breaking news
Tollywood
-
ఫౌజి షూటింగ్లో..
వరుస పాన్ ఇండియన్ ఫిల్మ్స్తో ఫుల్ స్వింగ్లో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ఫౌజి’ ఒకటి. ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ చిత్రంలోని ఓ కీలక సన్నివేశం కోసం గుర్రపు స్వారీ సీన్స్ తెరకెక్కిస్తుండగా అదుపు తప్పి ప్రభాస్ కింద పడటంతో చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయట. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అభిమానులు ఆందోళన పడ్డారు. ఈ వార్తలపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ‘‘ఏదైనా సినిమా షూటింగ్స్లో చిన్నచిన్న ప్రమాదాలు జరగడం సహజమే. ప్రభాస్కి పెద్ద గాయాలు కాలేదు.ఆయన చేతి వద్ద చిన్న గీటు మాత్రమే పడింది. అది కూడా చికిత్స అవసరం లేనంతగా ఉండటంతో ఆయన షూటింగ్లో పాల్గొన్నారు. అభిమానులు కంగారుపడొద్దు’’ అంటూ పేర్కొనడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండుగ సందర్భంగా ‘ఫౌజి’ విడుదల కానుంది. కాగా ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ‘స్పిరిట్, కల్కి 2898 ఏడీ 2’ వంటి సినిమాలున్నాయి. -
ప్రేక్షకుల నోట ఆ మాట వినాలని ఉంది: శివానీ నాగారం
‘‘వేగంగా వంద సినిమాలు చేయడం కంటే.. నటిగా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఐదు సినిమాలు చేసినా చాలు’ అనుకునే మనస్తత్వం నాది. వెంట వెంటనే సినిమాలు చేయకపోతే ఇండస్ట్రీలో కనిపించకుండా పోతావు అని కొందరు నాతో అన్నారు. కానీ, ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది అనే మాట ప్రేక్షకుల నోట వినాలని ఉంది. సెలక్టివ్గా సినిమాలు చేసే సాయిపల్లవి, నిత్యామీనన్గార్ల బాటలోనే నేను కూడా పయనిస్తాను’’ అని చెప్పారు హీరోయిన్ శివానీ నాగారం. సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘హే బల్వంత్!’ (హే భగవాన్ టైటిల్ను హే భల్వంత్! గా మార్చారు). గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శివానీ మాట్లాడుతూ–‘‘నా స్వస్థలం హైదరాబాద్. గాయనిగా కెరీర్ను ప్రారంభించాను. యాక్టర్గా తొలిసారి సుహాస్తో ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా చేశాను. ఆ తర్వాత ‘లిటిల్ హార్ట్స్’ మూవీ చేశాను. ఇప్పుడు మళ్లీ సుహాస్తో ‘హే బల్వంత్’ చేశాను.నా పాత్రలో అమాయకత్వంతో పాటు కామెడీ కూడా ఉంటుంది.నరేశ్, వెన్నెల కిషోర్, సుదర్శన్గార్ల కామెడీ నవ్విస్తుంది. సెకండాఫ్లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది. తెలుగు అమ్మాయిలకు ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు వస్తుండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలకు చాన్స్ వచ్చింది.. వివరాలు త్వరలోనే చెబుతాను. మంచి కథ, క్యారెక్టర్ ఉంటే ఓటీటీ ్ర΄ాజెక్ట్స్ చేస్తాను. అవకాశం వస్తే సింగర్గాను నిరూపించుకోవాలని ఉంది’’ అని చెప్పారు. -
పవర్ఫుల్ సెయాన్
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘సెయాన్’ టైటిల్ ఖరారైంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా పతాకాలపై కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ‘అమరన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థలో శివ కార్తికేయన్ చేస్తున్న రెండో సినిమా ఇది.సోమవారం ‘సెయాన్’ సినిమా టైటిల్ని ప్రకటించి, శివ కార్తికేయన్ ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘రూరల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ‘సెయాన్’. పవర్ఫుల్ అండ్ డైనమిక్ క్యారెక్టర్లో శివ కార్తికేయన్ కనిపిస్తారు. కమర్షియల్ మాస్ అంశాలు, భావోద్వేగాలు, వినోదం.. వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా కథనం సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణన్. -
పిలిచే మల్లికా...
ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ యాక్షన్ డ్రామా ‘కాటాలన్’. ఈ చిత్రంలో దుషారా విజయన్, సునీల్, కబీర్ దుహాన సింగ్, తరందాసు, పార్థ్ తివారీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పాల్ జార్జ్ దర్శకత్వంలో క్యూబ్స్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మే 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘మజాకో మల్లికా..’ అనే పాట లిరికల్ వీడియోను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. ‘రాజ రా.. రాజ రా రాజా.. పిలిచే మల్లిక... మజాకో మల్లికా..’ అంటూ ‘మజాకో మల్లికా...’ అంటూ తెలుగు వెర్షన్ సాంగ్ లిరిక్స్ వినిపిస్తాయి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ పాటకి రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా, అరుణ్, సమీర పాడారు. -
సినిమాలను వదిలేద్దామనుకున్నా.. కానీ.. : అర్జున్ సర్జా
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో యాక్షన్ కింగ్గా ప్రత్యేక స్థానం సంపాదించిన అర్జున్ సర్జా, సినీమాల్లోకి రాకముందు ఓ పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నారట. తన తండ్రి తనకోసం ఒక డాక్టర్ సీటు ఎలాగైనా సంపాదించి ఇస్తాను నువ్వు చదివి డాక్టర్ కావాలి అన్నారట. అయితే తనకు డాక్టర్ అవ్వాలని లేదు. అయితే అనుకోకుండా తను సినిమాల్లోకి వచ్చానని. తనకి సినీ హీరో అవుతాడని తెలియదని, తనని సినీమాల్లోకి ఎవరో తోసేశారని అర్జున్ అన్నారు. అర్జున్ సర్జా తాజాగా తన సినీ ప్రయాణంలోని పలు ఆసక్తికర సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న సమయంలో సినిమాలను వదిలేయాలని కూడా ఆలోచించినట్లు ఆయన వెల్లడించారు. ఆ సమయంలో శంకర్ తన వద్దకు వచ్చాడు. కానీ అప్పటికి తను కొత్త వాడు కావడంతో మొదట రిజెక్ట్ చేశాను. అయితే దర్శకుడు శంకర్ వెంటపడి మరీ ‘జెంటిల్మెన్’ కథ వినిపించారు. కాగా అందులోని సామాజిక సందేశం తనను ఆకట్టుకుంది. దాంతో ఆ చిత్రానికి ఓకే చెప్పాను.అయితే ‘జెంటిల్మెన్’ చిత్రం తన జీవితాన్నే మార్చేసిందని అర్జున్ గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రం కథలోని సామాజిక సందేశం, పాత్ర బలం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇంత మంచి కథను వదిలేస్తే నాకంటే తెలివితక్కువ వాడు ఉండడు అనిపించింది. 1993లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కల్ట్ క్లాసిక్గా నిలిచింది. శంకర్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం, అర్జున్ నటన అన్నీ కలిసి ‘జెంటిల్మెన్’ సినిమాను బ్లాక్బస్టర్ హిట్గా నిలబెట్టాయి. ఆ చిత్రంతో ఆయన స్టార్ హీరోగా మారారు. ఆ తరువాత యాక్షన్ కింగ్గా ఎన్నో హిట్లు తన కెరీర్లో సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు. తాజాగా అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’ వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటించడం విశేషం. కుటుంబ విలువలతో పాటు ప్రేమ, రోడ్ జర్నీ అంశాలను మేళవించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ పొందుతోంది. అర్జున్ సర్జా చెప్పినట్లుగా ఒక్క నిర్ణయం జీవితాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లగలదు. అర్జున్ సర్జా కెరీర్లో ‘జెంటిల్మెన్’ అలాంటి మలుపు. -
మెగాస్టార్ చేతికి పట్టీ.. అసలు విషయం ఇదే
తనకు సర్జరీ జరిగిందని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. అల్లు శిరీశ్ నుంచి వెడ్డింగ్ కార్డ్ అందుకునే సమయంలో చేతికి పట్టీ వేసుకుని మెగాస్టార్ కనిపించారు. దీంతో చిరు ఏమైందని ఫ్యాన్స్తో పాటు పలువురు ఆరా తీశారు. తాజాగా సర్జరీ జరిగిన విషయాన్ని మెగాస్టార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ..' నా చేయి పట్టీ గమనించిన తర్వాత చాలా మంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం ఒక చిన్న భుజం కీ హోల్ సర్జరీ. నేను బాగా కోలుకుంటున్నా. ఇప్పటికే నా దినచర్య తిరిగి ప్రారంభించా. అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రక్రియను సజావుగా, సౌకర్యవంతంగా చేయడంలో ఆయన శ్రద్ధ, నైపుణ్యం అద్భుతం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. Several well-wishers have enquired about my health after noticing the arm sling.It was just a minor shoulder keyhole surgery. I am recovering well and already getting back to my routine.My heartfelt thanks to Dr. Nithin, one of the finest arthroscopy surgeons, for his care… pic.twitter.com/txLNH2yNFQ— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2026 -
టాలీవుడ్లో తెలుగమ్మాయిల హవా.. ట్రెండ్ మారుతోందా?
టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్గా తెలుగమ్మాయిలు కనిపించడం చాలా అరుదు. అస్సలు తెలుగమ్మాయి హీరోయిన్ అయిందా? అని మనవాళ్లే ఆశ్చర్యపోతుంటారు. అలాంటి సందర్భాలు గతంలో చాలా చూశాం. టాలీవుడ్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ అయినప్పటికీ ఇక్కడ కన్నడ భామలదే హవా. వాళ్లతో పాటు కోలీవుడ్ బ్యూటీలు ఎక్కువగా ఛాన్స్ కొట్టేస్తుంటారు. తెలుగమ్మాయిలు హీరోయిన్గా కనిపించే సందర్భాలు చాలా అరుదుగానే కనిపించేవి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల్లో రష్మిక, శ్రీలీల, మీనాక్షి చౌదరి డామినేషన్ ఉందన్న వాస్తవాన్ని మనం అంగీకరించాల్సిందే.కానీ ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మన తెలుగమ్మాయిలు కూడా గ్లామర్లో ఏ మాత్రం తగ్గేదేలే అని నిరూపిస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథానాయికల విషయంలో మార్పులొస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన మన తెలుగమ్మాయి సైతం వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో మన తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. దాదాపు అరడజన్కు పైగా సినిమాలతో బిజీగా అయిపోయారు. ఇంతకీ రష్మిక, శ్రీలీల లాంటి కన్నడ భామలక పోటీగా వస్తోన్న మన తెలుగు హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం.మానస వారణాసి..మానస వారణాసి మన తెలుగమ్మాయే. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్ ఇండియా 2020 కిరీటాన్ని సొంతం చేసుకున్న మానస వారణాసికి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.శివానీ నాగారం..తెలుగమ్మాయి శివానీ నాగారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీగా మారిపోయింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో మొదలైన జర్నీ మరిన్ని అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్న హే బల్వంత్ మూవీలో కనిపించనుంది. ఫిబ్రవరి 20న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. లిటిల్ హార్ట్స్ మూవీతో యూత్ను కట్టిపడేసిన శివానీ నాగారం తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.బేబీ వైష్ణవి చైతన్య..బేబీ మూవీతో ఫుల్ ఫేమ్ దక్కించుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఈ మూవీలో తన మాస్ నటనతో ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వైష్ణవి లవ్ మీ ఇఫ్ యూ డేర్, సిద్ధు జొన్నలగడ్డతో జాక్ మూవీ మెరిసింది. ప్రస్తుతం వైష్ణవి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఓ ప్రాజెక్ట్లో కనిపించనుంది. తెలుగమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి వెండితెరపై సత్తా చాటుతోంది.శ్రీ గౌరి ప్రియ..మ్యాడ్ బ్యూటీ శ్రీ గౌరిప్రియ కూడా మన తెలుగమ్మాయే. రైటప్ పద్మభూషణ్, లవర్ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. యూత్లో క్రేజ్ కొట్టేసిన తెలుగు బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం శ్రీగౌరి ప్రియ వింటారా సరదాగా, చెన్నై లవ్ స్టోరీ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది.కోర్ట్ బ్యూటీ శ్రీదేవి..కోర్ట్ మూవీతో ఓవర్నైట్ క్రేజ్ దక్కించుకున్న తెలుగమ్మాయి శ్రీదేవి. ఈ సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయిపోయింది. ఈ మూవీ తర్వాత శ్రీదేవికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్లోనే కాదు.. కోలీవుడ్ డైరెక్టర్స్ సైతం శ్రీదేవి ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి బ్యాండ్మేళం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా తమిళంలోనూ ఓ ప్రాజెక్ట్లో నటిస్తోంది.ఈషా రెబ్బా..మన వరంగల్కు చెందిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత అంతకుముందు.. ఆ తర్వాత అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే తరుణ్ భాస్కర్ హీరోగా వచ్చిన ఓ శాంతి శాంతి శాంతిః చిత్రంలో కనిపించింది. తన గ్లామర్తో అభిమానులను అలరిస్తోన్న ఈషా రెబ్బా టాలీవుడ్లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలోనూ అవకాశాలతో రాణిస్తోంది.వీరితో పాటు అనన్య నాగళ్ల, చాందిని చౌదరి లాంటి తెలుగమ్మాయిలు టాలీవుడ్లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలో తెలుగమ్మాయిల హవా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాగే మనవాళ్లు మరిన్ని అవకాశాలతో ముందుకెళ్లాలని టాలీవుడ్ అభిమానులుగా ఆశిద్దాం. ఈ తెలుగు భామలు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం. -
చీరలో 'ధురంధర్' బ్యూటీ.. విష్ణుప్రియ జిగేలు!
చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న ఆయేషాజిగేలుమని మెరిపించేస్తున్న బిగ్బాస్ విష్ణుప్రియపక్షులతో ఆడుకుంటున్న బిగ్బాస్ ఫేమ్ దివి'రాజాసాబ్' ఫేమ్ మనీషా చీరలో అందాలుగ్లామర్తో రచ్చ లేపేస్తున్న మంచు లక్ష్మీప్రిన్సెస్లా తయారైపోయిన 'రాజాసాబ్' రిద్ధి View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manisha Kandkur (@manisha_kandkur) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Jabili 🌝 (@srideviactor) -
అమ్మకు రెండో పెళ్లి.. అవన్నీ అబద్ధాలే: సుప్రీత
టాలీవుడ్ నటి సురేఖవాణి కూతురు సుప్రీత ఇటీవలే బిగ్ స్క్రీన్పై సందడి చేసింది. అమరావతికి ఆహ్వానం పేరుతో వచ్చిన థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ నెల 13న థియేటర్లలోకి వచ్చిన టాలీవుడ్ అభిమానులను అలరిస్తోంది. అయితే ఈ మూవీ రిలీజ్కు ముందు జరిగిన ఈవెంట్లో సుప్రీత ఫుల్ ఎమోషనలైంది. తన జర్నీని తలచుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది.అంతేకాకుండా ఇటీవల సురేఖవాణి రెండో పెళ్లి గురించి వార్తలొస్తూనే ఉన్నాయి. దీనిపై తాజా ఇంటర్వ్యూలో మరోసారి క్లారిటీ ఇచ్చింది సుప్రీత. అమ్మకు రెండో పెళ్లి చేయాలనే ఆలోచన కేవలం నాది మాత్రమేనని.. అమ్మకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. గతంలో మీ అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంటుందని మీరెప్పుడైనా ఆలోచించారా? అని నన్ను కొందరు అడిగారని పేర్కొంది.ఈ ప్రశ్నకు తాను అవును సమాధానమిచ్చానని సుప్రీత తెలిపింది. కానీ చాలామంది నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించింది. నా మాటలు విని అమ్మ రెండో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు రాసుకొచ్చారని పేర్కొంది. అదంతా పూర్తిగా అబద్ధమని.. అమ్మకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. ఆమెకు మ్యారేజ్ చేయాలన్న ఆలోచన నాది మాత్రమేనని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది -
మిడ్ రేంజ్ హీరోలకు డేంజర్ బెల్స్.. లేటెస్ట్గా విశ్వక్
గత కొన్నేళ్లుగా చూసుకుంటే తెలుగు మిడ్ రేంజ్ హీరోలకు ఎప్పటికప్పుడు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రేక్షకుల పల్స్ వీళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారా? సరైన స్టోరీలని ఎంపిక చేసుకోలేకపోతున్నారా? తెలియట్లేదు గానీ చేసిన సినిమాలు చేసినట్లు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతున్నాయి. ఒకవేళ సక్సెస్ అయినా సరే కలెక్షన్స్ పెద్దగా రావడం లేదు. దీనికి లేటెస్ట్ ఉదాహరణ విశ్వక్ సేన్. వరసపెట్టి మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంతకీ తప్పు ఎక్కడ జరుగుతోంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)'ఈ నగరానికి ఏమైంది?', 'ఫలక్నుమా దాస్', 'హిట్' లాంటి సినిమాలతో యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్.. తర్వాత చేసిన 'అశోకవనంలో అర్జున కల్యాణం'తో నటుడిగా ఆకట్టుకున్నాడు. కానీ గత రెండు మూడేళ్లుగా చూసుకుంటే కెరీర్ ఏ మాత్రం ఆశజనకంగా లేదు. 2024లో ఏకంగా మూడు చిత్రాలతో వస్తే.. వాటిలో 'గామి' ప్రయోగాత్మక చిత్రం కావడంతో జనాలకు సరిగా రీచ్ కాలేదు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంటే.. 'మెకానిక్ రాకీ' ఘోరంగా దెబ్బతింది. గతేడాది ఇదే టైంకి వచ్చిన 'లైలా' అయితే అల్ట్రా డిజాస్టర్. దీంతో ఏడాది గ్యాప్ తీసుకుని 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్తో కలిసి 'ఫంకీ' చేశాడు. ఇదీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది.ఒకప్పటితో పోలిస్తే విశ్వక్ సేన్ యాటిట్యూడ్ ఎలా తగ్గిపోయిందో.. బాక్సాఫీస్ దగ్గర అతడి సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా అలానే తగ్గిపోతూ వస్తున్నాయి. ఓ రకంగా చూస్తే ఇది డేంజర్ బెల్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇతడి చేతిలో 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్, దర్శకుడిగా చేస్తున్న 'కల్ట్' ఉన్నాయి. ఈ రెండింటితోనైనా విశ్వక్.. బలమైన కంబ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం రేసులో వెనకబడిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఏంటి ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా అని తారక్ నాతో..)విశ్వక్ సేన్ మాత్రమే కాదు టాలీవుడ్లో చాలామంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్ దాదాపు ఇలానే ఉంది. గోపీచంద్, రవితేజ లాంటి హీరోల మార్కెట్ ఇప్పటికే చాలా పడిపోయింది. వీళ్లు సినిమాలైతే చేస్తున్నారు గానీ అటు కంటెంట్ పరంగా ఇటు మార్కెట్ పరంగా రెండూ వర్కౌట్ కావట్లేదు. వసూళ్లు కూడా పెద్దగా రావట్లేదు. సాయిధరమ్ తేజ్, సుధీర్ బాబు, శర్వానంద్, అల్లరి నరేశ్, నితిన్, వరుణ్ తేజ్, రామ్ పోతినేని లాంటి హీరోల పరిస్థితీ దాదాపు ఇంతే.పైన చెప్పిన హీరోలు.. తాము అసలు ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూస్తారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అప్పుడో ఇప్పుడో అన్నట్లు వస్తున్నారు. కానీ సక్సెస్ అందుకోలేకపోతున్నారు. వీళ్లు కాకుండా ఉన్న మిగతా మిడ్, చిన్న రేంజ్ హీరోల పరిస్థితి అయితే అంతకంటే దారుణంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండబోతుందో ఏంటో అనిపిస్తోంది.(ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్) -
సౌత్ హీరోలను కలవాలంటే కండీషన్స్? సెంథిల్ ఆన్సరిదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాలని, ఆ రూల్స్ ఇవేనంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే అదంతా ఫేక్ అని, బన్నీని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ నకిలీ జాబితా స్పష్టం చేశారని తర్వాత తేలిపోయింది. కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రం సౌత్ స్టార్స్ ఇలాంటి నిబంధనలు పెట్టారా? అని చర్చ జరిగింది. అలాంటిదేం లేదుతాజాగా ఈ వివాదంపై సౌత్ స్టార్ సినిమాటోగ్రాఫర్ కేకే. సెంథిల్ కుమార్ స్పందించాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన రూల్స్ అంటూ ఏమీ లేవు. నేనెప్పుడూ అటువంటి అనుభవాన్ని ఎదుర్కోలేదు. దక్షిణాదిన ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేశాను. కానీ, ఎప్పుడూ ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని ఎటువంటి ఆంక్షలు విధించలేదు. హీరోలు చాలా గౌరవప్రదంగా ఉంటారు. నిజం చెప్పాలంటే వారిని కలిస్తే స్నేహితులను కలిసినట్లే ఉంటుంది.చాలా సంతోషంనా విషయానికి వస్తే.. టెక్నీషియన్గా నేను పని చేసిన సినిమాలకు ఎంతో గుర్తింపు వచ్చింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. నేను బయటకు వెళ్లినప్పుడు కూడా జనం గుర్తుపట్టి మాట్లాడుతుంటారు. మా టాలెంట్ గురించి మాట్లాడుతూ మమ్మల్ని జనానికి పరిచయం చేస్తున్న మీడియా, సోషల్ మీడియాకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే! పైగా ఈ జనరేషన్లో పని చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీ. దేవుడికి థాంక్స్ఎందుకంటే అనేకమంది ప్రతిభావంతమైన సాంకేతిక నిపుణులు సినిమాకోసం ఎంతో కష్టపడ్డారు. కానీ, వారికి అంత గుర్తింపు లభించలేదు. ఈలెక్కన నాకు వచ్చిన గుర్తింపునకుగానూ ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. సెంథిల్ కుమార్.. సై, ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి పలు బ్లాక్బస్టర్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పని చేశాడు. ప్రస్తుతం స్వయంభు సినిమాకు పనిచేస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది.చదవండి: ఏం కావాలి? ఏది వద్దో నాకు బాగా తెలుసు: శోభిత ధూళిపాళ -
మహాశివరాత్రి సెలబ్రేషన్స్.. దురంధర్ బ్యూటీ, శ్రీనిధి శెట్టి డ్యాన్స్ వైరల్
మహాశివరాత్రి వేడుకల్లో పలువురు సినీతారలు సందడి చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో జరిగిన వేడుకల్లో దురంధర్ బ్యూటీ సారా అర్జున్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, బాలీవుడ్ భామ మౌనీ రాయ్ కూడా పాల్గొన్నారు. వీరు పూజలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆధ్యాత్మిక సేవలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైన తమన్నా, శ్రీనిధి, సారా అర్జున్ డ్యాన్స్తో అదరగొట్టేశారు. భక్తి పాటకు మంత్రముగ్ధులైన ముద్దుగుమ్మలు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా.. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీరంతా పంచ భూత క్రియ పూజలో పాల్గొన్నారు. Maha Shivaratri night 🕉🔱@ishafoundation#Mahashivratri#MahaShivaratri2026#IshaMahashivratri2026#Adiyogi pic.twitter.com/p1lbdFwh0L— Sara Arjun (@itz_Sara_Arjun) February 16, 2026 View this post on Instagram A post shared by Isha Foundation (@isha.foundation) #WATCH | Actors Tamannaah Bhatia, Sara Arjun attended the Mahashivratri 2026 celebrations at the Isha Yoga Centre in Coimbatore, Tamil Nadu pic.twitter.com/Vw6QE75Drt— ANI (@ANI) February 16, 2026 -
'డబ్బులు రాలేదని శనగలు తిందామన్నారు'.. వీకే నరేశ్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారితో హిట్ కొట్టిన నరేశ్.. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్ హే బల్వంత్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్మీట్కు హాజరైన వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గురించి ఆయన మాట్లాడారు. ఓ సినిమా షూటింగ్కు ఊటి వెళ్లిన ఘటనను గుర్తు చేసుకున్నారు. అమ్మగారు, కృష్ణగారు ఇద్దరు కూడా పదిమందిని కలుపుకుపోయే తత్వమని చెప్పారు. సాంగ్స్ షూటింగ్ కోసం ఊటికి వెళ్లగా.. కృష్ణ గారు చేసిన పని నాకు ఎప్పటికీ గుర్తుండిపోయిందని అన్నారు. అప్పట్లో మనీ ట్రాన్స్ఫర్ లాంటివేవి ఉండేవి కావని నరేశ్ తెలిపారు.ఆ షూటింగ్కు వెళ్లిన సమయంలో నిర్మాతకు డబ్బులు రావడం ఆలస్యమైందని నరేశ్ తెలిపారు. అప్పట్లో కేవలం క్యాష్ మాత్రమే చెలామణిలో ఉండేదని..టైమ్కు డబ్బులు అందలేదని అన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు స్నాక్స్ తినాలంటే నిర్మాత దగ్గర డబ్బులు లేవు.. అప్పుడు కృష్ణగారు ఓ మాట అన్నారని తెలిపారు. అందరం ఈ రోజు శనగలు తిందాం.. డబ్బులు నేను ఇస్తాను అని షూటింగ్ ఆగనివ్వకుండా చేశారని నరేశ్ గుర్తు చేసుకున్నారు. నిర్మాత బాగుంటేనే మనందరం బాగుంటామని చెప్పారని అన్నారు. విజయ్- కృష్ణ అంటే ఒకటేనని.. రెండు కాదని నరేశ్ ప్రశంసించారు.నిర్మాత దగ్గర డబ్బులు లేకపోతె ట్రైన్లో సెనగలు తిందాం అంటూ షూటింగ్ ఆగనివ్వకుండా చేసారు.సింప్లిసిటీ కి మారో పేరు కృష్ణ గారు...- Actor #Naresh !#HeyBhalwanth pic.twitter.com/wMgWkQpYed— Karthikuuu (@Anchor_Karthik_) February 16, 2026 -
నాకు ఏం కావాలి? ఏం వద్దో బాగా తెలుసు: శోభిత
కొంతమంది సెలబ్రిటీలు ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకుంటారు. ఏదో ఒకరకంగా తమ గురించే మాట్లాడుకోవాలని, అందరి నోళ్లలో నానుతూ ఉండాలని తహతహలాడతారు.అలా పబ్లిసిటీ కోసం పీఆర్ టీమ్లను పెట్టుకుంటారు. కానీ తనకు అలాంటివేవీ ఇష్టం లేదని, పీఆర్ టీమ్ అసలే లేదని చెప్తోంది హీరోయిన్ శోభిత ధూళిపాళ.24 గంటలు కనిపించాలా?తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. గతంలో నేను పీఆర్ ఏజెన్సీలతో పని చేశాను. కానీ, నా వ్యక్తిత్వానికి ఆ పద్ధతులు సెట్ అవవు అని అర్థమైంది. 24 గంటలు అందరికీ కనిపించాలి, అందరూ నాకోసం మాట్లాడుకోవాలి అని నేను అనుకోవడం లేదు. అది నాకు ఏమాత్రం ఉపయోగపడదు, దానిపై నాకు ఆసక్తి అసలే లేదు.అదైతే తెలుసునాకు పీఆర్ లేదు, కానీ కొందరికి అది బానే పని చేస్తుంది. నేను సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, నాది ముంబై కూడా కాదు. వైజాగ్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ముందుకు సాగాను. నాకు ఏం కావాలి? ఏం వద్దనే విషయాలపై క్లారిటీ ఉంది. రూల్స్తో సంబంధం లేకుండా నా దారిలో వెళ్లడమే నాకిష్టం. జనాలకు ఏదిష్టం, వాళ్లేం కోరుకుంటున్నారు? అనేది నాకు తెలియదు. కానీ నా గురించి నాకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది.సినిమాశోభిత ధూళిపాళ తెలుగమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్లో ఎక్కువ పాపులర్ అయింది. గూఢచారి, మేజర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైంది. ఇటీవలే చీకటిలో సినిమాతో మరోసారి అలరించింది.చదవండి: అప్పుడు రూ.500 అప్పు.. రూ.90 కోట్ల కలెక్షన్స్ -
ఏంటి ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా అని తారక్ నాతో..
రీసెంట్గా వచ్చిన 'శంబాల' సినిమాలో విలన్గా చేసిన రవివర్మ మంచి పేరు తెచ్చుకున్నాడు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ అడపాదడపా మాత్రమే మూవీస్ చేస్తూ వస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం వచ్చిన 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ మూడో సీజన్లోనూ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ క్రమంలోనే తాజాగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఒకదానిలో ఎన్టీఆర్తో తనకున్న జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. ఎంతలా తనని ర్యాగింగ్ చేశాడో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)'రాఖీ సినిమాని కేవలం ఎన్టీఆర్, కృష్ణవంశీని చూసే చేశారు. స్టోరీ కూడా నాకు సరిగా తెలియదు. వాళ్లు చెప్పింది చేసేశాను. నేను మొదట నటించిన 'వెన్నెల' మూవీ ప్రివ్యూ చేసిన కృష్ణవంశీ.. బాగా చేశావ్ ఇదెన్నో సినిమా అని అన్నారు. ఇదే తొలి చిత్రమని చెబితే ఆశ్చర్యపోయారు. సరే కలిసి పనిచేద్దాం అని అన్నారు. అలా పిలిచి 'రాఖీ'లో అవకాశమిచ్చారు. అందులో మెయిన్ విలన్ నేను అన్నట్లు చూపించారు గానీ నేనైతే అలా అనుకోలేదు. ఆ మూవీ చూపించిన ప్రభావం నుంచి బయటకు రావడానికి చాలా ఏళ్లు పట్టేసింది. నా ఫ్రెండ్స్ కూడా కొందరు.. మా చెల్లికి ఇలాంటి భర్త వస్తే ఏంటి పరిస్థితి అని భయపడ్డారు''రాఖీ సినిమాలో ఎన్టీఆర్.. నా కాళ్లు పట్టుకునే సీన్ ఒకటి ఉంది. అయితే నా దగ్గరకొచ్చి.. ఏంటి ఇప్పుడు నేను నీ కాళ్లు పట్టుకోవాలి అని ర్యాగింగ్ చేశాడు. గురువు గారు, నాకు తెలీదు, డైరెక్టర్-మీరు చూసుకోండి అని దండం పెట్టేశా. ఆ రోజంతా కూడా.. నీ పని చెప్తా అని నన్ను ఆటపట్టించారు. ఓ రేంజులో ఆడుకున్నారు. అలానే నా పుట్టినరోజు నాడు నేను చనిపోయే షూటింగ్ జరిగింది. దానిపై కూడా తారక్ కౌంటర్స్ వేస్తూనే ఉన్నారు. అలానే పెద్ద కేక్ కూడా సెట్కి తెప్పించి సెలబ్రేట్ చేశారు. తారక్,కృష్ణవంశీ ఇద్దరూ కలిసి నా ముఖమంతా కేక్ పుసేశారు' అని రవివర్మ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బీజేపీ నేత దారుణ కామెంట్స్పై స్పందించిన త్రిష) -
బ్రేకింగ్: విజయ్ రష్మిక పెళ్లి శుభలేఖ ఇదే.. ఫొటో వైరల్
టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ-రష్మిక.. ఈ నెల 26న పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలోనూ కనిపించారు. వీళ్లిద్దరూ వెళ్తున్నది పెళ్లి జరిగే రాజస్థాన్లోని ఉదయ్పుర్కే అనేది తెలిసిందే. తాజాగా వీళ్ల పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)26వ తేదీన ఉదయ్పుర్లో పెళ్లి జరగనుందని అందులో రాసుకొచ్చారు. కాకపోతే కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరు కానున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. ఆ విషయాన్ని పెళ్లి పత్రికలో ముద్రించారు. ఈ మేరకు సినిమా సెలబ్రిటీలకు ఇదివరకే ఆహ్వానాలు అందాయి. ఇప్పుడు ఆ ఫొటోలే వైరల్ అవుతున్నాయి.విజయ్-రష్మిక తొలిసారి జంటగా 'గీతగోవిందం' సినిమా చేశారు. అది సూపర్ హిట్. తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తర్వాత చాన్నాళ్ల పాటు కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం విజయ్ 'రణబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్. ఇది దసరాకు రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. అంటే పెళ్లి తర్వాత విజయ్-రష్మిక నుంచి రాబోయే మూవీ ఇదే.(ఇదీ చదవండి: బీజేపీ నేత దారుణ కామెంట్స్పై స్పందించిన త్రిష) -
భార్యతో విడాకులు, జైలు జీవితం.. డిప్రెషన్లోకి..: సామ్రాట్
వినాయకుడు, పంచాక్షరి, దేనికైనా రెడీ, ప్రేమకావాలి, దూసుకెళ్తా వంటి పలు సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు సామ్రాట్ రెడ్డి. తర్వాత సడన్గా వెండితెరపై కనిపించడం మానేశాడు. తెలుగు బిగ్బాస్ రెండో సీజన్లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హర్షితను పెళ్లి చేసుకున్నాక వైవాహిక జీవితంలో ఇబ్బందులతో వార్తల్లో నిలిచిన సామ్రాట్ తన జీవితంలోని అనేక విషయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.అందుకే బ్రేక్నటుడు సామ్రాట్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకానొక సమయలో హీరోయిన్తో పెళ్లిపీటలపై కూర్చోవడం.. తీరా పెళ్లి క్యాన్సిల్ అవడం.. ఇలాంటి పాత్రలే తరచూ వచ్చాయి. దీంతో నాకు బోర్ కొట్టేసి బ్రేక్ తీసుకున్నాను. హర్షితను పెళ్లి చేసుకున్న కొంతకాలానికే నాపై గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇవన్నీ ఉట్టి ఆరోపణలు మాత్రమే!కావాలనే నా ప్రతిష్ట దిగజార్చిందిపెళ్లి వర్కవుట్ కాలేదంటే దాన్ని చాలారకాలుగా డీల్ చేయొచ్చు. పరస్పర అంగీకారంతో లేదా తనవైపు నుంచి విడాకులు పంపించి విడిపోవచ్చు. కానీ ఆమె తప్పు దారి ఎంచుకుంది. నేను నటుడినన్న కారణంతో నా పరువు తీయాలనుకుంది. ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. అదే సమయంలో నాన్నకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మరింత కుంగిపోయాను. బిగ్బాస్ ఆఫర్ఒక్కసారిగా మా కుటుంబం చిన్నాభిన్నమైంది. మా ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నేను రెండురోజులు జైలుకు వెళ్లివచ్చాను. నాపై లేనిపోని అభాండాలన్నీ వేశారు. అది నా కెరీర్ను కూడా దెబ్బతీసింది. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. అప్పుడు బిగ్బాస్ ఆఫర్ వచ్చింది. వెళ్లకూడదనుకున్నాను. కానీ నాపై పడ్డ నిందలు తొలగించుకోడానికి బిగ్బాస్కు వెళ్లాను. చాలా బాధలు అనుభవించి రాటు తేలిపోయాను. మరో పెళ్లి చేసుకోనుమొదటి పెళ్లి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవితంలో మరో పెళ్లి చేసుకోనని ఇంట్లో చెప్పాను. కానీ, బిగ్బాస్ తర్వాత అంజనా శ్రీలిఖితను కలిశాను. చూడగానే నచ్చేసింది. పెళ్లి చేసుకుందామని అడిగాను. కానీ, ఆమె ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. వాళ్లను ఒప్పించేందుకు తను చాలాదూరం వెళ్లింది. అలా 2020లో పెళ్లి జరగ్గా 2022లో పాప పుట్టింది. మొదటిది పెద్దలు కుదర్చిన పెళ్లయితే రెండోది ప్రేమ వివాహం. లిఖిత నా జీవితంలోకి వచ్చాక సంతోషంగా ఉన్నాను అని సామ్రాట్ రెడ్డి చెప్పుకొచ్చాడు.చదవండి: 4 రోజుల్లో రిలీజ్.. హే భగవాన్ టైటిల్ ఛేంజ్ -
అలాంటి కంటెంట్కి లేని సమస్య.. టైటిల్స్కి ఎందుకు?
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కాస్త పద్ధతిగా ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే సెన్సార్ బోర్డ్ ఏమైనా కళ్లు ముసుకుందా అన్నట్లే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని చిత్రాల్లో బూతులు వినిపిస్తుంటాయి. మరికొన్నింటిలో అయితే మితిమీరిన హింస కనిపిస్తూనే ఉంటుంది. అసలు సెన్సార్ దాటుకుని ఈ మూవీస్ ఎలా బయటకు వచ్చాయా అనేది అంతుచిక్కని ప్రశ్న. వీటిపై విమర్శలు వస్తూనే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు విచిత్రంగా సెన్సార్ బోర్డ్.. తెలుగు సినిమా టైటిల్స్పై దండయాత్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)గత నెలన్నర రోజుల్లోనే ఏకంగా నాలుగు తెలుగు సినిమాల టైటిల్స్ విషయంలో సెన్సార్ చాలా ఇబ్బంది పెట్టేసింది. గత నెలలో రిలీజైన 'వనవీర' విషయానికొస్తే.. తొలుత వీళ్లు 'వానర' అనే టైటిల్ అనుకున్నారు. దాదాపు ఆ పేరుతో ప్రమోషన్ అంతా చేసుకున్నారు. తీరా సెన్సార్ జరిగే సమయానికి పేరు మార్చాలని బోర్డ్ చెప్పింది. తప్పని పరిస్థితుల్లో 'వనవీర' అని మార్చుకున్నారు. దీంతో అప్పటివరకు చేసిన ప్రమోషన్స్ అంతా వృథా అయినట్లేగా.గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'కపుల్ ఫ్రెండ్లీ' అనే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనికి 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయం గురించి ప్రమోషన్లలో మాట్లాడిన డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని.. టైటిల్ని 'ఫ్రెండ్లీ కపుల్' అని మారిస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తాం లేదంటే ఏ సర్టిఫికెట్ ఇస్తామని.. సెన్సార్ తమతో చెప్పిందని అన్నారు. చివరకు మూవీ టీమ్.. పేరు మార్చకుండానే సినిమాని రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: మాజీ ఎంపీ కూతురితో యువ హీరో నిశ్చితార్థం.. పెళ్లెప్పుడంటే?)ఈ వారాంతంలో థియేటర్లలోకి రావాల్సిన సుహాస్ 'హే భగవాన్' సినిమాకు ఇప్పుడు టైటిల్ మార్చేశారు. భగవాన్ బదులుగా బల్వంత్ అని పేరు పెట్టారు. తద్వాతా 'హే బల్వంత్' అయింది. అలానే 'చాయ్ వాలా' అనే మూవీకి కూడా 'నవాబ్స్ కేఫ్' అని టైటిల్ మార్పించారు. పైన చెప్పిన నాలుగు సినిమాల టైటిల్స్లోనూ బూతులు గానీ, కించపరిచే పదాలు గానీ లేవు. పోనీ వాటిపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారా అంటే లేదు. అలాంటిది సెన్సారే తనకు తానుగా టైటిల్ మార్చాల్సిందేనని చెప్పడం ఇక్కడ వింతగా విడ్డూరంగా అనిపిస్తుంది.రీసెంట్గా రిలీజైన పలు టీజర్లు, సినిమాలు చూస్తే రక్తం ఏరులైపారుతుంది. లేదంటే టీనేజీ రొమాన్స్ని మితిమీరి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటిపై సెన్సార్ ఎందుకు అసలు దృష్టి పెట్టట్లేదు అని నెటిజన్లు.. ఎత్తిచూపుతున్నారు. వీటితో లేని సమస్య.. టైటిల్స్కి ఎందుకొచ్చిందా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'ప్రభాస్'కు గాయం.. అసలు విషయం చెప్పిన టీమ్) -
నాలుగు రోజుల్లో రిలీజ్.. 'హే భగవాన్' టైటిల్ మార్పు
టాలీవుడ్ను సెన్సార్ సమస్యలు ప్రభావితం చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం 'కపుల్ ఫ్రెండ్లీ, వానర సినిమాల టైటిల్స్ మార్చాలని సెన్సార్ బోర్డ్ సూచించింది. ఇప్పుడు తాజాగా సుహాస్ సినిమాకు అలాంటి ఇబ్బందే వచ్చింది. విడుదలకు కేవలం నాలుగురోజుల ముందు టైటిల్ మార్చాలని CBFC పేర్కొంది. దీంతో తప్పని పరిస్థితిల్లో సినిమా పేరును మార్చి పోస్టర్ను విడుదల చేశారు.తండ్రీ తనయుల మధ్య అనుబంధాన్ని 'హే భగవాన్' మూవీలో ఓ కొత్త కోణంలో చూపిస్తామని దర్శకుడు గోపీ అచ్చర అన్నారు. అయితే, తాజాగా సెన్సార్ సూచన ప్రకారం ఈ టైటిల్ను 'హే బల్వంత్'(Hey Balwanth)గా మార్చారు. దీంతో నెటిజన్లు షాకవుతున్నారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన చిత్రమిది. వీకే నరేశ్, యాంకర్ స్రవంతి కీలక పాత్రలు పోషించారు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీకి CBFC నుండి A సర్టిఫికేట్ లభించింది. కేవలం టైటిల్ కారణంగానే ఆ సర్టిఫికేట్ వచ్చిందని నిర్మాత, డిస్ట్రీబ్యూటర్ ధీరజ్ మొగిలినేని చెప్పారు. అదే 'ఫ్రెండ్లీ కపుల్' టైటిల్ పెడితే 'U/A' వచ్చేదని ఆయన గుర్తుచేశారు. దీంతో పెద్దలు మాత్రమే థియేటర్లలో సినిమా చూడాల్సి ఉంటుందనేది తెలిసిందే. మరోవైపు వానర మూవీ టైటిల్ను కాస్త వనవీరగా మార్చారు. హనుమంతుడితో ముడిపడి ఉన్న పేరు కావడంతో సున్నితమైన కుల,రాజకీయ అంశాలు ఉండటం వల్ల సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పలు కారణాలతో చిన్న సినిమాలకు సెన్సార్ చిక్కులు తప్పడం లేదని విమర్శలు వస్తున్నాయి. -
'ప్రభాస్'కు గాయం.. అసలు విషయం చెప్పిన టీమ్
ఫౌజీ మూవీ షూటింగ్లో హీరో ప్రభాస్ గాయపడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన టీమ్ ప్రకటించింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీ సెట్స్లో ప్రమాదం జరిగినట్లు సోషల్మీడియాతో పాటు ప్రధాన వెబ్సైట్స్లలో కూడా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే మన డార్లింగ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. సినిమా సెట్స్ లో ప్రభాస్కు ఎలాంటి గాయం కాలేదని చెప్పింది. ఈరోజు కూడా షూటింగ్లో పాల్గొన్నారని తెలిపింది. మూవీ సెట్స్లో చిన్నచిన్న ప్రమాదాలు జరగడం సహజమని తన చేతి వద్ద చిన్న గీటు మాత్రమే పడినట్లు పేర్కొంది. ఆ గీటు కూడా చికిత్స అవసరం లేనంతగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చింది. అభిమానులు ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదని ప్రభాస్ టీమ్ వెల్లడించింది.‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 దసరాకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. -
'విశ్వంభర' ట్రైలర్.. నిర్మాత హై ఓల్టేజ్ కామెంట్
ఈ సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. కానీ, ఈ మూవీ కంటే ముందే విడుదల కావాల్సిన 'విశ్వంభర' గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. టీజర్ విడుదల సమయంలో వీఎఫ్ఎక్స్ వర్క్పై ట్రోల్స్ రావడంతో దర్శకుడు వశిష్ట సరిచేసే పనిలో ఉన్నారు. అయితే, ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్లు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలోనే ఉన్నారు. తాజాగా నిర్మాత, పంపిణీదారు ధీరజ్ మొగిలినేని ఒక వేడుకలో మాట్లాడుతూ విశ్వంభర గురించి పలు విషయాలు పంచుకున్నారు.వశిష్ట కాంబినేషన్లో రాబోతున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే మెప్పిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ ట్రైలర్పై ధీరజ్ మొగిలినేని చేసిన వ్యాఖ్యలు మరింత బజ్ని క్రియేట్ చేశాయి. కపుల్ ఫ్రెండ్లీ సినిమా సక్సెస్ మీట్లో ధీరజ్ ఇలా మాట్లాడారు. 'కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ విశ్వంభర ట్రైలర్ చూశాను. నెక్స్ట్ లెవెల్లో ఉంది. యూట్యూబ్లో విడుదలైన తర్వాత ట్రైలర్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తాయి. సినిమాకు సంబంధించి అసలు కథను చాలా దాచి ఉంచారు. ట్రైలర్ చూడగానే నాకు హై ఓల్టేజ్ ఫీల్ కలిగింది. ఈ ఏడాదిలో విశ్వంభరతో పాటు శర్వానంద్ బైకర్ చిత్రాలు రెండూ యువి క్రియేషన్స్ను ఉన్నత స్థానానికి చేరుస్తాయి.' అని ఆయన అన్నారు. అయితే, విశ్వంభర సినిమాను తాను డిస్ట్రిబ్యూట్ చేయలేదని ఆయన అన్నారు. ఆ సినిమాను పంపిణీ చేయాలంటే తనలాంటి వారు మరో పదిమంది కావాలని ఆయన చెప్పుకొచ్చారు. తన స్థాయికి మించి విశ్వంభర మార్కెట్ ఉందని ఆయన అన్నారు. అయితే, ఈ మూవీ ట్రైలర్ మార్చిలో విడుదల కావచ్చని తెలుస్తోంది. -
మైత్రి మూవీస్తో ధ్రువ్ సినిమా.. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఎంట్రీ
తమిళ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ కొత్త సినిమాను లాక్ చేసే పనిలో ఉన్నాడు. గతేడాదిలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బైసన్తో భారీ బ్లాక్ బస్టర్ సాధించాడు. అయితే, ఈసారి డైరెక్ట్గా తెలుగు సినిమా చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మణిరత్నంతో ఒక లవ్స్టోరీ చేసే ప్లాన్లో ఉన్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అందమైన ప్రేమకథకి హీరోయిన్గా రుక్మిణీ వసంత్ని ఎంపిక చేసినట్లు వైరల్ అయింది.అయితే, ఈ ప్రాజెక్టుకు నూతన దర్శకుడు దీపక్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. అతను తన షార్ట్ ఫిల్మ్ 'మనసానమః' తో ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ధ్రువ్తో సినిమా ఛాన్స్ దక్కినట్లు సమాచారం. ఈ చిత్రం ఒక రొమాంటిక్-కామ్ ఎంటర్టైనర్ అని, ఇందులో రుక్మిణీ వసంత్తో పాటు శ్రీలీల మరో మహిళా కథానాయికగా నటించనుందని చెబుతున్నారు.టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ధ్రువ్ విక్రమ్ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనుంది. ఈ చిత్రానికి మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ సాయి అబ్యాంకర్ సంగీతం అందిస్తున్నట్లు చెబుతున్నారు. అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఈ వార్త వైరల్ అవుతోంది. -
'ఫౌజీ' షూటింగ్లో ప్రమాదం.. ప్రభాస్కు గాయం!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ మూవీ షూటింగ్లో గాయపడినట్లు తెలుస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీ సెట్స్లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మూవీలో భాగంగా కీలక సన్నివేశం కోసం గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రభాస్ కిందపడిపోయారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ఆయన చేతికి గాయమైందని సోషల్మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే, అభిమానులు కంగారుపడాల్సిన పనిలేదని గాయం చిన్నదేనని తెలుపుతున్నారు. ఈ విషయంపై సినిమా యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన ఇవ్వాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 దసరాకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.‘‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూస్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ప్రభాస్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నారు హను రాఘవపూడి. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలో విడుదల కానుంది. -
మూడు ఓటీటీలలో యూత్ఫుల్ సినిమా స్ట్రీమింగ్
యూత్ను బాగా ఆకట్టుకున్న చిత్రం పతంగ్.. ఇప్పుడు ఏకంగా 3 ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది. వంశీ పూజిత్. ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైంది. దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి తెరకెక్కించిన ఈ మూవీని డి.సురేశ్బాబు సమర్పణలో సురేశ్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఇందులో గౌతమ్ మేనన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు.ట్రయాంగిల్ ప్రేమకథ కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, 'పతంగ్' మూవీని దర్శకుడు తెరకెక్కించిన తీరు బాగుంటుంది. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఏకంగా మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. జనవరి 30న సన్ నెక్స్ట్ (SUN NXT)ఓటీటీలో విడుదలైన పతంగ్.. ప్రస్తుతం అమెజాన్(Amazon Prime), ఆహా(Aha) తెలుగు ఓటీటీలలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.కథేంటి..?హైదరాబాద్లోని ఓ బస్తీకి చెందిన విజయ్ కృష్ణ అలియాస్ విస్కీ(వంశీ పూజిత్), అదే ప్రాంతంలో ఉండే అరుణ్(ప్రణవ్ కౌశిక్) అనే డబ్బున్న కుర్రాడితో ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు. చిన్ననాటి నుంచి వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క రోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) వస్తుంది. ఈమె ఏ విషయంలోనూ సొంతంగా, త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. తర్వాత అరుణ్ని ఇష్టపడుతుంది. దీంతో ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్ మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యని దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్ల పోటీ. మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే మిగతా స్టోరీ. -
వెయ్యేళ్ల క్రితం మన ఆలయంపై దండయాత్ర.. సంజయ్ లీలా భన్సాలీ కొత్త సినిమా
సోమనాథ్ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి... ఈ పదం చెవినబడగానే మన హృదయాంతరాళం పులకాంకితమై, మదిలో సగర్వ భావన మెదలుతుంది. అయితే, వెయ్యేళ్ల క్రితం సోమనాథ్పై జరిపిన గజనీ దండయాత్రను వెండితెరపై చూపించేందుకు బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ సిద్ధమయ్యారు. ఆయన సమర్పణలో ‘జై సోమనాథ్’ (JAI SOMNATH)అనే సినిమా రాబోతుంది. దర్శకుడు కేతన్ మెహతాతో కలిసి భన్సాలీ(Sanjay Leela BhansaliSanjay Leela BhansaliSanjay Leela Bhansali) తెరకెక్కిస్తున్నారు. ఆలయం కూలిపోవచ్చు.. విశ్వాసం కాదు అంటూ ఒక పోస్టర్తో పాటు వీడియోను విడుదల చేశారు. 2027లో ఈ మూవీ విడుదల చేస్తామని తెలిపారు. ఈ మూవీలో నటించబోయే వారి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర, హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తివిశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయజూశాడు. సోమనాథ్పై వెయ్యేళ్ల నాటి తొలి దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది.పర్షియా, మధ్య ఆసియా, అఫ్గానిస్థాన్లను కలిపి సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని గజనీ మహమ్మద్ అనుకున్నాడు. అందుకు కావాల్సిన ఆర్థిక వనరుల కోసం భారత్పైకి దాడి చేసేందుకు దిగాడు. కీ.శ.1000-1027 సమయంలో 17 సార్లు దండయాత్ర చేసి ఎంతో సంపదను భారత్ నుంచి దోచుకున్నాడు. అయితే, 15వ దండయాత్ర ఐశ్వర్యవంతమైన సోమనాథ దేవాలయంపై కొనసాగింది. సోలంకి రాజు భీమదేవుడిని ఓడించి సోమనాథ్ ఆలయాన్ని గజనీ మహమ్మద్ కొల్లగొట్టడమే కాకుండా ధ్వంసం చేశాడు. సోమనాథ్ ఆలయంపై దాడికి వెయ్యేళ్లయిన సందర్భంగా భారత ప్రధాని మోదీ ఇటీవల ప్రత్యేక వ్యాసం రాసిన సంగతి తెలిసిందే.. (వ్యాసం కోసం క్లిక్ చేయండి)ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్యంలా నిలిచి, ఆత్మార్పణకూ వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్ ప్రముఖులు. సోమ్నాథ్లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరళ కృషి వెలకట్టలేనిది. అటువంటి మహానుభావులు జీవించిన నేలపై నడయాడగలగటం నిజంగా మన అదృష్టం. -
జన నాయగన్కు మరో షాక్.. ఆ రోజు వరకు వచ్చే ఛాన్సే లేదు
విజయ్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం జననాయగన్ చిత్రానికి ఎదురౌతున్న అవరోధాలు అన్నీ ఇన్నీ కావు. నటుడు విజయ్ చిత్ర షూటింగ్కు ముందే తన చిత్ర విడుదల సమయంలో ఆటకాలు ఎదురౌతాయని, వాటిని అధిగమించగలరా? అని ఏ ముహూర్తానా అన్నారో తెలీదు గానీ.. ఇప్పుడు అక్షరాలా అదే జరుగుతోంది. చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ కోసం గత డిసెంబర్ నెలలో సెన్సార్బోర్డుకు పంపారు. అయితే ఇప్పటి వరకూ సర్టిఫికెట్ రాలేదు. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా నిర్మాత చేసిన ప్రయత్రాలన్నీ సఫలం కాలేదు. చివరికి హైకోర్టు నుంచి పిటిషన్ను వాపస్ తీసుకున్నారు. అయితే సెన్సార్ ప్రత్యేక కమిటీకి పంపిన జననాయగన్ చిత్రానికి ఆ కమిటీ ఎప్పుడు సర్టిఫికెట్ ఇస్తుందో తెలియని పరిస్థితి. జనవరి 9న విడుదల కావలసిన ఈ చిత్రం ఫిబ్రవరి నెల సగభాగం గడిచిపోతున్నా, ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి. ఈ నెల 20న చిత్రం విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జననాయకన్ చిత్రం కెనడాలో విడుదలకు హక్కులు పొందిన యార్క్ సినిమాస్ సంస్థ అధినేత ఈ చిత్రం ఏప్రిల్ 30 వరకూ విడుదల అవ్వడానికి అవకాశం లేదని, అందుకే టిక్కెట్ బుక్కింగ్ డబ్బులను రిఫండ్ చేసుకోండి అని పేర్కొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఈ ఏడాది మే నెలలో శాసన సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అలాంటిది ఆ సమయంలో జననాయగన్ చిత్రాన్ని విడుదల చేయడం సాధ్యం అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.ఈ పరిస్ధితులు విజయ్ అభిమానులకు జీర్ణయింకుకోవడం కష్టమే అవుతుంది. ఇక జననాయకన్ చిత్ర నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. -
శివ్ కైలాశోం కే వాసి
సింగర్గా హీరోయిన్ రాశీ ఖన్నా ‘జోరు, జవాన్, ప్రతిరోజూ పండగే’ వంటి సినిమాల్లో పాటలు పాడారు. తాజాగా ‘శివ్ కైలాశోం కే వాసి’ అనే భక్తి పాటను పాడారు రాశీ. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పాటను తన ఇన్స్టా ఖాతాలో ఆమె షేర్ చేయగా, వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా రాశీ మాట్లాడుతూ– ‘‘శివ్ కైలాశోం కే వాసి’ అనేది అహంకారాన్ని నాశనం చేయడం, అంతరంగాన్ని మేల్కొల్పడం, అతీంద్రియ శక్తి అయిన మహాదేవుడి మీద భక్తిని చాటే ప్రార్థనగా నిలుస్తుంది. ‘మహా శివరాత్రి’ అత్యంత పవిత్రమైన పర్వదినం. ఇలాంటి విశిష్టమైన రోజున పాడటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
డాక్టర్ కాదు!
నవీన్ చంద్ర హీరోగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్పై ‘మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి బలమైన కథా చిత్రాలను నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి ‘నాట్ ఎ డాక్టర్’ టైటిల్ని ప్రకటించి,పోస్టర్ని విడుదల చేశారు. ‘రాయని ఓ నవల ఆధారంగా’ అనేది ట్యాగ్లైన్. ‘‘ఓ వినూత్న కథతో ఈ చిత్రన్ని రూపొందిస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. -
టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్కు బ్రేక్?
ఒకప్పుడు సినిమా చివర్లో పార్ట్-2 త్వరలో అనే టైటిల్ కార్డు పడితే, ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్కు బ్రేక్ పడుతున్నట్టుంది. కొన్ని సినిమాలకు రెండో భాగం ప్రకటించినా, ఆ స్థాయిలో వర్కవుట్ కాలేదు. తల బొప్పికట్టే రేంజ్లో కొన్ని సినిమాలు చుక్కలుచూపించడంలో పార్ట్-2 అనేది దండగ అనే ఫీలింగ్కు వచ్చారు మేకర్స్. కథ డిమాండ్ లేకుండా సీక్వెల్స్ తీయడం అనవసరమని నిర్మాతలు భావిస్తున్నారు. బడ్జెట్ పెంచడం లేదా హైప్ క్రియేట్ చేయడం కోసం పార్ట్-2లు తీయడం సరైన పద్ధతి కాదని స్పష్టంగా చెబుతున్నారు. అసలు సీక్వెల్ ట్రెండ్ను మొదలుపెట్టిన రాజమౌళి కూడా ఇప్పుడు దానికి దూరమయ్యాడు. తను మహేష్బాబుతో చేస్తున్న తాజా చిత్రం “వారణాసి” ఒక్క భాగమే అని స్పష్టం చేశాడు. అంతేకాక సినిమా చివర్లో పార్ట్-2 కార్డులు పడవని ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్ర యూనిట్ కూడా సీక్వెల్ ఉండదని ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్, జూ.ఎన్టీఆర్తో చేస్తున్న “డ్రాగన్” సినిమాను సింగిల్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.ఇప్పుడు వచ్చే ఏ సినిమాకైనా పార్ట్-2 ఉందని ప్రకటిస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పార్ట్-2 ఉంది అనగానే దానికి వచ్చే హైప్ కంటే ట్రోలింగ్నే ఎక్కువగా జరుగుతోంది. తర్వాత వచ్చే పెద్ద సినిమాలు కూడా ఒక్క భాగంలోనే కథను ముగించాలనే నిర్ణయానికి వస్తున్నాయి. చూస్తుంటే రానున్న కాలంలో వచ్చే చిత్రాలకు ఈ పార్ట్-2 గోల తగ్గేలానే కనిపిస్తోంది. -
ప్రభాస్, బన్నీతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుపట్టారా? ఇప్పుడేం చేస్తోంది?
తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అప్పటికే ఉన్నోళ్లు మెల్లమెల్లగా సైడ్ అవుతూనే ఉంటారు. కాకపోతే కొందరు మాత్రం స్టార్స్ అవుతారనుకుంటే పట్టుమని పది మూవీస్ కూడా చేయకుండా తెరమరుగైపోతుంటారు. అలాంటి బ్యూటీనే ఈమె. అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్తో చేసినప్పటికీ మాయమైపోయింది. మరి ఈమెని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దీక్షా సేథ్. ఢిల్లీలో పుట్టిన ఈమె.. తండ్రి ఉద్యోగరీత్యా ముంబై, చెన్నై, కోల్కతా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో పెరిగింది. మంచి పొడగరి కావడంతో 2009లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. మోడలింగ్ అనుభవం లేనప్పటికీ టాప్-10లో ఒకరిగా నిలిచింది. ఓ మోడలింగ్ పనిమీద హైదరాబాద్ వచ్చినప్పుడు ఈమెని చూసిన దర్శకుడు క్రిష్.. 'వేదం'లో అవకాశమిచ్చాడు. ఇందులో పూజగా అల్లు అర్జున్ సరసన నటించింది. అలా టాలీవుడ్ దృష్టిలో పడింది.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)తర్వాత రవితేజ 'మిరపకాయ్', నిప్పు, గోపిచంద్ 'వాంటెడ్', మంచు మనోజ్ 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా', ప్రభాస్ 'రెబల్' సినిమాలు చేసింది. వీటిలో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ ఉండేసరికి తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. అనంతరం హిందీలో రెండు, కన్నడలో ఓ మూవీ చేసింది. అయినా సరే పెద్దగా ఉపయోగం లేకపోయేసరికి పూర్తిగా నటనకు దూరమైపోయింది.రీసెంట్ టైంలో ఈమె ఫొటోలు కొన్ని వైరల్ కావడంతో అసలు ఇప్పుడేం చేస్తుందా అని వెతకగా.. స్పెయిన్లో ఎంబీఏ పూర్తి చేసిన దీక్షా, అక్కడే ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటోందట. అలానే ఫ్యామిలీ కూడా అక్కడే సెటిల్ అయిపోవడంతో జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. అయితే హీరోయిన్గా ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే క్యూట్, గ్లామర్గా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721) -
మెరుపుతీగలా అనుపమ.. మస్తు క్యూట్గా మృణాల్!
మెరుపుతీగలా సన్నని గ్లామర్తో అనుపమముద్దుముద్దుగా పోజులిచ్చేసిన మృణాల్అందాల జాతర చేస్తున్న డింపుల్ హయాతిపట్టుచీరలో మెరిసిపోతున్న కీర్తి సురేశ్స్టేజీపై పాడుతూ దుమ్ములేపిన నోరా ఫతేహిచుడీదార్లో క్యూట్ 'కపుల్ ఫ్రెండ్లీ' వారణాసి View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) -
డ్యాన్స్తో దుమ్మురేపిన సునీల్.. 'కూలీ' మోనికాని మించి
లోకేష్ కనగరాజ్ తీసిన 'కూలీ' చూసినవారెవ్వరూ అందులోని మోనికా పాటని మర్చిపోలేరు. నిజానికి చూడనివారినీ వదలకుండా రకరకాల సామాజిక మాధ్యమాల్లో కవర్ సాంగ్గా ఆ పాట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటికి ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపును ఆ ఒక్క పాటతో దక్కించుకున్నాడు మళయాళ నటుడు సౌబిన్ షాహిర్. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేడుకల్లో ఆ పాట సందడి చేస్తూనే ఉంది.ఈ నేపధ్యంలో మన టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ ఆ పాట క్రేజ్కి చెక్ పెట్టేలా ఉన్నాడు. త్వరలో విడుదల కానున్న 'కాటలన్' అనే మళయాళ చిత్రంలో మోనికా పాటని మించేలా డ్యాన్స్ ఊపేశారు. ఈ విషయం తాజాగా ఆ సినిమా టీజర్ లాంచ్తో వెల్లడైంది. పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్ పెపే, దుసర విజయన్, కబీర్ సింగ్లతో పాటు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే చిత్ర నిర్మాతలు తమ చిత్రం మొదటి లిరికల్ వీడియోని విడుదల చేశారు. 'మజాకో మల్లికా' అంటూ సాగే ఈ పాట విడుదలైన కాసేపట్లోనే వైరల్గా మారింది. ముఖ్యంగా సునీల్ స్టెప్స్కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)'మజాకో మల్లికా'లో సునీల్ డ్యాన్స్లో ఈజ్ని అనేక మంది ప్రశంసిస్తున్నారు. అంతేకాక ఈ పాటను చాలామంది మోనికా పాటతో పోలుస్తున్నారు. ఓ చేత్తో సిగిరెట్ పట్టుకుని స్మోక్ చేస్తూ ఒకే కాలితో సునీల్ వేసిన స్టెప్స్ని చూసి ఒక నెటిజన్.. 'నటుడు సునీల్ డ్యాన్స్ నెక్ట్స్ లెవల్' అని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రేక్షకులకు సునీల్ డ్యాన్స్ బాగా పరిచయం అయినప్పటికీ... దక్షిణాది మొత్తానికి ఇప్పుడు పరిచయం అయిందని చెప్పొచ్చు.ఈ పాటకు సంగీతాన్ని ప్రముఖ కన్నడ సంగీతకారుడు అజనీష్ లోక్నాథ్ స్వరపరిచారు, ఇతను 'కాంతారా చాప్టర్ 2' కు వర్క్ చేయడం విశేషం. ఈ పాటను ఆనంద్ శ్రీరాజ్ భద్ర పాడారు, వినాయక్ శశికుమార్ సాహిత్యం రాశారు. కూలీ సినిమాలో సౌబిన్ లాగే ఈ సినిమాలో కూడా సునీల్ విలన్గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాటలన్ చిత్రం విడుదల తర్వాత సునీల్ సాంగ్.. మోనికా రేంజ్లో హిట్ కొడితే ఇక దక్షిణాది సినిమాల్లో హీరోలతో పాటుగా విలన్ పాటల ట్రెండ్ మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అత్యంత హింసాత్మక చిత్రంగా పేరొందిన మార్కో సినిమాను అందించిన క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అందిస్తున్న ఈ యాక్షన్ సినిమా మే నెలలో విడుదల కానుంది.(ఇదీ చదవండి: పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?) -
పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ కూడా దీన్ని ధ్రువీకరించడం లేదు. బహుశా పెళ్లి అయిపోయిన తర్వాత ఫొటోలు రిలీజ్ చేసి వెల్లడిస్తారేమో! సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలైపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)విజయ్ దేవరకొండ ఇప్పుడు కలిశాడంటే వేరే కారణాలేం లేవు. కచ్చితంగా పెళ్లికి ఆహ్వానించే విషయమై కలిసుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది గానీ మిగతా వివరాలు అయితే రాలేదు. అసలు విషయానికొస్తే ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చాలారోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 20నే ఇరు కుటుంబాలు రాజస్థాన్ వెళ్లనున్నారు.ఈనెల 22వ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు అంటే హల్దీ, మెహందీ, సంగీత్ లాంటివి ఉండనున్నాయి. చివరగా 26వ తేదీన పెళ్లి. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారని తెలుస్తోంది. అయితే మార్చి తొలివారంలో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ ఉండనుంది. దీని వివరాలు తెలియాల్సిఉంది. ఏదేమైనా వివాహ తేదీ దగ్గరపడినప్పటికీ విజయ్-రష్మిక.. పెళ్లి విషయాన్ని రహస్యం ఉంచుతూనే ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా) -
మెగా ఫ్యామిలీకే తొలి శుభలేఖ.. చిరంజీవికి ఏమైంది?
అల్లు ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్.. నయనిక మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. మార్చి 6న ఈ వివాహ కార్యక్రమం జరగనుంది. శిరీష్ అన్నవదినలైన అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు కూడా ఇదే కావడం విశేషం!పత్రికల పంపిణీఇప్పటికే దుబాయ్లో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. రెండు రోజుల క్రితం పసుపు దంచే కార్యక్రమం జరిగింది. తాజాగా పెళ్లిపత్రికల పంపిణీని మొదలుపెట్టారు. మొదటి పత్రికను చిరంజీవి- సురేఖ దంపతులకు ఇచ్చారు. ఆ ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మెగాస్టార్కు గాయం?మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను మా మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు అందించాం అంటూ ఫోటో షేర్ చేశాడు. అందులో చిరంజీవి దంపతులతో పాటు అల్లు అరవింద్- నిర్మల, శిరీష్ ఉన్నారు. అయితే ఫోటోలో మెగాస్టార్ షోల్డర్ బ్యాగ్ వేసుకుని కనిపించాడు. దీంతో ఆయనకు ఏమైంది? సర్జరీ జరిగిందా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.చదవండి: తిట్ల దండకం ఆపలేదు.. లాగిపెట్టి కొట్టా: బాలీవుడ్ హీరో -
హీరో నిఖిల్ కౌంటర్ ఎవరికి? ఎందుకీ కామెంట్స్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 'ఏఐ' అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. తమ చిత్రాల్లో ఎలాంటి సీన్లు.. ఈ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించాలేదని హీరోలు దర్శకనిర్మాతలు చెప్పుకొంటున్నారు. కష్టపడి విజువల్ ఎఫెక్ట్స్ చేయించామని అంటున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. యువహీరో నిఖిల్ మాత్రం ఏఐ గురించి చెబుతూనే మరో మూవీ గురించి కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'స్వయంభు'. నాలుగు రోజుల క్రితం టీజర్ రిలీజ్ చేశారు. ఏమంత గొప్ప రెస్పాన్స్ అయితే రాలేదు. కంటెంట్ పర్లేదు అన్నప్పటికీ ఎక్కువమంది 'బాహుబలి'తో పోల్చి చూస్తున్నారు. హీరోహీరోయిన్ పాత్రలు అలానే ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అలానే టీజర్ క్వాలిటీపైనా కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో హెచ్డీఆర్ క్వాలిటీతో ఇప్పుడు మరోసారి టీజర్ అప్లోడ్ చేశారు. ఇదే విషయాన్ని ట్విటర్లో చెప్పిన నిఖిల్.. రీసెంట్గా వచ్చిన ఓ సినిమాలా మా దానిలో ఎలాంటి ఏఐ ఉపయోగించలేదు అని అన్నాడు.మరి నిఖిల్ ఏ సినిమా గురించి అన్నాడా? అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. సరిగ్గా నిఖిల్ ట్వీట్ చేసే సమయానికి 'నాగబంధనం' మూవీ టీజర్ రిలీజైంది. మరి ఈ చిత్రంపైనే నిఖిల్ కౌంటర్ వేశాడా అనిపిస్తోంది. ఎందుకంటే రెండు కూడా విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న సినిమాలే. ఈ వేసవిలోనే థియేటర్లలోకి వస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్.. కావాలనే నెగిటివ్ అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడా అనిపిస్తుంది. బహుశా ఇదో రకం పబ్లిసిటీ టెక్నిక్ కావొచ్చేమో? చూడాలి మరి దీని గురించి నిఖిల్ ఏమని క్లారిటీ ఇస్తాడో?(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా) -
కుష్బూ వారసురాలిద్దరూ రెడీ..
ఉత్తరాది నుంచి దక్షిణాదికి దిగుమతి అయిన నటి కుష్బూ హిందీలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ సంచలన నటి ఆ తరువాత తెలుగులో వెంకటేష్కు జంటగా కలియుగ పాండవులు చిత్రంలో కథానాయికిగా పరిచయమయ్యారు. ఆ తరువాత వరుషం– 16 చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. విశేషం ఏమిటంటే ఈమె తెలుగు, తమిళం భాషల్లో నటించిన రెండు చిత్రాలు విజయం సాధించాయి. ఆ తరువాత ఈ రెండు భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, విజయకాంత్, ప్రభు, కార్తీక్ వంటి నటులతో జంటగా నటించారు. కథానాయకిగా బిజీగా ఉండగానే దర్శకుడు సుందర్.సి ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రచార కర్తగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరో పక్క నిర్మాతగా చిత్రాలు నిర్మిస్తున్నారు. సుందర్.సి, కుష్బూ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇప్పుడు వారు కూడా సినీ రంగప్రవేశం చేయడం విశేషమేమీ కాదు. చిన్న కూతురు ఆనందిత దర్శకుడు మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా చేరారు. పొన్నియిన్ సెల్వన్ 1, 2, థగ్లైఫ్ చిత్రాలకు పని చేశారు. పెద్ద కూతురు అవంతిక హీరోయిన్గా రంగప్రవేశం చేశారు. ఈమె లండన్లో నటనలో శిక్షణ పొందారన్నది గమనార్హం. ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించి తల్లి కుష్బూ ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆరంభం అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సరిత మరో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. సురేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. అవంతిక త్వరలో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ అవుతారని ఆశించవచ్చు. -
పెళ్లి బంధం ఫెయిల్..నటుడి మోసం.. మానసికంగా కుంగిపోయా..!
జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మమతా మోహన్ దాస్. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించారు. అంతేకాకుండా రాఖీ మూవీలో తన గాత్రంలో అభిమానులను అలరించింది. అయితే కొన్నాళ్లకే క్యాన్సర్ బారిన మమతా మోహన్ దాస్ చాలా ఇబ్బందులు పడింది. ఓసారి క్యాన్సర్ జయించినా మమతకు మళ్లీ తిరగబెట్టడంతో తన కెరీర్ ముగిసిపోయిందనుకుంది. కానీ చాలా ఏళ్ల తర్వాత మహారాజా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో మెప్పించింది. అంతేకాకుండా రుద్రంగి సినిమాతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది.అయితే సినిమా రంగంలో ఎంతటి విజయాలు అందుకున్నా..పర్సనల్ లైఫ్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటోంది ముద్దుగుమ్మ. తాజాగా ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది. ఒక స్టార్ యాక్టర్ తనను ఎలా మోసం చేశాడని తెలిపింది. క్యాన్సర్, బొల్లి వ్యాధి సమస్యలతో సమస్యలతో పోరాడుతున్న సమయంలోనే ప్రేమ, పెళ్లి విషయంలోనూ ఎంతో మానసిక వేదనను అనుభవించానని అంటోంది.అదే సమయంలో మలయాళంలో ఒక ప్రముఖ నటుడితో డేటింగ్ చేసినట్లు వెల్లడించింది. ఈ విషయం అమ్మ కూడా తెలుసని.. కానీ అతనికి అప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయిందనే నిజాన్ని దాచిపెట్టి నను మోసం చేశాడని తెలిపింది. అయితే మమతా మోహన్ దాస్ మొదట తన చిన్ననాటి స్నేహితుడు ప్రజిత్ను ఇష్టపడి 2011లో వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం ఆరు నెలలకే ముగిసిపోయింది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెళ్లి బంధంలో విడాకులు తనను మానసికంగా కుంగదీశాయని మమతా ఆవేదన వ్యక్తం చేసింది. -
ఎర్రబస్సు ఎక్కా.. ఒక్కరు గుర్తుపట్టలేదు : జగపతి బాబు
సింపుల్ లైఫ్ని లీడ్ చేసే అదికొద్ది మంది నటుల్లో ఒకరు జగపతి బాబు. ఒప్పుడు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. అలాగే పలు చిత్రాల్లో సహయ నటుడిగా కొనసాగుతున్నారు. అయితే హీరోగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. షూటింగ్ అయితేపోతే చాలు.. సాధారణ వ్యక్తిలాగే జీవిస్తాడు. సమయం దొరికితే ఒక్కడే రోడ్డుపై నడచుకుంటూ వెళ్తాడు. చుట్టూ ఉన్నవాళ్లతో సరదాగా మాట్లాడతాడు. అంతేకాదు సెట్లో కూడా చాలా అల్లరి చేస్తాడని తోటి నటీనటులు చెబుతుంటారు. మెమోరీస్గా ఉండాలంటూ కొన్ని అల్లరి పనులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన అల్లరి పనుల గురించి చెప్పాడు జగపతి బాబు. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక అల్లరి పని చేసి పోలీసు స్టేషన్కి వెళ్లి వచ్చేవారట. సెట్లో ఉన్నవాళ్లకు కచ్చితంగా మద్యం అందించేవాడట. అలా ఓసారి అమెరికాకి వెళ్లి.. మద్యం మత్తులో గ్యాంబ్లింగ్ ఆడారట. అక్కడ డబ్బులు వచ్చిన ప్రతిసారి గట్టిగా అరుస్తూ డాన్స్ చేస్తే.. చివరకు పొగపెట్టి గదిలో నుంచి బయటకు పంపేశారని, అది తనకో స్వీట్ మెమోరీ అని అంటున్నాడు జగపతి బాబు.బస్సు ఎక్కితే గుర్తుపట్టలేదుసాధారణ మనిషిలాగానే బతకడం నాకు ఇష్టం. అందుకే వీలు దొరికనప్పుడల్లా సరదాగా బయటకు వెళ్తుంటాను. ‘కబడ్డీ కబడ్డీ’సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు ఎర్రబస్సు ఎక్కితే..ఒక్కరు కూడా గుర్తుపట్టలేదు. రాజోలులో షూటింగ్ జరుగుతున్న సమయంలో.. నా షూట్ అయిపోగానే నడుచుకుంటూ వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కా. నా వెనక సిబ్బంది కూడా ఎక్కింది. నన్ను ఎవరూ గుర్తు పట్టలేదు. కాసేపయ్యాక గుసగుసలు మొదలయ్యాయి. జగపతి బానేనా.. జగపతి బానేనా అని ఒకరినొకరు అడుక్కుంటున్నారు. నేను మాత్రం సైలెంట్గా ఉన్నా. ఒకరు చూసి.. ‘నువ్వు జగపతి బాబువే కదా’ అని అన్నారు. నేను వెంటనే కాదని చెప్పా. వాళ్లు సైలెంట్ అయిపోయారు. మా హోటల్ దగ్గర బస్సు ఆగగానే.. దిగేసి ‘నేను జగపతి బాబునే’ అంటూ గట్టిగా నవ్వుకుంటూ హోటల్లోకి వెళ్లిపోయా. ఇలాంటి అల్లరి పనులు చాలానే చేశా’ అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. -
తెరపై శివతాండవం చేసిన హీరోలు వీళ్లే..
హిందువుల పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి. భోళా శంకరుడు పార్వతీదేవిని పెళ్లాడిన రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈరోజు (ఫిబ్రవరి 15న) చాలామంది ఉపవాసం, జాగరణ ఉంటారు. రాత్రంతా నిద్రపోకుండా దేవుడి సినిమాలు చూస్తారు. పలువురు నటీనటులు వెండితెరపై మహాశివుడిగా మెప్పించారు. శివుడి వేషం వేసిన ఆ నటులెవరో చూసేద్దాం..ముందు గుర్తొచ్చేది ఆయనే..ఇప్పుడంటే భక్తి సినిమాలు తక్కువయ్యాయి.. కానీ ఒకప్పుడు పౌరాణిక చిత్రాలు ఎన్నో వచ్చాయి. పురాణ కథలను వెండితెరపై చక్కగా చూపేవారు. వెంకటేశ్వరస్వామి, రాముడు, శివుడు, కృష్ణుడు.. ఇలా అందరి దేవుళ్ల వేషం కట్టేవారు. ఇక శివుడి పాత్ర వేసిన నటులు అనగానే ముందుగా గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు. ఉమా చండీ గౌరీ శంకరుల కథ, దక్షయజ్ఞం వంటి సినిమాల్లో ఆయన భోళాశంకరుడిగా ఆకట్టుకున్నారు.ఏఎన్నార్, శోభన్బాబు కూడా..మూగ మనసులు మూవీలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలో అక్కినేని నాగేశ్వరరావు శివుడి రూపంలో కనిపించాడు. శ్రీ వినాయక విజయంలో కృష్ణంరాజు, పరమానందయ్య శిష్యుల కథలో శోభన్బాబు, మగరాయుడు సినిమాలో కమెడియన్ మల్లికార్జునరావు, మావూర్లో మహాశివుడు మూవీలో రావు గోపాలరావు.., భూకైలాస్, నాగుల చవితి సినిమాల్లో నాగభూషణం, శ్రీ సత్యనారాయణస్వామి మూవీలో సుమన్ శివుడిగా మెప్పించారు.దేవుడిగా అద్భుతాలుశ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి, ఢమరుకంలో ప్రకాశ్ రాజ్, కన్నప్ప మూవీలో అక్షయ్ కుమార్ శివయ్యగా ఆకట్టుకున్నారు. సీతారామ కల్యాణం సినిమాలో ఎంత నేర్చినా ఎంత చూసినా పాటలో బాలకృష్ణ కాసేపు శివుడిగా కనిపించాడు. ఇలా ఎందరో యాక్టర్స్ యాక్షన్, ఎమోషన్స్తోపాటు పాటు భక్తిరస చిత్రాల్లోనూ నటించగలమని నిరూపించారు. తెరపై శివతాండవం చేసి ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. -
మా కన్నీళ్లతో డబ్బు సంపాదించుకుంటున్నారు: సుప్రిత
సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రిత అమరావతికి ఆహ్వానం సినిమాతో వెండితెరపైకి వచ్చింది. తాజాగా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన కెరీర్ ఆరంభంలోనే అనేక వివాదాలతో పాటు ట్రోలింగ్ను దాటుకుని వచ్చింది. అయితే, తమ వ్యక్తిగత జీవితం గురించి సుప్రిత పంచుకుంది.'కొన్ని సో కాల్డ్ మీడియా వారు మా కన్నీళ్లతో డబ్బు సంపాదించుకుంటున్నారు. ప్రతిదానికి మా గురించి తప్పుడు కథనాలు రాసేస్తున్నారు. వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా వెళ్లాం. అయితే, ఇప్పుడు బలంగా తయారయ్యాము. ఎంతటి నెగటివిటీ చేసినా సరే పట్టించుకనేది ఉండదు. గతంలో తెలిసోతెలీకనో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం. ఇప్పుడు అది కూడా లేదు. బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టాల గురించి తెలిసిన తర్వాత మేము కూడా చాలా బాధపడ్డాం. నిర్మాత కేపీ చౌదరితో ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నా సరే.. పదేపదే డ్రగ్స్తో లింక్లు అంటూ మాపై కొన్ని మీడియా ఛానల్స్లలో ప్రచారం చేశారు. కేపీ చౌదరిపై వచ్చిన వార్తా కథనాల వల్ల ఆయన కూడా కుంగిపోయారు. డ్రగ్స్తో సంబంధాలు పెట్టుకుని ఆయన తప్పు చేశాడు. కానీ, మరణించిన తర్వాత కూడా తప్పుడు థంబ్నైల్స్ పెట్టి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ డబ్బు సంపాధించేకునేందుకు ప్లాన్ చేశాయి. అతను ఒక మంచి వ్యక్తిగా మాకు తెలుసు. కానీ, లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేశారు.' అని చెప్పింది.తన తల్లి సురేఖ వాణి రెండో పెళ్లి గురించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. రెండో పెళ్లి చేయాలనేది కేవలం తన కోరిక మాత్రమేనని ఆమె చెప్పింది. తన మదర్కు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. -
ధురంధర్లో ఆఫర్.. క్లారిటీ ఇచ్చిన నాగార్జున
గతేడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసిన సినిమా ధురంధర్. మౌత్ టాక్తోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లోనూ దుమ్ము దులుపుతోంది.అక్షయ్పై సర్వత్రా ప్రశంసలురణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్ కీలక పాత్రలు పోషించారు. సినిమా రిలీజయ్యాక అందరికన్నా ఎక్కువగా అక్షయ్ పేరే మారుమోగిపోయింది. అతడి స్వాగ్, డ్యాన్స్, లుక్స్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. రెహ్మాన్ డకాయిట్గా అక్షయ్ అదరగొట్టేశాడని ప్రశంసలు లభించాయి.స్పందించిన నాగ్అయితే రెహ్మాన్ పాత్ర కోసం అక్షయ్ కంటే ముందు నాగార్జునను సంప్రదించారని ఓ వార్త ఫిల్మీదునియాలో వైరలవుతోంది. తాజాగా ఈ ప్రచారాన్ని కింగ్ నాగ్ కొట్టిపారేశాడు. ధురంధర్ సినిమా కోసం తనను సంప్రదించలేదని కుండ బద్ధలు కొట్టాడు. ఒకవేళ తనకు అవకాశం ఇచ్చుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ధురంధర్ మూవీ చాలా బాగుందన్నాడు. సినిమాఆదిత్య ధర్ దర్శకత్వం అదిరిపోయిందని, అతడి ముందు సినిమా ఉరి: ద సర్జికల్ స్ట్రైక్ కూడా తనకు ఎంతగానో నచ్చిందని ప్రశంసించాడు. సినిమాలో అందరూ బాగా నటించారని, అక్షయ్ ఖన్నా అద్భుతంగా యాక్ట్ చేశాడని మెచ్చుకున్నాడు. ధురంధర్ సీక్వెల్ కూడా మరింత బ్లాక్బస్టర్ అవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ధురంధర్ 2 మూవీ మార్చి 19న విడుదలవుతోంది.చదవండి: కపుల్ ఫ్రెండ్లీకి హిట్ టాక్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే? -
'ఓం శంభో శివ శంభో' ఈ సాంగ్ విన్నారా..?
మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా పరమేశ్వరుడి భక్తి పాటను హోంబలే ఫిల్మ్స్ సంస్థ విడుదల చేసింది. 'ఓం శంభో శివ శంభో స్వయంభో..' అంటూ సాగే ఈ పాటను స్వామి దయానంద సరస్వతి రచించగా నారాయణ్ శర్మ ఆలపించారు. వీఎఫ్ఎక్స్ విజువల్స్తో క్రియేట్ చేసిన ఈ సాంగ్ భక్తులను మెప్పస్తుంది. ఈ పాటలో శివుడు అత్యంత శక్తివంతమైన రూపంలో కనిపిస్తారు. గతేడాది మహావతార నరసింహ సినిమాతో భారీ విజయం అందుకున్న హోంబలే ఫిల్మ్స్ తాజాగా శివయ్యపై భక్తితో రూపొందిన ఈ పాటకు అద్భుతమైన విజువల్స్ను జోడించి విడుదల చేశారు. -
‘కపుల్ ఫ్రెండ్లీ’కి హిట్ టాక్.. ఫస్ట్డే కలెక్షన్ ఎంతంటే..
ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో హిట్ టాక్ సంపాదించుకున్న చిత్రం‘కపుల్ ఫ్రెండ్లీ’. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. రొటీన్ లవ్స్టోరీనే అయినా..తెరపై చాలా మెచ్యూర్డ్గా ప్రజెంట్ చేశాడంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సంతోష్, మానసల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం సినిమాకు కలిసొచ్చింది.పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ చిత్రం..బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.89 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బరిలో పెద్ద చిత్రాలేవి లేకపోవడం.. ఈ వారం రిలీజైన మిగతా చిత్రాలకు ఫ్లాప్ టాక్ రావడంతో వారాంతంలో కపుల్ ప్రెండ్లీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. -
మహేశ్బాబు చేతులమీదుగా టీజర్.. అదిరిపోయేలా విజువల్స్
పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’ టీజర్ వచ్చేసింది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘పెద్ద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా తాజాగా మహేష్బాబు చేతులమీదు టీజర్ను రిలీజ్ చేశారు.భారతదేశ చరిరత్రలో ఎన్నో పురాతనమైన రహస్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని నాగబంధం సంప్రదాయంతో ముడిపడి కాలగర్భంలో కలిసిపోయాయి. ఇదే కథను ఒక అద్భుతంలా తెరపై ఆవిష్కరించారు. 1750 నేపథ్యంలో భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 2026 వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. -
రవితేజ ఇరుముడి.. మహా శివరాత్రి అప్డేట్
మాస్ మహారాజా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఇరుముడి(Irumudi). ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 26న రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్లో అయ్యప్పమాల ధరించిన రవితేజ.. చేతిలో మరో చిన్నారిని ఎత్తుకుని చాలా కొత్తగా కనిపించారు.ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకుని మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫస్ట్ లుక్ను రివీల్ చేశారు. ఈ సినిమాలో కావేరి అనే పాత్రలో ప్రియా భవాని శంకర్ కనిపించనుందని వెల్లడించారు. ఈ చిత్రంలో రవితేజ భార్యగా అభిమానులను మెప్పించనుంది. తాజాగా రిలీజైన ఈ పోస్టర్ టాలీవుడ్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనున్నట్లు తెలుస్తోంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో దర్శకుడు శివ నిర్వాణ నిన్ను కోరి (2017), మజిలీ (2019), ఖుషి (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో హిట్స్ కొట్టారు. రవితేజతో తీస్తోన్న పాన్ ఇండియా రేంజ్ మూవీ 2026లోనే ఈ విడుదల కానుంది. Presenting the talented @priya_Bshankar as 'Kaveri' from #IRUMUDI / #ఇరుముడి - a caring wife and a doting mother ❤️Starring MASS MAHARAJA @RaviTeja_offl 🤩A @gvprakash musical 🎺🎼@ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/e9puiTkwrS— Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2026 -
లుంగీ ధరించి రమ్మన్నారు.. నో చెబితే..: యాంకర్
సుహాస్ హీరోగా నటిస్తున్న హే భగవాన్ చిత్రంలో యాంకర్, బిగ్బాస్ ఫేమ్ స్రవంతి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 20న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో స్రవంతి ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటూ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా దూసుకెళ్తెంది. హీరోయిన్ల డ్రెస్ల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాంకర్ డ్రెస్లు ఎవరు సెలక్ట్ చేస్తారనేది స్రవంతి క్లారిటీ ఇచ్చింది.' ఏదైనా ఒక సినిమా ఈవెంట్కు వెళ్లితే మా కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అనేది వాళ్లే డిసైడ్ చేస్తారు. ఎలాంటి దుస్తులు ధరించాలనేది మా చాయిస్ కాదు. శ్రీవిష్ణు నటించిన సింగల్ మూవీ ఈవెంట్ కోసం లుంగీ కట్టుకుని రమ్మని చెప్పారు. అప్పుడు అదే పనిగా కళ్లజోడు, లుంగీ కొనుగోలు చేసి వాటిని ధరించి యాంకరింగ్ చేశాను.నో చెబితే అవకాశాలు రావు. అందుకే ఈ విషయంలో మాకు ఆప్షన్ ఉండదు. దుస్తుల విషయంలో మాకు ఆప్షన్ ఇస్తే నేను ట్రెడిషనల్ డ్రెస్నే ఎంపిక చేసుకుంటాను. కొన్ని సినిమాలకు చీరలు కట్టుకునే ప్రమోషన్స్ కార్యక్రమాలకు పాల్గొన్నాను. నా వద్ద సుమారు వెయ్యికి పైగా చీరలు ఉన్నాయి.' అని స్రవంతి చెప్పింది.హీరోయిన్ల దుస్తుల గురించి నటుడు శివాజీ వ్యాఖ్యలు సబబుగానే ఉన్నాయని స్రవంతి పేర్కొంది. కానీ, మహిళల గురించి మాట్లాడుతూ ఆయన నుంచి రెండు పదాలు తప్పుగా దొర్లాయి.. వాటిని తాను కూడా సమర్ధించను. తర్వాత శివాజీ కూడా క్షమించాలని బహిరంగంగానే చెప్పారని ఆమె గుర్తు చేసింది. -
నాగబంధం టీజర్ రిలీజ్.. దర్శకుడు ఎమోషనల్ నోట్
‘పెద్ద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా నేడు(ఫిబ్రవరి 15) ఉదయం 11:11 గంటలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర దర్శకుడు అభిషేక్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ నోట్ విడుదల చేశాడు. ఈ సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపామని.. టీజర్ నచ్చితే మా కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే అవుతుందంటూ ఓ సుదీర్ఘమైన లేఖను విడుదల చేశాడు. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మహాదేవుని ఆశీస్సులతో మా చిత్రానికి సంబంధించిన వరల్డ్ ఆఫ్ నాగబంధం ఫస్ట్ టీజర్ను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ చిత్రం కేవలం రాసుకున్న కథ కాదు, ఏ చరిత్ర పుస్తకాల్లోనూ రాయని గాథ. ఈ కథను పూర్తిగా తెలుసుకొని రాయడానికి ఏన్నో నెలలు పట్టింది. ఈ కథ పూర్తిగా రాసిన తరువాతే ఊపిరిపీల్చుకోగలిగాము. ఈ కథను తెరపై ఎక్కించడానికి ఎన్నో నిశ్చబ్దాలను ఎదుర్కొంటూ, ఎన్నో నిద్రలేని రాతుల్రను గడిపాము.ఒక దర్శకుడిగా చెప్పాలంటే..ఈ టీజర్ అనేది విజువల్ మాత్రమే కాదు. అది మా ఊపిరిలో దాగిఉన్న శ్వాస. చాలాకాలం మా అంతరాత్మలో దాచుకొని మీ ముందుకు నిజంలా తీసుకొస్తున్న తొలి దృశ్యరూపం. మీరు చూసే ప్రతీ ఫ్రేమ్లోనూ మా కష్టం ఉంది. అది మీకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది. మాకు ఈ కథపై నమ్మకం, సనాతన ధర్మంపై విశ్వాసం, సినిమాపై ఉన్న ప్రేమే మా మార్గానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లింది.అలసిపోయిన రాత్రులు గడిపాము, ప్రశ్నలతో నిండిన రోజులు చూశాం. అయినా మేము ఆ ప్రశ్నల లోతులోకి తొంగి చూసి, వాటిని ఛేదిస్తూ ముందుకు సాగాము. కథను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దామో, అంతకంటే గొప్పగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని నమ్ముతున్నాము. ఆ మహాదేవునిపై ఉన్న దైవభక్తి మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించింది.మా ప్రయాణానికి వెన్నంటే ఉంటూ వెన్నెముకగా నిలిచిన మా నిర్మాతలు నిషిత, కిషోర్ గ్లారకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారు చూపించిన స్నేహపూర్వకమైన నమ్మకమే నా ధైర్యం. వారు నాకు చ్చిన ప్రోత్సాహమే నా బలం. ఇక మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, రానా దగ్గుబాటి గారి ప్రోత్సాహం, ఆశీర్వాదాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేను. రాతల్లో రాయలేను. మేము కోరుకునేది ఒక్కటే స్వచ్ఛమైన మనస్సుతో ఈ టీజర్ను వీక్షించండి. మీ మనస్సును తాకితే మా కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే. చివరిగా మీరు చూపించే ఆదరణే మా ఆయుధం. ఆ ఆయుధమే ఈ చిత్ర విజయానికి బాటలు వేసేలా చేస్తుందని భావిస్తున్నా’ అని అభిషేక్ నామా రాసుకొచ్చాడు. "#NAGABANDHAM IS NOT JUST ANOTHER MOVIE."With a heart filled with the deepest gratitude to everyone who supported me on this unforgettable journey,I am bringing the WORLD OF NAGABANDHAM before you at 11:11 AM.Let’s celebrate our history.Let’s celebrate our Sanatana Dharma.… pic.twitter.com/s0q3Lil6TJ— ABHISHEK PICTURES (@AbhishekPicture) February 15, 2026 -
'మరిన్ని మ్యాజికల్ చేద్దాం'.. పెద్ది కెప్టెన్కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఇటీవలే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా రామ్ చరణ్ తన డైరెక్టర్కు విషెస్ తెలిపారు. ఈ రోజు బుచ్చిబాబు బర్త్ డే కావడంతో పెద్ది మూవీ షూటింగ్లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. పెద్ది కెప్టెన్ బుచ్చిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. సెట్లో మీ అభిరుచి, వివరణాత్మక కథనం, పాతుకుపోయిన కథ చెప్పడం ప్రతిరోజూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని రాసుకొచ్చారు. మనిద్దరం కలిసి మరిన్ని మాయా కథలను సృష్టిద్దామని చెర్రీ తన టీట్లో రాసుకొచ్చారు. ఈ సంవత్సరం మీ కృషికి తగిన గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ కూడా బుచ్చిబాబుకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. Wishing my #Peddi captain @BuchiBabuSana Garu a very happy birthday! ❤️ ❤️ Your passion, detailing and rooted storytelling are inspiring every single day on set. Let’s create many more magical stories together.May this year bring you all the recognition your hard work truly… pic.twitter.com/NokRPm2HXV— Ram Charan (@AlwaysRamCharan) February 15, 2026 -
‘కపుల్ ప్రెండ్లీ’పై ప్రభాస్ రివ్యూ
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేశారు రెబల్ స్టార్ ప్రభాస్. తనకు వర్షం సినిమాలా, సంతోష్ శోభన్ కు కపుల్ ఫ్రెండ్లీ గుర్తుండిపోయే మూవీ అవుతుందని ప్రభాస్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఇదొక లవ్ లీ బ్యూటిఫుల్ ఫిలిం అని, ఈ చిత్రాన్ని చూడటాన్ని ఎంజాయ్ చేశానంటూ ప్రభాస్ తెలిపారు. సంతోష్, మానస జోడీ అద్భుతంగా ఉందని, అశ్విన్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించారని ప్రభాస్ ప్రశంసించారు. ఇలాంటి మంచి కథలను తెరపైకి తీసుకొచ్చిన కో ప్రొడ్యూసర్ అజయ్, యూవీ క్రియేషన్స్ కు ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు.కపుల్ ఫ్రెండ్లీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ రూపొందించారు. -
డేట్ ఛేంజ్
ఎస్... ఫలానా డేట్కి థియేటర్స్కి వచ్చేస్తాం అంటూ యూనిట్ ఒక డేట్ ఫిక్స్ చేసి, ప్రకటిస్తుంది. అయితే కొన్నిసార్లు సెట్ చేసిన డేట్కి ఆ సినిమా రాదు... వాయిదా పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వాయిదా వేస్తుంటారు. కొన్ని సినిమాల షూటింగ్ పూర్తి కాదు... కొన్ని పూర్తయినా గ్రాఫిక్స్ పూర్తి కావు... కొన్నయితే అన్నీ పూర్తయినా వేరే సినిమాలతో క్లాష్ అయ్యే పరిస్థితిలో తప్పక వాయిదా పడతాయి. కారణాలు ఏమైనప్పటికీ ఈ మధ్య కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ చిత్రాల పోస్ట్ పోన్ స్టోరీ తెలుసుకుందాం. వేసవిలో విశ్వంభర చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఇందుకు కారణం... చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా. తనయుడి ‘గేమ్ చేంజర్’ కోసం తన ‘విశ్వంభర’ మూవీ విడుదలని చిరంజీవి వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ చేంజర్’ 2025 జనవరి 10న రిలీజ్ అయింది. 2025 సంక్రాంతికి వాయిదా పడిన ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందని భావించినప్పటికీ కాలేదు. ఇందుకు కారణం వీఎఫ్ఎక్స్ పనులు. ఈ కారణంగా చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్గారు’ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేశ్ ముఖ్య పాత్ర పోషించారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఇక 2025 జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి... విడుదల తేదీపై స్పష్టత రావాలి. మార్చి టు ఏప్రిల్ రామ్చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీని రామ్చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా వేశారు. ‘‘రామ్చరణ్ హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా స్పోర్ట్స్, యాక్షన్ డ్రామా ‘పెద్ది’. హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ కోసం రామ్చరణ్ ఫుల్మాస్ లుక్లోకి మారిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. మార్చి 27న ఈ సినిమాని విడుదల చేయాలని భావించాం. అయితే వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30కి మార్చాం. మా సినిమా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘చికిరి చికిరి...’ పాట అన్ని ΄్లాట్ఫామ్లలో అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ పాట 200 మిలియన్ల వ్యూస్ దాటి సినిమాపై అంచనాలను భారీగా పెంచింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఏప్రిల్లో విడుదల కావాల్సిన పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్సింగ్’ ముందుకు వచ్చి, మార్చి 26న రిలీజ్ కానుంది. మార్చి నుంచి ఆగస్టుకి... ‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘కిల్, గ్యారా గ్యారా’ వంటి హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న రాఘవ్ జుయల్ ‘ది ΄్యారడైజ్’లో భాగమయ్యారు. ఓ కీలక పాత్రను సంపూర్ణేష్ బాబు చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. నానిపై ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఇంట్రో సాంగ్ చిత్రీకరిస్తున్నారు. వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో తెరకెక్కుతున్న ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మాస్ ట్యూన్ అందించారు. కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ భారీ విజువల్స్తో ఈ సాంగ్ని పూర్తి స్థాయి క్రౌడ్ ప్లీజర్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్ట్పోస్ చేసి, ఆగస్టు 21న విడుదల చేయనున్నారు. ‘‘మ్యాసివ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ హాటెస్ట్ పాన్ ఇండియన్ రిలీజెస్లో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. మా సినిమాని ముందుగా మార్చి 26న విడుదల చేయాలనుకున్నాం. అయితే తాజాగా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రిలీజ్ డేట్కి మా సినిమాకు వరుసగా మూడు వారాల పండగలు కలిసి రానున్నాయి. మొదటి వారంలో ఓనం, మిలాద్–ఉన్–నబీ పండగలు, రెండో వీకెండ్లో రాఖీ, మూడో వారంలో జన్మాష్టమి ఉండటం వల్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘ది ΄్యారడైస్’కి బాక్సాఫీస్ వద్ద బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది. ΄్లానింగ్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాని... ఈ నిర్ణయంతో మరోసారి తన మార్కెటింగ్ సెన్స్ని చూపించారు’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఫిబ్రవరి టు ఏప్రిల్... ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో ఈ నెల 13న రిలీజ్ చేస్తామని యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. అయితే ఆ తేదీకి విడుదల వాయిదా పడి, ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందిన చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్ పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు... ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయట. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న యూనిట్... కొంచెం ఆలస్యమైనా సరే బెస్ట్ ఔట్పుట్ ఇవ్వాలని నిర్ణయించుకుని ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 10కి వాయిదా వేసినట్లు టాక్. ఈ మూవీ 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల కానుంది. 1000 ఏళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ్రపాంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవాడు. అల్లరిగా తిరిగే అండర్ డాగ్ రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ‘సలార్’ మూవీ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచింది. అదే విధంగా సెంథిల్ కుమార్ విజువల్స్ ఈ మూవీకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. మే 1న లెనిన్ వస్తాడా? అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో అఖిల్ ఫుల్ మాస్ లుక్లో కనిపించనున్నారు. ‘లెనిన్’ని మే 1న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే... ఆ తేదీకి రిలీజ్ కాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం రామ్చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా అని ఫిల్మ్నగర్ టాక్. మార్చి 27న ‘పెద్ది’ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ‘లెనిన్’ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ‘లెనిన్’ని మే 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే కొత్త విడుదల తేదీపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి... ముందుగా అనుకున్నట్లు ‘లెనిన్’ మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తాడా? లేదా? లేకుంటే మరో కొత్త రిలీజ్ డేట్ని ప్రకటిస్తారా? అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ‘లెనిన్’ పై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ మూవీ తప్పకుండా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మార్చి నుంచి ఏప్రిల్కి? అడివి శేష్ హీరోగా రూపొందిన తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా 2025 డిసెంబరు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి రిలీజ్ని పోస్ట్పోన్ చేసి, ఉగాది కానుకగా ఈ ఏడాది మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇంటెన్స్ లుక్స్లో ఉన్న రిలీజ్ డేట్ పోస్టర్ను విడుదల చేశారు. అయితే ఈ మూవీ మరోసారి విడుదల వాయిదా పడనుందని ఫిల్మ్నగర్ టాక్. మార్చి నెలలో యశ్ ‘టాక్సిక్’, రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ వంటి సినిమాలు ఆడియన్స్ ముందుకి వస్తుండటంతో ‘డెకాయిట్’ విడుదల వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ కానుందనే చర్చ నడుస్తోంది. అయితే మార్చి 19న విడుదల వాయిదా గురించి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘‘ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘డెకాయిట్’. ఇప్పటికే విడుదలైన ఫైర్ గ్లింప్స్లోని ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్కి పాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారు. ఆయన నటించిన తొలి తెలుగు చిత్రం మాదే. అంతర్జాతీయ స్థాయిలో తీసిన ‘డెకాయిట్’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే... యూనిట్ ముందుగా ప్రకటించినట్లు మార్చి 19న ‘డెకాయిట్’ సినిమా విడుదలవుతుందా? లేదా అనేది వేచి చూడాలి. ∙సంబరాలు ఎప్పుడు? సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు (ఎస్వైజీ). ఐశ్వర్యా లక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించినప్పటికీ పోస్ట్పోన్ అయింది. అయితే ఆ తర్వాత విడుదల తేదీపై యూనిట్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, మార్చి 14న థియేటర్లలోకి రానుందని టాక్. ‘‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం రూ. 125 కోట్లకు పైగా బడ్జెట్తో భారీ స్థాయిలో రూపొందింది. సాయిదుర్గా తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ ్రపాజెక్ట్గా ఈ మూవీ నిలుస్తుంది. మా సినిమాలోని సీజీ వర్క్ ఆడియన్స్కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వెట్రి పళనిసామి విజువల్స్, బి. అజనీష్ లోక్నాథ్ సంగీతం అదనపు ఆకర్షణలు’’ అని యూనిట్ తెలిపింది. నాయకుడు వచ్చేదెప్పుడు? తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. కేవీఎన్ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా పొంగల్ కానుకగా ఈ ఏడాది జనవరి 9 విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కొత్త విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు. విజయ్ ఇప్పటికే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ కారణంగా ఆయన సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారు. అందుకే విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్కి అద్భుతమైన స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం సెన్సార్ ఇబ్బందుల్లో ఉంది. మరి... అడ్డంకులు దాటుకుని ‘జన నాయకుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదెప్పుడు? అన్నది వేచి చూడాలి. -
'ఈ బిడ్డ నా జీవితకాల కోరిక'.. బిగ్బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్
బిగ్బాస్ కంటెస్టెంట్, యాంకర్ శివజ్యోతి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 12న బిడ్డ పుట్టగా.. శివజ్యోతి బర్త్డే సందర్భంగా ఈనెల 14 శుభవార్తను పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలిపారు.తాజాగా బిగ్బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్ చేసింది. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని రాసుకొచ్చింది. నా వెంకటేశ్వర స్వామి ప్రసాదం...నా స్వామి ఇచ్చిన మహా లక్ష్మి... వెంకటేశ్వర స్వామి నా జీవితంలో అత్యంత విలువైన పుట్టినరోజు బహుమతని ఇదేనని భావోద్వేగ పోస్ట్ చేసింది. కుమార్తెను కనడం నా జీవితకాల కోరికని శివజ్యోతి వెల్లడించింది.శివజ్యోతి తన ఇన్స్టాలో రాస్తూ..' బిడ్డను కనడం నాకు ఒక పెద్ద కల. అందులో ఒక కుమార్తెను కనడం నా జీవితకాల కోరిక. బహుశా దేవుడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడని నేను ఎప్పుడూ భావించా. అత్యంత సరైన సమయంలో ఆయన నాకు ఆశీర్వాదాన్ని కొంచెం ఆలస్యంగా ఇస్తాడు. కానీ.. మొదటి నెల నుంచే నా హృదయం ఆడపిల్ల కోసం బలంగా కోరుకుంది. కానీ నా మనస్సు అబ్బాయి కావచ్చని చెబుతూనే ఉంది. ఆ తర్వాత నా డెలివరీ గడువు తేదీకి కేవలం రెండు రోజుల ముందు అకస్మాత్తుగా నా హృదయంలో ఆ భావన మారిపోయింది. మనకు ఆడపిల్ల పుట్టబోతోందని భావించా. ఈ రోజు, మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు, ప్రకృతి దయతో మాకు అందమైన ఆడపిల్ల పుట్టిందని' రాసుకొచ్చింది.ప్రస్తుతం నా భర్త గంగూలీ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన, అదృష్టవంతుల్లో ఒకరని తెలిపింది. ఆ జెంటిల్మెన్ స్వభావం, స్వచ్ఛమైన, దయగల హృదయం కారణంగానే మాకు ఆడపిల్ల పుట్టిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని తెలిపింది. మీ అందరి ఆశీర్వాదాలతో నేను, నా బిడ్డ క్షేమంగా ఉన్నామని పోస్ట్ చేసింది. ఈ శుభ సందర్భంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయని ఆనందం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) -
ప్రముఖ నటుడి కుమారుడి కారు బోల్తా..
తమిళ సినీ ప్రపంచంలో మన్సూర్ అలీ ఖాన్ ప్రముఖ విలన్గా, సహనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. లియో మూవీ విడుదల తర్వాత నటి త్రిషపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాడు. అయితే, ఆయన కుమారుడు తుగ్లక్ తన కారులో చెన్నై హాడోస్ రోడ్డు నుండి ఉత్తమర్ గాంధీ రోడ్డు వైపు వెళ్తుండగా..అకస్మాత్తుగా అదుపు తప్పి శాస్త్రి భవన్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి ఆపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా, కారులో ఉన్న తుగ్లక్ స్వల్ప గాయాలతో కిందపడ్డాడు. అక్కడ ఉన్న ప్రజలు అతన్ని రక్షించి, ఘటన స్థలంలో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మైలాపూర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ప్రమాదం జరిగినప్పుడు తుగ్లక్ మద్యం సేవించలేదని తెలిసింది. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. గత సంవత్సరం మాదకద్రవ్యాలు ఉపయోగించినందుకు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు తుగ్లక్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించడం గమనార్హం. -
వాలెంటైన్స్ డే స్పెషల్.. పవిత్రా లోకేశ్కు నరేశ్ స్వీట్ విషెస్..!
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా సుహాస్ హీరోగా వస్తోన్న హే భగవాన్ మూవీతో ఆడియన్స్ను పలకరించనున్నారు. శివానీ నాగారం హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే నరేశ్ మూవీ ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా పవిత్రా లోకేశ్తో సరదా ఇంటర్వ్యూ జరిగింది. హే భగవాన్ మూవీ గురించి పవిత్రా లోకేశ్ ప్రశ్నలు అడగ్గా.. నరేశ్ సమాధానాలిచ్చారు. ఈ మూవీలో నా క్యారెక్టర్ నేను మరిచిపోలేని పది సినిమాల్లో పాత్రల్లో ఇది ఒకటని అన్నారు. నాతో ఇంటర్వ్యూ ఎలా ఫీలవుతున్నారని పవిత్రా అడగ్గా.. నువ్వు చాలా బాగా మాట్లాడావ్.. మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. మంచి యాంకర్ అవుతావని నేను నమ్ముతున్నా అంటూ పంచులు వేశారు.అంతేకాకుండా వాలెంటైన్స్ డే కావడంతో పవిత్రకు స్పెషల్గా విషెస్ తెలిపారు. కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే.. ప్రియతమ నువ్వు అచట కుశలమా.. నేను ఇచట కుశలమే అంటూ లవ్ సాంగ్ పాడుతూ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రేమికుల రోజున మూవీ ప్రమోషన్తో పాటు వీరిద్దరి ప్రేమబంధం చూసిన ఆడియన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.పవిత్రకే బిజినెస్ ఏంటో చెప్పలేదు...మీరు చెబితే 20K,#Guess Cheyyandi#HeyBhagawan pic.twitter.com/hwOA60mRVh— Taraq(Tarak Ram) (@tarakviews) February 14, 2026 -
ఓటీటీ కోసం చేసే సినిమాలు పెరిగాయి : వంశీ నందిపాటి
‘‘హే భగవాన్’ ఎంటర్టైన్మెంట్ మూవీ. స్టోరీ లెవల్ నుంచే ఈ ప్రాజెక్టులో ఉన్నాను. ఇప్పుడు సమర్పకుడిగా ఉన్నాను. ఈ సినిమాలో బిజినెస్ అనే అంశం ఉంటుంది. ఒక కొడుకు తన తండ్రి గురించి అర్థం చేసుకోవడానికి ఆ అంశం ఉపయోగపడుతుంది. ఈ సినిమాలో వినోదంతో పాటు భావోద్వేగాలు ఉన్నాయి. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హృదయానికి హత్తుకునే సినిమా ఇది’’ అని వంశీ నందిపాటి అన్నారు. సుహాస్, శివానీ నాగారం జోడీగా గోపీ అచ్చర దర్శకత్వం వహించిన చిత్రం ‘హే భగవాన్’. బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కానుంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వంశీ నందిపాటి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర పేరు భగవాన్.. అందుకే ‘హే భగవాన్’ టైటిల్ పెట్టాం. కొంతకాలం నుంచి సుహాస్ ఎదురు చూస్తున్న కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో సాధించబోతున్నాడు. కథ పరంగా ఏవైనా మార్పులుంటే కన్విన్సింగ్గా చెబితే దర్శకులు కూడా ఒప్పుకుంటారు. అయితే కంటెంట్లో బలం ఉంటేనే మనం కూడా ఏమైనా చేయగలం.దర్శకుడు హ్యాపీ అయితే సినిమా బాగుంటుందనేది నా నమ్మకం. ఇక ‘లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి’ మూవీస్ తర్వాత చిన్న సినిమాలు పెరిగాయి. ఇటీవల ఫిల్మ్ఛాంబర్లో ఒక నెలలోనే 300 సినిమాల టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి. ఓటీటీ బిజినెస్లు కావడం లేదని ఓ క్లారిటీ వచ్చింది. అయితే కేవలం ఓటీటీ కోసం చేసే సినిమాలు పెరిగాయి. నిర్మాతగా మంచి చిత్రాలు అందించాలనేది నా లక్ష్యం. బన్నీ వాసుగారు నాకు బ్రదర్లాంటి వారు. మా ఇద్దరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉంటాయి. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్గా మార్చి 6న రిలీజ్ చేస్తున్నాను. సత్యదేవ్తో పాటు శ్రీవిష్ణుతో సినిమాలు చేస్తున్నాను. ‘పొలిమేర–3’ షూట్ని ఏప్రిల్ లేదా మేలో ప్రారంభిస్తాం. ఈ మూవీని అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈటీవీ విన్తో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తున్నాను’’ అని చెప్పారు. -
అల్లు అర్జున్- అట్లీ కాంబో.. మరో హీరోయిన్గా క్రేజీ బ్యూటీ..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఇదే. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం బిగ్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక్క హింట్ కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడా షూటింగ్కు సంబంధించిన సింగిల్ వీడియో కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇది చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ను ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొణెను ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. లేటేస్ట్గా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ బిగ్ ప్రాజెక్ట్లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ను మరో హీరోయిన్గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ విషయాన్ని త్వరలోనే రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ- అట్లీ సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. -
మెగాస్టార్ కొత్త సినిమా.. ఛాంపియన్ బ్యూటీకే ఆ ఛాన్స్..!
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన మనశంకర వరప్రసాద్గారు సూపర్ హిట్గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మెగా అభిమానులను మెప్పించింది. అయితే మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ హీరోయిన్స్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టాలీవుడ్లో క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రకు ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్గా కాదు.. చిరంజీవి కూతురిగా కనిపించనుందని సమాచారం. ఈ కథలో పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో దర్శకుడు బాబీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. భావోద్వేగాలకు ప్రధాన్యత ఉన్న పాత్ర కావడంతో అనస్వర నటన సినిమాకు మరింత బలం చేకూర్చనుందని ఇండస్ట్రీ లేటేస్ట్ టాక్. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
నెలాఖరులో విష్ణు విన్యాసం
విష్ణు, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో హేమ అండ్ షాలినిల సమర్పణలో సుమంత్ నాయుడు .జి నిర్మించారు.ఈ సినిమాను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లుగా శనివారం రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించి, కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ‘సత్యం’ రాజేష్ నటించిన ఈ సినిమాకు సంగీతం: రథన్. -
సరస్వతి సాహసం
వరలక్ష్మీ శరత్కుమార్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘సరస్వతి’. ఈ హై కాన్సెప్ట్ థ్రిల్లర్ సినిమాను దోస డైరీస్ పతాకంపై వరలక్ష్మీ శరత్కుమార్, ఆమె సోదరి పూజా శరత్కుమార్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను హీరోయిన్ సమంత లాంచ్ చేశారు. ‘‘సరస్వతి’ జర్నీ నాకు ఎంతో ముఖ్యమైంది. ప్రతి కథకు ఓ లక్ష్యం ఉంటుంది.క్రూరమైన ప్రపంచానికి వ్యతిరేకంగా సరస్వతి ఎదురు నిలిచే సాహసం చేసిందే కానీ, లొంగిపోవాలనుకోలేదు’’ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఉద్దేశించి, పేర్కొన్నారు వరలక్ష్మి. జీవా, ప్రకాశ్రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక, కిషోర్కుమార్, శ్రీకాంత్ అయ్యర్, రావు రమేష్, సప్తగిరి నటించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
డేట్ ఛేంజ్
ఎస్... ఫలానా డేట్కి థియేటర్స్కి వచ్చేస్తాం అంటూ యూనిట్ ఒక డేట్ ఫిక్స్ చేసి, ప్రకటిస్తుంది. అయితే కొన్నిసార్లు సెట్ చేసిన డేట్కి ఆ సినిమా రాదు... వాయిదా పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వాయిదా వేస్తుంటారు. కొన్ని సినిమాల షూటింగ్ పూర్తి కాదు... కొన్ని పూర్తయినా గ్రాఫిక్స్ పూర్తి కావు... కొన్నయితే అన్నీ పూర్తయినా వేరే సినిమాలతో క్లాష్ అయ్యే పరిస్థితిలో తప్పక వాయిదా పడతాయి. కారణాలు ఏమైనప్పటికీ ఈ మధ్య కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ చిత్రాల పోస్ట్పోన్ స్టోరీ తెలుసుకుందాం.వేసవిలో విశ్వంభర చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.ఇందుకు కారణం... చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా. తనయుడి ‘గేమ్ చేంజర్’ కోసం తన ‘విశ్వంభర’ మూవీ విడుదలని చిరంజీవి వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ చేంజర్’ 2025 జనవరి 10న రిలీజ్ అయింది. 2025 సంక్రాంతికి వాయిదా పడిన ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందని భావించినప్పటికీ కాలేదు. ఇందుకు కారణం వీఎఫ్ఎక్స్ పనులు. ఈ కారణంగా చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్గారు’ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదలైంది.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేశ్ ముఖ్య పాత్ర పోషించారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఇక 2025 జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి... విడుదల తేదీపై స్పష్టత రావాలి. మార్చి టు ఏప్రిల్ రామ్చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీని రామ్చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా వేశారు. ‘‘రామ్చరణ్ హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా స్పోర్ట్స్, యాక్షన్ డ్రామా ‘పెద్ది’. హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ కోసం రామ్చరణ్ ఫుల్æమాస్ లుక్లోకి మారిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. మార్చి 27న ఈ సినిమాని విడుదల చేయాలని భావించాం. అయితే వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30కి మార్చాం. మా సినిమా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘చికిరి చికిరి...’ పాట అన్ని ప్లాట్ఫామ్లలో అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ పాట 200 మిలియన్ల వ్యూస్ దాటి సినిమాపై అంచనాలను భారీగా పెంచింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఏప్రిల్లో విడుదల కావాల్సిన పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్సింగ్’ ముందుకు వచ్చి, మార్చి 26న రిలీజ్ కానుంది. మార్చి నుంచి ఆగస్టుకి... ‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘కిల్, గ్యారా గ్యారా’ వంటి హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న రాఘవ్ జుయల్ ‘ది ప్యారడైజ్’లో భాగమయ్యారు. ఓ కీలక పాత్రను సంపూర్ణేష్ బాబు చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. నానిపై ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఇంట్రో సాంగ్ చిత్రీకరిస్తున్నారు. వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో తెరకెక్కుతున్న ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మాస్ ట్యూన్ అందించారు. కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ భారీ విజువల్స్తో ఈ సాంగ్ని పూర్తి స్థాయి క్రౌడ్ ప్లీజర్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్ట్పోస్ చేసి, ఆగస్టు 21న విడుదల చేయనున్నారు. ‘‘మ్యాసివ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ హాటెస్ట్ పాన్ ఇండియన్ రిలీజెస్లో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. మా సినిమాని ముందుగా మార్చి 26న విడుదల చేయాలనుకున్నాం. అయితే తాజాగా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రిలీజ్ డేట్కి మా సినిమాకు వరుసగా మూడు వారాల పండగలు కలిసి రానున్నాయి. మొదటి వారంలో ఓనం, మిలాద్–ఉన్–నబీ పండగలు, రెండో వీకెండ్లో రాఖీ, మూడో వారంలో జన్మాష్టమి ఉండటం వల్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైస్’కి బాక్సాఫీస్ వద్ద బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది. ప్లానింగ్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాని... ఈ నిర్ణయంతో మరోసారి తన మార్కెటింగ్ సెన్స్ని చూపించారు’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఫిబ్రవరి టు ఏప్రిల్... ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో ఈ నెల 13న రిలీజ్ చేస్తామని యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. అయితే ఆ తేదీకి విడుదల వాయిదా పడి, ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందిన చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్ పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ప్రోడక్షన్ పనులు... ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయట. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న యూనిట్... కొంచెం ఆలస్యమైనా సరే బెస్ట్ ఔట్పుట్ ఇవ్వాలని నిర్ణయించుకుని ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 10కి వాయిదా వేసినట్లు టాక్. ఈ మూవీ 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల కానుంది.1000 ఏళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రాంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవాడు. అల్లరిగా తిరిగే అండర్ డాగ్ రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ‘సలార్’ మూవీ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచింది. అదే విధంగా సెంథిల్ కుమార్ విజువల్స్ ఈ మూవీకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. మే 1న లెనిన్ వస్తాడా? అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో అఖిల్ ఫుల్ మాస్ లుక్లో కనిపించనున్నారు. ‘లెనిన్’ని మే 1న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే... ఆ తేదీకి రిలీజ్ కాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం రామ్చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా అని ఫిల్మ్నగర్ టాక్.మార్చి 27న ‘పెద్ది’ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ‘లెనిన్’ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ‘లెనిన్’ని మే 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే కొత్త విడుదల తేదీపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి... ముందుగా అనుకున్నట్లు ‘లెనిన్’ మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తాడా? లేదా? లేకుంటే మరో కొత్త రిలీజ్ డేట్ని ప్రకటిస్తారా? అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ‘లెనిన్’ పై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ మూవీ తప్పకుండా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మార్చి నుంచి ఏప్రిల్కి? అడివి శేష్ హీరోగా రూపొందిన తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా 2025 డిసెంబరు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి రిలీజ్ని పోస్ట్పోన్ చేసి, ఉగాది కానుకగా ఈ ఏడాది మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇంటెన్స్ లుక్స్లో ఉన్న రిలీజ్ డేట్ పోస్టర్ను విడుదల చేశారు. అయితే ఈ మూవీ మరోసారి విడుదల వాయిదా పడనుందని ఫిల్మ్నగర్ టాక్. మార్చి నెలలో యశ్ ‘టాక్సిక్’, రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ వంటి సినిమాలు ఆడియన్స్ ముందుకి వస్తుండటంతో ‘డెకాయిట్’ విడుదల వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ కానుందనే చర్చ నడుస్తోంది. అయితే మార్చి 19న విడుదల వాయిదా గురించి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.‘‘ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘డెకాయిట్’. ఇప్పటికే విడుదలైన ఫైర్ గ్లింప్స్లోని ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్కి పాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారు. ఆయన నటించిన తొలి తెలుగు చిత్రం మాదే. అంతర్జాతీయ స్థాయిలో తీసిన ‘డెకాయిట్’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే... యూనిట్ ముందుగా ప్రకటించినట్లు మార్చి 19న ‘డెకాయిట్’ సినిమా విడుదలవుతుందా? లేదా అనేది వేచి చూడాలి. సంబరాలు ఎప్పుడు? సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు (ఎస్వైజీ). ఐశ్వర్యా లక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించినప్పటికీ పోస్ట్పోన్ అయింది.అయితే ఆ తర్వాత విడుదల తేదీపై యూనిట్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, మార్చి 14న థియేటర్లలోకి రానుందని టాక్. ‘‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం రూ. 125 కోట్లకు పైగా బడ్జెట్తో భారీ స్థాయిలో రూపొందింది. సాయిదుర్గా తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా ఈ మూవీ నిలుస్తుంది. మా సినిమాలోని సీజీ వర్క్ ఆడియన్స్కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వెట్రి పళనిసామి విజువల్స్, బి. అజనీష్ లోక్నాథ్ సంగీతం అదనపు ఆకర్షణలు’’ అని యూనిట్ తెలిపింది. నాయకుడు వచ్చేదెప్పుడు? తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. కేవీఎన్ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా పొంగల్ కానుకగా ఈ ఏడాది జనవరి 9 విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కొత్త విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు.విజయ్ ఇప్పటికే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ కారణంగా ఆయన సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారు. అందుకే విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్కి అద్భుతమైన స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం సెన్సార్ ఇబ్బందుల్లో ఉంది. మరి... అడ్డంకులు దాటుకుని ‘జన నాయకుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదెప్పుడు? అన్నది వేచి చూడాలి.– డేరంగుల జగన్ మోహన్ -
వాలంటైన్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీల లవ్లీ ఫొటోలు
గులాబీలతో రొమాంటిక్ పోజులిచ్చిన నేహా శెట్టిసెల్ఫ్ లవ్ అంటూ స్వీట్ స్టిల్స్తో కృతిశెట్టిభర్తపై ప్రేమ చూపించేసిన మెగా కోడలు లావణ్యగోవాలో భర్తతో ప్రేమక్షణాల్లో గుర్తుచేసుకున్న అమలా పాల్అందంగా కనిపిస్తూ నభా నటేశ్ ప్రేమ విషెస్గులాబీతో క్యూట్గా మాయ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Jagat Desai (@jagat_desaii) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
'ఫంకీ' సినిమా తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ తీసిన లేటెస్ట్ సినిమా 'ఫంకీ'. విశ్వక్ సేన్, కాయదు లోహర్ హీరోహీరోయిన్లుగా నటించారు. మూవీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ప్రమోషనల్ కంటెంట్తో ఆకట్టుకున్న ఈ చిత్రానికి థియేటర్లలో అనుకున్నంత స్పందన రాలేదు. తొలి షో నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. అక్కడక్కడ కామెడీ బాగున్నప్పటికీ ఓవరాల్గా మాత్రం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మరి ఇలాంటి రెస్పాన్స్తో తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి?ఫంకీ చిత్రానికి తొలిరోజు నెట్ వసూళ్లు రూ.2.25 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అలానే ఓవర్సీస్లో మొదటిరోజు పూర్తయ్యేసరికి లక్షా 85 వేల డాలర్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. మనవరకు మాత్రం ఇంకా పోస్టర్ లాంటిది రిలీజ్ చేయలేదు. వస్తున్న టాక్ బట్టి చూస్తుంటే వీకెండ్ అయ్యాక ఏమైనా పోస్టర్ వదిలితే వదలొచ్చు. లేదంటే లేకపోవచ్చు.(ఇదీ చదవండి: 'ఫంకీ' సినిమా.. మేం కావాలనే అలా తీశాం: నిర్మాత నాగవంశీ)'ఫంకీ'తో పాటు రిలీజైన మరో తెలుగు సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కి పాజిటివ్ టాక్ వస్తోంది. మరి ఈ రెండింటిలో దేనికి ప్రేక్షకులు ఓటేస్తారనేది సోమవారానికి తేలుతుంది.'ఫంకీ' విషయానికొస్తే.. కోమల్ (విశ్వక్ సేన్) కొత్త దర్శకుడు. ఓ నిర్మాణ సంస్థలో సినిమా కోసం అవకాశం దక్కించుకుంటాడు. రూ.4 కోట్లతో పూర్తి చేస్తానని రూ.40 కోట్ల బడ్జెట్ చేస్తాడు. అయినా సరే మూవీని పూర్తి చేయడు. దీంతో నిర్మాత కూతురు చిత్ర(కాయదు లోహర్) రంగంలోకి దిగుతుంది. రూ.కోటితో మిగిలిన చిత్రమంతా పూర్తిచేయాలనే షరతు పెడుతుంది. మరి అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తయిందా? ఈ క్రమంలో కోమల్-చిత్ర మధ్య ఎలాంటి బంధం ఏర్పడింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
తెలుగు హీరోయిన్గా ఇన్స్టా ఫేమస్ భామ.. గ్లింప్స్ రిలీజ్
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న యామినీ ఈఆర్.. టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'క్వీన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే ప్రస్తుత సొసైటీతో ముడిపడి ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రాళ్లమీద పేర్లతో కొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. తాజ్ మహల్ మీద గుర్తులుగా మరికొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. కానీ దేశపు మనుగడను మార్చే కొత్త శాసనంగా ఈ ప్రేమ కథ అని చెప్పుకొచ్చారు.తను ప్రేమించిన వ్యక్తి కలని నిజం చేస్తూ, అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో స్ఫూర్తి కలిగించేలా చూపించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇదే మూవీలో కాలకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్. ఈ మూవీలో కీలకమైన తండ్రి పాత్ర కోసం 90స్ హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు. -
'రాయుడు గారి తాలూకా' ట్రైలర్
'సోగ్గాడే చిన్ని నాయన' ఫేమ్ దర్శకుడు కల్యాణకృష్ణ చేతులు మీదుగా 'రాయుడు గారి తాలూకా' ట్రైలర్ విడుదలైంది. హీరో కమ్ నిర్మాతగా ఉలిశెట్టి శ్రీనివాస్ చేశారు. కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ అని అన్నారు. హీరో నిర్మాత ఉలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇది ఒక చక్కటి కుటుంబ చిత్రం, కుటుంబ విలువలు తెలిపే సినిమా, ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటుంది. మార్చి 6న థియేటర్లలో రిలీజ్ కానుందని అన్నారు. -
కాబోయే భార్యకు ముద్దుపేరు.. వాలంటైన్స్ డే వీడియో
అల్లు వారి కుటుంబంలో పెళ్లి హడావుడి మొదలైపోయింది. బన్నీ సోదరుడు శిరీష్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. నయనికతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. రెండు రోజుల క్రితమే పసుపు దంచుడు కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోని శిరీష్ పోస్ట్ చేశాడు. ఇప్పుడు వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రేమకథ గురించి, కాబోయే భార్యతో క్యూట్ మూమెంట్స్ ఉన్న వీడియోని షేర్ చేశాడు.శిరీష్.. తనకు కాబోయే భార్య నయనికకు 'క్యూటేష్' అనే ముద్దుపేరు పెట్టుకున్నాడు. వీడియోలో అదే విషయాన్ని చూపించాడు. ప్రపంచం తమని కలిపిందని చెప్పుకొచ్చాడు. పారిస్ వీధుల్లో కొన్ని రొమాంటిక్ క్షణాల్ని చూపించడంతో పాటు నిశ్చితార్థానికి సంబంధించిన విజువల్స్ని చూపించాడు. ఇకపోతే మార్చి 6న శిరీష్-నయనిక పెళ్లి జరగనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
‘సీతా పయనం’ మూవీ రివ్యూ
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటించిన తొలి సినిమా ‘సీతా పయనం’. ముందుగా ఈ చిత్రంలో హీరోగా విశ్వక్ సేన్ అనుకున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాల్లో కూడా విశ్వక్ పాల్గొన్నాడు. కానీ షూటింగ్కి కొద్ది రోజుల ముందు ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతొ విశ్వక్ ప్లేస్లో కన్నడ స్టార్ ఉపేంద్ర సోదరుడి కొడుకు నిరంజన్ని హీరోగా పెట్టి ఈ సినిమా తెరకెక్కించాడు అర్జున్. కూతురు డెబ్యూ ఫిల్మ్ అవ్వడంతో ప్రమోషన్స్ భారీగా చేశాడు.మొత్తానికి రిలీజ్కి ముందే సీతా పయనంపై హైప్ అయితే క్రియేట్ అయ్యేలా చేశారు. మంచి అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వైజాగ్కు చెందిన వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్(సత్య రాజ్)కి కూతురు సీత(ఐశ్వర్య అర్జున్) అంటే ప్రాణం. తల్లి లేకపోవడంతో అల్లారు ముద్దుగా పెంచుతాడు. కూతురికి పెళ్లి చేస్తే తన బాధ్యత తీరుతుందని భావిస్తాడు. కానీ సీతకు మాత్రం పెళ్లి అంటే నచ్చదు. పెళ్లి టాపిక్ తీసిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఓ రోజు వర్క్ షాప్ కోసం వైజాగ్ నుంచి తన కారులో హైదరాబాద్కి బయలు దేరుతుంది. మార్గ మధ్యలో అభి(నిరంజన్) పరిచయం అవుతాడు. తనతో కలిసి చేసే ప్రయాణంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవేంటి? ఆ సంఘటనల వల్ల సీతలో వచ్చిన మార్పు ఏంటి? సీత ప్రయాణంలో గిరి(అర్జున్), బసవన్న(ధృవ్ సర్జా) ఎలా భాగమయ్యారు? పెళ్లే వద్దనుకున్న సీత..చివరకు అభితో ప్రేమలో ఎలా పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సీతా పయనం కొత్త కథేమీ కాదు. మనం ఇంత వరకు ఎన్నో సార్లు, ఎన్నో సినిమాల్లో చూసిన విషయాలతోనే అర్జున్ ఈ మూవీని తెరకెక్కించాడు. ప్రస్తుత తరం మరిచిపోతోన్న విలువల్నిఈ కథ ద్వారా మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. మన హైందర ధర్మంలో పెళ్లికి ఉన్న గొప్పదనం చర్చిస్తూనే.. . తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉండాలి.. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎంత సంస్కారంతో పెద్ద చేయాలి.. పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ఎలా మెలగాలి అనే విషయాలను గొప్పగా చూపించారు. వీటితో పాటు గో రక్షణ గురించి ఓ ఎపిసోడ్ని యాడ్ చేశారు. ఈ సినిమాలో ఉన్న మరో గొప్పదనం ఏంటంటే.. ఇందులో అందరూ మంచి వాళ్లే. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒకటి, రెండు పాత్రలు కూడా ఒక్క సీన్తో మంచి వాళ్లు అయిపోతాయి. ఇదంతా చెప్పుకోవాడానికి బాగానే ఉన్నా.. తెరపై చూస్తుంటే మాత్రం అంత రక్తి కట్టించదు. ఎలాంటి మలుపులు, ట్విస్టులు లేకుండా ‘సీతా పయనం’ చాలా సాఫీగా సా..గుతుంది. ఇచ్చిన సందేశం మంచిదే కానీ.. కూర్చొబెట్టి హితబోధ చేసినట్లుగా అనిపిస్తుంది.తండ్రి కూతురు బాండింగ్ని చూపిస్తూ కథ ప్రారంభించాడు దర్శకుడు. కూతురుకి పెళ్లి చేయాలని తండ్రి.. పెళ్లి టాపిక్ వస్తేనే ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేసే కూతురు..మొదటి పది నిమిషాల కథంతా ఇలానే రొటీన్గా ఉంటుంది. ఇక సీత వర్క్ షాప్ కోసం హైదరాబాద్కి బయలుదేరినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. మార్గ మధ్యలో అభి పరిచయం అవ్వడం.. గిరి పాత్ర ఎంట్రీ.. ఆ తర్వాత కొన్ని సంఘటనలు ఇవన్నీ మొదట రొటీన్గానే అనిపించినా.. ఇంటర్వెల్ తర్వాత ఆయా సన్నివేశాల వెనుక ఉన్న అసలు విషయం తెలుస్తుంది. ఫస్టాఫ్ మొత్తం వైజాగ్ నుంచి హైదరాబాద్కి సీత ప్రయాణం ఉంటే.. సెకండాఫ్ రిటర్న్ జర్నీ ఉంటుంది. ధృవ్ సర్జా ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ భావోద్వేగానికి గురి చేస్తుంది. కొత్తదనం ఆశించకుండా, ఫ్యామిలీతో కలిసి ఓపికతో ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకునేవారిని ‘సీతా పయనం’ ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే..సీత పాత్రలో ఐశ్వర్య ఒదిగిపోయింది. ఆమె ఆహార్యం, హావభావాలు, మాట తీరు అన్నీ కూడా ఆడియెన్స్ని ప్రేమలో పడేస్తాయి. ఆమెని చూస్తే ఇంట్లోని అమ్మాయిలా అనిపిస్తుంది. అయితే డబ్బింగ్ విషయం ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేదేమో. ఇక అభి పాత్రకు నిరంజన్ న్యాయం చేశాడు. ఆయన పాత్ర ఇచ్చే ఓ చిన్న ట్విస్ట్ సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్లని కూడా బాగానే చేశాడు. ఇక హీరోయిన్ తండ్రిగా సత్యరాజ్ రెగ్యులర్ పాత్రను చేశాడు. హీరో తాతా, ఊరి పెద్దగా ప్రకాశ్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇలాంటి పాత్ర ఆయన కొత్తేమి కాదు. బిత్తిరి సత్తి రెండు, మూడు చోట్ల కనిపించి, నవ్విస్తాడు. అర్జున్ సర్జా ఎంట్రీ ఆకట్టుకుంటుంది. ధృవ్ సర్జా బ్లాక్, అక్కడ చెప్పిన సందేశం చాలా మందికి కనెక్ట్ అవుతుంది. మిగిలిన పాత్రధారులందరూ కూడా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అనూప్ నుంచి మంచి పాటల్ని, బీజీఎంని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్, సెట్ వర్క్ బాగానే కుదిరింది. కూతురు కోసం నిర్మాతగా మారిన అర్జున్.. ఈ సినిమాకు బాగానే ఖర్చు చేశాడు. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. - రేటింగ్ : 2.75/5 -
శ్రీకాంత్ కొడుకు రొమాంటిక్ కామెడీ సినిమా.. వీడియో రిలీజ్
'హిట్' ఫ్రాంచైజీ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు శైలేష్ కొలను.. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అన్నీ థ్రిల్లర్సే తీశాడు. ఇప్పుడు రూటు మార్చి తొలిసారి ఓ ప్రేమకథని తెరకెక్కిస్తున్నాడు. అదే 'ఏమో ఏమో ఇది'. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో కాగా ప్రీతి ముకుందన్ హీరోయిన్. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ బ్రీజ్ పేరిట సినిమా కాన్సెప్ట్ ఏంటనే విషయాన్ని రివీల్ చేశారు.సింగల్ మదర్ పెంపకంలో పెరిగే అభయ్(రోషన్).. ఓ కెఫే యజమాని అయిన అపూర్వ(ప్రీతి ముకుందన్)తో ఎలా ప్రేమలో పడ్డాడు? ఈ జర్నీలో ఏమేం జరిగింది? అనేది సినిమా స్టోరీలా అనిపిస్తుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దసరాకే థియేటర్లలోకి మూవీ వస్తుందని ప్రకటించారు. గతంలో 'పెళ్లి సందD', 'ఛాంపియన్' చిత్రాలు చేసిన రోషన్.. వాటితో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈసారి ఏం చేస్తాడో చూడాలి? -
చిన్నప్పటి నుంచి తను నా పెళ్లాం అనుకున్నారా!
'కోర్ట్' సినిమాతో గతేడాది హిట్ కొట్టిన జంట శ్రీదేవి-రోషన్. వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న మరో మూవీ 'బ్యాండు మేళం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. వచ్చే నెల 13వ తేదీన థియేటర్లలోకి రానుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఎమోషనల్ గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేశారు. బ్రేకప్ అయినప్పుడు హీరో బాధపడుతున్నట్లు ఇందులో చూపించారు.'కోర్ట్' మూవీ ఆంధ్ర బ్యాక్డ్రాప్లో ఇది తెలంగాణ నేపథ్యంగా ఉండనుంది. సతీష్ జవ్వాజి దర్శకుడు కాగా విజయ్ బుల్గానిన్ సంగీతమందించాడు. మరి రోషన్-శ్రీదేవి ఈసారి ఏం చేస్తారో చూడాలి? గ్లింప్స్లో ఎమోషన్ చూపించినప్పటికీ.. హీరో, తన ఫ్రెండ్కి తాళి కట్టడం ఫన్నీగా అనిపించింది. -
కొడుకు, కోడల్ని అభినందించిన చిరంజీవి
కవల పిల్లల రాకతో మెగా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. రామ్చరణ్- ఉపాసన దంపతులకు మూడేళ్ల క్రితం కూతురు క్లీంకార పుట్టగా ఈ ఏడాది జనవరి 31న కవలలు (బాబు, పాప) జన్మించారు. వీరికి ఫిబ్రవరి 11న బారసాల చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు మెగా, కామినేని కుటుంబసభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. అర్థవంతమైన పేర్లుకుమారుడికి శివరామ్ కొణిదెల అని, కుమార్తెకు అన్వీరా దేవి కొణిదెల అని నామకరణం చేశారు. ఈ రోజుల్లో పిల్లలకు నోరు తిరగని పేర్లు పెడుతున్నారు. ఎంత వెరైటీగా ఉంటే అంత బాగుంటుందని ఆలోచిస్తున్నారు. కానీ రామ్చరణ్ దంపతులు మాత్రం ఆధ్యాత్మిక భావనకు పెద్ద పీట వేస్తూ మంచి అర్థవంతమైన పేర్లు పెట్టారు. ఈ విషయంపై తమను చాలామంది అభినందిస్తున్నారంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.కొడుకు- కోడల్ని అభినందించిన చిరంజీవిస్నేహితులు, బంధువులు, అభిమానులు... ఇలా అందరూ కవలల పేర్లు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ఈ విషయంలో చరణ్, ఉపాసనను అభినందించాల్సిందే! ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా, దేవుడి ఆశీర్వాదం లభించేలా ఎంతో పవిత్రమైన పేర్లను ఎంచుకున్నారు. అందుకు నాకెంతో గర్వంగా ఉంది. మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది.ముందు తరాలకు మార్గనిర్దేశంభక్తి, సంస్కృతి మేళవించిన ఈ పేర్లు ముందు తరాలకు మార్గనిర్దేశం చేసేలా ఉన్నాయి. అలాగే చరణ్.. అతడి నానమ్మ అంజనాదేవి పేరు వచ్చేలా కూతురికి అన్వీరా 'దేవి' పేరు పెట్టడం నా మనసును కదిలించింది. చరణ్, ఉపాసనతో పాటు మీ పిల్లలకు కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్కు ఉసాపన.. లవ్యూ మామయ్య అని కామెంట్ పెట్టింది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) చదవండి: రాజాసాబ్లో డూప్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
రాజాసాబ్లో డూప్? క్లారిటీ ఇచ్చిన మాళవిక
ప్రభాస్- మారుతి కాంబినేషన్లో 'ది రాజాసాబ్' సినిమా ప్రకటించినప్పటి నుంచి విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. తీరా సినిమా రిలీజయ్యాక కూడా ట్రోలింగ్స్ మరింత పెరిగాయే తప్ప ఆగలేవు. ముఖ్యంగా ప్రభాస్కు చాలాచోట్ల డూప్ ఉపయోగించడంపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఓ ఫైట్ సీన్ కోసం హీరోయిన్ మాళవిక మోహనన్కు కూడా డూప్ ఉపయోగించడంతో తనను కూడా ట్రోల్ చేశారు.ట్రోలింగ్పై స్పందించిన హీరోయిన్తాజాగా ఈ వివాదంపై మాళవిక మోహనన్ స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. ది రాజాసాబ్ సినిమాలో నేనే స్వతాహాగా స్టంట్స్ చేశానని చెప్పుకున్నాను. అయితే నా బాడీ డబుల్ (డూప్) యాక్షన్ సీన్లో ఉన్నట్లుగా ఓ ఫోటో వైరలవుతోంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి స్టంట్ ఆర్టిస్ట్.. అలాగే నా డూప్ కూడా!చిన్నతనం నుంచే..ముందుగా నేను చెప్పొచ్చేదేంటంటే.. నాకు యాక్షన్ అంటే ఇష్టం. ఫైట్ సన్నివేశాల్లో పాల్గొనడాన్ని ఆస్వాదిస్తాను. చిన్నతనం నుంచే నేను స్పోర్టివ్ అమ్మాయిని. కొత్త విషయాలు నేర్చుకోవడం, శరీరాన్ని ఛాలెంజ్ చేయడం అంటే చాలా ఇష్టం. రెండో విషయం.. సెట్లో ఎప్పుడూ స్టంట్ డబుల్స్ సిద్ధంగా ఉంటారు. నటీనటులు సొంతంగా యాక్షన్ సీన్స్ చేసినా సరే వారు అందుబాటులోనే ఉంటారు.రిస్కీ షాట్స్ మాత్రం..వారు అనుభవజ్ఞులు కాబట్టి.. యాక్షన్ డైరెక్టర్ వారిని ఫైట్ రిహార్సల్స్ చేయమని చెప్తాడు. ఫైనల్ షాట్ మాత్రం మాపై చిత్రీకరిస్తారు. అయితే కొన్ని సన్నివేశాలు చాలా ప్రమాదకరం అని భావించినప్పుడు నటులకు బదులుగా స్టంట్ డబుల్ను సీన్ పూర్తిచేయమని అడుగుతారు. ఎందుకంటే ప్రొఫెషనల్స్ అయితే ఏ సమస్యా లేకుండా వాటిని ఈజీగా చేయగలరు.వివరణ అక్కర్లేదుఫైనల్గా.. నేను ఫైట్ సీన్స్ సమర్థవంతంగా చేసేందుకు నా స్టంట్ డబుల్ ఎంతగానో తోడ్పడింది అంటూ వీడియోలు షేర్ చేసింది. ఒక్క ట్వీట్ ద్వారా యాక్షన్ సీన్స్ తానే చేసినట్లు క్లారిటీ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు టాలెంటెడ్ అని మాకు తెలుసు.. నువ్వు ఎలాంటి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది. Been seeing a lot of tweets and articles about how I claimed to do my own stunts for ‘The Rajasaab’ but a body double did it as there’s a photo circulating online of a stunt artist who was my stunt double on the film.Firstly, I do action because I really enjoy doing action.… pic.twitter.com/9ePwlLpti4— Malavika Mohanan (@MalavikaM_) February 13, 2026 చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
యాంకర్, బిగ్బాస్ ఫేమ్ శివజ్యోతి గుడ్న్యూస్ చెప్పింది. తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 12న బేబీ జన్మించగా రెండు రోజులు ఆలస్యంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ పోస్ట్కు ఓ అందమైన ఫోటో జత చేసింది. అందులో శివజ్యోతి కుర్చీలో కూర్చుని నవ్వులు చిందిస్తుండగా ఆమె భర్త గంగూలీ బిడ్డను ఎత్తుకున్నాడు. ఈరోజు (ఫిబ్రవరి 14న) శివజ్యోతి బర్త్డే సందర్భంగా బేబీ రాకను వెల్లడించారు.ఇద్దరి గుండెచప్పుడు ముగ్గురిగా..తనకు ఇంత అందమైన బహుమతిచ్చిన శివజ్యోతికి గంగూలీకి కృతజ్ఞతలు తెలిపాడు. 'హ్యాపీ బర్త్డే, చిన్ని. నీ 33వ పుట్టినరోజుకు ఎంతో అందమైన బహుమతిని తీసుకొచ్చావ్. మన ఇద్దరి గుండెచప్పుడు ఇప్పుడు ముగ్గురిగా మారింది. మాకు పుట్టింది పాప? బాబు? అన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు శివజ్యోతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Ganguly Mantri (@ganguly_manthri) చదవండి: కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ -
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : కపుల్ ఫ్రెండ్లీనటీనటులు: సంతోష్ శోభన్, మానస వారణాసి, యోగిబాబు, రాజీవ్ కనకాల, గోపరాజు రమణ తదితరులునిర్మాణ సంస్థ:యూవీ కాన్సెప్ట్స్సమర్పణ: యూవీ క్రియేషన్స్రచన, దర్శకత్వం: అశ్విన్ చంద్రశేఖర్సంగీతం: ఆదిత్య రవీంద్రన్సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్విడుదల తేది: ఫిబ్రవరి 14, 2026సంతోష్ శోభన్.. ప్రతిభ గల నటుడు. కానీ ఆయన ఖాతాలో భారీ హిట్ అనేదే లేదు. ‘ఏక్ మినీ కథ’ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘కపుల్ ప్రెండ్లీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో అయినా సంతోష్ హిట్ ట్రాక్ ఎక్కాడా? ఫీల్ గుడ్ కంటెంట్తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాంకథేంటంటే..నెల్లూరుకు చెందిన శివ..ఓ బడ్డింగ్ ఆర్కిటెక్ట్. ఉద్యోగం కోసం చెన్నై వస్తాడు. ఏళ్లు గడిచినా ఆయనకు సరైన ప్రాజెక్టు దొరకదు. దీంతో డైలీ ఖర్చుల కోసం బైక్ పూలింగ్ చేస్తుంటాడు. అలా మిత్ర(మానన వారణాసి) అనే అమ్మాయి బైక్ రైడ్లో పరిచయం అవుతుంది. చిత్తూరుకు చెందిన మిత్ర.. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం చెన్నై వస్తుంది. శివలాగే ఆమె కూడా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది. ఓ కారణంగా ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురురించి.. లివింగ్ రిలేషన్ని కొనసాగిస్తారు. కొన్నాళ్లకు ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో వీరిద్దరి జీవితంలో ఊహించని పరిణామం ఎదురవుతుంది. అదేంటి? శివ, మిత్ర ఒకే ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. మిత్ర రాకతో శివ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరకు వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. జీవిత ప్రయాణం ఎప్పుడు ఎలా ఆగిపోతుందో ఎవరికీ తెలియదు. రేపటి గురించి ఆలోచించకుండా..ఈ క్షణం మనల్ని ప్రేమించిన వాళ్లతో సంతోషంగా గడుపుతూ.. కొన్ని మధుర జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి.. కపుల్ ఫ్రెండ్లీ సినిమా ద్వారా ఇచ్చిన మంచి సందేశం ఇది. సంభాషలతో కాకుండా కథ రూపంలో ఈ సందేశాన్ని ఇచ్చారు దర్శఖుడు. సినిమా కథ చాలా సరదాగా ప్రారంభమై.. ఎమోషనల్గా ముగుస్తుంది. కథనం నెమ్మదిగా సాగినా... ఎక్కడ బోర్ కొట్టదు. అనుకోకుండా పరిచమై.. ప్రేమలో పడి..పెళ్లికి ముందు హద్దులు దాటి.. చివరకు పెళ్లి చేసుకోవాలనుకునే సమయంలో ఓ షాకింగ్ విషయం తెలియడం.. ఆ ఆర్వాత వీరిద్దర ప్రయాణం ఎలా కొనసాగింది? అనేది తెరపై చాలా మెచ్యూర్డ్గా చూపించాడు దర్శకుడు.హీరో బ్రేకప్ సీన్తో సినిమా కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ చెన్నైకి వెళ్తుంది. అక్కడ ఉద్యోగం కోసం శివ పడే ఇబ్బందులను చూపిస్తూనే మరోవైపు మిత్ర పాత్రను పరిచయం చేశారు. ఇద్దరూ కలిసినప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. మిత్ర సహాయంతో శివ చేతికి ప్రాజెక్టులు రావడం..తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం.. ఈ ప్రయాణంలో మిత్రతో ప్రేమలో పడడం.. ఇదంతా రొమాంటిక్గా సాగుతుంది. ప్రథమార్థం కాస్త నెమ్మదిగా సాగినా.. బోర్ మాత్రం కొట్టదు. ఇక సెకండాఫ్ మొత్తం చాలా ఎమోషనల్గా సాగుతుంది. సినిమాలోని ట్విస్ట్ తెలిసిన తర్వాత మనకు గీతాంజలి, ఓయ్, సాగరసంగమం లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. సినిమా ప్రారంభంలో చూపించే కేరళ సీన్ల వెనుక ఉన్న అసలు స్టోరీ ద్వితియార్థంలోనే తెలుస్తుంది. క్లైమాక్స్ ఊహకందేలా సాగుతుంది.ఎవరిలా చేశారంటే.. శివ పాత్రలో సంతోష్ శోభన్ జీవించేశాడు. ఎక్కడ అతి చేసినట్లుగా అనిపించదు. ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. మిత్రగా మానస తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై చాలా అందంగా కనిపించింది. సంతోష్, మానసల ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. కథ మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. మిగతా పాత్రలన్ని ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి అంతే. యోగి బాబు ఉన్నా..కామెడీ పండించే స్కోప్ లేదు. హీరో తండ్రిగా గోపరాజు రమణ, హీరోయిన్ ఫాదర్గా రాజీవ్ కనకాల తెరపై కనిపించేదేది కాసేపే అయినా.. తమదైన నటనతో ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఆదిత్య రవీంద్రన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
ప్రేక్షకులు నిరాశ చెందరు
విశ్వక్ సేన్ , కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఫంకీ’. కేవీ అనుదీప్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ సక్సెస్మీట్లో విశ్వక్సేన్ మాట్లాడుతూ–‘‘సినిమా రిలీజ్కు ముందు ఒత్తిడితో ఉండటం సహజం. కానీ ‘ఫంకీ’ సినిమా రిలీజ్కు ముందు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఈ రోజు ఉదయం ప్రేక్షకులతో కలిసి ఈ మూవీ చూశాను.. వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ‘ఫంకీ’ నాకెంతో ఊరటనిచ్చింది’’ అన్నారు. ‘‘కుటుంబంతో కలిసి ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనే ‘ఫంకీ’ చేశాం. ప్రేక్షకుల స్పందన సంతోషాన్నిఇస్తోంది’’ అని తెలిపారు కేవీ అనుదీప్. ‘‘ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. ఈ విషయంలో మేం విజయం సాధించాం. మా డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ. నవ్వుకోవడానికి థియేటర్స్కు వచ్చిన వారు నిరాశ చెందరు’’ అన్నారు నాగవంశీ. ‘‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు కయాదు లోహర్. -
ట్రైలర్ చూడగానే హిట్ అనిపించింది
సంతోష్ శోభన్ , మానస వారణాసి జోడీగా నటించిన సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నేడు రిలీజ్ అవుతోంది. నిర్మాత– డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు అతిథిగా హాజరైన హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ–‘‘సంతోష్ మంచి పెర్ఫార్మర్. సహజంగా యాక్ట్ చేస్తాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూడగానే, మూవీ హిట్ అనిపించింది’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘సింపుల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్తో ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. ‘‘ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరచదు’’ అన్నారు అశ్విన్ చంద్రశేఖర్. ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం ఇది’’ అని చెప్పారు ధీరజ్ మొగిలినేని. దర్శకులు మేర్లపాక గాంధీ, అభిలాష్ రెడ్డి, నందినీ రెడ్డి, నిర్మాత స్వప్నదత్ అతిథిలుగా పాల్గొని ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
స్వయంభూ హీరోయిన్ లేటేస్ట్ స్టిల్స్.. రెడ్ డ్రెస్లో మెగా డాటర్ నిహారిక..!
స్వయంభు స్టిల్స్ షేర్ చేసిన సంయుక్త మీనన్..వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ అనిఖా సురేంద్రన్..మెగా డాటర్ నిహారిక కొణిదెల లేటేస్ట్ పిక్స్..మెడికల్ గ్రాడ్యుయేషన్ పిక్స్ షేర్ చేసిన శ్రీలీల.. View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) -
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
శ్రీవిష్ణు హీరోగా వస్తోన్న తాజా చిత్రం విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజైంది. మొదలే మొదలే అంటూ సెకండ్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ క్రేజీ సాంగ్ లవర్స్ను అలరిస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ అందించగా..నరేశ్ అయ్యర్, మధుశ్రీ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. -
మనశంకర వరప్రసాద్గారు సీరియల్ బ్యూటీ.. ఫుల్ ట్రెండింగ్లో నటి..!
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది.అయితే ఈ చిత్రంలో కనిపించిన అన్ని పాత్రలకు ఆడియన్స్ అందరు కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ఆరంభం నుంచి చివరి వరకు ఓ సీరియల్ నడుస్తుంది. ఆ సీరియల్ హీరోయిన్గా సౌమ్య పాత్రలో మెప్పించింది. మన శంకర వర ప్రసాద్ కారెక్టర్లో చిరంజీవి ఆ సీరియల్ గురించి.. ఆ సీరియల్లోని పాత్రల గురించి చెబుతూ ఉండటం.. అతని జీవితాన్ని రిప్లెక్ట్ చేస్తున్నట్టుగా ఆ సీరియల్ సాగడం.. ఇలా ఆ ట్రాక్ ఎంత ఫన్నీగా వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సీరియల్లో కనిపించిన నటికి కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఆ నటి కోసం తెగ వెతికేస్తున్నారట.ఈ మూవీలోని సీరియల్లో సౌమ్య పాత్రలో నటించిన ఆమె పేరు సాయి ప్రియా రెడ్డి. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి వచ్చింది. క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబెల్, మిర్చి, తడాఖా, జీనియస్, లక్కీ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేస్తోంది. ఆ తరువాత యూట్యూబ్లో సిరీస్లు కూడా చేసి మంచి పేరుని సంపాదించుకుంది.రీసెంట్గా వచ్చిన విశ్వక్ సేన్ లైలా చిత్రంలోనూ నటించింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో మెరిసింది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో మంచి పాత్ర దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక ముందు ఈ బ్యూటీకి టాలీవుడ్లో అవకాశాలు పెరిగేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు ప్రాజెక్టులో భాగస్వామి అయినట్టుగా సమాచారం. -
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
టైటిల్: అమరావతికి ఆహ్వానంనటీనటులు: శివ కంఠంనేని, ఎస్తేర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, అశోక్ కుమార్, హరీష్, భద్రమ్, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్ తదితరులుదర్శకత్వం: జీవీకేనిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్నిర్మాతలు: కెఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావుసినిమాటోగ్రఫీ: జె ప్రభాకర్ రెడ్డిసంగీతం: పద్మనాబ్ భరద్వాజ్ఎడిటింగ్: సాయిబాబు తలారివిడుదల తేదీ: 13 ఫిబ్రవరి, 2026టాలీవుడ్లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మంచి కంటెంట్ ఉన్న హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. అందుకే మలయాళ థ్రిల్లర్ తెగ చూసేస్తున్నారు. అందుకే డైరెక్ట్గా తెలుగులోనే వచ్చిన హారర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం. ఈ చిత్రం ఫిబ్రవరి 13వ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ టాలీవుడ్ ఆడియన్స్ను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.అమరావతికి ఆహ్వానం కథేంటంటే..ఈశ్వర్ (శివ కంఠమనేని) ఒక సస్పెండెడ్ సీఐ. అతని భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). భానుమతి సిస్టర్స్ భార్గవి (సుప్రిత), విజ్జు. అయితే భార్గవికి పెద్ద సెలబ్రిటీ కావాలనే కోరిక ఉంటుంది. అందుకే ఓ యూట్యూబ్ ఛానెల్ను రన్ చేస్తుంటుంది. ఈ యూట్యూబ్ ఛానెల్లో దెయ్యంతో డే అండ్ నైట్ అనే కాన్సెప్ట్తో వీడియోలు షూట్ చేసి.. కంటెంట్ అప్లోడ్ చేస్తుంటుంది. అలా పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ అనే భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయిపోతుంది.అయితే సడన్గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని అదే విషయాన్ని లైవ్లో నిరూపిస్తానని.. ఈ వీడియో షూట్ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని భార్గవికి చెప్తాడు. దీంతో మరింత ఉత్సాహంతో భార్గవి కుటుంబంతో సహా అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడికెళ్లి ఈశ్వర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎదురైన వింత సంఘటనలు ఏమిటి? అమరావతిలోని జమీందారు వంశ వారసురాలు రాజేశ్వరి(ఎస్తేర్)ను చంపింది ఎవరు? రాజేశ్వరి కుటుంబానికి, ఈశ్వర్ కుటుంబానికి మధ్య ఉన్న లింక్ ఏంటి? సీఐగా ఈశ్వర్ సస్సెండ్ కావడానికి కారణం ఎవరు? అన్న విషయాలు తెలియాలంటే థియేటర్స్కు వెళ్లాల్సిందే.ఎలా ఉందంటే..దెయ్యాలు అనే కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ దెయ్యం నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా మెజారిటీ హారర్ సినిమాల్లో దెయ్యాలు, క్షుద్రపూజలనే ప్రధాన కథాంశంగా చూపిస్తారు. ఈ అమరావతికి ఆహ్వానంలోనూ అదే పంథా ఫాలో అయ్యాడు డైరెక్టర్. కాకపోతే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ చూపించాడు. అంతేకాకుండా మంచి సందేశాన్ని ఇచ్చిన తీరు ఆడియన్స్ను కనెక్ట్ చేసేలా ఉంది ఈ హారర్ థ్రిల్లర్ సినిమా.అమరావతి అనే గ్రామంలో రాత్రివేళ జరిగే ఓ హారర్ సీన్తో కథ ప్రారంభించాడు. ఆ తర్వాత వెంటవెంటనే కథను హైదరాబాద్కు షిఫ్ట్ చేశాడు. ఫస్ హాఫ్లో భార్గవి వీడియోలు షూట్ చేయడం, మహేశ్ (శివ హరీశ్)తో ప్రేమలో పడడం లాంటివి చకచకా జరిగిపోతాయి. ప్రథమార్థంలో అంతగా ఆడియన్స్ను భయపెట్టే సీన్స్ పెద్దగా కనిపించవు. ఈశ్వర్ ఫ్యామిలీ అమరావతికి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ రాజేశ్వరి గురించి అసలు నిజం తెలుసుకోవడంతో ఫస్ట్ హాఫ్కు ఎండ్ కార్డ్ పడుతుంది. ఇక్కడే డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచేసింది.సెకండాఫ్లో కథ అంతా రాజేశ్వరి క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఆమె ప్లాష్బ్యాక్ ఎపిసోడ్తో కథనం ఆడియన్స్కు ఆసక్తికరంగా అనిపిస్తుంది. సెకండాఫ్లో హారర్ సీన్స్ ప్రేక్షకులను భయపెట్టేస్తాయి. ఇక ప్రీ క్లైమా క్స్ వచ్చే ట్విస్ట్ థ్రిల్ చేస్తుంది. హారర్ ఎలిమెంట్స్ మెప్పించినప్పటికీ.. కొన్నిచోట్ల ప్రేక్షకులు ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్. హారర్ థ్రిల్లర్లో సాంగ్స్ ఉంటే కథ సెట్ అవ్వదు. సెకండాఫ్లో ముగ్గురు హీరోయిన్స్తో సాంగ్ చేయడం అంతగా సెట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఓ హారర్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు డైరెక్టర్ జీవీకే. తన కథకు తగినట్లుగానే క్లైమాక్స్ డిజైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. హారర్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్, థ్రిల్ అందించడంలో జీవీకే మార్క్ కనిపించింది. హారర్ కంటెంట్ మూవీస్ ఇష్టపడేవాళ్లు అమరావతికి ఆహ్వానం ట్రై చేయొచ్చు. క్లైమాక్స్లో అమరావతికి ఆహ్వానంకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు.ఎవరెలా చేశారంటే..ఈశ్వర్, జగదీష్ పాత్రలలో శివ కంఠంనేనిగారి నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లోనూ తనదైన మార్క్ చూపించారు. ఈ సినిమాకు మరో మెయిన్ పిల్లర్ ఏస్తేర్. ఆమె రాజేశ్వరి పాత్రలో అదరగొట్టేశారు. భానుమతి పాత్రలో ధన్యబాలకృష్ణ మెప్పించింది. హారర్ సీన్స్లో ధన్య అదరగొట్టేసింది. భార్గవి పాత్రను సుప్రిత చాలా బాగా చేసింది. మహేశ్, జెమినీ సురేష్, భద్రమ్, అశోక్ కుమార్, నాగేంద్రలు వారి వారి పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. పద్మనాభ్ భరద్వాజ్ బీజీఎం హారర్ కథకు బాగా సెట్ అయింది. సాయి బాబా తలారి తన ఎడిటింగ్కు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
ఓటీటీలో మనశంకర వరప్రసాద్గారు.. 24 గంటల్లోనే రికార్డ్
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5 వేదికగా బుల్లితెర ప్రియులను అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ క్రేజీ రికార్డ్ను సొంతం చేసుకుంది. ఓటీటీకి వచ్చిన 24 గంటల్లోనే 200 మిలియన్ మినిట్స్ వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ జీ5 సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. థియేటర్లలోనే కాదు..ఓటీటీలోనూ మనశంకర వరప్రసాద్గారు దూసుకెళ్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
వారణాసి జానర్పై కన్ఫ్యూజన్.. రాజమౌళి ఫుల్ క్లారిటీ..!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైథలాజికల్ టచ్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దాదాపు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్ కానుందని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.అయితే రాజమౌళి సినిమాలపై అభిమానులకు భారీ అంచనాలు ఉండడం సహజం. ముఖ్యంగా కథపై ఆడియన్స్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అసలు ఏ జానర్లో మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. అందుకే ఈ మూవీ జానర్ను ఎవరికీ తోచినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారు. వారణాసి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువగా నడుస్తోంది.కొందరు ఈ సినిమాను ఫిక్షన్ అని అంటున్నారు. మరికొందరేమో విలన్ పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్లుక్ చూసి సైన్స్ ఫిక్షన్ అయి ఉంటుందని అంచనాకు వస్తున్నారు. దీంతో వారణాసి మూవీ జానర్పై ఆడియన్స్లో విపరీతమైన కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళినే క్లారిటీ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే వారణాసి మూవీ జానర్పై దర్శకుడు రాజమౌళిని స్వయంగా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉంటుందన్నారు. కానీ ఆ జానర్లో తీయడం లేదని.. వారణాసి ఫాంటసీ మైథలాజికల్ ఫిల్మ్ అని దర్శకధీరుడు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆడియన్స్ అనుమానాలకు చెక్ పడినట్లైంది. కాగా.. వారణాసిలో మహేశ్బాబు రుద్ర అనే పాత్రలో నటిస్తున్నారు. విలన్ రోల్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ మెప్పించనున్నారు. ఈ మూవీలో మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'ఫంకీ' సినిమా.. మేం కావాలనే అలా తీశాం
'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ తీసిన కొత్త సినిమా 'ఫంకీ' థియేటర్లలోకి వచ్చేసింది. విశ్వక్ సేన్, కాయదు లోహర్ హీరోహీరోయిన్లు కాగా నాగవంశీ నిర్మించాడు. విడుదలకు ముందు కాస్త బజ్ ఉంది. అలానే రిలీజైంది. కానీ తొలి షో నుంచే మిక్స్డ్, నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. కామెడీ అంతగా పండలేదని, స్టోరీ కూడా ఏం లేదని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ దీని గురించి ఏమంత పాజిటివ్గా మాట్లాడట్లేదు. ఈ క్రమంలోనే బ్లాక్బస్టర్ ప్రెస్మీట్ పెట్టగా.. నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ విచిత్రంగా అనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: చిరంజీవి 'విశ్వంభర' ఏమైపోయినట్టు?)'రివ్యూయర్లకి నచ్చదు అని నాకు ముందే తెలుసు. కానీ సాధారణ ప్రేక్షకులు కూడా ఎడిటింగ్ సరిగ్గా లేదని అంటున్నారు. మేము కావాలనే అలా తీసాం. ఎడిటింగ్ సమస్య కాదది. నేను సాగర సంగమం తీసా అని చెప్పానా? ముందే చెప్పాగా సినిమా సీన్ నుంచి సీన్ ఫ్లో లేకుండా ఉంటుందని. మీరేదో సైంటిస్ట్లా కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడతారు ఏంటి? నేను అన్నీ ముందే చెప్పా. సినిమాకు కావాల్సిన గ్లామర్ అయితే లేదు. అది తెలిసే సినిమా తీశాం'.. ఇలా సాగాయి నాగవంశీ మాటలు.పైన స్పీచ్లో ఎక్కడా కూడా ఆడియెన్స్కి నచ్చేలా సినిమా తీశాం అనే మాట వినబడలేదు. నవ్వించాలనే ఉద్దేశంతో మాత్రమే తీశానని నాగవంశీ అంటున్నారు. కానీ కొన్నిచోట్ల తప్పితే ప్రేక్షకులు.. మూవీలో సీన్లకు అనుకున్నంతగా నవ్వట్లేదనే విషయాన్ని మాత్రం ఇంకా ఒప్పుకోలేకపోతున్నారా అనిపిస్తుంది. గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే యావరేజ్ వచ్చిన మూవీస్ పరిస్థితే థియేటర్ల దగ్గర అంతంత మాత్రంగా ఉంది. అలాంటిది కాస్త నెగిటివ్ టాక్ కూడా వినబడుతున్న 'ఫంకీ'.. వీకెండ్ అయ్యేసరికి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
వరుస ఫ్లాఫ్స్.. మాస్ మహారాజా రిస్క్ తీసుకుంటున్నారా?
టాలీవుడ్లో మాస్ మహారాజాగా పేరున్న రవితేజ కొన్నేళ్లుగా హిట్ కొట్టలేకపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మాస్ హీరో సక్సెస్ అందుకోలేకపోయారు. మాస్ ఇమేజ్ను పక్కనపెట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ వచ్చిన రవితేజకు కొత్త ఏడాది కూడా కలిసిరాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా.. సూపర్ హిట్ కాకపోవడం మాస్ మహారాజా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.రవితేజ కీలక నిర్ణయం..సినిమా బడ్జెట్ విషయంలో రిస్క్ తగ్గించడం కోసం రవితేజ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. పారితోషికం తగ్గించుకుని మూవీకి వచ్చే లాభాల్లో షేర్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇప్పుడిదే టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం రవితేజ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల వరకు ఉంటోంది. దీంతో మూవీ బడ్జెట్ రూ.40 నుంచి 50 కోట్లను దాటిపోతోంది. అదే నిర్మాతలకు భారంగా మారింది. అందువల్లే రవితేజ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.రిస్క్లో షేర్..మరోవైపు ఓటీటీ రైట్స్ విలువ తగ్గడంతో నిర్మాతలు సైతం జాగ్రత్త పడుతున్నారు. ఇలా నిర్మాతలతో కలిసి రిస్క్ షేర్ చేసుకునే విధానం వైపే రవితేజ అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో నాని, సాయి ధరమ్ తేజ్, నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారని టాక్. అయితే ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే ఈ నిర్ణయం ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే. రవితేజ కొత్త సినిమా..రవితేజ- శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిస్తున్న మూవీ ఇరుముడి. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనుందిని టాక్.. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపిస్తారని తెలుస్తోంది. -
చిరంజీవి 'విశ్వంభర' ఏమైపోయినట్టు?
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్నిసార్లు సినిమా కష్టాలు తప్పవు. చిరంజీవి 'విశ్వంభర' సరిగ్గా ఇలాంటి స్థితిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ ఒకటుందని జనాలు ఇప్పటికే మర్చిపోయారు. మూవీ టీమ్ నుంచి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఈ చిత్రం ఈ ఏడాదైనా రిలీజ్ అవుతుందా? ఇంతకీ అసలేం జరుగుతోంది?'బింబిసార' లాంటి సక్సెస్ తర్వాత వశిష్ఠ.. చిరంజీవితో కలిసి కొత్త మూవీ చేసేందుకు సిద్ధమయ్యాడు. 2023లో చిరు పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్టుని ప్రకటించారు. అక్టోబరు నుంచి షూటింగ్ కూడా మొదలుపెట్టారు. 2024లో ఎప్పుడైతే గ్లింప్స్ పేరిట ఓ వీడియో వదిలారో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. గ్లింప్స్పై విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు వచ్చాయి. దెబ్బకు మూవీ టీమ్కి సీన్ అర్థమైపోయింది. గతేడాది ఓ పాట, కొత్త గ్లింప్స్ అని మరికొన్ని అప్డేట్స్ వచ్చాయి గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. బజ్ రాలేదు.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్)మరోవైపు దీని తర్వాత చాన్నాళ్లకు అనిల్ రావిపూడితో చిరంజీవి ఓ సినిమా ప్రకటించారు. 'మన శంకరవరప్రసాద్' పేరుతో గత నెలలో సంక్రాంతికి రిలీజ్ చేస్తే అద్భుతమైన హిట్ కొట్టింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కొత్త మూవీ చేసేందుకు చిరు రెడీ అయిపోతున్నారు. మెగా ఫ్యాన్స్ కొత్త ప్రాజెక్టు గురించి ఆనందపడిపోతున్నారు. దీని గురించి రూమర్స్ చాలానే వస్తున్నాయి. ఇది కూడా వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్గా తీస్తున్నారని అంటున్నారు. అదే టైంలో 'విశ్వంభర' గురించి చిన్న సౌండ్ కూడా లేదు.తాజాగా 'విశ్వంభర' నిర్మాతలే తీసిన 'కపుల్ ఫ్రెండ్లీ' విడుదల సందర్భంగా నిర్మాతలు.. చిరు సినిమా గురించి మాట్లాడట్లేదు. 'కపుల్ ఫ్రెండ్లీ' టీమ్తో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వశిష్ఠ కూడా 'విశ్వంభర' రిలీజ్ గురించి త్వరలో చెబుతాం అంటున్నాడే తప్ప ఈ ఏడాది వస్తుందా కనీసం వచ్చే ఏడాది వస్తుందా లాంటివి క్లారిటీ ఇవ్వట్లేదు. చూస్తుంటే గ్రాఫిక్స్ విషయంలో ఇంకా సందిగ్దత అలానే కొనసాగుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆ రిపేర్లు ఎప్పుడు పూర్తవుతాయో? బొమ్మ ఎప్పుడు బయటకు వస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నలా మారిపోయింది?(ఇదీ చదవండి: ఎన్టీఆర్ సినిమా.. నోటిలో నుంచి రక్తమొచ్చింది: జగపతిబాబు) -
‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: ఫంకీనటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహర్, నరేష్, ఈశ్వరీరావు, సంపత్ రాజ్ తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమానిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: అనుదీప్ కె.వి.సంగీతం: భీమ్స్ సిసిరోలియో ఎడిటింగ్: నవీన్ నూలి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026విశ్వక్ సేన్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. భారీ అంచనాల మధ్య గతేడాది రిలీజైన ‘లైలా’ డిజాస్టర్గా నిలిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ తెరకెక్కించిన చిత్రం కావడంతో ‘ఫంకీ’పై ఓ మోస్తరు అంచనాలు అయితే ఏర్పాడ్డాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఇలా ఈ వారం(ఫిబ్రవరి 13) భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఫంకీతో విశ్వక్ సేన్ హిట్ ట్రాక్ ఎక్కాడా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కోమల్ (విశ్వక్ సేన్) ఓ నూతన సినీ దర్శకుడు. ‘మంచి ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థలో ‘ఫంకీ’ అనే సినిమాను తెరకెక్కించే అవకాశం వస్తుంది. రూ. 4 కోట్ల బడ్జెట్లో సినిమా తీస్తానని నిర్మాత సుదర్శన్(నరేశ్) హామీ ఇచ్చి.. రూ. 40 కోట్లు ఖర్చు పెట్టిస్తాడు. అయినా కూడా సినిమా పూర్తికాదు. బడ్జెట్ భారీగా పెరిగిపోయిందనే టెన్షన్తో నిర్మాత సుదర్శన్ ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఆయన కూతురు చిత్ర(కయాదు లోహర్) తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బాధ్యతల నుంచి తప్పించడంతో కోమల్ ఏం చేశాడు? రూ. కోటి బడ్జెట్లో మిగిలిన సినిమాను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని కోమల్ నిలబెట్టుకున్నాడా లేదా? కోమల్తో చిత్ర ఎలా ప్రేమలో పడింది? ఈ కథలో జీకే (సంపత్ రాజ్) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘జాతి రత్నాలు’ తర్వాత అనుదీప్ సినిమాలంటే తెలుగు ఆడియన్స్కి ఓ అంచనా ఉంది. కథ గొప్పగా ఉండదు కానీ పంచ్ డైలాగ్స్తో ఫుల్ ఎంటర్టైనింగ్ కథనాన్ని నడిపిస్తాడనే నమ్మకం ఆడియన్స్లో ఉంది. అయితే గొప్ప కథ లేకపోయినా సరే..చెప్పుకోవడానికైనా కొంత స్టోరీ అయినా ఉండాలి కదా. అలా కాకుండా కేవలం సింగిల్ లైనర్స్తో పంచ్ డైలాగులు పేలిస్తే.. సినిమా ఆడేస్తుందని భావిస్తే అది పొరపాటే. జాతి రత్నాలు కేవలం పంచ్ డైలాగ్స్ వల్లే ఆడలేదు. అందులో కొంత కథ ఉంటుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. వాటికి తోడుగా పంచ్ డైలాగ్స్ కూడా ఉండడంతో ఆ సినిమా హిట్ అయింది. కానీ ‘ఫంకీ’లో పంచ్ డైలాగ్స్ తప్ప మిగతావేవి ఆకట్టుకునేలా లేవు. ఆ డైలాగ్స్ కూడా కామన్ ఆడియన్స్కి పెద్దగా నవ్వు తెప్పించవు. సినిమా ఇండస్ట్రీ వాళ్లు మాత్రం నవ్వుకుంటారు. డైలాగ్స్ కోసమే సన్నివేశాలు రాసినట్లుగా అనిపిస్తుంది. కథనం మొత్తం సింగిల్ పాయింట్ చుట్టూనే తిరుగుతూ.. చూసిన సన్నివేశాలే మళ్లీ రిపీట్ చేస్తూ విసుగు తెప్పించారు. అసలు ఈ కథని విశ్వక్, నాగవంశీ ఎలా ఒప్పుకున్నారనే సందేశం సినిమా చూస్తున్నంతసేపు మన మనసుని వెంటాడుతూనే ఉంటుంది.ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథే లేదు. కథనం ఆసక్తికరంగా సాగదు. ఒక్కో సన్నివేశాన్ని పేర్చుకుంటూ వెళ్లారు. కొన్ని సీన్లు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. హీరో పాత్రని తీర్చిదిద్దిన విధానం కూడా ఆకట్టుకునేలా ఉండడు. అన్ని విషయాలను లైట్ తీసుకునే వ్యక్తిలో కూడా ఎమోషన్లు ఉంటాయని హీరో పాత్ర ద్వారా చెప్పాలకున్నారు. కానీ దాన్ని తెరపై సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. క్లైమాక్స్లో మదర్ సెంటిమెంట్ని కూడా యాడ్ చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సినిమా ప్రారంభంలో వచ్చే కామెడీ సన్నివేశాల్లో మొదట్లో కాస్త నవ్వులు పూయిస్తాయి. అయితే అలాంటి సీన్లే మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వడంతో నవ్వు రాకపోగా.. ఒకనొక దశలో చిరాకు అనిపిస్తుంది. కోమల్, చిత్ర పాత్రల పరిచయ సన్నివేశాలు బాగుంటాయి. ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ కథనం కాస్త వేగంగా సాగుతుంది. అనుదీప్, కల్యాణ్ శంకర్ల గెస్ట్ అప్పీయరెన్స్ కూడా పెద్దగా నవ్వులు పంచలేకపోయింది. ఉన్నంతలో మదర్ సెంటిమెంట్ కాస్త ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ రొటీన్గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే..విశ్వక్ సేన్ మంచి నటుడే. అయితే అనుదీప్ రాసిన ‘కోమల్’క్యారెక్టర్ అతనికి సరిగా సూట్ అవ్వలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పటిమాదిరే పాత్రలో లీనమైన నటించాడు. కానీ పూర్తిగా నవ్వించలేకపోయాడు. కయాదు లోహర్ తెరపై అందంగా కనిపించింది. నరేశ్ పాత్ర నిడివి తక్కువే. ఆయనను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సంపత్ రాజ్ పాత్ర కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. ఈశ్వరీరావు తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ నేపథ్య సంగీతం, పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మాత్రం దారుణంగా ఉంది. కొన్ని సీన్లు ఎందుకు వచ్చాయో కూడా అర్థం కాదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఎన్టీఆర్ సినిమా.. నోటిలో నుంచి రక్తమొచ్చింది: జగపతిబాబు
అప్పట్లో హీరోగా మెప్పించిన జగపతిబాబు.. సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం 'పెద్ది' లాంటి పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటుడు.. 'అరవింద సమేత' జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు నోటిలో నుంచి రక్తం వచ్చిన విషయంపై మరోసారి స్పందించారు. అప్పుడు అసలేమైందనేది చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్)'అరవింద సమేత' సినిమాలో మీ గొంతు విషయంలో స్వరపేటిక కాస్త దెబ్బతిందని విన్నాను నిజమేనా? అని యాంకర్ ప్రశ్నించగా.. అవుననే సమాధానమిచ్చాడు. 'కాస్త మొరటుగా అనిపించేలా గంటలకొద్ది, రోజుల కొద్దీ డబ్బింగ్ చెప్పడంతో నా గొంతు మొరటుగా మారిపోయింది. ఓ సందర్భంలో నోటి నుంచి రక్తం వచ్చింది. షాకింగ్ వాయిస్ కావాలని అనుకొనే ఇలా చేశాను. ఆ ప్రయత్నంలో అలా జరిగిపోయింది. కాకపోతే మూవీ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఆ టైంలో పిచ్చి కసిమీద ఉన్నా. దానికి తగ్గట్లే త్రివిక్రమ్ కూడా అదరగొట్టేశాడు''క్లైమాక్స్ కూడా భలే మార్చాడు త్రివిక్రమ్. ఒరిజనల్గా అయితే క్లైమాక్స్లో రెగ్యులర్ ఫైటే చేశాం. ఎందుకో షూటింగ్లో బ్రేక్ వచ్చింది. ఏంటి శ్రీను, నువ్వు కూడా ఈ క్లైమాక్స్లు అని అన్నాను. బోర్ కొడతోంది. నువ్వైనా మార్చవయ్యా క్లైమాక్స్లు అని అన్నాను. దీంతో డైరెక్షన్ టీమ్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ కూర్చుని డిస్కషన్ పెట్టారు. రెండు రోజుల తర్వాత పూర్తిగా క్లైమాక్స్ మార్చేశారు. అదరగొట్టేశారు' అని జగపతిబాబు అన్నారు.ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో 2018లో వచ్చిన సినిమా 'అరవింద సమేత'. పేరుకే మాస్ యాక్షన్ మూవీ అయిప్పటికీ.. కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో సూపర్హిట్ అయింది. ఇందులో జగపతిబాబు చేసిన బసిరెడ్డి పాత్ర అయితే అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా 'మచ్చల పులి గాండ్రిస్తే ఎట్టా ఉంటదో తెలుసా?' అంటూ వైవిద్యమైన వాయిస్తో చెప్పిన డైలాగ్కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఆ డబ్బింగ్ వెనక రక్తం వచ్చేంత కష్టముందా అని తెలిసి నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ) -
అల్లు శిరీష్ పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్
అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ పెళ్లికి రెడీ అయిపోయాడు. నయనికతో మూడు ముళ్లు వేయనున్నాడు. గత నెలలో దుబాయిలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకోగా.. ఇప్పుడు హైదరాబాద్లోని అల్లు అరవింద్ ఇంట్లో పసుపు దంచుడు కార్యక్రమం గురువారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో శిరీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)సాధారణంగా హల్దీ పేరుతో చాలామంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాటికి నో చెప్పిన శిరీష్.. ఇంట్లోనే సంప్రదాయబద్ధంగా పసుపు దంచుకునే కార్యక్రమం చేసుకున్నాడు. ఈ వేడుకలో బన్నీ సతీమణి స్నేహ, పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, మిగతా బంధువులు, పిల్లలు కనిపించారు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
అర్జున్ సర్జా కామెంట్స్పై స్పందించిన విశ్వక్సేన్
విశ్వక్ సేన్, అర్జున్ సర్జాల సినిమాలు ఒక్కరోజు గ్యాప్తో రిలీజవుతున్నాయి. ఫంకీ ఫిబ్రవరి 13న విడుదలవగా సీతా పయనం ఫిబ్రవరి 14న రిలీజవుతోంది. అన్నీ కుదిరితే "సీతా పయనం"లోనూ విశ్వకే హీరోగా ఉండేవాడు. అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు, షూటింగ్ కూడా మొదలుపెట్టారు! కానీ అనివార్య కారణాల వల్ల అతడు సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో అర్జున్, విశ్వక్ మధ్య మాటల యుద్ధం జరిగింది.విశ్వక్పై పాజిటివ్ రియాక్షన్అయితే విశ్వక్తో వివాదం గురించి ఇటీవల అర్జున్ సానుకూలంగా స్పందించాడు. తను యువకుడు అని, తనకు చాలా భవిష్యత్తు ఉందన్నాడు. ఏదో కుదర్లేదని ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదన్నాడు. విశ్వక్ తల్లి చేతి భోజనం తిన్నానని, అతడు బాగుండాలని కోరుకుంటానని తెలిపాడు. కాలంతో పాటు కొన్ని మర్చిపోవాలని, రెండు సినిమాలు బాగా ఆడాలని ఆకాంక్షించాడు.స్పందించిన విశ్వక్సేన్ఈ వ్యాఖ్యలపై తాజాగా విశ్వక్ స్పందించాడు. ఆయన మాట్లాడింది నాకు చాలా మంచిగా అనిపించింది. ఈరోజు ఉన్న కోపం రేపు ఉండదు. అదే కదా జీవితం! పైగా రెండు సినిమాలు ఒకేరోజు రిలీజవుతున్నాయి. ఆయన చాలా మంచి విషయాలు మాట్లాడాడు. అది విని నాకు మంచిగా అనిపించింది. సీతాపయనం, కపుల్ ఫ్రెండ్లీ సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు. కాగా సీతాపయనం మూవీలో విశ్వక్ స్థానంలో నిరంజన్ నటించాడు.చదవండి: రూ.45 కోట్లు పెడితే రూ.1 లక్షలోపు వసూళ్లు.. గుండె ముక్కలైందన్న హీరోయిన్ -
రామ్చరణ్ ట్విన్స్ బారసాల.. చిరంజీవి పేరు కలిసొచ్చేలా..
మెగా హీరో రామ్చరణ్ దంపతులు ఇటీవలే (జనవరి 31న) కవల పిల్లలకు జన్మనిచ్చారు. తాజాగా వారికి నామకరణం చేశారు. మొదటి కూతురికి క్లీంకార అని నామకరణం చేసిన మెగా ఫ్యామిలీ ఈసారి కవలలకు కూడా అలాగే ప్రత్యేకమైన పేర్లను పెట్టింది. తండ్రీకొడుకుల పేర్లు కలిసొచ్చేలా కుమారుడికి శివరామ్ అని నామకరణం చేశారు. కూతురికి అన్వీరా దేవి అని పేరు పెట్టారు.కవలలకు నామకరణంఈ బారసాల ఫంక్షన్ గురించి రామ్చరణ్ వెరైటీ ఇండియాతో మాట్లాడుతూ.. పిల్లలకు పేర్లు పెట్టడం అనేది ఒక ఆచారం. ఏ పేరు పెట్టాలని ఉపాసన, నేను ఎంతగానో ఆలోచించాం. ఈ జర్నీలో మా తల్లిదండ్రులు, వారి ఆశీర్వాదాలున్నాయి. నా పిల్లల విషయానికి వస్తే.. కొడుకు పేరు శివరామ్ అని పెట్టాం. శివుడు, రాముడి బలం, నీతి నిజాయితీల ప్రతిబింబానికి నిదర్శనమే ఈ పేరు. అలాగే ఇది నా తండ్రి జన్మపేరు శివ శంకర వరప్రసాద్ను సూచిస్తుంది.పేరు వెనక కథకూతురి పేరు అన్వీరా దేవి.. ఇది అపరిమిత ధైర్యం, స్త్రీ శక్తిని సూచిస్తుంది. వీర అంటే ధైర్యం, అన్ అంటే అపరిమితం అని అర్థం. దేవి అనేది ఉద్దేశపూర్వకంగా పెట్టాం. బలం, ధైర్యం రెండింటి కలయికే అన్వీరా దేవి. ఈ పేర్లు కేవలం గుర్తింపు కోసం కాదు, బలం, ప్రేమ, ధైర్యానికి ప్రతీకలు అని చెప్పుకొచ్చాడు. చిరంజీవి సైతం బారసాల ఫంక్షన్ ఫోటో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) చదవండి: చికిరి చికిరి హుక్ స్టెప్ సాంగ్ కంపోజ్ చేసింది రామ్చరణా? -
‘నిలవే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: నిలవేనటీనటులు: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులునిర్మాణ సంస్థ: POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్నిర్మాతలు: రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నందర్శకత్వం - సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నంసంగీతం: కళ్యాణ్ నాయక్సినిమాటోగ్రఫీ: దిలీప్ కే కుమార్విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026ట్రైలర్ రిలీజ్ వరకు నిలవే చిత్రం గురించి ఎవరికీ తెలియదు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై బజ్ క్రియేట్ అయింది. చాలా మంది అర్జున్ రెడ్డి సినిమాతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరి ఈ చిత్రం అ అంచనాలను అందుకుందా? లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. అర్జున్(సౌమిత్ రావు) అనాథ. స్నేహితుడు(వైవా హర్ష) ఇంట్లో ఉంటూ ఓ యాడ్ ఏజెన్సీలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్గా పని చేస్తుంటాడు. అతనికి తోడుగా ఒక అమ్మాయి ఉంటే బాగుండేది అనుకుంటాడు. కానీ ఆయన జీవితంలోకి అమ్మాయి రాదు. దీంతో డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఫ్లాట్లో ఊరి వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో నుంచి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమే అతిథి(శ్రేయాసి సేన్). తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. పరిచయం పెంచుకొని దగ్గరకు అవుతాడు. అతిథి కూడా అర్జున్తో ఫిజికల్గా దగ్గరవుతుంది. కానీ ప్రేమను అంగీకరించలేకపోతుంది. దానికి గల కారణం ఏంటి? అతిథి ప్లాష్బ్యాక్ ఏంటి? పెళ్లి, పిల్లలతో ఒక మంచి ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలనుకున్న అర్జున్ కల నెరవేరిందా? శాంతను ఎవరు? అతిథి తన జీవితంలోకి వచ్చిన తర్వాత అర్జున్లో వచ్చిన మార్పు ఏంటి? చివరకు అర్జున్, అతిథిలు ఒక్కటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక డిఫరెంట్ లవ్స్టోరీ. ఓ మంచి ప్రేమ కథని సంగీతానికి ముడిపెడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు సౌమిత్ రావు, సాయి వెన్నం. ఒంటరి జీవితం వద్దనుకునే అబ్బాయి.. అందర్నీ వదిలేసి ఒంటరిగా బతకాలనుకున్న అమ్మాయి.. వీరిద్దరి ప్రేమ కథే ఈ సినిమా. హీరో ఆత్మహత్యకు ప్రయత్నించే సన్నివేశంతో చాలా ఆసక్తికరంగా సినిమా ప్రారంభం అవుతుంది. ఒంటరితనం మనిషిని ఎలా కుంగదీస్తుంది అనే అర్జున్ పాత్రను చూస్తే అర్థమవుతుంది. తోడు కోసం వెతికే క్రమంలో ఎదురుదెబ్బలు తగలడం.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే సమయంలో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. అప్పటి నుంచి కథనం రొమాంటిక్గా సాగుతుంది. హీరో, హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి.అర్జున్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ.. అతిథి వెనకడుగు వేయడంతో.. ప్లాష్బ్యాక్లో ఏదో ఒక స్టోరీ ఉందనే విషయం అర్థమైపోతుంది. అయితే అదేంటనే క్యూరియాసిటీని మాత్రం చివరి వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తి పెంచుకుంది. ఇక ద్వితియార్థం కథనం ఎమోషనల్గా సాగుతుంది. అతిథి ప్లాష్బ్యాక్ స్టోరీ గుండెను బరువెక్కిస్తుంది. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కానీ, థియేటర్స్కి వెళ్లి చూసిన వారికి మాత్రం గొప్ప అనుభూతిని అందిస్తుసింది.ఎవరెలా చేశారంటే...ఈ సినిమాలో హీరోహీరోయిన్లతో పాటు మిగతా నటీనటులంతా కొత్తవారే.అయినప్పటికీ చక్కగా నటించారు. అర్జున్ పాత్రకు సౌమిత్ రావు పూర్తి న్యాయం చేశాడు. డ్యాన్స్ ఇరగదీశాడు. ఎమోషనల్ సన్నివేశాలలో చాలా బాగా నటించాడు. తెరపై బాలీవుడ్ హీరోలా కనిపించాడు. ఇక అతిథిగా శ్రేయాసి సేన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమా అయినా.. ఆ విషయం తెరపై కనిపించకుండా జాగ్రత్త పడింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. వైవా హర్ష కొన్ని చోట్ల నవ్విస్తాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. కళ్యాణ్ నాయక్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'చికిరి చికిరి' బ్యాట్ స్టెప్ ఐడియా రామ్చరణ్దా?
గతేడాది బాగా హిట్టయిన సాంగ్స్లో 'చికిరి చికిరి' ఒకటి. ఇందులో రామ్చరణ్ డ్యాన్స్ స్టెప్స్ బాగా వైరలయ్యాయి. ఆ పాట రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ హుక్ స్టిప్ క్రేయేట్ చేసిన వీడియోలే దర్శనమిచ్చాయి. సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చిన ఈ పాటను ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేయగా మోహిత్ చౌహాన్ ఆలపించాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.కంపోజ్ ఎవరు చేశారంటే?తాజాగా జానీ మాస్టర్ ఓ డ్యాన్స్ షోలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. కూర్చుని లేసే స్టెప్స్ తాను కంపోజ్ చేశానని.. కానీ, క్రికెట్ బ్యాట్ స్టెప్ మాత్రం చరణ్ కంపోజ్ చేశాడని తెలిపాడు. జానీ మాట్లాడుతూ.. హుక్ స్టెప్ చరణ్ అన్న వేరేలా కంపోజ్ చేశారు. బ్యాట్ స్టెప్, దాన్ని పట్టుకునేముందు వచ్చే డ్యాన్స్ స్టెప్ ఆయనే క్రియేట్ చేశారు. ఏరోజూ ఆయన క్రెడిట్ తీసుకోరు, మనకే ఇచ్చేస్తారు. సినిమాఎందుకలా అని అడిగితే.. ఐడియా నాది, కానీ దాన్ని ఇంకాస్త బెటర్గా మార్చి.. ఇది వర్కవుట్ అవుతుందని నమ్మినందుకు ఆ క్రెడిట్ మీకే చెందాలి అన్నారు. రామ్చరణ్ విషయానికి వస్తే.. ఆయన చివరగా నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం పెద్ది అనే స్పోర్ట్స్ డ్రామా మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. చదవండి: రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు -
దిల్ రాజు డ్రీమ్స్లో మార్కండేయ
‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించిన 23 ఏళ్లలో 60 చిత్రాలు పూర్తి చేసిన మా సంస్థకు ‘దిల్ రాజు డ్రీమ్స్’ మరో విభాగం. ‘మార్కండేయ’ మూవీ కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని మా దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్లో తొలి సినిమాగా నిర్మించడం సంతోషంగా ఉంది’’ అని ‘దిల్’ రాజు తెలిపారు. విక్రాంత్ హీరోగా సిస్ట్లా వీఎంకే తెరకెక్కిస్తున్న చిత్రం‘మార్కండేయ’. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్గా డబ్బు పోగొట్టుకున్నాను. ఆ తర్వాత ‘పెళ్లి పందిరి’ సినిమా నిలబెట్టింది.‘మార్కండేయ’ మూవీని 2027 మహాశివరాత్రికి విడుదల చేస్తాం. ఈ బ్యానర్లో మరో నాలుగు చిత్రాలు నిర్మిస్తున్నాం. వాటిలో రెండు ఓటీటీ, మరో రెండు థియేట్రికల్గా రిలీజ్ అవుతాయి. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో ‘ఎల్లమ్మ, రౌడీ జనార్థన, దేత్తడి’ వంటి సినిమాలు నిర్మిస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘మాలాంటి కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చి నిలబెడుతున్న రాజుగారికి థ్యాంక్స్’’ అని సిస్ట్లా వీఎంకే పేర్కొన్నారు. ‘‘ఇతిహాసాల నుంచి తీసుకున్న కథతో మేం చేస్తున్న ఒక మిస్టిక్ థ్రిల్లర్ మూవీ ‘మార్కండేయ’’ అన్నారు విక్రాంత్. ఈ కార్యక్రమంలో కెమెరామేన్ జగదీశ్ వర్మ భూపతిరాజు, మ్యూజిక్ డైరెక్టర్ హరి ఎస్ఆర్ మాట్లాడారు. -
గర్భంతోనే ‘సతీ లీలావతి’ షూటింగ్లో పాల్గొన్నా: లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సతీ లీలావతి’. నాగ మోహన్ నిర్మించిన ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ–‘‘సతీ లీలావతి’ సినిమా ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. మూడు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాం. దర్శక–నిర్మాతల సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ‘‘కమల్హాసన్గారి ‘సతీ లీలావతి’ చిత్రంతో నా సినిమాను పోల్చను. కానీ ప్రేక్షకులందరూ రిలేట్ అయ్యేలా మా సినిమాను తీశాం’’ అని చెప్పారు తాతినేని సత్య. ‘‘ఇది నా తొలి చిత్రం. ఈ సినిమా ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నాను’’ అని చెప్పారు నాగ మోహన్. నటుడు సప్తగిరి మాట్లాడారు. -
టీజర్కి వేళాయె!
‘పెద కాపు’ మూవీ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వేసవిలో విడుదల కానుంది.ఈ మూవీ టీజర్ మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 15న రిలీజ్ కానుంది. అయితే విశేషం ఏంటంటే... హీరో మహేశ్బాబు చేతుల మీదుగా ఈ టీజర్ను లాంచ్ చేయించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకి కెమెరా: సౌందర్ రాజన్ ఎస్, సంగీతం: అభే, జునైద్ కుమార్, సీఈఓ: వాసు పోతిని. -
రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు: విశ్వక్ సేన్
‘‘స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ‘ఫంకీ’ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. రెండు గంటలు ఎలా అయిపోయాయో కూడా తెలియనంతగా మా సినిమా చూసి హాయిగా నవ్వుకుంటారు’’ అని విశ్వక్ సేన్ తెలిపారు. ఆయన హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఫంకీ’. కేవీ అనుదీప్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో అనుదీప్ కేవీ మాట్లాడుతూ–‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. కుటుంబంతో కలిసి సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘ఫంకీ’ నా కెరీర్లో మొదటి కామెడీ సినిమా’’ అన్నారు కయాదు లోహర్. ‘‘సినిమా నేపథ్యంలో జరిగే కథ ఇది. దర్శకుడికి, నిర్మాత కూతురికి మధ్య జరిగే సరదా కథ’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. -
Mrunal Thakur: ధనుష్తో పెళ్లి..? మృణాల్ ఠాకూర్ క్లారిటీ
సినీ ఇండస్ట్రీలో ఈ మద్య కాలంలో తరచూ వినిపించే ఓ వార్త ఏమిటంటే.. హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్నది. అయితే ఈ వార్తలు కొత్తవి కావు. గతంలో ఒక ఫంక్షన్లో వీరిద్దరూ క్లోజ్గా కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. కొంతమంది మేధావులు ఫిబ్రవరి 14న వీరి వివాహం జరుగుతుందని కథనాలు ప్రచారం చేశారు. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ ఈ పుకార్లపై స్పందింది. “ఫిబ్రవరి 14 కాస్తా ఏప్రిల్ 1గా మారినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ 1 ఫూల్స్ డే కదా. ఇదంతా ఎవరు మొదలుపెడుతున్నారో అర్థం కావడం లేదు. నేను అధికారికంగా చెప్పినట్టు కొంతమంది ఇలాంటి గాసిప్స్ వ్యాపింపజేస్తున్నారు. ఇది తనకు చాలా భయంకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ఇంతకుముందు పలుమార్లు ఈ విషయంపై ఆమె స్పందించినప్పటికీ, ఆ మాటలు పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టే అయ్యాయి. ఈసారి మాత్రం మృణాల్ స్పష్టంగా తనకు ధనుష్తో ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. అయితే ఆమె ఇచ్చిన క్లారిటీతో ఈ గాసిప్స్కు ముగింపు లభిస్తాయేమో చూడాలి. మొత్తానికి ధనుష్తో వస్తున్న పెళ్లి వార్తలు కేవలం పుకార్లేనని మృణాల్ ఠాకూర్ తేల్చి చెప్పింది. -
అమలాపాల్ ఫుల్ గ్లామరస్.. సంయుక్త మీనన్ బ్యూటిఫుల్ పిక్స్..!
ఫుల్ గ్లామరస్తో మెరిసిపోతున్న హీరోయిన్ అమలా పాల్..స్వయంభూ బ్యూటీ సంయుక్త మీనన్ లేటేస్ట్ పోజులు..యూకేలో చిల్ అవుతోన్న కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ..బ్లాక్ డ్రెస్లో కల్యాణి ప్రియదర్శన్ గ్లామరస్ పిక్స్.. స్టైలిష్ హెయిర్ లుక్లో హీరోయిన్ ప్రియమణి.. View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by SEERATH SHEIK | MAKE-UP ARTIST (@seerathmystique) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
విక్రాంత్ మార్కండేయ.. టైటిల్ గ్లింప్స్ అదుర్స్
సంతాన ప్రాప్తిరస్తు ఫేమ్ విక్రాంత్ హీరోగా వస్తోన్న చిత్రం మార్కండేయ. ఈ సినిమాకు వీఎంకే సిస్ట్లా దర్శకత్వం వహస్తున్నారు. ఈ మూవీని దిల్ రాజు డ్రీమ్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్ల్ రిలీజ్ చేశారు మేకర్స్. హైదరాబాద్లో నిర్వహించిన ఈవెంట్కు నిర్మాత దిల్ రాజు కూడా హాజరయ్యారు.మార్కండేయ గ్లింప్స్ చూస్తుంటే శివుడి ఇతివృత్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్ల్లో మంచుకొండల్లో సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. చివర్లో శివుడి శక్తి హీరోలోకి ప్రవేశించడం మరింత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్య ఈ పవర్ఫుల్ గ్లింప్స్ మీరు కూడా చూసేయండి. -
రష్మిక, శ్రీలీల బాటలో కాంతార బ్యూటీ.. టాలీవుడ్ కలిసొస్తుందా?
కన్నడ బ్యూటీలకు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. రష్మిక, శ్రీలీలకు ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోయిన్లుగా తమ పేరును లిఖించుకున్నారు. పుష్ప మూవీతో రష్మిక మందన్నా రేంజ్ పూర్తిగా మారిపోయింది. అలా కన్నడ భామలు ఇలా వచ్చి తెలుగులో సూపర్ పవర్గా ఎదిగారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల కంటే శాండల్వుడ్ భామలకే ఫుల్ డిమాండ్ ఉంటోంది.ఇప్పుడదే అదే బాటలో మరో కన్నడ బ్యూటీ అడుగులేస్తోంది. గతేడాది కాంతార-2 మూవీతో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న భామ రుక్మిణి వసంత్. ఇప్పుడు టాలీవుడ్పై దృష్టి సారించింది. సప్త సాగరాలు దాటి లాంటి కన్నడ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్లోనూ ఛాన్స్ కొట్టేసింది. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న చిత్రంలో అవకాశం దక్కించుకుని టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ కూడా అఫీషియల్గా ప్రకటించారు. ఈ మూవీతోనైనా రుక్మిణి వసంత్ టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకుంటుందేమో వేచి చూడాల్సిందే. రష్మిక, శ్రీలీల మాదిరిగానే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో స్టార్గా హోదాను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. టాలీవుడ్లోనూ తన కెరీర్ను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రుక్మిణి వసంత్ ఇప్పటికే తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంలో నటించింది. -
ఓటీటీల్లో సినిమాల పండగ.. ఒక్క రోజే 13 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. గతవారంలో థియేటర్లలో చిన్న సినిమాలు రిలీజైనా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ వారంలో విశ్వక్ సేన్ ఫంకీ మూవీ ఆడియన్స్లో ఆసక్తి పెంచుతోంది. దీంతో పాటు అమరావతికి ఆహ్వానం, నీలవే, కపుల్ ఫ్రెండ్లీ లాంచి చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ సందడి చేస్తున్నాయి. ఈ ఫ్రైడే మరిన్ని చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. తెలుగు సినిమాలు లేకపోయినా పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు, హాలీవుడ్ మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే దాదాపు 13 చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం ఓటీటీ సినిమాలునెట్ఫ్లిక్స్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13 మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ సిరీస్) - ఫిబ్రవరి 13 ద ఆర్ట్ ఆఫ్ సారా (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 13అమెజాన్ ప్రైమ్.. బ్యాండ్వాలే( హిందీ వెబ్ సిరీస్)-ఫిబ్రవరి 13 లవ్ మీ లవ్ మీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 13జియో హాట్స్టార్..ద కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 13జీ5భానుప్రియ భూతర్ హోటల్(బెంగాలీ హారర్ మూవీ)- ఫిబ్రవరి 13పాతిరాత్రి(మలయాళ సినిమా)- ఫిబ్రవరి 13ఉత్తర్(మరాఠీ సినిమా)- ఫిబ్రవరి 13సన్ నెక్స్ట్ సూర్య: పవర్ ఆఫ్ లవ్ (కన్నడ చిత్రం) - ఫిబ్రవరి 13 మాయబిమ్బుమ్(తమిళ సినిమా)-ఫిబ్రవరి 13ఆపిల్ టీవీ ప్లస్ ఎటర్నటీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13ది లయన్స్ గేట్ ప్లే..ది రఫ్నెక్(హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 13 -
నాని పాన్ ఇండియా మూవీ.. ది ప్యారడైజ్ వాయిదా..!
టాలీవుడ్ హీరో నాని నటిస్తోన్న యాక్షన్ చిత్రం ది ప్యారడైజ్. దసరా మూవీతో హిట్ కొట్టిన కాంబో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో తెరెకెక్కిస్తున్నారు. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని వెల్లడించారు.కానీ మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే ది ప్యారడైజ్ మూవీ వాయిదా పడింది. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అఫీషియల్గా ప్రకటించారు. ఏకంగా ఐదు నెలలు ఆలస్యంగా థియేటర్లకు రానుంది. కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తూ పోస్టర్ను పంచుకున్నారు. దీంతో నాని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని శ్రీకాంత్ ఓదెల ట్వీట్ చేశారు. నేను తొందరపడాలనుకోవడం లేదు.. తనకు ఇంకాస్తా సమయం కావాలని అభిమానులకు కోరారు. I don’t want to rush. I need some time to deliver it.#TheParadise - 21-08-2026 🔒 pic.twitter.com/2aKDg7IJP3— Srikanth Odela (@odela_srikanth) February 12, 2026 -
ముద్దు సీన్లు.. ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడ్డారు: మానస వారణాసి
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యువత ఈ ట్రైలర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి కారణం అందులో ఓ ముద్దు సీన్ కూడా చూపించడం. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయంటోంది హీరోయిన్ మానన వారణాసి. కథ చెప్పినప్పుడే తనకు ముద్దు సీన్ల గురించి చెప్పారని.. టీమ్పై నమ్మకంతో ఓకే చెప్పానని అంటోంది. అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇంట్లో వాళ్లు ఆ సీన్లను చూసి ఇబ్బంది పడ్డారట. ఈ విషయాన్ని స్వయంగా మానస వారణాసినే చెప్పింది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాలోని ముద్దు సీన్ల గురించి మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో సన్నిహితంగా ఉండే సన్నివేశాలు ఉంటాయి. కథ చెప్పినప్పుడే ఇది లవ్ స్టోరీ రెండు ముద్దు సీన్స్ ఉంటాయని చెప్పారు. మొదట్లో నేను సందేహించాను. కానీ మా డీవోపీ, డైరెక్టర్, హీరో సంతోష్..ఇలా టీమ్ అంతా ప్రొఫెషనల్, హానెస్ట్ గా ఉన్నారు. వీళ్లు అసభ్యంగా సీన్స్ చేయరు అని నమ్మకం కలిగింది. నాకొక కంఫర్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. సంతోష్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఈ టీమ్ అంతా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తుంటే నటిగా నేనూ ప్రొఫెషనల్ గా ఉండాలి కదా అని నటించాను. రొమాంటిక్ సీన్స్ అయినా బ్యూటిఫుల్ గా పొయెటిక్ గా తెరకెక్కించారు. నా దృష్టిలో గ్లామర్ అంటే ఎక్స్ పోజింగ్ కాదు. టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక మా ఇంట్లో వాళ్లు కొంచెం ఇబ్బందిగా మాట్లాడారు. మన వారణాసి కుటుంబంలో ఉండి ఇలా ఎలా చేశావు అన్నారు. ఆ తర్వాత మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. సపోర్ట్ చేశారు’ అని మానస చెప్పుకొచ్చింది. -
ఆ సంఘటన తర్వాత అందరు చీరల్లోనే: వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హే భగవాన్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన ఆయన హగ్ డే సందర్భంగా మాట్లాడారు. స్టేజీపై ఉన్న ఇద్దరు హీరోయిన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవాళ హగ్ డే కావడంతో మిమ్మల్ని హగ్ చేద్దామని వచ్చాను.. కానీ మీరిద్దరు చీరలు కట్టుకుని వచ్చారని అన్నారు. కొన్ని సంఘటనల ప్రతి ఒక్కరూ చీరలు కట్టుకుని వస్తున్నారన్నారు.కాగా.. గతంలో దండోరా మూవీ ఈవెంట్లో శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మహిళల డ్రెస్సులను ఉద్దేశించి శివాజీ మాట్లాడిన భాషపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలొచ్చాయి. అనసూయ, చిన్మయి లాంటి ఈ వివాదంపై నోరు విప్పారు. డ్రెస్ అనేది మహిళల ఛాయిస్ అని తమ వాయిస్ వినిపించారు. ఆ తర్వాత తన కామెంట్స్పై తీవ్ర వ్యతిరేకత రావడంతో శివాజీ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ తన వాడిన ఆ రెండు పదాలకు మాత్రమేనని క్షమాపణలు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనను ఉద్దేశించి తాజాగా వీకే నరేశ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా.. సుహాస్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా హే భగవాన్. ఈ చిత్రంలో శివాని నాగారం హీరోయిన్గా కనిపించనుంది. గోపి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ మూవీలో వీకే నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. -
రష్మిక-విజయ్ పెళ్లి వేడుక.. కోట్ల రూపాయల డీల్కు నో..!
టాలీవుడ్లో గత కొంత కాలంగా వీరి పెళ్లి చుట్టే చర్చ నడుస్తోంది. ఎంగేజ్మెంట్ వార్తల తర్వాత ఆ ఇద్దరు స్టార్స్ పెళ్లి వేడుక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ జంట మరెవరో కాదు.. టాలీవుడ్లో మోస్ట్ వైరల్ ప్రేమజంట రష్మిక- విజయ్ దేవరకొండ. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలోనే జరనుందని వచ్చినా డేట్ విషయంలో క్లారిటీ లేదు. మొదట ఫిబ్రవరి 2న జరగనుందని వార్తలొచ్చనా అలా జరగలేదు. తాజాగా ఈనెల 26న ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో విజయ్- రష్మిక పెళ్లికి సంబంధించిన మరో న్యూస్ తెగ వైరలవుతోంది. వీరి పెళ్లి వీడియోను ఏ ఓటీటీకి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్తో ముందుకొచ్చనట్లు సమాచారం. అయితే తమ వ్యక్తిగత జీవితంలో బిజినెస్ చేసే ఉద్దేశం లేదని ఓటీటీ విజ్ఞప్తిని తిరస్కరించనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వెడ్డింగ్ వీడియో విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే విజయ్- రష్మిక జాగ్రత్త పడుతున్నట్లు టాక్. ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వేడుకతో వ్యాపారం చేయడం విజయ్కి అస్సలు ఇష్టం లేదని సమాచారం. అందుకే కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఓటీటీ డీల్ను వీరు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తమ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్గా ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా వీరిద్దరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
రాజకీయాల్లోకి అర్జున్.. యాక్షన్ కింగ్ ఏమన్నారంటే..?
సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. ఎన్టీఆర్తో సహా పలువురు హీరోలు రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పారు. కొత్తగా తమిళ్ స్టార్ హీరో విజయ్ కుడా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరో అర్జున్ కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై అర్జున్ స్పందించారు. రాజకీయాలపై ఆసక్తి లేదని.. అంత జ్ఞానం కూడా తనకు లేదన్నాడు. (చదవండి: విశ్వక్ సేన్తో సినిమా తీస్తారా?.. అర్జున్ ఆన్సర్ ఇదే!)అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘సీతా పయనం’. ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా మీడియాతో మాట్లాడిన అర్జున్.. ‘రాజకీయ ఎంట్రీ’పై స్పందింస్తూ... ‘నాకు మంచి పని చేయాలని ఉంది కానీ..దాని కోసం రాజకీయాల్లోకి రావాలని లేదు. నాకు అంత జ్ఞానం కూడా లేదు. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నాను. ఒకవైపు నటిస్తూనే..మరోవైపు కొన్ని కథలను రాసుకుంటున్నాను. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అయితే నాకు లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు. ఇక విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. మంచి చేయాలనుకునేవాళ్లు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటారు. విజయ్ ఇప్పుడే వచ్చాడు. ఆయన పని తీరు ఎలా ఉంటుందో తెలియదు. అందరిలాగే తాను కూడా విజయ్ రాజకీయాల్లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు. -
'హే భగవాన్'.. మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి రా? (ట్రైలర్)
సుహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా 'హే భగవాన్' ట్రైలర్ వచ్చేసింది. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు తదితర సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన సుహాస్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో గోపి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్గా ఈ మూవీని తెరకెక్కించగా నరేంద్రరెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రంపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇందులో శివాని నగరం, నరేష్ విజయ కృష్ణ, సుదర్శన్ తదితరులు నటించారు. -
విశ్వక్ సేన్తో సినిమా తీస్తారా?.. అర్జున్ ఆన్సర్ ఇదే!
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా ‘సీతా పయనం’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నిరంజన్ హీరోగా నటించిన ఈచిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో మొదట హీరోగా విశ్వక్ సేన్ నటించాల్సింది. పూజా కార్యక్రమాల్లో కూడా విశ్వక్ పాల్గొన్నాడు. కానీ షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో అర్జున్ మీడియా ముఖంగా విశ్వక్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విశ్వక్ సైతం వివరణ ఇచ్చుకున్నాడు. చివరకు నిరంజన్ని హీరోగా పెట్టుకొని ఈ సినిమాకు తెరకెక్కించాడు అర్జున్. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అర్జున్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విశ్వక్ వివాదంపై కూడా ఆయన స్పందించారు. విశ్వక్పై తనకు ఎలాంటి కోపం లేదని.. కొన్ని కారణాల వల్ల తప్పకున్నాడు. అంతమాత్రనా ఆయనపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. మళ్లీ అవకాశం వస్తే కచ్చితంగా అతనితో సినిమా చేస్తా’ అని అర్జున్ అన్నారు. విశ్వక్ మారిన తర్వాత కథలో ఏవైనా మార్పులు చేశారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘నా సినిమాలో కథే హీరో. హీరో కోసం కథలో మార్పులు చేయలేదు. మొదట అనుకున్న కథతోనే ఈ సినిమాను తెరకెక్కించాను’ అని అర్జున్ అన్నారు. -
నా గర్భాశయాన్ని తీసివేయించాడు.. ఉదిత్ నారాయణ్పై రంజనా ఫిర్యాదు
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్పై మొదటి భార్య ఫిర్యాదు రంజనా ఝా చేసింది. ఈ క్రమంలోనే ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది.NDTVలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. బీహార్లోని సుపాల్లోని మహిళా పోలీస్ స్టేషన్లో తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. ఉదిత్ నారాయణ్తో పాటు ఆయన ఇద్దరు సోదరులు, రెండో భార్య కలిసి తనపై క్రిమినల్ కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొంది.ఉదిత్ నారాయణ్తో విడాకులు తీసుకున్న తర్వాత రంజనా ఝా పలుమార్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలసిందే. అయితే, తాజాగా ఆమె చేసిన ఆరోపణ అత్యంత హేయంగా ఉంది. ఆమె చేసిన ఫిర్యాదు ప్రకారం... 1996లో హెల్త్ చెకప్ పేరుతో తనను ఢిల్లీలో ఉన్న ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పింది. అయితే, తనకు తెలియకుండా గర్భాశయాన్ని తొలగించారని ఆమె ఆరోపించింది. తన అంగీకారం లేకుండా ఉదిత్ నారాయణ కుట్ర పన్నారని చెప్పింది. తాను తల్లి కాకుండా అడ్డుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, ఈ విషయం తనకు చాలా ఏళ్ల తర్వాత తెలిసిందని చెప్పింది. మరో అనారోగ్య సమస్యతో డాక్టరును సంప్రదించినప్పుడు అసలు విషయం బయటపడిందని పేర్కొంది. ఉదిత్ నారాయణ్ చేసిన ఈ మోసం తనను మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఎంతో కుంగదీసిందని పోలీసుల ముందే కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కుట్రలో ఉదిత్ నారాయణ్తో పాటు ఆయన ఇద్దరు సోదరులు, రెండో భార్య దీప కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొంది.ఉదిత్ వ్యక్తిగత విషయానికొస్తే.. 1985లో దీప అనే సింగర్ని రెండో పెళ్లి చేసుకుని ముంబైలో సెటిలైపోయాడు. వీళ్లకు ఆదిత్య నారాయణ్ అనే కొడుకు ఉన్నాడు. దీపని పెళ్లి చేసుకోవడానికి ముందే ఉదిత్.. తనని పెళ్లి చేసుకున్నాడని రాంజన అనే మహిళ బయటకొచ్చింది. 1984న హిందూ ఆచారాల ప్రకారం తనను మొదట పెళ్లి చేసుకున్నాడని రంజనా తెరపైకి వచ్చింది. అయితే తొలుత బుకాయించాడు గానీ ఆమె, కోర్టుని ఆశ్రయించడంతో ఒప్పుకొన్నాడు. అదే ఏడాది న్యాయబద్ధంగా ఉదిత్-రాంజన విడాకులు కూడా తీసుకున్నారు.విడాకులు తీసుకున్నప్పుడు భరణం కింద.. ఇల్లు, కొంత బంగారం, నెలకు రూ.15 వేల మొత్తాన్ని రాంజనకు ఇచ్చేలా బిహార్ మహిళా కమిషన్ ముందు ఉదిత్ ఒప్పుకొన్నాడు. కొంత కాలంగా భరణం కూడా చెల్లించడం లేదని రంజనా తెలుపుతుంది. -
హిస్టారికల్ ప్రదేశంలో 'జై హనుమాన్' మొదటి అడుగు
హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్' ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2024లో కాసుల వర్షం కురిపించింది. 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొని రూ. 300 కోట్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ సీక్వెల్ను తీసుకొస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విషయం తెలిసిందే.తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ (Hanu Man) సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్నదే ‘జై హనుమాన్’. ఈ మూవీ ఫిబ్రవరి 22న చారిత్రాత్మక పట్టణం హంపిలో పూజా కార్యక్రమంతో ప్రారంభించనున్నట్లు సమాచారం. సీక్వెల్ ‘హనుమాన్’కి మించి ఉంటుందని దర్శకుడు ప్రకటించడంతో భారీ బజ్ క్రియేట్ అయింది. ఆంజనేయస్వామి పాత్రను స్టార్ హీరో రిషభ్శెట్టి పోషిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసినట్లు సమాచారం. జై హనుమాన్ షూటింగ్ ఏప్రిల్ 2026లో ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ రెండు చిత్రాలూ ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగమే అని తెలిసిందే. -
రాజ్కుమార్ హిరాణి హిట్ సినిమా సీక్వెల్ రెడీ
బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్కుమార్ హిరాణి 3 ఇడియట్స్’ మూవీ సీక్వెల్ ప్రకటించాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయి అని తెలిపాడు. విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ చిత్రం 2009లో విడుదలై, బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో ఆమిర్ఖాన్ హీరోగా, ఆర్. మాధవన్ , శర్మన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ప్రధానపాత్రల్లో నటించారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో 3 ఇడియట్స్ సీక్వెల్ గురించి రాజ్కుమార్ హిరాణి ఇలా అన్నారు. 3 ఇడియట్స్ సీక్వెల్ కథ కోసం పనులు ప్రారంభించామన్నారు. స్టోరీ విషయంలో సరికొత్త ఆలోచన వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయితే, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆలోచన కూడా ఉంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టలేదంటూనే దాదాపు అంతా సిద్ధమైందన్నారు. ప్రధానపాత్రధారులు 15 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో ‘3 ఇడియట్స్’ సీక్వెల్ కథనం సాగుతుందని బాలీవుడ్ భోగట్టా. మరోవైపు మున్నాభాయ్ సీక్వెల్ కూడా కథ పూర్తి అయినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఓటీటీలో 'జీవా' హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
తమిళ నటుడు జీవా నటించిన తలైవర్ తంబి తలైమైయిల్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న కేవలం తమిళ్లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. కోలీవుడ్లో ఈ ఏడాది పొంగల్ సినిమాల్లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. దర్శకుడు నితీష్ సహదేవ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జీవాకు జోడీగా ప్రార్థన నటించింది. మలయాళంలో 'ఫెలిమి' అనే బ్లాక్బస్టర్ హిట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నితీష్.. తమిళంలో దర్శకత్వం వహించిన మొదటి సినిమా తలైవర్ తంబి తలైమైయిల్ (Thalaivar Thambi Thalaimaiyil) కావడం విశేషం.జీవా హిట్ సినిమా తలైవర్ తంబి తలైమైయిల్ (Thalaivar Thambi Thalaimaiyil) నెట్ఫ్లిక్స్(Netflix)లో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండానే విడుదల చేయడంతో ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. థియేటర్లో కేవలం తమిళ్ వర్షన్ మాత్రమే రిలీజ్ చేసిన మేకర్స్ ఓటీటీలో మాత్రం తెలుగు, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్కు తీసుకురావడం విశేషం. రూ. 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. -
Filmfare Awards 2026: ఫిల్మ్ఫేర్- 2026.. నామినేషన్స్లో ఉన్న సినిమాలివే..
దక్షిణాది చిత్రసీమలకు సంబంధించిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ -2026 ప్రకటన వచ్చేసింది. అవార్డ్ రేసులో ఉన్న నటీనటుల లిస్ట్తో పాటు చిత్రాలను కూడా ప్రకటించారు. కేరళ టూరిజం భాగస్వామ్యంతో ఫిబ్రవరి 21న ఈ వేడుకు జరగనుంది. దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమలకు చెందిన నటీనటులకు అవార్డ్స్తో గౌరవిస్తారు. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ -2026 (filmfare awards south 2026)లో పోటీ పడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది. సౌత్ చిత్ర పరిశ్రమల నుంచి అన్ని భాషలకు సంబంధించిన ఏయే చిత్రాలు పోటీపడుతున్నాయో నామినేషన్స్ను ప్రకటించారు. ఈసారి కేరళలో ఈ వేడుక జరగనుంది. 2024లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డ్స్ ఇస్తున్నారు.ఫిల్మ్ అవార్డ్స్-2026.. పోటీపడుతున్న నటీనటులు, సినిమాల లిస్ట్ ఇదే...ఉత్తమ చిత్రంహను-మాన్పుష్ప-2కల్కి 2898ADలక్కీ భాస్కర్35 చిన్న కథ కాదుకమిటీ కుర్రోళ్లుఉత్తమ దర్శకుడునాగ్ అశ్విన్ (కల్కి 2898AD)సుకుమార్ (పుష్ప-2)ప్రశాంత్ వర్మ (హను-మాన్)వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)యధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)ఉత్తమ నటుడుఅల్లు అర్జున్ (పుష్ప-2)దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)జూ. ఎన్టీఆర్ (దేవర)నాని (సరిపోదా శనివారం)సిద్దు జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్)తేజ సజ్జా (హనుమాన్)ఉత్తమ నటిఅనుపమ పరమేశ్వరణ్ (టిల్లు స్క్వేర్)అషికా రంగనాథ్ (నా సామిరంగా)మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)నివేథా తామస్ (35 చిన్న కథ కాదు)ప్రియాంక మోహన్ ( సరిపోదా శనివారం)రష్మిక మందన్న (పుష్ప-2)ఉత్తమ సహాయ నటుడుఅమితాబ్ బచ్చన్ (కల్కి 2898AD)ఫహద్ ఫాజిల్ (పుష్ప-2)సత్య ( మత్తు వదలరా-2)ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)వినయ్ రాయ్ (హనుమాన్)ధనజయ (జీబ్రా)ఉత్తమ సహాయ నటిఅంజలి (గ్యాంగ్ ఆఫ్ గోదావరి)ఫరియా అబ్దుల్లా ( మత్తు వదలరా-2)రాశి సింగ్ నందు ( ప్రసన్న వదనం)శరణ్య ప్రదీప్ ( అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)శ్రద్ధా శ్రీనాథ్ ( మేకానిక్ రాఖీ)వరలక్ష్మీ శరత్కుమార్ (హనుమాన్)ఉత్తమ సంగీత దర్శకుడుఅనిరుధ్ రవిచందర్ (దేవర)దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప-2)తమన్ (గుంటూరు కారం)జీవీ ప్రకాష్ కుమార్ ( లక్కీ భాస్కర్)చైతన్ భరద్వాజ్ (హరోం హర)జేక్స్ బెజోయ్ ( సరిపోదా శనివారం)గౌర హరి , అనుదీప్ దేవ్ , కృష్ణ సౌరభ్ (హనుమాన్)ఉత్తమ సాహిత్యంరామజోగయ్య శాస్త్రి ( చుట్టమల్లే- దేవర)రామజోగయ్య శాస్త్రి ( ధమ్ మసాల- గుంటూరు కారం)రామజోగయ్య శాస్త్రి ( కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం)కృష్ణ కాంత్ (ఆ రోజులు మళ్లీ రావు- కమిటీ కుర్రోళ్లు)శ్రీమణి (శ్రీమతి గారు- లక్కీ భాస్కర్)ఉత్తమ సింగర్అనిరుధ్ రవిచందర్ (ఫీయర్ సాంగ్- దేవర)అనురాగ్ కులకర్ణి (సుట్టంలా సూసి - గ్యాంగ్ ఆఫ్ గోదావరి)అర్జిత్ సింగ్ (అణువణువు- ఓం భీమ్ బుష్)గౌర హరి (పూలమ్మే పిల్ల- హనుమాన్)రామ్ మిరియాల (సుఫియాన- ఆయ్)సంజీత్ హెగ్డే (ధమ్ మసాల- గుంటూరు కారం)శ్రీ కృష్ణ ( కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం)ఉత్తమ సింగర్- ఫీమేల్శిల్పి రావ్ (చుట్టమల్లే- దేవర)మంగ్లీ (గుల్లెడు గుల్లెడు గులాబీలు- మెకానిక్ రాఖీ)శ్రెయా ఘోషల్ (సూసేకి- పుష్ప-2)ఉషా ఊతప్ (లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్) -
ఇప్పటికీ నెరవేరని కోరిక ఒకటి ఉంది: శ్రియ
సినిమాను ప్రేమిస్తే అది కచ్చితంగా ఉన్నత స్థాయిలో కుర్చోపెడుతుంది. ఇందుకు పలువురు ఉదాహరణ. ప్రతిభ, అంతకు మించిన ప్రేమ ఉంటే సినిమా ఎవరినైనా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చాలా మంది నిరూపించారు. అలాంటి వారిలో నటి శ్రియ ఒకరు అని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్లో పుట్టి, పెరిగిన ఈ బ్యూటీ 2001లో ఇష్టం అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తరువాత హిందీ, తమిళం , కన్నడం తదితర భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికగా ఎదిగారు. తమిళంలో విజయ్, రజనీకాంత్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో , తెలుగులో చిరంజీవి, నాగార్జున వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టి క్రేజీ హీరోయిన్గా ఎదిగారు. ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లోనే ఈమె నటించారన్నది గమనార్హం. ఏదేమైనా గత 25 ఏళ్లుగా నాట్ అవుట్గా కొనసాగుతున్న శ్రియ కొంత కాలం క్రితం పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ నటనకు దూరం కాలేదు. ప్రస్తుతం కథానాయకి పాత్రలు కాకపోయినా నటనకు అవకాశం ఉన్న అక్క,అమ్మ వంటి పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో దశ్యం 3 చిత్రంలో నటిస్తున్నారు. కాగా నటి శ్రియ మంచి నృత్య కళాకారిణి అన్నది గమనార్హం. ఇటీవల ఈ భామ ఓ భేటీలో పేర్కొంటూ చాలా భాషల్లో చాలా చిత్రాల్లో నటించానని, అయితే తాను మొదట ప్రేమించేది నాట్యాన్ని అని చెప్పారు. ఇంత వరకు నటించని, నటించాలని ఆశపడే పాత్ర ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉందన్నారు. తనకు నాట్య కళాకారిణి పాత్రలో నటించాలనే కోరిక చాలా ఏళ్లుగా ఉండిపోయిందన్నారు. ఒక నాట్యకళాకారిణిగా జీవిత పయనాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నట్లు శ్రియ పేర్కొన్నారు. తన కెరీర్ మొత్తంలో ఎవరూ కూడా అలాంటి పాత్ర తమ సినిమాలో ఉందని తనను కలవలేదని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భామ కోరిక నెరవేరే అవకాశం ఏ మేరకు ఉంటుందో చూడాలి. -
త్రీడీలో చూసి షాక్ అయ్యాను
‘‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా విజయం తర్వాత అంతకంటే అద్భుతమైన ప్రాజెక్ట్తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ చిత్రం చూసిన తర్వాత నిఖిల్ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా సంతోషపడతారు’’ అని నిఖిల్ చె΄్పారు. నిఖిల్ హీరోగా, సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో త్వరలో రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో నిఖిల్ మాట్లాడుతూ– ‘‘వెయ్యేళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రాంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవారు. అల్లరిగా తిరిగే అండర్ డాగ్ రాజ్యాలను శాసించే స్థాయికి ఆయన ఎలా ఎదిగారు? అనేది మా సినిమాలో చూపించాం. ఈ మూవీని త్రీడీలో చూసినప్పుడు షాక్ అయ్యాను. ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని చె΄్పారు. భరత్ కృష్ణమాచారి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా అందరికీ గొప్ప అనుభూతినిస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో భాగం కావడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు కెమెరామేన్ సెంథిల్ కుమార్. -
నేను ఊరుకోను.. మెగా కోడలు స్ట్రాంగ్ వార్నింగ్
మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. తమ కుటుంబంపై వచ్చిన ట్రోల్స్పై మరోసారి స్పందించింది. కొన్నిరోజుల క్రితం రామ్ చరణ్-ఉపాసన దంపతులతు కవలలు పుట్టిన సందర్భంగా కొందరు.. మెగాస్టార్ చిరంజీవిపై దారుణమైన విమర్శలు చేశారు. అప్పుడే సదరు నెటిజన్కి ఇచ్చిపడేసిన లావణ్య.. ఇప్పుడు ఆ సందర్భం గురించి మరోసారి మాట్లాడింది.'రామ్ చరణ్కి ట్విన్స్ పుట్టిన ఆనందంలో మేం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ సమయంలో అలాంటి ట్వీట్ వేయడం పూర్తిగా తప్పు. మా కుటుంబానికి ఏమైనా అంటే నేను ఊరుకోను' అని లావణ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈమె ప్రధాన పాత్ర చేసిన 'సతీ లీలావతి' వచ్చే నెల 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్ర ఈవెంట్ సందర్భంగానే మెగా ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించింది.గతంలో చిరంజీవి, ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ కుటుంబంలో అందరూ ఆడపిల్లలే ఉన్నారని, మెగా లెగసీని కొనసాగించే మగబిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. అయితే చిరు.. ఆడపిల్లల్ని చిన్నచూపు చూస్తున్నారని చెప్పి.. చరణ్కి కవలలు పుట్టిన సందర్భంగా ట్రోల్స్ వచ్చాయి. దీనిపై ఆ రోజు స్పందించిన లావణ్య.. చిరంజీవి తన కుటుంబంలోని మహిళల్ని, ముఖ్యంగా తన మనవరాళ్లని ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో ఈ విమర్శలు చేసేవారికి అస్సలు అవగాహన లేదు. ఆయన చేసే పనుల్లో 1 శాతం కూడా చేయలేని వాళ్లు.. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడటం సరికాదు అని అప్పుడు కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు మాట్లాడుతూ.. ఫ్యామీలీ జోలికొస్తే ఊరుకోనని చెప్పుకొచ్చింది.If anyone says anything about my family, I won’t tolerate it. That’s why I reacted.- #LavanyaTripathi | #Megafamily pic.twitter.com/Rupc5BxdVD— Filmyscoops (@Filmyscoopss) February 11, 2026 -
డబుల్ థమాకా.. గతంలో బాలయ్య, నాని.. ఇప్పుడు శ్రీవిష్ణు
గతంలో ఒకసారి నందమూరి బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ , బంగారు బుల్లోడు చిత్రాలకు.. మరోసారి హీరో నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం, జండాపై కపిరాజు చిత్రాలకు ఇలాంటి సమస్యనే ఎదురైంది. తమ సినిమాల విడుదల విషయం తమ చేతిలో లేకపోవడం. ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితి రావడం. ఇప్పుడు శ్రీవిష్ణుకి కూడా అదే పరిస్థితి ఎదురైంది. టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ఈ నెల చివర్లో ఓ ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. తను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. బాలయ్య రెండు చిత్రాలు ఒకేరోజు (1993 సెప్టెంబర్ 3) విడులైయ్యాయి. అలాగే నాని నటించిన రెండు చిత్రాలు 2015 మార్చి 21న విడుదలయ్యాయి.అయితే ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ్ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ తీసుకుంది. కానీ స్లాట్ ఈ నెలలోనే ఇచ్చింది. అయితే అదే శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమాను మరో ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. ఆ సంస్థ కూడా ఇదే నెలకు డేట్ ఇచ్చింది. ఈ విషయంపై చర్చలు జరిగాయి కానీ నో యూజ్. ఇద్దరూ ఒకే తేదీపై పట్టుబడటంతో నిర్మాతలు, హీరో శ్రీవిష్ణు కూడా ఏం చేయలేని పరిస్థితి. రెండు సినిమాలు తనవే కావడంతో, రెండింటినీ సమానంగా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత శ్రీవిష్ణుపై పడింది. ఇప్పటికే మృత్యుంజయ్ టీజర్ విడుదలైంది. మరో రెండు రోజుల్లో విష్ణు విన్యాసం టీజర్ కూడా రానుంది. ఆ వారం ఈ రెండు సినిమాలు తప్ప మరే పెద్ద రిలీజ్ లేకపోవడం శ్రీవిష్ణు అదృష్టమే. రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్ల ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. అయితే ఏదో ఒకటి ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ కంటెంట్ బలంగా ఉంటే మాత్రం రెండూ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి శ్రీవిష్ణుకు ఒకవైపు ఎంబ్రాసింగ్, మరోవైపు ఎక్సైటింగ్ కూడా. ఎందుకంటే ఒకేసారి రెండు సినిమాలు తనవే అని చెప్పుకోవడం అరుదైన విషయం. చూడాలి మరి చివరికి ఏమౌతుందో. విష్ణు విన్యాసం టీజర్ రిలీజైతే ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
యూఫోరియా మూవీకి మహేశ్ బాబు రివ్యూ.. ఏమన్నారంటే?
టాలీవుడ్ మూవీ యూఫోరియాపై ప్రిన్స్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఇది తప్పక చూడాల్సిన సినిమా అని అన్నారు. గుణశేఖర్ తన కథలను ఎలా ప్రజెంట్ చేస్తారనే దానిలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన నమూనా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉందని.. సినిమా బాగా నచ్చిందని మహేశ్ ట్వీట్ చేశారు. గుణశేఖర్, భూమికతో పాటు మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ సినిమాను గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో భూమిక ప్రధాన పాత్రలో నటించగా.. సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. There’s always a distinct pattern in how Gunasekhar garu presents his stories…Enjoyed the film especially the way the climax unfolds…👏🏻👏🏻👏🏻A must watch! Congratulations to Guna Sekhar garu, @bhumikachawlat and the entire team of #Euphoria 🤗🤗🤗@neelima_guna #YukthaGuna…— Mahesh Babu (@urstrulyMahesh) February 11, 2026 -
శారీలో మెరిసిపోతున్న పాయల్ రాజ్పుత్.. జ్యోతి పూర్వాజ్ హాట్ లుక్స్..!
శారీలో మెరిసిపోతున్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్..ఎనిమిది వసంతాలు హీరోయిన్ అనంతిక లేటేస్ట్ పిక్స్..టాలీవుడ్ హీరోయిన్ లయ స్మైలీ లుక్స్..పింక్ శారీలో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా అందాలు..బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్ పోజులు.. View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
శ్రీ విష్ణు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని టీజర్లో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు. -
ఇన్నాళ్లు అక్కడే నలిగిన జ్ఞాపకం.. ఇంతకాలానికి!
నటి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ రెండోసారి తల్లి కాబోతోంది. గతేడాది ఆగస్టులో తను రెండోసారి గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఆమె తన బేబీ షవర్ ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో భర్త, కుమారుడితో కలిసి దిగిన పిక్స్ జత చేసింది. వీటిలో పూర్ణ లైట్ పింక్ కలర్ గౌన్లో అందంగా ముస్తాబైంది.గర్వంగా ఉందిఅయితే ఈ డ్రెస్ వెనక ఓ స్టోరీ ఉందని చెప్పింది. అతడు (పూర్ణ భర్త) నాకు తొలిసారి ఐ లవ్యూ చెప్పినరోజు ఈ గౌన్ గిఫ్ట్ ఇచ్చాడు. ఏళ్ల తరబడి ఈ డ్రెస్ కప్బోర్డులో అలాగే నలిగిపోతూ ఉంది. ఒక మంచిరోజుకోసం ఇన్నేళ్లుగా ఎదురు చూస్తోంది. ఇంతకాలానికి ఆ మంచి రోజు రానే వచ్చింది. మాతృత్వాన్ని సెలబ్రేట్ చేసుకునేరోజు దాన్ని ధరించాను. నా భర్త ఈ సెలబ్రేషన్స్ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుతంగా మలిచాడు. నా మనసు సంతోషం, ప్రేమతో ఉప్పొంగిపోతోంది. అలాగే నా డ్యాన్స్ స్కూల్లో పిల్లలు ఒక్కో స్టెప్పు వేస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది.సినిమామలయాళ నటి పూర్ణ తెలుగులో.. శ్రీ మహాలక్ష్మి, సీమ టపాకాయ్, అవును, నువ్వలా నేనిలా, రాజుగారి గది, మామ మంచు అల్లుడు కంచు, సుందరి, అఖండ 2 వంటి పలు సినిమాలు చేసింది. గుంటూరు కారం మూవీలో కుర్చీ మడతపెట్టి పాటలో కనిపిస్తుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. 2022లో వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడింది. ఆ మరుసటి ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) చదవండి: ఆ సంతోషం, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను: చిరంజీవి -
సఖి, ఏ మాయే చేశావే తరహాలో ‘నిలవే’ : సింగర్ సునీత
ఈ మధ్య చాలా తక్కువ సినిమాల్లో చక్కటి భావోద్వేగాలు చూస్తుంటాం. అలా అన్నీ ఎమోషన్స్ చూపించేలా ఉన్న చిత్రమే ’నిలవే‘. అద్భుతమైన ఫొటోగ్రఫీ, దర్శకత్వం, తగిన నటీనటులు ఉన్న సినిమా ఇది. క్లాసికల్ మూవీస్ సఖి, ఏ మాయే చేశావే తరహాలో మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందని భావిస్తున్నా’ అన్నారు సింగర్ సునీత. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా పరిచయం అవుతుంది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. ఫిబ్రవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో బుధవారం చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో సింగర్ సునీత మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను. అర్థవంతమైన సినిమా ఇది. ఇందులోని పాటలు బాగున్నాయని ఓసారి కీరవాణిగారిని వినమంటే ఆయన విని తనవంతు సపోర్ట్ ఇస్తానని ప్రమోషన్ చేయడం కూడా సినిమా పై పాజిటివ్ నెలకొంది. ఈ సందర్భంగా అందరికీ మరోసారి విషెస్ చెబుతున్నానని అన్నారు.హీరో సౌమిత్ పోలాడి మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచీ నటుడు కావాలనే కోరిక ఉండేది. అందుకు నాకు స్పూర్తి మెగాస్టార్ చిరంజీవిగారే. ఫిబ్రవరి 13న నా తొలి సినిమా విడుదలకాబోతుంది. నిన్న ప్రీమియర్ వేశాం. అందరూ చాలా బాగుందని అభినందించారు. రేపు ప్రేక్షకులు కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. యాక్షన్ మూవీస్ లో కె.జి.ఎఫ్. ఎలా ఉందో లవ్ స్టోరీస్ లో కే జీ ఎఫ్ - నిలవే’ అన్నారు.హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీ. లో అతి పెద్దదైన తెలుగు ఇండస్ట్రీలో నాయికగా నటించినందుకు ఆనందంగా వుంది. ఈ సినిమా నేను అంగీకరించడానికి సంగీతమే ప్రధాన కారణం. డైలగ్స్ కూడా ఫీల్ కలిగేలా వున్నాయి. జంజీ జనరేషన్ కు చెందిన మా జనరేషన్ సినిమా ఇది. ఈ సినిమా చూశాక ప్రేమ మీద మంచి అభిప్రాయానికి వస్తారని నమ్ముతున్నాను. ఇంత మంచి సినిమా చేసిన టీమ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. ‘నాని గారు కోర్ట్ సినిమా తీశాక చూడండి నచ్చకపోతే నా తదుపరి సినిమా చూడకండి అంటూ బెట్ కూడా వేశారు. కానీ మా దగ్గర అలాంటి బెట్ లు లేవు. మా దగ్గర మంచి సినిమా ఉంది. దాన్ని మీరు చూసి ఆశీర్వదించండి. ఇందులో అందరూ కొత్తవారు కావచ్చు. అందరి కృషితో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’ అని దర్శకుడు సా కే వెన్నం అన్నారు. -
ఆ సంతోషం, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను: చిరంజీవి
ఎంతటి దూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్క అడుగు పడిందంటే ఎంతో కొంత విజయం లభించినట్లే! అలా తన సినీ ప్రస్థానానికి పునాది వేసిన తొలి సినిమాను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. 1979లో వచ్చిన పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి నటప్రస్థానం మొదలైంది. తొలి మెట్టుకే విజయాన్ని అందుకుని గుండె నిండా ధైర్యంతో ముందడుగు వేశారు. తనను తాను చెక్కుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. చందమామ కథలాంటి అనుభూతితాజాగా ఆయన పునాదిరాళ్లు సెట్లో అడుగుపెట్టిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆతృత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. నట జీవితానికి పునాది రాళ్లుఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు" అని ట్వీట్ చేశారు. తన ఫస్ట్ మూవీ చిత్రీకరణ సమయంలో దిగిన ఫోటోలను ఈ పోస్ట్కు జత చేశారు. ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు.ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి.ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు… pic.twitter.com/Rsc6UYmgiK— Chiranjeevi Konidela (@KChiruTweets) February 11, 2026 చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేశా: హీరో నిఖిల్ -
ఐశ్వర్య అర్జున్కు బ్రహ్మనందం బర్త్ డే గిఫ్ట్.. అదేంటంటే?
హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ సీతా పయనం. ఈ మూవీకి అర్జున్ సర్జానే దర్శకత్వం వహించారు. ఇందులో అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కెమియో రోల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్యకు బ్రహ్మనందం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఫిబ్రవరి 10న ఐశ్వర్య బర్త్ డే కావడంతో తానే స్వయంగా గీసిన శ్రీరాముడు, హనుమాన్ పెయింటింగ్ కానుకగా అందజేశారు. ఐశ్వర్య తన కూతురు లాంటిదని బ్రహ్మనందం అన్నారు.కాగా.. సీతా పయనం మూవీని శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై రూపొందించారు. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ, అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. #Brahmanandam garu presented his hand drawn picture of Hanuman & Sri Rama To #AishwaryaArjun#SeethaPayanam pic.twitter.com/5ThsSWFfni— cinee worldd (@Cinee_Worldd) February 10, 2026 -
ఇదే నా జీవితంలో పెద్ద అద్భుతం: శివజ్యోతి ఎమోషనల్
యాంకర్, బిగ్బాస్ ఫేమ్ శివజ్యోతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టినా, మంచి జరిగినా, చెడు జరిగినా అన్ని అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమెకు తొమ్మిది నెలలు నిండాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.థాంక్యూనా చిన్న పాప లేదా బాబుకు ఈ పోస్ట్ అంకితం.. ఈ తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీ ఇంత ఆనందంగా, అందంగా, అద్భుతంగా సాగనిచ్చినందుకు థాంక్యూ.. ఒక్కరోజు లేదా ఒక్కసారి కూడా నువ్వెప్పుడూ నన్ను టెన్షన్ పెట్టలేదు. కొన్నిసార్లు అసౌకర్యానికి లోనయినప్పటికీ అది ఈ జర్నీలో భాగమే.. దాన్ని కూడా నేను ఆస్వాదించాను. మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు నేను, నాన్నా నీకెప్పుడూ రుణపడి ఉంటాం. సేఫ్ డెలివరీనువ్వు మంచి బిడ్డగా ఉంటావని తెలుసు. నువ్వు మా జీవితాల్లోకి వస్తుండటమే అతి పెద్ద ఆశీర్వాదం, అలాగే అద్భుతం కూడా! నిన్ను ఎప్పుడెప్పుడు పొత్తిళ్లలోకి తీసుకోవాలా? అని ఎదురుచూస్తున్నాను. ఈ 9 నెలల జర్నీలాగే డెలివరీ కూడా సేఫ్గా అవుతుందని ఆశిస్తున్నాను. ఇట్లు నీ అమ్మా, నాన్నా అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు తప్పకుండా అంతా మంచే జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) చదవండి: నాకు జరిగినట్లుగా నా కూతురికి జరగనివ్వను: రణ్బీర్ కపూర్ -
అర్జున్ సర్జాకు గిఫ్ట్ ఇచ్చిన ట్యాంక్ బండ్ శివ.. వీడియో వైరల్
హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటేస్ట్ మూవీ సీతా పయనం. ఈ మూవీకి అర్జున్ దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీని శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ, అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు అర్జున్, ఆయన కూతురు ఐశ్వర్య. తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్యనటుడు బ్రహ్మనందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్లో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ట్యాంక్ బండ్ శివను ఘనంగా సత్కరించారు.ఈవెంట్కు హాజరైన ట్యాంక్ బండ్ శివ.. వేదికపై ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తన భార్య వల్లే జీవితానికి అర్థం తెలిసొచ్చిందని అన్నారు. ఒక దొంగలా కాకుండా దొరలా బ్రతకాలని తన దగ్గరే నేర్చుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా అర్జున్ సర్జాకు ఓ అరుదైన బహుమతి ఇచ్చారు. ఆయన సినిమాల్లోని ఫోటోలతో ఓ ఫ్రేమ్ను అర్జున్కు బహుకరించారు ట్యాంక్ బండ్ శివ దంపతులు. దీంతో అర్జున్ సర్జా ఆనందం వ్యక్తం చేశారు. సమాజం కోసం నిస్వార్థ సేవ చేస్తున్న ట్యాంక్ బండ్ శివకు లక్ష రూపాయల చెక్ను అర్జున్ సర్జా అందజేశారు."నా భార్య శాంతే నా జీవిత ప్రయాణానికి అర్థం.. ఒక దొంగలా కాకుండా దొరలా బ్రతకాలని తన దగ్గరే నేర్చుకున్నా.."-నిష్కల్మషమైన తన స్పీచ్ తో సభికుల మనసులను గెలుచుకున్న ట్యాంక్ బండ్ శివ..#SeethaPayanam pic.twitter.com/VJvjFyXpYN— Mega Abhimani (@megaabhimani3) February 10, 2026 -
‘సన్ ఆఫ్’లో మంచి కంటెంట్ ఉంది.. పెద్ద హిట్ అవ్వాలి: కోన వెంకట్
బత్తుల సతీష్ దర్శకత్వంలో సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాట్రైలర్, పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్బంగా నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్లో ప్రముఖ రైటర్, నిర్మాత కోన వెంకట్, సముద్ర, వి.ఎన్ ఆదిత్య, రామ సత్య నారాయణ రాజు, తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన ఈవెంట్లో.. ప్రముఖ రైటర్, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘సినిమాలోని నటీనటులు, టెక్నికల్ టీంను బట్టి ఆ మూవీ మీద ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఈ మూవీకి కాస్ట్ అండ్ క్రూ బాగా సెట్ అయింది. సాయి ఈ మూవీ కోసం హీరో అయి నిర్మాత అయ్యాడా?.. నిర్మాత అయ్యాక హీరోగా మారాడా? తెలీదు. కానీ ఈ సినిమాలో మాత్రం మంచి కంటెంట్ ఉంది. ప్రతీ శుక్రవారం పదుల సంఖ్యలో చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు హిట్ అయితే ఇంకా చాలా మంది కొత్త వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వస్తారు. ‘సన్ ఆఫ్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.హీరో, నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ .. ‘నేను ఎన్నో కథల్ని విన్నాను. సతీష్ బత్తుల చెప్పిన ‘సన్ ఆఫ్’ కథ నాకు చాలా నచ్చింది. యాక్టింగ్ పట్ల శిక్షణ తీసుకున్నాను. ఈ సినిమాకి నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ప్రతీ ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. ‘సన్ ఆఫ్’ ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతోంది. ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులతో కలిసి ఈ మూవీని చూడండి. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కన్నీరు కార్చకుండా మాత్రం థియేటర్ నుంచి బయటకు వెళ్లలేరు’ అని అన్నారు. -
యాక్టర్ కమ్ డాక్టర్.. వైద్య పట్టా అందుకున్న శ్రీలీల
ప్రముఖ తెలుగు నటి శ్రీలీల తన వైద్య విద్యను పూర్తి చేశారు. ఎంబీబీఎస్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసుకుని తాజాగా డాక్టర్గా అర్హత సాధించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె తన చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. తల్లి గైనకాలజిస్ట్గా ఉండటం వల్ల చిన్నప్పటి నుంచే వైద్య రంగంపై ఆసక్తి కలిగిన శ్రీలీల, సినిమా షూటింగ్ల మధ్యలోనూ చదువుపై దృష్టి పెట్టి ఈ గొప్ప విజయాన్ని సాధించింది. 2023లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ను పూర్తి చేసుకొని.. తాజాగా కాన్వోకేషన్ వేడుకలో డిగ్రీ పట్టాను అందుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. #SreeLeela has officially graduated, completing her medical degree ❤️Acting + academics - win win! pic.twitter.com/sisosEPRTZ— Siddarth Srinivas (@sidhuwrites) February 11, 2026‘డాక్టర్’ శ్రీలీల వెనుక పెద్ద కథే ఉందిశ్రీలీల వైద్య విద్యను అభ్యసించడానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. అమ్మమ్మ విషయంలో జరిగిన ఓ సంఘటననే తనను మెడిసిన్ చదివేలా చేసిందని చెప్పారు. ‘నేను డాక్టర్ అవ్వాలని నిర్ణయం తీసుకోవడానికి వెనక ఓ స్టోరీ ఉంది. మా ఇంట్లో అమ్మతో పాటు అన్నయ్య కూడా డాక్టరే. ఓ సారి నేను అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లాను. అది మారుమూల గ్రామం. ఓ రోజు అమ్మమ్మ సడెన్గా కిందపడిపోయింది. ఏం చేయాలో తెలియదు. అందరితో పాటు నేను కూడా అక్కడే నిల్చోని చూస్తున్నా. కానీ అన్నయ్య వెంటనే వచ్చి అమ్మమ్మను పైకిఎత్తి వీపు భాగాన్ని పుష్ చేశాడు.దీంతో అమ్మమ్మ ప్రమాదం నుంచి బయటపడింది. అన్నయ్య మెడిసిన్ చదవుతున్నాడు కాబట్టి.. ఆ సమయంలో ఏం చేయాలో అది చేశాడు. కానీ నాకు సహాయం చేయాలని అనిపించినప్పటికీ ఎలా చేయాలో తెలియదు. ఆ రోజే ఫిక్సయ్యా.. నేను ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని. అందుకే మెడిసిన్ కోర్సు తీసుకున్నాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. Actress #SreeLeela has officially graduated and completed her medical degree ❤️Balancing academics and cinema at such a young age 👏🏻👏🏻 pic.twitter.com/hGrMKv7iir— Ayyappan (@Ayyappan_1504) February 11, 2026 -
'అప్పుడు నాకు రెండు నెలలే'.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఎమోషనల్ వీడియో
టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్బస్టర్ మూవీ మనసంతా నువ్వే. ఈ ప్రేమకథా చిత్రం మరోసారి ఆడియన్స్ను అలరించేందుకు వస్తోంది. ఈ ఏడాది వాలైంటెన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో రీమా సేన్, తనూ రాయ్ హీరోయిన్లుగా నటించారు. 2001లో విడుదలైన ఈ సినిమాకు వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ నెల 14న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి, రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి ఓ వీడియోను రిలీజ్ చేసింది. నేను ఉదయ్ కిరణ్ మేనకోడలు అని.. ఈ సినిమా రిలీజైనప్పుడు నాకు రెండు నెలల వయస్సు ఉంటుందని తెలిపింది. ఈ ఫిబ్రవరి 14 మీకు చాలా స్పెషల్గా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది. మనసంతా నువ్వే మిమ్మల్ని మరోసారి థియేటర్లలో అలరించనుందని పేర్కొంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత వస్తోన్న ఈ సినిమాను మీ అందరితో కలిసి చూడడానికి చాలా ఆసక్తిగా ఉందంటూ మహతి వీడియోలో మాట్లాడింది. ఉదయ్కిరణ్ మేనల్లుడు తేజ కూడా..‘అంతకుముందే ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ కూడా మాట్లాడారు. 'మా మామయ్య నటించిన ఈ చిత్రం 25ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా మామయ్య పట్ల ఇంత ప్రేమ, ఆదరణ ఉటుందని నేను ఊహించలేదు. మనసంతా నువ్వే మ్యాజిక్ను మళ్లీ చూసేందుకు ఫిబ్రవరి 14న థియేటర్స్కు వెళ్లండి. ఈ మూవీ విడుదల సమయంలో నా వయసు 7ఏళ్లు మాత్రమే.. నేను కూడా థియేటర్కు వెళ్లి మూవీ చూస్తాను. కుటుంబం మొత్తం కలిసిచూడాల్సిన సినిమా అని చెబుతాను.' అంటూ తేజ ఒక వీడియో విడుదల చేశారు.#UdayKiran మేనకోడలు #Mahathi వీడియో బైట్లో సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ❤️#ManasanthaNuvve4K రీ రిలీజ్ థియేటర్స్లో ఫిబ్రవరి 14న 🎬🍿#ManasanthaNuvve pic.twitter.com/4PydDi1T4K— Gautam Yarramsetty (@mrgyvcofficial) February 11, 2026 -
ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ మూవీ చేశా.. హీరో నిఖిల్
'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం అందుకున్న హీరో నిఖిల్ మరో భారీ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'స్వయంభు'. బుధవారం (ఫిబ్రవరి 11న) ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. హ్యాపీ డేస్ వచ్చి 19 ఏళ్లవుతోంది. ఇది నా 22వ సినిమా.ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశా..ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అన్ని సమయాల్లో మీరంతా తోడున్నారు. గత రెండేళ్లుగా నేను కనిపించలేదు. కార్తికేయ 2 తర్వాత మంచి సినిమాతో మీ ముందుకు రావాలనుకున్నాను. ఒళ్లు దగ్గర పెట్టుకుని, భయపడుతూ, జాగ్రత్తగా చేసిన సినిమా స్వయంభు. నిఖిల్ మావాడు అని గర్వంగా చెప్పుకునేలా ఈ మూవీ ఉంటుంది. ఎంతోమంది పోరాట యోధుల వల్లే మన దేశం ఈరోజు ఇలా ఉంది. కొన్నిసార్లు వారి గురించి మన పుస్తకాల్లో కూడా ఉండదు. వెయ్యేండ్ల కిందట జరిగిన కథ ఇది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం అని చెప్పుకొచ్చాడు.సినిమాస్వయంభు విషయానికి వస్తే.. నిఖిల్ హీరోగా నటించగా, నభా నటేశ్, సంయుక్త, సునీల్ సుబ్బరాజు, సత్య కీలక పాత్రలు పోషించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించగా భువన్, శ్రీకర్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రం సమ్మర్లో రిలీజ్ కానుంది.చదవండి: స్వయంభు టీజర్ రిలీజ్ -
అతను నా నెంబర్ కోసం రూ.20 వేలు ఖర్చు చేశాడు: సురేఖ వాణి కూతురు
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. ఆమె ఇన్స్టాలో ఏదైనా పోస్ట్ పెడితే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఆమె అందాన్ని పొగుడుతూ పలువురు నెటిజన్లు కామెంట్ కూడా చేస్తుంటారు. మరికొంతమంది అయితే సోషల్ మీడియా వేదికగా ఆమెకు ప్రపోజ్ కూడా చేస్తుంటారు. అలా తనకు వెరైటీగా వచ్చిన ఒక ప్రపోజల్ గురించి మీడియాతో పంచుకుంటి అందాల తార సుప్రీత. ఆమె హీరోయిన్గా నటించిన ‘అమరావతికి ఆహ్వానం’ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకొచ్చిన ఓ వెరైటీ ప్రపోజల్ గురించి చెప్పుకొచ్చింది.‘నాకు రెగ్యులర్గా ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. అయితే వాటిని నేను లైట్ తీసుకుంటా. కొన్ని మెసేజ్లు చూసి నవ్వుకుంటాను. ఈ మధ్య ఒకతను నా మొబైల్ నెంబర్ కోసం రూ. 20 వేలు ఖర్చు చేశాడట. నా నెంబర్ కనుకొన్ని ఆయన మెసేజ్ చేశాడు. ‘మీ నెంబర్ కోసమే నేను రూ. 20 వేలు ఖర్చు చేశాను. మీరంటే నాకు చాలా ఇష్టం. పిచ్చి. నన్ను పెళ్లి చేసుకో.. చాలా బాగా చూసుకుంటాను. మీ నెంబర్ కోసమే అంత డబ్బు ఖర్చు చేశానంటే.. నిన్ను ఎలా చూసుకుంటానే అర్థం చేసుకో’ అని స్మార్ట్గా ప్రపోజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసి నవ్వుకొని అతన్ని బ్లాక్ చేశా’ అని సుప్రీత చెప్పుకొచ్చింది.ఇక తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెబుతూ.. ‘నన్ను భరించేవాడు దొరికితే చాలు. ఎప్పుడూ నా పక్కనే ఉండాలి. అలా అని ఖాలీగా ఉండకూడదు. ఏదో ఒక బిజినెస్ చేస్తూ..ఫ్రీ టైం మొత్తం నాతోనే గడపాలి. కలిసి బయటకు వెళ్లాలి. నేనే ఎక్కువ కేరింగ్ చేస్తా. నేను వండి పెట్టింది తింటూ నాతో ఉంటే చాలు’ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. -
'స్వయంభు' పవర్ఫుల్ టీజర్ చూశారా?
నిఖిల్ హీరోగా సంయుక్త, నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ ‘స్వయంభు’.. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదల చేశారు. పోరాట యోధుడిగా నిఖిల్ దుమ్మురేపాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ మూవీని ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. పవర్ఫుల్ పాన్ ఇండియా విజన్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
పావలా విలువ లేని ట్రోల్స్.. 'అల్లు అర్జున్'పై విమర్శల దాడి
అల్లు అర్జున్.. తన కెరీర్ ప్రారంభం నుంచే వందల ట్రోల్స్ను దాటుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. గంగోత్రి సినిమా నాటికి తన వయసు 20 ఏళ్లు. హీరో లక్షణాలే లేవని నానా రకాలుగా విమర్శించారు. ట్రోలింగ్ అంటే ఏంటో కూడా తెలియని టైమ్లోనే తట్టుకుని నిలబడ్డాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా సరే తనలోంచి తన్నుకొచ్చే ఆత్మవిశ్వాసాన్ని కళ్లల్లోనూ, నవ్వులోనూ, ముఖంలోనూ చూపుతూ తనను తాను మేకోవర్ చేసుకున్నాడు. అలా తెలుగు చిత్రసీమ సగర్వంగా భావించే నటుడిగా అల్లు అర్జున్ ఎదిగాడు. తొలి తెలుగు జాతీయ ఉత్తమ నటుడిగా కీర్తికెక్కాడు. అయినప్పటికీ తనపై తీవ్రమైన ట్రోలింగ్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. పావలా విలువ కూడా చేయని వాళ్లే సోషల్మీడియాలో ట్రోలింగ్కు దిగుతారని తెలిసిందే.3వేల మంది ఫాలోవర్స్ఈ క్రమంలో తాజాగా కావేరీ బారువా అనే బ్రాండింగ్ వ్యూహకర్త చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్తో ప్రకటనల్ని చిత్రీకరించేటప్పుడు 42 రకాల నిబంధనల్ని పాటించాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ఒక వ్యూహకర్తగా తన వృత్తికి పనికొచ్చేలా ఉన్నాయి. తనను తాను వైరల్ చేసుకునేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. సోషల్మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోవర్స్ కేవలం 3వేలు మాత్రమే.. దీంతో తను ఒక వ్యూహకర్త కాబట్టి ఇలాగైనా తను పాపులర్ కావచ్చని పక్కా ప్లాన్తోనే బన్నీపై పేలవమైన విమర్శలు చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు.ఆధారాలు లేకుండానే..ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా అల్లు అర్జున్పై చేసిన విమర్శలు చాలా అభ్యంతరకంగా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. వారి ఒత్తిడితో ఆ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూను యూట్యూబ్లో తొలగించారు. అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు ఉంటాయని ఆమె చెప్పింది. కానీ, అవేంటి అనేది చెప్పలేదు. తనకు ఎవరో చెప్పారు అంటుంది. పైగా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర బంధువులు అంటుంది. అసలు బన్నీ ఎవరు.. ఆయన బంధువులు ఎవరు అనేది కూడా తెలియకుండా ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటి అంటూ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. సంధ్య థియేటర్ గొడవ, ఎయిర్పోర్ట్లో మాస్క్ తీయాలంటూ వీడియో వైరల్, ఇప్పుడు స్ట్రాటజిస్ట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా కొందరు అల్లు అర్జున్కు వ్యతిరేఖంగా నడుపుతున్న యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్బన్నీపై ఆమె చేసిన కామెంట్లతో.. అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ రంగంలోకి దిగిపోయారు. 42 పాయింట్లతో ఒక పత్రాన్ని రెడీ చేసి సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ టీమ్ కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. బన్నీపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని కోరింది. బన్నీ ఇలాంటి రూల్స్ పెడుతారని ఎవరు చెప్పారో వివరాలు ఇవ్వాలని కోరింది. కానీ, వారి వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ వీడియోను తొలగించి సైలెంట్ అయిపోయారు.ఒకవేళ ఆమె చెప్పిన వ్యాఖ్యల్లో నిజం ఉంటే బన్నీ గురించి చెప్పిన ఆ వ్యక్తి వివరాలు తెలపవచ్చు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పాడ్కాస్ట్లో పాల్గొన్న కావేరీ బారువాతో పాటు హోస్ట్పై బూతులతో విరుచుకుపడుతున్నారు. వాటి వల్ల తాము ఇబ్బంది పడుతున్నామంటూ సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వారి అకౌంట్లు కూడా తొలగించేశారు. కావేరి బరువా చేసిన వ్యాఖ్యలు నమ్మేలా లేవని బన్నీ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఆయనతో పనిచేసిన వారందరూ బన్నీతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారు. అవన్నీ కూడా సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. (అల్లు అర్జున్ గురించి ఆయన అభిమానులు విడుదల చేసిన వీడియో) Ilanti person mida edustaru 🙏 pic.twitter.com/IxBpgnHN3b— 𝒞𝒽𝒾𝓀𝒾𝓉𝒽𝒶 (@chikithaaaaaaa) February 10, 2026 -
‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే...’ సాంగ్స్ రిలీజ్
అంకిత జాదవ్, రోహిత్ భోగ జోడీగా సాంగ్స్ ఆల్బమ్ రూపొందింది. కొరియోగ్రాఫర్ సత్య దర్శకత్వంలో అదోనై పిక్చర్స్ క్రియేషన్స్ సమర్పణలో కేకే రెడ్డి నిర్మించారు. జయంత్ ఆర్యన్ సంగీతం అందించిన ‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే...’ అంటూ సాగే సాంగ్స్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సాయిరాజేశ్, శైలేష్ కొలను, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, నటి ఆషు రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే...’ పాటలకి రాంబాబు గోసాల సాహిత్యం అందించగా, లిప్సిక, అదితీ భావరాజు పాడారు. ఈ సందర్భంగా సత్య మాస్టర్ మాట్లాడుతూ– ‘‘ఒక ఈవెంట్ కోసం నేను అమెరికా వెళ్లినప్పుడు కేకే రెడ్డిగారితో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఈ సాంగ్స్ హిందీ వెర్షన్ రెడీగా ఉన్నాయి. తెలుగులో చేయాలనే ఆలోచనను ఆయన నాతో షేర్ చేసుకున్నారు. అలా తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ్ర΄ారంభించాం’’ అని తెలి΄ారు. కేకే రెడ్డి మాట్లాడుతూ– ‘‘నువ్వే ఉండి΄ో ఇలా‘, ‘నువ్వేలే’ సాంగ్స్ని మంచి లవ్ ఫీల్తో బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు డైరెక్టర్ సత్యగారు. ఈ పాటలు మళ్లీ మళ్లీ వినేలా ఉంటాయి’’ అన్నారు. ‘‘నేను బాలీవుడ్లో మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తుంటా. నేను చేసిన ఐదో మ్యూజిక్ ఆల్బమ్ ఇది. ఈ ΄ాటలను న్యూయార్క్, షికాగోలో షూట్ చేశాం’’ అని అంకిత జాదవ్ చె΄్పారు. ‘‘ఈ సాంగ్స్ను హిందీలో చేశాం. తెలుగులోకి తీసుకురావాలనుకున్నప్పుడు ఇక్కడ మ్యూజిక్ లవర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సందేహించాం. కానీ, తప్పకుండా తెలుగు ఆడియన్స్ అంతా ఇష్టపడతారనే నమ్మకం ఉంది’’ అని మ్యూజిక్ డైరెక్టర్ జయంత్ ఆర్యన్ పేర్కొన్నారు. ఇంకా లిరిసిస్ట్ రాంబాబు గోసాల, సింగర్ లిప్సిక మాట్లాడారు. -
అర్ధరాత్రి రోడ్డుపై కారు ఆపి.. శ్రీహాన్ మంచి మనసు
కొన్నిసార్లు మన చుట్టూ ఏం జరిగినా చూసీచూడనట్లు పోతాం. కానీ, మానవత్వంతో ఆలోచించి ఒక్క నిమిషం కేటాయిస్తే కొన్ని ప్రమాదాలను నివారించవచ్చంటున్నాడు బిగ్బాస్ ఫేమ్, నటుడు శ్రీహాన్. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్ రన్నరప్గా నిలిచిన శ్రీహాన్.. మా ఆవారా జిందగీ, వర్జిన్ బాయ్స్ సినిమాల్లో నటించాడు.పూటుగా తాగేసి..తాజాగా అతడు తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. రాత్రిపూట రోడ్డుపై కారులో వెళ్తున్న శ్రీహాన్ మార్గమధ్యలో ఓ వ్యక్తి పూటుగా తాగేసి పడి ఉండటాన్ని గమనించాడు. నాకెందుకులే అని వెళ్లిపోకుండా కారు ఆపేసి మత్తులో ఉన్న అతడిని లేపి రోడ్డు దాటించాడు.రెండు నిమిషాల పనిదీనిగురించి శ్రీహాన్ మాట్లాడుతూ.. పెద్దాయన తాగేసి రోడ్డుపై పడి ఉన్నాడు. ఆయనకే సమస్యలున్నాయో, ఎందుకు తాగాడో మనకు అనవసరం. కానీ, వాహనాలు అన్నీ అతడి పక్కనుంచే వెళ్తున్నాయి. పైగా అతడి చేయి, కాలు రోడ్డుపై ఉంది. ట్రాఫిక్ ఎక్కువున్నప్పుడు కార్లకు, పెద్ద వాహనాలకు రోడ్డుపై ఉన్న అతడు కనిపించడు. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఏదైనా జరిగితే..రోడ్డు అవతలివైపు జనాలు నిలబడి చూస్తున్నారంతే! ఒకటీరెండు నిమిషాల సమయం కేటాయిస్తే అతడికి ఎటువంటి హాని జరగకుండా కాపాడవచ్చు. రేపు పొద్దున ఏదైనా జరగరానిది జరిగితే అది రీల్స్లో చూసి అయ్యో, పాపం అనుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పుకొచ్చాడు. వీడియోలో టైం, డేట్ తప్పుగా ఉంది, దాన్ని పట్టించుకోవద్దని కోరాడు. ఈ వీడియో చూసిన అభిమానులు మంచి పని చేశావంటూ శ్రీహాన్ను మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by Shrihan (@imshrihan) చదవండి: అల్లు అర్జున్ సాయం.. కన్నీళ్లు పెట్టుకున్న స్రవంతి -
డబ్బు లేకనే జైలుకెళ్తున్నా.. రాజ్పాల్కు అండగా సోనూ సూద్
బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. కొంత కాలంగా చెక్బౌన్స్ కేసులో ఆయన ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. తను చేసిన అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టు ఆరు నెలలు శిక్ష విధించింది. తిరిగి చెల్లించేందుకు తన దగ్గర డబ్బు లేదు.. సాయం చేసేందుకు స్నేహితులు కూడా లేరు. ఇలాంటి సమయంలో కోర్టు తీర్పు ప్రకారం లొంగిపోవడం తప్ప మరోక దారి నాకు కనిపించలేదని ఆయన అన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. తాజాగా సోషల్మీడియాలో పోస్టు చేశాడు.నటుడు రాజ్పాల్ కోసం నిర్మాతలు, దర్శకులతో పాటు తన సహచర నటులందరూ కలిసికట్టుగా నిలబడి సాయం చేయాలని సోనూ సూద్ కోరారు. తనకు కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో ఇవ్వాలని సూచించారు. ఇదీ దాతృత్వం కాదు.. ఒక నటుడి గౌరవాన్ని కాపాడేందుకు మనందరం ముందుకు వద్దాం. మనతో పాటు ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తను ఒంటరి కాదని గుర్త చేసే బాధ్యత మనపై ఉంది. అని సోనూ సూద్ అన్నారు. ఈ క్రమంలోనే నటుడు రాజ్పాల్కు కొంత మొత్తంలో అడ్వాన్స్గా ఇచ్చినట్లు తెలుస్తోంది.బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్, అతడి భార్య రాధపై ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. రాజ్పాల్ యాదవ్ తమ వద్ద రూ.5 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని సంస్థకు చెందిన ఎం.జి.అగర్వాల్ రికవరీ కేసు పెట్టాడు. వారు ఇచ్చిన బ్యాంక్ చెక్లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో రాజ్పాల్ దంపతులను 2018లోనే దోషులుగా న్యాయస్థానం తేల్చింది. ఈ క్రమంలో రాజ్పాల్కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఫిర్యాదుదారుడికి తిరిగి డబ్బు చెల్లిస్తానని స్టే తెచ్చుకున్నారు. కానీ, న్యాయస్థానం ముందు ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో ఢిల్లీ కోర్టు కూడా సీరియస్ అయింది. తీహార్ జైలు అధికారుల ముందు హాజరు కావాలని జారీ చేసింది. Rajpal Yadav is a gifted actor who has given years of unforgettable work to our industry. Sometimes life turns unfair, not because of talent, but because timing can be brutal. He will be part of my film, and I believe this is the moment for all of us..producers, directors,…— sonu sood (@SonuSood) February 10, 2026 -
'అల్లు అర్జున్' సాయం.. కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ స్రవంతి
యాంకర్ స్రవంతి సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన కష్టాన్ని నమ్ముకుని ఇప్పుడు స్టార్ యాంకర్గా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది. పలు ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, టెలివిజన్ షోలకు యాంకరింగ్ చేస్తూ అందరికీ దగ్గరైంది. 2009లోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ సరైన గుర్తింపు లేక ఛాన్స్ల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే, పుష్ప విడుదల సమయంలో అల్లు అర్జున్తో ఆమె చేసిన ఒక ఇంటర్వ్యూ తన జీవితాన్నే మార్చేసింది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి చెబుతూ శ్రవంతి ఎమోషనల్ అయింది.2021లో పుష్ప సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్ను యాంకర్ స్రవంతి ఇంటర్వ్యూ చేసింది. ఆమె కెరీర్లో అతిపెద్ద స్టార్ను కలవడం అదే తొలిసారి. తర్వాత ఆ ఇంటర్వ్యూ సోషల్మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమెకు వెంటనే బిగ్బాస్-5లో ఛాన్స్ దక్కింది. అనంతరం తన కెరీర్ పూర్తిగా ఉన్నత స్థానానికి చేరుకుంది. కేవలం బన్నీని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ దక్కడంతోనే తనకు గుర్తింపు వచ్చిందని ఆమె చెబుతుంది. అల్లు అర్జున్ను ఎప్పటికీ మరిచిపోలేనని అంటూ ఆమె ఇలా చెప్పుకొచ్చింది.'పుష్ప సినిమా విడుదలకు ముందు అల్లు అర్జున్తో ఇంటర్వ్యూ చేశాను. అప్పటి వరకు నా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇంటర్వ్యూ యూట్యూబ్లో షేర్ చేయగా మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అలా నాకు మంచి గుర్తింపు దక్కింది. దీంతో వెంటనే బిగ్బాస్-5లో ఛాన్స్ వచ్చింది. ఒక రకంగా అల్లు అర్జున్ వల్ల నా జీవితమే మారిపోయింది. అందుకే ఆయనపట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సైమా అవార్డ్స్లో బన్నీని కలిశాను. సైమా వేదికపై అవార్డ్ అందుకునేందుకు బన్నీ పేరును నేనే పిలిచాను.. అప్పడు నా గతాన్ని గుర్తుచేసుకుని బన్నీని చూడగానే తెలీయకుండానే కన్నీళ్లు వచ్చాయి. నాకు ఆయన చాలా సాయం చేశారు. ప్రతి పుట్టినరోజు నాడు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్తాను. ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటే అందుకు ప్రధాన కారణం అల్లు అర్జున్ మాత్రమే..' అంటూ శ్రవంతి చెప్పింది.అందరూ అనుకుంటున్నట్లు అల్లు అర్జున్లో ఎలాంటి గర్వం ఉండదని స్రవంతి చెప్పారు. కానీ, కొందరు పనికట్టుకుని విమర్శించడం సాధరణమే అన్నారు. రెగ్యూలర్గా చాలామంది ఫ్యాన్స్ ఆయన ఇంటికి వెళ్తుంటారు. వారందరితో కలిసి ఫోటోలు దిగుతారు. ఇతరులను ఆయన ఎప్పడు కూడా చులకన చేసి చూడరు. ఇలా బన్ని గురించి స్రవంతి చెప్పింది.అల్లు అర్జున్ చేసిన సాయం తలుచుకుని కళ్ల నీళ్లు పెట్టుకున్న యాంకర్ స్రవంతి@alluarjun @urs_sravanthi 📹https://t.co/lj4Z1Wb4Z0 pic.twitter.com/5j49D2T4ca— greatandhra (@greatandhranews) February 11, 2026 -
రియల్ హీరోలను సత్కరించిన అర్జున్.. గిఫ్ట్గా రూ.లక్ష
ప్రముఖ నటుడు అర్జున్ దర్శకత్వం వహించిన కొత్త మూవీ ‘సీతాపయనం’ ఈ నెల 14న విడుదల కానుంది. ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముగ్గురు సామాజిక కార్యకర్తలను ఆహ్వానించడంతో పాటు సన్మానించారు. ఎంతోమందికి సాయపడుతున్న రియల్ హీరోలు మీరే అంటూ అర్జున్ వారిని గౌరవించారు. డాక్టర్ ప్రకాశ్ ఆమ్టే, ట్యాంక్బండ్ శివ, దుశ్చర్ల సత్యనారాయణలను వేదికపై పిలిచి సత్కరించారు. ఆపై ఒక్కొక్కరికి రూ.లక్ష కానుకగా ఇచ్చ తన మంచి మనుసు చూపించారు.డాక్టర్ మందాకిని ఆమ్టే మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వైద్యురాలు, సామాజిక కార్యకర్త. ఆమె భర్త డాక్టర్ ప్రకాష్ ఆమ్టేతో కలిసి, గడ్చిరోలిలోని హేమల్కసాలో మాడియా గోండ్ ఆదివాసీల కోసం లోక్ బిరాదరి ప్రకల్పం (Lok Biradari Prakalp) ద్వారా వైద్య, విద్యా సేవలను అందిస్తున్నారు. గాయపడిన, నిరాశ్రయమైన వన్యప్రాణుల సంరక్షణ చేపట్టారు. 2008లో ఈ సేవలకు గానూ ఆమెకు రామన్ మెగసెసే అవార్డు లభించగా ఆమె భర్త ప్రకాష్ ఆమ్టే సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో ఆయనకు పద్మశ్రీ అవార్డును అందించింది.ట్యాంక్ బండ్ శివ అనడం కంటే శవాల శివ అనగానే హైదరాబాద్లో ఇట్టే గుర్తుపడుతారు. తన తొమ్మిదేళ్ల వయసులోనే హుస్సేన్ సాగర్లో పడిపోయిన ఒకరిని కాపాడి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అప్పటి నుచి వందలాది మందిని ప్రాణాలతో రక్షించాడు. నిత్యం హుస్సేన్ సాగర్ చుట్టూ తిరుగుతూ వేలాది శవాలను బయటకు తీశారు. ఆపై వారికి తోచిన సాయం కూడా చేస్తారు.సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన పర్యావరణ పరిరక్షణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ గురించి తెలుగు రాష్ట్రాల వారకి సుపరిచయమే.. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన 70ఎకరాల్లో అడవినే సృష్టించి ఆశ్చర్యపరిచారు. అందులో దాదాపు 5 కోట్ల మొక్కలు నాటారు. గవర్నర్ ప్రతిభా పురస్కారం కూడా ఆయన అందుకున్నారు. -
మమితా బైజు కొత్త సినిమా.. నిర్మాతగా మారిన స్టార్ హీరో
నటి మమితా బైజు క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. పదహారేళ్ల ప్రాయంలోనే నటిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ గత ఎనిమిదేళ్లగా మలయాళం, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ సక్సెస్ రేట్ను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తను నటించిన మలయాళం చిత్రం ప్రేమలు మాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ ల్లోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెబల్ చిత్రంతో జివీ.ప్రకాష్ కుమార్కు జంటగా కోలీవుడ్కు పరిచయమైన బ్యూటీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ప్రదీప్ రంగనాథన్కు జంటగా నటించిన డ్యూడ్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది.తాజాగా విజయ్ కథానాయకుడుగా నటించిన జననాయకన్ చిత్రంలోనూ మమితా బైజు కీ రోల్ చేశారు. కాగా ప్రస్తుతం ధనుష్ సరసన నటిస్తున్న కారా చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. అదేవిధంగా బెత్లెహేమ్ కుడుంబ అనే మలయాళం చిత్రంలోని నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ తాజా చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. అయితే ఈ చిత్రంలో ఆయనకు జంటగా కాకుండా ఆయన నిర్మించనున్న చిత్రంలో మమితా బైజు నాయకిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. చాలామంది నటుల మాదిరిగానే ప్రదీప్ రంగనాథన్ కూడా నిర్మాతగా మారిపోతున్నారు. ఈ చిత్రానికి ఆయన అసోసియేట్ డైరెక్టర్ ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలుతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఫ్లో చూస్తుంటే సినిమా కూడా తీసేస్తారేమో!
గతేడాది, ఈసారి వరసగా 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకరవరప్రసాద్' సినిమాలతో అద్భుతమైన సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. త్వరలో కొత్త మూవీ ప్రకటనతో వస్తానని కొన్నిరోజుల క్రితమే చెప్పాడు. కానీ అనిల్.. నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నాడు? స్టోరీ ఏంటి? ఇంకా ఎవరెవరు నటించబోతున్నారు? అని రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వాటికి పుల్స్టాప్ పెడుతూ స్వయంగా ఈ డైరెక్టరే క్లారిటీ ఇచ్చేశాడు.'నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా. నటీనటులు, కథ, టైటిల్ కూడా పెట్టేశారు. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా చెప్పేస్తారేమో. మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను. అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో నిజమైన పూర్తి వివరాలు మీకు అందిస్తాం' అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.అయితే అనిల్.. తన తర్వాత సినిమా వెంకటేశ్ హీరోగా తీయబోతున్నాడని పుకార్లు వచ్చాయి. ఈ ప్రాజెక్టులోనే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తాడని.. వెంకీ, ఫహాద్ బావబావమరిదిగా నటిస్తారని.. ఇందులో వెంకీ సరసన కీర్తి సురేశ్, పూజా హెగ్డే హీరోయిన్లు అని.. ఫహాద్ సరసన ఆషికా రంగనాథ్ కనిపిస్తుందని మాట్లాడుకున్నారు. అలానే మూవీకి 'శ్రీమతి లలితా రెడ్డి' అనే టైటిల్ కూడా నిర్ణయించారని, ప్రస్తుతం ఓటీటీ చర్చలు జరుగుతున్నాయని.. ఇది పూర్తవగానే అనౌన్స్మెంట్ ఉంటుందని టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఇవే నిజమవుతాయా? లేదంటే అనిల్ రావిపూడి.. వేరే ప్రాజెక్ట్ చేస్తాడా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా 😭🙏నటినటులు కధటైటిల్ కూడా పెట్టేసారు ఈ ఫ్లో చూస్తుంటే .యాక్షన్..కట్ కూడా చెప్పేస్తారేమో 😉😉😉😊😄మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను....అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో...నిజమైనపూర్తి వివరాలు... మీకు… pic.twitter.com/bfhQ4NrOfu— Anil Ravipudi (@AnilRavipudi) February 10, 2026 -
హీరోగా చేయడం నాకు ఇష్టం లేదు
‘‘నా దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా కామెడీ ఉంటుంది. దీంతో నా సినిమాల్లో కథ, లాజిక్లు ఉండవని ఆడియన్స్కు అనిపించవచ్చు. కానీ నా అన్ని సినిమాల్లో కథ, లాజిక్ ఉంటాయి. ఇప్పటి ట్రెండ్కు తగ్గట్లుగానే ‘ఫంకీ’ ట్రైలర్ను కట్ చేశాం. ట్రైలర్లో ఎక్కువగా కామెడీ సీన్స్ కనిపిస్తాయి. కానీ ఈ చిత్రంలో మంచి లవ్స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి’’ అని చెప్పారు కేవీ అనుదీప్. విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా కేవీ అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరల సమావేశంలో కేవీ అనుదీప్ పంచుకున్న సంగతులు. ⇒ ‘ఫంకీ’ చిత్రంలో విశ్వక్ సేన్ ఓ సినిమా దర్శకుడి పాత్ర చేశారు. ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది. ‘ఫంకీ’లోని హీరో క్యారెక్టరైజేషన్కు విశ్వక్ అయితే బాగుంటుందనిపించింది. కథ నచ్చి, ఆయన ఒప్పుకున్నారు. ⇒ జాతి రత్నాలు’తోపోలిస్తే ‘ఫంకీ’ కొత్తగా ఉంటుంది. దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేలా, సరదాగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. కొన్ని ఊహించని సన్నివేశాలను కూడా చూస్తారు. నిర్మాతలు నాగవంశీ, ‘దిల్’ రాజులతో పాటు దర్శకులు హరీష్ శంకర్, కల్యాణ్ శంకర్ గెస్ట్ రోల్స్ చేశారు. నేను కూడా నటించాను. కానీ హీరోగా యాక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దర్శకత్వంపైనే ఆసక్తి ఎక్కువ. దర్శకుడిగా నేను చెప్పాల్సిన కథలు చాలానే ఉన్నాయి.⇒ విశ్వక్ మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. హీరోకు సమానమైన పాత్రలో కయాదు యాక్ట్ చేసింది. ఈ చిత్రం విషయంలో నాగవంశీగారితో కంటే కూడా నేను చినబాబుగారితో ఎక్కువగా ట్రావెల్ చేశాను. త్రివిక్రమ్గారు సినిమా చూసి, మంచి సలహాలు ఇచ్చారు. ⇒ ప్రతి సినిమా హిట్ కావాలనే ఆకాంక్షతోనే చేస్తాం. కానీ నా గత చిత్రం ‘ప్రిన్స్’కు సరైన రిజల్ట్ రాలేదు. స్క్రిప్ట్ వర్క్కు సరైన సమయం దొరకలేదు. ‘ఫంకీ’ స్క్రిప్ట్కు మంచి టైమ్ దొరికింది... మంచి కథ కుదిరింది. హాస్య సన్నివేశాల్లో సహజత్వం ఉంటే ఆ సినిమా ఆడియన్స్కు చేరువ అవుతుంది. అలా ‘జాతి రత్నాలు’ విజయం సాధించిందని నేను అనుకుంటున్నాను. ఇక ‘జాతిరత్నాలు 2’ ఇప్పట్లో ఉండదు. కథ పరంగా సంతృప్తిగా ఫీలైనప్పుడే ‘జాతిరత్నాలు 2’ చేస్తాం. ⇒ మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థల్లో నేను సినిమాలు చేయాల్సి ఉంది. వెంకటేశ్గారితో ఓ సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను. రవితేజగారితో సినిమా కోసం చర్చలు జరిగాయి కానీ ఈ సినిమా ఉండదు. ఓ లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ఉంది. -
రవిబాబు 'రేజర్'.. యాక్షన్.. థ్రిల్
రవిబాబు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రేజర్’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి. సురేష్బాబు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించి, ఒకపోస్టర్తో పాటు స్పెషల్ గ్లింప్స్ను విడుదల చేశారు.‘‘డార్క్ అండ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించిన చిత్రం ‘రేజర్’. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చూడని సరికొత్త కథాంశంతో మా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతంపోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ వేసవిలో మా సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: ఎస్ఎస్ రాజేశ్. -
'చాయ్ వాలా' టైటిల్ వద్దని చెప్పారు
శివ కందుకూరి, తేజు అశ్విని హీరో హీరోయిన్లుగా, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నవాబ్ కేఫ్’. ప్రమోద్ హర్ష దర్శకత్వంలో రాధా వి. పపుడిప్పు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. తొలుత ఈ సినిమాకు ఉన్న ‘చాయ్ వాలా’ టైటిల్ను ‘నవాబ్ కేఫ్’గా మార్చామని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా మీట్లో హీరో శివ కందుకూరి మాట్లాడుతూ– ‘‘సెన్సార్ రూల్స్, గైడ్ లైన్స్ని గౌరవిస్తూ, మేం మా టైటిల్ను ‘నవాబ్ కేఫ్’గా మార్చాం. ప్రమోద్ ఈ సినిమా కథను నాకు చెప్పినప్పుడు, ఈ చిత్రానికి ‘నవాబ్ కేఫ్’ అనే టైటిల్ అనుకున్నాం. విధి చివరకు ఈ టైటిలే ఫైనల్ అయ్యేలా చేసింది. ‘నవాబ్ కేఫ్’ టైటిల్ మా సినిమా సోల్ని, స్టోరీని తెలియజేస్తుంది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ బయటకువచ్చి, వాళ్ల నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతారు. మంచి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘మా సినిమా టైటిల్ మార్చమని అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. నేను ముంబై వెళ్లాను. సెన్సార్ టీమ్తో మాట్లాడాను. ‘చాయ్ వాలా’ టైటిల్ వద్దని చెప్పారు. దీంతో మేం మా వర్కింగ్ టైటిల్ ‘నవాబ్ కేఫ్’నే ఫైనల్ చేశాం’’ అని చెప్పారు నిర్మాత వెంకట్. ‘‘నా జీవితంలో నేను చూసిన, అనుభవించిన సంఘటనల ఆధారంగా ఈ ‘నవాబ్ కేఫ్’ సినిమా కథనం సాగుతుంది’’ అని తెలిపారు ప్రమోద్ హర్ష. ‘‘ఇది నా మొదటి చిత్రం’’ అని పేర్కొన్నారు తేజు అశ్విని. -
లక్నో నుంచి లాహోర్ వెళ్తే?
సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘లాహోర్ 1947’. షబానా అజ్మీ, ప్రీతి జింతా, కరణ్ డియోల్, అలీ ఫజల్, అభిమన్యు సింగ్ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.భారత్ – పాకిస్తాన్ దేశాల విభజన కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా ఉండదట. లక్నోకు చెందిన ఓ ముస్లిం కుటుంబం కొన్ని పరిస్థితుల కారణంగా లాహోర్ వెళ్లాల్సి వస్తుందట. ఆ తర్వాత అక్కడ ఆ కుటుంబం ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది? అనే కోణంలో ‘లాహోర్ 1947’ సినిమా కథనం సాగుతుందని సమాచారం. -
వాంగ అన్నే రెడీయా... తెలుగు హీరోల చూపు అటువైపే
టాలీవుడ్... కోలీవుడ్.... మాలీవుడ్... శాండల్వుడ్... బాలీవుడ్... ఇప్పుడు అన్ని వుడ్స్ ఒకటే. ఇప్పటివరకూ హీరోయిన్లు మాత్రమే రక రకాల భాషల్లో సినిమాలు చేసేవారు. అప్పుడప్పుడూ డైరెక్టర్లు కూడా వేరే భాషల్లో వేరే హీరోలతో సినిమాలు చేసేవారు. అయితే ఆ కాంబినేషన్ అరుదుగా సెట్ అయ్యేది. ఇప్పుడు పాన్ ఇండియా’ హవాతో తెలుగు హీరోలు తమిళ దర్శకులతో... తమిళ హీరోలు తెలుగు దర్శకులతో.... అలానే వేరే భాషల దర్శకులతో ఇంకో భాషకు చెందిన హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎక్కువైంది. ఒక్క తెలుగు గురించి మాట్లాడుకుంటే... ఇక్కడి టాప్ స్టార్స్ కొందరు తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ అవి సెట్స్ మీద ఉన్నాయి. కొన్ని చర్చల్లో ఉన్నాయి. ఇక ‘వాంగ అన్నే... రెడీయా... స్టార్ట్ కెమెరా’ (రండి అన్నా... రెడీయా... స్టార్ట్ కెమెరా) అంటూ తెలుగు హీరోలను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్న తమిళ దర్శకులు, చర్చల్లో ఉన్న దర్శకుల గురించి తెలుసుకుందాం. యంగ్ డైరెక్టర్తో నూరవ చిత్రం నూరవ చిత్రం అనేది ఏ హీరోకైనా వెరీ వెరీ స్పెషల్. ఈ మైల్స్టోన్ మూవీ గ్రాండ్గా ఉండాలని, మంచి కథతో, మంచి దర్శకుడితో రూపొందించాలని అనుకుంటారు. నాగార్జున కూడా అలానే అనుకుని, పకడ్బందీగాప్లాన్ చేసుకున్నారు. అయితే తెలుగు దర్శకుడికి కాకుండా తన నూరవ చిత్రం దర్శకత్వ బాధ్యతను తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్కి ఇచ్చారు. దాదాపు ఏడాది క్రితం నాగార్జునకు కార్తీక్ ఓ స్టోరీ లైన్ వినిపించారని, అది నచ్చి కథగా డెవలప్ చేయమన్నారనీ తెలిసింది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కార్తీక్కి ఇది రెండో చిత్రం.తమిళ చిత్రం ‘నిదమ్ ఒరు వానమ్’తో దర్శకుడిగా పరిచయమై, రెండో ఫీచర్ ఫిల్మ్కే నాగార్జునలాంటి స్టార్ని డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్, లాటరీ కింగ్’ అనే టైటిల్స్ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం లాటరీ నేపథ్యంలో ఉంటుందని భోగట్టా. అందుకే ‘లాటరీ కింగ్’ టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ చిత్రంలో టబు నటిస్తున్నారు. అలాగే అనుష్క ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్పై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. మల్టీస్టారర్ మూవీలో ఎన్టీఆర్? ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్, ‘వార్ 2’లో హృతిక్ రోషన్ కాంబినేషన్లో నటించిన ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్ మూవీ చేయనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. రజనీకాంత్తో ‘జైలర్’ వంటి హిట్ మూవీ తెరకెక్కించి, ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా రజనీతోనే ‘జైలర్’ 2’ తెరకెక్కిస్తున్న నెల్సన్ దిలీప్కుమార్ నెక్ట్స్ ఓ సినిమాప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ కోసం నెల్సన్ ఓ భారీ యాక్షన్ స్టోరీని తయారు చేశారని సమాచారం. ఆ స్టోరీ లైన్ని ఎన్టీఆర్కి వినిపించారనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్.మరోవైపు కొత్త చిత్రాల కోసం కథలు వింటున్నారట. ఈ నేపథ్యంలోనే నెల్సన్ చెప్పిన స్టోరీ లైన్ విని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అయితే మల్టీస్టారర్ మూవీగా రూపొందనుందని భోగట్టా. ఎన్టీఆర్తో పాటు మరో స్టార్ హీరో ఈ చిత్రంలో నటిస్తారని ప్రచారం అవుతోంది. తెలుగు–తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందించాలనుకుంటున్నారట. సో... ఓ తమిళ స్టార్ హీరో నటించే అవకాశం ఉందని అటు చెన్నై ఫిల్మ్నగర్ అంటున్న మాట. మరి... ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో సినిమా ఉంటుందా? అది సోలో హీరో సినిమానా? లేక మల్టీస్టారరా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.ఇద్దరు దర్శకులతో... వరుసగా ఇద్దరు తమిళ దర్శకులతో అల్లు అర్జున్ సినిమాలు ఒప్పుకోవడం విశేషం. ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఈ హీరో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ సెట్స్లో ఉండగానే... సంక్రాంతి సందర్భంగా మరో చిత్రాన్ని ప్రకటించారు అల్లు అర్జున్. తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఆ మధ్య లోకేశ్ హైదరాబాద్ వచ్చి, అల్లు అర్జున్కి స్టోరీ లైన్ వినిపించారనే వార్త బయటకు వచ్చింది. దీంతో ఈ దర్శకుడి కాంబినేషన్లో ఈ హీరో సినిమా ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.ఆ ఊహలను నిజం చేస్తూ, ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. ఈ సినిమా ముగిసే సమయానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోని సినిమా షూట్ని ఆరంభించాలనుకుంటున్నారట. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆరంభం కానుందని తెలిసింది. తమిళ దర్శకుడు–తమిళ బేనర్... ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తర్వాత రామ్ ఓ కొత్త దర్శకుడితో సినిమాకి పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ చిత్రాన్ని దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మించనున్నారట. కాగా టాలీవుడ్కి చెందిన ఈ కొత్త దర్శకుడు చెప్పిన కథ రామ్కి నచ్చిందని సమాచారం. త్వరలో ఈ సినిమా ఆరంభం కానుందని తెలిసింది. మరోవైపు తెలుగులో బాగా పాపులర్ అయిన తమిళ నటుడు–దర్శకుడు సముద్ర ఖనితో సినిమా చేయడానికి రామ్ అంగీకారం తెలిపారని భోగట్టా. ఈ చిత్రాన్ని తమిళ బేనర్ కేవీఎన్ నిర్మించనుందట.ఈ సినిమా కథ రెడీ అయిందని, రామ్కి సముద్ర ఖని కథ నరేట్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ కథ నచ్చి, ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రాఘవేంద్ర రావు బేనర్లో నూతన దర్శకుడితో సినిమా పూర్తయ్యే సమయానికి సముద్ర ఖనితో సినిమాని పట్టాలెక్కించాలనుకుంటున్నారట రామ్. ఇక సముద్ర ఖని ఇప్పటికే తెలుగులో ‘శంభో శివ శంభో, జెండా పై కపిరాజు, బ్రో’ వంటి తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఉన్నట్లా? లేనట్లా? ‘దసరా, హిట్ 3’... ఇలా వరుసగా మాస్ యాక్షన్ సినిమాలు చేస్తున్న నాని ప్రస్తుతం మరో మాస్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చేసిన మాస్ సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా మరో ఎత్తు అనేలా భారీ యాక్షన్తో రూపొందుతోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాని. ఇక రెండు మూడేళ్లుగా ఫలానా దర్శకుడితో నాని సినిమా చేయనున్నారంటూ వినిపించిన లిస్ట్లో తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి పేరు ప్రముఖంగా ఉంది.శివ కార్తికేయన్ హీరోగా శిబి దర్శకత్వంలో రూపొందిన ‘డాన్’ (2022) సినిమా చూసి, ఇంప్రెస్ అయ్యారట నాని. ఈ నేపథ్యంలోనే శిబి చక్రవర్తి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారనే వార్త ప్రచారమైంది. నానీకి శిబి స్టోరీ లైన్ కూడా చెప్పారట. అయితే ఆ లైన్ అసంతృప్తిగా అనిపించడంతో ఈ ప్రాజెక్ట్ పెండింగ్లో పడిందని సమాచారం. మరి... నాని–శిబి చక్రవర్తి కాంబినేషన్లో సినిమా ఉన్నట్లా? లేనట్లా... కాలమే సమాధానం చెప్పాలి. ఇదిలా ఉంటే.... ఈ యువదర్శకుడికి సూపర్ స్టార్ రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుందర్ ఔట్ శిబి ఇన్ ‘తలైవర్ 173’ (వర్కింగ్ టైటిల్) పేరుతో రజనీకాంత్ హీరోగా శిబి చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. నిజానికి ఈ సినిమాకి ముందు సుందర్. సీని దర్శకుడిగా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు కమల్హాసన్ ఓ నిర్మాత. కమల్–రజనీ–సుందర్ కాంబినేషన్లో ‘తలైవర్ 173’ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే సుందర్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత పలువురి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్లీ సూపర్ స్టార్ సినిమా శిబి చక్రవర్తికి దక్కింది. ఇలా తెలుగు–తమిళ దర్శకుల కాంబినేషన్లో సినిమాలంటూ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. – డి.జి. భవాని -
'రాజాసాబ్'పై మళ్లీ ట్రోలింగ్.. చివరకు హీరోయిన్ కూడా
ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన 'రాజాసాబ్'పై రిలీజ్ టైంలోనే చాలా కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ రావడంతో ఫ్లాప్ అయింది. ప్రభాస్ ఉన్నప్పటికీ మూవీ లవర్స్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. సరేలే అయిపోయిందేదో అయిపోయిందనుకుంటే ఓటీటీలోకి మూవీ వచ్చిన తర్వాత విమర్శలు, ట్రోలింగ్ మరింత ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా ప్రభాస్కి చాలాచోట్ల డూప్ ఉపయోగించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు హీరోయిన్ డూప్ విషయంలో కొత్తగా ట్రోల్స్ చేస్తున్నారు.'రాజాసాబ్'లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. వీళ్లలో ఒక్కరి పాత్ర కూడా సరిగా డిజైన్ చేయలేదు. నిధి, రిద్ధి కంటే మాళవికకు కాస్త స్కోప్ దొరికింది. ఓ చోట ఫైట్ సీన్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈమెకి కూడా డూప్ వాడిన విషయం బయటపడింది. ఇదే చిత్రంలో విలన్ గ్యాంగ్లో నటించిన రోన్సన్ విన్సెంట్ అనే నటుడు.. తాజాగా 'రాజాసాబ్' గురించి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇందులో మాళవికకి కూడా డూప్ ఉందనే సంగతి బయటపెట్టాడు. దీంతో కొత్తగా పలువురు నెటిజన్లు.. 'రాజాసాబ్'పై ట్రోల్స్ చేస్తున్నారు.చాలా సినిమాల్లో స్టార్ హీరోహీరోయిన్లకు డూప్స్ని ఉపయోగిస్తారు. కానీ సదరు డూప్ యాక్టర్స్ గురించి ఒక్క ఫొటో గానీ వీడియో గానీ బయటపడకుండా మూవీ టీమ్ జాగ్రత్త పడుతుంది. 'రాజాసాబ్' విషయంలో ఇదంతా రివర్స్లో జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మూవీ రిలీజ్కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో దర్శకుడు మారుతినే ప్రభాస్కి డూప్ ఉపయోగించామని ఒప్పుకొన్నాడు. ఇప్పుడేమో ఓ యాక్టర్.. హీరోయిన్ డూప్గా చేసిన వ్యక్తితో కలిసి ఫొటోలు పోస్ట్ చేయడం చర్చనీయాంశమైపోయింది. View this post on Instagram A post shared by Ronson Vincent (@ronsonvincent) -
టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ సినిమాలకు కష్టకాలం?
టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాలు వరుసగా రెడీ అవుతున్నాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు నిర్మాతలకు తలనొప్పిగా మారాయి. ఒకవైపు ఓటిటి సంస్థలు ఇలాంటి సినిమాలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఫైనల్ కాపీ చూపించకపోతే ఒప్పందాలు కుదిరే పరిస్థితి లేదు. గతంలో వచ్చిన పలు విఎఫ్ఎక్స్ చిత్రాలు నాసిరకమైన గ్రాఫిక్స్ కారణంగా ప్రేక్షకుల నిరాకరణకు గురైన విషయం తెలిసిందే. ఆ అనుభవం వల్లే ఇప్పుడు ఓటిటి సంస్థలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. సినిమా ఫైనల్ వెర్షన్ చూపిస్తేనే రేటు నిర్ణయిస్తామని ఓటిటిలు స్పష్టంగా చెబుతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర, నిఖిల్ స్వయంభు, నాగ్ చైతన్య వృషకర్మ వంటి భారీ విఎఫ్ఎక్స్ ప్రాజెక్టులు ఓటిటి డీల్స్ కోసం వెయిటింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పటికే పూర్తయిన సినిమాలు మాత్రం సులభంగానే అమ్ముడవుతున్నాయి. కానీ ఇంకా మేకింగ్ దశలో ఉన్నవాటికి ఫైనల్ కాపీ చూపించకపోతే ఒప్పందాలు ముందుకు సాగట్లేదు. ఇలాంటి వాటిలో పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ కాంబినేషన్లు కూడా ఉన్నాయి. కానీ నిర్మాతలు మాత్రం కొత్తగా విఎఫ్ఎక్స్ సినిమాలు ప్లాన్ చేయడంలో ముందుకు వెనుకకు ఆలోచిస్తున్నారు. ఓటిటి మార్కెట్ బలహీనంగా ఉండటం వల్ల రిస్క్ ఎక్కువగా కనిపిస్తోంది. -
మరింత హాట్గా జ్యోతి పూర్వాజ్.. శారీలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల..!
బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్ పోజులు..టాలీవుడ్ నటి పూర్ణ బేబీ బంప్ ఫోటోలు..గ్రీన్ శారీలో ఫుల్ గ్లామరస్గా ఐశ్వర్య రాజేశ్..పూల లాంటి డ్రెస్లో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల.. బాయ్ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్లో పాయల్ రాజ్పుత్.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by BRIDAL JEWELRY RENTAL DUBAI, UAE (@rahz_allure_jewelry_rental_uae) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
'ఆమె వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు.. అల్లు అర్జున్ టీమ్ అధికారిక ప్రకటన'
అల్లు అర్జున్ లాంటి హీరోతో యాడ్ షూటింగ్ చేయాలంటే కఠినమైన రూల్స్ ఉన్నాయంటూ ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఐకాన్ స్టార్తో షూట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఆయన మేనేజర్స్ దాదాపు 42 నిబంధనలతో ఓ నోట్ ఇచ్చారని పేర్కొంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్పై వస్తున్న ఈ కథనంపై ఆయన టీమ్ రియాక్ట్ అయింది. ఆమె చెబుతున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇలాంటి అవాస్తవాలను ఎవరూ కూడా నమ్మొద్దని ఐకాన్ స్టార్ టీమ్ కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడమని స్పష్టం చేసింది. ఈ మేరకుఅల్లు అర్జున్ కార్యాలయం నుంచి అధికారిక నోట్ విడుదల చేసింది.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అల్లు అర్జున్ టీమ్ తెలిపింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇలాంటి ధృవీకరించని కంటెంట్ను షేర్ చేయకుండా ఉండాలని సూచించింది. కాగా.. గతంలో ఆమె అల్లు అర్జున్తో ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. Unbelievable rules of Allu Arjun.A media professional reveals some of the shocking "do's and don'ts" when meeting megastar Allu Arjun.From strictly following a list of 42 rules to being told "don't look in sir's eyes" and "don't shake hands,"Why someone can't look in your… pic.twitter.com/pGv9UmhhBP— lakshman (@rebel_notout) February 10, 2026 -
కమిట్మెంట్ అడిగేదంతా అంకుల్స్ బ్యాచే : నటి షాకింగ్ కామెంట్స్
క్యాస్టింగ్ కౌచ్పై నటి ఎస్తర్ నోరోన్హా కీలక వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటికీ కొనసాగుతుందని, కమిట్మెంట్ ఇస్తేనే చాన్స్లు ఇస్తామని చెప్పే దర్శకనిర్మాతలు చాలా మంది ఉన్నారని ఆరోపించింది. ఆడియన్స్ మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ని కంట్రోల్ చేయగలరని ఎస్తర్ చెబుతోంది. ఆమె కీలకపాత్ర పోషించిన చిత్రం అమరావతికి ఆహ్వానం చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్పై మాట్లాడింది.పేరు చెప్పరు..క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటికే టాలీవుడ్లో కొనసాగుతూనే ఉంది. రెండ్రోజుల క్రితమే నాకు ఓ కాల్ వచ్చింది. కమిట్మెంట్కి ఓకేనా అడిగారు. నో చెప్పడంతో వదిలేశారు. చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూలలో నేను కష్టపడి వచ్చాను.. టాలెంట్తోనే పైకి వచ్చాను, ఒక్కరు కూడా నన్ను కమిట్మెంట్ అడగలేదని చెబుతారు. కానీ అదంతా అబద్దం. చాలా మంది కాంప్రమైజ్ అయినవాళ్లే. నటన రానివాళ్లు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఎలా ఉంటారు? వాళ్లకు ఉన్న లోపాన్ని కప్పిపుచ్చాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే. అయితే ఎవరు అడిగారు అనేది ముందే చెప్పరు. ముందుగా మీడియేటర్ ద్వారా కమింట్మెంట్ గురించి అడిగిస్తారు. ఓకే అంటే రెమ్యునరేషన్ ఇలా, లేదంటే అలా చెబుతారు. మనసైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. అడిగింది ఎవరనే పేరుని చెబుతారు. అందుకే ముందుగానే కమిట్మెంట్ అడిగింది ఎవరు అని కనిపెట్టలేం.నా గురించి క్లారిటీ రాలేదుసినిమాలలో ఎప్పుడు చీరలో కనిపించి.. బయటికి దేవతలా కనిపించేవాళ్లు కూడా అలాంటి పనులు చేస్తారు. అయితే నేను ఏ కేటగిరీలో ఉన్నాను అనేది వారికి క్లారిటీ రావడం లేదు. కొంతమంది ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడి.. తర్వాత అలాంటి పనులు చేస్తుంటారు. నేను కూడా అదే క్యాటగిరీ అనుకొని కాల్ చేస్తుంటారు. ఆడియన్స్ కూడా ‘ఈవిడ బాగానే మాట్లాడుతుంది, కానీ ఏదో ఒకటి చేసే ఉంటుందని‘ అనుకుంటారు. అలాంటి వాళ్లు నా ఫిల్మోగ్రఫీ చూడాలి. ఒకవేళ నేను కూడా కమిట్మెంట్కి ఓకే చెబితే.. ఇన్నేళ్లలో ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా నా దగ్గరకు రాదా? నన్ను జనం ఇంతలా ప్రేమిస్తున్నారు.. నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ను ఆదరిస్తున్నారు. ఆడియన్స్, మీడియా సపోర్ట్ నాకుంది. అలాంటప్పుడు ఎందుకు నాకు అవకాశం రాలేదో ఆలోచించాలి.వాళ్లంతా అంకుల్స్ బ్యాచ్ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న యువతరం.. కమిట్మెంట్ గురించి అడగడం లేదు. వాళ్ల చాలా ఫ్యాషన్తో పని చేస్తున్నారు. అలాంటి పనులు చేసేవాళ్లంతా పాత బ్యాచ్. వారందరిని నేను అంకుల్స్ బ్యాచ్ అని పిలుచుకుంటాను. వాళ్ల ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మనలోని లోపాలను ఆసరాగా చేసుకొని కమిట్మెంట్ గురించి అడుగుతారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కనిపించకుండే చేసే అవకాశం ఆడియన్స్కి మాత్రమే ఉంది. వాళ్లు ఫిక్స్ అయితే.. ఇక్కడ అలాంటి పనులు జరుగవు. హాలీవుడ్, బాలీవుడ్లో లాగా.. ఇక్కడ కూడా కాంప్రమైస్ అయి నటించే నటీనటులను బ్యాన్ చేయాలి. అలాంటి వాళ్లు ఎంత పెద్ద సినిమా చేసినా బాయికాట్ చేయాలి. అప్పుడే క్యాస్టింగ్ కౌచ్ ఆగిపోతుంది’ అని ఎస్తర్ చెప్పుకొచ్చింది. -
బిగ్బాస్ ఆదిరెడ్డి కూతురి అన్నప్రాసన వేడుక.. వీడియో వైరల్
బిగ్బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా బిగ్బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.గతేడాది మరోసారి తండ్రైన ఆది రెడ్డి దంపతులకు కూతురు పుట్టింది. తాజాగా తమ ముద్దుల కూతురికి అన్నప్రాశన వేడుక నిర్వహించారు. మా బిడ్డకి మీ ఆశీర్వాదాలు కావాలంటూ అన్నప్రాసన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. మొదటి వీరిద్దరికీ ఓ కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో ఆయన సతీమణి రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆదిరెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రెండోసారి కూడా కూతురు పుట్టడం సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Kavitha Bondala (@kavitha_bondala) -
'ఐకాన్ స్టార్తో షూట్.. ఈ రూల్స్ పాటించాల్సిందేనట'.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత మరో స్టార్ డైరెక్టర్తో జతకట్టారు. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. జవాన్ డైరెక్టర్ అట్లీతో బన్నీ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంచితే అల్లు అర్జున్పై ప్రముఖ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ కావేరి బారువా చేసిన కామెంట్స్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆమె.. అల్లు అర్జున్ను కలవాలంటే కఠిన నిబంధనలు ఉంటాయని తెలిపింది. దాదాపు 42 రూల్స్ పాటించాలని ఆమె పేర్కొంది. అంతేకాకుండా అల్లు అర్జున్ కళ్లలోకి చూడకూడదని.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని వెల్లడించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.కావేరి బారువా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. "నా మరో ఆసక్తికరమైన ఇంటర్వ్యూ హైదరాబాద్ మెగా స్టార్ అల్లు అర్జున్తో జరిగింది. ఈ సౌత్ స్టార్ను కలవడానికి ముందు మాకు దాదాపు 42 రూల్స్కు సంబంధించిన నోట్ ఇచ్చారు. మీరు సార్ కళ్లలోకి చూడకూడదు.. అలాగే షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వకూడదని మేనేజర్లు సూచించారని" ఆమె అన్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కావేరి బారువా చేసిన వాదనలు నిజమో కాదో తెలియాలంటే.. అల్లు అర్జున్ బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.Yeh hai Pushpa ka rule : Massive respect to @alluarjun Sir for setting strict rules before meeting any media person! North has always treated their stars like gods with endless protocols, but when South's Icon sets his own in Bombay? Suddenly it's 'too much' and shocking?… pic.twitter.com/FALbtiv1Dn— AnandTanniru (@ceoyktv) February 10, 2026 -
ప్రతి రోజు నిన్నే ఎంచుకుంటాను.. నమ్రత ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్లో మహేశ్ బాబు, నమ్రత జోడి ఒకటి. ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టి నేటికి 21 సంవత్సరాలు అవుతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. విమానంలో మహేశ్బాబుతో కలిసి ఉన్న పాత ఫోటోని షేర్ చేస్తూ.. ‘21 వసంతాలు దాటినా ఇప్పటికీ ప్రతి రోజు నిన్నే ఎంచుకుంటాను’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోస్ట్ని మహేశ్ కూడా తన ఇన్స్టా ఖాతాలో రీ షేర్ చేశాడు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా కామెంట్ చేసింది. లవ్, ఫైర్, క్లాపింగ్ ఎమోజీలతో మ్యారేజ్ డే విషెస్ తెలియజేసింది. కాగా, వంశీ(2000) మూవీ షూటింగ్ టైమ్లో ప్రేమలో పడ్డ ఈ జంట.. ఐదేళ్ల తర్వాత 2005 ఫిబ్రవరి 10న వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2006లో గౌతమ్, 2012లో సితార జన్మించింది. మహేశ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమాచేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar)


