breaking news
Tollywood
-
అల్లు అర్జున్లా మిగతా హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు?
అల్లు అర్జున్ సినిమా థియేటర్లలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. కొత్త మూవీ రావడానికి మరో ఏడాది లేదంటే ఏడాదిన్నర పట్టొచ్చు. కానీ ఎలాంటి హడావుడి లేకుండా 900 మంది అభిమానుల్ని పిలిచి హైదరాబాద్లో ఓ మీటింగ్ ఏర్పాటు చేసి బన్నీ కలిశాడు. ఏకంగా ఏడు రాష్ట్రాల నుంచి వందలాది మంది ఫ్యాన్స్ని పిలిచి వాళ్లని పేరుపేరున పలకరించి ఫొటోలిచ్చి తలో రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కూడా చేయించాడు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఓసారి కలుస్తానని మాటిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు,వీడియోలు నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ ఎమోషనల్ లవ్ సినిమా)తెలుగులో దాదాపు అందరు హీరోలకు ఫ్యాన్స్, వీరాభిమానులు ఉన్నారు. కాకపోతే వాళ్లని ఆర్గనైజ్ చేసి ప్రతి ఏడాది మీటింగ్ పెట్టి వాళ్లతో కలిసిపోయే హీరోలు ఎంతమంది ఉన్నారా అని చూస్తే.. అల్లు అర్జున్ తప్పితే ఎవరూ కనిపించడం లేదు. బన్నీ ఈ మీటింగ్ పెట్టడం మాటేమో గానీ తమిళ హీరో విజయ్లా రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వస్తాడు. అందుకే ఇలా ఇప్పటినుంచి ఫ్యాన్స్ని ప్రిపేర్ చేస్తూ ప్రతి ఏడాది కలుస్తున్నాడని చాలామంది అంటున్నారు. అందులో నిజానిజాల ఏంటనేది భవిష్యత్తులో తెలుస్తుంది.ప్రతి ఏడాది కలవడం, వాళ్లకు ఫొటోలు ఇవ్వడం, ఇన్సూరెన్స్ చేయించడం లాంటివి చేస్తే సదరు అభిమానులు.. అల్లు అర్జున్పై మరింత ప్రేమని పెంచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. పైపెచ్చు సినిమాలు రిలీజైనప్పుడే కాకుండా మిగతా సమయాల్లోనూ అభిమాన హీరో కోసం నిలబడతారు. ప్రతిఫలం ఆశించకుండానే పనిచేస్తారు. ఈ హంగామా అంతా చూస్తుంటే అలానే అనిపిస్తుంది. మరి అల్లు అర్జున్ చేస్తున్నట్లు మిగతా తెలుగు స్టార్ హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారనేది ఇక్కడ ప్రశ్న. (ఇదీ చదవండి: నచ్చలేదా వదిలేయ్... రూ.1 కూడా ఖర్చు పెట్టకు: అల్లు అర్జున్) -
రష్మికతో ఐటెం సాంగ్.. ఆ భయంతో తీసేశారు: తమన్
చాలా కాలం తర్వాత ‘లెనిన్’తో హిట్ కొట్టాడు అఖిల్ అక్కినేని. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్గా నటించింది. తమన్ నేపథ్య సంగీతం, పాటలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే ఈ చిత్రంలో ఓ ఐటం సాంగ్ కూడా ప్లాన్ చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో ఆ పాటని పక్కన పెట్టాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని తమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.‘లెనిన్లో ఒక ఐటం సాంగ్ పెట్టాలని ముందే అనుకున్నాం. అఖిల్ కోసం ఓ మంచి పాటను కూడా కంపోజ్ చేశా. రాయలసీమ యాసలో సాగే ఆ పాట..బయటకు వస్తే సూపర్ హిట్ అవుతుందని అనుకున్నా. ఈ పాట కోసం రష్మిక, పూజాహెగ్డే, కయాదు లోహర్ లేదా ప్రీతిముకుందన్లలో ఎవరినో ఒకరిని తీసుకోవాలని ప్లాన్ చేశారు. ఆ పాట బయటకు వస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ కథకి బ్రేక్ వేసినట్లుగా అవుతుంది. నెగెటివ్ రివ్యూలు వస్తాయని భయపడి చివరి నిమిషంలో దాన్ని తీసేశారు. ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. బాధతో నాలుగైదు వాట్సాప్ గ్రూపులను నుంచి వైదొలిగాను’అని తమన్ చెప్పుకొచ్చాడు.#Lenin ఒక ఐటమ్ సాంగ్ అనుకున్నాం... Pooja Hegde, Rashmika Mandanna ఇలా డిస్కషన్ కూడా జరిగింది. కానీ ఆ సాంగ్ షూట్ కి ముందే తీసేసారు. నేను Whatsapp గ్రూప్స్ నుండి వెళ్లిపోయాను. - #Thaman pic.twitter.com/WczB7Ymvze— Rajesh Manne (@rajeshmanne1) July 28, 2026 -
‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో అప్డేట్
విక్టరీ వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’(AK 47). ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి, నారా రోహిత్, నివేతా పేతురాజ్, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ను ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వెంకటేశ్, శ్రీనిధి శెట్టి పాత్రలను పరిచయం చేసిన మేకర్స్.. తాజాగా యువినా పార్థవి క్యారెక్టర్ని రివీల్ చేస్తూ ప్రత్యేక వీడియోని రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో చిట్టిబాబుగా వెంకీ, స్వర్ణగా శ్రీనిధి నటిస్తున్నారు. చిట్టిబాబు, స్వర్ణ దంపతుల ముద్దుల కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో బాలనటి యువినా పార్థవి నటిస్తోంది. అమాయకత్వం, చిలిపితనం, అల్లరితో నిండిన సంపూర్ణ పాత్ర చిట్టిబాబు జీవితంలో నవ్వులు పూయించడంతో పాటు, అనూహ్యమైన చిన్న చిన్న సంఘటనలకు కూడా కారణమవుతుంది. ఈ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉండనుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి. కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
చెన్నై లవ్స్టోరీ.. పీఆర్ టీమ్తో హిట్ కొట్టారా? కిరణ్ ఏమన్నారంటే?
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం చెన్నై లవ్స్టోరీ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ. 40 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ ను యువసామ్రాట్ నాగచైతన్య ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కిరణ్ అబ్బవరం తనదైన శైలీలో విశ్లేషణాత్మకమైన సమాధానం ఇచ్చాడు.ప్రశ్నేంటి? కిరణ్ సమాధానమేంటి?చెన్నై లవ్స్టోరీ హిట్ అవ్వడానికి కిరణ్ అబ్బవరం పీఆర్ టీమ్ అని.. తన పారితోషికంలో కొంత పీఆర్కి ఖర్చు చేసి.. తనే టికెట్లు కొనిచ్చి థియేటర్స్ నింపేశాడనే రూమర్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. ఇదే విషయాన్ని నిన్నటి సక్సెస్ మీట్లో ఓ విలేకరి ప్రస్తావిస్తూ..‘సినిమా హిట్ అయిన తర్వాత పిఆర్ టీమ్ వల్లే ఈ హిట్ వచ్చిందని మీమ్స్ వస్తున్నాయి.. దీనిపై మీ స్పందన ఏంటి?' అని ప్రశ్నించాడు.దానికి కిరణ్ తనదైన శైలీలో జవాబు ఇచ్చాడు. ‘కేవలం పీఆర్తోనే హిట్లు కొట్టేటట్లయితే ప్రతి సినిమా అందరూ కొడతారు కదండి. ఎప్పుడు ఏదో ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒక మాట అనాలన్న ఆలోచనతో అలా అనకండి. ఏ సినిమా అయినా పిఆర్తో ఎవరు ఎంత రుద్దినా ఏమీ అవ్వదు, మనం ఆడియన్స్ని, వాళ్ల తీర్పుని రెస్పెక్ట్ చేద్దాం. చెన్నై లవ్ స్టోరీ సినిమాకి థియేటర్లలో 60% ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళు ట్విటర్లో ఉండేవాళ్లు కాదు.. కేవలం మౌత్ టాక్తో థియేటర్లకు వచ్చినవాళ్లు. ఏదో ఒకటి అనాలని అనడం చాలా ఈజీ, కానీ సక్సెస్ వచ్చినప్పుడు ఇలాంటివి ఉంటాయి.కొత్తేమి కాదు.. నాకు మొదటి సినిమా నుంచి ఇదంతా కొత్తేమీ కాదు. నాకు తెలిసింది ఒకటే.. కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి, అదే సక్సెస్ ఇస్తుంది. దయచేసి ఆడియన్స్ని, వాళ్ల రివ్యూని రెస్పెక్ట్ చేయండి. పిఆర్ తోనే వస్తుందంటే అందరి దగ్గర కోట్ల డబ్బులు ఉంటాయి, అందరికన్నా నా దగ్గర తక్కువ ఉన్నాయి.. అలా అయితే అందరి సినిమాలు రూ. 200 కోట్లు, రూ.300 కోట్లు రావాలి కదా. కాబట్టి ఊరికే పిఆర్ అని ప్రచారం చేయవద్దని కోరుతున్నాను' అని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్పు నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా.. టిక్కెట్లపై బంపరాఫర్
సుమంత్ లీడ్ రోల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి రాజేష్ కర్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమా థియేటర్లలో వీక్షించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒక్కో టికెట్ కేవలం రూ.105కే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయని మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులు ఈ ఆఫర్ను వినియోగించుకోవాలని చిత్ర యూనిట్ కోరింది. కాగా.. ఈ సినిమాకు సింజిత్ యర్రమిల్లి సంగీతమందించారు. -
ఉన్నట్లా... లేనట్లా ... సీక్వెల్స్పై సందిగ్ధం!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిట్ అయిన కథలకు కొనసాగింపుగా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4... ఇలా పలు భాగాలుగా సినిమా తీయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు దర్శక–నిర్మాతలు హిట్ అయిన సినిమాని ఫ్రాంచైజీలుగా తెరకెక్కిస్తున్నారు. సీక్వెల్ మూవీస్పై అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఫుల్ క్రేజ్ ఉంటోంది. దీంతో సీక్వెల్స్ చేయడానికి దర్శక–నిర్మాతలు, హీరోలు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరికొన్ని ప్రీ ప్రోడక్షన్లో ఉన్నాయి.అయితే ఇక్కడ చర్చించదగ్గ మరో విషయం ఏంటంటే... కొన్ని హిట్ సినిమాల సీక్వెల్స్లో భాగంగా రెండో భాగం ఉంటుందని మేకర్స్ ప్రకటించినప్పటికీ షూటింగ్ పట్టాలెక్కలేదు. ఈ లిస్ట్లో ఎన్టీఆర్: దేవర 2, కల్యాణ్ రామ్: బింబిసార 2, కిరణ్ అబ్బవరం: క 2, తేజ సజ్జా: జాంబీ రెడ్డి 2, సాయిదుర్గా తేజ్ : విరూపాక్ష 2 వంటి విజయవంతమైన సినిమాలున్నాయి.అయితే రామ్ హీరోగా నటించిన ‘స్కంద’, విరాట్ కర్ణ కథానాయకుడిగా నటించిన ‘పెదకాపు’ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. అయినప్పటికీ ఈ చిత్రాల సీక్వెల్స్ ఉంటాయని యూనిట్ ప్రకటించినప్పటికీ ఆ తర్వాత వాటి ఊసే లేదు. మరి... పైన పేర్కొన్న సినిమాల సీక్వెల్స్ ఉన్నట్లా? లేనట్లా? అనే సందిగ్ధం సినీ ప్రేక్షకుల్లో నెలకొంది. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం...ఎన్టీఆర్: దేవర ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘దేవర’ పార్ట్ 1’. ఈ మూవీ ద్వారా దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్, ప్రకాష్రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు.‘దేవర: పార్ట్ 1’ 2024 సెప్టెంబరు 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి, సూపర్ హిట్గా నిలిచింది. హై యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. లాస్ ఏంజెల్స్లోని ఈజిప్షియన్ థియేటర్లో ప్రీమియర్ అయిన తొలి భారతీయ సినిమాగానూ ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్గా ‘దేవర: పార్ట్ 2’ ఉంటుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘దేవర: పార్ట్ 1’ తర్వాత హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్ 2’ సినిమా ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు ఎన్టీఆర్.ఆ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీలో నటిస్తున్నారు. దీంతో ‘దేవర: పార్ట్ 2’ కోసం చాలా రోజులు వేచి చూసిన డైరెక్టర్ కొరటాల శివ తాజాగా బాలకృష్ణ హీరోగా ‘ఎన్బీకే 112’ సినిమాని ప్రకటించారు. ‘డ్రాగన్’ మూవీ తర్వాత త్రివిక్రమ్తో సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. దీంతో ‘దేవర: పార్ట్ 2’ ఉంటుందా? లేదా అనే చర్చ జరుగుతోంది.రామ్: స్కంద రామ్ పోతినేని హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, శరత్ లోహితశ్వ, అజయ్ పుర్కార్, గౌతమి, ఇంద్రజ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2023 సెప్టెంబరు 28న విడుదల అయింది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశారు.పక్కా మాస్ యాక్షన్గా బోయపాటి మార్క్ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాకి రెండో భాగం ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి విదితమే. అయితే ‘స్కంద’ విడుదలై దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ గ్యాప్లో ‘డబుల్ ఇస్మార్ట్’, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి సినిమాలు చేశారు రామ్. ఇక బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణ హీరోగా ‘అఖండ 2’ సినిమాని తెరకెక్కించారు. మరి ‘స్కంద 2’ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? లేదా అన్నది వేచి చూడాలి. కల్యాణ్ రామ్: బింబిసార నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం ‘బింబిసార’. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అన్నది ట్యాగ్ లైన్. ఈ మూవీ ద్వారా మల్లిడి వశిష్ఠ దర్శకుడిగా పరిచయమయ్యారు. సంయుక్త, కేథరిన్ హీరోయిన్లుగా, తనికెళ్ల భరణి, శ్రీనివాస రెడ్డి, ప్రకాష్రాజ్, అయ్యప్ప పి. శర్మ, భరత్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా 2022 ఆగస్టు 5న విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీకి వచ్చిన ప్రేక్షకాదరణతో ‘బింబిసార 2’ని ప్రకటించింది చిత్రబృందం.అయితే ‘బింబిసార’ సినిమా విడుదలై నాలుగేళ్లు అవుతున్నా ‘బింబిసార 2’ పై ఎలాంటి అధికారిక అప్డేట్ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘బింబిసార’ మూవీ తర్వాత ‘అమిగోస్, డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్, అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ వంటి సినిమాలు చేశారు కల్యాణ్ రామ్. ప్రస్తుతం వెంకటేశ్తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారాయన. ‘బింబిసార’ తర్వాత చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ చిత్రం తెరకెక్కించారు వశిష్ఠ. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారీ దర్శకుడు. అయితే ‘బింబిసార 2’కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇప్పటివరకూ రాలేదు. దీంతో ఈ మూవీపైనా ఇండస్ట్రీలో సందిగ్ధం నెలకొంది. కిరణ్ అబ్బవరం: క కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన హిట్ చిత్రాల్లో ‘క’ మూవీ ఒకటి. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ మూవీ తెరకెక్కించారు. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో అన్నపూర్ణ, అజయ్, శరణ్య ప్రదీప్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టై¯Œ మెంట్స్, కేఏ ప్రోడక్షన్స్పై చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా 2024 అక్టోబరు 31న విడుదలై, ఘనవిజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్గా ‘క 2’ ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆడియన్స్ ముందుకొచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ‘క 2’ పై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ గ్యాప్లో ‘దిల్ రూబా, కె ర్యాంప్, చెన్నై లవ్స్టోరీ’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు కిరణ్ అబ్బవరం. మరి ‘క 2’ సినిమా ఉందా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తేజ సజ్జా: జాంబీ రెడ్డి బాలనటుడిగా పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు తేజ సజ్జా. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఓ బేబీ’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి’ మూవీ ద్వారా హీరోగా మారారు. ‘అ!’, ‘కల్కి’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ సినిమాలో ఆనంది, దక్ష నగార్కర్, హరితేజ, రఘుబాబు, ఆర్జే హేమంత్, కిరీటి, జబర్దస్త్ శ్రీను, వినయ్ వర్మ, అన్నపూర్ణ, హర్షవర్ధన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రాజశేఖర్ వర్మ నిర్మించిన ఈ మూవీ 2021 ఫిబ్రవరి 5న విడుదలైంది.తెలుగులో తొలి జాంబీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించడంతో హిట్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా ‘జాంబీ రెడ్డి 2’ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు కూడా. అయితే ‘జాంబీ రెడ్డి’ రిలీజై ఐదున్నరేళ్లు దాటినప్పటికీ ఈ ప్రాజెక్ట్పై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ గ్యాప్లో తేజ సజ్జా ‘ఇష్క్, అద్భుతం, హనుమాన్, మిరాయ్’ వంటి సినిమాలు చేశారు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘హనుమాన్’కి సీక్వెల్గా రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోనూ తేజ సజ్జా నటిస్తున్నారు. అదే విధంగా ‘మిరాయ్’ సినిమాకి సీక్వెల్గా ‘మిరాయ్: జైత్ర’ రూపొందుతుందని తేజ సజ్జా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ‘జాంబీ రెడ్డి 2’ పై తాజా అప్డేట్ మాత్రం లేదు.సాయిదుర్గా తేజ్ : విరూపాక్ష అప్డేట్ మాత్రం లేదు. సాయిదుర్గా తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటించారు. బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, సునీల్, రవి కృష్ణ, సోనియా సింగ్, అభినవ్ గోమటం, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించారు.పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 21న విడుదలై ఘనవిజయం సాధించింది. సాయిదుర్గా తేజ్ కెరీర్లో వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ఈ మూవీ రికార్డు సాధించింది. ఈ మూవీ రిలీజై మూడేళ్లు దాటినప్పటికీ ‘విరూపాక్ష’ సీక్వెల్పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఈ గ్యాప్లో ‘బ్రో, సంబరాల యేటిగట్టు’ వంటి సినిమాలు చేశారు సాయిదుర్గా తేజ్. ‘సంబరాల యేటిగట్టు’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉంది. ఈ మూవీ విడుదల తర్వాత అయినా ‘విరూపాక్ష’ అప్డేట్ వస్తుందా? లేదా అన్నది వేచి చూడాలి. విరాట్ కర్ణ: పెదకాపు విరాట్ కర్ణ హీరోగా పరిచయమైన చిత్రం ‘పెదకాపు 1’. ‘కొత్త బంగారు లోకం’ మూవీ ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్. రావు రమేశ్, తనికెళ్ల భరణి, అనసూయ భరద్వాజ్, బ్రిగడ సాగా, వికాస్, రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్ర పోషించడం విశేషం.మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2023 సెప్టెంబరు 29న విడుదలైంది. 1983 నేపథ్యంలో ఉన్న కుల వివక్ష నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఈ మూవీకి సీక్వెల్గా ‘పెదకాపు 2’ ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మూవీ రిలీజై మూడేళ్లు కావస్తున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్పై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ గ్యాప్లో విరాట్ కర్ణ ‘నాగబంధం’ వంటి పాన్ ఇండియన్ మూవీ చేశారు. ఈ చిత్రానికి కూడా సీక్వెల్ ఉంటుందని చిత్ర దర్శకుడు అభిషేక్ నామా ప్రకటించారు. మరి ‘పెదకాపు 2’ ఉంటుందా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు... ‘మంగళవారం’ మూవీతో పాటు మరికొన్ని చిత్రాల సీక్వెల్స్ కూడా ప్రకటించినప్పటికీ సెట్స్పైకి వెళ్లలేదు.– డేరంగుల జగన్ మోహన్ -
ఇదే నిజమైన సక్సెస్: నాగచైతన్య
‘‘నాకు లవ్స్టోరీస్ అంటే చాలా ఇష్టం. కోవిడ్ తర్వాత లవ్స్టోరీ సినిమాలు తగ్గిపోతుంటే బాధపడ్డాను. లవ్స్టోరీస్ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్కు వెళ్తారా? వెళ్లరా? అని భయపడ్డాను. మెల్లిగా ఆ ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఈ ‘చెన్నై లవ్స్టోరీ’తో మరో కల్ట్ లవ్స్టోరీ సినిమాని ఇండస్ట్రీకి ఇచ్చారు. ‘చెన్నై లవ్ స్టోరీ’లో నేను కోరుకునే ప్రేమకథను చూశాను. పరిణతితో రాసిన ప్రేమకథ ఇది’’ అని నాగచైతన్య అన్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్స్టోరీ’. సాయి రాజేష్ కథ అందించగా రవి నంబూరి దర్శకత్వం వహించారు. సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది.రిలీజైన 3 రోజుల్లోనే రూ. 40.1 కోట్లు వసూళ్లను రాబట్టిందని చిత్రయూనిట్ పేర్కొంది. మంగళవారం నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్కు అతిథిగా హాజరైన హీరో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘కష్టాలు, అడ్డంకులన్నీ దాటుకుని తనకంటూ ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నాడు కిరణ్. నివిలాంటి క్యారెక్టర్ను గౌరి యాక్సెప్ట్ చేసి, తన పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెప్పించడం సులువైన పని కాదు. ఇంతమంచి కథ రాసి, మరో దర్శకుడికి ఇవ్వడంలోనే సాయి రాజేష్ గొప్పతనం కనిపిస్తోంది. కాంప్లెక్స్ ఎమోషన్స్ ఉన్న ఇలాంటి మెచ్యూర్డ్ లవ్స్టోరీని రవి నంబూరి చక్కగా తెరకెక్కించాడు.ఈ సినిమా టీమ్ అంతా గ్రౌండ్ లెవల్ నుంచి వచ్చారు. వీళ్ల విజయం నాకెంతో స్ఫూర్తినిస్తోంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని కొత్త వాళ్లకు కూడా వీళ్ల విజయాలు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఒక పోస్టర్ మీద కలెక్షన్స్ నంబర్స్ వేయడం కంటే ఇదే నిజమైన సక్సెస్. ఒక ప్రేమ కథకు ఇలాంటి నంబర్స్ బాక్సాఫీస్ వద్ద రావడం చాలా అద్భుతం’’ అని అన్నారు. నాలుగు రోజుల్లోనే ఆంధ్ర, నైజాం, సీడెడ్ అన్ని ఏరియాల్లో తమ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందని సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఆదరిస్తున్న ప్రేక్షకులకు కిరణ్ అబ్బవరం, ఎస్కేఎన్, సాయి రాజేష్, రవి నంబూరి ధన్యవాదాలు తెలిపారు. -
అల్లు అర్జున్ మూవీ నేనే చేయాల్సింది.. కానీ: సుమంత్
సుమంత్ ప్రధాన పాత్రలో వస్తోన్న లేటేస్ట్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారాయన. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుమంత్.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను రెండు బ్లాక్బస్టర్ సినిమాలు మిస్ చేసుకున్నానని వెల్లడించారు.2000లో వచ్చిన సూపర్ హిట్ మూవీ నువ్వే కావాలి చిత్రం దర్శకుడు కె విజయభాస్కర్ మొదట నన్నే సంప్రదించారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు యువకుడు, పెళ్లి సంబంధం సినిమాలతో బిజీగా ఉండడం వల్ల డేట్స్ కుదరలేదని తెలిపారు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు స్క్రిప్ట్ కూడా తానే మొదటి విన్నానని తెలిపారు. కానీ నేను చేసి ఉంటే అంత భారీ హిట్ కొట్టేది కాదన్నారు. అల్లు అర్జున్కే దేశముదురు సెట్ అయిందని పేర్కొన్నారు.కాగా.. న్యూటన్ థర్డ్ లా మూవీకి రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించగా.. కె.హరీశ్ నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, కార్తీక్ రత్నం, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ రిలీజ్
దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార. ఈ సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సమర్పణలో సందీప్, రమ్య, నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో శృతిహాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చిట్టి చిట్టి చీమ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్కు శ్రీమణి లిరిక్స్ అందించారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. -
ఆబ్జెక్షన్ మై లార్డ్.. చిరంజీవి అభినందించడం చాలా హ్యాపీ
జీ5లో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న తెలుగు సిరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్'. శ్రీకాంత్, అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్, సమీర్ ప్రధాన పాత్రలు చేశారు. సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించారు. రాజ్కుమార్ ఆకెళ్ల నిర్మించారు. 7 ఎపిసోడ్స్తో ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్ జరగ్గా టీమ్ అంతా పాల్గొన్నారు.సినిమాలో కంటే సిరీస్లోనే కష్టం ఎక్కువగా ఉంది. కానీ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఈ సిరీస్ అవుట్ ఫుట్ చూసి ఫిదా అయ్యాం. ప్రతి క్యారెక్టర్లో మంచి ఎలివేషన్ ఉంటుంది. అందరూ బాగా చేశారు. చిరంజీవి కూడా చూసి చాలా బాగుందని చెప్పారు. థాంక్యూ ఆల్ అన్నారు అని శ్రీకాంత్ చెప్పారు. -
లుక్ మార్చిన రాశీఖన్నా.. తనూజ గ్లామరస్ యాంగిల్
మినీ వ్యాన్లో శ్రీలీల క్రేజీ పోజులులుక్ మార్చి గ్లామర్ చూపిస్తున్న తనూజఎర్ర చీరలో అందంగా హీరోయిన్ అనుపమజపాన్ ట్రిప్ వీడియో షేర్ చేసిన ఆషికబ్లాక్ డ్రస్లో గ్లామరస్గా రాశీఖన్నాక్యూట్ పోజులతో దిశా పటానీ మాయ View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) -
త్వరలో టీవీ రంగానికి కూడా ప్రభుత్వ అవార్డులు
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇస్తుండగా.. త్వరలో టీవీ రంగానికి కూడా అవార్డులు ఇవ్వబోతున్నారు. ఈ మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, టెలివిజన్ అవార్డు కమిటీతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్డీసీ ఎండీ ముకుంద రెడ్డి, కమిటీ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా టెలివిజన్(టీవీ) అవార్డులపై చర్చ జరిగింది.మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. 'టెలివిజన్(టీవీ), ఎక్కువ ఎంటర్టైన్మెంట్ నిచ్చే రంగం. ఎక్కువ మంది మహిళలు,వృద్ధులు టీవీ కార్యక్రమాల పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీల వారికి మంచి మెసేజ్ ఇచ్చే సీరియల్స్, ప్రోగ్రామ్స్, చిల్డ్రన్ చిత్రాలు తీసే వారిని ప్రోత్సహిస్తాం. కమిటీ సభ్యులు సూచించినట్లు దీనికి పి.వి నరసింహారావు పేరు పెట్టే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చిస్తాను''పి.వి నరసింహారావు.. బహుభాషా కోవిదుడు,తెలంగాణ ఠీవి. దేశాన్ని ఆర్ధికంగా నిలబెట్టిన గొప్ప మేధావి. అట్లాంటి పేరు పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది. కమిటీ వీలైనంత త్వరగా గైడ్ లైన్స్, లోగో, అవార్డ్స్ పేరు లాంటివి తయారు చేసి ఇవ్వాలని సూచిస్తున్నాను. పేరయినా, లోగో అయినా తెలంగాణ ఆత్మని ప్రతిబింబించేలా ఉండాలి. మొట్టమొదటి సారి ఇవ్వబోయే ఈ అవార్డుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను. పూర్తి పారదర్శకంగా అవార్డులను ఎంపిక చేయాలని కమిటీ చైర్మన్,సభ్యులకు సూచిస్తున్నాను. అవార్డుల వేదిక కూడా రెండు మూడు ఆప్షన్స్ ఇవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ అంశాలన్నీ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం' అని చెప్పుకొచ్చారు. -
బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో తక్కువ సినిమాలే చేసినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెబా మోనికా జాన్ ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. బేబీ ఫొటోని కూడా షేర్ చేసి పేరు కూడా పెట్టినట్లు వెల్లడించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ సినిమా.. తెలుగులోనూ)రెబా మోనికా స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో సామజవరగమన, మృత్యుంజయ్, మ్యాడ్ స్క్వేర్ తదితర సినిమాల్లో నటించింది. ఈ ఏడాది ఏప్రిల్ చివరలో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. థాయ్లాండ్లోని బీచ్లో భర్తతో దిగిన ఫొటోలని షేర్ చేసింది. తాము ముగ్గురు కాబోతున్నామని చెప్పింది. ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది.2022లో జోమన్ జోసెఫ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న రెబా మోనికా జాన్.. 2016లో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 20 వరకు సినిమాలు చేసింది. చివరగా ఈ ఏడాది మార్చి తొలివారం వచ్చిన 'మృత్యుంజయ్'లో పోలీస్ అధికారిగా నటించింది. ఇకపోతే తనకు కూతురు పుట్టిన విషయాన్ని చెబుతూ కియారా అని పేరు పెట్టినట్లు తెలిపింది. బిడ్డని ఎత్తుకున్న ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసింది.(ఇదీ చదవండి: రామ్ చరణ్కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) -
రామ్ చరణ్కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకు?
హీరో రామ్ చరణ్.. 'పెద్ది' షూటింగ్లో గాయపడ్డాడు. చేతికి కట్టుతోనే ప్రమోషన్లలోనూ పాల్గొన్నాడు. ఇన్నాళ్లకు అంటే నిన్న(జూలై 27) కోయంబత్తూరులో గంగా ఆస్పత్రిలో చరణ్ మణికట్టుకు సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. ఎనిమిది వారాల పాటు విశ్రాంతి అవసరమని తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభించాలని వైద్యులు సూచించారు. అయితే చరణ్ భార్య ఉపాసనకు సంబంధించి హైదరాబాద్లోనే అపోలో, కామినేని ఆస్పత్రులు ఉండగా.. కోయంబత్తూరు వరకు ఎందుకు వెళ్లారా అని సందేహం రావొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ 'మైఖేల్'.. అధికారిక ప్రకటన)కోయంబత్తూరులోని గంగా ఆస్పత్రికి ప్రపంచవ్యాప్తంగా ఆర్థోపెడిక్స్, హ్యాండ్, మైక్రోవాస్క్యులర్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి మంచి పేరు ఉంది. ముఖ్యంగా చేతివేళ్లు, మణికట్టు, నరాలు, ఎముకలు, కండరాలు లాంటి క్లిష్టమైన సమస్యలని పరిష్కరించడంలో ఈ ఆస్పత్రి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అందుకే చరణ్.. దీనిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.డాక్టర్ రాజశేఖరన్ నేతృత్వంలో అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ వైద్యులు డా.అలెజాండ్రో బాడియా బృందం, డా.ప్రవీణ్ భరద్వాజ్ శస్త్రచికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. సో అదన్నమాట సంగతి. ప్రస్తుతానికైతే చరణ్ కొత్త సినిమాలేం చేయట్లేదు. సుకుమార్ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తున్నప్పటికీ.. షూటింగ్ మొదలయ్యేసరికి మరో ఆరేడు నెలలైనా పట్టొచ్చని సమాచారం.ఇక సర్జరీ విజయవంతమైన నేపథ్యంలో 'పెద్ది' నిర్మాణ సంస్థ.. చరణ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసింది. మణికట్టు శస్త్రచికిత్స విజయవంతమైనందుకు సంతోషంగా ఉంది. గాయంతోనే ఆయన 'పెద్ది' షూట్ కొనసాగించారు. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేశారు. సినిమా పట్ల ఆయనకున్న నిబద్ధత, పట్టుదల, మా టీమ్కి స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాం అని రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: నచ్చలేదా వదిలేయ్... రూ.1 కూడా ఖర్చు పెట్టకు: అల్లు అర్జున్) -
నచ్చలేదా వదిలేయ్... రూ.1 కూడా ఖర్చు పెట్టకు: అల్లు అర్జున్
హీరో అల్లు అర్జున్ ప్రతి ఏడాది నిర్వహించే ఫ్యాన్స్ మీట్.. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేశాడు. అభిమానులతో కలిసి ముచ్చటించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రోల్స్ గురించి తమని విమర్శించే వారి గురించి స్పందించాడు. నచ్చలేదా వదిలేయ్ అని చెప్పుకొచ్చాడు.'టైమ్ అనుకోండి ఎనర్జీ అనుకోండి ఏమైనా అనుకోండి. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ప్రతిరోజు మనం 100 శాతం ఛార్జింగ్ అవుతాం. అదే రోజు ఆ ఛార్జింగ్ అంతా అయిపోతుంది. దీనిని నువ్వు ఏమైనా అనుకో. నువ్వు అది దేనికి వాడతావ్ అనేది నీ ఇష్టం. ఎవరైనా నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మీ సమయం, ఎనర్జీని మీకు నచ్చిన పనిపైనే పెట్టండి. నచ్చని విషయాల కోసం ఒక్క శాతం ఖర్చు పెట్టొద్దు. నచ్చలేదా వదిలేయ్. కనీసం నీకు నచ్చిన అమ్మాయి ఇంటి బయట నిల్చో. కనీసం నువ్వైనా ఎంజాయ్ చేస్తావు' అని అల్లు అర్జున్ చెప్పాడు.'పుష్ప' సినిమాల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న బన్నీ.. తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో 'రాకా' చేస్తున్నాడు. అలానే లోకేశ్ కనగరాజ్తో మరో మూవీ చేస్తున్నాడు. ఇవి వచ్చే ఏడాది లేదంటే 2028లో థియేటర్లలోకి రావొచ్చు.Appreciating #AlluArjun for staying connected with his fans through regular interactive sessions.Every actor should remember who made them stars without expecting anything in return.Being accessible through fan associations is the least one can do. pic.twitter.com/hcTiKfsIRZ— Movies4u Official (@Movies4u_Officl) July 28, 2026 -
టాలీవుడ్లో గాయాల కలకలం. . ఆస్పత్రి బాట పడుతున్న అగ్ర హీరోలు!
టాలీవుడ్లో అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడుతున్న ఘటనలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల నందమూరి బాలకృష్ణకు గాయం కాగా.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి కూడా చేతికి కట్టుతో కనిపించారు. ఈ మధ్యే పవన్ కల్యాణ్, రామ్చరణ్ కూడా షూటింగ్ల సమయంలో గాయాల పాలై, సర్జరీలు చేయించుకున్నారు. దీంతో తెలుగు హీరోలకు గాయాలు, వాటి ప్రభావం సినిమాలపై ఎలా ఉంటుందనే అంశంపై చర్చ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిగా మారింది.మొన్న బాబాయ్.. నేడు అబ్బాయిఇటీవల తన కొత్త చిత్రం ('NBK111') షూటింగ్ కాకినాడ పోర్టులో జరుగుతుండగా, ఒక యాక్షన్ సీక్వెన్స్లో బాలయ్యకు మోకాలికి గాయమైంది. కండరాల కణజాలం దెబ్బతినడంతో, ఆయనకు హైదరాబాద్లో చిన్నపాటి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ఆయన నటిస్తున్న 'డ్రాగన్' (Dragon) సినిమా షూటింగ్లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వైద్యులు ఆయనకు 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.మెగా హీరోలకు వరుస గాయాలుమెగాస్టార్ చిరంజీవి గతంలో చేతికి సర్జరీ చేయించుకోవడంతో కట్టుతో కనిపించారు. అలాగే, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఆయన చేతికి హ్యాండ్ బెల్ట్ వేసుకుని కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు (గతంలో 2021లో కూడా ఆయన కుడిచేతికి నరాల సమస్యతో సర్జరీ చేయించుకున్నారు). ఇక తాజాగా రామ్ చరణ్ కూడా తన మణికట్టుకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో ప్రత్యేక చికిత్స అందుకున్నారు. ‘పెద్ది’షూటింగ్ సమయంలోనే చరణ్కి గాయాలయ్యాయి. ఇక మరో మెగా హీరో పవన్ కల్యాణ్ కూడా ఈ మధ్యే తన భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. పవన్ కల్యాణ్ తన సినీ ప్రయాణంలో అనేక యాక్షన్ సన్నివేశాలను స్వయంగా చేయడం వల్ల పలు మార్లు గాయాలపాలయ్యారు. భుజం, నడుము భాగాల్లో గాయాలతో కొంతకాలం షూటింగ్కు దూరమైన సందర్భాలు ఉన్నాయి.నిర్మాతల్లో ఆందోళనస్టార్ హీరోలకు గాయాలయ్యాయనే వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిర్మాతలకు మాత్రం షూటింగ్ షెడ్యూల్స్, విదేశీ లొకేషన్లు, భారీ సెట్లు, వందలాది మంది సిబ్బంది సమన్వయం వంటి అంశాలు సవాలుగా మారుతున్నాయి. ఒక్కరోజు షూటింగ్ వాయిదా పడినా కోట్ల రూపాయల అదనపు వ్యయం వచ్చే పరిస్థితి ఉంటుంది. సాధారణంగా స్వల్ప గాయాలైతే కొన్ని రోజుల విశ్రాంతితో హీరోలు తిరిగి షూటింగ్లో పాల్గొంటారు. అయితే గాయం తీవ్రంగా ఉంటే షూటింగ్ షెడ్యూల్లు ఆలస్యం కావడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వెనక్కి వెళ్లడం, చివరికి సినిమా విడుదల తేదీ మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో ముందుగానే థియేటర్ల బుకింగ్లు, ప్రమోషన్ ప్లాన్లు సిద్ధమవుతాయి. అలాంటి సమయంలో చిన్న ఆలస్యం కూడా నిర్మాతలపై ఆర్థిక భారం పెంచుతుంది.గాయాలు ఎందుకవుతున్నాయి?ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిని దాటి అంతర్జాతీయ మార్కెట్లోనూ సత్తా చాటుతున్నాయి. దీంతో యాక్షన్ సన్నివేశాల స్థాయి కూడా భారీగా పెరిగింది. రియలిస్టిక్గా కనిపించాలనే ఉద్దేశంతో చాలా మంది స్టార్ హీరోలు డూప్లపై పూర్తిగా ఆధారపడకుండా స్టంట్లు స్వయంగా చేస్తున్నారు. వైర్ యాక్షన్, హైస్పీడ్ ఛేజ్లు, భారీ ఫైట్ సీక్వెన్స్లు, క్లిష్టమైన యాక్షన్ షాట్ల కారణంగా చిన్నచిన్న గాయాలు సాధారణమవుతున్నాయి. -
అఫిషియల్ : నెల లోపే ఓటీటీలోకి ‘రావు బహదూర్’
సత్యదేవ్ కలల ప్రాజెక్టు, ఎంతో కష్టపడి నటించిన చిత్రం ‘రావు బహదూర్’. వెంకట్ మాహా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. సత్యదేవ్ నటనపై ప్రతిఒక్కరు ప్రశంసలు కురిపించారు కానీ.. కథ, కథనంపై మాత్రం పెదవి విరిచారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో ఈచిత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. థియేటర్స్లో రిలీజై నెల కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జులై 31 నుంచి ప్రముఖ ఓటటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ బాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.కథేంటంటే...1991 నేపథ్యంలో ఈ కథనం సాగుతుది. భువన వంశానికి చెందిన రామప్పరావు బహదూర్ అలియాస్ రాముడు(సత్యదేవ్) లివర్ క్యాన్సర్ బారిన పడతాడు. నాలుగు నెలలకు మించి బతకడని ఓ డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు గానీ ఏడాది దాటిపోయినా సరే రామప్ప అలానే ఉంటాడు. పైపెచ్చు రోజూ తాగుతూ బతికేస్తుంటాడు. నిద్రలో నుంచి లేచి అప్పుడప్పుడు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఇలా జరగడానికి కారణం ఎప్పుడో చనిపోయిన రామప్ప చిన్న కొడుకు కుసుమప్ప. వీడు తనకు పుట్టలేదని రామప్ప 'అనుమానం'. ఇదే విషయాన్ని చెబుతూ తన స్నేహితుడు, డాక్టర్ ఆచారి(వికాస్ ముప్పల) బుర్ర తినేస్తూ ఉంటాడు. మరి రావు బహదూర్ అనుమానం నిజమేనా? కుసుమప్ప ఎందుకు ఎలా చనిపోయాడు? ఈ కథలో రామప్ప భార్య రేణుక (దీపా థామస్) సంగతేంటి? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.Samajika nibandhanalatho mee burrani kadagadaniki Rao Bahadur osthunnadu! 😎👑 pic.twitter.com/A97zYKYU8i— Netflix India South (@Netflix_INSouth) July 28, 2026 -
అదండీ ఆడదంటే.. నవ్వులు పూయిస్తున్న ‘ఏకే 47’ వీడియో
వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’(AK 47). శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్, నారా రోహిత్, నివేతా పేతురాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం ఇప్పటికే వెంకటేశ్ పాత్రను పరిచయం చేశారు. ఇందులో ఆయన చిట్టిబాబు అనే పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఇక తాజాగా శ్రీనిధి శెట్టి పాత్రను పరిచయం చేశారు.‘ఇల్లాలే దేవత అని చెబుతూ.. ‘ఈ ఆడవాళ్లకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు బుజ్జిగారు. ఆదండి ఆడదంటే.. కనపడగానే పువ్వులాగా ఎలా నవ్వుతుందో చూడండి(పక్కింటి అమ్మాయిని చూపిస్తూ..). నా పెళ్లం ఉంది ఎందుకు..ఎప్పుడో పెళ్లి ఫోటోలో స్మైల్ ప్లీజ్ అంటే అప్పుడు నవ్వింది. మళ్లీ ఇప్పటిదాకా నవ్వలేదు. ఎప్పుడు మొహం ఇలా పెట్టుకుంటుంది’ అంటూ వెంకీ చెప్పే డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి. ఇందులో శ్రీనిధి..స్వర్ణగా నటిస్తోంది.‘చిట్టిబాబుకు భార్యగా, చిరునవ్వే చిరునామాగా ఉండే ఓ ఆప్యాయమైన మధ్యతరగతి ఇల్లాలిగా ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకోనుంది. చిట్టిబాబు–స్వర్ణల మధ్య ఉండే అనుబంధం, చిలిపి సంభాషణలు, అనురాగం, కుటుంబ విలువలు సినిమాకు మరింత ఆత్మను, ఆహ్లాదాన్ని అందించనున్నాయి’ అని మేకర్స్ తెలిపారు. -
‘మా’ ఆధ్వర్యంలో పావలా శ్యామల అంత్యక్రియలు
సీనియర్ నటి పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యతను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) తీసుకుంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నఆమె ఈ రోజు(జులై 28) హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. పావలా శ్యామల గారి కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, అంత్యక్రియల నిర్వహణకు 'మా' (MAA) ముందుకు వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్తి సొంత ఖర్చులతో ఈ అంత్యక్రియలను నిర్వహించనుండగా, ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఈ అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతలను దగ్గరుండి చూసుకోనున్నట్లు తెలిపారు.కాగా.. పలు టాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న శ్యామల.. చివరి రోజుల్లో దీన స్థితిని గడిపారు. చికిత్సకు డబ్బుల్లేక ఎన్నో అవస్థలు పడ్డారు. పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగించి.. ఈ రోజు కన్నుమూశారు. ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. -
గీతా మాధురి ఆలపించిన ‘డిస్కో లైట్’ మాసీ సాంగ్ విన్నారా?
కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్,ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్నఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి.ఇక తాజాగా ‘డిస్కో లైట్’ అంటూ సాగే ఓ మాసీ సాంగ్ను రిలీజ్ చేశారు. పార్టీ వైబ్ ఇస్తోన్న ఈ పాటలో హీరోయిన్లు, కబీర్ సింగ్ కనిపిస్తున్నారు. ఈ పాటకు కాసర్ల శ్యాం సాహిత్యం, గీతా మాధురి గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శేఖర్ మోపురి బాణీ ఎంతో క్యాచీగా అనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. -
‘ది ప్యారడైజ్’లో అదిరిపోయే ఐటమ్ సాంగ్.. ఆమెకే చాన్స్!
ఈ ఏడాది టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ది ప్యారడైజ్’ ఒకటి. ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్లో వస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పుటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రచార కంటెంట్.. సూపర్ హిట్గా నిలిచింది. పాటలు అయితే దుమ్మురేపుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ రూమర్ బయటకు వచ్చింది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. సంగీత దర్శకుడు అనిరుధ్ ఆ పాటను మరింత స్పెషల్గా తీర్చిదిద్దాడట. ఈ పాట కోసం మరో క్రేజీ హీరోయిన్ని రంగంలోకి దించబోతన్నట్లు సమాచారం. ఆ క్రేజీ బ్యూటీ మరెవరోకాదు..గతంలో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’మూవీ హీరోయిన్ కీర్తి సురేశ్.ఫైనల్గా కీర్తి.. స్పెషల్ సాంగ్స్కి కేరాఫ్ అనిరుధ్. ఆయన ఇప్పటి వరకు అందించిన ప్రతి ప్రత్యేక పాట సూపర్ హిట్ అయింది. ఇందులో కూడా పాట పెట్టాలని ముందే భావించారట. అయితే ఆ పాట కోసం ఎవర్నీ తీసుకుందామా అని చాలా రోజులుగా ఆలోచించారట. ఫైనల్గా కీర్తి సురేశ్ని అనుకున్నారట. నాని, కిర్తి బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇండస్ట్రీలో ఉన్నవాళ్లందరికి తెలుసు. ఆ చనువుతోనే నాని... కీర్తిని అడిగాడట. ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.హైదరాబాద్లో భారీ సెట్..ఈ స్పెషల్ సాంగ్ కోసం హైదరాబాద్లో ఓ భారీ సెట్ని వేశారట. రేపటి నుంచి అందులోనే ఈ పాటను తెరకెక్కించబోతున్నారు. దాదాపు 1000 మందికి పైగా జానియర్ ఆర్టిస్ట్లు, డ్యాన్సర్లతో ఈ పాటను షూట్ చేయబోతున్నట్లు సమాచారం. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పుటికే విడుదల కావాల్సింది. కానీ షూటింగ్ సరైర సమయానికి పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదిని ప్రకటించబోతున్నారు. -
ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
ప్రముఖ నటి, కమెడియన్ పావలా శ్యామల కన్నుమూశారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇవాళ మరణించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెకు గుండెపోటు రావడంతో మరణించినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం ఆమె భౌతిక కాయానికి ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.కాగా.. టాలీవుడ్ చాలా సినిమాల్లో పావలా శ్యామలా తన నటనతో మెప్పించారు. పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. చివరి రోజుల్లో ఆమె దీన స్థితిని గడిపారు. చికిత్సకు డబ్బుల్లేక ఎన్నో అవస్థలు పడ్డారు. పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగించారు. ఆమెతో పాటే ఉన్న ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి.. చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో మరణించడం టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
హనుమాన్ సీక్వెల్.. పవర్ఫుల్ పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో..!
హనుమాన్ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు. జై హనుమాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వైరలవుతోంది.ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అశ్వద్ధామ పాత్ర రానా పోషించబోతున్నారని తెలుస్తోంది. ఈ పాత్రతో రానా కూడా చాలా రోజుల తర్వాత మరింత పవర్ఫుల్గా కనిపించబోతున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాతో రానా మరోసారి పాన్ ఇండియా రేంజ్లో అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. #RanaDaggubati to Play Ashwatthama in Jai Hanuman😳Rana is reportedly set to play the powerful Ashwatthama in #JaiHanuman marking his return to a massive pan-India project. Directed by #PrasanthVarma the sequel to #HanuMan is shaping up as a grand mythological spectacle, with… pic.twitter.com/Zrx0z9ippu— The South Cinemaa (@southcinemaaaa) July 27, 2026 -
రామ్ చరణ్ మణికట్టు సర్జరీ సక్సెస్
మెగా హీరో రామ్ చరణ్కు మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయన కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో ప్రత్యేక చికిత్స అందుకున్నారు. రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. ఆ తరవాత హైదరాబాద్కు రానున్నట్లు తెలుస్తోంది. ఆర్థోపెడిక్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన గంగా హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ ఈ శస్త్రచికిత్సకు నాయకత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైన క్లిష్టమైన వెన్నెముక సమస్యకు కూడా ఈయనే చికిత్స అందించారు.ఈ ఏడాది జూన్లో పెద్ది మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్ ఫర్వాలేదనిపించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్లోనే చరణ్ మణికట్టుకి గాయమైంది. ప్రమోషన్లలోనూ చేతికి కట్టుతోనే కనిపించాడు. దీనికి సర్జరీ అవసరమవుతుందని అప్పట్లోనే వార్తలొచ్చాయి. చివరకు ఇన్నాళ్లకు చరణ్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్తో పాటే తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖతో పాటు ఆయన భార్య ఉపాసన కోయంబత్తూరులోనే ఉన్నారు. సర్జరీ పూర్తి కావడంతో రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు -
పొలిమేర 3 ఆరంభం
దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న ‘పొలిమేర’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న తాజా సినిమా ‘పొలిమేర 3’. ‘సత్యం’ రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి ప్రధాన తారాగణంగా నటì ంచనున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు అర్జున్ భాగం అయ్యారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో సోమవారం ప్రారంభం అయింది. ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్ నారాయణదాస్ నారంగ్ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించినట్లు మేకర్స్ తెలిపారు.నారాయణదాస్ నారంగ్ ఆశీస్సులతో వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్ ‘పొలిమేర 3’ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి. సురేష్బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత బన్నీ వాసు, ఎగ్జిబిటర్ సదానంద్ గౌడ్ యూనిట్కు స్క్రిప్ట్ను అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు. -
భావోద్వేగాల తీరం
ప్రభు, హరిప్రియ జంటగా వంశీ మునగాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తీరం’. వైశాలి, నిరుడి శ్రీనివాస్, సంధ్య, కిట్టయ్య, శిరీష ఇతర పాత్రలు పోషించారు. శ్రీ భవానీ క్రియేషన్స్ పై ఉపేందర్ గంగావెల్లి రూపొందిన ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాధ్విక్ సన్స్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘తీరం..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు.‘పుష్ప’ ఫేమ్ నటుడు జగదీష్, ఫన్ బకెట్ మహేష్ విట్ట, నటుడు రాజ్కుమార్ కసిరెడ్డి, దర్శకుడు ప్రసాద్, నటులు సద్దాం, కుమానన్ ముఖ్య అతిథులుగా హాజరై, సాంగ్ను ఆవిష్కరించారు. ‘‘భావోద్వేగ భరితమైన కథతో ‘తీరం’ రూపొందింది’’ అన్నారు వంశీ మునగాల. ‘‘మా సినిమా రిలీజ్ డేట్ని త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు ఉపేందర్ గంగవెల్లి. సంగీత దర్శకుడు సాధ్విక్ సన్స్ , కో–డైరెక్టర్, క్రియేటివ్ హెడ్–ఎడిటర్ విజయ్ శెట్టి మాట్లాడారు. -
ఊహించని సన్నివేశాలు: సుమంత్
సుమంత్, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిషోర్, రాజీవ్ కనకాల, అలీ ఇతర పాత్రల్లో నటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు, లక్ష్మణ్ నిర్మించారు. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఈ సినిమాను సెప్టెంబరు 11న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ–‘‘మహేంద్రగిరి వారాహి’ టీజర్ని హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఈ సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజ్లు, ట్విస్ట్లు, ఊహించని సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి’’ అని చెప్పారు. ‘‘వారాహి అమ్మవారి ఆశీస్సులతో పాటు ప్రేక్షకుల సపోర్ట్ మాపై ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ‘‘సుమంత్గారు ఈ చిత్రం కోసం కష్టపడ్డారు’’ అన్నారు కాలిపు మధు. -
రొమాంటిక్ థ్రిల్లర్
‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల హీరోలుగా, ‘సిద్ధార్థ్ రాయ్’ ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అదే నీవు అదే నేను’. కొండల్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ పై గోవిందు కాండ్రేగుల నిర్మించిన ఈ మూవీ ఈ నెల 31న విడుదల కానుంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను హీరో సునీల్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ–‘‘అదే నీవు అదే నేను’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. షాకింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీని థియేటర్స్లో చూసి, కొత్త ప్రతిభని ప్రోత్సహించాలి’’ అని తెలిపారు. ‘‘రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రమిది’’ అన్నారు కొండల్. -
ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు: రితిక నాయక్
‘‘డైరెక్టర్ మేర్లపాక గాంధీగారు ‘కొరియన్ కనకరాజు’ కథ చెప్పినప్పుడు షూటింగ్కి కొరియా వెళతాం అన్నది నన్ను మొదట బాగా ఆకట్టుకుంది(నవ్వుతూ). ఎందుకంటే నాకు కొరియన్ సంస్కృతి, అక్కడి సినిమాలు, కొరియన్ డ్రామాలు అంటే చాలా ఇష్టం. ‘కొరియన్ కనకరాజు’లో నేను చేసిన పాత్రకు, నా వ్యక్తిత్వానికి కొన్ని పోలికలు ఉన్నాయి. చాలా మోడ్రన్ అమ్మాయిగా కనిపిస్తాను. ఫైనల్ ఔట్పుట్ చూస్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో నవ్వుతూనే ఉంటారు’’ అని హీరోయిన్ రితిక నాయక్ తెలిపారు.వరుణ్ తేజ్, రితిక నాయక్ జోడీగా, నటుడు సత్య కీలకపాత్ర పోషించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ రచన–దర్శకత్వంలో యువీ క్రియేష న్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా రితిక నాయక్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఈ మూవీ షూటింగ్ కొంత భాగం అనంతపురంలో చేశాం.. అక్కడి జనాలు, ఆ వాతావరణం అందమైన అనుభూతిగా నిలిచిపోయింది.వరుణ్ తేజ్గారికి గాయం ఉన్నప్పటికీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు షూటింగ్ చేశారు. యువీ క్రియేషన్స్ తో పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ . షూటింగ్ సమయంలో ఒకసారి నేను అనారోగ్యానికి గురయ్యాను. ఆ సమయంలో నిర్మాతలు నా గురించి ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. తమన్గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం ‘మిరాయ్ 2’ సినిమా ప్రీ–ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ప్రస్తుతం నేను తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. -
మధ్యతరగతి నేపథ్యంలో...
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్పై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రోడ్యూసర్గా వ్యవహరించిన ఈ మూవీకి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా ఓ ముఖ్య పాత్ర పోషించారు.ఆగస్టు 7న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ను విశాఖపట్నంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో టాలీవుడ్ థండర్స్ టీమ్ విడుదల చేసింది. హీరోలు శ్రీకాంత్, సుధీర్ బాబు, తరుణ్, అశ్విన్ బాబు, సంగీత దర్శకుడు తమన్ ట్రైలర్ను విడుదల చేసి, ‘అనకాపల్లి’ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘మధ్యతరగతి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో త్రినాథరావు, ఇంద్రజ మిడిల్ క్లాస్ పేరెంట్స్గా కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు పూరి జగన్నాథ్ గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భారీ అంచనాలతో విడుదలైన లైగర్, ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఆయన కమ్బ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె పూరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన మాటల్లో.. అప్పట్లో 'పూరి' ఒక వ్యక్తిని బాగా నమ్మాడు. కానీ ఆ వ్యక్తి చేసిన మోసం వల్ల ఆయనకు భారీగా ఆర్థిక నష్టం జరిగింది. ఆ అప్పులు తీర్చేందుకు ప్రతి నెలా రూ.50 లక్షల వరకు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. దాంతో చివరికి పూరి ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ఆఫీస్ను కూడా అమ్మేయాల్సి వచ్చింది. తర్వాత అద్దె ఆఫీస్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రఘు కుంచె తెలిపారు. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం ఆయన వెల్లడించలేదు. అప్పట్లో ఓ ఇంటర్వూలో పూరి కూడా ఈ విషయంపై స్పంధించారు. అప్పుడు నేను ప్రభాస్, గోపీచంద్, అమితాబ్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాను. కానీ వచ్చే డబ్బు మాత్రం అప్పులకు వడ్డీలు చెల్లించేవాడిని. ఆ సమయంలో పెంపుడు జంతువులను కూడా ఫీడ్ చేయలేక ఇతరులకు ఇచ్చేశాను. ఆ సమయంలో మొదటిసారి ఏడ్చాను. నా డబ్బు పోయినదానికంటే ఆ విషయంలో నేను ఎక్కువ బాధపడ్డానని పూరి చెప్పారు.ఇక పూరి జగన్నాధ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ సంస్థలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రొల్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. పూరి జగన్నాథ్ కెరీర్లో ఈ సినిమా కీలక మలుపు అవుతుందనే ఆశలు అభిమానుల్లో ఉన్నాయి. -
జయకృష్ణ శ్రీనివాస మంగాపురం.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ మూవీలో రషా తడానీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఉక్కిరి బిక్కిరి’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. హరి చరణ్ ఆలపించారు. ఈ సాంగ్ జీవీ ప్రకాశ్కుమార్ కంపోజ్ చేశారు. ఈ సినిమాలో మోహన్బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. -
జూనియర్ ఎన్టీఆర్కు గాయం..
హైదరాబాద్: ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్కు గాయమైంది. ఈరోజు(సోమవారం, జూలై 27వ తేదీ) సాయంత్రం జూ. ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసిన ఎన్టీఆర్ కార్యాలయం.. డా. జె. మధుసూదన్ రావు మరియు డా. ఆర్. ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు స్పష్టం చేసింది. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసింది. ఎన్టీఆర్ ఆరోగ్యం, కోలుకునే ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని తగిన సమయంలో ఎప్పటికప్పుడు అందిస్తామని ఎన్టీఆర్ టీమ్ పేర్కొంది. NTR sustained an unfortunate shoulder injury and advised 6 to 8 weeks of complete Rest! pic.twitter.com/y5B0gYJ8kI— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) July 27, 2026 -
'ఆదర్శ కుటుంబం' చిట్టిబాబు.. భలే ఫన్నీగా ఉన్నాడు
ఒకప్పటితో పోలిస్తే ఫ్యామిలీ కాన్సెప్ట్తో తీస్తున్న సినిమాలు చాలా తగ్గిపోయాయి. అనిల్ రావిపూడి లాంటి ఒకరిద్దరు దర్శకులు తప్పితే వేరే ఎవరూ ఈ టైపు మూవీస్ చేయట్లేదు. ఇకపోతే త్రివిక్రమ్-వెంకటేశ్ చాన్నాళ్ల తర్వాత కలిసి చేస్తున్న మూవీ 'ఆదర్శ కుటుంబం'. అక్టోబరు 02న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా వెంకటేశ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)ఈ మూవీలో చిట్టిబాబు అనే భార్య చాటు భర్తగా వెంకటేశ్ కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన క్యారెక్టర్ వీడియోలో కామెడీ, మ్యూజిక్ బాగున్నాయి. గతంలో త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ కామెడీ ఉండబోతుందని అనిపిస్తుంది. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్ కాగా నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పుడు వెంకీ వీడియో వదిలారు. త్వరలో ఒక్కో పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
నా కథ, స్క్రీన్ప్లే దొంగిలించారు
నా కథ, స్క్రీన్ప్లేని దొంగిలించి, నేను రూపొందించిన ప్రాజెక్ట్ నుంచి తప్పించారంటూ ఓ సినీ రచయిత ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాద్ మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన భూక్య ప్రభుదేవ్ రూపొందించిన 'మణిమా–ది శూన్య పురుష–ది లార్డ్ పూరి జగన్నాథ్' మైథాలజీ సినిమాకు సంబంధించిన కథ, స్క్రీన్ప్లే, టైటిల్ గ్లింప్స్ ని స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్లో నమోదు చేసుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)సినిమా పనుల కోసం తనతో పనిచేసిన పి.రవి, కో డైరెక్టర్ నవీన్ నలమాసని ప్రభుదేవ్ నియమించుకున్నారు. వీరు అజిత్ కుమార్తో కలిసి ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్, ఫైల్స్ను, హార్డ్డిస్క్ దొంగిలించారని, అందులోని కథని ఉపయోగించి తనని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించి.. రచయిత, దర్శకులుగా గుర్తింపు పొందడానికి ప్రయత్నించారని ప్రభుదేవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం) -
హైదరాబాద్లో మందాకిని
‘వారణాసి’ సినిమా కోసం మరోసారి హైదరాబాద్లో అడుగుపెట్టారు ప్రియాంక చోప్రా. గతంలో ఈ చిత్రం షూటింగ్ కోసం ఎక్కువసార్లు సోలోగా వచ్చిన ప్రియాంక ఈసారి మాత్రం భర్త నిక్ జోనస్, కుమార్తె మాల్తీతో కలిసి వచ్చారు. దీంతో ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన ఓ లాంగ్ షెడ్యూల్ హైదరాబాద్లో జరగనుందని, ఇందుకోసమే ఫ్యామిలీతో సహా ప్రియాంక హైదరాబాద్కు వచ్చి ఉంటారని టాక్.మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అడ్వెంచరస్ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడు... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్లో మహేశ్బాబు కనిపిస్తారు. మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. కొంత టాకీ పార్ట్ చిత్రీకరణ జరిగింది. తాజాగా ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ యాక్షన్ ఎపిసోడ్లో మహేశ్బాబు, ప్రియాంక ల్గొంటారని తెలిసింది. ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. -
ఎప్పటికైనా ఆ ఇద్దరి దర్శకత్వంలో నటిస్తే చాలు: భాగ్యశ్రీ
మాస్రాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే అడుగుపెట్టింది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా భాగ్యశ్రీ, అఖిల్తో కలిసి నటించిన లెనిన్ సినిమా ఆమె కెరీర్కు మలుపు తిప్పింది.తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తన కెరీర్పై ప్రత్యేకమైన కలలు ఏమీ పెట్టుకోలేదని స్పష్టం చేసింది. నాకు ఎలాంటి డ్రీమ్ రోల్స్ లేవు.. ఫ్లోలో వెళ్లిపోవడమే. టార్గెట్లు లాంటివి పెట్టుకుంటే టెన్షన్ వస్తుంది. చిన్న చిన్న టైమ్ లైన్స్ పెట్టుకొని ముందుకు సాగితే మనసుకు చాలా హాయిగా ఉంటుందని ఆమె చెప్పింది.తెలుగు ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్న భాగ్యశ్రీ, తన చివరి చిత్రం కూడా తెలుగులోనే చేస్తానని ఇప్పటికే తెలిపింది. అలా ఈ గ్యాప్లో రాజమౌళి, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తేచాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.ప్రస్తుతం భాగ్యశ్రీ తెలుగు నేర్చుకుంటోంది. అంతేకాదు తెలుగు సంస్కృతికి కూడా అలవాటు పడుతోంది. ఉదయం అల్పాహారం నుంచి డిన్నర్ వరకు అన్నింటిలో తెలుగు వంటకాలను ఇష్టపడుతోంది. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, ఊతప్పం, ఉప్మా వంటి వంటకాలు తన ఫేవరెట్ లిస్ట్లో ఉన్నాయని వెల్లడించింది.ఇక తనకు ప్రత్యేకంగా ఏ నగరంలో సెటిల్ అవ్వాలని లేదని, కానీ హిల్ స్టేషన్లు అంటే చాలా ఇష్టమని తెలిపింది. బీచ్ల కంటే కొండ ప్రాంతంలో ఉండడమే తనకు హాయిగా అనిపిస్తుందని చెప్పింది. ఇటీవల తన సంపాదనతో తల్లికి మొబైల్ ఫోన్ కొనిచ్చిందని తెలిపింది. తనది మధ్యతరగతి కుటుంబమని.. కానీ తల్లిదండ్రుల కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదని ఆమె భావోద్వేగంగా చెప్పింది. -
చీరలో అనన్య.. వైజాగ్ బీచ్లో రషా
చీరలో అందాలన్ని చూపిస్తున్న అనన్య నాగళ్లవైజాగ్ బీచ్లో చిల్ అవుతున్న రషా తడానీవయ్యారంగా ఒంపుసొంపులతో భవానీ శ్రీఫ్యామిలీతో కలిసి యాంకర్ అనసూయ ఔటింగ్కాశీలో తిరుగుతున్న హీరోయిన్ నివేతా పేతురాజ్ఇటలీ వెళ్లిపోయిన నేహా శెట్టి, సయీ మంజ్రేకర్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) -
జూనియర్-నీల్ కాంబో.. మరో స్టార్ నటుడి ఎంట్రీ..!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ తర్వాత నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ కావడంతో టాలీవుడ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ నేపథ్యంలోనే డ్రాగన్కు సంబంధించిన ఓ క్రేజీ టాక్ వైరలవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ భాజ్పేయి నటించనున్నారని లేటేస్ట్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే అతన్ని మేకర్స్ సంప్రదించారని టాక్. ఓ కీలక పాత్ర కోసం మనోజ్ను చిత్ర యూనిట్ అడిగినట్లు తెలుస్తోంది. ఓకే అయితే వచ్చే షూటింగ్ షెడ్యూల్లోనే మనోజ్ ఎంట్రీ ఇస్తాడని సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. కాగా.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి నందమూరి కల్యాణ్రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. -
మిస్ యూ నానమ్మ.. పూరీ కూతురు పోస్ట్
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ కూతురు పవిత్ర ఎమోషనల్గా ఓ పోస్ట్ పెట్టింది. వరుసకు నానమ్మ అయ్యే (పూరీ జగన్నాధ్ బంధువు) బంధువు చనిపోయిన సంగతిని సోషల్ మీడియాలో పంచుకుంది. శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది.(ఇదీ చదవండి: వివాదంలో 'ఒడిస్సీ'.. కనీసం రూ.6 లక్షలు చెల్లించలేరా?)'ఇప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు? ప్రేమగా నన్నెవరు ముద్దుపెట్టుకుంటారు? నీతో మరోరోజు గడిపే అవకాశమొస్తే బాగుండు. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లు పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ' అని పూరీ జగన్నాధ్ కూతురు పవిత్ర.. ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: కోయంబత్తూరులో రామ్ చరణ్కి సర్జరీ) -
చైతూ-శోభిత గుడ్ న్యూస్ చెప్పనున్నారా?
టాలీవుడ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వృషకర్మ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ మూవీలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఇక ఈ సినిమా సంగతి పక్కనపెడితే ఇటీవలే నాగచైతన్య తన భార్య శోభిత ధూలిపాళ్లతో ఓ పిక్ చేశారు. పెళ్లయిన దాదాపు 2 సంవత్సరాల తర్వాత తొలిసారిగా నా భార్య శోభిత తన కోసం రాత్రి భోజనం వండిందని వెల్లడిస్తూ నాగ చైతన్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. బహుశా ఈ రోజు నేను ఏదో సరైన పనే చేశానేమో అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.ఈ ఫోటోలో శోభిత లుక్ చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే చైతూ-శోభిత గుడ్ న్యూస్ చెప్పనున్నారని పోస్టులు పెడతున్నారు. ఈ ఫోటోలో శోభిత బేబీ బంప్తో కనిపించిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు చైతూ కానీ.. శోభిత కానీ స్పందించలేదు. వీళ్లిద్దరూ క్లారిటీ ఇస్తేనే రూమర్స్కు చెక్ పడనుంది. కాగా.. టాలీవుడ్ హీరో నాగచైతన్య- శోభిత ధూలిపాళ్ల 2024 డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు తమ కెరీర్లో బిజీగా ఉన్నారు. కాగా.. ఈ ఏడాది మా ఇంటి బంగారంతో హిట్ కొట్టిన చైతూ మాజీ భార్య సమంత.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చైతూ కూడా ఇదే ఏడాది గుడ్ న్యూస్ చెప్పనున్నాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా? ఇంత పెద్ద కూతురు ఉందా?
తెలుగు తెరపై ఎందరో నటీనటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థి ర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే కొంతమంది మాత్రం సడెన్గా వెండితెరకు దూరం అయిపోతున్నారు. వందల సినిమాలు చేసినా.. మళ్లీ తెరపై కనిపించడం లేదు. అలాంటి వాళ్లలు నవీన్ ఓలేటి ఒకరు. పేరు చెబితే తెలియదు కానీ.. ప్రేమంటే ఇదేరా చిత్రంలో హీరో వెంకటేష్ ఫ్రెండ్.. విక్రమార్కుడులో పోలీసు.. తొలివలపు మూవీలో హీరో అన్నయ్య అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. నువ్వే నువ్వే, విక్రమార్కుడుతో పాటు దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. సినిమాల కంటే ముందు బుల్లితెరపై సందడి చేశాడు. పద్మవ్యూహం’, ‘నాన్న’ వంటి సూపర్ హిట్ సీరియల్స్లో ఆయన పోషించిన పాత్రలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అతని సతీమణి కూడా నటినే. పేరు మధురిమ. ఆర్. నారాయణ మూర్తి దర్శకత్వం వహించిన ‘ధళం’చిత్రంతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత నరసింహనాయుడు’, ‘ఫ్యామిలీ సర్కస్’, ‘ప్రేమతో రా’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించింది. విక్రమార్కుడు చిత్రంలో రాజీవ్ కనకాల భార్యగా నటించింది ఈమెనే. అదే చిత్రంలో నవీన్.. కానిస్టేబుల్గా నటించాడు.ఇలా వెండితెరపై ఆకట్టుకున్న ఈ జంట.. సడెన్గా ఇండస్ట్రీకి దూరమైంది. ఈ దంపతులు ఇప్పుడు పిల్లలతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు ప్లిలలు (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) ఉన్నారు. పెద్ద కుమార్తె మనవి హీరోయిన్ గా రాణించేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంది. View this post on Instagram A post shared by Manu 🪩 (@manavvivoleti) -
కోయంబత్తూరులో రామ్ చరణ్కి సర్జరీ
గత నెలలో 'పెద్ది'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్.. తెలుగు రాష్ట్రాల వరకు ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో చరణ్ మణికట్టుకి గాయమైంది. ప్రమోషన్లలోనూ చేతికి కట్టుతోనే కనిపించాడు. దీనికి సర్జరీ అవసరమవుతుందని అప్పట్లోనే వార్తలొచ్చాయి. చివరకు ఇన్నాళ్లకు చరణ్ శస్త్రచికిత్స చేసుకోనున్నాడు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం ఇది జరగనుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి గుండెల్ని పిండేసే తెలుగు లవ్స్టోరీ సినిమా)రామ్ చరణ్కు అండగా ఉండేందుకు తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖతో పాటు భార్య ఉపాసన కోయంబత్తూరుకు బయలుదేరారు. సర్జరీ జరగనున్న నేపథ్యంలో రామ్ చరణ్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లలో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. చరణ్ తర్వాత ప్రాజెక్ట్ విషయానికొస్తే సుకుమార్తో చేయనున్నాడు. చాన్నాళ్ల క్రితమే అధికారిక ప్రకటన వచ్చేసింది. కానీ షూటింగ్ మొదలయ్యేసరికి వచ్చే ఏడాది వేసవి పట్టొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: వివాదంలో 'ఒడిస్సీ'.. కనీసం రూ.6 లక్షలు చెల్లించలేరా?)Mega Power Star #RamCharan Garu has departed for Coimbatore with his family to undergo a scheduled hand surgery. Megastar Chiranjeevi Garu is by his side during this time. ❤️ pic.twitter.com/Ej1TvyRbeq— SivaCherry (@sivacherry9) July 26, 2026 -
కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ.. రెండు రోజుల కలెక్షన్స్
కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ జంటగా వచ్చిన లవ్ ఎంటర్టైనర్ చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలిరోజే రూ. 12.3 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సాయి రాజేష్, ఎస్ కే ఎన్ నిర్మించారు.ఈ మూవీ రెండు రోజు కూడా అదే జోరు కొనసాగించింది. రిలీజైన రెండు రోజుల్లోనే రూ.25.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన సానుకూల స్పందన రావడంతో రెండో రోజు వసూళ్లు రాబట్టింది. మొదటి రోజే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.. బరిలో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. #ChennaiLoveStory continues its SENSATIONAL BOX OFFICE RAMPAGE! ❤️🔥❤️🔥𝟐𝟓.𝟐 𝐂𝐑+ 𝐆𝐑𝐎𝐒𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 in just 𝟐 𝐃𝐀𝐘𝐒! 🔥🔥Sunday kickstarts on a BLOCKBUSTER note at the box office! 💥💥A CULT CLASSIC BLOCKBUSTER in every sense! 😍🫶🏻Book your tickets now 🎟️… pic.twitter.com/ZVtx1U5WO9— Mass Movie Makers (@MassMovieMakers) July 26, 2026 -
ఆ రోజే నా సినిమా కూడా రిలీజైంది: మహేశ్ బాబు స్పెషల్ వీడియో
సూపర్స్టార్ కృష్ణ మనవడు, మహేశ్బాబు సోదరుడు రమేష్బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీలో రవీనా టాండన్ కూతురు రషా తడానీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిం చారు. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఈ మూవీపై టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు స్పందించారు. మా రమేశన్న వాళ్ల అబ్బాయి జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది మా కుటుంబానికి చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. ఇప్పటి వరకు చూసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ చాలా చాలా బాగున్నాయని ప్రశంసించారు. ఈ క్రెడిట్ అంతా అజయ్ భూపతికి దక్కుతుందన్నారు. ఈ సినిమా జూలై 30న రిలీజ్ కానుంది.. అదే రోజు నా సినిమా రాజ కుమారుడు కూడా విడుదలైందని వెల్లడించారు. ఈ మూవీతో మీరంతా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మహేశ్ బాబు ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. Extremely happy for #JaiKrishnaGhattamaneni and #RashaThadani on their debut with #SrinivasaMangapuram…. I wish the whole team the very best for July 30th!!! 🤗🤗🤗♥️♥️♥️@DirAjayBhupathi #RashaThadani @themohanbabu @AshwiniDuttCh @gvprakash @gemini_kiran @CKPicturesoffl pic.twitter.com/VPgSDQRmAn— Mahesh Babu (@urstrulyMahesh) July 26, 2026 -
‘గబ్బర్ సింగ్’ రమేష్కి అండగా నిలిచిన మెగాస్టార్
బ్రెయిన్ స్ట్రోక్తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ గారు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్కు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంటనే స్పందించారు.అపోలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి రమేష్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారిని కోరారు. అంతేకాదు రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో రమేశ్ సతీమణికి రూ. 3 లక్షల చెక్కును అందజేశారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తామని చిరంజీవి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. రమేష్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని చిరంజీవి గారు ఆకాంక్షించారు. -
ఓటీటీలోకి గుండెల్ని పిండేసే లవ్స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన తాజా చిత్రం ‘దీవాన’. ఈ చిత్రంలోన బ్యూటిఫుల్ హీరోయిన్ స్మేహ మణిమేఘలై తెలుగు తెరకు పరిచయం అయింది. శ్రీకాంత్ సంఘిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని అర్హ మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవీ కార్యంపూడి నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 20న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్ని అందుకుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. అంతగా ఆకట్టుకున్న ఈ ప్రేమ కథ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.ఈ జులై 31వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 'మిస్ అయితే మస్త్ ఫీల్ అయితవ్' అంటూ మేకర్స్ ఈ రోజు ‘దీవాన’ ఓటీటీ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగానే ఎర్లీ యాక్సెస్ లో ఈ సినిమాను చూడొచ్చు. తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమా వ్యూయర్స్ కు అందుబాటులో ఉండనుంది.‘దీవాన’ కథేంటంటే.. డిగ్రీ పూర్తి చేసిన మున్నా (హర్షిత్ రెడ్డిద) ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఫ్రెండ్స్తో కలిసి తిరగడం, తాగడం తప్పా ఇంటి బాధ్యతల్ని పట్టించుకోడు. తండ్రి శేఖర్(నరేష్) పడే కష్టం గురించి మున్నా ఏ మాత్రం ఆలోచించడు. అసలు తల్లిదండ్రులు, ఇంటి బాధ్యత అన్నదే మున్నాకి పట్టదు. ఎప్పుడూ గాలి తిరుగుడు తిరుగుతూ ఉంటాడు. అలాంటి మున్నా ఓ సారి ఓ అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇక ఆ అమ్మాయి మీ సేవా కేంద్రంలో పని చేస్తుంటుందని, ఆమె పేరు అమూల్య (స్మేహా మణిమేఘలై) అని తెలుసుకుంటాడు. ఇక ప్రతీ రోజూ మీ సేవాలో ఏదో ఒక పని అడ్డం పెట్టుకుని అమూల్య వద్దకు వెళ్లడం చేస్తుంటాడు మున్నా. అయితే కొన్ని రోజులకు మున్నా చేష్టలకు అమూల్య విసిగిపోతుంది. నేను నెలకి రూ. 20 వేలు సంపాదిస్తున్నా.. నువ్వు మాత్రం రూ. 20 కూడా సంపాదించలేవు.. ముందు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని కనపడు.. ఆ తరువాత చూద్దాం అని మున్నాతో అమూల్య చెబుతుంది. దీంతో మున్నా ఓ గాడిన పడతాడు. అమూల్య చెప్పినట్టుగా జాబ్ సంపాదించుకునే క్రమంలో ప్రయత్నాలు మొదలు పెడతాడు. అసలు అమూల్య అలాంటి ఓ కండీషన్ ఎందుకు పెట్టింది? మరి మున్నా చివరకు తన ప్రయత్నంలో సఫలం అవుతాడా? వీరి ప్రేమ కథకు అడ్డుగా నిలిచే ఆ కారణాలు ఏంటి? చివరకు మున్నా ప్రేమ గెలుస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
డబ్బులున్న వారా లేదా సంతోషంగా ఉండేవారా? ఎవరు అమీర్?
ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమీర్ లోగ్’. వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న విడుదల చేస్తోంది. శనివారం హైదరాబాద్లో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్తో పాటు ‘అవ్వల్ దావత్...’ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ– ‘‘మాది నల్గొండలోని రాఘవపురం. నేను 1997లో హైదరాబాద్కు వచ్చాను. హైదరాబాద్ మనుషుల్ని తెరపై చూపించాలని ‘అమీర్ లోగ్’ మూవీ తీశాను. డబ్బులున్న వారు అమీర్లోగా? సంతోషంగా ఉండేవారు అమీర్ లోగా? ఎవరు అమీర్? అన్నది ఈ చిత్రం చూసిన తర్వాత అర్థం అవుతుంది’’ అని చెప్పారు. ‘‘అందరూ మా సినిమా చూసి నటీనటులను, సాంకేతిక నిపుణులను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మాధవి రెడ్డి. ‘‘హైదరాబాద్ను, ఇక్కడి బస్తీలను రమణా రెడ్డిగారు అద్భుతంగా చూపించారు’’ అని స్మరణ్ సాయి చెప్పారు. ‘‘హైదరాబాద్లో మనుషులు ఎలా ఉంటారు? బిర్యానీ ఎలా ఉంటుంది? క్రికెట్ అంటే ఎంత ప్యాషన్? అని ఎవరైనా అడిగితే ‘అమీర్ లోగ్’ సినిమా చూపించండి’’ అని వేద, హరి, మనోజ్, శశిధర్, సాయి యోగి, కీర్తి, రచయిత మనోజ్ కుమార్ పేర్కొన్నారు. -
నా లైఫ్లో స్పెషల్ మూవీ అదే : అఖిల్ కామెంట్స్ వైరల్
లెనిన్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అక్కినేని హీరో అఖిల్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అఖిల్.. ఎట్టకేలకు అయ్యగారే నంబర్వన్ అనిపించుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది.లెనిన్ హిట్ కొట్టిన ఆనందంలో ఉన్న అఖిల్ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన చిన్నప్పుడు నటించిన సిసింద్రీ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా మొత్తం నా నిద్ర టైమ్ ఆధారంగానే తెరకెక్కించారని తెలిపారు. నేను ఏడవాలంటే కెమెరా వెనకాల నాన్న చేతులు ఊపేవారని అన్నారు. నేను ఏడ్చాలంటే అమ్మ బై చెప్పి కారులో వెళ్లిపోయేదని అఖిల్ వెల్లడించారు. ఇలా చిన్న చిన్న ట్రిక్స్తో నేను నటించానని.. అందుకే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చిందన్నారు. నా లైఫ్లో ది మోస్ట్ యూనిక్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ సిసింద్రీ మూవీనేనని అఖిల్ ఆనందం వ్యక్తం చేశారు. నా జీవితంలో సిసింద్రీ మూవీ చాలా ప్రత్యేకమని తెలిపారు. -
ఆ ఒక్క కారణం వల్లే సినిమాల్లోకి: రకుల్ ప్రీత్ సింగ్
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత బాలీవుడ్లోనూ పలు మూవీస్ చేసింది. ప్రస్తుతం రామాయణ మూవీలో కనిపించనుంది. ఇటీవల రైజింగ్ భారత్ సమ్మిట్కు హాజరైన రకుల్.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను సినిమాల్లోకి రావడానికి గల కారణాన్ని వివరించింది.కేవలం కారు కొనాలనే కోరికతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టానని తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్. అలా జరిగితే నా ఫ్రెండ్స్లో కారు కొనుక్కున్న మొదటి వ్యక్తిని నేను అవుతానని భావించానని వెల్లడించింది. అందుకే కన్నడ మూవీలో అవకాశం రాగానే ఒప్పేసుకున్నానని పేర్కొంది. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీపై తనకు ఎలాంటి అవగాహన లేదని రకుల్ పంచుకుంది. రకుల్ మాట్లాడుతూ..' కాలేజీలో చదువుతున్నప్పుడే కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి అవకాశం వచ్చింది. ఎవరో నా ఫొటోలు చూసి మా నాన్నని కలిశారు. ఓ సినిమాలో నటించేందుకు నన్ను తీసుకుంటామని అడిగారు. అప్పుడు నాకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీపై నాకు అవగాహన లేదు. అయితే ఆ సినిమాకు నాకు రూ.5 లక్షల పారితోషికం ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులతో కారు కొనుక్కోవాలనుకున్నా. నా స్నేహితులందరిలో కారు ఉన్న మొదటి అమ్మాయిని నేనే అవుతా. ఆ ఒక్క కారణంతోనే సినిమా చేయడానికి అంగీకరించా' అని తెలిపింది. కాగా.. 2009లో కన్నడ చిత్రం గిల్లీతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ టాలీవుడ్లో అడుగుపెట్టింది. -
సైకలాజికల్ థ్రిల్లర్గా శ్రీరామ్ ‘ది మేజ్’
హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న సినిమా ‘ది మేజ్’. ప్రియాంక, హ్రితికా శ్రీనివాస్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డా. నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో డా. రవికిరణ్ గడలాయ్ దర్శకత్వంలో డా. ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డా. కేఎస్ఆర్, డా. భరత్ రెడ్డి గోపు, డా. అనిరుధ్ రెడ్డి సోమ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. దర్శకుడు రవికిరణ్ మాట్లాడుతూ – ‘‘వాస్తవం–భ్రమ మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ, మీ ఆలోచనలను సవాలు చేసే సైకలాజికల్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కథలోని ప్రతి మలుపు ఆసక్తి రేపేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్. -
డాన్సర్స్ అసోసియేషన్ మీటింగ్పై తీవ్ర ఉత్కంఠ
నేడు తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫెడరేషన్ సూచనల మేరకు వివాదాలు సర్దుమణగడంతో ఈ సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. యూనియన్ సభ్యులందరూ కలిసికట్టుగా, ఐక్యంగా చర్చించుకుని ముందుకు సాగాలని నిర్మాతల మండలి, ఫెడరేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు.ఉప ఎన్నికలు జరపాలంటూ హైకోర్టులో కేసుయూనియన్ అధ్యక్షుడు సుమలతా దేవికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల మధ్య, డాన్సర్ బాలు నిన్న డాన్సర్స్ అసోసియేషన్పై కోర్టులో కేసు దాఖలు చేశారు. తక్షణమే ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫెడరేషన్ సూచించిన మార్గదర్శకాలను పక్కనపెట్టి, నేడు జనరల్ బాడీ మీటింగ్ ఉన్నప్పటికీ కోర్టు కేసు వేయడం వెనుక ప్రెసిడెంట్ సుమలత, జానీ మాస్టర్ల హస్తం ఉందంటూ కొంతమంది డాన్సర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫెడరేషన్ మాటలను వీరు పట్టించుకోవడం లేదని వారి ఆరోపించారు.కాగా, ఇటీవల డాన్సర్స్ అసోసియేషన్లో జరిగిన పరిణామాలపై ఫెడరేషన్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్పై ఇండియా వైడ్గా సస్పెన్షన్ విధిస్తామని హెచ్చరించడమే కాకుండా, ఆయన పనిచేసే చిత్రాల్లో మిగతా 23 క్రాఫ్ట్స్కు చెందిన వర్కర్లు పాల్గొనకుండా బహిష్కరిస్తామని స్పష్టం చేసింది. జూలై 19న కుదిరిన రాజీ ఈ వివాద పరిష్కారానికి జూలై 19న ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫెడరేషన్ సభ్యులు, జానీ మాస్టర్ అలాగే అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతతో ప్రత్యేక చర్చలు జరిపారు.అదే రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫెడరేషన్ ప్రతినిధులు అసోసియేషన్లోని సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. జానీ మాస్టర్, సుమలతలు కూడా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపారు. ఈ రోజు జరుగుతున్న జనరల్ బాడీ మీటింగ్లో డాన్సర్స్ అసోసియేషన్ భవిష్యత్ కార్యాచరణ, ఏకాభిప్రాయం ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. -
నేనే దర్శకత్వం వహించినా.. ఇంత బాగా తీసేవాడిని కాదు : సాయి రాజేష్
‘‘చెన్నై లవ్ స్టోరీ’కి నేను కథా రచయితను అయినా నాకంటే ఎక్కువగా ఈ కథను ప్రేమించి, అర్థం చేసుకుని సినిమా తీశారు రవి నంబూరి. నేను దర్శకుడిని అయినా ఇంత బాగా తెరకెక్కించేవాడిని కాదేమో. ‘బేబి’ తర్వాత మా గౌరవాన్ని పెంచే సినిమా చేయాలనుకున్నాం. ‘బేబి’ కన్నా ‘చెన్నై లవ్ స్టోరీ’ చాలా గొప్ప సినిమా’’ అని సాయి రాజేష్ తెలిపారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. శనివారం జరిగిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో రవి నంబూరి మాట్లాడుతూ– ‘‘మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఏ దర్శకుడికైనా ఓ కల. ఆ కల నిజం కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.శ్రీ గౌరీప్రియ మాట్లాడుతూ– ‘‘కొంచెం ఎమోషనల్గా ఉన్నాను. నాకు చాలా ముఖ్యమైన రోజు ఇది. మా అమ్మ ఉండి ఉంటే నిజంగా చాలా సంతోషపడేవారు. కానీ, మా అమ్మ రూపంలో విశాల, ప్రమోదినిగార్లు అప్పుడప్పుడు వచ్చి నాకు మంచి మాటలు చెబుతుంటారు. ఇక్కడికి రాగానే ‘చెన్నై లవ్ స్టోరీ’లో నువ్వు చేసిన నివి పాత్రకు నీకు మంచి పేరు, ప్రశంసలు వస్తున్నాయి... అమ్మ చూసుంటే చాలా బాగుండేది’’ అని వారు అన్నారు. కానీ, మా అమ్మ చూస్తోంది.. తన వల్లే నాకీ పేరు వస్తోందని నా ఫీలింగ్’’ అన్నారు. ‘‘అప్పట్లో బాలచందర్, భారతీరాజాగారి కథల్లా సాయి రాజేష్గారి కథల్లో లోతు ఉంటుంది. మా సినిమా తొలి రోజు రూ. 12.3 కోట్లు వసూలు చేసిందని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అని ఎస్కేఎన్ పేర్కొన్నారు. ‘‘నా కెరీర్లో స్టీవెన్ శంకర్ అనే గుర్తుండిపోయే పాత్ర ఇచ్చిన రవి నంబూరిగారికి థ్యాంక్స్’’ అన్నారు కిరణ్ అబ్బవరం. కెమెరామేన్ విశ్వాస్ డేనియల్, రచయిత అనంత శ్రీరామ్, నటీనటులు ప్రమోదిని, త్రిగుణ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అవమానాలు తప్పవు.. పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు
పాన్ ఇండియా కథానాయికలుగా రాణిస్తున్న వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. దశాబ్దానికి పైగా తెలుగు ,తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా కొనసాగుతున్న ఈ బ్యూటీకి అందరూ నటీమణుల మాదిరిగానే కెరీర్ పరంగా అవరోధాలు ఎదురయ్యాయి. చిత్రాల జయాపజయాలు అనేవి ఎవరి చేతుల్లోనూ ఉండవు. అయినా కొన్ని చిత్రాల అపజయాలకు నటి పూజా హెగ్డేను బాధ్యతను చేయడంతో చాలా అవకాశాలు దూరం అయ్యాయి. అయితే అలాంటి వాటిని మళ్లీ అవకాశాలు అందుకుంటూ బిజీ అవుతున్నారు. అలా నటుడు విజయ్ సరసన కథానాయకి నటించిన చిత్రం జననాయకన్. ఇంతకుముందు ఆయన సరసన నటించిన బీస్ట్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ జననాయకన్ చిత్రంతో మరో అవకాశాన్ని అందుకున్నారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం వసూళ్లు కురిపిస్తోంది. ఈ సందర్భంగా నటి పూజా హెగ్డే ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ‘‘ సినిమా అనేది ఒక ఇసుక ఊబి లాంటిది. జాగరూకత లేకుంటే చిక్కుకుపోతాం. అలా చిక్కుకుంటే చెల్లా చెదురవుతాం. అందువల్ల పోటీ ఉన్నా, రాగద్వేషాలు లేకుండా పయనించాలి. శ్రమ, నమ్మకం ఉంటేనే సినిమాలో జయించగలం. ఇక్కడ విజయం సాధించిన వారంతా పలు సమస్యలను అధిగమించినవారే అయ్యి ఉంటారు. ఎందుకంటే అవమానాలను , పరాభవాలను ఎదుర్కోకుండా సినిమాల్లో రాణించటం సాధ్యం కాదు ‘‘ అని నటి పూజా హెగ్డే పేర్కొన్నారు. దీంతో ఆమె తన స్వానుభవాన్ని బయట పెట్టినట్లుంది అనే కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
ఫ్యామిలీ స్టార్స్
సూపర్ పవర్స్ లేని సూపర్ హీరో నాన్న. అయినా కుటుంబం కోసం సూపర్ కష్టాలను తట్టుకుని మరీ కుటుంబ సంక్షేమం కోసం తపన పడతాడు... ఒక్కోసారి తన ఇష్టాలను కూడా త్యాగం చేస్తాడు. బాధ్యతలనే ఇష్టంగా చేసుకుంటాడు. కుమారుడు, కుమార్తెల సంతోషమే తన ఆస్తిగా ఫీలవుతాడు. అందుకే ప్రతి కుటుంబానికి నాన్నే ఫ్యామిలీ స్టార్. ఇలా తండ్రి ఎమోషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే... ఫాదర్ ఎమోషన్ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్బస్టర్స్గా నిలిచాయి. ప్రస్తుతం ఈ జానర్లో మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నేడు (ఆదివారం) నేషనల్ పేరెంట్స్ డే. ఈ సందర్భంగా తండ్రి ఎమోషన్తో రానున్న కొన్ని సినిమాలపై ఓ లుక్ వేయండి.గ్యాంగ్స్టర్ నాన్న కూతురు సంరక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ తండ్రి కథ వచ్చే సంక్రాంతికి థియేటర్స్లోకి వచ్చే అవకాశం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీ కూతుళ్ల ఎమోషనే అని తెలిసింది. ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట.కొన్ని సీన్స్లో చిరంజీవి గ్యాంగ్స్టర్గా కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలోని కొంత భాగం గోదావరి నేపథ్యంలో, మరికొంత భాగం కోల్కతా నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల పాత్రలో చిరంజీవి, మలయాళ నటి అనశ్వర రాజన్ నటిస్తున్నారని టాక్. నివేతా పేతురాజ్ మరో కీ రోల్ చేస్తున్నారు. చిరంజీవి భార్యగా నివేతా పేతురాజ్ కనిపిస్తారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతి పండగకు రిలీజ్ చేయాలనే టార్గెట్తో చిత్రయూనిట్ షూటింగ్ చేస్తోందని తెలిసింది. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటు క్లాస్... అటు మాస్ సమాజంలో వారిది ‘ఆదర్శ కుటుంబం’. కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం, ఈ కుటుంబం పెద్ద అయిన తండ్రి గన్ పడతాడు? తన కుటుంబ సభ్యుల చేత ఫైట్ చేయిస్తాడు. ఈ మాస్ ఫాదర్ డీటైల్స్ ఏంటో తెలుసుకోవాలంటే అక్టోబరు 2 వరకు ఆగాల్సిందే. వెంకటేశ్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబరు 47’ (ఏకే 47). ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఫాదర్ రోల్ చేస్తున్నారు వెంకటేశ్. అలాగే వెంకటేశ్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. క్లాస్గా ఉంటూనే తన కుటుంబం ఆపదలో ఉందంటే మాత్రం ఫైర్ అయి పోయే మాస్ ఫాదర్ రోల్ చేస్తున్నారట వెంకటేశ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది. మరోవైపు వెంకటేశ్ హీరోగా నటించిన హిట్ ఫిల్మ్స్ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలకు దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉండటం సహజం.కూతురు కోసం... రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమాలో రవితేజ తండ్రి పాత్రలో నటించగా, ఆయన కుమార్తెగా బేబీ నక్షత్ర నటించారు. రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్ నటించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది. ఏదో మానసిక బాధలో ఉన్న తండ్రిని మందు మానేయమని కూతురు రిక్వెస్ట్ చేయడం, కుమార్తె కోసం ఆ తండ్రి తనను తాను మార్చుకోవాలనుకోవడం, ఆ కుమార్తె రక్షణ కోసం తన ప్రాణాలనైనా లెక్క చేయని తండ్రి సాహసం... వంటి అంశాల నేపథ్యంలో ఈ ‘ఇరుముడి’ సినిమా కథనం సాగుతుందని టాక్. ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది. తండ్రి ఆదేశం తన తండ్రి లక్ష్యం కోసం రుద్ర ఓ సాహసోపేతమైన ప్రయాణం మొదలుపెట్టాడు. కాలానికి అతీతంగా ఖండాల మధ్య ప్రయాణం చేస్తున్నాడు. మరి... రుద్రకు అతని తండ్రి అప్పగించిన మిషన్ ఏంటి? తండ్రి కోసం రుద్ర ఏం చేశాడు? అన్న అంశాల నేపథ్యంలోనే ‘వారణాసి’ సినిమా కథనం రూపొందుతోందనే ప్రచారం ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడు... ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు మహేశ్బాబు. మందాకినిగా ప్రియాంక చో్ర పా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్, అడ్వెంచరస్ అంశాలు ఉన్నప్పటికీ ‘వారణాసి’ ప్రధాన కథాంశం తండ్రీ కొడుకుల అనుబంధమే అని ఇటీవల పారిస్లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు రాజమౌళి. దీంతో ‘వారణాసి’ సినిమా కథపై విభిన్న ప్రచారాలు తెరపైకి వచ్చాయి. పైన పేర్కొన్న కథాంశం కూడా ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అంతేకాదు...ఈ చిత్రంలో మహేశ్బాబు తండ్రిగా ప్రకాశ్రాజ్ కనిపిస్తారని భోగట్టా. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. మహేశ్బాబు పాల్గొంటుండగా కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.ఓ తండ్రి... ఇద్దరు కొడుకులు ఓ తండ్రి తన ఇద్దరు కొడుకుల కోసం ఎలాంటి త్యాగం చేశాడు? ఈ ఇద్దరు కొడుకులకు, తండ్రికి మధ్య దూరం ఎందుకు ఏర్పడింది? అనే అంశాల ఆధారంగా ‘రాకా’ సినిమా తెరకెక్కుతోందట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ‘రాకా’. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తండ్రి, ఇద్దరు కొడుకులు... ఇలా మూడు పాత్రల్లోనూ అల్లు అర్జున్ కనిపిస్తారని ఫిల్మ్నగర్ భోగట్టా. ఈ తండ్రీ కొడుకుల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఈ సినిమాలో హైలైట్గా ఉంటాయని సమాచారం. అంతే కాదండోయ్..‘రాకా’ సినిమాలో అల్లు అర్జున్ చేస్తున్న మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ విలన్ అని టాక్. ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్లో ‘రాకా’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మేజర్గా ఈ సెట్స్లోనే ఈ సినిమాను షూట్ చేస్తున్నారు అట్లీ అండ్ టీమ్. కాగా, ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో భాగంగా ఆస్ట్రియాలో ఉన్నారు అల్లు అర్జున్. ఈ వెకేషన్ పూర్తి కాగానే, ముంబై చేరుకుని ‘రాకా’ చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ రిలీజ్ మాత్రం వచ్చే ఏడాది ఉంటుందట. ఎందుకంటే... ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించారు దర్శకుడు అట్లీ. అందుకోసం చాలా వీఎఫ్ఎక్స్ పనులు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే ‘రాకా’ సినిమా విడుదల వచ్చే ఏడాది ఉంటుంది. నటీమణులు దీపికా పదుకోన్, ఫెమినా జార్జ్, పంజాబీ నటి నైలా గ్రేవాల్ ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ సైతం ఈ సినిమాలో భాగమయ్యారని బాలీవుడ్ సమాచారం. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తండ్రి హీరో... కొడుకు విలన్? ఏ తండ్రికైనా తన కొడుకే హీరో. కానీ ఓ తండ్రి పాలిట ఓ కొడుకు విలన్ అయ్యాడు. మరి... ఈ తండ్రీ కొడుకుల కహానీ ఏంటి? కొడుకు తనపై పెంచుకున్న ద్వేషాన్ని ప్రేమగా మార్చేందుకు ఓ తండ్రి ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు? అన్న అంశాలతో ‘టాక్సిక్’ సినిమా రూపొందుతోందని సమాచారం. యశ్ ద్వి పాత్రాభినయం చేసిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లిష్) చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అండ్ అప్స్’. గోవా నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రాయ, టాక్సిక్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు యశ్.‘టాక్సిక్’ కథనం తండ్రీ కొడుకుల ప్రతీకారం, అనుబంధం నేపథ్యంలో సాగుతుందని, 1940–1970 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యశ్ పేర్కొన్నారు. ఈ సినిమా ప్రధానాంశం తండ్రిపై కొడుకు ప్రతీకారమే అయినా, క్లైమాక్స్లో వీరిద్దరూ కలిసి మెయిన్ విలన్ను ఓ ఆటాడిస్తారట. మరి... ఈ సినిమా కథనం ఇలానే సాగుతుందా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం ఆగస్టు 26 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే... ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను ఆగస్టు 8న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.ఇక ఈ చిత్రంలో గంగ పాత్రలో నయనతార, నాడియాగా కియారా అద్వానీ, రెబెక్కా రోల్లో తారా సుతారియా, మెలిస్సాగా రుక్మిణి వసంత్ నటించారు. ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్దాస్తో కలిసి ఈ సినిమాకు కథ అందించారు యశ్. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ సినిమాను నిర్మించారు. సంజయ్ విశ్వనాథ్ సూర్య హీరోగా నటించిన తాజా సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టైటిల్లోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఉండటం, ఈ చిత్రంలో సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య నటించారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్స్ కూడా ఈ చిత్రంలో సూర్య చేసినది ఫాదర్ రోల్ అని స్పష్టం చేస్తున్నాయి. మరి... సంజయ్ విశ్వనాథ్గా తండ్రి పాత్రలో సూర్య ఎలా నటించారు? ఈ పాత్ర చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ బాండింగ్స్ ఏంటి? అన్న అంశాలు తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే... ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించగా, హీరోయిన్గా మమితా బైజు నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేశారు.⇒ కార్తీ కెరీర్లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘ఖైదీ’ ఒకటి. ఈ సినిమాలో ఢిల్లీ పాత్రలో కార్తీ అద్భుతమైన నటన కనబరచారు. పదేళ్ల పాటు జైలు జీవితం గడిపి, తన కుమార్తె అముదను కలసుకునేందుకు ఢిల్లీ తిరిగి వస్తాడు. మరి... ఈ తండ్రీకూతుళ్ల కథ ఏంటి? ఢిల్లీ భార్యకు ఏం జరిగింది? డ్రగ్స్ మాఫియా నుంచి అముదకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఢిల్లీ ఏ విధంగా అడ్డుకుంటాడు? అన్న ఆసక్తికరమైన అంశాలను ‘ఖైదీ 2’ చిత్రంలో చూడాలి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఏఆర్ ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రూపొందిన ‘ఖైదీ’ సినిమా సీక్వెల్ ‘ఖైదీ 2’ కూడా రానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్తో సినిమా చేసే పనిలో ఉన్నారు లోకేష్. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘ఖైదీ 2’ సినిమా చిత్రీకరణను షురూ చేస్తారు కార్తీ, లోకేష్.⇒ మదర్ సెంటిమెంట్తో ‘బిచ్చగాడు’ సినిమా తీసి, బ్లాక్బస్టర్ అందుకున్నారు విజయ్ ఆంటోనీ. తాజాగా ఆయన ఫాదర్ సెంటిమెంట్తో చేస్తున్న సినిమా ‘నాన్న కుట్టి’. ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, చిత్ర లక్ష్మణన్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ము. మారన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోనీ ఈ సినిమాను నిర్మిస్తుండగా, రామాంజనేయులు జవ్వాజీ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. ఇలా తండ్రి భావోద్వేగాలతో కూడిన సినిమాలు మరికొన్ని ఉన్నాయి. అలాగే తల్లి ఎమోషన్తో కూడిన సినిమాలు కూడా ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
నాపై ఒత్తిడి ఉండటం మంచిదే!: జై కృష్ణ
‘‘నేను ఫ్యాన్స్కి ఇంకా ఏమీ ఇవ్వలేదు. అయినప్పటికీ వాళ్లు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేనీ సినిమా చేస్తున్నానని తెలియక ముందు నుంచే ఘట్టమనేని అభిమానులు నన్ను స పోర్ట్ చేశారు. అందుకే నటుడిగా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి... నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలి. మంచి కథలు, మంచి పాత్రలు చేయాలనే ఆలోచన నాకు మొదట్నుంచే ఉంది. ఈ విషయంలో నాపై ఒత్తిడి ఉండటం మంచిదే.అది నన్ను మంచి కథల వైపు తీసుకువెళ్తుంది’’ అని జై కృష్ణ అన్నారు. సూపర్స్టార్ కృష్ణ మనవడు, మహేశ్బాబు సోదరుడు రమేష్బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిం చారు. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో జై కృష్ణ చెప్పిన సంగతులు... ⇒ నా 16 ఏళ్ల వయసులో యాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత శిక్షణ తీసుకోవడం ప్రారంభించాను. రెండేళ్లు ముంబై, తర్వాత పాండిచ్చేరి, నెక్ట్స్ న్యూయార్క్ వెళ్లి యాక్టింగ్లో శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత ఇండియా వచ్చి కథలు వినడం ప్రారంభించాను. కొన్ని కథలు విన్న తర్వాత, నిర్మాత పి. కిరణ్గారి ద్వారా దర్శకుడు అజయ్ భూపతిగారిని కలిశాను. అజయ్గారు చెప్పి కథ నచ్చడంతో, ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా చేశాను. మంచి క్యారెక్టరైజేషన్, మంచి ఎమోషన్తో కూడిన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాను. నేను అనుకున్న అంశాలు ఈ కథలో కుదిరాయి. ఈ చిత్రం కోసం అజయ్గారు 3 నెలలు వర్క్షాప్ చేయించారు. లుక్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్, డైలాగ్స్... ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ అయ్యాం. ⇒ ఇందులో నేను శ్రీను అనే రోల్ చేశాను. శ్రీనుకి కాస్త అల్లరితనం ఉంటుంది. కానీ తనకేం కావాలో తనకి స్పష్టంగా తెలుసు. తను మంగను (రాషా తడానీ) ప్రేమిస్తాడు. ఆ తర్వాత కథ ఎలా సాగుతుంది? అన్నదే మిగిలిన సినిమా కథాంశం. ఇది రెగ్యులర్ లవ్స్టోరీ సినిమా కాదు. ఈ చిత్రంలో బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. ట్విస్ట్లు కొత్తగా ఉంటాయి. అజయ్గారు క్లారిటీ ఉన్న దర్శకుడు. అశ్వినీదత్గారితో నాకు మంచి అనుబంధం ఉంది. వైజయంతి మూవీస్లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో లాంచ్ కావడం హ్యాపీగా ఉంది. బాబాయ్ (మహేశ్బాబు) తొలి సినిమా కూడా ఈ బ్యానర్లోనే రూపొందింది.⇒ నాకు ఫ్యామిలీ స పోర్ట్ ఉంది. నా ప్రతి అడుగులో బంగారు తాతయ్య (కృష్ణ సోదరుడు–నిర్మాత ఆదిశేషగిరి రావు) ్ర పోత్సాహం ఉంది. నేను సినిమాల్లోకి రావాలని, మంచి నటుడిగా ఎదగాలని మా తాతయ్య (కృష్ణ)గారు కోరుకున్నారు. మా నాన్నగారు ఉన్నప్పుడు సినిమాల గురించి చర్చించుకునేవాళ్లం. నేను యాక్టర్ కావాలనుకున్న తర్వాత బాబాయ్ సలహాలు, సూచనలు ఇచ్చారు. దర్శకుడు విజన్కు తగ్గట్లు యాక్ట్ చేయాలని చె΄్పారు. అలాగే ‘శ్రీనివాస మంగాపురం’ చూసి, హ్యాపీ ఫీలయ్యారు. ఈ సినిమా ఆయనకు నచ్చింది. యాక్షన్ సీక్వెన్స్లు, సాంగ్స్ చాలా నచ్చాయని చె΄్పారు. స్క్రీన్పై డిఫరెంట్గా కనిపిస్తున్నావని, క్యారెక్టర్లోకి పూర్తిగా వెళ్లి పోయావని చె΄్పారు. ⇒ నా చిన్నతనంలో నేను సినిమా వాతావరణానికి దూరంగా ఉండి చదువుకునేవాడిని. మొదటిసారి ‘నిజం’ సినిమా షూటింగ్కు వెళ్లాను. ఇందులో చైల్డ్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ‘అర్జున్’ షూటింగ్కు వెళ్లాను. ఈ చిత్రానికి మా నాన్నగారు నిర్మాత. ‘గుంటూరు కారం’ షూటింగ్కు వెళ్లాను. ఒక యాక్టర్గా నాకు విభిన్న జానర్స్లో సినిమాలు చేయాలని ఉంది. కానీ యాక్షన్ సినిమాలు చేయడం ఎక్కువ ఇష్టం. నేను యాక్టర్ని కావాలనుకున్నప్పుడే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నాను. -
కొత్త కాంబినేషన్?
ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు రష్మిక మందన్నా. మరోవైపు ఇటు సినిమాలు అటు ఓటీటీ ప్రాజెక్ట్స్తో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకులు రాజ్ నిడిమోరు (రాజ్), కృష్ణ దాసరి (డీకే). వీరిద్దరూ తాజాగా రష్మిక కోసం ఓ పవర్ఫుల్ కథని సిద్ధం చేస్తున్నారట. కాగా ఇటీవలే రాజ్ నిడిమోరు అందించిన కథతో సమంత లీడ్ రోల్లో రూపొందిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు రూ. 100 కోట్లు వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.అందం, అభినయంతో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ అభిమానులను సం పాదించుకున్న రష్మికతో ఇప్పుడు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట రాజ్ అండ్ డీకే. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కథా చర్చలు ఆరంభంలో ఉన్నాయని సమాచారం. రష్మిక ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత ఆమెను కలిసి వినిపించనున్నారట రాజ్–డీకే. మరి... వార్తల్లో ఉన్నట్లు ఈ కొత్త కాంబినేషన్ కుదురుతుందా? అనేది వేచి చూడాల్సిందే. -
లెనిన్ హిట్ ఎఫెక్ట్.. 30 లక్షల నుంచి 2 కోట్ల దాకా
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా అడుగుపెట్టిన భాగ్యశ్రీ, మొదటి సినిమా ఫ్లాప్ అయినా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా భాగ్యశ్రీ, అఖిల్తో కలిసి నటించిన లెనిన్ సినిమా ఆమె కెరీర్కు మలుపు తిప్పింది. మొదటి సినిమాలో ఆమెకు ఇచ్చిన పారితోషికం కేవలం రూ.30 లక్షలు మాత్రమే. కానీ లెనిన్ చిత్రానికి ఆమె రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెరిగి కోటిన్నర రూపాయలకు చేరింది. ఇక త్వరలో సెట్స్పైకి రాబోతున్న మరో ప్రాజెక్ట్కి ఆమెకు రూ.2 కోట్ల పారితోషికం ఖరారైనట్టు సమాచారం. ఈ మధ్య లెనిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా భాగ్యశ్రీ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా చెప్పుకొచ్చింది. భాగ్యశ్రీ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. తనకు డబ్బు విలువ బాగా తెలుసని, చిన్నప్పుడు తన తండ్రి ఉద్యోగం కోసం ఎంతగా ప్రయత్నించాడో ఇప్పటికీ గుర్తుందని తెలిపింది. అందం, నటన రెండూ కలిసిన భాగ్యశ్రీ, కాంత, లెనిన్ వంటి సినిమాల్లో నటించి తన టాలెంట్ను నిరూపించుకుంది. గ్లామర్ రోల్స్కి కూడా ఎలాంటి కండిషన్లు పెట్టకుండా నటించడం ఆమె ప్రత్యేకత. ఇక మరో హిట్ పడితే, ఆమె పారితోషికం మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. -
'ఆలోచన' టీజర్ రిలీజ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం 'ఆలోచన'. సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు టీజర్ని ప్రముఖ రచయిత విజయేoద్ర ప్రసాద్ విడుదల చేశారు.'ఆలోచన' టీజర్ బాగుంది. వాస్తవ సంఘటనలని తీసుకొని చేసిన ఈ సినిమాని అద్భుతమైన నటుల కాంబినేషన్తో స్నేహం పై ఒక మంచి కాన్సెప్ట్తో చేశారు. ఈ సినిమా విజయం సాధించి, చిత్ర యూనిట్కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని విజయేంద్రప్రసాద్ అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
చీరలో ఓరచూపుతో ఆషిక.. పద్ధతిగా అనన్య
చుడీదార్లో అనన్య నాగళ్ల సింపుల్ లుక్చీరలో అందాల బొమ్మలా ఆషికా రంగనాథ్గ్లామర్ చూపించేస్తున్న ప్రణీత సుభాష్ఫ్యాషన్ కోసం రెడీ అయిన మంచు లక్ష్మీనిగనిగా మెరిసిపోతున్న శాన్వి మేఘనకొడైకెనాల్ ట్రిప్ వేసిన మానస చౌదరి View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Sapthaami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) -
'త్రికాల'ని విజువల్ వండర్గా తీర్చిదిద్దిన పవన్ చెన్నా
కెమెరా భాషని మాయాజాలంగా మార్చగల సినిమాటోగ్రాఫర్ పవన్ చెన్నా. మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ సినిమా 'త్రికాల' ద్వారా ఆయన తన ప్రతిభను మరో స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి ఈయన గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో, సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. మణి తెల్లగూటి దర్శకత్వంలో, రాధిక–శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు.సమకాలీన తెలుగు సినిమాలో సరికొత్త విజువల్ ట్రెండ్స్ సెట్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్లలో పవన్ చెన్నా ఒకరు. కేవలం నటీనటులను చూపించడమే కాకుండా, ప్రతి ఫ్రేమ్లోనూ లోతైన భావోద్వేగాలను పలికించడం ఆయన శైలి. మైథాలజీని ఒక మహా కావ్యంలా స్క్రీన్ పై ఆవిష్కరించారు. లార్జర్ ద్యాన్ లైఫ్ కంపోజిషన్స్, పక్కా ఫ్రేమింగ్, ఇన్ డెప్త్ విజువల్స్ ఆడియన్స్ని కట్టిపడేశాయి. లైటింగ్, షాడోలతో స్క్రీన్ పై అద్భుతమైన డ్రామా క్రియేట్ చేశారు. హై కాంట్రాస్ట్ డ్రామా లైటింగ్ సెటప్స్ సినిమాలోని సూపర్ నేచురల్ టెన్షన్ను, హాంటింగ్ అట్మాస్పియర్ను పీక్స్కి తీసుకెళ్లాయి.ప్రతి ఫ్రేమ్ ఒక కథ చెప్పాలి... ప్రతి విజువల్ ప్రేక్షకుల్లో ఒక భావోద్వేగాన్ని కలిగించాలి అనే నమ్మకంతోనే నేను సినిమాటోగ్రఫీ చేస్తాను. నా దృష్టిలో కెమెరా అనేది కేవలం చిత్రాలను బంధించే సాధనం కాదు దర్శకుడు ఊహించిన ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే భాష. 'త్రికాల' వంటి మైథలాజికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్లో సనాతన ధర్మం, దైవత్వం, మిస్టరీని విజువల్గా ఆవిష్కరించడం నాకు ఒక పెద్ద సవాల్గా అనిపించింది. నా పనిని ప్రశంసించడం ఒక సినిమాటోగ్రాఫర్గా నాకు ఎంతో సంతోషాన్ని, మరింత బాధ్యతను ఇచ్చిందని పవన్ చెన్నా చెప్పుకొచ్చారు. -
అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి
పవన్ మహావీర్ని హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి'. పవన్ లండన్లో డాక్టర్ కోర్స్ చేస్తూ హీరోగా నటించాడు. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు, దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్.ఆదిత్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ట్రైలర్ బాగుందని, పవన్ మహావీర్కి ఇది పరిచయ చిత్రమంటే నమ్మడం కష్టమని అతిధులు పేర్కొన్నారు. నిర్మాతగా శైలజ రెడ్డి, హీరోగా పవన్ మహావీర్కి ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. -
హీరో సూర్య పాడిన పెళ్లి పాట రిలీజ్
హీరో సూర్యకి తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఓ సినిమా చేశాడు. అదే 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వచ్చే నెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కొన్నాళ్ల క్రితం 'బటర్ ఫ్లై' పాట విడుదల చేయగా.. ఇప్పుడు సూర్య పాడిన పాటని వదిలారు.(ఇదీ చదవండి: 'విశ్వనాథ్ అండ్ సన్స్' తెలుగు సినిమా కాదు)'వెడ్డింగ్ సాంగ్' అంటూ సాగే ఈ పాట కలర్ఫుల్గా ఉంది. ఇందులో సూర్య 40 ఏళ్ల వ్యక్తిగా, మమిత బైజు 20 ఏళ్ల అమ్మాయిగా నటించారు. వీళ్లిద్దరూ ప్రేమలో పడితే ఏమైంది అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీశారు. రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: 45 ఏళ్లకు తల్లయిన టాలీవుడ్ హీరోయిన్) -
నవ్వాలంటే నాన్న.. ఏడవాలంటే అమ్మ.. 'సిసింద్రీ' సంగతులు
అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమాతో ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. మూవీ హడావుడి అంతా ముగిసిపోవడంతో ఇప్పుడో ఓ యూట్యూబర్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో తన చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన బోలెడు విషయాల్ని పంచుకున్నాడు. మరీ ముఖ్యంగా నెలల వయసున్నప్పుడు తనతో తీసిన 'సిసింద్రీ' గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని సంగతులు షేర్ చేశాడు.(ఇదీ చదవండి: షాకింగ్.. అఖిల్ అక్కినేని ఇండియన్ కాదా?)'నాకే గనక కొడుకు పుడితే సిసింద్రీ-2 చేస్తాను. ఈ విషయాన్ని నా భార్య జైనాబ్కి కూడా చెప్పాను. నాకు కొడుకు పుడతాడా? కూతురు పుడతుందా? అనేది దేవుడి చేతుల్లో ఉంది. ఒకవేళ కొడుకు పుడితే మాత్రం తనని పెట్టి సిసింద్రీ 2' తీయాలనేది నా ఆలోచన. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో నేను నాలుగు గంటల మాత్రమే మెలకువగా ఉండేవాడిని. ఆ టైంలో నా మూడ్ బాగుంటేనే షూటింగ్ చేసేవారు. సినిమాలో నేను నవ్వాల్సిన సందర్భంలో కెమెరా వెనక నాన్న నిలబడి సైగలు చేసేవారు. వాటిని చూసి నేను నవ్వేవాడిని. ఏడవాల్సిన సీన్స్ కోసం అమ్మ కారు ఎక్కి వెళ్లిపోయేది. అది చూసి నేను ఏడిస్తే ఆ సీన్స్ షూటింగ్ చేసేవారు' అని అఖిల్ పాత విషయాల్ని చెప్పుకొచ్చాడు.'సిసింద్రీ' సినిమాని హాలీవుడ్ సినిమా.. 'బేబీస్ డే ఔట్' ఆధారంగా తెరకెక్కించారు. శివనాగేశ్వరరావు దర్శకుడు కాగా నాగార్జున నిర్మించడంతోపాటు ఇందులో కీలక పాత్ర చేశాడు. ఈ మూవీ కమర్షియల్గా హిట్ అయింది. అఖిల్కి ఏకంగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. ఇకపోతే ఈ చిత్రంతో వచ్చిన లాభాలతోనే అమల.. తనకు ఎంతో ఇష్టమైన జంతు సంరక్షణ సంస్థ 'బ్లూ క్రాస్'ను ప్రారంభించారని అఖిల్ చెప్పాడు.'సిసింద్రీ' విషయానికొస్తే.. ఓ డబ్బింటి కుటుంబానికి చెందిన చిన్న పిల్లాడిని.. డబ్బుల కోసం తన బాబాయి కిడ్నాప్ చేయిస్తాడు. అందులో భాగమైన ముగ్గురు దొంగల్ని ఆ చిన్నపిల్లాడు ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు? తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు ఎలా చేరుకున్నాడు అనేది స్టోరీ. పూర్తిగా ఎంటర్టైనింగ్గా ఉండే ఈ సినిమాలో ఎంతో ముద్దుగా కనిపిస్తూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన అఖిల్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు.(ఇదీ చదవండి: నన్ను చూసి నాకే అసహ్యమేసింది: అఖిల్) -
నన్ను చూసి నాకే అసహ్యమేసింది: అఖిల్
అక్కినేని అఖిల్.. 'లెనిన్' సినిమాతో కెరీర్లో తొలి సక్సెస్ అందుకున్నాడు. ఈ నెల 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీని చూసిన చాలామంది బాగుందని అన్నారు. అందుకు తగ్గట్లే పర్లేదనిపించే కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చిన పదకొండేళ్ల తర్వాత అఖిల్ అందుకున్న తొలి హిట్ ఇది. అయితే ఇతడి గత చిత్రం 'ఏజెంట్' ఎంత దారుణమైన డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అఖిల్.. 'ఏజెంట్' ఫ్లాప్ కావడంపై స్పందించాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది)'ఏజెంట్ డిజాస్టర్ అయిన తర్వాత మళ్లీ ఆ సినిమా చూశాను. స్క్రీన్పై నన్ను నేను చూసుకుంటే చాలా అసహ్యమేసింది. దాదాపు ప్రతి సీన్లోనూ అతిగా ఓవరాక్టింగ్ చేశానని నాకే స్పష్టంగా అర్థమైంది. అలానే రిలీజ్కి ముందు ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడే ఏదో తేడా కొట్టిందని గ్రహించాను. అదే విషయాన్ని నా ఫ్రెండ్స్, క్లోజ్ సర్కిల్లోని కొందరికి చెప్పాను. అయితే నిర్మాత ఈ ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుబడి పెట్టారు. హీరోగా ఆ మొత్తాన్ని వీలైనంత వరకు రికవరీ చేయాలి. కాబట్టి మూవీకి సపోర్ట్ చేయాలని భావించి ప్రమోట్ చేశాను' అని అఖిల్ చెప్పుకొచ్చాడు.అయితే 'ఏజెంట్' సినిమాకు బౌండ్ స్క్రిప్ట్ లేకుండా దర్శకుడు సినిమా తీశారనే విమర్శలపై స్పందించిన అఖిల్.. ఇకపై తాను ఏ మూవీ కూడా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా చేయనని కుండబద్దలు కొట్టేశాడు. 'ఏజెంట్' విషయానికొస్తే.. 2023లో థియేటర్లలో రిలీజైంది. సురేందర్ రెడ్డి తీసిన ఈ చిత్రం కోసం అఖిల్ చాలానే కష్టపడ్డారు. కండలు పెంచాడు. డైలాగ్ మాడ్యులేషన్ కూడా మార్చాడు. కానీ థియేటర్లలో తొలి షో తొలి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో డైలమాలో పడిపోయిన అఖిల్.. దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకుని 'లెనిన్'తో వచ్చాడు. సక్సెస్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: షాకింగ్.. అఖిల్ అక్కినేని ఇండియన్ కాదా?) -
అమ్మ ఉంటే చాలా సంతోషించేది.. హీరోయిన్ ఎమోషనల్
ఈ వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'చెన్నై లవ్ స్టోరీ'కి పాజిటివ్ టాక్ వస్తోంది. సెకండాఫ్ మీద కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్గా పర్లేదని అంటున్నారు. మరోవైపు ఇందులో హీరోయిన్గా చేసిన తెలుగమ్మాయి శ్రీ గౌరిప్రియకి ప్రశంసలు దక్కుతున్నాయి. అన్ని రకాల ఎమోషన్స్ అద్భుతంగా పండిందని అంతా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈమె, సక్సెస్ మీట్లో అమ్మని తలుచుకుని ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: రిలీజ్ రోజే కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?)'ఇంత మంచి పేరు, విజయం వస్తున్నప్పుడు మా అమ్మ ఉండి ఉంటే చాలా సంతోషించేవారు. నన్ను ఇప్పుడు ఆమె చూసి ఉంటే బాగుండేదని అందరూ అంటున్నారు. కానీ మా అమ్మ ఎప్పుడూ పైనుంచి నన్ను చూస్తూనే ఉంటుంది' అని గౌరిప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.కిరణ్ అబ్బవరం, గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో రవి నంబూరి దర్శకుడిగా పరిచయమయ్యారు. 'బేబి' తీసిన దర్శకుడు సాయి రాజేశ్.. ఈ చిత్రానికి కథ అందించారు. ఎస్కేఎన్ నిర్మించారు. ఇకపోతే ప్రీమియర్లకే రూ.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. తొలిరోజు మరో రూ.6 కోట్ల వసూళ్లు.. అంటే ఓవరాల్గా ఇప్పటివరకు రూ.9 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ.. కిరణ్, శ్రీ గౌరి చేయాల్సింది కాదు..!)స్టేజ్పై హీరోయిన్ గౌరీ ప్రియ ఎమోషనల్‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర విజయోత్సవ సమావేశంలో హీరోయిన్ గౌరీ ప్రియ భావోద్వేగానికి లోనయ్యారు. “ఇంత మంచి పేరు, విజయం వస్తున్నప్పుడు మా అమ్మ ఉండి ఉంటే చాలా సంతోషించేవారు.. నన్ను చూసి ఉంటే బాగుండేదని అందరూ అంటున్నారు. కానీ మా అమ్మ ఎప్పుడూ పైనుంచి… pic.twitter.com/8x0pieJSmx— ChotaNews App (@ChotaNewsApp) July 25, 2026 -
షాకింగ్.. అఖిల్ అక్కినేని ఇండియన్ కాదా?
‘లెనిన్’తో హిట్ కొట్టాడు అఖిల్ అక్కినేని. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్..దాదాపు పదేళ్ల తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ జోష్లో వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ..తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్లో తన పౌరసత్వం గురించి ఆసక్తిక విషయాలు పంచుకున్నాడు.ఇండియన్ కాదా?అక్కినేని అఖిల్ 1994 ఏప్రిల్ 8న అమెరికాలోని కాలిఫోర్నియా లోని సాన్ జోస్ నగరంలో జన్మించారు. దీంతో అక్కడి చట్టాల ప్రకారం అఖిల్కు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. ఆయనకు అమెరికా పాస్పోర్ట్ కూడా లభించింది. చిన్ననాటి విద్యను హైదరాబాద్లోని చైతన్య విద్యాలయంలో ప్రారంభించిన అఖిల్, కొంతకాలం ఆస్ట్రేలియాలో చదువుకున్నారు. తిరిగి హైదరాబాద్లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యను పూర్తి చేశారు. అనంతరం నటనపై ఆసక్తితో న్యూయార్క్లోని లీ స్ట్రాస్బర్గ్ థియేటర్ & ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు చేశారు.కొద్ది రోజుల్లో భారతీయుడిని అవుతానుతాజాగా ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడిన అఖిల్.. ‘ప్రస్తుతం నేను అమెరికన్ పౌరుడినే. నా వద్ద అమెరికా పాస్పోర్ట్ కూడా ఉంది. అయితే త్వరనే ఆ పౌరసత్వాన్ని వదులుకుంటాను. ఇంకొన్ని నెలల్లో నేను భారతీయుడిని అయిపోతాను. ఇండియన్ మేరా భారత్ మహాన్’ అని అఖిల్ చెప్పుకొచ్చాడు.I will be Indian citizen soon.. మేర భారత్ మహాన్ - అఖిల్ pic.twitter.com/SWyjQQwIvr— Mr. Akkineni (Sai) (@AkkineniFF) July 24, 2026 -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘చెన్నై లవ్స్టోరీ’
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్స్టోరీ’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సాయి రాజేష్, ఎస్ కే ఎన్ నిర్మించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 24) విడుదలైన ఈ చిత్రానికి ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. సెకండాఫ్ని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదని పలు న్యూస్ వెబ్సైట్లు తమ రివ్యూలో పేర్కొన్నాయి. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా దూసుకెళ్తోంది. కేవలం కొన్ని చోట్ల మాత్రమే వేసిన ప్రీమియర్ షోకి రూ. 3.13 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక తొలి రోజు మొత్తంగా రూ. 12.3 కోట్లకు పైగా కలెక్షన్స్ని సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.. బరిలో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
యముడికి డ్యాన్స్ స్టెప్పులు నేర్పిన కైకాల!
తెలుగు సినీ పరిశ్రమకు ఆయన నవరస నటనా సార్వభౌముడు. వెండితెరపై వందల పాత్రల్లో జీవించి కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన మహానటుడు. కానీ కృష్ణా జిల్లా కౌతవరం ప్రజలకు మాత్రం ఆయన ఇప్పటికీ ‘మన కైకాల’. శనివారం ఆయన జయంతి సందర్భంగా గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్న ఆ ముద్దుబిడ్డ జ్ఞాపకాలివి.కృష్ణాజిల్లా: తెలుగు సినిమా చరిత్రలో కైకాల సత్యనారాయణ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన పోషించిన పాత్రలు కాదు.. ఆ పాత్రలకు ఆయన ఇచ్చిన ప్రాణం. యముడైనా, దుర్యోధనుడైనా, కంసుడైనా, రాజుగానైనా, రైతుగానైనా.. తెరపై కనిపించిన ప్రతిసారి ఆ పాత్రే నిజమైపోయేది. అలాంటి మహానటుడి మూలాలు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం అనే చిన్న గ్రామంలోనే ఉన్నాయి. కైకాల జయంతి సందర్భంగా ఆయన సినీ విజయాల కంటే, ఆయనను తీర్చిదిద్దిన కౌతవరం జ్ఞాపకాలు నేటికీ గ్రామంలో సజీవంగా నిలిచాయి. కాలినడకన చదువుకున్న బాలుడు.. కోట్లాది అభిమానుల నటుడయ్యాడు ప్రాథమిక విద్య కౌతవరంలో పూర్తిచేసిన కైకాల, హైస్కూల్ చదువుకోసం ప్రతిరోజూ కాలినడకన గుడ్లవల్లేరు వెళ్లేవారు. అదే పట్టుదల ఆయనను తర్వాత మద్రాసు వరకు తీసుకెళ్లింది. అక్కడ ప్రారంభమైన సినీ ప్రయాణం దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రతినాయకుడికి కొత్త నిర్వచనం విఠలాచార్య పరిచయం చేసిన ప్రతినాయక పాత్రలు కైకాలకు కొత్త గుర్తింపునిచ్చాయి. ఆయన విలన్గానే కాదు.. హాస్యం, కుటుంబ కథలు, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మక చిత్రాలు.. ఏ పాత్రలోనైనా సహజత్వాన్ని చూపించి ‘నవరస నటనా సార్వభౌముడు’ బిరుదును సార్థకం చేశారు. ఎన్టీఆర్కు డూప్గా.. తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఎన్టీఆర్ ను పోలిన రూపురేఖల కారణంగా పలు చిత్రాల్లో ఆయనకు డూప్గా నటించే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మెట్టుగా చేసుకుని తర్వాత తనదైన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. సినిమా దాటి.. సొంత ఊరిపై మమకారం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కౌతవరాన్ని మరచిపోలేదు. మచిలీపట్నం ఎంపీగా గ్రామంలో ప్రసూతి ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేశారు. కొత్త ఆస్పత్రి నిర్మాణం, కౌతవరం–చేవెండ్ర రహదారి అభివృద్ధి వంటి పనుల్లో ప్రత్యేక శ్రద్ధ చూపి గ్రామస్తుల మన్ననలు పొందారు. ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా లిచారు. ప్రతిఒక్కరూ ఆయన్ను గుర్తు చేసుకుంటారు.మర్రిచెట్టు నీడలో.. 1935 జూలై 25న కైకాల లక్ష్మీనారాయణ, సీతారావమ్మ దంపతులకు జన్మించిన సత్యనారాయణ చిన్ననాటి రోజులు సాధారణ గ్రామీణ బాలుడివే. కౌతవరం చెరువు గట్టున ఉన్న మర్రిచెట్టు కింద గంటల తరబడి స్నేహితులతో కబుర్లు చెప్పడం, చెరువులో దొరికే చేపలు ఇష్టంగా తినడం, మంచి బెల్లం–పప్పుచెక్క కోసం మిత్రులతో తిరగడం... ఇవన్నీ ఆయన బాల్యాన్ని గుర్తుచేసే మధురస్మృతులని గ్రామ పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు.గ్రామానికి గర్వకారణం.. చిరస్మరణీయం కైకాల మరణానంతరం గ్రామస్తులు స్వచ్ఛందంగా ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి జయంతి, వర్ధంతి రోజున ఆ విగ్రహం వద్ద నివాళులర్పించడం కౌతవరం ప్రజలకు ఒక ఆనవాయితీగా మారింది. ‘మా ఊరిలో పుట్టి తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన మహానటుడు’ అని గ్రామస్తులు ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు. -
మిల్కీ బ్యూటీ ఎయిర్పోర్ట్ లుక్
మానవ జీవితంలో ప్రచారం ఒక భాగమైపోయిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఉత్పత్తులు విక్రయించాలన్నా, కొనాలన్నా ప్రచారం ముఖ్య భూమిక పోషిస్తోంది. సినిమా రంగంలోనూ ఇది అత్యంత ప్రాధాన్యతగా మారింది. ముఖ్యంగా నటీనటులు తమదైన స్టైల్లో పబ్లిసిటీ చేసుకోవడంలో ముందుంటున్నారు. అలా ప్రచారానికి కాదేది అనర్హం అన్న విధంగా ప్రవర్తిస్తూ పాపులారిటీ పొందుతున్నారు. అలా తరచూ వార్తల్లో నిలిచే నటి తమన్నా. అన్ని రకాల పాత్రలను పోషించే సత్తా ఉన్న ఈమె ఐటెం సాంగ్ గర్ల్ గానే ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇందుకు నటి తమన్నా శారీరక సంపద ఒక కారణం కావచ్చు. అందుకే ఈమెను అభిమానులు మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. బాలీవుడ్లో నటిగా రంగ ప్రవేశం చేసినా, ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో అత్యధికంగా చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. Tammy snapped arriving at airport 🔥❤️🔥✨😍💋#TamannaahBhatia #Tamannaah #bollywood #kbke pic.twitter.com/riKqkciEbJ— KBKE Update 👁️ (@kahanibollyki) March 17, 2026 ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీ ఆ మధ్య నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడి, అందులో విఫలం కావడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కాగా హీరోయిన్లు సాధారణంగా పార్టీల్లో, ఇతర సినిమా కార్యక్రమాల్లో గ్లామరస్ దుస్తులు ధరించి పాల్గొంటుంటారు. నటి తమన్నా మాత్రం పబ్లిక్ ప్రదేశాల్లోనూ కుర్రకారును కవి్వంచే విధంగా డ్రస్ వేసుకుని తిరుగుతుండడం విశేషం. తాజాగా ఈమె టైట్ దుస్తులు ధరించి ఎయిర్పోర్టులో వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది ఎక్కడ జరిగిందో కానీ నెటిజన్లు మాత్రం ఇదో రకం పబ్లిసిటీ స్టంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Traditional Beauty @tamannaahspeaks spotted at Mumbai Airport heading to #UPT20League for Stunning performance post celebrated Krishna Janmashtami at home ♥️#Tamannaah #TamannaahBhatia#TamannaahBhatia𓃵#LadyMegaStarTamannaah#TamannahBhatia #Tamannah#Tamanna#IndianActress pic.twitter.com/VWzFtFULUe— 𝗞𝗔𝗥𝗧𝗛𝗜𝗖𝗞 ♡ (@Suriya_Speaks) August 17, 2025 -
వెండితెరపై మరోసారి ఖడ్గం
సూపర్ హిట్ సినిమా ‘ఖడ్గం’ మళ్లీ విడుదల కానుంది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్రాజ్, శివాజీ రాజా, సోనాలీ బెంద్రే, సంగీత ముఖ్య తారలుగా నటించిన సినిమా ‘ఖడ్గం’. కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధుమురళి నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 29న విడుదలై, భారీ విజయం సాధించింది. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న రీ రిలీజ్ కానుంది.దేవరపల్లి రేవంత్ సమర్పణలో విష్ణు మొలకల నక్షత్ర నిర్మాతగా, కృష్ణ వడిగేపల్లి, కాకర్లమూడి రామకృష్ణ సహ–నిర్మాతలుగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘దేశభక్తి, భావోద్వేగం, ప్రేమ, వినోదం... ఇలా అన్ని అంశాల మేళవింపుతో ‘ఖడ్గం’ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు’’ అని యూనిట్ పేర్కొంది. -
పురాణ కథకు సై?
‘నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ, భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి చిత్రాలను తెరకెక్కించి, దర్శకుడుగా తనదైన మార్క్తో ప్రతిభ చూపారు కిషోర్ తిరుమల. తాజాగా ఆయన ఓ ఉమెన్ సెంట్రిక్ స్టోరీని రెడీ చేస్తున్నారని, పురాణాలకు సంబంధించిన అంశాలు కూడా ఈ కథలో ఉంటాయని సమాచారం. ఈ సినిమాలోని లీడ్ రోల్కు సాయి పల్లవిని అనుకుంటున్నారని, ఆమెకు ఇటీవలే కిషోర్ కథ కూడా వినిపించారని తెలిసింది.స్టోరీ లైన్ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు సాయి పల్లవి కూడా ప్రాథమికంగా అంగీకారం తెలిపారట. ఫుల్ స్క్రిప్ట్ పూర్తయ్యాక ఫైనల్ నరేషన్ విని, ఈ చిత్రం చేయడంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారట సాయి పల్లవి. మరోవైపు హిందీ ‘రామాయణ’లో సీతగా నటించారామె. తమిళంలో ధనుష్ హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. -
మంచు కొండల్లో...
నిత్యం షూటింగ్స్తో బిజీ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు ఏమాత్రం విరామం దొరికినా కుటుంబంతో వెకేషన్ని ప్లాన్ చేస్తుంటారు. ఈ కోవలోనే ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాకా’. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.‘పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్’ వంటి బ్లాక్బస్టర్ మూవీస్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా, ‘జవాన్’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ కోసం ముంబైలోనే ఉంటూ షూటింగ్లో పాల్గొంటున్న అల్లు అర్జున్ ఈ బిజీ షెడ్యూల్ నుంచి చిన్న విరామం తీసుకున్నారు. అనంతరం తన భార్య అల్లు స్నేహ, కుమారుడు అయాన్, కుమార్తె అర్హాతో కలిసి ఆస్ట్రియా వెకేషన్కి వెళ్లారు అల్లు అర్జున్.నార్డ్కెట్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి సుమారు 1,905 మీటర్ల ఎత్తులో ఉన్న సీగ్రూబ్ టెర్రెస్ హిల్ స్టేషన్లో ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నారు. ఈ వెకేషన్కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను స్నేహ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేయగా, వైరల్గా అయ్యాయి. ఆస్ట్రియా వెకేషన్ ముగించుకుని త్వరలో హైదరాబాద్ రానున్న అల్లు అర్జున్ వెంటనే ముంబైలో ‘రాకా’ కొత్త షెడ్యూల్తో బిజీ అవుతారు. -
నారా రోహిత్ బర్త్ డే.. కొత్త సినిమా అప్డేట్ ఇదే
టాలీవుడ్ హీరో నారా రోహిత్ మరో సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇవాళ నారా రోహిత్ బర్త్ డే కావడంతో టైటిల్తో పాటు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈసారి నారా రోహిత్ కాస్తా డిఫరెంట్ కంటెంట్తో పలకరించబోతున్నట్లు తెలిసిపోతోంది. ఈ సినిమాకు కపాలి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పోస్టర్ చూస్తుంటే సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. పోలీసు నేపథ్యంతో సాగే ఈ కథలో మైండ్-బెండింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు అర్థమవుతోంది. ఇవాళ రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.ఈ మూవీకి రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక, ప్రణీత పట్నాయక్, లావణ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంతెన, భాను కిరణ్ ప్రతాప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. A journey into the UNKOWN begins here…My next #Kapaali. Written & Directed by @GanniRaam @VijayKrishnaLin @Kalyan_manthina @bhanu_pratapa @SAMWoffl pic.twitter.com/0KiSyP6WB1— Rohith Nara (@IamRohithNara) July 24, 2026 -
హే చికీతా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్ : హే చికీతానటీనటులు: అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్, అజయ్ తదితరులునిర్మాణ సంస్థలు: అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్నిర్మాతలు: ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, గరుడవేగ అంజి దర్శకత్వం: ధనరాజ్ లెక్కలసంగీతం: చరణ్ అర్జున్ సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజిఎడిటర్: మధు విడుదల తేది: జులై 24, 2026ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి నిర్మాతగా మారిన బద్రి సినిమాలోని ఓ పాటలోని పదం హే చికీతా తీసుకొని టైటిల్గా పెట్టడంతో ఈ చిన్న సినిమాపై కాస్తా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ హే చికీతా సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..శివ(అభినవ్ మణికంఠ)తన ఫ్రెండ్స్ ఢిల్లీ( జబర్దస్త్ అజయ్), రాజు, కృష్ణ, సూరిలతో కలిసి అల్లరిచిల్లరిగా ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. శివ పక్క ఊరిలో ఉండే తన మరదలు చిట్టి(దివిజ ప్రభాకర్) చిన్నప్పట్నుంచి ప్రేమించుకుంటారు. కానీ శివ జాబ్ తెచ్చుకుంటేనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు చిట్టి తండ్రి. ఇంకో మరదలు పొట్టి(తన్మయ్ ఖుషి) ఏమో శివని ప్రేమిస్తుంది. ఓ సినిమా రిలీజ్ రోజు శివ, తన మరదలు, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లగా అక్కడ వేరే ఊరికి చెందిన కొంతమందితో గొడవ పెట్టుకుంటాడు శివ. దాంతో వాళ్ళు శివ మీద అటాక్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. తన ఊళ్ళో గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం ఊళ్ళో పెద్ద మనుషులతో గొడవ పడి ఇంకో పందిరి పెట్టుకొని ఘనంగా చేస్తారు శివ, అతని ఫ్రెండ్స్. అయితే నిమజ్జనం రోజు థియేటర్లో శివతో గొడవపడిన వాళ్ళు శివపై అటాక్ చేయడంతో అందులో ఓ వ్యక్తిని శివ పొడుస్తాడు. ఆ తర్వాత ఏమైంది? శివ జాబ్ తెచ్చుకుంటాడా? శివ పెళ్లి ఎవరితో జరుగుతుంది.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఓ నలుగురు ఫ్రెండ్స్, హీరో లవ్ స్టోరీ, ఊళ్ళోనే ఉండి బతకాలి అనే కథాంశాలతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. ఈ హే చికీతా సినిమా కూడా అదే కోవలోకి చెందింది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, అతని ఫ్రెండ్స్ ఊళ్ళో చేసే అల్లరి చిల్లరి పనులు, కామెడీ, శివ - చిట్టి లవ్ స్టోరీ, హీరో గొడవలు, హీరో ఫ్రెండ్స్ పాత్రల పరిచయాలతో సోసో గా సాగుతుంది. ఇంటర్వెల్ కి హీరో ఓ వ్యక్తిని పొడవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఎక్కువగా హీరో - హీరోయిన్ లవ్ స్టోరీ మీదే నడుస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సాగుతుంది. క్లైమాక్స్ హీరో - హీరోయిన్ కలవడం, వ్యవసాయం, రైతు గురించి కొన్ని మంచి మాటలు చెప్పడంతో ముగుస్తుంది.అక్కడక్కడా కామెడీ సీన్స్ కొన్ని వర్కౌట్ అయ్యాయి. బావ మరదళ్ల లవ్ స్టోరీ బాగుంటుంది. రైతుల ఎమోషన్స్ క్లైమాక్స్ తో, కొన్ని సీన్స్ లో డైలాగ్స్ తో చెప్పించారు కానీ ఆ ఎమోషన్ ఎక్కడా పండలేదు. హీరో వ్యవసాయం చేస్తున్నాడు అంటారు కానీ అసలు ఎక్కడా హీరో వ్యవసాయం చేసినట్టు చూపించరు. హీరో పాత్ర మాత్రం క్లైమాక్స్ వరకు కూడా ఇంత జరుగుతున్నా ఇంకా మారడా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో మాత్రం కొన్ని అక్కర్లేని కామెడీ సీన్స్ తో సాగదీశారు అనిపిస్తుంది. ఇక ఈ కథ అంతా 2000 సంవతసరంలో జరుగుతుంది. దానికి తగట్టు చూపించడానికి రైటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది.ఎవరెలా చేశారంటే..అభినవ్ మణికంఠ హీరో పాత్రలో బాగానే మెప్పించాడు. దివిజ ప్రభాకర్ క్యూట్ గా కనిపిస్తూ అల్లరి చేసే అమ్మాయిలా మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా పర్వాలేదనిపించింది. తన్మయ్ ఖుషి మరో మరదలు పాత్రలో మెప్పిస్తుంది. జబర్దస్త్ అజయ్ అక్కడక్కడా నవ్విస్తాడు. దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్, ఫ్రెండ్స్ పాత్రల్లో నటించిన నటులు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఎడిటింగ్లో కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
పళ్లబురుసు.. క్రేజీ ఫోక్ సాంగ్ రిలీజ్
విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తోన్న మరో చిత్రం పళ్లబురుసు. బలగం నటులు ప్రధాన పాత్రల్లో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ వచ్చేసింది. తాజాగా 'కొత్త సోకు' అనే ఫోక్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో సుధాకర్ రెడ్డి కొత్త కళ్లజోడుతో కనిపించారు. ఈ పాట రంగురంగుల విజువల్స్తో ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సురేశ్ గంగుల లిరిక్స్ అందిచగా.. కుమారా వాగ్దేవి ఆలపించారు. ఈ మూవీకి పవన్ సీహెచ్ సంగీతమందిస్తున్నారు. పక్కా రూరల్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
విజయ్ దేవరకొండ రణబాలి.. అంతలా కష్టపడ్డారా?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా వస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది.అయితే ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ కాస్తా గట్టిగానే శ్రమించినట్లు తెలుస్తోంది. కథకు తగినట్లుగా యాక్షన్ సన్నివేశాల్లో సహజంగా కనిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. తన పాత్ర కోసం కెరీర్లోనే అత్యంత కఠినమైన శిక్షణ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. రణబాలి లుక్ కోసం నెలల తరబడి ఫిట్నెస్ వర్కవుట్స్ చేశారని ఓ నివేదికలో వెల్లడైంది.విజయ్ దేవరకొండ ముఖ్యంగా గుర్రపు స్వారీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయుధాలను వాడటం, తుపాకీని ఆపరేట్ చేయడం కూడా నేర్చుకున్నారని ఓ నివేదిక ద్వారా తెలిసింది. కత్తిసాము, ఆయుధాల వాడకం, తుపాకీ విన్యాసాలతో పాటు ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడానికి కఠోర శిక్షణ తీసుకున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
థియేటర్లలో సూపర్ హిట్ మూవీ.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
రవితేజ, శివ బాలాజీ, అల్లరి నరేశ్ ముఖ్య పాత్రల్లో వచ్చిన లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ శంభో శివ శంభో. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. తమ స్నేహితుడి ప్రేమ కోసం ముగ్గురు ఫ్రెండ్స్ చేసిన త్యాగమే ఈ సినిమా. తమ స్నేహితుడి ప్రేమ గెలవడానికి ముగ్గురు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ మూవీలో చూపించారు.2010లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆగస్టు 1న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియమణి హీరోయిన్గా మెప్పించింది. -
కొరియన్ కనకరాజు.. రిలీజ్కు ముందే బిగ్ డీల్..!
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తోన్న సినిమా 'కొరియన్ కనకరాజు'. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్కు భారీ ధర దక్కినట్లు సమాచారం. ఈ మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ.26 కోట్ల వరకు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కేవలం రూ.38 కోట్ల బడ్డెట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ డీల్తో మూవీ రిలీజ్కు ముందే బిజినెస్ పరంగా కొరియన్ కనకరాజు దూసుకెళ్తున్నాడు. దీంతో వరుణ్ తేజ్ కమ్ బ్యాక్ సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. -
చెన్నై లవ్ స్టోరీ.. కిరణ్, శ్రీ గౌరి చేయాల్సింది కాదు..!
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా వచ్చిన ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. తొలి రోజే ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ లవ్ స్టోరీకి యూత్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రవి నంబూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఆదరణ లభిస్తోంది.ఇక సినిమా సంగతి అటుంచితే ఈ మూవీకి మొదటి అనుకున్నది కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ కాదని తెలుస్తోంది. ఈ లవ్ స్టోరీకి బేబి జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చేయాల్సింది. కానీ పలు కారణాలు చేత వారిద్దరూ ఈ కల్ట్ బొమ్మ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం. అలా ఈ ఛాన్స్ కిరణ్, శ్రీగౌరి ప్రియకు దక్కింది. గతంలో సాయి రాజేశ్ డైరెక్షన్లో వచ్చిన కల్ట్ ప్రేమకాథా చిత్రం బేబీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
మీ పోరాటానికి నా సెల్యూట్: డైరెక్టర్ శేఖర్ కమ్ముల
నీట్ పేపర్ లీకేజీపై జెన్ జీ చేస్తోన్న పోరాటంపై టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించారు. మీ పోరాటానికి నా సెల్యూట్ అంటూ కొనియాడారు. నీట్ పేపర్ లీక్ కి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా.. నీట్ పేపర్ లీక్ వలన ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఏ ప్రభుత్వమైనా ఇవన్నీ అడక్కుండా చేయాల్సిన పనులని అన్నారు. ఈ చిన్న డిమాండ్లు సాధించుకోడానికా లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తిని రక్తమోడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిండీతిప్పలు మాని దెబ్బలకి ఓర్చుకుని, రాత్రనకా పగలనకా ఉద్యమిస్తున్నారని ప్రశంసించారు. పిల్లలు అకౌంటబిలిటీ అడుగుతున్నారు.. వారి ఆవేదనలో న్యాయం ఉందని తెలిపారు. ప్రభుత్వం వాళ్ల మాట వినాలి.. వాళ్లకి భరోసా ఇవ్వాలి. వాళ్ల స్ఫూర్తిని గెలిపించాలని శేఖర్ కమ్ముల కోరారు. మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టు...మన పిల్లలు గెలిస్తే మనం బ్రతికినట్టు.. ప్రజలు గెలిస్తే ప్రభుత్వాలు గెలిచినట్టు.. అని సందేశమిచ్చారు. డియర్ జెన్ జీ.. మీరు చేస్తున్న ఈ పోరాటానికి చేతులెత్తి దణ్ణం పెడుతున్నా.. మీకు సెల్యూట్ చేస్తున్నా అంటూ ఫేస్ బుక్లో శేఖర్ కమ్ముల పోస్ట్ చేశారు. -
నన్ను కసాయి అనుకున్నా పర్లేదు: కాజల్ అగర్వాల్
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన లేటేస్ట్ మూవీ 'ది ఇండియా స్టోరీ'. కల్తీ కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో సందడి రిలీజైంది. ఇటీవల మన ఇండియాలో కల్తీపాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రతి రోజు మనం తాగే పాకెట్ పాలు మంచివి కావని తెలిపింది. కల్తీపై అవగాహన కల్పించడం కోసమే ది ఇండియా స్టోరీ మూవీని తీశారని పంచుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. నన్ను ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు కానీ.. నా కుమారుడికి మాత్రం నేను పాలు ఇవ్వనని తెలిపింది. ఈ విషయంలో నన్ను అందరూ కసాయి తల్లి అనుకున్నా సరే.. నాకే పర్లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఇంట్లోనే పన్నీరు తయారు చేసి ఇస్తానని కాజల్ తెలిపింది. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.మనదేశంలో ఆహార కల్తీ విపరీతంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.. అంతేకాకుండా ఆహార కల్తీ వల్లే యువతలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని నటి కాజల్ అగర్వాల్ తెలిపింది. ఓ ప్రాజెక్ట్ రీసెర్చ్లో తాను షాకింగ్ విషయాలు తెలుసుకున్నా.. ఇటీవల ఓ కేసు గురించి విని పుచ్చకాయ తినడం మానేశానని కాజల్ చెప్పుకొచ్చింది. -
ఇది తెలుగు సినిమా కాదు.. డబ్బింగ్ చేశామంతే
సూర్య స్వతహాగా తమిళ హీరోనే కానీ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో బోలెడంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అందుకు తగ్గట్లే దాదాపు ప్రతి మూవీ ఒకేసారి ఇక్కడ కూడా థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటుంది. రీసెంట్ టైంలో అయితే 'కరుప్పు'ని 'వీరభద్రుడు' పేరుతో రిలీజ్ చేస్తే పర్లేదనిపించింది. వచ్చే నెలలో 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం గురించి దర్శకుడు వెంకీ అట్లూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ.. సూర్యతో చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుంచి అంతా ఇది.. ఈ హీరో తెలుగులో చేస్తున్న తొలి సినిమా అనుకున్నారు. కానీ స్ట్రెయిట్ తమిళ చిత్రం అని, తెలుగులో డబ్బింగ్ చేశామని స్వయంగా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతి బయటపెట్టాడు.'గతంలో ధనుష్తో 'వాతి'(సార్) సినిమా టైంలో ప్రయోగం చేయాలనుకున్నాం. ఓటీటీల కారణంగా ధనుష్కి తెలుగులో భారీగా అభిమానులు పెరిగారు. దీంతో ఈ మూవీని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించాం. కానీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్టోరీ దృష్ట్యా ముందుగా తమిళంలో పూర్తిచేసి తర్వాత తెలుగులో డబ్బింగ్ చేశాం. సూర్యతో ముందుగా ఓ బయోపిక్ చేయాలనుకున్నాను. కానీ దానికి హక్కుల విషయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది. సూర్యతో సినిమా చేయాలనేది నా చిరకాల కోరిక. భవిష్యత్తులో ఆయనతో తప్పకుండా మరో సినిమా చేయాలనుంది' అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు.40 ఏళ్ల వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడటం అనే స్టోరీతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా తీశారు. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో సూర్య సరసన మమిత బైజు హీరోయిన్గా చేసింది. రాధిక, రవీనా టండన్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: రిలీజ్ రోజే 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?)#VishwanathAndSons is not a bilingual like #Vaathi. The film was shot in Tamil only and dubbed into Telugu.It made more sense to me as a director and my actors were comfortable.- #VenkyAtluri pic.twitter.com/oF0Q73eCbx— telugucinema.com (@thetelugucinema) July 24, 2026 -
రిలీజ్ రోజే కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?
కిరణ్ అబ్బవరం, గౌరిప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా థియేటర్లలోకి వచ్చింది. ప్రేమకథగా తీసిన ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్లే కొన్నిచోట్ల పాజిటివ్ టాక్ మరికొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఒకటి రెండు రోజులు ఆగితే అసలు ఫలితం ఏంటనేది తేలుతుంది. ఇదంతా పక్కనబెడితే రిలీజైన రోజే మూవీ టీమ్, కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేయడం ఇక్కడ విచిత్రంగా అనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)'చెన్నై లవ్ స్టోరీ' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని కొన్నిచోట్ల గురువారం రాత్రి ప్రీమియర్స్ వేశారు. కేవలం పెయిడ్ ప్రీమియర్ షోల ద్వారానే రూ.3.13 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని మూవీ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే కిరణ్ అబ్బవరం స్టార్ హీరో కాదు, అలా అని టికెట్ రేట్లు కూడా పెంచలేదు. ప్రీమియర్లు కూడా గురువారం రాత్రి ఒకటి రెండు షోలు వేశారు. అంతమాత్రానికే రూ.3 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయా అనేది ఇక్కడ ప్రశ్న.టాలీవుడ్లో ఒకప్పుడు కలెక్షన్స్ పోస్టర్స్ వేస్తే జనాలు కూడా అదే నిజమని నమ్మేసేవాళ్లు. కానీ తర్వాత రోజుల్లో దిల్ రాజు, నాగవంశీ లాంటి ప్రముఖ నిర్మాతలే.. ప్రేక్షకులని ఆకట్టుకోవడం కోసం కొంత మొత్తం పెంచేసి నంబర్లు వేస్తుంటామని బాహాటంగానే ఒప్పుకొన్నారు. దీంతో ఆడియెన్స్ కూడా వసూళ్ల పోస్టర్ రిలీజ్ కాగానే ఇది నిజమా కాదా అని కనిపెట్టేస్తున్నారు.'చెన్నై లవ్ స్టోరీ' విషయానికొస్తే.. నివి(గౌరీప్రియ) తన ప్రియుడు అజయ్(త్రిగుణ్)తో పెళ్లికి రెడీ అవుతుంది. కానీ ముహూర్తం టైంకి మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి, అజయ్ వెళ్లిపోతాడు. దీంతో హీరోయిన్ చెన్నై వెళ్లిపోతుంది. దేవదాసులా మందుకు బానిసవుతుంది. ఆ టైంలో స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) ఈమెకు పరిచయమవుతాడు. దర్శకుడు అవ్వాలనే ఆశతో చెన్నైలోకి అడుగు పెట్టిన ఇతడికి నివి ఫ్రెండ్స్ గ్యాంగే ఆశ్రయమిస్తారు.తొలుత స్టీవెన్, నివికి చిరాకు తెప్పించినా తర్వాత అతడికి దగ్గరవుతుంది. మళ్లీ ఈమెలో ప్రేమ చిగురిస్తుంది. తర్వాత వాళ్లిద్దరి ప్రయాణం ఎలా సాగింది? వీళ్ల ప్రేమకథలో ఎదురైన సవాళ్లేంటి? మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి పెళ్లి పీటలపై నివిని వదిలేసి వెళ్లిపోయిన అజయ్.. మళ్లీ ఆమె జీవితంలోకి ఎందుకొచ్చాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ) -
'వారణాసి' కథ సుఖాంతం.. 'స్పిరిట్' సంగతేంటి?
రీసెంట్ టైంలో మహేశ్ బాబు 'వారణాసి', ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలు ఊహించని విధంగా ఒకే సమస్యలో చిక్కుకున్నాయి. వీటికి సంబంధించిన టైటిల్స్ని వేరే నిర్మాతలు కూడా తమ చిత్రాలకు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. అయితే వీటి విషయంలో మూవీ టీమ్స్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని అంతా అనుకున్నారు. అయితే 'వారణాసి' టైటిల్ వివాదం ముగిసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)ఇదివరకే 'వారణాసి' టైటిల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న నిర్మాత సుబ్బారెడ్డి.. ఈ పేరుపై హక్కులు తనకే ఉన్నప్పటికీ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రాజమౌళి-మహేశ్ ప్రాజెక్టుకి ఇచ్చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తన అభిమాన హీరో మహేశ్ బాబు చిత్రానికి టైటిల్ ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ సమక్షంలో 'వారణాసి' సినిమా టైటిల్కి సంబంధించిన పత్రాల్ని నిర్మాత కె.ఎల్.నారాయణకు సుబ్బారెడ్డి ఇటీవల అందజేశారు.అయితే ఈ చిత్ర టైటిల్ వివాదం ముగిసింది గానీ 'స్పిరిట్' విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. తెలుగులోనే ఇదే పేరుతో ఓ చిన్న సినిమాని కూడా తీశారు. అయితే తమకు నోటీసులు పంపించారని సదరు చిన్న నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మరి 'స్పిరిట్' టైటిల్ వివాదం ఎప్పుడు ముగుస్తుందో?(ఇదీ చదవండి: ఏడాది కష్టపడ్డా.. 'జన నాయగన్'లో నా సీన్ తీసేశారు: తమిళ నటి) -
కలలే... కథలే పెంచే..!
‘‘రాధా రమణ రాగాలు మనసున మోగే వేళలో... ఏదో తపన తాగేసి వయసులు ఊగే వేళలో... ఓ కన్నా నీ అందమే అలలై అలలై ముంచే..’ అంటూ సాగుతుంది ‘రాధా రమణ’ పాట. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్కుమార్ జంటగా నటించిన ‘రోమాంచకం’ సినిమాలోనిది ఈ పాట. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 3న రిలీజ్ కానుంది.ఈ సినిమా నుంచి ‘రాధా రమణ’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘కన్నుల్లో అందుకే కలలే... కథలే పెంచే, ఆవేశమే తెరచాటుగా లాగగా, బిడియాల ఆదేశమే పొరపాటనీ ఆపగా, ఈ ఊగిసలో, ఉందనా లేదనా...’ అంటూ ఈ పాట సాగుతుంది. చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించగా, ఈ చిత్రసంగీత దర్శకుడు వాసుకి వైభవ్ పాడారు. ‘‘ప్రేమ, హాస్యం మేళవింపుతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
నాన్స్టాప్ వినోదానికి సై
‘‘రండి... స్వాగతం’ అంటూ సాక్షి మడోల్కర్ని ఆహ్వానించింది ఆమె నటిస్తున్న తాజా చిత్రం యూనిట్. శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో సాక్షి మడోల్కర్ని కథానాయికగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తెలియజేసేలా ఓ ఫన్నీ వీడియోను విడుదల చేశారు. సూపర్ హిట్ మూవీ ‘సామజవరగమన’ తర్వాత హీరో శ్రీ విష్ణు–దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ఇది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘‘ఓ వినూత్న తరహా కథాంశంతో, హై వోల్టేజ్ హ్యుమర్ ఉన్న కథనంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నాన్–స్టాప్ వినోదాన్ని అందించేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
చిన్న సినిమాలను సక్సెస్ చేయాలి: విజయశాంతి
‘‘మంచి సబ్జెక్ట్ ఉన్న చిన్న సినిమాలను విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను. నిజానికి చిన్న సినిమాల్లో దమ్ముంటుంది. మేమందరం చిన్న సినిమాలు చేస్తూ ఈ స్థాయికి వచ్చాం’’ అన్నారు విజయశాంతి. సమైరా, సముద్ర ఖని, అభిరామి, ఆనంద్, శరణ్య ప్రదీప్ నటించిన సినిమా ‘కర్మాఖ్య’. అభినయ కృష్ణ దర్శకత్వంలో వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.తొలుత ‘కామాఖ్య’ టైటిల్ని ఖరారు చేసిన యూనిట్ తాజాగా ‘కర్మాఖ్య’గా మార్చింది. ఈ టైటిల్ మార్పును తెలియజేస్తూ, ఈ సినిమా ట్రైలర్ లాంచ్ను గురవారం నిర్వహించారు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన విజయశాంతి మాట్లాడుతూ– ‘‘కామాఖ్య అమ్మవారు పవర్ఫుల్. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందనుకున్నా. అయితే ఇప్పుడు ‘కర్మాఖ్య’ అని పెట్టారు.అందులోనూ అమ్మవారి పేరు ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తుంది. నాకు ట్రైలర్ నచ్చింది. ఈ ట్రైలర్లోని మ్యూజిక్లో ఒక వైబ్రేషన్ వినిపించింది. ఈ సినిమాకు నిర్మాతలు చాలా ఖర్చుపెట్టారు’’ అన్నారు. ‘‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది’’ అన్నారు మధు యాష్కీ. ‘‘ఇది అమ్మవారి ఎలిమెంట్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్. ఈ చిత్రానికి హిట్ టాక్ రాకపోతే నేను గుండు కొట్టించుకుంటాను’’ అని తెలిపారు అభినయ కృష్ణ. ‘‘మా సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సునీల్ నారంగ్, నవీన్గార్లకు థ్యాంక్స్’’ అని అన్నారు వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్. నటి శరణ్య ప్రదీప్, నిర్మాత రవికుమార్ పనస మాట్లాడారు. -
చిన్న కథ... ఓ మధుర జ్ఞాపకం: దర్శకుడు నందకిషోర్
‘‘2018లో ఒక ఆలోచనతో మొదలైన ‘35 – చిన్న కథ కాదు’ ఇక్కడివరకూ (జాతీయ అవార్డులని ఉద్దేశించి) వచ్చింది. అప్పట్నుంచి ఈ 2026 వరకూ పడిన కష్టం, ఆ కష్టాలను దాటుకుని వచ్చిన అనుభవం... ఇదంతా ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఈ సినిమా స్క్రీన్ప్లేను పుస్తకంగా ప్రచురించడం కూడా చాలా ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు నందకిషోర్ ఈమని అన్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, మాస్టర్ అరుణ్దేవ్ పోతుల తదితరులు ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘35 – చిన్న కథ కాదు’.నందకిశోర్ ఈమని దర్శకత్వంలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ బాల నటుడు (అరుణ్దేవ్ పోతుల) విభాగాల్లో రెండు అవార్డులు సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ– ‘‘ముందుగా ఈ సినిమాని సపోర్ట్ చేసిన సురేష్బాబుగారికి, స్పిరిట్ మీడియాకు ధన్యవాదాలు.ఈ సినిమాలో ప్రసాద్ పాత్రలో నేను చెప్పిన ‘చిన్న కథ కాదు’ అనే ఊతపదం ఈరోజు దేశవ్యాప్తంగా మారుమోగుతుండటం చిన్న విషయం కాదు’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు తొలి సహాయ దర్శకుడిగా పని చేయడం ఆనందాన్నిచ్చింది. చిన్న ఆలోచనగా మొదలైన ఈ కథను నందు నేషనల్ అవార్డు స్థాయికి తీసుకెళ్లాడు’’ అని సజీవ్ అన్నారు. అతిథులుగా పాల్గొన్న దర్శకులు మల్లిక్ రామ్, విద్యాధర్, శశాంక్, అనురాగ్, వినోద్ తదితరులు... ‘‘ఈ సినిమా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. బాల్యాన్ని గుర్తు చేసింది. భావోద్వేగానికి గురి చేసింది’’ అంటూ యూనిట్ని అభినందించారు. -
ఆటా... పాటా...
వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వెంకీఅనిల్ 5’ (వర్కింగ్ టైటిల్). రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్కు జోడీగా కీర్తి సురేష్, కల్యాణ్రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు.అర్చన, జీ స్టూడియోస్, సురేష్ ప్రోడక్షన్స్ సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. కాగా, ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసిందని చిత్రబృందం పేర్కొంది. ‘‘తొలి షెడ్యూల్ చిత్రీకరణ కోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా సెట్ను నిర్మించాం. ప్రధాన తారాగణం పాల్గొనగా టాకీ పార్ట్తో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించాం. ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్గా ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
బాజా మోగించి...
సూర్య హీరోగా నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమిత బైజు, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో సంజయ్ విశ్వనాథ్ అనే పాత్రలో నటించారు సూర్య.గురువారం (జూలై 23) సూర్య బర్త్ డే. ఈ సందర్భంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లోని పెళ్లి పాట లిరికల్ వీడియో ప్రోమోను రిలీజ్ చేసి, ఈ పూర్తి పాటను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘ఆజా అన్నాడే... రాజా చిన్నోడే... బాజా మోగించి తాళి కట్టేస్తాడే..’ అన్న లిరిక్స్ ఈప్రోమోలో వినిపిస్తాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి యూరప్లో ఓ కీలక షెడ్యూల్ జరిగింది.యూరప్లో ఈ వెడ్డింగ్ సాంగ్ను చిత్రీకరించారని సమాచారం. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను హీరో సూర్య పాడటం విశేషం. ఇక తనకంటే వయసులో దాదాపు 20 సంవత్సరాలు పెద్దవాడైన హీరోను ఓ యంగ్ గర్ల్ ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. -
చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: చెన్నై లవ్ స్టోరీ నటీనటులు : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, త్రిగుణ్ , సిరి హనుమంతు, నవీన్ తదితరులునిర్మాతలు - ఎస్ కేఎన్, సాయి రాజేశ్కథ : సాయి రాజేశ్స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - రవి నంబూరిసంగీతం : మణిశర్మఎడిటర్ : సంతోష్ నాయుడుసినిమాటోగ్రఫీ : విశ్వాస్ డేనియల్విడుదల తేదీ: 24 జులై 2026మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సాయి రాజేష్, ఎస్ కే ఎన్ నిర్మించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ . ఈ మూవీ రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని జూలై 24న రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏంటి? ఈ చిత్రం ఆడియెన్స్ ఏ మేరకు నచ్చుతుంది? అన్నది ఓ సారి చూద్దాం. కథ ఏంటంటే?కాలేజ్ రోజుల నుంచే అజయ్ (త్రిగుణ్), నివి అలియాస్ నివేదిత (గౌరీ ప్రియ) ప్రేమించుకుంటారు. రెండేళ్ల స్నేహం, మూడేళ్ల ప్రేమతో పెళ్లికి సిద్దం అవుతారు. సరిగ్గా పెళ్లి రోజే అజయ్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోతాడు. వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాని అజయ్ చెప్పడంతో నివేదిత తట్టుకోలేకపోతుంది. ఆ బాధతో నివేదిత మందుకు బానిస అవుతుంది. ఆఫీసులో సరిగ్గా వర్క్ మీద ఫోకస్ కూడా పెట్టదు. ఇక నివేదిత రూంలోకి ఓ అతిథిగా వస్తాడు స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం). అనాథ అయిన స్టీవెన్.. ఫిల్మ్ మేకర్ అవ్వాలని, చచ్చేలోపు ఒక్కసారి అయినా తన పేరుని సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని అవకాశాల కోసం తిరుగుతుంటాడు. స్టీవెన్ రాకతో నివిలో వచ్చిన మార్పులు ఏంటి? నివి, స్టీవెన్ ప్రయాణం ఎంత వరకు సాగుతుంది? దర్శకుడు అవ్వాలనే స్టీవెన్ కోరిక నెరవేరుతుందా? అజయ్ మళ్లీ నివి జీవితంలోకి వస్తాడా? చివరకు ఈ ప్రేమ కథలో ఎవరెవరు ఒకటి అవుతారు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే?..ప్రేమ కథల్లో చెన్నై లవ్ స్టోరీ మాత్రం కాస్త కొత్త ప్రేమ కథే అని చెప్పుకోవాలి. ప్రేమ కథ అన్నాక.. ప్రేమికుడు, ప్రేయసి ఉంటుంది.. వీరి మధ్య ఓ సంఘర్షణ ఉంటుంది.. ఇద్దరినీ దూరం చేసే కారణం ఏదో ఒకటి ఉంటుంది.. ఈ పాయింట్స్ని పట్టి చూస్తే ఈ ప్రేమ కథ చాలా కొత్తగా అనిపిస్తుంది. తొలి ప్రేమ తోపు కాదే అన్న మాట, పాటలోనే ఈ కథ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. అయితే ఈ కథను ఎలా డీల్ చేశారన్న దానిపైనే రిజల్ట్ ఆధార పడి ఉంటుంది. తొలి ప్రేమ అయినా, మలి ప్రేమ అయినా ప్రేయసి సుఖాన్ని, సంతోషాన్నే ప్రేమికుడు కోరుకోవాలి. నివి ప్రేమలో విఫలం అవ్వడం, పెళ్లి క్యాన్సిల్ అవ్వడం, ఆపై మందుకు బానిస అవ్వడం వంటి సీన్లతో ఆరంభం నుంచే ప్రేక్షకుడ్ని హుక్ చేసేస్తాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో పాత్రను పరిచయం చేయడం, అక్కడితో కాస్త ఎంటర్టైన్మెంట్ ట్రాక్ నడిపించడంతో కథ అలా ముందుకు వెళ్తుంటుంది. హీరో, హీరోయిన్ల మధ్య మొదట్లో వచ్చే గొడవలు, ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ చిగురించడం వంటి సీన్లతో కథ మరింత స్పీడుగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అయితే అన్నీ బాగానే ఉన్నాయ్ అని అనుకునే టైంకి కథ ఎవ్వరూ ఊహించని టర్న్ తీసుకుంటుంది. ఆ ఇంటర్వెల్ బ్లాక్తో అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. సెకండాఫ్ని ఎలా డీల్ చేస్తారు? అసలు కథ ఎలా ముందుకు సాగుతుంది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్లతో ద్వితీయార్దాన్ని ప్రేక్షకుడు చూస్తాడు. ఇక ఆడియెన్స్ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగానే కథనం సాగుతుంటుంది. హీరో, హీరోయిన్ల ట్రాక్ అక్కడ చాలా కొత్తగా అనిపిస్తుంది. మళ్లీ అజయ్ పాత్రను తీసుకు రావడంతో కథ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఆ తరువాత కథ అక్కడక్కడే తిరుగుతుండటం, చాలా వరకు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్లోని కొన్ని ఎమోషనల్ సీన్స్ గుండెల్ని మెలిపెట్టేలా ఉంటాయి. క్లైమాక్స్కి కన్నీరు పెట్టాల్సిందే. అలా చివరకు ఓ సంతృప్తితో ప్రేక్షకుడు బయటకు వెళ్తాడు. అయితే ద్వితీయార్దాన్ని ఇంకాస్త బెటర్గా మల్చి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేదనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..కిరణ్ అబ్బవరం తనకు ఇచ్చిన స్టీవెన్ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. ఫస్ట్ హాఫ్లో అమాయకుడిగా అందరినీ నవ్విస్తూ కనిపించే కిరణ్ అబ్బవరం, సెకండాఫ్లో మరింత కొత్తగా కనిపిస్తాడు. చాలా వరకు ఎమోషనల్ సీన్స్తో కిరణ్ అబ్బవరం ఏడ్పించేస్తాడు. గౌరి ప్రియ అయితే ఈ చిత్రానికి సోల్. ఆమె కారెక్టర్ను అద్భుతంగా రాసుకున్నారు.. ఆమె కూడా అంతే అద్భుతంగా నటించారు. త్రిగుణ్ పాత్ర కూడా బాగుంటుంది. హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్, మురుగన్ తల్లి, కరుణ కుమార్ పాత్రలు బాగుంటాయి. మిగిలిన వారంతా తమ పరిధి మేరకు మెప్పించారు.సాంకేతిక విషయాలకు వస్తే.. ఈ సినిమాకి మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం అని చెప్పాలి. తనదైన బీజియం తో మ్యాజిక్ చేశాడనే చెప్పుకోవచ్చు. పాటలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కెమెరావర్క్ గొప్పగా అనిపిస్తుంది. విజువల్స్ ఎంతో ప్లెజెంట్గా ఉంటాయి. మాటలు మనసుని హత్తుకుంటాయి. క్యాస్టూమ్స్, ఎడిటింగ్ అన్నీ బాగుంటాయి. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా అనిపిస్తాయి.అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘రా ఎన్టీఆర్’ వివాదం.. అభిమానులకు జూ. ఎన్టీఆర్ స్పష్టమైన సందేశం
జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలపై ఇటీవల వెలుగులోకి వచ్చిన వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. అభిమానుల పేరుతో ఏర్పడిన ‘రా ఎన్టీఆర్’ సంఘం చేసిన చర్యలు హీరోకు అసౌకర్యం కలిగించాయి.ఈ సంఘం ఊరూవాడ అనే కార్యక్రమం పెట్టారు. వంద కోట్ల రూపాయల ఫండ్ సేకరణ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చింది. నిజానికి ఈ సంఘం వారికి నిజంగానే ఎన్టీఆర్ అంటే అభిమానం. అప్పటికే వీళ్లు పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారు. తమ హీరోను మరింత ఎలివేట్ చేయాలనుకున్నారు. కానీ అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై లీకులు రావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ పరిణామాలపై ఎన్టీఆర్ స్వయంగా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ లేఖ తర్వాత ‘రా ఎన్టీఆర్’ సంస్థ ప్రెస్ మీట్ పెట్టింది. ఎన్టీఆర్ కోటరీ చుట్టూ పలు విమర్శలు చేసింది. కలసి మాట్లాడతాం తమకు ఎపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా కోరింది. కానీ తెరవెనక ఒత్తిడి పెరగడంతో చివరికి సేవా కార్యక్రమాలను నిలిపివేస్తున్నామని ‘రా ఎన్టీఆర్’ సంస్థ స్వయంగా ప్రకటించింది. దీంతో కొంతమంది ఆపన్నులకు అందాల్సిన సాయం ఆగిపోయింది. ఈ ఘటన ద్వారా ఎన్టీఆర్ అభిమానులకు స్పష్టమైన సందేశం వెళ్లింది. అభిమాన సంఘాలు హీరో పేరుతో చేసే పనులు పరిమితి లోపల ఉండాలి. సేవా కార్యక్రమాల వరకు ఓకే, కానీ.. రాజకీయాలు లేదా పెద్ద ఫండ్ సేకరణలు చేసే ముందు హీరో అనుమతి లేకుండా చేయరాదు. -
అఖిల్ లెనిన్.. లవ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. కాగా.. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాలోని వారెవా వారెవా అంటూ సాగే పాట ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ రొమాంటిక్ లవ్ సాంగ్కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ ఆలపించారు. ఈ సాంగ్ను తమన్ కంపోజ్ చేశారు. -
మూడు వారాల్లోనే ఓటీటీకి నాగబంధం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విరాట్ కర్ణ, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ నాగబంధం. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. అనంత పద్మనాభ స్వామి బ్యాక్డ్రాప్లో సోషియో ఫాంటసీ కథగా వచ్చిన ఈ సినిమా గ్రాఫిక్స్ పరంగా అభిమానుల్ని ఆకట్టుకుంది. అయితే కంటెంట్ పరంగా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకరపోయింది. ఈ సినిమాలో ఫైట్స్తో పాటు కొన్ని సన్నివేశాలు అనవసర నిడివిని పెంచాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.అయితే జూలై 3న రిలీజైన ఈ మూవీ అప్పుడే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రం జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. అసలు కథేంటంటే..ఈ సినిమా కథంతా 1756-1962 నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ సాగుతుంది. ఇండియన్ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్(జగపతి బాబు) తన 30 ఏళ్ల కెరీర్లో ఎన్నో రహస్యాలను ఛేదించినా.. నాగబంధం రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోతాడు. దీనిపై తన శిష్యులు టెస్లా, అలీ(రిషబ్ సాహ్నీ) పరిశోధన చేస్తూ హిమాలయాలకు వెళ్తారు . అక్కడ ఎన్నో ఏళ్లుగా బంధించబడి ఉన్న బైరాగి(గరుడ రామ్) తన మంత్ర శక్తితో అలీ గతాన్ని గుర్తు చేసి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ప్రపంచాన్ని జయించాలంటే నాగ బంధాన్ని విడిపించాలని అందుకోసం బ్రహ్మ కమలం తీసుకురావాలని ఆలీని ఆదేశిస్తాడు. అలీ తన అనుచరులతో బ్రహ్మకమలం వెతుకుతూ.. అడ్డుకున్న వాళ్లను, దానికి సంబంధించిన వివరాలు తెలిసి చెప్పని వాళ్లను క్రూరంగా చంపుతుంటాడు. చివరకు ఆ బ్రహ్మకమలం శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉన్న స్వామివారి నాభిలో ఉండే పద్మంలో ఉందని తెలిసి.. ఓ ప్లాన్ ప్రకారం ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. ఓ కారణంగా అది భైరవకోన సమీపంలోని సముద్రంలో పడిపోతుంది. దాన్ని తీసుకొచ్చింది అలీ మనుషులు తులసీవనం గ్రామానికి వెళ్తారు. అక్కడ డబ్బు ఆశ చూపి రుద్ర(విరాట్ కర్ణ) సహాయంతో పడవలో భైరవకోనకు బయలుదేరుతారు. మరి ఆ స్వర్ణ కమలం అలీ మనుషులకు దొరికిందా లేదా? రుద్ర వాళ్లకు సహాయం చేశాడా లేదా? ఆ బ్రహ్మకమలానికి రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? అతను ప్రాణంగా ప్రేమించే చెల్లి మాసస(సోనియా సింగ్) చావుకు కారణం ఎవరు? పార్వతి(నభా నటేష్) ఎవరు? రుద్రతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? 1956లో ఏం జరిగింది? ముస్లిం రాజుతో కలిసి భైరాగి పన్నిన కుట్ర ఏంటి? అసలు నాగబంధం నేపథ్యం ఏంటి?చివరకు బైరాగి నాగబంధాన్ని విడిపించాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
బిగ్ బాస్పై పుస్తకం... బిగ్ రియాలిటీ...!
ఈ ఏడాది హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం బంగ్లా భాషలలో బిగ్ బాస్ ఆరు ఎడిషన్లను ఒకేసారి ప్రారంభించడానికి జియోస్టార్ సిద్ధమైంది. తద్వారా తొలిసారి దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు బిగ్ బాస్ వినోదాన్ని ఏకకాలంలో అనుభవించబోతున్నారు. ఇది భారతదేశంలో రియాలిటీ ఎంటర్టైన్ మెంట్ రంగంలో ఒక మైలురాయిగా నిలువనుంది. ఈ ఆరు ఎడిషన్లు సెప్టెంబర్ 2026 నుంచి జియోస్టార్ టెలివిజన్ నెట్వర్క్, జియో హాట్స్టార్లో దేశ వ్యాప్తంగా ప్రసారం కానున్నాయి. బిగ్ బాస్కు పర్యాయపదంగా మారిన దిగ్గజ హోస్ట్లు సల్మాన్ ఖాన్, విజయ్ సేతుపతి, నాగార్జున, కిచ్చా సుదీప్, మోహన్ లాల్ ఈ సీజన్ లోనూ కొనసాగనున్నారు. ఈ సంవత్సరం బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ రాకతో ఇది మరింత ఆకర్షణీయంగా మారనుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని, ’ఇండియాస్ బిగ్ రియాలిటీ’ అనే ఒక ప్రత్యేకమైన డేటాతో నిండిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని జియో హాట్స్టార్ ఆవిష్కరించింది. రెండు దశాబ్దాల బిగ్ బాస్, అద్భుతమైన ప్రయాణం, సాంస్కృతి ప్రభావం శాశ్వత వారసత్వాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది.గత ఏడాది 500 మిలియన్ వీక్షకులు...భారతదేశపు అతిపెద్ద వినోద ఫ్రాంచైజీలలో ఒకటిగా బ్రాండ్లకు ఎలా వేదికగా నిలిచిందో ’ ఇండియాస్ బిగ్ రియాలిటీ’ వెల్లడించింది. కేవలం 2025లోనే, 500 మిలియన్లకు పైగా వీక్షకులను ఈ షో చేరుకుని 438 బిలియన్లకు పైగా వీక్షణ నిమిషాలను సృష్టించింది ఆరు భాషా ఎడిషన్లనూ కలిపి చూసినప్పుడు ఈ ఎంగేజ్మెంట్లో ఇయర్ ఆన్ ఇయర్ 47% వృద్ధిని సాధించింది. దాదాపు 625 కు పైగా బ్రాండ్లు ఈ షో ని ఉపయోగించుకుని, జాతీయ ప్రాంతీయ మార్కెట్లలో ఉత్పత్తులను విడుదల చేయటం, అవగాహన కల్పించడం, వినియోగదారులతో శాశ్వత సంబంధాలను ఏర్పరచుకోవడం చేశాయి. జియోహాట్స్టార్లో, ప్రతి 10 మంది వీక్షకులలో ఆరుగురు బిగ్ బాస్ లైవ్ ఫీడ్ను చూస్తున్నారు.ఇంటర్నెట్లోనూ ఫుల్ క్రేజ్...బిగ్ బాస్ కేవలం చూసే అనుభవం కంటే ఎంతో ఎక్కువ అని ఈ కాఫీ టేబుల్ పుస్తకం వెల్లడిస్తుంది. జియోహాట్స్టార్లో 9.32 బిలియన్లకు పైగా ఓట్లు పోలవడం 43 మిలియన్ల లైవ్ చాట్లు నమోదు కావడం ద్వారా ప్రేక్షకులు చురుకుగా వ్యవహరించారు. దాదాపు ప్రతి నలుగురు వీక్షకులలో ముగ్గురు ఈ షోతో భిన్న రకాలుగా మమేకమవుతున్నారు, బిగ్ బాస్ ఇంటర్నెట్లో విపరీతమైన క్రేజ్ను సృష్టించింది. కేవలం 2025లోనే 1.7 బిలియన్లకు పైగా సోషల్ ఎంగేజ్మెంట్లను 30 మిలియన్ల యూజర్–జనరేటెడ్ మీమ్స్ను బిగ్ బాస్ సృష్టించింది. బిగ్ బాస్ ఇప్పుడు హిందీ మార్కెట్లలో 20 కోట్లకు పైగా వీక్షకులను, దక్షిణ భారతదేశంలో 3 కోట్లకు పైగా వీక్షకులను చేరుకుంది. ఇక్కడ ప్రతి 10 మంది టెలివిజన్ వీక్షకులలో 8 మంది ఈ షోతో మమేకమవుతున్నారు. ఈ ప్రాంతంలోని మిగతా అన్ని రియాలిటీ షోల కంటే దీని రీచ్ 3.5 రెట్లు ఎక్కువ.అదే బిగ్ బలం...గత రెండు దశాబ్దాలుగా, బిగ్ బాస్ ప్రతి సీజన్ తో తన స్థాయిని, ఆదరణను, ప్రాముఖ్యతను పెంచుకుంటూ, నిరంతరం తనను తాను పునరావిష్కరించుకుంది. ప్రేక్షకులను నిరంతరం పాల్గొనేలా చేయడమే బిగ్ బాస్ బలం, ’ఈ కాఫీ టేబుల్ పుస్తకం భారత దేశ వినోద పర్యావరణ వ్యవస్థ పరిణామంలోని కీలకమైన క్షణాలను వెలుగులోకి తెచ్చింది‘ అని పుస్తకావిస్కరణ సందర్భంగా జియోస్టార్ టీవీ, ఎంటర్టైన్ మెంట్ సేల్స్ హెడ్ మహేష్ శెట్టి అన్నారు. ‘ పండుగ సీజన్ లో ప్రేక్షకుల వివిధ అంశాలపై దృష్టి మరల్చే తరుణంలో, బిగ్ బాస్ ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేస్తుంది. 24/7 లైవ్ ఫీడ్లు, బిలియన్ల కొద్దీ ఓట్లు, లైవ్ చాట్ల ద్వారా ఏటా 47% ఎంగేజ్మెంట్ వృద్ధిని సాధిస్తూ, ఈ షో వీక్షకులను సైతం తమ చురుకైన భాగస్వాములుగా మారుస్తుంది. ‘ అని జియోస్టార్ డిజిటల్, ఎంటర్టైన్మెంట్ సేల్స్ హెడ్ భాస్కర్ రమేష్ అన్నారు. -
ఓటీటీల్లో ఫ్రైడే సందడి.. ఒక్క రోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి ఉండనే ఉంటుంది. ఈ రోజు నుంచే థియేటర్లలో విజయ్ జన నాయగన్ సందడి చేస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత రిలీజైంది. అంతేకాకుండా ఈ వారంలో టాలీవుడ్ నుంచి కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' రిలీజ్ కానుంది. దీంతో పాటు కాజల్ 'ద ఇండియా స్టోరీ' సహా హే చికితా, చంద్రప్పన్, కాగితం పడవలు లాంటి చిన్న చిత్రాలు బిగ్ స్క్రీన్స్పైకి రానున్నాయి.ఇక ఈ ఫ్రైడే ఓటీటీల రిలీజ్ విషయానికొస్తే పల్లిచట్టంబి, కాన్ సిటీ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి సిరీస్లు సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ ద ట్రూతర్స్ (స్పానిష్ మూవీ) - జూలై 24 72 అవర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24 లాస్ క్రెయంటస్ (స్పానిష్ మూవీ) - జూలై 24 ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24 కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 24జియో హాట్స్టార్ స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24 ది డెవిల్ వియర్స్ ప్రద-2(హాలీవుడ్ సినిమా)- జూలై 24 స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్(హాలీవుడ్ సిరీస్)- జూలై 24 బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25అమెజాన్ ప్రైమ్ ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 24 ఈగో రామన్(తమిళ మూవీ)- జూలై 24జీ5 అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ సిరీస్) - జూలై 24 ప్రేమ్ షాట్స్ (బెంగాలీ సిరీస్) - జూలై 24సోనీ లివ్ పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24లయన్స్ గేట్ ప్లే ప్రొటెక్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 24ఆపిల్ ప్లస్ టీవీ ద డింక్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24సన్ నెక్స్ట్ సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ మూవీ) - జూలై 24మనోరమ మ్యాక్స్ట్రిపుల్ డెక్కర్(మలయాళ సినిమా)- జూలై 24 -
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్కు షాక్..!
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్కు షాక్ తగిలింది. నిర్మాత వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని పిటిషన్ కొట్టేసింది. దీంతో బండ్ల గణేశ్కు సుప్రీంలో చుక్కెదురైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న రుణ వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్ఫేసీ, ఐబీసీ చట్టాలకు సంబంధించిన కీలక అంశాలపై అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.అసలేం జరిగిందంటే..హైదరాబాద్లోని శ్రీ పరమేశ్వర పౌల్ట్రీఫామ్ ప్రైవేట్ లిమిటెడ్కు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రుణాలకు సంబంధించి బండ్ల గణేష్, ఆయన కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత ఆస్తులను పూచీకత్తుగా పెట్టిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ సమయంలో, బ్యాంక్ సర్ఫేసీ చట్టం కింద చర్యలు చేపట్టి తనఖా పెట్టిన ఆస్తుల్లో ఒకదానిని వేలం వేసింది. అయితే, ఈ వేలం ప్రక్రియను, సేల్ సర్టిఫికెట్ను హైదరాబాద్లోని రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్టీ) తప్పుబట్టింది. కొనుగోలుదారుడికి వడ్డీతోసహా డబ్బును వాపసు చేయాలని, పిటిషనర్లకు ఆస్తిని తిరిగి అప్పగించాలని ఆదేశించింది. అయితే, డీఆర్టీ ఇచ్చిన ఈ తీర్పును హైకోర్టు కొట్టివేసింది.వన్ టైమ్ సెటిల్మెంట్ కింద బ్యాంక్ రూ.71.44 కోట్లతో సహా సుమారు రూ.129.02 కోట్లను రికవరీ చేసిందని, బకాయిలు పూర్తిగా తీరిపోయినట్లు సెటిల్మెంట్ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందని బండ్ల గణేష్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆస్తిని వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తి ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. -
గేటెడ్ కమ్యూనిటీలో లవ్
ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరిగే రొమాంటిక్ థ్రిల్లర్ కథతో రూపొందిన చిత్రం ‘అదే నీవు అదే నేను’. కొండల్ దర్శకత్వంలో గోవిందు కాండ్రేగుల నిర్మించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు విభాగాల్లో అవార్డులు సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’లో నటించిన త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, ‘సిద్ధార్థ్ రాయ్’ సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘‘మంచి రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో కొండల్ తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని నిర్మాత పేర్కొన్నారు. -
ఓ మంచి అమ్మమ్మ
సుశీలమ్మ మంచి అమ్మమ్మ. ఆమె పంచే ప్రేమానురాగాలు ఇంటిల్లిపాదినీ ఆనందపరుస్తాయి. సహజమైన ప్రేమను పంచే ఆ సుశీలమ్మ పాత్రను సహజనటి జయసుధ పోషించారు. విడుదలకు సిద్ధమవుతున్న ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రంలోనే ఆమె ఈ పాత్ర చేశారు. శ్రీకర్ దర్శకత్వంలో ఈ బాలల చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని నిర్మించారు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి నటించిన చిత్రం ఇది. ‘‘మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే అందమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని యూనిట్ పేర్కొంది. -
వయసుతో పని లేదు... మనసు ముఖ్యం
‘నేను నీకన్నా పెద్దవాణ్ణి... నాతో నీకు ప్రేమ సెట్ కాదు’... అంటాడు హీరో. ‘అయినా ఓకే... నేనేమైనా తప్పు చేస్తే... చిన్నమ్మాయి అని క్షమిస్తావ్... నువ్వేమైనా అంటే.. పెద్దోడు అని సర్దుకుపోతా’ అంటుంది హీరోయిన్. ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్కి మధ్య జరిగే సంభాషణ ఇది. హీరో వయసు ఫిఫ్టీ ప్లస్... హీరోయిన్కి 25 ప్లస్. హీరోని వెంటపడి ప్రేమిస్తుంది హీరోయిన్. అప్పుడు హీరో ‘ఏజ్ గ్యాప్’ గురించి మాట్లాడితే... ‘లవ్కి ఏజ్తో సంబంధం లేదు... మనసు ముఖ్యం’ అంటుంది. ఇలా హీరో–హీరోయిన్ మధ్య 15–20 ఏళ్లు గ్యాప్ ఉన్న కథతో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్వరలో మరో మూడు చిత్రాలు రానున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం...నాకన్నా ఇరవైయేళ్లు చిన్నది... ‘నాకన్నా ఇరవైయేళ్లు చిన్నది...’ అంటూ సూర్య చెప్పడం... ‘నాకు ప్రాబ్లం లేదు’ అని మమితా బైజు అనడం వంటి డైలాగులు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ట్రైలర్లో ఉన్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా పక్కాగా ఏజ్ గ్యాప్ నేపథ్యంలో రూపొందిందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సూర్య హీరోగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న తెలుగు–తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో మమిత, సూర్యఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే సంజయ్ విశ్వనాథ్ అనే పిస్టల్ షూటర్ పాత్రని సూర్య పోషించారని అర్థం అవుతోంది. మ్యాడీ అనే పాత్రలో మమిత బైజు నటించారు. ప్రేమ... ప్రేమించమంటూ సంజయ్ విశ్వనాథ్ వెంట మ్యాడీ పడటం.. ‘నాకన్నా ఇరవైయేళ్లు చిన్నది... ఎలా’, ‘నువ్వు ఒక్క చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు చాలా మంది వచ్చి ఇలా పడిపోతారు’ అంటూ సంజయ్ విశ్వనాథ్ అనగానే... ‘కావాలంటే ఇంకో నాలుగు చిటికెలు వేస్తా... నువ్వు పడు చాలు’ అని మ్యాడీ అనడం వంటి డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తనను ప్రేమించమంటూ మ్యాడీ వెంటపడటం.. వయసు తేడా వల్ల ఆమె ప్రేమని సంజయ్ విశ్వనాథ్ కాదనడం ట్రైలర్లో కనిపిస్తోంది. మరి... వీరి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది తెలియాలంటే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. మరోసారి... హీరోయిన్ నయనతార మరోసారి ఏజ్ గ్యాప్ మూవీలో నటించారు. శింబు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘వల్లవన్’ (తెలుగులో ‘వల్లభ’) చిత్రంలో తనకన్నా వయసులో చిన్నవాడైన శింబుని ప్రేమించిన పాత్రలో నటించి, మెప్పించారామె. తాజాగా నయనతార మరోసారి అలాంటి పాత్ర పోషించిన చిత్రం ‘హాయ్’. విష్ణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ హీరో కెవిన్ హీరోగా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.‘హాయ్’లో కెవిన్, నయనతార ఈ మూవీ కూడా ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. వయసులో పెద్దదైన మహిళ... యువకుడి మధ్య జరిగే ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. ‘‘టైటిల్కు తగ్గట్టుగానే ‘హాయ్’ సింపుల్, హార్ట్ వార్మింగ్, ఫీల్గుడ్ సినిమా. ప్రతి కుటుంబం కలిసి చూసేలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని యూనిట్ పేర్కొంది.తొలి ప్రేమే మలి ప్రేమ కూడా! ప్రేమకథా చిత్రాలను సరైన రీతిలో తెరకెక్కిస్తే హిట్ గ్యారంటీ. అందుకు ఓ ఉదాహరణ మలయాళ దర్శకుడు గిరీష్ ఏడీ తెరకెక్కించిన ‘ప్రేమలు’ (2024). ఇప్పుడు ఈ దర్శకుడి నుంచి రానున్న ఎమోషనల్ లవ్స్టోరీ మూవీ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో ఆష్లీ (మమిత బైజు) అనే యువతి విదేశాల నుంచి తన స్వగ్రామానికి తిరిగి వస్తుంది. తన పక్కింట్లో జరుగుతున్న పెళ్లి వేడుకను చూసినప్పుడు ఆమెకు మొదటి ప్రేమికుడు జస్టిన్ (నివిన్ పౌలీ) గుర్తుకు వస్తాడు. ఆ జ్ఞాపకాలతో ఆమె జీవితంలో మళ్లీ భావోద్వేగాలు మొదలవుతాయి. అనుకోకుండా ఆష్లేకు జస్టిన్కి మళ్లీ ఎదురుపడే అవకాశం వస్తుంది.‘బెత్లెహెం కుడుంబ యూనిట్’లో నితిన్ పౌలీ, మమిత తొలి ప్రేమికుడితోనే మలి ప్రేమ మొదలవుతుంది. ఈ లవ్స్టోరీలో నితిన్ పౌలీ, మమిత బైజు జంటగా నటించారు. నితిన్ వయసు 40 ప్లస్... మమితకు 25. ‘‘ఈ ఏజ్ గ్యాప్ లవ్స్టోరీ చాలా ఎమోషనల్గా ఉంటుంది’’ అని చిత్రదర్శకుడు గిరీష్ పేర్కొన్నారు. ఈ చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది. ఇక ఈ దర్శకుడు తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘ప్రేమలు’తో మమిత బైజుకి మంచి గుర్తింపు వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే... ఇలాంటి ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్తో ఆగస్టు 14న రానున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లోనూ మమిత కథానాయికగా నటించారు. ఇదే తరహా కాన్సెప్ట్తో రూపొందిన రెండు చిత్రాలతో వచ్చే నెలలోనే వారం గ్యాప్లో ఆమె స్క్రీన్పై కనిపించనుండటం విశేషం. -
చెన్నైతో నా లవ్ స్టోరీ: చిరంజీవి
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా జూలై 24న విడుదల కానుంది. బేబీ, కలర్ ఫోటో టీమ్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందన తెచ్చాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను చెన్నైలో గడిపిన రోజులు గుర్తుచేసుకున్నారు. 'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నేనొక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాను. చెన్నైతో లవ్ స్టోరీ రోజులు గుర్తొచ్చాయి. చెన్నైతో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది. ఇక్కడ కదా మన బతుకు తెరువు, ఇక్కడ కదా మన ఫ్యూచర్, ఈ స్టూడియోల్లోనే కదా మనం నటుడిగా నిలదొక్కుకోవాలి.. ఇక్కడే కదా మనం పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి అంటూ అప్పట్లో నేను చెన్నై రోడ్ల మీద తిరిగాను. అక్కడే కార్లలో తిరిగాను. అనంతరం అక్కడే స్టార్ స్టేటస్ అందుకున్న చెన్నై రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అనే ఈ సినిమా టైటిల్ వినగానే నాకు చెన్నైతో లవ్ స్టోరీ గుర్తుకొచ్చింది ఈ టైటిల్లో ఆ మ్యాజిక్ ఉంది'' అని చిరంజీవి అన్నారు. అభిమానులను తాను ఎంతో ఇష్టపడతానని, కానీ అదే అభిమానులు పైకొస్తే తన ప్రాణప్రదంగా చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. నా అభిమానుల వల్లే ఈ ఈవెంట్కి వచ్చాను. ఎస్కెఎన్, సాయి రాజేష్, దర్శకుడు రవి, నా అభిమానులు. కిరణ్ అబ్బవరం వాళ్ల అన్న నా అభిమాని, కిరణ్ పవన్ కళ్యాణ్ అభిమాని. వీళ్లందరి అభిమానం నన్ను ఇక్కడికి రప్పించింది. అభిమానులు కేవలం అభిమానమే కాకుండా తమను ప్రేరణగా తీసుకొని పైకి రావాలి. ఎస్కెఎన్, సాయి రాజేష్ లాంటి వారు ఏమి లేకుండా వచ్చి ఎదిగారు. కష్టాలు, అవమానాలు ఉన్నా కష్టపడితే విజయం సాధించవచ్చు. ఈ వేదికపై ఉన్న వీళ్లంతా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా అసాధారణ కలలు కన్నారు. అదే వీళ్లను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరు కూడా కలలు కనండి.. వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నించండి... తప్పకుండా విజయం సాధిస్తారు.. అందుకు నేనే ఉదాహరణ. కంఫర్ట్ జోన్ వదిలేయాలి.. కష్టానికి ఎదురెళ్లాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయండి. అప్పట్టో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి మహానటుల మధ్య నేను ప్రత్యేకంగా కనిపించాలని చాలా కష్టపడ్డాను. అలాగే కిరణ్ అబ్బవరం కూడా రాయచోటిలో పుట్టి, తిరుపతిలో సినిమాలు చూసి పెరిగి, ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాడు. అలాంటి కొత్తవాళ్లు ఇంకా ఇండస్ట్రీకి రావాలి. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి మాట్లాడుతూ.. నేను డ్యాన్సులు అంత బాగా చేశానంటే మణిశర్మ సంగీతం వల్లే. ఆయన లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లేకపోతే నేను లేను. చివరగా చిరంజీవి సినిమా యూనిట్కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జోడీగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. దర్శకుడు సాయి రాజేశ్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్పై సాయి రాజేశ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) విడుదలవుతోంది. -
రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
మహారాజా రవి తేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న మూవీ మారెమ్మ. ఈ చిత్రంతోనే మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మారెమ్మ చిత్రం రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ ఏడాది వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. #MAREMMA - SEPTEMBER 10TH! Best wishes to @maadhav_9999 and team 🤗 pic.twitter.com/p84lQanTvR— Ravi Teja (@RaviTeja_offl) July 22, 2026 -
రవితేజకు జిరాక్స్ కాపీ.. ఇలా కూడా ఉంటారా?
ఈ భూమి మీద మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెప్పడం వింటుంటాం. ఏడుగురో ఏమో కానీ మనలా అచ్చం ఒక్కరు కనపడినా చాలని ఫీలవుతుంటాం. సడన్గా మనలాంటి వ్యక్తి ఎవరైనా ఎదురుగా వస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుంది. ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇలాంటి అనుభవం ఒక్కసారైనా ఎదురవ్వాలని మనం కూడా కోరుకుందాం. మనకేమో గానీ.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్న ఓ వ్యక్తి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఇతన్ని రవితేజ మూవీస్లో డూప్గా వాడుకోవచ్చు కదా కామెంట్స్ పెడుతున్నారు. అయితే రవితేజకు అచ్చం జిరాక్స్ కాపీలా అతనెవరో వివరాలేమీ తెలియదు. ఈ వీడియో మాత్రం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అచ్చం మనలాగే అలా ఎవరైనా ఉంటే చూడాలని మీకు కూడా అనిపిస్తోంది కదూ.As it is గా వున్నాడు,డూప్ గ వాడుకోవచ్చు కదా ఎలాగో కాండిడేట్ ఫేస్ వాడి పోయినట్టు వుంటుంది#Raviteja pic.twitter.com/jBgMjGLmDB— TVR Media 🚩🚩🚩 (@Tvr_Media7) July 21, 2026 -
‘గబ్బర్ సింగ్’ ఫేం రమేశ్కు బ్రెయిన్ స్ట్రోక్!
‘గబ్బర్ సింగ్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేశ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కి గురికావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా లేదని, పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అపోలో వైద్య బృందం వెల్లడించింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ (2012) ద్వారా రమేశ్ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. ఆ సినిమాలో వచ్చే ‘అంత్యాక్షరి’ కామెడీ ఎపిసోడ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కల్యాణ్తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అనంతరం అత్తారింటికి దారేది సినిమాలో కూడా కాసేపు కనిపించారు. వీటితో పాటు టాలీవుడ్లో పలు చిన్న, మధ్యతరహా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కామెడీ పాత్రల్లో నటించాడు. సోషల్ మీడియాలో కూడా రమేశ్ యాక్టివ్ గా ఉంటాడు. రెండు రోజుల క్రితమే షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియోని కూడా షేర్ చేశాడు. -
కామన్వెల్త్ గేమ్స్లో రష్మిక..!
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్లో నేషనల్ క్రష్ మెరవనుందా? ఈ క్రీడల సంగ్రామం ముగింపు వేడుకలకు హాజరు కానుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొగనుందని తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్తో కలిసి ఈ వేడుకకు హాజరకానున్నట్లు సమాచారం. వచ్చే నెల ఆగస్టు 2న జరగనున్న ఈ వేడుకల్లో భారతదేశం తరఫున నిర్వహించే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొగననుంది. ఈ వేడుకలో రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా కామన్వెల్త్ గేమ్స్ అధికారిక ఫ్లాగ్ను భారత్కు అందించనున్నారు. 2030లో జరగబోయే 100 ఏళ్ల శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్కు గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం అతిథ్యం ఇవ్వనుంది. గతంలో 2010లో ఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించిన తర్వాత.. భారత్ ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం రెండోసారి కావడం విశేషం. -
అల్లరి నరేశ్ రంభ ఊర్వశి మేనక.. క్రేజీ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటించిన లేటేస్ట్ మూవీ రంభ ఊర్వశి మేనక. ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సురభి హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా.. సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. నా కంటి మీద కునుకే’అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. ధనుంజయ్ ఆలపించారు. ఈ సాంగ్ను చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హస్య మూవీస్ బ్యానర్లో రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. -
ప్రభాస్తో కత్రినా.. సందీప్ రెడ్డి ప్లాన్ అదిరిందిగా!
‘యానిమల్’తర్వాత సందీప్రెడ్డి వంగా ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ తర్వాత వెంటనే ప్రభాస్తో ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్ చేశాడు. అప్పటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ అంచనాలను తగ్గట్లుగానే సందీప్ రెడ్డి వంగా అనౌన్స్మెంట్స్ ఉంటున్నాయి. తొలుత ఈ మూవీలో హీరోయిన్గా దీపికా పదుకొణెను అనుకున్నాడు. ఈ మేరకు అనౌన్స్మెంట్ కూడా చేశారు. కానీ ఆమె పెట్టిన కండీషన్స్ నచ్చక..దీపిక స్థానంలో త్రిప్తి దిమ్రిని తీసుకున్నాడు. షూటింగ్ కూడా ప్రారంభించాడు. ఇప్పటికే 40 శాతం పూర్తయింది కూడా. ఈ విషయాన్ని తాజాగా ఓ ఈవెంట్లో స్వయంగా సందీప్ రెడ్డినే చెప్పాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ డార్క్ యాక్షన్ ఎంటర్నర్లో మరో బాలీవుడ్ భామ కూడా నటించబోతుందట. ఓ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్ని రంగంలోకి దించేందుకు సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఆమెను సంప్రదించి.. కథ వినిపించాడట. పాత్ర నచ్చడంతో కత్రినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఆమె పాత్రకు కేవలం రెండు రోజుల షూటింగ్ మాత్రమే ఉంటుదంట. అలా అని క్యామియో రోల్ కాదు. కథను మొత్తం పూర్తిగా మార్చేసే పాత్ర అట. అందుకే నిడివి తక్కువైనా కత్రినా ఓకే చెప్పిందట. దీనికి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి సందీప్ అయితే పెద్ద ప్లానే వేశాడు. చిన్న చిన్న పాత్రల కోసం కూడా స్టార్స్ని పెడుతున్నాడు. ఐశ్వర్య దేశాయ్ కూడా ఓ పాత్ర చేస్తుంది. విలన్ గా వివేక్ ఒబేరాయ్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం తొలిసారి ΄పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు ప్రభాస్. వచ్చే ఏడాది మార్చి 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో వరస విషాదాలు
టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో వరస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్తని కోల్పోయిన ఈయన.. ఇప్పుడు తన సోదరి చనిపోయిన విషయాన్ని వెల్లడించాడు. తన చిన్నక్క జ్యోతి గత 14 రోజులుగా న్యూమోనియాకి చికిత్స తీసుకుంటూ మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచారని పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: రష్మిక కోసం సుకుమార్ సెంటిమెంట్ బ్రేక్?)'నా ప్రియమైన చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర ఈ రోజు రాత్రి 9:45 గంటలకు విజయవాడలో స్వర్గస్తులయ్యారు. వైరల్ న్యూమోనియాతో గత 14 రోజులుగా చికిత్స పొందుతూ అనంత లోకాలకు వెళ్లిపోయారు. నా చిన్నప్పటి నుంచి తను నా అండ. ప్రేమగా నా కూతురి పెళ్లి దగ్గరుండి జరిపించి శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల దర్శనం చేసుకుని ఎంతో ఆనందపడిన మా అక్క ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకు ఇంత తొందరగా వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు' అని మెహర్ రమేశ్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.2023లో మెహర్ రమేశ్ తల్లి చనిపోగా, గతేడాది మార్చిలో అక్క కన్నుమూశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్త మృతి చెందగా ఇప్పుడు చిన్నక్కని కోల్పోయిన సంగతి ఈ దర్శకుడు బయటపెట్టారు. ఇలా మెహర్ రమేశ్ ఇంట్లో వరస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇకపోతే గత నెల ప్రారంభంలోనే మెహర్ రమేశ్ కుమార్తె పెళ్లి జరిగింది. ఈ దర్శకుడు చివరగా 2023లో వచ్చిన 'భోళా శంకర్' తీశారు. అప్పటినుంచి మరో ప్రాజెక్ట్ చేయలేదు.(ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలనటి దుర్మరణం) View this post on Instagram A post shared by Meher Raamesh (@meherramesh) -
ఉస్మానియాలో పావలా శ్యామల
హైదరాబాద్: సినీనటి పావలా శ్యామల ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యసేవలు అందుకుంటున్నారు. కొన్నేళ్ల నుంచి ఆమె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. పలు కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఆమె కూతురు ఇటీవల ఉస్మానియా ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు ఇన్ పేషంట్గా చేర్చుకున్నారు. -
అబద్ధాలు ప్రచారం చేయడంలో దేశం ఎంతో ముందుంది
తమిళనాడు సీఎం విజయ్ కథానాయకుడిగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయగన్’ సెన్సార్ వివాదాలు, విడుదల అడ్డంకులపై దర్శకుడు హెచ్. వినోద్ మంగళవారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో కులం, మతం ఆధారంగా అబద్ధాలను సృష్టించి ప్రచారం చేయడంలో దేశం ముందంజలో ఉందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ’ఎ’ సర్టిఫికెట్ వివాదం ఈచిత్రానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయని, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ’ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం విచారకరమన్నారు. అయితే దీనిపై చట్టపరంగా పోరాడటానికి తమకు తగినంత సమయం లేదని, ప్రజలే ఈ సినిమాకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అబద్ధాల ప్రచారంపై ఆవేదన ‘‘అబద్ధాలను సృష్టించడంలో దేశం ముందుంది. కులం, మతం పేరుతో అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారు. ఒక చిన్న అబద్ధం మనిషిని మూర్ఖుడిగా మార్చగలదు. ఇలాంటి వాటిని అరికట్టడానికి బలమైన చట్టాలు అవసరం. కేవలం సెన్సార్ బోర్డు మాత్రమే ఈ సినిమాను అడ్డుకోలేకపోయింది.’’ అని వ్యాఖ్యలు చేశారు. ఏ వ్యక్తినీ, పార్టీనీ లక్ష్యంగా చేసుకోలేదు జననాయగన్ ద్వేషానికి వ్యతిరేకంగా, సమాజంలో ఐక్యత , మహిళల పురోగతిని ఆకాంక్షిస్తూ తీసిన చిత్రం. ఇందులో ఏ వ్యక్తిని, ఏ రాజకీయ పార్టీని లేదా సంస్థను లక్ష్యంగా చేసుకోలేదన్నారు.. విజయ్ కూడా ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా విమర్శించకూడదని స్పష్టంగా చెప్పారని, ద్వేషానికి వ్యతిరేకంగా తీసిన సినిమాపై మళ్లీ ద్వేషాన్ని రుద్దడం సరికాదన్నారు. తన చివరి సినిమా ఎలా ఉండాలనే దానిపై విజయ్ కొన్ని స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయన్నారు. ఎన్నో కథలు విన్న తర్వాత ఆయన ఈ కథను ఎంచుకోవడానికి ప్రధాన కారణం సమాజం , మహిళా సాధికారతపై ఆయనకున్న తీవ్రమైన అభిరుచే అని వివరించారు. ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం విజయ్కు కృతజ్ఞతులు అని పేర్కొంటూ, ఆయనపై ఎనలేని ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని స్పష్టంచేశారు. కాగా, విజయ్ నటించిన ఈ చిత్రం 23 వతేదీ గురువారం దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. తమిళనాడులో థియేటర్లలో వారం రోజుల పాటుగా అన్ని టికెట్లు బుక్కయ్యాయి. -
యాక్షన్ మండాడి
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మండాడి’. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న రిలీజ్ కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ రిలీజ్ చేస్తోంది.‘‘ఈ సినిమా కోసం సుహాస్, సూరి బాగా మేకోవర్ అయ్యారు. ఈ చిత్రంలోని బోట్ సీక్వెన్స్లు, యాక్షన్ సీక్వెన్స్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మణికందన్ సహ–నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. -
జననాయకన్ రిలీజ్ ముందు పూజా హెగ్డేకు షాక్!
పూజా హెగ్డే కెరీర్పై మళ్లీ అనుకోని మబ్బులు కమ్ముకున్నాయి. వరుస ఫ్లాప్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ముద్దుగుమ్మ, తన ఆశలన్నీ జననాయకన్ సినిమాపైనే పెట్టుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందని ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ సూచిస్తున్నాయి. అయితే పూజా హెగ్డేకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండవని దర్శకుడు హెచ్. వినోద్ స్పష్టంగా ప్రకటించారు. జర్నలిస్టు పాత్రలో కనిపించే పూజా కోసం తొలుత అనేక సన్నివేశాలు రాసుకున్నప్పటికీ, నిడివి కారణంగా చాలావాటిని షూట్ చేయలేకపోయారు. షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను కూడా కత్తిరించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పూజాకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇక రీమేక్ అంశంపై కూడా దర్శకుడు స్పందించారు. జననాయకన్ సినిమా, తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి రీమేక్ అని అంగీకరించిన ఆయన, కథలో భారీ మార్పులు చేసి కొత్తగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ సినిమా జూలై 23 నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ను జారీ చేసింది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుండగా.. ప్రేమలు బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. -
'72 ఏళ్లలో కేవలం రెండు సినిమాలకే'.. డైరెక్టర్
లెక్కల్లో సున్నా మార్కులు తెచ్చుకునే తెలుగు పిల్లాడి కథే 35 చిన్న కథ కాదు మూవీ. ఈ ఏడాది కేంద్రం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘ఉత్తమ బాలల చిత్రం’గా ఈ సినిమా ఎంపికైంది. జాతీయ అవార్డ్ కొట్టేసి 35 కాదు.. ఏకంగా వంద మార్కులు సాధించింది. 2024 సెప్టెంబర్లో విడుదలై హిట్గా నిలిచింది. పిల్లల తెలివిని మార్కులతో కొలవ వద్దనే సందేశం నేటి అవసరంగా భావించి కమిటీ ఈ సినిమాను జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది.తాజాగా 35 చిన్న కథ కాదు మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్కు డైరెక్టర్ నంద కిశోర్ కూడా హాజరయ్యారు. తన సినిమాకు జాతీయ అవార్డ్ రావడం తనకు గర్వంగా ఉందన్నారు. దాదాపు 72 ఏళ్ల చరిత్రలో కేవలం రెండు సినిమాలకే నేషనల్ అవార్డ్స్ వచ్చాయని తెలిపారు. అప్పట్లో ఎన్టీఆర్, గుణశేఖర్ కాంబోలో వచ్చిన బాలా రామాయణం.. ఇప్పుడు మా సినిమానేనని వెల్లడించారు. ఈ విషయాన్ని తాను ఎప్పుడు గర్వంగానే చెప్పుకుంటానని నంద కిశోర్ ఆనందం వ్యక్తం చేశారు. -
'వాళ్లిద్దరు లేకపోతే ఇండస్ట్రీలో లేను..': వరుణ్ సందేశ్
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్లో బక్క పలచని కుర్రాడిలా అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా మెప్పించారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటిస్తోన్న మూవీ బ్లాక్మెయిల్. ఈ చిత్రానికి శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా నా వైఫ్ మిస్సింగ్ అనే మూవీ కూడా చేస్తున్నారు.ఈ నెల 21న వరుణ్ సందేశ్ తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఇండస్ట్రీలో దిల్ రాజు, అల్లరి నరేశ్ చాలా సాయం చేశారని గుర్తు చేసుకున్నారు. ఇంటర్ చదివే సమయంలో ఓ గ్రాసరీ షాప్లో పనిచేశా.. అంతేకాకుండా క్యాషియర్గా కూడా పని చేశానని వరుణ్ తెలిపారు.నా కెరీర్లో ఎత్తు, పల్లాలు చూశానని వరుణ్ సందేశ్ తెలిపారు. నా కెరీర్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు డీ ఫర్ దోపీడి మూవీలో దిల్ రాజు ఛాన్స్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు. అల్లరి నరేశ్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ గుర్తుంటుందని తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో నా కష్టాల్లో అండగా నిలిచిన వీరిద్దరిని ఎప్పటికీ మరిచిపోలేనని వరుణ్ సందేశ్ తన మనసులోని మాటలు పంచుకున్నారు. -
ది రాజాసాబ్ డైరెక్టర్ నెక్ట్స్ ప్రాజెక్ట్.. ఆ మెగా హీరోతోనే ప్లాన్..!
ప్రభాస్ ది రాజాసాబ్ తర్వాత దర్శకుడు మారుతి ఇప్పటి వరకు తన ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. గతేడాది డిసెంబర్లో వచ్చిన ది రాజాసాబ్ రెబల్ స్టార్ అభిమానులను నిరాశపర్చిన సంగతి తెలిసిందే. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది టాలీవుడ్లో చర్చ మొదలైంది.ప్రస్తుతం మారుతి తన నెక్ట్స్ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టినట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. తన తర్వాత మూవీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో ప్లాన్ చేస్తున్నారని లేటేస్ట్ టాక్. వరుణ్ హీరోగా ఓ కొత్త కథను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ది రాజాసాబ్ తర్వాత మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.కాగా.. వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఆ తర్వాత నిహారిక నిర్మిస్తున్న బరి అనే చిత్రంలో నటించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల అనంతరం మారుతి-వరుణ్ తేజ్ కాంబోలో మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందేమో వేచి చూడాల్సిందే. -
'ఎప్పటికైనా హీరో అవుతా..' మాస్టర్ అరుణ్ దేవ్
35- చిన్న కథ కాదు మూవీతో పాస్ మార్కులు కొట్టేసిన బాలనటుడు అరుణ్ దేవ్. తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు. ఉత్తమ బాల నటుడుగా మాస్టర్ వరుణ్ జాతీయ అవార్డు అందుకోనున్నారు. దీంతో అరుణ్ దేవ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. జాతీయ అవార్డ్ ప్రకటనతో అందరి కళ్లు వరుణ్పైనే పడ్డాయి.తాజాగా నిర్వహించిన ఈవెంట్లో మాట్లాడిన బాలనటుడు అరుణ్ దేవ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను ఎప్పటికైనా మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనేదే తన ఆశయమని తెలిపాడు. మా చెల్లి, నా పేరేంట్స్ సపోర్ట్తోనే ఈ మూవీ చేశానని వెల్లడించాడు. నా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా మా స్కూల్కు చాలా రుణపడి ఉంటానని చెప్పాడు. 35 చిన్న కథ కాదు... ఇది చాలా పెద్ద కథ.. సున్నాని దాటాము.. నేషనల్ అవార్డుకి చేరుకున్నాం అంటూ మాట్లాడాడు. 35 కథేంటంటే..లెక్కల్లో సున్నా మార్కులు తెచ్చుకునే తెలుగు పిల్లాడి కథ. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘ఉత్తమ బాలల చిత్రం’ గా ఎంపికై నూరు మార్కులు తెచ్చుకుంది. 2024 సెప్టెంబర్లో విడుదలై నోటిమాటతో హిట్టయిన ‘35 చిన్న కథ కాదు’. ఇప్పుడు ఢిల్లీలోనూ హిట్ కొట్టింది. పిల్లల తెలివిని మార్కులతో కొలవ వద్దనే సందేశం నేటి అవసరంగా భావించి కమిటీ ఈ సినిమాను అవార్డుతో గౌరవించింది. -
ది రాజాసాబ్ మేకర్స్ చేతికి స్పిరిట్.. అందుకేనా??
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. గతేడాది మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఈ హారర్ కామెడీ చిత్రం అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశపర్చింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ది రాజాసాబ్ మేకర్స్కు బిగ్ డీల్ కుదిరింది. ది రాజాసాబ్ నష్టాన్ని కొంచమన్నా తగ్గించుకోవడానికి అవకాశం ఇచ్చారు. రెబల్ స్టార్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ స్పిరిట్ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను ది రాజాసాబ్ మేకర్స్కు అప్పగించారు. 'స్పిరిట్' చిత్రానికి సంబంధించిన కర్ణాటక థియేట్రికల్ పంపిణీ హక్కులను పొందినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. ది రాజాసాబ్తో నష్టపోయిన నిర్మాతను ఆదుకునేందుకే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని తెలుస్తోంది.కాగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తోన్న యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ మూవీని పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని సందీప్ రెడ్డి వంగా ఇటీవలే వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుండగా.. త్రిప్తీ దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. టీ-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తోన్న స్పిరిట్ వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 🔥A LANDMARK ALLIANCE FOR A LANDMARK FILM 🔥We proud to announce our partnership with @asiansureshent to distribute #SPIRIT across Karnataka.❤️🔥Karnataka has always showered immense love on India's Biggest Superstar #Prabhas, and this time, we're all set to create history… pic.twitter.com/DH9y86RCKT— People Media Factory (@peoplemediafcy) July 21, 2026 -
బాలకృష్ణకు గాయం.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ట్వీట్
సినిమా షూటింగ్లో గాయపడ్డ నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరోలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్లో వేరు వేరుగా పోస్టులు పెట్టారు. ‘బాలా బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం, సామర్థ్యంతో తిరిగి ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నారు’అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. Get well soon Bala Babai. Wishing you a speedy recovery and good health. Looking forward to seeing you roar back in full form…— Jr NTR (@tarak9999) July 21, 2026‘బాయ్ మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మీరు అమితంగా ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్ మోడ్లోకి రావాలని కోరుకుంటున్నా’ అని కల్యాణ్ రామ్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. Get well soon Babai. ❤️Wishing you a speedy recovery. I'm sure you will be back in action in no time, doing what you love the most.— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) July 21, 2026కాగా, #NBK111(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్లో బాలకృష్ణ గాయపడ్డాడు.గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్లో జరుగుతోంది. అక్కడ మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో టీమ్.. బాలకృష్ణని ఆస్పత్రికి తరలించారు. మోకాలికి గాయమైననట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కాకినాడ పోర్ట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. -
హీరో బాలకృష్ణకు గాయాలు
టాలీవుడ్ హీరో బాలకృష్ణ గాయపడ్డారు. ఆయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్ట్లో జరుగుతోంది. అక్కడ మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో టీమ్.. బాలకృష్ణని ఆస్పత్రికి తరలించారు. మోకాలికి గాయమైననట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కాకినాడ పోర్ట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ‘వీర సింహారెడ్డి’ విజయం తర్వాత గోపిచంద్ మలినేని - బాలయ్య నుంచి వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో బాలయ్య గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. హీరోయిన్గా కాజల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. -
'టాక్సిక్' మరో రొమాంటిక్ సాంగ్.. గన్తో లవ్ ప్రపోజ్
'కేజీఎఫ్' తర్వాత యష్ హీరోగా నటిస్తున్న సినిమా 'టాక్సిక్'. వచ్చే నెల 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ గ్యాంగస్టర్, యాక్షన్ ఎంటర్టైనర్గా తీశారు. గీతూ మోహన్ దాస్ దర్శకురాలు కాగా నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషీ హీరోయిన్లుగా నటించారు.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా)ఈ సినిమా నుంచి తొలుత వచ్చిన టీజర్లో శృంగరభరిత కంటెంట్ని ఎంతలా చూపించారో తెలిసిందే. తర్వాత వచ్చిన 'తబాహి' అనే పాటలోనూ యష్-కియారా తమదైన శైలిలో రొమాన్స్ పండించారు. ఇప్పుడు తాజాగా 'మనసాగదే' అంటూ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో యష్-తారా సుతారియా అలానే రొమాన్స్ పండించారు. బాత్ టబ్లో గన్తో ప్రపోజ్ చేసిన సీన్ వెరైటీగా అనిపించింది.'టాక్సిక్' ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే యాక్షన్ కంటే గ్లామరస్ రొమాన్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారా అని సందేహం కలుగుతోంది. ఇప్పటివరకు అయితే మూవీపై పెద్దగా అంచనాలు లేవు. రిలీజ్కి ఎలానూ మరో నెల రోజులు టైముంది. ఆ లోపు ట్రైలర్ వల్ల ఏమైనా హైప్ పెరుగతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా సోషల్ మీడియాలోకి రాను) -
ప్రెగ్నెన్సీ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన 'బిగ్బాస్' శుభశ్రీ
తెలుగు బిగ్బాస్ 7వ సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో శుభశ్రీ రాయగురు ఒకరు. స్వతహాగా ఒడియా అమ్మాయి, లాయర్ అయినప్పటికీ తెలుగు సినిమాల్లో నటిగా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే ఒకటి రెండు మూవీస్లోనూ కనిపించింది. కానీ సక్సెస్ ఏం రాలేదు. ఇదే టైంలో ఆస్ట్రేలియాలో ఉంటున్న అజయ్ అనే భారతీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)గతేడాది జూన్లో తన పెళ్లి సంగతి బయటపెట్టింది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించలేదు. చాన్నాళ్ల తర్వాత గత వారం పదిరోజుల నుంచి అడపాదడపా పోస్టులు పెడుతోంది. అయితే గతంతో పోలిస్తే ఈమె కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో శుభశ్రీ ప్రెగ్నెన్సీతో ఉందా అని పలువురు ఫాలోవర్లు కామెంట్స్ చేశారు. దీంతో శుభశ్రీ ఏకంగా ఓ వీడియో పోస్ట్ చేసింది. 'మీరు ప్రెగ్నెంటా' అని పదేపదే కామెంట్ పెడుతున్న సదరు నెటిజన్కి కౌంటర్ ఇచ్చింది. అదే టైంలో తానేం ప్రెగ్నెన్సీతో లేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: 'జన నాయగన్' 50 శాతమే రీమేక్.. వేరే కథ విజయ్కి చెబితే) View this post on Instagram A post shared by Subhashree Rayaguru (@subhashree.rayaguru) -
ఫౌజీ @ 40
‘స్పిరిట్’ సినిమా షూటింగ్ అనుకున్నట్లుగానే సజావుగా సాగుతోందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలిపారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్రాజ్, కాంచన, వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం తొలిసారి ΄పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు ప్రభాస్. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు.అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ–‘‘ఫౌజీ’ సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. మిగతా షూటింగ్ను కూడా ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే చిత్రీకరిస్తాం’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం వెకేషన్ లో భాగంగా విదేశాల్లో ఉన్నారు ప్రభాస్. ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ‘ఫౌజీ’ చిత్రీకరణలో పాల్గొంటారు.ఈ చిత్రం డిసెంబరు 3న రిలీజ్ కానుంది. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘స్పిరిట్’. ‘ఫౌజీ’ సినిమాలో తన షూటింగ్ పూర్తయిన తర్వాత జెట్ స్పీడ్తో ‘స్పిరిట్’ చిత్రీకరణను పూర్తి చేస్తారు ప్రభాస్. ఈ చిత్రం 2027 మార్చి 5న రిలీజ్ కానుంది. ‘స్పిరిట్’ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక ‘కల్కి 2’ సినిమా షూట్లో ప్రభాస్ జాయిన్ అవుతారు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్ షురూ
‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీతో దర్శకుడిగా హిట్ అందుకున్న సాయిలు కంపాటి దర్శకత్వంలో రెండో సినిమా షురూ అయింది. ఈ మూవీలో సుమంత్ ప్రభాస్ హీరో. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై పుస్కూర్ రామ్మోహన్ రావు, భరత్ నారంగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో పూజ తో ప్రారంభమైంది.ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శేఖర్ కమ్ముల కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో అడివి శేష్ క్లాప్ కొట్టారు. తొలి షాట్ను సాయిలు కంపాటి డైరెక్ట్ చేయగా, సదానంద్ స్క్రిప్ట్ను మేకర్స్కు అందించారు. ‘‘చిన్న పట్టణం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రేమకథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ , ఎంటర్టైన్ మెంట్కు ప్రాధాన్యం ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
థ్రిల్ రెడీ
నూతన తారలతో ఎస్కే బషీద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం ‘ఆమెన్’. రేగుల నీరజారాణి సమర్పణలో ఎస్బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.ఈ సంద ర్భంగా ఎస్కే బషీద్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, థ్రిల్, హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఆమెన్’. ఇప్పటి వరకు వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్ను పూర్తిగా మార్చేలా మా మూవీ రూపొందించాం. సరికొత్త సస్పెన్స్, భయానక అంశాలతో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాం. కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన ఒక భయానక అనుభవం. ఈ సినిమాపై పూర్తి నమ్మకం ఉండటంతో మేమే విడుదల చేస్తున్నాం’’ అన్నారు. -
పుట్టినరోజు ప్రత్యేకం
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ జనార్థన’. ‘రాజావారు రాణిగారు’ మూవీ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సోమవారం(జూలై 20న) రవికిరణ్ కోలా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ‘రౌడీ జనార్థన’ సెట్స్ నుంచి ఆయన వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు మేకర్స్.‘‘రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా ‘రౌడీ జనార్థన’ సినిమా రూపొందుతోంది. ‘దిల్’ రాజు, శిరీష్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రవికిరణ్ ఎంతో ప్యాషనేట్గా, కాన్ఫిడెంట్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్పై చూసేందుకు విజయ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబరులో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ సి చంద్రన్. -
ది ఒడిస్సీకి మిస్... వారణాసికి ప్లస్?
క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన దిఒడిస్సీ భారతదేశ వ్యాప్తంగా సంచలన కలెక్షన్లు సాధిస్తూ సాగిపోతోంది. ఐమ్యాక్స్ ఫార్మాట్లో రూపొందిన చిత్రంగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ సినిమాను ఐమ్యాక్స్ తెరపై చూడడం ఒక ప్రత్యేక అనుభవంగా ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే హైదరాబాద్ ప్రేక్షకులకు మాత్రం అది అందుబాటులో లేకపోవడం అత్యున్నత వీక్షణానుభవాన్ని ఆశించేవారిని నిరుత్సాహ పరుస్తోంది.ఒకప్పుడు ఐమ్యాక్స్ తెరకు చిరునామాగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఆ తర్వాత ఆ అనుభవం తెరమరుగు కావడం తెలిసిందే. దాంతో ప్రస్తుతం హైదరాబాద్లో ఐమ్యాక్స్ స్క్రీన్ లోటు ఏర్పడింది. మరోవైపు ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో లాగా ది ఒడిస్సీ పూర్తి అనుభవాన్ని ఆస్వాదించే మిస్ అవుతున్నామని సినీ అభిమానులు అంటున్నారు. అల్లు సినిమాస్ తో ఊరట...ఐకాన్స్టార్ అల్లు అర్జున్ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభమైన అల్లు సినిమాస్ ది ఒడిస్సీ అభిమానులను ఆదుకుంటోంది. మల్టీప్లెక్స్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ప్రేక్షకులకు అత్యున్నత శ్రవణ అనుభూతిని అందిస్తోంది. ఇప్పటిదాకా పలు చిత్రాలు ఈ థియేటర్లో ప్రదర్శితమైనప్పటికీ... ధియేటర్ ‘డాల్బీ’ సాంకే తిక సామర్ధ్యాన్ని పూర్తి స్థాయిలో అనుభూతించడం ది ఒడిస్సీ ద్వారానే సాధ్యమైందని ప్రేక్షకులు అంటున్నారు.ఈ సినిమాలోని సముద్ర అలల గర్జన, యుద్ధ సన్నివేశాల సందర్భంగా నేపథ్య సంగీతపు పూర్తి అనుభవాన్ని 3డీ ఆడియో ద్వారా సంపూర్ణంగా ఆస్వాదించగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ముందునుంచే కాకుండా పక్కల నుంచి, వెనుక నుంచి, పై భాగం నుంచి కూడా ప్రవహించే శబ్ధ తరంగాల అనుభూతి ది ఒడిస్సీ ప్రేక్షకులకు వీనుల విందు చేస్తోంది. ఏది ఏమైనా గొప్ప గొప్ప చిత్రాలను ఆస్వాదించడానికి అదే స్థాయి సాంకేతిక సామర్ధ్యం కలిగిన థియేటర్లు కూడా తప్పనిసరి అని ది ఒడిస్సీ మరోసారి స్పష్టం చేస్తోంది.ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న దర్శక థీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్బాబుల వారణాసి కోసమైనా ఐమ్యాక్స్ను హైదరాబాద్లో కొలువుదీర్చాల్సిన అవసరం కనిపిస్తోంది. త్వరలోనే ఐమ్యాక్స్ తెరను హైదరాబాద్కు తెస్తామని ఇటీవల ఏషియన్ మూవీస్ ప్రకటించింది. ఆ ప్రకటన కార్యరూపం దాలిస్తే... ది ఒడిస్సీని మిస్సయినా, వచ్చే ఏడాది విడుదల కానున్న వారణాసిని అత్యద్భుతమైన దిగ్గజ తెరపై ఆస్వాదించే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కుతుంది. -
ఎట్టకేలకు మారుతికి 'మెగా' హీరో సెట్?
రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘రాజాసాబ్’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించలేక పోయింది. అనంతరం ప్రభాస్ ఎప్పట్లానే తన సినిమాలతో బిజీ అయిపోయాడు. కానీ మారుతి మాత్రం చాలా కాలం పాటు ట్రోలింగ్కు గురైయ్యాడు. ఆ సినిమా ప్రమోషన్ సమయంలో ఇచ్చిన సవాళ్లు, స్టేట్మెంట్లు ఆయనపై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ తెచ్చాయి. అయితే, ఇటీవల ఆయన కొత్త స్క్రిప్ట్ పనిలో ఉన్నానని, దానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నానని ప్రకటించారు.ఇప్పుడు ఆ స్క్రిప్ట్కి సరిపోయే హీరోను మారుతి ఫైనల్ చేసినట్టుగా టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆయన తదుపరి చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా తర్వాత, తన చెల్లెలు నిహారిక నిర్మాతగా తెరకెక్కుతున్న ‘బరి’ సినిమాలో నటించాల్సి ఉంది. ఆ సినిమాతో పాటు మారుతి చేయబోయే చిత్రానికి కూడా వరుణ్ తేజ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. వీలైనంత రీజనబుల్ బడ్జెట్లో,మంచి కథతో ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మారుతికి అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాత ఈ ప్రాజెక్ట్ను నిర్మించనున్నాడని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
ఒడిస్సీలా మనం ఎందుకు చేయలేం: నాగార్జున ఆసక్తికర కామెంట్స్
అక్కినేని అఖిల్ మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన యాక్షన్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచే కలెక్షన్స్ పరంగా దూసుకెళ్లింది. ఏజెంట్ తర్వాత అఖిల్కు హిట్ పడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాజరైన నాగార్జున టాలీవుడ్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.ముఖ్యంగా సినిమా రిలీజ్ డేట్స్ విషయంపై నాగార్జున కాస్తా ఘాటు కామెంట్స్ చేశారు. ఒడిస్సి మూవీ ఏడాది కిందట రిలీజ్ డేట్ ప్రకటించి అదే తేదీకి విడుదల చేశారు. కానీ మనం రిలీజ్ డేట్ ప్రకటించినా ఆ టైమ్కు రిలీజ్ చేయలేకపోతున్నామని అన్నారు. లెనిన్ విషయంలోనూ అదే జరిగిందని తెలిపారు. గతంలో నెల రోజుల ముందే రిలీజ్ కాపీని చూసేవాళ్లమని నాగ్ వెల్లడించారు. ఇప్పుడు అలా ఎందుకు చూడలేకపోతున్నామనేదే నా ప్రశ్న అని అన్నారు. ప్రకటించిన తేదీకే అందరు సినిమాలను విడుదల చేస్తే బాగుంటుందని నాగార్జున తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమాను కనీసం రెండు వారాల ముందు ఇస్తే బాగుంటుందని నాగ్ అన్నారు. Lenin Blockbuster Mikela Undho Theliyadhu Kani Naku, Chaitanya Ki, Akhil Ki Pandaga Laa Undhi, Illantha Kalakalalaaduthundhi - King @iamnagarjuna speech @ #LENIN Blockbuster Vaibhavam Event ❤️🔥 #BlockbusterLENIN 📷🌋 pic.twitter.com/bw3bAtC4ca— Annapurna Studios (@AnnapurnaStdios) July 20, 2026 -
ప్రభాస్ ఫౌజీ.. రెబల్ స్టార్ పవర్ఫుల్ రోల్..!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఫౌజీ. ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇందులో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్యం కోసం ఆయన చేసే పోరాటమే ప్రధానంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ ముందుగా బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసి.. ఆ తర్వాత సుభాశ్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరుతాడని తెలుస్తోంది. ఇది కేవలం నేతాజీ బయోపిక్ మాత్రమే కాదని.. అంతే కాకుండా ఇండియన్ ఫ్రీడమ్ కోసం పోరాడిన సైనికుల కథను చూపించే చిత్రంగా ఉండనుందని టాక్. ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ధైర్య సాహసాలు, త్యాగం, దేశభక్తితో నిండి ఉంటుందని సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ చిత్రాన్ని డిసెంబరు 3న ఫౌజీ విడుదల కానుందని తాజాగా పోస్టర్ను పంచుకుంది.ఈ పోస్టర్లో ఎప్పుడు చూడని లుక్లో ప్రభాస్ కనిపించారు. దీంతో అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ మూవీ డిసెంబర్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ప్రభాస్ ఫౌజీతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో స్పిరిట్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆ తర్వాత సలార్: పార్ట్ 2, కల్కి 2898 ఏడీ: పార్ట్ 2 సినిమాలు చేస్తున్నారు. अज्ञातपर्व ENDS. THE REBELLION BEGINS 🔥#Fauzi GRAND RELEASE WORLDWIDE ON 3rd DECEMBER 2026 ❤️🔥#FauziOnDec3Rebel Star #Prabhas#Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma @rckamalakannan… pic.twitter.com/IUQaZLPb2Y— Fauzi (@FauziTheMovie) July 16, 2026 -
'ఆయనే అలా అంటే నేను తోపే కదా'.. నిహారిక కొణిదెల
'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నిర్మాత నిహారిక కొణిదెల స్పందించారు. నా సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో రుద్రవీణకు నాగబాబు అవార్డు అందుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా తన సినిమాకు అవార్డ్ రావడంపై చిరంజీవి, సురేఖ ప్రశంసించారని నిహారిక ఆనందం వ్యక్తం చేసింది.నన్ను చూస్తుంటే గర్వంగా ఉందని పెదనాన్న చిరంజీవి అనడంపై నిహారిక ఆనందం వ్యక్తం చేసింది. మన ఇండస్ట్రీకి ఇది గొప్ప గర్వకారణమన్నారు. ఆయనే మన ఇండస్ట్రీకి ప్రైడ్ అని ఫీలవుతుంటానని తెలిపింది. ఆయన నన్ను తోపు అంటుంటే.. నేను కూడా నిజంగానే తోపు అని ఫీలవుతా కదా అని సరదాగా మాట్లాడింది.కాగా.. నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. డిఫరెంట్ కంటెంట్తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీకి జాతీయ అవార్డ్ దక్కింది. -
‘నా క్యారెక్టర్ వచ్చేది అప్పుడే.. కల్ట్పై విశ్వక్ సేన్ కామెంట్స్'
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ కల్ట్. ఈ మూవీకి తానే సొంతంగా కథ రాసుకోవడమే కాదు..డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఈ మూవీని కరాటే రాజు, సందీప్ కాకర్ల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. హీ ఈజ్ మై దోస్తీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ అనేది ఇంటర్వెల్లో వస్తుందని తెలిపారు. ఈ మూవీ ద్వారా నేను 150 మందికి పైగా కొత్తవారిని పరిచయం చేస్తున్నానని విశ్వక్ వెల్లడించారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్లోపు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు విశ్వక్ సేన్ తెలిపారు. ఈ నగరానికి ఏమైంది-2 రిలీజైన తర్వాతే కల్ట్ మూవీ వస్తుందన్నారు. కాగా.. ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా న్యూ ఏజ్ పార్టీ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నారు. -
విలేజ్ స్టైల్లో మెగాహీరో మాస్ పాట
మెగాహీరోల్లో వరుణ్ తేజ్ ఒకడు. ముకుంద, ఫిదా, తొలిప్రేమ, కంచె లాంటి సినిమాలతో కెరీర్ ప్రారంభంలో సమ్థింగ్ డిఫరెంట్ అనిపించుకున్నాడు. తర్వాత నుంచి వరసపెట్టి ఫ్లాప్స్ పడ్డాయి. 2019లో వచ్చిన 'గద్దలకొండ గణేశ్' ఓ మాదిరిగా ఆకట్టుకోగా.. తర్వాత వచ్చిన గని, గాంఢీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మాట్కా చిత్రాలు ఒకదానిని మించి మరొకటి డిజాస్టర్స్ అయ్యాయి.(ఇదీ చదవండి: ఎప్పటికీ నువ్వు నా లిటిల్ స్టార్వే.. సితార గురించి మహేశ్)దీంతో రెండేళ్లు గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న సినిమా 'కొరియన్ కనకరాజు'. వచ్చే నెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. వారం క్రితం టీజర్ రిలీజ్ చేయగా పర్లేదనిపించుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రసగుమ్మడి' అంటూ ఓ పాట వదిలారు. విలేజ్ స్టైల్లో సాగే మాస్ బీట్తో ఉన్న ఈ గీతం కలర్ఫుల్గా బాగుంది. తమన్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. ఇకపోతే ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. రితికా నాయక్ హీరోయిన్.(ఇదీ చదవండి: అక్క 'జబర్దస్త్' కమెడియన్.. చెల్లి ఏమో రాకెట్ ఇంజినీర్) -
శ్రీనివాస మంగాపురం.. క్రేజీ లవ్ సాంగ్ రిలీజ్
ఘట్టమనేని జయకృష్ణ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మూవీ టీమ్. తాజాగా ఈ చిత్రంలోని ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలోని రావే చెలియా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ మూవీలో రషా తడానీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ పాటకు నాగ్ అర్జున్ రెడ్డి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ను కపిల్ కపిలన్ ఆలపించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. -
అక్క టాలీవుడ్ కమెడియన్.. చెల్లి ఏమో రాకెట్ ఇంజినీర్
సాధారణంగా ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి వస్తే వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఇందులోకి వచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. దాదాపుగా ఇదే జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం కాస్త నటీనటుల కుటుం సభ్యులు.. భిన్నమైన రంగాల్లోకి ప్రవేశించి ఆశ్చర్యపరుస్తుంటారు. 'జబర్దస్త్' ఫేమ్ సత్యశ్రీ చెల్లి కూడా ఇప్పుడు రాకెట్ ప్రయోగంలో భాగమైంది. స్వయంగా ఈమె ఫొటోలు బయటపెట్టడంతో ఈ సంగతి బయటపడింది.'జబర్దస్త్' షోలో చమ్మక్ చంద్ర కాంబోలో చేసిన సత్యశ్రీ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. ఈమె తల్లి కూడా ఒకప్పుడు నటిగా చేసింది. అలా ఇండస్ట్రీతో బాండింగ్ ఉన్న వీళ్ల ఇంటి నుంచి ఓ రాకెట్ ఇంజినీర్ వచ్చింది. ఆమెనే సత్యశ్రీ చెల్లి కీర్తిశ్రీ. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ సంస్థ 'స్కైరూట్ ఏరోస్పేస్' ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగంలో కీర్తి శ్రీ కీలక పాత్ర పోషించింది.శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్ర నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ 'విక్రమ్-1'.. రీసెంట్గా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక మిషన్లో భాగమైన ఇంజినీర్లలో సత్యశ్రీ చెల్లి కీర్తి శ్రీ కూడా ఒకరు. ఈ రాకెట్ కోసం ఏవియానిక్స్ ఇంజనీర్గా, ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వర్తించింది. చెల్లి కీర్తి.. రాకెట్తో పాటు ఉన్న ఫొటోలని పంచుకున్న సత్యశ్రీ భావోద్వేగానికి గురైంది.ఈ రోజు నేను కేవలం ఒక రాకెట్ని మాత్రమే చూడటం లేదు. నా చెల్లి కలలు ఆకాశంలోకి ఎగరడాన్ని చూస్తున్నా. 'మిషన్ ఆగమన్' రాకెట్పై నా చెల్లి సంతకం చేస్తుంటే ఒక అక్కగా నాకు ఎంతో గర్వంగా ఉంది. చిన్నప్పుడు నక్షత్రాలని వింతగా చూసిన నా చిన్నారి యువరాణి.. ఈ రోజు ఆ నక్షత్రాల వైపు ప్రయాణించే రాకెట్ని నిర్మించే స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ ఉంది అని సత్యశ్రీ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Satya Sri (@me_satyasri) View this post on Instagram A post shared by Satya Sri (@me_satyasri) -
ఎప్పటికీ నువ్వు నా లిటిల్ స్టార్వే.. సితార గురించి మహేశ్
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు ముద్దుల కూతురు సితార.. 14వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే మహేశ్ ఓ స్పెషల్ ఫొటో పంచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడిది అభిమానులని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'నువ్వు ఎంత ఎదిగినా సరే ఎప్పటికీ నా లిటిల్ స్టార్వే. పుట్టినరోజు శుభాకాంక్షలు సితార. రాబోయే ఏడాది అద్భుతంగా ఉండాలని అనుకుంటున్నా. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అని మహేశ్ బాబు, సితార గురించి రాసుకొచ్చాడు.మహేశ్ బాబుతో పాటు తల్లి నమ్రత, అన్నయ్య గౌతమ్ కూడా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్దయ్యాక హీరోయిన్ అవుతానని చాన్నాళ్ల క్రితమే చెప్పిన సితార.. అందుకు తగ్గట్లే యాక్టింగ్, డ్యాన్స్ నేర్చుకునే పనిలో ఉంది. ఇప్పటికే సాంగ్స్, యాడ్ షూట్స్ చేసింది.(ఇదీ చదవండి: 'ఒడిస్సీ'లో చూపించినవి నిజమైన లొకేషన్లే.. ఏది ఎక్కడంటే?)Forever my little star... no matter how much you grow. ❤️❤️❤️Happy 14 Sitara!!! ❤️❤️❤️ Have the most amazing year ahead….Love you always ❤️❤️❤️ pic.twitter.com/FnEldmotTV— Mahesh Babu (@urstrulyMahesh) July 20, 2026 -
జాతీయ వేదికపై సత్తాచాటిన హీరో రాగ్ మయూర్
ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, మట్టి వాసన వెదజల్లే పాత్రలతో మెప్పిస్తున్న మన తెలుగు నటులు నేడు జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నారు. తనదైన సహజ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటుడు రాగ్ మయూర్.. ముంబై వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక 'నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్' వేడుకలో ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నాడు. అమెజాన్ ఒరిజినల్ అయిన 'సివరపల్లి' వెబ్ సిరీస్లో ఆయన పోషించిన పాత్రకు ఈ గుర్తింపు లభించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)దేశవ్యాప్తంగా సినీరంగంలో ఉన్న ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో రాగ్ మయూర్ సందడి చేశారు. బాలీవుడ్ దిగ్గజ నటులు మనోజ్ బాజ్పేయి, బోమన్ ఇరానీ లాంటి స్టార్లతో పాటు దర్శక ద్వయం రాజ్ & డీకే లాంటి ప్రముఖులతో కలిసి ఆయన ఒకే వేదికను పంచుకోవడం విశేషం. (ఇదీ చదవండి: కెరీర్లో మొదటి హిట్.. భాగ్యశ్రీ రెమ్యునరేషన్ డబుల్!) -
బొడ్డు, నడుము ఫాంటసీ.. చాలా మారింది
భారతీయ సినిమాల్లో మరీ ముఖ్యంగా దక్షిణాదిలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు,తమిళంలో స్టార్ హీరోలతో దాదాపుగా నటించింది. 'మగధీర' మూవీ ఈమెని ఓవర్ నైట్ స్టార్ చేస్తే తర్వాత వచ్చిన పలు చిత్రాలు ఈమెని స్టార్ హీరోయిన్గా నిలబెట్టాయి. అలా నటిగా ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడే 2020లో గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్)పెళ్లి, పిల్లలు కారణంగా కొన్నాళ్ల గ్యాప్ తీసుకుంది. కానీ గత కొన్నేళ్లలో మళ్లీ నటిగా యాక్టివ్ అయిపోయింది. తెలుగులో బాలకృష్ణ సరసన ఓ మూవీ చేస్తోంది. మరోవైపు హిందీలో రామాయణ, ది ఇండియా స్టోరీ చిత్రాల్లోనూ నటించింది. ది ఇండియా స్టోరీ.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలో ఇస్తోంది. ఈ సందర్భంగా దక్షిణాది గురించి కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.దక్షిణాదిలో హీరోయిన్ బొడ్డు, నడుము చూపించడానికి ఆసక్తి చూపుతారనే ప్రశ్నకు కాజల్ బదులిస్తూ.. ఇంతకు ముందు అలాంటి అపోహ ఉండేదేమో గానీ గత కొద్దికాలంగా దక్షిణాది సినిమా అలాంటి విషయాల్లో చాలా మారిపోయిందని చెప్పుకొచ్చింది. గతంలో తమన్నా, తాప్సీ లాంటి వాళ్లు దక్షిణాది చిత్రపరిశ్రమతో సాయంతో స్టార్స్గా ఎదిగి తర్వాత మనపైనే విమర్శలు చేశారు. కాజల్ మాత్రం గుర్తింపు తీసుకొచ్చిన ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తోంది.(ఇదీ చదవండి: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ప్రేమలో బ్రేకప్?) -
శ్రీరాముడు పాత్ర చేయడం నా అదృష్టం: రణ్బీర్ కపూర్
రామాయణం ఆధారంగా రూపొందిన తాజా హిందీ సినిమా ‘రామాయణ’. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది దీపావళికి ‘రామాయణ: పార్ట్ 1’, వచ్చే ఏడాది దీపావళికి ‘రామాయణ: పార్ట్ 2’ విడుదల కానున్నాయి. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటించారు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్నారు. తొలి భాగం ట్రైలర్ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా, ఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరిట వేడుక నిర్వహంచి, ఈ సినిమా హిందీ 3డీ ట్రైలర్ను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి యోగా గురువు రామ్దేవ్ బాబా అతిథిగా హాజరై, ట్రైలర్ నచ్చిందని చెప్పి, ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో రణ్బీర్ మాట్లాడుతూ– ‘‘రామానంద్ సాగర్గారు తీసిన ‘రామాయణం’ (సీరియల్)లో శ్రీరాముడిగా అరుణ్ గోవిల్గారు అత్యద్భుతంగా నటించారు. తరాలుగా శ్రీరాముడి పాత్రలో అరుణ్గారిని చూసి, ప్రేక్షకులు స్ఫూర్తి పొందారు. నేను చిన్నప్పట్నుంచి శ్రీ రాముడి కథలు వింటూ, ఆయన నామస్మరణ, ఆశీస్సులతో పెరిగాను. అలాంటి శ్రీరాములవారి పాత్రను పోషించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.సాయిపల్లవి మాట్లాడుతూ– ‘‘సీతమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం. ఆ సీతమ్మే నాతో ఆమె పాత్ర చేయిస్తుందని, సీతమ్మకు కావాల్సినట్లుగా నా చేత నటింపజేసుకుంటుందని నమ్మి నేను ఈ రోల్ చేశాను. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నించాను’’ అన్నారు. యశ్ మాట్లాడుతూ– ‘‘మన శ్రీరాముడి కథను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతో ఈ ‘రామాయణ’ చేశాం’’ అని అన్నారు.‘‘మన గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన ‘రామాయణం’ని ప్రపంచంతో పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం’’ అని తెలిపారు నమిత్ మల్హోత్రా. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు రామాయణంలోని భావోద్వేగం, మానవత్వం, వేల సంవత్సరాలుగా దాన్ని చిరస్థాయిగా నిలబెట్టిన ఆత్మను కూడా అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు నితీష్ తివారి. ఈ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, రవి దూబే, అరుణ్ గోవిల్, శోభన, అజింక్య, కునాల్ కపూర్, రకుల్ ప్రీత్ తదితరులు పాల్గొన్నారు. -
గాన కోకిల జానకమ్మకు జన గాన ఘన నీరాజనం
ఒక్కటే గొంతు... దాదాపు ఇరవై భాషల్లో 45 వేల కంటే ఎక్కువ పాటలను ఆలపించి, ఆరు దశాబ్దాలుగా కోట్లాది మంది హృదయాలను మురిపించిన కమ్మని కంఠం మన శిష్టాల జానకమ్మ. ఈ అమర గాన కోకిల భౌతికంగా దూరమైనా, ఆవిడ పంచిన గానామృతం తరతరాల పాటు విశ్వమంతటా మారు మోగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో సంగీత సామ్రాజ్ఞి ఎస్. జానకి స్మరణార్థం ‘సాక్షి డిజిటల్’ సగర్వంగా ‘జన గాన ఘన నీరాజనం’ పేరిట ఒక అపూర్వమైన డిజిటల్ నివాళి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.జానకమ్మకు మనసారా వీడ్కోలు పలుకుతూ, ఆమె జ్ఞాపకాలను పదిలపరచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ ఈ వేదిక ద్వారా ఒకే తాటిపైకి తెస్తోంది. ఈ మహోన్నతమైన కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి సంగీత ప్రియులు, అభిమానులు తమకు నచ్చిన జానకమ్మ పాటను గానీ, ఆవిడ గురించిన మాటలను గానీ ఒక నిమిషం పాటు రికార్డ్ చేసి #tribute2 janaki పేరిట అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఇలా దేశ విదేశాల నుండి వచ్చే అభిమానుల సందేశాలను, గీతాలను క్రోడీకరించి ఆగస్టు 21న ప్రత్యేక నీరాజన కార్యక్రమంగా ‘సాక్షి డిజిటల్’ ప్రసారం చేయనుంది. ఆ మధుర గాయని వైభవాన్ని, సంగీత ప్రస్థానాన్ని స్మరించుకుంటూ సగర్వంగా సమర్పించే ఈ స్వరార్చనలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం. -
జానీ మాస్టర్కి ఉపశమనం
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి ఉపశమనం లభించింది. ఈయనపై విధించిన బహిష్కరణను ఉపసంహరించుకున్నట్లు తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆదివారం ప్రకటించింది. జానీ మాస్టర్తో పాటు డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందినట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ చెప్పారు.(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్)ఫెడరేషన్ కార్యాలయంలో నిర్మాతల మండలి నుంచి చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్, దర్శకుల సంఘం నుంచి సాయి రాజేష్తో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించిన ఫిలిం ఫెడరేషన్.. డాన్సర్ల వేతనాల చెల్లింపు వివాదంలో జానీ మాస్టర్, సుమలతా దేవితో సుదీర్ఘంగా చర్చించారు. ఇరువైపులా సమస్యకు ముగింపు పలికేలా నిర్ణయం తీసుకున్నారు.డాన్సర్స్ అసోసియేషన్ రాజీనామా చేసినా.. ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్తో కలిసి ముందుకు వెళ్లాలని ఫెడరేషన్ సుమలత దేవికి సూచించింది. డాన్సర్ల కష్టం దుర్వినియోగం కాకూడదన్న తమ పోరాటానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవికి జానీ మాస్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.(ఇదీ చదవండి: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ప్రేమలో బ్రేకప్?) -
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ప్రేమలో బ్రేకప్?
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, డేటింగ్, పెళ్లి, బ్రేకప్, విడాకులు లాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి కొన్నాళ్ల క్రితం ప్రేమ వార్తలు వైరల్ అయ్యాయి. తమిళ హీరో ధ్రువ్ విక్రమ్తో డేటింగ్ చేస్తుందనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అతడికి బ్రేకప్ చెప్పేసిందా అని సందేహం కలుగుతోంది. అనుపమ పెట్టిన తాజా పోస్ట్ దీనికి కారణం.(ఇదీ చదవండి: 'స్పిరిట్' క్రేజీ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా)స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న అనుపమ.. తమిళంలోనూ పలు మూవీస్ చేసింది. అయితే 'బైసన్' చేస్తున్న టైంలో హీరోహీరోయిన్లు అయిన ధ్రువ్ విక్రమ్, అనుపమ మధ్య నిజ జీవితంలో ప్రేమ పుట్టిందనే టాక్ బయటకు వచ్చింది. అందుకు తగ్గట్లే కొన్ని వ్యక్తిగత ఫొటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే ఇది నిజమా కాదా అనే సంగతి పక్కనబెడితే లేటెస్ట్గా అనుపమ.. బ్రేకప్ తర్వాత తనకు స్వాతంత్ర్యం వచ్చిందనే అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ పెట్టింది.ఫొటోలు పోస్ట్ చేసినందుకు సారీ చెబుతూ.. ఇది పెట్టేముందు ఎవరి అనుమతి అడగాల్సిన అవసరం లేకపోయిందని, వీటికి బ్యాక్ గ్రౌండ్ సాంగ్ సెలక్షన్ కోసం, ఇంకెవరో క్యాప్షన్ పెడతారని ఎదురుచూడటం లాంటివేం లేవని అనుపమ క్యాప్షన్ పెట్టింది. ఇక మరో పోస్టులో.. ఈ రోజు ప్రశాంతత నన్ను చేరుకుంది. ఒకప్పుడు నాదేనని మరిచిపోయిన జీవితాన్ని మరోసారి ప్రేమించడం ప్రారంభించా. మీ అందరినీ నేను ఎంతో ప్రేమిస్తున్నా. ఇకపై నా జీవితం పూర్తిగా నాదే అని రాసుకొచ్చింది. దీంతో అనుపమ బ్రేకప్ రూమర్స్ నిజమేనా అని మాట్లాడుకుంటున్నారు.అనుపమ సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్యే 'మరీచిక', లాక్ డౌన్ లాంటి సినిమాలతో వచ్చింది గానీ ఫ్లాప్స్ ఎదుర్కొంది. ప్రస్తుతం శర్వానంద్ సరసన 'భోగి' మూవీ చేస్తోంది. ఇది ఆగస్టులో థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
'స్పిరిట్' క్రేజీ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఫ్యాన్స్ బాగా ఎదురుచూస్తున్నదైతే 'స్పిరిట్'. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు కావడంతో చాలా హైప్ క్రియేట్ అయిపోయింది. వచ్చే ఏడాది మార్చి తొలివారంలో థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు రిలీజ్ డేట్ చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి.. క్రేజీ అప్డేట్ బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది)షూటింగ్ గురించి ఎదురైన ప్రశ్నకు బదులిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పటివరకు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. మీ అందరికీ అది నచ్చుతుందనే అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. తృప్తి దిమ్రి హీరోయిన్.అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో పాన్ ఇండియా సెన్సేషన్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. 'స్పిరిట్'ని మరింత వైలెంట్గా తీస్తున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. రాబోయే రోజుల్లో వచ్చే అప్డేట్స్ బట్టి ఏ రేంజ్ వయలెన్స్ అనేది క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్)40% of the shoot completed 🔥🔥🔥🔥#Prabhas | #Spirit | #SRV 💥💥💥 pic.twitter.com/2iPVg2ssd2— Movies4u Official (@Movies4u_Officl) July 19, 2026 -
మాల్దీవుల్లో తెలుగు బ్యూటీ.. ప్రీతి ముకుందన్ స్మైల్
మాల్దీవులు ట్రిప్ వేసిన తెలుగమ్మాయి శాన్వీపచ్చని డ్రస్లో రాశీ సింగ్ అందాల జాతరనవ్వుతూ మాయ చేస్తున్న ప్రీతి ముకుందన్మంచులో ఎంజాయ్ చేస్తున్న ప్రియా వారియర్'లెనిన్' షూటింగ్ మర్చిపోలేకపోతున్న భాగ్యశ్రీవైరల్ పాటకు ఆషికా రంగనాథ్ సూపర్ డ్యాన్స్ View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Jone Kingston (@jonekingston) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) -
రామ్ చరణ్- సుకుమార్ కాంబో.. పుష్ప రిపీట్ కానుందా?
పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో నటించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించనున్నారని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఈ మూవీని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని తెలుస్తోంది. పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పుష్ప తరహాలో రెండు భాగాలు తీసుకొచ్చేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తన్నట్లు అనిపిస్తోంది.ఈ చిత్రంలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ తన మార్క్ చూపించనున్నట్లు తెలుస్తోంది. మెగా అభిమానులు కోరుకునే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్. రంగస్థలం, పెద్ది చిత్రాల కంటే ఎక్కువ ఫర్మామెన్స్కు స్కోప్ ఉంటుందని సినీవర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించనున్నారని సమాచారం. ఈ మూవీ 2027 చివర్లో లేదా.. 2028 మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. -
మెగా158లో సీనియర్ హీరో..!
చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం మెగా 158(వర్కింగ్ టైటిల్). వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత వీరిద్దరు మరోసారి జతకట్టారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు 'కాకాజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో అనశ్వర రాజన్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో నివేతా పేతురాజ్ నటిస్తున్ననట్లు తెలుస్తోంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ టాక్ వైరల్గా మారింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శరత్ కుమార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శరత్ కుమార్ పాత్రతో పాటు ఈ చిత్రంలో మరో స్పెషల్ పాత్ర కూడా ఉంటుందని సమాచారం.. అది కూడా నెగిటివ్ రోల్ అని లేటేస్ట్ టాక్. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం మెగాస్టార్ సరికొత్త లుక్లో కనిపించనున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. -
పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరో
వైజాగ్ కుర్రాడు ప్రిన్స్ పెళ్లికి రెడీ అయ్యాడు. తెలుగులో బస్ స్టాప్ సహా పలు సినిమాల్లో హీరోగా నటించాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో సహాయ నటుడిగా మారి నేను శైలజ, డీజే టిల్లు తదితర చిత్రాలు చేశాడు. చివరగా ఈ ఏడాది మార్చిలో రిలీజైన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీలో కనిపించాడు. గతంలో బిగ్బాస్ తొలి సీజన్లోనూ పాల్గొన్న ప్రిన్స్.. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోనున్నాడు.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)గత నెల ప్రారంభంలోనే సాయి మాచిరాజు అనే అమ్మాయితో ప్రిన్స్ నిశ్చితార్థం జరిగింది. ఈ మేరకు ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాను ఓ ఇంటివాడిని కాబోతున్న సంగతి బయటపెట్టాడు. గతేడాది సెప్టెంబరులో ఓ ఫ్రెండ్ పెళ్లి తామిద్దరం కలుసుకున్నామని అలా స్నేహితులం అయ్యామని చెప్పాడు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత వివాహం చేసుకోవాలనుకున్నట్లు ప్రిన్స్ చెప్పుకొచ్చాడు.ఇక ప్రిన్స్ని చేసుకోబోయే సాయి మాచిరాజు కుటుంబం ప్రస్తుతం న్యూజిలాండ్లో ఉంటోంది. ఈమె కూడా అక్కడే ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే నెల 24వ తేదీన పెళ్లి కూడా న్యూజిలాండ్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్, సాయికి కామన్ ఫ్రెండ్ నటుడు ప్రియదర్శి. తాజాగా ప్రిన్స్ తాను ప్రపోజ్ చేసిన వీడియోని పోస్ట్ చేయగా అందులో ప్రియదర్శితో పాటు ఇరువురి సన్నిహితులు కూడా కనిపించారు.(ఇదీ చదవండి: విదేశీయుడిని పెళ్లి చేసుకున్న హిందీ సీరియల్ నటి) View this post on Instagram A post shared by Stone Photography ® (@stonephotography.in) -
మైత్రి చేతికి రా అండ్ రస్టిక్ ‘మండాడి’.. రిలీజ్ ఎప్పుడంటే..?
సుహాస్, సూరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మండాడి’. ఈ రా అండ్ రస్టిక్ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అందరినీ మెప్పించింది. సుహాస్, సూరి పాత్రలు, ఆ కారెక్టర్స్ మేకోవర్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టీం నమ్మకంగా చెబుతోంది. బోట్ సీక్వెన్స్ అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటాయని ఆల్రెడీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే.‘మండాడి’ మూవీని సెప్టెంబర్ 10న గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీస్ రిలీజ్ చేయబోతోంది. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి భారీ ఎత్తున విడుదల చేయనుంది.ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్గా పని చేశారు. ప్రొడక్షన్ డిజైన్ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు. -
47 మిలియన్ల వ్యూస్తో ప్రమీల’కు భారీ క్రేజ్!
తెలుగు పల్లె సంస్కృతిలో జానపద పాటలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రామీణ ప్రజల జీవన విధానం, ప్రేమ, అనుబంధాలు, బాధలు, భావోద్వేగాలు ఈ పాటల్లో ప్రతిబింబిస్తాయి. కాలం మారుతున్నా జానపద గీతాలపై ప్రజల అభిమానం ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి తాజా నిదర్శనంగా “ప్రమీల” జానపద పాట నిలుస్తోంది.పల్లె జీవనాన్ని, ప్రేమలోని స్వచ్ఛతను, మనసులో దాగిన భావాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శ్రోతల నుంచి భారీ స్పందన అందుకుంటున్న ఈ గీతానికి ఏకంగా 47 మిలియన్లకు పైగా వీక్షణలు (4 కోట్ల 70 లక్షల వ్యూస్) రావడం విశేషం.“ప్రమీల” జానపద పాట ఒక అందమైన ప్రేమకథను ఆధారంగా చేసుకున్న పల్లె గేయంగా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. ఈ పాటలో ప్రేమికుల మధ్య ఉన్న అనురాగం, ఒకరినొకరు కలుసుకోవాలనే ఆరాటం, దూరం వల్ల కలిగే వేదనను హృదయాన్ని తాకేలా చిత్రీకరించారు. ప్రమీల అనే యువతి, ఆమెను ప్రేమించే యువకుడు ఒకరినొకరు కలుసుకోవాలని కోరుకుంటారు. కానీ వారి మధ్య ఉన్న పరిస్థితులు, దూరాలు, కుటుంబ పరిమితులు వారి ప్రేమకు అడ్డుగా నిలుస్తాయి. ప్రమీలను చూడాలని, తన ప్రేమను వ్యక్తం చేయాలని యువకుడు తపన పడుతుంటాడు. మరోవైపు ప్రమీల కూడా తన మనసులోని ప్రేమను దాచుకోలేక భావోద్వేగానికి లోనవుతుంది.ఈ పాటలోని పల్లె వాతావరణం, సహజమైన పదాలు, ప్రేమలోని స్వచ్ఛమైన భావాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. అందుకే “ప్రమీల” జానపద గీతం తరాలు దాటుతూ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.(పాట కోసం ఇక్కడ కీక్ చేయండి) -
బాలయ్య- కొరటాల కాంబో.. ఊహించని టైటిల్..!
నందమూరి బాలకృష్ణ హీరోగా మరో సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఫుల్ యాక్షన్ మూవీని తెరకెక్కించనున్నారు. యాక్షన్తో పాటు సామాజిక కోణంలో కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య మూవీ టైటిల్పై పెద్దఎత్తున చర్చ మొదలైంది. దీంతో సినిమా టైటిల్ టాలీవుడ్లో ఆసక్తిగా మారింది.ఈ చిత్రానికి కార్పెంటర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ పేరును ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ టైటిల్ పెడితే సామాజిక కోణంలో కలిసి వస్తుందని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. ఈ మూవీలో సోషల్ మేసేజ్తో పాటు ఫుల్ యాక్షన్ ట్రీట్ కూడా ఉండనుందని తెలుస్తోంది.ఇక వచ్చేనెల చివరి వారంలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ మొదలుకానుంది. ఆ షెడ్యూల్లో బాలయ్యపై భారీ యాక్షన్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్ల కోసమే దాదాపు 20 రోజులకు పైగా షూటింగ్ కొనసాగనుందని సమాచారం. యాక్షన్ సీన్స్ విషయంలో కొరటాల శివ భారీగానే ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన తీసిన ప్రతి సినిమాలో బలమైన నేపథ్యం ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ కథపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా.. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


