Tollywood
-
ఆర్మీలో రెండేళ్ల ట్రైనింగ్.. ఆ మాటలతో మధ్యలోనే ఆగిపోయా!: యాంకర్ రవి
యాంకర్ రవి (Anchor Ravi).. బుల్లితెరపై ఎన్నో షోలు చేసే ఇతడు తాజాగా ఓ షోకి గెస్టుగా వెళ్లాడు. ఆహాలో తేజస్వి యాంకర్గా చేస్తున్న కాకమ్మ కథలు షోలో హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు తన జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. యాంకర్ రవి మాట్లాడుతూ.. దేవుడి దయ వల్ల నాకు మంచి కుటుంబం దొరికింది. మా నానమ్మకు కర్ణాటక, హిందుస్తానీ సంగీతం వచ్చు. అలా తను వేరేవాళ్లకు పాఠాలు చెప్పేది. అయితే ఈ కళపై ఆధారపడితే డబ్బు సంపాదించలేనని నాన్న అనేవాడు.దేశభక్తి..నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు మిలిటరీ ప్రాంతానికి తీసుకెళ్లి ఓ కల్నల్ ఇల్లు చూపించాడు. ఆర్మీ ఆఫీసర్ అయితే ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు తెలుసా.. అన్నాడు. నీకు గౌరవం, డబ్బు కావాలంటే ఆర్మీలో చేరాలన్నాడు. ప్రతి ఆదివారం అక్కడకు తీసుకెళ్లి.. మొదటి ప్రాధాన్యత దేశం.. తర్వాతే ఏదైనా అని నాకు దేశభక్తి నూరిపోశాడు. ఇంటర్ తర్వాత అందరూ ఇంజనీరింగ్ అని వెళ్తే నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్లాను. ఎగ్జామ్లో పాసై, ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసి అకాడమీలో చేరాను.ఆర్మీ శిక్షణ మధ్యలో వదిలేశా..పుణెలో ట్రైనింగ్ తీసుకున్నాను. ఉదయం నాలుగు గంటలకు శిక్షణ మొదలయ్యేది. మూడు నెలలకోసారి సెలవులిచ్చేవారు. 11 రోజులపాటు ఇంటికెళ్లి మళ్లీ ట్రైనింగ్లో చేరేవాళ్లం. రెండేళ్ల తర్వాత ఓసారి ఇంటికి వచ్చినప్పుడు మా నానమ్మ నన్ను వదిలిపెట్టలేదు. ఆమె ప్రేమను చూశాక నేను తిరిగి వెళ్లనని చెప్పాను. జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆర్మీ శిక్షణను మధ్యలో వదిలేయడమే! నానమ్మ ప్రేమను కాదనుకుని వెళ్లిపోయుంటే లైఫ్ మరోలా ఉండేది. ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతూ ఉంటాను అని రవి చెప్పుకొచ్చాడు.చదవండి: హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్ -
'ఏంటీ వీడియో కాల్ చేశావ్ సడన్గా?'.. హీరోయిన్లతో సిద్ధు సరదా సంభాషణ!
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా'. ఈ సినిమాతో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీ నిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని ప్రకటించారు.అయితే ఈ మూవీ రిలీజ్ తేదీని రోటీన్ కంటే భిన్నంగా ప్లాన్ చేశారు. ఇద్దరు హీరోయిన్లతో హీరోకు ఫోన్ కాల్ చేయడం.. ఆ తర్వాత ఇద్దరు హీరోయిన్ల మధ్య మాటల యుద్ధం.. ఫుల్ ఫన్నీగా అనిపిస్తోంది. చివర్లో తెలుసు కదా.. అంటూ సిద్ధు జొన్నలగడ్డ మూవీ రిలీజ్ తేదీని ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 17న ఈ సినిమా రిలీజ్ కానుందని వెల్లడించారు. దీపావళి కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఏదేమైనా అందరికంటే భిన్నంగా.. కొత్తగా మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేయడం క్రియేటివ్గా అనిపిస్తోంది. Two times the fun.Two times the chaos.And an infinite loop of love ❤️#TelusuKada - #LoveU2Bringing the celebration early this Diwali 🎇#TelusuKada Grand Release Worldwide on October 17th ✨STAR BOY #SiddhuJonnalagadda @NeerajaKona #RaashiiKhanna @SrinidhiShetty7… pic.twitter.com/ucc18cIIIL— People Media Factory (@peoplemediafcy) June 2, 2025 -
హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్ ప్రీత్సింగ్
సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాల నుంచి మొదలుపెడితే సెలబ్రిటీల పర్సనల్ విషయాల వరకు అన్నింటిపైనా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. కొందరు వాటిని లైట్ తీసుకుంటే మరికొందరేమో వాటిపై స్పందించి నిజానిజాలు ప్రేక్షకులకు తెలియజేస్తుంటారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల రిలేషన్స్ గురించి ఎన్నో పుకార్లు వస్తుంటాయి. వారిచ్చిపుచ్చుకునే కానుకల గురించైతే చెప్పనక్కర్లేదు.హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్?అలా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గురించి కూడా ఓ గాలి వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది. హైదరాబాద్లో ఆమె ఉంటున్న ఇల్లు తను సంపాదించింది కాదని, ఎవరో రాజకీయ నాయకుడు ఆమెకు కానుకగా ఇచ్చాడన్నది సదరు వార్త సారాంశం. ఈ రూమర్ గురించి రకుల్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. 'హైదరాబాద్లోని ఇల్లు ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారన్న వార్త చూసి మా నాన్న చాలా ఆగ్రహానికి గురయ్యాడు. నా కష్టార్జితం..నిజానికి ఆ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులన్నీ నాన్నే స్వయంగా చూసుకున్నాడు. అలాంటిది ఆ ఇల్లు మా సొంతం కాదన్న వార్త చూడగానే భరించలేకపోయాడు. ఏంటిది? నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొన్న ఇల్లు ఎవరో బహుమతిగా ఇచ్చారని ఎలా అంటారు? అని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఇలాంటి పనికిరాని పుకార్లకు మనం స్పందించాల్సిన అవసరం లేదని నచ్చజెప్పాను. నాన్నేమో.. రిప్లై ఇవ్వాల్సిందే అంటాడు. ఇలాంటి చెత్త రూమర్లను పట్టించుకోనక్కర్లేదని నాన్నను ఎలాగోలా సముదాయించాను' అని రకుల్ చెప్పుకొచ్చింది.సినిమారకుల్ ప్రీత్.. 'కెరటం' సినిమాతో తెలుగులో తన ప్రయాణాన్ని ఆరంభించింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, పండగ చేస్కో, కిక్ 2, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో.., జయ జానకి నాయక, చెక్, ఇండియన్ 2 వంటి పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలీవుడ్పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఇండియన్ 3, దేదే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.చదవండి: అలాంటి వారు పక్కకెళ్లి ఆడుకోండి.. హేటర్స్కు ధనుశ్ స్ట్రాంగ్ కౌంటర్ -
ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డ్: శేఖర్ కమ్ముల కామెంట్స్
నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.ఇకపోతే ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఆడియో లాంఛ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్ చేశారు. కోలీవుడ్ హీరో ధనుశ్పై ప్రశంసలు కురిపించారు.శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. టఈ సినిమాతో హీరో ధనుష్ మరో జాతీయ అవార్డ్ అందుకుంటారు. ఈ సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంతో మరో జాతీయ అవార్డు గెలుచుకుంటాడని భావిస్తున్నా. అతను తప్ప మరెవరూ ఈ పాత్రలో నటించలేరు" అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. నాగార్జున మాట్లాడుతూ.. "ధనుష్ ఒక ఇంటర్నేషనల్ యాక్టర్. అతనిలో గొప్ప టాలెంట్ ఉంది. ధనుష్, శేఖర్ కమ్ముల.. మీరిద్దరూ నన్ను మళ్లీ ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు" అంటూ ప్రశ్నించారు. -
త్వరలో స్కై
‘‘స్కై’లో ప్రతిభ గల టీమ్తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మంచి కథతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు మురళీ కృష్ణంరాజు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వంలో మురళీ కృష్ణంరాజు, శ్రుతీ శెట్టి జంటగా నటించిన సినిమా ‘స్కై’. నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీలక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.ఈ సినిమా టీజర్ విడుదల వేడుకలో పృథ్వీ పెరిచెర్ల మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్గా నాకు ఇది తొలి చిత్రం. ‘స్కై’ ప్రీమియర్ చూసినవారు చాలా బాగుందని చెప్పారు. మా సినిమాని ఆదరిస్తే ఇలాంటి మంచి కథలు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం’’ అన్నారు. ‘‘ఒక కాంపాక్ట్ బడ్జెట్లో పర్ఫెక్ట్గా ఒక మూవీ చేస్తే ఎలా ఉంటుంది అనేందుకు మా ‘స్కై’ ఓ ఉదాహరణ’’ అని సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ చెప్పారు. -
మేఘాలు చెప్పిన ప్రేమ కథ
నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జోడీగా నటించిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’(Meghalu Chappina Prema Katha). విపిన్ దర్శకత్వంలో ఉమాదేవి కోట నిర్మించారు. ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో విపిన్ మాట్లాడుతూ– ‘‘క్లీన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మా సినిమాలో సంగీత విద్వాంసులు ప్రిన్స్ రామవర్మ, ట్రావెల్ కోర్ వారసులు అతిథి పాత్రలు చేశారు’’ అన్నారు. ఉమాదేవి కోట మాట్లాడుతూ– ‘‘నాకు కథలు రాయడం ఇష్టం.నా జీవితంలో కె. విశ్వనాథ్, సిరివెన్నెల సీతారామ శాస్త్రిగార్లను కలవడం ఓ భాగ్యం. ఇంట్లో వాళ్ల సపోర్ట్తో ఈ బ్యానర్ని స్థాపించా. ప్రతి సినిమాలో కళని కనెక్ట్ చేయాలనేది నా ఆశ. అందుకే ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ని సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేలా తీశాం. ఈ సినిమాను సిరివెన్నెలగారికి అంకితం ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘పాటలు చక్కగా వచ్చాయి’’ అన్నారు సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్. కెమేరామేన్ మోహన్ కృష్ణ మాట్లాడారు. -
కామెడీ... మిస్టరీ
‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా, ప్రశాంతి చారులింగా హీరోయిన్గా నటించిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’. కేఎస్కే చైతన్య దర్శకత్వం వహించారు. సునీత, రాజ్కుమార్ బృందావనం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కేఎస్కే చైతన్య మాట్లాడుతూ– ‘‘కామెడీ, మిస్టరీ, ఎమోషన్... ఇలా అన్ని వాణిజ్య అంశాలతో రూపొందిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’.సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఓ కొత్త లోకంలో ఉంటారు. వారికి సరికొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథతో ‘గ్యాంబ్లర్స్’ తీశాం’’ అని రాజ్కుమార్ బృందావనం తెలిపారు. సునీత మాట్లాడుతూ– ‘‘యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. సంగీత్ శోభన్ నటన చాలా కొత్తగా ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మా చిత్రాన్ని నైజాంలో విడుదల చేస్తోంది’’ అని చెప్పారు. -
నేను వారికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు: ఎస్వీ కృష్ణారెడ్డి
‘‘నా సినిమాల ద్వారా ఎందరో ప్రతిభావంతులకు అవకాశాలు ఇచ్చానని చెబుతున్నారు. కానీ వాళ్లందరూ స్వతహాగా ప్రతిభ ఉన్నవారు. నా చిత్రాల ద్వారా వారి ప్రతిభ ప్రేక్షకులకు మరింతగా తెలిసింది. అంతేకానీ నేను వారికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు’’ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం (జూన్ 1) హైదరాబాద్లో ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘నన్ను మొదటి నుంచీ ప్రోత్సహిస్తూ, అండగా నిలబడిన నిర్మాత అచ్చిరెడ్డిగారికి కృతజ్ఞతలు.దర్శకుడిగా నాకు తొలి చాన్స్ ఇచ్చిన హీరో రాజేంద్రప్రసాద్గారికి థ్యాంక్స్’’ అన్నారు. నటి, మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ– ‘‘కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో చేసిన ‘శుభలగ్నం’ చిత్రం నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భర్తను కోటి రూపాయలకు అమ్మే అలాంటి ఘటనలు ఈ రోజు సమాజంలో జరుగుతున్నాయి. అంటే ఆయన సృజనాత్మకతలో ఎంత ముందు చూపు ఉందో ఊహించుకోవచ్చు’’ అని తెలిపారు. ఈ వేడుకల్లో మురళీమోహన్, బ్రహ్మానందం, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, రాజేంద్రప్రసాద్, అలీ, బండ్ల గణేశ్, లయ, ఇంద్రజ, ఆమని, సుచిత్రాచంద్రబోస్ తదితరులు పాల్గొని, ఎస్వీ కృష్ణారెడ్డితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
'పాడేరు 12వ మైలు' సినిమా జూన్ 6న రిలీజ్
సత్యం రాజేష్, శ్రవణ్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'పాడేరు 12వ మైలు'. ఎన్.కె దర్శకత్వం వహించారు. గ్రంధి త్రినాధ్ నిర్మాత. సుహాన హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 6న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం విశేషాలని పంచుకుంది.ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మొదకొండమ్మ తల్లి ఆశీస్సులతో ఈ సినిమాను ముందుకు తీసుకొని వెళుతున్నాం. పొలిమేర , పొలిమేర 2 తరువాత సత్యం రాజేష్ నటించిన పాడేరు 12వ మైలు సినిమా సస్పెన్స, లవ్ ఎలిమెంట్స్ తో రాబోతోందని దర్శకుడు ఎన్.కె చెప్పుకొచ్చారు. హైదరాబాద్, వైజాగ్, పాడేరులో షూటింగ్ జరిగిన ఈ సినిమాకు పీఆర్ సంగీతం అందించారు. నభ మాస్టర్ ఫైట్స్, కళాదర్ నృత్యాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నాయి. -
'చౌకీదార్' నుంచి 'నాన్న' పాట రిలీజ్
నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా 'చౌకీదార్'. తెలుగు, కన్నడ భాషల్లో తీస్తున్న ఈ చిత్రంలో పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ జంటగా నటిస్తున్నారు. డా. కల్లహల్లి చంద్ర శేఖర్ ఈ మూవీ నిర్మిస్తుండగా, చంద్రశేఖర్ బండియప్ప దర్శకుడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఎమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా)నాన్న గొప్పదనం చాటి చెప్పేలా గుండెను పిండేసేలా ఓ చక్కటి బాణీని అందించారు. నాన్నా అంటూ సాగే ఈ పాటను సంతోష్ వెంకీ రచించగా.. విజయ్ ప్రకాష్ ఆలపించారు. సచిన్ బస్రూర్ అందించిన బాణీ అయితే ప్రతీ ఒక్కరినీ కదిలించేలా ఉంది. తండ్రి త్యాగాల్ని, మోసే బాధ్యతల్ని, చూపించే ప్రేమను చాటేలా పాటను రచించారు. లిరికల్ వీడియో చూస్తుంటే సాయి కుమార్ తండ్రిగా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది) -
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. రెండో ఉత్తమ చిత్రంగా పాఠశాల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్లలో విడుదలైన సినిమాలకు ప్రతిష్ఠాత్మక గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది. ఒక్కో ఏడాదికిగానూ ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాల్ని పురస్కారాలకు ఎంపిక చేసింది. 2014 ఏడాదిగానూ సెకండ్ బెస్ట్ ఫిల్మ్గా 'పాఠశాల' చిత్రం ఎంపికైంది.మాహి వి రాఘవ దర్శకత్వం వహించిన 'పాఠశాల' చిత్రాన్ని రాకేశ్ మహాంకాళి, పవన్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఐదుగురు మిత్రులు, ఐదు వారాలపాటు, 5 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. యువత, స్నేహం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను అందంగా చూపించే ఒక అద్భుతమైన కథగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మనసుల్ని తాకిన గొప్ప కథనం, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన విజువల్స్ మేళవింపుతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా 2014 ఏడాది సెకండ్ బెస్ట్ ఫిల్మ్గా గద్దర్ సినీ అవార్డ్కు ఎంపికైంది.ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ పురస్కారానికి పాఠశాల చిత్రం ఎంపికకావడం పట్ల చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. 'పాఠశాల' చిత్రం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2014లో రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపు మా చిత్రానికి ఉన్న శాశ్వతమైన ప్రభావాన్ని, విలువలను మరింత బలపరుస్తోందని అన్నారు. -
స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా
సెలబ్రిటీలు అంటే ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. కొందరు మాత్రం పదేపదే నోరు పారేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఒకరు. నటుడిగా ఈయన్ని వంక పెట్టాల్సిన పనిలేదు. అన్ని రకాల భావోద్వేగాల్ని అవలీలగా పండించేస్తుంటారు. కానీ స్టేజీ ఎక్కితే మాత్రం నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కూడా అలానే అలీపై ఓ బూతు పదాన్ని ఉపయోగించారు.ఈ మార్చిలో 'రాబిన్ హుడ్' సినిమా రిలీజైంది. ఈ చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్.. వార్నర్ని 'దొంగ *** కొడకా' అని అన్నాడు. అప్పుడు ఆ విషయం పెద్ద రచ్చ కావడంతో తర్వాత రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు అదే రాజేంద్ర ప్రసాద్ మరోసారి స్టేజీపై అందరి ముందు నోరు జారాడు.(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది)ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్ని హైదరాబాద్లో ఆదివారం నిర్వహించారు. కృష్ణారెడ్డితో కలిసి పనిచేసిన చాలామంది టాలీవుడ్ నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇదే ఈవెంట్లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్.. అక్కడే ఉన్న కమెడియన్ అలీపై నోరు పారేసుకున్నాడు. బయటకు చెప్పలేని ఓ బూతు పదాన్ని అతడిపై ఉపయోగించాడు.'మీరంతా వస్తున్నారని నాకు చెప్పలేదు. రాకుంటే మిస్ అయ్యేవాడిని. ఏరా అచ్చెన్నా.. మన ఇద్దరం బయటకు వెళ్లాక నీ సంగతి చెప్తా. ఇది మా ఇద్దరికీ అలవాటే. అలీగాడు ఎక్కడున్నాడు *** *** ఇది మనకు కామన్. నేను నిన్న ఎన్టీఆర్ అవార్డ్ తీసుకోవడానికి వెళ్లాను. ఏంటి మీరు చప్పట్లు కొట్టరా? ఎన్టీఆర్ అవార్డ్ తీసుకోవడానికి వెళ్తే కొట్టరా? బ్రెయిన్ పోయిందా మీ అందరికీ.. నేను అడిగి మరీ కొట్టించుకోవడం ఏంటన్నయ్యా.. కొట్టకపోతే మీకు సిగ్గు లేనట్లే' అని రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (ఇదీ చదవండి: ఓటీటీలో టాప్ వెబ్ సిరీస్.. ఫైనల్లీ గుడ్ న్యూస్) -
'ప్రేమ కథలు చాలానే ఉంటాయి….కానీ ఇది మాత్రం'!
క మూవీ సూపర్ హిట్ తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దిల్ రుబా అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ లవ్ స్టోరీ టాలీవుడ్ సినీ ప్రియులకు అంతగా కనెక్ట్ కాలేదు. మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఫర్వాలేదనిపించినా కలెక్షన్లపరంగా రాబట్టిలేకపోయింది. ఈ మూవీ తర్వాత మరోసారి ప్రేమకథతోనే అభిమానుల ముందుకు రానున్నారు. తాజాగా తన కొత్త మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు కిరణ్ అబ్బవరం.అయితే ఈ సారి కాస్తా భిన్నంగానే ఉంటుందని అంటున్నాడు కిరణ్. 'ప్రేమ కథలు చాలానే ఉంటాయి…. కానీ ఇది మాత్రం .. రేపు కలుద్దాం' అంటూ అభిమానుల్లో అంచనాలు పెంచేశాడు. ఈ సినిమాకు సంబంధించి టైటిల్, గ్లింప్స్ సోమవారం విడుదల చేస్తామని ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన పోస్టర్ను పంచుకున్నారు. పోస్టర్ చూస్తుంటే ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో గౌరీ ప్రియ హీరోయిన్గా నటిస్తోంది.ప్రేమ కథలు చాలానే ఉంటాయి….కానీ ఇది మాత్రం ...... !!!రేపు కలుద్దాం ❤️🔥Title & Glimpse Drops TOMORROW, JUNE 2nd at 5:35PM 🌊❤️Extremely happy at this exciting collaboration with the entire team to bring a new magic 🤗@SKNonline #Sairajesh @srigouripriya @Ravinamburii… pic.twitter.com/mXdshmydmu— Kiran Abbavaram (@Kiran_Abbavaram) June 1, 2025 -
మల్లెపూలతో మీనాక్షి చౌదరి.. పూజ చేసిన సుప్రీత
మల్లెపూలు పెట్టుకుని చీరలో అందంగా మీనాక్షి చౌదరిఅమ్మవారికి పూజ చేసి సంప్రదాయంగా సుప్రీతఫ్రెండ్ హల్దీ వేడుకల్లో బిగ్ బాస్ స్రవంతిపచ్చగడ్డిపై సేద తీరుతున్న మృణాల్-పూజా హెగ్డేమరింత బోల్డ్నెస్తో నందిని రాయ్ రచ్చ రచ్చచీరలో నాభి అందాలతో హీరోయిన్ ప్రణీతబాలిలో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
పెద్ద సినిమా.. నేనే రిజెక్ట్ చేశా.. ఎందుకంటే?: ఇలియానా
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ (Ajay Devgn) హిట్ సినిమాల్లో రైడ్ మూవీ ఒకటి. ఇందులో గోవా బ్యూటీ ఇలియానా (Ileana D’Cruz) హీరోయిన్గా నటించింది. రాజ్కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2018లో విడుదలైంది. ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్గా రైడ్ 2 రిలీజైంది.నోరు విప్పిన బ్యూటీకానీ ఇందులో ఇలియానా స్థానంలో వాణీ కపూర్ తళుక్కుమని మెరిసింది. ఇలియానాను సెలక్ట్ చేయకపోవడంపై దర్శకుడు రాజ్ కుమార్ స్పందిస్తూ.. పెళ్లి తర్వాత ఆమె జీవితం మారిపోయిందని.. తను విదేశాలకు వెళ్లిపోవడం వల్లే కథానాయికను మార్చాల్సి వచ్చిందని వెల్లడించాడు. తాజాగా ఈ వ్యవహారం గురించి ఇలియానా పెదవి విప్పింది. రైడ్ 2లో నిన్ను మిస్ అయ్యాం. ఎప్పుడు కమ్బ్యాక్ ఇస్తావ్? అన్న అభిమాని ప్రశ్నకు సోషల్ మీడియా వేదికగా స్పందించింది. రైడ్ సినిమాలో అజయ్ దేవ్గణ్, రాజ్ కుమార్ గుప్తాతో కలిసి పని చేయడం మర్చిపోలేను.అందుకే చేయలేకపోయా..ఈ మూవీ నాకెంతో స్పెషల్. దీని సీక్వెల్లో కూడా నటించమని ఆఫర్ వచ్చింది. కానీ నేనే చేయలేకపోయాను. ఆ అవకాశం వచ్చినప్పుడు నాకు కొడుకు పుట్టాడు. అప్పుడు వాడే నా మొదటి ప్రాధాన్యత. సినిమా టీమ్ ఇచ్చిన షెడ్యూల్ నాకు సెట్టవలేదు. అలా వదులుకోవాల్సి వచ్చింది. అయినా రైడ్ 2లో వాణి కపూర్ చాలా బాగా చేసింది. తన పాత్రకు మరింత అందాన్ని తీసుకొచ్చిందని ప్రోమోలు చూస్తేనే అర్థమైపోతుందని చెప్పుకొచ్చింది.కచ్చితంగా మళ్లీ వస్తా!వెండితెరపై ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నకు.. డైపర్లు మార్చే పనిలో బిజీగా ఉన్నానంటూ బాబు ఫోటోను షేర్ చేసింది. వెండితెరపై రీఎంట్రీ ఉంటుందా? అన్న ప్రశ్నకు తప్పకుండా మళ్లీ సినిమాలు చేస్తానని హామీ ఇచ్చింది. ఇలియానా.. ప్రియుడు మైఖేల్ డోలన్ను 2023లో పెళ్లి చేసుకుంది. వీరికి అదే ఏడాది బాబు పుట్టాడు. ప్రస్తుతం ఇలియానా రెండోసారి గర్భం దాల్చింది.చదవండి: శంకర్ కూతురు ఆ తెలుగు డైరెక్టర్ను అంతమాట అనేసిందేంటి! -
సమంత- రాజ్ డేటింగ్ రూమర్స్.. డైెరెక్టర్ భార్య పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత తాజాగా చేసిన పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది. జిమ్లో వర్కవుట్స్తో పాటు పికిల్ బాల్ ఆడుతున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరుతో పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది. అలా మరోసారి ఇద్దరు కలిసి జంటగా కనిపించడంతో డేటింగ్పై చర్చ మొదలైంది. ఇటీవల శుభం మూవీ రిలీజ్ తర్వాత విమానంలో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోను సామ్ షేర్ చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి.తాజాగా ఈ వీడియో చూసిన తర్వాత డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య శ్యామలి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. 'అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది.. కర్మ వాటిని సరిదిద్దుతుంది.. విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది' అంటూ ఇన్స్టా స్టోరీస్లో రాసుకొచ్చింది. గతంలో కూడా ఆమె వీరిద్దరిపై వస్తున్న డేటింగ్ వార్తలపై పరోక్షంగా స్పందించారు.కాగా.. శుభం మూవీ సక్సెస్ తర్వాత విమానంలో సమంత షేర్ చేసిన ఫోటో చూశాకే రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. శుభం సక్సెస్ మీట్లోనూ రాజ్ నిడిమోరు కనిపించారు. అంతకుముందు ఇద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కానీ ఇప్పటివరకు తమపై వస్తున్న వార్తలపై సమంత కానీ.. రాజ్ కానీ స్పందించలేదు. మరోవైపు సమంత, రాజ్ ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్' అనే కొత్త ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, జైదీప్ అహ్లవత్, వామికా గబ్బి, అలీ ఫజల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది
యంగ్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా ఇంట్లో సెలబ్రేషన్స్ అని కొన్ని ఫొటోలు చేసింది. దీంతో ఈమెకు నిశ్చితార్థం జరిగిందా? పెళ్లెప్పుడు? అబ్బాయి ఎవరు? అని ఇలా రకరకాల ప్రశ్నలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ విషయమై తెగ మాట్లాడుకున్నారు. ఇంకా ఊరుకుంటే ఇది చాలా దూరం వెళ్తుందేమోనని ఊహించిన శ్రీలీల.. మొత్తానికి ఈ ఫొటోలపై క్లారిటీ ఇచ్చేసింది.'నా ముందస్తు పుట్టినరోజు వేడుకల్ని ఇట్లో మేం ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా అమ్మ చూసుకున్నారు' అని శ్రీలీల చెప్పింది. దీంతో పాటు ఓ నాలుగైదు ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకల్లో నటుడు రానా భార్య మిహిక పాల్గొనడం విశేషం.(ఇదీ చదవండి: పరమశివుడిగా సూపర్స్టార్ కృష్ణ.. పోస్టర్ చూశారా?)ఈ ఫొటోలు చూసి శ్రీలీల ఎంగేజ్మెంట్ అని అందరూ అనుకోవడానికి ఓ కారణముంది. ప్రస్తుతం బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్తో కలిసి ఓ సినిమా చేస్తున్న ఈమె.. సదరు హీరోతో డేటింగ్లో ఉందని, త్వరలో పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే శ్రీలీల తాజా ఫొటోలు చూసి అందరూ షాకయ్యారు. క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.'పెళ్లి సందD' మూవీతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. వరస సినిమాలు చేసింది. చివరగా 'రాబిన్ హుడ్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం అఖిల్ 'లెనిన్'లో నటిస్తోంది. అలానే పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లోనూ ఈమెనే హీరోయిన్.(ఇదీ చదవండి: నిఖిల్ పాన్ ఇండియా మూవీ.. ఇన్నాళ్లకు అప్డేట్) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
శంకర్ కూతురు ఆ తెలుగు డైరెక్టర్ను అంతమాట అనేసిందేంటి!
అభిమాన హీరో కళ్ల ముందు కనిపిస్తే చాలు సెల్ఫీలంటూ ఎగబడతారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతుళ్లు అదితి, ఐశ్వర్య కూడా అదే పని చేశారు. తండ్రితో కలిసి షూటింగ్కు వెళ్లినప్పుడు ఓ హోటల్ దగ్గర ఆగారు. అక్కడ మహేశ్బాబు (Mahesh Babu)ను చూడగానే సెల్ఫీ అంటూ అతడి ముందు వాలిపోయారు. అయితే వీళ్లు శంకర్ కూతుర్లని తెలీక.. ఫ్యామిలీతో ఉన్నాను.. ఇప్పుడు సెల్ఫీ ఇవ్వడం కుదరదని పంపేశాడు.అదితితో సెల్ఫీకి నో చెప్పిన మహేశ్దీంతో వాళ్లు నిరాశగా వెనుదిరిగారు. ఇదంతా చూసిన డైరెక్టర్ మెహర్ రమేశ్ (Meher Ramesh).. వెంటనే హీరో దగ్గరకు వెళ్లి.. ఆ అమ్మాయిలు ఎవరన్న విషయం చెప్పడంతో అతడు నాలుక్కరుచుకున్నాడు. శంకర్ దగ్గరకు వెళ్లి.. మీ కూతుర్లని తెలీక అలా చేశానని మహేశ్ సారీ చెప్పాడు. అందుకు శంకర్.. హీరోలంటే ఎలా ఉండాలో వాళ్లక్కూడా తెలియాలి కదా అని రిప్లై ఇచ్చాడు. శంకర్ కూతుర్లు చాలా సింపుల్గా ఉంటారంటూ మహేశ్బాబు ఈ సంఘటనను అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో వెల్లడించాడు.మహేశ్కు సారీ చెప్పిన శంకర్ కూతుర్లుతాజాగా ఇదే సంఘటనను అదితి శంకర్ (Aditi Shankar) ఓ యూట్యూబ్ ఛానల్లో గుర్తు చేసుకుంది. నాన్న సినిమా కోసం మేమందరం ఓ చోటుకు వెళ్తున్నాం. దారిలో ఓ హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. అక్కడ మహేశ్బాబు ఉన్నారు. నేను, నా సోదరి ఆయనకు అభిమానులం. మేము తన దగ్గరకు వెళ్లి ఓ ఫోటో అడిగాం. అందుకాయన.. ఇప్పుడు ఇవ్వలేనమ్మా అని తిరస్కరించారు. డిస్టర్బ్ చేసినందుకు సారీ చెప్పి వెళ్లిపోయాం. వీడియో వైరల్అప్పుడు మహేశ్ బాడీగార్డ్ వెళ్లి.. మేము శంకర్ కూతుర్లమని చెప్పాడు. దాంతో ఆయన మేమున్న టేబుల్ దగ్గరకు వచ్చి మీ కూతుర్లని తెలీదు సర్ అని వివరణ ఇచ్చుకున్నాడు. పర్లేదు.. హీరో ఎలా ఉంటారో వారికి తెలియాలి. అయినా వాళ్లకు ఫోటో కావాలంటే నీ దగ్గరకు వచ్చి అడుగుతారు. ఇస్తావా? లేదా? అనేది నీ నిర్ణయం అని నాన్న అన్నాడు. ఏదో తెలీక నో చెప్పానంటూనే మహేశ్ మాతో ఫోటో దిగాడు అని అదితి చెప్పుకొచ్చింది. ఈ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన జనాలు.. పాపం, మెహర్ రమేశ్ను మహేశ్కు బాడీగార్డ్ను చేసేసిందని కామెంట్లు చేస్తున్నారు. Finally hearing from @shankarshanmugh daughter about her funny experience with @urstrulyMahesh.Papam @MeherRamesh ni body guard anukundi 😂😂#MaheshBabu #Khaleja4K #ssmb29 pic.twitter.com/TfzfBLePGo— 👌🌟Ⓜ️🅱️2️⃣9️⃣ (@SPYderLoading) May 31, 2025 చదవండి: కమెడియన్ అలీకి చిరంజీవి గిఫ్ట్.. ఈసారి స్పెషల్గా..! -
పరమశివుడిగా సూపర్స్టార్ కృష్ణ.. పోస్టర్ చూశారా?
సూపర్స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా 'జటాధర' మూవీ యూనిట్ ఆయనకు నివాళులు అర్పించింది. ఈ క్రమంలో కృష్ణని స్మరించుకుంటూ ఆయన పరమశివుడు రూపంలో ఉన్న ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. 'హ్యాపీ బర్త్డే టు ది కింగ్ ఆఫ్ చర్మిష్మా' అని రాసుకొచ్చారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'జటాధర' సినిమా షెడ్యూల్ రీసెంట్గా పూర్తి చేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సమంత ‘శుభం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)పాన్ ఇండియా మూవీగా తీస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'జటాధర'ను తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సుధీర్ బాబు హీరో కాగా సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న జటాధర చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేసుకుంటోంది. త్వరలో రిలీజ్ వివరాలు ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: నిఖిల్ పాన్ ఇండియా మూవీ.. ఇన్నాళ్లకు అప్డేట్) -
ఖలేజా రీ రిలీజ్.. అనూహ్యంగా ట్రెండింగ్లోకి వచ్చిన నటి.. అసలు విషయం ఇదే!
మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూవీ ఖలేజా. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ చేశారు. అప్పట్లో థియేటర్లలో అంతగా రాణించని ఈ చిత్రం.. రీ రిలీజ్లో మాత్రం ఊహించని రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రీ రిలీజ్ రోజు మహేశ్ బాబు అభిమానులు థియేటర్లలో ఓ రేంజ్లో సందడి చేశారు. ఓ అభిమాని ఏకంగా పామును పట్టుకుని మూవీ థియేటర్కు వచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది.అయితే ఈ సినిమా రీ రిలీజ్ తర్వాత అనూహ్యంగా ఆమె పేరు ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఆమె ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అనుష్క అని అందరూ అనుకుంటున్నారేమో. అస్సలు కాదు.. ఓ చిన్న పాత్రలో మెప్పించిన ఆమె ఉన్నట్టుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి.ఈ సినిమాను ఎక్కువగా రాజస్థాన్లో షూట్ చేశారు. ఆ సమయంలో టాక్సీ డ్రైవర్ అయినా హీరో దిలావర్ సింగ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తాడు. ఈ సీన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకున్నాయి. ఈ సీన్స్లో నటించిన దిలావర్ సింగ్ భార్యగా నటించిన ఆమె దివ్య మేరి సిరియాక్ అని నెట్టింట తెగ వైరలైంది. అయితే ఇది చూసిన ఆమె.. ఖలేజా మూవీలో తాను నటించలేదని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె క్లారిటీ ఇచ్చింది.తాజాగా ఖలేజా రీ రిలీజ్ కావడంతో దిలావర్ సింగ్ భార్యగా నటించింది దివ్య మేరి సిరియాక్ అని నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఆ రోల్ తాను చేయలేదని స్పష్టం చేసింది. తానేనని చాలామంది పొరపాటుగా పోస్ట్ చేశారని తెలిపింది. View this post on Instagram A post shared by Divya Mary Cyriac (@divyacyriac) -
జూదం కోసం సీక్రెట్ సొసైటీ.. ఆసక్తికరంగా ‘గ్యాంబ్లర్స్’ ట్రైలర్
సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’ (Gamblers). చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ని చిత్రబృందం విడుదల చేసింది. ‘ఆడడం చేతగానివాడికి జూదం అంటే నేరం అనిపిస్తుంది. ఆడడం తెలిసిన వాడికి జూదం నేరం కాదు’ అనే డైలాగ్తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభం అయింది. సీక్రెట్ సొసైటీలోకి ఆహ్వానించడం.. అక్కడ ఏది నిజం కాదు చెప్పడం.. రూ.100 కోట్ల డైమండ్ మిస్ అయినట్లు ట్రైలర్లో చూపించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు.ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత రాజ్ కుమార్ బృందావనం మాట్లాడుతూ '' గతంలో మా సంస్థలో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో 'శ్రీవల్లి' అనే సినిమాను నిర్మించాం. తాజాగా మరో వైవిధ్యమైన కాన్సెప్ట్తో తాజాగా 'గ్యాంబ్లర్స్' చిత్రాన్ని నిర్మించాం. సినిమాలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైనర్గా అందరి మనసులను ఈ చిత్రం దోచుకుంటుంది' అన్నారు. మరో నిర్మాత సునీత మాట్లాడుతూ ''యూత్ఫుల్ ఎంటర్టైనర్గా అన్ని ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయి. మా సంస్థ నుంచి రాబోతున్న మరో వైవిధ్యమైన చిత్ర. మా బ్యానర్ నుంచి కొత్త కాన్సెప్ట్లు చిత్రాలు అందించాలన్నదే మా లక్ష్యం.ఈ సినిమాలో డిఫరెంట్ సంగీత్ శోభన్ను చూడబోతున్నారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి అంశం ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. నూతన ప్రతిభను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో మా బ్యానర్లో సినిమాలు చేస్తున్నాం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మా పాటలను విడుదల చేశాం' అన్నారు. దర్శకుడు కేఎస్కే చైతన్య మాట్లాడుతూ '' ఈ చిత్ర కథ చెప్పగానే నిర్మాతలు ఎంతో ఎక్జ్సైట్ అయ్యారు. ఫుల్ ఫ్యాకేజీలా ఈ సినిమా ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయి. కామెడీ, గ్లామర్, మిస్టరీ కలబోతగా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త లోకంలో ఉంటారు. సరికొత్తగా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నాం. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ పర్పార్మెన్స్ పొటెన్షియాలిటీని చూడబోతున్నారు అన్నారు. -
నిఖిల్ పాన్ ఇండియా మూవీ.. ఇన్నాళ్లకు అప్డేట్
హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'స్వయంభు'. పీరియాడికల్ సబ్జెక్ట్తో తీస్తున్న చిత్రం కావడంతో చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకొంటోంది. ఇప్పుడు అది చివరి దశకు వచ్చేసినట్లు ఉంది. ఈ క్రమంలోనే నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే త్వరలో టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సమంత ‘శుభం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 'బాహుబలి' తరహా సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నారు. సంయుక్త హీరోయిన్. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో హీరో నిఖిల్తో పాటు ఈమె కూడా కత్తి పట్టుకుని కదన రంగంలో ఉన్నట్లు కనిపించింది. మరి మూవీ ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.'కార్తికేయ 2' మూవీతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. తర్వాత 'స్పై', '18 పేజీస్' చిత్రాలు చేశాడు గానీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇతడి దృష్టంతా 'స్వయంభు' మీదే ఉంది. దీంతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: కమెడియన్ అలీకి చిరంజీవి గిఫ్ట్.. ఈసారి స్పెషల్గా..!) -
కమెడియన్ అలీకి చిరంజీవి గిఫ్ట్.. ఈసారి స్పెషల్గా..!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి కమెడియన్ అలీ (Comedian Ali) ఆప్తమిత్రుడు. ప్రతి ఏడాది వేసవికి అలీతో పాటు బ్రహ్మానందానికి ఓ బహుమతి పంపిస్తుంటారు. అవే మామిడి పండ్లు. ఎప్పటిలాగే ఈసారి కూడా తన ఫామ్హౌస్లో పండిన మామిడి పండ్లను ఈసారి కూడా అలీకి పంపించాడు. అవి చూసి అలీ దంపతులు మురిసిపోయారు.ఈసారి ప్రత్యేకంగా..అయితే ఈసారి వాటికి అదనంగా మరిన్ని బహుమతులు వచ్చాయి. అవే ఆవకాయ పచ్చడి, ఉప్మా, పులిహోర, కేసరి, రసం, పొంగల్.. వంటి రెడీ టు మిక్స్ పొడులు. వాటన్నింటిని చూసి అలీ భార్య జుబేదా తెగ సంబరపడిపోయింది. చిరంజీవి అన్న తమకోసం ప్రేమగా పంపారని పేర్కొంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇన్స్టంట్ వంట..అత్త సురేఖ చేసే వంటల్ని అందరికీ వడ్డించాలన్న సంకల్పంతో ఉపాసన.. అత్తమ్మాస్ కిచెన్ పేరిట గతేడాది ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన విషయం తెలిసిందే! ఇక్కడ పచ్చళ్లతో పాటు అప్పటికప్పుడు ఈజీగా వంటలు చేసుకునేలా రెడీ టు మిక్స్ పొడులు కూడా అందుబాటులో ఉన్నాయి. చిరు సినిమాల విషయానికి వస్తే.. ఈయన చివరగా భోళా శంకర్ (2023) సినిమాలో నటించాడు. ఏడాదిగా వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడితో కలిసి ఓ సినిమా (#Mega157) చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Zubeda Ali (@zubedaspage) చదవండి: ప్రాణాలతో చెలగాటమాడే గేమ్.. ఫైనల్ సీజన్ ట్రైలర్ చూశారా? -
ఓటీటీలోకి సమంత ‘శుభం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సమంత నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం శుభం(Subham). ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి నటించారు. మే 09న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో మెరిసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నెల 13 నుంచి జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ పోస్టర్ను షేర్ చేసింది. శుభం కథేంటంటే..వైజాగ్లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను(హర్షిత్రెడ్డి)‘మన టౌన్ కేబుల్ టీవీ’ ఆపరేటర్. అతని స్నేహితులు(గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ)లకు అల్రేడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరిదా, గాయత్రి(శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి) చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా.. బ్యాచిలర్ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లీ(శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్ అయిపోతాడు. ఫస్ట్నైట్ రోజు శ్రీవల్లీ శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్ మెదలవుతుంది. రాత్రి 9గంటలు కాగనే శ్రీవల్లి టీవీ ఆన్ చేసి ‘జన్మజన్మల బంధం’ సీరియల్ చూస్తుంది.ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీను అడిగితే..దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిసుంది. ఇది తన ఒక్కడి సమస్యే అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ(సమంత) వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది? అనేది తెలియాలంటే ‘శుభం’ సినిమా చూడాల్సిందే. This June 13th, katha aarambham on JioHotstar 💫 Chacchina choodalsindhe 👀 #SubhamOnJioHotstar #Subham @Samanthaprabhu2 @TralalaPictures #JioHotstar pic.twitter.com/If7zN9utiY— JioHotstar Telugu (@JioHotstarTel_) June 1, 2025 -
సినిమా హిట్టయినా అవకాశాలు నిల్.. దానిపైనే ఫోకస్ పెట్టిన బ్యూటీ
కృతి శెట్టి అంటే చటుక్కున గుర్తు రాకపోవచ్చు. కాని, బేబమ్మ అంటే ‘సి’ సెంటర్ ప్రేక్షకుడు కూడా గుర్తు పట్టేస్తాడు. పక్కించి అమ్మాయిలా కనిపించే కృతి చెప్పిన ముచ్చట్లు కొన్ని మీకోసం... తెలుగులో కృతి శెట్టి (Krithi Shetty) మొదటి సినిమా ‘ఉప్పెన’లో బేబమ్మగా అందరినీ మైమరపింపజేసింది. ఆ తర్వాత వరుసగా ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సినిమాల సక్సెస్తో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. లక్ ఫ్యాక్టర్ ఎంతోకాలం పని చేయలేదు. రామ్ పోతినేనితో నటించిన ‘వారియర్’, నితిన్తో నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’, నాగ చైతన్యతో నటించిన ‘కస్టడీ’ అన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో అవకాశాలు తగ్గాయి. మాతృ భాష ఏదంటే?అనుష్క శెట్టి, ఐశ్వర్యా రాయ్, పూజా హెగ్డేలాంటి అందాల భామలు వచ్చిన మంగుళూరు ప్రాంతం నుంచే కృతి శెట్టి కూడా వచ్చింది. తుళు ఆమె మాతృభాష. కృతి శెట్టి తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గర కావడానికి పట్టుదలతో తెలుగు నేర్చుకుంటోంది. తెలుగు భాష మీద గ్రిప్ సంపాదిస్తే, క్యారెక్టర్ని ఇంకా బాగా పండించవచ్చని కృతి శెట్టి నమ్ముతుంది.ఆచితూచి..‘ఉప్పెన’ సూపర్ హిట్ తర్వాత రెమ్యునరేషన్ విపరీతంగా పెంచిన కృతి శెట్టి – ఇప్పుడు మాత్రం ఆచి తూచి అడుగేస్తోంది. ‘లవ్ టు డే’, ‘డ్రాగన్’ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా చేరువ అయిన ప్రదీప్ రంగనాథన్ సరసన నటిస్తున్న– ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా మీదే కృతి శెట్టి ఆశలన్నీ పెట్టుకుంది. నయనతార ఈ సినిమాకి నిర్మాత కాగా, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. అయితే ఈ సినిమా రిలీజ్, రిజల్ట్ కోసం ఇంకో నాలుగు నెలలు ఆగాల్సిందే!హిట్ అయినా అవకాశాలు నిల్మలయాళంలో టొవినో థామస్తో చేసిన ‘ఎఆర్ఎమ్’ హిట్ అయినా, మలయాళంలో అవకాశాలు రాలేదు. తనతో జీవితం పంచుకునేవాడిలో నిజాయితీ, దయ ఉండాలని, అన్ని విషయాల్లో పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. భరించరాని ఒత్తిడికి లోనయినప్పుడు, ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు నిద్రపోతానని, ఏ ఆర్టిస్టుకి అయినా తగినంత గాఢ నిద్ర అవసరం అని చెప్పింది. మోహన్లాల్ కుమారుడు ప్రణవ్ యాక్ట్ చేసిన ‘హృదయం’లోని ‘దర్శనా’ సాంగ్ అంటే పిచ్చి. కారులో ట్రావెల్ అవుతున్నంత సేపు అదే పాట వింటూ ఉంటానంది.చదవండి: కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే? -
Miss World 2025: ఆరడుగుల బ్యూటీ.. బెడ్రూమ్లో భర్త చేతిలో నరకం
అందాల సుందరి కిరీటం గెలుచుకోవడం గొప్ప గౌరవం. అంతకు మించి గొప్ప అవకాశాలకు మార్గం. అందులోనూ ప్రపంచ సుందరి కిరీటం అంటే... అంతకు మించి.. అయితే మిస్ వరల్డ్ కిరీటం దక్కగానే అన్నీ దక్కేసినట్టే అనేది అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యం అనేది నిజం. అడ్డంకులెన్నో అధిగమించి.. అందాల రాణి అనే అంతర్జాతీయ కిరీటం అందుకున్నా... అత్తింట్లో అష్టకష్టాలు పడే సాదా సీదా అమ్మాయిలు కూడా ఉంటారు. అలాంటి మహిళే యక్తా ముఖి.ఆమె 1999లో మిస్ వరల్డ్గా భారతదేశానికి గౌరవం తీసుకువచ్చిన యుక్త ముఖి(Yukta Mukhi)... 5.11 అంటే షుమారు 6 అడుగుల హైట్తో కిరీటం దక్కించుకుందే కానీ అందలాలు అందుకోవడంలో మాత్రం విజయం సాధించలేకపోయింది. ఆ ఒక్క గెలుపు తప్ప ఆ తర్వాత ఏ రకమైన సంతృప్తినిచ్చే గమ్యాన్నీ ఆమె చేరుకోలేకపోయింది.మిస్ వరల్డ్గా టైటిల్ సాధించిన తర్వాత, ఎన్నో ఆశలతో, తన ముందున్న ఐశ్వర్య రాయ్ వంటివారి విజయాల స్ఫూర్తితో యుక్త ముఖీ వెండితెరపై అడుగుపెట్టింది. తొలిగా 2001లో పూవెల్లమ్ ఉన్ వాసమ్ అనే తమిళ చిత్రంలో ‘యుక్తాముఖి’ అనే పాటలో కనిపించే అతిధి పాత్రతో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది. అనంతరం 2002లో అఫ్తాబ్ శివ్దాసాని పక్కన ’ప్యాసా’ చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసినా.. ఆ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత మార్కెట్ అనే సినిమా షూటింగ్లో ఉండగా, గాయం వల్ల ఆ సినిమా నుంచి వైదొలగింది. అనంతరం కబ్ క్యోం కహా, హమ్ తీనోం..సినిమాలకు సంతకం చేసినా, అవి క్లాప్ కొట్టకుండానే అటకెక్కాయి. ఆ తర్వాత మరో రెండు ప్రాజెక్టులు కూడా అలాగే జరిగాయి. తర్వాత ’కట్పుత్లీ’, ’లవ్ ఇన్ జపాన్’, ’మెమ్సాహబ్’ వంటి చిత్రాల్లో నటించినా, అవి కూడా విజయవంతం కాలేదు. దాదాపు 9 ఏళ్ల తర్వాత 2019లో ’గుడ్ న్యూస్’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో మాత్రమే ఆమె కనిపించింది. విచిత్రంగా వ్యక్తిగత జీవితం కూడా ఆమెకి విషాదాన్నే మిగిల్చింది. న్యూయార్క్కు చెందిన వ్యాపారవేత్త ప్రిన్స్ తులిని 2008లో యుక్త ముఖీ, వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు అయితే, కొన్నేళ్ల పాటు భర్త చేతిలో అసహజ లైంగిక వాంఛలతో, చిత్రహింసలకు గురైన యుక్తా ముఖి 2013లో భర్త , అత్తింటి వారిపై సదరు సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసు పెట్టింది. చివరికి 2014లో ఈ దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. సినీ రంగం నుంచి దూరమైన తర్వాత, ప్రస్తుతం 48 ఏళ్ల వయసులో యుక్త ముఖీ సామాజిక సేవలో నిమగ్నమైంది. ఎయిడ్స్ బాధితులు, థలసీమియా, బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల కోసం పనిచేస్తోంది. అలాగే అవయవదానాన్ని ప్రోత్సహిస్తూ, మరోవైపు బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. మురికివాడల్లోని బాలికలకు ఆరోగ్యం, శారీరక అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటోంది. -
నటిగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ సింగర్!
‘కలర్ఫోటో’, ‘బెదురులంక 2012’ చిత్రాలతో అందరిని ఆకట్టుకున్న నిర్మాత రవీంద్ర బెనర్జీ..ఇప్పుడు మరో వైవిధ్యమైన ప్రేమకథని తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న‘దండోరా’లో బలమైన ప్రేమ కథాంశంతో పాటు కఠినమైన నిజాలను, సమాజంలో కొనసాగుతోన్న సామాజిక దుష్పప్రవర్తలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య తదితరులు ప్రధాన పాత్రల్లో మెప్పించనున్నారు.ఇప్పుడు టాలెంటెడ్ సింగర్ అదితి భావరాజు నటిగా ఈ చిత్రంతో సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ను ఆలపించిన అదితి..‘దండోరా’ చిత్రంలో నటనా ప్రతిభను ప్రదర్శించనుంది. ఆమె ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.‘దండోరా’ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పలు కీలక షెడ్యూల్స్ను పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన మూవీ ఫస్ట్ బీట్ టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాబోయే రోజుల్లో సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు. -
ఈజీగా టచ్ చేయడానికి మేం ఆట బొమ్మలమా? : నిత్యామీనన్ ఫైర్
దక్షిణాది నటీమణుల్లో నటి నిత్యామీనన్(Nithya Menen) రూటే వేరయ్యా..అని అనవచ్చు. పిట్ట కొంచెం కూత ఘనం లెక్క ఈ భామది. బాల నటిగానే సినీ రంగ ప్రవేశం చేసిన ఈ మలయాళ అమ్మడు మాతృభాషలోనే కథానాయకిగానూ పరిచయం అయ్యారు. ఆ తరువాత తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో ఎంట్రీ ఇచ్చారు. అలా తమిళంలో 180 అనే చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తరువాత వరుసగా అక్కడ నటిస్తున్న నిత్యామీనన్ మణిరత్నం దర్శకత్వంలో ఓ కాదల్ కణ్మణి చిత్రంలో నటించి బాగా పాపులర్ అయ్యారు.ఇకపోతే ఇటీవల తిరుచ్చిట్రం ఫలం చిత్రంలో ధనుష్తో జత కట్టిన ఈమె ఆ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్నారు. తాజాగా మరోసారి ధనుష్ సరసన నటించిన ఇడ్లీ కడై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతికి జంట గా తలైవన్ తలైవి చి త్రంలో నటిస్తున్నా రు.కాగా నటి నిత్యామీనన్కు కాస్త తల బిరుసు తనం ఎక్కువనే ముద్ర ఉంది. ఆమె ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. ఈ బ్యూటీ ఇటీవల ఒక భేటీలో చాలా మంది మగవారు సగటు మహిళల మాదిరిగా నటీమణులను భావించరన్నారు. నటీమణులను ఈజీగా టచ్ చేయవచ్చని భావిస్తారన్నారు. తాము ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. కరచాలనం అంటూ తమను టచ్ చేయడానికి ఎగబడతారని, అదే సాధారణ మహిళలను కరచాలనం అడుగుతున్నారా ?. అలా ఈజీగా టచ్ చేయడానికి తామేమన్నా ఆట బొమ్మలమా? అని నటి నిత్యామీనన్ ప్రశ్నించారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. కొద్ది రోజుల క్రితం నిత్యామీనన్ ఓ ఈవెంట్కి వెళ్లింది. అక్కడ ఓ అభిమాని ఆమెకు షేక్హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ నిత్యామీనన్ అతనికి నమస్కారం చేసి తనకు జలుబు ఉందని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత వేదికపై ఉన్న నటుడిని కౌగిలించుకుని చేయి ఇచ్చారు. ఈ వీడియోని షేర్ చేస్తూ నిత్యామీనన్ను నెటిజన్స్ ట్రోల్ చేశారు. దీనికి కౌంటర్గా తాజాగా నిత్యామీనన్ పై విధంగా వివరణ ఇచ్చింది. -
21 సినిమాలు చేశా...ఒక్క ముద్దు సీన్ లేదు, కానీ .. : తమిళ హీరో
తమిళ హీరో విష్ణు విశాల్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించి విజయాలు అందుకున్నారు. అలాగే ఎఫ్ఐఆర్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన విష్ణు విశాల్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. కాగా తాజాగా విష్ణు విశాల్ నిర్మాత రాహుల్కు చెందిన రోమియో పిక్చర్స్, కేవీ దురైలతో కాలి తన విష్ణు విశాల్ స్టూడియో పతాకంపై ఓహో ఎందన బేబీ అరే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తన పెదనాన్న కొడుకు రుద్రను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈయన ఇంతకుముందు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ వద్ద దర్బార్ తదితర చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం.అలాగే నటుడు విష్ణు విశాల్ నిర్మించిన చిత్రాల నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. కాగా ఓహో ఎందన బేబీ చిత్రంలో నటుడు విష్ణు విశాల్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నటి మిథులా భాస్కర్ నాయకిగా నటిస్తున్నారు. దీనికి నటుడు కష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలైలో తెరపైకి రావడానికి ముస్తాబు అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, దర్శక నిర్మాతలు శుక్రవారం చైన్నెలో మీడియాతో ముచ్చటించారు.విష్ణు విశాల్ మాట్లాడుతూ..‘ ఇది పూర్తిగా రొమాంటిక్ ఎంటర్టైనర్. మా పెదనాన్న కొడుకు రుద్ర ఇందులో హీరోగా నటిస్తున్నాడు. తనకు చిన్నప్పటి నుంచి సినిమా రంగంపై ఆసక్తి ఉంది. పెదనాన్న ప్రోత్సాహంతోనే నేను కూడా నటుడిని అయ్యాను. రుద్ర కూడా అలానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. నేను ఇప్పటి వరకు 21 సినిమాల్లో హీరోగా నటించాను కానీ ఒక్క ముద్దు సీన్ కూడా లేదు. కానీ రుద్ర మాత్రం తొలి చిత్రంలోనే హీరోయిన్తో మూడు ముద్దు సన్నివేశాల్లో నటించాడు(నవ్వూతూ..). ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది. జులైలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’అన్నారు. -
ఓటీటీలో అదరగొడుతున్న చిన్న సినిమా
చిన్న చిత్రాలకు ఓటీటీలు వరంగా మారుతున్నాయి. థియేటర్స్లో ఆడని కొన్ని చిత్రాలు ఓటీటీలో మంచి విజయం సాధిస్తున్నాయి. బడా సినిమాలను పక్కకునెట్టి టాప్లో దూసుకెళ్తున్నాయి. అలా ఓటీటీలో అదరగొడుతున్న మరో చిన్న చిత్రమే ‘టుక్ టుక్’.తెలుగమ్మాయి శాన్వి మేఘన, ‘కోర్ట్’ఫేం హర్ష్ రోషన్, సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్, సోషల్ మీడియా ఫేమ్ స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో థియేటర్లో విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఇక ఇటీవల అమెజాన్ ప్రైమ్లోకి వచ్చిన ఈ చిత్రం..అక్కడ టాప్ వ్యూస్తో దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాల్లో టుక్ టుక్ మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 100 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఒక్క చిన్న చిత్రానికి ఈ స్థాయిలో వ్యూస్ రావడం గొప్ప విషయమే. వీక్షకులు ఈ సినిమాను అంతగా ఆదరించడమే కాకుండా, ప్రతి క్యారెక్టర్ను, ప్రతి నటుడి నటనను ప్రశంసిచడం సంతోషంగా ఉందని చిత్రబృందం పేర్కొంది. మంచి కంటెంట్తో వస్తే ఆదరణ ఉంటుందనే ఈ చిత్రం మరోసారి నిరూపించిందని అన్నారు.టుక్ టుక్ కథేంటి?ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు(హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బుల కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకచవితి చేస్తారు. ఆ ఊళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉండటం, నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక పాత స్కూటర్ ని ముగ్గురు కూర్చునే టుక్ టుక్ బండిలా తయారుచేస్తారు. ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు. ఆ తెల్లారి నుంచి ఆ బండి దానంతట అదే ఆపరేట్ అవుతుండటంతో అందులో దేవుడు వచ్చాడు అనుకుంటారు. దీంతో స్కూటర్ లో దేవుడు ఉన్నాడు, ఏం అడిగినా హ్యాండిల్ అటు ఇటు ఊపి అవునా, కదా అని సమాధానాలు చెప్తాడు అని ఊళ్ళో ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు.ఈ క్రమంలో ఆ స్కూటర్ లో ఉంది దేవుడు కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఈ ముగ్గురు కుర్రాళ్ళని కాస్త భయపెడుతుంది కూడా. మరి ఆ స్కూటర్ లో ఉన్న ఆత్మ ఎవరిది? ఆ స్కూటర్ లో ఎందుకు ఉంది? ఈ ముగ్గురు కుర్రాళ్ళు అందులో ఆత్మ ఉందని తెలిసాక ఏం చేసారు? నవీన్(నిహాల్ కోదాటి) - శిల్ప(శాన్వి మేఘన)ల ప్రేమ కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
సక్సెస్ అంటే...
నార్నే నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. ఈ సినిమాలో సంపద హీరోయిన్. చింతపల్లి రామారావు, ఎం. సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది.హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సతీష్ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందించాం. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపర్చదు’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎన్టీఆర్గారు ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారు’’ అన్నారు చింతపల్లి రామారావు. -
నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తి అవి: మంచు మనోజ్
‘‘తొమ్మిదేళ్ల తర్వాత ‘భైరవం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. నన్ను ఎంతో గొప్పగా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి సపోర్టు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను మళ్లీ ఆశీర్వదించిన సినీ కళామతల్లికి నమస్కరిస్తున్నాను. ఈ చిత్రంలో నా వాయిస్, డిక్షన్ మా నాన్నగారిలా (మోహన్బాబు) అనిపించిందంటున్నారు. ఇది కావాలని ట్రై చేయలేదు. అది డీఎన్ఏ. అవి ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి’’ అని మంచు మనోజ్ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా, అదితీ శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భైరవం’.విజయ్ కనకమేడల దర్శకత్వంలో జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం మే 30న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం ‘బ్లాక్ బస్టర్ బీభత్సం’ పేరుతో నిర్వహించిన ప్రెస్మీట్లో విజయ్ కనకమేడల మాట్లాడుతూ– ‘‘ముగ్గురు హీరోలని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. కానీ, కథలో మూడు క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయడం కష్టం. ముగ్గురు హీరోలకి ఇది మంచి కమ్ బ్యాక్ అని ఆడియన్స్ చెప్తుంటే హ్యాపీగా అనిపించింది’’ అన్నారు.సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా నటనకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది నా కెరీర్లో మోస్ట్ మెమొరబుల్ మూవీ’’ అని చెప్పారు. ‘‘ఇంత మాస్ క్యారెక్టర్ నేనెప్పుడూ చేయలేదు’’ అని పేర్కొన్నారు నారా రోహిత్. ‘‘ముగ్గురు హీరోలతో సినిమా చేసి, హిట్ సాధించాను. ఇక రీ రిలీజ్ సినిమాలను శుక్రవారం కాకుండా సోమవారం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. దీనిపై చర్చలు జరగాలి’’ అని కేకే రాధామోహన్ చెప్పారు. -
బ్యాచిలర్ కష్టాలు
నటుడిగా, హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రవీణ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్జే శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటించారు. ఎస్జే మూవీస్పై లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.వికాస బడిస సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘నా అంగీ జాతీయం... నీ లుంగీ జాతీయం...’ అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్జే శివ మాట్లాడుతూ– ‘‘హంగర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బ్యాచిలర్ కష్టాలు, బ్యాచిలర్ లైఫ్లో ఉండే ఆనందాలను తెలియజేస్తూ విష్ణువర్థన్ రాసిన ‘నా అంగీ జాతీయం..’పాటని అనురాగ్ కులకర్ణిపాడారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
కథా చర్చల్లో..?
‘‘కొన్ని క్షణాలు మీ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. లెజెండరీ విజయేంద్ర ప్రసాద్గారితో సమయం గడపడం అలాంటిదే. ఆయన జ్ఞానం, వినయం, ఆలోచనల్లోని స్పష్టత నిజంగా స్ఫూర్తిదాయకం’’ అంటూ పూరి కనెక్ట్స్ ‘ఎక్స్’ ఖాతాలో విజయేంద్ర ప్రసాద్, పూరి జగన్నాథ్ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు ఈ సంస్థ ప్రతినిధులు. దాంతో రచయిత విజయేంద్ర ప్రసాద్–దర్శకుడు పూరి జగన్నాథ్ ఎందుకు కలిశారు? అనేది హాట్ టాపిక్గా మారింది. విజయ్ సేతుపతి హీరోగా తాను తెరకెక్కించనున్న సినిమా కథా చర్చల కోసమే విజయేంద్ర ప్రసాద్ని పూరి కలిశారనే ఊహాగానాలు నెలకొన్నాయి.ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. జూన్ చివర్లో చిత్రీకరణను ప్రారంభించేందుకు హైదరాబాద్, చెన్నై లొకేషన్స్ను రెక్కీ చేస్తున్నారు. మరి.. వార్తల్లో ఉన్నట్లు ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో భాగంగానే విజయేంద్ర ప్రసాద్ను పూరి జగన్నాథ్ కలిసి ఉంటారా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ మూవీ.. టాప్ టెన్లో ట్రెండింగ్!
ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన టాలీవుడ్ చిత్రం చౌర్యపాఠం. ఓ సినిమా డైరెక్టర్.. బ్యాంక్ దొంగతనానికి ప్రయత్నిస్తే ఏమైందనే కాన్సెప్ట్తో తెరకెక్కించారు. ఈ చిత్రం ఏప్రిల్ 24న థియేటర్లలో సందడి చేసింది. అయితే ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన దక్కించుకుంది. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసిన 'చౌర్య పాఠం (Chaurya paatam) ఓటీటీలో దూసుకెళ్తోంది. ఏకంగా టాప్ టెన్లో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ అమెజాన్లో టాప్-7లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని చౌర్యపాఠం మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.(ఇది చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఈ సినిమా కథేంటంటే..చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ. -
ఖలేజా రీ రిలీజ్.. మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చాలా రోజుల తర్వాత ఆయన అభిమానులను అలరించారు. ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ బ్లాక్బస్టర్ భైరవం పేరుతో సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన హీరో మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రీ రిలీజ్ సినిమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.రీ రిలీజ్ సినిమాలు వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో పెట్టుకుంటే బాగుంటుందని మనోజ్ సూచించారు. అలా చేయడం వల్ల కొత్త సినిమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. వీకెండ్స్లో విడుదల చేస్తే మన సినిమాను ఇంకో సినిమాతో చంపేసినట్లు ఉంటుందన్నారు. ఎలాగైనా ఏ సినిమాకు ఉండే బలం.. ఆ సినిమాలకు ఉంటుంది.. ఎందుకంటే వీకెండ్స్లోనే అందరికీ టైమ్ దొరుకుతుందని తెలిపారు. ఈ విషయంపై సినీ పెద్దలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు మంచు మనోజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇదే ఈవెంట్లో కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్పై ప్రశ్న ఎదురవడంతో మనోజ్ స్పందించారు. ఇది సినిమా ఈవెంట్.. ఇక్కడ కేవలం సినిమా గురించే మాట్లాడుకుందాం.. ఎందుకంటే ఒక సినిమా వెనుక ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసని అన్నారు. మనోజ్ గతంలో కన్నప్ప సినిమాపై తాను చేసిన సరదాగా మాట్లాడానని తెలిపారు. ఆ సినిమా వెనుక ఉండే కష్టం నాకు తెలుసు.. కన్నప్ప ఘన విజయం సాధించాలని విష్ణు అన్నకు కోసం ఆల్ ది బెస్ట్ అంటూ మంచు మనోజ్ మాట్లాడారు.కాగా.. భైరవం రిలీజ్ అయినరోజే మహేశ్ బాబు నటించిన ఖలేజా విడుదలైంది. ఈ సినిమాకు సైతం మహేశ్ బాబు ఫ్యాన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్లోనూ ఖలేజాను రీ రిలీజ్ చేశారు. మొదటి రోజే థియేటర్లలో మహేశ్ బాబు అభిమానులు డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు. -
చిరంజీవితో శేఖర్ కమ్ముల.. ఇది చాలా స్పెషల్
తెలుగు దర్శకుల్లో శేఖర్ కమ్ముల కాస్త డిఫరెంట్. చాలా సాధారణంగా అనిపించే కథలతో సినిమాలు తీసి హిట్స్ కొడుతుంటారు. ప్రస్తుతం 'కుబేర' అనే చిత్రాన్ని రిలీజ్కి సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఓ విషయమై కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: హైదరాబాద్ పబ్లో తెలుగు నటి కల్పిక రచ్చ రచ్చ)'టీనేజీలో ఒక్కసారి చిరంజీవి గారిని దగ్గరగా చూశాను. 'ఈయనతో సినిమా తీయాలి' అనే ఫీలింగ్ అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు. 'లెట్స్ సెలబ్రేట్' అని మా టీమ్ అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవిగారే. కొన్ని జనరేషన్స్ని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ ఆయన. 'ఛేజ్ యువర్ డ్రీమ్స్, సక్సెస్ మనల్ని ఫాలో అయి తీరుతుంది' అన్న నమ్మకం ఇచ్చింది ఆయనే''కాబట్టి నా 25 ఏళ్ల జర్నీ సెలబ్రేషన్స్ అంటే ఆయన దగ్గరే చేసుకోవాలి అనిపించింది. థ్యాంక్యూ సరే ఈ మూమెంట్స్లోనే కాదు, నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు' అని శేఖర్ కమ్ముల తన ఆనందాన్ని అక్షరాల రూపంలో రాసుకొచ్చారు. 'డాలర్ డ్రీమ్స్' సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన.. ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ.. ఇలా చాలా మంచి సినిమాల్ని అందించారు. జూన్ 20న 'కుబేర'తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు) View this post on Instagram A post shared by Sekhar Kammula (@kammula.sekhar) -
డైరెక్టర్తో సమంత డేటింగ్.. మరోసారి అతనితో కలిసి!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన సొంత బ్యానర్లో శుభం అనే మూవీని నిర్మించింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా సక్సెస్ కావడంతో సమంత సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలో తన జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది.అయితే గత కొద్దికాలంగా హీరోయిన్ సమంతపై డేటింగ్ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పలుసార్లు జంటగా కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ఇటీవల విమానంలో రాజ్ నిడిమోరుతో క్లోజ్గా ఉన్న ఫోటో వైరల్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. ఇవీ చూసిన నెటిజన్స్ వీరిద్దరు డేటింగ్లో ఉన్నది నిజమేనా? అనే డైలామాలో పడ్డారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ వార్తలపై స్పందించలేదు.తాజాగా సమంత డేటింగ్పై చర్చ మొదలైంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను దీనికి కారణం. హ్యాపీ వీకెండ్ అంటూ జిమ్లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోలతో పాటు ఫోటోలు కూడా పంచుకుంది. వీటిలో రాజ్ నిడిమోరుతో కలిసి సామ్ పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది. కోర్టులో ఇద్దరు పికిల్ బాల్ ఆడుతూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిపై నెట్టింట మరోసారి చర్చ మొదలైంది. శుభం మూవీ విడుదలకు ముందు ఇద్దరు కలిసి తిరుమల తిరుపతి ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే.కాగా.. సమంత, రాజ్ నిడిమోరు 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీసుల్లో కలిసి పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరు 'రక్త బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్' అనే చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
బర్త్ డే లేడీ శోభితతో నాగచైతన్య.. కీర్తి సురేశ్ ఫన్
శోభితకు పుట్టినరోజు విషెస్ చెప్పిన నాగచైతన్యకామాఖ్య ఆలయాన్ని సందర్శించిన అషూరెడ్డికేరళలో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న మేఘా ఆకాశ్వర్కౌట్ వీడియోలు పోస్ట్ చేసిన సమంతయూకేలో చిల్ అవుతున్న మృణాల్ ఠాకుర్లేటు వయసులో గ్లామరస్గా సోనాలి బింద్రేనవ్వుతూ మాయ చేస్తున్న నటి సురేఖావాణి View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) -
SKY: ఆకట్టుకునేలా 'జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్'
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "స్కై". ఈ చిత్రాన్ని వాలోర్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ లో నాగి రెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న "స్కై" సినిమా నుంచి 'జర్నీ ఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్' లాంఛ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ - "స్కై" సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. మా టీమ్ అంతా మనసు పెట్టి ఈ మూవీకి వర్క్ చేశాం. వీలైనంత త్వరగా "స్కై" సినిమాను మీ ముందుకు తీసుకురావాలని ఎగ్జైటింగ్ గా ఉన్నాం. మా సినిమా ప్రతి ఒక్క ఆడియెన్ కు నచ్చుతుంది. అన్నారు.హీరో, నిర్మాత మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ - నన్ను నేను హీరోగా కంటే ఒక నటుడిగా భావిస్తా. ఈ సినిమాలో ప్రతిభ గల టీమ్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. రీసెంట్ గా మా మూవీ స్క్రీనింగ్ చేసినప్పుడు నా క్యారెక్టర్ ను మర్చిపోయి సినిమాను ఎంజాయ్ చేశా. నేను ఎలా నటించాను అని మా టీమ్ మెంబర్స్ ను అడిగితే ఎంకరేజింగ్ గా చెప్పారు. మా టీమ్ లో రసూల్ గారి లాంటి చాలా ఎక్సిపీరియన్స్ టెక్నీషియన్ ఉండటం ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. త్వరలోనే "స్కై" మూవీతో మీ ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ మాట్లాడుతూ - ఒక కాంపాక్ట్ బడ్జెట్ లో పర్పెక్ట్ గా ఒక మూవీ చేస్తే ఎలా ఉంటుంది అనేందుకు మా "స్కై" సినిమా ఎగ్జాంపుల్. ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ సినిమాకు ప్రతి ఒక్కరం పనిచేశాం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం. డైరెక్టర్ పృథ్వీ పొయెటిక్ కథతో చాలా ప్యాషనేట్ గా ఈ మూవీని రూపొందించారు. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కోరుకుంటున్నా. అన్నారు.డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల మాట్లాడుతూ - సినిమా మేకింగ్ అంటే ఏంటో, ఏ క్రాఫ్టులు కలిసి పనిచేస్తాయో అవగాహన తెచ్చుకుంటూ ఈ చిత్రానికి సన్నాహాలు చేసుకున్నాం. డైరెక్టర్ గా నాకు ఇది డెబ్యూ మూవీ. నేను ముందు ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారిని కలిశాను. ఆ తర్వాత రసూల్ గారిని కలిశాను. సినిమా మీద ప్యాషన్ తో మేమంతా వర్క్ చేశాం. ఇటీవల "స్కై" మూవీ షో చూసి మూవీ చాలా బాగుందని అంతా చెప్పారు. చాలా హ్యాపీగా ఫీలయ్యాం. మనకున్న బడ్జెట్ లో మంచి సినిమా చేయగలం, ఆడియెన్స్ కు ఒక సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వగలం అనే నమ్మకం కలిగింది. ఇలాంటి మంచి కథలు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అన్నారు. -
అందుకే కన్నప్ప సినిమాలో నటించలేదు : శివరాజ్ కుమార్
మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్కు రెడీ అవుతోంది. జూన్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు మేకర్స్. పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కన్నప్ప(Kannappa) టీమ్ బెంగళూరు వెళ్లింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shiva Rajkumar )తో కలిసి మంచు మోహన్ బాబు, విష్ణు ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘కన్నప్ప’ సినిమా శివుడి పాత్రను పోషించమని తొలుత నన్నే అడిగారు. కానీ నా డేట్స్ కుదరకపోవడంతో నటించలేకపోయాను. ఈ సారి విష్ణు ఏం అడిగినా చేస్తాను. రెమ్యునరేషన్ నాకు సమస్యే కాదు’ అని చెప్పారు. కన్నప్ప చిత్రం గుఇరంచి మాట్లాడుతూ.. నాన్నగారు(రాజ్ కుమార్) నటించిన ‘శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం’ చిత్రంలో కన్నప్ప పాత్ర చేశాను. ఆయనతో కలిసి ‘కన్నప్ప’ పాత్ర చేయాలంటే మొదట భయం వేసింది. ఆ తర్వాత ఆ పాత్రపై నాకు ఇష్టం ఏర్పడింది. ముఖ్యంగా ‘నేనిల్ల నేనిల్ల’ పాట చేస్తున్నప్పుడు మరింత ఆసక్తి ఏర్పడింది. 37ఏళ్ల తర్వాత అదే కథతో విష్ణు సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనపై గౌరవం మరింత పెరిగింది’ అన్నారు.ఇక మోహన్ బాబు మాట్లాడుతూ.. ఏదైనా కన్నడ సినిమాలో నటిస్తే బాగుండేదని అని అనిపిస్తూ ఉండేది. అప్పట్లో అంబరీష్ను అడిగితే, నవ్వి ఊరుకునేవాడు. రాజ్కుమార్గారిని అడగాలంటే ధైర్యం సరిపోలేదు. ఆయన తనయుడు శివరాజ్ కుమార్ని ఒక కోరిక కోరుతున్నాను. ఆయన నటించే చిత్రంలో విలన్ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను’ అని అన్నారు. ఇదే విషయంపై రాజ్ కుమార్ స్పందిస్తూ..‘మోహన్ బాబు గొప్ప నటుడు. ఆయన నా చిత్రంలో విలన్గా నటిస్తానని అడిగారు కానీ.. నేను ఆ పాత్ర ఇవ్వను. ఒక అందమైన అన్నయ్య పాత్ర ఇస్తా. హై క్వాలిటీ రోల్ అది. నేను ఆయనతో ఫైట్ చేయాలనుకోవడం లేదు’అని నవ్వుతూ అన్నారు. -
హైదరాబాద్ పబ్లో తెలుగు నటి హంగామా.. వీడియో వైరల్
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన కల్పిక గణేశ్.. తాజాగా ఓ వివాదంలో నిలిచింది. రీసెంట్గా తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్కి వెళ్లింది. బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వహకులు, ఈమెకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోని నటి కల్పిక తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తనపై పబ్ నిర్వహకులు దురుసుగా ప్రవర్తించారని కల్పిక చెబుతోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)అయితే గొడవ విషయమై పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలానే ప్రవర్తించాలని కల్పిక ఆరోపిస్తోంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదంలో నటిపై పబ్ సిబ్బంది దాడి చేశారని అంటున్నారు గానీ అందుకు తగ్గ ఫొటోలు, వీడియోలు ఏం బయటకు రాలేదు. దీంతో దాడి నిజంగా జరిగిందా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది.'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఈమెకు పెద్దగా ఆఫర్స్ లేవు. ఇలాంటి ఈ టైంలో వివాదం ద్వారా వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: నాగార్జున కొడుకు పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం) View this post on Instagram A post shared by iamkalpika (@iamkalpika27) -
ఎన్టీఆర్ బావమరిది ఫస్ట్ సినిమా.. ఇన్నాళ్లకు మోక్షం
జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. ఇప్పటికే హీరోగా మూడు సినిమాలు చేశాడు. అవే 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్'. అయితే ఇతడు పరిచయ చిత్రం మాత్రం వాయిదాలు మీద వాయిదాలు పడుతూనే ఉంది. అప్పుడెప్పుడో 2022లో లాంచ్ చేశారు. ఇన్నాళ్లకు దానికి మోక్షం కలిగింది. జూన్ 6న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ముగ్గురు హీరోల 'భైరవం' తొలిరోజు కలెక్షన్స్)'శ్రీశ్రీశ్రీ రాజావారు' పేరుతో తీసిన ఈ సినిమాలో నార్నే నితిన్తో పాటు రావు రమేశ్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'శతమానం భవతి' ఫేమ్ సతీశ్ వేగ్నేశ దర్శకుడు. తాజాగా రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ పల్లెటూరి కుర్రాడు. ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. కానీ సిగరెట్ అలవాటు వల్ల ఇతడి జీవితంలో ఎక్కడలేని కష్టాలన్నీ వస్తాయి. చివరకు ఏమైంది? హీరో సిగరెట్ అలవాటు మానేశాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.విజువల్స్ చూస్తుంటే రిచ్గా ఉన్నాయి గానీ ట్రైలర్ మాత్రం అంతంత మాత్రంగానే అనిపించింది. ప్రమోషన్స్ మీద మాత్రం టీమ్ అస్సలు దృష్టి పెట్టలేదు. మరి కారణాలేంటో వాళ్లకే తెలియాలి. వచ్చే వారం థియేటర్లలో కమల్ హాసన్ 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ కానుంది. దీనిపై కాస్తోకూస్తో హైప్ ఉంది. మరి దీంతో పోటీపడి 'రాజావారు' మూవీ ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
ముగ్గురు హీరోల 'భైరవం' తొలిరోజు కలెక్షన్స్
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'భైరవం'. నిన్న థియేటర్లలోకి వచ్చింది. చాలావరకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ జనాలు మాత్రం కొంతమేర బాగానే థియేటర్లలోకి వచ్చారు. మరి ఈ చిత్రానికి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్?(ఇదీ చదవండి: రీ రిలీజ్లో మహేశ్ 'ఖలేజా' కలెక్షన్స్ రికార్డ్)ముగ్గురు హీరోలు నటించిన ఈ మినీ మల్టీస్టారర్ మూవీ.. తమిళ హిట్ 'గరుడన్'కి రీమేక్. అయినా సరే తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు చిన్న చిన్న మార్పులు చేశారు. తొలిరోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.2.75 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. 'ఖలేజా' రీ రిలీజ్ కావడం ఓ రకంగా దీనికి మైనస్ అయిందని చెప్పొచ్చేమో. ఎందుకంటే మహేశ్ ఫ్యాన్స్తో పాటు పలువురు ప్రేక్షకులు మహేశ్ మూవీకి ఓటేశారు.భైరవం చిత్రానికి ఓవర్సీస్లోనూ పర్వాలేదనిపించే ప్రారంభం దక్కింది. తొలిరోజు 50 వేల డాలర్లు వసూళ్లు వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఓవరాల్ కలెక్షన్ పోస్టర్ ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. కథ విషయానికొస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఊరు. గజపతి (మనోజ్), వరద (నారా రోహిత్), శీను ఫ్రెండ్స్. అయితే గజపతి కుటుంబం.. ఓ అమ్మవారి ఆలయానికి ట్రస్టీగా ఉంటారు. ఆలయానికి చెందిన వెయ్యి కోట్ల విలువైన భూమిపై ఓ మంత్రి కన్నేస్తాడు. దీని వల్ల ముగ్గురు హీరోల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి. చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
కెమెరా ముందు అలా చేయమన్నారు..నటి షాకింగ్ కామెంట్స్
సినిమా సన్నివేశాల్లో సహజత్వం కోసం దర్శకులు పడే తాపత్రయంలో అద్భుతమైన కళాదృష్టి ఉంటే ఉండొచ్చు గాక..ఒక్కోసారి అది నటీనటులకు ప్రాణ సంకటంగా మారొచ్చు. ఎంత సహజత్వం కోసం తాపత్రయపడే ప్రేక్షకులైనా కొన్ని నిజజీవితంలో చేసే పనులు తెరమీద నేరుగా చూపిస్తే జుగుప్సాకరంగా ఫీల్ అవకుండా ఉండలేరు. అలాంటి వాటిలో వాష్ రూమ్ సన్నివేశాలు ముందు వరుసలో ఉంటాయి. అయితే అచ్చంగా అలాంటి ఒక సన్నివేశాన్ని చిత్రీకరించిన దర్శకుడు సహజత్వం కోసం సదరు నటిని చేయమన్న పని ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.హిందీలో షైతాన్ గా రీమేక్ చేయబడిన గుజరాతీ హర్రర్ చిత్రం వాష్(Vash) లో నటించిన నటి జాంకి బోడివాలా(Janki Bodiwala) ఆ సినిమా లో సనిన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా తాను ఎదుర్కున్న అనుభవాలను నుంచి ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. ఇటీవల ఫిల్మ్ఫేర్తో జరిగిన రౌండ్టేబుల్ చర్చలో, ఆమె మాట్లాడుతూ వాష్ చిత్రంలోని ఒక కీలక సన్నివేశంలో తాను మూత్ర విసర్జన చేసే సీన్ ఉందన్నారు. అయితే ఆ సీన్ను రీమేక్ చేస్తున్న సమయంలో సహజత్వం కోసం దర్శకుడు కృష్ణదేవ్ యాగ్నిక్ నిజంగా మీరు మూత్ర విసర్జన చేయగలరా అని తనను అడిగినట్లు ఆమె వెల్లడించింది. సినిమాలో ఆ మూత్ర విసర్జన సన్నివేశం చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుందనీ కాబట్టి, ఆ సీన్లో నిజంగా ఆ పని చేయగలరా? అని దర్శకుడు అడిగినట్టు ఆమె తెలిపింది. అయితే ఆ మాటకి ముందు షాక్ తిన్నా... ఆ తర్వాత తాను చాలా ఉద్విగ్నంగా ఫీల్ అయ్యానని ఆమె చెప్పింది. ఓహ్! నటుడిగా, నాకు తెరపై చేసే అవకాశం లభిస్తోంది. ఎవరూ చేయనిది.’’అంటూ సంతోషపడ్డానని వివరించింది.అయితే, వారు సన్నివేశాన్ని చిత్రీకరించడానికి సిద్ధమైన తర్వాత తనకి దర్శకుడు కోరుకున్న విధంగా చేయడం అసాధ్యం అనిపించిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సన్నివేశం తనను నటిగా ఉత్సాహపరిచింది కాబట్టి తాను చేయడానికి అంగీకరించానని వెల్లడించింది. ‘‘కానీ తరువాత, అది జరగలేదు మరియు దీనికి చాలా రీటేక్లు తీసుకున్నాం. ఇది సెట్లో ఆచరణాత్మకంగా సాధ్యం కాదని నాకు అర్ధమైంది. కాబట్టి మేము దానిని చేయడానికి వేరే మార్గాన్ని కనుగొన్నాం’’ అంటూ ఆమె తెలిపింది. నిజ జీవితంలో తాను చేయలేని పనులు చేయగలిగినందుకు సంతోషంగా ఉన్నానని ఆ సన్నివేశం చేసినందుకు తను ఎలాంటి బాధ లేదని స్పష్టం చేసింది.కనోడియా, నీలమ్ పాంచల్ హితేన్ కుమార్ నటించిన వాష్ చిత్రాన్ని హిందీలో అజయ్ దేవ్గన్, జ్యోతిక ఆర్ మాధవన్లతో షైతాన్గా రీమేక్ చేశారు. ఒక రహస్యమైన అపరిచితుడు ఒక యువతిపై నియంత్రణ సాధించడం ద్వారా వారి ఇంట్లోని కుటుంబంపై ఎలా ప్రవర్తించాడు? అనే హారర్ కథ ఇది. రెండు భాషా చిత్రాలలోనూ నటించిన జానకి అపరిచితుడి ఉచ్చులో పడే కుమార్తెగా ఆకట్టుకుంటుంది. -
మహేశ్ 'ఖలేజా' రీ రిలీజ్.. ఆల్ టైమ్ కలెక్షన్ రికార్డ్
టాలీవుడ్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి. కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలు సరిగా ఆడట్లేదు. అదే టైంలో రీ రిలీజ్ల హడావుడి ఎక్కువైపోయింది. గత కొన్నాళ్ల నుంచి ఈ తరహాలోనే పాత చిత్రాల్ని విడుదల చేస్తున్నారు. వీటికే కోట్లకు కోట్లు కలెక్షన్స్ కూడా వస్తుండటం విశేషం. ఇప్పుడు మహేశ్ 'ఖలేజా' కూడా అలానే రీ రిలీజ్ కాగా.. కళ్లు చెదిరే వసూళ్లు వచ్చాయి.(ఇదీ చదవండి: నాగార్జున కొడుకు పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం)రీ రిలీజ్ ట్రెండ్లో మహేశ్ సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. మురారి, బిజినెస్మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాలని రీ రిలీజ్ చేయగా.. అభిమానులు థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు. తాజాగా సూపర్స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా 'ఖలేజా'ని మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చారు. దీనికి ఏకంగా ప్రీమియర్స్ కూడా వేయడం విశేషం.ఇప్పుడు 'ఖలేజా' మూవీ రీ రిలీజ్లోనూ రికార్డ్స్ సృష్టించినట్లు తెలుస్తోంది. తొలిరోజు మొత్తం రూ.8.26 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన 'ఖలేజా'.. 2010లో థియేటర్లలో రిలీజైంది. అప్పుడేమో డిజాస్టర్ అయింది. తర్వాత టీవీల్లో ప్రసారమైనప్పుడు చాలామందికి ఇది ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు రీ రిలీజ్ వల్ల అభిమానులు ఈ చిత్రంపై తన ప్రేమనంతా చూపించారు. వచ్చే శుక్రవారం వరకు ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ప్రదర్శించనున్నారు.(ఇదీ చదవండి: వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
‘ఘటికాచలం’ మూవీ రివ్యూ
నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన చిత్రం ‘ఘటికాచలం’. ఈ చిత్రానికి ఎం.సి.రాజు కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించారు. అమర్ కామెపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పై ప్రముఖ దర్శకుడు మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ నేడు(మే 31) రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కౌశిక్ (నిఖిల్ దేవాదుల) మెడిసన్ స్టూడెంట్.తనకు ఇష్టం లేకపోయినా నాన్న (ప్రభాకర్)కోసం డాక్టర్ కావాలనుకుంటాడు. కనీసం తనకు ఇష్టం అయిన వంట చేయమని తల్లితో చెప్పలేని ఇంట్రోవర్ట్. కాలేజీలో తోటి విద్యార్థిని సంయుక్తని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పడానికి భయపడతాడు. ఇష్టంలేని చదువు ఒకవైపు..ఇష్టమైన విషయాలు చెప్పలేక మరోవైపు మానసికంగా ఇబ్బంది పడతాడు. కొన్నాళ్లకు తనకి మాత్రమే ఓ భీకరమైన వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ అతన్ని కంట్రోల్ చేస్తుంది. చదుకోనివ్వదు.. రెబల్గా మార్చేస్తుంది. ఓ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తే.. సైకలాజికల్ ప్రాబ్లమ్ అని చెబుతారు. బాబాలు,మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్తే గాలి సోకిందని చెబుతారు. కౌశిక్తో మాట్లాడుతున్న వాయిస్ కొన్నేళ్ల క్రితం చనిపోయిన ఘటికాచలంది అని తెలుస్తుంది. అసలు ఘటికాచలం ఎవరు? కౌశిక్కి ఎలా పరిచయం అయ్యాడు? ఇంతకీ కౌశిక్కి దెయ్యం పట్టిందా లేదా మెంటల్ ప్రెజర్ తో అలా మారిపోయాడా? చివరకు కౌశిక్ ఆరోగ్యంగా బయటపడ్డాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే..చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలతో ఆకట్టుకున్న నిఖిల్ దేవాదులకి హీరోగా తొలి చిత్రం ఇది. ఫస్ట్ మూవీలోనే బలమైన పాత్ర పోషించాడు. ఈ పాత్ర కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. పాత్ర ఒక్కటే కానీ అందులోనే రెండు మూడు వేరియేషన్స్ ఉంటాయి. అలాంటి పాత్రకి నిఖిల్ పూర్తి న్యాయం చేశాడు. నటుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంటుంది. హీరో తండ్రిగా ప్రభాకర్, తల్లిగా దుర్గాదేవి ఉన్నంతలో బాగానే నటించారు. డాక్టర్గా ఆర్వికా గుప్తా తెరపై కనిపించేంది కాసేపే అయినా కథకి కీలకమైన పాత్ర ఆమెది. హీరోయిన్గా సంయుక్త రెడ్డి నటన ఓకే. జోగినాయుడు రెండు మూడు సీన్లలో కనిపించినా.. తన మార్క్ చూపించాడు.మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాకేంతికంగా సినిమా బాగుంది. ప్లేవియో కుకురోలో నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. హారర్ సన్నివేశాలకు ఆయన అందించిన బీజీఎం అదిరిపోయింది. ఎస్ ఎస్ మనోజ్ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
భారీ బడ్జెట్ పేరుతో ప్రజలపై భారం వేయకండి: నారాయణమూర్తి
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపుపై నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అసంతృప్తి తెలిపారు. విడుదలైన ప్రతి సినిమాకు అలా ధరలు పెంచుకుంటూ పోతే ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందన్నారు. క్రమేపి వారు థియేటర్కు వచ్చి సినిమా చూడటం తగ్గిస్తారని సూచించారు. చవకగా దొరికే వినోదం ఇప్పుడు చాలా ఖరీదుగా మారిపోయందని అభిప్రాయపడ్డారు. ఇకనుంచి అయినా సరే టికెట్ ధరలు పెంపు అంశంపై అందరూ ఒకసారి పరిశీలించాలని ఆయన కోరారు.'భారీ ఖర్చుతో సినిమాలు తీయడం మంచిదే. కానీ, ఆ ఖర్చును ప్రజలపై రుద్ద వద్దు. హాలీవుడ్లో ఎన్నో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు. మన దగ్గర షోలే, మోఘల్ ఏ ఆజాం లాంటి సినిమాలు వచ్చాయి. వాటి కోసం ధరలు పెంచలేదు. మన తెలుగులో ఐదేళ్ల పాటు లవకుశ తీశారు, ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచమని అడగలేదు. సినిమాలు బాగుంటే తప్పకుండా జనాలు వస్తారు. టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ల హీరోల సినిమాలు చూడలేని పరిస్థి వస్తుంది.' అని ఆర్ నారాయణమూర్తి అన్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ కోసం గద్దర్ అవార్డులను ప్రకటించడం చాలా గర్వంగా ఉందన్నారు. విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో సీఎం చంద్రబాబు కూడా నంది అవార్డులను ప్రకటించాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. -
నాగార్జున కొడుకు పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
అక్కినేని ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగార్జున చిన్న కొడుకు అఖిల్.. ఈ జూన్లో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే గత కొన్నిరోజుల నుంచి రూమర్స్ వచ్చాయి. జూన్ తొలివారంలో అఖిల్ పెళ్లి చేసుకోనున్నాడని అంటున్నారు. ఇదలా ఉండగానే ఇప్పుడు నాగ్ వైపు నుంచి ఓ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)శనివారం ఉదయం.. నాగార్జున దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమారుడి వివాహానికి సీఎంని ఆహ్వానించారు. ఇప్పుడు ఈ ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాగార్జున-అమల దంపతులకు పుట్టిన సంతానం అఖిల్. ఇప్పటికే హీరోగా ఐదు సినిమాలు చేశాడు గానీ హిట్ కొట్టలేకపోయాడు. గతంలో ఓసారి అఖిల్ నిశ్చితార్థం జరిగి రద్దయింది. దీంతో గతేడాది ఎలాంటి హడావుడి లేకుండా జైనబ్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కూడా ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లికి రెడీ అయిపోయాడు.(ఇదీ చదవండి: శిరీషతో పెళ్లి ఎప్పుడంటే.. ప్రకటించిన నారా రోహిత్) -
రజాకార్, మల్లేశం సినిమాలకు గద్దర్ అవార్డులు
సాక్షి, యాదాద్రి : ప్రజా గాయకుడు గద్దర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సినీ అవార్డుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా నేపథ్యం కలిగిన రెండు సినిమాలకు అవార్డులు దక్కాయి. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యలో తీసిన రజాకార్ సినిమా ఉత్తమ చారిత్రాత్మక చిత్రంగా, చేనేత ఇతివృత్తంగా తీసిన మల్లేషం సినిమాకు జ్యూరీ కమిటీ అవార్డులు ప్రకటించింది. జిల్లాకు చెందిన వ్యక్తుల నేపథ్యం కలిగిన రెండు సినిమాలకు అవార్డులు రావడం పట్ల సినీ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక చిత్రంగా రజాకార్ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర నేపథ్యంలో రజాకార్ సినిమా తీశారు. బీబీనగర్ మండలం గూడూరుకు చెందిన బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి ఈ చిత్ర నిర్మాత. నల్లగొండకు చెందిన యాట సత్యనారాయణ డైరెక్టర్గా వ్యవహరించారు. బీబీనగర్ మండలం మహదేవ్పూర్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా తీశారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, అదిలాబాద్ పలు జిల్లాల్లో 1947 నుంచి 1948 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాట సంఘటల ఆధారంగా సినిమా చిత్రీకరించారు. ఆసుయంత్రం తయారీ ఇతివృత్తంగా.. ఆసు యంత్రాన్ని తయారు చేయడానికి మల్లేశం పడిన శ్రమను ఇతి వృత్తంగా తీసుకుని మల్లేశం సినిమా తీశారు. ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన చింతకింది మల్లేశం చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆసుయంత్రం సృష్టికర్తగా మల్లేశం పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి అబ్దుల్ కలాం అవార్డు అందుకున్నారు.మల్లేశం సినిమాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది మల్లేశం సినిమా తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాత, కథ స్క్రీన్ ప్లే వహించిన రాజు రాచకొండకు, నటీ, నటీమణులకు, సినిమా నిర్మాణంలో పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు. గద్దర్ అవార్డులు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. – చింతకింది మల్లేశంతెలంగాణ సాయుధ పోరాటానికి దక్కిన గౌరవంచారిత్రాత్మక చిత్రం కేటగిరిలో రజాకార్ సినిమాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి దక్కిన గౌరవం. చరిత్రను పరిచయం చేసిన చిత్రంగా ఈ సినిమా నిలిచిపోతుంది.– గూడూరు నారాయణరెడ్డి, రజాకార్ చిత్ర నిర్మాత -
'హరి హర వీరమల్లు'తో పక్కదారి పట్టించారు: ఆర్ నారాయణమూర్తి
జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ ఉంటుందని ప్రకటన వచ్చిన తర్వాత చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఎంట్రీతో చిత్ర పరిశ్రమ ఆ నిర్ణయాన్ని సడలించుకుంది. తాజాగా ఇదే అంశంపై నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి పలు వ్యాఖ్యలు చేశారు.మల్టీఫ్లెక్స్ మాదిరే సింగిల్ థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని ఆయన కోరారు. అయితే, కొందరు అసలు విషయాన్ని దాటేసి ఇదంతా 'హరి హర వీరమల్లు' సినిమాకు నష్టం చేసేందుకు కుట్ర అంటూ తెరపైకి తీసుకురావడం చాలా దుర్మార్గం అని పేర్కొన్నారు. సింగిల్ థియేటర్స్ మనుగడ కోసమే వారు బంద్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఇలా అన్నారు. 'నేను చాలా ఏళ్ల క్రితమే సింగిల్ థియేటర్లకు కూడా పర్సంటేజీ సిస్టమ్ ఉండాలని, లీజ్ సిస్టమ్ వద్దని కోరాను. చాలామంది నిర్మాతలు కూడా ఇదే కోరుకుంటున్నారు. పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. కానీ, హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పర్సంటేజీలు ఖరారైతే నా లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది. పవన్ కల్యాణ్పై ఎవరు కుట్ర చేస్తారు..? పవన్ కార్యాలయం నుంచి ఆ ప్రకటన రావడం సమంజసంగా లేదు. హరిహర వీరమల్లు కోసం కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం.. రావాలని పిలిస్తే పవన్పై గౌరవం మరింత పెరిగేది. పర్సంటేజీ సిస్టమ్ అన్ని థియేటర్స్కు లేకపోవడం వల్ల నిర్మాతలు అందరూ నాశనం అయిపోతున్నారు. సింగిల్ థియేటర్స్ మూత పడుతున్నాయి. మల్టీఫ్లెక్స్ల మాదిరే వాటికి కూడా ఇదే పద్ధతి ఉండాలి. దీని కోసం మేము చాలా ఏళ్లపాటు పెద్ద ఉద్యమం చేశాం. థియేటర్స్ 'లీజ్ సిస్టమ్' వల్ల తీరని నష్టం జరుగుతుంది. దీనిని అందరూ గుర్తించాలి. 'బంద్ అనేది బ్రహ్మాస్తం లాంటిది. సింగిల్ థియేటర్ల మనుగడ నేడు ప్రశ్నార్థకరమైంది. భారతదేశంలో సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి దొరికే వినోదం. పర్సంటేజి విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక్కణ్ణి. ఈ విషయంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు చేశాం. ఎంతో మంది ఛాంబర్ ప్రెసిడెంట్లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజి విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సరికాదు. పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలువాలని అనడంలో తప్పులేదు. మేం మీ బిడ్డలం. ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి పర్సంటేజి అంశాన్ని పక్కదారి పట్టించవద్దు. కార్పొరేట్ సిస్టమ్లకు వంతపాడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి. సింగిల్ థియేటర్లు దేవాలయాల లాంటివి. కానీ, నేడు సింగిల్ థియేటర్లు కళ్యాణ మండపాలవుతున్నాయి. పర్సంటేజిని బతికించి నిర్మాతలను కాపాడాలి. ఇదే జరిగితే ప్రేక్షకులు ఓటీటీలలోనే సినిమాలు చూస్తారు. ఆ పొరపాటు జరిగితే ఇండస్ట్రీ నాశనమవుతుంది. పవన్ సినిమా రిలీజ్ అవుతుందటే థియేటర్స్ బంద్ చేయడం చాలా దుర్మార్గం అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆయన మాటలు చాలా తప్పు. ఈ పోరాటం ఇప్పటిది కాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి.' అని నారాయణమూర్తి అన్నారు. -
శిరీషతో పెళ్లి ఎప్పుడంటే.. ప్రకటించిన నారా రోహిత్
టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లిపై ప్రకటన చేశారు. తాజాగా తను నటించిన కొత్త సినిమా భైరవం విడుదలైంది. ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన పెళ్లి ప్రస్థావన రావడంతో అందుకు క్లారిటీ ఇచ్చేశారు. వాస్తవంగా నారా రోహిత్ పెళ్లి ఇప్పటికే జరగాల్సి ఉంది. ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయింది. కానీ, తన తండ్రి మరణం వల్ల వాయిదా వేసుకున్నారు.నారా రోహిత్, నటి శిరీషాల నిశ్చితార్థం గతేడాది అక్టోబర్లో జరిగింది. త్వరలో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు (72) నవంబర్లో అకాల మరణం చెందడం వల్ల పెళ్లికి బ్రేకులు పడ్డాయి. అయితే, ఇప్పుడు నారా రోహిత్ పెళ్లి టైమ్ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించాడు. హిందు సంప్రదాయం ప్రకారం.. అప్పటికి తన పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందని ఆయన క్లారిటీ ఇచ్చేశారు.'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాదిలో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వారిద్దరు ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. -
అది మూడు సెకన్ల సీన్.. ఇంత గోల ఏంటి: నటి
'థగ్ లైఫ్' సినిమా ట్రైలర్ విడుదల తర్వాత మూడు సెకన్ల సీన్పై పెద్ద చర్చే జరిగింది. 70 ఏళ్ల కమల్ హాసన్, 42 ఏళ్ల అభిరామి మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ట్రైలర్లో కనిపించడంతో చాలా విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, జాతీయ వార్తా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి అభిరామి తొలిసారి మాట్లాడింది. ట్రైలర్లోని సన్నివేశం కేవలం మూడు సెకన్ల నిడివి మాత్రమే ఉందని, దాని గురించి ఇంత వివాదం సృష్టించడం అనవసరమని నటి అభిరామి పేర్కొంది.థగ్ లైఫ్ ప్రమోషన్స్లతో బిజీగా ఉన్న అభిరామి ఆ సీన్ గురించి ఇలా చెప్పింది. 'ఈ రోజుల్లో ఏదైనా క్షణాల్లోనే వివాదంగా మారవచ్చు. మనం దాని నుంచి తప్పించుకోలేము. దర్శకులు మణిరత్నం సార్ నన్ను ఆ పాత్రకు ఎందుకు ఎంచుకున్నారో నేను ఆయన్ను ప్రశ్నించను. సినిమా విషయంలో వారి నిర్ణయం ఏదైనా సరే నేను దానిని అంగీకరిస్తున్నాను. పూర్తి నా ఇష్టంతోనే ఆ సీన్ తీశారు. ఇది కేవలం మూడు సెకన్ల దృశ్యం. కానీ, ట్రైలర్ వల్ల కొన్ని అపార్థాలు ఏర్పడ్డాయి. సినిమాలోని ఆ సన్నివేశంతోనూ, లిప్లాక్కు దారితీసే విషయాలతోనూ చాలా లింక్ ఉంటుంది. మూవీ చూసిన తర్వాత ఎవరూ అలాంటి కామెంట్లు చేయరని అనుకుంటున్నాను. అది ఆ సన్నివేశానికి బాగా సరిపోతుందనే చేశాం. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. వారు ముందు సినిమా చూడాలని నేను అభ్యర్థిస్తున్నాను' అని అభిరామి అన్నారు.కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతున్న 'థగ్ లైఫ్' సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. ఈ చిత్రంలో శింబు, జోజు జార్జ్, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, నాసర్, అశోక్ సెల్వన్,అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ నిర్మించారు.కమల్ హాసన్, మణిరత్నం 37 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న ఈ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్ డే' అంటూ ఫోటోలు విడుదల.. అసలు విషయం ఇదేనా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్లో ఒకరిగా ఫుల్ జోష్లో ఉన్న శ్రీలీల(Sreeleela) త్వరలో పెళ్లి చేసుకోబోతుందని నెట్టింట వైరల్ అవుతుంది. అందుకు కారణం తాజాగా సోషల్మీడియాలో ఆమె షేర్ చేసిన వీడియో, ఫోటోలే అని తెలుస్తోంది. కొంత సమయం క్రితం శ్రీలీల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఫోటోలు పంచుకుంది. తన చెంపల మీద పసుపు పూసి కొందరు ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు నాకు 'బిగ్ డే' అంటూనే పూర్తి వివరాలు 'కమింగ్ సూన్' అంటూ హింట్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు కూడా ఒక క్లారిటీకి వచ్చేసి.. సైలెంట్గా శ్రీలీల నిశ్చితార్థం చేసుకుందని త్వరలో పెళ్లి అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే, అసలు విషయం నిశ్చితార్థం కాదని తెలుస్తోంది. జూన్ 14న శ్రీలీల పుట్టినరోజు ఉంది. కానీ తిథుల ప్రకారం ఆ వేడుకను ఇలా ముందే సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం ఉంది. ప్రతి ఏటా ఆమెకు ఇది అలవాటుగా చేస్తారని టాక్. పుట్టినరోజు సెలబ్రేషన్స్ను ఈరోజుల్లో కూడా తిధుల ప్రకారం ఇలా జరుపుకునే వాళ్లు ఉన్నారా..! అదీ హీరోయిన్ జరుపుకోవటం వింతగా ఉందని కొందరు చెబుతున్నారు.ఫోటోలు షేర్ చేసిన శ్రీలీల ఎలాంటి వివరాలు పూర్తిగా ప్రకటించలేదు. త్వరలో చెబుతానని, తనకు ఈరోజు 'బిగ్ డే' అంటూ.. హింట్ ఇచ్చింది. అయితే, నెటిజన్ల నుంచి శ్రీలీల షేర్ చేసిన ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. శ్రీలీల నిశ్చతార్థం చేసుకుందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఏదైనా వాణిజ్య ప్రకటన కోసం ఆమె చేస్తున్న ప్రమోషన్స్ కావచ్చని అంటున్నారు. మరోవైపు ఆమె పుట్టినరోజును ఇలా సెలబ్రేట్ చేసుకుందని కూడా సమాచారం ఉంది. ఫోటోలు షేర్ చేసే సమయంలో కాస్త క్లారిటీగా విషయం చెబితే బాగుంటుంది కదా అంటూ మరికొందరు మండిపడుతున్నారు. ఈ విషయంపై శ్రీలీల ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan), శ్రీలీల (Sreeleela) డేటింగ్లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అనురాగ్ బసు దర్శకత్వంలో వారిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారని టాక్ వచ్చింది. కార్తిక్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి వేడుకలో శ్రీలీల కనిపిస్తూ ఉంటుంది. ఆపై కొద్దిరోజుల క్రితం జరిగిన ‘ఐఫా’ (IFFA) వేడుకల్లో తమ ఇంటికి ఎలాంటి అమ్మాయి కోడలిగా రావాలో చెబుతూ కార్తిక్ ఆర్యన్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'ఒక మంచి వైద్యురాలు మా ఇంటికి కోడలిగా రావాలని మేము కోరుకుంటున్నాం' అని ఆమె చెప్పారు. శ్రీలీల నటి మాత్రమే కాదు ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ చదువుతుంది. హీరో తల్లి చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
ఉత్తమ హాస్యనటుడు.. కామారెడ్డి కిశోరుడు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: హాస్య నటుడిగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న వెన్నెల కిశోర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ సినీ పురస్కారం–2024కి ఉత్తమ హాస్య నటుడిగా ఎంపిక చేసింది. వచ్చే నెల 14న హైదరాబాద్లో నిర్వహించే వేడుకలో కిశోర్కు పురస్కారం అందజేయనున్నారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ, యశోద దంపతులకు నలుగురు కూతుళ్లతోపాటు కుమారుడు కిశోర్. పట్టణంలోని జీవదాన్ హైస్కూల్లో పదో తరగతి వరకు చదివిన కిశోర్ ఇంటర్మీడియెట్ మాతృశ్రీ కాలేజీలో అభ్యసించారు. తరువాత హైదరాబాద్లో ఉన్నత చదువులకు వెళ్లారు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన వివిధ కోర్సులు అభ్యసించారు. ఇంగ్లిష్ పత్రికలు, ఇంగ్లిష్ నవలలు చదివే అలవాటున్న కిశోర్ ఆ భాషపై మంచి పట్టుసాధించారు. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లిన కిశోర్ చదువు పూర్తికాగానే అక్కడే ఉద్యోగంలో చేరారు. కామారెడ్డికి చెందిన స్నేహితులను కిశోర్ రెగ్యులర్గా కలుస్తుంటారు.మరో అవార్డు..రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సినీ పురస్కారాలు–2024ను గురువారం ప్రకటించింది. మత్తువదలరా–2 సినిమా లో నటించిన వెన్నెల కిశోర్, సత్యను సంయుక్తంగా ఉత్తమ హాస్యనటులుగా ఎంపిక చేసింది. గతంలో నంది, సైమా అవార్డులను కిశోర్ అందుకున్నారు. తాజాగా మరో పు రస్కారం దక్కింది. కిశోర్ కు అవార్డు దక్కడంతో ఆయన మేనల్లు డు, లిటిల్ స్కాల ర్స్ స్కూల్కరస్పాండెంట్ పున్న రాజేశ్, అక్కా, బావ అరుణ, రాజేశ్వర్ ఆనందం వ్యక్తం చేశారు.సినిమా పేరే ఇంటిపేరుగా..అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో (2005) కిశోర్కు ఊహించకుండానే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ‘వె న్నెల’ సినిమాలో ఆయన నటించడంతో ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మా రింది. ఆ తరువాత మూడునాలుగేళ్లపాటు సినీ అవకాశాలు లేకపోవడంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన తన భార్యతో కలిసి కిశోర్ ఇండియాకు వచ్చేశారు. 2009లో సినీ అ వకాశాలు రావడం మొదలుకాగా, ఆ తరువాత కిశోర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సుమారు 130కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. పూర్తి స్థాయి నటుడిగా సినీ రంగంలో స్థిరపడ్డారు. -
బక్రీద్ కానుకగా ఓటీటీలో 'లాల్ సలామ్'.. అధికారిక ప్రకటన
సౌత్ ఇండియాలో భారీ అంచనాలతో రజనీకాంత్ 'లాల్ సలామ్'(Lal salaam) (2024) విడుదలైంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. అయినప్పటికీ రజనీ (Rajinikanth) అభిమానులు ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా లాల్సలామ్ ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించిగా రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించారుబక్రీద్ పండుగ కానుకగా జూన్ 6న ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు సన్ నెక్ట్స్(Sun NXT) ప్రకటించింది. ఎదురుచూపులకు తెర పడింది అంటూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్ వర్షన్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సుమారు రూ. 90 కోట్ల బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 52 కోట్లు మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమా ఓటీటీ ఢీల్స్ మొదట నెట్ఫ్లిక్స్తో కుదుర్చుకుంది. అయితే, సినిమా విడుదల సమయంలో నెట్ఫ్లిక్స్ సూచించిన సీన్స్ కలపకపోవడంతో ఆ ఢీల్ను క్యాన్సల్ చేసుకున్నారు. దీంతో లాల్ సలామ్ ఓటీటీ విడుదల ఆలస్యానికి ప్రధాన కారణం అయింది.కథేంటంటే'లాల్ సలామ్' కథ మొత్తం 1990ల కాలం బ్యాక్డ్రాప్తో నడుస్తోంది. మొయిదీన్ భాయ్ (రజనీకాంత్) కుమారుడు సంషి (విక్రాంత్), గురు (విష్ణు విశాల్) స్నేహితులు. షంషుద్దీన్ (విక్రాంత్)ను క్రికెటర్ను చేయాలన్నది తండ్రి కల. అనుకున్నట్లు గానే సంషి రాష్ట్ర రంజీ జట్టుకు ఆడటానికి ఎంపికవుతాడు. ఈ క్రమంలో ఆ ఊళ్లో త్రీస్టార్ - ఎంసీసీ టీమ్స్ మధ్య జరిగే క్రికెట్ ఆటతో రెండు మతాల మధ్య గొడవ మొదలౌతుంది. ఆ గొడవలోనే షంషుద్దీన్ చేతిని నరికేస్తాడు గురు అలియాస్ గురునాథం (విష్ణు విశాల్).. దాడి చేసిన గురు కూడా మొయిదీన్ భాయ్కి ప్రాణ స్నేహితుడు అయిన (ఫిలిప్ లివింగ్స్టోన్) కుమారుడు కావడం విశేషం. హిందూ ముస్లింలు ఐకమత్యంగా ఉండే ఆ ఊరిలో క్రికెట్ వల్ల మత కల్లోలంగా మారుతుంది. ముంబైలో వ్యాపారావేత్తగా రాణిస్తున్న మొయిద్దీన్ అ గ్రామానికి తిరిగొస్తాడు. కుమారుడి చేయి నరికిన స్నేహితుడి కుటుంబాన్ని మొయిదీన్ ఏం చేస్తాడు..? క్రికెట్లో గొడవలకు కారణం ఏంటి..? సంషి, గురు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు ఎలా మొదలైంది..? తన కొడుకు చేయి నరికిన గురును మొయిద్దీన్ ఏం చేశాడు..? అనేది తెలియాలంటే జూన్ 6న సన్ నెక్ట్స్లో లాల్ సలామ్ చూడాల్సిందే. -
అవార్డులు గౌరవం ఇస్తాయి: మురళీమోహన్
‘‘రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదేళ్లుగా అవార్డులు ఇవ్వడం మానేశాయి. ప్రభుత్వం నుంచి ఒక అవార్డు రావాలి, ఆ అవార్డుని ఇంట్లో పెట్టుకోవాలని ఆశిస్తాం. అంతేకానీ డబ్బుల గురించి కాదు... అవార్డు లనేవి గౌరవం ఇస్తాయి’’ అని నటుడు, నిర్మాత మురళీమోహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించనున్న ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్(Gaddar Telangana Film Awards) (2014–2023)కి సంబంధించి జ్యూరీ చైర్మన్గా మురళీమోహన్ వ్యవహరించారు. జూన్ 14న హైదరాబాద్లోని హైటెక్స్లో ఈ అవార్డుల వేడుక జరగనుంది.ఈ అవార్డుల వివరాలను ప్రకటించేందుకు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజుతో కలిసి శుక్రవారం హైదరాబాద్లోని ఎఫ్డీసీ కార్యాలయంలో మురళీమోహన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ప్రతి ఏటా అవార్డులు ఇవ్వాలని ఈ పదేళ్లల్లో ముఖ్యమంత్రులందర్నీ కలిసి విన్నవించాం. అప్పుడు అందరూ ఇద్దాం, చేద్దాం అన్నారు కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిగారు ఓ స్ఫూర్తితో ప్రజాగాయకుడు గద్దర్గారి పేరిట ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’ని ప్రకటించడం సంతోషం. ఈ కమిటీకి ‘దిల్’ రాజుగారు నన్ను చైర్మన్ని చేశారు.మా జ్యూరీలో అందరూ అనుభవం ఉన్నవారిని, సినిమాకి సంబంధం ఉన్న వ్యక్తులనే నియమించారు. అందరం కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయంతోనే అవార్డులు ఎంపిక చేశాం. గురువారం సాయంత్రం ఈ అవార్డుల జాబితాను రేవంత్ రెడ్డిగారికి సమర్పించాం. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నాం. ఈ అవార్డుల ప్రదానానికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డిగారికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున ధన్యవాదాలు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి అవార్డుల ప్రదానం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని, ఒక అవగాహనకు రావాలి. ఒక్కో ఏడాది ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటిస్తే బాగుంటుంది. ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు’’ అని పేర్కొన్నారు.తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది మూడు అవార్డుల చొప్పున (తొలి ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రం, తృతీయ ఉత్తమ చిత్రం) ఈ పదేళ్లకు సంబంధించిన సినిమాలను జ్యూరీ చైర్మన్ మురళీమోహన్గారి ఆధ్వర్యంలోని జ్యూరీ ఎంపిక చేసింది. అలాగే ఆరు ప్రత్యేక అవార్డులు ఇవ్వనున్నాం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నంది అవార్డుల్లో ఉన్న నాలుగు ప్రత్యేక అవార్డు (రఘుపతి వెంకయ్య, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులు) లతోపాటు అదనంగా తెలంగాణకి చెందిన పైడి జైరాజ్, కాంతారావు పేర్లతోనూ అవార్డులను ఇవ్వనున్నాం. జూన్ 14న 2024కి సంబంధించిన ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’తోపాటు ఈ పదేళ్లకి సంబంధించిన అవార్డులను కలుపుకుని మొత్తం 11 ఏళ్లకి సంబంధించి అదే రోజు ప్రదానం చేస్తాం’’ అని తెలిపారు. ఈ సమావేశంలో జ్యూరీ సభ్యులు కె. దశరథ్, డీవీకే రాజు, ఊహ, ఉమామహేశ్వర రావు, వనజా ఉదయ్, కూచిపూడి వెంకట్, కె. శ్రీధర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డా. హరీశ్ తదితరులు పాల్గొన్నారు. అవార్డుకి ఎంపికైన చిత్రాలు2014 1. రన్ రాజా రన్ 2.పాఠశాల 3. అల్లుడు శీను 2015 1. రుద్రమదేవి 2. కంచె 3. శ్రీమంతుడు 2016 1. శతమానం భవతి 2. పెళ్ళి చూపులు 3. జనతా గ్యారేజ్ 2017 1. బాహుబలి 2, 2. ఫిదా 3. ఘాజీ 2018 1. మహానటి 2. రంగస్థలం 3. కేరాఫ్ కంచరపాలెం 2019 1. మహర్షి 2. జెర్సీ 3. మల్లేశం 2020 1. అల వైకుంఠపురములో.. 2. కలర్ ఫోటో 3. మిడిల్ క్లాస్ మెలోడీస్ 2021 1. ఆర్ఆర్ఆర్ 2. అఖండ 3. ఉప్పెన 2022 1. సీతారామం 2. కార్తికేయ 2 3. మేజర్ 2023 1. బలగం 2. హనుమాన్ 3. భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డు: ప్రజాకవి కాళోజీ ప్రత్యేక అవార్డులు... ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ (హీరో) పైడి జైరాజ్ ఆల్ ఇండియా ఫిల్మ్ అవార్డు: మణిరత్నం (డైరెక్టర్) బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్ (డైరెక్టర్) నాగిరెడ్డి–చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణచంద్రరావు (నిర్మాత) కాంతారావు ఫిల్మ్ అవార్డు: విజయ్ దేవరకొండ (హీరో) రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్ (రచయిత)⇒ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒక వైపు... ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు... నటుడిగా నేను 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకోవైపు... కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్తో సత్కరించిన ఇలాంటి తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ని నాకు ప్రకటించడం నా అదృష్టంగా, దైవ నిర్ణయంగా, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, నాన్నగారి చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లవేళలా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. – హీరో బాలకృష్ణ⇒ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్లో ‘శ్రీమంతుడు, మహర్షి, మేజర్’ సినిమాలకు అవార్డులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా దర్శకులకు, ఈ అవార్డులకు కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సినిమాను సెలబ్రేట్ చేసే ప్రతిష్ఠాత్మకమైన గౌరవ పురస్కారాలను ఇన్షియేట్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.– హీరో మహేశ్బాబు ⇒ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో నట ప్రపూర్ణ కాంతారావు ఫిల్మ్ అవార్డుకు నేను ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డుని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకంతో ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. అదే విధంగా 2016కి సంబంధించి రెండో ఉత్తమ సినిమాగా ‘పెళ్ళి చూపులు’ ఎంపికవడంపై సంతోషంగా ఉన్నాను. ఈ చిత్రానికి నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ విజయం నా అభిమానులకు చెందుతుంది. ఎందుకంటే వారి ప్రేమ, అభిమానాలే నన్ను నిరంతరం ముందుకు నడిపిస్తున్నాయి. ఈ ప్రయాణంలో భాగమైన నా దర్శక–నిర్మాతలు, కుటుంబ సభ్యులు, ఇతర చిత్రయూనిట్కి థ్యాంక్స్. – హీరో విజయ్ దేవరకొండ⇒ 2015వ సంవత్సరానికిగాను మా గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద రాగిణి గుణ, నీలిమ గుణ, యుక్త గుణ నిర్మించిన ‘రుద్రమ దేవి’కి ఉత్తమ చిత్రంగా గద్దర్ సినిమా అవార్డుని ప్రకటించడం ఆనందంగా,ప్రోత్సాహకరంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్గారికి, మిగతా సభ్యులకు కృతజ్ఞతలు. రుద్రమ దేవిగా అనుష్క అద్భుతంగా నటించారు. గోన గన్నారెడ్డిపాత్రలో మెప్పించిన అల్లు అర్జున్ తెర ముందు, తెర వెనక మా చిత్రానికి వెన్నెముకగా నిలిచారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. – దర్శక–నిర్మాత గుణశేఖర్⇒ తెలుగు సినిమా మార్గదర్శకులలో బీఎన్ రెడ్డిగారు ఒకరు. ఆయన పేరు మీద అవార్డు అందుకోనుండటం చాలా గౌరవం. నన్నెంతగానో స΄ోర్ట్ చేస్తున్న నా నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ జ్యూరీకి నా ధన్యవాదాలు. – దర్శకుడు సుకుమార్ -
అర్జున్ అంబటి హీరోగా 'పరమపద సోపానం'.. క్రేజీ సాంగ్ వచ్చేసింది!
బిగ్బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం పరమపద సోపానం'. ఈ చిత్రంలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో ఎస్.ఎస్.మీడియా బ్యానర్లో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి నాగ శివ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ మూవీ నుంచి 'భూమ్ భూమ్' అంటూ సాగే రెండో లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటను గీతా మాధురి ఆలపించారు. రాంబాబు గోశాల సాహిత్యం అందించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాలోని 'చిన్ని చిన్ని తప్పులేవో' అనే లిరికల్ సాంగ్ను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రమోషన్లలో భాగంగా రెండో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా జూలై 11న థియేటర్లలో సందడి చేయనుంది.గీతా మాధురి మాట్లాడుతూ.. " పరమపద సోపానంలో 'భూమ్ భూమ్' అనే పాటని పాడాను. నాగ శివ పూరి వద్ద చాలా సినిమాలకు అసోసియేట్గా వర్క్ చేశారు. ఇప్పుడు దర్శకుడిగా మారి మనముందుకు 'పరమపద సోపానం'ని తీసుకొస్తున్నారు. ఈ పాటని చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను. ఇది మంచి స్వింగ్ ఉన్న పాట. కచ్చితంగా ఈ పాట అందరినీ అలరిస్తుంది. టీం అందరికీ థాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్" అని అన్నారు. -
టీవీల్లో పుష్పరాజ్.. ఎప్పుడు.. ఎక్కడ చూడాలంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1896 కోట్లు రాబట్టింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాహుబలి, కేజీఎఫ్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం దంగల్ మూవీ రికార్డ్ను మాత్రమే అధిగమించలేకపోయింది. ఇటీవల ఈ మూవీలో నటనకు గానూ అల్లు అర్జున్కు గద్దర్ అవార్డ్ వరించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. జనవరి 30 నుంచి ఓటీటీలో సందడి చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో బుల్లితెరపై కూడా సందడి చేసింది. థియేటర్లలో విడుదలైన తర్వాత టీవీల్లోనూ పుష్ప-2 ప్రసారమైంది.తాజాగా హిందీ ప్రేక్షకులను కూడా టీవీల్లో అలరించనున్నారు పుష్పరాజ్. ఈనెల 31 వ తేదీన జీ సినిమాలో ప్రసారం చేయనున్నట్లు పుష్పటీమ్ వెల్లడించింది. శనివారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు జీ సినిమాలో ప్రసారం కానున్నట్లు ట్వీట్ చేశారు మేకర్స్. మొదటిసారి బుల్లితెరపై పుష్పరాజ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ప్రకటనతో టీవీల్లో పుష్ప-2 వీక్షించేందుకు బాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా.. పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్గా తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. 31 May ki shaam,Har ghar goonjegi ek hi awaaz, Pushparaj!Dekhiye #TVParPehliBaar 'Pushpa 2: The Rule', 31 May, shaam 7:30 baje, sirf #ZeeCinema par. @zeecinema #Pushpa2TheRule #TVParPehliBaar #Pushpa2OnZeeCinema #Pushpa2OnZeeCinemaOn31May #WildFirePushpa… pic.twitter.com/aFarZPGepn— Pushpa (@PushpaMovie) May 30, 2025 -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తారకరామం పుస్తకం బహుకరణ
మహా నటుడు, ప్రజా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి 'తారకరామం' పుస్తకాన్ని బహుకరించానని సీనియర్ జర్నలిస్ట్ రచయిత జి. భగీరథ తెలిపారు. ఎన్టీఆర్ రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ ఆధ్వర్యంలో 'శకపురుషుడు ' , 'తారకరామం' అనే రెండు పుస్తకాలు తన సంపాదకత్వంలో వెలువడ్డాయని భగీరథ చెప్పారు.ఈనెల 28 వ తేదీన ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో కలసి పుస్తకాన్ని అందించినట్లు భగీరథ వెల్లడించారు. 1950 నుంచి 1995 మధ్యకాలంలో రామారావు ఇచ్చిన ఇంటర్వ్యూలతో ఈ పుస్తకం రూపొందించినట్లు తెలిపారు. ఆయన జయంతి రోజున 'తారకరామం ' ప్రత్యేక గ్రంథాన్ని కానుకగా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం.. మనోజ్ టార్గెట్గా విష్ణు కామెంట్స్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం కావడం టాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఈ విషయం బయటికి రావడంతో హాట్ టాపిక్గా మారింది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు కూడా నమోదు చేశారు. హార్డ్ డిస్క్ ఎవరూ మాయం చేశారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హార్డ్ డిస్క్ మాయంపై హీరో మంచు విష్ణు స్పందించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై మంచు విష్ణు సంచలన కామెంట్స్ చేశారు.మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని మంచు విష్ణు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే వాళ్లుగా తీసుకున్నారా? ఇంకెవరైనా వారితో చేయించారా? అన్నది త్వరలోనే తెలుస్తుందని అన్నారు. హార్డ్ డిస్క్ బయటకు వెళ్లిన విషయమై పోలీసుల ద్వారా రిపోర్టర్కు తెలియడం వల్లే బయటకొచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెప్పడం తనకు ఇష్టం లేదని మంచు విష్ణు వెల్లడించారు. కలర్ గ్రేడింగ్కు సంబంధించి ముంబయిలో రెడీ అయితే.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉందని తెలిపారు. మొదటిసారి పంపిన కాపీ సరిగా రాకపోవడంతో ఆ కంపెనీ హార్డ్ డ్రైవ్లో ఆ సీన్స్ను పెట్టి కొరియర్ చేసిందని విష్ణు అన్నారు.మంచు విష్ణు మాట్లాడుతూ..' మేం రెండు అడ్రస్లు మెయింటెన్ చేస్తాం. అందులో ఆఫీస్ అడ్రస్ ఒకటి.. మరొకటి జీఎస్టీ రిజిస్ట్రార్ పేరిట ఉంటుంది. ఇది ఫిల్మ్ నగర్లోని నాన్న ఇంటి అడ్రస్. మా ముగ్గురికి సంబంధించిన ఏదైనా ఇక్కడికే వస్తుంది. అక్కడ ఉండే మా మేనేజర్లు ఎవరిది వాళ్లకు అందజేస్తారు. దాదాపు 15 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. కానీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి కొరియర్ వచ్చిన సమయంలో రఘు అనే అతను అక్కడికి వచ్చాడు. ఆ ప్యాకెట్ తీసుకుని చరిత అనే అమ్మాయికి ఇచ్చాడు. ఇది జరిగి దాదాపు నెల రోజులైంది. నాకు తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించలేదు. కొరియర్ తీసుకున్న వాళ్లు మనోజ్ ఇంట్లో పనిచేస్తున్నారో? లేదో నాకు తెలియదు. ఎవరైనా చెప్తే వచ్చి తీసుకెళ్లారా? వాళ్లే స్వయంగా తీసుకున్నారో తెలియాల్సి ఉంది' అని అన్నారు. కాగా.. కన్నప్ప మూవీ జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. Actor Vishnu Manchu about the #Kannappa harddisk Missing:“The accused mentioned in FIR , Raghu & Chaithra was working under My younger brother Manoj Manchu . There is no request from production team for the harddisk to send to the VFX team; but we don't know why they sent .… pic.twitter.com/T5Kyt4aWZ8— Christopher Kanagaraj (@Chrissuccess) May 30, 2025 -
నివేదా ఇంట సెలబ్రేషన్స్.. ఎర్ర గులాబీలా నిధి
శ్రీలంక కొలంబోలో ఎంజాయ్ చేస్తున్న అనసూయనివేదా థామస్కు గద్దర్ అవార్డ్.. ఇంట్లో సెలబ్రేషన్స్'హరిహర వీరమల్లు' జ్ఞాపకాలతో నిధి అగర్వాల్థాయ్లాండ్లో చిల్ అవుతున్న '96' ఫేమ్ గౌరీ కిషన్పెట్ డాగ్తో హీరోయిన్ పూజా హెగ్డే ఫన్నీ గేమ్స్స్టేజీ ఫెర్ఫార్మెన్స్ వీడియో పోస్ట్ చేసిన శ్రుతి హాసన్లండన్లో తెగ తిరిగేస్తున్న చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) -
వరలక్ష్మీ శరత్ కుమార్ 'పోలీస్ కంప్లెయింట్'
దక్షిణాదిలో డిఫరెంట్ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు తెలుగులో 'పోలీస్ కంప్లెయింట్' అనే మూవీ చేస్తోంది. ఇందులో వరలక్ష్మి ఫస్ట్ లుక్ని సూపర్స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా విడుదల చేశారు. పవర్ఫుల్ పోలీస్గా ఈమె కనిపించనుంది. ఈ చిత్రంలో కృష్ణ మీద స్పెషల్ సాంగ్ షూట్ చేసామని, అది సినిమాకే మెయిన్ హైలెట్ అని నిర్మాతలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: 'షష్టిపూర్తి' సినిమా రివ్యూ)సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' అనే కాన్సెప్ట్ ఆధారంగా సినిమా తీశామని చెప్పిన దర్శకుడు సంజీవ్.. మనం చేసే ప్రతి చర్యకి ఫలితంగా అదే తిరిగి మనకే వస్తుందనే విషయాన్ని హారర్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో సరికొత్తగా చూపించబోతున్నామని అన్నారు. (ఇదీ చదవండి: భైరవం మూవీ రివ్యూ) -
అలా జరిగి ఉంటే బిన్ లాడెన్ పదేళ్ల ముందే దొరికేవాడు: పూరి జగన్నాధ్
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవల రోజుకొక పాడ్కాస్ట్తో అభిమానులను అలరిస్తున్నారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆయన తరచుగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూనే ఉన్నారు. ఏదో ఒక సబ్జెక్ట్పై తన పరిశోధన జరిపి ఫ్యాన్స్కు, సినీ ప్రేక్షకులకు అందిస్తున్నారు. అయితే రోటీన్గా కాకుండా ఈ సారి భిన్నమైన అంశాన్ని తీసుకొచ్చారు. ఏకంగా మోస్ట్ వాంటెడ్ పేరుతో ఒసామా బిన్ లాడెన్ చివరి పదేళ్లు ఎలా బతికాడు? అనే విషయాన్ని పంచుకున్నారు. ఎంతోమంది చావుకు కారణమైన ఒసామా బిన్ లాడెన్ చివరికీ భయపడుతూ బతకాల్సి వచ్చిందని అన్నారు.పూరి మాట్లాడుతూ..'పాకిస్థాన్ స్వాట్ వ్యాలీలో స్పీడ్గా వెళ్తున్న కారును పోలీసులు ఆపారు. ఆ కారులో నీట్గా షేవ్ చేసుకున్న వ్యక్తి కూర్చున్నాడు. ఆ కారు డ్రైవర్తో ఏదో మాట్లాడిన తర్వాత పోలీసులు వారిని వదిలేశారు. కానీ ఆ కారులో ఉన్నంది ఒసామా బిన్ లాడెన్ అని పోలీసులకు తెలియదు. ఆరోజు గనుక అతన్ని వదలకుండా ఉంటే.. దశాబ్దం ముందే దొరికే పోయేవాడు. అలా తప్పించుకున్న బిన్ లాడెన్ స్వాట్ వ్యాలీ, పెషావర్, హరిపూర్ తర్వాత చివరికీ అబోటాబాద్లో సెటిలయ్యాడు. అతను ఉన్న ఇంటి పేరు వజీరిస్థాన్ హవేలి. దాదాపు చుట్టూ 12-18 అడుగుల ఎత్తున్న గోడలతో మూడు అంతస్తుల ఇల్లు ఇది. తన ముగ్గురు పెళ్లాలు.. 8మంది పిల్లలు.. ఐదుగురు మనవళ్లతో అక్కడే ఉండేవాడు' అని పంచుకున్నారు.ముఖ్యంగా బిన్ లాడెన్ తన చిన్న పెళ్లాంతోనే ఎక్కువగా ఉండేవాడు. ఆ ఇంటికి టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది కాదు. చెత్త కూడా ఇంట్లోనే కాల్చేసేవారు. తలుపు తీసేవారు కాదు. ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారో ఆ చుట్టుపక్కల వాళ్లకూ తెలియదు. బిన్ లాడెన్కు నాలుగు జతల బట్టలు, ఒక జాకెట్, రెండు స్వెటర్స్ మాత్రమే ఉండేవి. అలా 9ఏళ్లు అజ్ఞాతంలో కాలం వెళ్లదీశాడు. స్పై శాటిలైట్స్ నుంచి తప్పించుకోవడం కోసం బయటకు వచ్చినప్పుడల్లా కౌబాయ్ టోపీ పెట్టుకుని కాంపౌండ్లో తిరిగేవాడు. అతని రైట్ హ్యాండ్ అబు అహ్మద్ అల్ కువైటీ.. అతని స్నేహితుడు అబ్రార్ మాత్రమే లాడెన్తో ఇతరులకు కమ్యూనికేషన్. అలాగే ఇంట్లో అవసరాలు వాళ్లే చూసుకునేవారు' అని పంచుకున్నారు.లాడెన్ తన ఇంట్లోనే కూరగాయలు పండించుకుంటూ కుందేళ్లు, కోళ్లను పెంచుకుంటూ బతికేవాడు. మనవళ్లతో మొక్కలు నాటించి.. ఎవరిది పొడుగ్గా పెరిగితే వాళ్లకు బహుమతులు ఇస్తానని పోటీలు పెట్టేవాడట. సీక్రెట్ శాటిలైట్ డిష్ పెట్టుకుని టీవీ చూసేవాడట. తన గురించి ఒబామా ఏం మాట్లాడుతున్నాడో అనుక్షణం తెలుసుకునేవాడు. అతడు ఎక్కువగా టామ్ అండ్ జెర్రీ యానిమేటెడ్ సినిమాలు చూసేవాడు. స్వీట్స్, చాక్లెట్లు అంటే కూడా అతనికి బాగా ఇష్టం. ఒకసారి తన భార్య డెలివరి అవుతుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో తానే స్వయంగా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. మారువేషంలో ఉన్న బిన్ లాడెన్.. డాక్టర్తో నా భార్య మూగ, చెవిటిది అని అబద్ధం చెప్పాడు. దాంతో ఆమెను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఆ రోజు అమాయకంగా ఆస్పత్రిలో కూర్చొన్న బిన్లాడెన్ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు' అని తెలిపారు.'అల్ఖైదా ఆపరేషన్స్ గురించి అతడు చెబుతుంటే.. కూతుళ్లు కాగితం మీద రాసేవారు. ఆ సమయంలో అల్ఖైదా బలహీనపడటంపై ఎక్కువగా బాధపడేవాడట. ఒకసారి అల్ఖైదా పేరు కూడా మార్చాలని ఆలోచించాడు. తన పిల్లలు, మనవళ్లు స్కూల్కు వెళ్లే అవకాశమే లేదు. దీంతో తానే పాఠాలు చెప్పేవాడు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కంప్యూటర్ ఉండేది. ఏదైనా సమాచారం చేరవేయాలంటే యూఎస్బీ డ్రైవ్స్ వాడేవాడు. ఏళ్ల తరబడి అదే ఇంట్లో అనుక్షణం భయపడుతూ బతికాడు. రోజంతా ఏం చేయాలో తోచక అతని దగ్గరున్న వీడియో కెమెరాతో కోళ్లు, మొక్కలు, అప్పుడప్పుడు ఇంటిపై నుంచి వెళ్తున్న హెలికాప్టర్ దృశ్యాలను రికార్డు చేసేవాడు. ఎందుకంటే పక్కనే పాకిస్థాన్ ఆర్మీ కంటోన్మెంట్ ఉండేది. ఏ హెలికాప్టర్ వచ్చినా భయం వేసేదంట. ఆ తర్వాత సీల్ టీమ్ ఇంట్లో చొరబడి అతడిని చంపిన తర్వాత అక్కడి కంప్యూటర్ నుంచి 4.70 లక్షల ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అందులో పోర్న్ వీడియోలు కూడా దొరికాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామాను ఎలా చంపాలో వేసిన ప్లాన్స్ అన్నీ సీల్ టీమ్కు దొరికాయి. ఎన్నో వేల మంది చావులకు, సెప్టెంబరు 11 దాడులకు కారణమైన బిన్లాడెన్ తన చివరి పదేళ్లు కష్టాలు పడుతూ, భయపడుతూ బతికాడు. ఇవి బిన్ లాడెన్ గురించి తెలియని కొన్ని విషయాలు' అంటూ పూరి జగన్నాథ్ తన మ్యూజింగ్స్తో వివరిచారు. -
పిచ్చి పీక్స్.. 'ఖలేజా' రీ రిలీజ్లో పాముతో వీరంగం!
గత కొన్నాళ్లుగా టాలీవుడ్లో వింత పరిస్థితి. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్ల హడావుడి ఎక్కువైపోయింది. స్టార్ హీరోల మూవీస్ అయితే అభిమానులు, సదరు చిత్రాల్లో సీన్లని రీ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా 'ఖలేజా' రీ రిలీజ్ సందర్భంగానూ అంతకు మించి అనేలా ఓ అభిమాని రచ్చ చేశాడు. ఏకంగా థియేటర్లలోకి పాము తీసుకొచ్చి హల్చల్ చేశాడు.(ఇదీ చదవండి: నటి స్నానం చేసిన నీటితో సబ్బు.. రేటు ఎంతంటే?)తెలుగు రాష్ట్రాల్లో తాజాగా మహేశ్ బాబు 'ఖలేజా'ని రీ రిలీజ్ చేశారు. ఈ మూవీలో సీన్లకు తగ్గట్లు కొందరు ఆస్పత్రి డ్రస్ వేసుకుని వెళ్లగా, మరికొందరు కుండీతో మొక్కని తీసుకెళ్లారు. విజయవాడలో ఓ అభిమాని మాత్రం థియేటర్లలోకి పాముని తీసుకెళ్లాడు. సినిమా ప్రారంభంలో మహేశ్ బాబు పాముని పట్టుకుని.. విలన్లకి పైకి విసురుతాడు. ఇప్పుడు అభిమాని కూడా.. స్క్రీన్ దగ్గర పాముతో కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.'గుంటూరు కారం' తర్వాత మహేశ్ ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇది రావడానికి మరో మూడు నాలుగేళ్లు పట్టొచ్చు. అందుకే మహేశ్ ఫ్యాన్స్.. 'ఖలేజా' రీ రిలీజ్ సందర్భంగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. రకరకాల సీన్లని రీ క్రియేట్ చేస్తూ నెట్టింట వైరల్ అయిపోతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు తొలిరోజు భారీగానే వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: విష్ణుని రెచ్చగొట్టేలా మంచు మనోజ్ మరో పోస్ట్!)ఇదేమీ సీన్ రిక్రియేషన్ పిచ్చిరా బాబు...విజయవాడలో ఖలేజా రీరిలీజ్ సందర్భంగా ఓ అభిమాని హల్చల్. సినిమా ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్లోకి పాముని తీసుకెళ్లి, స్క్రీన్ పైకి ఎక్కి వీరంగం సృష్టించాడు.#KhalejaReRelease #MaheshBabu pic.twitter.com/kJbWY6ptFE— greatandhra (@greatandhranews) May 30, 2025 -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో పాల్గొన్న నటి
అర్చనా సింగ్... తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు కొత్తగా అనిపించినా, కన్నడ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో ఆమె ఓ సుపరిచిత నటి. కన్నడలో కాంతామణిగా పేరొందిన అర్చనా, ఇటీవల హిమాలయాల్లోని "ఎవరెస్ట్ బేస్ క్యాంప్" సాహస యాత్రలో పాల్గొని తన ధైర్యాన్ని చాటింది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనేదే తన లక్ష్యమని చెప్పకనే చెప్పింది.ఎం.బి.ఏ. పట్టభద్రురాలైన అర్చనా, సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే, "విప్రో", "ఐ.టి.సి. గ్రూప్ ఆఫ్ హోటల్స్", "కింగ్ ఫిషర్", "జెట్ ఎయిర్లైన్స్" వంటి ప్రముఖ సంస్థల్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేసింది. కన్నడ, తమిళ చిత్రాల్లో నటించిన ఈ అందాల నటి, తెలుగులో "దమయంతి - కౌశిక్ వర్మ" చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం "మై ఫాదర్ - మై హీరో" అనే చిత్రంతో మలయాళంలో అరంగేట్రం చేస్తోంది, ఈ చిత్రం ఇంగ్లీష్లోనూ రూపొందుతోంది. శాస్త్రీయ నృత్యంలో నైపుణ్యం కలిగిన అర్చనా, సమయం దొరికినప్పుడల్లా నృత్య ప్రదర్శనలు కూడా ఇస్తుంది. కన్నడ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్లలో స్వీయవంతంగా మాట్లాడే ఆమె, తెలుగు, తమిళ భాషల్లోనూ పట్టు సాధించింది.ఇటీవల తన "ఎవరెస్ట్ బేస్ క్యాంప్" యాత్ర గురించి మాట్లాడుతూ ..నా కెరీర్ ప్రారంభంలో చేసిన ఉద్యోగాలు, దక్షిణ భాషల సినిమాల్లో నటించడం నాకు ఎంత ఉత్సాహాన్నిచ్చాయో, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర అంతకంటే ఎక్కువ ఉత్తేజాన్నిచ్చింది. జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పాన్ని, ప్రేరణను ఈ యాత్ర నాలో నింపింది. నాలో దాగి ఉన్న భయాలను, బెరుకును ఈ సాహసం తుడిచిపెట్టింది. ఈ అనుభవాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం." నటన విషయంలో తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఈ ధైర్యవంతమైన నటి చెప్పింది. -
‘యాస’కు సై అంటున్న టాలీవుడ్ స్టార్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో యాస మారుతోంది. గతంలో హీరోలు, హీరోయిన్లు, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కూడా అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యేలా సాధారణ యాసలో డైలాగులు చెప్పేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. చిత్రకథ ఏ ప్రాంతీయ నేపథ్యంలో సాగుతుందో అక్కడి యాసని పలికేందుకు నటీనటులు సై అంటున్నారు. రాయలసీమ, కోస్తా, తెలంగాణ, ఆంధ్ర... ఇలా ప్రాంతం ఏదైనా అక్కడి నేటివిటీకి తగ్గట్టు యాస నేర్చుకుని, తమదైన శైలిలో డైలాగులు చెబుతూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులు పంచుతున్నారు. ఇలాంటి చిత్రాలని ప్రేక్షకులు కూడా ఆదరిస్తుండటంతో మేకర్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో మన హీరోలు పలుకుతున్న యాస విశేషాలేంటో చూద్దాం... రాయలసీమ నేపథ్యంలో... చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగానే ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి శ్రీకారం చుట్టారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారను ఖరారు చేశారు మేకర్స్. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందనుందని, చాలా కాలం తర్వాత చిరంజీవి కంప్లీట్ హ్యూమరస్ రోల్లో కనిపించనున్నారనీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో రాయలసీమ నేపథ్యం ఉంటుందని సమాచారం. చిరంజీవి ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్లో రాయలసీమ బ్యాక్డ్రాప్ ఉంటుందని తెలుస్తోంది. సో... చిరంజీవి రాయలసీమ యాసలో అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘సైరా నరసింహారెడ్డి, గాడ్ఫాదర్’ వంటి చిత్రాల తర్వాత చిరంజీవి– నయనతార కలిసి మూడవసారి నటిస్తున్న చిత్రం ‘మెగా 157’. 2026 సంక్రాంతి కానుకగా ‘మెగా 157’ విడుదల కానుంది. పుడతాం ఏటి మళ్లీ... రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియన్ చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’తో (2021) బ్లాక్బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్లో.. ‘ఓటే పని చేసే నాకి, ఒకేనాక బతికే నాకి ఇంత పెద్ద బతుకెందుకు?’, ‘ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్చరణ్ చెప్పిన డైలాగులకు అద్భుతమైన స్పందన వచ్చింది. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో హైదరాబాద్ శివార్లలో వేసిన ఓ భారీ విలేజ్ సెట్లో రామ్చరణ్తో పాటు ఇతర తారాగణంపై భారీ యాక్షన్ సీక్వెన్స్తో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ తాజా షెడ్యూల్తో సుమారు 50 శాతం పూర్తవుతుందని టాక్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. 2026 మార్చి 27న ‘పెద్ది’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.బ్రిటీష్ పాలన నేపథ్యంలో... విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించనున్నారు. ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాతో తొలిసారి రాయలసీమ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. తెలంగాణకి చెందిన విజయ్ ‘వీడీ 14’లో తన పాత్ర కోసం మొదటిసారి రాయలసీమ యాసలో మాట్లాడనున్నారట. ఆ యాసని పర్ఫెక్ట్గా పలికేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో దేశభక్తి అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో ఓ యోధుడిగా కనిపించనున్నారట విజయ్ దేవరకొండ. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ మూవీ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్న ఈ సినిమా కథ కూడా రాయలసీమ నేపథ్యంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని ఫిల్మ్నగర్ టాక్. ఈ చిత్రానికి ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది.కదిరి నరసింహ సామి సాచ్చిగా... వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ మూవీ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇండో–కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రం అనంతపురం నేపథ్యంలో కొనసాగుతుంది. ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా’ అంటూ ఇటీవల వరుణ్ తేజ్ పెట్టిన పోస్ట్తో ఈ విషయం స్పష్టమైంది. అందులో భాగంగానే ఈ సినిమా తాజా షెడ్యూల్ అనంతపురంలో జరిపారు మేకర్స్. అనంతపురంలోని ప్రముఖ కార్ల కంపెనీ కియా గ్రౌండ్స్తో పాటు అక్కడి అందమైన గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఇటీవలే ఈ షెడ్యూల్ ముగిసినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్ హైదరాబాద్లో, ద్వితీయ షెడ్యూల్ అనంతపురంలో విజయవంతంగా పూర్తి చేసింది యూనిట్. మూడో షెడ్యూల్ కొరియాలో ప్రారంభం కానుంది. థ్రిల్లింగ్ సన్నివేశాలతో పాటు తనదైన పంచ్ హ్యూమర్తో ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు మేర్లపాక గాంధీ. ‘వీటీ 15’ కోసం అనంతపురం యాసలో మాట్లాడనున్నారు వరుణ్ తేజ్. ఈ సినిమాకి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ అనుకుంటున్నారట.ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్ ’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథాంశం రాయలసీమలోని చిత్తూరు నేపథ్యంలో సాగనుంది. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘గతాన్ని తరమడానికిపోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అక్కినేని అఖిల్ చెప్పిన ఇంటెన్స్ డైలాగ్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో మాస్ లుక్లో కనిపించనున్నారు అఖిల్. ఇందుకోసం ΄÷డవాటి జుట్టు, గెడ్డంతో ఆయన మేకోవర్ అయ్యారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కొత్త షెడ్యూల్ చిత్తూరు జిల్లాలో కొనసాగనున్నట్లు తెలిసింది.ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండా...‘విరూపాక్ష, బ్రో’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ‘హనుమాన్ ’ వంటి బ్లాక్బస్టర్ పాన్ ఇండియన్ మూవీ తర్వాత ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారతదేశానికి స్వాతంత్య్రం రాక మునుపు జరిగే కథతో రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోందని సమాచారం. ‘ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండా.. ఈ తూరి నరికినానంటే అరపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాల్లోనుంచొచ్చాది’ అంటూ రాయలసీమ యాసలో సాయి దుర్గాతేజ్ చెప్పిన డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. పైగా ఫస్ట్ లుక్స్, టీజర్ చూసిన వారికి తన కెరీర్లోనే పూర్తి స్థాయి మాస్ లుక్లో, బలమైన పాత్రలో ఆయన కనిపించనున్నారని తెలు స్తుంది. భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం పూర్తి మేకోవర్ అయ్యారు తేజ్. ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా 120 రోజుల పాటు కొనసాగింది. ఈ లెంగ్తీ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్తో కలుపుకుని 75 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు తెలిసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.మదనపల్లె యాసలో... ‘మేజర్, హిట్: ది సెకండ్ కేస్’ వంటి హిట్ సినిమాల తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ థ్రిల్లర్ మూవీగా ‘డెకాయిట్’ రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ చూస్తే.. ఇంటన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్తో అద్భుతంగా అనిపించింది. ఈ గ్లింప్స్కి మంచి స్పందన వచ్చింది. రాయలసీమలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె యాసలో అడివి శేష్ పలికిన డైలాగ్స్, ఆయన వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్స్కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు బాలీవుడ్లోనూ తెరకెక్కుతోంది. హిందీ వెర్షన్కు కూడా అడివి శేష్ సొంతంగా డబ్బింగ్ చెబుతుండటం విశేషం. ‘డెకాయిట్’ సినిమా క్రిస్మస్ కానుకగా తెలుగు, హిందీ భాషల్లో డిసెంబర్ 25న విడుదల కానుంది. – డేరంగుల జగన్ మోహన్ -
విష్ణుని రెచ్చగొట్టేలా మంచు మనోజ్ మరో పోస్ట్!
మంచు ఫ్యామిలీలో చాన్నాళ్లుగా గొడవలు సాగుతున్నాయి. వీటి గురించి మళ్లీ చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నిరోజులుగా మాత్రం విష్ణు, మనోజ్ సైలెంట్గానే ఉన్నారు. మనోజ్ కీలక పాత్రలో నటించిన 'భైరవం' సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ మనోజ్.. 'శివయ్య' అంటూ కామెంట్ చేశాడు. తర్వాత సారీ చెప్పాడు. ఇప్పుడు మరోసారి అన్న విష్ణుని రెచ్చగొట్టేలా ఓ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ అయింది.(ఇదీ చదవండి: అపస్మారక స్థితిలో 'హరిహర వీరమల్లు' నిర్మాత.. నిజమేంటి?)'భైరవం' రిలీజ్ వేళ తండ్రితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మనోజ్.. 'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' అని మోహన్ బాబుతో కలిసున్న ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో కేవలం మోహన్ బాబు-మనోజ్ మాత్రమే ఉండటంతో ఇదేదో విష్ణుని రెచ్చగొట్టేలా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.చాలా ఏళ్లుగా సినిమాలు చేయడం మానేసిన మంచు మనోజ్.. 'భైరవం' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇందులోబెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ హిట్ మూవీ 'గరుడన్'కి రీమేక్ ఇది. అలానే తేజ సజ్జా హీరోగా నటించిన 'మిరాయ్' అనే పాన్ ఇండియా మూవీలో మనోజ్ విలన్గా నటించాడు. ఇది సెప్టెంబరులో రిలీజ్ కానుంది. మరోవైపు మంచు విష్ణు కూడా 'కన్నప్ప' మూవీతో చాన్నాళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జూన్ 27న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు) View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
భైరవం మూవీ రివ్యూ
టైటిల్: భైరవంనటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అతిధి శంకర్, ఆనంది , దివ్య తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్నిర్మాత: కేకే రాధామోహన్దర్శకత్వం: విజయ్ కనకమేడలసంగీతం: శ్రీచరణ్ పాకాలసినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతంఎడిటర్: చోటా కె ప్రసాద్విడుదల తేది: మే 30, 2025బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ఈ ముగ్గురు హీరోల ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఈ మధ్యకాలంలో వీరి నుంచి సినిమాలే రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తమిళ బ్లాక్ బస్టర్ 'గరుడన్’ తెలుగు రీమేకే ఈ భైరవం. టాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని మార్పులు చేసి సినిమాను తెరకెక్కించామని మేకర్స్ చెప్పారు. మరి ఆ మార్పులలో తెలుగు ఆడియన్స్ని మెప్పించారా లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. (Bhairavam Review)భైరవం కథేంటంటే..?తూర్పు గోదావరి జిల్లా దేవిపురం గ్రామానికి చెందిన గజపతి(మనోజ్), వరద(నారా రోహిత్),శీను(బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ(జయసుధ) మరణించడంతో అనుకోకుండా ఆ ఆలయ ధర్మకర్త బాధ్యతలు శీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వెదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలను దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు. (Bhairavam Review)మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ(ఆనంది) ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఈ విషయం వరదకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు? గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శీను ఎలా రక్షించాడు. గజపతి గురించి శీనుకు తెలిసిన నిజం ఏంటి? మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి. అమ్మవారి పూనకం వచ్చే శీను.. న్యాయం కోసం చివరకు ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిన తర్వాత రీమేక్ చిత్రాలు రావడం తగ్గిపోయాయి. ఓ మంచి సినిమా ఏ భాషలో వచ్చినా సరే ఓటీటీల పుణ్యమా అని అన్ని ప్రాంతాల ప్రేక్షకులు చూసేస్తున్నారు. అలాంటి సమయంలో తమిళ బ్లాక్ బస్టర్ గరుడన్ని తెలుగులో రీమేక్ చేశాడు దర్శకుడు విజయ్ కనకమేడల. ఇది ఓ రకంగా పెద్ద సాహసమే. కానీ దానికి తగిన న్యాయం చేయలేకపోయాడు దర్శకుడు. ఒరిజినల్ సినిమాలోని ఎమోషన్ని ఇందులో క్యారీ చేయలేకపోయాడు. కథలో ఆయన చేసిన చిన్న చిన్న మార్పులే దీనికి కారణం. ముగ్గురు హీరోలను మేనేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు కానీ సెంటిమెంట్స్ని పండించే విషయంలో తడబడ్డాడు.ఒరిజినల్లో బెల్లంకొండ పాత్రను సూరి పోషించాడు. ఆయనకున్న ఇమేజ్కి ఆ పాత్ర కొత్తగా అనిపించింది. కానీ బెల్లంకొండకు ఇక్కడ ఉన్న ఇమేజ్ వేరు. దీంతో ఆ పాత్రలో ఆయన ఒదిగినట్లుగా కాకుండా నటించినట్లుగానే అనిపిస్తుంది. అలాగే మనోజ్ పాత్ర కూడా. ముగ్గురు హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వడంపైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. అమ్మవారి ట్రాక్ని కూడా సరిగా వాడుకోలేకపోయాడు. సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. గుడి నేపథ్యంతో పాటు ముగ్గురు హీరోల పరిచయం తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. శీను-వెన్నెల(అతిధి శంకర్) లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదు. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక సెకండాఫ్లో కథనం సాగదీసినట్లుగా ఉంటుంది. గరుడన్ చూసిన వారికి ట్విస్టులు కూడా తెలుస్తాయి కనుక.. అవి కూడా ఆకట్టుకోలేవు. ఇక గరుడన్ చూడని ప్రేక్షకులకు మాత్రం కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్..ముగ్గురూ టాలెంటెడ్ నటులే. మంచి పాత్రలు పడాలేకానీ రెచ్చిపోయి నటిస్తారు. భైరవంలోనూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. బెల్లంకొండ శ్రీనివాస్కి ఈ సినిమా ప్లస్ అవుతుందని చెప్పాలి. శీను పాత్రలో ఆయన జీవించేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే పూనకాల సీన్లో అదరగొట్టేశాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న గజపతి వర్మగా మనోజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లలో బాగా నటించాడు. ఇక నారా రోహిత్ తన పాత్రకి న్యాయం చేశాడు. హీరోయిన్లు అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. వెన్నెల కిశోర్ , జయసుధతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శ్రీచరణ్ పాకాల పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
అపస్మారక స్థితిలో 'హరిహర వీరమల్లు' నిర్మాత.. నిజమేంటి?
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా.. ఎట్టకేలకు మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు పాటలు రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా త్వరలో టీమ్ అంతా మీడియా ముందుకొస్తుంది. మూవీ కోసం అభిమానులు కూడా మరీ కాకపోయినా కొంత ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతలోనే చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే మాటలు వినిపించాయి. దీనిపై ఆయన టీమ్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)దాదాపు రెండు దశాబ్దాలుగా పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తున్న ఏఎమ్ రత్నం.. పవన్తో 'హరిహర వీరమల్లు' తీశారు. దాదాపు ఐదేళ్లుగా సెట్స్పై ఉన్న ఈ చిత్రం.. ఇబ్బందులు దాటుకుని ఈ జూన్ 12న థియేటర్లలోకి రానుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం.. శుక్రవారం ఉదయం బీపీ ఎక్కువ కావడంతో కళ్లు తిరిగి కింద పడ్డారని, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని తొలుత కొన్ని వార్తలొచ్చాయి. దీంతో హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోనూ చేర్పించారని, ప్రస్తుతం ఆయనకు డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారని వినిపించింది.అయితే ఇవన్నీ కూడా కేవలం పుకార్లేనని, ఏఎమ్ రత్నం ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. మరో నిర్మాత ఏ.దయాకర్ కూడా ఈ విషయమై ట్వీట్ చేశారు. అన్నయ్య ఏఎమ్ రత్నం అనారోగ్యం గురించి వస్తున్న రూమర్స్ నిజం కాదని, ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి పుకార్లని వ్యాపింపజేయొద్దని ట్విట్టర్లో రాసుకొచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: NIA అదుపులో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్) -
గద్దర్ అవార్డ్స్.. 2014 నుంచి 2023వరకు ఉత్తమ చిత్రాలు ఇవే
తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను (Gaddar Awards) ప్రకటించింది. మే 29న 2024 ఏడాదికి సంబంధించిన అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను అవార్డ్స్ కోసం ఎంపిక చేసి అందిస్తామని తెలంగాణ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయా చిత్రాలకు సంబంధించిన అవార్డులను నటుడు మురళీ మోహన్, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. జూన్ 14న అవార్డులు ప్రధానోత్సవం జరుగుతుందని వారు ప్రకటించారు2014- ఉత్తమ చిత్రాలుఉత్తమ చిత్రం- రన్ రాజా రన్ఉత్తమ రెండో చిత్రం - పాఠశాలఉత్తమ మూడో చిత్రం - అల్లుడు శ్రీను2015- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - రుద్రమదేవిరెండవ ఉత్తమ చిత్రం - కంచెమూడవ ఉత్తమ చిత్రం- శ్రీమంతుడు2016- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - శతమానం భవతిరెండవ ఉత్తమ చిత్రం - పెళ్లి చూపులుమూడవ ఉత్తమ చిత్రం - జనతా గ్యారేజ్2017- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - బాహుబలి: ది కన్క్లూజన్రెండవ ఉత్తమ చిత్రం - ఫిదామూడవ ఉత్తమ చిత్రం - ఘాజీ2018- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - మహానటిరెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - రంగస్థలంమూడవ ఉత్తమ ఉత్తమ చిత్రం - C/O కంచరపాలెం2019- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - మహర్షిరెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - జెర్సీమూడవ ఉత్తమ ఉత్తమ చిత్రం - మల్లేశం2020- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - అలా వైకుంఠపురములోరెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - కలర్ ఫోటోమూడవ ఉత్తమఉత్తమ చిత్రం - మిడిల్ క్లాస్ మెలోడీస్2021- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - RRRరెండవ ఉత్తమ చిత్రం - అఖండమూడవ ఉత్తమ చిత్రం - ఉప్పెన2022- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - సీతా రామంరెండవ ఉత్తమ చిత్రం - కార్తికేయ 2మూడవ ఉత్తమ చిత్రం - మేజర్2023- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - బలగంరెండవ ఉత్తమ చిత్రం - హనుమాన్మూడవ ఉత్తమ చిత్రం - భగవంత్ కేసరి2024- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం : కల్కీ 2898రెండవ ఉత్తమ చిత్రం : పోటేల్మూడవ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్స్పెషల్ అవార్డ్స్ ప్రకటించిన తెలంగాణఎన్టీఆర్ నేషనల్ అవార్డు- నందమూరి బాలకృష్ణపైడి జయరాజ్ నేషనల్ అవార్డు- మణిరత్నంబి ఎన్ రెడ్డి అవార్డు - దర్శకుడు సుకుమార్నాగిరెడ్డి చక్రపాణి అవార్డు- అట్లూరి పూర్ణచంద్రరావుకాంతారావు అవార్డ్- విజయ్ దేవరకొండరఘుపతి వెంకయ్య అవార్డు- యండమూరి వీరేంద్రనాథ్ -
వైజాగ్పై కమల్ వ్యాఖ్యలు.. 'ఓజీ'లో శింబు పాట
‘థగ్ లైఫ్’ ఒక అద్భుతమైన సినిమా అని హీరో కమల్ హాసన్ అన్నారు. తాజాగా విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో చిత్ర యూనిట్ గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా కమల్హాసన్ మాట్లాడుతూ.. వైజాగ్ తనను ఎంతో ఆదరించిందన్నారు. 21 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చిన తనకు ‘మరో చరిత్ర’చిత్రం తిరుగులేని అభిమానగణాన్ని అందించిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ‘ఏక్ దుజే కేలియే’ చిత్రం హిందీలో విజయం సాధించినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతోగానో ఆనందించారన్నారు. ‘సాగర సంగమం’, ‘ఏక్ దుజే కేలియే’, ‘శుభసంకల్పం’వంటి చిత్రాలు షూటింగ్లు ఇక్కడే జరిగాయని, ఇది తన సొంత ఇల్లు లాంటిదని ఆయన పేర్కొన్నారు. మంచి కళ ఎక్కడ కనిపించినా తాను సెల్యూట్ చేస్తానని, అందులో ఎన్నో విషయాలు నేర్చుకుంటానని కమల్ అన్నారు. తాను కొన్ని చెడు సినిమాలు కూడా చేశానని, వాటిని ప్రేక్షకులు మరిచిపోయి కేవలం మంచి చిత్రాలనే గుర్తు పెట్టుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. మంచి సినిమాలు అందించడం తన బాధ్యత అని అన్నారు. తాను నటించిన 15 తెలుగు చిత్రాల్లో 13 విజయవంతం అయ్యాయని, ఆ విజయాలన్నీ ప్రేక్షకుల వల్లే సాధ్యమయ్యాయని చెప్పారు. ప్లాప్లు మాత్రమే తన ఖాతాలో వేసుకుంటానన్నారు. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి ‘థగ్ లైఫ్’చిత్రాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ‘థగ్ లైఫ్’ చాలా గొప్ప చిత్రమని, శింబు అద్భుతమైన నటన కనబరిచారని, ఇది వరకు చూడని పాత్రలో ఆయన కనిపిస్తారని కొనియాడారు. అభిరామి కూడా అద్భుతంగా నటించారని, నాజర్తో తనది చాలా కాలం నుంచి ప్రయాణమన్నారు. త్రిష నటన ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని, తామంతా కలిసి ఒక గొప్ప సినిమా చేశామని నమ్ముతున్నట్లు చెప్పారు. జూన్ 5న తాము అనుకున్నది కరెక్టో కాదో ప్రేక్షకులు సినిమా చూసి చెప్పాలని కోరారు.ఓజీ సినిమాలో పాట పాడాను..హీరో శింబు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారని, ఈ చిత్రం కూడా తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఓజీ’ సినిమాలో తాను ఒక పాట పాడానని, అది త్వరలోనే విడుదల కానుందని తెలిపారు. పవన్ కల్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం కూడా త్వరలో విడుదల కానుందని, ఆ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హీరోయిన్ త్రిష మాట్లాడుతూ ‘వర్షం’ సినిమా విడుదలై 22 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఇంత అభిమానం చూపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. వైజాగ్ తనకెంతో ఇష్టమైన నగరమని, ‘థగ్ లైఫ్’సినిమాలో కమల్ హాసన్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తాను ఇంద్రాణి అనే పాత్ర పోషించానని, ఆ పాత్ర తప్పకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందన్నారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో సినిమా బృందానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. -
కోహ్లీ లైక్తో 20 లక్షలు మంది ఫాలో.. ఇంత ఖాళీగా ఉన్నారా: రకుల్
బాలీవుడ్ నటి అవ్నీత్ కౌర్(Avneet Kaur) ఫ్యాన్ పేజీలోని ఒక పోస్ట్ను క్రికెటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli) లైక్ చేయడంతో ఆ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇప్పుడు దాని గురించి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh) మాట్లాడారు. దేశంలో మనం ఇంత కాళీగా ఉన్నామా అంటూ తనదైన స్టైల్లో కామెంట్ చేసింది. ఇలాంటి వాటిని ఎందుకు వైరల్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. అవసరం లేని విషయాలకు ఎక్కువ సమయం కేటాయించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని సూచించారు.అవ్నీత్కౌర్ ఫ్యాన్ పేజీలోని ఒక ఫోటోను విరాట్ లైక్ చేయడంపై రకుల్ ఇలా చెప్పుకొచ్చారు. ' ఈ అంశం నన్ను చాలా బాధించింది. హమ్ బోహోత్ వేలే హై (మనమంతా ఇంత ఖాళీగా ఉన్నామా..) అనిపించింది. విరాట్ లైక్ వల్ల ఆమెకు(అవ్నీత్కౌర్) 20 లక్షల మంది ఫాలోవర్స్ కొన్ని గంటల్లోనే పెరిగారు. పొరపాటున లైక్ బటన్ ప్రెస్ అయిందని చెప్పినా కూడా పెద్ద సంఖ్యలో ఆమెను అనుసరించారు. ఇన్స్టాగ్రామ్లో ఒక్కోసారి మనం కూడా పొరపాటున స్నేహితులను అన్ఫాలో చేయడం జరుగుతుంది. ఇలాంటివి చాలా కామన్గా జరిగే అంశాలు. విరాట్ కూడా వివరణ ఇచ్చారు. కానీ, విరాట్ సెలబ్రిటీ కాబట్టి ఆయనకు నచ్చిన, నచ్చని అంశాలు అన్నీ వార్తలుగా మారిపోతున్నాయి. ఆయన వ్యక్తిగత విషయాలను కూడా ఇలా వైరల్ చేయడం చాలా విచారకరమైన విషయం. సోషల్ మీడియాలో చాలామంది సమయాన్ని వృథా చేస్తున్నారు.' అని ఆమె అన్నారు.ఆ అంశంపై కోహ్లీ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. తన ఇన్స్టాగ్రామ్లోని ఫీడ్ను క్లియర్ చేస్తున్న క్రమంలో పొరపాటున లైక్ బటన్ ప్రెస్ అయి ఉండొచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంలో ఎలాంటి ఉద్దేశం లేదని కూడా చెప్పారు. అవసరంలేని ప్రచారాలు చేయకండని కూడా కోరారు. -
పాకిస్థాన్ 10 వీడియోలు.. NIA అదుపులో బయ్యా సన్నీ యాదవ్
తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై ఎయిర్పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్లో భాగంగా ఆయన కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్కు వెళ్లారు. అక్కడ పరిస్థితిలు ఎలా ఉంటాయో తన యూట్యూబ్లో చెప్పుకొచ్చాడు. పాక్లో మొదటిరోజు అంటూ ఒక వీడియోను ఆయన రీసెంట్గా షేర్ చేశారు. దానిని చూసిన ఎన్ఐఏ అధికారులు బయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేశారు.పహల్గాం (Pahalgam Terror Attack)లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాక్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్పై భారత్ దాడికి దిగింది. ఇలాంటి సమయంలోనే బయ్యా సన్నీ యాదవ్ పాక్ వెళ్లినట్లు 10 వీడియోలను పంచుకున్నారు. వాటిపై ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో అతను పాకిస్థాన్ వెళ్లినట్లు సమాచారం. ఏప్రిల్లో పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ స్థాయిలో చర్చలకు దారి తీసింది. ఇలాంటి సమయంలో తన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తాయని వాటితో డబ్చు చేసుకోవచ్చనే ఉద్దేశంతో తన యూట్యూబ్లో పోస్ట్ చేశారని తెలుస్తోంది.పాకిస్థాన్కు గూఢచారిగా వ్యవహరించిందని హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను (Jyoti Malhotra) పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మల్హోత్రాను ఓ అస్త్రంగా పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లు (ISI) మలచుకున్నట్లు హరియాణా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఒక అధికారితో ఆమె టచ్లో ఉన్నట్లు కూడా విచారణలో గుర్తించారు. ట్రావెల్ వీడియోస్ పేరుతో జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్లో పలుమార్లు పర్యటించిందని పోలీసులు గుర్తించారు. ఓసారి చైనాకూ కూడా ఆమె వెళ్లి వచ్చినట్లు ఆధారాలు సేకరించారు. ఆమె తరహాలోనే బయ్యా సన్నీ యాదవ్కు కూడా ఏమైనా పాక్ అధికారులతో పరిచయాలు ఉన్నాయా..? అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. -
నటుడు రవిమోహన్కు అత్త నోటీసులు
నటుడు రవిమోహన్ (జయం రవి), భార్య ఆర్తీల విడాకుల వ్యవహారం సీరియల్గా సాగుతోందనే చెప్పాలి. ముందు రవిమోహన్, ఆర్తీ ఒకరిపై ఒకరు విమర్శించుకున్నారు. తమ జీవితంలో వివాదం తలెత్తడానికి కారణం గాయని కెనిషానే కారణం అని ఆర్తిపై విమర్శలు చేశారు. అయితే మీ వివాదంలోకి తనను లాగొద్దని కెనిషా గట్టిగానే హెచ్చరించారు. కాగా రవిమోహన్, ఆర్తి విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. కాగా తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లో సామాజిక మాధ్యమాల్లో తొలగించాలని రవిమోహన్ ఆయన భార్య ఆర్తికి, అత్త సుజాతలకు నోటీసుల పంపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్తి తల్లి సినీ,టీవీ సీరియళ్ల నిర్మాత సుజాత తన న్యాయవాది ద్వారా రవిమోహన్కు ఒక నోటీస్ పంపారు. తమపై చేసిన తప్పుడు ఆరోపణలను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇకపై సోషల్మీడియాలో తప్పుడు పోస్ట్లను షేర్ చేయవద్దన్నారు. అదే నోటీస్ను మీడియాకు రిలీజ్ చేశారు. అందులో రవిమోహన్, ఆర్తీల వ్యవహారం గురించి, వారి వివాహ సమస్యల గురించిన ప్రసారాన్ని అన్ని సామాజిక మాధ్యమాల్లో తొలగించాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. అదేవిధంగా రవిమోహన్, ఆర్తి, ఆమె తల్లి సుజాతలకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం చేయకూడదని పేర్కొన్నారన్నారు. వీరి వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి. -
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రకటన.. ఆనందంలో విజేతలు
‘‘రాష్ట్ర ప్రభుత్వం అందించే అవార్డు ఎవరికైనా ప్రత్యేక ఆనందాన్నిస్తుంది’’ అంటూ చిత్రరంగానికి చెందిన పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. ‘‘సృజనాత్మక రంగంలో ఉన్న ఏ ఆర్టిస్ట్కైనా, టెక్నీషియన్కి అయినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఎంతో విలువైనది. అవార్డుల సంప్రదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించడం ప్రోత్సాహకరంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి‡రేవంత్ రెడ్డిగారు, సంబంధిత అధికారులు, ఇతర బృందానికి కృతజ్ఞతలు’’ అని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇక 2024 సంవత్సరానికిగాను అవార్డు విజేతల స్పందన ఈ విధంగా...తొలిసారిగా ప్రవేశ పెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్లో ‘పుష్ప: ది రూల్’ సినిమాకు గాను తొలి ఉత్తమ నటుడిగా నాకు అవార్డు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు క్రెడిట్ అంతా నా దర్శకుడు సుకుమార్గారు, నా నిర్మాతలు (మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్) అండ్ ‘పుష్ప’ టీమ్కే చెందుతుంది. నన్ను ఎల్లప్పుడూ స΄ోర్ట్ చేస్తూ, నాలో స్ఫూర్తి నింపుతున్న నా అభిమానులకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నాను.– హీరో అల్లు అర్జున్–‘‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్లో మాకు నాలుగు (ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైన్) అవార్డులు రావడం గర్వంగా ఉంది. ఇది మాకెంతో ప్రత్యేకం. తెలంగాణ ప్రభుత్వానికి, సీయం రేవంత్రెడ్డి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిగార్లకు, జ్యూరీకి ధన్యవాదాలు’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ‘కల్కి 2898ఏడీ’ చిత్రబృందం పేర్కొంది.–నాగ్ అశ్విన్ – నా జీవితంలో ఎప్పుడూ కష్టపడని రీతిలో ‘పొట్టేల్’ సినిమా కోసం కష్టపడ్డాను. చదువు గురించి చెప్పిన కథను ప్రభుత్వం గుర్తించడం హ్యాపీగా ఉంది. ‘కల్కి 2898 ఏడీ, లక్కీ భాస్కర్’ సినిమాల మధ్యలో మా సినిమాకూ చాన్స్ కల్పించారు. వెయ్యి కోట్ల (కలెక్షన్స్), వంద కోట్ల రూ పాయల సినిమాల మధ్య మా సినిమా ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. మా నిజాయితీకి ప్రతిఫలం ఈ రూపంలో వచ్చిందనుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వానికి, మా సినిమాను గుర్తించిన జ్యూరీకి థ్యాంక్స్. – ‘పొట్టేల్’ దర్శకుడు సాహిత్ మోత్కూరి– తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ ఏడాది నుంచి అవార్డ్స్ను ప్రకటించడం నిజంగా సంతోషంగా ఉంది. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలందరికీ నా శుభాకాంక్షలు. అలాగే ‘దేవర’ సినిమాకు గానూ బెస్ట్ కొరియోగ్రాఫర్గా విజేతగా నిలిచిన గణేశ్ ఆచార్యగారికి కంగ్రాట్స్. – హీరో ఎన్టీఆర్–14 ఏళ్ల తర్వాత మళ్లీ స్టేట్ అవార్డ్స్ రావడం, గద్దర్ అవార్డ్స్ తొలి ఎడిషన్లో నా పేరు ఉండటం, నా దర్శకత్వంలోని ‘లక్కీ భాస్కర్’ సినిమాకు నాలుగు అవార్డులు రావడం హ్యాపీ. ఈ సినిమా స్క్రీన్ ప్లే మొత్తం కరెక్ట్గా కుదిరింది. ఇందుకు హెల్ప్ చేసిన మా ఎడిటర్ నవీన్ నూలికీ అవార్డు వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణప్పుడే దుల్కర్ సల్మాన్ చాలా మంచి గుర్తింపు వస్తుందన్నారు. నిర్మాత నాగవంశీగారితో ‘లక్కీ భాస్కర్’ నా మూడో సినిమా. ఈ సినిమాకు గద్దర్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఎంటర్టైన్మెంట్ అవార్డులను తిరిగి తీసుకొచ్చిన తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ‘దిల్’ రాజుగార్లకు, జ్యూరీకీ «థ్యాంక్స్.– ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు వెంకీ అట్లూరి –మాలాంటి న్యూ టాలెంట్ని ప్రోత్సహించేలా అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మా టీమ్ సహకారం లేక΄ోతే ఇలాంటి అవార్డులు కష్టం. ఈ సినిమాని నిర్మించిన మా నిర్మాతలు నిహారిక, ఫణిగార్ల ప్రొడక్షన్ హౌస్లకి ఈ అవార్డు ఓ బూస్ట్లాంటిది. ఈ అవార్డు కొత్తవాళ్లతో సినిమాలు తీయొచ్చనే అభి్ర పాయాన్ని వారికి బలపరుస్తుంది. మా ‘కమిటీ కుర్రోళ్లు’లో నటించిన హీరోలు, మా మ్యూజిక్ డైరెక్టర్, మా డీఓపీగారు సినిమాలతో బిజీ అయ్యారు. ఈ సినిమా విడుదల కాగానే పెద్ద్ద బేనర్స్ నుంచి నాకు ఆఫర్స్ వచ్చాయి. – ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడు యదు వంశీ–హైదరాబాద్లో జరిగిన మారణహోమాన్ని భారతీయుల కళ్ల ముందుకు తీసుకువచ్చేందుకు నిజాయతీగా మేం పెట్టిన కష్టానికి ‘రజాకార్’ సినిమాకిగాను అవార్డ్స్ వచ్చాయనిపిస్తోంది. 1947, 1948 సమయంలో హైదరాబాద్ స్టేట్ కింగ్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నేతృత్వంలో హిందువులపై రజాకార్లు జరిపిన దురాగతాలను నేటి తరం ప్రేక్షకుల ముందుకు ‘రజాకార్’ సినిమా రూపంలో తీసుకొచ్చే ప్రయత్నంలో మేం సక్సెస్ అయ్యాం. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నందుకు తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జ్యూరీ చైర్పర్సన్ జయసుధ, ఎఫ్డీసీ చైర్మన్ ‘దిల్’ రాజులకు ధన్యవాదాలు. – బీజేపీ సీనియర్ నేత, ‘రజాకార్’ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి –మా ‘రజాకార్’కి మూడు అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉంది. మేం ఎంత నిజాయతీగా ఆలోచించి ఈ సినిమా చేశామో జ్యూరీ కూడా అంతే నిజాయతీగా మా సినిమాని ఎంపిక చేయడం సంతోషం. దాదాపు ఇరవయ్యేళ్లుగా ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొన్న భీమ్స్ సిసిరోలియోకి మా సినిమా ద్వారా అవార్డు రావడం మాకు, తనకు సంతోషంగా ఉంది. ఇరవయ్యేళ్లుగా ఉన్న మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీనుకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. నిర్మాత గూడూరు నారాయణ రెడ్డిగారు కూడా చాలా ఆనందంతో ఫోన్ చేసి, మాట్లాడారు. – ‘రజాకార్’ దర్శకుడు యాటా సత్యనారాయణ–‘మ్యూజిక్షాప్ మూర్తి’ సినిమాకి నాకు అవార్డు రావడానికి మా టీమ్ సహకారం ఉంది. నిర్మాతలు హర్ష గార పాటి, రంగారావు, సహ–నిర్మాతలు సత్యకుమార్, వంశీ ప్రసాద్, సత్యనారాయణ పాలడుగు మమ్మల్ని నమ్మి, అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. చిన్న సినిమా అని కాకుండా కథ, కథనం, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, దర్శకుడి విజన్... ఇవే జ్యూరీ చూసిందని నేను అనుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ అవార్డులను తిరిగి తీసుకొచ్చిన ప్రభుత్వానికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్, జ్యూరీకి ధన్యవాదాలు. – ‘మ్యూజిక్షాప్ మూర్తి’ దర్శకుడు శివ పాలడుగు–కొత్తవారికి ప్రభుత్వ అవార్డులు ఓ మంచి బూస్ట్లాంటివి. తెలంగాణ ప్రభుత్వానికి «థ్యాంక్స్. ‘క’ రిస్కీ లైన్తో చేసిన సినిమా. స్క్రీన్ప్లేని ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకుంటారు? ఎలా ట్రావెల్ అవుతారు? అనుకునేవాళ్లం. కానీ సబ్జెక్ట్ని బలంగా నమ్మాం. క్లైమాక్స్లో మేం చెప్పిన విషయానికి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయితే హిట్ అనుకున్నాం. మేం అనుకున్నట్లే కనెక్ట్ అయ్యారు. ఇక... మేం కొత్త కథలు అనుకోవడానికి చిన్నప్పట్నుంచి మా అమ్మ చెప్పిన కథలు హెల్ప్ అయ్యాయి. మా నాన్నగారి ఎంకరేజ్మెంట్ని మరచి΄ోలేం. అయితే మా సక్సెస్ని చూడకుండానే నాన్నగారు గత ఏడాది దూరం అయ్యారు. ఆ వెలితి ఉంది. – ‘క’ చిత్రదర్శకులు సుజీత్–సందీప్–పధ్నాలుగేళ్ల తర్వాత ఇస్తున్న అవార్డ్స్లో నా తొలి సినిమాకు అవార్డ్ రావడం హ్యాపీగా ఉంది. గీతా ఆర్ట్స్ వంటి నిర్మాణ సంస్థ అండగా ఉండటంతో ఈ సినిమా జర్నీ సాఫీగా సాగింది. అయితే మా సినిమా రిలీజ్ టైమ్లో మరో రెండు సినిమాలు విడుదలయ్యాయి. దాంతో మా సినిమా రిజల్ట్ విషయంలో ఆందోళన చెందాను. అయితే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘ఆయ్’కు అవార్డు వచ్చిందనగానే హీరో నార్నే నితిన్, నిర్మాత బన్నీ వాసుగారు, ఇంకా మా టీమ్ అంతా ఆ షూట్ డేస్ని గుర్తు చేసుకున్నాం. – ‘ఆయ్’ దర్శకుడు అంజి కె. మణిపుత్ర -
ఉత్తమ నటుడు అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: పుష్ప–2 సినిమాలో నటనకుగాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ నటి అవార్డును నివేదా థామస్ (35 చిన్న కథ కాదు) గెలుచుకున్నారు. ప్రజా వాగ్గేయకారుడు, ఉద్యమకారుడు గద్దర్ పేరుపై ఏర్పాటుచేసిన సినిమా అవార్డులను తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలసి గద్దర్ అవార్డుల జ్యూరీ చైర్పర్సన్, నటి జయసుధ గురువారం అవార్డుల వివరాలను ప్రకటించారు. మొదటి ఉత్తమ చిత్రంగా కల్కి 2898ఏడీ, రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డులు గెలుచుకున్నాయి. మొత్తం 11 కేటగిరీల్లో 1,248 నామినేషన్లు వచ్చినట్లు జయసుధ తెలిపారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా అవార్డులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వచ్చేనెల 14వ తేదీన విజేతలకు గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. రెండు చిత్రాలకు నాలుగేసి అవార్డులు గద్దర్ అవార్డుల్లో కల్కి 2898ఏడీ, లక్కీ భాస్కర్ సినిమాలు నాలుగు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ స్కీన్ర్ప్లే, ఉత్తమ ఎడిటింగ్, స్పెషల్జ్యూరీ అవార్డులు లక్కీ భాస్కర్ చిత్రానికి దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తం ఆర్ట్ డైరెక్టర్, ఉత్తమ కాసూ్టమ్ డిజైనర్ కేటగిరీల్లో కల్కి అవార్డులు గెలుచుకుంది. రజాకార్ సినిమా చారిత్రక విభాగంలో ఫీచర్ హెరిటేజ్ చిత్రం అవార్డుతోపాటు ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో అవార్డులు దక్కించుకుంది. అన్ని కేటగిరీల్లోనూ 2024కు సంబంధించి గద్దర్ సినిమా అవార్డులను ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం సినిమా అవార్డులు ఇవ్వబోతోందని దిల్ రాజు తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛగా ఎంపిక జరిగిందని చెప్పారు. పారదర్శకంగా స్క్రీనింగ్ చేసి బెస్ట్ ఆఫ్ బెస్ట్ను ఎంపిక చేసినట్లు జయసుధ వివరించారు. 2014, జూన్ నుంచి 2023, డిసెంబర్ వరకు విడుదలైన ఉత్తమ చిత్రాలకు త్వరలో అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందంటూ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చిత్రాల విభాగంలో అవార్డులు మొదటి ఉత్తమ మొదటి చిత్రం: కల్కి రేండో ఉత్తమ చిత్రం: పొట్టేల్ ఉత్తమ మూడవ చిత్రం: లక్కీ భాస్కర్ జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల అభ్యున్నతిపై బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: కమిటీ కుర్రోళ్లు ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: యదువంశీ (కమిటీ కుర్రోళ్లు) ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఆయ్ చారిత్రక విభాగంలో ఫీచర్ హెరిటేజ్ చిత్రం: రజాకార్ వ్యక్తిగత విభాగంలో అవార్డులు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2) ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు) ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి) ఉత్తమ సహాయ నటుడు: ఎస్జే సూర్య (సరిపోదా శనివారం) ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్) ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్) ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన–నిజమే నే చెబుతున్నా..) ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2– సూసేటి అగ్గిరవ్వ) ఉత్తమ హాస్యనటులు: సత్య, వెన్నెల కిశోర్ (మత్తు వదలరా–2) ఉత్తమ బాలనటులు: మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల (35 ఇది చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్) ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి) ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్) ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్) ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి) ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్) ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి) ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేశ్ ఆచార్య (దేవర) ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి) ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: కె. చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్స్టర్) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్) ఉత్తమ కాస్టూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి) స్పెషల్ జ్యూరీ అవార్డులు దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్) అన్యన్య నాగళ్ల (పొట్టేల్) సుజిత్, సందీప్ (కేఏ) ప్రశాంత్రెడ్డి, రాజేశ్ (రాజు యాదవ్) స్పెషల్ మెన్షన్: ఫరియా అబ్దుల్దా (మత్తు వదలరా–2) తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం: మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్) -
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్- జైనాబ్ పెళ్లి తేదీ ఫిక్స్!
అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి సందడి మొదలు కానుంది. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన త్వరలోనే ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ వినిపిస్తోన్న టాక్ ప్రకారం వచ్చేనెలలోనే అక్కినేని ఇంట పెళ్లిభాజాలు మోగనున్నాయి. అఖిల్ తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగానే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.కాగా.. గతేడాది అక్కినేని నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను ఆయన పెళ్లాడారు. వీరి పెళ్లి ప్రకటన తర్వాతే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జైనాబ్ రవ్దీతో నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని నాగార్జున వెల్లడించారు. -
సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్తో తెరకెక్కించనున్న మూవీ పనులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ను అధికారికంగా అనౌన్స్ చేశారు. యానిమల్తో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి.. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీనే ప్రభాస్కు జోడీగా తీసుకొస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ యానిమల్ చిత్రంలో తన గ్లామర్తో అభిమానులను కట్టిపడేసింది. ఇక ప్రభాస్ సరసన స్పిరిట్లోనూ తన అందాలతో టాలీవుడ్ ప్రియులను అలరించనుంది.అయితే తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగా హీరో రామ్ చరణ్ దంపతులు పంపిన సర్ప్రైజ్ గిఫ్ట్ను ఇన్స్టాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసనకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో పలు ఆహార ఉత్పత్తులు విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సందీప్ రెడ్డికి ప్రత్యేకంగా తయారు చేసిన ఆవకాయ పచ్చడిని జాడీలో పంపించినట్లు తెలుస్తోంది. ఇది కాస్తా వైరల్ కావడంతో వావ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga) -
గద్దర్ అవార్డ్స్ ప్రకటన.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్ విజేతలకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. 2024 ఏడాదిగానూ ఎంపికైన అవార్డ్ గ్రహీతలకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. సృజనాత్మక రంగంలోని ఏ కళాకారుడికైనా, సాంకేతిక సిబ్బందికైనా రాష్ట్ర గుర్తింపు అనేది చాలా విలువైనదని అన్నారు. ఇలాంటి అవార్డులు మరింత ప్రేరణనిస్తాయని రాసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని మళ్లీ ప్రారంభించడం సినీ పరిశ్రమకు ప్రోత్సాహకరంగా ఉంటుందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. అవార్డులు విషయంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, అధికారులకు ధన్యవాదాలు అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు. కాగా.. ఇవాళ జయసుధ నేతృత్వంలోనే జ్యూరీ గద్దర్ అవార్డులు-2024 విజేతలను ప్రకటించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డ్ను సొంతం చేసుకున్నారు.ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది. విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. Hearty Congratulations to each and every winner of the First #GaddarTelanganaFilmAwards for the year 2024. 👏👏State recognition is extremely precious and motivating for any Artiste and Technician in the Creative fraternity. It’s greatly encouraging to see the Government of…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 29, 2025 -
ఇలియానాకు రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్!
హీరోయిన్ ఇలియానా గతేడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 2024లో తాను రెండోసారి గర్భం ధరించినట్లు తెలిపింది. 2023లో మైఖేల్ డోలన్ను పెళ్లాడింది. అయితే కొన్నాళ్ల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన ముద్దుగుమ్మ.. 2023లో కుమారుడు పుట్టిన తర్వాత మైఖేల్ పూర్తి ఫొటోను షేర్ చేసింది. తాజాగా తన బేబీబంప్నకు సంబంధించిన ఫోటోలను ఇలియానా మరోసారి సోషల్ మీడియాలో పంచుకుంది. 'బంప్ బడ్డీస్' అంటూ తన స్నేహితురాలితో ఉన్న ఫోటోను ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసింది.కాగా.. ఇలియానా తెలుగులో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తన తొలి చిత్రం దేవదాసుతో అందరికీ తెగ నచ్చేసింది. పోకిరి, రాఖీ, మున్నా, ఆట, జల్సా, కిక్.. ఇలా వరుసగా తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్గా రాణిస్తున్న సమయంలో బాలీవుడ్లో బర్ఫీ మూవీ ఛాన్స్ వచ్చింది. అది మంచి కథ కావడంతో అందులో నటించింది. ఆ వెంటనే హిందీలోనే వరుస చిత్రాలు చేసింది. ఇలియానా చివరిసారిగా రొమాంటిక్ కామెడీ చిత్రం 'దో ఔర్ దో ప్యార్'లో నటించింది. ఈ చిత్రంలో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, సెంధిల్ రామమూర్తి కీలక పాత్రల్లో నటించారు. -
గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆహా ఓటీటీ మూవీస్
తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్డ్స్లో ఆహా ఓటీటీ సినిమాలు తమ సత్తా చాటాయి. పలు కీలక విభాగాల్లో ఆహా చిత్రాలు అవార్డులు సాధించాయి. 'పొట్టేల్' సెకండ్ బెస్ట్ ఫిల్మ్గా, '35 ఇది చిన్న కథ కాదు' బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్గా అవార్డులు గెలుచుకున్నాయి. '35 ఇది చిన్న కథ కాదు' చిత్రంలో నటనకు నివేదా థామస్ బెస్ట్ హీరోయిన్గా, 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'లో నటనకు శరణ్య ప్రదీప్ ఉత్తమ సహాయ నటిగా, 'రజాకార్' చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా గద్దర్ అవార్డులు అందుకున్నారు.'35 ఇది చిన్న కథ కాదు'లో నటించిన మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల, 'మెర్సీ కిల్లింగ్'లో నటించిన బేబీ హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంపికయ్యారు. 'రాజు యాదవ్' చిత్రానికి చంద్రబోస్ బెస్ట్ లిరిసిస్ట్గా, 'రజాకార్'కు నల్ల శ్రీను బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్గా అవార్డులు పొందారు. 'పొట్టేల్'లో నటనకు అనన్య నాగళ్ల, 'రాజు యాదవ్' నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లేపల్లి స్పెషల్ జ్యూరీ అవార్డులు సాధించారు.ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు ప్రధాన విభాగాల్లో గద్దర్ అవార్డులు గెలవడంపై ఆహా టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గ చిత్రాలు, సిరీస్లు, షోలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కంటెంట్ అందించడమే తమ లక్ష్యమని ఆహా టీమ్ పేర్కొంది. -
Yamudu Teaser: అమ్మాయిల మిస్సింగ్తో యముడికి ఉన్న సంబంధం ఏంటి?
ప్రస్తుతం ఆడియన్స్ రెగ్యులర్ కమర్షియల్, లవ్, యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్ ఆధారిత సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ ట్రెండ్లో భాగంగా జగన్నాధ పిక్చర్స్ బ్యానర్పై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యముడు’. ఈ సినిమాకి ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే ఉప శీర్షిక ఉంది. శ్రావణి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.తాజాగా ‘యముడు’ టీజర్ను గురువారం ప్రముఖ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ను చూసిన తర్వాత ఆయన చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ టీజర్ మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జోనర్ల మిశ్రమంగా ఉంది. సిటీలో అమ్మాయిలు అదృశ్యమవుతున్న కేసులు, నాటకాల్లో యముడి వేషం వేసే వ్యక్తికి ఈ హత్యలతో సంబంధం ఉందేమో అనే సూచన టీజర్లో కనిపిస్తుంది. యముడు భూలోకానికి వచ్చి నరకంలో విధించే శిక్షలను ఇక్కడే అమలు చేస్తున్నాడా అనే ఆలోచన కలిగిస్తుంది.‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ అనే డైలాగ్ హిందూ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని కొత్త దృక్పథంతో సినిమాను తీర్చిదిద్దినట్లు సూచిస్తోంది. హిందూ ధర్మం నుంచి ఒక నూతన కోణాన్ని ఆసక్తికరంగా అందించేలా ఈ చిత్రం ఉంటుందని టీజర్ చూస్తే అనిపిస్తుంది. విష్ణు రెడ్డి వంగా సినిమాటోగ్రఫీ, భవాని రాకేష్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ను మరింత ఆకట్టుకునేలా చేశాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది. -
దీపిక తొలగింపు.. పరేష్ రావల్ కంపు... ఈ బాలీవుడ్కేమైంది?
బాలీవుడ్ అంటే దేశంలోని అన్ని వుడ్లకూ గాడ్ లాంటిది అనలేకపోయినా కనీసం పెద్దన్న లాంటిది అనొచ్చేమో... దేశవ్యాప్తంగా నటీనటులందరిపైనా, అన్ని భాషా చిత్ర పరిశ్రమలపైనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బాలీవుడ్ ప్రభావం ఉంటుంది. అలాంటి బాలీవుడ్కి అకస్మాత్తుగా ఏమైంది? గత కొంత కాలంగా హిందీ చిత్ర పరిశ్రమ విజయాలు తక్కువ వివాదాలెక్కువ అన్నట్టుగా తయారైంది. ఒకప్పుడు నటీనటుల వివాహేతర సంబంధాలు, తెరవెనుక అలవాట్లు...వంటివి మాత్రమే ఎక్కువగా చర్చనీయాంశమయ్యేవి. అవన్నీ వ్యక్తిగతం అంటూ బాలీవుడ్ పెద్దలు సమర్ధించుకునేవారు. కానీ ఇప్పుడు వస్తున్న వివాదాలు వ్యక్తిగతమైనవి కావు...వ్యవస్థాగతమైనవే. అవి కూడా చిన్నా చితకా స్టార్స్కు సంబంధించినవి కావు.. బాలీవుడ్ని ఓ రకంగా ఏలుతున్న నటీనటులకు సంబంధించినవి కావడం గమనార్హం. బాలీవుడ్లో వినోదాత్మక చిత్రాభిమానులను అలరిస్తుందనే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్ర ‘హేరా ఫేరి 3‘(Hera Pheri 3) . ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కధానాయకుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. అలాంటి సినిమా నుంచి అనూహ్యంగా మరో ప్రముఖ నటుడు పరేష్ రావల్ (శంకర్ దాదా ఎంబిబిఎస్ ఫేం) తప్పుకోవడం బాలీవుడ్ పరిశ్రమను, ప్రేక్షకుల్ని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. పరేష్ రావల్(Paresh Rawal) ఆకస్మిక నిర్ణయం తర్వాత, సహనటుడు అక్షయ్ కుమార్ తో పాటు ఆ సినిమా నిర్మాతలు పరేష్ రావల్పై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. దాంతో పరేష్ రావల్ తన సంతకం చేసి ముందస్తుగా స్వీకరించిన రూ.11 లక్షలను 15% వడ్డీతో తిరిగి చెల్లించాల్సి వచ్చింది. అతని మొత్తం పారితోషికం రూ.15 కోట్లు అని సమాచారం.మరోవైపు బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone ), ప్రభాస్తో కలిసి నటించాల్సిన ‘స్పిరిట్‘(Spirit) చిత్రం నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నారు. అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ కి తలొగ్గినా కూడా దీపిక ఒకదాని తర్వాత ఒకటిగా రకరకాల డిమాండ్లు పెడుతుండడంతో విసుగు చెందిన స్పిరిట్ దర్శకుడు సందీప్రెడ్డి వంగా ఆమెను తన ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. అయితే ఈ నిర్ణయం తర్వాత కూడా వీరిద్దరి మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ దీపికాపై పరోక్ష విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా తనకు అనుకూలమైన వాతావరణం ఉన్నచోట మాత్రమే తాను పనిచేయాలనుకుంటున్నట్లు దీపిక వ్యాఖ్యానించారు. మొత్తం మీద బాలీవుడ్లో వరుసగా చోటు చేసుకున్న ఈ రెండు సంఘటనలూ...బాలీవుడ్ ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే సినిమాల నుంచి నటీనటులు మధ్యలో తప్పుకోవడం ఇదే మొదటి సారి కాదని గతంలోనూ పలు మార్లు ఇలాంటివి జరిగాయని పలువురు గుర్తు చేస్తున్నారు.గత 2013లో’రేస్ 2’ చిత్రం షూటింగ్ ప్రారంభమైన తర్వాత, దీపికా పదుకునే అకస్మాత్తుగా ప్రాజెక్ట్ను వదిలివేశారు. దీంతో నిర్మాత రమేష్ తౌరానీ దీపిక అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ వివాదం బాలీవుడ్లో పెద్ద చర్చకు దారి తీసింది. అలాగే గత 2018లో సల్మాన్ ఖాన్ తో కలిసి ’భారత్’ చిత్రంలో నటించాల్సి ఉన్న ప్రియాంక చోప్రా షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ప్రాజెక్ట్ను వదిలివేశారు. దీంతో సల్మాన్ ఖాన్, ఆమెపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత, కత్రినా కైఫ్ ఈ పాత్రను స్వీకరించారు. అలాగే ఇంకా ముందుకు వెళితే..2000లో కహో నా ప్యార్ హై సినిమా నుంచి కరీనాకపూర్ , 2003లో చల్తే చల్తే చిత్రం నుంచి సల్మాన్ఖాన్ గందరగోళం కారణంగా ఐశ్వర్యరాయ్ లు తప్పుకున్నారు. గత 2015లో ఊపిరి సినిమాలో నటించాల్సి ఉన్న శృతిహాసన్ మధ్యలో వదిలేయడంతో చిత్ర నిర్మాతలు ఆమెపై కోర్టుకెక్కారు. అయితే ఈ ఘటనలన్నీ కూడా సంవత్సరాల వ్యవధిలో జరుగగా... ఇప్పుడు వరుసగా బాలీవుడ్లో జరుగుతుండడమే చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు : అల్లు అర్జున్
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులపై అల్లు అర్జున్ స్పందించారు. పుష్ప 2 చిత్రానికి ఉత్తమ నటుడిగా తనను ఎంపిక చేయడం గౌరవంగా ఉందన్నారు. ఈ గౌరవాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు సుకుమార్, నిర్మాతలతో పాటు పుష్ప టీమ్ మొత్తానికి ఈ ఘనత దక్కుతుందని చెప్పారు. ఈ అవార్డును తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. (చదవండి: గద్దర్ అవార్డులు : ఉత్తమ చిత్రాలివే.. ప్రత్యేకత ఏంటంటే?)అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా గద్దర్ అవార్డులపై స్పందించారు. సినిమా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. దేవర చిత్రానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు గెలుచుకున్న గణేష్తో పాటు విజేతలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. (చదవండి: :'గద్దర్ అవార్డ్స్' విజేతలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం)కాగా, 2024 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను గురువారం ప్రకటించింది. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డుల వివరాలను గురువారం జ్యూరీ చైర్పర్సన్ జయసుధ వెల్లడించారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మూడు చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. అందులో మొదటి చిత్రం కల్కి , రెండో చిత్రంగా పొట్టేల్, మూడో చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికైంది. ఇక ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప 2), ఉత్తమ నటిగా నివేధా థామస్ ( 35 చిన్న కథ కాదు) అవార్డుకు ఎంపికయ్యారు. జూన్ 14న ఈ అవార్డులను అందిస్తారు. -
20 నిమిషాల పాత్రకి 20 కోట్లట..పదేళ్లలోనూ ఫ్లాపులే ఎక్కువ!
సినిమా రంగం ఎవరిని ఎప్పుడు నెత్తికి ఎక్కించుకుంటుందో ఎవరిని నేలకేసి కొడుతుందో అంచనా వేయడం అంత సులభం కాదు. అందుకు నిదర్శనంగా మన తెలుగు హీరోను చెప్పొచ్చు. వయసులో ఉన్నప్పుడు ఉరకలేసే ఉత్సాహంతో ఫైట్లూ, డ్యాన్సులూ వేసినా సమకాలికులైన హీరోలపై సాధించలేకపోయిన పైచేయిని..సక్సెస్నూ వృద్ధాప్యంలో సాధిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు బాలకృష్ణ. ఇటవలి కాలంలో సీనియర్ నటుల్లో బాలకృష్ణ అందుకుంటున్న విజయాలు మరెవ్వరికీ సాధ్యం కావడం లేదనేది వాస్తవం. నిజానికి యుక్తవయసులో ఉండగా కూడా బాలయ్య ఇంత సందడి చేయలేదని చెప్పొచ్చు. వయసులో ఉండగా చేయలేకపోయిన యాడ్స్లో కూడా ఆయన ఇప్పుడు సత్తా చాటుతుండడం దీనికో నిదర్శనం. ఈ నేపధ్యంలో తాజాగా సినీరంగంలో హల్చల్ చేస్తున్న ఒక వార్త మరోసారి బాలకృష్ణ సరికొత్త స్టామినాను చాటి చెబుతోంది. అదేమిటంటే జైలర్ 2 సినిమాలో అతిధి పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నాడని, అందుకు గాను అత్యధిక పారితోషికం అందుకుంటున్నారని.. కేవలం 20 నిమిషాల నిడివి ఉండే పాత్ర కోసం బాలకృష్ణ ఏకంగా రూ.20కోట్లకు పైనే రెమ్యునరేషన్ ఇవ్వడానికి జైలర్2 నిర్మాతలు ఓకే అన్నారని తెలుస్తోంది. ఈ సమాచారం ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఒకప్పుడు అంటే దాదాపుగా ఒక పదేళ్ల క్రితం డిక్టేటర్ వంటి సినిమాల్లో నటించే సమయంలో బాలకృష్ణ మొత్తం సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ కూడా దాదాపుగా అంతే ఉంటుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఒక సినిమా మొత్తం కనిపించే హీరోగా పదేళ్ల క్రితం తీసుకున్న పారితోషికాన్ని ఇప్పుడు కేవలం 20 నిమిషాల పాత్ర కోసం తీసుకుంటూ బాలకృస్ణ కొత్త రికార్డ్ సాధించారని చెప్పొచ్చు. మొదటి నుంచీ నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరోగా బాలకృష్ణకు పేరుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా పారితోషికం రూపంలో నిర్మాతల నెత్తిన భారం మోపే వాడు కాదని అందుకే ఎన్ని ఫ్లాపులొచ్చినా బాలకృష్ణ చేతిలో సినిమాలు లేని పరిస్థితి ఎప్పుడూ లేదని అంటుంటారు. అంతెందుకు ఆయన రెమ్యునరేషన్ అమాంతం పెరిగిన ఈ పదేళ్లలో చూసుకున్నా... బాలకృష్ణ కెరీర్లో విజయాలకన్నా అపజయాలే ఎక్కువ.గత 2014లో లెజెండ్ తర్వాత లయన్, డిక్టేటర్, గౌతమ్ పుత్ర శాతకర్ణి, పైసా వసూల్, జై సింహా, కధానాయకుడు పార్ట్ 1, కధానాయకుడు పార్ట్ 2, రూలర్... వరకూ వరుస ప్లాఫులే. ఆ తర్వాత ‘అఖండ’తో మాత్రమే విజయాలు ప్రారంభమయ్యాయి. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, ఢాకూ మహరాజ్..లు హిట్స్గా నిలిచాయి.అంటే పదేళ్లలో 9 ఫ్లాపులు, 4 మాత్రమే విజయాలు. హిట్టయిన నాలుగింటిలోనూ బాలకృష్ణ డ్యాన్సులు ఫైట్లు చేసే కుర్ర హీరోలా కాకుండా డైలాగులు పేల్చడం, విలన్లను నరకడం వరకే పరిమితమైన వయసుకు తగ్గ పాత్రలు పోషించడం కూడా ఈ సినిమాల సక్సెస్కు కారణంగా చెప్పొచ్చు. ఏదేమైనా వచ్చే జూన్ 10వ తేదీతో 65ఏళ్లు నిండుతున్న బాలయ్య... రేపోమాపో యువహీరోగా తెరకెక్కనున్న తన కొడుకుతో పోటీపడే స్థాయిలో నిలవడం విశేషమే అని చెప్పాలి. -
తెలంగాణ గద్దర్ అవార్డులు.. ఉత్తమ సినీ గ్రంథంగా రెంటాల జయదేవ పుస్తకం
రచయిత, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డు వరించింది. మరుగున పడిపోయిన మన సినీ చరిత్రలోని అనేక అంశాలపై ఆయన రచించిన 'మన సినిమా... ఫస్ట్ రీల్' అనే పుస్తకం ఉత్తమ సినీ గ్రంథంగా ఎంపికైంది. 2024లో వచ్చిన ఉత్తమ చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో జయదేవ రచనకు అవార్డ్ లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల జ్యూరీ ఈ విషయాన్ని ప్రకటించింది.దక్షిణ భారతీయ భాషా చిత్రాల తొలి అడుగుల చరిత్రపై జయదేవ పాతికేళ్ల పరిశోధనా పరిశ్రమకు ప్రతిఫలం ఈ మన సినిమా... ఫస్ట్ రీల్ పుస్తకం. ఇప్పటికీ మన సినీ చరిత్రలో నమోదు కాకుండా మిగిలిపోయిన అనేక అంశాలను తవ్వి తీసిన అరుదైన రచన ఇది. మూకీ సినిమాల రోజుల నుంచి తెర మీద బొమ్మ మాటలు నేర్చి.. భాషల వారీగా ప్రత్యేక శాఖలుగా విడివడిన టాకీల తొలి రోజుల దాకా మన భారతీయ సినిమాలో, ముఖ్యంగా మన తెలుగు సినిమాలో జరిగిన మనకు తెలియని అనేక పరిణామాలను సాక్ష్యాలతో, సవిశ్లేషణాత్మకంగా రాసిన గ్రంథం ఇది. రచయిత జయదేవ శ్రమించి సేకరించిన దాదాపు వందేళ్ల క్రితం అలనాటి పత్రికా సమాచారం, ఫోటోల లాంటి ప్రామాణిక ఆధారాలతో... అరుదైన సమాచారంతో... ఈ సినీ చరిత్ర రచన సాగింది.తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ చిత్రం కాళిదాస్(1931)పై అనేక కొత్త సంగతులను రెంటాల జయదేవ ఇందులో తవ్వితీశారు. నిజానికి, అది ఒక సినిమా కాదనీ.. మూడు చిన్న నిడివి చిత్రాల సమాహారమనీ, అందులో ప్రధాన భాగమైన ‘కాళిదాస్’ కథాచిత్రం మాత్రం 4 రీళ్ల నిడివిలో పూర్తిగా తెలుగులోనే తీసిన లఘుచిత్రమని తెలిపారు. అలనాటి సాక్ష్యాధారాలతో ఈ విషయాన్ని నిరూపించారు. తమిళులు దాన్ని తమ తొలి టాకీగా చెప్పుకుంటూ తమ చరిత్రలో కలిపేసుకుంటూ ఉంటే... పూర్తి తెలుగు డైలాగులు ఆ సినిమాను తెలుగువాళ్లం మన సినీ చరిత్ర లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామని గుర్తుచేశారు. అలా మనం విస్మరిస్తున్న మన తొలినాళ్ల తెలుగు సినీచరిత్రను అక్షరబద్ధం చేశారు.హిందీతో సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీసీమల్లో వచ్చిన మొట్టమొదటి టాకీలకు సంబంధించిన అనేక చారిత్రక సత్యాలను ఈ రచనలో జయదేవ అందించారు. అత్యంత అరుదైన దాదాపు 2 వేల పత్రికా ప్రకటనలు, ఫోటోలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 90 ఏళ్ల చరిత్ర గల ప్రతిష్ఠాత్మక పుస్తక ప్రచురణ సంస్థ ఎమెస్కో 566 పేజీల ఈ బృహత్ రచనను ప్రచురించింది. ఈ పుస్తకం పండిత, పామరుల ప్రశంసలందుకొని, ప్రామాణిక చరిత్ర గ్రంథంగా పాఠక లోకంలో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ సినీ గ్రంథంగా ఎంపికైంది.ఆనాటి నుంచి ఈనాటి వరకు పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా.. అలనాటి వారు గతంలో వచ్చిన ఇంటర్వ్యూల నుంచి కూడా ఎంతో విలువైన సమాచారాన్ని జయదేవ సేకరించి మన సినిమా... ఫస్ట్ రీల్ అనే పుస్తకంలో పొందుపరిచారు. పైపైన వివరాలకు పరిమితం కాకుండా సినిమాల రూపకల్పన, అందుకు జరిగిన కసరత్తు, నటీనటుల ఎంపిక, వాటి విడుదలకు నిర్మాతలు పడిన పాట్లు, అనేక పరిమితుల మధ్యనే ఆనాటి దర్శకులు చూపిన సృజనశీలత, అప్పటి సినిమా నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక రంగాల తీరు, సినిమా వ్యాపారం జరిగే పద్ధతులు, కాలానుగుణంగా వచ్చిన పరిణామాలు... అన్నీ ఈ రచనలో కళ్లకు కట్టినట్లు వివరించారు.తెలుగునాట రచయితగా, పరిశోధకుడిగా, పత్రికా రంగంలో ఫీచర్స్ రచయితగా, సినీ విశ్లేషకుడిగా, విలేఖరిగా ప్రసిద్ధమైన పేరు డాక్టర్ రెంటాల జయదేవ. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల పైగా నిరంతరాయంగా ఆయన తన రచనలతో ప్రత్యేక కృషి చేస్తున్నారు. తండ్రి గారైన ప్రముఖ అభ్యుదయ కవి, దాదాపు 200 పుస్తకాలు రాసిన గ్రంథకర్త, జర్నలిస్టు, కీర్తిశేషులు రెంటాల గోపాలకృష్ణ సాహితీ, పత్రికా వారసత్వాన్ని జయదేవ పుణికిపుచ్చుకున్నారు. పాత తరం పత్రికా విలువల జెండాను కొత్త తరంలో ముందుకు తీసుకువెళుతున్న అతి కొద్దిమంది నిఖార్సయిన జర్నలిస్టుల్లో ఒకరిగా నిలిచారు. జయదేవ పత్రికా సంపాదకీయాలు, ప్రత్యేక వ్యాసాలు, సినిమా సమీక్షలు, ప్రత్యేక వార్తా కథనాలు, విశ్లేషణలు, ప్రముఖులతో లోతైన టీవీ, పత్రికా ఇంటర్వ్యూలు ప్రజలకూ, పరిశ్రమ వారికీ సుపరిచితం. ఆపకుండా చదివించే ఆయన రచనలు పాఠకుల్ని ఆకట్టుకోవడమే కాక, పలుమార్లు చర్చనీయాంశం అవుతుంటాయి.తొలి పూర్తి నిడివి పది రీళ్ల తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సరైన విడుదల తేదీని కూడా గతంలో రెంటాల జయదేవే తన పరిశోధనలో వెలికితీశారు. తెలుగు సినిమా దినోత్సవం విషయంలో అనేక దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న తప్పులను ఆయన సాక్ష్యాధారాలు చూపి సరిదిద్దారు. తెలుగు సినీరంగ చరిత్రను మార్చేసిన ప్రామాణికమైన ఆయన పరిశోధనను ప్రముఖ చరిత్రకారులు, సినీ పెద్దలు బాహాటంగా ఆమోదించారు. ప్రపంచ వ్యాప్తంగా జయదేవ పరిశోధన అంగీకారం పొందడంతో, ఇవాళ తెలుగు సినీ పరిశ్రమ మన తెలుగు సినిమా దినోత్సవాన్ని సవరించుకొని, ఆయన చెప్పిన ఫిబ్రవరి 6నే అధికారికంగా తెలుగు సినిమా డేను జరుపుకొంటూ ఉండడం విశేషం.ఇది చదవండి: తెలుగు సినిమా పండగ రోజురెంటాల జయదేవ విశిష్ట కృషిని గుర్తించి.. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డుకు ఎంపిక చేసింది. 2011కి గాను ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు సినిమా చరిత్రను కొత్త మలుపు తిప్పిన ఈ పరిశోధనాత్మక గ్రంథంతో తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డ్ వరించింది. తొలినాళ్ల తెలుగు సినిమా చరిత్రపై కనివిని ఎరుగని పరిశోధన చేస్తూ, ఎన్నో కొత్త సంగతులు బయటపెట్టిన రెంటాల జయదేవ (Rentala Jayadeva) నిరంతర అపూర్వ కృషిని తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికీ ప్రాతినిధ్య సంస్థ అయిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం గుర్తించింది. భక్త ప్రహ్లాద సరైన విడుదల తేదీని పురస్కరించుకొని ఆయనను ఇటీవల ప్రత్యేకంగా సత్కరించడం విశేషం. -
'కేరళ క్రైమ్ ఫైల్స్ 2' ఆసక్తిగా తెలుగు ట్రైలర్
మలయాళంలో తెరకెక్కిన 'కేరళ క్రైమ్ ఫైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు' (kerala crime files season 2) ట్రైలర్ విడుదలైంది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. 2023లో జియో హాట్స్టార్ వేదికగా 'కేరళ క్రైమ్ ఫైల్స్' వెబ్ సిరీస్కు సీక్వెల్గా దర్శకుడు అహ్మద్ కబీర్ తెరకెక్కించాడు. పార్ట్ 1లో ఒక్క మర్డర్ కేసుకు సంబంధించి చూపించి ఆపై పోలీసుల విచారణ సమయంలో మీడియా ఫోకస్, రాజకీయ జోక్యం అనేవి లేకుండా కథ చెప్పాడు. అలాంటి కేసును పోలీసులు సవాలుగా తీసుకుని ఎలా పూర్తి చేస్తారనేది చాలా ఆసక్తిగా చెప్పాడు. అప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ రావడంతో మేకర్స్ సీక్వెల్ను ప్లాన్ చేశారు. ఇప్పుడు పార్ట్2 కూడా క్రైమ్ కథాంశంతోనే నిర్మించారు. అజు వర్గీస్, లాల్,నివాస్ వాలిక్కున్ను, జిన్జ్ షాన్, శ్రీజిత్ వంటి వారు ఇందులో నటించారు. త్వరలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. -
ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హారర్ చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. థియేటర్స్లో ఆడని చిత్రాలు కూడా ఓటీటీలో హిట్ అవుతున్నాయి. అందుకే పలు ఓటీటీ సంస్థలు హారర్ చిత్రాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. ఇక హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంతో ఆహా ముందుంటుంది. ఇప్పటికే పలు తమిళ, మలయాళ హారర్ చిత్రలను తెలుగులో ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఆహా..మరోసారి బ్లాక్ బస్టర్ హారర్ చిత్రంతో అలరించేందుకు రెడీ అయింది. తమిళ్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ "డీమన్"(Demon ) నేటి(మే 29) నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. రమేశ్ పళనీవేల్ దర్శకత్వంలో, నిర్మాత ఆర్. సోమసుందరం నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం, భవాని మీడియా ద్వారా Aha ఓటీటీలో ప్రసారం కానుంది. సచిన్ మణి , అబర్నతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో, సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రల్లో అదరగొట్టారు. హారర్, సస్పెన్స్, ట్విస్ట్ లతో కూడిన కథనంతో డీమన్ ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నది. ఊహించని మలుపుతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. చిత్రానికి రోనీ రాఫెల్ అందించిన సంగీతం, ఆర్.ఎస్. ఆనందకుమార్ చేసిన ఛాయాగ్రహణం, రవికుమార్ ఎం. చేసిన ఎడిటింగ్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దాయి. -
ప్రముఖ హీరో మృతి.. సంతాపం తెలిపిన రజనీకాంత్
తమిళ చత్రి పరిశ్రమలో విషాదం నెలకొంది. సుమారు ఐదు దశాబ్దాల పాటు కోలీవుడ్లో రాణించిన నటుడు రాజేష్ (75) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా చెన్నైలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో చిత్ర పరిశ్రమలోని ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయన సతీమణి జోన్ సిల్వియా గతంలోనే మరణించారు. వారికి దివ్య, దీపక్ పిలల్లు ఉన్నారు.1974లో దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అవల్ ఒరు తొడరకథై’ (అంతులేని కథ) చిత్రంతో ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయనకు వరుస ఛాన్సులు దక్కాయి. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. పోతురాజు, మహానది, సత్య, కన్ని పరువతిలే వంటి సినిమాల్లో నటించారు. ఆయన హీరో నుండి క్యారెక్టర్ యాక్టర్ వరకు వివిధ పాత్రలు పోషించాడు . 1985లో చెన్నైలోని కె.కె. నగర్ సమీపంలో సినిమా షూటింగ్ కోసం ఒక బంగ్లాను నిర్మించిన తొలి తమిళ నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆ ఇంట్లో అనేక తమిళ, మలయాళ మరియు హిందీ సినిమా షూటింగ్లు పూర్తయ్యాయి. సినిమాలతో పాటు ఆయన హోటల్, నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించాడు. తెలుగులో బంగారు చిలక, చాదస్తపు మొగుడు, మా ఇంటి మహారాజు సినిమాల్లో నటించారు. ఆయన మరణం పట్ల సూపర్స్టార్ రజనీకాంత్ సంతాపం తెలిపారు. ఇలాంటి సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఆ దేవుడు అందించాలని కోరారు. రాజేష్తో తనకు ప్రత్యేకమైన అనుభంధం ఉందని గుర్తుచేసుకున్నారు. -
ఆ మూడు సినిమాలు తీసుంటే రిటైర్ అయ్యేవాడిని : సుకుమార్
‘‘ఈ వేదికపై ఇద్దరు (అర్జున్, ఉపేంద్ర) లెజెండ్స్ ఉన్నారు. ఈ ఇద్దరూ యాక్టర్స్ మాత్రమే కాదు.. దర్శకులు కూడా. ‘ఓం, ఏ, ఉపేంద్ర... ఇలాంటి కల్ట్ సినిమాలు తీసిన తర్వాత ఏ దర్శకుడైనా రిటైర్ అయిపోవచ్చు. నేను ఆ మూడు చిత్రాలు తీసి ఉంటే రిటైర్ అయిపోయేవాడిని. ఈ రోజు నా స్క్రీన్ప్లే ఇలా ఉందంటే కారణం ఆ మూడు సినిమాలే’’ అని అన్నారు దర్శకుడు సుకుమార్.హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్ ప్రధాన పాత్రలో, అర్జున్, ధ్రువ సర్జా, నిరంజన్, సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ టీజర్లో ఐశ్వర్య, నిరంజన్ బ్యూటిఫుల్గా కనిపించారు. అలాగే ఈ చిత్రంలో చంద్రబోస్ గారు రాసిన ఓ పాట విన్నాను. చాలా నచ్చింది. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.‘‘నేను కాలేజీలో చదివిన రోజుల్లోనే అర్జున్ గారు నాకు డైలాగ్ రైటర్గా అవకాశం ఇచ్చారు. అప్పుడు నాకు అవకాశం కల్పించిన అర్జున్గారు, ఇప్పుడు నా అన్న కొడుకుకి అవకాశం ఇచ్చారు. ‘సీతాపయనం’ టీజర్ బ్యూటిఫుల్గా ఉంది’’ అన్నారు మరో ముఖ్య అతిథి ఉపేంద్ర. ‘‘నా హనుమాన్ జంక్షన్’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా చేసిన సుకుమార్ ఇప్పుడు ఇండియాలోని టాప్ టెన్ దర్శకుల్లో ఒకరని చెప్పడం గర్వంగా ఉంది. ఉపేంద్రగారికి పెద్ద పెద్ద దర్శకులే అభిమానులుగా ఉంటారు. మా అమ్మాయి కోసం ఈ సినిమాను మొదలుపెట్టాను. నాపై తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమను మా అమ్మాయిపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నాను. నిరంజన్లో మంచి అంకితభావం ఉంది’’ అన్నారు. ‘‘సీతా పయనం’తో తెలుగు పరిశ్రమకు వస్తున్నందుకు, నాన్నగారితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు ఐశ్వర్యా అర్జున్. ‘‘తెలుగులో నాకిది తొలి సినిమా’’ అన్నారు నిరంజన్. -
'సూర్య'ను కాదనుకున్న కీర్తి సురేశ్.. తెలుగు హీరో కోసమేనా?
కీర్తి సురేశ్.. చిత్ర పరిశ్రమలో ఎలాంటి పాత్రలోనైనా సరే తన నటనతో సత్తా చూపించగలరు. తమిళ హీరో సూర్య కూడా ఆ కోవకు చెందిన నటుడిగానే గుర్తింపు ఉంది. అయితే, సూర్యతో నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ కీర్తి వదులుకుందని వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత కీర్తి మళ్లీ బిజీ అవుతుంది. బాలీవుడ్ తన మొదటి సినిమా 'బేబీ జాన్' నిరాశ పరిచినప్పటికీ మళ్లీ అక్కడే మరో ఛాన్స్ దక్కించుకుంది. కీర్తి కోసం ఇప్పటికే పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెతో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థ విధానంపై బాలీవుడ్లో ఒక మూవీని ప్లాన్ చేస్తున్నారు. నటుడు రాజ్కుమార్ రావుతో (Raj Kumar Rao) కలిసి కీర్తి నటించనున్నట్లు సమాచారం. ‘సెక్టార్ 36’ ఫేమ్ ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.అదే విధంగా తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా కీర్తి సురేశ్( Keerthy Suresh) నటించే ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో తమిళం, తెలుగు భాషల్లో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న 46వ చిత్రంలోనూ కథానాయకిగా నటించే అవకాశం ఆమెను వరించిందట, అయితే ఆమె విజయ్దేవరకొండకు జంటగా నటించనున్నడం వల్ల సూర్యతో కలిసి నటించే ఛాన్స్ను వదులుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంతనో తెలియాల్సి ఉంది. మొత్తం మీద కీర్తి వివాహానంతరం మళ్లీ బిజీ అవుతున్నారన్నమాట. కాగా ఈమె ఇంతకుముందు సూర్యకు జంటగా 'గ్యాంగ్' చిత్రంలో నటించారన్నది గమనార్హం. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సూర్య.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్గా రెట్రోతో మెప్పించిన ఆయన తాజాగా మరో సినిమాను మొదలుపెట్టారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. సార్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో సౌత్ చిత్రపరిశ్రమలో తనదైన ముద్రను వెంకీ అట్లూరి వేశారని చెప్పవచ్చు. -
గద్దర్ అవార్డులు : ఉత్తమ చిత్రాలివే.. ప్రత్యేకత ఏంటంటే?
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డుల వివరాలను గురువారం జ్యూరీ చైర్పర్సన్ జయసుధ వెల్లడించారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మూడు చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. అందులో మొదటి చిత్రం కల్కి , రెండో చిత్రంగా పొట్టేల్, మూడో చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికైంది. ఈ చిత్రాలకు గాను జూన్ 14న అవార్డులు అందిస్తారు. ఉత్తమ చిత్రాలుగా అవార్డులు గెలుచుకున్న చిత్రాల నేపథ్యంపై ఓ లుక్కేద్దాం. ఫలించిన నాగ్ అశ్విన్ ప్రయోగంవెండితెరపై ప్రయోగాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కొద్ది మంది దర్శకులు మాత్రమే వైవిధ్యభరిత కథలను తెరకెక్కిస్తుంటారు. అది విజయం సాధించిందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఆ ప్రయోగం మాత్రం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి ప్రయోగాత్మక చిత్రమే కల్కి 2898 ఏడీ. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇప్పటివరకు చూడనటువంటి ప్రపంచాన్ని కల్కి చిత్రం ద్వారా సృష్టించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. కురుక్షేత్రం తర్వాత ఆరు వేల ఏళ్లకు మొదలయ్యే కథ ఇది.మొదటి నగరంగా చెపుకునే కాశీలో తాగడానికి నీళ్లు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ప్రకృతి మొత్తం నాశనం అవుతుండటంతో సుప్రీం యాష్కిన్(కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్లో ఉంటాయి. ఎప్పటికైనా కాంప్లెక్స్లోకి వెళ్లి సుఖపడాలనేది ఫైటర్ భైరవ (ప్రభాస్)కోరిక.మరోవైపు యాష్కిన్ చేస్తున్న అన్యాయాలపై రెబల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. సుప్రీం యాష్కిన్ని అంతం చేసి కాంప్లెక్స్ వనరులను అందరికి అందేలా చేయాలనేది వారి లక్ష్యం. దాని కోసం ‘శంబాల’ అనే రహస్య ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచే పోరాటం చేస్తుంటారు. ‘కాంప్లెక్స్’లో ‘ప్రాజెక్ట్ కే’పేరుతో సుప్రీం యాష్కిన్ ఓ ప్రయోగం చేస్తుంటాడు. గర్భంతో ఉన్న సమ్-80 అలియాస్ సుమతి(దీపికా పదుకొణె) కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని శంబాల వెళ్తుంది.. సుమతిని పట్టుకునేందుకు కాంప్లెక్స్ మనుషులు ప్రయత్నిస్తుంటారు. ఆమెను అప్పగిస్తే కాంప్లెక్స్లోకి వెళ్లొచ్చు అనే ఉద్దేశంతో భైరవ కూడా సుమతి కోసం వెళ్తాడు.వీరిద్దరి బారి నుంచి సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ(అమితాబ్ బచ్చన్) ప్రయత్నిస్తాడు. అసలు అశ్వత్థామ ఎవరు? వేల సంవత్సరాలు అయినా అతను మరణించకుండా ఉండడానికి గల కారణం ఏంటి? సుమతిని ఎందుకు కాపాడుతున్నాడు? ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరు? సుప్రీం యాష్కి చేపట్టిన ‘ప్రాజెక్ట్ కే’ ప్రయోగం ఏంటి? కాంప్లెక్స్లోకి వెళ్లాలనుకున్న భైరవ కోరిక నెరవేరిందా? అసలు భైరవ నేపథ్యం ఏంటి? అశ్వత్థామతో పోరాడే శక్తి అతనికి ఎలా వచ్చింది? భైరవ, అశ్వత్థామ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.సందేశం ఇచ్చిన పొట్టేల్ పొట్టేల్..పేరుకు చిన్న సినిమానే కానీ కథ మాత్రం చాలా పెద్దది. 1970-80 కాలంలో ఉన్న పటేళ్ల పెత్తనం, మూఢ నమ్మకాలు, సమాజంలో ఉన్న అసమానతలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే చదువు యొక్క గొప్పదనాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేశారు. 1970-80 మధ్యకాలంలో సాగే కథ ఇది. తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఓ చిన్న పల్లెటూరు గుర్రంగట్టు. అక్కడ పటేళ్లదే రాజ్యం. ఆ ఊరిలో 12 ఏళ్లకు ఒక్కసారి బాలమ్మ జాతర నిర్వహిస్తారు. ఆ జాతరలో పొట్టేల్ని బలి ఇవ్వడం ఆనవాయితీ. అయితే వరుసగా రెండు సార్లు జాతర సమయానికి బలి ఇచ్చే పొట్టేల్ చనిపోవడంతో ఆ ఊర్లో కరువు తాండవిస్తుంది. అలాగే ప్రజలు అనారోగ్య బారిన పడి చనిపోతుంటారు. ఈసారి జాతరకు ఎలాగైనా పొట్టేల్ని బలి ఇవ్వాలని, దాని కాపాడాల్సిన బాధ్యతను గొర్రెల కాపరి పెద్ద గంగాధరి (యువచంద్ర కృష్ణ)కు అప్పగిస్తారు. పటేల్(అజయ్) చేసే మోసాలన్నీ గంగాధరికి తెలుసు. తన అవసరాల కోసమే బాలమ్మ సిగం(పూనకం రావడం) వచ్చినట్లు నటిస్తున్నాడని.. ఆయన మాటలు నమ్మొదని చెప్పినా ప్రజలెవరు పట్టించుకోరు. భార్య బుజ్జమ్మ(అనన్య నాగళ్ల) మాత్రం గంగాధరి మాటలను నమ్ముతుంది.పటేళ్ల పిల్లల మాదిరే తన కూతురు సరస్వతికి కూడా చదువు చెప్పించాలనుకుంటాడు. ఇది పటేల్కు నచ్చదు. దీంతో ఊరి బడి పంతులు(శ్రీకాంత్ అయ్యంగార్)ని బ్రతిమిలాడి కూతురికి రహస్యంగా చదువు చెప్పిస్తాడు. ఇంతలో ఊరి జాతర దగ్గర పడుతుందనగా బాలమ్మ పొట్టేల్ కనిపించకుండా పోతుంది. గాంగాధరి తప్పిదం వల్లే పొట్టేల్ పోయిందని.. దాని తీసుకురావాల్సిన బాధ్యత అతనిదే అని పటేల్ ఆదేశిస్తాడు. అంతేకాదు బాలమ్మ పూనినట్లు నటిస్తూ.. పొట్టేల్ని తీసుకురాకుంటే ఈసారి జాతరలో గంగాధరి కూతురు సరస్వతిని బలి ఇవ్వాలని చెబుతాడు. ఊరి జనాలు కూడా ఇది బాలమ్మ ఆదేశం అని నమ్ముతారు. అసలు పొట్టేల్ ఎలా మాయం అయింది? కూతురు ప్రాణాలను కాపాడుకోవడం కోసం గంగాధరి ఏం చేశాడు. చివరకు పొట్టేల్ దొరికిందా లేదా? పటేల్ నిజస్వరూపం తెలిసిన తర్వాత ఊరి జనాలు ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.భాస్కర్ లక్కీనే..1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే లక్కీ భాస్కర్. బ్యాంక్లో పని చేసే ఒక కామన్ స్టాక్ ఎక్సేంజ్ని ఎలా బురిడీ కొట్టించారనేది ఈ సినిమా కథ. బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్, మధ్య తరగతికి చెందినవారి మనస్తత్వాలు... వీటన్నిటినీ మేళవిస్తూ ఓ వ్యక్తి జీవిత ప్రయాణంగా ఈ చిత్రాన్ని మలిచాడు దర్శకుడ వెంకీ అట్లూరి. కథ విషయానికొస్తే.. ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ. -
'గద్దర్ అవార్డ్స్' ప్రకటించిన తెలంగాణ.. ఉత్తమ నటుడిగా 'అల్లు అర్జున్'
తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను (Gaddar Awards) ప్రకటించింది. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్ నటి జయసుధ (Jayasudha), ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవార్డ్స్ కోసం ఎంపికైనా వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను అవార్డ్స్ కోసం ఎంపిక చేశారు. అయితే, ప్రస్తుతం 2024 ఏడాదికి సంబంధించి అన్ని విభాగాల్లో అవార్డ్స్ అందుకున్న వారి వివరాలు ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి చలన చిత్ర అవార్డులను ఇస్తున్నట్టు దిల్ రాజు గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు టెక్నికల్ టీమ్, ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలన చిత్ర విభాగం, హెరిటేజ్, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేశారు. గద్దర్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వస్తే.. వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి తదితర విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. 2024 విజేతలు ఉత్తమ చిత్రం : కల్కీ 2898ఉత్తమ రెండో చిత్రం : పోటేల్ఉత్తమ మూడో చిత్రం: లక్కీ భాస్కర్ఉత్తమ బాలల చిత్రం : 35- చిన్న కథకాదుఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఆయ్హిస్టరీ ఫీచర్ విభాగంలో ఉత్తమ హెరిటేజ్ చిత్రం- రజాకార్ ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)ఉత్తమ నటి: నివేధా థామస్ ( 35 చిన్న కథ కాదు)ఉత్తమ దర్శకుడు: నాగ అశ్విన్ (కల్కి 2898 ఏ.డీ)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)ఉత్తమ సంగీత దర్శకుడు :భీమ్స్ (రజాకార్)ఉత్తమ సహాయ నటుడు : ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ : చంద్రశేఖర్ (గ్యాంగ్స్టర్ )ఉత్తమ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (దేవర)ఉత్తమ కమెడియన్: సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : సిద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్: శ్రేయ ఘోషాల్ (పుష్ప2/ సూసేకి అగ్గిరవ్వ)ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్ (రాజూ యాదవ్)ఉత్తమ సినిమాటోగ్రాఫర్- విశ్వనాథ్రెడ్డి (గామి)ఉత్తమ బాలనటులు- మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక (35 చిన్న కథ కాదు)ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)ఉత్తమ కాస్టూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి) బెస్ట్ బుక్ ఆన్ సినిమా - మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ విజేతలు దుల్కర్ సల్మాన్: లక్కీ భాస్కర్అనన్య నాగళ్ల: పొట్టేల్దర్శకులు సూజిత్, సందీప్ (క) నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ (రాజూ యాదవ్)స్పెషల్ జ్యూరీ : ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2) -
ఏంజెలీనా జోలితో విడాకులు.. తొలిసారి బ్రాడ్ పిట్ వ్యాఖ్యలు
ప్రముఖ హాలీవుడ్ నటులు ఏంజెలీనా జోలి - బ్రాడ్ పిట్ గతేడాదిలోనే విడాకులు తీసుకున్నారు. సుమారు 8 ఏళ్ల పాటు కోర్టులో కొనసాగిన తర్వాత ఎట్టకేలకు అధికారికంగా వారు విడిపోయారు. హాలీవుడ్ చరిత్రలో సుదీర్ఘమైన, అత్యంత వివాదాస్పదమైన విడాకులలో ఒకటిగా నిలిచిపోయింది. అయితే, తొలిసారి బ్రాడ్ పిట్ ఈ విడాకుల గురించి GQ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.సుదీర్ఘ విడాకుల పోరాటంలో ఏంజెలీనా జోలితో ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత మీకు ఉపశమనం కలిగిందా అని అడిగినప్పుడు, బ్రాడ్ పిట్ ఇలా అన్నాడు.. 'లేదు.., అది అంత పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నాను. పరిష్కారం అనేది చట్టపరమైన లాంఛన ప్రాయం మాత్రమే, ఉపశమనం కాదు. 8 ఏళ్ల తర్వాత ఒక ఒప్పందంతోనే ఆమె నుంచి విడిపోయాను. ఎవరినైనా అడిగి నా గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి. నేను ఎంతో క్షోభ అనుభవించాను. జీవితంలో చికాకు చెందాను. వివిధ స్థాయిలలో నా శక్తికి మించే పోరాడాను. ఇప్పుడు వాటి గురించి మాట్లాడి సమయాన్ని వృధా చేసుకోవాలనిలేదు. నా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఇది 30 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది' అన్నారు.అదే ఇంటర్వ్యూలో ప్రస్తుతం తాను ఎలా ఉన్నాడో చెప్పాడు. ' నేను చాలా అందంగానే ఉన్నాను కదా. జీవితం బాగానే కొనసాగుతుంది. నా స్నేహితులతో పాటు నా కుటుంబంతో గడుపుతున్నాను. నేను ఎవరో నాకు ఇప్పుడే తెలిసింది. కెరీర్ పరంగా కూడా ఇప్పుడిప్పుడే మళ్లీ స్పీడ్ పెరిగింది. తను నటించిన కొత్త సినిమా 'F1 - ది మూవీ' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది జూన్ 27న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో థియేటర్లలోకి వస్తుంది.హాలీవుడ్ నటులు, అస్కార్ విజేతలైన ఏంజెలీనా జోలి(49), బ్రాడ్ పిట్(61) కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి (2014) చేసుకున్నారు. ఈ జంటకు ఆరుగురు పిల్లలు. అయితే, 2016లో వారు ఒక ప్రైవేట్ జెట్లో ప్రయాణిస్తున్నప్పుడు బ్రాడ్ పిట్ తమ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారని జోలీ విడాకుల కోరింది. 2019లో ఈ దంపతులకు విడాకులు ముంజూరయ్యాయి. కానీ, ఆస్తుల విభజన విషయంలో చాలా కాలం పాటు కోర్టులో విచారణ జరిగింది. 2024లో పూర్తిగా వారు విడిపోయారు. -
పవన్ కల్యాణ్ 'ఓజీ'లో శిరీష.. నారా రోహిత్ క్లారిటీ
పవన్కల్యాణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'ఓజీ'లో శిరీష లేళ్ల ఛాన్స్ దక్కించుకుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ఆమెకు కాబోయే భర్త నారా రోహిత్ తాజాగా ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఓజీ సినిమా గురించి మాట్లాడారు. 'ప్రతినిధి2' చిత్రంలో నారా రోహిత్ సరసన శిరీషా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రేమలో పడిన వారిద్దరూ గతేడాదిలో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో వివాహం కానుంది.'భైరవం' సినిమా మే 30న విడుదల కానుంది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించారు. మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఈ ముగ్గురితో హీరో సాయి ధరమ్ తేజ్ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఓజీ అప్డేట్ ఇవ్వాలంటూ రోహిత్ను ప్రశ్నించగా ఇలా చెప్పారు. 'ఓజీలో నాకు కాబోయే సతీమణి శీరీషా కూడా నటించారు. ఒక కీలకమైన పాత్రలో నటించే ఛాన్స్ ఆమెకు దక్కింది' అని ఆయన అన్నారు. ప్రస్తుతం రోహిత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.‘ఓజీ’ సినిమా షూటింగ్ స్పీడ్గానే సాగుతుంది. ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని సమాచారం. ఈ ఏడాది సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమన్ సంగీతం అందించారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్లతో పాటు శిరీషా కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది. -
దీపికా పదుకొణెకు సపోర్టుగా తమన్నా.. నెటిజన్ల రచ్చ
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా చేసిన ట్వీట్తో రెండు రోజులుగా దీపికా పదుకొణె( Deepika Padukone) పేరు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. తను తీయబోతున్న సినిమా కథను ఒక స్టార్ హీరోయిన్ లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సోషల్మీడియాలో ఆయనొక పోస్ట్ చేశారు. సందీప్ చేసిన కామెంట్స్ దీపికను ఉద్దేశించే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సందీప్ కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే దీపిక కూడా పరోక్షంగా స్పందించింది. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'జీవితంలో బ్యాలెన్స్డ్గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం. నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను' అని చెప్పుకొచ్చింది. ఆ వీడియోతో పాటు దీపికకు చెందిన ఒక పాత వీడియోను ఆమె అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అగౌరవం, పురుషులు, లింగ వివక్షత, లింగ వేతన వ్యత్యాసం, ఓవర్ టైం పని, వృత్తి నైపుణ్యం లేకపోవడం, స్త్రీ ద్వేషం, ద్వంద్వ ప్రమాణాలు అంటూ చెప్పిన ఆమె మాటలను ఇప్పుడు మళ్లీ వైరల్ చేశాడు. దానిని తమన్నా లైక్ చేశారని కొందరు నెటిజన్లు చెప్పుకొచ్చారు. అది కాస్త నెట్టింట వైరల్ అయిపోయింది. దీపికాకు తమన్నా సపోర్ట్ చేస్తుందంటూ పేర్కొన్నారు. అయితే, తాజాగా తమన్నా వివరణ ఇచ్చింది. తాను ఎవరి పోస్ట్కు లైక్ కొట్టలేదని తెలిపింది. కొందరు కావాలనే ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. లైక్ కొట్టలేదని ఇన్స్టాగ్రామ్ చెప్పినా నమ్మలేని స్థితిలో కొందరు ఉన్నారని పేర్కొంది. తనకు తానుగా పోస్ట్లను ఇన్స్టాగ్రామ్ ఎలా లైక్ చేస్తుందో చెబితే బాగుంటుందని ఆమె తెలిపింది. దయచేసి దీనిని ఇంతటితో వదిలేయండి చాలా పనులు ఉన్నాయంటూ ఆమె వెళ్లిపోయింది. -
మలయాళంలో హిట్.. తెలుగులోనూ విడుదల (నరివెట్ట ట్రైలర్)
మలయాళ హీరో టొవినో థామస్ (Tovino Thomas) నటించిన 'నరివెట్ట' (Narivetta) తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాను అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ప్రారంభంలో 'ఐడెంటిటీ' చిత్రంతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకున్న ఆయన నరివెట్ట సినిమాతో మరో హిట్ అందుకున్నారు. మలయాళం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. దీంతో తెలుగులో కూడా మే 30న విడుదల చేయనున్నారు. 2003 ముతంగ సంఘటన ఆధారంగా అబిన్ జోసెఫ్ కథ రాశారు. ఈ చిత్రంలో టొవినో థామస్, సూరజ్ వెంజరమూడు, చేరన్ నటించారు. -
నా చిత్రాల్లో నటించాకే వారందరూ రాజకీయాల్లోకి ఎంట్రీ: ఏఎం.రత్నం
నా చిత్రాల్లో నటించిన తరువాత కథానాయకులు రాజకీయాల్లోకి వెళ్లారని నిర్మాత ఏఎం.రత్నం అన్నారు. ఇంతకుముందు కోలీవుడ్లో ఆయన ఇండియన్ (భారతీయుడు), ఆరంభం, ఎన్నై అరిందాల్ (ఎంతవాడు గాని), వేదాళం వంటి పలు భారీ చిత్రాలను నిర్మించారు. ఈయన తాజాగా నిర్మించిన చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ఇందులో నిధిఅగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునిల్, కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణం అందించారు. రవికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో జూన్ 12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఆ చిత్రంలోని తార తార అనే పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు కేఎస్.రవికుమార్, కేఆర్ పాల్గొని చిత్రం మంచి విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. ఏఎం రత్నం మాట్లాడుతూ చిత్రం బాగా వచ్చిందని, హరిహర వీరమల్లు చిత్రానికి రెండవ భాగం చేస్తానని చెప్పారు. ఈ చిత్రానికి తన కొడుకు రవికృష్ణ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు. కాగా తన చిత్రాల్లో నటించిన తరువాత ఆయా చిత్రాల కథానాయకులు రాజాకీయాల్లోకి ప్రవేశించారని చెప్పారు. నటుడు శరత్కుమార్, విజయ్కాంత్, విజయ్, విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లారని, పవన్కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యారని ఇది యాదృఛ్చకంగా జరిగిందో ఏమో తెలియదని ఆయన పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు రవికృష్ణ మాట్లాడుతూ తాను ఏడెనిమిది ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం హరిహరవీరమల్లు అని పేర్కొన్నారు. అదేవిధంగా పవన్కల్యాణ్ పిలిచి తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని, తాను మాత్రం మీ తండ్రికి అభిమానినని, ఆయన బాగుండాలని, ఆయన లెగసీని నువ్వు కొనసాగించాలని చెప్పారని రవికృష్ణ పేర్కొన్నారు. -
జైలర్తో విద్య?
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్ ’(2023) చిత్రం సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. జైలర్, రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్గా రజనీకాంత్ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రజనీ–నెల్సన్ కాంబినేషన్లోనే ‘జైలర్’కి సీక్వెల్గా ‘జైలర్ 2’ చిత్రం రూపొందుతోంది. సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందట. ఇదిలా ఉంటే.. ‘జైలర్ 2’లో విద్యా బాలన్ నటించనున్నారని తమిళ ఇండస్ట్రీ టాక్. ఇటీవల విద్యా బాలన్ని కలిసి, ‘జైలర్ 2’ కథ చె΄్పారట నెల్సన్. చిత్రకథతో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో ఆమె నటించేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ‘జైలర్ 2’లోనూ ఆమె అదే పాత్రలో కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో విద్యా బాలన్ పాత్ర ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడక తప్పదు. ఇదిలా ఉంటే... ‘జైలర్ 2’లో హీరో బాలకృష్ణ నటించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. తాజాగా హీరో నాగార్జున కూడా ఈ చిత్రంలో నటించనున్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషించారు. మరి... ‘జైలర్ 2’లో కూడా నటిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. -
మళ్లీ దొరికిపోయిన రష్మిక.. తానే హింట్ ఇచ్చిందిగా!
పుష్పభామ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. పుష్ప-2 తర్వాత వచ్చిన ఛావా మూవీతో సైతం సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ సరసన సికందర్లోనూ మెరిసింది. ప్రస్తుతం నాగార్జున-ధనుశ్ కీలక పాత్రలు పోషిస్తోన్న కుబేరలో కనిపించనుంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో టచ్లో ఉండే ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఎల్లో శారీలో ఉన్న పిక్స్ మరింత గ్లామరస్గా ఉన్నాయి. అయితే ఇవీ చూసిన నెటిజన్స్ నెట్టంట భిన్నమైన కామెంట్స చేస్తున్నారు. ఆ ఫోటోలు తీసింది.. మరెవరో కాదు.. బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.రష్మిక తన ఇన్స్టాలో రాస్తూ.. "ఈ ఫోటోలన్నీ నాకు ఇష్టమైనవి. ఈ రంగు, ప్రదేశం నాకు చీరను బహుమతిగా ఇచ్చిన అందమైన మహిళ. అంతేకాకుండా ఫోటోగ్రాఫర్.. ఈ ఫోటోలోని ప్రతిదీ నా లైఫ్లో భర్తీ చేయలేనివి " అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అయితే ఈ ఫోటోల్లో ఉన్న బ్యాగ్ గ్రౌండ్ విజయ్ దేవరకొండ ఇంటిలాగే ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఈ ఫోటోలు కచ్చితంగా విజయ్ దేవరకొండ తీసి ఉంటారని మరొకరు రాసుకొచ్చారు. ఏదేమైనా గతంలో చాలాసార్లు విజయ్ ఇంట్లో ఉన్న ఫోటోలు షేర్ చేసి దొరికిపోయిన రష్మిక.. మరోసారి అలాగే నెటిజన్లకు చిక్కింది. గతేడాది దీపావళి పండుగ సమయంలోనూ రష్మిక.. విజయ్ ఇంటివద్దనే సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే గత కొన్నేళ్లుగా రష్మిక-విజయ్పై డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. వీరిద్దరు జంటగా 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలలో నటించారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
నా సిినిమా ఇంత కల్ట్గా ఉందంటే కారణం అతనే: సుకుమార్ ఆసక్తికర కామెంట్స్
సీనియర్ హీరో అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం 'సీతా పయనం'. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నిరంజన్ , అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా కీలక పాత్ర పోషిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్కు పుష్ప డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కన్నడ హీరో ఉపేంద్ర కూడా ఈవెంట్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కన్నడ హీరో ఉపేంద్రపై పుష్ప డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు కురిపించారు. ఆయన వల్లే నా సినిమాల్లో స్క్రీన్ ప్లే ఇంత కల్ట్గా ఉందని అన్నారు. ఎందుకంటే ఉపేంద్ర తెరకెక్కించిన ఓమ్, ఏ, ఉపేంద్ర లాంటి సినిమాలే నాకు ఆదర్శమని తెలిపారు. ఆడియన్స్కు పిచ్చి, మ్యాడ్ తెప్పించే కల్ట్ మూవీస్ ఆయన మనకిచ్చారు. ఆయనలా కేవలం 3 సినిమాలు తీస్తే ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చన్నారు. నేనైతే తప్పనిసరిగా రిటైర్ అయ్యేవాడినని సుకుమార్ నవ్వుతూ మాట్లాడారు. ఉపేంద్ర నుంచే స్క్రీన్ ప్లేను తాను తస్కరించానని సుకుమార్ అన్నారు. -
కన్నప్ప హార్డ్ డిస్క్ చోరీ.. కీలక విషయాలు వెల్లడించిన నిర్మాత!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్కు ముందు కష్టాలు తప్పేలా లేవు. ఈ మూవీకి సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ చోరీకి గురి కావడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సైతం ఓ లేఖను విడుదల చేసింది. మూడు నెలల క్రితమే హార్డ్ డ్రైవ్ పోయినట్లు నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.తమ సినిమా హార్డ్ డ్రైవ్ కోసం ముంబయి కంపెనీని నిర్మాత సంప్రదించారు. అయితే తాము మార్చి మొదటి వారంలోనే హైదరాబాద్కు డ్రైవ్ పంపించామని కంపెనీ ప్రతినిధులు ఆయనతో అన్నారు. కొరియర్ ద్వారా హార్డ్ డ్రైవ్ పంపిస్తే రఘు డెలివరీ తీసుకున్నారని సదరు కంపెనీ తెలిపింది. అయితే తానేలాంటి డ్రైవ్ తీసుకోలేదని రఘు నిర్మాతతో అన్నారు. దీంతో వెంటనే హార్డ్ డిస్క్ మిస్సింగ్ కావడంపై నిర్మాత పోలీసులను ఆశ్రయించారు. అందులో అత్యంత కీలకమైన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఫైల్స్ మొత్తం ఉన్నాయని తెలిపారు. ఆ డ్రైవ్ మిస్సయితే కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అన్నారు. సినిమా విడుదల కంటే ముందు ఏదైనా బయటికి వస్తే పెద్ద నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతతో పాటు పలువురి దగ్గర నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. -
మంచు విష్ణు కన్నప్ప.. శ్రీకాళహస్తి ఫుల్ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన భక్తి సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు.ఈ మూవీ నుంచి శ్రీకాళహస్తి అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ భక్తి గీతాన్ని విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. A song filled with devotion and power! 🔥 Sri-Kala-Hasti lyrical from #Kannappa🏹 is OUT NOW! 🎶✨ Feel the rhythm, embrace the energy! Watch & enjoy!Har Har Mahadev 🔱Har Ghar Mahadev 🔥#SriKalaHastiLyricalSong #Kannappa #Stalapurana #OmNamahShivaya🔗Telugu:… pic.twitter.com/e4ebn1Ypoh— Kannappa The Movie (@kannappamovie) May 28, 2025 -
కథ నచ్చడంతో నేనే నిర్మించా: రూపేష్
‘‘ప్రస్తుతం మన సినిమాల్లో స్వచ్ఛమైన ప్రేమను చూపించడం లేదు. మా ‘షష్టిపూర్తి’ చిత్రంలో కుటుంబ అంశాలతో పాటు అన్ని రకాల భావోద్వేగాలను చూపించాం. అలాగే అందమైన ప్రేమకథ కూడా ఉంది. ఇందులోని పాత్రల్ని చూస్తే తమని తాము చూసుకున్నట్టుగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు’’ అని హీరో–నిర్మాత రూపేష్ తెలిపారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో, రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్పై రూపేష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రూపేష్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘షష్టిపూర్తి’ కథను రాజేంద్ర ప్రసాద్గారి కోసమే పవన్ ప్రభ రాసుకున్నారు. ఆయన కొడుకు పాత్ర కోసం నన్ను సంప్రదించారు. పవన్గారు చెప్పిన ఈ కథ బాగా నచ్చడంతో ఈ కథని రాజీ పడకుండా తీయాలనే ఆలోచనతో నేనే నిర్మించాను. ఔట్పుట్ చూసుకున్నాక... కథ విన్నప్పుడు కంటే రెండింతల సంతృప్తి కలిగింది. పవన్గారు అంత బాగా తెరకెక్కించారు. మా చిత్రానికి ఇళయరాజా, తోట తరణివంటి పెద్ద సాంకేతిక నిపుణులు పని చేయడంతో బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువైంది. అయితే ఆ ఖర్చు అంతా తెరపై కనిపిస్తుంది. మా ఆయి ప్రొడక్షన్స్ అంటే మా అమ్మ ప్రొడక్షన్ అని అర్థం. నేను నటించిన తొలి చిత్రం ‘22’. అయితే ముందుగా ‘షష్టిపూర్తి’ విడుదలవుతోంది. ‘22’ని కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నాం. నా తర్వాతి సినిమాలకు రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అని చెప్పారు. -
ఆకట్టుకునేలా తేజ సజ్జా 'మిరాయ్' టీజర్
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు మరోసారి సూపర్ హీరోగా అలరించేందుకు సిద్ధమైపోయాడు. 'మిరాయ్' మూవీతో రాబోతున్నాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. అలానే మూవీ కొత్త రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?)తేజ సజ్జా హీరోగా నటిస్తున్న 'మిరాయ్'లో పవర్ఫుల్ విలన్గా మంచు మనోజ్ కనిపించబోతున్నాడు. టీజర్ అయితే బందోబస్తుగా ఉంది. ప్రభాస్ 'కల్కి' తరహాలో త్రేతా యుగం, కలియుగం మధ్య ఏదో లింక్ ఉన్నట్లు చూపించారు. విజువల్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. అలానే లొకేషన్స్ కూడా అదిరిపోయాయి.కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో నిర్మించింది. తొలుత అనుకున్నట్లు ఆగస్టు 1న కాకుండా సెప్టెంబరు 5న ఏడు భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి తేజ సజ్జా ఈసారి హిట్ కొడితే.. పాన్ ఇండియా వైడ్ హీరోగా సెటిలైపోవచ్చు. విలన్గా మనోజ్ కూడా అంచనాలు పెంచేలా కనిపించాడు. చివర్లో రాముడి ఎంట్రీ ఉందన్నట్లు చూపించి ఆసక్తి పెంచారనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ) -
నాగార్జున ఫ్లాప్ సినిమా నచ్చిందంటున్న ధనుష్
నాగార్జున హీరోగా సినిమాలు చేయట్లేదు. అలా అని ఖాళీగా ఏం లేరు. కుబేర, కూలీ లాంటి తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్తో కలిసి 'కుబేర'లో నటించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన ఈ చిత్రం జూన్ 20న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన ధనుష్.. నాగ్తో పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు.నాగార్జునతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన ధనుష్.. ఆయన సినిమాల్లో 'రక్షకుడు' అంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. దీంతో అసలు ఏంటి సినిమా అని కొందరు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో మాత్రం నాగ్ సినిమాలు చేశారు గానీ అప్పట్లో తమిళంలోనూ పలు చిత్రాలు చేశారు. అలాంటి ఓ మూవీనే రక్షకుడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)ప్రవీణ్ గాంధీ అనే దర్శకుడు తీసిన ఈ సినిమాని కుంజుమోన్ భారీ బడ్జెట్తో నిర్మించారు. భారీ అంచనాలతో రిలీజైంది గానీ ఘోరమైన డిజాస్టర్గా నిలచింది. అక్కడక్కడ కొన్ని ఫ్యాన్ మూమెంట్స్... అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఇది తప్పితే స్టోరీ పరంగా తేలిపోవడంతో ఫ్లాప్ అయింది. అలాంటి మూవీ ధనుష్కి నచ్చింది. ఇప్పుడు అదే విషయాన్ని బయటపెట్టాడు.నాగ్ ప్రస్తుతం హీరోగా కంటే కీలక పాత్రలు చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే చివరగా 'నా సామి రంగ' మూవీ చేశారు. తర్వాత అదిగో ఇదిగో అంటున్నారు గానీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ లేదు. మరోవైపు కుబేర, కూలీ లాంటి క్రేజీ మూవీస్ చేశారు. జైలర్ 2లోనూ నాగ్ విలన్గా చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. (ఇదీ చదవండి: 'వారసుడు' సినిమా చేసి బాధపడ్డాను: నందిని రాయ్) -
'వారసుడు' సినిమా చేసి బాధపడ్డాను: నందిని రాయ్
బిగ్బాస్ 2వ సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న నందిని రాయ్.. తర్వాత చాలా సినిమాల్లో నటించింది. కానీ దళపతి విజయ్ 'వారసుడు' చేసి మాత్రం తప్పు చేశానని అంటోంది. అందుకు గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది. మోడల్గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. మిస్ ఆంధ్రప్రదేశ్గానూ నిలిచింది. ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. ఎక్కువగా బోల్డ్ రోల్స్ చేస్తూ ఫేమస్ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)వారసుడు చిత్రంలో నటించడం గురించి మాట్లాడిన నందిని రాయ్.. 'విజయ్ సర్ 'వారసుడు'లో నాది చిన్న రోల్ కాదు. నెరేషన్ ఇచ్చినప్పుడు ప్రకాశ్ రాజ్ కూతురు పాత్ర, శ్రీకాంత్ని రెచ్చగొట్టి అతడి కుటుంబాన్ని విడదీయాలి. ఇదంతా షూటింగ్ కూడా చేశారు. కానీ ఎడిటింగ్లో సీన్లన్నీ తీసేశారు. మొత్తంగా చూస్తే మూవీలో 2 నిమిషాలు కూడా లేదు నా పాత్ర. రిలీజ్ తర్వాత ఎందుకు ఈ సినిమా చేశావ్ అనే ప్రశ్నలు వచ్చాయి. ఈ మూవీ చేసినందుకు మాత్రం బాధపడ్డాను. ఇదంతా నేను ఊహించలేదు. ఆ చిత్రం వల్ల నాపై నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. వారసుడు తరహా పాత్రలు మళ్లీ చేయను' అని చెప్పుకొచ్చింది.2011లో '040' అనే తెలుగు సినిమాతో నందిని రాయ్ నటిగా మారింది. సుధీర్ బాబు 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రంలో హీరోయిన్ రోల్ పడింది. కానీ పెద్దగా ఉపయోగపడలేదు. సిల్లీ ఫెలోస్, శివరంజని, సీఎస్ఐ సనాతన్, భాగ్ సాలే తదితర చిత్రాలైతే చేసింది గానీ గుర్తింపు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చింది.అలానే తన అనారోగ్య సమస్యల గురించి కూడా నందిని రాయ్ బయటపెట్టింది. గతంలో స్నేహితులతో కలిసి గోవా వెళ్లినప్పుడు బీచ్లో ఎంజాయ్ చేస్తున్నా. నీటిలో ఒక గుడ్డ.. నా కాలికి పదేపదే తగులుతూ ఉంది. ఎన్నిసార్లు వదిలినా నా కాలికి చుట్టుకుంది. తీరా తీసి చూస్తే అందులో ఎవరికో చేతబడి చేసి రెండు బొమ్మలు, సూదులు గుచ్చి ఉన్నాయి. పువ్వులు, ఎవరిదో జుట్టు కూడా ఉంది. ఆ షాక్తో చాలా డిస్టర్బ్ అయ్యాను. మూడు రోజులు జ్వరంతో బాధపడ్డాను. దాని తర్వాత కొన్ని రోజులు అనారోగ్య సమస్యలు వేధించాయి. చావు మీద భయం వచ్చింది. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. అప్పుడు సినిమా ఆఫర్స్ వచ్చినా అనారోగ్యం వల్ల చేయలేకపోయాయను. ఆ మూవీస్ చేసుంటే నాకు సక్సెస్ వచ్చి ఉండేదేమో అని భావోద్వేగానికి గురైంది.(ఇదీ చదవండి: నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్) -
ఆ తప్పులు మళ్లీ చేయకూడదని తెలిసొచ్చింది: నారా రోహిత్
‘‘ముగ్గురు హీరోలతో ఒక సినిమా చేయడం అంత సులభం కాదు. కానీ రాధామోహన్గారు మమ్మల్ని (సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్) నమ్మి ‘భైరవం’ని రాజీ పడకుండా తీశారు. ఆయనలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. రాధామోహన్గారికి ఈ సినిమాతో పెద్ద విజయం, భారీగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’’ అని నారా రోహిత్ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా, అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భైరవం’.విజయ్ కనకమేడల దర్శకత్వంలో జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నిర్మాత బెల్లంకొండ సురేష్గారు ఫోన్ చేసి, తమిళ చిత్రం ‘గరుడన్’ చూడమంటే చూశాను... చాలా నచ్చింది. ఈ సినిమా తెలుగు రీమేక్ ‘భైరవం’లో శశికుమార్పాత్ర చేయాలని కోరారు. ఆపాత్ర నాకూ బాగా నచ్చడంతో చేశాను.నా తొలి కమర్షియల్ మాస్ ఫిలిం ‘భైరవం’. ఇక ఇన్నేళ్ల నా కెరీర్లో విజయాలు, అపజయాలు, ఎత్తు పల్లాలు ఉన్నాయి. కథల ఎంపికలో కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులు మళ్లీ చేయకూడదని తెలిసొచ్చింది. ఇకపై నా నుంచి రెగ్యులర్గా సినిమాలు వస్తాయి. నేను హీరోగా నటించిన ‘సుందరకాండ’ విడుదల జూలైలో ఉంటుంది’’ అని పేర్కొన్నారు.‘పుష్ప’లో షెకావత్ (ఫాహద్ ఫాజిల్ చేసినపాత్ర) క్యారెక్టర్కు నన్ను అడిగారు. ఫొటోలు పంపమంటే, మీసాలు పెంచుకుని ఫొటోషూట్ చేయించి, పంపాను. కానీ ఇదిపాన్ ఇండియా మూవీ కాబట్టి వివిధ భాషల వాళ్లని తీసుకోవాలనే ఆలోచనతో ఫాహద్ని తీసుకుని ఉంటారేమో. -
జూన్ నుంచి జోరుగా...
లొకేషన్ సెర్చ్ చేస్తున్నారు పూరి జగన్నాథ్. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టబు, కన్నడ నటుడు విజయ్ కుమార్ కీలకపాత్రల్లో నటించనున్నారు.పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మించనున్నారు. జూన్ చివరి వారంలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. షూటింగ్ ఆరంభించినప్పటి నుంచి మొత్తం సినిమా పూర్తయ్యేవరకూ షెడ్యూల్స్ని జోరుగా జరిపేలా ప్లాన్ చేశారట. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై ఏరియాల్లో లొకేషన్స్ రెక్కీ చేస్తోంది పూరి అండ్ టీమ్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
వినాయక చవితికి జాతర
ఆగస్టులో థియేటర్స్లో మాస్ జాతర అంటున్నారట రవితేజ. ‘ధమాకా’ వంటి బ్లాక్బాస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మణ్ భేరి అనేపోలీసాఫీసర్పాత్రలో రవితేజ, విలన్గా నవీన్ చంద్ర నటిస్తున్నారని తెలిసింది.ఈ సినిమా టాకీపార్టు చిత్రీకరణ దాదాపు పూర్తయింది.పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట. కాగా ‘మాస్ జాతర’ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు చివరి వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
'కన్నప్ప మూవీపై పెద్ద కుట్ర'.. నిర్మాణ సంస్థ సంచలన లేఖ!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం కావడంపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ మూవీకి సంబంధించిన 90 నిమిషాల ఫుటేజ్ను ఆన్లైన్లో లీక్ చేసే కుట్ర జరుగుతోందని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ (24 Frames Factory) నిర్మాణ సంస్థ ఆరోపించింది. కన్నప్ప హార్డ్డిస్క్ చోరీకి గురవడంపై వచ్చిన రూమర్స్పై కూడా సంస్థ స్పందించింది.నిర్మాణ సంస్థ తన నోట్లో రాస్తూ..' కన్నప్పలోని ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్తో పాటు, కీలకమైన వీఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ ట్రాన్సిట్ సమయంలో చోరీకి గురైంది. ఈ హార్డ్ డిస్క్ ముంబయిలోని హైవ్ స్టూడియోస్ నుంచి మా నిర్మాణ కార్యాలయానికి డెలివరీ చేస్తుండగా చోరీ చేశారు. హార్డ్డిస్క్ చోరీపై నాలుగు వారాల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశాం. కన్నప్ప సినిమా ఫుటేజ్ ఆన్లైన్లో లీక్ కాకుండా సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. ఈ చోరీకి పాల్పడిన వారిద్దరూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు కాదు. దీని వెనుక ఎవరున్నారో తమకు తెలుసని ప్రొడక్షన్ హౌస్ తన లేఖలో పేర్కొంది. కాగా.. అంతకుముందు ఈ ఘటనపై ఆ సినిమా హీరో మంచు విష్ణు స్పందింటారు. జటాజూటధారీ.. నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?’ హరహరమహదేవ్ అంటూ ట్వీట్ చేశారు.OFFICIAL STATEMENT FROM 24 FRAMES FACTORYREGARDING THE THEFT OF CRUCIAL KANNAPPA FOOTAGEIn response to circulating rumours and speculation, 24 Frames Factory is issuing this official statement to bring clarity to the situation.A hard drive containing a pivotal action…— 24 Frames Factory (@24FramesFactory) May 27, 2025 -
స్టేజీపై రచ్చ చేసిన తమన్నా.. పూల్లో అనసూయ
స్టేజీ ఫెర్ఫార్మెన్స్ జ్ఞాపకాల్ని షేర్ చేసిన తమన్నాశ్రీలంకలో స్విమ్మింగ్ పూల్లో అనసూయ ఎంజాయ్చీరలో ముద్దబంతి పువ్వులా ఆషికా రంగనాథ్కలర్ కలర్ డ్రస్సులో శ్రీలీల.. తోడుగా ఫన్నీ కొటేషన్బెండ్ అయిన పోజుల్లో అదితీ రావ్ హైదరీమరింత గ్లామరస్గా మారిపోతున్న ఛార్మీపడుకుని మత్తెక్కించే పోజులిచ్చిన శివాత్మిక View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
అల్లరి నరేశ్.. ఈసారి 'ఆల్కహాల్'?
టాలీవుడ్లో కామెడీ తరహా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేశ్.. ఇప్పుడు చాలా స్లో అయిపోయాడు. ఒకటి అరా సీరియస్ లేదా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నప్పటికీ అనుకున్న ఫలితం దక్కట్లేదు. అయినా సరే మూవీస్ చేస్తూనే ఉన్నాడు. గతేడాది డిసెంబరులో చివరగా 'బచ్చలమల్లి' అనే రస్టిక్ మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ఓ హారర్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్)ఇప్పుడు అల్లరి నరేశ్ చేయబోయే సినిమా కోసం ఓ క్రేజీ టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడంతా మాస్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో 'ఆల్కహాల్' అని ఓ పేరుని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. రీసెంట్ టైంలో హిట్ సినిమాలతో ఆకట్టుకుంటున్న సితార ఎంటర్టైన్మెంట్స్.. అల్లరోడితో ఈ మూవీని నిర్మించనుందని సమాచారం.'సుడిగాడు' తర్వాత తర్వాత అల్లరి నరేశ్.. కెరీర్ పరంగా కాస్త టర్న్ తీసుకున్నాడు. 'ఉగ్రం' మూవీతో డిఫరెంట్ ప్రయత్నం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మళ్లీ అదే దర్శకుడితో కలిసి 'నాంది' చేశాడు. కాకపోతే బాక్సాఫీస్ దగ్గర ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. 'బచ్చలమల్లి'పై నరేశ్ కాస్త ఎక్కువ అంచనాలు పెట్టుకున్నాడు గానీ పూర్తిగా ఇది నిరాశపరిచింది. అయినా సరే తగ్గకుండా ఆ తరహా కథతోనే 'ఆల్కహాల్' చేయబోతున్నాడని తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టుపై క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
తెరపై ఒక్కసారి కనిపించకున్నా...లేడీ సూపర్ స్టారే...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సీతార ఘట్టమనేని(Sitara Ghattamaneni) పేరు ఇప్పుడు ప్రకటనల ప్రపంచంలో మార్మోగుతోంది. అయితే ఓ అగ్రనటుడి కుమార్తెగానో లేక బాల నటిగానో కాదు కానీ, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన యాడ్ ఫేస్గా ఆమె సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసడర్గా, యాడ్ మోడల్గా ఆమె చూపిస్తున్న టాలెంట్కు సినీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఆమె వయస్సు కేవలం 11 ఏళ్లు మాత్రమే అయినా, చూపే ప్రొఫెషనలిజం, కెమెరా ముందు చూపుతున్న కాన్ఫిడెన్స్ చూసి యాడ్ రూపకర్తలు ఆమెవైపు అమితంగా ఆకర్షితులవుతున్నారు.సీతార కెమెరా ముందు మొదటిసారి కనిపించింది ఓ ఫ్యామిలీ యాడ్లో. అందులో తన తల్లి నమ్రత శిరోద్కర్, తండ్రి మహేష్ బాబుతో కలిసి ఓ జ్యూవెలరీ బ్రాండ్ ప్రచారంలో కనిపించింది. ఆ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, బ్రాండ్కు పెద్దగా ప్రాచుర్యం వచ్చింది.అప్పటి నుంచి సీతారకు యాడ్స్ ఆఫర్లు వెల్లువెత్తడం ప్రారంభమైంది. అనుకోకుండా చేసిన యాడ్తో వచ్చిన పాప్యులారిటీతో ఇతర బ్రాండ్లు కూడా ఆమెను సంప్రదించాయి. ఆ తర్వాత ఆమె ‘బేబీ స్కిన్ కేర్‘, ‘ఎడ్యుకేషన్ ప్యాకేజింగ్‘, ‘ఫ్యాషన్‘ వంటి విభాగాల్లో చేసిన యాడ్స్ లక్షల సంఖ్యలో వ్యూస్ ఆదరణ సాధించాయి. పిఎంజె జ్యూయల్స్, ఒట్లో క్లోతింగ్, టాటా సంపన్న్ జూనియర్ ఫుడ్స్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, మామిఎర్త్, జీ తెలుగు ఫ్యామిలీ ప్రోమో, ట్రెండ్స్... ఇలా అనేక టాప్ బ్రాండ్స్లో ఆమె కనిపిస్తోంది. వీటిలో తన డాడీ మహేష్తో కలిసి చేసిన ట్రెండ్స్ సంస్థ యాడ్ నిజంగా ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి.యాడ్, ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, సీతార ఒక్కో యాడ్ కు రూ. 15 – 25 లక్షల వరకు పారితోషికం( Remuneration) అందుకుంటోంది. వార్షికంగా ఆమె చేసే ప్రచారాల ద్వారా రూ. 2.5 కోట్ల పైగా ఆదాయం వస్తోందని యాడ్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ ఆదాయం ప్రత్యేకంగా ఆమె పేరిట ఓ ట్రస్ట్ ఖాతాలో వేస్తున్నామని, ఈ మొత్తం భవిష్యత్తులో ఆమె విద్య, క్రియేటివ్ అభిరుచుల విస్త్రుతికి ఉపయోగించనున్నట్లు సమాచారం.కెమెరా ఫ్రెండ్లీ ఫేస్ కావడంతో పాటు అమాయకత్వంతో కూడిన గ్లామర్ సితారకు ప్లస్ అవుతోంది. అలాగే తండ్రి, తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన అభినయ ప్రతిభ కూడా ఆమెకు మరో బలం. ముఖ్యంగా తల్లి నమ్రత శిరోద్కర్ గతంలో మిస్ ఇండియా గా ఉన్నందున, ఫ్యాషన్, కెమెరా నైపుణ్యాల్లో తల్లి గైడెన్స్ ఆమెకు బాగా ఉపయోగపడుతోంది.ఇంతింతై..సితార స్టారై...ఇప్పటికే సితార పేరుతో ఇంటర్నెట్లో ప్రత్యేక ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. ఆమె ఏ వీడియో వదిలినా మిలియన్ల వ్యూస్ వస్తాయి. ప్రస్తుతం తను పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది, అయితే యాడ్ ఫిల్మ్స్ను పేషన్గా తీసుకుంటోందో లేక రేపటి బిగ్ స్క్రీన్ ఎంట్రీకి రిహార్సల్గా తీసుకుంటుందో గానీ... తెరపై నైపుణ్యం పెరిగే కొద్దీ, ఆమె పెద్ద తెరపై నటిగా అడుగు పెట్టే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెను ‘చైల్డ్ లీడ్ రోల్‘లో తీసుకోవాలని కొందరు డైరెక్టర్లు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.చిన్న వయసులో పెద్ద నెపథ్యంతో తెరపైకి వచ్చినా, ఆమె చూపిస్తున్న ప్రతిభ మాత్రం పూర్తిగా ఒరిజినల్. ఇదే విధంగా తండ్రి స్టార్ పవర్, తల్లి గైడెన్స్, తన స్వంత ప్రతిభ మేళవిస్తూ సితార కొనసాగితే ఆమె చరిత్ర సృష్టించకుండా అసాధ్యం అనే చెప్పాలి. ఇప్పుడు యాడ్ ప్రపంచంలో చైల్డ్ ఐకాన్ గా ఆమె సృష్టిస్తున్న సందడి చూస్తుంటే, అప్పుడే ఏమైంది? ‘‘ఇంకా చాలా ఉంది చూడడానికి!’’ అనిపించడం మాత్రం ఖాయం. -
నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా తీయడం మాటేమో గానీ ఎప్పటికప్పుడు ఏదో ఓ విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొన్నాళ్ల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవల కారణంగా ఈ సినిమా కాస్త సైడ్ అయింది. కానీ మరో నెలలో రిలీజ్ పెట్టుకుని, ఇప్పుడు హార్ట్ డిస్క్ దొంగతనం జరగడంతో సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.దొంగతనానికి గురైన హార్డ్ డిస్క్లో ప్రభాస్ సీన్లు ఉన్నాయని టాక్ నడుస్తోంది. మరోవైపు సీజీ వర్క్స్కి సంబంధించిన దాదాపు 90 నిమిషాల కంటెంట్ ఇందులో ఉందని అంటున్నారు. అసలు ఇంత ముఖ్యమైన హార్డ్ డిస్క్ని ముంబై నుంచి కొరియర్ లో పంపడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మాయం కావడం, దీంతో మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఇప్పుడు ఈ విషయాలపై స్వయంగా మంచు విష్ణు స్పందించాడు. మొత్తంగా కాకుండా సింపుల్గా ఒక్క ఫొటో పోస్ట్ చేశాడు. అందులో..'జటాజూఠదారీ నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?' అని ట్వీట్ చేశాడు. అయితే కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఏంటనేది ప్రస్తుతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇవన్నీ చూస్తుంటే సినిమా వాయిదా పడటం గ్యారంటీ అనిపిస్తుంది.ఈ సంగతి అలా ఉంచితే 'కన్నప్ప' ఓటీటీ డీల్ కూడా ఇంకా సెట్ కాలేదని, అంతా చూస్తుంటే జూన్ 27న చెప్పిన తేదీకి థియేటర్ విడుదల కావడం కష్టమేమో అనిపిస్తుంది. మూవీ టీమ్ మాత్రం చెప్పిన డేట్కి రావడం పక్కా అని అంటున్నారు. మరి నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడాలి ఇక?(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' కాజల్)#HarHarMahadevॐ #kannappa pic.twitter.com/jKNfIOTrQH— Vishnu Manchu (@iVishnuManchu) May 27, 2025 -
మంచు విష్ణు కన్నప్ప.. ఆయన కుమార్తెల సాంగ్ ప్రోమో చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.(ఇది చదవండి: కన్నప్పలో ప్రభాస్.. రెబల్ స్టార్ పాత్రపై మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్)ఈ మూవీ శ్రీకాళ హస్తి అనే లిరికల్ సాంగ్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 28న ఈ పాటను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తాజాగా ఈ సాంగ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ భక్తి గీతాన్ని విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. My little munchkins! They are blessed by Lord Shiva to be singing the Stalapurana of SriKalaHasti temple. Cannot wait for all of you to hear the song. #HarHarMahadev https://t.co/dDPjlxixO1#kannappa— Vishnu Manchu (@iVishnuManchu) May 27, 2025 -
Kannappa: హార్డ్డ్రైవ్లో ప్రభాస్ యాక్షన్ సీన్స్.. లీకైతే భారీ నష్టమే!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa)కు వరుస కష్టాలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది కానీ.. పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో చిత్రబృందానికి భారీ షాక్ తగిలింది. కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్ మిస్ అయింది. దీనిపై చిత్రబృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది.హార్డ్ డిస్క్లో 1.30 గంటల సినిమా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కంటెంట్ను లీక్ చేస్తే మాత్రం సినిమాకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇందులో సినిమాకు కీలకమైన సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా ప్రభాస్కు సంబంధించిన యాక్షన్ సీన్లన్ని ఈ హార్డ్ డిస్క్లోనే ఉన్నాయట. సినిమా బృందం ముందు నుంచి ప్రభాస్ పాత్ర, లుక్ విషయంలో గోప్యత వహించాయి. ఆయన లుక్ని మాత్రమే రిలీజ్ చేసి..సినిమాలో ఆయన పాత్రలో ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఇందులో ప్రభాస్తో భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇద్దామనే ప్లాన్తో ప్రమోషన్స్లో కూడా ఈ విషయాన్ని బయటపెట్టలేదు. కానీ ఇప్పుడు హార్డ్డ్రైవ్ మిస్ అవ్వడంతో మేకర్స్ భయానికి గురవుతున్నారు. ఒకవేళ ఆ వీడియోని ఆన్లైన్లో లీక్ చేస్తే.. ప్రభాస్ యాక్షన్స్ సీన్స్ అన్నీ వైరల్ అయిపోతాయి. దీంతో సినిమాపై ఆసక్తి తగ్గిపోతుందని మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు సినిమాలో సగ భాగం వరకు ఈ హార్డ్ డ్రైవ్లోనే ఉందట. బ్యాకప్ ఉంటుంది కాబట్టి దొంగిలించిన వాళ్లు అది ఇవ్వకపోయినా నష్టమేమి ఉండదు. కానీ ఆన్లైన్లో లీక్ చేస్తే మాత్రం ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. మరి పోలీసుల చొరవతో ఈ హార్డ్డ్రైవ్ మళ్లీ మేకర్స్ చేతికి అందుతుందో లేదో చూడాలి. -
'ఓజీ'లో నారా రోహిత్ కాబోయే సతీమణి
పవన్కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఓజీ'లో నారా ఫ్యామిలీకి కాబోయే కోడలు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు నారా రోహిత్కు కాబోయే సతీమణి శిరీషా (శిరీష లేళ్ల) ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో నటించినున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని తెలిసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాదిలో నిశ్చితార్థం జరిగింది. త్వరలో ఏడడుగుల బంధంతో ఒకటి కానున్నారు. భైరవం సినిమాతో నారా రోహిత్, ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. సినిమాలపై మక్కువతో ఆమె హైదరబాద్లోని తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమా ఛాన్స్ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా నారా రోహిత్తో ప్రతినిధి2లో అవకాశం దక్కింది. అలా వారి పరిచయం కాస్త పెళ్లి వైపు అడుగులు పడ్డాయి. వివాహానికి ఇంకా సమయం ఉండటంతో ఆమె పలు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓజీలో ఛాన్స్ దక్కడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. -
Spirit: రూ. 20 కోట్లు డిమాండ్ చేసిన దీపికా.. త్రిప్తికి ఎంత ఇస్తున్నారంటే?
త్రిప్తి డిమ్రీ(Tripti Dimri ).. ‘యానిమల్’సినిమాకు ముందు ఈ బ్యూటీ ఎవరనేది పెద్దగా తెలియదు. కానీ ఆ ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా..అవేవి త్రిప్తికి గుర్తింపుని తెచ్చిపెట్టలేదు. కానీ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్లో అందాల ఆరబోసి ఓవర్నైట్ స్టార్గా మారింది. ఆ తర్వాత త్రిప్తికి వరుస చాన్స్లు వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ త్రిప్తి పేరు నెట్టింట్లో వైరల్ అవుతుంది. దానికి కారణం మళ్లీ సందీప్ రెడ్డినే. ప్రభాస్తో ఆయన తెరకెక్కించబోతున్న ‘స్పిరిట్’ చిత్రంలో త్రిప్తిని హీరోయిన్గా తీసుకున్నాడు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించడంతో త్రిప్తి పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.దీపికా ప్లేస్లో..ప్రభాస్తో సందీప్ తెరకెక్కించే ‘స్పిరిట్’(Spirit)లో దీపికా పదుకొణె(Deepika Padukone) హీరోయిన్గా నటించాల్సింది. ఈ మేరకు సందీప్ కూడా ఆమెకు కథ చెప్పి ఒప్పించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆమెను పక్కకు పెట్టి త్రిప్తికి చాన్స్ ఇచ్చాడు. దీపికా పదుకొణె పెట్టిన కండీషన్స్ నచ్చకపోవడంతోనే సందీప్ ఆమెను తప్పించాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రంలో ఎక్స్ఫోజింగ్ ఎక్కువగా ఉందని, అది నచ్చకనే దీపికానే తప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. అంతేకాదు ‘స్పిరిట్’ కథను లీక్ చేస్తూ.. సందీప్ని కించపరిచేలా బాలీవుడ్ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది.రూ.20 కోట్లు డిమాండ్ చేసిన దీపికా..స్పిరిట్ చిత్రంలో ప్రభాస్కి జోడీగా దీపికా అయితేనే బాగుంటుందని భావించాడు సందీప్. తొలుత ఆమెకే ఈ కథను వినిపించాడట. ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ‘తగ్గేదే లే’ అన్నట్లుగా వ్యవహరించారట. రూ. 20 కోట్ల పారితోషికం ఇస్తేనే నటిస్తానని చెప్పిందట. అంతేకాదు టైమింగ్స్ విషయంలోనూ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంట్లో చిన్న పాప ఉండడం కారణంగా ఎక్కువ గంటలు పని చేయలేనని చెప్పిందట. దీపికా పెట్టిన కండీషన్స్..ఆమె అడిగిన రెమ్యునరేషన్ నచ్చకపోవడంతో సందీప్ ఆమెను పక్కకు పెట్టి త్రిప్తి డిమ్రీని హీరోయిన్గా తీసుకున్నాడు.ఐదింతలు తక్కువే..స్పిరిట్ కోసం దీపికా రూ. 20 కోట్ల డిమాండ్ చేస్తే.. దానికి ఐదింతలు తక్కువకు త్రిప్తి ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంటే ఈ సినిమా సినిమాకు గాను త్రిప్తి రూ. 4 కోట్లను పారితోషికంగా అందుకుంటుంది. గత సినిమాలతో పోలిస్తే ఆమెకు ఇది చాలా ఎక్కువ. యానిమల్ కంటే ముందే ఒక్కో సినిమాకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే తీసుకునే త్రిప్తి.. ఆ సినిమా తర్వాత రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. ఇక స్పిరిట్కు తన కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటుంది. అయితే దీపికా డిమాండ్ చేసిన పారితోషికంతో పోలిస్తే..త్రిప్తి అడిగింది చాలా తక్కువని..నిర్మాతలు కూడా వెంటనే ఓకే చెప్పేశారట.ఇక స్పిరిట్ విషయానికొస్తే..ఈ చిత్రంలో ప్రభాస్ పవఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నట్లు సమాచారం. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. -
జైలర్-2లో విలన్గా తెలుగు అగ్ర హీరో
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తొలిసారి విలన్గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్- నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జైలర్2లో ఆయన విలన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కోలీవుడ్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. జైలర్ పార్ట్1లో విలన్గా వినాయకన్ నటించిన విషయం తెలిసిందే. అయితే, సిక్వెల్లో ఆయన పాత్ర కేవలం రెండుమూడు సీన్ల వరకే ఉంటుందని టాక్. జైలర్2 షూటింగ్లో వినాయకన్ రెండురోజులు మాత్రమే పాల్గొనడంతో ఆయన పాత్రపై ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే, ఫుల్ లెన్త్ విలన్గా నాగార్జున నటించనున్నారని కథనాలు వస్తున్నాయి.ఇప్పటికే రజనీకాంత్ ‘కూలీ’లో నాగార్జున ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో, నాగార్జున సిమాన్ అనే పాత్రను పోషిస్తున్నారు. అయితే, ఇందులో కూడా ఆయన పాత్ర నెగటివ్ షేడ్లోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో క్రేజీ నటి శృతిహాసన్ ముఖ్యపాత్రను పోషించగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ యువ సామ్రాట్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇలా పలువురు ప్రధాన పాత్రలు పోషించారు. కూలీ చిత్రాన్ని ఆగస్టు 14వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.జైలర్2 షూటింగ్ రీసెంట్గా చైన్నె పరిసర ప్రాంతాల్లో కొంత భాగం జరిగింది. ప్రస్తుతం కేరళలో జరుపుకుంటుంది. అక్కడ షూటింగ్లో నాగార్జున పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో బాలకృష్ణ ఒక పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఈ రెండి విషయాలపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రటన రాలేదు. చిత్ర షూటింగ్ డిసెంబర్ పూర్తి అవుతుందని దర్శకుడు ఇప్పటికే చెప్పారు. కాగా దీని తర్వాత రజనీకాంత్ నటించనున్న తదుపరి చిత్రం టాలీవుడ్ యువ దర్శకుడితో చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. -
కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' కాజల్
బిగ్బాస్ తెలుగు షో వల్ల చోటామోటా సెలబ్రిటీలు కూడా మంచి ఫేమ్ సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే పలు సీజన్లలో విజేతలుగా నిలిచిన వాళ్లు, షోలో పార్టిసిపేట్ చేసినోళ్లు ప్రమోషన్లు చేస్తూ మంచిగా సంపాదించుకుంటున్నారు. కారు, ఇల్లు లాంటివి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ఆర్జే కాజల్ కూడా చేరింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ)ఎఫ్ఎమ్లో రేడియో జాకీగా కొందరికి తెలిసిన కాజల్.. బిగ్బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఇంకాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఐదో సీజన్లో కొన్ని వారాల పాటు హౌస్లో ఉండి వచ్చింది. బయటకొచ్చిన తర్వాత అడపాదడపా షోలు చేసుకుంటూ సంపాదిస్తుంది. ఇప్పుడు తన దగ్గర దాచుకున్న డబ్బుతో ఓ ఇల్లు కొనుగోలు చేసింది.తాజాగా గృహ ప్రవేశం జరగ్గా.. బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్, సిరి హన్మంతు, సింగర్ లిప్సిక తదితరులు పాల్గొన్నారు. వీళ్లు తమ తమ ఇన్ స్టా ఖాతాల్లో వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశారు. వీటిని ఆర్జే కాజల్ తన స్టోరీలో షేర్ చేసింది. కొత్త ఇల్లు కట్టుకున్న సందర్భంగా తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: బ్లౌజ్ లేకుండా సినిమా మొత్తం నటించా..: సీనియర్ హీరోయిన్ అర్చన) View this post on Instagram A post shared by Lipsika Uday (@lipsikabhashyam) -
'నువ్వు RCB ఫ్యాన్వా.. కెరీర్ మీదా గట్టిగా ఫోకస్ చేయాలి' ('3 రోజెస్' టీజర్)
'3 రోజెస్' సీజన్ 2 (3 Roses Season 2) డైలాగ్స్ సోషల్మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, ‘సత్యం’ రాజేశ్, కుషిత కల్లపు ప్రధానపాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’ నుంచి తాజాగా కమెడియన్ సత్యను పరిచయం చేస్తూ ఒక టీజర్ను విడుదల చేశారు. బెట్టింగ్ భోగి పాత్రలో కడుపుబ్బా ఆయన నవ్వించేలా ఉంది. ఐపీఎల్లో బెట్టింగ్పై పంచ్లు వేస్తూ ఆయన నవ్వించారు.ఆహా (Aha) వేదికగా త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రవి నంబూరి, సందీప్ బొల్ల ఈ మూవీకి రచన చేయగా, కిరణ్ కె.కరవల్ల దర్శకత్వం వహించారు. నిర్మాతగా ఎస్కేఎన్ తెరకెక్కిస్తున్నారు. ‘త్రీ రోజెస్’ సీజన్ 2 నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఈషా రెబ్బా, కుషిత కల్లపు గ్లింప్స్లకు మంచి స్పందన వచ్చింది. రాశీ సింగ్ క్యారెక్టర్ గ్లింప్స్కి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
అమ్మానాన్నల విలువ చేప్పే చిత్రం ‘షష్టిపూర్తి’ : పవన్ ప్రభ
‘‘మాది ఉమ్మడి కుటుంబం. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, పిన్నమ్మ, పెద్దమ్మ, మేనత్త.. ఇలా అందరి ప్రేమ నాకు తెలుసు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కొందరికి అమ్మానాన్నలు కూడా భారం అవుతున్నారు. వారిని నడిరోడ్డుపై వదిలేస్తున్నారు. అమ్మానాన్నల గొప్పదనం, ప్రేమ విలువలు చెప్పాలనే ‘షష్టిపూర్తి’ సినిమా తీశాను. మంచి భావోద్వేగాలతో పాటు ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యే అంశాలు ఉన్నాయి’’ అని దర్శకుడు పవన్ ప్రభ అన్నారు. రూపేశ్ కుమార్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఆకాంక్షా సింగ్ హీరోయిన్ గా నటించగా, రాజేంద్ర ప్రసాద్, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పవన్ ప్రభ విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఫిట్టింగ్ మాస్టర్’ సినిమాకు డైరెక్షన్ టీమ్లో పని చేశాను. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. ఈ సమయంలో సినిమా అంటే ఏంటో నేర్చుకున్నాను. ఇక ‘షష్టిపూర్తి’ కథ రూపేశ్గారికి నచ్చడంతో నిర్మించారు. రూపేశ్, ఆకాంక్ష చక్కగా నటించారు. స్ట్రిక్ట్ మదర్గా అర్చనగారు, జోవియల్ ఫాదర్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తారు. ఈ సినిమాకి సంగీతం చాలా ముఖ్యం. అందుకే ఇళయారాజాగారే కావాలి అనుకున్నాను. రూపేష్గారి వల్ల ఆయన్ని కలిశాను. ఆయన ఒక ΄ాట కోసం ఎన్నో ట్యూన్లు ఇచ్చారు. ‘షష్టిపూర్తి’ వేడుక గురించి వివరంగా చెప్పే ప్రయత్నం చేశాను. నా తర్వాతి సినిమాని త్వరలోనే ప్రకటిస్తాను’’ అని తెలిపారు. -
బ్లౌజ్ లేకుండా సినిమా మొత్తం నటించా.. దర్శకుడి మీద నమ్మకం వల్లే: అర్చన
'ఆకాశం ఏనాటిదో.. అభిమానం ఆనాటిది' అంటూ నిరీక్షణ (1982) సినిమాతో తొలిసారి వెండితెరపై హీరోయిన్గా 'అర్చన' మెరిశారు. ఈ సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మొదట రంగు తక్కువ అంటూ నటిగా తిరస్కరణకు గురైన ఆమె... ఆ తర్వాత వరుసగా రెండు సార్లు జాతీయ అవార్డు సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగు కుటుంబానికి చెందిన అర్చన.. తమిళ అమ్మాయిగా స్థిరపడిపోయారు. ఆమెకు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు బాలుమహేంద్రనే నిరీక్షణ సినిమాతో హీరోయిన్ను చేశారు. గిరిజన యువతి పాత్రలో బ్లౌజ్ లేకుండా నటించడంపై ఆమె తొలిసారి స్పందించారు.సుమారు 20 ఏళ్ల తర్వాత 'షష్టి పూర్తి' సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను నటి అర్చన పలకరించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆమె నటించిన తొలి సినిమా గురించి ఇలా చెప్పారు. 'నిరీక్షణ సినిమాలో గిరిజన యువతి పాత్రలో నటించడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఆరోజుల్లోనే బ్లౌజ్ లేకుండా సినిమా అంతా నటిస్తున్నానని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. నేను నా దర్శకుణ్ని నమ్మాను. అప్పటికే ఆయన చిత్రీకరించిన ఏ సినిమాలోనూ అశ్లీలతతో పాటు గ్లామర్ను ప్రదర్శించడం అనేది లేదు. అందుకే, ఏమీ ఆలోచించకుండా నిరీక్షణలో నటించాను. నా జీవితంలోనే ప్రత్యేకమైన సినిమా ఇదే. మలయాళంలో మమ్ముట్టి, శోభనలతో బాలుమహేంద్రనే తెరకెక్కించారు. తెలుగులో నేను, భానుచందర్ నటించాం. దర్శకుడి మీద నమ్మకంతోనే బ్లౌజ్ లేకున్నా సరే నటిస్తానని చెప్పాను. అనుకున్నట్లుగానే ఆయన చాలా పవిత్రంగానే ఆ పాత్రను ప్రేక్షకులకు చూపించారు. నిరీక్షణ సినిమాతో నాకు ఒక అన్నయ్య (భానుచందర్) దొరికాడు. ఆ బంధం ఇప్పటికీ ఉంది.' అని ఆమె అన్నారు.నిరీక్షణ సినిమాలో భాను చందర్ .. అటవీశాఖాధికారిగా నటించగా అర్చన గిరిజన్ యువతి పాత్రలో మెప్పించింది. ఇప్పటికే ఈ చిత్రం చాలామందికి ఎవర్గ్రీన్ అని చెప్పవచ్చు. ఈ మూవీ విడుదల తర్వాత అర్చనకు భారీ అవకాశాలు వచ్చాయి. వీడు (1987), దాసి (1988) చిత్రాలకు గాను రెండుసార్లు జాతీయ ఉత్తమ నటిగా అర్చన అవార్డు అందుకున్నారు. -
ఓటీటీల విషయంపై అమిర్ ఖాన్ సంచలన నిర్ణయం
బాలీవుడ్ ఆగ్ర నటుడు అమిర్ ఖాన్ (Aamir Khan) నటిస్తోన్న కొత్త చిత్రం 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) థియేటర్లో విడుదలైన తర్వాత డైరెక్ట్గా యూట్యూబ్లో విడుదల చేసే యోచనలో ఉన్నారు. సినిమాలపై ఓటీటీల ప్రభావం తగ్గించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఓటీటీల ప్రభావం థియేటర్లపై పడుతోందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. థియేటర్లలో విడుదలైన సినిమాలు ఎనిమిది వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చే విధానాన్ని ఆయన తప్పు పట్టారు. ఇలాంటి డీల్ వ్యాపారంలో సరైంది కాదన్నారు.అమీర్ ఖాన్ కొత్త సినిమా 'సితారే జమీన్ పర్' జూన్ 20న విడుదల కానుంది. సాధారణంగా థియేటర్ రన్ 8వారాలు పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రావాల్సిందే. అయితే, దానిని అమీర్ బ్రేక్ చేయనున్నారు. ఓటీటీలో కాకుండా యూట్యూబ్లో విడుదల చేయనున్నారు. అది కూడా చాలా రోజుల తర్వాతే అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. ఆ సమయంలో సినిమా చూడాలనుకునే వారు చిత్ర నిర్మాతలు సూచించిన రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు నిర్మాతలకు నష్టం వాటిల్లదని ఆయన అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఈ నిర్ణయంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమీర్ చెప్పిన మాట ప్రకారం ఇలా ఓటీటీని బాయ్కాట్ చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.అమిర్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ.. 'థియేటర్లలో విడుదలైన సినిమాలు తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో సినిమా థియేటర్స్ తీవ్రంగా నష్టపోతున్నాయిని నేను నమ్ముతున్నాను. ఇక నుంచి నేను నటించే సినిమాలు ఓటీటీలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నాను. వాటిని థియేటర్స్లో మాత్రమే విడుదల చేస్తాను. అభిమానులు కూడా నా సినిమాను పెద్ద స్క్రీన్ మీదే చూడాలని కోరుకుంటారు. అందుకే నా మూవీని థియేటర్స్లో విడుదల చేస్తాను. దీంతో సినిమా వ్యాపారం బలం పుంజుకుంటుందని నమ్ముతున్నాను.' అని అన్నారు. ఓటీటీల వల్ల ఆడియన్స్ను థియేటర్లకు రావొద్దని మనమే పరోక్షంగా చెబుతున్నామని, అందుకే సినిమాలు విజయవంతం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. 2007లో వచ్చిన 'తారే జమీన్ పర్' సినిమాకు సీక్వెల్గా ‘సితారే జమీన్ పర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. స్పోర్ట్స్ కామిడీ డ్రామాగా ఈ చిత్రం రానుంది. -
'మార్కో' హీరో ఉన్ని ముకుందన్పై ఫిర్యాదు
మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్(Unni Mukundan)పై పోలీసులకు ఫిర్యాదు అందింది. తన మాజీ మేనేజర్ విపిన్ కుమార్ కొచ్చిలోని ఇన్ఫోపార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చాలా కాలంగా ఉన్ని ముకుందన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆయన పోలీసులకు తెలిపారు. అయితే, ఉన్ని ముకుందన్ వాంగ్మూలం కూడా తీసుకున్న తర్వాతే అతనిపై కేసు నమోదు చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఉన్ని ముకుందన్ రీసెంట్గా మార్కో సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందారు. తెలుగులో జనతా గ్యారేజ్, ఖిలాడి, యశోద చిత్రాల్లో ఆయన యాక్ట్ చేశాడు.విపిన్ కుమార్ ఒకప్పుడు ఉన్ని ముకుందన్ వద్ద మేనేజర్గా పనిచేశాడు. ఆయన సినిమాకు సంబంధించిన అన్ని షెడ్యూల్స్తో పాటు తన రెమ్యునరేషన్ వంటి వివరాలను కూడా ఆయనే చూసుకునే వాడు. అయితే, కొద్దిరోజుల క్రితం పల కారణాల వల్ల విపిన్ను మేనేజర్గా నటుడు ముకుందన్ తొలగించాడు. అయితే, తనపై నటుడు ఉన్ని ముకుందన్ దాడి చేపించారని విపిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'నటుడి అనుచరులు నా ఫ్లాట్ వద్దకు వచ్చారు. నన్ను పార్కింగ్ ఏరియాకు పిలిపించి దాడి చేశారు. వారు నా ఇంటి అద్దాలను కూడా పగలగొట్టారు. తన వరుస సినిమాలు పరాజయం పాలవడంతో ఉన్ని నిరాశలో ఉన్నాడు. ఆ బాధను చాలా మందిపై మోపుతున్నాడు. నేను కూడా ఒక చిత్రనిర్మాతను అనే విషయం మరిచిపోతున్నాడు. ఆయన చాలా సినిమాలకు నేను పనిచేశాను. అతని కొత్త సినిమా 'నరివెట్ట' గురించి నేను మాట్లాడినందుకే దాడి చేశారు. అతని(ఉన్ని ముకుందన్) గురించి చెప్పడానికి నా వద్ద చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ తర్వాత చెబుతాను.' అని పోలీసుల వాంగ్మూలంలో విపిన్ తెలిపారు. కానీ, ఉన్ని ముకుందన్పై సోషల్మీడియాలో చాలా నీచమైన పోస్టులను విపిన్ కుమార్ షేర్ చేశారని, అందుకే ఆయన అభిమానులు దాడి చేశారని కొందరు చెబుతున్నారు. ఈ కేసు గురించి హీరో కానీ అతని పీఆర్ టీమ్ గానీ స్పందించలేదు. -
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
'యానిమల్' సినిమా తర్వాత బాలీవుడ్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్థాయి పెరిగిపోయింది. త్వరలో స్పిరిట్ సినిమాతో రానున్నాడు. రీసెంట్గా ప్రభాస్ సరసన అందులో నటించబోయే హీరోయిన్ను కూడా పరిచయం చేశాడు. అయితే, తాజాగా బాలీవుడ్ పీఆర్ టీమ్ను ఉద్దేశించి ఆయనొక సంచలన ట్వీట్ చేశారు. ఆయన పేరు చెబితే చాలు కొంతమంది బాలీవుడ్ జనాలు షేకైపోతారు. ఒక్కోసారి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినా సరే అక్కడి వారికి సరైన నిద్ర కూడా పట్టదు. టాలెంట్ ఉంటే ఎవరికీ తల వంచాల్సిన పనిలేదని బాలీవుడ్కు రుచి చూపించిన దర్శకుడు. ఆయన తెరకెక్కించిన కబీర్ సింగ్, యానిమల్ సినిమాలపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఎలాంటి బెరుకు లేకుండా సింగిల్గానే ఎదుర్కొని తానేంటో బాలీవుడ్కు చూపించాడు. ఇప్పుడు తాజాగా మరోసారి తనదైన స్టైల్లో పంచ్ ఇచ్చాడు.సందీప్ రెడ్డి కొత్త సినిమా ‘స్పిరిట్’ త్వరలో ప్రారంభం కానుంది. అయితే, బాలీవుడ్ పీఆర్ టీమ్స్ ఆయన్ను అప్పుడే టార్గెట్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్గా దీపికా పదుకునే( Deepika Padukone) ఎంపిక అయిందని వార్తలు వచ్చాయి. కానీ, ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వైరల్ అయిన వెంటనే బాలీవుడ్ మీడియా రంగంలోకి దిగింది. సందీప్ను టార్గెట్ చేస్తూ.. బాలీవుడ్ మీడియాలో వరుసగా కథనాలు మొదలయ్యాయి. సందీప్ పెట్టిన కండిషన్లకు దీపికా ఒప్పుకోలేదని, మితి మీరిని గ్లామర్ సీన్లు ఉండటం వల్లే ఆమె తప్పుకున్నట్లు అక్కడి మీడియా ప్రచురించింది. కథలో ఎక్కువగా 'ఎ' రేటెడ్ సీన్లు ఉన్నాయని, అవి నచ్చకనే స్పిరిట్ సినిమా నుంచి ఆమె తప్పుకుందని కథనాలు రాశారు. సందీప్కు సినిమాలు తీయడం చేతకాదంటూ.. అతనొక అన్ ప్రొఫెషనల్ డైరెక్టర్ వంటి స్టోరీస్ ప్రచురించారు. వాళ్ల పీఆర్ స్టంట్స్కు సందీప్ బెదిరిపోయే రకం కాదు. పరోక్షంగా దీపికా పదుకొనేకు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.ఇదే మీ ఫెమినిజమా..?దర్శకుడిగా కొద్దిరోజుల క్రితం ప్రముఖ హీరోయిన్కు నేను కథ చెప్పాను. అలా చేశానంటే అది పూర్తి నమ్మకంతోనే అని గుర్తించాలి. కానీ, వాళ్లు మాత్రం నా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కథను బయటకు చెప్పిన ఆ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. నటీనటులకు మేము స్టోరీని చెప్పామంటే వారు ఎవరితోనూ చెప్పకూడదనే అనధికారిక అగ్రిమెంట్ ఉన్నట్లు లెక్క. దానిని కూడా ఆ నటి ఉల్లంఘించారు. చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుంచి తప్పుకున్నారా..? మీ స్త్రీ వాదం దీనినే సూచిస్తుందా..? ఒక యంగ్ యాక్టర్ను తక్కువ చేసి మీ పీఆర్ టీమ్ ప్రస్తావిస్తుంది. ఫెమినిజం అంటే ఇదేనా..? ఒక సినిమా దర్శకుడిగా కథ రాసుకునేందుకు నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. నాకు, సినిమానే ప్రతిదీ. మీరు ఎప్పిటికీ దానిని పొందలేరు. నా సినిమా మొత్తం కథను మీరు లీక్ చేసినా నాకు పోయేదేమీ లేదు.' అని డర్టీ పీఆర్ గేమ్స్ #dirtyPRgames అనే హ్యాష్ ట్యాగ్ను సందీప్ జోడించాడు. దీపికా పదుకొనే గురించే సందీప్ ఈ ట్వీట్ చేశాడని నెటిజన్లు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. అందుకే ఆమె ఫోటోను సందీప్ కామెంట్ బాక్స్లో షేర్ చేస్తున్నారు.When I narrate a story to an actor, I place 100% faith. There is an unsaid NDA(Non Disclosure Agreement) between us. But by doing this, You've 'DISCLOSED' the person that you are....Putting down a Younger actor and ousting my story? Is this what your feminism stands for ? As a…— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 26, 2025 -
కన్నప్ప చిత్రం హార్డ్డ్రైవ్తో యువతి పరార్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప మూవీకి సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన హార్డ్ డ్రైవ్ మాయమైన సంఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముంబైకి చెందిన వీఎఫ్ఎక్స్ విక్రేతల్లో ఒకరు (హైవ్ స్టూడియోస్) కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్ను డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిలింనగర్లోని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి పంపించారు. డీటీడీసీ డెలివరీ రికార్డుల ప్రకారం పార్శిల్ ఈ నెల 25న కార్యాలయానికి చేరుకుంది. పార్శిల్ అందుకున్న ఆఫీస్బాయ్ రఘు దానిని చరిత అనే యువతికి అప్పగించాడు. కార్యాలయ సిబ్బంది క్రాంతి హార్డ్డ్రైవ్ విషయమై రఘును ప్రశ్నించగా తాను చరితకు ఇచ్చినట్లు చెప్పాడు. అయితే చరిత హార్డ్డ్రైవ్ తీసుకున్నప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతోంది. కొందరు వ్యక్తుల మార్గదర్శకత్వంలో పని చేస్తున్న చరిత సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా పోయిందంటూ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రెడ్డి విజయ్కుమార్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా తమ సినిమా ప్రాజెక్టుకు తీవ్ర అంతరాయం కలిగించిందన్నారు. సదరు హార్డ్డ్రైవ్లో కన్నప్ప చిత్రానికి సంబంధించి విడుదల చేయని, గోప్యమైన, అత్యంత సున్నితమైన డేటా ఉందన్నారు. ఈ కంటెంట్ను లీక్ చేయడం లేదా, డిలీట్ చేయడం ద్వారా తమ సంస్థ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే హార్డ్డ్రైవ్ను రికవరీ చేసి తమకు అప్పగించాలని కోరారు. -
భైరవంకి అది ప్లస్ అవుతుంది: అనిల్ రావిపూడి
‘‘ముగ్గురు హీరోలు కలిసి ఓ సినిమా చేస్తున్నప్పుడు ముందుగా పక్కన పెట్టాల్సింది అహం. సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్లను చూస్తే అహంని పక్కనపెట్టి ‘భైరవం’ చిత్రం చేసినట్లు అనిపిస్తోంది. బ్రదర్స్లాగా చాలా కలిసిపోయి ప్రమోషన్స్ చేస్తున్నారు. అది ఈ సినిమాకి కచ్చితంగా ప్లస్ అవుతుంది’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన చిత్రం ‘భైరవం’. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు. పెన్ స్టూడియోస్పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, సంపత్ నంది, నిర్మాత బెల్లంకొండ సురేష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘ఈ ముగ్గురు హీరోలు కష్టాలు చూసి నిలబడ్డారు. ఈ సినిమాని అందరూ థియేటర్స్లో చూడండి’’ అని చెప్పారు. ‘‘భైరవం’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు బెల్లంకొండ సురేష్. కేకే రాధామోహన్ మాట్లాడుతూ–‘‘మా సినిమా ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు.‘‘ఒక మంచి సినిమా చూశామనే సంతృప్తిని ‘భైరవం’ ఇస్తుంది’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పారు. ‘‘ఈ సినిమా విజయం సాధించాలని మా యూనిట్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది’’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రాన్ని చూసి, మమ్మల్ని ఆశీర్వదించండి’’ అన్నారు నారా రోహిత్. ‘‘ఈ సినిమా ఆడియన్స్ కి నెక్ట్స్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది’’ అని విజయ్ కనక మేడల తెలి΄ారు. ఈ వేడుకలో ఆనంది, దివ్య పిళ్లై, సంగీత దర్శకుడు శ్రీ చరణ్పాకాల, నటుడు అజయ్ మాట్లాడారు. -
జోడీ కుదిరిందా?
‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత హీరో వెంకటేశ్ నటించనున్న చిత్రం ఏంటి? అనే విషయంపై స్పష్టత లేదు. అయితే హీరో వెంకటేశ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందనే ప్రచారం ఇండస్ట్రీలో చాలా రోజులుగా జరుగుతూ ఉంది. అయితే ఈ కాంబినేషన్పై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ వెంకటేశ్ తర్వాతి చిత్రం మాత్రం త్రివిక్రమ్తోనే అని ఫిల్మ్నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ సినిమా ప్రారంభం అవుతుందనుకున్నారంతా.అయితే తమిళ దర్శకుడు అట్లీ సినిమాకి ఓకే చెప్పారు అల్లు అర్జున్. జూన్లో సెట్స్పైకి వెళ్లనున్న ఈ సినిమా పూర్తవడానికి కనీసం ఏడాది అయినా పడుతుంది. అప్పటి వరకూ ఖాళీగా ఉండటం ఇష్టం లేని త్రివిక్రమ్.. వెంకటేశ్ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టారని టాక్. ఈ సినిమాలో వెంకటేశ్కి జోడీగా రుక్మిణీ వసంత్ నటించనున్నారని సమాచారం.హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా జూన్ 6న అధికారికంగా ప్రారంభం కానుందని ఫిల్మ్నగర్ టాక్. ఈ చిత్రంలో వెంకటేశ్కి జోడీగా రుక్ష్మిణీ వసంత్ని ఎంపిక చేశారట. నిఖిల్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’(2024) సినిమాతో రుక్మిణీ వసంత్ తెలుగుకి పరిచయమయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. -
లంగా ఓణీలో విష్ణుప్రియ.. శ్రీలంక ట్రిప్లో అనసూయ
ఫ్యామిలీతో కలిసి శ్రీలంక వెళ్లిన అనసూయలంగా ఓణీలో కిక్కిచ్చేలా కనిపిస్తున్న విష్ణుప్రియనాభి అందాలతో మైమరిపిస్తున్న సిమ్రాన్ చౌదరిపిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చిన అన్షుఒంపుసొంపులతో కేక పుట్టిస్తున్న నభా నటేశ్ప్రెగ్నెన్నీలో లావణ్య.. బుక్ చదువుతూ వీకెండ్ ఎంజాయ్చీరలో బ్యాక్ పోజులతో మెరిసిపోతున్న ఈషా రెబ్బా View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Abhirami (@abhiramiact) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) -
సంక్రాంతి బరిలో టాలీవుడ్ యంగ్ హీరో చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం అనగనగా ఒక రోజు. ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ సంక్రాంతికి దద్దరిల్లే నవ్వులని ఆనందాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 14న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ తర్వాత నవీన్ పోలిశెట్టి నటిస్తోన్న చిత్రం ఇదే కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రీ వెడ్డింగ్ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. The Star Entertainer @NaveenPolishety is back with a hilarious family entertainer this Sankranthi 😎#AnaganagaOkaRaju is blasting into theatres - January 14th, 2026 ❤️🔥ఈ సంక్రాంతికి దద్దరిల్లే నవ్వులని ఆనందాన్ని తీసుకొస్తున్నాము….#AOROnJan14th 💫 #NaveenPolishetty4… pic.twitter.com/bsi37OZK77— Sithara Entertainments (@SitharaEnts) May 26, 2025 -
కొంతమంది చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు: దిల్ రాజు
ప్రస్తుతం టాలీవుడ్లో థియేటర్ల సమస్య నడుస్తోంది. థియేటర్ల యజమానులు, సినిమాలు తీస్తున్న నిర్మాతల మధ్య పర్సంటేజ్ విషయమై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. దీన్ని కాసేపు అలా పక్కనబెడితే రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టగా.. నిర్మాత అల్లు అరవింద్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు సోమవారం.. దిల్ రాజు మీడియా ముందుకొచ్చారు.సినిమా ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదేనని దిల్ రాజు అన్నారు. ఇండస్ట్రీలో సమన్వయం లేదని, ఎవరికీ తోచినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. 250 థియేటర్లు ఓనర్స్, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారు. 'ఆ నలుగురు' అంటూ మీడియా ఇష్టమొచ్చినట్లు రాస్తోందని, అందుకే ఈ విషయమై క్లారిటీ ఇద్దామని ఇప్పుడు మాట్లాడుతున్నానని దిల్ రాజు స్పష్టం చేశారు.(ఇదీ చదవండి: థియేటర్ల బంద్.. ఆ విషయంలోనే వివాదం మొదలైంది: దిల్ రాజు)ఇదే ప్రెస్ మీట్లో మాట్లాడిన దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ పైరసీ కావడం, ఓ నిర్మాత చేసిన కామెంట్స్ గురించి చెప్పుకొచ్చారు. 'గేమ్ ఛేంజర్ విడుదలైన రోజే పైరసీ ప్రింట్ వచ్చింది. కానీ ఓ మాజీ నిర్మాత.. ప్రొడ్యూసరే ఈ సినిమాని కావాలనే పైరసీ చేశాడని అన్నాడు. ఇది ఎంత నీచం? నా సినిమా నేను కాపాడుకుంటాను కానీ పైరసీ చేసుకుంటానా? కొంతమంది చాలా నీచంగా బిహేవ్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాని నేను పైరసీ చేసుకుంటానా? పైరసీ చేస్తే ప్రొడ్యూసర్గా నాకు నష్టం కాదా? డిస్ట్రిబ్యూటర్కు నష్టం కాదా? బుద్ధి ఉన్నోడు ఎవడైనా తన ఇంట్లో మనిషిని చంపుకుందాం అనుకుంటాడా?' అని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన గేమ్ ఛేంజర్ సినిమా.. దారుణమైన డిజాస్టర్ అయింది. తొలిరోజే ఘనంగా రూ.186 కోట్ల కలెక్షన్స్ అని పోస్టర్ రిలీజ్ చేశారు గానీ దీనిపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. రిలీజైన ఇన్నాళ్లు అవుతున్నాసరే ఏదోలా మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇప్పుడు స్వయంగా చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా తను ఎదుర్కొన్న బాధని బయటపెట్టారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్) -
థియేటర్ల బంద్.. ఆ విషయంలోనే వివాదం మొదలైంది: దిల్ రాజు
థియేటర్ల వివాదంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదేనని అన్నారు. ఇండస్ట్రీలో సమన్వయం లేదని దిల్ రాజు వెల్లడించారు. ఎవరికీ తోచినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తొలి రోజే నా సినిమా గేమ్ ఛేంజర్ను పైరసీ చేశారని దిల్ రాజు ఆరోపించారు. మా సినిమాను పైరసీ చేసిన వాళ్లలో మరో నిర్మాత కూడా ఉండొచ్చని దిల్ రాజు అన్నారు. దాదాపు 56 రోజులు షూటింగ్లు ఆపి నిర్మాతలు ఏం సాధించలేకపోయారని అన్నారు. థియేటర్ల మూసివేతపై తప్పుడు ప్రచారం జరిగిందని దిల్ రాజు తెలిపారు. సినిమా వాళ్లకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముఖ్యమేనని మాట్లాడారు. పవన్ కల్యాణ్ సినిమాను ఎవరూ ఆపడం లేదన్నారు. ఎగ్జిబిటర్ల కష్టాలు తమకు తెలుసని.. పర్సంటేజీ విధానం ఉంటే బాగుంటుందని కొందరు చెప్పారని తెలిపారు. కానీ పర్సంటేజీ విధానంలోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని దిల్ రాజు పేర్కొన్నారు. రెంట్, పర్సంటేజ్ విధానంలో ఆడే థియేటర్ల విషయంలోనే వివాదం మొదలైందని దిల్ రాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో ఈ సమస్య తెరపైకి వచ్చిందని వెల్లడించారు.దిల్ రాజు మాట్లాడుతూ..'ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ లేదా పర్సంటేజ్ విధానం నడుస్తోంది. మొదటి వారం బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాం. సెకండ్ వీక్ కలెక్షన్లు తగ్గగానే పర్సంటేజ్ ఇస్తున్నాం. అది వాళ్లకు కష్టమని మా అందరికీ తెలుసు. దీనిపై చర్చిస్తున్నాం. కానీ సమస్య ఓ కొలిక్కి రాలేదు. నైజాంలో 370 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే.. ఎస్వీసీఎస్ సహా మా వద్ద ఉన్న థియేటర్లు 30 మాత్రమే. ఏషియన్, సురేశ్ కంపెనీలో 90 ఉన్నాయి. 250 థియేటర్లు ఓనర్లు, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారు. ఆ నలుగురు అంటూ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తోందని ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నాం. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు' అని అన్నారు. -
లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ కమెడియన్.. ఎన్ని కోట్లో తెలుసా?
వైవా అనే షార్ట్ ఫిల్మ్తో గుర్తింపు తెచ్చుకున్న హర్ష.. తర్వాత తర్వాత తెలుగులో పలు సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. గతేడాది 'సుందరం మాస్టర్' అనే మూవీలో హీరోగానూ నటించాడు. ప్రస్తుతానికైతే మోగ్లీ, బకాసుర రెస్టారెంట్ అనే చిత్రాలు చేస్తున్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే కార్లు, బైక్స్ అంటే ఇతడికి తెగ పిచ్చి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఖరీదైన లగ్జరీ కారుని కొనుగోలు చేశాడు.కమెడియన్గా హర్ష అందరికీ తెలుసు. కానీ వీలుచిక్కినప్పుడల్లా స్పోర్ట్స్ బైక్స్ వేసుకుని ఫ్రెండ్స్తో కలిసి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటాడు. ఆ బైక్స్ అన్నీ కూడా రూ.20 లక్షలు, రూ.30 లక్షలు విలువ చేసేవే. ఇప్పుడు వాటికి తోడు బీఎండబ్ల్యూ ఎఫ్87 ఎమ్2 కాంపిటీషన్ కారు కొనుగోలు చేశాడు. ఈ మేరకు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)హైదరాబాద్ మార్కెట్ లో ఈ కారు ధర రూ.కోటి 30 లక్షల నుంచి రూ.కోటి 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే సినిమాలు చేస్తూ సంపాదిస్తున్న హర్ష.. వాటిని కార్స్, బైక్స్ కొనడానికే ఖర్చు పెడుతున్నాడేమో అనిపిస్తుంది.హర్ష వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2021లో అక్షర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటికప్పుడు ఈమెతో దిగిన ఫొటోలని పోస్టూ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతానికైతే కెరీర్ పరంగా హర్ష ఫామ్లో ఉన్నాడు.(ఇదీ చదవండి: బాలకృష్ణతో పవన్ పోరు.. వార్ తప్పదు) View this post on Instagram A post shared by TURBO BUOY !! (@turbochemudu) -
కన్నప్పలో ప్రభాస్.. రెబల్ స్టార్ పాత్రపై మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా.. ప్రీ ప్రొడక్షన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మంచు విష్ణు.. ప్రభాస్ రోల్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్ 30 నిమిషాల పాటు అతిథి పాత్రలో కనిపిస్తారని మంచు విష్ణు తెలిపారు. కన్నప్ప 3 గంటల 10 నిమిషాల రన్టైమ్ను కలిగి ఉందని అన్నారు. కన్నప్ప పరివర్తనలో కీలక పాత్ర పోషించే దైవిక వ్యక్తిగా ప్రభాస్ నటించారని వెల్లడించారు. ఈ సినిమాను ఆధ్యాత్మిక మార్గంలో బయలుదేరే ఒక నాస్తికుడి గురించిన పౌరాణిక కథగా తెరకెక్కించినట్లు తెలిపారు. ప్రభాస్కు మోహన్ బాబుతో ముఖ్యమైన సన్నివేశాలు ఉన్నాయని వివరించారు. మోహన్ లాల్ పాత్ర 15 నిమిషాలకే పరిమితం అయినప్పటికీ.. బలమైన భావోద్వేగాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు, మోహన్లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రలలో కనిపించనున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి శ్రీ-కాళహస్తి అనే పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సాంగ్ మే 28న విడుదల కానుంది. ఈ భక్తి గీతంలో విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
నిజాయితీకి అర్థం ఉంటే అది మా సినిమానే.. 'నిలవే' హీరో సౌమిత్ రావు
సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన చిత్రం ‘నిలవే’... ఈ మూవీకి సౌమిత్ రావు, సాయి వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్పై తాహెర్ సినీ టెక్ సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి పాత్రల్ని పరిచయం చేశారు. సంతోషం, నమ్మకం, అలక, పిలుపు అంటూ అన్ని రకాల ఎమోషన్స్కు సంబంధించిన ‘నిలవే’ పోస్టర్లను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ..హీరో సౌమిత్ రావు మాట్లాడుతూ .. 'నిలవే' ఓ మంచి మ్యూజికల్ లవ్ డ్రామాగా రాబోతోంది. అంతా కొత్త వాళ్లం కలిసి చేస్తున్నాం.' మేం ఎంతో నిజాయితీతో ఈ మూవీని చేశాం. మా సినిమా బాగుందని ఆడియెన్స్ ఫీల్ అయ్యేలా చేయాలని ప్రయత్నిస్తున్నాం. మా మూవీని ఆడియెన్స్ వద్దకు తీసుకెళ్లేందుకు మీడియా సహకరించాలి. నిజాయితీకి అర్థం ఉంటే అది మా ‘నిలవే’ సినిమా. మా చిత్రం అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది’ అని అన్నారు.దర్శకుడు సాయి వెన్నం మాట్లాడుతూ .. ‘మా పేర్లు ఎవ్వరికీ తెలియకపోవచ్చు. మాది చిన్న టీం కావొచ్చు. కానీ మా కాన్సెప్ట్, మా సినిమా చాలా పెద్దగా ఉంటుంది. ఇదొక అందమైన ప్రేమ కథ. ఓ వ్యక్తి జీవితంలో జరిగే ప్రయాణమే ‘నిలవే’. మ్యూజిక్ని లవ్తో చూపించాలని అనుకున్నాం. మేం కథ పైన ప్రేమతో ఎంతో కష్టపడి ‘నిలవే’ చిత్రాన్ని తీశాం. టీజర్ చూస్తే నిజాయతీగా ఉంటుంది. ఎక్స్పోజింగ్ లేదని, డైలాగుల్లో బూతులు లేవని, వైరల్ అవ్వదని చాలా మంది చెప్పారు. కానీ మా కంటెంట్ మాత్రమే చెప్పాలని టీజర్ కట్ చేశాం. ‘నిలవే’ చాలా మంచి సినిమా. అందరూ మా సినిమాకు సపోర్ట్ చేయండి’ అని అన్నారు. -
గేమ్ ఛేంజర్కు పని చేయడం ఓ చేదు అనుభవం.. డైరెక్టర్పై విమర్శలు!
ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా పెద్దగా రాణించలేకపోయింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో అంజలి, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు.అయితే 'గేమ్ ఛేంజర్' డైరెక్టర్ శంకర్పై ఎడిటర్ షమీర్ మహమ్మద్ విమర్శలు చేశారు. ఆయనతో పని చేయడం నా జీవితంలో చేదు అనుభవమని చెప్పారు. దర్శకుడు శంకర్తో కలిసి పనిచేయడం చాలా దారుణంగా అనిపించిందని షమీర్ మహమ్మద్ వెల్లడించారు. నేను చాలా ఉత్సాహంగా అక్కడికి వెళ్తే.. నాకు అక్కడ అంతా భిన్నంగా ఉందని అన్నారు.ఎడిటర్ షమీర్ మహమ్మద్ మాట్లాడుతూ.. 'గేమ్ ఛేంజర్ కోసం దాదాపు ఒక సంవత్సరం పనిచేశా. ఆరు నెలల తర్వాత వారితో మరో నెల రోజులు ఉండాల్సి ఉంటుందని నాతో చెప్పారు. నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సినిమా నిడివి 7 గంటల నుంచి 7.30 గంటలు. దానిని మూడున్నర గంటలకు తగ్గించా. ఆ తర్వాత మరో కొత్త ఎడిటర్ వచ్చి దానిని రెండున్నర నుంచి 3 గంటలకు కుదించాడు. డైరెక్టర్ ఎడిటింగ్ కోసం ఒక తేదీని నిర్ణయించేవాడు. కానీ పది రోజుల తర్వాత మాత్రమే వచ్చేవాడు. అదే పద్ధతి చాలా రోజులు కొనసాగింది. దీంతో నేను 300-350 రోజులు చెన్నైలో ఉన్నా. అందుకే ఈ సినిమాను మధ్యలో వదిలేయాల్సి వచ్చింది" అని అన్నారు. కానీ షమీర్ ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఎడిటర్ రూబెన్ను తీసుకున్నారు. -
మ్యాడ్ స్క్వేర్ తర్వాత గ్యాంబ్లర్స్.. టీజర్ చూశారా?
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా రూపొందిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఒక ఐలాండ్లో జరిగే జూదం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. కేఎస్కే చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రశాంతి చారులింగ హీరోయిన్గా, రాకింగ్ రాకేశ్ ముఖ్యపాత్రలో నటించారు. సునీత, రాజ్కుమార్ బృందావనం నిర్మించారు. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ చూస్తే కథలో అనేక థ్రిల్లింగ్ అంశాలతో పాటు ట్విస్ట్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. -
'డకాయిట్' ఫైర్ గ్లింప్స్ విడుదల
అడివి శేష్ కొత్త సినిమా ' డకాయిట్' నుంచి ఫైర్ గ్లింప్స్ను (Dacoit Fire Glimpse) మేకర్స్ విడుదల చేశారు. షానీల్ డియో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. ఇందులో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తుంది. ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డకాయిట్’. వారు తమ జీవితాలను మార్చడానికి వరుస దోపిడీలకు ప్రణాళిక రచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది..? అన్నది ఆసక్తిగా ఉంటుంది. -
బాలకృష్ణతో పవన్ పోరు.. వార్ తప్పదు
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ (ఓజీ), బాలకృష్ణ (అఖండ 2) విడుదల కానున్నాయి. ఇప్పటికే రెండు సినిమాల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద మొదటిసారి పవన్తో బాలయ్య పోటీ పడనున్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య మరోసారి బాక్సాఫీస్ లెక్కలపై చర్చ జరగనుంది. దసరా విజేతగా ఎవరు నిలుస్తారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'సాహో'(Saaho) సినిమా తర్వాత ఆరేళ్లకు దర్శకుడు సుజిత్ (Sujith) తెరకెక్కిస్తున్న చిత్రం 'ఓజీ'.. పవన్ కల్యాణ్ గ్యాంగ్స్టర్గా ఈ చిత్రం రానుంది. దీంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ కూడా మంచి అంచనాలే పెట్టుకున్నారు. మరోవైపు అఖండకు సీక్వెల్గా బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో అఖండ2 రానుంది. ఇప్పుడు రెండు సినిమాలు ఒకేరోజున విడుదల కానున్నట్లు ప్రకటన రావడంతో కలెక్షన్స్ పరంగా ఇద్దరికీ నష్టం తప్పదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా సంయుక్త (Samyuktha) నటిస్తోంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్ చరిత్రలో భారీ అంచనాల మధ్య ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి.'ఓజీ' సినిమాను రూ. 200 కోట్ల బడ్జెట్తో నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పవన్ కల్యాణ్ కొంత కాలంగా ఎన్నికల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ ఆగిపోయింది. దీంతో మొదట అనుకున్న బడ్జెట్ కాస్త పెరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా ఓజీ నిర్మాణం కోసం రూ. 250 కోట్లు పైగానే ఖర్చు చేసినట్లు సమాచారం. మరోవైపు అఖండ2 కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ చిత్రం కూడా రూ. 200 కోట్లతో తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇలా అత్యంత బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రాలు ఒకేరోజు విడుదలైతే తప్పకుండా థియేటర్స్ విషయంలో ఇబ్బందులు రావచ్చు. -
ఓటీటీలో రెట్రో.. ప్రకటన వచ్చేసింది
సూర్య హిట్ సినిమా రెట్రో(Retro) ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సూర్య(Suriya) కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాదిలో భారీ అంచనాలతో విడుదలైన ‘కంగువా’ చిత్రం సూర్య (Suriya)కు చేదు అనుభవాన్ని మిగిల్చినా రెట్రో మాత్రం ఆ లోటును తీర్చింది. అయితే, తెలుగులో అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా మే 1న రెట్రో విడుదలైంది. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించగా.. జోజూ జార్జ్, జయరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. యాక్షన్తో పాటు, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్స్టర్గా సూర్య ఇందులో నటించాడు.రెట్రో సినిమా మే 31న ఓటీటీలోకి రానున్నట్లు నెట్ఫ్లిక్స్(Netflix) అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ కానుంది. రెట్రో సినిమా 18 రోజుల్లో రూ. 235 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సూర్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా మొదటి స్థానంలో రెట్రో ఉంది. ఆ తర్వాత 24 మూవీ రూ. 157 కోట్లు, సింగం2 రూ. 122 కోట్లు, కంగువా రూ. 106 కోట్లు, 7th సెన్స్ రూ. 113 కోట్లు, సికిందర్ రూ. 95 కోట్లతో వరుసగా ఉన్నాయి. అయితే, ఈ మూవీ ఫైనల్గా రూ. 250 కోట్ల కలెక్షన్స్ దాటిందని సినీ వర్గాలు అంచనా వేశాయి.కథేంటంటే..గ్యాంగ్స్టర్ తిలకన్ (జోజు జార్జ్) కొడుకులా పెంచుకున్న పారివేల్ కన్నన్ (సూర్య)తో గ్యాంగ్స్టర్స్గా ఒక సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకుని చలామణి సాగిస్తుంటారు. ఒక ఢీల్(గోల్డ్ఫిష్) విషయంలో ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. దీంతో పెంచిన తండ్రితో తెగదెంపులు చేసుకుని తాను ప్రేమించిన రుక్మిణి (పూజా హెగ్డే)తో జీవితాన్ని గడపాలనుకుంటాడు. ఈ క్రమంలో తిలకన్ వల్ల పారివేల్ కన్నన్ ఐదేళ్లు జైలుకు వెళ్తాడు. దీంతో గొడవలు అంటే నచ్చని రుక్మిణి అతని జీవితం నుంచి వెళ్లిపోతుంది. ఆమె ఆచూకి వివరాలు తెలుసుకోవాలని తన గ్యాంగ్ను కోరతాడు పారివేల్. చివరికి ఆమె అండమాన్లకు దూరంగా ఒక ఐల్యాండ్లో ఉన్నట్లు వివరాలు తెలుసుకుంటారు. ఆమెను ఎలాగైనా కలుసుకోవాలని జైలు నుంచి తప్పించుకున్న పారివేల్ ఆమె ఉన్న చోటుకు వెళ్తాడు. అదే సమయంలో తనను పెంచిన తండ్రి తిలకన్ కూడా ఒక ఢీల్కు సంబంధించి అదే ఐలాండ్కు చేరుకుంటాడు.అయితే, అప్పటికే అక్కడ ఒక పెద్ద గ్యాంగ్తో రాజ్వేల్ దొర (నాజర్) అతని కుమారుడు మైఖేల్ ఉంటారు. అక్కడి ప్రజలను తమ గుప్పెట్లో పెట్టుకుని అనేక దారుణాలు చేస్తుంటారు. వారితో ఒక ఢీల్ సెట్ చేసుకుని తిలకన్ అక్కడికి చేరుకుంటాడు. తన ప్రియురాలు రుక్మిణి కోసం పారివేల్ ఆ ప్రాంతంలో అడుగుపెట్టగానే మళ్లీ గ్యాంగ్ వార్ మొదలౌతుంది. అక్కడి నుంచి గోల్డ్ఫిష్ వేట కొనసాగుతుంది. ఇంతకీ గోల్డ్ఫిష్ సీక్రెట్ ఏంటి..? దాని కోసం పెంచిన కొడుకునే తండ్రి చంపాలని ఎందుకు అనుకుంటాడు..? అనాధగా ఉన్న పారివేల్కు ఆ ఐల్యాండ్తో ఉన్న గత సంబంధం ఏంటి..? పారివేల్ జన్మించక ముందే రాజ్వేల్ దొర (నాజర్)తో ఉన్న లింక్ ఏంటి..? ఫైనల్గా రుక్మిణిని పారివేల్ పెళ్లి చేసుకుంటాడా..? అనేది తెలియాలంటే రెట్రో చూడాల్సిందే. -
'థగ్ లైఫ్' వేదికపై అదిరిపోయే సాంగ్ పాడిన శ్రుతి హాసన్
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'థగ్ లైఫ్'.. జూన్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తాజాగా చెన్నైలో ఆడియో రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కమల్ కుమార్తె నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) పాల్గొన్నారు. వేదికపై ఒక పాట పాడి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఆ సాంగ్ నెట్టింట ట్రెండింగ్లో ఉంది. థగ్ లైఫ్ నుంచి 'విన్వెళి నాయగ' (Vinveli Nayaga) అనే తమిళ వర్షన్ పాటను వేదికపై ఆమె ఆలపించారు. సినిమాలో కూడా సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్తో కలిసి ఆమె ఆలపించారు. ఇందులో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. -
అనిల్ రావిపూడి స్పీడ్కు చిరంజీవి బ్రేకులు.. కారణం ఇదేనా?
సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడంలో దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన సినిమా ప్రకటన నుంచే అదిరిపోయే ప్రమోషన్స్లతో ప్రేక్షకుల అభిరుచిని పట్టేస్తాడు. ఈ క్రమంలో నటీనటులతో ఆయన కూడా ప్రమోషన్స్లో పాల్గొని, నవ్వులు పంచుతూ ఆయా చిత్రాలపై ఆసక్తి రేకెత్తిస్తుంటారు. అలాంటి మ్యాజిక్ చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మారుమూల ప్రాంతం వారికి కూడా కనెక్ట్ అయ్యేలా చేశాడు. అయితే, తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో (MEGA157) సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో అనిల్ దూకుడుతో అదరగొడుతున్నాడు. అయితే, దానికి కాస్త బ్రేక్ ఇవ్వాలని చిరు కోరారట. కావాలంటే కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ మొదలు పెట్టమని సూచించారట.అనిల్ రావిపూడి స్పీడ్కు చిరు బ్రేకులు వేయడం వెనుక కూడా కారణం ఉందని తెలుస్తోంది. చిరు కొత్త సినిమా విశ్వంభర( Vishwambhara) త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ పట్ల మొదట్లో భారీ అంచనాలే ఉండేవి. కానీ, ప్రస్తుతం చిరు అభిమానుల్లో కూడా సినిమాపై అంతగా ఆసక్తి లేదని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి తన సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ వల్ల విశ్వంభర మీద ప్రభావం పడుతుంది. అందరూ మెగా157 ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. నయనతారతో ప్రమోషన్స్ ఆపై సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో చిరు కళ్ళమీద క్లాప్ కొట్టి దాని చిన్న క్లిప్ రూపంలో వదలడం.. ఇలాంటివి అన్నీ మెగా ఫ్యాన్స్లో జోష్ నింపుతున్నాయి. కానీ, విశ్వంభరపై అలాంటి జోష్ కనిపించడం లేదు. అందుకే అనిల్ను కాస్త బ్రేక్ తీసుకోవాలని చిరు సూచించారట.విశ్వంభర టీజర్ తర్వాత ఎలాంటి పబ్లిసిటీని ఆ మూవీ మేకర్స్ చయలేదు. అయితే, ఈ సినిమా దర్శకుడు వశిష్ఠపై ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. తప్పకుండా హిట్ అవుతుందని సాధారణ ప్రేక్షకులలో కూడా అంచనాలు ఉన్నాయి. కానీ, ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచితేనే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో నిర్మాత విక్రమ్ రెడ్డి ఒక బుక్ లాంచ్ చేసి ఫోటోలు విడుదల చేశారు. కానీ, అందులో ఉన్న సారాంశం ఎంటి..? దాని ప్రత్యేకత ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. ఇలా అయితే ఎలా అంటూ విశ్వంభర ప్రమోషన్స్లో వేగం పెరగాలని అభిమానులు కూడా కోరుతున్నారు. సినిమా విడుదల విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జులైలో విడుదల కావచ్చు అనే టాక్ అయితే వస్తుంది. -
రింగ్లో దిగనున్న 'కరాటే కిడ్: లెజెండ్స్'.. ఎప్పుడంటే
హాలీవుడ్ చిత్రాలకు భారతీయ సినీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి, ఆదరణ ఉంటుంది. అలా ఇంతకుముందు వచ్చిన కరాటే కిడ్ 5 ఫ్రాంచైజ్ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆలరించాయి. తాజాగా ఆ కోవలో వస్తున్న చిత్రం కరాటే కిడ్: లెజెండ్స్. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఈనెల 30న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇందులో డేనియల్ లారుస్సోగా ప్రధాన పాత్రను పోషించిన రాల్ఫ్ మాచియో తన భావాలను పంచుకుంటూ కరాటే కిడ్: లెజెండ్స్ చిత్రంలో మరోసారి లారుస్సో పాత్రలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో జాకీచాన్, మిస్టర్ హాన్లతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. ఒక నటుడుగా, ఎంటర్టైనర్గా జాకీచాన్ పట్ల తనకు ఎంతో గౌరవం అన్నారు. ఈ రంగంలో ఆయన ఒక లెజెండ్ అని, చిత్రాల్లో మార్షల్ ఆర్ట్స్, కామెడీ సన్నివేశాల్లో నటించడంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. అదే విధంగా మిస్టర్ మియాగి అంటే కూడా తనకు చాలా గౌరవం అని రాల్ఫ్ మాచియో చెప్పారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లిష్ ,తమిళం, తెలుగు భాషల్లో మే 30వ తేదీన తెరపైకి రానుంది. -
ఆ నలుగురిలో నేను లేను
సాక్షి, హైదరాబాద్: ‘రెండ్రోజుల నుంచి ఆ నలుగురు.. ఆ నలుగురు అని వినిపిస్తోంది. ఆ నలుగురుకి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. పదిహేనేళ్ల క్రితం ఆ నలుగురు అని మొదలైంది. ఆ తర్వాత ఆ నలుగురు కాస్తా పదైంది. అది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓ పది మంది దగ్గర థియేటర్లు ఉన్నాయి. ఆ నలుగురి వ్యాపారంలో నేను లేను. కోవిడ్ టైమ్ నుంచే నేను బయటకు వచ్చాను. తెలుగు రాష్ట్రాల్లో 1,500 థియేటర్లు ఉన్నాయి. కానీ.. తెలంగాణలో నాకున్నది ఒకే ఒక్క థియేటర్. ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నింటినీ వదిలేసుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం 15లోపు థియేటర్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. వీటి లీజులు అయిపోయిన తర్వాత రెన్యువల్ చేయొద్దని నా సిబ్బందితో చెప్పాను. పాత అలవాటు ప్రకారం ఆ నలుగురిలో నా ఫొటోను వాడుకుంటున్నారు. నన్ను విమర్శిస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు ఆ నలుగురు న్యూస్లో నన్ను కలపకండి. నేను వాళ్లలో లేను. వారితో వ్యాపారంలో లేను’అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం థియేటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సెక్టార్స్లో థియేటర్ల రెవెన్యూ షేరింగ్, థియేటర్స్లో అద్దె చెల్లింపులు వంటి అంశాల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ను మూసివేస్తారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించిన విధానం చాలా సమంజసంగా ఉందని నాకనిపించింది. ఇక ఈ థియేటర్స్ క్లోజ్ అంశానికి సంబంధించి ఇటీవల జరిగిన సమావేశాలకు నేను కావాలని, ఇష్టం లేకనే వెళ్లలేదు. అలాగే నా గీతా డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వ్యక్తులు కానీ, నాతో అసోసియేట్ అయిన వ్యక్తులు కానీ ఈ మీటింగ్కు వెళ్లొద్దని చెప్పాను. థియేటర్స్కు చాలా కష్టాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ కొందరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై నాకు చిరాకు కలిగి వెళ్లలేదు. థియేటర్లు మూసివేస్తున్నాం అనడం సరైంది కాదు. పవన్కళ్యాణ్ సినిమా విడుదల సమయంలో థియేటర్లు మూసివేస్తామని చెప్పడం దుస్సాహసం. గతంలో అశ్వనీదత్ సినిమా విషయంలో పవన్ను కలిశాం. అప్పుడు ఆయన ఫిల్మ్ చాంబర్ తరపున వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబును కలవండన్నట్టు హింట్ ఇచ్చారు. అయితే మన వాళ్లు పట్టించుకోలేదు. ఆ విషయాన్ని విస్మరించారు. అధికారికంగా అందరం కలవాలి. కానీ కలవలేదు. ఎవరో ఇటీవల మనది ప్రభుత్వానికి సంబంధం లేని రంగం అని అంటుంటే విన్నాను. ప్రభుత్వానికి సంబంధం లేని పరిశ్రమ అయితే గత చీఫ్ మినిస్టర్ను సినీ పరిశ్రమలోని పెద్దపెద్ద వాళ్లంతా వెళ్లి ఎందుకు కలిశారు? ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని వెళ్లి కలవకపోవడం సరికాదు. మనకు కష్టం వస్తే తప్ప మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్లమా? నిజంగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి తప్ప.. ఇలా థియేటర్స్ మూసివేస్తున్నామని చెప్పడం సరికాదు’అని అరవింద్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యల్ని అరవింద్ ఖండించారంటున్న నెటిజన్లు ‘ప్రైవేట్ పెట్టుబడితో మేం సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటాదేంటి’అని గత ప్రభుత్వ హయాంలో పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఏ వ్యాపారమైనా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఏంటి. మాది ప్రైవేట్ వ్యాపారం అనడం సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. ప్రభుత్వం కో–ఆపరేషన్ కావాలి’అంటు అరవింద్ తాజాగా చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని అల్లు అరవింద్ పరోక్షంగా ఖండించినట్టు ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు.. తాజాగా అరవింద్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్ను జతచేసి సోషల్ మీడియా వేదికలపై వైరల్ చేస్తున్నారు.