Tollywood
-
సత్యదేవ్ సాహసం.. రావు బహదూర్ టీజర్ రిలీజ్
సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ రావు బహదూర్. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. మహేశ్బాబు, నమ్రాతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటైర్టెన్మెంట్స్ సమర్పణలో నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ మూవీ రానుంది.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సత్యదేవ్ రోల్ చూస్తుంటే విభిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. డిఫరెంట్ లుక్స్లో సత్యదేవ్ అదరగొట్టేశారని అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్లో సత్యదేవ్ పాత్ర సరికొత్తగా ఉండనుందని టీజర్తోనే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
సామాన్యులకు వెల్కమ్.. బిగ్బాస్ అగ్నిపరీక్షకు రెడీనా?
బుల్లితెర ప్రియుల రియాలిటీ షో బిగ్బాస్ మళ్లీ వచ్చేస్తోంది. తొమ్మిది సీజన్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ షో పదో ఎడిషన్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రోమో రిలీజ్ చేయగా.. కింగ్ నాగార్జున్ మరోసారి హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ ఉండనుందని ఆడియన్స్లో ఆసక్తి పెంచేశారు.అయితే ఈ సారి కూడా సామాన్యులకు ఈ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. గతేడాది మాదిరే అగ్ని పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు వరకు ఆడిషన్కు వీడియోలు పంపవచ్చని నాగార్జున ప్రకటించారు. ఈ వీడియోలు గరిష్ఠంగా మూడు నిమిషాల వరకు ఉండవచ్చని తెలిపారు. మీ వీడియోలను https://bbtelugu.jiostar.com సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఇంకెందుకు ఆలస్యం మీ టాలెంట్ను బయటకు తీసి వీడియోలు పంపి బిగ్బాస్ ఛాన్స్ కొట్టేయండి. -
సునీత తనయుడి కొత్త మలుపు మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా నటించిన తాజా చిత్రం కొత్త మలుపు. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కోనసీమ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ మూవీగా రూపొందించారు. తాజాగా ఈ మూవీ జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కొత్త మలుపు కథేంటంటే..జీవితాన్ని ఎంజాయ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని స్నేహితులతో కలిసి హైదరాబాద్లో హ్యాపీగా గడిపే యువకుడు కమల్ (ఆకాశ్). ఓ కుటుంబ వివాహ వేడుక కోసం తూర్పు గోదావరి జిల్లాలోని అందమైన గ్రామానికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా) అనే గ్రామీణ యువతిని చూసి ఆకర్షితుడవుతాడు. ఒక రాత్రి అనుకోని పరిస్థితుల్లో అవమానకర స్థితిలో చిక్కుకున్న కమల్ను ఓ యువతి కాపాడుతుంది. అయితే ఆమె ఎవరో తెలియదు. తనను ఆదుకున్న ఆ అమ్మాయి కోసం కమల్ చేసే అన్వేషణలో వరలక్ష్మి అతనికి తోడుగా నిలుస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.అయితే, తాను వెతుకుతున్న అమ్మాయి వరలక్ష్మినేనని తెలుసుకునేలోపే, ఆమె మరో యువకుడితో ఉన్న ఫోటో కమల్ చేతికి చిక్కుతుంది. దాంతో ప్రేమలో అనుమానాలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆ యువకుడు ఎవరు? వరలక్ష్మికి అతనితో సంబంధం ఏమిటి? ఈ అపార్థాల మధ్య కమల్-వరలక్ష్మి ప్రేమ ఎలాంటి పరీక్షలు ఎదుర్కొంది? చివరికి వారి ప్రేమ గెలిచిందా లేదా? అన్నదే కొత్త మలుపు కథ.ఎలా ఉందంటే..ప్రేమ, అపార్థాలు, నమ్మకం, గతం-వర్తమానం మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణను దర్శకుడు శివ కేసనకుర్తి చక్కగా తెరపై ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథకు గోదావరి ప్రాంతం అందాలను జోడించి ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించారు. సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడికి మంచి ఫీల్ను కలిగిస్తుంది. పల్లెటూరి విజువల్ అద్భుతంగా ఉన్నాయి. పెళ్లి సందడి, హీరో-హీరోయిన్ల మధ్య నడిచే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్లో వచ్చే కామెడీ ఎపిసోడ్స్, గోదావరి కామెడీ మంచి ఎంటర్టైనింగ్గా అనిపించాయి.రెండో అర్ధభాగంలో కథ భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. ప్రేమలో అనుమానం ఎంత ప్రమాదకరమో డైరెక్టర్ ఇందులో చూపించారు. ఒకరి గతాన్ని పట్టుకుని తీర్పు చెప్పడం ఎంత తప్పో చెప్పే ప్రయత్నంలో దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో వచ్చే సందేశం నేటి యువతకు ఎంతో అవసరమనే మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. "ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది. కానీ మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి వర్తమానాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు" అనే ఒక్క డైలాగ్లో తన స్టోరీ సారాంశం చెప్పేశారు.ఎవరెలా చేశారంటే.. కమల్ పాత్రలో ఆకాశ్ అదరగొట్టేశారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ భైరవి వరలక్ష్మి పాత్రలో మెప్పించింది. రఘుబాబు, పృథ్వీ తమ కామెడీ టైమింగ్తో గోదావరి యాసలో అలరించారు. గోపి పాత్రలో సిద్ధు మంచి నటన కనబరిచాడు. ఇక సాంకేతికత విషయానికొస్తే యశ్వంత్ నాగ్ సంగీతం ఆకట్టుకుంది. సుమంత్ కచర్ల సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి ప్రాంతంలోని ప్రకృతి అందాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్లో మరింత పని చెప్పాల్సి ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
గోపిచంద్ యాక్షన్ మూవీ.. టైటిల్ ఇదే
టాలీవుడ్ హీరో, మాచో స్టార్ గోపిచంద్ ప్రస్తుతం వెంకట్ డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇవాళ గోపీచంద్ బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సింగ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ వీడియోలో సుత్తి చేతిలో పట్టుకుని గోపిచంద్ కనిపించారు. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన అనార్కలి నాజర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతమందిస్తున్నారు. -
పెద్ది టీమ్కు మెగా ప్రశంసలు
రామ్ చరణ్ పెద్ది టీమ్ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంపై చిరు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను పెద్ది టీమ్ ట్విటర్లో పంచుకుంది.రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 4న రిలీజైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.345 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. A MEGA APPRECIATION 💥Megastar @KChiruTweets Garu congratulated and appreciated team #Peddi on the blockbuster success of the film ❤️#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/0aN2EgDNtD— PEDDI (@PeddiMovieOffl) June 12, 2026 -
వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబో.. బీచ్లో క్రేజీ అప్డేట్
ప్రతి సంక్రాంతికి హిట్ కొడుతున్న టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఏడాది కూడా మనశంకరవరప్రసాద్గారు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. చిరంజీవి- వెంకీతో కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. వీరిద్దరి కాంబోలో బాగానే వర్కవుట్ అయింది. ఇద్దరు స్టార్స్ను తీసుకుని కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించడం ఒక్క అనిల్ రావిపూడికే సాధ్యమని టాలీవుడ్ సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకీమామతో బ్లాక్బస్టర్ కొట్టిన అనిల్.. మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. వెంకీతో పాటు కల్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ దాదాపు రెడీ అయిపోయింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని రోటీన్గా కాకుండా చాలా క్రేజీగా అనౌన్స్ చేశారు. వివాహ భోజనంబు చిత్రంలోని సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం మధ్య బీచ్లో జరిగే ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఆడియన్స్ను అలరిస్తోంది. ఆ సినిమాలో లాగే బీచ్లో జీవీ ప్రకాశ్ను ఇసుకలో పూడ్చి మరి మ్యూజిక్ కంపోజ్ చేయించారు. ఆ తర్వాత పాటల రచయితగా అనంత శ్రీరామ్ పని చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఇంకా సెట్స్పైకి వెళ్లకముందే అప్డేట్స్తో అనిల్ రావిపూడి సరికొత్తగా దూసుకెళ్తున్నారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. I've always admired @gvprakash's ability to make music that connects instantly with audiences.👌🏻Thrilled to welcome him on board for #VenkyAnil5 - #NKRAnil2 🤗And we had a blast pulling off this fun concept...A big thank you to GV for trusting the idea, joining in… pic.twitter.com/AeAMx5hJbd— Anil Ravipudi (@AnilRavipudi) June 12, 2026 -
సింగ్ గీతం.. 94 ఏళ్ల వయసులో అదే డెడికేషన్..!
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిచిన తాజా చిత్రం సింగ్ గీతం. ఆయన ఇంటి పేరుతోనే వచ్చిన ఈ మూవీకి 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించారు. ఈ వయసులో సినిమాకు దర్శకత్వం వహించడం అంటే మాటలు. దాదాపు 90 ఏళ్లు పైబడిన వ్యక్తి సెట్కు వచ్చి తెరకెక్కించడం సవాల్తో కూడుకున్న పనే. అయినా కూడా ఆయన పట్టుదలతో ఈ మూవీని రూపొందించారు. ఈ వయసులో కూడా కథ చెప్పడం పట్ల ఆయనకున్న అభిరుచి, నిబద్ధతతో ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవలం 77 రోజుల్లోనే పూర్తి చేయడం మరో విశేషం. ఈ విషయాన్ని మూవీ టీమ్ సన్నిహితులు వెల్లడించారు.ఈ మూవీ కోసం సింగీతం శ్రీనివాసరావు పనిచేసిన తీరును కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పంచుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు ఎలా దర్శకత్వం వహించారో వివరించారు. ఈ మూవీ కోసం ఎన్నో సర్దుబాట్లు అవసరమయ్యాయని అన్నారు. చెన్నైలో షూటింగ్ బాగానే జరిగిందని.. కానీ హైదరాబాద్లో మాత్రం కష్టంగా అనిపించిందని చెప్పారు. ఆయన ప్రయాణించలేని సమయంలో ఇంట్లోనే ఒక వర్చువల్ మానిటర్ను ఏర్పాటు చేశారు. సింగీతం హెడ్సెట్ ద్వారా నటీనటులకు, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ వచ్చారు. దూరం నుంచే షూటింగ్ను పర్యవేక్షించారు.అయినప్పటికీ ఆయన ఎక్కువ భాగం ఆయన భౌతికంగా సెట్లోనే ఉన్నారని తెలిపారు. ఈ మూవీ చివరి రెండు నెలల్లో దర్శకుడికి దగ్గు రావడం.. అది తీవ్రమై ఇన్ఫెక్షన్గా మారిందని నాగ్ అశ్విన్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కొంచెం బరువు తగ్గారని.. కానీ అదేమీ ఆయన ఉత్సాహాన్ని తగ్గించలేదన్నారు. సింగీతం అభిరుచి ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రంలో అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
వరలక్ష్మి, నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే?
వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ పోలీస్ కంప్లైంట్. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు.ఈ సినిమా కథేంటంటే..గర్భిణి మహిళ హత్యతో ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. క్షుద్రపూజల పేరుతో జరిగినట్లు అనుమానిస్తున్న ఈ హత్య కేసు సంవత్సరాల పాటు మూలన పడిపోతుంది. డాడీ కావాలంటూ చిన్నారి అద్వైత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతోనే అసలు కథ మొదలవుతుంది. పాప తాను డాడీ అని పిలిచిన వాళ్లంతా చనిపోతారు. ఒక నిబద్ధత కలిగిన పోలీస్ అధికారి(వరలక్ష్మి శరత్కుమార్) ఈ కేసును మళ్లీ తెరపైకి తీసుకురావడంతో అసలు కథ మొదలవుతుంది. అప్పుడే పోలీస్ అధికారి భర్త డాక్టర్ రామ్ ( నవీన్ చంద్ర ) అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు పోలీస్ అధికారిణి ఏ నిర్ణయం తీసుకుంది. వరుస హత్యల వ్యవహారం వెనుక ఏం జరుగుతుంది? వారిని ఎవరు చంపేశారు? ఈ మరణాల వెనుక నిజంగా అతీంద్రియ శక్తులున్నాయా? అన్నదే అసలు కథ.ఎలా ఉందంటే.డైరెక్టర్ సంజీవ్ మేగోటి చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్కు హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కథలో మిస్టిరీయస్ అంశాల్లో ప్రేక్షకులను మెప్పించారు. హారర్, మిస్టరీ, యాక్షన్ అంశాలను చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్లో ఎక్కువగా ట్విస్ట్లు ఆడియన్స్ను థ్రిల్కు గురి చేస్తాయి.ఇంటర్వెల్ తర్వాత కథ వేగం పెరుగుతుంది. కేసు దర్యాప్తు సన్నివేశాలు ఉత్కంఠకు గురిచేస్తాయి. ఈ కేసుల్లో బయటపడే రహస్యాలు ప్రేక్షకులను చివరి వరకు కుర్చీలో కట్టిపడేసేలా ఉన్నాయి. ముఖ్యంగా హారర్ సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ కథకు బలం. సంజీవ్ సస్పెన్స్తో పాటు థ్రిల్లింగ్ కలిగించే కథను అందించారు. అయితే కొన్ని సీన్స్ బోర్ కొట్టేలా అనిపిస్తాయి. అక్కడక్కడ కథలో లాజిక్ మిస్సయినట్లు ప్రేక్షకుడికి అనిపిస్తుంది. మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని థ్రిల్లింగ్ కథతో చెప్పే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కథలు ఇష్టపడేవాళ్లు ఈ మూవీని ఓసారి ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..నవీన్ చంద్ర తన పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దర్యాప్తు అధికారిగా మెప్పించారు. వరలక్ష్మి శరత్కుమార్ మరోసారి తన టాలెంట్ను ప్రదర్శించారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. కృష్ణసాయి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా సూపర్స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతంలో ఆయన ప్రదర్శన అభిమానులను అలరిస్తుంది. రాగిణి ద్వివేది, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమిని సురేష్, విజయభాస్కర్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు.ఇక సాంకేతికత విషయానికొస్తే ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాత్రి సీన్లు, హారర్ ఎపిసోడ్స్ను విజువల్గా బాగా తీర్చిదిద్దారు. ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో అందించిన నేపథ్య సంగీతం ఫర్వాలేదు. అనుగోజు రేణుకా బాబు కొన్ని సీన్స్ మరింత కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
స్లమ్డాగ్ టీజర్.. పూరి జగన్నాధ్ డెడికేషన్ చూశారా?
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి- పూరి జగన్నాధ్ అరుదైన కాంబోలో వస్తోన్న చిత్రం స్లమ్ డాగ్.. 33 టెంపుల్ రోడ్. ఇటీవలే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ టీజర్లో యాక్షన్ సీన్స్ చూస్తే పూరి డైరెక్షన్ మార్క్ స్పష్టంగా కనిపించింది.తాజాగా ఈ టీజర్ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పూరి జగన్నాధ్ ఎనర్జీ, డెడికేషన్ అద్భుతంగా ఉంది. యాక్షన్స్ సీన్స్ హీరోకు వివరిస్తున్న తీరు పూరి ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పెద్ది మానియా.. చికిరి సాంగ్కు చిందులేసిన వరుడు
ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది మానియా నడుస్తోంది. ఈనెల 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పటికే రూ.345 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి రోజే పాజిటివ్ తెచ్చుకున్న ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.అయితే ఈ మూవీలోని సాంగ్స్ అభిమానులను ఓ ఊపు ఊపేశాయి. రైరై రారా అంటూ సాగే పాటతో పాటు చికిరి చికిరి సాంగ్కు ఫ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టేశారు. పిల్లల నుంచి ముసలివాళ్లు సైతం కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియోలను ఇటీవల జరిగిన పెద్ది ఈవెంట్లో ప్రదర్శించారు. పెద్ది సాంగ్స్ అంతలా ఆడియన్స్లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాయి.తాజాగా చికిరి చికిరి సాంగ్కు ఓ వరుడు స్టెప్పులేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తన కాబోయే సతీమణి ముందే స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Cringe 😬😬 anipinchadam ledhaa #Peddi pic.twitter.com/MiHFAwWZu2— AVM (@AvmNews7) June 11, 2026 -
‘సింగ్ గీతం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: సింగ్ గీతంనటీనటులు: అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి, తులసి, బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ తదితరులునిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమానిర్మాత: నాగ్ అశ్విన్దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావుసంగీతం: దేవిశ్రీ ప్రసాద్విడుదల తేది: జూన్ 12, 2026ట్రెండ్కి భిన్నంగా ఆలోచించే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. అన్ని జానర్లో సినిమా తీయడమేకాదు.. అందులో కొత్త ప్రయోగాలు చేసి విజయం సాధించాడు. ఆదిత్య 369, విచిత్ర సోదరులు, భైరవద్వీపం, మైఖెల్ మదన కామ రాజు.. ఇలా అప్పట్లోనే ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి మెప్పించాడు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫోన్ చేతపట్టి ‘సింగ్ గీతం’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి కూడా మరో కొత్త ప్రయోగమే. మాటలనే పాటగా మార్చి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. మరి 94 ఏళ్లు యువకుడు తీసిన చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కుబేర పురం అనే ఒక ఫిక్షనల్ విలేజ్ చుట్టూ ఈ సినిమా కథనం తిరుగుతుంది. ఆ ఊరంతా బంగారమే ఉంటుంది. దాన్ని దోచుకోవడానికి రేణూ (షాలిని కొండేపూడి), ఆమె తండ్రి మైనింగ్ సాగిస్తుంటారు. ఆ మైనింగ్ను ఓ విదేశీ వ్యాపారాస్తుడికి అమ్మేయడానికి ప్లాన్ చేస్తారు. అదే సమయంలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములు అక్కడ ఉన్నాయని తెలుసుకుని ప్రతాప్ (అయాన్) ఆ ఊరికి వస్తాడు. తన భూమిలో బంగారు గనులున్నాయని తెలుసుకొని రేణూతో చేతులు కలుపుతాడు. బంగారాన్ని దోచుకోవడానికి ఆ ఊర్లో ఉన్న ఆఖరి చెట్టుని కూడా నరికేస్తారు. ఆ చెట్టుని తన తల్లిలా భావించి గౌరి(అహల్య) వద్దని అడ్డుకున్నా ఆ చెట్టుని తొలగిస్తారు. దీంతో ఆ ఊరి దేవుడు కుబేరుడికి కోపం వస్తుంది. ఆ ఊరికి ఓ శాపం ఇస్తాడు. ఎవరి నోట్లోంచి మాటే రాదు. కేవలం పాట మాత్రమే వస్తుంది. ఏం మాట్లాడాలన్నా పాట రూపంలోనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంతేకాదు నిజాలు మాత్రమే బయటకు వస్తుంటాయి. మరి ఈ పాటల వల్ల, వాళ్లు చెబుతున్న నిజాల వల్ల వారి జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. మాటలు లేకుండా పాటలతో సినిమా చేయడం.. వినడానికి ఇప్పటికీ విచిత్రంగా ఉంది కదా? కానీ 40 ఏళ్ల కిందటే సింగీతం శ్రీనివాసరావు ఈ ఆలోచన చేశాడు. ఇలాంటివి పేపర్పై రాసుకోవడానికి బాగుంటాయి. కానీ ఆచరణలో పెట్టడమే చాలా కష్టం. ప్రతి మాట.. ఎమోషన్ని పాట రూపంలో చెప్పడం అంత ఈజీ కాదు. కానీ సింగీతం అది చేసి చూపించాడు. 40 ఏళ్ల కింద రాసుకున్న కథ అయినప్పటికీ.. నేటికీ నవ్యత లోపించలేదు. నేటితరానికి ఇవ్వాల్సిన మంచి సందేశం ఈ కథలో ఉంది. ప్రకృతి ఎంత గొప్పదో చెబుతూనే.. మనిషి అత్యాశతో పర్యావరణాన్ని ఎలా నాశనం చేస్తున్నాడో ఇందులో చూపించాడు. అయితే ఈ సినిమా మొత్తం పాటలే ఉన్నాయా? మాటలు లేవా? అంటే ఉన్నాయి. సినిమా ప్రారంభం నుంచి తొలి 20 నిమిషాలు మూములుగానే కథనం సాగుతుంది. సాధారణ సినిమాల్లోలాగే మాటలు ఉంటాయి. ప్రతాప్ కుబేరపురం రావడం.. ఆ ఊరి ప్రజల పరిచయం.. మైనింగ్ మాఫియా నేపథ్యం అంతా రొటీన్గానే సాగుతుంది. ఎప్పుడైనే ఊరికి శాపం తగులుతుందో అప్పటి నుంచి మాటలు కాస్త పాటలుగా మారుతాయి.‘ఏమయ్యింది.. ఏమయ్యింది..’ అంటూ ఊరంతా పాడుకోవడం నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. పాట వరకు సరదాగే సాగినా.. ఆ తర్వాత మాటలు కూడా పాటలుగా రావడం బోరింగ్గా అనిపిస్తుంది. దానికి తోడు ఆయా సన్నివేశాలన్నీ సినిమాటిక్గానే అనిపిస్తాయి తప్ప ఎక్కడ సహజంగా అనిపించదు. ఇంటర్వెల్ వరకు ఇలానే సాగుతుంది. ఇక సెండాఫ్లో మాత్రం దర్శకుడు కథపై ఫోకస్ పెట్టాడు. ద్వితియార్థంలో బలమైన కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఆ తర్వాత ప్రతాప్ మారిపోవడం.. ఆస్తిపై కీలక నిర్ణయం తీసుకోవడం, ఈ తర్వాత నడిచే డ్రామా ఆకట్టుకుంటుంది. ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సింగీతం మరోసారి తన మార్క్ చూపించాడు. ఇక చివరిలో విజయ్ దేవరొకండ ఎంట్రీ సర్ప్రైజ్ చేస్తుంది. పార్ట్ 2 ఉంటుందన్నట్లుగా విజయ్ ఈ గెస్ట్ ఎప్పీరియన్స్ ఉంది. మరి సీక్వెల్ ఉంటుందా లేదా? అనేది చూడాలి. ఎవరెలా చేశారంటే..సినిమాలో ప్రధాన పాత్రలు పోషించినవారంతా కొత్తవాళ్లే అయినా చక్కగా నటించారు. చెట్టులో తల్లిని చూసుకునే గౌరి పాత్రలో అహల్య ఒదిగిపోయింది. అయితే ఆమె డబ్బింగ్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. నెగెటివ్ షేడ్స్ ఉండే ప్రతాప్ పాత్రలో అయాన్, రేణూ పాత్రలో షాలిని తమదైన సహజ నటనతో మెప్పించారు. రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. సినిమాకు వాళ్ల పాత్రలే చాలా కీలకం. సీనియర్ నటి తులసికి ఈ సినిమాలో మంచి పాత్ర లభించింది. అతిథి పాత్రలు చేసిన అనుదీప్, విజయ్ దేవరకొండతో పాటు మిగిలినవారు కూడా తమ పాత్రల పరిధిమేర బాగానే చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమా మొత్తం పాటలే ఉంటాయి. మాటలను కూడా పాటలుగా ట్యూన్ చేసిన తీరు బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఆయన కెరీర్లో ఇదొక డిఫరెంట్ చిత్రంగా నిలుస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగోలేదు. ఊరుతో పాటు సినిమాలో వేసిన ప్రతి సెట్.. ఆర్టిఫియల్గానే కనిపిస్తాయి తప్ప.. ఎక్కడ కూడా సహజంగా కనిపించవు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ధనుష్-శివ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్?
సినీ రంగంలో క్రేజీ కాంబినేషన్పై ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి కొత్త కాంబోకు శ్రీకారం పడనుందా అంటే కోలీవుడ్లో అవుననే సమాధానమే వస్తోంది. కథానాయకుడిగా, దర్శకుడు, నిర్మాతగా బిజీగా ఉన్న నటుడు ధనుష్. ఈయన ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ తనను వెతుక్కుంటూ వస్తున్న మంచి కథలను వదులు కోవడం లేదు. తాజాగా దర్శకుడు శివ చెప్పిన కథ నచ్చడంతో అందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సూర్య కథానాయకుడిగా శివ ఇంతకు ముందు దర్శకత్వం వహించిన కంగువ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న శివ నటుడు అజిత్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే ఆ చిత్రం ఇప్పట్లో తెరకెక్కే అవకాశం లేక పోవడంతో ధనుష్ తో చిత్రం చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ సంస్థ ఇటీవల కోలీవుడ్లో చిత్రాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుందని చెప్పవచ్చు. ఇటీవల అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు శివ దర్శకత్వంలో రూపొందించబోతున్నది యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈచిత్రం కోసం నటుడు ధనుష్ 2027 జనవరి నుంచి కాల్ షీట్స్ కేటాయించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు అన్నది గమనార్హం. -
OG 2 Update: ‘ఓజీ’ మళ్లీ వస్తున్నాడు..ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG). ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్గా చేశాడు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. గతేడాది సెప్టెంబరులో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ పవన్ ఫ్యాన్స్కి మాత్రం ఆకట్టుకుంది. ఈ చిత్రానికి పార్ట్ 2 చేసే అవకాశం ఉందని ప్రమోషన్స్లోనే చెప్పాడు సుజీత్. ఓజీ’ ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని పవన్ కల్యాణ్ కూడా వెల్లడించారు. అయితే పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ఇద్దరు క్లారిటీ ఇవ్వలేదు. రాజకీయంగా పవన్ బిజీ కావడంతో ఓజీ 2 రావడం కష్టమే అని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులకు శుభవార్త చెప్పాడు పవన్. ‘ఓజీ 2’అప్డేట్ ఇచ్చాడు.‘ఇచ్చిన మాట ప్రకారమే ఆయన చేస్తారు. అయితే ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు. విదేశాల నుంచి సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత చర్చలు మొదలవుతాయి’ అంటూ పవన్కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ చేసింది. దీంతో ఓజీ 2 కచ్చితంగా ఉంటుందనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. అయితే ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం సుజిత్.. నానితో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ షూటింగ్ని కూడా ప్రారంభించారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఓజీ2 ప్రాజెక్టును మొదలు పెట్టాలని సుజిత్ భావిస్తున్నాడట. As promised, he will. The timing, he will let us know. Once @Sujeethsign returns from abroad, we will discuss.#OG2— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 11, 2026 -
ఓటీటీ అయినా ఓకే.. అదే నా లక్ష్యం : భైరవి
‘‘కొత్త మలుపు’లో కుటుంబ భావోద్వేగాలు, వినోదం, కామెడీ, సస్పెన్స్ వంటి అన్ని వాణిజ్య అంశాలున్నాయి. యువతరానికే కాదు... కుటుంబ ప్రేక్షకులకూ మా చిత్రం నచ్చుతుంది’’ అని భైరవి ఆర్థ్యా అన్నారు. గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నేడు(జూన్12) విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం హీరోయిన్ భైరవి ఆర్థ్యా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కొత్త మలుపు’లో నా పాత్ర పేరు వరలక్ష్మి. కోనసీమకు చెందిన అమాయకమైన గ్రామీణ యువతి తను. చాలా స్వేచ్ఛగా, మనసుకు నచ్చినట్టు జీవించే అమ్మాయి. ఈ సినిమా కోసం నాకు భాషే పెద్ద సవాలుగా మారింది. తెలుగు నేర్చుకున్నప్పటికీ గోదావరి ప్రాంత యాసను పట్టుకోవడం అంత సులభం కాదు. అలాగే వర్షాకాలంలో షూటింగ్ జరగడంతో వాతావరణ పరిస్థితులు కూడా కొంత ఇబ్బంది కలిగించాయి. అయితే టీమ్ అందరి సహకారంతో ఆ సవాళ్లను అధిగమించగలిగాను.ఇక మంచి కథ, పాత్ర బాగుంటే సినిమా అయినా, ఓటీటీ ప్రాజెక్ట్ అయినా నటించేందుకు నేను సిద్ధమే,నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయడం నా లక్ష్య’అని పేర్కొన్నారు. -
సింగ్ గీతంలాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు: నిర్మాత నాగ్ అశ్విన్
‘‘సింగీతం శ్రీనివాసరావుగారు 14 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం వహించిన చిత్రం ‘సింగ్ గీతం’. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు’’ అని నిర్మాత నాగ్ అశ్విన్ తెలిపారు. ఆయాన్, అహల్యా బమ్రూ జంటగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించిన చిత్రం ‘సింగ్ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘ఏడాదిగా నేను, దేవిశ్రీ ప్రసాద్గారు, మా టీమ్ అందరం సింగీతంగారితో ప్రయాణం చేసి, ఇలాంటి సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందించాం. సింగీతంగారి స్టైల్లో చేసిన మరో సరికొత్త ప్రయోగం ఇది. నేను 10 ఏళ్ల వయసులో ‘ఆదిత్య 369’ సినిమా చూసి, స్ఫూర్తి పొందాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసి మరో 10 ఏళ్ల కుర్రాడు కూడా స్ఫూర్తి పొందాలన్నది మా ఆశ’’ అని పేర్కొన్నారు. -
స్పెషల్ గెస్ట్..?
ముత్తువేల్ పాండియన్తో చేతులు కలపనున్నారట హృతిక్ రోషన్. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జైలర్’. 2023లో విడుదలైన ఈ సినిమా సూపర్హిట్గా నిలిచింది. ప్రస్తుతం రజనీ, నెల్సన్ల కాంబినేషన్లోనే ‘జైలర్’కు సీక్వెల్గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది.ఈ సినిమాలోని ఓ స్పెషల్ గెస్ట్ రోల్ను హృతిక్ రోషన్ చేయనున్నారని తెలిసింది. ఈ నెల 22, 23 తేదీల్లో ఈ సినిమా చిత్రీకరణ కోసం హృతిక్ రోషన్ చెన్నై చేరుకుంటారని, రజనీ–హృతిక్ కాంబినేషన్లోని కీలక సన్నివేశాలను నెల్సన్ చిత్రీకరిస్తారని సమాచారం. -
సినిమాల్లోకి కత్రినా కైఫ్ రీఎంట్రీ..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మళ్లీ సినిమాల్లోకి అడుగుపెడుతున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆమె టీమ్ పూర్తిగా ఖండించింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చేసింది.కొడుకు విహాన్ కౌశల్ జననం తర్వాత కత్రినా పూర్తిగా తన కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చింది. గత రెండేళ్లుగా కత్రినా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తన భర్త విక్కీ కౌశల్, కొడుకు విహాన్తో విహార యాత్రలు చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఆనందిస్తోంది.తాజాగా 2027 ద్వితీయార్థంలో వెండితెరపైకి తిరిగి వస్తారనే ఊహాగానాలు నెట్టింట వైరల్ అయ్యాయి. అలాగే ఓటీటీ ప్రాజెక్ట్తో అడుగుపెడతారనే వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని ఆమె టీమ్ స్పష్టం చేసింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చేసింది. దాంతో రీఎంట్రీ లేదని తేలిపోయింది. ఇక తన నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా కత్రినా విజయవంతంగా రాణిస్తున్నారు. ఆమె సొంత కాస్మోటిక్స్ బ్రాండ్ ‘కే బ్యూటీ’ భారతీయ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, వ్యాపార రంగంతో పాటు తన వ్యక్తిగత జీవితంలో కూడా కత్రినా బిజీగా ఉన్నారు. -
ఓటీటీకి టాలీవుడ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగా కొత్త కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉన్నాయి. శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాల సందడి ఉంటుంది. తెలుగు నేరుగా ఓటీటీ చిత్రాలు రాకపోయినప్పటికీ.. వెబ్ సిరీస్లు మాత్రం వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటేస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇసాకపట్నం. టైటిల్ వింటేనే విశాఖ నేపథ్యంలోనే కథ ఉండనుందని అర్థమవుతోంది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డిబొర్రా నిర్మించారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు. ఈ సిరీస్లో ఏడు ఎపిసోడ్స్ ఉంటాయని తెలిపారు. ఈ సిరీస్లో నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజాచెంబోలు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వర్షన్ అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్టైటిల్స్తో 240కి పైగా దేశాల్లోని ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. -
ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. ఒక్క రోజే 21 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో కూడా థియేటర్లలో పెద్ది హవా కొనసాగుతోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి షురూ అవుతుంది. ఈ నెల 12న ఫ్రైడే రోజున చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సింగ్ గీతం, భారత భాగ్య విధాత, పోలీస్ కంప్లైంట్, కొత్త మలుపు లాంటి సినిమా బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.ఇక ఈ శుక్రవారం ఓటీటీల విషయానికొస్తే సూర్య కరుప్పు(తెలుగులో వీరభద్రుడు)పై ఆసక్తి నెలకొంది. భూత్ బంగ్లా లాంటి బాలీవుడ్ మూవీపై కూడా ఆడియన్స్లో క్రేజ్ ఉంది. వీటితో రమణి కల్యాణం అనే తెలుగు సినిమా సైతం ఓటీటీలో సందడి చేయనుంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్లు కూడా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్తో పాటు హాలీవుడ్ నుంచి సినిమాలతో పాటు పలు ఆసక్తికర వెబ్ సిరీస్లు అందుబాటులోకి రానున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్ భూత్ బంగ్లా (హిందీ సినిమా) - జూన్ 12ఐ యామ్ ఫ్రాంకెల్డా (స్పానిష్ మూవీ) - జూన్ 12ది పాలిగమిస్ట్(వెబ్ సిరీస్)- జూన్ 12అవుట్ లాస్ట్ ది జంగిల్-(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12ది రెస్ట్ ఈజ్ ఫుట్బాల్- సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12అమెజాన్ ప్రైమ్ రాఖ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 12 కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 12 విజిల్(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 డాగ్51(ఫ్రెంచ్ సినిమా)- జూన్ 12 ఓవర్ యువర్ డెడ్ బాడీ(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 ఎవరీ ఇయర్ ఆఫ్టర్(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12జియో హాట్స్టార్ ద్రిదమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 12 అలైస్ అండ్ స్టీవ్- సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12 బిలో డెక్ మెడిటెరియన్-సీజన్ 11(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12ఆహా ష్ సీజన్ 3 (తెలుగు సిరీస్) - జూన్ 12జీ5మై హూ నా (హిందీ రియాలిటీ షో) - జూన్ 12తార్ఖతా (బెంగాలీ సిరీస్) - జూన్ 12లయన్స్ గేట్ ప్లే షెల్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12 విక్కీ క్రిస్టీ బార్సిలోనా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 12సన్ నెక్ట్స్రమణి కల్యాణం(తెలుగు సినిమా)- జూన్ 12హెబీవో మ్యాక్స్దె విల్ కిల్ యూ(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 -
ఆ రోజుల్లో రొమాన్స్ కామన్.. ఇప్పుడేమో వేధింపులు: పెద్ది వివాదంపై మధుబాల
రామ్ చరణ్ పెద్ది సినిమా హిట్ టాక్తో పాటు.. వివాదానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. దీంతో మూవీ మేకర్స్ జాన్వీ కపూర్ ఓవర్ గ్లామర్ సీన్స్ అన్ని తొలగించారు. డైరెక్టర్ బుచ్చి సైతం క్షమాపణలు చెప్పారు. జాన్వీ కపూర్ సన్నివేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఏదేమైనా విమర్శలు రావడంతో ఆ సీన్స్ మూవీ నుంచి తీసేశారు. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు హీరోయిన్స్ స్పందించారు. తాజాగా ఈ లిస్ట్లో మరో నటి కూడా చేరిపోయింది. సినిమాల్లో మహిళల పాత్రలపై ప్రేక్షకుల అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయని నటి మధుబాల అన్నారు. గతంలో చాలా సినిమాల్లో శృంగారభరిత సన్నివేశాలు చాలా ఉన్నాయని తెలిపారు. అప్పుడు రాని అభ్యంతరాలు.. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.ఈ సందర్భంగా 1991లో తాను నటించిన ఫూల్ ఔర్ కాంటే చిత్రాన్ని ప్రస్తావించారు. ఈ సినిమాలో ఎక్కువగా అమ్మాయిలను ఈవ్ టీజింగ్ తేసే సన్నివేశాలు ఉన్నాయని తెలిపారు. ఈ చిత్రంలో కొన్ని పాటలతో పాటు కాలేజీ క్యాంపస్లో అమ్మాయిని వెంబడించడం, ఆటపట్టించడం లాంటి సీన్స్ రొమాంటిక్గా చిత్రీకరించారని మధు వివరించారు. కానీ ఈ సినిమాపై అప్పట్లో ఎలాంటి విమర్శలు రాలేదని వెల్లడించారు. ఆ దశాబ్దంలోనే అతిపెద్ద హిట్లలో ఒక చిత్రంగా నిలిచిందని మధుబాల అన్నారు. పాత సినిమాల్లో శృంగార భరిత సన్నివేశాలు ఒకప్పుడు సర్వసాధారణంగా ఉండేవని పేర్కొన్నారు. అప్పట్లో చాలా అరుదుగా విమర్శలు వచ్చేవని తెలిపారు. ఆ రోజుల్లో ప్రేక్షకులు అలాంటి సన్నివేశాలను ప్రేమ వ్యక్తీకరణగా చూసేవారని మధుబాల తెలిపారు. ఆ సినిమాలో తన పాత్ర కూడా తన వెంటపడే వ్యక్తితోనే ప్రేమలో పడుతుందని ఆమె అన్నారు. అయితే ఇప్పుడు అదే ప్రవర్తనను ప్రేమగా కాకుండా.. వేధింపులుగా చూస్తున్నారని చెప్పారు. సినిమాలు తరచుగా సామాజిక అంశాలను ప్రతిబింబిస్తాయని మధు అన్నారు. ఒకప్పుడు ప్రేక్షకులు ఈవ్-టీజింగ్ సీన్స్ ఆమోదించేవారని.. కానీ ఇప్పుడు వేధింపులుగానే చూస్తున్నారని ఆమె అన్నారు. సినిమా అనేది సమాజంతో ముడిపడి ఉందని.. మారుతున్న సాంస్కృతిక విలువలకు అనుగుణంగా సినిమాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని మధుబాల అన్నారు. -
తీరు మారని బాలయ్య.. బర్త్ డే రోజు కూడా అదే పని
సందర్భం ఏదైనా సరే తన తీరు ఇంతే అనే హీరోల్లో బాలయ్య ముందుంటారు. గతంలో చాలాసార్లు తన కోపంతో ఎంతోమంది అభిమానులపై చేయి చేసుకున్నారు. అలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. తాజాగా మరోసారి తన దురుసు ప్రవర్తన చూపించారు. బాలయ్య బర్త్ డే వేడుకలకు వచ్చిన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం ఆస్పత్రిలో ఫొటో సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులంతా సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అదే సమయంలో కొందరు అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లండి అంటూ అభిమానులపై దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ బాలయ్య ఇక మారడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కోపంతో ఊగిపోయిన బాలయ్యనందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం ఆస్పత్రిలో జరిగిన ఫొటో సెషన్లో స్వల్ప తోపులాట జరిగింది. కొందరు అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో బాలకృష్ణ తీవ్ర అసహనానికి లోనయ్యారు. "వెనక్కి వెళ్లండి" అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.… pic.twitter.com/BlBT0gWpSQ— ChotaNews App (@ChotaNewsApp) June 11, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ మెప్పించింది.ఈ మూవీ రిలీజై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కేవలం ఏడు రోజుల్లోనే రూ.345 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ కలెక్షన్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో 400 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీలో జగపతి బాబు, శివరాజ్కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో మెప్పించారు. BOX OFFICE CHAMPION 💥💥#Peddi collects a gross of over 345 CRORES WORLDWIDE in 7 days ❤🔥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/5p6FrjrmUv— PEDDI (@PeddiMovieOffl) June 11, 2026 -
'కార్నర్ సీట్.. ఓయో రూమ్.. ఈ రోజుల్లో అంతే'..అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీవాన మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ రోజుల్లో లవ్ గురించి మాట్లాడారు. నేటి తరం లవ్ అంటే జనాల్లేని థియేటర్లకు వెళ్లి.. కార్నర్ సీట్లో కూర్చొని సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత రెండుసార్లు షాపింగ్ చేశాక.. నేరుగా ఓయో రూమ్లోనే ఎండ్ అవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి యువత ప్రేమ గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి.ఇది విన్న హీరో విశ్వక్ సేన్.. అంటే ఏంటి సార్ నాకు తెల్వదు అంటూ ఫన్నీగా మాట్లాడారు. మీకు ఎవరితో ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాను చూశారని యాంకర్ ప్రశ్నించగా.. ఇప్పుడు ఆ పేరు చెబితే బాగోదు.. వాళ్లకు మనవలు, మనవరాలు కూడా ఉన్నారంటూ సరదాగా మాట్లాడారు.కాగా.. హర్షిత్, స్మేహ ప్రధానపాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం దీవాన. ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఏఏఏ సినిమాస్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో అల్లు అరవింద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. #VishwanSen: ఈరోజు మీ Oneside Love Story చెప్పాలి...#AlluArvind: ఒక్కటా... రెండా... 😂ఈ మధ్య LOVE:జనం లేని సినిమాలకి వెళ్ళి...2 Shopping లు చేసుకొని..OYO లో End అవుతుంది.. pic.twitter.com/Kv4KvS17sQ— Movies4u Official (@Movies4u_Officl) June 11, 2026 -
‘సింగ్ గీతం’పై చిరు ట్వీట్
లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన కొత్త మూవీ ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ చిరంజీవి ట్వీట్ చేశాడు.‘శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు..తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ నెల 12 వ తేదీన సింగ్ గీతం సినిమా విడుదల అయ్యి, ఇండియన్ సినిమాలో మరొక మైలురాయి గా నిలుస్తుందని, పెద్ద విజయం సాధించాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.అలాగే ఇలాంటి పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత నాగ్ అశ్విన్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకవైపు ఆ నాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు, మరోవైపు ఈ తరం ఆలోచనలను ప్రతిబింబించే నాగ్ అశ్విన్..వీరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.అలాగే ఈ చిత్రానికి, నాకెంతో ఇష్టమైన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరింత ఉత్సాహాన్ని కలగజేస్తుంది. నాగ అశ్విన్ కి, స్వప్న సినిమా, వైజయంతి మూవీస్కి,అలాగే ఈ చిత్రం లో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని చిరంజీవి ట్వీట్ చేశాడు. "శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు"తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు.అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ… pic.twitter.com/tA6rvr14Il— Chiranjeevi Konidela (@KChiruTweets) June 11, 2026 -
భారీగా డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ రావట్లేదు.. ఆరోపణలపై వరలక్ష్మీ స్పందన
ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్కుమార్పై దర్శకుడు సంజీవ్ మేగోటి సంచనల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో వరలక్ష్మీ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ . ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వరలక్ష్మి తమకు సహకరించడం లేదని, లక్షలకు లక్షల డబ్బులు తీసుకొని కూడా ప్రమోషన్స్కి రావడం లేదని ఆయన ఫైర్ అయ్యాడు. దీనిపై తాజాగా వరలక్ష్మీ స్పందించింది. అవసరమైన సమయాల్లో తాను టీమ్ కి అందుబాటులో ఉన్నానని, దర్శకుడి ఆరోపణలపై స్పందించి ఈ వివాదం పెద్దది చేయడానికి తనకు ఇష్టం లేదని చెప్పింది. ఈ మేరకు ఇన్స్టా స్టోరీలో ఓ నోట్ పెట్టింది.‘నన్ను దేనికైతే పిలిచారో, వాటన్నింటికీ నేను హాజరయ్యాను. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు నాపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో నాకు పూర్తిగా తెలియదు, కాబట్టి వాటిపై పూర్తి అవగాహన లేకుండా స్పందించడం సరికాదు. కొన్ని విషయాల్లో నాకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అందుకే చిత్రబృందం చేస్తోన్న ఆరోపణల గురించి బహిరంగంగా చర్చించాలని అనుకోవడం లేదు’ అని వరలక్ష్మీ అన్నారు. అంతేకాదు మరో పోస్ట్లో ‘కొన్ని కుక్కలు అరుస్తాయి. కానీ కరవవు. నేను అరవను.. కానీ కరుస్తా’ అంటూ పరోక్షంగా సంజీవ్కి కౌంటర్ ఇచ్చింది. -
ప్రభాస్తో ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా దర్శకుడు ఆదిత్య ధర్ కలయికపై వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ గురించి ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. వాళ్లిద్దరూ కలిశారనేది నిజం. కొన్ని ఐడియాస్ షేర్ చేసుకున్నారనేది కూడా నిజం. కానీ ఈ కాంబినేషన్ పై ఎలాంటి కన్ ఫర్మేషన్ లేదు. ఇదే విషయాన్ని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు దర్శకుడు సందీప్ వంగాతో స్పిరిట్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఫౌజీ సెట్స్ పై ఉంది. వాటితో పాటు కల్కి-2 సినిమా పనులు కూడా కొనసాగుతున్నాయి. అనంతరం సలార్-2 కూడా లైన్లో ఉంది. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్య ప్రభాస్ మరో కొత్త ప్రాజెక్ట్కు కాల్షీట్లు కేటాయించే పరిస్థితి లేదు. ఇక ఆదిత్య ధర్ విషయానికి వస్తే.. ఆయనకు ఇప్పటికే జియోతో మరో చిత్రానికి కమిట్మెంట్ ఉంది. జీ స్టూడియోస్ కూడా ఆయనతో కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఓటీటీలో విడుదలైన ధురంధర్-2 (ది రివెంజ్) రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ ఫ్రాంచైజీ ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అందువల్ల ప్రభాస్ – ఆదిత్య ధర్ కాంబినేషన్ పై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. వీళ్ల మధ్య ఎలాంటి కథా చర్చలు జరగలేదు. కానీ కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం వీళ్లను కలిపే ప్రయత్నం చేస్తున్నాయన్నది మాత్రం నిజం. -
'మీ రాకా కోసం ఎదురు చూస్తున్నా..' బన్నీకి రామ్ చరణ్ రిప్లై
అల్లు అర్జున్ పెద్ది రివ్యూకు రామ్ చరణ్ స్పందించారు. మీరు మాకు శుభాకాంక్షలు చెప్పడం మాకు టీమ్కు చాలా ప్రత్యేకమన్నారు. మీ సినిమా రాకా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. మీరు మాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇటీవల పెద్ది వీక్షించిన అల్లు అర్జున్ సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు. నిన్న రాత్రి సినిమా చూసిన ఆయన ఈ రోజు ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, నటన,అదిరిపోయే స్టెప్పులతో అలరించాడని అన్నారు. నా బ్రదర్ని చూసి నిజంగా ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. ఈ ప్రశంసలన్నింటికి చరణ్ నిజమైన అర్హుడని ప్రశంసించారు. జాన్వీ కపూర్, జగపతి బాబుతో పాటు ఇతర నటీనటులు చాలా బాగా నటించారు. చరణ్ను అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టేలా చేసిన దర్శకుడు బుచ్చిబాబుకి ప్రత్యేక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు.ఇక పెద్ది సినిమా విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. Thank you, Bunny @alluarjun ❤️Your wishes mean a lot to me and the entire #Peddi team.Lots of love. Looking forward to #Raaka ❤️ https://t.co/I3cq8lmhf5— Ram Charan (@AlwaysRamCharan) June 10, 2026 -
రామ్ చరణే వచ్చాడు.. మీరెందుకు రారు మేడం?.. వరలక్ష్మిపై డైరెక్టర్ ఫైర్
సినీ నటి వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ సంజీవ్ మేగోటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని సినిమా ప్రమోషన్స్కు రాకపోవడంపై ఆయన మండిపడ్డారు. నిర్మాతల బాధలు తనకు తెలుసని అన్నారు. ఈ బాధ ఆమెకు కూడా తెలుసన్నారు. ఆమె సరస్వతి మూవీ కోసం మూడు నెలలు డబ్బింగ్కు రాకుండా ఆపేశారని ఆరోపించారు.డబ్బులు తీసుకుని ప్రెస్మీట్కు రాకపోవడమేంటని సంజీవ్ ప్రశ్నించారు. ప్రెస్మీట్కు రమ్మని నేను ఆమెను అడుక్కున్నానని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూవీ షూటింగ్కు ఆమె సహకరించారు.. కానీ ప్రమోషన్స్ ఎగ్గొట్టడం కరెక్ట్ కాదన్నారు. ఆమెకు షూటింగ్లో చేతికి గాయం అయితే కూడా మేమే కాంప్రమైజ్ అయ్యామని తెలిపారు.రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో పెద్ది మూవీ కోసం ప్రమోషన్స్లో పాల్గొన్నారని సంజీవ్ గుర్తు చేశారు. మీడియా ముందుకొచ్చి రామ్ చరణ్ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారని తెలిపారు. వాళ్లు చాలా గ్రేట్.. ఇటీవల సింగీతం శ్రీనివాసరావు దాదాపు 94 ఏళ్ల వయసులో తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చారని అన్నారు. మీరెందుకు రారు వరలక్ష్మి శరత్కుమార్ గారు అని ఆమెను డైరెక్టర్ ప్రశ్నించారు. డబ్బుల కోసం మాత్రం ఆమె మేనేజర్ రోజు కాల్ చేస్తాడని.. ఆమె మాత్రం ప్రమోషన్స్కు రాదన్నారు. కాగా.. వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో పోలీస్ కంప్లైంట్ అనే మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
పెద్ది వివాదం.. జాన్వీ కపూర్ రోల్పై ఆదా శర్మ కామెంట్స్..!
ప్రస్తుతం టాలీవుడ్లో రామ్ చరణ్ పెద్ది వివాదం హాట్ టాపిక్గా మారింది. జాన్వీ కపూర్ సీన్స్పై అభ్యంతరాలు రావడంతో మూవీ టీమ్ ఇప్పటికే వాటిని తొలగించింది. దీనిపై డైరెక్టర్ బుచ్చిబాబు సైతం క్షమాపణలు కోరారు. అభ్యంతరకర సీన్స్ను తొలగించినట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నిత్యామీనన్, జయా బచ్చన్ లాంటి వాళ్లు రియాక్ట్ అయ్యారు. తాజాగా ది కేరళ స్టోరీ ఫేమ్ ఆదా శర్మ కూడా స్పందించింది.హీరోయిన్లు పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని ఆదా శర్మ సూచించింది. అయితే తాను ఇంకా పెద్ది సినిమా చూడలేదని తెలిపింది. అందుకే ఆ విషయంపై నేను మాట్లాడడం సరికాదని పేర్కొంది. కానీ పాత్రల ఎంపిక అనేది మనపైనే ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఈ బాధ్యత కేవలం నటీమణులదే కాదని.. నటులు, దర్శకులు, నిర్మాతలు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం చాలా దూరం వరకు వెళ్తుందని ఆదా శర్మ అభిప్రాయపడింది.కాగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో వచ్చిన పెద్ది మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం జాన్వీ కపూర్ రోల్పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆమెను కేవలం గ్లామర్ చూపించేందుకు మాత్రమే పెట్టారా? అని విమర్శించారు. అంతేకాకుండా కొన్ని సీన్స్ మరింత ఓవర్గా ఉండడంతో మరింత వ్యతిరేకత వచ్చింది. దీంతో మేకర్స్ ఆ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించారు. -
మా సినిమాలో ‘ట్రాన్స్ జెండర్స్’ కష్టాలను చూపించాం: సునీల్ కుమార్ రెడ్డి
‘సమానత్వం ఉందని చెప్పుకునే మన దేశంలో ట్రాన్స్ జెండర్స్ విషయంలో తీవ్రమైన వివక్ష ఎదురవుతోంది. ట్రాన్స్ జెండర్స్ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కానీ అవి పోలీస్ స్టేషన్స్ లో కేసులుగా నమోదు కావడం లేదు. కోర్టుల దాకా వెళ్లి జడ్జిమెంట్ పొంది శిక్షలు పడటం లేదు. ఇప్పటిదాకా ఒక్క ట్రాన్స్ జెండర్ కేసు కూడా ఏ కోర్టులోనూ తుది తీర్పు వచ్చి శిక్ష పడలేదు. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. ఫస్ట్ టైమ్ ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్ సినిమాలోనే ఒక ట్రాన్స్ జెండర్ కేసులో పూర్తి న్యాయం జరిగినట్లు చూపిస్తున్నాం’ అన్నారు ప్రముఖ దర్శకనిర్మాత పి.సునీల్ కుమార్ రెడ్డి. రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్. ఈ చిత్రంలో ఎల్ బి శ్రీరామ్, ఎస్తర్ నార్నోన్హ, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతీ నిగమ్ తో పాటు రియల్ ట్రాన్స్జెండర్ యాక్టర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. హిమ రాథోడ్ హీరోయిన్ గా , చంద్రముఖి , లైలా వంటి ప్రముఖ యాక్టివిస్టులు , గే యాక్టివిస్ట్ విష్ణు తేజ నటించారు. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు.సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఒక కొత్త తరహా కంటెంట్ చూడాలనుకునే ప్రేక్షకులు మా సినిమాకు రావొచ్చు. పుణెలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మా సినిమాకు బెస్ట్ ఫిలిం అవార్డ్ దక్కింది. ఫిలిం ఫెస్టివల్స్ కు మాత్రమే ఇలాంటి సినిమాలు పరిమితం కావొద్దు. జనాల మధ్యలో డిస్కషన్ కు రావాలి అనేది మా ఉద్దేశం. గే అండ్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ గురించి నేను చేసిన చిత్రమిది. సెన్సార్ విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాం’ అన్నారుతెలంగాణ స్టేట్ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా మాట్లాడుతూ - మా హక్కుల కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నాం కానీ మాకు సరైన వేదిక ఎక్కడా లభించలేదు. డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు మా సమస్యల ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించడం హ్యాపీగా ఉంది. మేము నటులము కాము. కానీ మా జీవితంలో మేము ఎలా ఉంటామో అలాంటి పాత్రలనే డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ చిత్రంలో తెరకెక్కించారు. మేము ఈ సినిమాలో మా నిజ జీవిత పాత్రలనే పోషించాం. ఈ సినిమా ద్వారా మేము సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నాం’ అన్నారు.గే కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ విష్ణు మాట్లాడుతూ.. గే కమ్యూనిటీ కోసం దాదాపు 12 ఏళ్లుగా పోరాడుతున్నాను. మన సినిమాల్లో గే క్యారెక్టర్స్ ను కామెడీ కోసం ఉపయోగించడం చూశాం. కానీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కు వచ్చే అనేక చిత్రాల్లో ఎంతో డెప్త్ గా గే కమ్యూనిటీ సమస్యలను తెరకెక్కించడం నేను గమనించాను. ఇతర రాష్ట్రాల్లో గే లైఫ్ మీద ఇన్ డెప్త్ మూవీస్ సీరియస్ అప్రోచ్ తో వచ్చాయి. ఆ సినిమాల వల్ల అక్కడి సమాజం గే కమ్యూనిటీని చూసే విధానం మారిపోయింది. తెలుగులో ఫస్ట్ టైమ్ అలాంటి ప్రయత్నం డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన మాతో ట్రావెల్ చేసి మా జీవితాన్ని దగ్గరగా గమనించారు. ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు మీ సపోర్ట్ దక్కాలి. ఈ చిత్రంతో మా జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నాము. అన్నారు.ట్రాన్స్ జెండర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సనా ఖాన్ మాట్లాడుతూ..మా జీవితాలు ఎలా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. బయట ప్రపంచం చూడని మా జీవిత ప్రయాణాన్ని, మా సమస్యలు, భావోద్వేగాలను ఈ చిత్రంలో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డిగారు చూపించారు. మేము ఏంటి అనేది కాకుండా మా ప్రతిభ అందరికీ తెలియాలి. ఇంకా మాకు మరిన్ని అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు. -
దర్శక దిగ్గజానికి దర్శకధీరుడు నివాళి
దర్శక దిగ్గజం భారతీ రాజా మరణంపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ఆయన తన సహజమైన, రాజీపడని కథనంతో సినీరంగంలో ఒక విప్లవం సృష్టించారని కొనియాడారు. మా అందరికీ నిజమైన మార్గదర్శిగా నిలిచారన్నారు. ఆ మరపురాని గ్రామీణ కథలు, ఆ నిర్భయమైన దృక్పథం, ఆయన తెరపైకి తీసుకువచ్చిన వాస్తవికత సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. ఆయన అసాధారణమైన కృషిని, వారసత్వాన్ని వీక్షించడం, స్మరించుకోవడం మనందరికీ గౌరవమని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా భారతీ రాజా మరణం పట్ల రాజమౌళి తన సంతాపం వ్యక్తం చేశారు.కాగా.. వయో, అనారోగ్య సమస్యలతో దర్శక దిగ్గజం భారతీ రాజా కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ అంతా షాకింగ్కు గురైంది. తమిళనాడు సీఎం విజయ్ సైతం ఎమోషనల్ అయ్యారు. భారతీరాజాకు నివాళులర్పిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పలువురు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు భారతీ రాజాకు సంతాపం ప్రకటించారు. Bharathiraja garu was a true pioneer who revolutionized cinema with his raw and uncompromising storytelling. Those unforgettable rural narratives, that fearless vision and the authenticity he brought to the screen will live on forever.It was an honour to witness and celebrate…— rajamouli ss (@ssrajamouli) June 10, 2026 -
రెండేళ్లుగా ఖాళీ.. పిచ్చిదానిలా ప్రవర్తించినా సరే..: దీప్తి ఎమోషనల్
దీప్తి సునయన.. ఒకప్పుడు యూట్యూబ్లో సెన్సేషన్.. కవర్ సాంగ్స్, డబ్ స్మాష్తో పాపులర్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్బాస్ రెండో సీజన్లో పాల్గొంది. అమాయకత్వం, చిలిపితనంతో అభిమానులను సంపాదించుకున్న ఈ నటి అప్పట్లో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు కలిసిమెలిసి ఉన్న వీరిద్దరూ 2022లో బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటినుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు.టైంపాస్ చేస్తున్న దీప్తిఇటీవలే షణ్ముఖ్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి కొత్తింట్లో కొత్త జీవితం ప్రారంభించాడు. మరోపక్క ఈ మధ్యే ఓ ప్రైవేట్ సాంగ్ చేశాడు. అలాగే ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఇటు దీప్తి సునయన మాత్రం పనిని పక్కనపెట్టేసి జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తోంది. మధ్యమధ్యలో గుళ్లుగోపురాలు కూడా తిరుగుతోంది. అయితే ఆమె ఏ ప్రాజెక్టులు చేయకపోయినా తనపై ప్రేమను అలాగే కొనసాగిస్తున్న అభిమానులకు తాజాగా కృతజ్ఞతలు తెలిపిందీ బ్యూటీ.ఏం చేశానని ఇంత ప్రేమ?'గత 10 ఏళ్లుగా మీరు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేను ఎలా ఉన్నా ప్రేమించారు. పిచ్చిగా ప్రవర్తించినా ఇష్టపడ్డారు. ప్రతిదానిలో నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంతటి స్వచ్ఛమైన ప్రేమను పొందేందుకు నేను ఏం చేశానో నాకే తెలీదు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నిజం చెప్పనా.. నాకు పని చేయడానికి ఒంట్లో శక్తి లేదు. రెండేళ్లుగా విశ్రాంతి తీసుకోవడంలోనే గడిపేశాను. అయినా మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మళ్లీ వర్క్లో బిజీ అవమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరిచ్చే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది.ఆ ప్రయత్నంలోనే ఉన్నా..నేను ఎందుకిలా డీలా పడిపోయానో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నేను మళ్లీ పూర్తి ఉత్సాహంతో మీ ముందు నిలబడతాను. నేను ఏ పనీ చేయకపోయినా సరే.. నన్ను ప్రేమిస్తున్నందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు, నాకోసం నిలబడినందుకు థాంక్యూ సో మచ్' అని దీప్తి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.చదవండి: వరుస కష్టాలు.. నాకే ఎందుకిలా జరుగుతోంది?: శ్రీజ కొణిదెల -
వరుస కష్టాలు.. నాకు ఎందుకింత క్షోభ?: శ్రీజ కొణిదెల
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల తన కష్టాలపై తొలిసారి పెదవి విప్పింది. చాలాకాలంపాటు తను అనుభవించిన బాధను బయటకు చెప్పుకుంది. ఎట్టకేలకు ఆ బాధ నుంచి బయటకు వచ్చేశానంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. "నాకే ఎందుకిలా జరుగుతోంది? ఎందుకింత బాధ అనుభవిస్తున్నాను? ఒకదాని వెంట మరొకటి వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయేంటి? నేనేం పాపం చేశానని ఇంత క్షోభ అనుభవిస్తున్నాను? అని చాలారోజులు నాలో నేనే మథనపడ్డాను. ఆలోచనల్లో క్లారిటీనేను బాధితురాలిని అని బాధపడుతూ కూర్చున్న నేను నెమ్మదిగా ఆ భావన నుంచి బయటకు వచ్చాను. మన జీవితమేంటి.. ఇలా ఉంది! అని బాధపడటానికి బదులుగా దాన్ని మార్చుకునేందుకు ఏం చేయగలం? అని తెలుసుకోవడమే అసలైన మార్పు అని తెలుసుకున్నాను. 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్' వల్ల నాలో ఆ మార్పు మొదలైంది. నా ఆలోచనల్లో క్లారిటీ వచ్చింది. జీవితం ప్రశాంతంగా మారింది. నేనేంటో తెలుసుకున్నాను.తప్పు తెలుసుకున్నా..ఒకప్పుడు నా లైఫ్లో జరిగిన తప్పులే నా గుర్తింపును నిర్ధారించాయనుకున్నాను. కానీ, అది తప్పని తెలుసుకున్నాను. బాధ నాలో ఒక భాగమే కానీ, అదే జీవితం కాదని తెలిసొచ్చింది. మనిషిలో ఇంకా ఎన్నో లేయర్స్ ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంటుంటే చాలా బాగుంది" అని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు గుండె లోతుల్లో బాధను అనుభవించిన తాను ఇప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నానంది. ఈ పోస్ట్కు నిహారిక కొణిదెల స్పందిస్తూ.. "మై సూపర్ ఉమెన్" అని కామెంట్ పెట్టింది.పెళ్లిశ్రీజ కొణిదెల 2007వ సంవత్సరంలో శిరీష్ భరద్వాజ్ను పెళ్లి చేసుకుంది. ఏడాది తిరిగేలోపు వీరికి కూతురు నివృతి జన్మించింది. కానీ కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2011లో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి పుట్టింటికి తిరిగొచ్చేసింది. 2014లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. 2016లో నటుడు కల్యాణ్ దేవ్ను రెండో పెళ్లి చేసుకుంది శ్రీజ. వీరికి 2018లో కూతురు నవిష్క జన్మించింది. కానీ ఈ దాంపత్య జీవితం కూడా ఎంతోకాలం సాగలేదు. 2022లో వీరు విడిపోయారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) చదవండి: R సెంటిమెంట్.. భారతీరాజా గురించి ఈ విషయాలు తెలుసా? -
కూల్ కూల్గా... బిజీ బిజీగా...
హమ్మయ్యా... వేసవి ముగుస్తోంది. ఇప్పటి వరకూ భగ భగమంటూ తన ప్రతాపం చూపించిన సూర్యుడు ఇప్పుడు కాస్త చల్లబడుతున్నాడు. ఎండల తీవ్రత కారణంగా ఇప్పటి వరకూ సినిమా చిత్రీకరణల్లో కాస్త ఆచి తూచి పా ల్గొన్న నటీనటులు ఇప్పుడు వేగం పెంచారు. ఈ నేపథ్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో షూటింగ్స్ సందడి నెలకొంది.ప్రస్తుతం పలు సినిమాలు హైదరాబాద్తో పా టు పరిసరప్రాంతాల్లో చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. ఓ వైపు నాగార్జున, వెంకటేశ్, రవితేజ వంటి సీనియర్ హీరోలతో పా టు మరోవైపు ప్రభాస్, మహేశ్బాబు, ఎన్టీఆర్, గోపీచంద్, శ్రీవిష్ణు వంటి యంగ్ హీరోలు ప్రస్తుతం తమ సినిమాల చిత్రీకరణలతో బిజీ బిజీగా ఉన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏయే చిత్రాల షూటింగ్స్తో కూల్ కూల్గా... బిజీ బిజీగా ఉన్నారో చూద్దాం....అల్యూమినియం ఫ్యాక్టరీలో...అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘నా సామి రంగా’. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. 2025లో ఆయన హీరోగా మిస్ అయినప్పటికీ ‘కూలీ, కుబేర’ వంటి సినిమాల్లో కీలక పా త్రల్లో కనిపించారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాగార్జున కెరీర్లో వందో చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని తమిళ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. తన సినీ ప్రయాణంలో ఓ మైలురాయిగా నిలవనున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సీనియర్ నటి టబు కూడా నటిస్తున్నారు.సాధారణంగా స్టార్ హీరోల సినిమాలంటే భారీ హడావుడి ఉంటుంది. కానీ, ఈ చిత్రం విషయంలో చిత్రబృందం చాలా గోప్యత పా టిస్తోంది. ఎలాంటి అధికారిక ప్రకటన, హడావుడి లేకుండానే చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నాగార్జునతో పా టు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కార్తీక్. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎమోషనల్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చూడని ఒక విభిన్నమైన లుక్లో నాగార్జున కనిపించనున్నారు.సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయట. ఆధునిక హాలీవుడ్ చిత్రాల్లో వాడే ‘డి–ఏజింగ్’ సాంకేతికతను ఈ సినిమా కోసం వాడుతున్నారు. దీని సాయంతో నాగార్జునను వెండితెరపై మళ్లీ 25 ఏళ్ల యువకుడిగా చూపించబోతున్నారు దర్శకుడు. తమ అభిమాన హీరోని ‘శివ’, ‘హలో బ్రదర్’ నాటి లుక్లో చూస్తామంటూ అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట కార్తీక్. ‘నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే’ వంటి సినిమాల తర్వాత నాగార్జున–టబు మళ్లీ కలిసి నటిస్తుండటంతో ఇటు ట్రేడ్ వర్గాల్లో అటు సినిమా ప్రేమికుల్లో ఈ మూవీపై క్రేజ్ పెరిగింది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని టాక్. నాగార్జున కెరీర్లోనే వందో చిత్రంగా ఓ మైలురాయిగా రూపొందుతోన్న ఈ మూవీలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పా త్రల్లో మెరుస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం లేదు. ఈ మూవీ టైటిల్ విషయానికి వస్తే ‘కింగ్ 100, లాటరీ కింగ్, కింగ్ 100 నాటౌట్’ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.రాజేంద్ర నగర్లో... హీరో దగ్గుబాటి వెంకటేశ్ గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ అయింది. ఈ మూవీ ద్వారా రూ. 300 కోట్ల క్లబ్లోకి చేరారు వెంకటేశ్. ఈ మూవీ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్గారు’ సినిమాలో కీలకమైన వెంకీ గౌడ పా త్రలో సందడి చేశారు వెంకటేశ్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే 47). ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీనిధీ శెట్టి హీరోయిన్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ మూవీ నిర్మిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ఈ సినిమాలో వెంకటేశ్ మార్క్ కామెడీతో పా టు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసిన చిత్రబృందం తాజా షెడ్యూల్లో నిమగ్నం అయింది. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో షూటింగ్ జరుపుకుంటోంది.వెంకటేశ్తో పా టు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట త్రివిక్రమ్. వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి చిత్రాలకు రచయితగా పని చేసిన త్రివిక్రమ్... తొలిసారి ఆయన్ను డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని వెంకటేశ్ తన ఖాతాలో వేసుకుంటారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దసరా కానుకగా అక్టోబరు 16న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే సంకల్పంతో మేకర్స్ ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. డబుల్ ధమాకా.... వరుస పా న్ ఇండియా ప్రాజెక్ట్స్తో జెట్ స్పీడ్లో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ఆయన ప్రస్తుతం ‘ఫౌజీ, స్పిరిట్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఫౌజీ’ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.ఈ మూవీలో జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ముఖ్యమైన పా త్రలుపోషిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ మూవీ తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ పా ల్గొనకపోయినప్పటికీ ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండుగ సందర్భంగా అక్టోబరులో ‘ఫౌజీ’ విడుదల కానుంది. ⇒ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న మరో పా న్ ఇండియన్ మూవీ ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ హీరోయిన్. ప్రకాశ్రాజ్ కీలక పా త్రపోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ ప్రోడక్షన్స్, టీ–సిరీస్ బ్యానర్స్పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘స్పిరిట్’ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లోని అజీజ్ నగర్లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో హీరో ప్రభాస్ పా ల్గొంటున్నారు. ఆయనతో పా టు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను తీస్తున్నారట సందీప్ రెడ్డి వంగా. ‘‘స్పిరిట్’ చిత్రంలో తన కెరీర్లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు ప్రభాస్. ఈ మూవీని తన మార్క్ యాక్షన్, ఎమోషన్స్తో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు సందీప్ రెడ్డి. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడతో పా టు చైనీస్, జపనీస్, కొరియన్ సహా మొత్తం 8 భాషల్లో 2027 మార్చి 5న విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. శంషాబాద్లో... మహేశ్బాబు హీరోగా నటిస్తున్న తాజా పా న్ ఇండియన్ మూవీ ‘వారణాసి’. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. ఈ మూవీలో రాముడిగా, రుద్రగా కనిపించనున్నారు మహేశ్బాబు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభ అనే ప్రతినాయకుడి పా త్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లో శరవేగంగా జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరణ జరుపుతున్నారు రాజమౌళి. ఈ షెడ్యూల్లో మహేశ్బాబుతో పా టు కీలక తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన క్యారెక్టర్పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్కు అత్యద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ‘వారణాసి’ సైన్స్ ఫిక్షన్ ట్రావెల్ టైమ్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇందులో రామాయణం ఎపిసోడ్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది కూడా.ఇదిలా ఉంటే... ఈ సినిమా స్టోరీ ఏంటనే విషయాన్ని రచయిత విజయేంద్ర ప్రసాద్ రివీల్ చేయడం చర్చనీయాంశం అయింది. ‘‘రాముడికి, కుంభ కర్ణుడికి మధ్య జరిగే యుద్ధం ‘వారణాసి’. టైటిల్ టీజర్లో కుంభ కర్ణుడు, రాముడు, ఆంజనేయుడి తోక, తోక మీద రథం కనిపించాయి కదా... ఈ ఎపిసోడ్ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఒక 30 నిమిషాల సీక్వెన్స్ ఇండియాని షేక్ చేస్తుంది’’ అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. డ్రాగన్ టైమ్ ‘దేవర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిల్ కపూర్, బిజూ మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రానా, అన్షుమన్ పుష్కర్, సిద్ధాంత్ గు΄్తా, ప్రభాస్ శ్రీను, శత్రు, శివ, భిమల్ జీత్ ఒబెరాయ్ తదితరులు ఇతర కీలక పా త్రలుపోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పా న్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. అక్కడి స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఎన్టీఆర్పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని విడుదల చేసిన ‘డ్రాగన్’ టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది.‘దేవుడు నాకు ఓ గొప్ప వరం ఇచ్చాడు... ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం’, ‘నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ల ముఖాలు రావు... మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనబడతాయి.. ΄÷రపాటున కూడా నా కల్లోకి రావొద్దు’ అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగులు ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్లో ఉన్నాయి. ‘‘డ్రాగన్’ కథ గోల్డెన్ ట్రైయాంగిల్ప్రాంతంలోని అంతర్జాతీయ అఫీమ్ (ఓపియం) అక్రమ వ్యాపారం నేపథ్యంలో సాగుతుంది. ఎన్టీఆర్ ఇందులో లూగర్ అనే పా త్రలో అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన అస్సాసిన్–ఇన్–చీఫ్గా కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల కానుంది. నవ్వులు డబుల్ హీరో శ్రీ విష్ణు సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుంటాయి. ఆయన నుంచి వచ్చిన పలు సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. హీరో శ్రీవిష్ణు– డైరెక్టర్ రామ్ అబ్బరాజులది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజ వరగమన’. 2023 జూన్ 28న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి వినోదం అందించడంతో పా టు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది.‘సామజ వరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, సుదర్శన్ కీలక పా త్రలుపోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పా టు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు. ‘సామజ వరగమన’ చిత్రానికి మించి డబుల్ వినోదాన్ని అందించనున్నట్లు మేకర్స్ తెలిపారు.యాక్షన్... ఎమోషన్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోపీచంద్ 34’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ ఈ మూవీ ద్వారా హీరోయిన్గా టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. గోపీచంద్–అనార్కలితో పా టు ఇతర తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట వెంకట్.‘‘గోపీచంద్ 34’ చిత్రం ద్వారా 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఒక సరికొత్త కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుంది. వి. వెంకట్కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం అయినప్పటికీ ఒక బలమైన స్క్రిప్ట్ను రూపొందించారు. గోపీచంద్ను పూర్తి యాక్షన్, ఎమోషన్స్తో కూడిన పా త్రలో చూపిస్తున్నారు ఆయన. ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. గోపీచంద్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘భరత వర్ష’. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘నిన్ను కోరి, మజిలీ, ఖుషి’ చిత్రాల ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పా త్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మŠస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల అనుబంధాలు, భావోద్వేగాలతో ముడిపడిన ఈ యాక్షన్ మూవీలో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించనున్నారు రవితేజ. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్రతో పా టు సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక వంటి నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట శివ నిర్వాణ. ఈ నెల 3న విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘‘ఇరుముడి’ చిత్రంలో యాక్షన్ ప్రధానంగా ఉన్నప్పటికీ అద్భుతమైన కథ ఉంది. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్... వంటి అంశాలు అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూపోషించని విభిన్నమైన పా త్రను ‘ఇరుముడి’లోపోషిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది.– డేరంగుల జగన్ మోహన్ -
యూత్ఫుల్ ఎంటర్టైనర్గా సిద్ధుగాడి లవ్ స్టోరీ
మనోజ్ కుమార్, మోహన సిద్ధి, , శృతి శంకర్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న సినిమా సిద్ధుగాడి లవ్ స్టోరీ. ఈ మూవీకి రమేష్ చెరుకూరు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రసాద్ ల్యాబ్లోజరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, దామోదర ప్రసాద్, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, దర్శకులు వి. సముద్ర, రామ్ ప్రసాద్, నిర్మాత అశోక్ కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, రాజేందర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు.నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..'పవన్ కల్యాణ్ డైలాగ్లో వచ్చిన సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్ ఎంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో.. అదే విధంగా ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా చేరువ అవుతుందని నమ్ముతున్నా. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చిత్ర బృందానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. డల్లాస్ నుంచి వచ్చి ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రమేశ్ భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నా' అన్నారు.తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ..'ఈ చిత్రాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన సినీ పెద్దలందరికీ ధన్యవాదాలు. రమేశ్ నన్ను సంప్రదించినప్పుడు ఆయనలో ఉన్న సినిమా పట్ల అభిరుచి, పట్టుదల నాకు అర్థమైంది. అందుకే ఆయనకు పూర్తి సహకారం అందించాను. మా దర్శకుల సంఘ సభ్యుల సినిమాల విడుదలకు సహకరించాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ సినిమా చిత్ర బృందాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నా' అన్నారు.ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..'కొత్తవారితో మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయం. టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టపడి పని చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. దర్శకుడు రమేష్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. -
జాన్వీ కపూర్ సీన్స్ కట్.. పెద్ది మేకర్స్ సాహసం చేస్తున్నారా?
పెద్ది మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాన్వీ కపూర్ సీన్స్పై తీవ్రమైన విమర్శలు రావడంతో ఆ సన్నివేశాలను తొలగించారు. ఈ విషయాన్ని పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు స్వయంగా ప్రకటించారు. పెద్దిలో జాన్వీ రోల్కు అపార్థం చేసుకున్నారని అన్నారు. ఈ కథను ఉప్పెన కంటే చాలా భిన్నంగా రాసుకున్నానని వెల్లడించారు. అయితే విమర్శలు రావడం వల్లే జాన్వీ కపూర్ సీన్స్ను తొలగిస్తున్నామని డైరెక్టర్ స్పష్టం చేశారు.కొత్త సీన్స్ యాడ్?అయితే జాన్వీ కపూర్ సీన్స్ తొలగించినప్పటికీ పెద్ది మేకర్స్ మరో ఆలోచనలో ఉన్నారట. మరిన్ని కొత్త సన్నివేశాలు యాడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే సెన్సార్ అయిన వర్షన్ నుంచి జాన్వీ కపూర్ సీన్స్ మాత్రమే కాకుండా మరికొన్ని సీన్స్ తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా మరిన్ని సీన్స్ యాడ్ చేయనున్నారని సమాచారం. సెకండాఫ్లో కొన్ని సీన్స్ తొలగించి రామ్ చరణ్, జగపతి బాబు మధ్య ఎమోషనల్ సీన్స్ యాడ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే మళ్లీ సెన్సార్ చేయించి థియేటర్స్లో పెద్ది కొత్త వర్షన్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. -
తండ్రి-కొడుకుల అనుబంధంతో ‘ఐ యామ్ హ్యాండ్సమ్’
తండ్రి-కొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన హృదయాన్ని హత్తుకునే చిత్రం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ (Since 2009). దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ స్వయంగా కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని K ఫిలిమ్స్ బ్యానర్ పై, మహేష్ గుడారు సమర్పణలో కేదార్నాథ్ నిర్మించారు. అన్విష కథానాయికగా నటించిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో చిత్ర ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.ముఖ్య అతిథి కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, ‘సినిమా విజయానికి అసలు బలం కంటెంట్. మంచి కథ, బలమైన భావోద్వేగాలు ఉన్న సినిమాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. దుర్గా దేవ్ నాయుడు నటుడిగా, దర్శకుడిగా ఒకేసారి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం. ఆయనలో ఉన్న ప్రతిభ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. సినీ పరిశ్రమలో టాలెంట్కు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు, హీరో దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ, ‘నేను ఏలూరుకు చెందినవాడిని. మా నాన్న అరటిపండ్ల వ్యాపారి. చిన్న పట్టణం నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకే నేను నాకు నేనే స్టార్ అని గర్వంగా చెప్పుకుంటాను. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా తీశాను. ఒకవేళ నచ్చకపోతే ఇంకా మంచి సినిమా తీస్తాను అని నిజాయితీగా చెబుతున్నాను. ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. చిత్ర యూనిట్లోని ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. డబ్బుల గురించి ఆలోచించకుండా సినిమా కోసం కష్టపడ్డారు. నిర్మాత కేదార్నాథ్, కేఎల్ దామోదర్ ప్రసాద్ ఎంతో సహకారం అందించారు. తెలుగు ప్రేక్షకులతో పాటు మంచి కంటెంట్ కోసం ఎదురుచూసే ప్రతి సినీ ప్రేమికుడికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు.ట్రైలర్ విడుదల అనంతరం చిత్ర బృందం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించింది. విలేకరులు అడిగిన ప్రశ్నలకు దర్శకుడు దుర్గా దేవ్ నాయుడు, నిర్మాత కేదార్నాథ్, సాంకేతిక నిపుణులు సమాధానాలు ఇచ్చారు. సినిమా అవుట్పుట్ అద్భుతంగా వచ్చిందని, ముఖ్యంగా చివరి 45 నిమిషాలు ప్రతి ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురి చేస్తాయని, థియేటర్ల నుంచి తృప్తిగా బయటకు వస్తారని వారు తెలిపారు. ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ కుటుంబ బంధాలు, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల సమ్మేళనంగా ప్రేక్షకులను అలరించేందుకు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రామ్ చరణ్ పెద్ది వసూళ్లు.. ఐదు రోజుల్లోనే క్రేజీ మార్క్
రామ్ చరణ్ పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రీమయర్స్తో మొదలైన పెద్ది ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. ఈ మూవీ రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటేసింది. ఓవరాల్గా ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు.రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్గా, రెజ్లర్గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. BOX OFFICE CHAMPION #PEDDI continues his dominance 🔥🔥#Peddi collects a gross of over 315 CRORES + GROSS WORLDWIDE in 5 days ❤🔥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/e5fZ2thleb— PEDDI (@PeddiMovieOffl) June 9, 2026 -
న్యాయం కోసం ప్రేమికుడి పోరాటమే ‘ఒక కోర్టు కేస్’
సూర్యాన్ష్, తనీషా మిశ్రా జంటగా నటించిన సినిమా ‘ఒక కోర్టు కేస్’. నాగేష్ పూడి, ముకేష్ పూడి సమర్పణలో ఓపెన్ ఐస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గణేష్ పూడి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా జూలై 17న రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ను హీరో శ్రీకాంత్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ప్రేమలో జరిగే ఘటనలను లీగల్ డ్రామాగా మలచడం ఆసక్తిగా అనిపించింది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ప్రేమలో మోసపోయిన ఒక యువకుడు తనకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధానాంశం’’ అన్నారు సూర్యాన్ష్. ‘‘ప్రేమలో బ్రేకప్ తర్వాత జరిగే ప్రతీకారం అనే అంశాన్ని కూడా ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు గణేష్ పూడి. ‘‘ఈ కథ విన్నప్పుడే సాధారణ ప్రేమకథ కాదని అర్థమైంది’’ అని తనీషా మిశ్రా పేర్కొన్నారు. -
'వీడి అనుమానంలో మనం విడిపోయేలా ఉన్నాం'.. ఫుల్ కామెడీగా టీజర్
యంగ్ హీరో రాగ్ మయూర్ నటించిన లేటేస్ట్ సైకాలాజికల్ కామెడీ ఎంటర్టైనర్ అనుమాన పక్షి. ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజీవ్ చిలకా, రాజేశ్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మించారు. ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ప్రతి విషయానికి అనుమానపడే వ్యక్తిగా హీరో రాగ్ మయూర్ కనిపించారు. ప్రతిదాన్ని అనుమానించే హీరో పెళ్లి విషయంలో ఏం చేశారనే నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో ప్రిన్స్, అనన్య, చరిత్, బ్రహ్మజీ, రాశి, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
కుక్కను చంపేశారు.. భోరున ఏడ్చేసిన హీరోయిన్ (వీడియో)
తాను ఎంతో ప్రేమగా చూసుకునే కుక్కను దారణంగా కొట్టి చంపారంటూ నటి మంజరి ఫడ్నిస్ భోరున ఏడ్చేశారు. 2019 నుంచి ఆ కుక్క తన అపార్ట్మెంట్లోనే ఉండేదని.. సొసైటీకి చెందిన ఓ వ్యక్తి అత్యంత కీరాతకంగా దాన్ని కొట్టి చంపేశాడని ఆమె ఆరోపించింది. మంజరి ఫడ్నిస్ తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో ఒక కుటుంబం వదిలేసి వెళ్లిన ఓ కుక్కను సొసైటీ సభ్యులు చేరదీశారు. దానికి ‘మైకీ’ అని పేరు పెట్టి సొసైటీలోనే పెంచుకుంటున్నారు. మంజరి కూడా దానికి స్నానం చేయించడం, గ్రూమింగ్ చూసుకోవడం లాంటివి చేసేవారు. అయితే కొన్ని రోజుల క్రితం మైకీ కనిపించకుండా పోయింది. పోస్టర్లు వేయించి వెతికినా కూడా దొరకలేదు. బేస్మెంట్ ఏరియాలో మైకీ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో, సోసైటీకి చెందిన ఓ వ్యక్తి దారుణంగా కొట్టి చంపేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ మంజరి ఎమోషనల్ అయ్యారు. భవిష్యత్తులో ఇలా ఎవరూ జంతుహింసకు పాల్పడకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మంజరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హీరోయిన్లు భూమి పెడ్నేకర్, వేదిక, డింపుల్ హయతి సహా పలువురు నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జంతు క్రూరత్వ నిరోధక చట్టం కింద దోషులను కఠినంగా శిక్షించాలంటూ మంజరికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా, మంజరి ఫడ్నిస్ తెలుగులో సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం, శుభప్రదం, జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) -
పెద్ది సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనూ రూ. 292.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ స్టార్స్ మాత్రం ఈ సినిమాపై నిన్నటి వరకు స్పందించలేదు. తాజాగా అల్లు అర్జున్ పెద్ది సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు. నిన్న రాత్రి సినిమా చూసిన ఆయన ఈ రోజు ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. (పెద్ది సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)‘నిన్న రాత్రి పెద్ది సినిమా చూశా. రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, నటన,అదిరిపోయే స్టెప్పులు.. ఇలా ప్రతి విషయంలోనూ అద్భుతంగా రాణించాడు. నా బ్రదర్ని చూసి నిజంగా ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. ఈ ప్రశంసలన్నింటికి చరణ్ నిజమైన అర్హుడు. జగపతి బాబుతో పాటు ఇతర నటీనటులు చాలా బాగా నటించారు. జాన్వీ కపూర్కి ప్రేమపూర్వక అభినందనలు. టెన్నికల్ టీమ్కు, నిర్మాతలకు నా అభినందనలు. చరణ్ను అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టేలా చేసిన దర్శకుడు బుచ్చిబాబుకి ప్రత్యేక అభినందనలు’ అని బన్నీ తన ఎక్స్లో రాసుకొచ్చాడు.పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్చరణ్, జాన్వీకపూర్ జోడీగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan. A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the…— Allu Arjun (@alluarjun) June 9, 2026 -
గుండెను మెలిపెట్టే 'ప్రేమ డైరీలో చివరి పేజీలు'
ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో టాలీవుడ్ స్క్రీన్పైకి ఓ బ్యూటీఫుల్ మూవీ రాబోతోంది. పి.వి. అర్జున్ యాదవ్ - అదితి జంటగా, శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్పై పి.వి. నరసింహ యాదవ్ నిర్మాణంలో, హరికృష్ణ పామంజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'ప్రేమ డైరీలో చివరి పేజీలు'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకు ముస్తాబవుతోంది.ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అర్మాన్ మెరుగు అందించిన మెలోడీ ట్యూన్స్, క్యాచీ లిరిక్స్ సంగీత ప్రియులను అలరిస్తూ, సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచాయి. ఈ సినిమాతో పి.వి. అర్జున్ యాదవ్ హీరోగా గ్రాండ్గా పరిచయం అవుతున్నారు. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్, ఆయన నటన ప్రేక్షకులను ఎమోషనల్ జర్నీకి గురిచేస్తాయని, లవ్, ఎమోషన్స్ కలబోసిన ఈ కథలో అర్జున్ యాదవ్ తన నటనతో, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను కట్టిపడేయనున్నాడని మేకర్స్ తెలిపారు. అర్జున్-అదితిల రి కెమిస్ట్రీ సినిమాకు హైలైట్గా నిలవనుందని చెప్పారు. ‘ప్రేమ, భావోద్వేగాలు, మరిచిపోలేని జ్ఞాపకాల సమాహారంగా దర్శకుడు హరికృష్ణ పామంజి ఈ చిత్రాన్ని అద్భుతమైన స్క్రీన్ప్లేతో తెరకెక్కించారు. ప్రతి ఒక్కరినీ క్లైమాక్స్ వరకు కదలకుండా కూర్చోబెట్టేలా ఈ 'చివరి పేజీలు' సాగుతాయి’అని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను, విడుదల తేదీని చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది. -
పెద్ది.. ఎంతపని చేశావ్ బుచ్చిబాబు?
గ్లింప్స్తోనే అంచనాలు పెంచేసిన రామ్చరణ్ పెద్ది వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజైన విషయం తెలిసిందే..! గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చెర్రీ నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ ఇది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్ల గ్యాప్తో బుచ్చిబాబు తీసిన సినిమా కూడా ఇదే. చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన తెలుగు మూవీ ఇదే కావడం మరో ప్రత్యేకం. ఈ సినిమాకు థియటర్లలో ఇప్పటి వరకూ ఐతే.. ఓకే అనే ఫీడ్బ్యాక్ వస్తోంది. స్టోరీ అద్భుతం కాకపోయినా.. మేకింగ్, రామ్చరణ్ యాక్టింగ్, మేకోవర్, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, టెక్నికల్ వాల్యూస్ సినిమాను గట్టెక్కించిందనే టాక్ వినిపిస్తోంది.కాగా.. రిలీజ్కు ముందు తానేదో సొంతంగా స్టోరీ తయారు చేసుకుని తీసిన అద్భుతమైన సినిమా అని బుచ్చిబాబు బిల్డప్ ఇచ్చారు. కానీ.. రెండేళ్ల క్రితం బాలీవుడ్లో వచ్చిన చందు ఛాంపియన్ సినిమాను కొంచెం అటుఇటు తిప్పి తీసిన సినిమా పెద్ది అని టాలీవుడ్ జనాలు తొలి రోజే కనిపెట్టేశారు. చందు ఛాంపియన్ మూవీ చూసిన వారికి ఖచ్చితంగా పెద్ది రీమేక్ మూవీనా అనే డౌట్ రాక మానదు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరో. స్టార్ డైరక్టర్ కబీర్ఖాన్ డైరక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే సమ్మర్లో రిలీజైంది. ఐతే.. ఇది ఓ క్రీడాకారుడి రియల్ స్టోరీ అని మేకర్స్ ప్రకటించారు.(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)చందు ఛాంపియన్ కూడా పీరియాడిక్ మూవీనే. 1960-70లో జరిగిన ఓ బాక్సర్ స్టోరీ ఇది. సేమ్ పెద్దిలో లాగానే ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన పహిల్వాన్ కథ. పెద్దిలో హీరో తొలుత క్రికెటర్, తర్వాత పహిల్వాన్, ఆ తర్వాత పారా స్ప్రింటర్గా మారతాడు హీరో. చందు ఛాంపియన్లోనూ ఇంతే. ఇందులో హీరో తొలుత కుస్తీ వీరుడుగా కనిపిస్తాడు. ఆ తర్వాత మిలటరీలో చేరి బాక్సర్గా అవతారమెత్తుతాడు. అక్కడ యుద్ధంలో బుల్లెట్ తగిలి కాలు పోవడంతో స్విమ్మర్గా మారి పారా ఒలిపింక్స్లో పాల్గొని సత్తా చాటుతాడు. సేమ్ మన పెద్దిలో కూడా హీరో మొదట క్రికెటర్గా.. ఆ తర్వాత పహిల్వాన్గా.. అక్కడ్నుంచి రన్నర్గా మారి పారా ఒలింపిక్లో పాల్గొంటాడు. పెద్ది లాగా ఇది కూడా పీరియాడిక్ మూవీనే. అంతెందుకు చివరికి ప్రోమో కటింగ్ కూడా చందు ఛాంపియన్నే రెఫరెన్స్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే పెద్ది స్టోరీకి విలేజ్ బ్యాక్డ్రాప్ను తగిలించి ఫుల్లుగా ఎమోషన్స్ పండించాడు బుచ్చిబాబు. అలాగే కేజీఎఫ్లో హీరోకి ఎలివేషన్ ఇస్తూ ముక్కలుముక్కులుగా చెప్పడం జరిగింది. చందు ఛాంపియన్ను మక్కీకి మక్కీ దించేయకుండా రెఫరెన్స్గా తీసుకోవడం వరకు బానే ఉందిగాని.. పెద్ది చూసిన వెంటనే ఆ సినిమా ఖచ్చితంగా గుర్తుకు వస్తుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పేలుతున్నాయి. -
హిందీ కంటే సౌత్ సినిమాలే మెరుగ్గా రాణిస్తున్నాయి: కాజల్
వృత్తిపరమైన అంశాల్లో దక్షిణాది చిత్ర పరిశ్రమదే పైచేయి అంటున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు.. ‘నటీ మణులకు ఉత్తరాదిలో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయా? లేక దక్షిణాదిలోనా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి కాజల్ అగర్వాల్ బదులిస్తూ– ‘‘అవకాశాలైతే రెండు చోట్ల (ఉత్తరాది, దక్షిణాది) ఉన్నాయని నేను నమ్ముతున్నాను. కానీ, వృత్తిపరమైన నైపుణ్యం, నిబద్ధత విషయాల్లో మాత్రం దక్షిణాది ఉన్నతమైనది. అద్భుతమైన దర్శకులు, గొప్ప సాంకేతిక నిపుణులు, కథాంశాలు, సృజనాత్మకత మనకు సౌత్లోనే కనిపిస్తున్నాయి. దక్షిణాది సినిమా పరిధి కూడా పెరిగింది. చాలా హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలు మెరుగ్గా రాణిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ మూవీ జూలై 24న రిలీజ్ కానుంది. అలాగే బాలకృష్ణ–గోపీచంద్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్గా, రణ్బీర్కపూర్ ‘రామాయణ’ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో కాజల్ నటిస్తున్నారు. -
ఆ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ని.. ఇప్పుడు హీరో చేశా: విజయ్ సేతుపతి
‘‘పూరి జగన్నాథ్గారి ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమా తమిళ రీమేక్లో జయం రవి (రవి మోహన్ ) హీరోగా నటించారు. ఈ చిత్రంలో నేను జూనియర్ ఆర్టిస్ట్గా నటించాను. ఇప్పుడు పూరిగారి దర్శకత్వంలో నేను హీరోగా ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమా చేయడం సంతోషాన్నిస్తోంది. ఆయన కెరీర్లో ఇది ఒక బెస్ట్ ఫిల్మ్గా నిలుస్తుంది’’ అని విజయ్ సేతుపతి చెప్పారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన చిత్రం ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’. సంయుక్త, టబు, విజయ్కుమార్ ఇతర పాత్రల్లో నటించారు. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మించారు. సోమవారం చెన్నైలో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో టీజర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ–‘‘నిజ జీవిత ఘటనలతో రాసిన కథ ఇది. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు.. చాలా భావోద్వేగాలు కూడా ఉంటాయి’’ అన్నారు. ‘‘పూరిగారు, నా కాంబినేషన్లో చేసిన తొలి స్ట్రయిట్ తమిళ్ సినిమా ఇది’’ అన్నారు చార్మీ కౌర్. ‘‘పూరి జగన్నాథ్గారితో పని చేయాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది’’ అని పేర్కొన్నారు సంయుక్త. ‘‘పూరి జగన్నాథ్గారితో నిర్మాణ బాధ్యతలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత జేబీ నారాయణరావు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడారు. -
నేను కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను: ఎస్.ఎస్. తమన్
‘‘హైదరాబాద్లో ఈ నెల 13న ‘ఓజీ టూర్ ఇండియా’ మెగా మ్యూజికల్ ఈవెంట్ని నిర్వహించబోతున్నాం. ఈ కాన్సర్ట్ పూర్తి మ్యాజికల్గా ఉండబోతోంది. మా ప్లే లిస్ట్ చూస్తుంటే మాకే ఎనర్జీ వస్తోంది. ఫైర్వర్క్స్, ఎల్ఈడీ స్క్రీన్స్ , 3డీ ఎఫెక్ట్స్, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ... అన్నీ అద్భుతంగా ఉంటాయి. గత కొన్ని రోజులుగా నేను కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ షోలో ఫుల్ లెంగ్త్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లు ఉంటాయి’’ అని సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తెలిపారు.ఏసీటీసీ, ఎస్.ఎస్.తమన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఓజీ టూర్ ఇండియా’ మెగా మ్యూజికల్ ఈవెంట్ ఈ నెల 13న హైదరాబాద్లో జరగనుంది. ఈ ఈవెంట్కు సంబంధించిన వివరాలను తెలిపేందుకు హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ–‘‘ఓజీ’ సినిమా అప్రిషియేషన్ సెలబ్రేషన్ ను కొనసాగిస్తూ ‘ఓజీ టూర్ ఇండియా’ను నిర్వహిస్తున్నాం.జూన్ 13న హైదరాబాద్లో, జూలై 11న బెంగళూరులో, ఆగస్టు 15న చెన్నైలో, సెప్టెంబర్ 25న వైజాగ్లో ఈవెంట్లు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం నేను ‘మెగా 158, ఎన్బీకే 111, ఆదర్శ కుటుంబం, లెనిన్, ఇట్లు అర్జున’ వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘తమన్గారితో కలిసి ఈ టూర్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు ఏసీటీసీ నిర్వాహకుడు శరవణన్ వాసు. -
ఊహించలేని మలుపులున్నాయి: ఆకాష్
‘‘విభిన్నమైన పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను. ప్రస్తుతం రొమాంటిక్ అండ్ కామెడీ సబ్జెక్ట్ చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నాను. నటుడిగా కొంత ప్రయాణం చేసిన తర్వాత యాక్షన్ చిత్రాలు కూడా చేస్తాను. ఒకే జానర్కే నన్ను నేను పరిమితం చేసుకోవాలనుకోవడం లేదు’’ అని ఆకాష్ గోపరాజు చెప్పారు.ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా, భైరవి ఆరాధ్య హీరోయిన్గా నటించిన రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ సినిమా ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకాష్ గోపరాజు విలేకరులతో మాట్లాడుతూ–‘‘కోనసీమ నేపథ్యంతో సాగే విలేజ్ లవ్ స్టోరీ ఇది.పల్లెటూరి అందాలు, నవ్వులు, ఎమోషన్స్ , సస్పెన్స్ , ప్రేమ.. ఇలా అన్ని అంశాల మేళవింపుతో రూపొందించాం. నేటి యువత ఆలోచనలు, వారి భావోద్వేగాలకు దగ్గరగా ఉండే చాలా ఎనర్జిటిక్ పాత్ర చేశాను. ఈ సినిమా టైటిల్కు తగ్గట్లే కథలో వచ్చే మలుపులను ప్రేక్షకులు ఊహించలేరు. బాలకృష్ణగారు రాజీ పడకుండా ఈ మూవీ నిర్మించారు. యశ్వంత్ నాగ్ సంగీతం, ఆర్ఆర్ ప్లస్ అవుతుంది. మా అమ్మగారు ఈ సినిమా ఔట్పుట్ పట్ల సంతోషించారు’’ అని చెప్పారు. -
వరలక్ష్మి హారర్ థ్రిల్లర్.. సూపర్స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్
నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం పోలీస్ కంప్లైంట్. ఈ మూవీ హరర్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార గీతాలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి పెంచేశాయి.తాజాగా కృష్ణసాయి, కృతి వర్మలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. సూపర్స్టార్ కృష్ణపై రూపొందించిన ఈ గీతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూపర్స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను వీక్షించిన సూపర్స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చిత్ర యూనిట్ను ప్రత్యేకంగా అభినందించారు. పాట అద్భుతంగా వచ్చిందని ప్రశంసిస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. 'సూపర్స్టార్ కృష్ణ గారి సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కృష్ణపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మెచ్చుకోవడం మా యూనిట్కు ఎంతో గర్వకారణం. ఆయన ఆశీర్వాదాలు మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ చిత్రాన్ని 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లో పూర్తి చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ చుట్టూ కథ సాగుతుంది. హారర్ థ్రిల్లర్ అంశాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ ఉండే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది” అన్నారు. ఈ మూవీలో కృష్ణసాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, కృతి వర్మ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. -
'ఆయనను చూస్తే నా కళ్లలో నీళ్లు తిరిగాయి'.. రామ్ చరణ్ ఎమోషనల్
పెద్ది మూవీ సక్సెస్తో రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ మీట్లో పాల్గొన్న రామ్ చరణ్ తాము పడ్డ కష్టాన్ని పంచుకున్నారు. ఈ సినిమా కోసం టీమ్ అంతా సమష్టిగా కృషి చేశామని తెలిపారు. నిజాయతీగా, మనస్ఫూర్తిగా పని చేస్తే ఏ సినిమా అయినా హిట్ కావాల్సిందేనని అన్నారు. ఇంతటి ఘనవిజయం అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.రామ్ చరణ్ మాట్లాడుతూ..' నచ్చిన పని చేస్తూ మీ అందరి ప్రేమ పొందడం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎవరో పుష్ చేస్తే చేసిన సినిమా కాదు. బుచ్చిబాబు చెప్పిన కథను నమ్మి చేశా. ఈ విషయంలో నేను చాలా సంతృప్తిగా ఉన్నా. చాలా రోజుల తర్వాత నేను థియేటర్లలో సినిమా చూశా. నేను ఊహించని సీన్స్కు కూడా ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం చాలా ఆనందం కలిగించింది. ఇంత మంచి హిట్ అందించిన బుచ్చిబాబుకు, పెద్ది టీమ్కు థాంక్స్. నా లైబ్రరీలో నంబర్వన్గా పెద్ది నిలుస్తుంది. తొలిసారి ఈ కథ విన్నప్పుడే బుచ్చిబాబును హగ్ చేసుకున్నా. నిజాయతీగా పని చేస్తే ఏదైనా హిట్ కావాల్సిందే. పెద్ది సినిమాలో జగపతి బాబుని చూసినప్పుడు.. ఒక ఆర్టిస్ట్గా నా కళ్లలో నీళ్లు తిరిగాయి' అని అన్నారు.కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో పెద్ది మూవీని తెరకెక్కించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది. జగపతిబాబు, శివరాజ్కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం మరింత క్రేజ్ను తీసుకొచ్చింది. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.292 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. -
'మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా'.. స్లమ్డాగ్ యాక్షన్ టీజర్
తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా వస్తోన్న చిత్రం స్లమ్ డాగ్.. 33 టంపుల్ రోడ్. ఈ మూవీకి టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.'ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కొనే జీవితాలు మావి.. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా' అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్లో విజయ్ సేతుపతి ఎంట్రీ, యాక్షన్ సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక సామాన్యుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో ఈ కథ ఉండనుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. టీజర్లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో సంయుక్త, టబు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ రిలీజ్ డేట్ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. -
'మోదీ ఆలోచనే పెద్దికి ఆదర్శం'.. బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది.తాజాగా పెద్ది టీమ్ హైదరాబాద్లో థ్యాంక్ యూ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్కు డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు హీరో రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పెద్ది మూవీ కథకు స్ఫూర్తి ఏంటనే విషయాన్ని రివీల్ చేశారు. ఇది ఒక ఆదర్శమైన కథ అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను బయటి ప్రపంచానికి పరిచయం పెద్ది మూవీ ఉద్దేశమని బుచ్చిబాబు అన్నారు. 2017లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఖేలో ఇండియానే పెద్ది కథకు స్ఫూర్తి అని తెలిపారు. మట్టిలో ఆటగాళ్లను వెతుకుదాం.. ఓట్లలాగే ఇంటింటికి వెళ్లి ఆటగాళ్లను కూడా అడుక్కుందాం అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇండియాకు మెడల్స్ తీసుకొచ్చేలా గ్రామీణ మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడమే ఖేలో ఇండియా ఉద్దేశమన్నారు. భారత జీవన విధానంలోనే ఆట కూడా ఓ భాగమని చెప్పాలనుకున్నా.. అందుకే పెద్దిని మీ ముందుకు తీసుకొచ్చానని అన్నారు. పెద్ది అనేది కమర్షియల్ చిత్రం కాదన్నారు. ఈ మూవీ గ్రామీణ క్రీడాకారుందరికీ ఆదర్శమని బుచ్చిబాబు తెలిపారు. -
పెద్ది పేరుతో ఏకంగా స్కూల్.. ఎక్కడో తెలుసా?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది.అయితే ఈ మూవీ పేరుతో ఏకంగా స్కూల్ ఉందని మీకు తెలుసా? దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియో స్కూల్ను చూసిన ఓ చిన్నారి ది పెద్ది స్కూల్.. నాన్న అది చికిరి చికిరి వాళ్ల స్కూలా అంటూ క్యూట్గా.. అమాయకంగా అడిగింది. ఈ వీడియో యూఎస్లో తీసినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో పెద్ది టీమ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.#ChikiriChikiri Vala School Ah Anta 🔥😂#PEDDI @AlwaysRamCharan pic.twitter.com/LDYLZLZTXQ— SAI CHARANISM ™ 🔥 (@saicharanism1) June 8, 2026 -
థియేటర్లలో పెద్ది.. ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల మార్క్కు దగ్గరకు చేరుకుంది. ఈ వారం కూడా పెద్ది హవానే కొనసాగుతోంది. ఈ ఫ్రైడే రోజు చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సింగ్ గీతం, భారత భాగ్య విధాత, పోలీస్ కంప్లైంట్, కొత్త మలుపు లాంటి సినిమా బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి.ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఓటీటీకి వచ్చేస్తోంది. దీంతో పాటు బాలీవుడ్ మూవీ భూత్ బంగ్లా స్ట్రీమింగ్కు రానుంది. వీటితో పాటు తెలుగులో ష్ అనే తెలుగు వెబ్ సిరీస్ ఆసక్తి పెంచుతోంది. అంతేకాకుండా పలు టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (జూన్ 8 నుంచి 14 వరకు)నెట్ఫ్లిక్స్కలర్స్ ఆఫ్ ఈవిల్ - బ్లాక్ (మూవీ) - జూన్ 10మై ఫ్యామిలీ సీజన్2 (వెబ్సిరీస్) - జూన్ 10స్వీట్ మగ్నోలియాస్ -సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 11ది ఈవిల్ లాయర్ (వెబ్సిరీస్) - జూన్ 11భూత్ బంగ్లా (హిందీ సినిమా) - జూన్ 12ఐ యామ్ ఫ్రాంకెల్డా (స్పానిష్ మూవీ) - జూన్ 12అమెజాన్ ప్రైమ్ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10ద రెస్ట్ ఈజ్ ఫుట్బాల్ (డాక్యుమెంటరీ మూవీ) - జూన్ 10రాఖ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 12కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 12జియో హాట్స్టార్ద్రిదమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 12ఆహాష్ సీజన్ 3 (తెలుగు సిరీస్) - జూన్ 12జీ5మై హూ నా (హిందీ రియాలిటీ షో) - జూన్ 12తార్ఖతా (బెంగాలీ సిరీస్) - జూన్ 12లయన్స్ గేట్ ప్లేషెల్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12విక్కీ క్రిస్టీ బార్సిలోనా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 12ఆపిల్ టీవీ ప్లస్క్రిమినల్ రికార్డ్ (వెబ్సిరీస్) - జూన్ 10 -
‘పెద్ది’ చిత్రానికి మరో బిగ్ షాక్.. అట్రాసిటీ కేసుకు డిమాండ్!
రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రానికి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే సినిమాలోని జాన్వీ కపూర్ పాత్రపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సాధారణ మహిళలే కాకుండా సినిమా హీరోయిన్లు సైతం తెరపై జాన్వీని చూపించిన తిరుని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు కూడా చెప్పి..ఆ సీన్లలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించాడు. అయినా కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వేళ.. చిత్రబృందానికి ఆదివాసీ సంఘాలు షాకిచ్చాయి. (చదవండి: ‘పెద్ది’ వివాదం.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్)సినిమాలో గిరిజనులను కించపరిచేలా సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయంటూ విజయనగరం జిల్లా కలెక్టర్కు, ఎస్పీకి ఆదివాసీ సంఘాలు ఫిర్యాదు చేశాయి. సినిమా మొత్తంలో 15 సార్లు గిరిజనులను కించపరిచేలా పదాలు వాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రబృందంతో పాటు సెన్సార్ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కలెక్టర్, ఎస్పీలకు విజ్ఞప్తి చేశారు. గిరిజన హక్కుల చట్టంలో స్పష్టం చేసిన పదాలనే సినిమాలో అసభ్యంగా వాడడం..వాటినే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇష్టానుసారంగా వినియోగించడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ నాలుగు రోజుల్లో రూ.292.5 కోట్లు వసూలు చేసింది. -
‘పెద్ది’ కాంట్రవర్సీ.. జాన్వీని టార్గెట్ చేయొద్దు: జగపతి బాబు
రామ్ చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి..రికార్డును సృష్టించింది. మరోవైపు అదే స్థాయిలో పెద్దిపై విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన తీరుపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ మహిళలే కాదు సినీ తారలు కూడా జాన్వీ పాత్రను తీర్చిదిద్దిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యా మీనన్, డింపుల్ హయాతీ, అషికా లాంటి తారలు ఈ వివాదంపై స్పందిస్తూ.. సినిమాల్లో హీరోయిన్లను గ్లామర్ బొమ్మలా చూపిండాన్ని తప్పుపట్టారు. తాజాగా పెద్ది సినిమాలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ఈ వివాదంపై స్పందించాడు. సినిమా క్యారెక్టరైజేషన్ విషయంలో నటీనటులను వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం ఏమాత్రం సరికాదంటూ జాన్వీకి అండగా నిలిచాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమా విషయంలో ఆర్టిస్టులను ట్రోల్ చేయొద్దు. పాపం ఆ అమ్మాయి(జాన్వీ కపూర్) జోలికి వెళ్లడం కరెక్ట్ కాదు. తాను సొంతంగా అలా చేయలేదు కాదా? దర్శకుడు ఇలా చెయ్ అంటేనే ఆమె చేస్తుంది. ఇష్టం ఉందో లేదో మనకేమి తెలియదు కానీ దర్శకుడిని నమ్మి వచ్చినప్పుడు.. ఆయన మాట వినాలి. డైరెక్టర్ చెప్పింది చేస్తాం. తన జస్టిఫికేషన్ తనకు ఉంది. కానీ కొన్నిసార్లు అది మిస్ ఫైర్ అవుతుంది. ఈ విషయంలో నేను జాన్వీకపూర్కు సపోర్ట్ చేస్తాను. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు. ట్రోల్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు’ అని జగపతి బాబు అన్నాడు.ఇక తాను పోషించిన అప్పల సూరి పాత్రకు వచ్చిన రెస్పాన్స్ గురించి మాట్లాడుతూ.. పెద్ది’ విడుదలయ్యాక నాకు ఓ పెద్ద డైరెక్టర్ ఫోన్ చేశారు. ‘‘పెద్ది’లో మీరు చాలా గొప్ప పాత్ర చేసినా ఎందుకు ఎవరూ గుర్తించట్లేదు. అదే పాత్రను వేరే భాషకు చెందిన నటులు చేసి ఉంటే బాగా హైలైట్ చేసేవారు. వాళ్లకు 20 సినిమాలు ఆఫర్ చేసేవారు. మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు ఏంటి?’ అని అన్నారు. ఏ ఇండస్ట్రీలో అయినా పరభాష నటులకు ఎక్కువ గౌరవం ఇస్తారు. నేను కన్నడలో చేస్తే అక్కడ బాగా గౌరవిస్తారు. పెద్ది సినిమా కోసం నేను ప్రాణం పెట్టాను. అందుకే గుర్తింపు కోసం అడిగే హక్కు నాకు ఉంది. మిగతా సినిమాలకు నేను ఎప్పుడూ ఇలా అడగలేదు. ‘పెద్ది’ ఇంకా ఆదరణ దక్కాల్సిన చిత్రం. కచ్చితంగా ఆదరణ దక్కుతుంది. ఇందులో పనిచేసిన ప్రతిఒక్కరూ దీన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతారు’ అని అన్నారు. -
ప్రకాశ్ రాజ్కు ఆర్జీవీ మద్దతు.. నాగబాబుకు కౌంటర్
సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై కూడా తరచూ స్పందించే ఆర్జీవీ.. తాజాగా జనసేన నేత నాగబాబు, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన సోషల్ మీడియా వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రకాశ్ రాజ్కు తన మద్దతు తెలుపుతూ పరోక్షంగా నాగబాబుకు చురకలు అంటించాడు.ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘నాయకుడి మాటే శిరోధార్యం. ఏది సరైనదో, ఏది కాదో నాయకుడికే తెలుసు. సందేహాలను పక్కనపెట్టి, ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించాలి’ అంటూ పవన్ కల్యాణ్ ఫోటోని షేర్ చేశాడు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ‘మేము గొర్రెలం కాదు, బానిసలమూ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు. ఏ నాయకుడైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది’ అని నాగబాబుకు కౌంటర్ ఇచ్చాడు. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వ్యవహారంపై తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు. అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరు’ అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.In effect what you mean is , in a democracy, a leader is given a responsible position by people who trusted him to take care of their issues ..He’s not been crowned as a king 🙏 https://t.co/k9OaxI2Mn8— Ram Gopal Varma (@RGVzoomin) June 7, 2026 -
ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్కు రాహుల్ రామకృష్ణ చురకలు!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టాలీవుడ్ నటుల్లో రాహుల్ రామకృష్ణ ఒకరు. కేవలం సినిమా కబుర్లనే కాకుండా సమాజంలో చోటు చేసుకున్న పలు అంశాలపై తనదైన శైలీల్లో స్పందిస్తుంటాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై ఈ కమెడియన్ ఎక్స్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించాడు. మీ గొప్పలు పక్కన పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు నిర్వహించే శాఖల్లోని సమాచారాన్ని వెల్లడిస్తున్నారా? అంటూ పవన్ని నిలదీస్తూ ఎక్స్లో వరుస పోస్టులు పెట్టాడు.‘ PESA 1/70 చట్టం (ది పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్), గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి అడిగి చూపించండి. అటవీకరణ కార్యక్రమాలు మీరు చేశారా? ఓ స్వతంత్ర సంస్థ కన్ఫర్మ్ చేసిన లెక్కల ప్రకారం అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను దాఖలు చేసి గుర్తించిన ఫలితాలను అడుగుతున్నా.' అంటూ చివర్లో ‘జై తెలంగాణ’ అని ట్వీట్ చేశాడు.ఆ తర్వాత మరో ట్వీట్లో ‘మీరు సాధారణంగా చేసే ఆర్భాటాలు పక్కన పెడితే.. మీరు నిర్వహించే ప్రతి శాఖలో సమాచార హక్కు చట్టంలోని క్రియాశీల సమాచారాన్ని బహిర్గతం చేయడానికి సంబంధించిన సెక్షన్ 4.1(బి)ని అమలు చేశారా సార్? నేను మీ అభిమానిగా అడుగుతున్నా.. ప్రశ్నలకు నిరంతరం సమాధానం చెప్పాలి. ప్రశ్నించినందుకు నేను దేశద్రోహిని కాదు’ అని రాహుల్ రామకృష్ణ తనదైన శైలీలో పవన్కు చురకలు అంటించాడు. కాగా,ఇటీవల హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘తెలంగాణ మీ అయ్య జాగీరా ’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ .. హైదరాబాద్లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పెట్టేందుకు ప్రయత్నించగా.. తెలంగాణ పోలీసులు అనుమతించకపోవడంతో అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మినహా తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. తెలంగాణ మేధావులు కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. Apart from your usual bravado, have you implemented section 4.1(b) of proactive disclosure of the Right To Information Act in every department of every position you hold sir?I’m asking because I’m you’re fan and you need to constantly answer our questions— Rahul Ramakrishna (@eyrahul) June 7, 2026Asking questions doesn’t make me an anti national— Rahul Ramakrishna (@eyrahul) June 7, 2026 -
‘పెద్ది’ వివాదం.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
‘పెద్ది’లో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒకవైపు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు జల్లు కురిపిస్తూనే మరోవైపు జాన్వీ పాత్రపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు అయితే తెరపై జాన్వీని చూపించిన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బుచ్చిబాబు వెంటనే స్పందించి..మహిళలకు క్షమాపణలు చెప్పి, ఆ సీన్లను తొలగిస్తామని ప్రకటించాడు. అయినప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు హీరోయిన్లు సైతం జాన్వీని అభ్యంతరకంగా చూపించారని మండిపడుతున్నారు. ఇప్పటికే డింపుల్ హయాతీ, అషికా రంగనాథ్తో పాటు కొంతమంది బాలీవుడ్ తారలు కూడా దీనిపై స్పందించారు. తాజాగా సహజ నటి నిత్యామీనన్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెరపై మహిళలను ఓ ఆట బొమ్మలా చూపించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. తాను పెద్ది సినిమా చూడలేదని, అయినప్పటికీ జాన్వీ కపూర్కి తన మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పారు. సినిమాల్లో మహిళలను వస్తువుతా చూపించడం కేవలం దక్షిణాది చిత్రపరిశ్రమకే పరిమితం కాదని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమాలో ఇదొక ప్రధాన సమస్యగా మారిందని నిత్యా అభిప్రాయపడ్డారు.‘వాణిజ్య పరమైన అంశాలను జత చేయాలనే ఒత్తిడితో మహిళా పాత్రలను శృతిమించి చూపిస్తున్నారు. ఈ విషయంలో హీరోయిన్లే స్వీయ నియంత్రణ పాటించాలి. హద్దు దాటినట్లుగా అనిపిస్తే.. ఆ పాత్రని రిజెక్ట్ చేయాలి. తమని తెరపై ఓ వస్తువులా చూపిస్తున్నారనే అనుమానం కలిగితే వెంటనే నో చెప్పేయాలి’ అని నిత్యా సలహా ఇచ్చారు. పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 236.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. -
చిత్ర పరిశ్రమలో ఇంకా వివక్ష ఉంది.. కాజల్ షాకింగ్ కామెంట్స్
అందం, ఐశ్వర్యం, ఆనందం, ఆసక్తి, ఆకర్షణ, నిరాకరణ, సంతృప్తి, అసంతృప్తి, ఆవేదన అన్నీ కలగలిపిన పరిశ్రమ సినిమా. ఇక్కడ ప్రతిభ, అదృష్టాలను పరీక్షించుకుని ఉన్నంత స్థాయికి చేరుకున్న వారు ఎందరో. తమ కలలను పండించుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నా వారు ఉన్నారు. అదే సమయంలో వివక్ష గొంతెత్తే వారు ఉంటూనే ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు కాజల్ అగర్వాల్ చేరారు. లక్ష్మీకల్యాణం అనే తెలుగు చిత్రంతో కథానాయికిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత వరుసగా అవకాశాలను అందుకుంటూ అగ్ర కథానాయిక స్థాయికి చేరారు. కాజల్ బిజీగా ఉన్న తరుణంలోనే పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి ప్రవేశించారు. అలా ఒక బిడ్డకు తల్లి కూడా అయినా ఈ ఉత్తరాది భామ మళ్లీ నటనపై దృష్టి పెట్టారు. కాజల్ తాజాగా నటించిన ది ఇండియా స్టోరీ చిత్రం జూలై 24న తెరపైకి రానుంది. కమలహాసన్తో కలిసి నటించిన ఇండియన్–3 చిత్రం విడుదల కావలిసి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ సందర్భం వచ్చినప్పుడల్లా గ్లామర్ ను ప్రదర్శిస్తూ అవకాశాల వేటలో పడుతున్నారు. తాజాగా చిత్రపరిశ్రమలో వివక్ష గురించి ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. పారితోషికం విషయంలో ఆడ, మగ మధ్య వివక్ష లేదని చెప్పలేను కానీ ఈ పరిస్థితి మారాలి. సినిమా ఇప్పుడు కార్పొరేట్గా మారిపోతోంది. అయినా ఆడ, మగ మధ్య పారితోషికం విషయంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. నాకు దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆసక్తి ఎక్కువ. నాకు అక్కడ లేని సౌకర్యం దక్షిణాది చిత్ర పరిశ్రమలో కలుగుతుందని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. -
క్యాబ్ డ్రైవర్పై సినీ నటుడు దాడి
హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్పై ఓ సినీ నటుడు చితకబాదిన సంఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడు తెలిపిన మేరకు.. శ్రీహరి అనే క్యాబ్ డ్రైవర్ ఆదివారం తన ట్రిప్ పూర్తి చేసుకొని మరో బుకింగ్ కోసం నాగారం చౌరస్తాలో రోడ్డు పక్కన కారు నిలిపాడు. అదే సమయంలో కారులో వచ్చిన సినీ నటుడు సుప్రీత్రెడ్డి (కాట్రాజ్) వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్నావని ఆగ్రహంతో క్యాబ్ డ్రైవర్ శ్రీహరిని దుర్భాషలాడుతూ చితకబాదాడు. వెంటనే బాధితుడు 100కు డయల్ సమాచారం అందించి, కీసర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
యాక్షన్ రెడీ
నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్కుమార్, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పోలీస్ కంప్లైంట్’. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో సూపర్స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు వీక్షించారు. ‘‘ఈ పాట బాగుంది. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలి’’ అని యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు.‘‘కృష్ణసాయి, కృతి వర్మలపై చిత్రీకరించిన ఈ ప్రత్యేక గీతాన్ని ఇటీవల విడుదల చేయగా, కృష్ణగారి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని సంజీవ్ మేగోటి తెలిపారు. ‘‘మా సినిమాని థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కృష్ణసాయి. -
మళ్లీ విలన్గా?
చిరంజీవి సినిమాలో కన్నడ నటి రచితా రామ్ భాగమయ్యారని తెలిసింది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ‘చిరు 158’ (వర్కింగ్ టైటిల్) అనే యాక్షన్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ నటి అనశ్వర రాజన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.మరో కీలక పాత్రకు కన్నడ నటి రచితా రామ్ను మేకర్స్ సంప్రదించారని, ఈ సినిమాలో ఆమె ఖరారయ్యారని టాక్. అయితే రచిత పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఇక ‘చిరు 158’ చిత్రీకరణ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. చిరంజీవితో పాటు ఈ సినిమా ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమాలో రచిత నెగటివ్ షేడ్స్ ఉన్న కల్యాణి పాత్రలో నటించి, మెప్పించారు. వార్తల్లో ఉన్న ప్రకారం చిరంజీవి సినిమాలోది నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అయితే ఆమె మళ్లీ విలన్గా చేసినట్లు అవుతుంది. -
ట్రెజర్ హంట్ కాన్సెప్ట్ ఆధారంగా...
విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా దర్శ కత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మంచిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు సన్నాహాలు మొదలయ్యాయి.‘‘ఈ సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్కు అనుగుణంగా ఈ ప్రచార యాత్రను ప్లాన్ చేశాం. ప్రతి నగరంలో జరిగే కార్యక్రమంతో ఈ సినిమా ప్రపంచం, అందులోని రహస్యాలు, సాహస అంశాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేయనున్నాం.ఈ ప్రచార యాత్రలో భాగంగా తొలి కార్యక్రమాన్ని ఈ నెల 19న హైదరాబాద్లో నిర్వహించి, ట్రైలర్ లాంచ్ చేస్తాం. ఆ తర్వాత జూన్ 20 నుంచి 23 వరకు ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించనున్నాం. జూన్ 26న వారణాసిలో ఈ సినిమాలోని ‘వీర నాగ’ పాటను రిలీజ్ చేస్తాం. జూన్ 28న హైదరా బాద్లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
వరలక్ష్మి వ్రతానికి ఇరుముడి
అయ్యప్ప స్వామి భక్తుడిగా హీరో రవితేజ నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ‘ఇరుముడి’ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆదివారం నిర్మాతలు తెలిపారు.‘‘భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో అంకితభావం గల తండ్రి పాత్రలో రవితేజ నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. భక్తి, మానవ సంబంధాలు, కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథలో కమర్షియల్ అంశాలను కూడా జోడించి శివ నిర్మాణ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సింగర్ సునీత తనయుడి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా వస్తోన్న చిత్రం కొత్త మలుపు. ఈ మూవీలో భైరవి అర్ధ్యా హీరోయిన్గా నటిస్తోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించగా.. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ..'ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద విజయంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం ఉండేలా కనిపిస్తోంది. ఇందులో ఆకాష్, భైరవి బావ, మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు.దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ..' మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక దిగ్గజం కోదండరామి రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదములు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అని తెలిపారు. -
దురంధర్కు అలా.. పెద్దికేమో ఇలా.. అసలు టాలీవుడ్కు ఏమైంది?
ప్రస్తుతం థియేటర్లలో రామ్ చరణ్ పెద్ది మూవీ సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ మూవీపై సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కథ అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. తనయుడి టాలెంట్ను చూసి చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. పెద్ది కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డారంటూ పొగిడారు.అయితే పెద్దికి మాత్రం టాలీవుడ్ హీరోల నుంచి సపోర్ట్ కరువైంది. కేవలం చిరంజీవి, కొందరు మెగా హీరోలు మాత్రమే రివ్యూలు ఇచ్చారు. సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్స్ వీక్షించి మరి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే మిగిలిన స్టార్ హీరోల నుంచి మాత్రం పెద్దికి ఎలాంటి మద్దతు రావడం లేదు. రణ్వీర్ సింగ్ దురంధర్పై ఒక్కసారిగా ట్వీట్ల వర్షం కురిపించిన తెలుగు హీరోలు.. పెద్ది విషయానికి వచ్చేసరికి గప్చుప్ అయిపోయారు. పెద్ది సినిమాపై ఇప్పటి వరకూ టాలీవుడ్ స్టార్స్ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు తమ అభిప్రాయాలను పంచుకోవడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఇదే చర్చ హాట్ టాపిక్గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి సైతం ఇప్పటి వరకు పెద్దిపై ఎలాంటి ట్వీట్ చేయలేదు. దురంధర్ సినిమాను సపోర్ట్ చేసిన మన హీరోలు.. టాలీవుడ్ మూవీని ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ మొదలైంది. ఇకనైనా మన హీరోలు.. మన సినిమాలకు మద్దతుగా నిలుస్తారో.. లేదో వేచి చూడాల్సిందే. -
రెబల్ స్టార్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. కల్కి-2 క్రేజీ అప్డేట్
కల్కి మూవీతో హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి-2 అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇవాళ చెన్నైలో జరిగిన సింగ్ గీతం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగ్ అశ్విన్ క్రేజీ న్యూస్ షేర్ చేశారు. కల్కి-2 సీక్వెల్ షూటింగ్ షెడ్యూల్పై క్లారిటీ ఇచ్చారు.కల్కి-2 ఇప్పటికే ప్రారంభమైందని నాగ్ అశ్విన్ తెలిపారు. తదుపరి షెడ్యూల్ వచ్చేనెలలో మొదలు కానుందని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీని వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ మూవీని మరింత వేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నాగ్ అన్నారు. ఏప్రిల్ 2027 నాటికి మెయిన్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.కాగా.. మొదటి భాగం కల్కి 2898 ఏడీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకొణె సైతం అభిమానులను మెప్పించింది. కల్కిలో విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రభాస్ కోసం నిర్మాతలు మరింత భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. -
సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా సాంగ్ రిలీజ్
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా చిత్రం సింగ్ గీతం. సంగీతమే ప్రధానంగా ఈ మూవీని తెరకెక్కించారు. 94 ఏళ్ల వయసులో ఈ సినిమాను రూపొందించడం విశేషం. ఈ మూవీ జూన్ 11న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా సింగ్ గీతం మూవీ నుంచి క్రేజీ సాంగ్ విడుదల చేశారు. ఓరి జీవుడా జీవుడా అంటూ సాగా పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. శంకర్బాబు ఆలపించారు. ఈ సాంగ్ను దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. తాజాగా రిలీజైన ఈ పాట మ్యూజిక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటోంది. -
ఓటీటీకి టాలీవుడ్ ఎమోషనల్ డ్రామా..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సూర్య వశిష్ట, దీప్షిక హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఎమోషనల్ డ్రామా రమణి కల్యాణం. ఈ ఎమోషనల్ డ్రామాకు విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. మే 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మించారు.ఈ సినిమా ఓటీటీ సందడి చేసేందుకు వచ్చేస్తోంది. సన్ నెక్ట్స్ వేదికగా ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈనెల 12 నుంచే సన్ నెక్ట్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు.ఈ సినిమా కథేంటంటే.. సంజన(దీప్షిక) చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకున్నా తన పనులు తాను చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ ఓ పబ్ లో సింగర్ గా పనిచేస్తూ ఉంటుంది. నలుగురు పిల్లలు, ఓ బామ్మ.. వాళ్లే సంజన ప్రపంచం. సంజన పనిచేసే పబ్ ఓనర్ కిషోర్(శ్రీనివాసరెడ్డి) ఫ్రెండ్ రాజ్(సూర్య వసిష్ఠ) నడవలేడు. పక్షవాతం వల్ల వీల్ చైర్ కే అంకితం. అనుకోకుండా ఈ ఇద్దరూ ఓ గొడవతో పబ్ లో కలిసి స్నేహితులుగా మారి అనంతరం ప్రేమలో పడతారు. ఎప్పుడూ అతని గతం, గోల్ గుర్తుచేసుకుంటూ బాధపడే రాజ్ సంజన ప్రేమతో పూర్తిగా మారిపోయి సంతోషంగా ఉంటాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే కిషోర్ కి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? మరి సంజన - రాజ్ ల పెళ్లి జరిగిందా? అసలు రాజ్ ఎందుకు వీల్ చైర్ కే పరిమితమయ్యాడు? రాజ్ గతమేంటి? సంజన గతం ఏంటి? సంజనతో ఉండే నలుగురు పిల్లలు ఎవరు? కిషోర్కి రాజ్ గురించి ఏం తెలిసింది అన్నదే ఈ సినిమా కథ.When the perfect match is the one who heals your soul.Stream Ramani Kalyanam on Sun NXT from 12 June!#RamaniKalyanam #TeluguMovies #TFI #SunNXT [Feel Good Movies, Telugu Movies, New Telugu Movies, Deepshika, Surya Vashistta, Romance Movies, Emotional Drama, Poetic Movies,… pic.twitter.com/LL5Wa17mDS— SUN NXT (@sunnxt) June 7, 2026 -
45 ఏళ్లుగా ఆ సినిమా చేయలేకపోయాం: కమల్ హాసన్
కమల్ హాసన్-సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో వచ్చిన ‘పుష్పక విమానం’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్ అయిన తర్వాత సింగీతం శ్రీనివాస రావు మరో కథను కూడా కమల్కు వినిపించాడట. 45 ఏళ్ల క్రితమే ఆ సినిమాను తెరకెక్కించాలని భావించారట కానీ, అది సాధ్యం కాలేదు. దాదాపు 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదే ‘సింగ్ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ని చెన్నైలో నిర్వహించారు. ప్రముఖ హీరో కమల్ హాసన్ ముఖ్య అథితిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన సింగీతం శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ.. ‘సింగ్ గీతం’సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సింగీతం శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడింది. మా తొలి సినిమా అనుకోకుండా తెరకెక్కింది. ఆ తర్వాత నాకు రెండు కథలు వినిపించాడు. అందులో పుష్పక విమానం తెరకెక్కింది. రెండో కథ మాత్రం అలానే ఉండిపోయింది. దాని గురించి 45 ఏళ్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ చేయలేకపోయాం. అదే సింగ్ గీతం. 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సింగీతం శ్రీనివాసరావుకు వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ఆలోచన విషయంలో ఆయన ఇప్పటికీ జెన్ జీ కన్నా ఒక అడుగు ముందే ఉంటాడు. ఆయన నుంచి ఇంకా నేర్చుకుంటున్నా. సింగీతం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయాలని ఉంది’ అని కమల్ అన్నారు. నాకు 20 ఏళ్ల వయసున్నప్పుడు సింగీతం గారితో మొదటిసారి ఈ సినిమా గురించి మాట్లాడాను... మాట్లాడుకుంటున్నాం కానీ చేయలేకపోయాం. ఇప్పుడు నాకు 71... ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. Some Ideas are Ageless - Ulaganayagan #KamalHaasan #SingGeetham pic.twitter.com/fjHwUA5p0O— Sai Satish (@PROSaiSatish) June 7, 2026 -
నేలపై కూర్చుకున్న నాగ్ అశ్విన్.. 'కల్కి' దర్శకుడి వీడియో వైరల్
ఈ రోజుల్లో చిన్న సినిమాలు చేసిన కొద్దిమంది నటులు, దర్శకులే తాము పెద్ద సెలబ్రిటీలమనే రేంజ్లో ఫీల్ అవుతూ గాల్లో తేలిపోతుంటారు. కానీ, ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్తో 'కల్కి 2898 AD' లాంటి గ్లోబల్ పాన్-ఇండియా బ్లాక్బస్టర్ సినిమా తీసిన స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం తన సింప్లిసిటీతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన నిరాడంబరతకు అద్దం పట్టే ఒక అరుదైన ఘటన తాజాగా చెన్నైలో చోటుచేసుకుంది.లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ సమర్పణలో 'సింగ్ గీతం' అనే సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో ఒక ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు కోలీవుడ్ విశ్వనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు రావడంతో వేదికపై మరియు గెస్టుల గ్యాలరీలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. వచ్చిన అతిథులకు, ప్రత్యేక ఆహ్వానితులకు కూర్చోవడానికి సీట్లు సరిపోలేదు. తన సినిమా ఈవెంట్కు వచ్చిన అతిథులకు ఇబ్బంది కలగకూడదని భావించిన నాగ్ అశ్విన్.. ఏమాత్రం ఈగోకు పోకుండా, తాను ఒక స్టార్ డైరెక్టర్ ని అనే విషయాన్ని పక్కన పెట్టి, సోఫాల పక్కనే కింద నేల మీద కూర్చుండిపోయారు. కమల్ హాసన్ లాంటి లెజెండ్ పక్కన కూర్చునే అవకాశం ఉన్నప్పటికీ, అతిథుల సౌకర్యం కోసం నాగ్ అశ్విన్ కింద కూర్చోవడం చూసి అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో నాగ్ అశ్విన్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Producer Nag Ashwin @nagashwin7 at #SingGeetham movie pre release event.. 🙏 pic.twitter.com/NJgolG5BNG— H A N U (@HanuNews) June 7, 2026 -
రామ్ చరణ్కు క్లీంకార సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
మెగా హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం పెద్ది సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. తొలి రోజే హిట్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లపరంగానూ దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ క్రికెటర్గా, రెజ్లర్గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు.పెద్ది సూపర్ హిట్ వేళ ప్రతి ఒక్క అభిమాని ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కూతురు క్లీంకార.. డాడీకి క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చింది. నాన్న.. దిస్ ఈజ్ ఫర్ యూ.. క్లీంకార లవ్ యూ సో మచ్ అంటూ చరణ్ ఇంట్లో పనిచేసే సిబ్బందితో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో వారంతా చికిరి చికిరి సాంగ్కు స్టెప్పులు వేస్తూ కనిపించారు. ఈ వీడియో మెగా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. -
అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. పిల్లలు ఫుల్ హ్యాపీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఓ అభిమాని కోరిన వెంటనే అతని ఆకాంక్షను నెరవేర్చాడు. తన ఇద్దరు పిల్లల కోసం రెండు కుకీస్ పంపమని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా కోరాడు. ఇది చూసిన ఎన్టీఆర్ మీ అడ్రస్ పెట్టు పంపిస్తా అంటూ రిప్లై ఇచ్చారు.అతనికి మాటిచ్చినట్లుగానే తన ఆటోగ్రాఫ్తో కూడిన కుకీస్ను పంపి అభిమాని కోరిక తీర్చాడు. వాటిని స్వయంగా ఎన్టీఆర్ తయారు చేసి మరి పంపించాడు. తమ రిక్వెస్ట్కు స్పందించి కుకీస్ పంపడంతో ఆ అభిమాని ఆనందం పట్టలేకపోయారు. జూనియర్ పంపిన కుకీస్ను అతని పిల్లలు తింటుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఆ ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది.ఇక జూనియర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పనిచేస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ కనిపించనుంది. Thank you so very much @tarak9999 Mama 🤗🤗 with love Smaran and Stharaka 😘What started as a casual comment actually turned into the sweetest surprise. Today, the cookies reached home. The kids are happy, i am on cloud nine with the autograph, and we are all just smiling at… pic.twitter.com/DkRU7PEMJK— saiteja (@saitejaathoti) June 6, 2026 -
‘బిగ్బాస్ 10’ వచ్చేస్తోంది.. పాటతో ప్రకటన..వీడియో వైరల్!
‘బిగ్బాస్’ అభిమానులకు గుడ్ న్యూస్. బిగ్బాస్ 10వ సీజన్ రాబోతుంది. ఇప్పటికే 9 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో.. త్వరలోనే 10వ సీజన్తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు నిర్వాహకులు. 10వ సీజన్కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్గా వ్యవహరించబోతున్నాడు.‘బిగ్బాస్.. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం’అంటూ నాగార్జున చెప్పే పవర్ఫుల్ డైలాగ్తో స్పెషల్ వీడియో ప్రారంభం అవుతుంది. బిగ్బాస్పై రూపొందించిన ఓ ప్రత్యేక పాటతో వీడియో ఆద్యంతం అలరించేలా సాగుతుంది. చెదరని ప్రస్థానం..తరగని అభిమానం బిగ్బాస్ సొంతం. ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్కి సాక్ష్యం కాబోతుంది. ఈ సారి మీరు చూడబోయేది బిగ్బాస్ దశావతారం’ అంటూ సీజన్ 10పై ఆసక్తిని పెంచేశాడు నాగార్జున. ఇక ప్రతి సీజన్ ఏదో ఒక క్యాప్షన్తో వచ్చే బిగ్బాస్.. ఈ సారి కూడా ‘ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అనే క్యాప్షన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే షో ఎప్పుడు ప్రారంభం అవుతుంది? కంటెస్టెంట్స్ ఎవరనే విషయాలను మాత్రం ప్రకటించలేదు. -
డబుల్ సెంచరీ కొట్టిన ‘పెద్ది’ గాడు.. శనివారం ఎన్ని కోట్లు వచ్చాయి?
‘పెద్ది’గాడు డబుల్ సెంచరీ కొట్టేశాడు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. జూన్ 4న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. ప్రీమియర్లతో కలిపి తొలి రోజు రూ. 135.36 కోట్లు రాబట్టింది.ఇక రెండో రోజు మాత్రం కేవలం 46.60 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజే కలెక్షన్లలో ఇంతలా డ్రాప్ కనిపించడంతో ఇక ‘పెద్ది’గాడి పని అయిపోయిందనుకున్నారు. కానీ వీకెండ్లో మాత్రం ‘పెద్ది’గాడు పుంజుకున్నాడు. (పెద్ది మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)మూడో రోజు హాఫ్ సెంచరీ(రూ. 54.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్) కొట్టేశాడు. దీంతో మూడు రోజుల్లోనే డబుల్ సెంచరీ దాటేశాడు. ఒప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 236.7 గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఆదివారం కూడా కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే మూడు,నాలుగు రోజుల్లో కచ్చితంగా రూ. 500 కోట్ల క్లబ్లులో చేరే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించాడు. చరణ్కు జోడీగా జాన్వీ కపూర్ నటించగా, జగపతి బాబు, శివరాజ్కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రత్యేక పాటలో శృతీహాసన్ మెరిసింది.BOX OFFICE CHAMPION #PEDDI IS UNSTOPPABLE 🔥🔥#Peddi collects a gross of 236.7 CRORES GROSS WORLDWIDE in 3 days ❤🔥Book your tickets now!🎟️ https://t.co/EMhY3eMGKq#PEDDI in cinemas NOW 💥 pic.twitter.com/OotedmRSpx— PEDDI (@PeddiMovieOffl) June 7, 2026 -
94 ఏళ్ల వయసులో ఇలాంటి సినిమా.. భవిష్యత్తులో కూడా కష్టమే : నాగ్ అశ్విన్
‘‘సింగీతం శ్రీనివాసరావుగారు ఎప్పుడూ అంతర్జాతీయ స్థాయిలోనే ఆలోచిస్తారు. ‘సింగ్ గీతం’లాంటి సినిమా ప్రపంచంలో ఎక్కడా రాలేదని ఆయన చెప్పేవారు. ఈ సినిమా పూర్తయ్యాక చూస్తుంటే నిజంగానే ఈ తరహా సినిమా ఇప్పటివరకు రాలేదనిపిస్తోంది. భవిష్యత్లో కూడా ఇలాంటి సినిమా రావడం కష్టమే. మన తరానికి సింగీతంగారు ఈ సినిమా ఇస్తున్నారంటే మనం అదృష్టవంతులమనే చెప్పాలి. పదేళ్ల తర్వాత గుర్తుండిపోయే సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ ‘సింగ్ గీతం’ చిత్రం చేశాం’’ అని దర్శక–నిర్మాత నాగ్ అశ్విన్ చెప్పారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి నటించిన సినిమా ‘సింగ్ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చెప్పిన విశేషాలు... → ‘పుష్పక విమానం’ సినిమాకు ముందే సింగీతంగారు ‘సింగ్ గీతం’ కథను కమల్హాసన్గారికి చెప్పారు. అయితే సింగీతంగారికి ఉన్న కొన్ని ప్రాజెక్ట్స్ కారణంగా ఈ చిత్రాన్ని అప్పట్లో చేయడం ఆయనకు సాధ్యపడలేదు. ఇప్పుడు కుదిరింది. సింగీతంగారి సినిమాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ‘పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం’ ఇలా ఆయన డైరెక్షన్లో వచ్చిన ఏ సినిమాను తీసుకున్నా టైమ్లెస్గా ఉంటాయి. ‘పుష్పక విమానం’ ఇప్పటికి సంబంధించిన సినిమాలానే ఉంటుంది. ‘సింగ్ గీతం’ కూడా ఈ జనరేషన్ కోసం తీసిన కథలానే అనిపిస్తుంది. → ‘మహానటి’ సినిమా తర్వాత సింగీతంగారు నాకు ‘సింగ్ గీతం’ సినిమా కథ చెప్పారు. ఇది కల్పిత కథ. కుబేరపురంలో గోల్డ్ మైన్స్ ఉంటాయి. ఆ ఊరికి, ఆ గోల్డ్ మైన్స్కు ఉన్న సంబంధం ఏంటి? అనేది సింగీతంగారి శైలిలో హ్యూమర్, హ్యుమానిటీల మేళవింపుతో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ఒక ప్రత్యేక ప్రపంచంలో జరుగుతున్నట్లుగా సాగుతుంది. కాబట్టి పెద్ద స్టార్స్ అయితే వారి ఇమేజ్ ప్రభావం ఈ కథపై పడే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులు కొత్తగా, సహజంగా ఫీలవ్వాలనే ఉద్దేశంతో సింగీతంగారు కొత్తవారిని తీసుకున్నారు. → ఈ సినిమా కోసం సింగీతంగారితో రెండేళ్లు ప్రయాణించాను. ఒకసారి ఆయన ఏదైనా చెప్పి, ఆ తర్వాత అది ఆయనకే నచ్చకపోతే మార్చేస్తారు. ‘మీరే చెప్పారు కదా?’ అంటే... ‘నేను తప్పు చేయకూడదా?’ అంటారు. నేను కొత్తతరం దర్శకుడినా? కాదా అనే సందేహం నాకు అప్పుడప్పుడు వస్తుంటుంది (సరదాగా). కానీ సింగీతంగారు 94 ఏళ్ల వయసులో కూడా ఓ టీనేజర్ తీసినట్లే ఈ సినిమా తీశారు. ఈ ప్రాజెక్ట్ ప్రతి అడగులో నేను ఉన్నాను. సింగీతంగారి విజన్ను స్క్రీన్పై తీసుకురావడానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా ఉన్నానని అనుకోవచ్చు. → మ్యూజిక్ పరంగా ఇది చాలెంజింగ్ సినిమా. ఇందులో డైలాగ్స్ అన్నీ పాటల్లా వస్తాయి. కానీ మ్యూజిక్ వింటున్నాం అనే ఫీలింగ్ రాదు. దేవిశ్రీ ప్రసాద్గారు మంచి సంగీతం ఇచ్చారు. → ఏ సినిమా సక్సెస్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ కథను నిజాయితీగా చెప్పడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ‘పుష్పక విమానం’ కథను సింగీతంగారు చెప్పినప్పుడు కూడా ‘మాటలు లేకుండా సినిమా ఏంటి?’ అని చాలామంది అనుకుని ఉంటారు. నేను ‘మహానటి’ తీస్తానంటే ‘ఇప్పుడు ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు?’ అనే మాటలు వినిపించాయి. సినిమా పూర్తయ్యేవరకు ఎవరూ అంచనా వేయలేరు. నిజాయితీని నమ్మితే విజయం దానంతట అదే వస్తుంది. → నా డైరెక్షన్లోని ‘కల్కి 2’ చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి కంటిన్యూస్గా షూటింగ్ జరపడానికి ప్లాన్ చేశాం. రిలీజ్ ఎప్పుడనే విషయంపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేను. -
తెలుగు ప్రేక్షకులంటే అందరికీ చులకనే!
టికెట్ కొని వెళ్లే ప్రేక్షకులంటే హీరోలు, దర్శకనిర్మాతలకు కనీస గౌరవం ఉండాలి. కానీ గత కొన్నాళ్లుగా చూస్తే మాత్రం అది చాలా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. లేటెస్ట్గా 'బాలన్' ట్రైలరే దీనికి మరో ఉదాహరణ. 'మంజుమ్మల్ బాయ్స్' దర్శకుడు తీసిన కొత్త మూవీ ఇది. తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు కానీ టాలీవుడ్ ఆడియెన్స్ అంటే ఏం చూపించినా చూస్తారులే అని డబ్బింగ్ వింటేనే అర్థమవుతోంది.(ఇదీ చదవండి: సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు)మంజుమ్మల్ బాయ్స్ సినిమా తీసిన దర్శకుడు.. జన నాయగణ్, టాక్సిక్ మూవీస్ తీసిన కేవీఎన్ ప్రొడక్షన్స్ దీన్ని నిర్మించింది. విజువల్స్, స్టోరీ బాగున్నాయి. కానీ తెలుగు డబ్బింగే దారుణంగా చేశారు. గూగుల్ ట్రాన్స్లేటర్లో కాపీ చేసి డబ్బింగ్ చేశారా అనే సందేహం కలుగుతోంది. ట్రైలర్లోని కంటెంట్ ఆసక్తిగా అనిపించినప్పటికీ.. తెలుగు డబ్బింగ్ ఆ ఆసక్తిని మొత్తం తగ్గించేసినట్లు అనిపించింది.వచ్చే శుక్రవారం(జూన్ 19) తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. మూవీ రిలీజ్ నాటికైనా డబ్బింగ్ విషయంలో మార్పులు చేర్పులు చేస్తే సరేసరి. లేదంటే మాత్రం విమర్శలు తప్పవు. ఇదే కాదు టైటిల్ కూడా 'బాలన్' అని ఉన్నది ఉన్నట్లు పెట్టేశారు.ట్రైలర్ బట్టి చూస్తే.. సర్వైవల్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. మానసిక స్థితి సరిగ్గా లేని ఒక తల్లి.. ఆ తల్లి ఏం చేస్తుందో తెలియని ఒక పిల్లాడు. అనుకోకుండా ఆ పిల్లాడు కనిపించకుండాపోవడం.. అతడి కోసం పోలీసులు వెతకడం.. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: రజనీకాంత్ సినిమా.. ఇంకెంతమంది మారతారో ఏంటో?) -
రామ్ సైకలాజికల్ థ్రిల్లర్కి ఆయన ఫిక్స్
రజనీకాంత్ ‘పేట్ట’, మహేశ్బాబు ‘భరత్ అనే నేను’, ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’, హృతిక్ రోషన్ ‘క్రిష్ 3’ వంటి సూపర్ హిట్ సినిమాలకు తిరునావుక్కరసు (తిరు) సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ హీరోగా నటిస్తూ,, స్వీయ దర్శకత్వం వహించనున్న సినిమాకీ ఆయన ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మించనున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో వీర అనే పాత్రలో నటిస్తారు రామ్. ‘‘జాతీయ అవార్డు అందుకున్న అనుభవం, విజువల్ స్టైల్, ఫ్రేమింగ్, లైటింగ్, సినిమాటిక్ టెక్స్టర్లపై తిరుకు ఉన్న పట్టు, ఈ సినిమా విజువల్స్ మేకింగ్లో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఇటీవల ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
'కోర్ట్' హీరో నుంచి మరో ప్రేమకథ
‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నక్షత్ర హీరోయిన్గా నటిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘తెల్ల కాగితం’ అనే టైటిల్ను ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు.‘‘యూత్ఫుల్ లవ్స్టోరీగా రూపొందుతోన్న చిత్రం ‘తెల్ల కాగితం’. నందు సవిరిగన ఈ చిత్రానికి లోతైన భావోద్వేగాలతో కూడిన కథ, కథనాన్ని, మాటల్ని అందించారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినివ్వాలని రమేష్ బండ్రెడ్డి ప్రయత్నిస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: విజయ్ బుల్గానిన్. -
దైవిక శక్తి నిలిచి పోయిన అనుభూతి కలిగింది: తమన్నా
తమన్నా... ఈ పేరు చెప్పగానే అందం, అభినయం గుర్తొస్తుంది. ఆమె ఫ్యాన్స్ మాత్రం మిల్కీ బ్యూటీ అంటూ ప్రేమగా పిలుచుకుంటుంటారు. హీరోయిన్గా అయినా.. స్పెషల్ సాంగ్స్ చేసినా.. లేడీ ఓరియంటెండ్ మూవీస్లో నటించినా తనదైన నటన, డ్యాన్సులతో ప్రేక్షకులను అలరిస్తుంటారామె. రీల్ లైఫ్లో గ్లామరస్గా, మోడ్రన్గా కనిపించినప్పటికీ రియల్ లైఫ్లో మాత్రం చాలా భక్తి భావంతో ఉంటారు తమన్నా.సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత కోసం ఆలయాలను సందర్శించడం, పూజలు చేయడం, ధ్యానం చేయడం తన జీవితంలో ఒక భాగమని చెబుతుంటారామె. ఈ నేపథ్యంలోనే ముంబైలోని తన ఇంట్లో ఇషా యోగా సెంటర్కు చెందిన సాధ్వీల ఆధ్వర్యంలో లింగ భైరవీ దేవి పుణ్య పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తమన్నా. ఆ ఫొటోలను, ఆ సమయంలో తనకు కలిగిన ఒక మ్యాజికల్ ఫీలింగ్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ‘‘లింగ భైరవీ దేవి పుణ్య పూజకు ముందు ముంబైలో భరించలేని వేడి వాతావరణం ఉండేది.ఈ కారణంగా పూజకు వచ్చిన అతిథులు ఇబ్బంది పడతారేమోనని ఆందోళన చెందాను. అయితే పూజ జరిగే రోజు ఉదయం నిద్రలేచి చూడగా అనూహ్యంగా వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని రోజులుగా ముంబైని కమ్మేసిన వేడి మాయమైంది. దీపారాధన చేయక ముందే వర్షం రూపంలో లింగ భైరవీ దేవి మా ఇంటికి వచ్చిందనిపించింది. పూజ పూర్తయినా కూడా నేను అమ్మవారి పక్కనే కూర్చుండి పోయాను. పూజ పూర్తయి అందరూ వెళ్లి పోయిన తర్వాత కూడా ఆ ఇంట్లో ఏదో దైవిక శక్తి నిలిచి పోయిన అందమైన అనుభూతి నాకు కలిగింది. ఈ ప్రత్యేకమైన రోజును కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జరుపుకోవడం ఆనందాన్నిచ్చింది’’ అని తమన్నా పేర్కొన్నారు. -
కథ చెప్పండి గురూ!
సినిమాలో కొత్తదనం లేక పోతే ప్రేక్షకులు థియేటర్స్కు రావడం లేదు. దీంతో హీరోలందరూ కొత్త కథల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఒక్క కథను ఓకే చేయడం కోసం పదుల సంఖ్యలో కథలు వింటున్నారు. ఇటు దర్శకులు, రచయితలు కూడా తమ కలానికి మరింత పదును పెట్టి విభిన్నమైన కథలను సిద్ధం చేస్తున్నారు. దీంతో సరికొత్త కాంబినేషన్స్ పుట్టుకొస్తున్నాయి. మరి... ఏ హీరోకి ఏ దర్శకుడు కథ చె΄్పారు? ఏ దర్శకుడు ఏ హీరోను మెప్పించారు? తెలుగులో రాబోతున్న కొత్త కాంబినేషన్స్ ఏమిటి? అన్న విశేషాలపై ఓ లుక్ వేయండి.సంక్రాంతి తర్వాతే..! హీరో వెంకటేశ్ వరుస కథలు వింటున్నారు. యువ రచయిత నందు, తరుణ్ భాస్కర్ చెప్పిన కథలను ఆల్రెడీ విన్నారు వెంకటేశ్. అయితే ఈ కథలతో సినిమాలు చేయాలని ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఇదే స్పీడ్లో వెంకటేశ్ రీసెంట్గా మరో కథ విన్నారట. ‘బింబిసార’ చిత్రంతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకుని, రెండో సినిమాయే చిరంజీవితో ‘విశ్వంభర’ తీసిన మల్లిడి వశిష్ట ఇటీవల వెంకటేశ్కు ఓ కథ వినిపించారట. ఈ సినిమా చేసేందుకు వెంకటేశ్ సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట.ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబరు 47’ సినిమాలో హీరోగా నటిస్తూ, బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ను త్వరితగతిన పూర్తి చేయాలనే సంక్పల్పంతో ఉన్నారట ఈ సీనియర్ హీరో. అలాగే ‘ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకర వర ప్రసాద్’ (ఇందులో చిరంజీవి హీరో) వంటి హిట్ చిత్రాలను తనకు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేశ్ ఓ సినిమా చేస్తారు.వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. సో... వెంకీ ఇమ్మిడియట్ సినిమా ఇదే అవుతుంది. ఈ నెల 20 తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్రామ్ మరో హీరోగా నటించనుండగా కీర్తీ సురేష్, కృతీశెట్టి హీరోయిన్స్గా నటిస్తారు. ఇక ఈ చిత్రానికి ‘జనవరి 13న విడుదల’ అనే ఓ క్రేజీ టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఇలా తన తర్వాతి ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉండటంతో, వెంకీ తన తదుపరి సినిమాను సంక్రాంతి పండగ తర్వాతనే ఫైనలైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే కథలు మాత్రం వింటున్నారు. ఈలోపు వెంకీని ఇంప్రెస్ చేసి, ఆయనతో సినిమా చేసే చాన్స్ను ఏ దర్శకుడు దక్కించుకుంటారో చూడాలి.నెక్ట్స్ ఎవరు? రాజమౌళి డైరెక్షన్లోని ‘వారణాసి’ చిత్రంతో మహేశ్బాబు ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేయాల్సి ఉంది. దీంతో అనుకున్నట్లుగానే ఏప్రిల్ 7నే సినిమాను రిలీజ్ చేయాలని, ఇది జరగాలంటే ఈ ఏడాది ఆగస్టులోపే షూటింగ్ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. ఇలా ‘వారణాసి’ సినిమా షూటింగ్ కాస్త అటూ ఇటూ అయినా ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ నుంచి ఫ్రీ అవుతారు మహేశ్బాబు.కాగా, ఈ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకూడదని మహేశ్బాబు అనుకుంటున్నారట. ఈ సినిమా రిలీజైన వెంటనే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట మహేశ్. ఇందుకు తగ్గట్లుగానే ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారట. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్లతో పాటు బుచ్చిబాబు సానా చెప్పిన స్టోరీ లైన్స్ను మహేశ్బాబు విన్నారని సమాచారం. ‘వారణాసి’ సినిమా రిలీజైన తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయాలనే విషయంపై మహేశ్బాబు ఓ స్పష్టతకు వస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. మోస్ట్లీ సందీప్ రెడ్డి వంగాతోనే మహేశ్బాబు సినిమా ఉండొచ్చని భోగట్టా.ముందు ఎవరు? హీరో రవితేజ కాస్త స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందే తన నెక్ట్స్ సినిమాలను ఖరారు చేసుకోవాలని అనుకుంటున్నారట రవితేజ. ఇందులో భాగంగానే దర్శకుడు వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి చెప్పిన కథలను రవితేజ విన్నారని తెలిసింది. ముందుగా హసిత్ గోలి కథ వినిపించారు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ చెప్పిన కథ విన్నారట రవితేజ.ఈ రెండు కథలకూ ఇంప్రెస్ అయినప్పటికీ ముందుగా వివేక్ ఆత్రేయ సినిమాను సెట్స్కు తీసుకువెళ్లాలని రవితేజ నిర్ణయించుకున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని తెలిసింది. ఈ సినిమా ప్రారంభమైన మరికొన్ని రోజులకే హసిత్ గోలీ సినిమానూ సెట్స్పైకి తీసుకు వెళ్లాలని రవితేజ ΄్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇలా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లాలని రవితేజ అనుకుంటున్నారట. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాదే రిలీజ్ అవుతాయని ఊహించవచ్చు. ఇక రవితేజ హీరోగా హసిత్ గోలి డైరెక్షన్లోని సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. కాస్త సమయం ఉంది.. ‘ది ప్యారడైజ్’ ప్రపంచంలో తీరిక లేకుండా ఉన్నారు హీరో నాని. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూ΄÷ందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు సుజిత్తో ‘బ్లడీ రొమియో’ అనే ఓ గ్యాంగ్స్టర్ డ్రామా సినిమా చేయనున్నారు నాని. ఇక రెండు సినిమాలు ఇలా ఉండగానే... నిర్మాతగా తనకు ‘కోర్టు’ సినిమా రూపంలో ఓ బ్లాక్బస్టర్ను అందించిన రామ్ జగదీష్ చెప్పిన కథను నాని ఓకే చేశారని తెలిసింది.కానీ ఈ కథలో నానీయే హీరోగా నటిస్తారా? లేక నిర్మాణ బాధ్యతల వరకే పరిమితం అవుతారా? అనేది చూడాలి. అలాగే ఇటీవల ‘బ్యాండ్ మేళం’ సినిమా తీసిన సతీష్ జవ్వాజి చెప్పిన కథను కూడా విన్నారు నాని. ఈ కథను ఆల్మోస్ట్ ఓకే చేశారు. అయితే ఈ కథలో తానే హీరోగా నటించాలని నాని భావిస్తున్నారని, కాక పోతే కథకు ఇంకాస్త మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని సతీష్కు నాని సూచించారని ఫిల్మ్నగర్ భోగట్టా. ఇప్పటికే రెండు సినిమాలను ఖరారు చేసుకున్న నాని,మరో రెండు సినిమాల కథలను కూడా ఓకే చేశారు.మ్యూజికల్ లవ్స్టోరీ! ప్రస్తుతం ‘వృషకర్మ’ సినిమాతో నాగచైతన్య బిజీ బిజీ. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రం. దీంతో తన కెరీర్లోని 25వ సినిమాను లవ్ జానర్లో చేయాలా? లేక యాక్షన్ జానర్లో చేయాలా? అనే సందిగ్ధంలో ఉన్నారట నాగచైతన్య. ఈ క్రమంలోనే దర్శకుడు కొరటాల శివ, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ, ‘బెదురులంక 2012’ ఫేమ్ క్లాక్స్ చెప్పిన కథలను విన్నారట నాగచైతన్య.అయితే రొటీన్ లవ్స్టోరీకీ కాస్త భిన్నంగా ఓ డిఫరెంట్ ప్రేమకథను చెప్పిన క్లాక్స్కు ముందుగా చాన్స్ ఇచ్చారని సమాచారం. ప్రజెంట్ ఈ కథకు సంబంధించిన తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట క్లాక్. ‘వృషకర్మ’ సినిమా రిలీజ్ తర్వాత, నాగచైతన్య 25వ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ‘దూత’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ‘దూత చాప్టర్2’ షూటింగ్లోనూ త్వరలోనే పాల్గొనున్నారు నాగచైతన్య. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘దూత చాప్టర్ 2’తో తొలిసారిగా నిర్మాతగా మారారు నాగచైతన్య. ఈ సిరీస్కు శరత్మరార్ మరో నిర్మాత.రెండు సంవత్సరాల తర్వాత తొలి చిత్రం ‘ఉప్పెన’తో సూపర్ హిట్ అందుకున్నారు హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వైష్ణవ్ చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాలను రాబట్ట లేక పోయాయి. వైష్ణవ్ గత చిత్రం ‘ఆది కేశవ’ 2023లో విడుదలైంది. ఆ తర్వాత మరో కొత్త సినిమా సైన్ చేయడానికి వైష్ణవ్ దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకున్నారు. ఈ గ్యాప్లో వైష్ణవ్ ఎన్నో కథలు విన్నారని తెలిసింది. కానీ ఫైనల్గా సుధీర్బాబుతో ‘హంట్’ సినిమా తీసిన దర్శకుడు మహేశ్ సూరపనేని చెప్పిన కథ వైష్ణవ్ను ఇంప్రెస్ చేసిందట.ఒకేసారి రెండు సినిమాలు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు కనీసం రెండు సెట్స్పై ఉంటున్నాయి. ఇప్పుడు కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజి, స్పిరిట్’ చిత్రాలు సెట్స్పై ఉన్నాయి. ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే పూర్తవుతుంది. ‘ఫౌజీ’ సినిమా రిలీజ్ను ఈ ఏడాదే అనుకుంటున్నారు. ‘స్పిరిట్’ సినిమాను వచ్చే మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే... మరో రెండు సినిమాలను సమాంతరంగా సెట్స్పైకి తీసుకువెళ్లాలని ప్రభాస్ భావిస్తున్నారట. కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్తో ప్రభాస్ మూడు సినిమాలు చేయాల్సి ఉంది. వీటిలో ‘సలార్ 2’ ఒకటి అని తెలిసింది. అలాగే ప్రశాంత్ వర్మతో కూడా ప్రభాస్ ఓ మైథాలజీ సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’తో ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ చేస్తూ ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నారు. కానీ వచ్చే ఏడాదికి ఈ ఇద్దరు దర్శకులు కాస్త ఫ్రీ అవుతారు. మరి... ప్రభాస్ తర్వాతి రెండు సినిమాలకు ఈ ఇద్దరు దర్శకులే డైరెక్షన్ చేస్తారా? లేక మరో దర్శకుడి పేరు ఏదైనా సడన్గా తెరపైకి వచ్చి, కొత్త కాంబినేషన్ సెట్ అవు తుందా? అనేది చూడాలి. ఏదీ ఏమైనా తన తర్వాతి సినిమాలపై ప్రభాస్ ఓ క్లారిటీతో ఉన్నారని సమాచారం.అడవిలో పోరాటం ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు రామ్చరణ్. ఇక మెల్లిగా చరణ్ ఫ్యాన్స్ చర్చంతా ఆయన తర్వాతి సినిమాపైనే జరుగుతోంది. ‘రంగస్థ్థలం’ వంటి బ్లాక్బస్టర్ సినిమాను తనకు ఇచ్చిన సుకుమార్తో రామ్ చరణ్ తర్వాతి సినిమా ఉంటుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్కు వెళ్తుందని సమాచారం. అయితే ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ముంబైలో ఓ సందర్భంగా కలిశారట రామ్ చరణ్. దీంతో వీరి కాంబినేషన్లో సినిమా కన్ఫార్మ్ అనే టాక్ తెరపైకి వచ్చింది.అయితే ఇదొక పీరియాడికల్ జంగిల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా అని, ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించరని, కేవలం నిర్మాణం వరకు మాత్రమే పరిమితం అవుతారనే వార్తలు బాలీవుడ్లో వినిపించాయి. అలాగే ఈ సినిమాకు తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. మరోవైపు బాలీవుడ్లో ‘కిల్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు నిఖిల్ నగేష్ భట్తోనూ ఓ సినిమా విషయమై రామ్చరణ్ చర్చలు జరిపారని టాక్. అయితే ఈ అంశాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.– ముసిమి శివాంజనేయులు -
కల్కి 2పై ప్రభాస్ ఫోకస్.. నాగ్ అశ్విన్ ఆసక్తికర అప్డేట్
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన రాజాసాబ్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందకపోవడంతో ప్రభాస్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రాలను సమాంతరంగా పూర్తి చేసే పనిలో ప్రభాస్ ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ కల్కి 2పై కూడా ఫోకస్ పెట్టాడు. తాజాగా సింగ్ గీతం సినిమా ప్రమోషన్లలో దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నాడు. ఆ ఈవెంట్లో కల్కి 2 గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే కల్కి 2 చిత్రీకరణ ప్రారంభమైంది. జూలై నుంచి నిరంతరాయంగా షూటింగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని నాగ్ అశ్విన్ చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం అన్నీ అనుకున్నట్టు జరిగితే కల్కి 2 చిత్రం 2027 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే నాగ్ అశ్విన్ మాత్రం దీనిపై ఎలాంటి డెడ్లైన్ పెట్టుకోలేదని స్పష్టం చేశారు. ఇక ఫౌజీ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. స్పిరిట్ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా టీమ్ ప్రకటించారు. ఈ రెండు థియేటర్లలోకి వచ్చిన తర్వాతే కల్కి 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాతే సలార్ 2 రానుంది. -
'పెద్ది' వివాదంలో మరో మలుపు.. జాన్వీ కపూర్ చాట్ లీక్?
'పెద్ది' సినిమా వచ్చింది. చూసినవాళ్లు మరీ సూపర్ కాకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉందంటున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ సీన్స్ గురించి మాత్రం ఎడతెగని చర్చ నడుస్తోంది. మరీ దారుణమైన యాంగిల్స్లో ఈమెని చూపించారని, ఈమె పాత్రకు అనుమతి లేకుండా హీరో ముద్దు పెట్టుకోవడం లాంటి సీన్స్పైనా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు బుచ్చిబాబు కూడా సారీ చెప్పేశాడు. దీంతో సమస్య ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ జాన్వీ కపూర్ గతంలో ఓ అభిమానితో 'పెద్ది'లో సన్నివేశాల గురించి చాట్ చేసిందంటూ ఇప్పుడు ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)వైరల్ అవుతున్న చాట్ ప్రకారం.. 'పెద్ది' షూటింగ్ టైంలోనే తనని చూపించిన కెమెరా యాంగిల్స్ పట్ల జాన్వీ కపూర్ అసౌకర్యం వ్యక్తం చేసిందట. మరీ ముఖ్యంగా తన శరీరాన్ని జూమ్ చేసి చూపించే సన్నివేశాల్ని సినిమాలో ఉపయోగించొద్దని కూడా మూవీ టీమ్ని కోరిందట. తాను ఎందుకు అసౌకర్యానికి గురువుతున్నానో కూడా పలుమార్లు చెప్పే ప్రయత్నం చేసిందట. ఈ విషయంలో తనకు రామ్ చరణ్ మద్దతుగా నిలిచాడని, ఆయన కూడా కొన్ని కెమెరా యాంగిల్స్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారని అందులో ఉంది. ఈ చాట్ గతేడాది అక్టోబరులో జరిగినట్లు కూడా సదరు వీడియోలో ఉంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.'పెద్ది' రిలీజ్ తర్వాత జాన్వీ కపూర్ చేసిన అచ్చియమ్మ పాత్రపైనే దాదాపు చాలామంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. యాక్టింగ్ కంటే అందచందాల ప్రదర్శన కోసమే ఈమెని తీసుకున్నారా అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. జాన్వీ పాత్ర తీరుతెన్నులపై పలువురు సెలబ్రిటీలు కూడా పరోక్షంగా పోస్టులు పెట్టారు. ఏదేమైనా ఈ సినిమాకు వచ్చిన పాజిటివిటీ అంతా కూడా జాన్వీ పాత్ర వల్ల నెగిటివ్గా మారిపోయిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: హీరోయిన్లకు ‘క్యారెక్టర్’ అక్కర్లేదా?)#janhvikapoor #Ramcharan #peddiPr game 🎯 pic.twitter.com/y5Jn6ZgGuI— C FOR CINEMA (@cforcinemaaa) June 6, 2026 -
చీరలో అనసూయ అలా.. జీన్స్లో రష్మిక ఇలా
చీరలో మైమరిపించేస్తున్న అనసూయమాయ చేసేస్తున్న రష్మిక మంధాన్నక్యూట్ అండ్ స్వీట్గా మాళవిక నాయర్పట్టుచీరలో చందమామలా రజిషబాపుబొమ్మలా హీరోయిన్ కావ్య కల్యాణ్రామ్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Malvika Nair (@malvikanairofficial) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) -
రామ్ చరణ్ని సర్ప్రైజ్ చేసిన కూతురు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా థియేటర్లలో ఉంది. మిక్స్డ్ టాక్ రావడంతో తెలుగులో మాత్రమే కలెక్షన్స్ వస్తున్నాయి. మిగిలిన భాషల్లో తేలిపోయింది. కానీ మెగా ఫ్యామిలీలో మాత్రం 'పెద్ది' మేనియా కనిపిస్తోంది. రామ్ చరణ్ కూతురే స్వయంగా తండ్రికి విషెస్ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఉపాసన తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)'దిస్ ఈజ్ ఫర్ యూ నాన్న, లవ్ యూ సో మచ్' అని క్లీంకార ముద్దుమాటలతో ప్రారంభమైన వీడియోలో.. చరణ్-ఉపాసన ఇంట్లోని పనివాళ్లంతా కలిసి చికిరి చికిరి పాటకు డ్యాన్స్ చేశారు. చివరకు చరణ్ సెక్యూరిటీ గార్డ్తోనూ వైరల్ బ్యాట్ స్టెప్ వేయించారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో రామ్ చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్గా కనిపించాడు. చరణ్ అద్భుతంగా నటించాడు. ఏఆర్ రెహమాన్ కూడా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకున్నప్పటికీ.. జాన్వీ కపూర్ సీన్ల వల్ల ఘోరమైన నెగిటివిటీ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన సక్సెస్ మీట్లో సదరు సన్నివేశాలని తొలగిస్తామని చెప్పిన దర్శకుడు బుచ్చిబాబు.. ప్రేక్షకులకు క్షమాపణ కూడా చెప్పాడు. రెండు రోజుల్లో రూ.181 కోట్ల గ్రాస్ కలెక్షన్ ఈ చిత్రానికి వచ్చాయి.(ఇదీ చదవండి: 'రెబల్' విషయంలో ప్రభాస్ తండ్రి ముందే హెచ్చరించారు.. కానీ మేమే) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ప్రభాస్ తండ్రి ముందే హెచ్చరించారు.. కానీ మేమే
'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ గురించి ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీనికంటే ముందు తీసిన 'రెబల్' చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయింది. నిర్మాతలు, దర్శకుడు రాఘవ లారెన్స్ మధ్య అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. చెప్పిన బడ్జెట్ కంటే రెట్టింపు ఖర్చు పెట్టించాడని, అలానే బెదిరిస్తున్నాడని నిర్మాతలే స్వయంగా లారెన్స్పై పోలీసు కేసు కూడా పెట్టడం అప్పట్లో టాలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'రెబల్' గురించి మాట్లాడిన నిర్మాతలు భగవాన్, పుల్లారావు.. మరోసారి పాత విషయాలు గుర్తుచేసుకున్నారు.(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)'లారెన్స్ మీద కోపంగానే ఉన్నాం. మేం ఒక బడ్జెట్ అనుకున్నాం. సగం సినిమా అయ్యేసరికి అది అయిపోయింది. ఇది పెద్ద లాస్ అని నిర్మాతలుగా మాకు అప్పుడే తెలిసిపోయింది. అయినా సరే మేం ఎక్కడా దాన్ని వదిలిపెట్టకుండా ముహూర్తం నాడు ఎంత ఉత్సాహంగా ఉన్నామో అలానే పూర్తి చేసి రిలీజ్ చేశాం. లారెన్స్ పేరు ప్రభాస్కి మేమే ముందు చెప్పాం. మంచి కాంబినేషన్ అవుతుందని నమ్మాం. కానీ ప్రభాస్ వాళ్ల నాన్న మాత్రం.. లారెన్స్తో మీరు పడలేరు, వద్దయ్యా అనేవారు. వేరే ఎవరైనా డైరెక్టర్ని ఆలోచించండి అనేవారు. ఆయనతోనే చేస్తామని మేం అనేసరికి, సరే మీ ఇష్టం అని ప్రభాస్ తండ్రి వదిలేశారు''ప్రభాస్ దేవుడు లాంటి మనిషి. 'రెబల్' కోసం జరిగిందంతా చూశారు. దీంతో మీరు చాలా కష్టపడ్డారు. మీకు మరో సినిమా తప్పకుండా చేస్తానని మాటిచ్చారు. కానీ ఆ ప్రామిస్ని ఇంకా ఉపయోగించుకోలేకపోయాం. ఇప్పటికీ ప్రభాస్తో మాకు అనుబంధం కొనసాగుతోంది. ప్రతి పండగకు విషెస్ చెబుతుంటారు' అని నిర్మాతలు జె.భగవాన్, జె. పుల్లారావు చెప్పుకొచ్చారు.చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో నిర్మాతలుగా ఉన్న వీళ్లు.. జంబలకడిపంబ, మావిడాకులు,సముద్రం, మనసున్న మారాజు, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, జూనియర్స్, శంఖం, రెబల్, గౌతమ్ నంద, రిపబ్లిక్ లాంటి సినిమాలని నిర్మించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
సుడిగాలి సుధీర్కి జోడీగా బిగ్ బాస్ బ్యూటీ
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సుధీర్స్ జోకర్’. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.ఈ రోజు హీరోయిన్ అయేషా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘సుధీర్స్ జోకర్’ చిత్రంలో ఆమె షాలినీ అనే క్యారెక్టర్ లో తన అందంతో పాటు పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. రీసెంట్ గా హీరో సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘సుధీర్స్ జోకర్’ మూవీ బ్యాంగర్ కు హ్యూజ్ రెస్పాన్స్ దక్కింది. ఒక ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చూడబోతున్నామనే ఎక్స్ పెక్టేషన్స్ ఈ మూవీపై ఏర్పడుతున్నాయి. -
రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు బాగుందని అంటున్నారు. మరికొందరు పర్లేదని అంటున్నారు. అయినా సరే కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. తొలిరోజు ప్రీమియర్లతో కలిపి సెంచరీ మార్క్ కొట్టగా.. రెండోరోజుకి దారుణంగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. నిర్మాతలు అధికారికంగా రిలీజ్ చేసిన పోస్టర్తో ఈ విషయం అర్థమైంది.(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)గురువారం ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' రిలీజ్ కాగా.. ముందురోజు రాత్రి ప్రీమియర్లు కూడా వేశారు. అలా ప్రీమియర్లు, తొలిరోజు కలిపి రూ.135.36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. రెండోరోజులకు కలిపి రూ.181.80 కోట్ల గ్రాస్ వచ్చినట్లు వెల్లడించారు. అంటే రెండో రోజు కేవలం రూ.46.40 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. మరి ఎందుకు ఇంతలా కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది అంటే దానికో కారణం ఉంది.మిశ్రమ స్పందన రావడంతో పాటు శుక్రవారం ఓ కారణం కాగా హెచ్డీ పైరసీ ప్రింట్ కూడా బయటకొచ్చేయడం.. కలెక్షన్లలో ఇంతలా తగ్గుదలకు కారణంలా కనిపిస్తుంది. శని, ఆదివారాల్లో బాక్సాఫీస్ దగ్గర 'పెద్ది' ఎలాంటి దూకుడు చూపిస్తాడనేది కీలకం. ఎందుకంటే సోమవారం నెమ్మదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వారం పెద్ద చిత్రాలేం లేనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర 'పెద్ది'కి ఎంతవరకు లాంగ్ రన్ ఉంటుందనేది చూడాలి?(ఇదీ చదవండి: ‘పెద్ది’.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు)#Peddi collects 181.8 CR+ GROSS WW in 2 Days💥💥BOX OFFICE CHAMPION #PEDDI is conquering the cinemas ❤🔥Book your tickets now 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/rkwmfFiwlA— PEDDI (@PeddiMovieOffl) June 6, 2026 -
‘పెద్ది’ వివాదం.. అనసూయ సంచలన పోస్ట్
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తెరపై ఆమెను చూపించిన తీరుపై, కొన్ని సీన్లపై మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెబుతూ.. ఆ సన్నివేశాలను తొలగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నెట్టింట దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. తాజాగా నటి, యాంకర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమా అనేది కేవలం ఒక కల్పిత కథ మాత్రమేనని, అందులోని మంచి చెడులను నిర్ణయించుకునే పూర్తి విచక్షణ ప్రేక్షకులకే ఉంటుందని అనసూయ అన్నారు. సమాజంలో జరిగే ప్రతి విషయానికి సినిమాలను ముడిపెట్టకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. చిత్రరంగంలో ఉండాల్సిన సామాజిక బాధ్యత, సృజనాత్మక స్వేచ్ఛ గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.ఒకప్పుడు నైతికత..ఇప్పుడు గందరగోళం‘ఒకప్పటి సినిమాల్లోని కథలలో నైతికత కనిపించేది. హీరో పాత్రలు స్ఫూర్తిదాయకంగా, విలన్ పాత్రలు మనం అనుకరించకూడదనే విధంగా ఉండేవి. కానీ, ఈ రోజుల్లో వచ్చే కథల్లో ఆ స్పష్టత లోపిస్తోంది. కేవలం పాత్రను గొప్పగా చూపించడం కోసమే దర్శకులు ఈ విధమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఒక కథను తెరకెక్కిస్తున్నప్పుడు సమాజంపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయంలో.. సాంకేతిక నిపుణుల నుంచి దర్శక నిర్మాతలు, నటీనటులు, చివరకు ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ కీలక పాత్రధారులే. అందుకే సినిమా ఎప్పుడూ బాధ్యతాయుతంగా ఉండాలి.నేను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా..నేను కూడా గతంలో సృజనాత్మకత విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల వల్లే కొన్ని షోల నుంచి తప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. దానివల్ల నా ప్రతిభకు తగిన అవకాశాలు రావడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ సిద్ధాంతాల కోసమే నిలబడ్డాను.ప్రతి తప్పుకూ సినిమాను మాత్రమే నిందించడం సరికాదుసినిమాలకు సృజనాత్మక స్వేచ్ఛ ఎంత అవసరమో, సామాజిక స్పృహ ఉండటం కూడా అంతే ముఖ్యం. సినిమాలు సమాజాన్ని మంచి మార్గంలో నడిపిస్తాయని ఆశించకూడదు. అలాగని, అవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపవని కూడా అనుకోలేం. సమాజంలో జరిగే ప్రతి తప్పుకూ సినిమాను మాత్రమే నిందించడం సరికాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది ఇలాంటి విషయాలపై చర్చలు జరపడం, కథల్లో పాత్రలను చూపించే విధానాలను ప్రశ్నించడం, విమర్శనాత్మకంగా ఆలోచించడం వంటివి చూస్తుంటే తనకు సంతోషంగా ఉంది. అవసరమైనప్పుడు తప్పులను ప్రశ్నించడం అంటే సృజనాత్మకతపై దాడి చేయడం కాదు, అది సమాజంలో అవగాహన పెంచడమే. నేను ఎవరినీ వ్యక్తిగతంగా నిందించడం లేదు. ఈ చిత్ర పరిశ్రమ అనే వ్యవస్థలో మనమంతా భాగమేనని గుర్తుచేయడమే నా ఉద్దేశం. ఇకనైనా క్రియేటర్స్, నటీనటులు, దర్శకనిర్మాతలు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఆడియన్స్ మరింత సామాజిక స్పృహతో, బాధ్యతాయుతంగా కంటెంట్ను రూపొందిస్తారని ఆశిస్తున్నాను’ అని అనసూయ తన పోస్టులో రాసుకొచ్చింది.🙏🏻 pic.twitter.com/gfQfdsaLV4— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 6, 2026 -
అభిమానికి ఊహించని షాకిచ్చిన ఎన్టీఆర్!
అభిమానులకు రకరకాల కోరికలు ఉంటాయి. తమ అభిమాన హీరోని ఒక్కసారైనా కలవాలి.. ఆయనతో కాసేపు మాట్లాడాలి.. వీలైతే కలిసి భోజనం చేయాలి.. కనీసం ఒక సెల్ఫీ అయినా దిగాలి.. ఇలాంటి డ్రీమ్స్ చాలానే ఉంటాయి.నిజానికి వీటిలో చాలా వరకు నెరవేరని కోరికలే అని అభిమానులకు కూడా బాగా తెలుసు. కానీ, ఆరాధించే గుండెకు లాజిక్కులు తెలియవు కదా! అందుకే నెరవేరుతుందో లేదో తెలియకపోయినా.. సరదాగానైనా సరే, తమ మనసులోని ఆ ముచ్చటను బయటపెడుతుంటారు. అయితే ఇలా సరదాగా అడిగిన కోరికను హీరో నిజం చేస్తే మాత్రం..ఆ అభిమాని షాకవ్వడం మాత్రం గ్యారెంటీ. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ అలాంటి పనే చేసి అభిమానికి షాకిచ్చాడు. వివరాల్లోకి వెళ్లితే..ఎన్టీఆర్కు వంటలు చేయడం చాలా ఇష్టం. ఖాలీ సమయం దొరికితే కిచెన్లోకి దూరిపోతుంటాడు. బిర్యానీ చేయడంతో ఆయన దిట్ట. అయితే ఈ సారి మాత్రం కాస్త వెరైటీ వంటకం ట్రై చేశాడు. పిల్లలకు చాలా ఇష్టమైన కుకీలు రెడీ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్లో షేర్ చేస్తూ.. అవి కొన్నవి కాదని, స్వయంగా తయారు చేశానని చెప్పుకొచ్చాడు.Anna janma dhanyam ayyindi anna @tarak9999 , any way sesh nestle apartments flat no 102 , moti nagar, near gowtham model school 😉 https://t.co/hh7hfv5KY0— saiteja (@saitejaathoti) June 5, 2026ఎన్టీఆర్ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. పలువు అభిమానులు ఎన్టీఆర్ని పొడుగుతూ కామెంట్స్ పెట్టారు. అయితే ఓ అభిమాని తన హీరోకి సరదాగా ఓ విజ్ఞప్తి చేశాడు. ‘మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రెండు కుకీలు పంపించు అన్న’అని ట్వీట్ చేశాడు. దానికి ఎన్టీఆర్ సరదగా స్పందిస్తూ.. ‘అడ్రస్ పెట్టు’ అంటూ బ్రహ్మానందం వీడియోని పెట్టాడు. అది చూసి సదరు అభిమాని ఆశ్చర్యపోయాడు. ‘అన్నా.. జన్మ ధన్యమైంది’ అంటూ తన ఇంటి అడ్రస్ చెప్పాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ నిజంగానే తాను తయారు చేసిన కుకీస్ని అతనికి పంపించేశాడు. ఇది చూసి సదరు అభిమాని ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు. ‘కాళ్లు, చేతులు వణుకుతున్నాయి. కన్నీళ్లను ఆపుకోలేకతున్నాను’ అంటూ తారక్ పంపిన కుకీల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. Anna @tarak9999 legs and hands are still shaking cant control tears 😭😭😭 pic.twitter.com/YMdmQjbFWD— saiteja (@saitejaathoti) June 5, 2026 -
విజయ్-రష్మికల ‘రణబాలి’.. 100 రోజుల షూటింగ్ పూర్తి!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ‘రణబాలి’ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ సినిమా రూపొందుతోంది.తాజాగా ‘రణబాలి’ సినిమా సక్సెస్ ఫుల్ గా వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే గండికోటలో షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. వారం రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ రూపొందించారు. ఇప్పటిదాకా ఈ చిత్రానికి సంబంధించిన 90 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఔట్ పుట్ పూర్తి సంతృప్తికరంగా వచ్చిందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లోని ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీక్వెన్సులు మూవీ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ‘రణబాలి’ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కు అన్ని సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. -
పెద్ది.. అప్పటి నుంచి నా ఫోన్ రింగ్ అవడం ఆగలేదు : బుచ్చిబాబు
‘‘బుచ్చిబాబు రాసిన ‘పెద్ది’ కథలో మా హీరో రామ్ చరణ్గారు అద్భుతంగా నటించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆయన నటన గురించే మాట్లాడుకుంటున్నారు. చరణ్గారి పెర్ఫార్మెన్స్ న భూతో న భవిష్యతి. మిగతా నటీనటులందరూ కూడా బాగా నటించారు’’ అని నిర్మాత వై. రవిశంకర్ (మైత్రి మూవీ మేకర్స్) తెలిపారు.రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీగా నటించిన చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. శుక్రవారం నిర్వహించిన ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ సక్సెస్ ప్రెస్మీట్లో వై. రవిశంకర్ మాట్లాడుతూ–‘‘తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చూడని విధంగా మల్టిపుల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందిన సినిమా ‘పెద్ది’. పిల్లలకు ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుంది’’ అని పేర్కొన్నారు.వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ– ‘‘పెద్ది’ తొలి రోజే రూ. 135 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. ఇది రామ్ చరణ్గారి కెరీర్లోనే బెస్ట్ సినిమా. ఆ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి’’ అని తెలిపారు. బుచ్చిబాబు మాట్లాడుతూ– ‘‘పెద్ది’ విడుదలైనప్పటి నుంచి నా ఫోన్ రింగ్ అవడం ఆగలేదు. ‘ఉప్పెన’ సమయంలోనూ ఇదే జరిగింది. అయితే ‘ఉప్పెన’ కంటే పది రెట్లు ఎక్కువ రెస్పాన్స్ ‘పెద్ది’ కి వస్తోంది’’ అన్నారు. ‘‘రామ్ చరణ్గారి కెరీర్లోనే ఫస్ట్ డే హయ్యెస్ట్ రికార్డ్ ఇది. ఈ సినిమా మరిన్ని రికార్డులు నెలకొల్పుతుందని నమ్ముతున్నాను’’ అని మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ చెప్పారు. -
‘పెద్ది’.. క్షమాపణలు చెప్పిన బుచ్చిబాబు
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మహిళలను అవమానించేలా జాన్వీ కపూర్ పాత్రను తీర్చిదిద్దారంటూ పలువురు నెటిజన్స్ బుచ్చిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో హీరోయిన్ని చూపించిన తీరు, కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు తాజాగా ఈ విమర్శలపై స్పందించాడు. క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియాలో ఓ సుధీర్గమైన పోస్ట్ పెట్టాడు.ఒక ఫిల్మ్ మేకర్గా.. సినిమా అనేది ప్రేక్షకులను అలరించాలి, వారిలో స్ఫూర్తిని నింపాలి అనుకుంటాను. ఎవరినీ అసౌకర్యానికి, అగౌరపరచాలని చూడను. పెద్దిలో కొన్ని సన్నివేశాలు ఇబ్బందిగా అనిపించినట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని తీవ్రంగా పరిగణించాం. తెరపైన, తెర వెనుక కూడా మహిళలంటే నాకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంది. మహిళల పాత్రలను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. ఈ సినిమాలో సన్నివేశాలు మీ మనోభావాలు దెబ్బతీసేలా ఉంటే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. అలాగే ఆయా సన్నివేశాలలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నాం (జాన్వీ కపూర్కి సంబంధించిన రొమాంటిక్ సీన్లన్నీ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం). ప్రేక్షకులు ఆదరిస్తేనే సినిమా ఎదుగుతుంది. అభిమానులతో ఉన్న అనుబంధమే సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి అభిమానుల భావోద్వేగాలు, అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కొన్ని సున్నితమైన అంశాలపై కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి మహిళా గౌరవానికి అర్హురాలే. వారిని శక్తిమంతంగా చూపించడానికి, వారి విలువను పెంచే కథలు చెప్పడానికి మేం కట్టుబడి ఉన్నాం. తమ అభిప్రాయాలను నిజాయితీగా, మనస్ఫూర్తిగా పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని బుచ్చిబాబు తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.I have always had immense respect for…— BuchiBabuSana (@BuchiBabuSana) June 6, 2026 -
చరణ్-జాన్వీల ముద్దు సీన్పై విమర్శలు... స్పందించిన బుచ్చిబాబు
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం ఈ నెల 4న విడుదలై హిట్ టాక్తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తున్నాయి. సినిమా చూసినవారంతా గ్లామర్ షో కోసమే జాన్వీ కపూర్ని పెట్టారని, కథకు ఆమె పాత్రకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే జాన్వీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్-జాన్వీల ముద్దు సీన్పై కూడా విమర్శలు వచ్చాయి. ఏ సందర్భం లేకుండా ఉద్దేశపూర్వకంగా ఆ సీన్ పెట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు. ముద్దు సీన్పై ఇలాంటి నెగెటివ్ స్పందన వస్తుందని ఊహించలేదన్నారు.రామ్ చరణ్-జాన్వీల మధ్య సరదా సాగే ఓ ప్రేమ కథను మాత్రమే తెరపై చూపించాలనుకున్నామని.. అందులో భాగంగానే ముద్దు సీన్ పెట్టామని వివరణ ఇచ్చాడు. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకొని ఇకపై అలాంటి సీన్లను తెరకెక్కించే ముందు మరింత జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. తన తదుపరి సినిమాల్లో అలాంటి సీన్లు ఉంటే.. ప్రేక్షకులను నచ్చే విధంగా తెరకెక్కిస్తామని తెలిపారు.పెద్ది విషయానికొస్తే.. 1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలోని కొండకింద ఊరికి చెందని ఓ యువకుడు.. గుర్తింపు కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఇందులో రామ్ చరణ్ గిరిజన యువకుడిగా కనిపిస్తూ.. క్రికెటర్గా, కుస్తీ ఆటగాడిగా, అథ్లెట్గా మూడు విభిన్నమైన పాత్రలు పోషించి, ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. మొదటి రోజు ఈ చిత్రం రూ. 135 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. -
సింగ్ గీతం చేయడం నా అదృష్టం: దేవిశ్రీ ప్రసాద్
‘‘సింగీతం శ్రీనివాసరావుగారు చేసినన్ని ప్రయోగాలు ఎవ్వరూ చేసి ఉండరు. ‘సింగ్ గీతం’ ప్రాజెక్ట్ చేస్తున్నామని మూడేళ్ల క్రితం ఆయన చెప్పినప్పుడు హ్యాపీ అనిపించింది. నాగ్ అశ్విన్గారు, స్వప్నగారు, వైజయంతి మూవీస్తో కలిసి ఈ సినిమా రూపొందడం మరింత ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.ఆయాన్, అహల్యా బమ్రూ జంటగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించిన చిత్రం ‘సింగ్ గీతం’. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు.⇒ నేను సింగీతంగారికి వీరాభిమానిని. మా నాన్న సత్యమూర్తిగారిని కలవడానికి వచ్చినప్పుడు వాళ్లు మాట్లాడుకుంటుంటే నేను ఆరాధనగా చూసేవాడిని. అలాంటిది సింగీతంగారితో కలిసి పని చేయడం ఒక ఆశీర్వాదంగా అనిపించింది. సింగీతంగారు ఎప్పుడూ ట్రెండ్కి తగ్గట్టు కథలు ఆలోచించలేదు. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంటే అది ఇంతకు ముందు రానిది, తర్వాత కూడా రానిదిగా ఉంటుంది. ‘పుష్పక విమానం’ ఇప్పటికీ చాలా అడ్వాన్డ్స్ మూవీ. ‘సింగ్ గీతం’ ఐడియా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ⇒ ఒక గ్రామం మొత్తం మాట్లాడలేక కేవలం పాటల రూపంలోనే సంభాషించే కథ ఇప్పటివరకు రాలేదు. అది ‘సింగ్ గీతం’లో కొత్తగా ఉంటుంది. నా కెరీర్లో సవాల్తో కూడుకున్న సినిమా ఇది. ఇది కేవలం కామెడీ సినిమా కాదు... అద్భుతమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయి. కమల్హాసన్గారు సినిమా చూసి, ‘ఇలాంటి సినిమాలో నేను కూడా భాగం కావాల్సింది’ అనడం మాకు ఆనందాన్నిచ్చింది. ⇒ చిన్నప్పటి నుంచి ప్రతి అక్ష రాన్ని సంగీతంగా మార్చే అలవాటు నాకుండేది. అప్పుడు న్యూస్పేపర్ తీసుకుని అందులో ఉన్న వార్తలనే ట్యూన్స్గా మార్చుకునేవాడిని. అది ‘సింగ్ గీతం’కి ఉపయోగపడింది. ఈ సినిమా కోసం ప్రతిదీ ముందుగానే మ్యూజికల్గా చేసి ఇచ్చాం. తర్వాత షూట్ చేశారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ పాడగలిగారు. 94 ఏళ్ల వయసులోనూ కొత్త ఆలోచనతో, ఉత్సాహంగా సినిమా చేసిన సింగీతంగారి నుంచి ప్రేక్షకులు స్ఫూర్తి పొందుతారు. -
ఓ లాయర్ పోరాటం
వ్యవసాయంలో పురుగుల మందు వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న తీవ్ర ప్రభావాలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు చేతన్ డీకే రూపొందించిన సినిమా ‘ది ఇండియా స్టోరీ’. ‘స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ అన్నది ఈ సినిమా ఉపశీర్షిక. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో చేతన్ సాగర్ బి. షిండే నిర్మించిన ఈ సినిమా జూలై 24న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘ప్రతి మూడు కుటుంబాల్లో ఒకరు క్యాన్సర్తో పోరాడుతున్నారు, ప్రతి అరవై సెకన్లకు ఒకరు లేదా ఇద్దరు చనిపోతున్నారు’’ అంటూ డైలాగ్స్ లేకుండా కొన్ని నంబర్స్ను ఈ టీజర్లో చూపించారు. వ్యవసాయరంగంలో జరుగుతున్న కల్తీ, ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడటం, వ్యవసాయ రంగంలో వినియోగించే మందుల తయారీలో ఆయా కంపెనీల నిర్లక్ష్యం వంటి అంశాలను ఈ సినిమాలో చర్చించినట్లుగా విడుదలైన టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ లాయర్ పాత్రలో నటించారు. -
రాముడు వర్సెస్ కుంభకర్ణుడు
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న టైమ్ ట్రావెల్ అండ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్రగా, రాముడిగా నటిస్తున్నారు మహేశ్బాబు. ఈ సినిమాలో మహేశ్బాబు 30 నిమిషాల పాటు రాముడిగా కనిపిస్తారని ఆల్రెడీ చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం రచయితల్లో ఒకరైన వి. విజయేంద్ర ప్రసాద్ ఓ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. రాముడికి, కుంభకర్ణుడికి మధ్య యుద్ధానికి సంబంధించిన చిత్రంగా ‘వారణాసి’ ఉంటుందని, ఈ సీక్వెన్స్ అత్యద్భుతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో కుంభ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా, శివభక్తుడు పాత్రలో ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇక ఈ ‘వారణాసి’ సినిమాకు వి. విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్. కాంచి కథ అందించగా, దర్శకుడు దేవ కట్టా సంభాషణలు రాశారు. -
రామ్ చరణ్ బాడీ గార్డ్.. జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్గా, రెజ్లర్ పాత్రల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. తొలిరోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పెద్ది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.అయితే పెద్ది మూవీ సంగతి పక్కనపెడితే.. గత కొద్ది రోజులుగా ఓ వ్యక్తి గురించే పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్లో రామ్ చరణ్ కంటే అతనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అతను మరెవరో కాదు.. రామ్ చరణ్ ప్రత్యేక బాడీ గార్డ్ కెవిన్ కుంటా. అతను ఎక్కడికెళ్లినా సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. పెద్ది సినిమాతో కెవిన్ కుంటా ఒక్కసారిగా స్టార్గా మారిపోయాడు.అతనికి ఫేమ్ రావడంపై రామ్ చరణ్ సైతం ఫన్నీగా స్పందించారు. మీరు ఫేమస్ చేసేశారు.. కెవిన్ను బయటికి పంపకుండా చేశారంటూ సరదాగా మాట్లాడారు. తాజాగా కెవిన్ కుంటా ఫిట్నెస్పై ఎంత శ్రద్ధ పెడతారో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. అతను జిమ్లో వర్కవుట్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ కెవిన్ కుంటా డెడికేషన్కు ఫిదా అవుతున్నారు. "Like boss, like bodyguard." 😎🔥#MassaMassa pic.twitter.com/tiFrCqMwg3— ᶠʳᵒᵒᵗʸపెద్ది🦁 (@Mouli_Ka) June 4, 2026 -
'ఉప్పెన హీరో.. హిట్ కోసం తంటాలు.. నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?'
ఉప్పెనతో హిట్ కొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా ఆకట్టుకుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించారు. అయితే ఈ మూవీ హిట్ తర్వాత వైష్ణవ్కు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ పెద్దగా రాణించలేకపోయాయి.దీంతో సక్సెస్ కోసం మెగా హీరో తంటాలు పడుతున్నారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గత మూడేళ్లలో దాదాపు 100కు పైగా స్క్రిప్ట్లను మెగా హీరో తిరస్కరించినట్లు తెలుస్తోంది. పెద్ద నిర్మాతలు సంప్రదించినప్పటికీ ఓకే చెప్పలేదని తెలుస్తోంది. కానీ ఇటీవలే ఓ కథకు వైష్ణవ్ ఓకే చెప్పారని లేటేస్ట్ టాలీవుడ్ టాక్. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.టాలీవుడ్ హీరో సుధీర్ బాబుతో హంట్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ మహేశ్తో వైష్ణవ్ తేజ్ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో సినిమా చేసేందుకు వైష్ణవ్ ఓకే చెప్పారట. మహేశ్ చెప్పిన కథ వైష్ణవ్కు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు రెడీ అవుతున్నారని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే నెలలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. -
అక్కినేని అఖిల్ 'లెనిన్'.. వయొలెంట్ సాంగ్ వచ్చేసింది
అక్కినేని నాగార్జున తనయుడు తనయుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 1న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ కుదరకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది.ఇప్పటికే రిలీజైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అక్కినేని ఫ్యాన్స్ను అలరిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. కుమార వాగ్దేవి, తమన్ ఎస్ పాడారు. ఈ సాంగ్ను తమన్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 26న థియేటర్లలో సందడి చేయనుంది.No WAR is more VIOLENT than LOVE ❤️🔥#SoulOfLenin is out now▶️ https://t.co/caQUyeFpz1 MANODU VASTHUNNADU 🔥🔥#Lenin #LeninOnJune26th @MusicThaman Musical 🎶 🎤 @ImVagdevi ✍️ #KalyanChakravarthy@AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu… pic.twitter.com/Cnm7pLzX5U— Sithara Entertainments (@SitharaEnts) June 5, 2026 -
‘మొహబ్బత్’ విజయం సాధించాలి: ఎమ్మెల్యే నవీన్ యాదవ్
సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘మొహబ్బత్’.ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యాక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం శుక్రవారం నాడు ఘనంగా జరిగింది. పూజా కార్యక్రమాలకు చిన్న శ్రీశైలం యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నవీన్ యాదవ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ని కూడా లాంచ్ చేశారు.ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ .. ‘సినీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాల్ని నిర్మిస్తూనే ఉంటారు. ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఇది పాన్ ఇండియాగా రిలీజ్ కాబోతోంది. దర్శకుడు మ్యాక్కి మంచి సక్సెస్ రావాలి. ఈ సినిమా మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.దర్శకుడు సలీమ్ మాలిక్ (మ్యాక్) మాట్లాడుతూ .. ‘నిర్మాత అఫ్రోజ్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ‘మొహబ్బత్’ను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఎమోషనల్ యూత్ ఫుల్ జెన్ జీ చిత్రంగా ‘మొహబ్బత్’ రానుంది. త్వరలోనే మా సినిమా పాన్ ఇండియా వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని అన్నారు.నిర్మాత అఫ్రోజ్ షేక్ మాట్లాడుతూ .. ‘నా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద మొదటి ప్రాజెక్ట్గా ‘మొహబ్బత్’ను నిర్మిస్తున్నాను. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. మ్యాక్ మంచి దర్శకుడు. సంతోష్, శ్రేయాసిలకు ఈ సినిమాతో మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాను. మా కోసం వచ్చిన నవీన్ యాదవ్ గారికి, శ్రీశైలం యాదవ్ గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ .. ‘‘మొహబ్బత్’ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. ఈ కథ నాకు చాలా నచ్చింది. ఇది నాకు రెండో చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మ్యాక్ గారు, అఫ్రోజ్ గారికి థాంక్స్’ అని అన్నారు.హీరో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ .. ‘అఫ్రోజ్ గారికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. మా డైరెక్టర్ మ్యాక్ అద్భుతమైన టాలెంటెడ్. ఇలాంటి ఓ ప్రేమ కథకు సంగీతం ప్రధానం. సునీల్ కశ్యప్ గారితో పని చేస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు. -
'ఉప్పెన కంటే ఎక్కువ.. ఆయన లేకపోతే పెద్దినే లేదు'
రామ్ చరణ్ పెద్ది సక్సెస్తో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి తొలిరోజే పాజిటిక్ రావడంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్కు హాజరైన డైరెక్టర్ బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు అభిమానులకు బుచ్చిబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రీమియర్స్ నుంచే నాకు ఫోన్ కాల్స్ రావడం మొదలైందన్నారు. పెద్ది విజయానికి కారణం రామ్ చరణ్ మాత్రమేనన్నారు. ఉప్పెన కంటే ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మూవీలోని పెద్ది క్యారెక్టర్ ఆదర్శమని పలువురు కొనియాడారని తెలిపారు. చరణ్ గారు పడిన కష్టాన్ని అందరూ గుర్తించారు.. చరణ్ లేకపోతే ఈ సినిమా లేదు.. థ్యాంక్ యూ చరణ్ సార్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన లేటేస్ట్ మూవీనే పెద్ది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించగా.. శృతిహాసన్ ప్రత్యేక సాంగ్లో మెరిసింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
రెండో రోజే ‘పెద్ది’కి భారీ షాక్.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. ఇలా థియేటర్స్లో విడుదల కాగానే అలా హెచ్డీ ప్రింట్ ఆన్లైన్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ‘పెద్ది’ని కూడా పైరసీ బూతం వదల్లేదు. విడుదలైన రెండో రోజే పెద్ది చిత్రానికి సంబంధించిన హై క్వాలిటీ హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ కావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది.(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం..జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. తొలి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 135 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు మేకర్స్ ప్రటించారు.అంతేకాదు వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు సినీ పండితులు వెల్లడించారు. ఇలాంటి తరుణంలో చిత్రబృందానికి భారీ షాక్ తగిలింది. సినిమాకు సంబంధించని హెచ్డీ ప్రింట్ ప్రముఖ పైరసీ వెబ్సైట్లో ప్రత్యేక్షమైంది.సినిమా లాంగ్ రన్ కలెక్షన్లపై దీని ప్రభావం పడుతుందేమోనని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పైరసీ లింకులను వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగించాలని వారు సైబర్ క్రైమ్ పోలీసులను, డిజిటల్ టీమ్ను సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. @AlwaysRamCharan Peddi movie is streaming online in some site. Someone has forwarded me the link. I can’t send the link here in public. Let me know where to send so you can ask the concern to restrict the site.— Kiran Surya Nadella (@kiran_nadella) June 5, 2026 -
కేవలం సాంగ్స్, ముద్దుల కోసమేనా?.. జాన్వీ రోల్పై సింగర్ షాకింగ్ పోస్ట్
టాలీవుడ్లో ఇప్పుడంతా పెద్ది హవా నడుస్తోంది. జూన్ 4న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. తొలిరోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు పరంగా పెద్దికి కలిసొచ్చింది. దీంతో మొదటి రోజే సెంచరీ మార్క్ను దాటేసింది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.అయితే ఈ మూవీ జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని టాక్ వినిపిస్తోంది. కేవలం గ్లామర్ కోసమే జాన్వీని తీసుకున్నారని విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సింగర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. పెద్దిలో జాన్వీ పాత్రను ఓవర్గా చూపించారని ఆరోపిస్తున్నారు. కేవలం సెక్సువల్ అట్రాక్షన్ కోసమే ఆమెను సినిమాలో తీసుకున్నారని సింగర్ సుమంగళి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా మేకర్స్ నిస్సహాయత వల్ల కలిగే వేదన చుట్టూ ఒక కథను అల్లారని.. కానీ జాన్వీ కపూర్ పోషించిన అచియమ్మ పాత్రకు అదే గౌరవాన్ని ఇవ్వలేదని ఆమె పోస్ట్లో రాసుకొచ్చారు. ఇప్పటికే జాన్వీ కపూర్ పాత్రపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తోన్న సంగతి తెలిసిందే.సుమంగళి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాస్తూ..'శక్తివంతమైన పురుషులతో నిండిన ఒక గదిలో కూర్చుని నిస్సహాయత వల్ల కలిగే వేదన గురించి ఒక కథను రాశారు. వాళ్లు అదే సమయంలో జాన్వీ కపూర్ పాత్రను కెమెరా ముందు కేవలం బలవంతపు ముద్దు పెట్టే ఒక వస్తువుగా.. పాటలు అయిపోయాక ఆమె పక్కకు పారేసే ఓ వస్తువుగా మాత్రమే చూపించారు. ఒక మనిషిని గౌరవించడం ఏమిటో వారికి కచ్చితంగా తెలుసు. కానీ ఆమె దానికి జాన్వీ కపూర్ అర్హురాలు కాదని ముందే నిర్ణయించుకున్నారని ఆమె విమర్శించారు. ఈ సినిమాలో హీరోయిన్కు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. భారతీయ సినిమాలో ఒక కథానాయికకు జరిగిన అత్యంత ఖరీదైన అవమానం అంటూ అనే శీర్షికతో ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ను షేర్ చేసింది.హీరోయిన్ కేవలం గ్లామర్ కోసమే కాదని.. ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండాలని నెటిజన్స్ కోరుతున్నారు. సాంగ్స్, ముద్దుల కోసమే వారిని సినిమాలో చూపించడం కరెక్ట్ కాదంటున్నారు. మహిళలను కేవలం లైంగిక వస్తువులుగా చూడటాన్ని మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా పెద్ది మూవీలోని జాన్వీ కపూర్ సీన్స్పై కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అనుమతి లేకుండా హీరోయిన్ను తాకాలనుకుంటున్నానని పెద్ది చెప్పే సన్నివేశాలపై ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యలన్నీ లైంగిక దాడి కిందకే వస్తాయని చాలా మంది విమర్శిస్తున్నారు. -
అభిమానుల ఓవరాక్షన్.. ఉపాసన ఆగ్రహం.!
టాలీవుడ్లో ప్రస్తుతం పెద్ది హవా నడుస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టారు. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున హడావుడి కనిపించింది. పెద్ది సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.రామ్ చరణ్ సతీమణి కూడా స్వయంగా థియేటర్కు వెళ్లి పెద్ది మూవీని వీక్షించింది. హైదరాబాద్లోని ఓ థియేటర్కు వెళ్లిన ఉపాసన అభిమానులతో కలిసి మూవీ చూసింది. అయితే అదే సమయంలో థియేటర్లో అభిమానుల అల్లరితో అసహనానికి గురైంది. అక్కడే గట్టిగా అరుస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.కాగా.. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. థియేటర్ లో గొడవ పెట్టుకున్న ఉపాసన ఒక్కసారిగా అంతా షాక్ | Upasana Viral Video | CVR News#peddimovierelease #upasana #ramcharan #theatre #ramcharanfans #virulshorts #trending #viral #shorts #cvrnews pic.twitter.com/scrQaV0bAW— Cvr News Telugu (@cvrtelugunews) June 4, 2026 -
తండ్రి నాగార్జున దారిలోనే నాగచైతన్య
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నాగార్జున కాస్త డిఫరెంట్. ఒకవైపు హీరో, విలన్, కీలక పాత్రలు, షో హోస్టింగ్ చేస్తూ మరోవైపు నిర్మాతగానూ అడపాదడపా సినిమాలు తీస్తుంటారు. ప్రస్తుతం తన 100వ మూవీ బిజీలో ఉన్నారు. మరోవైపు కొడుకుల్లో నాగచైతన్య 'వృషకర్మ' చిత్రం చేస్తుండగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుని ప్రకటించారు. 2023లో వచ్చిన వెబ్ సిరీస్ 'దూత' రెండో సీజన్ మొదలుపెట్టేశారు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్'.. డబ్బులు తిరిగిచ్చేస్తున్న నిర్మాత)థ్రిల్లర్ కాన్సెప్ట్తో మెప్పించిన 'దూత' సిరీస్లో నాగచైతన్య, ప్రియాభవానీ శంకర్, పార్వతి ప్రధాన పాత్రలు చేశారు. విక్రమ్ కే కుమార్ దర్శకుడు. మళ్లీ ఇన్నాళ్లు రెండో సీజన్ లాంఛనంగా మొదలుపెట్టారు. అయితే దీనిలో నటించడంతో పాటు నిర్మాతగానూ నాగచైతన్య వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.ఏడాదిన్నర క్రితం శోభితని పెళ్లి చేసుకున్న నాగచైతన్య.. ఆ వెంటనే 'తండేల్'తో వచ్చి హిట్ కొట్టాడు. ఇప్పుడు నిర్మాతగానూ మారిపోయాడు. రాబోయే రోజుల్లో తను హీరోగా నటించే చిత్రాలతో పాటు శోభిత నటించే సినిమాలని కూడా నిర్మిస్తాడేమో! 'దూత' సిరీస్ తొలి సీజన్.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు.(ఇదీ చదవండి: మొన్న 'దేవర'.. ఇప్పుడు 'పెద్ది'.. జాన్వీ కపూర్ అదే తంతు)Auspicious beginnings as I step into the second chapter of Dhootha and my first step as a producer . Onwards and upwards . Here’s to the magic ahead . #dhootha2 @Vikram_K_Kumar @AnnapurnaStdios @nseplofficial @sharrath_marar @Padmak131 @PrimeVideoIN @parvatweets @priya_Bshankar… pic.twitter.com/cReG7A4mbi— chaitanya akkineni (@chay_akkineni) June 5, 2026 -
అతిపెద్ద షాకింగ్ నిజం.. కాజల్ కొత్త సినిమా టీజర్
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర చేస్తున్న సినిమా 'ద ఇండియన్ స్టోరీ'. మన దేశంలో పురుగు మందుల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయే అంశం ఆధారంగా ఈ మూవీ తీశారు. ఇందులో కాజల్.. న్యాయవాదిగా కనిపించనుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. వచ్చే నెల 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్'.. డబ్బులు తిరిగిచ్చేస్తున్న నిర్మాత)అయితే సినిమాలోని విజువల్స్ ఏం చూపించకుండా కాన్సెప్ట్ ఏం ఉండబోతుందనే స్లైడ్స్ మాత్రమే వేశారు. 'మనం ఆహారాన్ని కాదు విషాన్ని పండిస్తున్నాం', '50 వేలకు పైగా మెట్రిక్ టన్నుల పురుగు మందులు వాడుతున్నాం', '20 కోట్ల మంది ప్రజలు వీటి బారిన పడ్డారు', 'ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి క్యాన్సర్తో పోరాడుతోంది', 'ప్రతి నిమిషానికి ఒకరిద్దరు చనిపోతున్నారు', 'ప్రతి ఏడాది 10 లక్షల మందికి పైగా చనిపోతున్నారు', ఇదే 'ద ఇండియా స్టోరీ' అని చూపించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఆసుపత్రి బెడ్పై నుంచే పండు మాస్టర్ వీడియో) -
ఆసుపత్రి బెడ్పై నుంచే పండు మాస్టర్ వీడియో
తెలుగులో డ్యాన్స్ షోలతో గుర్తింపు తెచ్చుకున్న పండు మాస్టర్.. రీసెంట్గా వైజాగ్లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతానికి పండు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆస్పత్రి బెడ్పై నుంచే వీడియో రిలీజ్ చేశాడు. యాక్సిడెంట్ ఎలా జరిగింది? తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వెల్లడించాడు.(ఇదీ చదవండి: మొన్న 'దేవర'.. ఇప్పుడు 'పెద్ది'.. జాన్వీ కపూర్ అదే తంతు)'తగరపువలసలో ఈవెంట్ చేసుకుని బయలుదేరాం. కారులో వస్తుండగా నాకు వాంతి వస్తున్నట్లు అనిపించింది. దీంతో ఆనందపురం దాటిన తర్వాత ఓ చోట ఆగాను. బయటకు దిగి కారు ముందుకెళ్లి వాంతి చేస్తుండగా కోళ్ల ఫారమ్ వ్యాన్ వచ్చి మా కారుని బలంగా ఢీ కొట్టింది. అప్పుడు మా కారు నాపై ఎక్కడంతో నా రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. అప్పుడు నేను అపస్మాకర స్థితిలో ఉండటంతో ఏం జరిగిందో తెలీదు' అని ఈ వీడియోలో పండు చెప్పాడు. అయితే ఈ ప్రమాదానికి కోళ్ల వ్యాన్ డ్రైవర్ అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.వైద్యులు చెప్పిన దాని ప్రకారం.. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ నడుము కింది భాగంలో జాయింట్ కదిలిపోయింది. శస్త్రచికిత్స ద్వారా దాన్ని సరిచేశారు. రెండు కాళ్లకు కూడా సర్జరీలు చేసినట్లు తెలుస్తోంది. కనీసం ఆరు నెలల విశ్రాంతి అవసరమని, తర్వాత మళ్లీ యధావిధిగా డ్యాన్స్ చేయవచ్చని వైద్య బృందం స్పష్టం చేశారు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్'.. డబ్బులు తిరిగిచ్చేస్తున్న నిర్మాత)యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి స్పందించిన 'ఢీ' ఫేమ్ పండు మాస్టర్.. వీడియో వైరల్! #pandumaster #selfievideo #accident #incident #Anntelugu pic.twitter.com/7JjC9j0Nm6— ANN Telugu (@ANN_Telugu) June 5, 2026 -
‘పెద్ది’లో హీరోయిన్కి అవమానం.. ఒప్పుకున్న జాన్వీ కపూర్!
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘పెద్ది’ చిత్రం భారీ అంచనాలతో నిన్న(జూన్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. రామ్ చరణ్ నటన, మేకింగ్, రెహమాన్ సంగీతంపై ప్రశంసలు కురిపించినప్పటికీ.. కథనం, జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వచ్చాయి. దేవర మాదిరే పెద్దిలోనూ జాన్వీ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. పలు సినిమా వెబ్సైట్స్ కూడా తమ రివ్యూల్లో జాన్వీ పాత్ర గురించి నెగెటివ్గానే రాసుకొచ్చాయి. అయితే తన గురించి నెగెటివ్గా రాస్తూ ఇన్స్టాలో పెట్టిన ఓ రివ్యూ పేజీని జాన్వీ కపూర్ లైక్ చేయడమే ఇప్పుడు విమర్శకులకు దారి తీసింది.(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)‘పెద్ది: భారతీయ సినీ చరిత్రలో ఒక హీరోయిన్కి జరిగిన అత్యంత అవమానం’ అని హెడ్డింగ్తో రాసి ఉన్న ఓ రివ్యూ పేజీని జాన్వీ కపూర్ లైక్ కొట్టడంతో అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. విమర్శిస్తూ రాసిన రివ్యూను లైక్ చేసిందంటే.. తన పాత్రకు ప్రాధాన్యత లేదనే విషయాన్ని జాన్వీ కపూర్ కూడా ఒప్పుకుందంటూ కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తే.. మరికొంత మంది ఏమో పొరపాటును ఆమె లైక్ కొట్టిందేమోనని భావిస్తున్నారు. మొత్తంగా ఈ పోస్ట్ వైరల్ కావడం.. పెద్దిపై విమర్శలు రావడంతో జాన్వీ ఆ పోస్ట్ను అన్లైక్ చేసింది. అయితే ఈ లోపే ఆమె లైక్ కొట్టిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్గా మారాయి.కాగా, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రలో కనిపించింది. అయితే అసలు కథలు ఆమె పాత్రకు సంబంధమే ఉండదు. నిడివి కూడా తక్కువే ఉంటుంది. నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అందుకే జాన్వీ పాత్రపై విమర్శలు వస్తున్నాయి. ఇక పెద్ది విషయానికొస్తే..టాక్తో సంబంధం లేకుండా తొలి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ. 135 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. -
మొన్న 'దేవర'.. ఇప్పుడు 'పెద్ది'.. అదే తంతు
'పెద్ది' సినిమా బాగుందా? బాగోలేదా? ఎన్ని కోట్లు కలెక్షన్స్ వస్తాయనేది ఇక్కడ విషయం కాదు. ఒక మంచి ఉద్దేశం లేదా మంచి పాయింట్తో మూవీ తీద్దామనుకున్నప్పుడు అందులో ప్రతి విషయం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. పంటి కింద రాళ్లలా అనవసర సీన్స్ ఉండకూడదు. అలా కాకుండా కమర్షియల్ పేరిట నచ్చిన అంశాలు నచ్చినట్లు పెట్టేస్తే మంచి కంటే మిగతా విషయాలే ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు 'పెద్ది' విషయంలో అదే జరుగుతోంది.(ఇదీ చదవండి: ‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)'పెద్ది' సినిమాలో ఊరి గుర్తింపు కోసం ఓ కుర్రాడు ఎంతవరకు వెళ్లాడు అనే అంశాన్ని చూపించాలనుకున్నారు. అదే చూపించారు కూడా. సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. పాత్ర కోసం అతడు పడిన కష్టం తెరపై కనిపించింది. కానీ హీరోయిన్ పాత్ర తీరుతెన్నులే అత్యంత దారుణంగా ఉన్నాయి. సినిమా చూసిన చాలామంది ఇదే అంటున్నారు. అందచందాల ప్రదర్శన తప్పితే జాన్వీ చేసిందేం లేదు. దీని కోసమే జాన్వీని తీసుకున్నారా అని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.ఈ సినిమాలో ఓ సందర్భంలో హీరో పాత్ర.. అనుమతి లేకపోయినా సరే హీరోయిన్కి ముద్దు పెడతాడు. పైగా దానిని రొమాన్స్ అని జస్టిఫికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలు.. జనాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. పైగా 'పెద్ది' సినిమాకు యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే 16 ఏళ్ల అబ్బాయి లేదా అమ్మాయిలు కూడా ఈ మూవీ చూడొచ్చు. ఇలాంటి సీన్స్ చూస్తే సదరు పిల్లల ఆలోచన ఎలా ఉంటుంది? సదరు సన్నివేశాలపై వీళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది సెన్సార్ బోర్డ్, హీరో, దర్శకనిర్మాత కచ్చితంగా ఆలోచించాలి.జాన్వీ కపూర్లోనూ నటి ఉండొచ్చు. తెలుగు దర్శకులు మాత్రం ఆమెలోని నటి కంటే గ్లామర్నే చూస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ 'దేవర'లోనూ గ్లామర్ షో తప్పితే మరొకటి చేయలేదు. కనీసం 'పెద్ది'లోనైనా కాస్తంత గుర్తింపు ఉన్న పాత్ర చేస్తుందనుకుంటే ఇందులోనూ అదే తంతు. కావాలనే ఈమెతో దర్శకులు అలా చేయిస్తున్నారా? లేదంటే అన్ని తెలిసే జాన్వీ ఇలాంటి రోల్స్ చేయడానికి ఒప్పుకొంటుందా అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. ఇదే కొనసాగితే మాత్రం జాన్వీ.. టాలీవుడ్లో ఎక్కువ రోజులు నిలబడటం కష్టమే!(ఇదీ చదవండి: 'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?) -
విడాకులు తీసుకోనున్న 'బిగ్బాస్' బ్యూటీ
కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటి, బిగ్బాస్ ఫేమ్ శుభ పూంజా పెళ్లి జీవితం ముగింపు దశకు చేరుకుంది. భర్త నుంచి ఈమె విడిపోవాలని నిర్ణయించుకుంది. నాలుగేళ్ల క్రితం నటి శుభ పూంజా, సుమంత్ బిల్లవ పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్నేళ్లకే పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించారు.కన్నడ వ్యాపారి అయిన సుమంత్ బిల్లవ స్వస్థలం ఉడుపి. ఇతడు నటి శుభ పూంజా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2022 జనవరి 5న వివాహం జరిగింది. మరి ఇప్పుడు ఏమైందో ఏమో గానీ ఇద్దరూ ఫ్యామిలీ కోర్టులో అర్జీ వేశారు. వచ్చే వాయిదా రోజున ఇద్దరు కోర్టుకు వెళ్లి జడ్జి ముందు హాజరై విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు. -
సిగ్మా స్టైల్
సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘సిగ్మా’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది. గురువారం ఈ సినిమా నుంచి ‘సిగ్మా స్టైల్’ అంటూ ఈ సినిమా మ్యూజిక్ వీడియోను మలయాళ నటుడు–నిర్మాత దుల్కర్ సల్మాన్ లాంచ్ చేశారు. ‘‘సందీప్–ఫరియాల డైనమిక్ పెర్ఫార్మెన్స్, ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాస్ ట్యూన్, జేసన్ సంజయ్ రాసిన క్యాచీ లిరిక్స్తో ‘సిగ్మా స్టైల్’ పాటను ఇన్స్టంట్ చార్ట్బస్టర్గా నిలబెట్టాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
గండికోటలో...
విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నాల పెళ్లయి ముచ్చటగా మూడు నెలలైంది. అయితే ఈ ఇద్దరూ పెళ్లయిన తర్వాత జస్ట్ చిన్న బ్రేక్ మాత్రమే తీసుకుని, షూటింగ్స్తో బిజీ అయ్యారు. ఇక ఈ ఇద్దరూ జంటగా సిల్వర్ స్క్రీన్పై ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కనిపించిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్లో రానున్న మూడో సినిమా ‘రణబాలి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్తోనే విజయ్–రష్మిక బిజీగా ఉన్నారు.ఈ చిత్రం షూటింగ్ వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని గండికోటలో జరుగుతోంది. కోట ముఖద్వారం దగ్గర, ధాన్యాగారంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గత ఆదివారం గండికోటలో ఆరంభమైన ఈ చిత్రం షెడ్యూల్ నేటితో ముగుస్తుందని సమాచారం. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది.ఈ చిత్రం కోసం విజయ్ దేవరకొండ స్టాలియన్ అనే బ్రీడ్కు చెందిన గుర్రాలను స్వారీ చేయడం నేర్చుకున్నారు. ‘‘ఇది చాలా కఠినమైన ట్రైనింగ్. స్టాలియన్ బ్రీడ్ గుర్రాలను స్వారీ చేయడం అంత ఈజీ కాదు’’ అని ఆ మధ్య విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా యూనిట్ పేర్కొంది. చిత్రబృందం పేర్కొన్నట్లే... విజయ్ చాలా ప్రయత్నాలు చేసి, సక్సెస్ఫుల్గా హార్స్ రైడింగ్ చేయడం ఆ గ్లింప్స్లో కనిపించింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్ – అతుల్, కెమెరా: నీరవ్ షా. -
పొల్లాచ్చిలో ప్రారంభం
పొల్లాచ్చి వెళ్లింది చిరంజీవి అండ్ టీమ్. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో ‘చిరు158’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ యువ హీరోయిన్ అనశ్వర రాజన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని ఓ కాలేజీలో జరిగింది.చిరంజీవి–అనశ్వరల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్ తమిళనాడులోని పొల్లాచ్చిలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘దర్శకుడు బాబీ ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేశారు. ఈ సినిమాలో చిరంజీవి తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.ఇందుకోసం ఆయన ఫిజికల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. ఇక ఈ చిత్రం ప్రధాన కథాంశం కోల్కతా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో చిరంజీవి గ్యాంగ్స్టర్గా కనిపిస్తారని సమాచారం. అలాగే తండ్రీ కూతుళ్ల ఎమోషన్ ఈ సినిమా కథకు కీలకమని, చిరంజీవి–అనశ్వర తండ్రీ కూతుళ్లుగా కనిపిస్తారని తెలిసింది. కెవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్ .ఎస్. -
త్రిషతో వివాదం.. సీఎం విజయ్కి పార్తీబన్ కానుక!
తమిళనాడు ఎన్నికల సమయంలో నటుడు పార్తీబన్ త్రిషను లక్ష్యంగా చేసుకుని ఆమెను బయటకు రానివ్వకూడదు, కొన్నాళ్లు త్రిష ఇంట్లో ఉంటేనే మంచిది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.అయితే ఇప్పుడు అదే పార్తీబన్ నేరుగా తమిళనాడు సీఎం విజయ్ని కలవడం ఆసక్తికరంగా మారింది. విజయ్-త్రిష మధ్య సంబంధాలపై ఊహాగానాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వీరిద్దరి భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత భేటీలో అసలు వీరిద్దరూ త్రిష గురించి మాట్లాడుకున్నారా లేదా..?, పార్తీబన్ తను అప్పట్లో త్రిషపై చేసిన వ్యాఖ్యల గురించి ఏదైనా వివరణ ఇచ్చారా లేదా అనే విషయం మాత్రం బయటకు రాలేదు.ఇక సీఎం విజయ్ను కలిసిన సందర్భంగా పార్తీబన్ ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారు. విజయ్ను చక్రవర్తిగా పోలుస్తూ రూపొందించిన ఓ పెయింటింగ్ను విజయ్కు అందజేశారు. దాంతో ఈ బహుమతి కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
మ్యాడ్ హీరో కొత్త సినిమా.. బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
మ్యాడ్ మూవీతో యూత్ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరో రామ్ నితిన్. మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని వల్లభనేని గిరిబాబు సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుందరకాండ ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు.ఇవాళ హీరో రామ్ నితిన్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ పోస్టర్ కలర్ ఫుల్ కాలేజ్ ఫెస్ట్ వైబ్స్తో ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. 'ఫన్, ఫెస్ట్, కెయాస్..బిగిన్స్ సూన్' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని కాకినాడలోని ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు లిటిల్ హార్ట్స్ ఫేమ్ సింజిత్ యర్రమల్లి మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నారు. -
పెద్దిపై జపనీస్ ప్రేమ.. ఉద్యోగానికి సెలవులు పెట్టి మరి..!
మెగా హీరో రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఎన్నో రోజులు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. బుధవారం రాత్రి నుంచే పెద్ది హవా మొదలైంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మెగా ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే పాన్ ఇండియా రేంజ్లో పెద్దికి అభిమానుల ఆదరణ లభిస్తోంది.అయితే రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికి జపాన్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్పై అభిమానంలో ఏకంగా జపాన్ మహిళలు హైదరాబాద్కు వచ్చేశారు. పెద్దిని చూసేందుకు రూ.2 లక్షల ఖర్చు పెట్టి మరి ఇండియాలో ల్యాండయ్యారు. ఉద్యోగానికి ఐదు రోజులు సెలవు పెట్టి మరి రెండు రోజుల ముందే నగరానికి చేరుకున్నారు జపాన్ అభిమానులు మసామీ, క్రిస్. తమ స్నేహితురాలు కణ్మనితో కలిసి నగరంలోని మల్టీఫ్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాను ఆస్వాదించారు. పెద్ది సినిమా కేవలం ఒక షో కాదు.. ఏకంగా 10 షోలు చూశాకే జపాన్ విమానం ఎక్కుతామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Japan Rc fans watched #Peddi at bramarambha ❤️🔥Their love for @AlwaysRamCharan is unconditional 🥹❤️ pic.twitter.com/DZSEqfsWcb— Mr.RK (@RavikumarJSP) June 4, 2026 -
'నా బాడీ గార్డ్ను బయటికెళ్లకుండా చేశారు'.. రామ్ చరణ్ ఫన్నీ కామెంట్స్
తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ పెద్ది హవా కనిపిస్తోంది. ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది.అయితే పెద్ది మూవీతో మరో వ్యక్తి అనూహ్యంగా ఫేమ్లోకి వచ్చేశాడు. అతను మరెవరో కాదు.. రామ్ చరణ్ స్పెషల్ బాడీ గార్డ్ కెవిన్. పెద్ది ఈవెంట్స్లో అతను కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆరా తీయడం మొదలెట్టారు. అంతేకాకుండా పెద్ది’ రిలీజ్ నేపథ్యంలో పలు థియేటర్ల వద్ద అభిమానులు కెవిన్కు పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేయడం మరో విశేషం.ఇటీవల మూవీ ప్రమోషన్స్లో రామ్ చరణ్ అతని గురించి మాట్లాడారు. కెవిన్ చాలా త్వరగా పాపులర్ అయ్యాడని అన్నారు. అతన్ని మీరే ఫేమస్ చేశారని.. అందుకే నేను అతన్ని బయటికి వెళ్లనివ్వడం లేదని అన్నారు. కెవిన్ను స్వేచ్ఛగా బయటకు వెళ్లకుండా చేశారని సరదాగా మాట్లాడారు. కెవిన్ దాదాపు నాలుగేళ్లుగా మా కుటుంబంతోనే ఉంటున్నాడని తెలిపారు. వ్యక్తిగత దినచర్యలు అతనికి బాగా తెలుసని.. పిల్లలతో బయటకు వెళ్లినప్పుడు తరచుగా వారితో పాటు వెళ్తుంటాడని రామ్ చరణ్ స్పష్టం చేశారు. కాగా.. కెవిన్ పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియాకు చెందిన ఒక ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్లో నివసిస్తున్నారు. కెవిన్ తనకు వస్తున్న ఆదరణ చూసి సోషల్ మీడియాలో భారతీయ అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. -
ఈ వీకెండ్ పండగే.. థియేటర్లలో పెద్ది.. ఓటీటీలో దురంధర్-2..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వీకెండ్ మొత్తం రామ్ చరణ్ పెద్ది హవా ఉండనుంది. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు నుంచే పాజిటివ్ వస్తోంది. సూపర్ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారాంతం మూడు రోజులు పెద్దికి కలిసి రానుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే దురంధర్-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచే ప్రీమియర్ షోతో దురంధర్ ఓటీటీలో సందడి చేయనుంది. దీంతో పాటు అగ్లీ స్టోరీ, కేడీ ది డెవిల్ లాంటి సినిమాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. ఈ ఫ్రైడే పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు సైతం స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ 29 (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూన్ 05 మెక్సికో 86 (స్పానిష్ సినిమా) - జూన్ 05 ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 05 టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ సిరీస్) - జూన్ 05 ద మార్క్డ్ ఉమన్ (స్పానిష్ సినిమా) - జూన్ 05స్కార్లెట్ (హాలీవుడ్ మూవీ)- జూన్ 06 యూఎస్ఏ 94 (పోర్చుగీస్ చిత్రం) - జూన్ 07జియో హాట్స్టార్ ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05అమెజాన్ ప్రైమ్ ద పిరమిడ్ స్కీమ్ (హిందీ సిరీస్) - జూన్ 05 పీటర్(కన్నడ సినిమా)- జూన్ 05జీ5 పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 05 కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05 బ్రౌన్ (హిందీ సిరీస్) - జూన్ 05సోనీ లివ్ గుల్లాక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 05సన్ నెక్స్ట్ ద రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05ఆహాఅగ్లీ స్టోరీ(తెలుగు సినిమా)- జూన్ 5ఆపిల్ టీవీకేప్ ఫియర్(హాలీవుడ్ సినిమా)- జూన్ 05 -
పెద్దిపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ.. ఏమన్నారంటే?
టాలీవుడ్లో ఇప్పుడంతా పెద్ది మాటనే వినిపిస్తోంది. బుధవారం రాత్రి మొదలైన హడావుడి తొలి రోజే మరింత ఊపందుకుంది. పెద్ది మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పెద్దిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని డైరెక్టర్ సుకుమార్తో పాటు ఉపాసన కూడా వీక్షించారు.తాజాగా పెద్ది మూవీని యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వీక్షించారు. హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో వీక్షించిన సందీప్ రెడ్డి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. థియేటర్ నుంచి బయటికి వస్తున్న సందీప్ను అక్కడే ఉన్న కొందరు అభిమానులు సినిమా ఎలా ఉంది? అని అడిగారు. దీనికి సందీప్ రెడ్డి బదులిస్తూ.. బాగుంది అని రిప్లై ఇచ్చారు. కాగా.. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన పెద్దికి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా రెబల్ స్టార్ ప్రభాస్తో మూవీని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి స్పిరిట్ టైటిల్ ఫిక్స్ చేశారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.Sensational director Sandeep Reddy Vanga snapped at AMB Cinemas, Hyderabad after watching the special screening of Ram Charan's #Peddi!#SandeepReddyVanga #RamCharan #PeddiMovie #AMBCinemas pic.twitter.com/r1dmMAovhq— SR PROMOTIONS (@SRPROMOTIONS29) June 4, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. పూనకంతో స్టెప్పులేసిన మహిళ అభిమాని..!
రామ్ చరణ్ పెద్ది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 3న ప్రీమియర్స్తో మొదలైన పెద్ది హవా.. మొదటి రోజే ఫ్యాన్స్ను ఊపేస్తోంది. అభిమానులు సూపర్ హిట్ అంటూ పండుగ చేసుకుంటున్నారు. ఓ మహిళ అభిమాని ఏకంగా థియేటర్లోనే డ్యాన్స్ చేస్తూ అలరించింది. రైరై రారా అంటూ సాగే పాటకు పూనకం వచ్చినట్లు స్టెప్పులతో అదరగొట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ అద్భుతంగా డాన్స్ చేోశావంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కాగా.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. రెండుసార్లు వాయిదా పడినా ఈ చిత్రం టాక్సిక్ తప్పుకోవడంతో జూన్ 4న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. కోలీవుడ్ భామ శృతిహాసన్ సైతం ప్రత్యేక సాంగ్లో మెరిసింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.‘పెద్ది’ రిలీజ్.. థియేటర్లో డాన్సులతో రచ్చ చేసిన లేడీ ఫ్యాన్.మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ప్రీమియర్లతోనే అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. థియేటర్లలో పేపర్ల వర్షం, ఈలలు, డ్యాన్స్లతో అభిమానులు ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు.అయితే అందరి దృష్టిని… pic.twitter.com/eMWVbzWkvN— Tupaki (@tupaki_official) June 4, 2026 -
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత, సీబీఎఫ్సీ మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలతో మృతి చెందారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఆయన ప్రముఖ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.పహ్లాజ్ నిహలానీ తన కెరీర్లో 'ఆంఖేన్', 'అందాజ్', 'తలాష్', 'రంగీలా రాజా', 'జూలీ 2' వంటి అనేక బాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా 2015 నుంచి 2017 వరకు సీబీఎఫ్సీ ఛైర్పర్సన్గా పనిచేశారు. సెన్సార్షిప్, ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డులో ఆయన ఉన్న సమయంలో, తీసుకున్న అనేక నిర్ణయాలు చిత్ర పరిశ్రమలో చర్చలకు దారితీశాయి. నిహలానీ నిర్మాతగా వివిధ జానర్లకు చెందిన అనేక కమర్షియల్ హిందీ చిత్రాలు నిర్మించారు. హిందీ చిత్ర పరిశ్రమకు దశాబ్దాల పాటు ఆయన సేవలందించారు. ఆయనకు భార్య నీతా, ముగ్గురు కుమారులు విశాల్, దీపేశ్, చిరాగ్ ఉన్నారు. -
‘పెద్ది’పై చిరంజీవి రివ్యూ.. గర్వంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది చిత్రం థియేటర్స్లో సందడి చేస్తోంది. నిన్న(జూన్ 3) రాత్రి ప్రీమియర్ షో నుంచే మెగా అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్స్కి పోటెత్తారు. ఒక సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం సినిమా చూసి..సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన కొడుకు సినిమాపై స్పందించాడు. ఎక్స్ వేదిగా ‘పెద్ది’పై తనదైన శైలీలో రివ్యూ ఇస్తూ.. ‘తండ్రిగా, నటుడిగా చరణ్ చూసి గర్వంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)‘నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం. ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబుకి నా ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత సతీష్ కిలారుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, ‘కరునాడ చక్రవర్తి’ శివరాజ్ కుమార్, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతి బాబుకి అభినందనలు. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన రెహమాన్కి, తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్ను అత్యద్భుతంగా మలిచిన, అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన కొల్లా అవినాష్, తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ నవీన్ నూలికి ప్రత్యేక అభినందనలు. ఈ చిత్రం విజయంలో భాగమైన జాన్వీ కపూర్, ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. పెద్ది సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. -
‘పెద్ది’ గాడి మాస్ ఎంట్రీ.. థియేటర్స్లో పేపర్లు ఎగరేసిన ఉపాసన
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం పెద్ది థియేటర్స్లో సందడి చేస్తోంది. రిలీజ్కి ఒక్క రోజు ముందు అంటే నిన్న(జూన్ 3) రాత్రే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. మెగా అభిమానులంతా థియేటర్స్కి పోటెత్తారు. ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా నిన్న రాత్రే సినిమా చూశారు. హైదరాబాద్ బాలానగర్లో ఉన్న విమల్ థియేటర్స్లో అభిమానుల మధ్య ఉపాసన తన స్నేహితులతో కలిసి సినిమా వీక్షించారు. పెద్ది పాత్ర ఎంట్రీ కాగానే ఫ్యాన్స్తో కలిసి పేపర్లు ఎగరేస్తూ, ఆనందంతో గట్టిగా అరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక మెగా అభిమానులు అయితే రాత్రి నుంచే నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. సినిమా చూసిన వారిలో చాలా మంది చరణ్ యాక్టింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. రెహమాన్ బీజీఎంపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్ మొత్తంలో ఇప్పుడు పెద్ది గురించే చర్చ కొనసాగుతోంది. మరి కలెక్షన్ల పరంగా పెద్ది ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. Upasana garu is throwing papers for RC’s entry ❤️ #Peddi #Ramcharan #Upasana pic.twitter.com/9g6Ng33eES— justin telugu (@JustinTelu59343) June 3, 2026 -
సింగ్ గీతంలో నాది బలమైన పాత్ర
‘‘సింగీతం శ్రీనివాస్గారి సినిమాల్లో మహిళల పాత్రలు బలంగా ఉంటాయి. ‘సింగ్ గీతం’లో నాది కూడా బలమైన వ్యక్తిత్వం కలిగిన పాత్ర’’ అని అహల్య బమ్రూ తెలిపారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘సింగ్ గీతం’. ఆయాన్, అహల్యా బమ్రూ హీరో హీరోయిన్లుగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా అహల్య బమ్రూ మాట్లాడుతూ– ‘‘మాది పుదుచ్చేరి. ఇంగ్లిష్, ఫ్రెంచ్, బెంగాలీ వంటి భాషలు మాట్లాడే ఒక ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పెరిగాను. నేను ఎప్పుడూ నటిని అవ్వాలని అనుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేస్తుంటాను. నాగ్ అశ్విన్గారు నా కంటెంట్ చూసి ‘సింగ్ గీతం’ గురించి చెప్పారు. నా ఆడిషన్ కూడా ఇన్స్టా్రగామ్ ద్వారానే ఇచ్చాను. 94 ఏళ్ల వయసులో మోడ్రన్ ఆలోచనతో సినిమా చేయడం సింగీతంగారికే సాధ్యం. నిర్మాతగానే కాదు.. క్రియేటివ్ ్ర΄ాసెస్లో కూడా నాగ్ అశ్విన్గారు కీలక ΄ాత్ర ΄ోషించారు. తెలుగులో మహేశ్బాబుగారు అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
పెద్ది రిలీజ్..తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ
పెద్ది రిలీజ్ సందర్భంగా సినీ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న జాన్వీ.. గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, జాన్వీ కపూర్, రామ్ చరణ్ జంటగా నటించిన పెద్ది చిత్రం ఈ రోజు (జూన్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. కథ బాగున్నప్పటికీ.. కథనం ఊహకందేలా ఉండడం మైనస్ అని చెబుతున్నాయి. అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని అంటున్నారు.ఇక ఏఆర్ రెహమాన్ సంగీతంపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నేపథ్యం సంగీతం కొత్తగా ఉందని... అదే సినిమా స్థాయిని పెంచిందని కామెంట్ చేస్తున్నారు. (పెద్ది సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)Tirumala, Andhra Pradesh: Actor Janhvi Kapoor visited the Tirumala temple and offered prayers at the revered shrine.#JanhviKapoor #Tirumala #Tirupati #AndhraPradesh #CelebrityUpdate pic.twitter.com/hriHzRfDu6— Rohit (@Rohit6156585804) June 4, 2026 -
‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : పెద్దినటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులునిర్మాత: సతీష్ కిలారుసమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్రచన-దర్శకత్వం: బుచ్చిబాబుసంగీతం: ఏఆర్ రెహమాన్సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలుఎడిటింగ్: నవీన్ నూలివిడుదల తేది: జూన్ 4, 2026గ్లింప్స్తోనే అంచనాలు పెంచేసిన చిత్రం ‘పెద్ది’. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్ల గ్యాప్తో బుచ్చిబాబు తీసిన సినిమా కూడా ఇదే. చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ సంగీతం అదించిన తెలుగు చిత్రం ఇదే కావడం మరో ప్రత్యేకం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మరి ఆ అంచనాలకు, ఆసక్తికి దీటుగా ఈ చిత్రం ఉందా? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూ(Peddi Review)లో చూద్దాం.కథేంటంటే..1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో కొండ కింద ఓ ఊరు ఉంటుంది. అక్కడ 450 కుటుంబాలు, 1800 మంది జనాభా ఉన్నా.. ఆ ఊరికి గుర్తింపే ఉండదు. ఆ ఊర్లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే గుర్తింపుతో పాటు కాలి నడక ప్రయాణం తప్పుతుందని, అదే ఊరికి చెందిన అప్పల సూరి(జగపతిబాబు) 30 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరోవైపు ఆ ఊరికి చెందిన యువకుడు పెద్ది(పెద్ది) కూలీ పని చేస్తూ.. డబ్బుల కోసం క్రికెట్ ఆడుతుంటాడు. ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టడం ఆయన స్పెషాలిటీ. క్రికెట్లో విజయనగరం యువత మొత్తానికి ఫేవరేట్ అయిన పెద్ది..ఓ కారణంగా ఆ ఆటను వదిలేసి ప్రాణాలను పణంగా పెట్టి కుస్తీ నేర్చుకుంటాడు. గౌర్నాయుడు(శివరాజ్కుమార్) శిక్షణలో కుస్తీ పోటీల్లో నేషనల్ వరకు వెళ్తాడు. మరి నేషనల్ పోటీల్లో పెద్ది గెలిచాడా లేదా? తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆటను ఎందుకు వదుకోవాల్సి వచ్చింది? కుస్తీ, క్రికెట్తో పాటు మరో ఆట కూడా ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఆ ఆట ఏంటి? అసలు పెద్ది లక్ష్యం ఏంటి? అది నెరవేరిందా లేదా? ఈ కథలో అచ్చీయమ్మ( జాన్వీ కపూర్), రామ్ బుజ్జి( దివ్యేందు శర్మ) పాత్రలు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే...గుర్తింపు కోసం ఓ యువకుడు చేసే క్రీడా పోరాటమే ఈ పెద్ది కథ. దర్శకుడు బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఓ ఎమోషనల్ స్టోరీ రాసుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ ఈ కథలో ఓ ప్రత్యేకత ఉంది. హీరో ఒక ఆటకే పరిమితం కాడు. క్రికెట్తో తెరపై ఎంట్రీ ఇచ్చి, కుస్తీతో ఆకట్టుకొని, అథ్లెట్గా ప్రేక్షకుల హృదయాలను గెలుస్తాడు. మూడు విభిన్నమైన క్రీడల్నీ తీసుకున్న బుచ్చి బాబు.. వీటి మధ్యలో ఓ ఎమోషనల్ కథ చెప్పాడు. ఆ కథ ఊహకందేలా సాగడమే ఇక్కడ కొంతవరకు మైనస్. అయితే రామ్ చరణ్ నటన, రెహమాన్ నేపథ్య సంగీతం ఆ మైనస్ని కొంతవరకు కప్పిపుచ్చాయనే చెప్పాలి.2016లో కథ ప్రారంభం అవుతుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్కి కేవలం 2 ఓలింపిక్స్ పథకాలే రావడంతో క్రీడా శాఖ మంత్రి అధికారులపై సీరియస్ అవ్వడం.. వచ్చే పోటీల్లోపు మెరికాల్లాంటి కుర్రాళ్లను తయారు చెయమని ఆదేశించడం.. ఓ అధికారి(బోమన్ ఇరానీ) విజయనగరం రావడం.. అక్కడ పెద్ది పేరు విని..అతని గురించి తెలుసుకునేందుకు ఆ ఊరికి చెందిన ఓ వ్యక్తితో కలిసి ప్రయాణం చేసినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆ ఊరి వ్యక్తి పెద్దికి భారీ ఎలివేషన్ ఇస్తూ.. స్టోరీని ప్రారంభిస్తాడు. అయితే కేజీయఫ్ తర్వాత ఇలా హీరో కథని ఎలివేషన్ ఇస్తూ, ముక్కలు ముక్కలుగా చెప్పడం రొటీన్గా మారింది. అందుకే పెద్ది ప్రారంభం అంత ఆసక్తికరంగా అనిపించదు. ఎప్పుడైతే పెద్ది పాత్ర ఎంట్రీ ఇచ్చి గ్రౌండ్లో సిక్సర్ కొడతాడో.. అప్పటి నుంచి కథనం ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఒకవైపు పెద్ది క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెబుతూనే.. మరోవైపు అప్పల సూరి పాత్ర ద్వారా ఊరి సమస్య చూపించి.. అసలు సంఘర్షణ ఏంటనేది మొదటి నుంచే ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పుకొచ్చాడు. అయితే అచ్చీయమ్మగా జాన్వీ ఎంట్రీ, ఎన్నికల ప్రచారం.. ముద్దు సీన్.. ఇవేవి అంతగా ఆకట్టుకోవు. అసలు కథకు ఈమె పాత్రకు సంబంధమే ఉండదు. జగపతి బాబు పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఎమెషనల్గా సాగుతాయి. పోలీస్ స్టేషన్ సీన్తో హీరో మెయిన్ ట్రాక్ ఎక్కుతాడు. ఇంటర్వెల్ సీన్ ని దర్శకుడు చక్కగా ప్లాన్ చేశాడు. ఫస్టాఫ్ మొత్తం పక్కా కమర్షియల్ మీటర్లో తీర్చిదిద్దిన బుచ్చిబాబు.. సెకండాఫ్ని మాత్రం వాటిని పట్టించుకోకుండా చెప్పాల్సిన పాయింట్పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. ద్వితియార్థంలో వచ్చే కుస్తీ ఎపిసోడ్స్ అన్ని ఆకట్టుకుంటాయి. ఒకవైపు కుస్తీ పోటీలు జరుగుతుండగానే కీలక మలుపు రావడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. ఢిల్లీ ఎపిసోడ్.. ప్రమోషన్స్లో చెప్పినంత గొప్పగా ఏమి ఉండదు. కానీ ఊరి గుర్తింపు కోసం హీరో తీసుకునే కఠిన నిర్ణయం మాత్రం హృదయాలను హత్తుకుంటుంది. క్రీడలకు సంబంధించిన ఎపిసోడ్స్ విషయంలో దర్శకుడు చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. అయినా కూడా తెరపై సహజంగానే కనిపిస్తాయి. ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఎమోషనల్గా సాగుతుంది. ఎవరెలా చేశారంటే.. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఇది. క్రికెటర్గా, కుస్తీ ఆటగాడిగా, అథ్లెట్గా మూడు విభిన్నమైన పాత్రలతో కనిపించిన చరణ్..ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. అప్పల సూరి పాత్రతో జగపతి బాబు ఒదిగిపోయాడు. అయితే ప్రమోషన్స్లో ఇచ్చినంత ఎలివేషన్స్ మాత్రం సినిమాలో లేవు. కుస్తీ గురువు గౌర్నాయుడు పాత్రకు శివరాజ్కుమార్ న్యాయం చేశాడు. ఇక అచ్చియమ్మగా జాన్వీ కపూర్ తెరపై కనిపించేంది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. కొన్ని చోట్ల ఆమె నటన అతిగా అనిపిస్తుంది. అలాగే అసలు కథకి ఆమె పాత్రకు సంబంధమే ఉండదు. హీరోయిన్ అన్నాక కథకు కొంత లింకు చేయాలి అన్నట్లుగా.. కొంతవరకు అలా చూపించారంతే. రామ్ బుజ్జిగా దివ్యేందుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు బాగున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచేసింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
పెద్ది రిలీజ్ వేళ.. శ్రీవారి సేవలో బుచ్చిబాబు ఫ్యామిలీ
పెద్ది రిలీజ్ వేళ బుచ్చిబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్ది కోసం రామ్ చరణ్తో సహా తాము చాలా కష్టపడ్డామని తెలిపారు. ఈ మూవీ ఘన విజయం సాధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జూన్ 3 రాత్రి నుంచే పెద్ది ప్రీమియర్స్ షోలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
ఓటీటీకి డకాయిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా హిందీ వర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. డకాయిట్ హిందీ వర్షన్ జూన్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్లో హిందీ వర్షన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.డకాయిట్ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.pyaar mein badla ya pyaar se badla 💔#DacoitOnPrime, In Hindi, June 5@AdiviSesh @mrunal0801 @anuragkashyap72 #SupriyaYarlagadda @Deonidas #ZaynMarieKhan @bhaskarla_sai @atul_kulkarni #BheemsCeciroleo @abburiravi @AnnapurnaStdios @AsianSuniel #SSCreations @sonymusicindia pic.twitter.com/zNvGM3KtJ0— prime video IN (@PrimeVideoIN) June 3, 2026 -
పెద్ది ప్రీమియర్ షో.. ఉపాసన ఏ థియేటర్లో చూడనుందంటే?
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పెద్ది పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ సినిమా చూసేందుకు మెగా ఫ్యాన్స్ అంతా సిద్ధమైపోయారు. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు భారీస్థాయిలో పెరిగిపోయాయి.ఈ మూవీ ప్రీమియర్ షో చూసేందుకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల రానుంది. బాలానగర్లో విమల్ 70ఎంఎం థియేటర్లో ఆమె పెద్దిని వీక్షించనుంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్కు ఉపాసనతో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరు కానున్నారు. పెద్ది కోసం గ్రాండ్గా సెలబ్రిటీ ప్రీమియర్ షోను ప్లాన్ చేశారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు సైతం పెద్దిని వీక్షించనున్నారు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా డైరెక్షన్లో వస్తోన్న మూవీ ‘పెద్ది’. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
విజయ్ దేవరకొండ రణబాలి.. గండికోటలో గుర్రపు స్వారీ..!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ రణబాలి. ఈ మూవీని రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ కథ బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే కర్నూల్, నంద్యాల జిల్లాలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ జరిగింది.ప్రస్తుతం రణబాలి షూటింగ్ కడప జిల్లాలోని గండకోటలో జరుగుతోంది. రాయలసీమ కథకు తగినట్లుగా యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా కోట ముఖద్వారం వద్ద, ధాన్యాగారంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ముఖ్యంగా గుర్రపు స్వారీ చేసే యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Grand Canyon of India Gandikota Maa Rayalaseema Ela anipinchindi anna @TheDeverakonda ❤️#VijayDevaraKonda #Ranabali https://t.co/NVMZTfLF9a pic.twitter.com/ALGkWAr9Fb— Narasimha NTR 🦚 (@NarasimhaNTR_) June 2, 2026 -
పెద్ది ఫస్ట్ రివ్యూ.. అంచనాలు పెంచేసిన సమంత
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సనా కాంబినేషన్లో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం ఈ రోజు(జూన్ 3) రాత్రికే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే అప్పుడే రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు. అందులో వాస్తవం ఉందో తెలియదు కానీ.. సినిమా సూపర్, రామ్ చరణ్ నటన అదిరిపోయిందంటూ ఎక్స్లో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. క్రీడాకారుడిగా రామ్ చరణ్ నటన అదరగొట్టేశాడని సెన్సార్ సభ్యులు అన్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింటని చెప్పారట. అంతేకాదు జాన్వీ కపూర్, జగపతి బాబు నటనపై కూడా ప్రశంసలు కురిపించారట.#Peddi అందరూ రామ్ చరణ్ గురించే మాట్లాడుతున్నారు..అయితే ఓ సీన్ లోజాన్వి ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టిస్తుంది..విజిల్స్ వేయిస్తుంది— devipriya (@sairaaj44) June 3, 2026మరోవైపు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్పై ప్రశంసలు కురిపిస్తూ..పెద్దిపై హైప్ క్రియేట్ అయ్యేలా పోస్టులు పెడుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో లో సమంంత మాట్లాడుతూ.. 'నేను పెద్ది సినిమా కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ఇది పెద్ది టైమ్. చరణ్ ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరచబోతున్నాడు. ఈ పాత్ర కోసం అతను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. నాకు ఈ సినిమాలో బ్లాక్బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం టీమ్కు ఆల్ ది బెస్ట్' అంటూ తన శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్తో పాటు పలువు టాలీవుడ్ హీరోలు కూడా పెద్ది టీమ్కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్స్ చేశారు. INSIDE REPORTS:#PEDDI seems to be a film that will connect more strongly with South Indian audiences. The emotions, setting, and mass moments feel very rooted, making it a proper big-screen experience. 🔥— Cɪɴᴇ Hᴜɴɢᴀᴍᴀ (@Cinehungamaa) June 3, 2026 -
అల్లు అర్జున్- లోకేశ్ మూవీ ఆగిపోయిందా?.. ఇందులో నిజమెంత?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. బన్నీ లుక్ తోడేలును తలపించేలా ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో అల్లు అర్జున్ నెగెటివ్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగానే బన్నీ మరో సినిమా ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్తో మూవీని(AA23) చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రంపై రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఆగిపోయిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.కానీ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, కాస్టింగ్ ప్రాసెస్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్కు అల్లు అర్జున్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో లోకేశ్ నిమగ్నమై ఉన్నారని ఇండస్ట్రీలో టాక్. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. -
థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహం.. సోషల్ మీడియాలో ట్రోల్స్..!
పెద్ది మూవీ రిలీజ్ వేళ తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ఇప్పటికే భారీస్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. రిలీజ్కు ఒక్క రోజు ముందే థియేటర్లలో పెద్ది పండుగ వాతావరణం నెలకొంది. దీంతో హైదరాబాద్లో నగరంలో ప్రముఖ థియేటర్ల వద్ద అభిమాన హీరో రామ్ చరణ్ కటౌట్స్తో పాటు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని కూకట్పల్లిలో ఉన్న అర్జున్ థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.అయితే రామ్ చరణ్ విగ్రహం కాస్తా ట్రోలింగ్కు గురైంది. అస్సలు రామ్ చరణ్లా లేదంటూ నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామ్ చరణ్లా లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ సైతం విమర్శించారు. విగ్రహంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏర్పాటు చేసిన అభిమాన సంఘం తమ పొరపాటుకు క్షమాపణలు చెప్పింది. మేము ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం.. రామ్ చరణ్ విగ్రహంతో మా ప్రేమ, అభిమానం, భక్తిని ప్రత్యేకమైన రీతిలో వ్యక్తపరచాలనుకున్నాం.. కానీ దురదృష్టవశాత్తు అంచనాలను అందుకోలేక విఫలమయ్యాం అని క్లారిటీ ఇచ్చారు.ఆ విగ్రహం టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర, మలయాళ నటుడు జోజు జార్జ్లా ఉందని కొందరు ట్రోల్స్ చేశారు. మరికొందరు నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. సూపర్ అన్నా.. ఇంతకీ అది ఎవరి విగ్రహం? అని రాసుకొచ్చారు. రామ్ చరణ్ విగ్రహం చేయడానికి ప్రయత్నించి.. రాహుల్ రామకృష్ణ విగ్రహం తయారు చేశారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా డైరెక్షన్లో వస్తోన్న మూవీ ‘పెద్ది’. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా.. శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. We sincerely apologize to everyone. Our intention with the Ram Charan statue was to express our love, admiration, and devotion towards @AlwaysRamCharan in a unique way. Unfortunately, the execution did not meet expectations and turned out to be a misfire.— KUKATPALLYRCFC (@KukatpallyRCFC) June 2, 2026 -
మీ అభిమానం సల్లగుండా.. పెద్ది కోసం రూ.2 లక్షల ఖర్చు..!
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రాత్రి నుంచే పెద్ది సందడి మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా పెద్ది మానియా కనిపిస్తోంది. టాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్స్లో పెద్ది దూసుకెళ్తోంది. ఉత్తర అమెరికాలోనూ ప్రీ బుకింగ్స్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదంతా చూస్తుంటే మూవీపై క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.ఈ సినిమాకు ఫ్యాన్స్ కేవలం ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్లోనూ ఉన్నారు. పెద్ది కోసం ఏకంగా విదేశాల నుంచి హైదరాబాద్లో అడుగుపెట్టారు. జపాన్లోని టోక్యోకు చెందిన ఇద్దరు జపనీస్ మహిళ అభిమానులు భాగ్యనగరానికి చేరుకున్నారు. పెద్దిని చూసేందుకు దాదాపు రూ.2 లక్షల ఖర్చు చేసి హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరు పెద్ది సినిమాను 3 రోజుల్లో 10 సార్లు చూడాలన్నదే ఆశయమని చెబుతున్నారు. తెలుగు భాష రాకపోయినా కేవలం అభిమానంలో జపాన్ నుంచి ఇండియాకు రావడమంటే మాటలు కాదు. ఇది చూసిన కొందరు ఖరీదైన అభిమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. -
'పెద్ది'.. రూ.100 టికెట్ రూ.420
'పెద్ది' సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఆంధ్రా, ఓవర్సీస్లో రెండు మూడు రోజుల ముందే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ తెలంగాణలో మాత్రం రిలీజ్కి కొన్ని గంటల ముందు తెరిచారు. ఇక తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్లకు రూ.100, మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.150 పెంచుకోవచ్చని పేర్కొన్నారు. కానీ హైదరాబాద్లోని ఓ ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రం ఒక్కో టికెట్ రూ.420 ఉండటం షాకిచ్చింది.(ఇదీ చదవండి: 'పెద్ది' బడ్జెట్ ఎంత? అంచనాలు ఎలా ఉన్నాయి?)హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవి 70ఎమ్ఎమ్ థియేటర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ థియేటర్లో రిలీజ్ రోజు నుంచి రెగ్యులర్ షోల కోసం టికెట్ రూ.420 అన్నట్లు బుక్ మై షోలో చూపించింది. మిగతా సింగిల్ స్క్రీన్లలో సెకండ్ క్లాస్ టికెట్ పెంపుతో కలిపి రూ.150 రూపాయలు ఉంటే దేవిలో మాత్రం రూ.420 ఉంది. దీంతో పలువురు నెటిజన్లు ఈ పెంపుపై విమర్శలు చేస్తున్నారు.ఎందుకంటే ఏఎంబీ, ఏఏఏ లాంటి మల్టీప్లెక్స్ల్లో రూ.420, దేవి లాంటి సింగిల్ స్క్రీన్లోనూ రూ.420 టికెట్ రేటు ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రస్తుతానికైతే సినిమాపై బజ్ బాగానే ఉంది గానీ ఈరోజు రాత్రికల్లా అసలు టాక్ ఏంటనేది బయటకొస్తుంది. అప్పుడు టికెట్ సేల్స్లో హెచ్చుతగ్గులు కనిపించడం గ్యారంటీ.'పెద్ది' ప్రీ సేల్స్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.35 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తర అమెరికాలో ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్లకు పైనే టికెట్ సేల్స్ జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి తొలిరోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: రిలీజ్కి ముందే 'పెద్ది' కలెక్షన్ల హంగామా) -
పెద్ది ఫ్యాన్స్కు తీవ్ర నిరాశ.. ఆ విషయంలో బిగ్ ట్విస్ట్..!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. ఈ రోజు రాత్రి నుంచే పెద్ది మూవీ ప్రీమియర్స్ షురూ కానున్నాయి. ఈ రోజు 8 గంటల నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. కొద్ది గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.అయితే ఈ మూవీని పలు ఫార్మాట్లలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఐమ్యాక్స్, డాల్బీతో పాటు 4డీఎక్స్ ఫార్మాట్లో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఆడియన్స్ ఎక్కువగా 4డీఎక్స్ ఫార్మాట్లో చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ఈ ఫార్మాట్లో చూస్తే వచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది.అయితే 4డీఎక్స్ ఫార్మాట్లో పెద్దిని రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. ఇప్పటి వరకు ఈ వర్షన్లో టికెట్ బుకింగ్స్ మాత్రం ఓపెన్ చేయలేదు. హైదరాబాద్తో సహా బార్కో లేజర్, ఎపిక్, డాల్బీ సినిమా ఫార్మాట్లతో మాత్రమే టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో 4డీఎక్స్ వర్షన్లో చూడాలనుకున్న ఫ్యాన్స్కు నిరాశే మిగలనుంది. ఈ విషయంలో మాత్రం పెద్ది మేకర్స్ ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేశారనే చెప్పుకోవాలి. -
‘పెద్ది’ విజయం.. వీరికి చాలా కీలకం
మరికొన్ని గంటల్లో పెద్ది(Peddi) మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.పెద్దితో టాలీవుడ్కి పెద్ద విజయం వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా విజయంపై చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. కొంతమందికి అయితే ఈ సినిమా విజయం చాలా అవసరం. వారిలో మొదటి వరులో ఉన్నది హీరో రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ అంచనాతో వచ్చిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మారింది. ఇప్పుడు రామ్ చరణ్ ఆశలన్నీ పెద్ది పైనే ఉన్నాయి. ఈ సినిమా విజయంపైనే చరణ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. పెద్ది సూపర్ హిట్ అయి భారీ కలెక్షన్స్ తీసుకొస్తే.. పాన్ ఇండియా మార్కెట్లో చరణ్ వ్యాల్యూ పెరిగిపోతుంది. అతని పారితోషికం పెరగాలన్నా.. పాన్ ఇండియా స్టార్స్తో పోటీలో నిలవాలన్నా పెద్ది విజయం చరణ్కు చాలా అవసరం.ఇక దర్శకుడు బుచ్చిబాబుకు కూడా పెద్ది హిట్ అత్యంత కీలకమనే చెప్పాలి. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకొని ఈ సినిమా తెరకెక్కించాడు. రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం బుచ్చిబాబు అదృష్టం అని చెప్పాలి. అయితే ఈ సినిమా విజయం సాధిస్తేనే బుచ్చిబాబు కెరీర్ బాగుంటుంది. తర్వాత కూడా వరుసగా స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాలు వస్తాయి. బోల్తా పడితే మాత్రం ఆ నింద ఎక్కువగా బుచ్చిబాబుపైనే పడుతుంది. ఆయన కెరీర్కి ఈ సినిమా చాలా కీలకం.వీరితో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్కి కూడా పెద్ది హిట్ చాలా అవసరం. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా..తొలి సినిమాలో నటనకు పెద్దగా స్కోప్ దొరకలేదు. తెరపై కనిపించింది కూడా చాలా తక్కువే. పెద్దిలో అచ్చియమ్మ పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాలనుకోంటోంది. సినిమా హిట్ అయితేనే ఆమె పాత్రకు తగిన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఇక నిర్మాత వెంకట సతీష్కి కూడా పెద్ది విజయం చాలా కీలకం. ఆయన నిర్మాతగా చేసిన తొలి సినిమా ఇది. దాదాపు రూ. 350 కోట్లకు పైగా ఖర్చు చేశాడు. ఓ రకంగా ఇది పెద్ద సాహసమనే చెప్పాలి. చరణ్ సినిమా కాబట్టి హిట్ టాక్ వస్తే.. కలెక్షన్స్తో పాటు నిర్మాతగా మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఇలా భారీ ఆశలతో వస్తున్న పెద్ది సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. -
త్రిషకు మెగా కోడలి సర్ప్రైజ్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
హీరోయిన్ త్రిషకు మెగా ఫ్యామిలీ సర్ప్రైజ్ ఇచ్చింది. మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన నుంచి ప్రత్యేక బహుమతిని అందుకుంది. అత్తమ్మాస్ కిచెన్ నుంచి స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ పొందింది. అత్తమ్మాస్ కిచెన్ నుంచి త్రిషకు ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్ చేరింది. ఈ విషయాన్ని త్రిష సోషల్ మీడియాలో పంచుకుంది. థ్యాంక్ యూ ఉపాసన.. ది సమ్మర్ స్పెషల్ గిఫ్ట్.. అంటూ ఆనందం వ్యక్తం చేసింది.కాగా.. అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఉపాసన, చిరంజీవి సతీమణి సురేఖ ఈ వంటకాలు తయారు చేస్తున్నారు. ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంచారు. ఇందులో కేసరి, పొంగల్, ఉప్మా, రసం లాంటి వంటకాలు ఉండనున్నాయి. అత్తమ్మాస్ కిచెన్లో పులిహోర వంటకం ఎక్కువగా ఫేమస్ అయింది. త్రిషకు పంపిన గిఫ్ట్ హ్యాంపర్లో రుచికరమైన ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల పొడులు కూడా ఉన్నాయి. దీంతో త్రిష ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ఇక త్రిష విషయానికొస్తే.. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు మార్మోగిపోతోంది. ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే చర్చ నడుస్తోంది. త్వరలోనే త్రిష పెళ్లి చేసుకోనుందని రూమర్స్ కూడా వస్తున్నాయి. వాటన్నింటికీ త్రిష సైతం తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తూనే ఉంది. ఇటీవల నా కుక్కకు మాత్రమే వ్యక్తగత విషయాల్లో అనుమతి ఇస్తానని రూమర్స్ను ఉద్దేశించి పోస్ట్ చేసింది. -
నాట్ అధ్యక్షుడిగా టాలీవుడ్ నిర్మాత
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (ఎన్.ఎ.టి.ఎస్) నూతన అధ్యక్షుడిగా టాలీవుడ్ నిర్మాత(ఇటీవల వచ్చిన నిలవే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు) రాజ్ అల్లాడ ఎన్నికయ్యారు. 2026–2028కి గాను నూతన కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నారు. న్యూజెర్సీకి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ రాజ్ అల్లాడ 2009 నుంచి ‘ఎన్.ఎ.టి.ఎస్’లో వాలంటీర్గా సేవలందిస్తున్నారు. సంస్థలో పలు బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు పలుమార్లు బోర్డ్ మెంబర్గా చేశారు. సేవా కార్యక్రమాల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తపన వల్ల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా రాజ్ అల్లాడ, వైస్ ప్రెసిడెంట్గా (ప్రోగ్రామ్స్) రాజేష్ కండ్రు, వైస్ ప్రెసిడెంట్గా (ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్) అనుదీప్ అర్లా, వైస్ ప్రెసిడెంట్గా (సర్వీసెస్) రాజ్యలక్ష్మి చిలుకూరి, కార్యదర్శిగా సుధీర్ మిక్కిలినేని, ఖజాంచీగా రామ్ నరేష్ కొమ్మనబోయిన, జాయింట్ సెక్రటరీగా భానులంక, జాయింట్ ట్రెజరర్గా వెంకట శాఖమూరి బాధ్యతలు చేపట్టనున్నారు. -
ఆ ఊరిలో పాటల రూపంలో మాట్లాడతారు.. అదే ‘సింగ్ గీతం’
‘‘సింగ్ గీతం’ పూర్తిగా ఒరిజినల్ కాన్సెప్ట్. భారతీయ సినీ చరిత్రలోనే తొలి మ్యూజికల్ కామెడీ ఫిల్మ్. కుబేరపురం అనే ఒక ఫిక్షనల్ గ్రామంలో జరుగుతుంది. ఆ ఊరిలో అందరూ పాటల రూపంలో ఎందుకు మాట్లాడతారు? అనేది థియేటర్లో చూసి ఆస్వాదించాల్సిందే. ఇలాంటి జానర్లో ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు’’ అని శాలిని కొండెపుడి తెలిపారు.లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సింగ్ గీతం’. ఆయాన్, అహల్యా బమ్రూ జంటగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శాలిని కొండెపుడి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మై డియర్ దొంగ, జయమ్మ పంచాయితీ, శుభం’ వంటి చిత్రాలు చేశాను.‘సింగ్ గీతం’లో నా పాత్ర నెగటివ్ షేడ్లో ఉంటుంది. తాను అనుకున్నది సాధించాలనుకునే మనస్తత్వంతో పాటు తాను నమ్మిందే నిజమని భావించే పాత్ర నాది. ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తాయి. సింగీతం, నాగ్ అశ్విన్గార్ల విజన్తో పాటు వారి సెన్సిబిలిటీస్ కూడా ఈ మూవీలో కనిపిస్తాయి. సింగీతంగారి దర్శకత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్గారు మాటలను పాటలుగా అద్భుతంగా మార్చారు. నాగ్ అశ్విన్గారు నిర్మించిన ఈ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాను. నా తర్వాతి సినిమా కోసం కథ రాస్తున్నాను. ఈ మూవీకి నేనే దర్శకత్వం వహిస్తాను’’ అని తెలిపారు. -
'ఇరుముడి' గ్లింప్స్.. కొత్తగా కనిపించిన రవితేజ
రవితేజ మంచి నటుడే కానీ గత కొన్నాళ్ల నుంచి ఒకే తరహా సినిమాలు తీసి తీసి బోర్ కొట్టించేస్తున్నాడు. ప్రస్తుతం 'ఇరుముడి' అనే మూవీ చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ని పెద్దగా హడావుడి లేకుండానే రిలీజ్ చేశారు. పల్లెటూరి బ్యాక్డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవితేజ కొత్తగా.. సాధారణ షర్ట్, లుంగీతో కనిపించాడు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)గ్లింప్స్ బట్టి చూస్తే గ్రామంలో ఉండే హీరో, అతడికో కూతురు. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ హీరోకి మందు అలవాటు. వ్యసనాన్ని మానేయమని కూతురు అడుగుతుంది. అప్పుడు హీరో ఏం చేశాడు? అయ్యప్ప స్వామి మాల ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అనేది కాన్సెప్ట్లా అనిపిస్తుంది. జీవీ ప్రకాశ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా బాగుంది. ఆగస్టులో మూవీ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: రిలీజ్కి ముందే 'పెద్ది' కలెక్షన్ల హంగామా) -
రిలీజ్కి ముందే 'పెద్ది' కలెక్షన్ల హంగామా
మరికొన్ని గంటల్లో 'పెద్ది' సినిమా థియేటర్లలోకి రానుంది. ఆంధ్రా, విదేశాల్లో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసేయగా తెలంగాణలో మాత్రం ఇంకా సమస్య తీరలేదు. ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపు కోసం తెలంగాణలో జీవో వచ్చినా గానీ ఆన్లైన్లో బుకింగ్స్ మాత్రం పూర్తిస్థాయిలో ఓపెన్ అవ్వలేదు. అయినా సరే ప్రీ సేల్స్లో మంచి నంబర్లే కనిపిస్తున్నాయి. ఇంతకీ 'పెద్ది'కి ప్రీ సేల్ వసూళ్లు ఎంతొచ్చాయి? తెలంగాణలో సమస్య ఏంటి?(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)'పెద్ది'కి ఎలాగైనా పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని తెలంగాణ ఎగ్జిబిటర్లు కొన్నిరోజుల క్రితం పట్టుబట్టుకుని కూర్చున్నారు. నిర్మాతలు, చిరంజీవి, తెలుగు ఫిలిం ఛాంబర్తో వరస చర్చల కారణంగా ఈ వివాదం సద్దుమణిగింది. ఈ క్రమంలోనే మంగళవారం.. టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి జీవో కూడా వచ్చేసింది. అయితే పీవీఆర్ యాజమాన్యంతో అగ్రిమెంట్ విషయంలో ఏదో సమస్య నడుస్తోందని, అందుకే ఇంకా సదరు థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేయలేదని తెలుస్తోంది. మిగతా చోట్ల కూడా త్వరలోనే ఓపెన్ చేయనున్నారు.'పెద్ది' ప్రీ సేల్స్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.35 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తర అమెరికాలో ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్లకు పైనే టికెట్ సేల్స్ జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మిగతా దేశాల్లో బుకింగ్స్ పర్లేదనిపించేలా ఉన్నాయి. ప్రస్తుతానికి నంబర్లన్నీ బాగానే ఉన్నాయి గానీ ఈరోజు రాత్రికి పడే ప్రీమియర్లతో టాక్ ఏంటనేది బయటకొస్తుంది. దానిబట్టి బుకింగ్స్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తీసిన 'పెద్ది'లో రామ్ చరణ్ క్రాస్ ఓవర్ అథ్లెట్గా కనిపించబోతున్నాడు. అంటే క్రికెట్ ఆడతాడు, కుస్తీ చేస్తాడు, రన్నింగ్ కూడా చేస్తాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: 'పెద్ది' బడ్జెట్ ఎంత? అంచనాలు ఎలా ఉన్నాయి?) -
ప్రస్తుతానికి ఆ భాషలో నటించాలనుకోవడం లేదు
అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్.. పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటోంది. బాలీవుడ్లో ఇప్పటికే పలు మూవీస్ చేసి తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. తన తల్లి శ్రీదేవిలా దక్షిణాది సినిమాల్లోనూ నటించి పేరు తెచ్చుకోవాలనేది ఈ బ్యూటీ కోరిక. అలా ఇప్పటికే తెలుగులో 'దేవర'లో చేసింది. పరం సుందరి'లో మలయాళీ అమ్మాయిలా నటించింది. ఈమె నటించిన 'పెద్ది' ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. దీనిపై చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పొచ్చు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దక్షిణాది భాషల గురించి, మరీ ముఖ్యంగా మలయాళ భాష గురించి జాన్వీ తన అభిప్రాయాన్ని చెప్పింది.(ఇదీ చదవండి: తెలంగాణలో 'పెద్ది' టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్ ఎంతంటే?)మలయాళ భాష చాలా అందమైనది, మధురమైనది. అయినా నాకు చాలా కష్టమైనది. అందుకే ప్రస్తుతానికి మలయాళ చిత్రాల్లో నటించాలనుకోవడం లేదు. మలయాళం కంటే తెలుగు, తమిళ భాషలు నాకు కొంచెం పరిచయం ఉన్నవిగా అనిపిస్తాయి. అందుకే తెలుగు సినిమాల్లో నటించడాన్ని చాలా ఆస్వాదిస్తున్నా. తమిళ చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నానని జాన్వీ చెప్పుకొచ్చింది. అయితే జాన్వీ త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందనే రూమర్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. పండు మాస్టర్కి తీవ్ర గాయాలు) -
శ్రీహరి హీరోగా 'పెళ్ళైంది కాని నో కహాని'
శ్రీహరి హీరోగా నటిస్తున్న సినిమా 'పెళ్ళైంది కాని నో కహాని'. స్మిత హీరోయిన్. మై3 సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర పోస్టర్ని హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.'పెళ్ళైంది కాని NO కహాని' సినిమా చాలా బాగా వచ్చింది. మరో నెలన్నరలో రిలీజ్ చేస్తున్నాం. మూవీ ఆద్యంతం హిలేరియస్ ఫన్తో ఎంటర్ టైన్ చేస్తుంది. డైరెక్టర్ ఏడుకొండలు చాలా బాగా తీశారని హీరో శ్రీహరి చెప్పుకొచ్చారు. తెలుగు వారికి సంక్రాంతి ఎంత సరదాగా ఉంటుందో, ఈ సినిమా కూడా అంతే ఎంటర్టైనింగ్గా ఉంటుందని డైరెక్టర్ ఏడుకొండలు చెప్పారు. -
ఘోర ప్రమాదం.. పండు మాస్టర్కి తీవ్ర గాయాలు
'ఢీ' ఫేమ్ పండు మాస్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన ఇతడు ప్రమాదానికి గురయ్యారు. ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం విశాఖపట్నం వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.విశాఖపట్నంలో జరిగే ఒక ఈవెంట్లో పాల్గొనేందుకు పండు మాస్టర్ తన టీమ్తో ప్రయాణమవుతుండగా ఆనందపురం మండలం లొతగలవానిపాలెం హైవేపై అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆయనను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.ఆగి ఉన్న రెండు వాహనాలను బొలెరో కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న డాన్స్ మాస్టర్ పండుకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
కల నిజం అయింది
‘రాకా’ సినిమాలో భాగం అయ్యారు మలయాళ నటి ఫెమినా జార్జ్. హీరో అల్లు అర్జున్ , దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో హీరోయిన్ దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్లు జాన్వీకపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో భాగం అయ్యారని టాక్. తాజాగా తానూ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఫెమినా జార్జ్ తెలి పారు.‘‘హ్యాపీ’ సినిమా చూసినప్పటి నుంచి అల్లు అర్జున్ గారికి పెద్ద అభిమానిని. ఆయన హీరోగా చేస్తున్న ‘రాకా’ చిత్రంలో నేను భాగం అవుతానని అస్సలు ఊహించలేదు. నా కల నిజం అయినట్లుగా ఉంది. నా కెరీర్లో ఇప్పటి వరకు నేను చేసిన భారీ సినిమా ఇదే. ఈ చిత్రంలో నా పాత్ర నిడివి తక్కువే కావొచ్చు.. కానీ, ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఫెమినా జార్జ్. మలమాళ హిట్ ఫిల్మ్ ‘మిన్నల్ మురళి’తో ఇండస్ట్రీకి వచ్చిన ఫెమినా ఆ తర్వాత ‘తీ΄్పోరి బెన్నీ’, ‘కరక్కం’ వంటి సినిమాల్లో నటించారు. -
వారసులు వస్తున్నారు
తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ... ఇలా ఇండస్ట్రీ ఏదైనా వారసులు వస్తుండటం సాధారణం. తమ కుమారులను, కుమార్తెలను హీరోలుగా, హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నారు పలువురు హీరో, హీరోయిన్లు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల వారసులు వెండితెరపై అరంగేట్రం చేస్తున్నారంటే వారి అభిమానులకు పండగే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పైగా ఇటు సగటు సినీ ప్రేమికుల్లోనూ వారు నటిస్తున్న సినిమాలపై ఎంతో ఆసక్తి ఉంటుంది. ఈ కారణంగా నటీనటుల వారసులను పరిచయం చేసేందుకు చాలామంది దర్శక–నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు.నూతన నటీనటులు పరిచయం అయ్యే చిత్రాలకంటే వారసులు అరంగేట్రం ఇచ్చే సినిమాలపై ట్రేడ్ వర్గాల్లోనూ ఫుల్ క్యూరియాసిటీ ఉంటుంది. ఈ కోవలోనే ప్రస్తుతం అరడజను మందికి పైగా వారసులు వెండితెరపై సందడి చేసేందుకు వస్తున్నారు. హీరో–హీరోయిన్ల వారసులే కాదు. నిర్మాతల వారసులు కూడా నటీనటులుగా ఎంట్రీకి సిద్ధం అవుతున్నారు. అయితే.. తన తండ్రి విజయ్ స్టార్ హీరో అయినప్పటికీ తాను మాత్రం తెరపై కాకుండా తెరవెనక ఉంటానని దర్శకుడిగా మారారు హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్. ప్రస్తుతం హీరోలుగా, హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న వారసులు ఎవరు? వారి వివరాలేంటి? ఆ సినిమాలేంటి? వంటి విషయాలపై ఓ లుక్ వేద్దాం...ఘట్టమనేని జయకృష్ణ ఘట్టమనేని కుటుంబంలో సూపర్ స్టార్ కృష్ణ తొలి తరం కథానాయకుడు. తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరించారాయన. ఆయన నట వారసులుగా రమేశ్బాబు, మహేశ్బాబు, మంజుల తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఘట్టమనేని కుటుంబంలో మూడో తరంగా మహేశ్బాబు తనయుడు ఘట్టమనేని గౌతమ్ ‘1 నేనొక్కడినే’ సినిమా ద్వారా బాలనటుడిగా పరిచయం అయ్యాడు. అయితే తాజాగా సూపర్స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్బాబు (మహేశ్బాబు సోదరుడు) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్పై పి. కిరణ్ ఈ సినిమా నిర్మించారు. ఈ మూవీ నుంచి తన అన్న కొడుకు జయకృష్ణ పవర్ఫుల్ ఫస్ట్ లుక్ను హీరో మహేశ్బాబు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దుమ్ము, ధూళి ఎగసే రగ్డ్ బ్యాక్డ్రాప్లో హై స్పీడ్లో బైక్ నడుపుతూ కనిపించారు జయకృష్ణ. ఓ చేత్తో బైక్ను పట్టుకుని, మరో చేత్తో గన్ టార్గెట్గా పెట్టిన విధానం, చుట్టూ మోషన్ బ్లర్, అతని కళ్లలో కనిపించే ఫోకస్... ఇలాంటివి ఉన్న ఈ ఫస్ట్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది. సూపర్స్టార్ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా ఈ మూవీ నుంచి విడుదలైన యాక్షన్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ‘‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో అద్భుతమైన ప్రేమకథతో పాటు యాక్షన్, రొమాన్స్ వంటి అంశాలు కూడా ఉన్నాయి. తన పాత్ర కోసం జయకృష్ణ చాలా ఎఫర్ట్ పెట్టారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నందమూరి తారక రామారావు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబంలో నందమూరి తారక రామారావు తొలి తరం హీరో. ఆయన తర్వాత రెండో తరంగా హరికృష్ణ, బాలకృష్ణ వంటి వారు నటులుగా ఎంట్రీ ఇచ్చారు. మూడో తరంలో ఎన్టీఆర్, తారక రత్న, కల్యాణ్ రామ్ తదితరులు చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. తాజాగా నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం వెండితెరకు పరిచయం అవుతోంది. నందమూరి తారక రామారావు ముని మనవడు, హరికృష్ణ మనవడు, నిర్మాత జానకిరామ్ (హీరో కల్యాణ్ రామ్ సోదరుడు) తనయుడు నందమూరి తారక రామారావు టాలీవుడ్కి హీరోగా పరిచయం అవుతున్నారు.‘సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాస్’ లాంటి పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వైవీఎస్ చౌదరి.. నందమూరి తారక రామారావుని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయన స్వీయ రచన, దర్శకత్వంలో ‘న్యూ టాలెంట్ రోర్స్’ బ్యానర్పై యలమంచిలి గీత ఈ మూవీ నిర్మిస్తున్నారు. 2025 మే 12న ఈ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున నందమూరి తారక రామారావు మాట్లాడుతూ– ‘‘మా ముత్తాత ఎన్టీఆర్, మా తాత హరికృష్ణ, మా నాన్న జానకిరామ్గార్ల ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉంటాయి. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘1980ల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. తెలుగు సాహిత్యం, తెలుగు సంప్రదాయం, తెలుగు భాష, హైందవ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించే కథతో ఈ మూవీ రూపొందుతోంది’’ అన్నారు వైవీఎస్ చౌదరి.తెలుగమ్మాయి వీణా రావు అరంగేట్రం... ఎంతోమంది హీరోలను, హీరోయిన్లను టాలీవుడ్కు పరిచయం చేసిన వైవీఎస్ చౌదరి ఇప్పుడు నందమూరి తారక రామారావుని హీరోగా పరిచయం చేస్తున్న చిత్రం ద్వారా తెలుగమ్మాయి వీణా రావుని హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు. తెలుగమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేయాలనే సంకల్పంతో ఆడిషన్స్ నిర్వహించారు వైవీఎస్. ఈ అవకాశం ఫైనల్గా వీణా రావుని వరించింది. ఆమెకు చిత్ర పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. రాషా తడాని... హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, అభిమానులను సొంతం చేసుకున్నారు హీరోయిన్ రవీనా టాండన్. తెలుగులో వినోద్ కుమార్తో ‘రథసారధి’, బాలకృష్ణతో ‘బంగారు బుల్లోడు’, నాగార్జునతో ‘ఆకాశ వీధిలో’, మోహన్బాబుతో ‘ పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి సినిమాల్లో నటించారు రవీనా టాండన్. యశ్ హీరోగా రూపొందిన కన్నడ ఫిల్మ్ ‘కేజీఎఫ్: చాప్టర్ 2’లో ప్రధాన మంత్రిగా తనదైన నటనతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆమె.రవీనా కుమార్తె రాషా తడాని తెలుగులో ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన ఆమె ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. టీజర్, సాంగ్స్లోనూ తనదైన అందం, అభినయంతో కనిపించారు రాషా తడాని. ‘‘శ్రీనివాస మంగాపురం’ మూవీ తెలుగులో నాకు బెస్ట్ ఎంట్రీ అవుతుంది’’ అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రాషా తడాని.జోవిక విజయ్ కుమార్... తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటీనటులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు మంజుల, విజయ్ కుమార్. వారి కుమార్తెలు వనిత, ప్రీత, శ్రీదేవి చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసి, ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. కాగా ‘దేవి’ సినిమా ద్వారా వనితను తెలుగులో పరిచయం చేశారు దర్శక–నిర్మాత ఎంఎస్ రాజు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుశీల పాత్రలో నటించారు వనిత. 1999 మార్చి 12న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలవడంతో వనితకి తెలుగులోనూ మంచి గుర్తింపు వచ్చింది. ‘దేవి’ చిత్రం ద్వారా ఆమెను తెలుగులో పరిచయం చేసిన ఎంఎస్ రాజు ఇప్పుడు ఆమె కుమార్తె జోవికా విజయ్ కుమార్ని ‘అగధ’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం చేస్తుండటం విశేషం.కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘అగధ’. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రోడక్షన్స్ బ్యానర్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ఈ మూవీలో హరిణి పాత్రలో జోవిక విజయ్కుమార్ నటించారు. ఇటీవల ఆమె క్యారెక్టర్ పోస్టర్ విడుదల చేశారు. జోరున కురుస్తోన్న వర్షంలో చేతిలో కత్తి పట్టుకుని కోపంగా చూస్తున్న ఆమె లుక్కి మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ైదరాబాద్లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో జోవికా విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘అగధ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎం.ఎస్. రాజుగారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ మూవీలో నా ఫస్ట్ లుక్ చూసిన అందరూ మా అమ్మమ్మ మంజులగారిలా ఉన్నానని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా, అందులో నా నటన అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెబుతున్నాను’’ అని తెలి పారు. ‘అగధ’ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి రాకేష్ వెంకటాపురం సంగీతం అందించారు.ప్రియాంక రాజకుమార్... దేవయాని... ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ‘సుస్వాగతం’ మూవీ గుర్తుకొస్తుంది. ఈ సినిమా ద్వారా టాలీవుడ్కి పరిచయం అయ్యారు దేవయాని. 1998 జనవరి 1న విడుదలైన ఈ మూవీ మంచి మ్యూజికల్ హిట్గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి, అందం, అభినయంతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు దేవయాని. ‘శ్రీమతీ వెళ్లొస్తా, చెన్నకేశవ రెడ్డి, నాని, జనతా గ్యారేజ్, అరవింద సమేత వీరరాఘవ’ వంటి పలు తెలుగు సినిమాల్లో నటించారామె. దర్శకుడు రాజకుమార్ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు దేవయాని.వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. ప్రస్తుతం తన చిన్న కుమార్తె ప్రియాంకని ‘రంజన్: ది అడ్వకేట్’ మూవీ ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు దేవయాని. ‘జీన్స్’ మూవీ ఫేమ్ ప్రశాంత్ టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. ఆయన తండ్రి త్యాగరాజన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన ‘కోర్ట్’ మూవీకి రీమేక్గా రూపొందుతోన్న చిత్రమిది. పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించేలా దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన ‘కోర్ట్’ సినిమా తెలుగులో మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల చెన్నైలో ‘రంజన్: ది అడ్వకేట్’ చిత్రం ప్రారంభోత్సవం సందడిగా జరిగింది. ‘కోర్ట్’ మూవీలో శ్రీదేవి పోషించిన పాత్రలో ప్రియాంక నటిస్తున్నారు. హరి ఎంట్రీ... ‘రంజన్: ది అడ్వకేట్’ మూవీ ద్వారా నిర్మాత ఎస్. కథిరేశన్ తనయుడు హరి కోలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ‘కోర్ట్’ సినిమాలో హర్‡్ష రోషన్ పోషించిన పాత్రను తమిళంలో హరి చేస్తున్నారు. సుహానా ఖాన్ ఆగయా...బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘కింగ్’. షారుక్తో ‘పఠాన్, ఫైటర్’లాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ‘కింగ్’కి దర్శకత్వం వహిస్తున్నారు. షారుక్ ఖాన్ సొంత బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్పై ఆయన భార్య గౌరీ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్, మమత ఆనంద్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్కి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకోన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అర్షద్ వార్సి, రాణీ ముఖర్జీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుహానా ఖాన్ కూడా పలు యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. తండ్రి షారుక్, తనయ సుహానా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తొలి చిత్రం ‘కింగ్’ కావడం విశేషం. ఈ సినిమాపై బాలీవుడ్లో మంచి క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా డిసెంబరు 24న విడుదల కానుంది. డైరెక్టర్గా ఎంట్రీ...తమిళ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో విజయ్ ఒకరు. హీరోగా కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకున్నారాయన. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తన తండ్రి స్టార్ హీరో అయినప్పటికీ ప్రస్తుతానికి నటన వైపు మొగ్గు చూపకుండా... దర్శకుడిగా మారారు జేసన్ సంజయ్. ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’.ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్నారు. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ప్రకటన నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. పైగా ఇటీవల విడుదలైన టీజర్కు అద్భుతమైన స్పందన రావడంతో ఈ మూవీ మరింత హైప్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టయిల్...’ అంటూ సాగే పాటని ఈ నెల 4న రిలీజ్ చేయనున్నారు. లైకా ప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 31న విడుదల కానుంది. జేసన్ సంజయ్ మాట్లాడుతూ– ‘‘సిగ్మా’ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ప్రయాణం. నా విజన్ను నమ్మి ప్రతి దశలోనూ అండగా నిలిచిన సుభాస్కరన్గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం కోసం ఎంతో నిబద్ధతతో పని చేస్తూ, నాకు పూర్తి సహకారం అందిస్తున్న నటీ నటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. పైన పేర్కొన్నవారే కాదు.. మరికొంత మంది వారసులు కూడా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
కొత్త మలుపు
ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీలో భైరవి ఆర్థ్యా కథానాయిక. తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ నెల 12న విడుదల చేయనుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి నటుడు భానుచందర్, గాయని సునీత, నిర్మాత సి. కల్యాణ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది’’ అని తాటి బాలకృష్ణ తెలి పారు. ‘‘లవ్, సస్పెన్స్ జానర్లో ఈ సినిమాను రూపొందించాం’’ అని శివ వరప్రసాద్ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాతో ఆకాష్ మంచి స్థాయికి చేరుకోవాలి’’ అన్నారు సునీత.


