Tollywood
-
కొత్త నిర్మాతలకు ఇదే నా సలహా : ‘సుయోధన’ నిర్మాత
ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుయోధన’. డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. బోసుబాబు నిడుమోలు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ - సుయోధన చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు. మా నెక్ట్స్ మూవీకి ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రెస్పాన్స్ బాగుంది. ఈ సినిమా చేసిన అనుభవంతో నెక్ట్స్ మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం. అయితే ఈ సారి ఏదైనా పేరున్న సంస్థతో భాగస్వామ్యం అయి సినిమా నిర్మించాలని అనుకుంటున్నాం. ఎంతో కొంత అనుభవం, అవగాహన తెచ్చుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావాలని కొత్త నిర్మాతలకు నా సలహా. త్వరలోనే మంచి సబ్జెక్ట్ చూసుకుని కొత్త మూవీ అనౌన్స్ చేస్తాం. ఈ సారి మా సంస్థలో రాబోయే సినిమా పక్కా ప్లానింగ్ తో ఉంటుంది. అన్నారు.డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ - సుయోధన మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి షో కు స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడి నుంచి మిత్రులు మూవీ చాలా బాగుందంటూ ఫోన్స్ చేస్తున్నారు. ప్రియదర్శి, సాయికుమార్ నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తోంది. మా సినిమాను మరింతగా ప్రేక్షకుల దగ్గరకు మీరు రీచ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు. -
'డోర్ తీసి చీర మార్చుకో'.. ఆ స్టార్ నిర్మాతను కాలితో తన్నా: నటి
భయం తన బ్లడ్డులోనే లేదంటోంది నటి రాధా ప్రశాంతి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆమెను టైగర్, ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 125 సినిమాలు చేసిన ఆమె చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యను ఏకరువు పెట్టింది.అర్ధరాత్రి రాద్ధాంతంరాధా ప్రశాంతి మాట్లాడుతూ.. 'నేనుంటున్న ఫ్లాట్ 2005లో బిల్డర్ దగ్గర కొనుక్కున్నాను. మొదట్లో దాన్ని అద్దెకిచ్చాము. అక్కడేం జరుగుతుందో నాకు తెలిసేది కాదు. 2012లో మేము ఆ ఫ్లాట్కు షిఫ్ట్ అయ్యాం. ఆ అపార్ట్మెంట్లో అక్రమ కార్యకలాపాల ఆఫీసులు నడిపిస్తున్నారని తెలిసింది. వాళ్లు తాగి వచ్చి అర్ధరాత్రి మా ఇంటి తలుపు తట్టేవారు. ముఖ్యంగా వాచ్మెన్ కుటుంబంతోనే నాకు ప్రాణభయం ఉంది.నా ఇంటిని తగలపెట్టారునా ఇంటి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతోంది. 2014లో పోలీసులు రైడ్ చేసి ఆ బిల్డింగ్ను సీజ్ చేశారు. కొంతకాలానికి మళ్లీ ఆ దందా మొదలుపెట్టారు. వీడియో ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. డ్రగ్స్ బిజినెస్ కూడా చేస్తున్నారు. వాళ్ల దందాకు అడ్డొస్తున్నాననే కరోనా సమయంలో ఓ నిర్మాత నా ఇంటిని కావాలని తగలపెట్టాడు. నన్ను అక్కడినుంచి వెళ్లగొట్టాలని దాడులు చేయించారు.నిజాలు మాట్లాడితే నిందలా?నాకు మానసిక పరిస్థితి సరిగా లేదు, పిచ్చి అని ప్రచారం చేసి నన్ను పంపించేయాలని చూశారు. నిజాలు మాట్లాడేవారిపై ఇలాంటి నిందలేస్తారా? కొన్నేళ్లుగా నా ఇంటి విషయంలో నరకం అనుభవిస్తున్నాను. గతంలో కూడా నాపై ఇలాంటి దుష్ప్రచారమే జరిగింది. ఓసారి టచప్ బాయ్ నా ఇంట్లో నుంచి 15 తులాల బంగారం దొంగతనం చేశాడు. కానీ రివర్స్లో నేను అతడిని చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది పేపర్లో వచ్చింది. నేను అతడిపై చేయి చేసుకోలేదు. దీంతో ఆ వార్త రాసిన వ్యక్తిని అమీర్పేట చౌరస్తాలో కాలర్ పట్టుకుని కొట్టాను. నాపై ఇలాంటి మచ్చ వేస్తే మా జీవితం ఏం కావాలి?కాలర్ పట్టుకుని..షూటింగ్స్లో కూడా ఒకటీరెండుసార్లు చేయి చేసుకున్నాను. ఒక ప్రొడక్షన్ మేనేజర్.. ఇప్పుడు ఆయన పెద్ద నిర్మాతయ్యాడనుకోండి.. నేను గదిలో దుస్తులు మార్చుకుంటుంటే డోర్ తీశాడు. నేను వెంటనే వెళ్లి డోర్ లాక్ చేశాను. క్షణం ఆగకుండా తలుపు తడుతూనే ఉన్నాడు. ఏంటని డోర్ తీశాను. అతడు నవ్వుతూ.. ఔట్ డోర్ షూటింగ్లో చెట్టు పక్కనే చీర మార్చుకుంటారు.. నేనిక్కడే ఉంటా.. చీర మార్చుకో అన్నాడు. కోపంతో తన్నాను. కాలర్ పట్టుకుని కొడుతూ నిర్మాత దగ్గరకు తీసుకెళ్లాను' అని గుర్తు చేసుకుంది.ఏఎన్నార్ సలహా'సినిమాలో అన్నిరకాల మనుషులుంటారు. ఎవరేమన్నా సరే సెట్లో యాక్ట్ చేయడం నేర్చుకో.. కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకో.. సర్దుకుని వెళ్లు, అలాగని తప్పు చేయమని చెప్పడం లేదు, సున్నితంగా తప్పించుకుని వెళ్లు అని ఏఎన్నార్ సలహా ఇచ్చారు. కానీ నాకు నిజ జీవితంలో యాక్టింగ్ చేయడం రాలేదు' అని రాధా ప్రశాంతి చెప్పుకొచ్చింది. కాగా ఈమె.. పరువు ప్రతిష్ట, శ్రీదేవి నర్సింగ్హోం, పెళ్లి పందిరి, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం రా, మధ్యతరగతి మహాభారతం.. ఇలా ఎన్నో సినిమాలు చేసింది. బుల్లితెరపై సీరియల్స్ కూడా చేసింది.చదవండి: పెళ్లయితే సినిమాలు మానేయాలని కండీషన్.. అందుకే రిజెక్ట్ చేశా: హీరోయిన్ -
9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’.. నిర్మాత ట్వీట్ వైరల్
ధురంధర్ 2 చిత్రం ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది. బాలీవుడ్,టాలీవుడ్ అని మాత్రమే కాదు ఎక్కడ చూసినా.. ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. విడుదలై 10 రోజులు గడుస్తున్నా.. థియేటర్స్కి జనం పోటెత్తుతున్నారు. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం రికార్డులను బద్దలు కొడుతుంది. 10 రోజుల్లో రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాంతో పాటు బాహుబలి రికార్డుని కూడా బద్దలు కొట్టింది. ఉత్తర అమెరికా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా బాహుబలి 2 ఉంది. గత 9 ఏళ్లుగా ఉన్న ఈ రికార్డును తాజాగా ధురంధర్ 2 బద్దలు కొట్టింది. కేవలం 10 రోజుల్లోనే 20+ మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘బాహుబలి 2 రికార్డుని ధురంధర్ 2 అధిగమించింది’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ‘నేను కూడా ఇటీవల ధురంధర్ 2 చూశా. ఆద్యంతం ఆస్వాదించా. ఈ చిత్రం అన్ని రికార్డులు బద్దలుకొడుతూ.. కొత్త బెంచ్మార్క్ను నెలకొల్పడం ఆనందంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు’ అని పేర్కొన్నారు.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించారు. రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు. Yesterday I watched #Dhurandhar2TheRevenge and needless to say I loved it and thoroughly enjoyed the film! Happy to see it breaking all the records and setting new box office benchmarks in India and worldwide! Congratulations to the entire team! 👏🏼👏🏼 https://t.co/ATl3o3bNTu— Shobu Yarlagadda (@Shobu_) March 28, 2026 -
ఓటీటీలో ఉస్తాద్ భగత్సింగ్..!
పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట వైరల్ అవుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పటి వరకు సుమారు రూ. 70 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ సాక్నిల్క్ పేర్కొంది. ఓవర్సీస్లో ఉస్తాద్ కనీసం 1మిలియన్ మార్క్ కూడా దాటలేదు. ధురంధర్-2 హిట్ కావడంతో చాలా స్క్రీన్స్ నుంచి ఉస్తాద్ భగత్సింగ్ చిత్రాన్ని తొలగించారు.‘ఉస్తాద్ భగత్సింగ్’ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో పాటుగా ధురంధర్-2 దెబ్బ కూడా గట్టిగానే ప్రభావం చూపింది. దీంతో థియేట్రికల్ రన్లో బోల్తా పడింది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఏప్రిల్ 17న నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్కు తీసుకురావాలనే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. ఈ తేదీలో కుదరకపోతే ఏప్రిల్ 24న తప్పకుండా ఉస్తాద్ ఓటీటీ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. థియేటర్స్లో మెప్పించలేని ఈ మూవీ కనీసం ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా మంచి రెస్పాన్స్ సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఎమోషనల్ లవ్ స్టోరీ.. అనకాపల్లి టీజర్ చూశారా?
విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ఠ, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం అనకాపల్లి. ఈ సినిమాకు తమ్మినేని ఖగేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ నక్కిన త్రినాథరావు కథ అందించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన అనకాపల్లి టీజర్ చూస్తుంటే ప్రేమకథా చిత్రంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నారేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, నక్కిన త్రినాథరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవ్జాండ్ సంగీతమందిస్తున్నారు. -
ఆ హీరో నన్ను మోసం చేశాడు.. యువకుడి ఆత్మహత్యాయత్నం
భారీ మొత్తంలో నగదు తీసుకొని, తిరిగి ఇవ్వకుండా ఓ హీరో వేధిస్తున్నాడంటూ చిత్తూరు జిల్లాకు చెందిన లోకేష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు కారణం హీరో మాన్యం మురళీ కృష్ణనే అంటూ రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.‘జెట్టి’ సినిమా హీరో మాన్యం మురళీ కృష్ణకి తన బంధువుల ద్వారా రూ.3.15 కోట్లు ఇప్పించానని, తిరిగి ఇవ్వమని అడిగితే.. ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు లోకేశ్ను బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం చిత్తూరు తీసుకెళ్లారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. వాస్తవాలు తెలియాల్సి ఉంది.సూసైడ్ లెటర్లో ఏముంది?సూసైడ్ నోట్ లో తనకు జరిగిన అన్యాయం గురించి లోకేష్ రాసుకొచ్చాడు. ‘నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. మా అమ్మనాన్నలను, భార్యబిడ్డలను ఈ స్తాయికి తీసుకోస్తానని అనుకోలేదు. నా కుటుంబాన్ని ఈ రోజు నేను రోడ్డుపైకి తీసుకొచ్చాను. అంతా అప్పుల పాలు అయిపోయాను. నన్ను క్షమించండి. ఈ రోజు నేను తల ఎత్తుకొని బతకలేకపోతున్నాను. నా చావుకు కారణం హీరో మాన్యం మురళీ కృష్ణ. ఇతను రైల్వే కాంటాక్ట్ పేరుతో మోసం చేశాడు. మొత్తం మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇందులో నా బంధువులతో పాటు సోదరులు కూడా డబ్బులు పెట్టారు. ఇతని వల్ల అందరూ ఇప్పుడు రోడ్డుపైకి వచ్చారు. ఇన్నిరోజుల నా కష్టం మొత్తం వృధా అయింది. అతన్ని(మురళీ కృష్ణ) మాత్రం వదలకండి. ఇతనితో పాటు వాళ్ల తమ్ముడు కూడా ఇందులో ఉన్నాడు. ఇద్దరు కలిసి మోసం చేశారు. డబ్బులు అడుగుతుంటే ఇవ్వడం లేదు. ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి’ అని సూసైడ్ లెటర్లో రాసుకొచ్చాడు.బ్రేకింగ్ న్యూస్అమ్మానాన్న క్షమించండి..జెట్టి సినిమా హీరో తనను మోసం చేశాడంటూ చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు లోకేష్ ఆత్మహత్యాయత్నంహీరో మాన్యం మురళీకృష్ణకు రూ.3.15 కోట్లు బంధువుల ద్వారా ఇప్పించానని రైల్వే కాంట్రాక్ట్ పేరుతో మోసం చేశాడంటూ సూసైడ్ నోట్ రాసి… pic.twitter.com/mYGIpHyMEz— Telugu Feed (@Telugufeedsite) March 28, 2026గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
బాలకృష్ణతో డింపుల్.. మీకెవరు చెప్పారంటూ గోపీచంద్ కౌంటర్
బాలకృష్ణ- దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే. గతంలో ‘వీర సింహారెడ్డి’తో విజయం అందుకున్న తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది. అయితే, ఇందులో హీరోయిన్గా డింపుల్ హయాతిని తీసుకున్నారని సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఎంపిక అనేది దర్శకుడి బ్లండర్ మిస్టేక్ అని.. ఆమెకు బదులుగా రవీనా టండన్ని తీసుకుంటే బాగుండేదని నెటిజన్ పోస్ట్ చేశారు. అయితే, దర్శకుడు గోపీచంద్ మలినేని ఫన్నీగా మహేష్బాబు వీడియోతో సమాధానం ఇచ్చారు.హీరోయిన్ ఎంపిక గురించి ప్రస్తావిస్తూ.. మంచి హైప్ ఉన్న సినిమాను(NBK111) ఎలా చెడగొట్టాలో మేకర్స్ ని చూసి బాగా నేర్చుకోవచ్చని నెటిజన్ పోస్ట్ చేయడంతో దర్శకుడు గోపీచంద్ మలినేని కౌంటర్ ఇచ్చారు. సింపుల్గా మహేష్ బాబు మాట్లాడుతున్న ఒక మీమ్ వీడియోను పంచుకుంటూ, ఆ వార్తలలో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. 'మీకేమన్నా చెప్పారా ఎవరైనా.. నేను అయితే ఎవరికీ చెప్పలేదండి' అనే మహేష్ డైలాగ్ను షేర్ చేశారు.ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతారను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇందులో ఒక కీలక పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్లు సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి, తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రత్యేక సెట్లో జరుగుతున్న షూటింగ్లో బాలయ్య పాల్గొంటున్నట్లు టాక్. ఇది ముంబయి నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండనుంది. https://t.co/qSP7PTXug8 pic.twitter.com/rqmOPRCgJ3— Gopichandh Malineni (@megopichand) March 29, 2026 -
‘బైకర్’ శర్వానంద్ 23 కిలోలు తగ్గాడు: అభిలాష్ రెడ్డి
శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బైకర్’. ఈ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించగా, రాజశేఖర్, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో అభిలాష్ రెడ్డి కంకర మాట్లాడుతూ– ‘‘బైకర్’లో రేసింగ్తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన కల్పిత కథ ఇది. తండ్రీ–కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. శర్వానంద్గారి నటన అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం కోసం ఆయన ఆరు నెలలు ఫిజికల్గా, మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. 23 కేజీల బరువు తగ్గారు. ‘బైకర్’ను శర్వాగారు తన కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్గా చెప్పారు. ఇందులో శర్వాగారి తండ్రి, కోచ్ పాత్రలో రాజశేఖర్గారు నటించారు. ఆయన చుట్టూ ఈ కథ తిరుగుతుంది. శర్వానంద్, రాజశేఖర్గార్లు, మాళవిక ... ఇలా అందరూ ‘బైకర్’ సినిమా ఫస్ట్ నరేషన్లోనే ఓకే చెప్పారు. ఈ కథకు అంతలా కనెక్ట్ అయ్యారు. కథ 1990, 2000.. ఇలా రెండు డిఫరెంట్ టైమ్లైన్స్లో జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికే దాదాపు 60 రోజులు పట్టింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి రేసర్స్ను తీసుకువచ్చి చిత్రీకరించాం. అలాగే 90స్లోని రెండు స్పోర్ట్స్ బైక్స్ ఉండేవి, అవి ఇప్పుడు లేవు. వాటిని డిజైన్ చేయడానికి చాలా టైమ్ పట్టింది. ఇండియాలో శ్యామ్ కొఠారి అనే రేసర్ ఉన్నారు. క్రికెటర్గా కపిల్ దేవ్కి వచ్చినంత గుర్తింపు, రేసింగ్లో శ్యామ్ కొఠారీకి రాలేదు. మా సినిమా మోటివ్ కూడా ఇలాంటి గుర్తింపులు దక్కాలనే. మా నిర్మాతలు ఫస్ట్ కాపీ చూసి, హ్యాపీగా ఉన్నారు. త్రీడీలో చేద్దామని నిర్మాతలు అడిగితే నేనే వద్దన్నాను. సౌండ్, ఆర్ఆర్ విషయంలో జిబ్రాన్ సరికొత్త మ్యూజిక్ అందించారు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఓ మంచి ఫీలింగ్తో బయటకు వస్తారు. నా తర్వాతి సినిమా ‘దిల్’ రాజుగారితో ఉంటుంది’’ అన్నారు. -
మహాకాళిలో ప్రభాస్..!
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో భాగంగా తెరకెక్కుతున్న చిత్రం మహాకాళి.. ఇదే సినిమాటిక్లో వచ్చిన హనుమాన్ భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఫీమేల్ సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్కు ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహాకాళిగా కన్నడ నటి భూమి శెట్టి నటింస్తుండగా.. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. అయితే, ప్రభాస్ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని ప్రచారం జరుగుతుంది.మహాకాళి చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ.. ఆయన తన పాత్ర చిత్రీకరణను కూడా ఇప్పటికే పూర్తి చేశారని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఆయన పోషించబోయే పాత్ర ఎలా ఉండనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నప్పలో కూడా ప్రభాస్ అతిథి పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే.ఇప్పటివరకు మహాకాళి సినిమా 100 రోజుల షూటింగ్ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అక్షయ్ ఖన్నా పాత్రకు సంబంధించి కూడా చిత్రీకరణ కూడా పూర్తయిందట. పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రాన్ని ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందించారు. ఇదే యూనివర్స్ (PVCU)లో భాగంగా ‘అధీర’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎస్జే సూర్య , కల్యాణ్ దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్ హీరో చిత్రాన్ని శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించనున్నారు. -
ఓటీటీలో శ్రీవిష్ణు థ్రిల్లింగ్ సినిమా.. ప్రకటన వచ్చేసింది
టాలీవుడ్లో హీరో శ్రీవిష్ణు నటించిన కొత్త చిత్రం 'మృత్యుంజయ్' ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తన కామెడీ జానర్ని వదిలి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ మూవీతో థియేటర్లోకి వచ్చాడు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 6న విడుదలైంది. ఇందులో రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, చిన్నా, సుదర్శన్, రచ్చ రవి, బాలాదిత్య తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని సందీప్ గున్నం మరియు వినయ్ చిలకపాటి నిర్మించగా, కాల భైరవ సంగీతం అందించారు.'మృత్యుంజయ్' సినిమా ఏప్రిల్ 3న ఓటీటీలోకి రానుంది. నెట్ఫ్లిక్స్(Netflix) అప్కమింగ్ చిత్రాల జాబితాలో అధికారికంగా ప్రకటించింది. క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రం థియేటర్స్లో ప్రేక్షకులను మెప్పించంది. అయితే, ఓటీటీలో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఈ వీకెండ్లో థ్రిల్ తెప్పించే సినిమాగా 'మృత్యుంజయ్' ఉంటుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.కథేంటంటే.. జయ్ (శ్రీవిష్ణు)..ఓ ప్రముఖ దినపత్రికలో యాడ్ డిపార్ట్మెంట్లో పని చేస్తుంటాడు. ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్గా మారాలనేది తన కల. ‘శ్రద్ధాంజలి’ యాడ్స్ కోసం చనిపోయిన వారి ఇంటికి వెళ్లి.. వాళ్ల గురించి గొప్పలు చెబుతూ కుటుంబ సభ్యుల నుంచి ప్రకటనల్ని తీసుకోస్తుంటాడు. అలా ఓ సారి అచ్యుత్రావు (బాలాదిత్య) అనే వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని.. వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ సైలెంట్గా ఉన్న అచ్యుత్రావు కూతురు అంజలిని చూడగానే అతని బ్యాల్యం గుర్తొస్తుంది. ఆమె అమాయకంగా ‘మా నాన్నకు అలా ఎందుకైంది’ అని ప్రశ్నించడం చూసి చలించిపోతాడు.చిన్నారి ప్రశ్నకు సమాధానం చెప్పాలకుంటాడు. మూడు రోజుల తర్వాత అచ్యుత్ తరహాలోనే విక్రాంత్ అనే వ్యక్తి కూడా మరణిస్తాడు. అయితే ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిన మరణాలే అని పోలీసులు నిర్ధారణకు వస్తారు. కానీ ఏసీపీ సీత(రెబా మోనికా జాన్) మాత్రం ఈ మరణాల వెనుక ఏవైనా రహస్యాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ మొదలుపెడుతుంది. అవి ప్రమాదాలు కావని హత్యలని జయ్ తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని ఏసీపీ సీతతోనూ చెబుతాడు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఆమె పట్టించుకోదు. జయ్ మాత్రం ఈ హత్యల వెనుక ఉన్నదెవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు.నిజంగానే జయ్ చెప్పినట్టుగా అవి హత్యలేనా? ఎవరు చేసారు? ఎందుకు చేశారు? హంతకుడిని కనిపెట్టే క్రమలో జయ్కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. -
స్టార్ దర్శకులను మెప్పించిన సినిమా.. ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'నీలిర'.. తమిళ్ వర్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు వర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. శ్రీలంకకు చెందిన తమిళ దర్శకుడు సోమిధరన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో నవీన్ చంద్ర, విదూ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 1988నాటి శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది. అప్పటి భయానక పరిస్థితుల మధ్య సామాన్యుల ఇబ్బందులు కళ్లకు కట్టేలా ఈ మూవీలో చూపించనున్నారు.నీలిర చిత్రాన్ని ఇప్పటికే వెట్రిమారన్, లోకేష్ కనగరాజ్, ఏఆర్ మురుగదాస్ వంటి క్రియేటివ్ దర్శకులు చూశారు. ఈ మూవీ కథ, తెరకెక్కించిన తీరుపై వారు ప్రశంసలు కురిపించారు. యుద్ధం వెనుక దాగి ఉన్న సామాన్యుల కన్నీటి గాథలను ఈ సినిమా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. తాజాగా ట్రైలర్ను చూస్తే దర్శకుడు సోమీధరన్ ఈ సున్నితమైన అంశాన్ని అత్యంత సహజంగా, డాక్యుమెంటరీ స్టైల్ తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.శ్రీలంకలో అంతర్యుద్ధం1988లో శ్రీలంకలో జరిగిన కొన్ని సంఘటనలు రాజకీయ మార్పులకు దారితీశాయి. ప్రేమదాసా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో శ్రీలంకలో సివిల్ వార్ మరింత తీవ్రతరం కావడానికి కారణమైంది. శ్రీలంకలో మార్క్సిస్ట్-లెనినిస్ట్ పార్టీ అయిన జనతా విముక్తి పెరమున (JVP) తిరుగుబాటు వల్ల దక్షిణ ప్రాంతంలో అలజడి రేగింది. దీంతో ప్రజలపై హింసాత్మక దాడులు జరిగాయి. ఇది దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు పెద్ద సవాలు అయింది. ఆపై ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో LTTE (Liberation Tigers of Tamil Eelam) తిరుగుబాటు కొనసాగింది. ఈ రెండు తిరుగుబాట్ల కారణంగా వేలాది మంది అమాయక ప్రజలు మరణించారు. ఎంతోమందిపై హింసాత్మక దాడులు జరిగాయి. దీంతో అక్కడ రాజకీయ అస్థిరత చోటుచేసుకుంది. తర్వాత దేశంలో పరిపాలన మార్పులు జరిగాయి. -
నా బిడ్డను ఎవరూ ముద్దుపెట్టుకోవద్దు.. ఇది నా రూల్: మెరీనా
నటి, బిగ్బాస్ ఫేం మెరీనా అబ్రహం గతేడాది తల్లిగా ప్రమోషన్ పొందింది. పెళ్లయిన 8 ఏళ్లకు పేరెంట్స్ కావడంతో మెరీనా- రోహిత్ జంట ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది జనవరిలో పాపకు మొదటి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిపారు. అయితే తన బిడ్డపై ప్రేమను కురిపించడం వరకు ఓకే కానీ అతిగా ముద్దు చేయడం నచ్చడం లేదంటోంది మెరీనా. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ షేర్ చేసింది.ఇదంతా డ్రామా కాదునా పాప కోసం నేను కొన్ని హద్దులు గీసుకున్నాను, దయచేసి వాటిని గౌరవిస్తారనుకుంటున్నాను. తనకు చాక్లెట్లు ఇవ్వొద్దని చెప్పానంటే ఎవరూ ఇవ్వడానికి వీల్లేదు. నా పాపను ముద్దు పెట్టుకోకండి అని చెప్పినప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉండండి. ఇదంతా డ్రామా కాదు, యాటిట్యూడ్ అంతకన్నా కాదు.. ఇది పిల్లల్ని పెంచే పద్ధతి. ఏదో ఒకసారి అలా చేస్తే ఏమవుతుంది? అందులో అంత ప్రమాదకరం ఏముందని మీరు అనుకోవచ్చు. .నేనొకటే చెప్తున్నా..మీరంతవరకే ఆలోచించారు. కానీ నేను దాని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. తను అనారోగ్యానికి గురైతే బెంగపడేది నేను.. జాగ్రత్తగా చూసుకునేది నేను. కాబట్టి నేనొకటే చెప్తున్నా.. నా బిడ్డను మీరంతగా ఇష్టపడితే, నా మాటల్ని గౌరవించండి, నాకు సహకరించండి, నేను పెట్టిన రూల్స్ను అతిక్రమించకండి. నా బిడ్డ రక్షణే నాకు అన్నింటికన్నా ముఖ్యం అని రాసుకొచ్చింది.ఎందుకు భయం?పెద్దలు చిన్నపిల్లలకు ప్రేమతో ముద్దుపెడతారు. కొన్నిసార్లు అది ఇన్ఫెక్షన్కు దారి తీసే ప్రమాదం ఉంది. అలాగే పిల్లలు తినే చిరుతిండి వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మెరీనా.. తన కూతురికి అటువంటివి అలవాటు చేయొద్దని కోరుతోంది. మెరీనా- రోహిత్ ఇద్దరూ తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లో జంటగా పాల్గొన్నారు.చదవండి: చిరంజీవి కొత్త సినిమా ప్రారంభమయ్యేది అప్పుడే.. -
అజయ్ దేవగన్పై ఫిర్యాదు.. కోర్టుకెక్కిన కార్తీ 'ఖైదీ' నిర్మాతలు
అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో, నటించి నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'భోలా' (2023).. తమిళ హిట్ చిత్రం 'ఖైదీ'కి రీమేక్గా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, భోలా చిత్ర నిర్మాతలు రీమేక్ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందం ప్రకారం ఖైదీ సినిమా హక్కులకు సంబంధించిన పూర్తి డబ్బు చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొంది.ఖైదీ సినిమా పూర్తి హక్కులు తమకే ఉన్నాయని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పేర్కొంది. హిందీ రీమేక్ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆ నిర్మాణ సంస్థ పేర్కొంది. అయితే, కొంత మొత్తంలో మాత్రమే డబ్బు చెల్లించారని తమకు ఇంకా రూ. 4కోట్లు బకాయి పడ్డారని భోలా చిత్ర నిర్మాతలపై ఆరోపణలు చేశారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, కోర్టుకు అధికార పరిధి ఉందా లేదా అనే విషయంపై తీర్పును రిజర్వ్ చేసింది.ఖైదీ సినిమా నచ్చడంతో హిందీలో భోలా పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అజయ్ దేవగన్ చిత్ర నిర్మాణ సంస్థ, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే, ఖైదీ నిర్మాతలతో రీమేక్ హక్కులకు సంబంధించి కుదుర్చుకున్న ఢీల్ ప్రకారం పూర్తిగా డబ్బు చెల్లించలేదని తెలుస్తోంది. 2023లో విడుదలైన ఈ చిత్రం ఆశించినంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేదు. -
చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడంటే..?
‘మన శంకర వరప్రసాద్గారు’ సినిమా భారీ విజయంతో ఈ ఏడాదిని చిరంజీవి ప్రారంభించారు. అయితే, కాస్త విరామం తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ రెడీ చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే.చిరంజీవి- బాబీ సినిమా షూటింగ్ ఏప్రిల్ మూడో వారంలో మొదలు కానుందని తెలుస్తోంది. భారీ యాక్షన్ కాన్సెప్ట్ కథతో బాబీ సిద్ధం అయ్యారట. ఈ చిత్రంలో ఫుల్ మాస్ రోల్లో చిరంజీవి కనిపించనున్నారని టాక్. అయితే, ఈ మూవీలో నటించనున్న ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు. చిరు సరసన భార్యగా ప్రియమణి, కూతురి పాత్రలో ఛాంపియన్ ఫేమ్ అనస్వర రాజన్ దాదాపుగా ఫిక్స్ అయినట్లు టాక్ ఉంది. ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు.వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వంభర’ విడుదల గురించి ప్రకటన రాలేదు. 2025 సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో అనే అంశంపై క్లారిటీ లేదు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రం ఈ ఏడాది దసరాకు విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. -
ఎదురు చూపుల్లో కృతిశెట్టి..!
అవకాశాలను అందిపుచ్చుకుని నటిస్తున్నప్పటికీ నటి కృతిశెట్టిని విజయాలు మాత్రం వరించడం లేదు. అసలు ఈ మంగుళూరు భామ తెలుగులో నటించిన ఉప్పెన చిత్రం సంచలన విజయం సాధిస్తుందని, ఎవరు ఊహించలేదు. తొలి చిత్రమే మంచి పేరు తెచ్చిపెట్టడంతో తన కెరీర్ వెలిగిపోతుందని కృతిశెట్టి(Krithi Shetty) తెగ సంబరపడింది. అనుకున్నట్లుగానే వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. వాటిలో ఒకటి రెండు హిట్లు కూడా ఉన్నాయి. దీనికి తోడు మలయాళం, తమిళం భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఇంకేముంది దక్షిణాదిలో టాప్ రేంజ్లో దూసుకుపోవచ్చని కలలు కని ఉండవచ్చు.తమిళంలోనూ కార్తీ, రవి మోహన్, ప్రదీప్ రంగనాథన్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. అయితే రవి మోహన్ సరసన నటించిన జీనీ చిత్రం ఏళ్ల తరబడి నిర్మాణంలోనే ఉంది. ఇక కార్తీతో జత కట్టిన వా వాథ్దియార్ చిత్రం ఈ మధ్యనే విడుదలై పూర్తిగా నిరాశ పరిచింది. ఇక మిగిలింది ప్రదీప్ రంగనాథన్కు జంటగా నటించిన ఎల్ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) వరుసగా విజయాలను అందుకుంటున్న ప్రదీప్ రంగనాథన్ హిరోగా నటించిన చిత్రం కాబట్టి సక్సెస్ గ్యారెంటీ అని అందరూ అనుకుంటున్నారు. అయితే నటి నయనతార రౌడీ పిక్చర్స్ సంస్థ, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది అక్టోబర్లోనే విడుదల కావలసింది. అదే సమయంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన డ్యూడ్ చిత్రం విడుదల కావడంతో ఎల్ఐకే చిత్రం విడుదలను వాయిదా వేయాల్సిన పరిస్థితి. ఆ తరువాత పలుమార్లు ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరోసారి వాయిదా పడుతున్నట్లు తాజా సమాచారం. ఎల్ఐకే చిత్రాన్ని ఏప్రిల్ 2వ వారంలో తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కృతిశెట్టి చేతిలో ఉన్న ఒకే ఒక్క చిత్రం వాయిదా మీద వాయిదా పాడటం ఆమెకు నిరాశ పరిచే విషయమేమీ అవుతుంది. ఇలా ఎదురు చూపులతో ఉన్న కతి శెట్టికి గుడ్డిలో మెల్ల అన్నట్లుగా త్వరలో తెలుగులో ఒక క్రేజీ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. -
మరోసారి...
తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ సాగుతోంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా వన్స్ మోర్ అంటూ ఆ సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్పై చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే గత చిత్రాలను 4కె క్వాలిటీతో సరికొత్తగా అందిస్తుండటంతో ప్రేక్షకులు కూడా సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’, మహేశ్బాబు ‘అతిథి’, ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా, ఊసరవెల్లి’, రవితేజ ‘కృష్ణ’, సిద్ధార్థ్ ‘ఓయ్’, శింబు ‘వల్లభ’ వంటి అరడజను పైగా సినిమాలు రీ రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఆయా చిత్రాల వివరాలేంటో ఓ లుక్ వేద్దాం... పద్దెనిమిదేళ్ల తర్వాత... హీరో రవితేజ ఈ వేసవిలో థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వులు పంచనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘కృష్ణ’ చిత్రం మే నెలలో రీ రిలీజ్ కానుంది. రవితేజ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా ‘కృష్ణ’. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ముకుల్ దేవ్, గిరిబాబు, చంద్రమోహన్, సుధ, వేణు మాధవ్, సునీల్, జయప్రకాశ్ రెడ్డి, షాయాజీ శిండే, సత్యం రాజేశ్ ఇతర పాత్రలు పోషించారు. నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ విజువల్స్పై బి. కాశీ విశ్వనాథం నిర్మించారు.రవితేజ మాస్ ఇమేజ్, వినాయక్ మాస్ క్రేజ్ ఈ మూవీకి ప్లస్ అయింది. రవితేజ, త్రిష, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ని కడుపుబ్బా నవ్వించాయి. 2008 సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. చక్రి అందించిన సంగీతం ఈ మూవీ విజయంలో తన వంతు పాత్ర పోషించింది అనడం అతిశయోక్తి కాదు. మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా రవితేజ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. పద్దెనిమిదేళ్ల తర్వాత మే 8న ‘కృష్ణ’ మూవీ రీ రిలీజ్ అవుతోంది.ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు. దేవుడా... ‘రేసు గుర్రం’ సినిమాలో దేవుడా అంటూ ఓ మేనరిజమ్తో హీరో అల్లు అర్జున్ పలికిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. మరోసారి ఆ మేనరిజాన్ని ప్రేక్షకులు చూడనున్నారు. అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘రేసు గుర్రం’. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, ప్రకాశ్రాజ్, అలీ, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, రవి కిషన్, శ్యామ్, పవిత్రా లోకేష్, ప్రగతి ఇతర పాత్రలు పోషించారు. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ్రపొడక్షన్స్పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వ రావు నిర్మించారు.మాస్, యాక్షన్ , కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా 2014 ఏప్రిల్ 11న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ప్రత్యేకించి అల్లు అర్జున్–శ్రుతీహాసన్ ఎనర్జిటిక్ డ్యాన్సులు ప్రేక్షకులకు కనువిందు కలిగించాయి. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్టింగ్, శ్రుతీహాసన్ అమాయకత్వం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. తమన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇన్స్పెక్టర్ కిల్బిల్ పాండేగా బ్రహ్మానందం ఏ స్థాయిలో ఆడియన్స్కి నవ్వులు పంచారో తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘రేసు గుర్రం’ మూవీని ఆయన పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న రీ రిలీజ్ చేస్తున్నారు. క్రౌన్ మూవీస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ని కూడా విడుదల చేశారు.తమ అభిమాన హీరో (అల్లు అర్జున్) పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న ‘రేసు గుర్రం’ రీ రిలీజ్ అవుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే... ‘పుష్ప: ది రైజ్’ (2021), ‘పుష్ప 2: ది రూల్’ (2024) సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏఏ 22’ (వర్కింగ్ టైటిల్). తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అతిథి వస్తున్నాడు ఈ వేసవికి మహేశ్ బాబు ‘అతిథి’ గా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అతిథి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా రావ్ హీరోయిన్గా నటించారు. కోట శ్రీనివాసరావు, నాజర్, మురళీ శర్మ, ఆశిష్ విద్యార్థి, అజయ్, వేణుమాధవ్, రాజీవ్ కనకాల, ప్రగతి ఇతర పాత్రలు పోషించారు. ఘట్టమనేని రమేశ్ బాబు, రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 2007 అక్టోబరు 18న విడుదలైంది. మహేశ్ బాబు మేకోవర్, స్టైలిష్ లుక్స్, యాక్షన్... వంటివన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహేశ్ బాబును దర్శకుడు సురేందర్ రెడ్డి అల్ట్రా మోడ్రన్ లుక్లో ప్రజెంట్ చేశారు. లాంగ్ హెయిర్, ట్రెండీ కాస్ట్యూమ్స్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో మహేశ్ బాబు ప్రేక్షకులను కట్టిపడేశారు.ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాలు, సురేందర్ రెడ్డి మార్క్ టేకింగ్ చాలా కొత్తగా అనిపించాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం ‘అతిథి’ సినిమాకు అతి పెద్ద బలం అని చెపొ్పచ్చు. అదే విధంగా మహేశ్ బాబు–అమృతా రావ్ మధ్య సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ సినిమాను 4కె వెర్షన్న్లో రీ రిలీజ్ చేస్తుండటంతో అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఫుల్ క్రేజ్ నెలకొంది. మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మే 29న ‘అతిథి’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో, మెరుగైన సౌండ్ క్వాలిటీతో వస్తున్న ‘అతిథి’ని చూసేందుకు ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా మహేశ్ బాబు హీరోగా నటించిన ‘పోకిరి’, ‘ఒక్కడు’, ‘బిజినెస్ మేన్’, ‘మురారి’ వంటి చిత్రాలు ఇప్పటికే రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ‘వారణాసి’ తాజా షెడ్యూల్ హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన వారణాసి సెట్లో జరుగుతోంది. 2027 ఏప్రిల్ 9న విడుదల కానున్న ‘వారణాసి’పై అంతర్జాతీయ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది. డబుల్ ధమాకా హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటించిన ‘ఆంధ్రావాలా’, ‘ఊసరవెల్లి’ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘ఆంధ్రావాలా’. ఈ మూవీలో రక్షిత హీరోయిన్గా నటించారు. రమాప్రభ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, వేణుమాధవ్, షాయాజీ శిండే, రాహుల్ దేవ్, బెనర్జీ, నాజర్, సంఘవి ఇతర పాత్రలు పోషించారు.భారతి సమర్పణలో గిరి నిర్మించిన ఈ సినిమా 2004 జనవరి 1న విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి తండ్రీకొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు. చక్రి అందించిన సంగీతం ఈ మూవీకి ప్లస్ అయింది. ఎన్టీఆర్, రక్షిత డ్యాన్స్లు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం విడుదలై 22 ఏళ్లు దాటిపోయింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఆంధ్రావాలా’ని రీ రిలీజ్ చేస్తున్నారు నిర్మాత గిరి. ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఊసరవెల్లి’. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించారు. ప్రకాశ్రాజ్, తనికెళ్ల భరణి, విద్యుత్ జమాల్, షాయాజీ శిండే, మురళీ శర్మ, ప్రభాస్ శ్రీను, జీవీ సుధాకర్ నాయుడు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 2011 అక్టోబరు 6న రిలీజ్ అయింది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో సంగీతం అందించారు. సుమారు పదిహేనేళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధం అవుతోంది.మే 20న ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని ఈ సినిమా రీ రిలీజ్కి ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ . మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేసవిలో ఓయ్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (2005) సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు హీరో సిద్ధార్థ్. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారాయన. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ (2006) మూవీతో సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రాల్లో ‘ఓయ్’ ఒకటి. ఆనంద్రంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షామిలి హీరోయిన్గా నటించారు.సునీల్, అలీ, కృష్ణుడు, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి, ప్రదీప్ రావత్, నెపోలియన్ తదితరులు నటించారు. డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మించారు. 2009 జూలై 3న విడుదలైన ఈ సినిమా యూత్ని బాగా ఆకట్టుకుంది. ప్రత్యేకించి యువన్ శంకర్ రాజా సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయింది. మ్యూజిక్ పరంగా ఈ మూవీ హిట్ అయ్యింది. మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘ఓయ్’ ఏప్రిల్ 17న రీ రిలీజ్ అవుతోంది. తెలుగులో ఆ మధ్య వరుస సినిమాలు చేసిన సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళంలో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు. వల్లభ సిద్ధం శింబు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘వల్లవన్’. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, రీమా సేన్, సంధ్య, సంతానం, ప్రేమ్జీ, సత్యన్ ప్రధాన పాత్రలు పోషించారు. పీఎల్ తేనప్పన్ నిర్మించిన ఈ మూవీ తమిళంలో 2026 అక్టోబరు 21న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వల్లభ’ పేరుతో అనువదించి, రిలీజ్ చేశారు. 2006 నంబరు 11న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నయనతార టీచర్గా, శింబు స్టూడెంట్గా నటించారు. టీచర్–స్టూడెంట్ మధ్య ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ప్రత్యేకించి యువతని భారీగా ఈ మూవీ థియేటర్లకు రప్పించింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ప్రత్యేకంగా నిలిచింది. కళాశాల ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన ‘వల్లభ’ సినిమా మే 9న విడుదలవుతోంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్కి ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
అమ్మ ప్రేమ దూరం కాదు
జ్యోతి పూర్వాజ్ లీడ్ రోల్లో రవి, శ్రేయ తివారీ జోడీగా నటించిన చిత్రం ‘విచిత్ర’. సైఫుద్దీన్ మాలిక్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సిస్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం మే 22న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ– ‘‘ప్రపంచం మొత్తం దూరమైనా మనకు దగ్గరగా ఉండేది అమ్మ ప్రేమే.ప్రతి మహిళ గుండె బరువెక్కే సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిన సినిమా ‘విచిత్ర’. నిజానీ అందించిన సంగీతంలోని అన్ని పాటలు బాగా వచ్చాయి. చిత్రగారు పాడిన తల్లి సెంటిమెంట్ సాంగ్ హైలెట్గా నిలుస్తుంది’’ అన్నారు. ‘బేబీ’ శ్రీ హర్షిణి, రవిప్రకాశ్, సూర్య, ఛత్రపతి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. -
ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలి: శర్వానంద్
కెన్ కరునాస్, అనిష్క అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షీ యాదవ్, మీనాక్షీ దినేష్ ప్రధాన నటించిన తమిళ సినిమా ‘యూత్’. కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాడులో ఈ నెల 19న విడుదలైంది. ఈ చిత్రాన్ని ఈ2సీ పతాకంపై హౌస్ఫుల్ వినీత్, సందీప్ ఈ నెల 27న తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో ‘యూత్’ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని యూనిట్ పేర్కొంది.శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్మీట్కు ముఖ్య అతిథిగా హాజరైన శర్వానంద్ మాట్లాడుతూ–‘‘యూత్’ సినిమాలో ఒక 23 ఏళ్ల అబ్బాయి హీరోగా నటించడంతోపాటు దర్శకత్వం వహించి సూపర్ హిట్ కొట్టాడంటే నమ్మలేకపోయాను. ఇలాంటి మంచి మూవీస్ మరిన్ని చేయాలి’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో నేను ప్రభాస్గారి ఫ్యాన్గా నటించాను. ఆయన ఫ్యాన్స్ మా సినిమాను సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కంటెంట్ ముఖ్యమని మరోసారి నిరూపించారు. మీ ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి’’ అన్నారు కెన్ కరునాస్.‘‘మా మార్కెటింగ్ సంస్థ పేరు హౌస్ఫుల్. ఇప్పుడు మా సినిమాకు హౌస్ఫుల్ బోర్డులు చూస్తుండటం సంతోషంగా ఉంది. పిల్లలు తమ తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్తో తీసిని సినిమా ఇది’’ అన్నారు సందీప్. ‘‘మా సినిమాను సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు వినీత్. ఎగ్జిక్యూటివ్ ్రపొడ్యూసర్ సతీష్, దర్శకుడు వశిష్ట, నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడారు. -
ఐటమ్ డ్యాన్సర్గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్
అనిరుధ్తో పలు పాటలు పాడిన గ్లామరస్ సింగర్ జోనితా గాంధీ.. ఇప్పుడు ఐటమ్ సాంగ్లో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న 'డకాయిట్' కోసం తొలిసారి కాలు కదిపింది. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఈ పాటని లెక్క ప్రకారం ఈ సాయంత్రమే రిలీజ్ చేయాలి. కానీ కాస్త ఆలస్యంగా ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్కి డ్యాన్స్ నేర్పింది నేనే)ఇప్పటివరకు సింగర్గానే అందరికీ తెలిసిన జోనితా.. ఇప్పుడు అందంతో ఐటమ్ సాంగ్లోనూ ఆకట్టుకోవడం విశేషం. ఇకపోతే ఏప్రిల్ 10న 'డకాయిట్'.. తెలుగు, హిందీలో థియేటర్లలోకి రాబోతుంది. మృణాల్ ఠాకుర్ హీరోయిన్. దాదాపు నాలుగేళ్ల తర్వాత శేష్ నుంచి వస్తున్న మూవీ ఇది. చూడాలి మరి ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటాడో?(ఇదీ చదవండి: 'పెద్ది'కి దారి ఇచ్చేసిన 'లెనిన్'.. కొత్త రిలీజ్ డేట్) -
కొడుకు పేరు రివీల్ చేసిన ఆది సాయికుమార్.. అర్థం ఏంటంటే?
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్-అరుణ దంపతులకు ఈ ఏడాది జనవరిలో కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తమ కుమారుడికి నామకరణం చేసినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. చిన్నారి ఫోటోని రివీల్ చేయలేదు కానీ.. పేరుని మాత్రం వెల్లడించారు. అతనికి ‘ఇషాన్ కార్తీక్’ అనే పేరు పెట్టారు. ఈషాన్ అంటే శివుడు, కార్తీక్ అంటే.. కార్తీకేయ స్వామి. ఇలా ఇద్దరి దేవుళ్ల పేర్లు కలిసేలా తమ కొడుకు పేరును పెట్టుకున్నారు. శివుడితో పాటు కార్తికేయ స్వామి ఆశీస్సులతో తన కొడుకుకు ఇషాన్ కార్తీక్ అని పేరు పెట్టామని ఆది సాయికుమార్ ట్వీట్ చేశారు. కాగా, ఆది సాయికుమార్, అరుణల పెళ్లి 2014లో జరిగింది. అరుణ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పటికే ఈ జంటకు ఓ కూతురు ఉంది. అయితే కుమార్తె పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత, ఈ ఏడాది జనవరి 2న పండంటి బాబుకు జన్మనిచ్చారు.ఇక ఆది సాయికుమార్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘శంబాల’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈగో రాజా అనే సినిమా చేస్తున్నాడు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ పోస్టర్లో ఆది సాయికుమార్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. Today, we named our son Ishan Karthik, with the blessings of Lord Shiva and Lord Karthikeya. 🙏✨ pic.twitter.com/CPOHY7DfEA— Aadi Saikumar (@iamaadisaikumar) March 28, 2026 -
నీలి రంగు చీరలో నిధి.. పాన్ నములుతూ రష్మి
నీలి రంగు చీరలో మెరిసిపోతున్న నిధి కాశీలో పాన్ తింటూ ఎంజాయ్ చేస్తున్న రష్మితల్లి అయినా సరే కియారా అడ్వాణీ తగ్గేదే లేయువరాణిలా ఆకట్టుకునేలా నభా నటేశ్క్యూట్గా కవ్విస్తున్న హాట్ బ్యూటీ సుప్రీతసిల్క్ చీరలో మాయ చేస్తున్న శ్రుతి హాసన్ View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Kunal Mundhe (@kmundhe4442) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
అది సినిమానే కాదు.. 'ధురంధర్ 2'పై వెట్రిమారన్ షాకింగ్ కామెంట్స్!
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డును సృష్టించింది. ప్రతి ఒక్కరు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత వెట్రిమారన్ మాత్రం ఈ మూవీపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశాడు. హింసను ప్రేరేపించేలా సినిమాను తీసి వందల కోట్లు సంపాదిస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు చరిత్రను వక్రీకరించడానికి, ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడానికి సినిమాలను వాడుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.శ్రీలంక సివిల్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న'నీలిర' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో వెట్రిమారన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మనం మన కథలను చెప్పుకునేంత వరకు, మన శత్రువులు చెప్పిందే మన జీవితం. మన సొంత కథలను చెప్పుకోవడానికి మనకు ప్రజాస్వామ్యం లేదు. ఈ చిత్రం ద్వేషాన్ని ప్రొత్సహించదు. హింసను సమర్థించదు. వందల కోట్లు సంపాదించాలనే ఆశతో కొంతమంది హింసను ప్రేరేపించేలా సినిమాలను నిర్మిస్తున్నారు. కానీ ఈ చిత్రం ఒక జాతిని, ఒక మతాన్ని కానీ అపహాస్యం చేసేలా తెరకెక్కలేదు’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ..‘ఈ రోజుల్లో ప్రతీది ఒక ప్రచారంగా మారిపోయింది. మన జ్ఞాపకాలను, ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఈ ప్రచారానికి ఉంది. నోట్ల రద్దు వల్ల ఎవరు నష్టపోయారో, క్యూ లైన్లలో నిలబడి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాటన్నింటినీ మరుగున పడేసి, ద్వేషాన్ని పెంచేలా ప్రచారం చేస్తున్నారు. అది సినిమానే కాదు. చరిత్రను లేదా వాస్తవాలను వక్రీకరించి చూపడం ‘హేట్ ప్రొపగండా’కిందకే వస్తుంది’అని వెంట్రిమారన్ విమర్శించాడు.కాగా, ధురంధర్ 2 చిత్రంలో 2016లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు. పాకిస్తాన్ నుంచి వచ్చే దొంగ నోట్లను అరికట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చూపించారు. వాస్తవం ఏంటో తెలియదు కానీ.. నోట్ల రద్దు కారణంగా దేశంలో చిన్న వ్యాపారాలు అన్ని మూతబడ్డాయి. కొంతమంది డబ్బుల కోసం బ్యాంకు వద్ద క్యూ లైన్లో నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. రైతులు తమ పంటను అమ్ముకోలేక, విత్తనాలు కొనలేక తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇదే విషయాన్ని వెట్రిమారన్ ప్రస్తావిస్తూ.. సినిమాల్లో నోట్ల రద్దును ఒక గొప్ప విజయంగా చూపిస్తున్నప్పుడు, పైన పేర్కొన్న సామాన్యుల కష్టాలను ఆ సమయంలో జరిగిన ప్రాణనష్టాన్ని విస్మరించడం ‘ప్రొపగండా’ అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వెంట్రిమారన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ధురంధర్ 2 గురించే ఆయన మాట్లాడారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #Vetrimaaran indirectly attacks #Dhurandhar2:"Today everything becomes propoganda. Propoganda has power to influence memory. We all know who has impacted with demonetization & how many Lost lives in standing the queue. It's hate propoganda"pic.twitter.com/kdQgYobUCN— AmuthaBharathi (@CinemaWithAB) March 28, 2026 -
'పెద్ది'కి దారి ఇచ్చేసిన 'లెనిన్'.. కొత్త రిలీజ్ డేట్
అక్కినేని హీరో అఖిల్.. ఎలాగైనా సరే ఈసారి హిట్ కొట్టాలని అనుకుంటూ చేసిన సినిమా 'లెనిన్'. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. లెక్క ప్రకారం మే 01న థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. కానీ వాయిదా పడిన 'పెద్ది'.. ఏప్రిల్ 30న థియేటర్లలోకి వస్తుందని కొన్నాళ్ల క్రితం క్లారిటీ ఇచ్చారు. దీంతో 'లెనిన్' వాయిదా పక్కా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. అధికారికంగా కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: రెండు వారాలుగా బెడ్పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?)'లెనిన్'లో అఖిల్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు. నాగార్జున, నాగవంశీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 30న వస్తున్న 'పెద్ది'కి అండగా నిలబడదాం అని చెప్పిన 'లెనిన్' మేకర్స్.. రామ్ చరణ్, అఖిల్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని గుర్తుచేసుకున్నారు. అందుకే తమ చిత్రాన్ని జూన్ 26కు వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.జూన్ నెల ప్రారంభంలో అంటే 4వ తేదీన యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' రిలీజ్ కానుంది. ఇదొచ్చిన మూడు వారాలకు అఖిల్ 'లెనిన్' థియేటర్లలోకి రాబోతుంది. ప్రస్తుతానికైతే ఈ నెలలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. కాబట్టి కంటెంట్, టైమ్ కలిసొచ్చి అఖిల్ ఈసారైనా హిట్ కొడతాడేమో చూడాలి? ఇదివరకే ఓ పాట రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్కి డ్యాన్స్ నేర్పింది నేనే) View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) -
అల్లు అర్జున్కి డ్యాన్స్ నేర్పింది నేనే
హీరోయిన్గా అప్పట్లో తెలుగు, తమిళ సినిమాలు చేసిన రాధిక.. ప్రస్తుతం టీవీ షోలు, అడపాదడపా మూవీస్ చేస్తూ బిజీగా ఉంటోంది. తెలుగులోనూ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్న ఈమె.. రీసెంట్గా అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా అనిపించాయి. బన్నీకి డ్యాన్స్ నేర్పింది నేనే అని అనేసరికి అతడి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఓ తెలుగు ఛానెల్లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షోలో రాధిక ఈ వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్డేట్)ఆట డ్యాన్స్ షోలో ప్రీతి అనే కంటెస్టెంట్.. 'పుష్ప 2'లోని జాతర పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ క్రమంలోనే సదరు కంటెస్టెంట్ని పొగిడిన జడ్జి రాధిక.. అల్లు అర్జున్ ఇంత గొప్ప డ్యాన్సర్ కావడానికి నేనే కారణం అని చమత్కరించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో గతంలో తాను ఓ సినిమా చేశానని, అప్పుడు షూటింగ్ సందర్భంగా బన్నీకి డ్యాన్స్ నేర్పించానని గుర్తుచేసుకుంది. అలానే సమయానికి చిన్న పిల్లాడు ఎవరూ లేకపోవడంతో బన్నీ తనతో పాటు ఓ సీన్లో కలిసి నటించాడని, ఇందులో భాగంగా అల్లు అర్జున్ని ఎత్తుకుని రైల్వే ట్రాక్పై పరుగెత్తిన విషయాన్ని రాధిక గుర్తుచేసుకుంది. ఈ విషయాలన్నీ రాధిక చెబుతున్న ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.రాధిక ఈ కామెంట్స్ ఫన్నీగానే చేశారు. నెటిజన్లు కూడా అంతే సరదాగా రియాక్ట్ అవుతున్నారు. బన్నీకి మీరు డ్యాన్స్ నేర్పించారా అని మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ విషయానికొస్తే.. టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. పుష్ప, పుష్ప 2 చిత్రాలు ఇతడి స్థాయిని పెంచేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అట్లీ, లోకేశ్ కనగరాజ్లతో మూవీస్ చేస్తున్నాడు. వీటిపై బోలెడంత బజ్ ఉంది. (ఇదీ చదవండి: రెండు వారాలుగా బెడ్పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?) -
'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్డేట్
'ధురంధర్' సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది డిసెంబరులో వచ్చిన తొలి భాగంలో హీరోని డామినేట్ చేసిన విలన్గా అక్షయ్ ఖన్నా అదరగొట్టేశాడు. రహమాన్ డకాయిట్ అనే పాత్రలో జీవించేశాడు. పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇతడు నెక్స్ట్ ఓ తెలుగు సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా ఇతడి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.(ఇదీ చదవండి: మారుతికి అర్థమైంది.. హరీశ్ శంకర్కి అర్థం కావట్లేదు!)హిందీలో గతంలోనే హీరోగా పలు సినిమాలు చేసినప్పటికీ అక్షయ్ ఖన్నాకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. తర్వాత చాన్నాళ్ల పాటు సైలెంట్ అయిపోయాడు. మళ్లీ 'ఛావా', 'ధురంధర్' చిత్రాలు ఇతడికి ఓవర్నైట్ స్టార్డమ్ తీసుకొచ్చాయి. ఇవి చేస్తున్నప్పుడే తెలుగులో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోని 'మహాకాళి' మూవీలో శుక్రచార్య పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్నాడు. పూజా కొల్లూరు ఈ చిత్రానికి దర్శకురాలు కాగా.. ప్రశాంత్ వర్మ షో రన్నర్గా వ్యవహరిస్తున్నాడు. గతంలోనే ఈ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఇప్పుడు అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ చెప్పిన ప్రశాంత్ వర్మ.. ప్రతిభకు సౌండ్ అక్కర్లేదు. మీతో పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మనం ఏం సృష్టించామో ప్రపంచానికి చూపించాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, అలానే టాక్ బట్టి తెలుస్తోంది ఏంటంటే అక్షయ్ ఖన్నా షూటింగ్ పూర్తయింది. మరో 40 రోజులు చిత్రీకరణ చేస్తే మిగతా కూడా అయిపోతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కన్నడ నటి భూమి శెట్టి.. 'మహాకాళి'లో లీడ్ రోల్ చేస్తోంది.(ఇదీ చదవండి: చిరంజీవి చనిపోయారని పోస్ట్.. వ్యక్తిపై కేసు)Happy Birthday #AkshayeKhanna sir, a true actor who proves that real talent doesn't need noise. Effortless screen presence, powerful performances, and unmatched class always stand out 🎭🎬Its an absolute honour working with you. Can’t wait to show the world what we’ve created… pic.twitter.com/xiblaH8voc— Prasanth Varma (@PrasanthVarma) March 28, 2026 -
చిరంజీవి ఫొటోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి ఫొటోను ఓ వ్యక్తి ‘ఎక్స్’లో చిరంజీవి అభిమానులు ఆందోళన చెందేవిధంగా పెట్టడమే కాకుండా దానిని తొలగించాలని విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం వహించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... గచ్చిబౌలిలో నివసించే గూడెపు భాస్కర్సాయి (22) ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న సూరిబాబు అనే వ్యక్తి ‘ఎక్స్’లో చిరంజీవి ఫొటోను ఆయన మరణించినట్లు భావించే విధంగా పోస్ట్ చేశాడు. ఈ విషయం గమనించిన భాస్కర్ సదరు సూరిబాబుకు ఫోన్ చేసి ఆ ఫొటోను, పోస్ట్ను తొలగించాల్సిందిగా కోరాడు. ఇందుకు సూరిబాబు నిరాకరించడమే కాకుండా తాను పెట్టిన పోస్ట్ను అలాగే కొనసాగించాడు. ఈ ఫొటోను చూసిన వారు తీవ్ర ఆందోళనకు గురికావడమే కాకుండా చిరు అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ పోస్ట్ ఉందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ మేరకు సూరిబాబుపై బీఎన్ఎస్ సెక్షన్ 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విలన్ పాత్ర.. రూ. 20 కోట్లు డిమాండ్ చేస్తున్న స్టార్ హీరో!
విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ఆకట్టుకునే నటుడు ఫహద్ ఫాజిల్. ఈ మలయాళ నటుడికి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ‘పుష్ప’ చిత్రం తర్వాత ఆయనకు టాలీవుడ్లో విపరీతమైన క్రేజీ ఏర్పడింది. వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన ‘డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్’ మినహా..తెలుగులో ఇంకో చిత్రమేది చేయడం లేదు. తెలుగులోని బడా నిర్మాతలంతా ఆయన కోసం క్యూ కడుతున్నా.. ఒక్క ప్రాజెక్ట్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. దానికి కారణం రెమ్యునరేషన్.తెలుగు సినిమాలో విలన్గా నటించడానికి భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. హీరోగా కాకుండా విలన్గా నటించాలంటే.. రూ. 15-20 కోట్లు ఇవ్వాల్సిందేనని కండీషన్ పెడుతున్నారట. అంత మొత్తంలో ఇచ్చుకోలేక.. నిర్మాతలకు వెనుకంజ వేస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అందుకే ఫహద్కు టాలీవుడ్లో అవకాశాలు రావడం లేదు.అనిల్ రావిపూడి తెరకెక్కించే కొత్త సినిమాలో వెంకటేశ్తో పాటు ఫహద్ని కూడా అనుకున్నాడట. అయితే పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేయడంతో.. ఆ స్థానంలో కల్యాణ్ రామ్ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే రామ్ సినిమాలోనూ విలన్గా ఫహద్నే తీసుకోవాలనుకున్నారట. అక్కడ కూడా పారితోషికం విషయంలోనే ఇబ్బందులు ఎదురై.. చివరకు వదిలేశారట. ఫహద్ని తీసుకుంటే మలయాళంతో పాటు పాన్ ఇండియా మార్కెట్కి కూడా ప్లస్ అవుతుందని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారు. అయితే భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో.. అంత ఇచ్చుకోలేక ఇతర నటులవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పాటు ఫహద్ కూడా రొటీన్ విలన్ పాత్రలు చేయడానికి ఇష్టపడడం లేదట. తనకు గుర్తింపు తెచ్చేలా ఉంటేనే ఆ పాత్రలో నటించేందుకు ముందుకు వస్తున్నాడట. లేదంటే హీరోగా సినిమాలు చేసుకుందామనే ఆలోచనలోనే ఉన్నారట. విలన్ కంటే హీరో పాత్రలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. -
‘మన్యం ధీరుడు’కి ఉత్తమ చిత్ర అవార్డు
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డు 2026 గాను ఆర్ వి వి సత్యనారాయణ నటించి నిర్మించిన చిత్రం మన్యం ధీరుడు కు ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. మలేషియా తెలుగు సంఘం క్లాంగ్ శాఖ ఆధ్వర్యంలో సుందర్ పెరుమాళ్ ఆలయం ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగిన ఉగాది వేడుకలలో ఉగాది పురస్కార్ 2026 ఉత్తమ చిత్ర అవార్డును మన్యం ధీరుడు చిత్రానికి ఇవ్వడం జరిగింది. మలేషియా తెలుగు సంఘం చైర్మన్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉగాది వేడుకల్లో ముఖ్య అతిథిగా కాంగ్ ఉత్తర జిల్లా పోలీస్ కమిషనర్ విజయరావు చేతుల మీదుగా ఆర్ వి వి సత్యనారాయణ మరియు శ్రీమతి ఆర్ పార్వతి దేవి దంపతులను ఘనంగా సత్కరించి పురస్కార ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులు సుబ్రమణ్యం రామానాయుడు కమిటీ మెంబర్స్ 600 మంది తెలుగు సంఘం సభ్యులు పాల్గొన్నారు.ముఖ్యఅతిథి పోలీస్ కమిషనర్ విజయరావు మాట్లాడుతూ మన తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు గాధను మన్యం ధీరుడు పేరును తరికెక్కిచ్చిన భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఆర్ వి వి సత్యనారాయణకు ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ సినిమాలో దేశభక్తిని చాటుతూ ఒక దేశభక్తి గీతాన్ని ఆలపించి ఆ గీతం భారతదేశంలో ప్రతి పౌరుడు ఆలపించే విధంగా ఆ పాటను తీర్చిదిద్దారు ఆర్ వి సత్యనారాయణ గారు అని కొనియాడారు. -
బరిలో వరుణ్ తేజ్.. ఫస్ట్ వీడియో చూశారా?
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా బరి నుంచి పోస్టర్ వీడియోను విడుదల చేశారు. దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీని నిహారిక కొణిదెల తన బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై నిర్మిస్తున్నారు. నేడు పూజా కార్యక్రమంతో మొదలైన ఈ మూవీ నుంచి తాజాగా ‘ది వరల్డ్ ఆఫ్ బరి’ (The World Of Bhari) పేరుతో పవర్ఫుల్ వీడియోను పంచుకున్నారు. 2027 సంక్రాంతికి పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. -
అమెరికాలో ఉస్తాద్ కలెక్షన్స్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో విడుదలైన కొత్త మూవీ ‘ఉస్తాద్ భగత్సింగ్’. మార్చి 19న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఉగాది, రంజాన్ సెలవులు ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా నిరాశపరిచింది. తొమ్మిదిరోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 68.06 కోట్ల నెట్ రాబట్టినట్లు సాక్నిల్క్ ట్రేడ్ సంస్థ ప్రకటించింది. అయితే, ఓవర్సీస్లో ఉస్తాద్ కనీసం 1మిలియన్ మార్క్ కూడా దాటలేదు. ఆపై శుక్రవారం నాడు నార్త్ అమెరికాలో ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.నార్త్ అమెరికాలో ఉస్తాద్ భగత్సింగ్ ఇప్పటి వరకు రూ. 6 కోట్లు మాత్రమే రాబట్టింది. అక్కడ లాభాల్లోకి ఈ చిత్రం రావాలంటే కనీసం మరో రూ. 7 కోట్లు రాబట్టాలి. లేదంటే భారీ నష్టాలు తప్పవు. ఇప్పటి వరకు ఈ సినిమా కనీసం 1 మిలియన్ డాలర్ల మార్కును కూడా అక్కడ అందుకోకపోవడంతో ట్రేడ్ నిపుణులు నివ్వెరపోయారు. శుక్రవారం నాడు అయితే అమెరికాలో కేవలం 4వేల డాలర్లు రూ. 3.79 లక్షలు మాత్రమే రాబట్టింది. సినిమా డిజాస్టర్ కావడంతో చాలాచోట్ల ఉస్తాద్ను తొలగించేశరాఉ. ఇది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద తమ అంచనాలను నిరాశపరిచినందుకు దర్శకుడు హరీష్ శంకర్ను చాలామంది ఫ్యాన్స్ నిందిస్తున్నారు. దీంతో ఆయన సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నారు. అయితే, అమెరికాలో ధురంధర్-2 దుమ్మురేపుతుంది. ప్రస్తుతం రూ. 275 కోట్లు సాధించి రికార్డ్ నెలకొల్పింది. North America Thursday Gross | Totals: #DhurandharTheRevenge - $643K | $18.06M#Aadu3 - $8K | $465K#BandMelam - $6K | $8K#Youth - $4K | $98K#UstaadBhagatSingh - $4K | $780K— Venky Box Office (@Venky_BO) March 27, 2026 -
స్టార్ హీరోయిన్ను అన్ఫాలో చేసిన రిషబ్ శెట్టి
కాంతార సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టికి గుర్తింపు దక్కింది. అయితే, ఈ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్తో బంధం తెంచుకున్నారని వార్తలు వచ్చాయి. సోషల్మీడియా చిత్ర నిర్మాణ సంస్థ అధికార ఖాతాను అన్ఫాలో చేయడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా తనతో పాటు నటించిన వారిని కూడా తన ఇన్స్టాలో అన్ఫాలో చేయడం కన్నడ పరిశ్రమలో వైరల్ అవుతుంది.కాంతార మూవీలో తనతో పాటు నటించిన రుక్మిణి వసంత్ను కూడా రిషబ్ శెట్టి అన్ఫాలో చేశారు. ఆపై తన ఆప్త మిత్రుడైన రాజ్.బి.శెట్టిలను కూడా సోషల్ మీడియాలో ఫాల్ కావడం ఆపేశాడు. రెండురోజుల క్రితం హోంబలే ఫిల్మ్స్ ఖాతాను అన్ ఫాలో చేసిన రిషబ్.. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేయడంతో కాంతార టీమ్తో ఏమైనా గొడవలు ఉన్నాయా అనే అనుమానం మొదలైంది. అయితే, హోంబలే ఫిల్మ్స్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. అయితే, రోజుల వ్యవధిలోనే ఇలా మూడు ముఖ్యమైన అకౌంట్లను రిషబ్ అన్ ఫాలో చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ అంశం గురించి రిషబ్ శెట్టితో పాటు నిర్మాణసంస్థ నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ప్రస్తుతం రిషబ్ తన తదుపరి మూవీ జై హనుమాన్ పనిలో ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో రిషబ్ కనిపించనున్నారు. -
అన్నయ్య కోసం 'బరి'లోకి దిగిన చెల్లెలు
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రకటించారు. అయితే, ఈ ప్రాజెక్ట్ను నిహారిక కొణిదెల తన బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి బరి అనే టైటిల్ను ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆపై ‘బరి’ మూవీకి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.‘కమిటీ కుర్రోళ్లు’ మూవీతో భారీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ యదు వంశీ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని నిహారిక అధికారికంగా ప్రకటించారు. నేడు పూజా కార్యక్రమం జరిగింది. కుటుంబ బ్యానర్లో వరుణ్ తేజ్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్-కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇదే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది.Power Star #PawanKalyan garu at our Mega Prince @IAmVarunTej 's New movie #Bhari Opening ceremony#VarunTej #NiharikaKonidela pic.twitter.com/fXPOmdT3SS— Milagro Movies (@MilagroMovies) March 28, 2026 -
ధురంధర్- 2లో దర్శకుడి సతీమణి.. అండర్ కవర్ ఏజెంట్గా ఎంట్రీ
రణవీర్ సింగ్- దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ధురంధర్-2.. గతేడాది విడుదలైన పార్ట్-1కు సీక్వెల్గా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. అయితే, దర్శకుడు ఆదిత్య ధర్ సతీమణి యామీ గౌతమ్ తాజాగా ఈ మూవీని చూశారు. ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తన సోదరితో రహస్యంగా ప్రేక్షకులతో పాటుగా మూవీని చూశారు.గౌరవం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యామీ గౌతమ్.. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్తో భారీగా పాపులర్ అయింది. దర్శకుడు ఆదిత్య ధర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. 'ఉరి' మూవీ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో ఇది రెండో చిత్రం కావడం విశేషం.ధురంధర్-2లో యామీ గౌతమ్ నర్స్ కమ్ అండర్ కవర్ ఏజెంట్ 'షాజియా బానో'గా నటించారు. తెరపై ఆమె కనిపించగానే కాస్త సిగ్గుగా చూస్తూ, చిరునవ్వుతో నిశ్శబ్దంగా ఉండమని తన సోదరి సురిలీ గౌతమ్ని సైగ చేసింది. ఈ ముచ్చటైన క్షణాన్ని సురిలీ కెమెరాతో వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్లో "మూవీ టైమ్" అనే క్యాప్షన్తో అప్లోడ్ చేసింది. ఆ క్లిప్లో 'ధురందర్ 2'లో నర్సుగా యామీ చేసిన అతిథి పాత్రను చూపిస్తుంది. ఆ తర్వాత ఆమె కెమెరాను ఆ నటి వైపు తిప్పుతుంది. థియేటర్లో ఆ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు యామీ నవ్వుతూ, సిగ్గుపడుతూ కనిపించింది. ఆ తర్వాత ఆమె తన సోదరిని నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది. Yami Gautam blushing watching herself on *Dhurandhar* screen , how cute!❤️❤️❤️Yami Gautam Dhar ☆ Aditya Dhar #Dhurandhar2TheRevenge https://t.co/L0Zoy6GQ9K pic.twitter.com/mEh2vvlgtl— JyotiKarma🚩🇮🇳 (@JyotiKarma7) March 27, 2026Spotted! ❤️ Yami Gautam enjoying #Dhurandhar2 like a true fan in a packed theatre—supporting hubby Aditya Dhar & even cheering her own cameo! 🔥 #DhurandharTheRevenge pic.twitter.com/2b0sXIGRnk— Smita Patil (@patil45802) March 27, 2026 -
అనుష్కపై ఆగని ట్రోలింగ్స్
సెలబ్రిటీలకు రాజభోగం ఆరు, వదంతుల తలనొప్పి 12 అన్నంతగా పరిస్థితులు మారుతున్నాయని చెప్పవచ్చు. మొదట్లో ఎన్నో అవమానాలు, అవరోధాలను ఎదుర్కొని, ఎంతో శ్రమించి ఉన్నత స్థాయికి చేరుకున్న వారికి వివిధ రూపాల్లో వచ్చే వదంతులు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయా అంటే కచ్చితంగా అవుననే బదులే వస్తోంది. ముఖ్యంగా సినీ నటీమణులను ఇలాంటి వదంతులు చుట్టుముట్టి అశాంతికి గురిచేస్తున్నాయని చెప్పవచ్చు. వాస్తవానికి వదంతులను చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అయితే ఒక్కోసారి వ్యక్తి గత విషయాలపై అవాస్తవాలు ప్రచారం అయినప్పుడు అలాంటి వాటిని ఖండించాల్సి వస్తుంది. అనుష్క పరిస్థితి ఇలాంటిదే. ఈ బెంగళూరు భామ నటనలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారనే చెప్పాలి. మొదట్లో అందాలారబోతతో యువతను అలరించినా, సరైన పాత్ర వేస్తే తన తడాఖా చూపిస్తానని అరుంధతి చిత్రంతో నిరూపించుకున్నారు. ఆ మధ్య సైజ్ జీరో అనే చిత్రంలోని పాత్ర కోసం బరువు భారీగా పెరిగిన అనుష్క ఆ తరువాత బరువు తగ్గడానికి చేసిన ఏ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. దీంతో అవకాశాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉంటే ఈమె వ్యక్తి గత జీవితంపై ట్రోలింగ్స్ వైరల్ అవడం, ముఖ్యంగా అనుష్క పెళ్లి వదంతులు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఈమె చాలా సార్లు ఖండించారు. వయసును ప్రస్తావించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అనుష్క గురించి ఏదో ఒక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా అనుష్కకు పెళ్లి నిశ్చితార్థం జరిగిందని, ఆమె ఒక వ్యక్తి చెయ్యి పట్టుకుని నడుస్తున్న ఫొటోను పోస్ట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారన్నారు. వాస్తవానికి ఆ ఫొటో 2016లో జరిగిన ఒక ఫ్యాషన్ కార్యక్రమానికి చెందింది. ఇలా వాస్తవాలను తెలుసుకోకుండా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఏది నిజమో ? ఏది అవాస్తవమో తెలియని పరిస్థితి నెలకొంటోంది. -
బిగ్బాస్ బ్యూటీ దివి శ్రీరామనవమి లుక్.. పట్టు పరికిణిలో అరియానా గ్లోరీ..!
బిగ్బాస్ బ్యూటీ దివి శ్రీరామనవమి లుక్..పట్టు పరికిణిలో అరియానా గ్లోరీ అందాలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ గ్లామర్..వైట్ డ్రెస్లో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హోయలు.. బాలిలో చిల్ అవుతోన్న హీరోయిన్ లక్ష్మీ రాయ్ View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
ప్రియదర్శి సస్పెన్స్ థ్రిల్లర్ సుయోధన.. ఆడియన్స్ను మెప్పించిందా?
టాలీవుడ్ హీరో ప్రియదర్శి విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా 'సుయోధన' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చారు. ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్గా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 27న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రల్లో నటించారు. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్పై బోసుబాబు నిడుమోలు నిర్మించారు. ఈ మూవీతో ప్రియదర్శి మరో హిట్ కొట్టాడా? లేదా అన్నది రివ్యూలో చూద్దాం.ఈ మూవీ కథేంటంటే..వరుణ్ (ప్రియదర్శి) ఒక 'ఫోలే' (సౌండ్ డిజైనర్) ఆర్టిస్ట్. వరుణ్కి చిన్నప్పటి నుంచి 'సుయోధన' అనే ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో దుర్యోధనుడి ఆకారం కళ్ల ముందే ఉన్నట్లు అనిపిస్తుంది. అది విన్నప్పుడల్లా, చూసినప్పుడల్లా భయపడుతుంటాడు. వరుణ్ తండ్రి మద్దులూరి ప్రకాష్ (సాయి కుమార్) నాటకాలు వేస్తుంటారు. ఆయనకు దుర్యోధనుడి పాత్రంటే చాలా ఇష్టం. ఇది చూసే వరుణ్ భయపడుతున్నాడని అతని తల్లి రాధమ్మ, డాక్టర్లు చెప్పడంతో.. ప్రకాష్ నాటకాలు ఆపేస్తారు. ఇక వరుణ్ ఫోలీ స్టూడియో పెట్టుకొని జీవితం సాగిస్తుంటాడు. అప్పుడే సమిత (ద్రిషిక చందర్) ఒక డెమో ఫిల్మ్ షూటింగ్ చేయడానికి రాగా.. వరుణ్కు పరిచయం అవుతుంది. సమిత షూట్ చేసిన ఓ పాత్ర అతనికి దుర్యోధనుడిలా కనిపిస్తుంది. తనకు ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఒకానొక సందర్భంలో అతని తండ్రి ప్రకాశే వరుణ్కు దుర్యోధనుడిగా కనిపిస్తాడు. ఆ తర్వాత వరుణ్ తండ్రి హత్యకు గురవుతాడు. అసలు వరుణ్ తండ్రిని చంపింది ఎవరు? హత్యలో ఏదైనా రాజకీయ కోణం ఏంటి? సుయోధన అనే శబ్దం వరుణ్కే ఎందుకు వినిపిస్తోంది? అసలు ఈ సినిమాలో సుయోధన ఎవరు? అనేది తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే.ఎలా ఉందంటే..హీరో ప్రియదర్శికి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ పాత్ర కొత్తే అయినప్పటికీ.. గతంలో ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఇక్కడ టాలీవుడ్ ప్రేక్షకులకు 'ఫోలే' ఆర్టిస్ట్ అనేది కొత్త యాంగిల్ నచ్చిందనే చెప్పాలి. సినిమాలో వచ్చే శబ్దాలను ఇలా రికార్డ్ చేస్తారా? అనే విషయం సుయోధన ద్వారా ప్రేక్షకులకు అర్థమైంది. స్క్రీన్ ప్లేతో పాటు సినిమాలోని కొన్ని ట్విస్టులు ఆడియన్స్ను మెప్పిస్తాయి.సినిమా ప్రారంభం నుంచే డైరక్టర్ సస్పెన్స్ క్రియేట్ చేయడంలోచాలా వరకు సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకుల్లో వాట్ నెక్ట్స్ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ఈ కథలో 'సౌండ్' కీ రోల్ ప్లే చేసింది. దర్శకుడు మాధవ్ రెడ్డి ఎంచుకున్న పాయింట్ బాగుంది. అయితే అక్కడక్కడ కొంత ల్యాగ్ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మాత్రం కాస్తా ఎంగేజింగ్గా ఉంటుంది. కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరింత ఆసక్తిగా ఉంటే బాగుండేది. దర్శకుడికి తొలి సినిమా అయినా తడబడకుండానే తెరకెక్కించాడు. ఈ కథ సైకలాజికల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. పొలిటికల్ డ్రామా, మదర్ సెంటిమెంట్ కూడా బాగానే వర్కవుట్ అయింది. ఓవరాల్గా ఆడియన్స్కు ఓ కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సుయోధన. రొటీన్కు భిన్నంగా.. వినూత్నమైన మిస్టరీ థ్రిల్లర్ను చూడాలనుకుంటే 'సుయోధన' ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..ప్రియదర్శి మరోసారి తన పాత్రలో అదరగొట్టేశాడు. సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుర్యోధనుడి పాత్రతో మెప్పించారు. ఆయన డైలాగ్స్, నటనతో ఈ సినిమాకు ప్లస్. సీనియర్ హీరోయిన్ ప్రేమ తల్లి పాత్రలో ఆకట్టుకున్నారు. హీరోయిన్ ద్రిశికా చందర్ తన గ్లామర్తో అలరించింది. విష్ణు ఓయ్, దేవి ప్రసాద్ తమ పాత్రల పరిధిలో ఫర్వాలేదనిపించారు. సినిమాలో హీరో సత్యదేవ్, బిత్తిరి సత్తి కూడా అలా వచ్చి ఇలా వెళ్లారు. సాంకేతికపరంగా చూస్తే సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రాణం పోశాయి. జై క్రిష్ అందించిన సంగీతం ఫర్వాలేదు. ముఖ్యంగా కథకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు ఉన్నతంగా బాగున్నాయి. -
మెగాస్టార్ విషెస్.. మెగా కోడలు ఉపాసన రియాక్షన్
గ్లోబల్ స్టార్ రామ్చరణ్కు పుట్టినరోజు వేడుకను మెగాస్టార్ ఫ్యామిలీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇవాళ తనయుడి బర్త్ డే కావడంతో వృద్ధులకు భోజనాలు వడ్డించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఈ వేడుక నిర్వహించారు. అంతకుముందు తనయుడు రామ్ చరణ్పై తన ప్రేమను చాటుకున్నారు. చరణ్ బాల్యంలో జరుపుకున్న పుట్టినరోజు ఫోటోను అభిమానులతో మెగాస్టార్ పంచుకున్నారు.తాజాగా మెగాస్టార్ చేసిన పోస్ట్కు మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల స్పందించింది. మా చిన్న కూతురు అన్వీరా దేవి.. అచ్చం నాన్న రామ్ చరణ్ లాగే ఉంటుందని కామెంట్ చేసింది. కాగా.. ఈ ఏడాది జనవరి 31 ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరికి అన్వీరా దేవి, శివరామ్ అనే పేర్లు పెట్టారు. అంతకుముందు ఈ జంటకు ఓ పాప పుట్టగా.. క్లీంకార అని నామకరణం చేశారు. Charan Babu…❤️❤️❤️From holding my hand as a child to becoming an inspiration to many today… You make me truly proud.The way you balance cinema and personal life, your sense of responsibility towards family, your faith in God, discipline, and values… every time I see it, my… pic.twitter.com/MMg5fYYo3k— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2026 -
శ్రీరామనవమి స్పెషల్.. ఆయనకు అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీరామనవమి పండుగను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరాములవారి విశిష్టతను జపాన్కు చెందిన ప్రముఖ గీక్ పిక్చర్స్ సీఈవో టోమట్సు కోసానోకు వివరించారు. శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారామ కళ్యాణం' చిత్రపటాన్ని ఆయనకు బహుకరించారు. ఈ వీడియోను అల్లు అర్జున్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇక ఐకాన్ స్టార్ బన్నీ విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ డైరక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిపారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. A reflection of his love for Indian culture and traditions. 🤍Icon Star @AlluArjun presented a Sita Rama Kalyanam painting to Geek Pictures CEO Mr. Tomatsu Kosano, explaining the historical and spiritual essence of the Ramayana.🙏A beautiful moment of cultural exchange… pic.twitter.com/T4dOeoBqxc— Team Allu Arjun (@TeamAAOfficial) March 27, 2026 -
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఇంట్లోనే ప్రత్యేక హోమం
మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ సంతోషంతో అభిమాన హీరో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు తమ హీరోకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తన కుమారుడి బర్త్ డేను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిన్ను చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.చెర్రీ బర్త్ డేను మెగా కుటుంబం ఓ పండుగలా నిర్వహిస్తున్నారు. తాజాగా ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లోనే ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు గ్లోబల్ స్టార్. శ్రీరామనవమి రోజే రామ్ చరణ్ బర్త్ డే రావడంతో మెగా కుటుంబంలో ఆనందం మరింత రెట్టింపైంది. రామ్ చరణ్ హోమం నిర్వహించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఇవాళ చెర్రీ బర్త్ డే సందర్భంగా పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో పహిల్వాన్గా రామ్ చరణ్ సరికొత్త లుక్లో కనిపించారు. ఈ రోజు రిలీజైన గ్లింప్స్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. On the auspicious occasion of #SriRamaNavami and Mega Powerstar #RamCharan’s birthday, Megastar #Chiranjeevi performed a special homam at his residence, seeking divine blessings. ✨ pic.twitter.com/6G0baHvhXo— Filmy Focus (@FilmyFocus) March 27, 2026 -
మెగాస్టార్ గొప్పమనసు.. రామ్ చరణ్ తరఫున బర్త్ డే గిఫ్ట్
మెగా తనయుడు రామ్ చరణ్ బర్త్ డే వేళ మెగాస్టార్ తన గొప్ప మనసును చాటుకున్నారు. కుమారుడి పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ బహుమతి పురస్కారం రూ.10 లక్షల నగదు మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళమిచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న సర్వ్ ఫౌండేషన్, అంధుల కోసం పని చేస్తున్న దేవనార్ ఫౌండేషన్, చిన్నారులను సంరక్షిస్తున్న వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతోపాటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి కూడా మెగాస్టార్ విరాళంగా ఇచ్చారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్లో రామ్ చరణ్ను కలిసిన వృద్ధులను మెగాస్టార్ తన బ్లడ్ బ్యాంక్కు ఆహ్వానించారు. వారందరికీ బర్త్ డే గిఫ్ట్గా కొత్త దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం తానే స్వయంగా వారందరికీ భోజనాలు పెట్టించారు. -
వెంకటేశ్-అనిల్ రావిపూడి.. మళ్లీ ఆయనతోనే
ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. కొన్నాళ్ల క్రితమే వెంకటేశ్-కల్యాణ్ రామ్ కాంబోలో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం త్వరలో లాంఛనంగా మొదలు కాబోతుంది. ఇంతలోనే ఒక్కో అప్డేట్ రివీల్ చేస్తున్నారు. తాజాగా నిర్మాతలు ఎవరనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన)అనిల్ రావిపూడితో 'భగవంత్ కేసరి', 'మన శంకరవరప్రసాద్' తీసిన సాహు గారపాటి.. మూడోసారి ఈ మూవీ కోసం కలిసి పనిచేయబోతున్నారు. అలానే సురేశ్ బాబు, జీ స్టూడియోస్ కూడా నిర్మాణంలో పాలుపంచుకోనున్నాయి. ఈ మేరకు శ్రీరామనవమి సందర్భంగా పోస్టర్స్ రిలీజ్ చేసి అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు.ఇందులో వెంకటేశ్, కల్యాణ్ రామ్కి జంటగా కీర్తి సురేశ్, కృతిశెట్టిలని అనుకుంటున్నారని గత కొన్నిరోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. త్వరలో హీరోయిన్లపై క్లారిటీ ఇవ్వడంతో పాటు లాంఛనంగా ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అలానే సంగీత దర్శకుడిగా భీమ్స్నే అనిల్ తీసుకుంటాడా? లేదా వేరే వాళ్లకు అవకాశమిస్తాడా అనేది చూడాలి. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.(ఇదీ చదవండి: హరీశ్ శంకర్కి ఇంకా అర్థం కావట్లేదు!) View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema) -
మారుతికి అర్థమైంది.. హరీశ్ శంకర్కి అర్థం కావట్లేదు!
ఏ సినిమా గానీ హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? అని రిలీజైన రోజే అందరికీ అర్థమైపోతుంది. కాకపోతే ఫ్లాప్ అనే నిజాన్ని ఒప్పుకొనే ధైర్యం అందరికీ ఉండదు. కొందరికి మొదట్లోనే సీన్ అర్థమైపోతే మరికొందరికి మాత్రం ఎప్పటికి అర్థం అవుతుందో అని సందేహం కలుగుతుంది. ఎందుకంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంతో గతవారం పలకరించిన దర్శకుడు హరీశ్ శంకర్.. మూవీ ఫ్లాప్ అయినా సరే విడిచిపెట్టట్లేదు. తాను తీసింది సూపర్ హిట్ అనే రేంజులో ప్రమోట్ చేసుకుంటున్నారు. తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్కి ఇచ్చిన సమాధానమైతే మరీ విచిత్రంగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలోనూ మొత్తం డిస్కషన్ ఈయన గురించే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన)గతంలో పవన్తో 'గబ్బర్ సింగ్' అనే రీమేక్ తీసి హిట్ కొట్టిన హరీశ్ శంకర్.. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'తో వచ్చాడు. దాదాపు అప్పటి తరహా టెంప్లేట్ స్టోరీ కావడం, మూసగా ఉందనే నెగిటివ్ టాక్ రావడంతో తొలిరోజు నుంచి నిర్మాతలు సైలెంట్ అయిపోయారు. ప్రతి మూవీకి కలెక్షన్స్ ప్రకటించే వీళ్లు.. 'ఉస్తాద్' విషయంలో మౌనం పాటించారు. అందరికీ అప్పుడే ఫలితం అర్థమైపోయింది. దర్శకుడు హరీశ్ శంకర్ మాత్రం తాను తీసింది హిట్ అనే రేంజులో ఇంటర్వ్యూలు, మీటప్స్ పెడుతూ బిజీ అయిపోయాడు. అందులో ఈయన, హీరోయిన్లు తప్పితే మరో టెక్నీషియన్ కనిపించలేదు.రెండు నెలల క్రితం అంటే సంక్రాంతికి వచ్చిన 'రాజాసాబ్' రిలీజ్కి ముందు దర్శకుడు మారుతి కూడా ఇలానే చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. తీరా థియేటర్లలోకి మూవీ వచ్చిన తర్వాత విషయం అర్థమైపోయి సైలెంట్ అయిపోయాడు. అభిమానులు ఎంతలా ట్రోల్ చేసినా సరే అవన్నీ భరిస్తూ వచ్చాడు తప్పితే ఏది పడితే అది మాట్లాడలేదు. హరీశ్ శంకర్ మాత్రం సినిమాలో తప్పుల్ని కూడా సమర్థించుకుంటున్నాడు. పవన్ ఎంట్రీ సీన్పై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. మాస్టర్ తీసింది, తాను తీసింది నచ్చడంతోనే రెండుషాట్స్ పెట్టానని చెప్పేసరికి నెటిజన్ల మతిపోతోంది. హిట్ అయిన సినిమా గురించి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది గానీ ఫ్లాప్ అయిన మూవీ గురించి పదేపదే మాట్లాడినంత మాత్రాన అది హిట్ అయిపోదు. ఈ విషయం హరీశ్ శంకర్ ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో?(ఇదీ చదవండి: 'రాజాసాబ్' ఫ్లాప్ నుంచి కోలుకున్న మారుతి.. పోస్ట్ వైరల్) -
మహేశ్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫోటో వైరల్
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఓ గుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రత్యేకత ఏంటంటే.. ఆ విగ్రహం అచ్చం మహేశ్ బాబులాగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఓ దేవాలయంలో ఆ రాముడి విగ్రహం ఉందని ఓ నెటిజన్ పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది.ఏఐ ఫోటో?అయితే సదరు నెటిజన్ ఆ విగ్రహం ఉన్న గుడి పేరు చెప్పకుండా ‘15 ఏళ్ల క్రితం ఆంధ్రాలో ఎక్కడో గుడిలోని రాముడు.. అచ్చం మహేశ్ బాబులాగే కనిపిస్తున్నాడు’ కదా అని పోస్ట్ పెట్టడంతో.. అది నిజమైన విగ్రహం కాదేమో అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నిజంగానే ఉంటే.. ఈ పాటికే అందరికి తెలిసిపోయేది కదా? అని కామెంట్ చేస్తున్నారు. కేవలం వ్యూస్, రీచ్ కోసమే ఇలాంటి ఏఐ ఫోటోలను షేర్ చేస్తున్నారంటూ కొంతమంది నెటిజన్స్ మండిపడుతున్నారు. మహేశ్ అభిమానులు అయితే.. శ్రీరాముడిగా కనిపిస్తున్న తమ హీరోని చూసుకొని మురిసిపోతున్నారు.రాముడిగా మహేశ్?మహేశ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రూ. 1000 కోట్ల బడ్జెట్ లో హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేశ్..రాముడిగా కనిపిస్తాడని రాజమౌళి చెప్పాడు. మహేశ్ బాబును పోలిన రాముడి విగ్రహం వైరల్ కావడానికి అది కూడా ఒక కారణం. 15 years back andhra lo ekkado gudilo Ramudu Mahesh lage kanipisthunadu kada pic.twitter.com/zI3KXBExN0— 000009 (@ui000009) March 27, 2026 -
'రాజాసాబ్' ఫ్లాప్ నుంచి కోలుకున్న మారుతి.. పోస్ట్ వైరల్
ఈ సంక్రాంతికి వచ్చి ప్రేక్షకుల్ని దారుణంగా నిరాశపరిచిన సినిమా 'రాజాసాబ్'. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్ర ట్రైలర్స్ చూసి, దర్శకుడు మారుతి మాటల్ని నమ్మి.. అభిమానులు హైప్ పెంచేసుకున్నారు. తీరా చూస్తే వాళ్లని దారుణంగా మోసం చేశారు! కంటెంట్ ఓ మాదిరిగా ఉండగా.. విజువల్ ఎఫెక్ట్స్, హెడ్ మార్పింగ్ లాంటివి మరీ ఎక్కువగా ఉండేసరికి చాలామంది ఇప్పటికీ మారుతిని విమర్శిస్తూనే ఉన్నారు. అలా గత కొన్నేళ్లుగా బయట కనిపించని మారుతి.. చాన్నాళ్లకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. తన కొత్త మూవీ గురించి అప్డేట్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: తిరుపతిలో సింపుల్గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో)శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పిన దర్శకుడు మారుతి.. ప్రతి ప్రయాణం ఓ అనుభవమే అని 'రాజాసాబ్' ఫెయిల్యూర్ని గుర్తుచేసుకున్నాడు. తన కొత్త మూవీ స్క్రిప్ట్ చివరి దశలో ఉందని, దీనిపై రాముడి ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తనకు అండగా నిలబడిన మీడియా, సన్నిహితులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.చూస్తుంటే 'రాజాసాబ్' ఫ్లాప్ నుంచి మారుతి కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. అయితే ఇతడి తర్వాతి సినిమాకు 'హ్యాపీ పొంగళ్' అనే టైటిల్ అనుకుంటున్నట్లు, మెగా హీరో అయిన వైష్ణవ్ తేజ్తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడనే రూమర్స్ వస్తున్నాయి. మరి ఇవి నిజమా కాదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఈ చిత్రంతో మారుతి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి. లేదంటే మాత్రం కష్టమే!(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన)Every journey is a learning experience. On this auspicious occasion of #SriRamaNavami, I’m grateful to be giving final touches to my next script with His blessings 🙏A heartfelt thank you to all my audience, well-wishers and the media for constantly supporting me and sharing… pic.twitter.com/TXGf0rpGSk— Director Maruthi (@DirectorMaruthi) March 27, 2026 -
ఆదిత్య ధర్కు పాకిస్తాన్ ప్రజల వింత డిమాండ్
రణ్వీర్ సింగ్- ఆదిత్యధర్ కాంబినేషన్ సినిమా ‘ధురంధర్2’ హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. గతేడాది విడుదలైన ‘ధురంధర్-1’ సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 1000 కోట్ల మార్క్ను దాటేసింది. అయితే, ఈ కలెక్షన్స్ గురించి పాక్స్తాన్లోని ల్యారీ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశంపై ఒక వీడియో వైరల్ అవుతుంది.ధురంధర్-2 కలెక్షన్స్పై నెటిజన్లకు నవ్వు పుట్టించేలా ఈ వీడియో ఆసక్తిగా ఉంది. ఈ మూవీలో ఎక్కువగా కరాచీలోని ల్యారీ ప్రాంత నివాసుల జీవితం గురించి చూపించారు. ఇప్పుడు ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో అక్కడి ప్రజలు సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. ధురంధర్-2 రూ. 1000 కోట్లు వసూలు చేసింది కాబట్టి, దర్శకుడు ఆదిత్య ధర్ అందులో నుంచి రూ. 500 కోట్లు తిరిగి తమకు ఇచ్చేయాలని, ఆ డబ్బుతో తమ ల్యారీ ప్రాంతంలో మంచి రోడ్లు నిర్మించుకుంటామని వారు కోరడం విశేషం.ఎంతో చమత్కారంగా ఉన్న ఈ వ్యాఖ్యలు నెటిజన్ల మనసులను తాకింది. దీంతో వారు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ల్యారీ ప్రజల నిజ జీవిత సమస్యలను సినిమాలో చాలా చక్కగా చూపించారని కూడా వారు అంటున్నారు. తమ జీవితాలు ఎలా ఉంటాయో ఈ మూవీ ద్వారా ప్రపంచానికి చూపించారని దర్శకుడిపై వారు ప్రశంసలు కూడా కురిపించడం విశేషం.Pakistani delulu aawam is saying that Aditya Dhar will earn 1000 Crore from #Dhurandhar2TheRevenge , he should return back 500 crore to Lyari because we don't have good roads here 😭😭😭😂😂😂😂 pic.twitter.com/kBdtGYvPla— Chota Don (@choga_don) March 27, 2026 -
క్షమాపణలు చెప్పనక్కర్లేదు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని చోట్ల మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వృత్తి జీవితంలో సర్దుకొని పోవాల్సి వస్తుంది. చాలా సందర్భాలలో తమ అభిప్రాయాలు, లక్ష్యాలు, ప్లాన్లు అన్నీ ఇతరులకు అనుకూలంగా మార్చుకుంటారని, అది త్యాగమని కూడా భావించకుండా..ముందుకు సాగుతున్నారు’ అని స్టార్ హీరోయిన్ సమంత ఆవేదన వ్యక్తం చేసింది. సమాజంలో గుర్తింపు పొందేందుకు పురుషులతో పోలిస్తే మహిళలలు మరింత కష్టపడాల్సి వస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ సంస్థ నిర్వహించిన ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు.ఆ అలవాటుని మార్చుకోవాలిఈ సందర్భంగా మహిళల స్థితిగతులపై సమంత మాట్లాడుతూ.. ‘సమాజంలో ఇతరులు సౌకర్యంగా ఉండటానికి మహిళలు తమ అభిప్రాయాలు, షెడ్యూళ్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. తమ ఆశయాలను వదులుకుంటూ , ఇతరుల కోసం బతకడం మహిళలకు అలవాటైపోయింది. ఇకనైనా మహిళలు ఈ అలవాటును మార్చుకోవాలి. తమకు తాము విలువ ఇచ్చుకోవడం చాలా అవసరం. సాధించిన విజయాలను గర్వంగా స్వీకరించాలి’ అని అన్నారు.ఆ రోజులు రావాలిసినిమా ఇండస్ట్రీలో మహిళలు..తగిన గుర్తింపు సంపాదించుకోవడానికి రెట్టింపు కష్టం చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఒక రిస్క్ లాగా లేదా ఒక ప్రత్యేక కేటగిరి లాగా చూస్తున్నారు. ఆ రోజులు పోవాలి. వాటిని కూడా డిఫరెంట్ కథలు అని చెప్పుకునే రోజులు రావాలి.తెరపై మహిళలు కేవలం హీరోకి భార్యగానో .. హీరోకి ధైర్యం చెప్పడానికో పరిమితం కాకుండా నిజజీవితంలో ఉండే మహిళల లాగానే క్లిష్టమైన మనస్తత్వంతో ఉండాలి’అని సమంత తెలిపింది.సారీ..అక్కర్లేదుపురుషులతో పోలిస్తే.. మహిళలే ఎక్కువ సార్లు క్షమాపణలు కోరుతున్నారు. ఒకే పరిస్థితిలో పురుషుల కంటే మహిళలు దాదాపు పది రెట్లు ఎక్కువ సారీ అంటారని మీకు తెలుసా?, ఇది వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి ఒక సూచనగా పరిగణించవచ్చు. ప్రతి చిన్న విషయానికి క్షమాపణలు కోరాల్సిన అవసరం లేదు. ఇక చాలు.. మహిళలు ఇలా తమని తాము తగ్గించుకోవడం ఆపాలి.క్రెడిట్ తీసుకోవడం తప్పు కాదు. అంబిషన్ ఉండటం తప్పు కాదు. ఎవరో పొగిడితే సింపుల్గా థాంక్యూ అనడం అహంకారం కాదు. మీరు కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని అనుభవించే హక్కు పూర్తిగా మీకు ఉంది’ అని సమంత చెప్పుకొచ్చింది. -
ఎట్టకేలకు కొత్త సినిమా రిలీజ్ డేట్.. ఈ హీరో గుర్తున్నాడా?
తెలుగులోని ప్రామిసింగ్ హీరోల్లో నాగశౌర్య ఒకడు. ఊహలు గుసగుసలాడే, ఛలో లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న ఇతడు.. తర్వాత మూవీస్ అయితే చేశాడు గానీ ఎనిమిదేళ్లుగా హిట్ అనేది అందుకోలేకపోయాడు. చివరగా 2023లో' రంగబలి' చిత్రంతో వస్తే ఘోరమైన డిజాస్టర్ అయింది. తర్వాత నుంచి ఎక్కుడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనంతగా మాయమైపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ హీరో నుంచి కొత్త సినిమా రాబోతుంది. ఈ మేరకు విడుదల తేదీ ప్రకటించారు.(ఇదీ చదవండి: తిరుపతిలో సింపుల్గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో)నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బ్యాడ్ బాయ్ కార్తిక్'. విధి యాదవ్ హీరోయిన్. రామ్ దేశిన దర్శకుడు. గతేడాది ఇదే టైంకి షూటింగ్ పూర్తయినప్పటికీ ఎందుకనో రిలీజ్ చేయకుండా నాన్చుతూ వచ్చారు. మధ్యలో ఒకటి రెండు పాటలు వదిలినప్పటికీ అవేం ఇంప్రెస్ చేయలేదు. ఇప్పుడు సడన్గా శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెబుతూ ఏప్రిల్ 17న తమ చిత్రం థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు.హరీశ్ జయరాజ్ సంగీతమందించిన ఈ సినిమాలో సాయికుమార్, సముద్రఖని లాంటి సీనియర్స్ నటించారు. ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇదేదో రొటీన్ కమర్షియల్ మూవీలానే అనిపిస్తుంది. ఇలాంటి వాటికి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ దక్కట్లేదు. మరి మూడేళ్ల తర్వాత వస్తున్న నాగశౌర్య.. ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి? హిట్, ఫ్లాప్ సంగతి పక్కనబెడితే రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నప్పటికే హీరోలకు సరైన మార్కెట్ ఉండట్లేదు. అలాంటి మూడేళ్లుగా కనిపించని నాగశౌర్య ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: పదిరోజుల్లోనే ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా) -
తిరుపతిలో సింపుల్గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో
ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ నడుస్తోంది. అంటే వేరే ఊరికి వెళ్లిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడం అనమాట. గత నెలలో ఇలానే హీరో విజయ్ దేవరకొండ-రష్మిక.. రాజస్థాన్లోని ఉదయ్పుర్ వెళ్లి అక్కడ గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. అయితే ఇలాంటి హడావుడి ఏం లేకుండా సింపుల్గా పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.(ఇదీ చదవండి: ‘యూత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఈ నెల ప్రారంభంలో కావ్య అనే అమ్మాయి తన జీవితంలో ఉందని చెప్పి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పరిచయం చేశాడు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యేసరికి ఇదేదో ఎంగేజ్మెంట్ అని అంతా అనుకున్నారు. కానీ ఇది కేవలం కుటుంబాల కలిసిన సందర్భం అని సదరు హీరో చెప్పుకొచ్చాడు. త్వరలో శుభవార్త గురించి, పెళ్లి డేట్ బయటపెడతానని అన్నాడు. ఇప్పుడు ఆ తేదీల గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.వచ్చే నెల 5వ తేదీన బెల్లంకొండ శ్రీనివాస్-కావ్య.. హైదరాబాద్లో నిశ్చితార్థం చేసుకోనున్నారు. వచ్చే నెల 29న తిరుపతిలో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్గా పెళ్లి చేసుకోనున్నారు. మే 01న హైదరాబాద్లో టాలీవుడ్ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.(ఇదీ చదవండి: పదిరోజుల్లోనే ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా) -
నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మృతి
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మరణించారు. పారాక్వాట్ (Paraquat) అనే రసాయన గడ్డిమందు కారణంగా తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని సోషల్ మీడియా ద్వారా అయన తెలిపారు. అత్యంత విషపూరితమైన ఈ రసాయనం తెలంగాణలో చాలా సులభంగా అందుబాటులో ఉండటం తెలిసి తనను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. ఈ రసాయనం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్యను చూసి డాక్టర్లు కూడా షాకవుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఆత్మహత్యల కోసం విచ్చలవిడిగా దుర్వినియోగం చేయబడుతోందని ఆవేదన చెందారు. ఇది ప్రతిచోటా ఎంత సులభంగా లభిస్తుందో చూసి దిగ్భ్రాంతి చెందానని ఆయన అన్నారు. దయచేసి వీలైనంత త్వరగా దీనిని నిషేధించండి - ప్రాణాలను కాపాడండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO), భారత ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) ఆయన విజ్ఞప్తి చేశారు.భారతదేశంలో పారాక్వాట్ వినియోగం ఇప్పటికీ కొనసాగుతుంది. దీని విషపూరితత కారణంగా కొన్ని రాష్ట్రాలు (ఉదా: తెలంగాణ) అమ్మకాలపై పరిమితులు విధించాయి. ప్రపంచంలోని చాలా దేశాలు దీన్ని పూర్తిగా నిషేధించాయి. వైద్య నిపుణులు చిన్న పరిమాణం కూడా ప్రాణాంతకమని హెచ్చరించడంతో తెలంగాణ ప్రభుత్వం (2026) పారాక్వాట్ అమ్మకాలపై పరిమితులు విధించింది. భారతదేశంలో చాలా రాష్ట్రాలు కొన్ని కఠిన మార్గదర్శకాలతో మాత్రమే అనుమతిస్తున్నాయి. పొలాల్లో పనిచేసే రైతులు ఎక్కువగా ఈ రసాయనం వల్ల ప్రభావితమవుతున్నారు. Honourable Sirs @TelanganaCMO @PMOIndia,Lost my brother today to Paraquat poisoning. It’s terrifyingly lethal and widely misused for self-destruction. Shocked by how easily it is available everywhere. Doctors are overwhelmed by the amount of cases.Please ban it ASAP-save lives🙏🏽— Rahul Ramakrishna (@eyrahul) March 26, 2026 -
పెద్ది పవర్ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్ సినిమా ‘పెద్ది’ నుంచి అదిరిపోయే అప్డేట్ను ఇచ్చారు. నేడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ అభిమానులను మెప్పించాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్ మరింత పవర్ఫుల్గా ఉండటంతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి.పెద్ది షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఒక భారీ యాక్షన్ సీన్లో భాగంగా చరణ్ కంటికి గాయమైంది. కొన్ని రోజుల విశ్రాంతి అవసరం ఉన్నప్పటికీ చరణ్ మళ్లీ షూటింగ్లో పాల్గొనడం విశేషం. ఇందులో చర్కు జోడీగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్, జగపతిబాబు, బోమన్ ఇరానీ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం సమకూరుస్తున్నారు. ఏప్రిల్ 30న పాన్ ఇండియా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
‘యూత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: యూత్నటీనటులు: కెన్ కరుణాస్, అనిష్మా అనిల్ కుమార్, దేవదర్శని, సూరజ్ వెంజరామూడు, ప్రియాంషీ యాదవ్, మీనాక్షి దినేష్, అభిసాన్ దేవరస తదితరులునిర్మాతలు: కరుప్పయ్య సీ రామ్, సులోచన కుమార్దర్శకత్వం: కెన్ అండ్ గ్యాంగ్సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ఎడిటర్: నాష్విడుదల తేది: నవంబర్ 27, 2026కెన్ కరుణాస్.. చైల్డ్ ఆరిస్ట్గా కెరీర్ ప్రారంభించి.. హీరోగా మారాడు. ‘వాతీ’, ‘తిరుచిత్రంబలం’, ‘అసురన్’ లాంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గాను చేశాడు. ఆయన హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహించిన చిత్రం యూత్. ఈ మూవీ ఈ నెల 19న తమిళ్లో విడుదలై హిట్ టాక్ని సంపాదించుకుంది. ఇప్పుడీ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తమిళ్ మాదిరే ఇక్కడ కూడా విజయం సాధిస్తుందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ప్రవీణ్ (కెన్ కరుణాస్) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. తండ్రి ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు) బెకరీ నడుపుకుంటూ జీవితం కొనసాగిస్తాడు. తల్లి సరోజ(దేవదర్శిని) ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కొడుకు అంటే ప్రాణం. తండ్రికి మాత్రం ప్రవీణ్ చేసే పనులు నచ్చవు. చదువు పక్కకు పెట్టి.. అమ్మాయిలకు సైట్ కొడుతుంటాడు. ఆయన చేష్టలకు స్కూల్లో ఏ అమ్మాయి అతని వైపు చూసేది కాదు. కానీ ఇంటర్లో మాత్రం గంగవల్లి (అనీషా అనిల్ కుమార్), ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనాల్ (ప్రియాన్షీ యాదవ్).. ముగ్గురు తన జీవితంలోకి వస్తారు. ఆ ముగ్గురి వల్ల ప్రవీణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? బ్రేకప్స్, అవమానాలతో ప్రవీణ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి? తల్లి సరోజకు వచ్చిన సమస్య ఏంటి? బాగా చదువుకోవాలని ఆశపడ్డ తల్లిదండ్రుల కోరికను ప్రవీణ్ నెరవేర్చాడా లేదా? అనేది తెలియాలంచే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. కాలేజీ నేపథ్యంలో సాగే యూత్ఫుల్ లవ్స్టోరీలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ చిత్రం కూడా అదే కోవకు చెందింది. తెలిసి తెలియని వయసులో ఓ కుర్రాడు ప్రేమ కోసం పాకులాడి.. చివరకు పరిణితి చెందిన వ్యక్తిగా ఎలా మారాడనేది ఈ సినిమా ఇతివృత్తం. దానికి చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ని జోడించి.. యూత్ఫుల్ ఎంటర్టైనింగ్గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కెన్ కరుణాస్. రొటీన్ కథే అయినా.. నేటి ట్రెండ్కు తగ్గట్టుగా ముఖ్యంగా జెంజీ బ్యాచ్ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. టీనేజ్లో పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి? తెలిసి తెలియక చేసే తప్పులు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది ఈ చిత్రంలో చాలా నేచురల్గా చూపించారు. ఫస్టాఫ్ మొత్తం చాలా హిలేరియస్గా సాగుతుంది. హీరో కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఫస్ట్ సీన్ నుంచే నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరో టెన్త్ పాస్ అయి.. ఇంటర్లో జాయిన్ అయినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. అమ్మాయిల వెంటపడి ఛీ కొట్టించుకునే హీరో జీవితంలోకి ప్రేషిక రావడం..ఆమెతో ప్రేమలో పడిన వెంటనే మరో అమ్మాయి రావడం.. ఈ క్రమంలో హీరో చేసే పనులు, తన బ్యాచ్ ముందు ఇచ్చే బిల్డప్పులు..ప్రతీది నవ్వులు పూయిస్తుంది. జెంజీ కిడ్ అయితే హీరో పాత్రకు ఈజీగా కనెక్ట్ అయిపోతాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే బ్రేకప్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక ద్వితియార్థంలో కథనం కాస్త ఎమోషనల్గా సాగుతుంది. కాలేజీ టూర్, గంగవల్లితో పరిచయం.. ఆమె ప్రేమ కోసం హీరో పరితపించడం.. ఇదంతా కామెడీగానే సాగుతుంది. హీరో తల్లి అనారోగ్యానికి గురి అయినప్పటి నుంచి కథనం ఎమోషనల్గా సాగుతుంది. తండ్రీ ప్లాష్బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. క్లైమాక్స్ రొటీన్గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. దర్శకుడిగా, హీరోగా కెన్ కరుణాస్.. కొంతమేర సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథనే ఎంచుకున్నా.. యూత్కి నచ్చే సీన్లతో ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. ప్రవీణ్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరోయిన్లు ముగ్గురూ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. హీరో తల్లిదండ్రులుగా సూరజ్, దేవదర్శిని తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు వీరిద్దరి పాత్రలు చాలా కీలకమైనవే. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవి ప్రకాశ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
చిరుత బర్త్డే.. స్పెషల్ ఫోటో షేర్ చేసిన మెగాస్టార్
మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆపై తాను దాచుకున్న మధురమైన ఫోటోలను షేర్ చేశారు. చరణ్ బాల్యంలో జరుపుకున్న పుట్టినరోజు నాటి ఫోటోను అభిమానులతో మెగాస్టార్ పంచుకున్నారు. ఈ సందర్భంగా చరణ్పై తనకున్న ప్రేమను సోషల్మీడియా ద్వారా తెలిపారు.చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ప్రత్యేకంగా చిరు ఇలా అన్నారు. 'చిన్నప్పుడు నా చేయి పట్టుకోవడం నుండి ఈ రోజు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవడం వరకు నీ ఎదుగుదల చూస్తుంటే నాకు నిజంగా గర్వకారణంగా ఉంది. సినిమా, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునే విధానం, కుటుంబం పట్ల నీవు చూపించే బాధ్యత, దేవుని పట్ల నీకున్న విశ్వాసం, క్రమశిక్షణ, విలువలు... ఇవన్నీ నేను చూసిన ప్రతిసారీ నీపై నా ప్రేమ, అభిమానం మరింత బలపడుతూనే ఉన్నాయి. దేవుని ఆశీస్సులు, అభిమానుల ప్రేమ నిన్ను ఉన్నత శిఖరాలకు నడిపించాలని కోరుకుంటున్నాను. ప్రియమైన నా చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు.' అని చిరు షేర్ చేశారు.Charan Babu…❤️❤️❤️From holding my hand as a child to becoming an inspiration to many today… You make me truly proud.The way you balance cinema and personal life, your sense of responsibility towards family, your faith in God, discipline, and values… every time I see it, my… pic.twitter.com/MMg5fYYo3k— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2026 -
పదిరోజుల్లోనే ఓటీటీకి హెబ్బా పటేల్ సినిమా
హెబ్బా పటేల్, చైతన్య రావు నటించిన కొత్త సినిమా 'రేపు ఉదయం 10 గంటలకు'.. ఆసక్తికరమైన టైటిల్తో మార్చి 14న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓ పిట్ట కథ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు ఈ మూవీని తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామ్ వీరపనేని నిర్మించారు. ఇందులో అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు.హెబ్బా పటేల్, చైతన్య రావు ఇదివరకు హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమాతో మెప్పించారు. ఈ క్రమంలో వారిద్దరూ మరోసారి 'రేపు ఉదయం 10 గంటలకు'(Repu Udayam 10 Gantalaku) అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించారు. థియేటర్స్లో పెద్దగా ఈ మూవీ మెప్పించలేదు. దీంతో కేవలం పదిరోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. -
విభిన్నమైన పాత్రలో రవితేజ.. హైదరాబాద్లో యాక్షన్
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. నేడు శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ను విడుదల చేసింది యూనిట్. ‘‘ఇరుముడి’లో యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ పోరాట సన్నివేశాలను ఫైట్ మాస్టర్స్ అనల్ అరసు, రియల్ సతీష్ తెరకెక్కిస్తున్నారు’’ అని యూనిట్ తెలిపింది. -
పెయిన్తోనే విజయ్, త్రిషలపై కామెంట్ చేశా: సముద్రఖని
టీవీకే అధినేత విజయ్, త్రిష వివాదానికి సంబంధించి వైరల్ అయిన తన వ్యాఖ్యల వివాదంపై నటుడు, దర్శకుడు సముద్రఖని తాజాగా స్పందించారు. తాను నటించిన ‘కార్మేని సెల్వం’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. విజయ్పై తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సందర్భానికి సంబంధం లేకుండా వాటికి వక్రీకరణలు చేశారని ఆయన అన్నారు. తాను నిజాయితీగా మాట్లాడానని, ఎవరినీ అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన ఆలోచనలను వ్యక్తం చేసినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేశారని క్లారిటీ ఇచ్చారు. 'పాత వీడియోలో నేను మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి మొదటి నుంచి కాకుండా మధ్యలో వీడియో రికార్డ్ చేశారు. అయితే, తను రికార్డ్ చేస్తున్నాడు కదా అని నేను మాట్లాడటం ఆపలేదు. విజయ్ మొదట సపోర్ట్ ఇచ్చింది నేనే.. కాబట్టే కాస్త నాకు పెయిన్గానే ఉంటుంది.' అని వివరించారు.ఏం జరిగిందంటే..?విజయ్, త్రిష ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇదే అంశం గురించి సముద్రఖని కొందరితో చర్చిస్తన్న వీడియో వైరల్ అయింది. వారిద్దరి తీరుపై సముద్రఖని తన అసంతృప్తిని బయటపెట్టారు. 'ఇదేమైనా ఆటా..? వ్యక్తిగత విషయాలను ఇలా బయటపెట్టాలా..? ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు..? అంతా సవ్యంగ జరుగుతున్న సమయంలో ఇలాంటివి అవసరమా..? ఈ కారణంతో పార్టీలోని కొందరు సపోర్టర్స్ వెళ్లిపోతున్నారు' అని ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ వీడియో కాస్త వైరల్ అయింది. -
పెళ్లిపై ఆలోచన లేదు: సాయి పల్లవి
ప్రయత్నం ఎన్నటికీ వృథా కాదు.. వెంటనే కాకున్నా, కొద్ది కాలం తరువాత అయినా దాని ఫలితం ఉంటుంది. నటి సాయి పల్లవి విషయంలోనూ ఇదే జరిగింది. ఈ కోయంబత్తూరు భామకు సినిమాల్లో నటించాలన్నది చిన్నప్పటి నుంచి ఆశ. అయితే వెంటనే తన ఆశను నెరవేర్చుకునే ప్రయత్నం చేయలేదు. ముందు చదువుపై దృష్టి సారించి డాక్టర్ కూడా అయ్యారు. ఆ తరువాత కూడా నటనపై తన ఆసక్తి తగ్గాక పోవడంతో డాన్స్ లో శిక్షణ పొందారు. ఆపై తనలోని నటిని చూపేందుకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అలా మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ప్రేమలులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అంతేకాదు అందులో టీచర్ పాత్రకు పెద్ద పేరు వస్తుందని సాయి పల్లవి కూడా ఊహించి ఉండరు. ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగిన పోయారు. చాలా మంది గ్లామర్ క్రేజ్తోపాటు, అవకాశాలను తెచ్చి పెడుతుందని భావిస్తారు. అందులో నిజం లేకపోయినప్పటికీ, సాయి పల్లవి మొదటి నుంచి సహజత్వానికి ప్రాధాన్యత నటిస్తున్నారు. అదే ఆమెకు ప్లస్ అయ్యింది కూడా. సాయి పల్లవి నటిస్తే ఆ చిత్రం హిట్టే అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఈమె నటుడు శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్ చిత్రం ఘనవిజయం సాధించింది, ఆ తరువాత తెలుగులో నాగచైతన్యతో జత కట్టిన తండేల్ చిత్రం విజయాన్ని సాధించింది. ఇటివల బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ సాయి పల్లవి, అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ కలిసి నటించిన ఏక్ దిన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అదేవిధంగా రామాయణం ఇతిహాసం ఇతివృత్తంతో రూపొందుతున్న రామాయణ 1,2 భాగాల్లో సీతగా నటిస్తున్నారు. అదేవిధంగా తమిళంలో ధనుష్కు జంటగా మరో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా చాలా బిజీగా ఉన్న సాయి పల్లవి ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పెళ్లెప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని కచ్చితంగా చెప్పారు. ప్రస్తుతానికి తాను సింగిల్ అని కూడా చెప్పారు .కాగా ఈ 33 ఏళ్ల భామ చెల్లెలు పూజా కన్నన్ రెండేళ్ల ముందే పెళ్లి చేసుకున్నారు. మరి సాయి పల్లవికి పెళ్లి ఘడియలు ఎప్పుడు వస్తాయో ఏమో! -
రేసు గుర్రం వస్తోంది
అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘రేసు గుర్రం’ ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, ప్రకాశ్రాజ్, రవికిషన్, శ్యామ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వ రావు నిర్మించారు.యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా 2014 ఏప్రిల్ 11న విడుదలై హిట్గా నిలిచింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజుని పురస్కరించుకుని క్రౌన్ మూవీస్ ద్వారా ‘రేసుగుర్రం’ సినిమాని అదే రోజు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ట్రైలర్ని విడుదల చేశారు మేకర్స్. -
గాయంతో తిరిగి సెట్స్పైకి రామ్ చరణ్
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఎడమ కంటికి తగిలిన దెబ్బ కారణంగా చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది. యూనిట్ ఈ గాయం పెద్దది కాదని ప్రకటించినప్పటికీ, తన అభిమానులు మాత్రం కొంత ఆందోళన చెందారు. అయితే గాయమైన గంటల వ్యవధిలోనే చరణ్ తిరిగి సెట్స్పైకి వచ్చాడు. గురువారం 'పెద్ది' చిత్ర షూటింగ్లో పాల్గొన్నాడు. దాంతో వందల సంఖ్యలో మెగా అభిమానులు సెట్స్కు చేరుకుని ఆయనను కలుసుకున్నారు. చరణ్ వారందరితో మాట్లాడి, సెల్ఫీ వీడియో కూడా దిగాడు. ఆ వీడియోను యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో చరణ్ స్వయంగా తన గాయంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. చరణ్కు సుధాకర్ ప్రసాద్ అనే వైద్యుడు మైనర్ సర్జరీ చేసినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. డాక్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక మార్చి 27 (శుక్రవారం) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9.45 గంటలకు పెద్ది నుంచి సర్ప్రైజ్ రాబోతోందని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి ధృవీకరించారు. -
'అప్పుడే నెల.. మీరు లేకుంటే నా పెళ్లి ఇలా జరిగేది కాదు'.. రష్మిక పోస్ట్
విజయ్- రష్మిక పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఫిబ్రవరి 26న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి జరిగి నెల రోజులు పూర్తి కావడంతో ప్రత్యేక పోస్ట్ చేశారు. పెళ్లినాటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. విజయ్ దేవరకొండతో పాటు రష్మిక సైతం పెళ్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అప్పుడే నెల రోజులు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నానంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.రష్మిక తన ఇన్స్టాలో రాస్తూ..' అప్పుడే ఒక నెల గడిచిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నా. పెళ్లి చేసుకోవడం అనేది ఎంతో దూరపు కలలా అనిపించేది.. కానీ ఇప్పుడు మా పెళ్లి జరిగి నెల రోజులు పూర్తయ్యాయి. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. అయితే పెళ్లి చేసుకోవాలని అనుకున్న క్షణం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రయాణంలో మహిళలే నాకు అండగా నిలిచి, నా రక్షకుల్లా వ్యవహరించారు. నేను మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా. ఇది శాశ్వతంగా నిలిచిపోయే ప్రేమ. మీరందరూ లేకుంటే ఈ పెళ్లి ఇంత అద్భుతంగా జరిగేది కాదు' తన వారిపై ప్రశంసలు కురిపించింది.ఐశర్య, మాగంటి ప్రియ, అర్పిత పేర్లను రష్మిక ప్రస్తావించింది. వారి గురించి తన అనుభవాలను పంచుకుంది. ఇవి మీ రోజులు.. అన్నీ మర్చిపోండి, హాయిగా ఉండండి.. అంటూ చెప్పిన మీ అందరికీ నా ధన్యవాదాలు.. మేము కూడా అలానే చేశామని రష్మిక తెలిపింది. మీరందరూ లేకుండా ఈ పెళ్లి ఇంత అద్భుతంగా జరిగేది కాదని రాసుకొచ్చింది. నా జీవితంలో నన్ను ప్రశాంతంగా, నిలకడగా ఉండేలా చేసిన అందమైన మహిళలకు నా అభినందనలు.. ఇదే నా చిన్న ప్రపంచం అంటూ ఎమోషనలైంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
థియేటర్లలో బ్యాండ్ మేళం, సుయోధన.. ఓటీటీల్లో ఒక్క రోజే 11 సినిమాలు..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ వారం తెలుగులో 'కోర్ట్' జంట నటించిన బ్యాండ్ మేళం, ప్రియదర్శి సుయోధన థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ చిత్రాలైన 'యూత్', 'హ్యాపీరాజ్' రిలీజ్ అవుతున్నాయి .ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే క్రేజ్ ఉన్న మూవీస్ ఏమీ రావట్లేదు. విజయ్ సేతుపతి 'కాట్టాన్' సిరీస్ మస్తిష్క మరణం, మర్దానీ 3 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ అనిపించేలా ఉన్నాయి. ఈ శుక్రవారం ఓటీటీల్లో దాదాపు 11 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓవరాల్గా చూస్తే ఈ ఫ్రైడే పెద్దగా ఆసక్తి పెంచే చిత్రాలేవీ కనిపించడం లేదు. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మస్తిష్క మరణం(మలయాళ మూవీ)- మార్చి 27మర్దానీ 3 (హిందీ సినిమా)-మార్చి 27ది రిటర్న్(డాక్యుమెంటరీ)- మార్చి 2753 సండేస్(హాలీవుడ్ మూవీ)- మార్చి 27అమెజాన్ ప్రైమ్ఓ రోమియో (హిందీ మూవీ) - మార్చి 27హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27జియో హాట్స్టార్కాట్టాన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మార్చి 27జీ5ప్రజాపతి 2 (బెంగాలీ సినిమా) - మార్చి 27హే కాయ్ నవీన్ (మరాఠీ సిరీస్) - మార్చి 27ఆపిల్ టీవీ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27సన్ నెక్ట్స్మాయ బింబుమ్(తమిళ సినిమా)- మార్చి 27 -
'అప్పు చేస్తేనే పెద్ద వాళ్లమవుతాం'.. ఆసక్తిగా కార్మేని సెల్వం ట్రైలర్
సముద్రఖని, అభినయ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ కార్మేని సెల్వం. ఈ ద్విభాషా చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ఈ మూవీని పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మించారు. ఈ చిత్రంలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఓకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ హైదరాబాద్లో రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఓ మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సామాన్యుడి ఇంటికల, ఆర్థిక సమస్యలు, డబ్బు అనే కోణంలో ఈ కథను రూపొందించారని ట్రైలర్లో అర్థమవుతోంది. అప్పులు అనే కాన్సెప్ట్తో పాటు ఎమోషనల్ స్టోరీగా ట్రైలర్లో చూపించారు. కాగా.. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పెద్ది బర్త్ డే స్పెషల్.. ఇప్పుడు చేతిలో ఉండేది బ్యాట్ కాదు....!
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక్క రోజు ముందే రామ్ చరణ్ ఎడమ కన్నుకు చిన్న గాయం కావడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారుతాజాగా పెద్ది మూవీ టీమ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు అప్డేట్ రానుందని ప్రకటించారు. ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది..ఇప్పటిదాకా బ్యాట్ పట్టుకుని అతన్ని చూశారు కదా.. ఇప్పుడు గదతో విరుచుకుపడబోతున్నాడు.. రేపు (మార్చి 27) ఉదయం 9:45 గంటలకు అతను రణరంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు అంటూ గదతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. చెర్రీ పుట్టినరోజు కానుకగా పెద్ది టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ONE DAY TO GO 🔥You've seen him hold the bat, now unleashing him with a mace ❤🔥He enters the arena tomorrow (March 27th) at 9.45 AM 💥#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/EvpXHy0LX5— BuchiBabuSana (@BuchiBabuSana) March 26, 2026 -
శ్రీరామనవమి స్పెషల్.. ఇరుముడి టీమ్ ప్రత్యేక పోస్టర్
రవితేజ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఇరుముడి. ఈ చిత్రంలో మాస్ మహారాజా అయ్యప్పదీక్షలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ చూస్తే డెవోషనల్ టచ్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీ, కూతుళ్ల బంధం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఇరుముడి టీమ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రేమ, ఆప్యాయత గల తండ్రి.. ముచ్చటైన కూతురి కథ.. అంటూ మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. ఈ పోస్టర్తోనే కథేంటో మేకర్స్ రివీల్ చేశారు. ఈ ఏడాది రవితేజ బర్త్ డే సందర్భందా మూవీ టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏడాదిలోనే విడుదల కానుంది. Tale of a Doting father & Lovely daughter knotted with love - #IRUMUDI 🫶శ్రీరామనవమి శుభాకాంక్షలు 🏹✨Starring MASS MAHARAJA @RaviTeja_offlA @gvprakash musical 🎺🎼@priya_Bshankar @ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/CNZuTYRLKB— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2026 -
సినిమా ఫ్లాప్ అయితే.. కోడి రామకృష్ణ మాటలు గుర్తు తెచ్చుకుంటా: ప్రియదర్శి
ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘సుయోధన’. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ ‘సుయోధన’ సినిమాను విడుదల చేస్తోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నుహైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ - ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు మరింత చేరువ కావాలి, వారి ఆదరణ మరింత పొందాలనే ప్రయత్నిస్తుంటాను. ఆ క్రమంలో ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే బాధగా ఉంటుంది. అలాంటప్పుడే కోడి రామకృష్ణ లాంటి లెజెండ్స్ నా గురించి బాగా చెప్పారు కదా అనే ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతుంటాయి. సాయి కుమార్ , ఆయన కుటుంబం 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. పరిశ్రమ అభివృద్ధిలో భాగమవుతున్నారు. ఈ చిత్రంలో సుయోధన పాత్రకు ఆయన తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అంత బాగా నటించారు. ప్రేక్షకుల ఊహకు అందనంత ఆసక్తికరంగా సాగే చిత్రమిది. ఈ కథ, టైటిల్ విన్నప్పుడే ఇది కొత్తగా ఉంటుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమానే నన్ను సెలెక్ట్ చేసుకుందని అనిపిస్తుంటుంది. ఈ చిత్రంతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. హాలీవుడ్ క్లాసిక్ మూవీ డ్యూన్ లెవెల్లో ఈ సినిమా చేయాలని మా మూవీ టీమ్ పట్టుదలగా పనిచేశారు. మా సినిమాను మీరు థియేటర్స్ లో చూసి మంచి సక్సెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా’అన్నారు.సాయికుమార్ మాట్లాడుతూ - నేను 1972లో ధుర్యోధనుడి పాత్రను నాటికలో అభినయించాను. అప్పటికి నా వయసు 11 ఏళ్లు. ఇప్పుడు ఈ చిత్రంలో సుయోధనుడిగా నటిస్తుంటే ఆ రోజులు గుర్తుకువచ్చాయి. మీరు చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెబుతున్నారు. మూవీలో ఎలాంటి మలుపులు ఉంటాయో మాకూ తెలియదు. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రమిది. ఇలాంటి సినిమాలు తరుచూ రావు. ఈ టీమ్ అంతా చాలా కష్టపడి, ప్యాషనేట్ గా మూవీ చేశారు. రేపు థియేటర్స్ లోకి వస్తున్న సుయోధన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. -
'ఆయనను గురువులా భావిస్తా'.. సైన్ లాంగ్వేజ్లో అభినయ స్పీచ్ వైరల్
టాలీవుడ్ నటి అభినయ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్మేని సెల్వం అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ ఈవెంట్కు అభినయ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలో తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన అభినయ తన సైన్ లాంగ్వేజ్తో అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్నప్పటి నుంచే అభినయకు మాటలు రావన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రత్యేక స్పీచ్తో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సముద్రఖనిపై అభినయ ప్రశంసలు కురిపించింది. నాకు తమిళంలో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సముద్రఖని అని తెలిపింది. ఆయనను ఒక గురువులా భావిస్తానని అభినయ వెల్లడించారు. ఆయన దర్శకుడు మాత్రమే కాదని.. అంతకు మించిన నటుడని కొనియాడారు. ఇప్పటివరకు అన్ని భాషల్లోనూ కలుపుకుని 64 సినిమాలు మాత్రమే చేశానని అభినయ తెలిపారు. సముద్రఖని చెప్పినట్లు వెయ్యి సినిమాలు చేస్తానో లేదో వేచి చూడాల్సిందేనని అన్నారు.ఈ మూవీకి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా.. టాలీవుడ్లో 'నేనింతే' సినిమాతో పరిచయం అయిన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్మీడియా ద్వారా పరిచయం చేసింది. తెలుగులో కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్ని పాత్రలో బాగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్లో చాలా సినిమాల్లో అభినయ తన నటనతో ఆకట్టుకుంది. సైన్ లాంగ్వేజ్ లో నటి అభినయ స్పీచ్...నాకు తమిళంలో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సముద్రఖని గారుసముద్రఖని గారు మంచి దర్శకులు అలాగే అంతకు మించి మంచి నటుడు: అభినయ#Abhinaya #CarmeniSelvam #Samuthirakani pic.twitter.com/lukFHtLVFJ— Filmy Focus (@FilmyFocus) March 26, 2026 -
పెద్ది వాయిదా తప్పదా.. అందుకే ఆ డేట్ మార్చారా?
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక్క రోజు ముందే రామ్ చరణ్ ఎడమ కన్నుకు చిన్న గాయం కావడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. ఈ రోజు నుంచి యథావిధిగా పెద్ది షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.అయితే ఇప్పటికే ఓసారి వాయిదా పడిన పెద్ది మూవీపై మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్పోన్ కానుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈనెల 27 నుంచి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామని ముందుగానే ప్రకటించారు. కానీ ఈ డేట్ కూడా ఏప్రిల్ 8కి మార్చారు. దీంతో మరోసారి పెద్ది వాయిదా పడనుందనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది.తాజా అప్డేట్ ప్రకారం చూస్తే.. ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూ ఉండడం.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల మరింత ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. ఏదేమైనా బుచ్చిబాబు ఏప్రిల్ 30న రిలీజ్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తయితే చెప్పిన డేట్ ప్రకారమే పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. లేదంటే మే 21వ తేదీకి మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది. మరోవైపు శుక్రవారం రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. -
దగ్గుబాటి కుటుంబ కేసు.. ఆ విషయంలో జాగ్రత్త..!
దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసు విచారణ ఏప్రిల్ 10కి కోర్టు వాయిదా వేశారని దగ్గుబాటి కుటుంబం లీగల్ టీమ్ తెలిపింది. గతంలో మాదిరిగానే రాబోయే విచారణకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంగా చేసిందని వెల్లడించింది.అయితే విచారణ సమయంలో నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేయలేదని లీగల్ టీమ్ పేర్కొంది. దీనికి విరుద్ధంగా ప్రత్యర్థులు,కొన్ని వర్గాలు చేసే ప్రచారం పూర్తిగా అసత్యం, తప్పుదోవ పట్టించేవని తెలియజేసింది. ఈ కేసుకు సంబంధించి మీడియా సంస్థలు ఏవైనా వార్తలు ప్రచురించే ముందు కోర్టు ఆదేశాలను పరిశీలించడం, దగ్గుబాటి కుటుంబం న్యాయ సలహాదారుని సంప్రదించి ప్రచురించాలని లీగల్ టీమ్ విజ్ఞప్తి చేసింది.అసలు కేసు ఏంటంటే..?గతంలో సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబ సభ్యులపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలింనగర్ రోడ్డునెంబర్–1లో ఉన్న దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో బాధితుడు నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేష్ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్ (ఏ4)లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.2022 నవంబర్లో దక్కన్ కిచెన్ హోటల్ను జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. నందకుమార్కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థల వివాదం ఉంది. నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు కూడా వేశారు. ఈ అంశంలో స్టేటస్ కో కొనసాగించాలని.. ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు దిగవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తూ గతేడాది జవనరిలో దగ్గుబాటి కుటుంబం హోటల్ను పూర్తిగా నేలమట్టం చేసింది. దీంతో మరోసారి బాధితుడు నందకుమార్ దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కోర్టు ఆదేశాల ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన నాంపల్లి న్యాయస్థానం ఈ ఘటనలో కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
రామ్ చరణ్ కంటికి సర్జరీ.. చిరంజీవి ట్వీట్ వైరల్
‘పెద్ది’ సినిమా షూటింగ్లో రామ్ చరణ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఓ హై ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో రామ్ చరణ్ ఎడమ కంటికి స్వల్ప గాయం అయింది. దీంతో షూటింగ్కి బ్రేక్ ఇచ్చి ఆస్పత్రికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా చరణ్కి కంటికి చిన్న సర్జరీ చేశారట. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. సర్జరీ చేసిన డాక్టర్కి కృతజ్ఞతలు తెలిపారు. ‘డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారు,చరణ్ కనురెప్పకు మీరు ఎంతో నైపుణ్యంతో సర్జరీ చేసినందుకు ధన్యవాదాలు. తొలుత మాకు కొంత ఆందోళన కలిగినప్పటికీ.. మీరు చెప్పిన మాటలు మా భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని ఇచ్చాయి. సకాలంలో స్పందించి, శస్త్రచికిత్స అందించినందుకు కృతజ్ఞతలు’ అని చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వార్త తెలుసుకున్న మెగా అభిమానులు.. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘పెద్ది’ గ్లింప్స్ని రిలీజ్ కానుంది. Dr. Sudhakar Prasad garu,Your timely and skilful surgery on Charan’s eyelid has truly been a blessing. What was a moment of concern for us was eased entirely by your precision, care, and expertise.Your craftsmanship made all the difference, and we are truly grateful.Thank… pic.twitter.com/j53rRIpOKB— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2026 -
నాగబంధం విడుదలపై ప్రకటన
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం నాగబంధం.. తాజాగా ఈ మూవీ విడుదలను మేకర్స్ ప్రకటించారు. ఇందులో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బిఎస్ అవినాష్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరికీ చిత్ర యూనిట్ గుడ్న్యూస్ చెప్పింది. జులై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, మలయాళం, కన్నడలో విడుదల కానుందని ప్రకటించారు.కొద్దిరోజుల క్రితం టీజర్ విడుదల తర్వాత ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కోసమే రూ. 20 కోట్లు ఖర్చు చేశారట. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్లలో ఒకటిగా నిలుస్తోంది. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్ గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశారు. -
‘బ్యాండు మేళం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
‘కోర్ట్’ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండు మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 13నే విడుదల కావాల్సింది. కానీ చివరి నిమిషం వాయిదా వేసి.. నేడు(మార్చి 26)న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిరంజీవితో పాటు టాలీవుడ్ స్టార్స్ అంతా ప్రమోషన్స్లో పాల్గొనడంతో ‘బ్యాండు మేళం’పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంది? కోర్ట్ మాదిరే హర్ష్ రోషన్, శ్రీదేవిలకు మరో హిట్ దక్కిందా? లేదా? రివ్యూ(Band Melam Review)లో చూద్దాం.కథేంటంటే.. తెలంగాణలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యాదగిరి అలియాస్ గిరి(హర్ష్ రోషన్), రాజీ(శ్రీదేవి) బావమరదళ్లు. చిన్నప్పుడు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్లు కూడా పెద్దయ్యాక ఇద్దరికి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. కానీ వీరిద్దరు పెద్దయ్యే సరికి పరిస్థితులు తారుమారు అవుతాయి. గిరి వాళ్ల నాన్న సుందరయ్య(గోపరాజు విజయ్) దానధర్మాలు చేసి అప్పుల పాలవుతాడు. గిరి ఏమో పదోతరగతి ఫెయిల్ అయి స్నేహితులతో బ్యాండు మేళం నడుపుతుంటాడు. మరోవైపు రాజీ వాళ్ల నాన్న సాయన్న(సాయి కుమార్) బావ సుందరయ్య చేసే సాయంతో కోటీశ్వరుడు అవుతాడు. రాజీ టెన్త్ టాపర్గా నిలిచి..ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్లో జాయిన్ అవుతుంది. ప్రేమ, పెళ్లి అంటూ బావ గిరి వెంటపడుతున్నా పట్టించుకోదు. సాయన్న కూడా తన కూతురుని గిరికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడడు. ఓ గొప్పింటి అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. పెళ్లి రోజు రాత్రే రాజీ.. తన క్లాస్మేట్ రాజేశ్తో కలిసి లేచిపోతుంది. ప్రాణంగా ప్రేమించిన మరదలు.. వేరే వ్యక్తితో లేచిపోయిన విషయం తెలిసిన తర్వాత గిరి ఏం చేశాడు? లేచిపోయిన రాజీ తిరిగి గిరి ఇంటికి ఎందుకు వచ్చింది? గిరి మ్యూజిక్ లో సక్సెస్ అయ్యాడా? ఈ బావమరదళ్లు మళ్లీ ఎలా ఒక్కటయ్యారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్ రచయితల్లో కోన వెంకటేశ్కు ఉన్న క్రేజీ గురించి తెలిసిందే. కామెడీ ఫ్యామిలీ డ్రామా కథలను రాయడంతో ఆయన సిద్ధహస్తుడు. అయితే ఈ మధ్య ఆయన కథలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని తనకు బలమైన కామెడీ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలోనే ‘బ్యాండు మేళం’ కథను రాసుకొని.. సొంతంగా నిర్మించి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ప్రచార చిత్రాలు, ప్రమోషనల్ ఈవెంట్లలో ఆయన మాటలు విని .. ఈ సారి కొత్త కామెడీతో నవ్విస్తాడని అంతా భావించారు. కానీ కోన మాత్రం మళ్లీ పాత కథతోనే నవ్వించే ప్రయత్నం చేశాడు. కథ మాత్రమే కాదు కథనం కూడా పాతగానే ఉంటుంది. కొత్తదనం అనేది మచ్చుకైనా కనిపించదు. రొటీన్ కామెడీ స్టోరీకి తెలంగాణ బ్యాక్డ్రాప్ యాడ్ చేశారంతే. హీరో జులాయి.. హీరోయిన్ రిచ్ కిడ్.. వారి ప్రేమకు ఆస్తిపాస్తులు అడ్డురావడం.. చివరకు ఒక్కటవ్వడం.. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఈ కథలను చూస్తూ వస్తున్నాం. అలాంటి కథతో సతీష్ జవ్వాజీ తెరకెక్కిన చిత్రమే ఈ బ్యాండు మేళం. బావమరదళ్ల లవ్స్టోరీలో అయినా కొత్తదనం ఉంటుందా అంటే అదీ ఉండడు. ఇక కథకు కీలకమైన ట్విస్టులు కూడా ఊహకందేలా ఉండడంతో కథనం ఎక్కడ రక్తి కట్టించదు. కోన గారి రెగ్యులర్ కథల్లానే ఈ సినిమా కథ కూడా చైల్డ్వుడ్ ఎపిసోడ్తో మొదలవుతుంది. హీరోహీరోయిన్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని చూపించి.. అసలు కథను ప్రారంభించారు. ఫస్టాఫ్లో బ్యాండు మేళం బ్యాచ్తో హీరో చేసే అల్లరి కొంతమేర నవ్విస్తుంది. స్టూడియో కట్టేందుకు హీరో గ్యాంగ్ చేసే పని సిల్లీగా అనిపించినా.. ఎంటర్టైన్ అవుతారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఎంతకూ ముందుకు కదలదు. ఒకే పాయింట్ చుట్టూ కథను తిప్పారు. క్లైమాక్స్లో రాజీ పాత్ర ఇచ్చే ట్విస్టు కూడా ఊహించేలా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. గిరి పాత్రలో హర్ష్ ఒదిగిపోయాడు. తెరపై చాలా ఎనర్జిటిక్గా కనిపించాడు. డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. రాజీగా శ్రీదేవి కూడా బాగా నటించింది. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. ఇక హీరోయిన్ తండ్రి సాయన్నగా సాయికుమార్ రెగ్యులర్ పాత్రలో కనిపించి, మెప్పించాడు. హీరోగ్యాంగ్గా కనిపించినవారంతా కొత్తవాళ్లే అయినా.. చక్కగా నటించారు. ముఖ్యంగా ఆ గ్యాంగ్లోని అమ్మాయి పాత్ర అందరికి గుర్తిండిపోతుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విజయ్ బుల్గానిక్ నేపథ్య సంగీతం బాగుంది. ‘తిప్పుకుంటున్నవావే..’ అంటూ సాగే ఫోక్ సాంగ్ తెరపై మరింత ఆకట్టుకునేలా ఉంది. మిగతా పాటలు ఒకే. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో కోన వెంకట్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -
ఓటీటీలో రెండు థ్రిల్లింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ప్రకటన
మలయాళ ప్రేక్షకులను మెప్పించిన మస్తిష్క మరణం సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. రజీషా విజయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీని దర్శకుడు కృషంద్ ఆర్కే తెరకెక్కించారు. కృష్ణంద్ ఫిల్మ్స్ సహకారంతో అజిత్ వినాయక ఫిల్మ్స్ బ్యానర్పై వినాయక అజిత్ నిర్మించారు. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకుంది.‘మస్తిష్క మరణం’ (Masthishka Maranam) మార్చి 27 నుంచి నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, తెలుగు వర్షన్ గురించి సరైన సమాచారం ప్రస్తుతానికి లేదు. తన బిడ్డను కోల్పోయిన దుఃఖం నుండి బయటపడలేక, గడిచిన క్షణాలను తిరిగి అనుభవించాలనే ప్రయత్నంలో ఒక తండ్రి, అత్యాధునిక వర్చువల్ రియాలిటీ మెమరీ కన్సోల్ను ఆశ్రయిస్తాడు. ఇది ఒక డార్క్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ సినిమాగా, సమాజంపై వ్యంగ్య అస్త్రంగా రూపొందింది. 2046లో, ప్రజల జ్ఞాపకాలు , అనుభవాలు డిజిటల్గా రికార్డ్ చేయబడి, వ్యాపారంగా చేయబడతాయి. మనుషులు తమ బాధలను కూడా వైద్య చికిత్స ద్వారా మర్చిపోగలరు. ఈ కాన్సెప్ట్తోనే సినిమాను తెరకెక్కించారు.ఓటీటీలో వధ్-2బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన సినిమా ‘వధ్’ (2022).. ఈ మూవీకి సీక్వెల్గా తెరకెక్కిన క్రైమ్ డ్రామా చిత్రం ‘వధ్- 2’ గతేడాది థియేటర్స్లోకి వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ మూవీ కూడా ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix)లో వరల్డ్వైడ్గా స్ట్రీమింగ్ కాబోతోంది. సీనియర్ నటులు సంజయ్ మిశ్రా, నీనా గుప్తా మెయిన్ లీడ్స్గా నటించిన ఈ సినిమాను దర్శకుడు జస్పాల్ సింగ్ సంధు తెరకెక్కించారు. థ్రిల్లింగ్ సినిమాలను ఇష్టపడేవాల్లకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. -
ఆల్టైమ్ డిజాస్టర్గా ఉస్తాద్ భగత్సింగ్..
'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైందని పూర్తి లెక్కలతో వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా నటించిన ఈ మూవీని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు. సుమారు. 150 కోట్లకు పైగా బడ్జెట్తో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. అయితే, సినిమా విడుదలై వారం గడిచినప్పటికీ కలెక్షన్స్పై కనీసం ఒక్క పోస్టర్ కూడా నిర్మాతలు విడుదల చేయలేదు. అందుకు ప్రధాన కారణం సినిమా ఫలితమేనని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే, ట్రేడ్ వెబ్సైట్ సక్నిల్క్ బాక్సాఫీస్ గణాంకాల ప్రకారం చూస్తే ఆల్టైమ్ డిజాస్టర్గా ఉస్తాద్ భగత్సింగ్ నిలిచిపోయింది.'ఉస్తాద్ భగత్ సింగ్' నష్టాల దెబ్బ నిర్మాతల కంటే డిస్ట్రిబ్యూటర్స్పైనే ఎక్కువ పడింది. భారీ ధరకు కొనుగోలు చేసిన వారు పెట్టుబడిలో కనీసం సగం కలెక్షన్స్ కూడా తెచ్చుకోలేకపోయారు. ఓవర్సీస్లో ఉస్తాద్ను విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాకపోవడంతో మైత్రీ మూవీస్ వారే రిలీజ్ చేశారు. ఆపై సీడెడ్, కర్ణాటకలతో పాటు ఏపీలో కూడా పేలవంగా కలెక్షన్స్ రాబట్టింది.పెట్టుబడిలో సగం కూడా రాలేదుట్రేడ్ వెబ్సైట్ సక్నిల్క్ ప్రకారం ఉస్తాద్ భగత్సింగ్ మొదటి వారం రూ. 65.74 కోట్ల నెట్ సాధించింది. ఏడోరోజు కేవలం కోటి రూపాయలు మాత్రమే రాబట్టడంతో పవన్ కల్యాణ్ మార్కెట్ సత్తా ఇంతేనా అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ ప్రకారం ట్రెండ్ చూస్తే రూ. 70 కోట్ల నెట్ కలెక్షన్స్తో ఉస్తాద్ ప్రయాణం ముగిసిపోవడం దాదాపు ఖాయం. ఒక్క నైజాం ఏరియాలోనే దాదాపు రూ. 30 కోట్ల నష్టం రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కోసం సుమారు రూ. 115 కోట్లు పెట్టుబడి పెట్టారని సమాచారం. అయితే, ఏడురోజుల్లో రూ. 50 కోట్లు మాత్రమే రికవరీ అయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోట ఈ మూవీకి పెట్టిన పెట్టుబడిలో సగం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో భారీ నష్టాలను ఎదుర్కొవాల్సిన పరిస్థితి డిస్ట్రిబ్యూటర్స్కు ఏర్పడింది.పవన్ గత సినిమా 'ఓజీ' కేవలం నాలుగు రోజుల్లోనే రూ.130 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫైనల్ కలెక్షన్స్ కూడా రూ.100 కోట్ల మైలురాయిని చేరలేకపోవడం కష్టమే.. ఆశ్చర్యకరంగా, ఈ చిత్రం ఉత్తర అమెరికాలో 1 మిలియన్ డాలర్ కంటే తక్కువ వసూలు చేసింది. ఇది దాని ఘోరమైన ప్రదర్శనను స్పష్టం చేస్తోంది. ఈ మధ్య విడుదలైన డిజాస్టర్ సినిమాలు అఖండ -2, హరి హర వీర మల్లు చిత్రాలు కూడా 1 మిలియన్ డాలర్ల మార్కును దాటాయి. కానీ, 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆ మైలురాయిని చేరుకోవడంలో విఫలమైంది. -
అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. హీరోయిన్లు ఫిక్స్, వెంకీతో తొలిసారి..!
వెంకటేశ్–కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు? అనే విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే వెంకటేశ్–కల్యాణ్ రామ్లకు సరైన జోడీ కోసం అనిల్ రావిపూడి వేట మొదలెట్టారట. ఇందులో భాగంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వెంకటేశ్కి జోడీగా ‘మహానటి’ మూవీ ఫేమ్ కీర్తీ సురేష్ నటించనున్నారనే వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇప్పటివరకూ వెంకటేశ్–కీర్తీ సురేష్ కలిసి నటించలేదు. వీరి కాంబినేషన్ అయితే ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందనే ఆలోచనతో ముందుకెళుతున్నారట అనిల్ రావిపూడి.ఇక కల్యాణ్ రామ్కి జోడీగా నటించనున్న హీరోయిన్ల జాబితాలో ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో కృతీ శెట్టి, కయాదు లోహర్ ఉన్నారు. ‘ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు’ వంటి పలు హిట్ సినిమాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు సొంతం చేసుకున్న కృతీ శెట్టి పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే ‘డ్రాగన్, అల్లూరి, ఫంకీ’ చిత్రాల ఫేమ్ కయాదు లోహర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి... వెంకటేశ్కి జోడీగా కీర్తి నటిస్తారా? లేదా? కల్యాణ్ రామ్కి జంటగా కృతీ, కయాదు లోహర్లలో ఎవరు ఫైనల్ అవుతారు? లేకుంటే మరో హీరోయిన్ ఫిక్స్ అవుతారా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఈ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
అనిల్ రావిపూడి సినిమా.. రెండో హీరోయిన్గా ఎవరంటే?
టాలీవుడ్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త సినిమా త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సంక్రాంతికి చిరంజీవి - వెంకటేశ్లతో కలిసి ‘మన శంకరవరప్రసాద్గారు’తో భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే, వచ్చే సంక్రాంతి కోసం ఆయన తెరకెక్కించబోయే సినిమాలో వెంకటేశ్ - నందమూరి కల్యాణ్రామ్ నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో హీరోయిన్గా కీర్తి సురేశ్ ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. తాజాగా రెండో హీరోయిన్ గురించి కూడా వైరల్ అవుతుంది.2027 సంక్రాంతికి వెంకటేశ్, కల్యాణ్రామ్ సందడి చేయనున్నారు. ఈ మూవీలో మరో హీరోయిన్గా కృతిశెట్టి(Krithi Shetty) పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. కల్యాణ్ రామ్కు జోడీగా ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ సమ్మర్ నుంచి షూటింగ్ ప్రారంభ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు అనిల్ రావిపూడి ప్రకటించనున్నారని సమాచారం. -
ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ నటించిన కొత్త చిత్రం 'మర్దానీ 3' ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా నిర్మించారు. ‘‘మర్దానీ (2014), మర్దానీ 2 (2019)’ వంటి విజయాల తర్వాత ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ను ఇచ్చేలా ‘మర్దానీ 3’ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది.'మర్దానీ 3' మార్చి 27న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇతర రీజనల్ భాషల్లో ఉండదు. ఈ ఫ్రాంచైజీలో అత్యధిక వసూళ్లు సాధించిన పార్ట్-3లో జానకి బోడివాలా, జిషు సేన్గుప్తా, ఇంద్రనీల్ సేన్గుప్తా సహాయ పాత్రలలో నటించారు. ఇందులో రాణి ముఖర్జీ.. శివానీ శివాజీరాయ్ అనే పోలీసు పాత్రలో కనిపించారు.మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్ వంటి అంశాలతో ‘మర్దానీ’, ‘మర్దానీ 2’ చిత్రాలు హిట్ సాధించాయి. అయితే, పార్ట్-3లో ఎనిమిది నుంచి పదేళ్ల వయసున్న 93 మంది చిన్నపిల్లల కిడ్నాప్ కేసును ఛేదించడం కనిపిస్తుంది. భయంకరమైన బిచ్చగాళ్ల మాఫియాతో పాటు ఒక ప్రాణాంతకమైన మెడికల్ ఎక్స్పెరిమెంట్ గుట్టును శివాని శివాజీరాయ్ ఎలా ప్రపంచానికి తెలిపారనేది ఈ కథ. -
మేము విడిపోవాలని కోరుకుంటున్నారా.. విడాకులపై ప్రియాంక
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా విడాకులు తీసుకుంటుందంటూ నాలుగేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి రూమర్స్కు గతంలోనే చెక్ పెట్టిన ఆమె తాజాగా మరోసారి ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. తాను సోషల్మీడియాలో ఏదైనా ఫొటోని పంచుకుంటే ఏవేవో ఊహించుకుంటుంటూ కొందరు అదేపనిగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాజమౌళి- మహేశ్బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’లో హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంక తాజాగా తన భర్త నిక్ జొనాస్ గురించి మాట్లాడారు.ప్రియాంక చోప్రా.. నిక్ జొనాస్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాము ఇద్దరం జీవితంలో ఎంతో సంతోషంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. బయటి విషయాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వమని ఆమె అన్నారు. అయితే, తాము విడాకులు తీసుకుంటున్నామంటూ కొన్ని కథనాలు వచ్చినట్లు తెలిసిందన్నారు. తమ వివాహబంధం ముగిసిపోవాలని వారు కోరుకుంటున్నారా..? అని ఆమె ప్రశ్నించారు. తరచుగా ఇలాంటి రూమర్స్ ఎందుకు వైరల్ చేస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. 'మేము వేర్వేరు దేశాలకు చెందడంతో పాటు వేర్వేరు మతాలు, మా ఇద్దరి మధ్య వయసు తేడా ఇలా కొన్ని కారణాలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఎనిమిదేళ్లుగా మేము చాలా సంతోషంగా కలిసే ఉంటున్నాం. నిక్ జొనాస్ పరిచయం అయిన తర్వాత ఆరు నెలల్లోనే పెళ్లి చేసుకున్నాం. మా గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవడం మానేశాను. నిక్ని కలిశాక.. తానే నా జీవితానికి సరైన జోడీ అనిపించి మరో అడుగు ముందుకువేశాను' అని క్లారిటీ ఇచ్చారు.తన కుటుంబ భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని ప్రియాంక చోప్రా చెప్పారు. తన కుమార్తె మాల్టి మేరి గురించి చాలా అప్రమత్తంగా ఉంటానని ఆమె అన్నారు. తమ అనుమతి లేకుండా చాలామంది మాల్టి మేరి ఫోటోలు తీసి నెట్టింట వైరల్ చేయడం తనకు నచ్చదని ఆమె తెలిపారు. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకే సెక్యూరిటీని పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అయితే, తనతో ఎవరైనా ఫోటోలు దిగొచ్చని ఆమె క్లారిటీ ఇచ్చింది. కానీ, తన కూతురి ప్రైవసీని కాపాడటం తన బాధ్యతని ప్రియాంక చెప్పుకొచ్చింది. -
అందమే ఆనందం.. జ్యోతిక ఫోటోలు వైరల్
అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం ఆన్నారో మహాకవి. అవును ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఏనాటి వరకైనా జీవితం అందం గురించే పరుగులు తీస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. అలా అందమైన నగుమోము కలిగిన అతిథులకు వయసు గుర్తుకు రాదని చెప్పడానికి పలు ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కడికో ఎందుకు మనం నటి జ్యోతికనే తీసుకుంటే 1997లో ఒక హిందీ చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసి, ఆ వెంటనే అంటే 1998లో అజిత్ హీరోగా నటించిన వాలి చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రమే సంచలన విజయాన్ని సాధించడం, జ్యోతిక నటన ప్రశంసనీయంగా ఉండడంతో ఆ తరువాత ఆమెకు నటిగా ఎదురు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తమిళం, తెలుగు,హిందీ వంటి పలు భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికిగా రాణిస్తున్నారు. చంద్రముఖి చిత్రంలో ఈమె నటన రిమార్కబుల్. టైటిల్ రోల్లో అంత అద్భుతంగా నటించారు. అలా రెండు దశాబ్దాలకు పైగా నటిస్తూ ఎవర్ గ్రీన్ నాయకి పేరు తెచ్చుకున్న జ్యోతిక కెరీర్ ప్రారంభంలోనే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడారు. వీరి పెళ్లి 2006 జరిగింది. ఆ తరువాత కొంతకాలం సంసార జీవితానికి పూర్తిగా సమయాన్ని కేటాయించారు. సూర్య, జ్యోతిక దంపతులకు దేవ్ అనే కొడుకు, దియా అనే కూతురు ఉన్నారు. పిల్లలు చదువుపై దృష్టి పెట్టిన తరువాత జ్యోతిక మళ్లీ నటనపై దష్టి పెట్టారు.అయితే తన ఇమేజ్ కు సరిపోయే ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. కాగా ఇటీవల బాలీవుడ్పై ఎక్కువగా దష్టి పెడుతున్నారు.అలా ఈమె నటుడు అజయ్ దేవగన్తో కలిసి నటించిన సైతాన్ చిత్రం 2024లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్లో నటిస్తున్న జ్యోతిక తన అందాలను పదిల పరచుకోవడానికి తీవ్రంగా కసరత్తు చేస్తుంటారు. అందుకే 47 ఏళ్ల వయసులో కూడా ఆమె చాలా అందంగా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జ్యోతిక కొత్తగా ఫుల్ ఫిట్ నెస్తో కూడిన తన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
చిరునవ్వులు.. డ్యాన్సులు..
‘‘పెళ్లి వేడుకల తర్వాత మేం కొన్నాళ్లు తీరికగా గడపాలనుకున్నాం’’ అని సోషల్ మీడియా వేదికగా రష్మికా మందన్నా పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నాల వివాహం ఫిబ్రవరి 26న జరిగిన విషయం తెలిసిందే. హల్దీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్, గుడికి వెళ్లడం, సత్యనారాయణ వ్రతం, అభిమానులతో విందు, మీడియాని ప్రత్యేకంగా కలవడం... ఇలా వివాహ వేడుకలతో బిజీ బిజీగా గడిపిన విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ఉరుకులు పరుగులు లేకుండా కాస్త ప్రశాంతంగా ఉండాలనుకున్నారు. అందుకే థాయ్ల్యాండ్లోని కో సామ్యూయ్ దీవికి వెళ్లారు. అయితే ఈ నూతన జంటతో పాటు వీరి స్నేహితులు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ‘‘ప్రశాంతమైన ఉదయాలు, ఈతతో మధ్యాహ్నాలు, టేబుల్ టెన్నిస్ మరియు పూల్ గేమ్స్తో సాయంత్రాలు, సినిమాలతో రాత్రిళ్లు... ఇలా చిరునవ్వులతో సమయం గడిచి΄ోయింది. కో సామ్యూయ్ మాకు ఇల్లులానే అనిపించింది. ఫ్రెండ్స్తో కలిసి గడిపిన ఆ ఆనంద క్షణాలు’’ అని పేర్కొని, ఇన్స్టాగ్రామ్ వేదికగా రష్మిక కొన్ని ఫొటోలు, ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ‘మై హజ్బెండ్’ అని విజయ్ని రష్మిక పిలవడం, విజయ్ నవ్వుతూ చూడడం, ఇంకా రష్మిక కోసం విజయ్ పిజ్జా తయారు చేయించి, ఇవ్వడం, ఇద్దరూ డ్యాన్స్ చేయడం, చిరునవ్వులు చిందించడం, మాట్లాడుకోవడం వంటి విజువల్స్ ఉన్నాయి. -
చరణ్కు గాయం.. 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి రాబోయే అప్డేట్ ఆలస్యమవుతుందేమోనని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే యూనిట్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. చరణ్ ఎడమ కంటికి చిన్నపాటి గాయం మాత్రమే జరిగింది. దానికి వెంటనే ట్రీట్మెంట్ జరిగిందని 'పెద్ది' టీమ్ తెలిపింది. రేపట్నుంచే ఆయన తిరిగి సెట్స్లో పాల్గొనబోతున్నారని కూడా ప్రకటించింది. ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. మార్చి 27 ఉదయం 11:07 గంటలకు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెడీ చేసిన టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ చేసిన బ్యాట్ విన్యాసం సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అదే తరహాలో ఈ బర్త్డే టీజర్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే రామ్ చరణ్ గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్స్, సంబరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెద్ది టీమ్ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. -
శోభిత షాకింగ్ లుక్.. మృణాల్ ఏమో ఇలా
ఓ మ్యాగజైన్ కోసం శోభిత షాకింగ్ లుక్స్బ్లాక్ డ్రస్లో మనసు దోచేస్తున్న మృణాల్చీరలో అందాల ముద్దుగుమ్మలా నేహాశెట్టి'మేడిన్ కొరియా' జ్ఞాపకాలతో ప్రియాంక మోహన్చీరలో నాభి అందాలతో నభా నటేశ్మంచు దేశంలో నైట్ టైమ్ కృతి సనన్ చిల్ View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) -
రామ్ చరణ్కు గాయం.. పెద్ది టీమ్ క్లారిటీ
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గాయంపై పెద్ది టీమ్ స్పందించింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. షూటింగ్లో చరణ్ ఎడమకన్నుకు చిన్న గాయమైందని వెల్లడించింది. అనంతరం రామ్ చరణ్కు చికిత్స అందించామని ప్రకటించింది. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్ ప్రారంభమవుతుందని పెద్ది టీమ్ నోట్ విడుదల చేసింది. దయచేసి ఎటువంటి ఊహాగానాలు నమ్మవద్దని అభిమానులకు సూచించింది. పెద్ది షూటింగ్కు ఎలాంటి ఆటంకం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం ఈ మూవీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.An update regarding @AlwaysRamCharan Garu's injury on the sets of #Peddi.We promise everything is safe and on track ❤️Kindly do not speculate. Thank you. pic.twitter.com/5Abhs2QyHb— PEDDI (@PeddiMovieOffl) March 25, 2026 -
షార్ట్ ఫిల్మ్తో ఎంట్రీ.. ఇప్పుడేమో వరుస ఆఫర్లు.. ఎవరీమె?
సినీరంగంలోకి దూసుకెళ్తన్నారు ప్రముఖ నటి ద్రిషికా చందర్. న్యూయార్క్లోని ప్రతిష్ఠాత్మక పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్లో చదువుకున్న ఆమె నటిగా మంచి మార్కులు కొట్టేశారు. అంతేకాదు.. సమర్థవంతమైన వక్తగా కూడా రాణిస్తున్నారు. థియేటర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ద్రిషికా.. తక్కువ కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించడం మరో విశేషం.ద్రిషికా చందర్ తెలుగు భాషలో 'మనసానమః' షార్ట్ ఫిల్మ్ ద్వారా తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. 2022లో ఆస్కార్ అర్హత పొందిన ఈ చిత్రంలోని ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయిలో నలభైకి పైగా 'ఉత్తమ నటి అవార్డులు' పొందారు. అంతేకాదు మనసానమః చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. తెలుగులో 'బుచ్చి నాయుడు కండ్రిగ', 'ఎ బ్యూటిఫుల్ గర్ల్' తదితర చిత్రాలతో సినీ ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆమె నటించిన 'సుయోధన' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి వైఎస్ మాధవ రెడ్డి దర్శకత్వం వహించారు. బోసుబాబు నిడిమోలు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఇప్పటికే తెలుగులో నాలుగు, హిందీలో రెండు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అంతేకాకుండా మలయాళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఇటీవలే జియో సినిమాలో రిలీజైన హిందీ మూవీ 'హే కమీనీ'లో ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ద్రిషికా నటిస్తోన్న మరిన్ని మలయాళ, తెలుగు భాషా చిత్రాలు నిర్మాణానంతర పనుల్లో ఉన్నాయి.ఆమె వెండి తెరపైనే కాకుండా నాటక రంగంలోనూ ఆమెకు ప్రవేశం ఉంది. 'ఏవం ఇంద్రజిత్' అనే హిందీ నాటికలో ఆరు విభిన్న కోణాలున్న మహిళా పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషలపై మంచి పట్టున్న ద్రిషికా చందర్.. రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయారు. View this post on Instagram A post shared by DRISHIKA CHANDER (@drishikachander) -
ఎంటర్టైనింగ్గా 'రాకాస' ట్రైలర్
'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో ఎంటర్టైన్ చేసిన సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా 'రాకాస'. మెగా డాటర్ నిహారిక నిర్మించగా.. మానస శర్మ అనే అమ్మాయి దర్శకురాలిగా పరిచయమవుతోంది. హారర్ కామెడీ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?)ట్రైలర్ బట్టి చూస్తే.. ఇదివరకు వచ్చిన హారర్ సినిమాల్లానే ఇందులో స్టోరీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఏ మాత్రం సంబంధం లేని హీరో, ఓ పల్లెటూరికి వస్తాడు. అక్కడే ఉండే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అనుకోని విధంగా హీరో సమస్యల్లో చిక్కుకుంటాడు. బ్రహ్మ రాక్షసుడికి ఆహారంగా ఊరంతా కలిసి ఇతడిని పాడుబడ్డ కోటలోకి పంపిస్తారు. అక్కడ హీరోకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: రేలంగి మామయ్యగా ఒకవేళ రాజశేఖర్ చేసుంటే?) -
పెళ్లి తర్వాత తొలి వేకేషన్ ట్రిప్.. విరోష్ జంట వీడియో వైరల్..!
టాలీవుడ్ జంట విజయ్-రష్మిక ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత ఈ జంట హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.తాజాగా పెళ్లి తర్వాత విరోష్ జంట వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధంచిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరలవుతున్నాయి. అయితే పెళ్లి తర్వాత ఈ థాయ్లాండ్ ట్రిప్లో తామిద్దరం చాలా సంతోషంగా ఎంజాయ్ చేశామని రష్మిక తెలిపారు. ఈ మేరకు ఎయిర్బిఎన్బి (Airbnb) భాగస్వామ్యంతో రష్మిక తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. ‘ప్రశాంతమైన ఉదయం, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, పూల్ ఆటలతో ఇక్కడి కో సముయ్లోని ప్రాంతం మా సొంత ఇల్లులా అనిపించిందని తెలిపింది. ఆ రోజుల్లో మేము గడిపిన కొన్ని క్షణాలు’ అంటూ వీడియోను పోస్ట్ చేసింది. అయితే వీరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూశారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఎక్కడా తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పలేదు. ఎన్నిసార్లు రూమర్స్ వినిపించినా వాటిపై ఎవరు కూడా స్పందించలేదు. అయితే కొన్ని సార్లు ఇన్ డైరెక్ట్గా హింట్స్ ఇస్తూ వచ్చారు. చాలాసార్లు వీరిద్దరు ఉన్న ఫోటోలు బయటికొచ్చాయి. కానీ చివరికీ పెళ్లి కొద్ది రోజుల ముందు మాత్రమే సోషల్ మీడియాలో అఫీషియల్గా ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ రణబలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
నా నవ్వు బాగుందని ఆ పాత్ర చేయమన్నారు.. కానీ
కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తెలుగులోనూ అలా చాలా మూవీస్ ఉన్నాయి. ఇవి చూస్తున్న ప్రతిసారి.. వీళ్లు తప్పితే మరెవరు నటించినా అస్సలు సూట్ కాదు కదా అని కచ్చితంగా అనిపిస్తుంది. అలాంటి వాటిలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీ ఒకటి. మరీ ముఖ్యంగా ఇందులో ప్రకాశ్ రాజ్, రేలంగి మామయ్యగా జీవించేశాడు. ఇప్పటికీ ఎవరైనా నవ్వుతూ ఉంటే సరదాగా రేలంగి మామయ్య అని ఆటపట్టిస్తుంటారు. అంతలా జనాల్లో వెళ్లిపోయింది. అయితే ఈ పాత్ర కోసం సీనియర్ నటుడు రాజశేఖర్ని తొలుత అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టారు.(ఇదీ చదవండి: ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్)''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ఎప్పుడూ నవ్వుతూ ఉంటే పాత్ర కోసం దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు. నా నవ్వు బాగుంటుందనే విషయాన్ని గుర్తుచేస్తూ నేను చేస్తే బాగుంటుందని అడిగారు. కానీ చేయలేకపోయాను' అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. చేయనుందుకు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అని అడగ్గా.. అలాంటిదేం లేదని అన్నారు. ఒకవేళ రాజశేఖర్.. రేలంగి మామయ్య పాత్ర చేసుంటే ఎలా ఉండేదో ఊహించుకోండి!శర్వానంద్ హీరోగా చేసిన 'బైకర్' మూవీలో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. ఇది వచ్చే నెల 3వ తేదీన థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్ల సందర్భంగానే చాలా విషయాలని రాజశేఖర్ పంచుకుంటున్నారు. అప్పట్లో ఈయన్ని వెతుక్కుంటూ చాలానే క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు వచ్చాయి. కానీ పలు కారణాలతో వాటిని వదులుకున్నారు. ఇప్పుడేమో ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి అని ఈయనే టాలీవుడ్ దర్శకనిర్మాతలని రిక్వెస్ట్ చేస్తున్నారు.రాజశేఖర్ కెరీర్ విషయానికొస్తే అప్పట్లో అల్లరి ప్రియుడు, సింహరాశి, మా అన్నయ్య, అంకుశం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో రాజశేఖర్.. గత కొన్నేళ్లుగా తెరపై కనిపించట్లేదు. చెప్పాలంటే ఈయన్ని దర్శకులు పట్టించుకోవడం మానేశారు. కొన్నాళ్ల క్రితం నితిన్ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' మూవీలో క్యారెక్టర్ రోల్ చేసినప్పటికీ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు 'బైకర్'పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇందులో హీరోకి తండ్రి, బైక్ రేసింగ్ కోచ్గా కనిపించనున్నారు.(ఇదీ చదవండి: శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది) -
'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?
'ధురంధర్ 2' వచ్చింది. దేశంలో ప్రతిచోట బాక్సాఫీస్ కళకళలాడిపోయేలా చేస్తోంది. ఇప్పటికే రూ.1000 కోట్ల కలెక్షన్స్కి చేరువలో ఉంది. కొన్ని సినిమాలు కేవలం వచ్చి వెళ్లడం మాత్రమే కాదు. ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేస్తాయి. 'ధురంధర్ 2' ఆ రేంజ్ మూవీలానే అనిపిస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో అన్ని ఇండస్ట్రీలపై దీని ప్రభావం గట్టిగానే ఉండబోతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే)ఎందుకంటే ఏదైనా సినిమా హిట్టయి, వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తే చాలు.. టాలీవుడ్లో కావొచ్చు బాలీవుడ్లో కావొచ్చు అదే తరహాలో మూవీస్ తీసే ప్రయత్నం చేస్తుంటారు. రాబోయే కొన్నేళ్లలో 'ధురంధర్' తరహా మూవీస్ ఎక్కువగా రావడం గ్యారంటీ. గతంలో బాహుబలి, కేజీఎఫ్ వచ్చినప్పుడు ఇలానే చాలామంది డైరెక్టర్స్ వాటిని అనుకరించి సినిమాలు తీశారు. అడ్డంగా బోల్తా కొట్టారు. టాలీవుడ్, 'ధురంధర్' మాయలో పడకపోతేనే బెటర్. లేదు మేం కూడా ఇలాంటి మూవీసే తీస్తాం, హిట్ కొడతాం అనుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది.టాలీవుడ్లో చాలామంది దర్శకులు.. స్టోరీ కంటే హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వాలి, అవసరం లేకపోయినా కామెడీ పెట్టాలి, ఐటమ్ సాంగ్స్ ఇరికించాలి అనే ఆలోచనలతోనే ఉంటారు. ఇలాంటివన్నీ చూసి బోర్ కొట్టడం వల్లే 'ధురంధర్'కి అదే తెలుగు ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. కాబట్టి 'ధురంధర్' లాంటి సినిమాలు తీయాలంటే హీరోలని అనుకుని స్టోరీలు రాయడం కాకుండా స్టోరీ రాసి, దానికి తగ్గ నటీనటుల్ని వెతుక్కోవాలి. అప్పుడే సరైన ఫలితం దక్కే అవకాశముంటుంది.ఏదైనా సినిమాకు సీక్వెల్ అంటే చాలు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాలనేలా టాలీవుడ్ని భ్రష్టుపట్టించారు. ఆ ట్రెండ్ బ్రేక్ చేసిన ఆదిత్య ధర్.. తొలి పార్ట్ వచ్చిన మూడంటే మూడు నెలల్లో సీక్వెల్ తీసుకొచ్చాడు. ప్రేక్షకుల అంచనాలని అందుకోవడమే కాదు వాటిని దాటేసి మెప్పించాడు. ఒకవేళ తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు ఎవరైనా చేద్దామనుకుంటే ఇదే ట్రెండ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.టాలీవుడ్లో ఉన్న ఇంకో సమస్య టికెట్ రేట్స్. సినిమాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టికెట్ ధరలు పెంచేయాలని తాపత్రయపడుతుంటారు. దీని కారణంగానే థియేటర్లకు వచ్చే చాలామంది ప్రేక్షకులని ఓటీటీలు, పైరసీలకు అలవాటు పడేలా చేశారు. ఈ విషయంలో 'ధురంధర్' టీమ్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. తొలి పార్ట్ గానీ రెండో పార్ట్కి గానీ టికెట్ రేట్లు పెంచలేదు. ఆయా థియేటర్ లేదా మల్టీప్లెక్స్ల్లో ఎంత రేటు అయితే ఉందో దానితోనే సినిమా చూసే అవకాశం కల్పించారు. ఇలా చేయడం వల్లే అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. టాలీవుడ్ దీన్నిచూసి చాలా నేర్చుకోవాలి.'ధురంధర్' రెండు భాగాలని కలిపి రూ.300 కోట్ల కంటే తక్కువ బడ్జెట్తోనే పూర్తి చేశారని టాక్. ఈ విషయంలో టాలీవుడ్ ఎంత నేర్చుకుంటే అంత బెటర్. స్టార్ హీరోలకు వందల కోట్లు గుమ్మరించడం లాంటివి కాకుండా కంటెంట్కి ఏం కావాలి? దేనికి ఎంత ఖర్చుపెట్టాలి అనే విషయాలపై కాస్త దృష్టిపెట్టాలి అప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కొంతైనా మార్పు వస్తుంది. లేదు మేం ఇలానే రొటీన్, మూస స్టోరీలు తీస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రేక్షకులు అలాంటి వాటిని చూడటం మానేశారు. మానేస్తున్నారు. నిర్మాతలు ఈ విషయం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత బెటర్.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'అవతార్ 3' సినిమా) -
ఒక రోజు ఆలస్యంగా రాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్
కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ ‘యూత్’. ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా ఈ నెల 27న థియేటర్స్ లోకి రాబోతోంది. పెయిడ్ ప్రీమియర్స్ పై ప్రకటన చేస్తామని ప్రొడ్యూసర్స్ వెల్లడించారు. ఇప్పటికే తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్.ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. 'కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ - నో ఏజ్ లిమిట్' అనే స్లోగన్ తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు, సాంగ్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ ఆడియెన్స్ ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ధురంధర్ 2 ఎఫెక్ట్.. స్టార్ హీరో సినిమా వాయిదా
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘భూత్ బంగ్లా’ విడుదల మరోసారి వాయిదా పడనుంది. ఈమేరకు సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. అక్షయ్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘భూత్ బంగ్లా’. ఇందులో టబు, వామికా గబ్బి, పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి.రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. దీంతో ఏప్రిల్ 10న భూత్ బంగ్లా విడుదల కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం మరో వారం పాటు వాయిదా పడి, ఏప్రిల్ 17, 2026న కొత్త విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. 'ధురందర్: ది రివెంజ్' భారీ విజయం సాధించి, బాక్సాఫీస్ను శాసిస్తూ ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. -
మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఇవే.. వీడియోలు వైరల్
రాజమౌళి ఏ సినిమా తీసినా కాస్త రహస్యంగానే ఉంచుతాడు. బాహుబలి కావొచ్చు, ఆర్ఆర్ఆర్ కావొచ్చు.. జక్కన్న అనుకున్నప్పుడే ఏ చిన్న విషయమైనా బయటకొచ్చేది. అలాంటిది మహేశ్ బాబుతో తీస్తున్న 'వారణాసి' కోసం ఇంతకు ముందులా కాదు చాలా మారిపోయినట్లే కనిపిస్తున్నాడు. ఎందుకంటే మూవీ రిలీజ్కి ఏడాదిన్నర ముందే టీజర్ లాంటిది రిలీజ్ చేసి షాకిచ్చాడు. ఇప్పుడు మూవీ సెట్స్కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి.. వీడియో వైరల్)సాధారణంగా చిత్రీకరణ ఫొటోలు, సెట్ ఫొటోలు గానీ బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండే రాజమౌళి.. గతేడాది నవంబరులో మూవీ టీజర్/గ్లింప్స్ రిలీజ్ కోసం ఏకంగా హాలీవుడ్ మీడియాలోని కొందరిని హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఆ సమయంలో తానే స్వయంగా వాళ్లని 'వారణాసి' షూటింగ్ లొకేషన్స్కి తీసుకుని వెళ్లాడు. అప్పుడు వాళ్లు సెట్స్కి సంబంధించిన వీడియోలు తీసుకున్నారు. ఇప్పుడు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.వారణాసి వీధులు, ఘాట్స్ తదితర సెట్స్ ఇందులో చూపించారు. మినీయేచర్ సెట్ వీడియో కూడా ఇందులో చూడొచ్చు. ఇకపోతే రెండు నెలల క్రితం హాలీవుడ్కి చెందిన రెండు యూట్యూబ్ ఛానెల్స్కి మూవీ టీమ్ ఇచ్చిన ఇంటర్వ్యూలు రిలీజ్ చేశారు. సాధారణంగా ఇలాంటివి.. సినిమా రిలీజ్ టైంలో ప్లాన్ చేస్తుంటారు. కానీ రాజమౌళి ఏడాదిన్నర ముందు నుంచి ఇలాంటివి ప్లాన్ చేస్తూ వస్తున్నాడు. చూస్తుంటే ఈసారి హాలీవుడ్లోనూ గట్టిగా పాగా వేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి?గ్లోబ్ట్రాటర్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న 'వారణాసి'లో రుద్ర అనే పాత్రలో మహేశ్ కనిపించబోతున్నాడు. మందాకిని అనే పాత్ర ప్రియాంక చోప్రా చేస్తుండగా, కుంభ అనే ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా మూవీని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: ప్రభాస్తో సినిమా ఛాన్స్.. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నా: రాశి) View this post on Instagram A post shared by DiscussingFilm (@discussingfilm) -
రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి.. వీడియో వైరల్
రాజస్థాన్కు చెందిన యువ నటి, ప్రముఖ మోడల్ హర్షిల్ కాలియా (30) రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ డీకొట్టడంతో పల్టీలు కొట్టింది. షిప్రా పాత్ రోడ్డులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఘటన జరిగిన తర్వాత స్థానికులు వెంటనే కారు వద్దకు చేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదం స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు.‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ అనే వెబ్ సిరీస్తో హర్షిల్ కాలియా పాపులర్ అయ్యారు. రాజస్థానీ ప్రాంతీయ సాంగ్స్లో ఆమె డ్యాన్సర్గా పనిచేశారు. ఆపై యాంకర్గా కూడా గుర్తింపు పొందారు.“Shiprapath Road पर दर्दनाक हादसा: 30 वर्षीय मॉडल युवती की मौ*त#Jaipur #CarAccident #HarshilKalia #ShiprapathRoad #TragicNews #RoadAccident #BreakingNews #CCTVFootage #updateindia pic.twitter.com/7FGuqG1Rs8— Update India (@UpdateIndia_TV) March 24, 2026 -
ఎల్లమ్మ లగ్గం నుంచి సదర్ వరకు.. ‘దేత్తడి’లో గొప్పగా చూపించాం: దిల్ రాజు
‘రౌడీ బాయ్స్, లవ్ మీ’ చిత్రాల హీరో ఆశిష్ నటిస్తున్న తాజా సినిమా ‘దేత్తడి’. ఆదిత్య రావు గంగసాని దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్, ఫస్ట్ లుక్ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ఘన్ను అనే పాత్రలో ఆశిష్ కనిపిస్తాడు. హైదరాబాద్లో జరిగే ఎల్లమ్మ లగ్గం దగ్గర నుంచి బోనాలు, వినాయక చవితి, సదర్... ఇలా హైదరాబాద్ కల్చర్ గురించి ఆదిత్య ఈ సినిమా తీస్తున్నారు. ఏడాది పాటు ఆశిష్, ఆదిత్యలు బ్యాండ్ వాయించే వాళ్ళ చుట్టూ తిరుగుతూ, వాళ్ల గురించి తెలుసుకుంటూ, వాళ్ల జీవితాల్లోని ఇన్సిడెంట్స్ అన్నింటినీ పోగు చేసుకుని, ‘దేత్తడి’ కథను రాశారు. తమ గురించి సినిమా తీస్తున్నారనే ఆనందంతో దాదాపు ఆరు వందల మంది స్ట్రీట్ డ్రమ్మర్స్ ఉచితంగా వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ప్రతి బ్యాండు వాళ్ల దగ్గరకు వెళ్లి, బ్యాండ్ ఎలా కొట్టాలి? ఎన్ని బ్యాండ్స్ ఉంటాయి.. ఇలా నేర్చుకుని, ఈ సినిమా కోసం రెడీ అయ్యాడు ఆశిష్. హైదరాబాద్ కల్చర్ని ప్రపంచానికి గొప్పగా చూపించబోయే సినిమాతో వస్తున్నారు’’ అని అన్నారు. ‘‘ప్రతి బ్యాండ్ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. మీతో పాటు మా ఇజ్జత్ కోసం ఈ సినిమా తీస్తున్నాం’’ అని చెప్పారు ఆశిష్. ‘‘అందరికీ గుర్తుండిపోయేలా ఈ మూవీని తీస్తాం’’ అని చెప్పారు దర్శకుడు ఆదిత్య. ‘‘హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అసలైన హైదరాబాద్ కల్చర్ను చూపించే తొలి సినిమా ఇదే అవుతుంది’’ అని పేర్కొన్నారు రైటర్ ప్రసన్న. -
నన్ను తాకేవాడు.. ఇంట్లో వాళ్లకు చెబితే సర్దుకుపొమ్మన్నారు: మోనాలిసా
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాతో పాపులర్ అయిన మోనాలిసా ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. తనకు మొదటిసారిగా సినిమా ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రాపై మీడియాతో మాట్లాడుతూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది.షూటింగ్ సెట్లో సనోజ్ మిశ్రా తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారని మోనాలిసా వాపోయింది. షూటింగ్ పేరుతో తన శరీరాన్ని పలుమార్లు తాకుతూ చాలా ఇబ్బందిపెట్టేవాడిని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొంది. తన ఇంట్లో వారితో కన్నీళ్లు పెట్టుకున్నా సరే మొదటి సినిమా కావడంతో సర్దుకుపోవాలని సూచించారని మోనాలిసా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఆ సమయంలో తన వయసు 18 ఏళ్లు కూడా పూర్తి కాలేదని గుర్తుచేసింది. అందుకే బయటి ప్రపంచానికి చెప్పలేకపోయానని తెలిపింది. ప్రస్తుతం తన భర్త ఫర్మాన్ ఖాన్తో కలిసి కేరళలో నివసిస్తున్నానని చెప్పింది. తమకు ప్రాణహాని ఉండటంతో ఆందోళనతో ఉన్నామని తెలిపింది.యూపీ ఝాన్సీ నగరానికి చెందిన ఓ యువతి కూడా గతంలో సనోజ్ మిశ్రాపై లైంగిక ఆరోపణలు చేసింది. సినిమా ఛాన్స్ ఇస్తానని నమ్మించి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. జూన్ 18, 2021న తనని ఓ రిసార్ట్లో తనకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. అయితే, ఆ సమయంలో వీడియోలు కూడా రికార్డ్ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ వీడియోలతో బెదిరించి చాలాసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆ యువతి పేర్కొంది. ఈ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత బెయిల్ ద్వారా విడుదలయ్యారు. అయితే, మోనాలిసా పెళ్లి చేసుకున్న తర్వాత సనోజ్ మిశ్రా సంచలన కామెంట్ చేశాడు. మోనాలిసా సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ఆమె సడెన్గా పెళ్లి చేసుకోవడంతో సినిమా ఫలితంపై భారీ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. -
టొవినో థామస్ సినిమా.. రూ. 14 కోట్ల మోసం అంటూ..
మలయాళ నటుడు టొవినో థామస్, కయాదు లోహర్ నటిస్తున్న కొత్త చిత్రం 'పల్లి చట్టంబి' వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు డీజో జోస్ ఆంటోనీ తెరకెక్కిస్తున్నారు. రెండురోజుల క్రితం ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. సామాజిక మాధ్యమాలలో సినిమాపై బజ్ కూడా క్రియేట్ అయింది. ఇందులో విజయ్ రాఘవన్, సుధీర్, బాబురాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. నౌఫల్, బ్రిజేశ్, సీసీసీ బ్రదర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.మాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం.. దుబాయ్లో నివసిస్తున్న ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈ చిత్ర నిర్మాతలైన నౌఫల్ అహ్మద్, బ్రిజేష్ మహమ్మద్లపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను సుమారు రూ. 14 కోట్లకు మోసం చేశారని, ఆ నిధులతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని ఆయన ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు పిటిషన్లో భాగంగా మాత్రమే ఉన్నాయి. కానీ కోర్టులో ఇంకా నిరూపించబడలేదు. హైకోర్టు ఈ విషయాన్ని విచారణకు స్వీకరించి, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఆదేశాలు కూడా షెడ్యూల్ చేసింది. అయితే, ఇప్పటివరకు, చిత్ర బృందం నుండి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. ఈ సినిమా 1950, 60ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో రూపొందుతోంది. -
ప్రభాస్తో సినిమా ఛాన్స్.. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నా: రాశి
సీనియర్ హీరోయిన్ రాశి మరోసారి ప్రభాస్పై అభిమానాన్ని చూపించారు. టాలీవుడ్లో ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రాశి.. బాలనటిగా తన కెరీర్ను ప్రారంభించింది. ఇండస్ట్రీలోని అగ్ర హీరోలతో కలిసి నటించింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు చిత్రాలు ఆమెకు భారీ గుర్తింపు తెచ్చాయి. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత రాశి కొన్నేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన రాశి పలు చిత్రాలతో పాటు సీరియల్స్లో కూడా కనిపిస్తుంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి నటి రాశి పలు వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని చెప్పారు. ప్రభాస్తో కలిసి ఒక్కసినిమాలో అయినా నటించాలనే ఆశ చాలా ఏళ్లుగా ఉండిపోయిందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో ఛాన్స్ వచ్చినా తల్లిగా మాత్రం నటించనని క్లారిటీ ఇచ్చారు. ఆపై అక్క, వదిన వంటి పాత్రలు వచ్చినా చేయనన్నారు. హీరోయిన్గా నటించే ఛాన్స్ ఎలాగూ ఇవ్వరని తెలిపారు. దీంతో తన కోరిక అలాగే ఉండిపోయిందన్నారు. అయితే, ప్రభాస్ను ఇంతవరకు కలవలేదని రాశి అన్నారు. మిర్చి, రాధేశ్యామ్ వంటి చిత్రాలకు డబ్బింగ్ చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. 'ఈశ్వర్ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని తన బ్రదర్తో చెప్పానని ఆమె అన్నారు. ప్రభాస్ సినిమాలు చూడటానికి మాత్రమే థియేటర్కి వెళ్తానని రాశి చెప్పడం విశేషం.అడవి రాముడు షూటింగ్ సమయంలో ప్రభాస్ ఉన్న హోటల్లోనే తాను కూడా ఉన్నానని రాశి అన్నారు. 'ఆ విషయం తెలిసి నేను ఎగిరి గంతేశా. అయితే ప్రభాస్ను కలవాలని అనుకున్నా. కానీ కుదరలేదు. అయితే.. ఆయన ఉన్న రూమ్కు కాల్ చేసి మాట్లాడా. అయితే ప్రభాస్ సీనియర్స్కు చాలా మర్యాద ఇస్తారని విన్నా.' అని తెలిపింది. Nen #Prabhas ki Matram Amma ga cheyanu. Eshwar Trailer chusi I just told my brother that he's going to be a Big Hero ani, Ayana Cinema ki Matrame Theatre ki velta nenu, Chatrapati, BB1&2!(Nenu Intha varaku Prabhas ni kalavale) Industry lo unavale kalavale ante manam, kastamey. pic.twitter.com/G9S1gTJjld— . (@charanvicky_) March 24, 2026 -
నటుడు సుదీప్కు గుడి కట్టిన వీరాభిమాని
తమ అభిమాన నటీనటులకు ఆలయాలు కట్టి పూజలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన నటీనటులకు తమిళ సినీ అభిమానులు గుడి కట్టించడమే విశేషం. అలా ఇంతకుముందు ఉత్తరాదికి చెందిన తమిళనాడులో ఆమె వీరాభిమాని గుడి కట్టించి ఆరాధించిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ నటుడు సుదీప్కు తమిళనాడులో ఒక వీరాభిమాని గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు. కన్నడం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కథానాయకుడిగా 50 కి పైగా చిత్రాల్లో నటించిన నటుడు సుదీప్. తెలుగులో ఈయన నటించిన “ఈ “చిత్రం “ నాన్ ఈ “గా తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.అదేవిధంగా విజయ్ హీరోగా నటించిన పులి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. మరికొన్ని చిత్రాల్లో నటించిన సుదీప్కు తమిళనాడు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అలా ఈరోడ్ జిల్లా, తొట్టాగాజనూర్ ప్రాంతానికి చెందిన సుందరరాజ్ నటుడు సుదీప్కు వీరాభిమాని. ఇతను ద్విచక్రవాహంలో ఐస్ వ్యాపారం చేస్తుంటాడు. కాగా తన అభిమాన నటుడు సుదీప్ కోసం తన ఇంటి ముందు గుడిని కట్టించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఆ గుడిలో సుదీప్ చిత్ర పటంతో పాటు మహర్షి వాల్మీకి, వీర మాతంగరి ఫొటోలు పొందుపరిచి పూజలు చేస్తున్నారు. -
రామ్ చరణ్కు గాయం.. షూటింగ్కు బ్రేక్
రామ్ చరణ్ గాయపడ్డారని సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా సెట్స్లో చరణ్కు స్వల్ప గాయం అయినట్లు సమాచారం. ఆయన కంటి దగ్గర గాయమైనట్లు తెలుస్తోంది. కానీ, అది స్వల్పమైనదేనని చెబుతున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోషల్మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, తిరిగి సెట్స్లో చేరతారని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే చరణ్తో ఉన్న కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఒక ప్రత్యేక గీతాన్ని షూట్ చేయనున్నారట. రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) శుక్రవారం కావడంతో, ఆ రోజున ఒక టీజర్ను విడుదల చేస్తారని టాక్..గ్రామీణ నేపథ్యంలో జరిగే స్పోర్ట్స్ డ్రామా మూవీగా ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివ రాజ్కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 27న బాక్సాఫీసు ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ తేదీలో కూడా పెద్ది విడుదల కావడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి. -
అతను నా క్లాస్మేట్.. స్టార్ హీరోపై శృతి హాసన్ కామెంట్
పాన్ ఇండియా కథానాయికల్లో ఒకరు శృతి హాసన్. ఈమె నటుడు కమలహాసన్ వారసురాలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథానాయకి, గాయని, సంగీత దర్శకురాలు ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకుంటూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్న నటి ఈమె. అంతేకాకుండా సంచనాలకు నిలయం శృతి హాసన్(Shruti Haasan) అనే ట్యాగ్లైన్ను కూడా వేసుకున్నారీమె. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటూ అభిమానుల్లో జోష్ నింపే ఈమె ప్రేమ వ్యవహారం కూడా తెలిసిన పుస్తకమే. కాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరిగా ఉన్నారు. కాగా ఇటీవల ఒక బేటిలో శృతిహాసన్ తన పాఠశాల జీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందులో భాగంగా నటుడు దుల్కర్ సల్మాన్ గురించి తెలిపారు. దుల్కర్ సల్మాన్ తాను బాల్యంలో చెన్నైలో ఓకే స్కూల్లో కలిసి చదువుకున్నామని చెప్పారు. రెండు ప్రముఖ పాఠశాలల్లో తమ విద్యాభ్యాసం జరిగిందన్నారు. ఆ సమయంలో తాము తరచూ కలుసుకునేవారుమని చెప్పారు. ఆయన తనను సోంబి అని పిలిచేవాడన్నారు. అప్పట్లో పలువురు సహా విద్యార్థులతో కలిసి తాను సోంబి పాటను పాడిన అనుభవం ఉందన్నారు. ఆ తర్వాతనే తనను దుల్కర్ సల్మాన్ సోంబి అని పిలిచే వాడిని పేర్కొన్నారు. అతనితో కలిసి చదివిన విద్యార్థులకు తాను కమలహాసన్ కూతురు అన్న విషయం మాత్రమే తెలుసు అని, తన పేరు తెలియదని చెప్పారు. కాగా తాజాగా ఈ భామ దుల్కర్ సల్మాన్తో కలిసి ఆకాశంలో ఒక తార అనే తెలుగు చిత్రం లో నటించడం విశేషం. ఈ చిత్రం తమిళం, కన్నడం మలయాళం హిందీ భాషల్లో రూపొందుతోంది. -
వినోదాల సందడి
మార్చి నెల ముగింపుకు వచ్చింది. దీంతో ఏప్రిల్ నెలలో ఏయే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయనే చర్చ ఆడియన్స్లో మొదలైంది. వచ్చే నెలలో డిఫరెంట్ జానర్స్లోని సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ జాబితాలో ‘పెద్ది’ వంటి పెద్ద చిత్రం నుంచి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ వంటి చిన్న చిత్రాలు చాలానే ఉన్నాయి. మరి... ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆ సినిమా ఎలా ఉండబోతోంది? అనే విషయాలు ఈ విధంగా...పెద్ది పోరాటం వచ్చే నెల చివర్లో థియేటర్స్లోకి రానున్నాడు పెద్ది. రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ అండ్ పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ పాల్గొంటుండగా క్లైమాక్స్కు చెందిన టాకీ పార్టు చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. అయితే ఇంకా సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉంది. తొలుత ‘పెద్ది’ని రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయా లనుకున్నారు మేకర్స్. కానీ ఏప్రిల్ 30కి వాయిదా వేశారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో టీమ్ చాలా స్పీడ్గా షూటింగ్ చేస్తోంది. ఆల్రెడీ ఒకసారి సినిమా రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో మరోసారి ఇలా జరగకూడదని పక్కా ప్లాన్తో షూటింగ్ షెడ్యూల్ను ప్లాన్ చేశారు మేకర్స్. మరోవైపు పోస్ట్ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని తెలిసింది. ఈ స్పెషల్ సాంగ్లో మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేస్తారని, ఇదే సాంగ్లో ఈ చిత్రం హీరో హీరోయిన్లు రామ్ చరణ్, జాన్వీ సైతం కాలు కదుపుతారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.అలాగే ఈ నెల 27న రామ్చరణ్ బర్త్ డే. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ నుంచి సర్ప్రైజింగ్గా ఓ యాక్షన్ టీజర్ను రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేసిందని తెలిసింది. ‘పెద్ది’ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్లో రామ్చరణ్ క్రికెటర్గానే కనిపించారు. కానీ రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా రాబోతున్న యాక్షన్ టీజర్లో చరణ్ కుస్తీ పడుతున్న సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. ఇంకా ‘పెద్ది’ చిత్రంలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి ఇతర క్రీడల ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది.అంతేకాదు... ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఊరిలో నెలకొన్న ఓ సమస్య కోసం హీరో పాత్ర పోరాటం చేస్తుందని సమాచారం. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎమోషనల్ బైకర్ ఏప్రిల్ 3న థియేటర్స్లోకి దూసుకు రానున్నాడు బైకర్. శర్వానంద్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘వాడికి రేసింగ్ అంటే ప్రాణం..’, ‘నువ్వు అందరికంటే ముందు రాలేదు... నీ కంటే అందరూ వెనకాల వచ్చారు.రెండింటికి చాలా తేడా ఉంది’, ‘విక్కీతో కొంచెం మాములుగా ఉండొచ్చు కదా... ఎందుకంత కంట్రోల్ చేస్తావ్..., ఈగో ఇంపార్టెంట్ కాదు సుదర్శన్... నథింగ్ ఈజ్ బిగ్గర్ థేన్ స్పోర్ట్’, ‘నీలాంటి పిరికివాడితో పని చేయడం నాకు తెలియదు రా..’, ‘వాళ్ల నాన్నకు విక్కీ కొడుకు కాదు... రేసర్ అంతే..’, ‘కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రిని ఒక్కర్ని చూపించు’ వంటి డైలాగ్స్ ‘బైకర్’ సినిమా ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రంలో వికాస్ నారాయణన్ పాత్రలో శర్వానంద్, బుల్లెట్ సునిల్ పాత్రలో రాజశేఖర్ నటించారు. ఇందులో రాజశేఖర్, శర్వానంద్ తండ్రీకొడుకులుగా చేశారు.‘బైకర్’ సినిమాలో రైసింగ్ అంశాలతో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా కథ 1990, 2000... ఇలా రెండు డిఫరెంట్ టైమ్లైన్స్లో సాగుతుంది. ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్గా రూపొందిన ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించగా, జిబ్రాన్ సంగీతం అందించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక ‘బైకర్’ సినిమాను తొలుత గత ఏడాది డిసెంబరు 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ప్రొడక్షన్ వర్క్స్లో రాజీ పడకూడదని, యూనిట్ ఈ సినిమా రిలీజ్ను ఏప్రిల్ 3కి వాయిదా వేసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత శర్వానంద్ నుంచి రానున్న ‘బైకర్’ చిత్రంపై ఆడియన్స్లో అంచనాలు ఉన్నాయి.మాజీ ప్రేమికుల ప్రయాణం బ్రేకప్ తర్వాత ఇద్దరు మాజీ ప్రేమికులు మళ్లీ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ప్రేమికులు తిరిగి ప్రేమలో పడతారా? ఈ ప్రయాణంలో వారు వాళ్ల గురించి ఏం తెలుసుకున్నారు? అన్న అంశాల నేపథ్యంలో ‘డెకాయిట్’ సినిమా తెరకెక్కిందని తెలిసింది. ఈ చిత్రంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర చేశారు. దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారు.అనురాగ్ కశ్యప్, జైన్ మేరీ... ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దాదాపు 150 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా కథనం రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో వచ్చే ఓ రాబరీ ఎపిసోడ్, అలాగే ‘కన్నె పిట్టరో..’ పాట హైలైట్స్గా ఉంటాయని సమాచారం. షానియల్ డియో దర్శకత్వంలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో స్వరకర్త. సునీల్ నారంగ్ సహ–నిర్మాతగా వ్యవహరించారు.తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. తొలుత ‘డెకాయిట్’ సినిమాను మార్చి 19న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ తేదీకి రణ్వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా రిలీజ్కు షెడ్యూల్ కావడంతో ‘డెకాయిట్’ను ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. ఈ నెల 28న ఈ సినిమా నుంచి ‘చిచ్చుబడ్డి’ అనే పాట లిరికల్ వీడియో రిలీజ్ కానుంది.ఈ సంగతి ఇలా ఉంచితే... 2022లో అడివి శేష్ హీరోగా ‘హిట్: ది సెకండ్ కేసు’ సినిమా వచ్చింది. ఈ చిత్రం తర్వాత అడివి శేష్ సోలో హీరోగా మరో సినిమా థియేటర్స్కు రాలేదు. మూడు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా అడివి శేష్ నుంచి రాబోతున్న ‘డెకాయిట్’ సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి ఆడియన్స్లో నెలకొని ఉంది. ఇక గత ఏడాది నాని హీరోగా నటించిన ‘హిట్: ది థర్డ్ కేసు’ చిత్రంలో అడివి శేష్ ఓ అతిథి పాత్రలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.కాపాడే కవచం నిఖిల్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘స్వయంభూ’. సంయుక్త, నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిం చారు. ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. అయితే ‘స్వయంభూ’ సినిమాను తొలుత ఫిబ్రవరి 13న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు. అయితే ఈ సినిమా పోస్ట్ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో ఏప్రిల్ 10న విడుదల కాకపోవచ్చనే టాక్ తెరపైకి వచ్చింది.అంతేకాదు... ఏప్రిల్ 30న ‘పెద్ది’ సినిమా ఒకవేళ విడుదల కాకపోతే, ఆ తేదీకి తమ సినిమా విడుదలయ్యేలా ‘స్వయంభూ’ టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇక ఇటీవల ‘స్వయంభూ’ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ‘సాక్షాత్తు ఆ సదాశివుడే దిగి వచ్చి, శ్రీరాముడికి అందించిన ఈ సింగోలుకి కూడా అరణ్యవాసమా?’, ‘యుద్ధమా?’, ‘అంతర్యుద్ధం..’, ‘కాలం కత్తై దూస్తే కాపాడే కవచం ఒకటి కావాలి కదా..’, ‘బలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా... కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది’ వంటి డైలాగ్స్ ఈ టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు.అమెరికా రిటర్న్స్ సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఫ్యాంటసీ అండ్ అడ్వెంచరస్ కామెడీ సినిమా ‘రాకాస’. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్కు రైటర్గా, ‘బెంచ్లైఫ్’ సిరీస్కు దర్శకురాలిగా చేసిన మానసా శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మానసా శర్మకు ఇది తొలి ఫీచర్ ఫిల్మ్. ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటించారు. ఉమేష్ కుమార్ బన్సల్తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఇటీవల ‘రాకాస’ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘నరకం నుండి సందేశం వస్తుంది.ఇక సమయం లేదు’, ‘మన ఊరి శాపం ఇది’, ‘మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత’, ‘ఐయామ్ వీరూ సార్... అమెరికా రిటర్న్స్’, ‘నేను రైట్ అడ్రస్కు వచ్చిన రాంగ్ పర్స్ని సార్... నాకు, ఈ ఊరికి అస్సలు సంబంధం లేదు సార్...’, ‘ఇది ఆఖరి హెచ్చరిక’ వంటి డైలాగ్స్ ఈ సినిమా టీజర్లో ఉన్నాయి. అయితే టీజర్లోని కంటెంట్, డైలాగ్స్ను బట్టి ‘రాకాస’ కథనం ఓ ఊరు, అక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తోంది. నేడు (బుధవారం) ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.ఇక ‘మ్యాడ్, మ్యాడ్ 2’ వంటి ఫీచర్ ఫిల్మ్స్లో సంగీత్ శోభన్ ఓ లీడ్ రోల్లో నటించారు. అలాగే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సిరీస్లో హీరోగా చేశారు. కానీ ‘రాకాస’ చిత్రంలో మాత్రం సంగీత్ శోభన్ సోలో హీరోగా చేశారు. మరి... ఈ సినిమా సంగీత్ కెరీర్కు ఎంత మైలేజ్ ఇస్తుందన్న విషయం మరో పది రోజుల్లో తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఓ స్నేక్ డ్యాన్స్ ఉంది. ఇందులో హీరో హీరోయిన్లతో పాటు ఈ చిత్రనిర్మాత–నటి నిహారిక కొణిదెల గెస్ట్ రోల్ చేశారని తెలిసింది. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.తిమ్మరాజుపల్లిలో ఏం జరిగింది? సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ పీరియాడికల్ సినిమాకు వి. మునిరాజు దర్శకత్వం వహిం చారు. 1990 కాలంలో ఈ సినిమా కథనం సాగుతుంది. తేజ వేల్పుచర్లతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఈ సినిమా ప్రధాన కథాంశం తిమ్మరాజుపల్లి అనే ఊరి బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ఆ ఊరి ప్రజలు, హీరో ప్రేమకథ, శివరాత్రి జాగారం సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు... ఇలాంటి అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందట. వంశీకాంత్ రేఖన ఈ చిత్రానికి సంగీతం అందించారు.పాపం ప్రతాప్ ఇటీవలే ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు తిరువీర్. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అజయ్ ఘోష్, ప్రసాద్ బెహరా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్.పి దుర్గా నరేష్ దర్శకత్వంలో రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ భార్యాభర్తలుగా నటించారు.అనువాద చిత్రాలూ ఉన్నాయికోలీవుడ్లో ఏప్రిల్లో విడుదలవుతున్న ముఖ్యమైన సినిమాల్లో ‘కర’ ఒకటి. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించగా, మమితా బైజు హీరోయిన్గా నటించారు. కేఎస్ రవికుమార్, జయరామ్, సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి కె. గణేష్ ఈ సినిమాను నిర్మించారు. రివెంజ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. మంగళవారం ఈ సినిమా నుంచి మమితా బైజు, కేఎస్ రవికుమార్ల ఫస్ట్ లుక్స్ను రిలీజ్ చేశారు.‘కర’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక తమిళ యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పత్య్రేకంగా చె΄్పాల్సిన అవసరం లేదు. ‘లవ్ టుడే, డ్రాగన్ (తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’), డ్యూడ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ప్రదీప్ దగ్గరయ్యారు. ఈ కుర్ర హీరో పటించిన తాజా చిత్రం ‘ఎల్.ఐ.కే ’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్గా నటించారు. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నయనతార, ఎస్ఎస్ లలిత్కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేయాలనుకున్నారు.కానీ ఈ సినిమా ఏప్రిల్ 10కి వాయిదా పడిందని టాక్. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. శరవణన్ ‘లీడర్’ చిత్రం కూడా ఏప్రిల్లోనే రిలీజ్కు సిద్ధం అవుతోంది. ఇక బాలీవుడ్లో వచ్చే నెల రిలీజ్ కానున్న సినిమా ‘భూత్ బంగ్లా’. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ హారర్ సినిమాలో పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్, టబు, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి మంగళవారం ‘తుహీ దిస్దా’ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను అర్జిత్ సింగ్ పాడారు.అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. మరోవైపు మాలీవుడ్లో ఏప్రిల్ 10న ‘పళ్లి చట్టంబి’ సినిమా రిలీజ్కు సిద్ధం అవుతోంది. టొవినో థామస్, కయదు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.1950–1960 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. కన్నడలో ధ్రువ సర్జా నటించిన ‘కేడీ: ది డెవిల్’ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రేమ్ దర్శకత్వంలో ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ నిర్మించారు. సంజయ్ దత్, శిల్పా శెట్టి, వి. రామచంద్రన్ ఈ మూవీలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఇలా వచ్చే నెల తెలుగులో రిలీజ్ కానున్న మరికొన్ని అనువాద సినిమాలు కూడా ఉన్నాయి.ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఏప్రిల్లో రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్నాయి. – ముసిమి శివాంజనేయులు -
పావు గంట కథ విని ఓకే చెప్పారు: మానస శర్మ
‘‘రాకాస’ కథని నిహారికగారు ఓ పావు గంట వినగానే నమ్మకంతో వెంటనే ఓకే చెప్పారు. ఈ సినిమా ఔట్పుట్ కూడా ఆమెకు నచ్చాలని నేను మరింత బాధ్యతగా పని చేశాను. డైరెక్టర్గా ‘రాకాస’ నా తొలి ఫీచర్ ఫిల్మ్. నాకు వెబ్ సిరీస్లు చేసిన అనుభవం ఉండటంతో ‘రాకాస’ తీయడం సవాల్గా అనిపించలేదు’’ అని డైరెక్టర్ మానస శర్మ పేర్కొన్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో చిత్రదర్శకురాలు మానస శర్మ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్లో ‘మ్యాడ్ హౌస్’ చేశాను. ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్గా చేశాను. అనంతరం ‘బెంచ్ లైఫ్’ సిరీస్ చేశాను. ‘రాకాస’ని ఫ్యాంటసీ, అడ్వెంచర్, కామెడీ జానర్లో తీశాం. సంగీత్ అద్భుతమైన నటుడు. అతని కామెడీ టైమింగ్ నాకు ఇష్టం.నయన్ సారిక ప్రతిభ, నటన చూసి ఈ చిత్రంలోకి తీసుకున్నాం. థియేటర్లో చూసి, ఎక్స్పీరియన్స్ చేయాల్సిన చిత్రమిది. అనుదీప్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నిహారికగారు మంచి నిర్మాత. ఇక నా తర్వాతి ప్రాజెక్టుల కోసం ప్రస్తుతం కొన్ని కథలు, ఐడియాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అందులో కామెడీ ప్రధానంగా ఉండేలా చూసుకుంటాను’’ అని తెలిపారు. -
మాల్దీవుస్లో మాళవిక రాజ్ చిల్.. బిగ్ బాస్ దివి స్టన్నింగ్ పోజులు
కాఫీ తాగుతూ హీరోయిన్ మేఘా ఆకాశ్ చిల్..బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గ్లామరస్..బిగ్బాస్ దివి స్టన్నింగ్ పోజులు..మాల్దీవుస్లో మాళవిక రాజ్ చిల్..బుల్లితెర భామ దివ్యాంక త్రిపాఠి సీమంతం వేడుక.. View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) -
'ఎంత ఎత్తుకు ఎదిగినా నాకు చిట్టి తల్లివే'.. మంచు లక్ష్మీ ఎమోషనల్
టాలీవుడ్ నిర్మాత, నటి మంచు లక్ష్మీ ఇటీవలే తన కూతురి హాఫ్ శారీ వేడుక గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో మంచు మనోజ్ దంపతులు పాల్గొని సందడి చేశారు. తన మేన కోడలిని విద్యా నిర్వాణను చూసి మనోజ్ మురిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఎల్లప్పుడు నీ వెంటే ఉంటానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.తాజాగా మంచు లక్ష్మీ తన కూతురిని తలచుకుంటూ మరో పోస్ట్ చేసింది. నువ్వు ఇంత అందమైన అమ్మాయిగా ఎదగడం చూసి నా హృదయం ఆనందంతో నిండిపోయిందని ట్వీట్లో రాసుకొచ్చింది. నీ దయ, సౌమ్యత, ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత.. నిన్ను 'నువ్వు'గా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం అంటూ కుమార్తె విద్యా నిర్వాణపై తల్లిగా తన ప్రేమను చాటుకుంది.మంచు లక్ష్మీ తన పోస్ట్లో రాస్తూ..'యాపిల్.. నిన్ను ఇంత అందమైన అమ్మాయిగా చూడటం నా హృదయాన్ని వర్ణించలేని ఆనందం. ఆ ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత... నిన్ను నువ్వుగా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం.. వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం. నువ్వు ఎదుగుతుండగా గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో లభించిన గొప్ప వరాలలో ఒకటి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత దూరాలకు వెళ్లినా సరే... నా హృదయంలో మాత్రం నువ్వు ఎప్పటికీ నా చిట్టి తల్లివే... సదా ఎల్లప్పుడూ నా కంటి పాపవే' అంటూ భావోద్వేగానికి గురైంది. Apple...Watching you blossom into such a beautiful young girl fills my heart with a joy I can’t even put into words. You are the very embodiment of kindness, gentleness, warmth, laughter, loyalty, and that effortless spark of sass that makes you you.Every moment of watching… pic.twitter.com/smHR7J6HZ8— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 24, 2026 -
సాయి పల్లవి ఎంట్రీ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ఏక్ దిన్. ఈ చిత్రంలో అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తెలుగులో ఒక రోజు పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'నేను కోరుకున్నది నా కళ్లముందే ఉంది.. కొన్ని జీవితాలకు ఒక్క రోజే ఎక్కువ' అనే డైలాగ్స్ వింటుంటే పక్కా ప్రేమకథ అని అర్థమవుతోంది. ఈ సినిమాను మే 1న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించారు. Sometimes, One Day is enough. ❤️Oka Roju Trailer Out Now!Watch #OkaRoju only in theatres on 1st May 2026.#JunaidKhan #SaiPallavi pic.twitter.com/PVOBLDDRot— Aamir Khan Productions (@AKPPL_Official) March 24, 2026 -
అదుర్స్ సీక్వెల్.. వీవీ వినాయక్ ఏమన్నారంటే?
టాలీవుడ్ ప్రియులను ఫుల్ ఎంటర్టైన్ చేసిన చిత్రాల్లో అదుర్స్ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేసిన ఈ మూవీసో మాస్ అండ్ కామెడీతో అభిమానులను ఆకట్టుకున్నారు. చారి పాత్రలో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. బ్రహ్మనందంతో కలిసి చేసిన కామెడీ సినీ ప్రియులకు ఎప్పటికీ గుర్తు ఉంటుంది. ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఈ మూవీ సీక్వెల్ రానుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. గతంలో టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కోన వెంకట్ కూడా సీక్వెల్పై మాట్లాడారు. అదుర్స్-2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని కామెంట్స్ చేశారు. ఈ ప్రకటనతో సీక్వెల్పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఓ మూవీ ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ వీవీ వినాయక్ అదుర్స్-2పై మాట్లాడారు.ఈ విషయంలో దర్శకుడు వినాయక్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఆ సినిమా అక్కడితోనే అయిపోయిందని స్పష్టం చేశారు. ఇక సీక్వెల్ తీసేందుకు ఏమీ మిగలలేదని అన్నారు. ఒకవేళ సీక్వెల్ బలవంతంగా తీసినా.. మళ్లీ అంత గొప్పగా చేయగలమనే నమ్మకం నాకు లేదని తెలిపారు. అందుకే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడం బెటర్ అని వీవీ వినాయక్ వెల్లడించారు. -
పవన్కు‘తొలిప్రేమ.. నాకు ‘దీవాన’: యంగ్ హీరో హర్షిత్ రెడ్డి
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". స్మేహ మణిమేగలై హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. "దీవాన" సినిమా ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈరోజు ఈ చిత్రం నుంచి ఇది ప్రేమ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ - దీవాన కథ నా దగ్గర చాలా కాలంగా ఉంది. దీన్ని సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ఈ సినిమా మీరు చూశాక ఈ పాయింట్ ను స్క్రీన్ ప్లే చేసి సినిమాగాచూపించవచ్చా అనుకుంటారు. ఎంతో ధైర్యంగా వాసు, శ్రీదేవి ఈ మూవీ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ చిత్రంలోని మున్నా మిడిల్ క్లాస్ అబ్బాయి. అతని లైఫ్ ను, అతని జర్నీ చూస్తారు. చివరలో మీ మనసును కదిలిస్తుంది. అంత బ్యూటిఫుల్ క్లైమాక్స్ ఈ చిత్రంలో చూస్తారు. మీ మనసులో ఒక స్థానం సంపాదించుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాం’ అన్నారు.హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘ నేను షారుఖ్ ఖాన్ అభిమానిని. ఆయన మొదటి చిత్రం పేరు కూడా దీవాననే అని తెలుసుకున్న తర్వాత ఈ సినిమా నాకు వర్కవుట్ అవుతుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమాకు నేచర్ బాగా సపోర్ట్ చేస్తోంది. రెండేళ్లు షూటింగ్ చేశాం. ఈ సినిమాకు ఏమేం కావాలో అన్నీ అలా కలిసివచ్చేవి. హీరోయిన్ లేకుండానే సగం సినిమా షూటింగ్ చేశాం. మంచి హీరోయిన్ వస్తుందనే నమ్మకం మాలో ఉండేది. మా డైరెక్టర్ సినిమా విషయంలో దీవాన. ఒక్క సీన్ బాగా రాకున్నా ఆయన టెన్షన్ పడేవారు. కమల్ హాసన్ గారికి సద్మా, నాగార్జున గారికి గీతాంజలి, పవన్ గారికి తొలి ప్రేమ, విజయ్ దేవరకొండ గారికి అర్జున్ రెడ్డి ఎలాగో ఈ హర్షిత్ కు దీవాన అలా పేరు తెస్తుంది’ అన్నారు. సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో ప్రముఖ దర్శకులు వెంకీ అట్లూరి, రవికిరణ్ కోలా, నందినీరెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. -
హీరోయిన్తో ప్రేమలో కాలభైరవ! హింట్ ఇచ్చారా?
టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రొఫెషనల్ పనులతోనే బిజీగా ఉండకుండా కాస్త పర్సనల్ లైఫ్పైనా ఓ కన్నేశారు. జీవితంలో ఓ అడుగు, కాదు కాదు.. ఏడడుగుల బంధంలోకి వెళ్లే ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. అటు బెల్లంకొండ శ్రీనివాస్ తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు. ఆ సినిమా నుంచే లవ్ఇప్పుడీ జాబితాలోకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, సింగర్ కాలభైరవ చేరనున్నట్లు తెలుస్తోంది. బలగం హీరోయిన్ కావ్య కల్యాణ్రామ్తో అతడు ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా నెట్టింట రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఉస్తాద్ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందట! కాలభైరవ తమ్ముడు శ్రీసింహ హీరోగా నటించిన ఈ చిత్రంలో కావ్య కథానాయికగా నటించింది. హింట్ ఇచ్చారా?అలా ఈ మూవీ సెట్లో వీరికి ఏర్పడిన పరిచయం రానురానూ ప్రేమబంధంగా మారిందట! వీళ్ల ప్రేమాయణానికి పెద్దలు సైతం పచ్చజెండా ఊపారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కావ్య, కాల భైరవ ఓ కార్యక్రమానికి జంటగా వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంటే తాము ప్రేమలో ఉన్నమాని సిగ్నల్స్ ఇచ్చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సినిమాకావ్య కల్యాణ్ రామ్ విషయానికి వస్తే.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఈమె గంగోత్రి మూవీలో బాలనటిగా యాక్ట్ చేసింది. స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, బాలు, బన్నీ, పాండురంగడు.. ఇలా అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా మెప్పించింది. 2022లో వచ్చిన మసూదతో హీరోయిన్గా మారింది. బలగం చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైంది. కాలభైరవ విషయానికి వస్తే.. 2019లో వచ్చిన మత్తు వదలరా మూవీతో సంగీత దర్శకుడిగా మారాడు. కెరీర్కలర్ ఫోటో, ఆకాశవాణి, లక్ష్య, కార్తికేయ 2, గుర్తుందా శీతాకాలం, మోగ్లీ, మత్తు వదలరా 2, యుఫోరియా.. వంటి పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశాడు. బాహుబలి 2లో పాడిన దండాలయ్యా.. పాట సింగర్గా అతడికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆర్ఆర్ఆర్ మూవీలో రాహుల్ సిప్లిగంజ్తో కలిసి పాడిన నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ గెల్చుకుంది. అదే చిత్రంలోని కొమురం భీముడో పాటకుగానూ కాలభైరవకు జాతీయ అవార్డు వచ్చింది. Manollani nenu chala sarlu theatres lo, Restaurants lo chusanu naku appude theda kottindhi. Relation lo unnaru ani ardhamaindhi. Finally Book launch event ki kalisi vaccharu. Andhariki Hint ivvadaniki 🥰🥰Chudali e celebrate couple aina life long unte bagundu❤️❤️🥹🥹 pic.twitter.com/ILVGBRQ7pM— Swaasthi (@swaasthi) March 24, 2026 చదవండి: బ్యాండ్మేళం కోసం చిరంజీవినే రిస్క్లో పడేసిన కోన వెంకట్ -
ఉత్తరాంధ్ర జానపద పాటలో ఆనంది మాస్ స్టెప్పులు.. చూశారా?
తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గరివిడి లక్ష్మి. గౌరీ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బుర్రకథలతో ఫేమస్ అయిన గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నల జీలకర్ర మొగ్గ బాగా వైరలయింది. తాజాగా మరో జానపద పాటను వదిలారు.ఉత్తరాంధ్ర జానపదంకోసింది కోయగూర దుబ్బో సందమామ.. వాసనకీ సంపంగి మొగ్గ అంటూ పాట మొదలవుతుంది. ఈ జానపద పాటలో ఆనంది మాస్ స్టెప్పులు వేసింది. చరణ్ అర్జున్ సంగీతం అందించగా అనన్య భట్, షకలక శంకర్, గౌరీ నాయుడు జమ్ము ఆలపించారు. ఈ పాటను ఉత్తరాంధ్ర జానపదాల నుంచి సేకరించినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.ఆనంది కెరీర్ఆనంది విషయానికి వస్తే.. తెలంగాణలోని వరంగల్ జిల్లా తన స్వస్థలం. ఆమె అసలు పేరు రక్షిత. సినిమాల్లోకి వచ్చాక తన పేరును హాసికగా మార్చుకుంది. అది కలిసిరాకపోయేసరికి ఆనందిగా మారింది. తెలుగులో జాంబిరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, శ్రీదేవి సోడా సెంటర్, ప్రేమంటే, భైరవం సినిమాలు చేసింది. తెలుగులోకన్నా కోలీవుడ్లోనే హీరోయిన్గా మంచి పేరు, అవకాశాలు తెచ్చుకుంది. -
చిరంజీవిని రిస్క్లో పడేసిన కోన వెంకట్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో పేరుమోసిన రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు కోన వెంకట్. అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, వెంకీ, ఢీ, రెడీ, అదుర్స్, దూకుడు, అల్లుడు శీను, నిన్ను కోరి. ఇలా అనేక హిట్ సినిమాలకు కథారచయితగా పని చేశాడు. అయితే ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన కోన వెంకట్ తర్వాత వరుస వైఫల్యాలు చూసేసరికి నెమ్మదిగా సైడ్ అయిపోయాడు. రైటర్గా చాలావరకు సినిమాలు తగ్గించేశాడు.కోన వెంకట్కు బూస్ట్అలాంటి కోన వెంకట్కు 'వాల్తేరు వీరయ్య'తో మళ్లీ ఎనర్జీ వచ్చినట్లయింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ బ్లాక్బస్టర్ మూవీకి కోన రచనా సహకారం అందించాడు. ఇకపోతే వీరి కాంబినేషన్లో మరోసారి రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే! చిరంజీవి-బాబీ సినిమాకు కోన రచనా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.అప్పుడు నాని చాలెంజ్కోన వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'బ్యాండ్ మేళం'. కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. తాజాగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కోన వెంకట్ చిరంజీవి సినిమాకు పని చేస్తున్నట్లు తెలిపాడు. అదే సమయంలో ఓ ఆసక్తికర ఛాలెంజ్ విసిరాడు. కోర్ట్ సినిమా రిలీజ్కు ముందు నాని ఓ మాటన్నాడు. ఈ మూవీ నచ్చకపోతే ఇంకెప్పుడూ తన సినిమా చూడవద్దన్నాడు. ఆ మాట చెప్పడానికి చాలా గుండెధైర్యం కావాలి. సీరియస్గా చెప్తున్నా..ఇప్పుడు నేనూ చెప్తున్నా.. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను రాసే సినిమాలను మీరెవరూ చూడకండి. ఇది నేను సరదాకి చెప్పడం లేదు.. నిజంగానే ఈ మూవీ నచ్చకపోతే నా సినిమాలు చూడకండి. అలాగని రాయడం మానేయను, మీకు నచ్చేంతవరకు కథలు రాస్తూనే ఉంటాను. ఇప్పుడిది చూశారంటే చిరంజీవిగారు కోప్పడతారు. ఎందుకంటే నేను నెక్స్ట్ రాస్తున్న సినిమా ఆయనదే! అన్నాడు. అలా చిరు-బాబీ కాంబినేషన్లో రాబోయే సినిమాకు తాను రైటర్ అని కోన వెంకట్ వెల్లడించాడు. మొత్తానికి ఈ ఓపెన్ ఛాలెంజ్తో చిరు-బాబీ సినిమాను రిస్కులో పడేశాడు.చదవండి: రామ్చరణ్, మహేశ్బాబుకు అలా.. కానీ,, : బండ్ల గణేశ్ -
18 ఏళ్లకే తల్లి పాత్ర.. ‘ధురంధర్’ నటిపై ప్రశంసలు
సాధారణంగా హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేస్తుంటారు. నటనకు స్కోప్ ఉండే పాత్రలు రేర్గా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడే కొంతమంది తమ టాలెంట్ని నిరూపించుకుంటారు. అయితే అందులోనూ తమ వయసు తగ్గ పాత్రలనే ఎంచుకుంటారు. ముఖ్యంగా తల్లి పాత్రలు చేయాల్సి వస్తే సీనియర్ హీరోయిన్లు సైతం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. 30 ఏళ్లు దాటినా.. తల్లి పాత్ర చేయమని అడిగితే నో చెప్పే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ సారా అర్జున్ మాత్రం 18 ఏళ్లకే తల్లి పాత్ర చేసింది. అది కూడా 40 ఏళ్ల వయసు ఉన్న హీరో నటించిన పాన్ ఇండియా సినిమాలో. అదే ధురంధర్ 2.ధురంధర్ సినిమా సమయంలో సారాపై పెద్ద ఎత్తున ట్రోల్ నడిచింది. 40 ఏళ్ల వయసు ఉన్న హీరో(రణ్వీర్ సింగ్)తో రొమాన్స్ చేయబోతుందంటూ ఆమెను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. కానీ ధురంధర్ రిలీజ్ తర్వాత అందరూ ఆమెపై ప్రశంసలు కురిరించారు. చిన్న పిల్ల అయినా బాగా నటించిందని అభినందించారు.అయితే పార్ట్ 1లో కేవలం హీరో ప్రియురాలి పాత్రలో కనిపించిన సారా.. పార్ట్ 2 మాత్రం ఓ బిడ్డకు తల్లిగా నటించి, మెప్పించింది. ప్రస్తుతం సారా వయసు 20 ఏళ్లు. ధురంధర్ షూటింగ్ సమయంలో ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులో తల్లి పాత్ర ఒప్పుకొని సారా పెద్ద సాహసమే చేసింది.కథపై నమ్మకంతోనే సారా ఆ పాత్ర చేసేందుకు అంగీకరించిందట. తల్లి పాత్ర ఉంటుందని చెప్పగానే ఏమాత్రం సంకోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ విషయాన్ని ధురంధర్ సినిమా కాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ చబ్రా చెప్పారు.‘పార్ట్ 2లో తల్లి పాత్ర పోషిస్తున్నానా అనే విషయాన్ని కూడా సారా అడగలేదు. కథ విని వెంటనే ఓకే చెప్పింది. దీంతో ఆమెకు లుక్ టెస్ట్ చేశాం. నేను చేసిన లుక్ టెస్ట్లోనూ సారానే ది బెస్ట్ అనిపించింది. అందుకే ఆ పాత్రకు ఎంపిక చేశాం’ అని ముకేష్ అన్నారు. కాగా, ధురంధర్ కాస్టింగ్పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలోని ప్రతి పాత్రకు సరైన నటుడిని ఎంచుకున్నారని, తెరపై చూస్తుంటే వారు తప్ప వేరే నటుడు అలా చేయరేమో అన్నట్లుగా పాత్రలను తీర్చిదిద్దారంటూ సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు. -
కోర్ట్ తర్వాత సినిమాలు వద్దని చెప్పా.. నా మాట వినలేదు!
కోర్ట్ సినిమాతో హర్ష్ రోషన్, శ్రీదేవి వెండితెరపై హీరోహీరోయిన్గా పరిచయమయ్యారు. తొలి సినిమాకే భారీ విజయాన్ని అందుకుని అందరి దృష్టిలో పడ్డారు. గతేడాది కోర్ట్ మూవీతో పలకరించిన ఈ జంట ఈ ఏడాది బ్యాండ్మేళంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రిరీలీజ్ ఈవెంట్లో కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాలు మర్చిపోండిఆయన మాట్లాడుతూ.. చందు-జాబిలి(కోర్ట్ మూవీలో ప్రధాన పాత్రల పేర్లు).. వీళ్లనెప్పటికీ ఇదే పేర్లతో పిలుస్తుంటాను. కోర్ట్ తర్వాత వీళ్లు ఏం చేస్తారు? ఏమైపోతారనుకున్నాను. నేనైతే.. కోర్ట్ అయిపోగానే మీరు కనపడొద్దని చెప్పాను. సినిమాలు మర్చిపోండి, మూడునాలుగేళ్లు కనిపించకూడదు. మంచి కాలేజీలో చేరి చదువుకోమని చెప్పాను. పుస్తకాల్లో ఏం చదువుకుంటారో తెలియదు కానీ కాలేజీకి వెళ్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. కాలేజీ డేస్ మిస్ మీరు ఫస్ట్ కాలేజీకి వెళ్లండి, కళాశాల జీవితాన్ని మిస్ అవొద్దని చెప్పాను. ఈ వయసులో యాక్టింగ్లో బిజీ అయితే జీవితంలో ముఖ్యమైన కాలేజీ డేస్ మిస్ అవుతారన్నాను. కానీ నా మాట వినలేదు. వినుంటే బ్యాండ్ మేళం వచ్చేది కాదు.. విననందుకు థాంక్స్ అన్నాడు. బ్యాండ్మేళం విషయానికి వస్తే.. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీని కోన వెంకట్ నిర్మించారు.చదవండి: ధురంధర్ 2పై తలైవా రివ్యూ.. సంతోషంలో డైరెక్టర్ -
‘పెద్ది’ వస్తే.. ‘గాయపడ్డ సింహం’ వాయిదా వేస్తాం : దిల్ రాజు
‘‘గాయపడ్డ సింహం’ మూవీ గురించి తరుణ్ భాస్కర్ చెప్పాడు. డైరెక్టర్ పవన్ని ఈ సినిమా కాన్సెప్ట్ గురించి అడిగితే.. టీజర్ చూపించారు. టీజర్ చాలా నచ్చింది. ఆ తర్వాత మొత్తం కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. దీంతో ఈ సినిమాని మా శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్పై రిలీజ్ చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చెప్పారు. తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పణలో సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కల్యాణ చక్రవర్తి మంతెన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మించారు. ఈ మూవీ విడుదల హక్కులను ‘దిల్’ రాజు కొనుగోలు చేశారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో ‘గాయపడ్డ సింహం’ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా ‘దిల్’రాజు మాట్లాడుతూ – ‘‘మే 1న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించాం. అయితే ఏప్రిల్ 30కి ‘పెద్ది’ సినిమా వస్తే ‘గాయపడ్డ సింహం’ విడుదల తేదీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా కోసం పవన్గారు. నిర్మాతలు, జీ టీమ్ సపోర్ట్ చేశారు’’ అన్నారు కశ్యప్ శ్రీనివాస్. ‘‘మాలాంటి యంగ్ ఫిలిం మేకర్స్ని సపోర్ట్ చేస్తున్న ‘దిల్’ రాజు గారికి ధన్యవాదాలు’’ అని భాను కిరణ్ పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్ 30న ‘పెద్ది’ వస్తోంది. మా మూవీకి థియేటర్స్ విషయంలో ఇబ్బందులు కలిగితే విడుదల తేదీ మార్చుకుంటాం’’ అని పవన్ సాధినేని చెప్పారు. -
చిరంజీవితో పని చేయాలని కోరిక: మ్యూజిక్ డైరెక్టర్
దండోరా సినిమాకు నాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా గద్దర్ అవార్డు లభించడం చాలా సంతోషాన్నిచ్చింది. ప్రేక్షకులకు మరింత మంచి సంగీతం ఇచ్చేందుకు ఈ అవార్డు స్ఫూర్తినిస్తుంది. అలాగే సంగీత దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాను అని చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె. రాబిన్.గద్దర్ అవార్డుది ఘోస్ట్, మల్లేశం, జాంబిరెడ్డి, ఏజెంట్, సాయిశ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలకు సంగీతం అందించి తన ప్రతిభ నిరూపించుకున్నారు. దండోరా సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్న మార్క్ కె.రాబిన్ విలేకరులతో మాట్లాడుతూ.. నాకు బాల్యం నుంచే సంగీతం అంటే ఇష్టం. కొంతకాలం టీచర్గా పని చేశాను. లిరిసిస్ట్ కృష్ణకాంత్ నాకు మంచి మిత్రుడు. నానికి నచ్చడంతో..దర్శకనిర్మాత ప్రశాంత్ వర్మ, కృష్ణకాంత్, నేను తరచూ కలుస్తుండేవాళ్లం. అలా నేను, ప్రశాంత్ కలిసి ఇన్ ది డార్క్ అనే ఇండియా ఫస్ట్ వర్చువల్ ఆడియో షార్ట్ ఫిలిం చేశాం. ఆ తర్వాత నానిగారి మజ్ను మూవీ ట్రైలర్కు ఆర్ఆర్ అందించాను. ఈ మ్యూజిక్ నానిగారికి నచ్చడంతో అ..! చిత్రానికి అవకాశం కల్పించారు.అదే నా కోరికఅలా మ్యూజిక్ డైరెక్టర్గా నా ప్రయాణం మొదలైంది. భావోద్వేగంతో నిండిన మనసుతోనే దండోరాకి సంగీతాన్ని అందించాను. చిరంజీవిగారితో సినిమా చేయాలన్నదే నా ఆకాంక్ష. సంగీతం విషయంలో మనం ఇప్పటికీ చెన్నైకి వెళ్లాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ప్రస్తుతం కథాకళి, రాజాది రాజా సినిమాలతో పాటు ప్రశాంత్ వర్మగారితో రెండు సినిమాలు చేస్తున్నాను. హిందీలో సైఫ్ అలీఖాన్గారితో ఓ మూవీ చేయాల్సింది కానీ కుదర్లేదు. అదే విధంగా ఒక స్టార్ హీరో సినిమాకు చర్చలు జరుగుతున్నాయి అన్నారు. -
రామ్చరణ్, మహేశ్కు అలా జరిగింది.. కానీ!: బండ్ల గణేశ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి సందడి చేసేందుకు వచ్చేస్తున్నారు. ఈసారి బ్యాండ్మేళం మూవీలో వీరు బావామరదళ్లుగా నటించారు. సతీశ్ జవ్వాజి డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం (మార్చి 24న) ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్కు నిర్మాత బండ్ల గణేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.అరడజను మంచి డైరెక్టర్లకు ఛాన్స్ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. కోన వెంకట్గారికోసమే ఈ ఈవెంట్కు వచ్చాను. ఇండస్ట్రీ మొత్తం ఒక పక్కనుంటే, కోన ఒక్కడే నీ పక్కనుంటే నువ్వు గెలిచేయొచ్చని వినాయక్ అన్నాడు. అది ఆయనకున్న పవర్.. ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలను ఒప్పించి అరడజను మంది దర్శకులకు డైరెక్షన్ ఛాన్స్ ఇప్పించడం అంటే జోక్ కాదు. హీరోలు 100 ప్రశ్నలు వేస్తారు, 200 డౌట్లు పడతారు. చస్తే ఆ పని చేయనుఎందుకంటే వాళ్లకు హిట్టు కావాలి! అలాంటి వాళ్లను ఎలాగోలా మాయ చేసి ఒప్పిస్తున్నారు. బాబీ, గోపీచంద్ మలినేని, హరీశ్ శంకర్ శివ నిర్వాణ.. ఇలా ఎంతోమందిని డైరెక్టర్ల ముందడుగు కారణమై సక్సెస్ను ముందుకు తీసుకెళ్లడంలో కోన వెంకట్ ముందుంటాడు. బ్యాండ్మేళం కోసం ఆయన రెండు, మూడు ప్రాపర్టీలు అమ్మేశాడు. నేనయితే ప్రాణం పోయినా ఆ పని చేయను. ఆస్తి తాకట్టు పెట్టి సినిమా తీశారంటే మీకు సినిమా అంటే అంత ప్రేమ.సక్సెస్ మన చేతుల్లో లేదుహీరో హర్ష్ రోషన్ విషయానికి వస్తే.. టాలెంట్ ఎవడి సొత్తు కాదు.. ఎవరైనా ఇండస్ట్రీకి రావొచ్చు. ఇండస్ట్రీలో స్టార్ కొడుకు స్టార్ అవడం చాలా అరుదు. మహేశ్బాబు, రామ్చరణ్లాంటివారికి జరిగింది. స్టార్ డైరెక్టర్స్.. తమ కుమారులకు వారసత్వంగా ఆస్తినిచ్చారు, కానీ సక్సెస్ ఇవ్వలేదు. సక్సెస్ అనేది మన చేతుల్లో లేదు. నిజంగా రోషన్ను చూస్తే నా కొడుకుగా పుట్టుంటే బాగుండేదనుకున్నాను. ఈ అబ్బాయి సూపర్స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ కోన వెంకట్గారికోసమైనా సూపర్ హిట్ అవుతుంది అని బండ్ల గణేశ్ జోస్యం చెప్పాడు.చదవండి: నాకు నత్తి.. ఇప్పటికీ బాధపడుతుంటా: సమీరా రెడ్డి -
నాకు నత్తి.. ఇప్పటికీ బాధపడుతుంటా: సమీరా రెడ్డి
హీరోయిన్ సమీరారెడ్డి ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తన కష్టాలు, ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం, డెలివరీ తర్వాత ఎదుర్కొన్న సమస్యలు.. వీటన్నింటి గురించి ఓపెన్గా మాట్లడుతూ ఉంటుంది. అయితే చిన్నతనంలో నత్తి వల్ల తనను ఎందరో వెక్కిరించేవారంటోంది.వెక్కిరింతలుతాజాగా ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. చిన్నప్పుడు నాకు నత్తి ఉండేది. దానివల్ల నన్ను వెక్కిరిస్తూ వేధించేవారు. నాలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి సంవత్సరాల తరబడి థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను నత్తిగా మాట్లాడినప్పుడు ఎవరైనా దానిపై సెటైర్లు వేస్తే బాధగా ఉంటుంది. చిన్ననాడు మనల్ని ఏమేం అంటారో అవన్నీ మనసులో లోతుగా పాతుకుపోయుంటాయి.అదే నిజమనుకుని..ఉదాహరణకు.. ఆమె చాలా స్లో, వీక్ అంటుంటారు. ఇలాంటి పదాలు పదేపదే విన్నప్పుడు మనపై మనకే అనుమానం వేస్తుంటుంది. ఫలితంగా పిల్లలు ఏదైనా సాహసం చేసేందుకు వెనుకాడతారు. పిల్లల్ని పదేపదే బుద్ధిహీనుడు, బలహీనుడు, ముసలివాడు.. అని పిలిస్తే వాళ్లు అదే నిజమనుకుంటారు. వాళ్లను వాళ్లు చూసుకునే విధానమే మారిపోతుంది. ఎవరినీ కించపర్చొద్దుఅదే నిజమని నమ్మి, అందరిలా దూకుడుగా ఉండలేరు. ఏవీ ప్రయత్నించకుండా సైలెంట్ అయిపోయే ప్రమాదం ఉంది. నా పిల్లలు.. వారికి ఏ సమస్య ఎదురైనా నాతో చెప్పమంటాను. ఎవరినీ కించపరచొద్దని చెప్తుంటాను. పిల్లలకు సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం చేస్తే మంచి ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. పర్సనల్ లైఫ్తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటివారంతా సపోర్ట్గా నిలబడితే పిల్లలు వారికెదురయ్యే సవాళ్లను ఒక అడ్డంకిగా కాకుండా.. దాన్నుంచి ఎలా బయటపడాలన్నది నేర్చుకుంటారు అని చెప్పుకొచ్చింది. సమీరా.. 2014లో ఎంటర్ప్రెన్యూర్ అక్షయ్ వార్డేను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2015లో కుమారుడు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి.. తెలుగులో నరసింహుడు, జై చిరంజీవ, అశోక్ సినిమాల్లో నటించింది.చదవండి: హీరోయిన్ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం -
అలనాటి హీరోయిన్ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం
అలనాటి హీరోయిన్లు భానుప్రియ, శాంతిప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వారి తల్లి ఎం. లక్ష్మి (83) ఆదివారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఎం.లక్ష్మికి భానుప్రియ, శాంతిప్రియతో పాటు గోపాలకృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కూతుర్లను సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా తీర్చిదిద్దారు లక్ష్మి. భానుప్రియకాగా భానుప్రియ 1998లో ఆదర్శ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. వీరికి కూతురు అభినయ సంతానం. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో 2005లో అతడి నుంచి విడిపోయి కూతుర్ని తీసుకుని చెన్నైకి వచ్చి తల్లితోనే కలిసి ఉంటోంది. 2018లో నటి మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో మరణించాడు. శాంతిప్రియభానుప్రియ చివరగా అయాలన్ అనే తమిళ సినిమాలో కనిపించింది. శాంతిప్రియ విషయానికి వ్తే.. ఈమె ప్రముఖ దర్శకుడు వి.శాంతారాం మనవడు, నటుడు సిద్దార్థ్ రాయ్ను పెళ్లి చేసుకుంది. 1992లో వీరి వివాహం జరగ్గా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. 2004లో సిద్దార్థ్ కూడా గుండెపోటుతోనే కన్నుమూశాడు. -
బ్రిటిష్ సైనికుడు
‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై ‘హను–మాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తెరకెక్కించిన కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు శ్రీకాంత్ పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నారు.మార్చి 23న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఈ మూవీలో శ్రీకాంత్ పోషించిన బ్రిటిష్ పాత్ర పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ప్రతి గాయాన్ని ఒక పతకంలా ధరించే సైనికుడిగా శ్రీకాంత్ కనిపించనున్నారు. ఆయన లుక్కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీ ద్వారా సాయి దుర్గాతేజ్ ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘అసుర ఆగమన’ గ్లింప్స్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బర్త్ డే స్పెషల్
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఆయన లుక్ సరికొత్తగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో ఇప్పటికే హీరోయిన్ దీపికా పదుకొనె భాగం కాగా, జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.ఎందుకంటే... ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేయాలనే దిశగా అట్లీ అండ్ టీమ్ వర్క్ చేస్తున్నారని సమాచారం. ఈ టీజర్లోనే టైటిల్ కూడా ఉంటుందని టాక్. అంతే కాదు.. అల్లు అర్జున్ , దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లోని సినిమా అప్డేట్స్ కూడా ఏప్రిల్ 8న బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. మరి.. వచ్చేనెల 8న అల్లు అర్జున్ సినిమాల గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయనే ఆసక్తి ఆయన ఫ్యాన్స్లో నెలకొంది. -
దృశ్యం-3 వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ దృశ్యం. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 సైతం అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో దృశ్యం-3 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా దృశ్యం-3 మేకర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు మోహన్ లాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఏడాది మే 21 దృశ్యం-3 విడుదల కానుందని హీరో ట్వీట్ చేశారు. కాగా.. మొదట ఏప్రిల్ 02న విడుదల కానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలోనూ రీమేక్ చేయనున్నారు. తెలుగులో వెంకటేశ్ హీరోగా కనిపించనుండగా.. హిందీలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. హిందీ దృశ్యం3 కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఈ మూవీ అక్టోబరు 2న విడుదల కానుంది. కాగా..ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరంబవూర్ నిర్మించారు. The past never stays silent…it only waits.Georgekutty arrives, May 21st 2026.#Drishyam3 | Worldwide Release @jeethu4ever @antonypbvr @KumarMangat @jayantilalgada @AbhishekPathakk #MeenaSagar @aashirvadcine @PanoramaMovies @PenMovies @ram_rampagepix @Rajeshmenon1969… pic.twitter.com/2r8KCVe98U— Mohanlal (@Mohanlal) March 23, 2026 -
స్విమ్ షూట్లో హీరోయిన్ అనితా.. సముద్రంలో ప్రగ్యా జైస్వాల్ చిల్..!
వైట్ బ్యూటీలా మెరిసిపోతున్న ది రాజాసాబ్ బ్యూటీ..సముద్రంలో జలకాలాడుతోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..హీరోయిన్ కావ్య థాపర్ స్మైలీ లుక్స్...ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా..స్విమ్ షూట్లో మెరిసిన హీరోయిన్ అనితా.. View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
మల్లన్న సేవలో హీరో శ్రీకాంత్ దంపతులు
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ దంపతులు శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా స్వామి అమ్మవార్లను తన భార్య, నటి ఊహతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలం వెళ్లిన శ్రీకాంత్ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద అధికారులు స్వాగతం పలికారు.అనంతరం మల్లిఖార్జున, భ్రమరాంబ అమ్మవార్లను హీరో శ్రీకాంత్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు వీరికి వేద ఆశీర్వచనాలు అందించారు. దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే శ్రీకాంత్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న సంబరాల ఏటిగట్టు చిత్రంలో నటిస్తున్నారు. ఇవాళ శ్రీకాంత్ బర్త్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. Birthday boy #Srikanth in a brand new avatar as BRITISHUUU from #SambaralaYetiGattu 🎉🔥Stylish, fresh & intriguing look—setting the vibe already! 👀✨#SYG #SaiDharamTej #Tollywood #NewLook #BirthdaySpecial @actorsrikanth pic.twitter.com/ePycsIAR6A— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) March 23, 2026 -
విజయ్-రష్మిక పెళ్లి.. గబ్బర్ సింగ్ టీమ్ ఆవేదన..!
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట విజయ్- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న జరిగిన ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు, కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా భోజనాలు, స్వీట్స్ పంపిణీ చేసింది విరోష్ జంట.అయితే ఇటీవల ఓ చిన్నారి అభిమాని పెళ్లికి పిలవలేదని అలిగింది. నేను మీ ఫ్యాన్నే నన్ను ఎందుకు పిలవలేదు? ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవలే ఆ చిట్టి అభిమానిని ఇంటికి పిలిచి లంచ్ ఏర్పాటు చేశారు. ఆ చిన్నారికి ఇష్టమైన స్వీట్స్ కూడా వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే అలాగే తాజాగా తమను పెళ్లికి పిలవలేదని మరో వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ సారి మాత్రం వాళ్లు చిట్టి అభిమానులు మాత్రం కాదండోయ్. గబ్బర్ సింగ్ చిత్రంలో మనల్ని కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ గ్యాంగ్. వీరంతా విజయ్ దేవరకొండకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషెస్ తెలిపారు. మేము కూడా ఆర్టిస్తులమే కదా అన్నా.. మమ్మల్ని ఎందుకు పెళ్లి పిలవలేదు అన్న అంటూ వీడియోలో వేడుకున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Mammalni kuda Bhojananiki intiki pilvandi ani aduguthunna Gabbarsingh Villan Team🔥@TheDeverakonda @iamRashmika #Virosh pic.twitter.com/2YQUdeovLp— THE RWDY🗿X (@TheDEVERA_fan) March 23, 2026 -
మూడు సార్లు రిజెక్ట్ చేశారు.. తొక్కా అనుకున్నా: దిల్ రాజు
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తనకు అమెరికా వీసా మూడు సార్లు తిరిస్కరణకు గురైందని తెలిపారు. కానీ ఆ తర్వాత 2009లో మరో చరిత్ర షూటింగ్ టైమ్లో నాకు వీసా లభించిందని అన్నారు. అప్పుడే తొలిసారి యూఎస్ వెళ్లానని వెల్లడించారు. వీసా రిజెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటని యాంకర్ దిల్ రాజును ప్రశ్నించారు.దీనికి దిల్ రాజు బదులిస్తూ.. తొక్కా.. వాళ్లేంటి ఇచ్చేది.. వీసా వచ్చినప్పుడే పోదాం లే అనుకున్నా అని అన్నారు. అప్పటికే నేను ఆర్య, బొమ్మరిల్లు చిత్రాలను నిర్మించానని దిల్ రాజు తెలిపారు. కాగా.. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం గాయపడ్డ సింహం. ఈ మూవీకి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. మే 1న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈవెంట్కు నిర్మాత ముఖ్య అతిథిగా దిల్రాజు హాజరయ్యారు. రిలీజ్ డేట్ మారొచ్చు..అనంతరం ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి దిల్ రాజు మాట్లాడారు. వీళ్లు మే 1వ తేదీకి రిలీజ్ చేస్తామని అంటున్నారు. కానీ ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ కానుంది. అలాంటి టైమ్లో వీళ్లు వన్ వీక్ వెనక్కి వెళ్లే అవకాశముందని అన్నారు. కాకగా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఓ యువకుడి జీవితం ఎలా మారింది? అనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో తరుణ్ భాస్కర్కు జంటగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్నారు. అప్పట్లో అమెరికా వెళ్దాం అనుకుంటే.. నాకు... 3 సార్లు వీసా రిజెక్ట్ అయ్యింది 'మరో చరిత్ర' షూటింగ్ టైంలో దొరికింది తొక్క... వాళ్ళు ఇచ్చేది ఏంటి.. వచ్చినప్పుడే వెళదామని అనుకున్నాను అప్పటికే నేను 'ఆర్య' 'బొమ్మరిల్లు' సినిమాలు తీసిన నిర్మాతని : దిల్ రాజు#TharunBhascker… pic.twitter.com/1lmiOuwQPu— Filmy Focus (@FilmyFocus) March 23, 2026 -
కోట్లాది రూపాయల స్కామ్ ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన మంగ్లీ
సత్యవతి అలియాస్ ప్రముఖ సింగర్ మంగ్లీ పేరుతో కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు మంగ్లీ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు వసూలు చేశారని సమాచారం. ఇందుకు సంబంధించి ఓ లాయర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించగా.. ఈ కేసులో మంగ్లీ తమ్ముడు శివ కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్లో ఏకంగా రూ.150 కోట్ల మేర క్రిప్టో కరెన్సీ ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడీ విషయమై స్వయంగా మంగ్లీనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.(ఇదీ చదవండి: రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయింది)'మైక్రో ఫైనాన్స్ పేరిట నా పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తలని ఖండిస్తున్నాను. నాకు ఆ వ్యక్తులకు, వాళ్లకు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాలకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం నన్ను, నా తమ్ముడిని రోజూ చాలామంది సంప్రదిస్తుంటారు. ఆ ఈవెంట్కి సంబంధించిన ఇన్విటేషన్ వివరాలవరకే గానీ, వాళ్ల వ్యక్తిగత వ్యాపారాల గురించి నాకు, నా కుటుంబ సభ్యులకు ఏ మాత్రం సంబంధం లేని విషయం. ఇలాంటి మోసపూరిత విషయాల్లో నా పేరుని వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయం' 'కావాలని కొందరు నా వ్యక్తిగత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కరెన్సీకి సంబంధించిన వీడియోలని, మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మొద్దు. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాను' అని మంగ్లీ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు) View this post on Instagram A post shared by Mangli 🎙️ (@iammangli) -
'తెరచాప' ట్రైలర్ రిలీజ్
అనన్య క్రియేషన్స్ బ్యానర్పై కైలాష్ దుర్గం నిర్మాతగా తీస్తున్న సినిమా 'తెరచాప'. జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు హీరోహీరోయిన్లుగా నటించారు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. విడుదల తేది దగ్గరవుతున్న సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు)తెరచాప ట్రైలర్ చూస్తుంటే సముద్రతీరంలో జరిగే ఒక ఊరి కథలా అనిపిస్తుంది. ఊరంటే మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలుతో పాటు రాజకీయాలు, భేద భావాలు ఉండడమూ సహజమే. అలాంటి పరిస్థితుల మధ్య ఒక యువకుడు తన ఊరిలో ఉన్న పరిస్థితులపై ఎలా పోరాడాడు? అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయిన ధురంధర్ 2) -
రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయింది
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. బీభత్సమైన అంచనాలతో బరిలోకి దిగిన ఈ మూవీ ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోని బీ,సీ సెంటర్లలోనూ హవా చూపిస్తుండటం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రోజు నుంచి వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి ఊహించని రికార్డులు సొంతం చేసుకుంది. ఇంతకీ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?(ఇదీ చదవండి: ధురంధర్ 2 సక్సెస్: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్)తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి 'ధురంధర్ 2' చిత్రానికి రూ.750 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం ఒక్కరోజే కేవలం మన దేశంలోనే రూ.115 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదో రికార్డ్. ఇప్పటివరకు వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప 2' రూ.762 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. దీని తర్వాతి స్థానంలోకి 'ధురంధర్ 2' వెళ్లింది. ఈ క్రమంలోనే బాహుబలి 2 (రూ.591 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.470 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.500 కోట్లు) తదితర రికార్డులు బ్రేక్ చేసింది.మరోవైపు బాలీవుడ్లోనూ ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ 'పఠాన్' పేరిట రూ.287 కోట్ల కలెక్షన్స్ రికార్డ్ ఉంది. దీన్ని 'ధురంధర్ 2' అధిగమించడంతో పాటు సరికొత్త ఘనత సాధించింది. చూస్తుంటే ఇప్పుడప్పుడే ఈ చిత్ర రచ్చ ఆగేలా లేదు. తొలి వారం పూర్తయ్యేసరికి రూ.1000 కోట్లు సాధించడం పక్కా అనిపిస్తుంది. అలానే రూ.2000 కోట్ల మార్క్ని కూడా త్వరలోనే అందుకునే అవకాశముందని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు) -
మనుషులు సైతాన్ ఎదురెదురుగా ఉండే ప్రదేశమిది.. టీజర్ రిలీజ్
'2018' అనే డబ్బింగ్ సినిమాతో పాటు పలు ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్తోకూస్తో పరిచయమున్న టొవిన్ థామస్.. ఇప్పుడు 'పల్లిచట్టంబి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏప్రిల్ 10న దక్షిణాది భాషల్లో ఇది రిలీజ్ కానుంది. లేటెస్ట్ సెన్సేషన్ బ్యూటీ కాయదు లోహర్ హీరోయిన్. తాజాగా ప్రమోషన్లలో భాగంగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)ఓ ఊరిలో జరిగి అంతర్గత సమస్యల బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తీసినట్లు టీజర్ బట్టి అర్థమవుతుంది. ఒకటి రెండు తెలిసిన ముఖాలు ఉన్నప్పటికీ.. టైటిల్ దగ్గర నుంచి కాన్సెప్ట్ వరకు ప్రతిదీ తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవుతుందా అనేది ఇక్కడ ప్రశ్న. దానికి తోడు అదే తేదీన 'డకాయిట్' మూవీ రిలీజ్ కానుంది. చూడాలి మరి 'పల్లిచట్టంబి' ఏం చేస్తుందో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు) -
మంచు లక్ష్మి కూతురి ఓణీ ఫంక్షన్లో మోహన్బాబు
టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూతురు నిర్వాణ హాఫ్ శారీ ఫంక్షన్ ఇటీవల ఘనంగా జరిగింది. ఆ వేడుకకు లక్ష్మి తల్లితో పాటు, సోదరుడు మంచు మనోజ్ భార్యాపిల్లలతో సహా హాజరయ్యాడు. ఎంతో సంబరంగా మేనకోడలిని పల్లకిలో ఎక్కించుకుని మరీ ఊరేగాడు. మరో సోదరుడు విష్ణు, తండ్రి మోహన్బాబు మాత్రం ఫంక్షన్లో ఎక్కడా కనిపించలేదు.మరోసారి ఫంక్షన్దీంతో మంచు కుటుంబంలో విభేదాలు తగ్గలేదా? అన్న అనుమానం మొదలైంది. తాజాగా మరోసారి హాఫ్ శారీ ఫంక్షన్కు సంబంధించిన ఈవెంట్ నిర్వహించడం చూస్తే ఇది నిజమనే తెలుస్తోంది. నిర్వాణ ఓణీల ఫంక్షన్ను మరోసారి ఇంట్లో గ్రాండ్గా నిర్వహించారు. తనకు నలుగుపెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హాజరవని విష్ణుఈ వేడుకను మోహన్బాబు దంపతులు దగ్గరుండి చూసుకున్నారు. మనవరాలిని మనసారా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మంచు విష్ణు భార్య విరానిక, వారి పిల్లలు సైతం హాజరయ్యారు. కానీ విష్ణు మాత్రం హాజరవలేదు. అలాగే మనోజ్ దంపతులు కూడా ఈ ఫంక్షన్లో కనిపించలేదు. దీంతో విడిపోయిన కుటుంబం కోసం రెండుసార్లు ఈ వేడుక జరిపినట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
తమిళ సాంగ్ రిలీజ్.. స్టెప్పులేసిన రోజా
మిలియన్ డాలర్స్ స్టూడియోస్, నీయో కాస్టిల్స్ క్రియేషన్స్ సంస్థల అధినేతలు సత్య కరికాలన్, యువరాజ్ గణేశన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అన్బే డయానా. జమా చిత్రం ఫేమ్ పారి ఇళవళగన్ కథానాయకుడిగా నటిస్తుండటంతో పాటు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా రమ్య రంగనాథన్ నటిస్తోంది.సాంగ్ రిలీజ్తమిళనాడులోని ఒక గ్రూప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ.. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగిల్ సాంగ్ను విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు నటి రోజా కూడా స్టెప్పులేశారు. జెస్సీ గిఫ్ట్ ఆలపించిన ఈ పాటను ఇప్పుడు సంగీత ప్రియులు రిపీట్ మోడల్ వింటున్నారు. సినిమారొమాంటిక్ వైబ్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగే అన్బే డయానా ఆడియో, ట్రైలర్ లాంచ్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. నటుడు చేతన్, వైరల్ యూట్యూబర్ పరితాపంగల్ గోపి, ఇస్మత్ భాను, సుదర్శన్ గాంధీ, సెల్ మురుగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతాన్ని, షెల్లీ గెలిస్ట్ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. -
అరెరే... అరెరే
గాయని – నటి దియా తాజా మ్యూజిక్ వీడియో ఆల్బమ్ ‘అరెరే... అరెరే..’. క్రాంతీ వర్మ దర్శకత్వంలో నూతన్ చేకూరి నిర్మించిన ఈ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, హీరో ఆకాశ్ పూరి, సంగీత దర్శకుడు రఘు కుంచె, మిమిక్రీ ఆర్టిస్టు–నటుడు శివ, సమీర్, సాగర్... ఈ ఆల్బమ్ సక్సెస్ అవ్వాలన్నారు.‘‘మంచి కాన్సెప్ట్తో రూపొందిన ఆల్బమ్ ఇది’’ అని చెప్పారు నూతన్ చేకూరి. ‘‘భావోద్వేగాలతో కూడిన విజువల్ అనుభూతిని ప్రేక్షకులకు అందించాలనే ఈ ఆల్బమ్ చేశాం’’ అన్నారు క్రాంతీ వర్మ. ఈ ఆల్బమ్ మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ మాట్లాడారు. -
పాట కావాలయ్యా..!
సినిమా మొత్తం సీరియస్గా సాగుతోంది... మరోవైపు ఎమోషన్స్ కూడా కంట తడిపెట్టిస్తున్నాయి... ఇలాంటప్పుడే రిలీఫ్ కోసం ఒక పాట కావాలయ్యా అని ఎవరికైనా అనిపిస్తుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకైతే గ్రాండ్ లెవెల్లో స్పెషల్ సాంగ్ కావాలని ఉంటుంది. అందుకే ప్రతి సినిమాలోనూ స్పెషల్ సాంగ్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. రానున్న కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్లో ఈ తరహా పాటలు ఉన్నాయి. అయితే... ఈ స్పెషల్ సాంగ్స్ గురించి యూనిట్ నుంచి అధికారిక ప్రకటన లేదు. కానీ ప్రచారంలో ఉన్న ప్రకారం పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహీ ప్రత్యేక పాటల్లో కనిపించనున్నారట. ఆ పాటలు ఏ సినిమాలోనో తెలుసుకుందాం.హిట్ రిపీట్ అవుతుందా? టాప్ హీరోయిన్ పూజా హెగ్డే వీలైనప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు. రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంలో పూజా హెగ్డే చేసిన ‘మోనికా..’ సాంగ్ సూపర్హిట్గా నిలిచింది. రామ్చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’లో పూజా హెగ్డే చేసిన ప్రత్యేక పాట ‘జిగేల్ రాణి’, వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 3’లో చేసిన స్పెషల్ సాంగ్ ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాల..’ కూడా చాలా పాపులర్. ఈ పాటల తరహాలోనే మరో హిట్ స్పెషల్ సాంగ్ను చేయనున్నారట పూజా హెగ్డే. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలో దీపికా పదుకోన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు యూనిట్ ప్రకటించగా, హీరోయిన్స్ జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ భోర్సేలు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ కోసం మేకర్స్ పూజా హెగ్డేని సంప్రదించారనే టాక్ తెరపైకి వచ్చింది.మరి... అల్లు అర్జున్ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తారా? పూజా హెగ్డే గత ప్రత్యేక పాటల సక్సెస్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘అల.. వైకుంఠపుర ములో..’లోని సాంగ్స్ బాగా పాపులర్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. మాస్ సాంగ్ రామ్ చరణ్ నటించిన రూరల్ మాస్ మూవీ ‘రంగస్థలం’లోని ‘జిల్ జిల్ జిగేల్ రాణి..’ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మళ్లీ రామ్చరణ్ ఈ రూరల్ బ్యాక్డ్రాప్లో మరో సినిమా చేస్తున్నారు. అదే ‘పెద్ది’. బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ పూర్తి కాగానే పాటల చిత్రీకరణను ఆరంభిస్తారు. అయితే బ్యాలెన్స్ ఉన్న సాంగ్ షూట్లో స్పెషల్ కూడా ఒకటి ఉందని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్లో ముగ్గురు హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తారనే ప్రచారం సాగింది.కానీ ఫైనల్గా మృణాల్ ఠాకూర్ చేయనున్నారని సమాచారం. అది మాత్రమే కాదు... ఈ చిత్రకథానాయిక జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో కనిపిస్తారని భోగట్టా. రామ్ చరణ్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ల కాంబినేషన్లో రూరల్ బ్యాక్డ్రాప్లో ఈ మాసీ సాంగ్ అంటే మాస్ ఫ్యాన్స్కు విజిల్ మూమెంట్స్ అనే చెప్పవచ్చు. అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయని ఊహించ వచ్చు. ఏప్రిల్లో మొదటి వారంలో ఈ పాట చిత్రీకరణ జరగనుందని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్.జైలర్తో సందడి ‘నువ్వు కావాలయ్యా...’ అంటూ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ (2023)లో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ‘జైలర్ 2’లో ఈ తరహా ప్రత్యేక పాట కావాలయ్యా... అంటున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే సీక్వెల్లోనూ బ్రహ్మాండమైన స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాటకు నోరా ఫతేహీ డ్యాన్స్ చేశారని కోలీవుడ్ టాక్. రజనీకాంత్–నోరా పాల్గొనగా చెన్నైలో ఎనిమిది రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారని సమాచారం.తొలి భాగానికి పాటలు స్వరపరచిన అనిరుధ్ రవిచందర్ ‘జైలర్ 2’కి కూడా సంగీతం అందించారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన నెల్సన్ దిలీప్కుమార్ మలి భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తొలి భాగాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ సీక్వెల్ని నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలోని ప్రత్యేక పాటకు జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారని తెలిసింది. ఇది సౌత్ స్టైల్లో సాగే సాంగ్ అని, చాలా గ్రాండ్గా చిత్రీకరించారని చెన్నై ఫిల్మ్నగర్ అయిన కోడంబాక్కమ్లో ప్రచారమవుతోంది.ఇదిలా ఉంటే... తెలుగు, తమిళ, హిందీ... ఇలా పలు భాషల్లో నోరా ఫతేహీ ఇప్పటివరకూ ఎన్నో ప్రత్యేక పాటలు చేశారు. వాటిలో ఎన్టీఆర్ ‘టెంపర్’లోని ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా..’, ప్రభాస్ ‘బాహుబలి’లోని ‘మనోహరీ...’ పాటలు కూడా ఉన్నాయి. మరి... ‘జైలర్ 2’లోని పాటకు నోరా ఏ స్థాయిలో డ్యాన్స్ చేశారో జూన్లో తెలిసిపోతుంది. ఆ నెలలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ఏడు వారాలు... పది కిలోలు
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి మేకోవర్కైనా ఎన్టీఆర్ సై అంటారు. అందుకు ఉదాహరణలుగా ‘అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలను చెప్పుకోవచ్చు. తాజా చిత్రం ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) కోసం ఈ చాలెంజ్ను స్వీకరించారని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభ సమయంలో కాస్త హెవీ బాడీ లుక్లో కనిపించిన ఎన్టీఆర్ ఇటీవలి కాలంలో చాలా సన్నగా కనిపించారు. హీరో క్యారెక్టరైజేషన్ కోసమే ఎన్టీఆర్ ఇలా స్లిమ్ లుక్లోకి మారిపోయారని సమాచారం. ఈ లుక్ కోసం ఎన్టీఆర్ ఏడు వారాల్లో పది కిలోల బరువు తగ్గారట.నిపుణుల సమక్షంలో ప్రతిరోజూ గంటన్నర పాటు వ్యాయామం, లో ప్రోటీన్ డైట్ను ఫాలో అవుతూ లీన్ లుక్లోకి మారిపోయారని టాక్. ఇలా సినిమా షూట్ ప్రారంభంలో కాస్త హెవీ బాడీ లుక్లో కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత లీన్ లుక్లోకి మారారంటే... ‘డ్రాగన్’లో ఈ హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయా? అనే చర్చ జరుగుతోంది.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, టోవినో థామస్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోందని టాక్. నందమూరి కల్యాణ్రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. -
పవన్ దొరికిపోతే.. యష్ తప్పించుకున్నాడు!
కొన్నిసార్లు పోటీ కంటే తప్పుకోవడం వల్ల కూడా మంచి జరగొచ్చు. అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు, మూవీ లవర్స్ మధ్య ఇలాంటి ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదంతా కూడా 'ధురంధర్ 2' గురించే. ఈ మూవీ నుంచి యష్ ఎలా తప్పించుకున్నాడు. పవన్ కల్యాణ్ ఎలా దొరికిపోయాడనేదే ఈ స్టోరీ.(ఇదీ చదవండి: ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్)గతేడాది డిసెంబరు 5న 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు. మార్చి 19న థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. అయినా సరే 'కేజీఎఫ్' ఫేమ్ యష్ 'టాక్సిక్' మూవీని అదే తేదీకి తీసుకొస్తామని మేకర్స్ ఘనంగా అనౌన్స్ చేశారు. మార్చి మొదలైన వరకు రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడతాయేమోనని అనుకున్నారు. కానీ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో అనిశ్చితి వాతావరణాన్ని కారణంగా చూపిస్తూ 'టాక్సిక్' మూవీని వాయిదా వేశారు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం వల్లే ఇలా చేశారని మాట్లాడుకుంటున్నారు.మరోవైపు 'ధురంధర్ 2' రిలీజైన వారం తర్వాత అంటే మార్చి 26న తమ సినిమా రిలీజ్ చేస్తామని 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలుత చెప్పింది. కానీ 'టాక్సిక్' వాయిదా పడటంతో వారం ముందుకొచ్చారు. ధురంధర్ హిందీ సినిమానే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి హైప్ ఉంది. ఇదేమైనా 'ఉస్తాద్..'కి నెగిటివ్ అవ్వొచ్చేమోనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే రిలీజ్ రోజున 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ రాకపోవడం, ఉగాది పండగ వల్ల 'ఉస్తాద్..'కి ఉన్నంతలో కలిసొచ్చింది.కానీ రెండో రోజు నుంచి 'ధురంధర్ 2' హిందీ బుకింగ్స్ పెరిగాయి. అదే టైంలో మూస కంటెంట్ వల్ల 'ఉస్తాద్..' వసూళ్లలోనూ విపరీతమైన డ్రాప్ కనిపించింది. అది మరింతగా కొనసాగుతోంది. ఈ వీకెండ్ వరకు ఓకే గానీ సోమవారం నుంచి పవన్ సినిమాకు అగ్నిపరీక్షే. ఎందుకంటే వర్కింగ్ డేస్లోనూ ఈ మూవీ నిలబడితే పర్లేదు. అలా జరగకపోతే మాత్రం కష్టమే. మరోవైపు 'ధురంధర్ 2' తెలుగు షోలకు ఇచ్చిన స్క్రీన్లు సరిపోవడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి థియేటర్ ఓనర్స్ ఈ సినిమా వైపు మొగ్గుచూపుతారా? లేదంటే 'ఉస్తాద్..'నే కొనసాగిస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?) -
ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్
అప్పట్లో అల్లరి ప్రియుడు, సింహరాశి, మా అన్నయ్య, అంకుశం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో రాజశేఖర్.. గత కొన్నేళ్లుగా తెరపై కనిపించట్లేదు. చెప్పాలంటే ఈయన్ని ఏ దర్శకులు కూడా తీసుకోవట్లేదు. కొన్నాళ్ల క్రితం నితిన్ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' అనే మూవీలో క్యారెక్టర్ రోల్ చేసినప్పటికీ అస్సలు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈయన కీలక పాత్రలో నటించిన సినిమా 'బైకర్'. శర్వానంద్ హీరో. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలోనే రాజశేఖర్.. తనకు అవకాశాలు ఇవ్వాలని బతిమలాడుకున్నారు.(ఇదీ చదవండి: శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది)ఒకప్పుడు హీరోగా హిట్స్ కొట్టిన చాలామంది ఇప్పుడు తెరమరుగైపోయారు. మధ్యలో విలన్, సహాయ పాత్రలతో జగపతిబాబు లాంటి వాళ్లు వచ్చారు. ఒకరిద్దరు మాత్రమే బలంగా నిలబడ్డారు. ఇప్పుడు రాజశేఖర్ 'బైకర్'లో హీరో తండ్రిగా, రేసింగ్ కోచ్గా మంచి నిడివి ఉన్న పాత్రనే చేసినట్లున్నారు. అయితే తనని ఏ దర్శకుడు కూడా సంప్రదించకపోయేసరికి.. స్వయంగా ఈయనే 'ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి' అని రిక్వెస్ట్ చేశారు.సెకండ్ స్టేజీకి వచ్చేశానని ఇన్నాళ్లు అనుకున్నానని.. కానీ అలాంటివేం ఇప్పుడు లేవని తన కూతుళ్లు చెప్పడంతోనే 'బైకర్'లో నటించానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఈ చిత్ర షూటింగ్లో తనని రెండో హీరోలా ట్రీట్ చేశారని, శర్వానంద్ కూడా నేనే హీరోని అన్నట్లు ప్రవర్తించాడని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా రాజశేఖర్ లాంటి నటుడు.. ఇలా అవకాశాల కోసం బతిమలాడుకోవడం వింతగా అనిపించింది. రీసెంట్ టైంలో అయితే గోటీల ఫ్యాక్టరీ అనే మాటతో తెగ వైరల్ అవుతున్నారు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?) -
చీరలో ముద్దుగుమ్మలా ఆషిక.. వావ్ అనేలా తమన్నా
చీరలో అందాలు చూపించేస్తున్న ఆషికవావ్ అనేలా మెరిసిపోతున్న తమన్నాగ్లామరస్ వీడియోతో సంయుక్త హొయలుమెరుపు తీగ కంటే సన్నగా మౌనీ రాయ్మాల్దీవుల్లో చిల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్కన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్ మెరుపులు View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Preity Mukhundhan (@preity_mukhundhan) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది
శర్వానంద్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'బైకర్'. ఒకప్పటి హీరో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు కాగా యూవీ క్రియేషన్స్ నిర్మించింది. లెక్క ప్రకారం గతేడాది డిసెంబరులోనే ఈ మూవీ రిలీజవ్వాలి. కానీ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది అదిరిపోయిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)రేసింగ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. అందులోనూ బైక్ రేసింగ్ కాన్సెప్ట్తో ఇప్పటివరకు అయితే రాలేదు. ఇందులో శర్వానంద్, రాజశేఖర్.. తండ్రికొడుకులు పాత్రలు చేశారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉన్నాయి. మరి మూవీ ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. ఇంత పొరపాటు ఎలా చేశారు?) -
పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?
గతంలో పవన్ కల్యాణ్ వరస ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు 'దబంగ్'ని రీమేక్ చేసి 'గబ్బర్ సింగ్' తీసిన దర్శకుడు హరీశ్ శంకర్ హిట్ కొట్టాడు. ఇది 2011లో జరిగింది. మూవీలో కంటెంట్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండేసరికి ప్రేక్షకులు ఆదరించారు. దాదాపు అదే టెంప్లేట్తో తీసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' రీసెంట్గా థియేటర్లలోకి వచ్చింది. పవన్ అభిమానుల కోసం దీన్నే తీశానని హరీశ్ శంకర్ మొదటి నుంచి చెబుతూ వచ్చాడు. అందుకు తగ్గట్లే ఫ్యాన్స్కి తప్పితే సగటు ఆడియెన్స్కి నచ్చలేదు. బుకింగ్సే అందుకు నిదర్శనం.(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)ఇప్పుడు పవన్తో మరో సినిమా తీస్తానని హరీశ్ శంకర్ అంటున్నాడు. ఈసారి స్టోరీ కొత్తగా ఉంటుందని, అందరికీ నచ్చేలా తీస్తానని అంటున్నాడు. అయితే ఈ దర్శకుడు మూవీ చేస్తానని అనడం బాగానే ఉంది గానీ పవన్ ఒప్పుకొన్నాడా లేదా అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం పవన్ చేతిలో సురేందర్ రెడ్డి మూవీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఒప్పుకొన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి తర్వాత మూవీస్ చేస్తాడా అనేది సందేహమే.హరీశ్ శంకర్ ట్రాక్ రికార్డ్ చూస్తే.. అప్పుడెప్పుడో వచ్చిన 'గబ్బర్ సింగ్' హిట్ అయింది. తర్వాత చేసిన వాటిలో దువ్వాడ జగన్నాథం, సుబ్రమణ్యం ఫర్ సేల్ ఉన్నంతలో ఆకట్టుకున్నాయి. గద్దలకొండ గణేశ్, మిస్టర్ బచ్చన్ లాంటి రీమేక్స్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. ఇప్పుడు తీసిన 'ఉస్తాద్..' ప్రకటించి, పూర్తి చేసి రిలీజ్ చేయడానికే ఐదేళ్లు పట్టేసింది. ఇప్పుడు మరో సినిమా అంటే అయ్యే పనేనా అని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పవన్ ఒప్పుకొన్న ప్రొడ్యూసర్ ఎవరనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పెద్ది'కి ఐటమ్ బ్యూటీ దొరికేసింది!) -
షకీరా భారత్ పర్యటన బ్రేక్
పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న ఘర్షణల కారణంగా షకీరా భారత సంగీత కచేరీ వాయిదా పడిందని నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్లో ముంబై, ఢిల్లీలలో జరగాల్సిన ఈ ప్రదర్శనలను "భౌగోళిక రాజకీయ పరిస్థితి, ప్రాంతీయ ఉద్రిక్తతల" కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టిక్కెట్టు కొనుగోలు చేసిన అభిమానులకు పూర్తిగా డబ్బు వాపసు ఇవ్వబడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమం గురించి నిర్వహాకులు ఇలా ప్రకటించారు. "ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా.. షకీరా పాల్గొనవలసిన 'ఫీడింగ్ ఇండియా కాన్సర్ట్' మరో తేదీకి వాయిదా వేయబడింది. అభిమానుల రక్షణే మా యూనిట్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. టిక్కెట్టు కొనుగోలు చేసిన వారందరికీ పూర్తి వాపసు ఇవ్వబడుతుంది," అని డిస్ట్రిక్ట్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ తమ హ్యాండిల్లో ఒక పోస్ట్ పేర్కొంది.కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. కొలంబియన్ సింగర్ షకీరా మత్తెక్కించే గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. భారత్లో తొలిసారి ముంబైలో(2007) ఒక అద్భుతమైన కచేరీ చేసింది. ఇక్కడ అదే ఆమెకు తొలి ప్రదర్శన కావడం విశేషం. ప్రస్తుతం తన కొత్త ఆల్బమ్, "లాస్ ముజెరెస్ యా నో లోరన్ వరల్డ్ టూర్" (Las Mujeres Ya No Lloran World Tour) తో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రదర్శనలు ఇస్తోంది. -
లంగా ఓణితో పార్టీకి వెళ్లలేం కదా.. డ్రెస్సింగ్పై నిహారిక కామెంట్స్
మహిళల వస్త్రధారణ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎలాంది దుస్తులు ధరించాలనేది వారిష్టం కానీ, సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మెలగాలని ఆమె అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ.. ‘నా వరకు అయితే నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన దుస్తులు ధరించొచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత మనం సొసైటీతో ఎన్నో రిలేషన్స్ పెట్టుకొని ఉంటాం, వాటికి అనుగుణంగానే వస్త్రధారణ ఉండాలి. నేను ఏదైనా ఒక పెళ్లికి వెళితే కచ్చితంగా చీర కట్టుకొనే వెళ్తాను. అలాగే నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళితే లంగా ఓణి వేసుకొని వెళ్లలేను కదా? అలా వెళ్తే.. అందరూ కింది నుంచి పైవరకు అలా చూస్తారు(నవ్వుతూ..). మనం వెళ్లే సందర్భాన్ని బట్టి దుస్తులు ఉండాలి. టీనేజ్ లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ ఇలాంటి డ్రెస్ వేసుకొద్దు.. అలా రెడీ కావాలని చెబుతుంటారు. అది మనకు కండీషన్లు పెట్టినట్లు కాదు..బయట సమాజం గురించి తెలియదు కాబట్టే వాళ్లు ప్రొటెక్ట్ చేస్తున్నారనీ అర్థం. నాక్కుడా నాన్న అలాంటి సలహా ఇచ్చేవారు. అమ్మ కూడా ‘ఇది నీకు సెట్ అవ్వలేదు..అది వేసుకో బాగుంటుంది’ అని చెప్పేది. అందులో తప్పేం లేదు. టీనేజ్ దాటిన తర్వాత కూడా అలాంటి కండీషన్లు పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్లకు తెలుసు. ఏ డ్రెస్ వేసుకుంటే.. ఎలాంటి కామెంట్స్ చేస్తారో. మనం సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దుస్తులు ధరించాలి’ అని నిహారిక చెప్పుకొచ్చింది. నిహారిక కెరీర్ విషయానికొస్తే.. నటనకు కాస్త బ్రేక్ ఇచ్చి.. నిర్మాణ సంస్థపై ఫోకస్ చేసింది. తన బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై వరుస సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతోంది. తాజాగా రాకాస అనే హర్రర్ కామెడీ చిత్రాన్ని నిర్మించింది. సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కాబోతుంది. -
'నూరేళ్లు కాదు.. 130 ఏళ్లు'.. సుమకు రాజీవ్ బర్త్ డే విషెస్
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాలకు ఆమె భర్త ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ సుమ బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను వ్యక్తం చేశారు. తెలుగులో వేద మంత్రాన్ని రాస్తూ తన సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండూ నూరేళ్లు… కాదు కాదు.. ఒక 120–130 ఏళ్లు మీ మనవలు, మనవరాళ్లతో హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నానంటూ భార్యపై తన ప్రేమను చాటుకున్నారు రాజీవ్ కనకాల. ఇది చూసిన అభిమానులు సైతం సుమకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. రాజీవ్ కనకాల, సుమ 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కుమారుడు రోషన్ టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారి పరిచయం సీరియల్స్తోనే మొదలైంది. అలా ప్రేమలో పడిన ఈ జోడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. గతంలో ఓ సినిమా ఈవెంట్లో రాఘవేంద్రరావు మాట్లాడుతూ వారి పెళ్లి గురించి సరదా వ్యాఖ్యలు చేశారు. సుమ - రాజీవ్ కలిసి నటించిన సూపర్ హిట్ సీరియల్ 'శాంతి నివాసం' సీరియల్తోనే వారి మధ్య ప్రేమ చిగురిందని అన్నారు.శుభజన్మదినం తుభ్యంశుభజన్మదినం తుభ్యంశుభజన్మదినే తవ హేసకలం సఫలం భూయాత్సకలం చ శుభం భూయాత్నిండూ నూరేళ్లు… కాదు కాదు, ఒక 120–130 ఏళ్లు మీ మనవలు, మనవరాళ్లతో హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నాను ✨Happy Birthday @ItsSumaKanakala ❤️ pic.twitter.com/nxYUpFVVKb— Raajeev kanakala (@RajeevCo) March 22, 2026 -
అల్లు అర్జున్- అట్లీ సినిమాలో అనుష్క
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్లోకి(AA 22) బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతుంది. పుష్ప-2 తర్వాత బాలీవుడ్లో అల్లు అర్జున్కు భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో తను నటించబోయే సినిమాల్లో హిందీ హీరోయిన్లనే ఎంపిక చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే అట్లీ సినిమా కోసం దీపికా పదుకోణ్ను తీసుకున్నారు. లోకేశ్ కనగరాజ్ మూవీ కోసం శ్రద్ధా కపూర్ పేరు పరిశీలనలో ఉంది. ఇంతలోనే మరో క్రేజ్ హీరోయిన్ పేరు తెరపైకి రావడం విశేషం.అల్లు అర్జున్- అట్లీ మూవీ కోసం అనుష్క శర్మను తీసుకోనున్నట్లు బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. కానీ, ఈ వార్త వైరల్ అవుతుంది. ఒకవేళ ఇది నిజమైతే, అనుష్క ఈ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేయనున్నారు. క్రికెటర్ కోహ్లీతో వివాహం తర్వాత అనుష్క కాస్త సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, అల్లు అర్జున్తో సినిమా కావడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.AA22 చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సైన్స్ఫిక్షన్ మూవీలో హీరో పాత్ర మూడు విభిన్న కోణాల్లో సాగుతుందని టాక్. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణ్తో పాటు అనుష్క శర్మ ఎంట్రీ ఇస్తే ఇదో సంచలనంగా మారడం ఖాయం. -
'మామయ్య ఎల్లప్పుడు నీ వెంటే ఉంటారు'.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
మంచువారి ఇంట ఇటీవలే శుభకార్యం జరిగింది. టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ప్రసన్న కూతురు విద్యా నిర్వాణ హాఫ్ శారీ వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో హీరో మంచు మనోజ్ దంపతులు కూడా పాల్గొన్నారు. తన కోడలి ఓణీ వేడుకలో పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ ఫంక్షన్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. దేవుడు నాకేమిచ్చాడని అడిగితే.. అందులో మా సిస్టర్ కూడా ఒకరని భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆమె నాకు ఎల్లప్పుడు ప్రేమను, ఆప్యాయతను, బలాన్ని ఇస్తుందని రాసుకొచ్చాడు.మంచు మనోజ్ తన ఇన్స్టాలో రాస్తూ..' దేవుడు నాకిచ్చిన వాళ్లలో మా సిస్టర్ కూడా ఒకరు. ఆమె నాకు నిరంతరం ప్రేమ, ఆప్యాయత, బలాన్ని ఇచ్చింది. తనకు కూడా అదే ప్రేమను తిరిగి ఇవ్వాలన్న కోరిక నాలో ఎప్పుడూ ఉండేది. చిన్నారి విద్యా నిర్వాణ మా జీవితాల్లోకి అడుగుపెట్టినప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చింది. తనకు మామగా నా ప్రయాణం మొదలైంది. విద్యా నిర్వాణకు మామగా ఉండటం కేవలం ఒక బిరుదు కాదు.. అది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. తన రక్షకుడిగా, స్నేహితుడిగా, మార్గదర్శిగా, ఊహించనంత ప్రేమను ఇవ్వాలని కోరుకునే వ్యక్తిగా మను మామ, అత్త, ధైరవ్, దేవసేన ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటారు. నేను నీకు కనిపించనప్పుడు కూడా సున్నితమైన హృదయంతో ఈ ప్రపంచాన్ని జయించు. నీకు బలంగా, నీకు అండగా, నిశ్శబ్దంగా నీ వెనుక నిలబడతా.. లవ్ యూ నా బంగారు తల్లి ' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
'ధురంధర్' విజయం వెనుక తెలుగు హిట్ సినిమా: ఆదిత్య ధర్
రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధురంధర్- 2: ది రివెంజ్’.. బాక్సాఫీస్ వద్ద మూడురోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిపోయింది. గతేడాదిలో విడుదలైన పార్ట్-1 భారీ విజయం అందుకోవడంతో దర్శకుడు ఆదిత్య ధర్ పేరు పాన్ ఇండియా రేంజ్లో ట్రెండ్ అవుతుంది. అయితే, ఇంతటి బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ను డైరెక్ట్ చేసిన ఆదిత్య ధర్ తాజాగా తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపించారు. 'ధురంధర్' సినిమా విజయం వెనుక తెలుగు హిట్ సినిమా స్పూర్తి అని ఆయన పంచుకున్నారు.నాగార్జున ఐకానిక్ చిత్రం 'శివ'(1989)పై దర్శకుడు ఆదిత్య ధర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని నేటికీ తప్పక చూడాలని ఆయన అన్నారు. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు శివ సినిమా చూసినట్లు గుర్తుచేసుకున్నారు. శివ చిత్రం చాలామంది దర్శకులకు దిక్సూచిగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సినిమా ద్వారా టెక్నికల్ వాల్యూస్, మేకింగ్ స్టైల్లో కొత్త ఒరవడిని RGV సృష్టించారని ఆయన మెచ్చుకున్నారు.శివ సినిమాలోని ఇళయరాజా సంగీతంపై కూడా ఆదిత్య ధర్ ప్రశంసించారు. ఇందులో విప్లవాత్మకమైన సౌండ్ డిజైన్ ఉన్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. 'శివ' చిత్రం ఇప్పటికీ తాజాగా, శక్తివంతంగా అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ చిత్రం భారతీయ సినిమా భాషను ఎలా మార్చిందో, తరతరాల చిత్రనిర్మాతలకు ఎలా స్ఫూర్తినిచ్చిందో ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఒక ఆధునిక దర్శకుడి నుండి వచ్చిన ఈ అరుదైన ప్రశంస, నిజమైన క్లాసిక్లు కాలంతో పాటు మసకబారవని నిరూపిస్తుంది. రామ్గోపాల్ వర్మ తన సృజనాత్మక మేకింగ్తో తరతరాల దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారని, ఆదిత్య ధర్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. A 6 year old kid saw #Shiva and today he became #AdityaDhar https://t.co/Y0Fh3GP55Z pic.twitter.com/ARbIY4t2j0— Nag Mama Rocks (@SravanPk4) March 21, 2026 -
ఇటలీలో భారీ విల్లా కొనుగోలు చేసిన ప్రభాస్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆస్తుల గురించి ఏదో ఒక పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఆయనకు విదేశాల్లో భారీ ఆస్తులు ఉన్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో క్రేజీ గాసిప్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ప్రభాస్ ఇటలీలో భారీ విల్లాను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం ఆయనకు ఇటలీలో రెండు భారీ విల్లాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇటలీ అంటే పిచ్చి..ప్రభాస్కు ఇటలీ అంటే చాలా ఇష్టం. ఖాలీ సమయం దొరికితే చాలు ఇటలీలో వాలిపోతాడు. అక్కడి వాతావరణం, లొకేషన్స్ అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఎక్కువ సమయం ఇటలీలో గడిపేందుకు ప్రయత్నిస్తాడు. ఇప్పటికే అక్కడ ఓ భారీ విల్లాను కొనుగోలు చేశాడట. ఇటలీ వెళ్లిన ప్రతిసారి ప్రభాస్ అదే విల్లాలో ఉంటాడని, మిగతా సమయంలో రెంట్కి ఇస్తాడని గతంలో వార్తలు వినిపించాయి. వీటిపై ప్రభాస్ ఎప్పుడూ స్పందించలేదు.యూరప్లో సెటిల్?ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకునే నటుడు ప్రభాస్. తన సంపాదనలో ఎక్కువ భాగం భూమిపైనే పెట్టేందుకు ఆసక్తి చూపుతాడట. తన బంధువులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. మరికొంత భాగాన్ని ఇలా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి కేటాయిస్తాడట. అయితే వరుసగా ఇటలీలోనే రెండు విల్లాలు కొనడంతో..ఇక భవిష్యత్తులో ప్రభాస్ అక్కడే సెటిల్ అవుతాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల మోకాలీ సర్జరీకి కూడా ప్రభాస్ ఇటలీకే వెళ్లాడు.వరస సినిమాలతో బిజీ బిజీప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి ‘ది రాజాసాబ్’తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు ఆయన నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘పౌజీ’ కూడా రిలీజ్కు రెడీ అవుతుంది. మరోవైపు కల్కీ సీక్వెల్ కల్కీ 2 మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. -
కల్కి సీక్వెల్లో స్టార్ నటుడు ఎంట్రీ..!
ప్రభాస్- దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ లేకుండానే ఇప్పటికే కల్కి పార్ట్-2 షూటింగ్ పనులు కొద్దిరోజుల క్రితమే మొదలయ్యాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్తో భాగమైన సీన్స్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. అయితే, తాజాగా ఈ మూవీలో మరో స్టార్ నటుడు చేరాడని తెలుస్తోంది.హైదరాబాద్లో కొనసాగుతున్న కల్కి-2 షూటింగ్ సెట్స్లోకి ప్రముఖ హీరో జె.డి. చక్రవర్తి కూడా ఎంట్రీ ఇచ్చారని సమాచారం. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ మూవీలో ఆయన ప్రధానమైన పాత్రలో కనిపించనున్నారట. అతి త్వరలోనే కల్కి సెట్స్లోకి ప్రభాస్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నగా.. దీపికా పదుకోన్ స్థానంలో ఒక కొత్త నటి రానుంది. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు. -
మేనకోడలికి ఆమిర్ ఖాన్ శుభాకాంక్షలు
బాలీవుడ్ దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, నటుడు–దర్శక–నిర్మాత ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్’. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, జైన్ మేరీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. జైన్ మేరీ ఖాన్ బర్త్ డే (మార్చి 20) సందర్భంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఆమె ఫస్ట్ లుక్ను యూనిట్ రిలీజ్ చేసింది. ఈ లుక్ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి, యూనిట్కు అభినందనలు తెలిపారు ఆమిర్ ఖాన్. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ‘‘లవ్, యాక్షన్, హార్ట్బ్రేక్ వంటి అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహ–నిర్మాత: సునీల్ నారంగ్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నేపథ్య సంగీతం: గ్యాని. -
హుక్ స్టెప్ సవాల్.. గెలిస్తే రూ. లక్ష సొంతం!
పార్థ గోపాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. మేఘన హీరోయిన్గా నటించారు. సూర్య జి. యాదవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొని, పాటలను విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ ఎమోషన్ అండ్ రివెంజ్ మూవీ ఇది. ఏప్రిల్లో రిలీజ్ చేయనున్నాం. ఈ చిత్రంలోని ‘మరదలివే..’ పాటలోని హుక్ స్టెప్ రీల్స్ చేసి, పంపించేవారిలో విజేతలకు నగదు బహుమతులు ఇస్తాం’’ అని తెలిపారు పార్థ గోపాల్. మొదటి బహుమతి కింద లక్ష రూపాయలు, రెండో బహుమతిగా రూ. 50 వేలు అందిస్తామని చెప్పారు. ‘‘పెద్దపల్లి రోహిత్ ఈ సినిమాకు మంచి సంగీతం, ఆర్ఆర్ ఇచ్చారు’’ అని పేర్కొన్నారు సూర్య జి. యాదవ్. -
విరోష్ జంట హనీమూన్.. సోషల్ మీడియాలో ఫోటో లీక్..!
టాలీవుడ్ జంట రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ కొత్త ఏడాదిలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. పెళ్లికి కొన్ని రోజుల ముందే తమ బంధాన్ని అఫీషియల్గా ప్రకటించారు. వీరిద్దరి పెళ్లి వేడుక రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో విరోష్ జంట సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొని సందడి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించారు.తాజాగా ఈ జంట పెళ్లి తర్వాత హనీమూన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. విరోష్ జంట తమ హనీమూన్ కోసం థాయ్లాండ్ వెళ్లినట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఫుల్ రొమాంటిక్గా ఉన్న ఈ ఫోటో చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ థాయిలాండ్ హనీమూన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫోటోలో విరోష్ జంట ఒక మెట్లపై ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ప్రశాంతంగా హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న 'రణబలి' చిత్రంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ మూవీ బ్రిటిష్ కాలం నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. View this post on Instagram A post shared by ⭐VDFC MAHARASHTRA™⭐ (@vijaydeverakonda_maharashtra) -
కాంట్ అవాయిడ్
‘వయొలెన్స్ ... వయొలెన్స్ ... వయొలెన్స్ ... ఐ డోంట్ లైక్... ఐ అవాయిడ్... బట్.. వయొలెన్స్ లైక్స్ మీ... ఐ కాంట్ అవాయిడ్’ అంటూ ‘కేజీఎఫ్ 2’ సినిమాలో యశ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... ప్రస్తుతం తెరకెక్కుతోన్న సినిమాల్లో అధిక శాతం ‘కాంట్ అవాయిడ్... కథలో వయొలెన్స్ ఉంటే తప్పదు గురూ’ అన్నట్లుగా వయొలెన్స్ డామినేటెడ్ కథల్లో నటిస్తున్నారు కొందరు స్టార్స్. చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, యశ్, నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, అడివి శేష్, శర్వానంద్ వంటి హీరోలు వెండితెరపై వయొలెన్స్ చూపించనున్నారు. ఆ విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం...కాన్సెప్ట్ పోస్టర్తోనే అంచనాలు చిరంజీవి వరుసగా యువ దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన బ్లాక్బస్టర్ అందున్నారు. ఈ మూవీకి యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో రిలీజైన ఈ చిత్రం భారీ విజయం సాధించి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ‘మన శంకర వరప్రసాద్గారు’ తర్వాత తన భుజానికి చిన్న సర్జరీ చేయించుకున్నారు చిరంజీవి. ఈ కారణంగా బాబీ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించనున్న షూటింగ్ ఆరంభం కాలేదు.ప్రస్తుతం సర్జరీ నుంచి కోలుకున్న ఆయన బాబీ డైరెక్షన్లో రూపొందనున్న మూవీలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే... మరో యువ దర్శకుడు, ‘దసరా’ మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లోనూ చిరంజీవి ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ మూవీతో నానీని ఫుల్ మాస్ లుక్లో చూపించి, హిట్ అందుకున్నారు. తొలి సినిమాతోనే రా అండ్ రస్టిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన చిరంజీవితో సినిమా చేసే లక్కీ చాన్స్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం నాని హీరోగా ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు శ్రీకాంత్. ఈ మూవీలోనూ ఫుల్ మాస్ లుక్లో కనిపించనున్నారు నాని. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది.ఈ చిత్రం విడుదల తర్వాత చిరంజీవి సినిమాపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారాయన. చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల మూవీకి సంబంధించి ఓ కాన్సెప్ట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. చేతి నుంచి రక్తం కారుతున్న ఆ పోస్టర్ ఈ మూవీలో ఏ స్థాయి వయొలెన్స్ ఉండబోతోందో చెప్పింది. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. హీరో నాని ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించనుడంటం విశేషం. 1970–74లో సాగే ఈ పీరియాడిక్ డ్రామాలో చిరంజీవి సరికొత్తగా కనిపిస్తారని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మూవీ షూటింగ్ని ఆరంభిస్తామని సుధాకర్ చెరుకూరి ప్రకటించారు. మూడువేల మందితో... ‘దేవర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో వయొలెన్స్ , యాక్షన్కి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ప్రత్యేకించి ‘కేజీఎఫ్ 1, 2 ’ చిత్రాల్లో వయొలెన్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’లోనూ యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ హైలెట్గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్, మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఫైట్ ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ పేర్కొంది. అంతేకాదు.. ఈ మూవీ కోసం జోర్డాన్ లోనూ రెండు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పోరాట సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని అలరిస్తాయట.ఈ చిత్రం కోసం హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు పదిహేను కోట్ల రూపాయలతో సినిమాలో ఎన్టీఆర్ ఇంటి సెట్ని నిర్మించారు. ఈ సెట్లోనూ ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారట మేకర్స్. ఇలా... ఈ సినిమాలోని ఫైట్స్ అన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఈ సినిమాకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న రిలీజ్ కానుంది. మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో... ‘ది రాజా సాబ్’ వంటి హిట్ మూవీ తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న మరో పాన్ ఇండియన్ మూవీ ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టి. సిరీస్ బ్యానర్స్పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తన లేటెస్ట్ ఫిల్మ్ ‘యానిమల్’ లో వైలెన్స్ ని ఏ స్థాయిలో చూపించారో సందీప్ రెడ్డి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ వయొలెన్స్ పై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ తన పంథా ఏమాత్రం మార్చుకోకుండా తనదైన శైలిలోనే వెళుతున్నారాయన. ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్ని కూడా ఫుల్ వయొలెన్స్ గా చూపించనున్నారట ఆయన. తన మార్క్ ఇంటెన్స్, యాక్షన్, ఎమోషన్స్, రా పవర్తో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు సందీప్. తన కెరీర్లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించనున్నారు ప్రభాస్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ‘స్పిరిట్’ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ సహా మొత్తం 8 భాషల్లో 2027 మార్చి 5న గ్రాండ్గా విడుదల కానుంది. సలార్ 2లోనూ.... ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్: పార్ట్ 1–సీజ్ ఫైర్’. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా 2023 డిసెంబరు 22న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ప్రత్యేకించి యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీలో హైలెట్గా నిలిచాయి. ఈ మూవీకి సీక్వెల్గా ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ రానున్న విషయం తెలిసిందే. తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్లో వయొలెన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయని ఫిల్మ్నగర్ టాక్. ఈ ఎపిసోడ్స్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకులకు కూడా సరికొత్త అనుభూతిని పంచుతాయని తెలిసింది.ఇదిలా ఉంటే... ఈ మూవీపై గత కొన్నాళ్లుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమా గురించిన అప్డేట్స్ కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిత్రనిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ– ‘‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ షూటింగ్ని త్వరలోనే ప్రారంభిస్తాం. మొదటి భాగంతో పోలిస్తే ద్వితీయ భాగం అందర్నీ మరింత ఆశ్చర్యపరుస్తుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘ఎన్టీఆర్–నీల్’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారట ప్రశాంత్ నీల్.అంతకు మించి... ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్బస్టర్స్ మూవీస్ తర్వాత యశ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రో డక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ కలిసి కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ చూస్తే...‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ సినిమాలకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్, వయొలెన్స్ ‘టాక్సిక్’లో ఉన్నాయని అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం యశ్ సరికొత్త ఫిజిక్తో మేకోవర్ అయ్యారు.ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో ఈ నెల 19న రిలీజ్ కావాల్సి ఉండగా జూన్ 4కి వాయిదా పడింది. ‘‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’ అనేది ప్రపంచ ప్రేక్షకుల కోసం నిర్మించాం. ఎంతో అంకితభావం, ఎన్నో ఏళ్ల శ్రమతో తీసిన మా సినిమాని మార్చి 19న రిలీజ్ చేసి మా ఆనందాన్ని అందరితో పంచుకోవాలని అనుకున్నాం. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో నెలకొన్న ప్రస్తుత అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో జూన్ 4న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఓవర్సీస్లో ప్రధాన పంపిణీ భాగస్వామి అయిన ఫార్స్ ఫిల్మ్స్ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం.గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడటం కూడా విడుదల వాయిదాకి ఓ కారణం. మా భాగస్వాములు, మా ప్రేక్షకుల ప్రయోజనాల దృష్ట్యా మా సినిమా విడుదలను తిరిగి షెడ్యూల్ చేయడానికి మేం నిర్ణయం తీసుకున్నాం. ఇలానే మీ ప్రేమ, అభిమానం, సహకారం ఉంటాయని ఆశిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ‘టాక్సిక్’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను శ్రీవెంకటేశ్వర క్రియేషన్్సపై నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.పవర్ఫుల్ కల్ట్విశ్వక్ సేన్ హీరోగా నటించి, స్వీయ రచన, దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కల్ట్’. ‘ఫలక్నుమా దాస్, దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. గాయత్రీ భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ ఇతర పాత్రలు పోషించారు. తారక్ సినిమాస్ బ్యానర్పై సందీప్ కాకరాల నిర్మించారు.ఈ సినిమా తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుంది. వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ మూవీలో రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ చూస్తే రక్తంతో తడిసిన ఇంటెన్స్ లుక్లో విశ్వక్ సేన్ కనిపించగా, భారీ హైప్ సృష్టించింది. అదే విధంగా ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ‘‘జనాలు నా నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం మిస్ అవుతున్నారు? ఇవన్నీ నేను గమనిస్తున్నాను. అవన్నీ కలిపి కొట్టి ‘కల్ట్’ సినిమా తీశాను.‘ఫలక్నుమా దాస్’ మూవీ తీయకముందు నాలో ఒక కసి, ఆకలి ఉండేది. ‘కల్ట్’ తీసే ముందు కూడా ఆ కసి పదింతలు పెరిగింది. అంత కసిగా ఈ సినిమా తీశాను. పిల్లలు, సున్నిత మనస్కులని ఈ సినిమాకి దూరంగా ఉంచండి’’ అంటూ టీజర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో వయొలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మాస్ జడల్ ‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై రూపొందుతోన్న ఈ సినిమాలో మంచు మోహన్బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘దసరా’. ఈ మూవీలో నానీని పవర్ఫుల్ మాస్ పాత్రలో చూపించారు శ్రీకాంత్ ఓదెల. ‘దసరా’ మూవీ తర్వాత వీరి కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో జడల్ అనే రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తారు నాని. ‘హిట్ 3’లో నాని వయొలెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను భయపెట్టాయి. అయితే ‘ది ప్యారడైజ్’లోని వయొలెన్స్ సన్నివేశాలు ఓ రేంజ్లో ఉంటాయని మరింత స్పష్టం అవుతోంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, గ్లింప్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం నానిపై చిత్రీకరించిన ఇంట్రో సాంగ్ ‘ఆయా షేర్...’ని ఇటీవల విడుదల చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని కూడా యూనిట్ తెలియజేసింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్... ఇలా మొత్తం ఎనిమిది భాషల్లో ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే చిత్రీకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆగస్టు 21కి విడుదల వాయిదా వేశారు మేకర్స్. మాస్ రణబాలి హీరో విజయ్ దేవరకొండ ఒకేసారి ‘రౌడీ జనార్థన, రణబాలి’ వంటి రెండు వయొలెన్స్ సినిమాలు చేస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్థన’. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్ . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఫుల్ వయొలెంట్గా ఉంటుంది. 1980 దశకం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో విజయ్ కనిపించనున్నారు. ఇప్పటివరకు ఆయన ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదంటూ నిర్మాత ‘దిల్’ రాజు చె΄్పారు కూడా.ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడుతుండటం విశేషం. ‘‘నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానినే. ఒక హీరో నుంచి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అలాంటి కథ, కథనాలతో ‘రౌడీ జనార్థన’ మూవీని తెరకెక్కిస్తున్నా. ఫ్యాన్స్ కి పండగే. ఎక్కడా నిరుత్సాహపడరు’’ అంటూ డైరెక్టర్ రవికిరణ్ కోలా స్పష్టం చేశారు. టీజర్తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది.హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’. 2018 నవంబరు 17న విడుదలైన ఈ సినిమా హిట్గా నిలిచింది. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్, రాహుల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్. ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల తర్వాత విజయ్–రష్మిక కలిసి నటిస్తున్న మూడో చిత్రం ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమించిలి రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా ‘రణబాలి’ రూపొందుతోంది. ఈ సినిమాలోనూ వయొలెన్స్ , యాక్షన్ సన్నివేశాలు మరో లెవల్లో ఉండనున్నాయి. అజయ్–అతుల్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పెళ్లి పాట ‘ఏందయ్య సామీ...’కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా నటిస్తున్న ఈ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. సెప్టెంబర్ 11న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.రగ్డ్ డెకాయిట్ అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహంచిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’ మూవీతో కొత్త లుక్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. థ్రిల్లింగ్ యాక్షన్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీలో తన కెరీర్లో ఇప్పటివరకూ కనిపించని మాస్, రగ్డ్ పాత్రలో కనిపించనున్నారు అడివి శేష్. ‘‘డెకాయిట్’ ఒక కొత్త జోనర్లో చేసిన సినిమా. ఇది థ్రిల్లింగ్ యాక్షన్లో చెప్పిన లవ్ స్టోరీ. విడిపోయిన మాజీ ప్రేమికులు, వాళ్ల జర్నీలో ఏం రియలైజ్ అవుతారో ఇందులో చాలా స్పెషల్గా ఉంటుంది. చుట్టూ గన్స్, బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎమోషన్ ఎలా ఉంటుందనేది కొత్తగా ఉంటుంది. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో షూట్ చేశాం. హిందీలో కొన్ని సీన్స్ ట్రీట్మెంట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మ్యాసీవ్ ఔట్డోర్లో చిత్రీకరించిన ఈ మూవీ క్లైమాక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అంటూ అడివి శేష్ పేర్కొన్నారు. ఎ బ్లడ్ ఫెస్ట్శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అనేది ట్యాగ్లైన్గా పెట్టారంటే ఈ మూవీలో ఏ స్థాయిలో వయొలెన్స్ , రక్తపాతం సన్నివేశాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన మేకోవర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్డే సందర్భంగా ‘భోగి’ మూవీ నుంచి విడుదల చేసిన ఆయన ఇంటెన్స్ పోస్టర్కి అద్భుతమైన స్పందన వచ్చింది.గుబురు గడ్డంతో రా అండ్ రెబెలియస్ లుక్లో కనిపించారు శర్వా. పెదవుల మధ్య బీడీ పెట్టుకుని, దాని నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్న పొగ ఆయన పాత్రలోని యాటిట్యూడ్ను మరింత హైలైట్ చేసింది. ‘‘పీరియడ్ యాక్షన్ డ్రామాగా భారీ పాన్–ఇండియా మూవీగా ‘భోగి’ రూపొందుతోంది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శర్వానంద్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఈ చిత్రం ఒకటిగా ఉంటుంది. మా సినిమాని రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పైన పేర్కొన్న హీరోలే కాదు... మరికొంత మంది కథానాయకులు కూడా వయొలెన్స్ , ఫుల్ యాక్షన్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
ఇప్పుడు ఫైట్... నెక్ట్స్ పాట
రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ రూరల్ యాక్షన్ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ సెట్లో జరుగుతోందని సమాచారం. రామ్చరణ్ పాల్గొంటుండగా క్లైమాక్స్ సీక్వెన్స్ లోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.ఈ చిత్రీకరణలో భాగంగా ఓ ఫైట్ కూడా ఉందని భోగట్టా. ఈ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయితే ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుందట. ఏప్రిల్ మొదటి వారంలో పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. -
'పెద్ది' వాయిదా రూమర్స్.. ఏం జరుగుతోంది?
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. లెక్క ప్రకారం ఈనెల 27న చరణ్ పుట్టినరోజు కానుకగా థియేటర్లలోకి తీసుకొస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యమయ్యేసరికి నెలరోజులు వాయిదా వేశారు. ఏప్రిల్ 30న తీసుకొస్తామని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది చాలారోజులైపోయింది. ఇప్పుడు మళ్లీ 'పెద్ది' వాయిదా గురించి రూమర్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)'పెద్ది' ప్రస్తుత పరిస్థితి చూస్తే మరో 4 రోజుల టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణ ఇంకా చేయాల్సి ఉందట. రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. టీమ్ మాత్రం కచ్చితంగా చెప్పిన తేదీకే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ చేస్తున్నారు. కానీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్తోపాటు షూటింగ్ ఇన్ టైంలో పూర్తి చేస్తారా సందేహం కలుగుతోంది.మరోవైపు 'పెద్ది' వాయిదాపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. చరణ్ పుట్టినరోజున ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని అధికారికంగా ప్రకటించారు. దీనిబట్టి చూస్తే దాదాపు ఏప్రిల్ 30నే పాన్ ఇండియా రిలీజ్ అని అనుకోవచ్చు. కానీ ఏమైనా ఆలస్యమైతే మాత్రం జూలైలో తేదీని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'తో హిట్ కొట్టారు. రీసెంట్గా పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చింది. దీనికి ఏమంత పాజిటివ్ టాక్ అయితే రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ తమ అశలన్నీ 'పెద్ది'పైనే పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్) -
పెళ్లిలో అల్లు స్నేహా.. మెరిసిపోతున్న శ్రీలీల
ఫ్రెండ్ పెళ్లిలో అల్లు స్నేహా చీరలో ఇలాడిజైనర్ డ్రస్లో మెరిసిపోతున్న శ్రీలీలసెల్ఫీలన్నీ ఒకేసారి పోస్ట్ చేసిన రకుల్కాన్ఫిడెన్స్తో పోజులిచ్చిన జ్యోతికఎర్రని గౌనులో ధగధగమనేలా శాన్విగ్లామర్ చూపించేస్తున్న అనన్య నాగళ్ల View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan)


