breaking news
Tollywood
-
పవర్ఫుల్ అబ్దాలి
విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది.ఈ సినిమాలో అబ్దాలిగా ‘ఫైటర్’ మూవీ ఫేమ్ రిషబ్ సాహ్నీ చేస్తున్న లుక్ని రిలీజ్ చేశారు. ‘‘ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి అనే పవర్ఫుల్ పాత్రను చేస్తున్నారు రిషబ్ సాహ్నీ. 1750 బ్యాక్డ్రాప్లోని ఈ చిత్రంలో భారత్లో అబ్దాలీ చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపిడీ, అపార సంపద కోసం అతడు చేసిన క్రూర ప్రయత్నాలను ఈ పాత్రలో చూపించనున్నాం. ఈ నెల 15న టీజర్ని విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
ఇది సీరియస్ మేటర్
తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్ ఖరారైంది. ‘డోన్ట్ లాఫ్... ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ (నవ్వొద్దు... ఇది సీరియస్ మేటర్) అనేది ఈ సినిమా క్యాప్షన్. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.దర్శకుడు పవన్ సాధినేని సమర్పణలో కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో కల్యాణ చక్రవర్తి మంతిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయిందని యూనిట్ పేర్కొంది. శుక్రవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేసి, టీజర్ను ఈ నెల 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ‘‘పొలిటికల్ సెటైర్, క్రైమ్, కామెడీ వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం స్వీకర్ అగస్తీ. -
జోడీ రిపీట్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ రష్మికా మందన్నా జోడీ రిపీట్ కానుందని సమాచారం. హోమీ అడజానియా దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’లో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రంలో కృతీ సనన్ మరో హీరోయిన్గా చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. అయితే తాజాగా మరో రొమాంటిక్ కామెడీ మూవీలో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది.హిందీలో ‘బదాయి హో, మైదాన్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అమిత్ శర్మ ఓ రొమాంటిక్ కామెడీ కథను రెడీ చేసి, షాహిద్ కపూర్కు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట షాహిద్. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మికా మందన్నా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే షాహిద్, రష్మికల జోడీ సిల్వర్ స్క్రీన్పై రిపీట్ అవుతుంది. జియో స్టూడియోస్తో కలిసి సునీల్ ఖేతర్ పాల్ ఈ సినిమాను నిర్మించనున్నారట.మరోవైపు ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణతో రష్మికా మందన్నా బిజీగా ఉన్నారు. ఇంకా విజయ్ దేవరకొండ ‘రణబాలి’, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మైసా’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు రష్మికా మందన్నా. ఇలా వరుస చిత్రాలతో రష్మిక బిజీ బిజీగా ఉన్నారు. -
అల్లు అర్జున్ నుదురుపై డైలాగ్ పేపర్.. అదీ కారణం
టాలీవుడ్ సినిమాల్లో ఒకప్పుడు దాదాపుగా తెలుగు నటీనటులు మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి వాళ్లో తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. గత కొన్నేళ్లలో చూసుకుంటే కీలకమైన సహాయ పాత్రల్లో ఎక్కువగా తమిళ, మలయాళ యాక్టర్స్ దర్శనమిస్తున్నారు. అందులో జయరామ్ ఒకరు. ఈయన అల్లు అర్జున్తో కలిసి 'అల వైకుంఠపురములో' మూవీలో నటిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా అనుభవం గురించి ఇన్నాళ్లకు బయటపెట్టారు. అది ఆసక్తికరంగా అనిపించింది.'నాకు తెలుగు తెలియదు. డైలాగ్ ఎన్నిసార్లు చదివినా సరే గుర్తుండట్లేదు. చివరకు డైలాగ్ని ఓ కాగితంపై రాసి ఎదురుగా ఉన్న అల్లు అర్జున్ నుదురు, ఛాతీపై అంటించి, దాన్ని చూస్తూ డైలాగ్ చెప్పేశాను' అని జయరామ్.. తాజాగా మలయాళ ఎఫ్ఎమ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్వతహాగా మలయాళ నటుడు అయిన జయరామ్.. 2018లో అనుష్క 'భాగమతి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా, ఖుషీ, హాయ్ నాన్న, గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, మిరాయ్ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. తనదైన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. సాధారణంగా డైలాగ్స్ విషయంలో నంబర్స్ చదువుతారు, లేదంటే పక్కనున్న వ్యక్తులు ప్రాంప్ట్ ఇస్తుంటారు. కానీ జయరామ్ మాత్రం అలా కాకుండా ఏకంగా బన్నీ నుదురుపైనే డైలాగ్ పేపర్ పెట్టి చెప్పడం అంటే కాస్త విశేషమే అని చెప్పొచ్చు. -
అర్జున్ రెడ్డి బ్యూటీ బోల్డ్ లుక్.. థాయ్లాండ్లో శ్వేతామీనన్ చిల్..!
భర్తతో ప్రియాంక చోప్రా రొమాంటిక్ పిక్స్..అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే బోల్డ్ లుక్స్..థాయ్లాండ్లో చిల్ అవుతోన్న శ్వేతామీనన్..పాట పాడుతూ హీరోయిన్ మాధవి చిల్..బాలీవుడ్ బుల్లితెర భామ మౌనీ రాయ్ లేటేస్ట్ పిక్స్.. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) -
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్లడ్ రోజెస్. ఈ మూవీకి ఏంజీఆర్ దర్శకత్వం వహించారు. టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్లో హరీష్ కమర్తి నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్ నగరంలో దేవి దాస్, భజరంగి దాస్ అనే ఇద్దరు లీడర్స్ ఉంటారు. వీరిద్దరు తమ కుమారులను వచ్చే ఎన్నికల్లో నిలబెడతారు. ఆ తర్వాత సిటీలో వరుస హత్యలు జరగడం మొదలవుతుంది. అదే సమయంలో ఈ వరుస హత్యలకు దేవి దాస్ కొడుకు మదన్కి సంబంధం ఉందని వార్తల్లో వస్తుంది. దేవి దాస్ కొడుకు రాజకీయ జీవితం నాశనం చేయడానికి భజరంగి దాస్ ప్లాన్ చేసాడని దేవి దాస్ కార్యకర్తలు రోడ్ మీదకి వస్తారు. ఈ కేసును సీఐ అరుణ్ గోగోయ్ చాలా సీరియస్గా తీసుకుంటాడు. పొలిటికల్ ఒత్తిడితో అరుణ్ గోగోయ్ స్పెస్పెండ్ అవుతాడు. ఈ కేసు సీబీఐకి వెళ్తుండగా హోమ్ మినిస్టర్ని కమిషనర్ రిక్వెస్ట్ చేసి అధిరను ఒప్పిస్తాడు. ఈ వరుస హత్యలను వెనక ఉన్నా హంతకుడిని అధిర ఎలా పట్టుకున్నది అనేదే అసలు కథ.ఎలా ఉందంటే..ఈ సినిమాలో మహిళలను తక్కువ చేయొద్దని.. వాళ్లు అన్నింటిలో సమానం అని స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ప్రేమించకూడదు.. ప్రేమిస్తే మోసం చేయకూడదని అమ్మాయి పాయింట్ అనే మెసేజ్ ఇందులో చూపించారు. అలాగే 2026లో డిఫరెంట్ పాయింట్తో ఈ సినిమా బ్లడ్ రోజెస్. వరుస హత్యల నేపథ్యంలో ఈ కథ సాగడం రోటీన్గా అనిపిస్తుంది. కథ నెమ్మదిగా సాగడంతో ఆడియన్స్కు అంతగా నచ్చదు.డైరెక్టర్ యం. జి అర్ కథ, మాటలు స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నప్పటికీ తెరపై చూపించడంలో ఫెయిల్ అయ్యారు. తాను అనుకున్న పాయింట్ ఆడియన్స్ చెప్పడంలో కాస్తా తడబాటుకు గురయ్యారు. కన్నడతో రెండు సినిమాలు చేసిన ఆయన తెలుగు ఆడియన్స్కు మెప్పించే ప్రయత్నం చేశారు. ఈ మూవీలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. క్రైమ్ స్టోరీలు ఇష్టపడేవాళ్లకు కొద్దిగా నచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే రోటీన్ కథే. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్.ఎవరెలా చేశారంటే..ఇందులో అధిర క్యారెక్టర్ చేసిన అప్సర రాణి లుక్ అదిరిపోయింది. ఆమెకు ఈ మూవీ తర్వాత ప్రత్యేక మార్క్ ఉంటుంది. శాండల్ వుడ్ హీరో ధర్మాకీర్తి రాజు అరుణ్ గోగోయ్ పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీలు పృథ్విరాజ్ జనని క్యారెక్టర్లో ఫర్వాలేదనిపించింది. క్రాంతి కిల్లి మార్టిన్ క్యారెక్టర్ అదరగొట్టేశారు. ఈ సినిమాలో సుమన్, టార్జన్, ఘర్షణ శ్రీనివాస్, రాజేంద్ర, జూనియర్ రేలంగి, జగదేశ్వరి, మాణికుమార్ మాణిక్, జ్యోతి, అనిల్ కుమార్,ధ్రువ,నరేన్ తేజ్,ప్రగ్య,నవిత, లౌక్య,హాసిని,ఆనంద్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. -
'ఏడేళ్లప్పుడు ఆ ఒక్క సంఘటన.. ఆ దెబ్బకు మారిపోయా'
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగ తెలిసిందే. కుక్కల సంరక్షణ గురించి మాట్లాడగా.. అది కాస్తా కాంట్రవర్సీకి దారితీసింది. తన పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. కేవలం తాను కుక్కుల క్షేమం కోసమే పనిచేస్తున్నానని చాలా సార్లు వెల్లడించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేణు దేశాయ్.. తాను వేగాన్గా మారడానికి కారణాలను పంచుకుంది.తనకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక మేక పిల్లను బలి ఇవ్వడం చూశానని రేణు దేశాయ్ తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ వెజ్ ముట్టుకోలేదని రేణు వెల్లడించింది. మాది బ్రాహ్మణ కుటుంబమని.. అయినప్పటికీ నాన్న మాంసం తినేవారని పేర్కొంది. కానీ మా అమ్మ మమ్మల్ని తినద్దని ఎప్పుడు ఆపలేదని.. కానీ నేను తినకూడదని నిర్ణయించుకున్నాని రేణు దేశాయ్ పంచుకుంది. ఏడేళ్ల వయసులో ఆ సంఘటన చూసినప్పటి నుంచి పూర్తి వేగాన్గా మారిపోయానని తెలిపింది. మా అమ్మ కఠినమైన శాకాహారి..వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినకపోయేదని రేణు వివరించింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
రూరల్ బ్యాక్డ్రాప్ ప్రేమకథ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
జయమ్మ పంచాయతీ మూవీ ఫేమ్ దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే లవ్స్టోరీతో పాటు ఫాదర్ సెంటిమెంట్తో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చేతుల మీదుగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించారు. టైటిల్ చాలా బాగుందని.. సినిమా కూడా బాగుంటుందని సురేష్ బాబు అన్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ..'సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కుటుంబమంతా కలిసి ఆహ్లాదంగా చూడదగ్గ మూవీ. శతమానం భవతి, బలగం, ఆ నలుగురు లాంచి మంచి కంటెంట్ ఉన్న కథ. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను కూడా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.ఈ సందర్భంగా సీనియర్ నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ..'మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మంచి కుటుంబ కథా చిత్రంగా వస్తోంది. సెంటిమెంట్ పరంగా, అన్నిరకాలుగా మూవీ బాగుంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ను సురేష్ బాబు లాంఛ్ చేశారు. ఆయన హ్యాండ్ చాలా మంచిది. అది సినిమాకు బాగా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, సుధ, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూముంజెటి, హాసిని యామిని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. -
జపాన్లో పుష్ప-2.. అక్కడ కూడా తగ్గేదేలే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ పుష్ప-2. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఏకంగా వరల్డ్ వైడ్గా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ చిత్రాల జాబితాలో రెండో పేస్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కంటే ముందు అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2200 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.అయితే జపాన్లో మన తెలుగు సినిమాలతో పాటు ఇండియన్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే మన హిట్ సినిమాలను జపనీస్లోకి డబ్ చేసి అక్కడ రిలీజ్ చేస్తుంటారు. ఇటీవల పుష్ప-2 మూవీని కూడా జపాన్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ మూవీని జనవరి 16న జపాన్లో 'పుష్ప కున్రిన్' అనే పేరుతో విడుదల చేశారు. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ అక్కడ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా జపాన్ బాక్సాఫీస్ వద్ద రూ.139.73 కోట్ల వసూళ్లతో ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది.ఇటీవల జపాన్లో రిలీజైన పుష్ప-2 సైతం జపాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా మూవీ రిలీజైన 14 రోజుల్లోనే ఇండియన్ చిత్రాల జాబితాలో టాప్-10లో అడుగుపెట్టేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.రూ.6.06 కోట్ల వసూళ్లతో ఆమిర్ ఖాన్ నటించిన ధూమ్ 3 (రూ6.03 కోట్లు) వసూళ్లను అధిగమించి 10వ స్థానంలో నిలిచింది. దీంతో జపాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాలలో పుష్ప 2 చోటు దక్కించుకుంది. కాగా.. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించింది. జపాన్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితా..ఆర్ఆర్ఆర్ - రూ.139.73 కోట్లుముత్తు - రూ.23.39 కోట్లుబాహుబలి 2: ది కన్క్లూజన్ - రూ.17.61 కోట్లు3 ఇడియట్స్- రూ.9.81 కోట్లుఇంగ్లీష్ వింగ్లీష్- రూ.9.24 కోట్లుది లంచ్బాక్స్- రూ.8.66 కోట్లుసాహో- రూ.7.56 కోట్లుమగధీర- రూ.7.51 కోట్లుఎంతిరన్ (రోబో - రూ.6.33 కోట్లుపుష్ప 2: ది రూల్- రూ.6.06 కోట్లు -
‘సుమతీ శతకం’ మూవీ రివ్యూ
బిగ్బాస్ షో తర్వాత బుల్లితెర హీరో అమర్దీప్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పలు టీవీ షోలతో పాటు సినిమా చాన్స్లు కూడా వస్తున్నాయి. బుల్లితెరపై ఓ మార్క్ వేసిన అమర్ దీప్ ఇప్పుడు హీరోగా ‘సుమతీ శతకం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..తూర్పు గోదావరి జిల్లాలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన కృష్ణ (అమర్ దీప్)కి పెళ్లిపై చాలా ఆశలు ఉంటాయి. ఊర్లోనే ఉంటూ కిరాణ కొట్టు నడుపుతుండడంతో అతనికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. ఊర్లో జరిగే జాతరలో అందరి సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకుంటానంటూ నాన్నమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టలేకపోతోన్నందుకు కృష్ణ బాధపడుతుంటాడు. అలాంటి సమయంలో పక్క గ్రామానికి అంగన్వాడీ టీచర్గా వచ్చిన సుమతి(శైలి చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మరి కిరాణం కొట్టు నడిపే కృష్ణతో సుమతీ ఎలా ప్రేమలో పడింది? పెళ్లికి ఆమె పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు కృష్ణ పెళ్లి జరిగిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఈ విలేజ్ లవ్స్టోరీకి భక్తి, సందేశాత్మక అంశాలు మేళవించి కమర్షియల్ పంథాలో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎంఎం నాయుడు. ప్రారంభంలో కాస్త కథ ట్రాక్ తప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్కి కథలో లీనమయ్యేలా ప్రేక్షకుడ్ని కట్టి పడేస్తారు. అయితే ఇందులో ట్విస్ట్స్ పెద్దగా లేకపోవడం, ఊహకందేలా సాగడం, విలనిజం కూడా గట్టిగా పండకపోవడంతో ఈ సినిమాకు మైనస్.అయితే ఎమోషనల్ సన్నివేశాలతో ఆ లోపాలను కొంతమేర కప్పిపుచ్చారు.పెళ్లి చుట్టూ రాసుకున్న కథ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, ఎమోషన్ ఇలా అన్నింటినీ సమపాళ్లలో చూపించారు. కానీ ముందుగా చెప్పినట్లుగా ఊహకందేలా కథనం సాగడంతో కథనం రక్తి కట్టించదు. సరదాగా, సాఫీగా సాగే గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మక కథలు ఇష్టపడే ప్రేక్షకులను ఈ చిత్రం నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రకు అమర్దీప్ న్యాయం చేశాడు. పల్లెటూరి యువకుడిగా కృష్ణ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ను పండించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ శైలి చౌదరి నటన పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఊరి ప్రెసిడెంట్గా మహేష్ విట్టా, హీరో స్నేహితుడిగా టేస్టీ తేజ కొన్ని సీన్లలో నవ్వులు పూయించారు. మిగతా ఆర్టిస్టులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కెమెరా వర్క్ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని ఎంతో అందంగా చూపించారు. ఈ చిత్రంలోని చాలా విజువల్స్ బాగుంటాయి. రూరల్ బ్యాక్డ్రాప్ను సినిమాటోగ్రాఫర్ ఎస్ హాలేష్ బాగా క్యాప్చర్ చేశారు. సుభాష్ ఆనంద్ ఇచ్చిన పాటల్లో పల్లెటూరి ఫీల్ వచ్చింది. నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి ఖర్చు విషయంలో రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -
యశ్ టాక్సిక్.. భారీ ధరకు తెలుగు రాష్ట్రాల రైట్స్..!
శాండల్వుడ్ హీరో యశ్ నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. కేజీఎఫ్- 2 తర్వాత రాకింగ్ స్టార్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ సీన్ పెట్టడంపై దర్శకురాలిపై విమర్శలు చేశారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహంచారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ సినీ ప్రియులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ను భారీ డీల్కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ పంపిణీ హక్కుల కోసం ఏకంగా రూ. 120 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఓ డబ్బింగ్ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్గా రికార్డ్ సృష్టించనుంది.ఈ మూవీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు ఇదొక బిగ్ డీల్ అని టాలీవుడ్లో చర్చ మొదలైంది.ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ.. 'యశ్ సినిమా రంగంలో ఒక పవర్ఫుల్ స్టార్గా ఎదిగారు. కేజీఎఫ్ -2 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అతని మార్కెట్ మరింత పెరిగింది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత వస్తోన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను అందించడానికి థ్రిల్గా ఉన్నాం. భవిష్యత్తులో యశ్తో మరిన్ని చిత్రాలకు కలిసి పనిచేస్తాం' అని అన్నారు.ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. The chaos is beginning to unfold. Toxic: A Fairy Tale for Grown-ups arrives in theaters across Andhra Pradesh and Telangana through @SVCReleaseIntoxicating the world from 19-03-2026.#DaddyIsHome #ToxicTheMovie#TOXIConMarch19th @TheNameIsYash#Nayanthara@humasqureshi… pic.twitter.com/1uB4RbQ9sg— KVN Productions (@KvnProductions) February 6, 2026 -
హారర్ థ్రిల్లర్ ‘హనీ’ మూవీ రివ్యూ
టైటిల్: హనీనటీనటులు: నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, దివి, రాజా రవీందర్, జయన్ని, జయత్రినిర్మాతలు: రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డిరచన, దర్శకత్వం: కరుణ కుమార్సంగీతం: అజయ్ అరసాడసినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్ఎడిటింగ్: మర్తాండ్ కె వెంకటేశ్విడుదల తేది: ఫిబ్రవరి 6, 2025కథేంటంటే..ఆనంద్(నవీన్ చంద్ర)కు మూఢనమ్మకాల పిచ్చి. ఆ నమ్మకాల కారణంగా అతని ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అయినా కూడా క్షుద్ర పూజలు, అఘోర విశ్వాసాలను వదలడు. భార్య లలిత (దివ్య పిళ్లై), కూతురు మీరా(జయన్ని) భయబ్రాంతులకు గురవుతున్నా.. ఆయన క్షుద్ర పూజలు చేస్తూనే ఉంటాడు. ఊరికి దూరంగా ఓ బంగ్లాకి తన ఫ్యామిలీని తరలిస్తాడు. అక్కడ క్షుద్ర పూజలు చేస్తే..తన కోరిక నెరవేరుతుందని, అందుకుగాను కూతురు మీరా తన మాట వినాలని చెబుతాడు. మొదట లలిత.. భర్త నిర్ణయాన్ని తిరస్కరించినా.. కొన్ని పరిస్థితుల కారణంగా తర్వాత ఆమె కూడా ఒప్పుకుంటుంది. కూతురు మీరాతో ఆనంద్ ఏ పని చేయించాడు? అతని క్షుద్రపూజలు నిజంగానే ఫలించాయా? ఆనంద్ కారణంగా తల్లి-కూతుళ్లు ఎదుర్కొన్న భయంకర అనుభవాలు ఏంటి? ఈ కథలో రవణ(దివి), సారంగపాణి(రాజా రవీంద్ర) పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలపై విశ్వాసంతో దుర్మార్గపు, అమానవీయ చర్యలకు పాల్పడే మనుషులు ఉన్నారు. క్షుద్రపూజల కోసం సొంత మనుషులనే చంపుకున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటి కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే ‘హనీ’. .‘పలాస’తో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు కరుణ కుమార్, ఈసారి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. మూఢనమ్మకాల పిచ్చితో కట్టుకున్న భార్యని, కన్న కూతురిని చిత్రహింసలకు గురిచేసే ఓ చీకటి మనిషి కథ ఇది. ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. అయితే ఇందులో టచ్ చేసిన పిల్లి మాయ కాన్సెప్ట్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మదనపల్లె సహా పలు నిజ జీవిత క్షుద్ర పూజల సంఘటనల్ని గుర్తొస్తాయి. ఎక్కడా అనవసరమైన భయపెట్టే సీన్స్ లేకుండా, సిచ్యుయేషన్స్ ద్వారానే టెన్షన్ క్రియేట్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత.కొండగుహలో ఓ తెగ క్షుద్ర దేవతను ఆరాధించే ఆసక్తికర సన్నివేశంతో కథను ప్రారంభించాడు దర్శకుడు. అలాంటి క్షుద్రపూజలే హీరో ఆఫీస్లో చేయడంతో అతన్ని చితక్కొట్టి.. బయటకు పంపిస్తారు. ఆ తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. అతనికున్న పిచ్చితో కూతురు, భార్య పడే ఇబ్బందులు ఎమోషనల్కు గురి చేస్తాయి. ఇక ఫ్యామిలీతో కలిసి ఊరి బయట ఉన్న ఇంట్లోకి వెళ్లిన తర్వాత.. కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. పిల్లి మాయ సేకరణ సీన్ థ్రిల్లింగ్కు గురి చేస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదించిన ఫీలింగ్ ఇచ్చినా, క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ద్వితియార్థం కథని మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే..ఆనంద్ పాత్రలో నవీన్ చంద్ర ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల కంటి చూపుతోనే భయపెట్టాడు. లలిత పాత్రలో దివ్య పిళ్లై అద్భుతంగా నటించింది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆమె నటన హృదయాలను హత్తుకుంటుంది. మీరా పాత్రలో కనిపించిన చిన్నారి సహజ నటనతో ఆకట్టుకుంది. రమణగా దివి చేసిన బోల్డ్ రోల్ సినిమాకు ఇంకో డార్క్ షేడ్ ఇచ్చింది. సారంగపాణిగా రాజా రవీంద్ర తనదైన ముద్ర వేశాడు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అజయ్ అరసాడ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. కెమెరా వర్క్ బాగుంది. డైలాగ్స్ కథకు బలంగా నిలుస్తాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.- రేటింగ్: 3/5 -
డ్యాన్స్తో అదరగొట్టిన శ్రీలీల.. వీడియో వైరల్..!
హీరోయిన్ శ్రీలీల ఈ ఏడాది పరాశక్తితో ప్రేక్షకుల ముందుకొచ్చింది. శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమైంది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న ఈ మూవీ మార్చి 26వ థియేటర్లలో సందడి చేయనుంది.ఇదిలా ఉంచితే శ్రీలీల తాజాగా హైదరాబాద్లోని ఓ మాల్ ఓపెనింగ్కు హాజరైంది. ఈ సందర్భంగా తన టాలెంటన్ను బయటపెట్టింది. అభిమానుల కోరిక మేరకు డ్యాన్స్తో అదరగొట్టేసింది. ఉస్తాద్ భగత్ సింగ్లోని దేక్లేంగే సాలా అంటూ సాగే పాటకు స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీలీల స్టెప్పులకు అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు.Actress #SreeLeela performs to #DekhLengeSaala from #UstaadBagathSingh at a shop opening! pic.twitter.com/Ilm1dpRLWL— idlebrain jeevi (@idlebrainjeevi) February 6, 2026 -
విశ్వక్ సేన్ ఫంకీ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫంకీ ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ నెల 7న మూసాపేట్లోని శ్రీరాములు థియేటర్లో ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.The Key for FUN with #FUNKY unlocks tomorrow 🔓💥 Trailer drops on 7th Feb from 4 PM onwards. #FunkyTrailer Launch Event at Sree Ramulu 70MM, Hyderabad. Join us for pure FUNKY MADNESS 😎🔥 In cinemas from FEB 13 #FunkyFrom13thFeb Mass Ka Das @VishwakSenActor @11Lohar… pic.twitter.com/g2UyiUjsLL— Sithara Entertainments (@SitharaEnts) February 6, 2026 -
యాటిట్యూడ్ స్టార్కు మరో షాక్.. కేసు నమోదు..!
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్పై మరో కేసు నమోదైంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు సాంగ్ పాడారని ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. అతని ప్రవర్తన, వాడిన పదజాలం అసభ్యకరంగా ఉన్నాయని.. ప్రజల మర్యాదని దెబ్బ తీశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇప్పటికే చంద్రహాస్పై ప్రముఖ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై ఇప్పటికే మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బరాబర్ ప్రేమిస్తా మూవీలోని ఓ సాంగ్ను పాడిన చంద్రహాస్.. అందులో తన సొంత పదజాలంతో పాడారు. బూతులు ఊపయోగిస్తూ పాడడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. -
‘శ్రీ చిదంబరంగారు’ మూవీ రివ్యూ
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరంగారు’. వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గో పాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రాజమండ్రి సమీప గ్రామంలో ఉండే సోలమన్(వంశీ తుమ్మల)కి మెల్లకన్ను ఉంటుంది.దీంతో ఊర్లోవాళ్లంతా అతనికి చిదంబరం అని పేరు పెట్టి హేళన చేస్తుంటారు. ఆ అవమానం భరించలేక చిన్నప్పుడు స్కూల్కి వెళ్లడమే మానేస్తాడు. అంతేకాదు తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి కళ్లజోడు ధరిస్తుంటాడు. తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి మేస్త్రీ పనికి వెళ్తుంటాడు. అదే గ్రామానికి చెందిన లీలా(సంధ్య వశిష్ట)కి చిదంబరం అంటే చాలా ఇష్టం. కానీ, తనకున్న లోపం కారణంగా లీలా తనను ఇష్టపడదనే భయంతో చిందబరం..ఆమెకు దూరంగా ఉంటుంటాడు. ఒక చిన్న అపార్థం కారణంగా లీలా తనను తిరస్కరించిందని భావించి సోలమన్.. ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? చిదంబరం తనను అపార్థం చేసుకున్నాడనే విషయం తెలిసిన తర్వాత లీలా ఏం చేసింది? కళ్లజోడు వెనుకాల బతికే పోలమన్.. చివరకు ఆ కళ్లజోడుని తీసి..ధైర్యంగా ఆ ప్రపంచాన్ని ఎలా చూశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని బలంగా మార్చుకుంటే.. ధైర్యంగా జీవించొచ్చు అని సాటిచెప్పే కథ ఇది. దర్శకుడు వినయ్ రత్నం సింపుల్ పాయింట్ని ఎంచుకొన్ని దానికి బలమైన ఎమోషన్స్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శారీరకలోపం ఉన్నవాళ్లని సమాజం ఎలా అవమానిస్తుంది? వారు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.మెల్లకన్ను కారణంగా సోలమన్కి స్కూల్లో జరిగిన అవమానాన్ని చూపిస్తూ.. చాలా ఎమోషనల్గా సినిమాను ప్రారంభించాడు దర్శకుడు. సోలమన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని పరిచయం చేసి.. ఆ తర్వాత అసలు కథను ప్రారంభించాడు. లీలా-సోలోమన్ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఒకవైపు లీలా-సోలోమన్ల లవ్స్టోరీని నడిపిస్తూనే..మరోవైపు గోదావరి తీర ప్రాంతపు పల్లెటూరి ప్రజల జీవనశైలీని చాలా సహజంగా చూపించారు. ఇంటర్వెల్ సీన్తో కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం.. సోలమన్ తనకున్న లోపాన్ని సరిదిద్దుకునేందుకు చేసే ప్రయత్నం చూట్టూనే కథనం తిరుగుతుంది. మతం పేరుతో చేసే మోసాలను కూడా ఈ సినిమా చక్కగా చూపించారు. అయితే ఆయా సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. అలాగే హీరోలో వచ్చే మార్పుకు గల కారణం కూడా బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్లో ఇచ్చే సందేశం బాగుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో హీరోహీరోయిన్గా నటించిన వంశీ తుమ్మల, సంధ్యకి ఇది తొలి చిత్రమే అయినా చక్కగా నటించారు. మెల్లకన్ను ఉన్న యువకుడి పాత్రలో వంశీ తుమ్మల ఒదిగిపోయాడు. ఇక ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి లీలాగా సంధ్య వశిష్ట తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తల్లిగా కల్పలత, హీరోయిన్ తల్లిగా తులసి మరోసారి తమ అనుభవాన్ని తెరపై చూపించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. చందు-రవి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉంటాయి. నేపథ్య సంగీతం కథకు తగ్గట్లుగా సహజంగా ఉంటుంది. ఎం.ఎం.కీరవాణి ఆలపించిన ‘వెళ్లే దారిలోన’ పాట ఆకట్టుకునేలా ఉంటుంది. అక్షయ్ రామ్ పోడిశెట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను, పల్లెటూరి పచ్చదనాన్ని తెరపై మరింత అందంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఒక్కమాటతో తారక్పై గౌరవం రెట్టింపు: పూజా బేడీ
ప్రముఖ బాలీవుడ్ నటి పూజా బేడీ చాలా తక్కువ సినిమాలే చేసింది. వాటిలో చిట్టెమ్మ మొగుడు (1993), శక్తి (2011) అని రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. అయితే చాలాకాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై సందడి చేసింది. చంద్రహాస్ హీరోగా నటించిన బరాబర్ ప్రేమిస్తా మూవీలో పూజా బేడీ కీలక పాత్రలో నటించింది. ఇటీవల ఈ సినిమా ఈవెంట్లో ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించింది పూజా బేడీ. నెగెటివ్ పాత్రఆమె మాట్లాడుతూ.. శక్తి సినిమా నేను సోనూసూద్కు భార్యగా నటించాను. నాది ప్రతికూల ఛాయలున్న పాత్ర. ఓ సీన్లో హీరో నాతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. అందుకు జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. ఆడవారితో ఫైట్ చేయలేనని నిరాకరించారు. అప్పుడు ఆయనపై గౌరవం మరింత పెరిగింది. ఇప్పుడున్న సినీప్రపంచంలో ఇలాంటి విలువలు పాటించేవాళ్లు చాలా అరుదు అని తెలిపింది.తారక్ సినిమాజూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన చివరగా వార్ 2లో కనిపించాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం తారక్.. ప్రశాంత్ నీల్తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. అలాగే దేవర 2 సినిమా కూడా లైన్లో ఉంది.చదవండి: అడ్జస్ట్ అవ్వాల్సిందే.. అమ్మతో అనేసరికి: నటి -
హీరోయిన్గా అర్జున్ కూతురు.. ‘సీతా పయనం’ ఎప్పుడంటే..?
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు.ఇక ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్ని కూడా వినూత్నంగా చేపట్టారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు.ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పాజిటీవ్ బజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, ఫ్యామిలీస్ కు బాగా నచ్చే అనేక అంశాలు ఈ మూవీలో ఉండబోతున్నాయి, త్వరలో సీతా పయనం ట్రైలర్ ను మేకర్స్ విడుదల చెయనున్నారు. -
ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) మూవీ నెట్ఫ్లిక్స్(Netflix)లో విడుదల కానుంది. ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుందని యాప్లో ఆ ఓటీటీ సంస్థ పేర్కొంది. నవీన్ పొలిశెట్టి కామెడి పంచ్లకు ఫిదా అయిన ప్రేక్షకులు మరోసారి ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరి 13న ఓటీటీలోకి ఈ మూవీ రానుందంటూ పెద్ద ఎత్తున సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, అంతకంటే ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.కథేంటంటే..గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు(నవీన్ పొలిశెట్టి)కి ‘జమీందారు’ అనే ట్యాగ్ తప్ప చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఉన్న ఆస్తులన్నీ తాత పరాయి స్త్రీలకు పంచడంతో పెద్ద పేరున్న పేదవాడిగా జీవితం గడుపుతుంటాడు. తన స్నేహితుడు ఒకడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ అవ్వడంతో.. తాను కూడా బాగా డబ్బున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు(రావు రమేశ్) బాగా రిచ్ అని తెలుసుకొని.. అతని కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ని ప్రేమలో పడేస్తాడు. తాను కూడా బాగా ధనవంతుడని నమ్మించి.. పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు రాజుకి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటి? రాజు అనుకున్నట్లుగా భూపతి రాజు ఆస్తులన్నీ ఆయన చేతికి వచ్చాయా? చారులత కూడా రాజుని ఎందుకు ప్రేమించింది? జమీందారు అయిన రాజు.. పెద్దపాలెం ప్రెసిడెంట్గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎర్రిరాజు(తారక్ పొన్నప్ప)తో నవీన్కు ఎందుకు వైర్యం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. -
కాలినడకన తిరుమలకు నటి మీనాక్షి చౌదరి (వీడియో)
కలియుగదైవం తిరుమల శ్రీవారిని నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. రీసెంట్గా తాను నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం విజయం అందుకోవడంతో ఆమె స్వామివారి ఆశీస్సులను తీసుకునేందుకు అలిపిరి కాలినడకన కొండకు చేరుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీ విడుదల సమయంలో కూడా శ్రీవారిని ఆమె దర్శించుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో మీనాక్షి పాల్గొన్నారు. దర్శన అనంతరం మీనాక్షికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకుని ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగారు. -
చెక్బౌన్స్ కేసులో తీహార్ జైలుకు కిక్-2 నటుడు
కిక్-2 సినిమాతో తెలుగువారికి పరిచయమైన బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. చెక్బౌన్స్ కేసులో నటుడికి ఢిల్లీ హైకోర్టు ఆరు నెలలు శిక్ష విధించింది. కానీ, గడుపు పెంచాలని పలుమార్లు కోరుతూ కొంత కాలంగా ఆయన కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో కోర్టు ఆగ్రహం చేయడంతో తప్పనిపరిస్థితిల్లో తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్, అతడి భార్య రాధపై ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. రాజ్పాల్ యాదవ్ తమ వద్ద రూ.5 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని సంస్థకు చెందిన ఎం.జి.అగర్వాల్ రికవరీ కేసు పెట్టాడు. వారు ఇచ్చిన బ్యాంక్ చెక్లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో రాజ్పాల్ దంపతులను 2018లోనే దోషులుగా న్యాయస్థానం తేల్చింది. ఈ క్రమంలో రాజ్పాల్కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఫిర్యాదుదారుడికి తిరిగి డబ్బు చెల్లిస్తానని స్టే తెచ్చుకున్నారు. కానీ, న్యాయస్థానం ముందు ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో ఢిల్లీ కోర్టు కూడా సీరియస్ అయింది. తీహార్ జైలు అధికారుల ముందు హాజరు కావాలని జారీ చేసింది. -
నా ఫస్ట్ మూవీ తెలుగులో.. ఇంతవరకు రిలీజవ్వలేదు
తెలుగు సినిమాతోనే తన ప్రయాణం మొదలైందంటున్నాడు బాలీవుడ్ నటుడు నకుల్ మెహతా. కానీ తెలుగులో నటించిన తొలి సినిమా ఇంతవరకు రిలీజవలేదని చెప్తున్నాడు. నకుల్ మాట్లాడుతూ.. తెలుగు మూవీతోనే నా కెరీర్ మొదలైంది. హైదరాబాద్ వెళ్లి మూడు నెలలు అక్కడే ఉన్నాను. అప్పుడు హీరోయిన్ శ్రియా పేరు బాగా వినిపించింది. ఖాళీగానే ఉన్న సమయంలో తన సినిమాలు చూసేవాడిని. నా సినిమా ముందుకు కదల్లేదుతన కెరీర్ కూడా అప్పుడప్పుడే మొదలైంది. కానీ ఆరంభం నుంచే సక్సెస్ఫుల్గా రాణించింది. నా సినిమా మాత్రం ముందుకు కదల్లేదు. దీంతో నేను మళ్లీ ముంబై వచ్చేసి యాడ్స్ చేసుకుంటూ నా దారి నేను చూసుకున్నాను. నటుడినవ్వాలన్న కోరిక మొదట్లో అంత బలంగా లేదు. కాకపోతే నా చుట్టూ ఉంండేవారంతా నన్ను యాక్టింగ్ వైపు వెళ్లమని చెప్పేవారు. నాక్కూడా అందరినీ ఎంటర్టైన్ చేయడం అంటే ఇష్టం. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టా..అలా తెలుగు సినిమాలో అవకాశం రాగానే ఒప్పుకున్నాను. కానీ ఆ భాష నాకు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. అయితే మన చుట్టూ ఉన్న మనుషులు సరిగా ఉంటే అన్నీ సర్దుకుపోవచ్చనిపించింది. ఈ అనుభవం నాకు బాగానే పనికొచ్చింది. కెమెరా ముందు నటించడాన్ని మరింత ప్రేమించాను. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. మంచి పర్ఫామెన్స్ ఇచ్చేందుకు నావంతు ప్రయత్నిస్తూనే ఉన్నాను. అదే సక్సెస్శ్రియా 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఎంతో సక్సెస్ను చూసింది, స్టార్డమ్ను సంపాదించుకుంది. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తూనే ఉంది. నా దృష్టిలో సక్సెస్ అంటే జనం మనల్ని ప్రేమించడమే! కాగా నకుల్.. ఇష్క్బాజ్ సీరియల్తో గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులో అభిమాని (2005) సినిమాలో యాక్ట్ చేశాడు. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఫుల్ యాక్టివ్గా కనిపిస్తున్నాడు. చివరగా స్పేస్ జెన్: చంద్రయాన్ అనే సిరీస్లో యాక్ట్ చేశాడు.చదవండి: ధురంధర్ 2లో దర్శకుడి సతీమణి -
హిందీ వాళ్లపై కోపం లేదు.. 'పరాశక్తి' తెలుగు ట్రైలర్
సంక్రాంతి కానుకగా శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి’ తమిళ్లో మాత్రమే విడుదలైంది. తెలుగులో థియేటర్స్ కొరత కారణంగా కనీసం ట్రైలర్ కూడా ఆ సమయంలో రిలీజ్ చేయలేదు. అయితే, కోలీవుడ్లో థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత డైరెక్ట్గా తెలుగు వర్షన్ను కూడా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు ట్రైలర్ను జీ5 వేదికగా పంచుకున్నారు. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇదే మూవీతో శ్రీలీల తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.పరాశక్తి(Parasakthi) సినిమా ఫిబ్రవరి 7న జీ5(ZEE5) ఓటీటీలోకి రానుంది. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ వర్షన్ కూడా విడుదల కానుంది. ఇదే విషయాన్ని తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో పేర్కొన్నారు. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి సినిమా తెరకెక్కింది. ఆ సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. ఆ సమయంలో ఎలాంటి ఘటనలు జరిగాయనేది ఇందులో చూపించారు. -
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
టైటిల్: యుఫోరియానటీనటులు: భూమిక, సారా అర్జున్, విఘ్నేశ్ గవిరెడ్డి, గౌతమ్ మేనన్, రోహిత్, ఆదర్శ్ బాలకృష్ణ, నాజర్, రవి ప్రకాశ్, నవీన రెడ్డి తదితరులునిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్నిర్మాతలు: నీలిమ గుణ, యుక్తా ముఖి, రాగిణి గుణరచన-దర్శకత్వం: గుణశేఖర్సంగీతం: కాల భైరవసినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె పోతన్ఎడిటర్: ప్రవీణ్ పూడివిడుదల తేది: ఫిబ్రవరి 06, 2026తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల జాబితాలో గుణశేఖర్ పేరు ఉంటుంది. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఒక్కడు, రుద్రమదేవి, రామాయణం వంటి చిత్రాలతో చరిత్రాత్మక, సామాజిక, యాక్షన్ జానర్లలో తన ప్రత్యేక ముద్ర వేశారు. అయితే, గత కొన్నేళ్లుగా గుణశేఖర్కు సరైన విజయం దక్కలేదు. శాకుంతలం ఫ్లాప్ తర్వాత సరికొత్త కాన్సెప్ట్తో 'యుఫోరియా' మూవీని తెరకెక్కించారు. యువతరం మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ఎలాంటి నష్టాలు చూడాల్సి వస్తుందో నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని తెరకెక్కించారు.కథచైత్ర (సారా అర్జున్) చదువులో టాపర్.. ఐఏఎస్ కావాలనే కోరికతో సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్న అమ్మాయి కూడా .. ఒకరోజు తన స్నేహితురాలు పిలుపుమేరకు ఓ పబ్కు వెళ్తుంది. అక్కడ చైత్రకు పరిచయమైన ఐదుగురు కుర్రాళ్లలో వికాశ్ (విఘ్నేశ్ గవిరెడ్డి) ఆమెపై కన్నేస్తాడు. డ్రగ్స్ మత్తులో ఉన్న వారందరూ చైత్రను నమ్మించి కారులో తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. చైత్ర ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మేనన్) ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు.అయితే, చైత్రను అత్యాచారం చేసిన ఐదుగురు కుర్రాళ్ల బ్యాక్గ్రౌండ్ చాలా బలంగా ఉంటుంది. వారిలో సంపన్న కుటుంబాలకు చెందిన వారితో పాటు రాజకీయ, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నారు. ఇలాంటి క్లిస్టసమయంలో కమిషనర్ జయదేవ్ కేసును ఎలా ఛేదించారు..? ఈ కేసులో నేను కూడా నేరం చేశానని వింధ్య వేములపల్లి (భూమిక) ఎంట్రీ ఇస్తుంది.. ఇంతకీ ఈ నేరంతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి..? తనకు శిక్ష విధించాలని హైకోర్టును ఎందుకు కోరుతుంది..? ఈ కేసుని డీల్ చేస్తున్న సిటీ కమిషనర్ జయదేవ్కు వింధ్య చేసిన సాయం ఏంటి..? తప్పు చేసిన వారికి శిక్ష పడేలా వింధ్య ఎలాంటి సాహసం చేసింది..? తెలియాలంటే యుఫోరియా మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..2022 మే 28న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో 17 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్రేప్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘటనలో 6 మంది యువకులు (వారిలో 5 మంది మైనర్లు) పాల్గొన్నారు. ఈ ఘటనతో పాటు మరికొన్ని కీలక సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు గుణశేఖర్ యుఫోరియా కథను వెండితెరపై చూపించారని అర్థమౌతుంది. నేటి యువతరం విచ్చలివిడిగా తమ ఆనందం కోసం మాదకద్రవ్యాలకు బానిసలై ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారో ఈ మూవీలో చూపించారు. ఈ క్రమంలో తమ కన్నవాళ్ల జీవితాలు కూడా నరకంగా మారుతున్నాయని ఈ కుర్రాళ్ల కథ చెబుతుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు మనం రెగ్యులర్గా న్యూస్లో చూసిన విధంగానే పలు అత్యాచార సంఘటనలు కళ్ల ముందు కదులుతాయి. మైనర్ల మీద అత్యాచారం అనే ఘటనలు విన్న ప్రతిసారి మనలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇలాంటి సీన్స్ పదేపదే కనిపించడంతో మూవీలో ఉన్న ఆసక్తి కాస్త తగ్గుతుంది. సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ అనిపించదు. సినిమా ప్రారంభంలోనే చైత్రపై వికాశ్ గ్యాంగ్ చేసిన అత్యాచార ఘటన చాలా భయాందోళనగా కనిపిస్తుంది. ఈ కేసులో వెంటనే కదలిక రావడం ఆపై భూమిక తెరపైకి కనిపించడం వంటి సీన్లు కథపై పట్టును కోల్పోనియదు. కమిషనర్ జయదేవ్ విచారణ శైలి మెప్పిస్తుంది. సమాజంలో ఇలాంటి కేసులో నిత్యం జరుగుతూనే ఉంటాయి.అలాంటి సమయంలో పోలీసులు కేసును ఎలా ఛేదిస్తారనేది ఆసక్తిగా చూపించారు. మైనర్లపై అత్యాచారం సంఘటనల్లో పోక్సో చట్టం ఎంత శక్తివంతంగా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పడంలో గుణశేఖర్ సక్సెస్ అయ్యాడు. చైత్ర కేసులో కొడుకు చేసిన తప్పుకు తల్లిగా భూమిక అనుభవించిన క్షోభ ఎలా ఉంటుందో అందరినీ కదిలిస్తుంది. కొడుకు చేసిన తప్పు వల్ల ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ క్రమంలో కుమారుడు చేసిన తప్పును తనపై వేసుకుని కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఇలాంటి సీన్లు అన్నీ కూడా ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. అయితే, సెకండాఫ్లో కథ కాస్త గాడితప్పింది. కొడుకు, తల్లి మధ్య చూపించిన బంధం బాగున్నప్పటికీ దానిని సరైన రీతిలో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూపించలేదనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే.. 'యుఫోరియా' కథలో ప్రధాన బలం సారా అర్జున్దే అని చెప్పాలి. చైత్రగా ఆమె చాలా అందంగా కనిపించడంతో పాటు తన నటనతో మెప్పించింది. అత్యాచార బాధితురాలు సమాజంలో ఎలాంటి ఇబ్బంది పడుతుందో తన నటనతో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆపై వింధ్య వేములపల్లిగా భూమిక అదరగొట్టింది. చైత్ర తర్వాత భూమిక లీడ్రోల్లో కనిపిస్తుంది. కొడుకు తప్పు చేసినా సరే చట్టం ముందు శిక్ష పడాల్సిందేనని న్యాయవ్యవస్థ పట్ల ఉండాల్సిన గౌరవాన్ని చూపుతూ... మరోపైపు కొడుకు జీవితం గురించి తల్లడిల్లిపోయే ఒక తల్లిగా భూమిక జీవించింది. వికాశ్ పాత్రలో విఘ్నే, జయదేవ్ పాత్రలో గౌతమ్ మేనన్ తమ పరిదిమేరకు మెప్పించారు. కాల భైరవ సంగీతం బాగుంది. నేటి యువతరం చూడాల్సిన సినిమాగా 'యుఫోరియా' కథ ఉంటుంది. సినిమాలో చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ఈ సమాజానికి చాలా అవసరమైన మూవీని గుణశేఖర్ తీశారని చెప్పొచ్చు. -
'ధురంధర్-2'లో దర్శకుడి సతీమణి..
బాలీవుడ్ సినిమా 'ధురంధర్' భారీ హిట్ అందుకుంది. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్ సీక్వెల్ను ప్లాన్ చేశారు. పార్ట్-2 మార్చి 19న విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో జియో స్టూడియోస్ నిర్మిస్తుంది. తాజాగా సీక్వెల్ టీజర్ను విడుదల చేశారు. అయితే, ధురంధర్-2లో ప్రముఖ నటి యామి గౌతమ్ నటిస్తుందని తెలుస్తోంది. గౌరవం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్తో కూడా భారీగా పాపులర్ అయింది. దర్శకుడితో పెళ్లి తర్వాత కూడా హిందీలో వరుస సినిమాలు, సిరీస్లు చేస్తూ బిజీగా ఉంటున్న యామి ఇప్పుడు ధురంధర్-2లో కీలకమైన పాత్రలో కనిపించనుంది.'ధురంధర్' దర్శకుడు ఆదిత్య ధర్ను నటి యామి గౌతమ్ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రణ్వీర్ సింగ్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’లో ఒక కీలకమైన పాత్రలో యామి గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్లో కూడా ఆమె వారం రోజుల పాటు పాల్గొన్నారట. సినిమాలో ఆమె కనిపించేది కొన్ని నిమిషాలే అయినప్పటికీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా యామి పాత్ర ఉండబోతుందని బాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. కాగా యామీ గౌతమ్ తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో రీసెంట్గా ఆమె నటించిన హక్ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. -
అభిమానానికి ధన్యవాదాలు: శివకార్తికేయన్
ప్రముఖ హీరో శివకార్తికేయన్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ కమర్షియల్గా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. అదే సమయంలో మంచి కంటెంట్తో కూడిన చిన్న చిత్రాలకు తన నిర్మాణ సంస్థ ద్వారా విడుదల చేస్తూ చేయూతనిస్తున్నారు. శివ కార్తికేయన్ తాజాగా కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈయన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. చేతిలో ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న చిత్రంతో పాటు కమలహాసన్ నిర్మించనున్న మరో ప్రాజెక్ట్ ఉంది. వాటిలో ఏది ముందు సెట్స్పైకి వెళుతుందో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుచ్చిలోని కుమారస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం శివ కార్తికేయన్ మీడియాతో ముచ్చటించారు. 14 ఏళ్ల సినిమా జీవితం తనకు చాలా అందించిందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలతో పాటు పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ, అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు వాటన్నింటినీ మరిచిపోయేలా చేసింది. నా కుటుంబంపై అలాంటి అభిమానాన్ని కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని శివకార్తికేయన్ పేర్కొన్నారు. కాగా తిరుచ్చిలో కుమారస్వామి ఆలయంలో దిగిన ఫొటోలను ఆయన సతీమణి ఆర్తి ఎక్స్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
హీరో అంటే కేవలం హీరోయిజమే కాదు: ఆనంద్ దేవరకొండ
‘‘నటీనటులకు తొలి సినిమా ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అలాగే యూనిట్ కష్టం కూడా తెలుసు. అందుకే ‘శ్రీ చిదంబరంగారు’ ఈవెంట్కి వచ్చాను. ఈ మూవీ టీజర్ ఎంతో నచ్చింది. హీరో అంటే కేవలం హీరోయిజమే కాదు. జనాలకు నమ్మకం కూడా ఇవ్వాలి. ఈ సినిమా ఇంటెన్షన్ అదే. ఈ మూవీలో హీరో పాత్ర చేయడం చాలా కష్టం. కానీ, వంశీని చూశాక ఎంతో కన్విన్సింగ్గా అనిపించింది.ఇలాంటి సినిమాలను మన ప్రేక్షకులు ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని హీరో ఆనంద్ దేవరకొండ తెలిపారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరంగారు’. వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గో పాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ మూవీని వంశీ నంది పాటి నేడు విడుదల చేస్తున్నారు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ఆనంద్ దేవరకొండ, నిర్మాత, నటి నిహారిక కొణిదెల అతిథులుగా హాజరై, ‘శ్రీ చిదంబరం గారు’ సక్సెస్ అవ్వాలని ఆకాంక్షించారు. వంశీ నంది పాటి మాట్లాడుతూ– ‘‘ఇన్సెక్యూరిటీని దాటి జీవితంలో ఎలా ఎదగాలి అనేది ఈ చిత్రకథ. అన్నీ కోల్పోయాం అనుకునేవాళ్లకు స్ఫూర్తి, ధైర్యం నింపే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘హీరో కావాలనే నా కల ‘శ్రీ చిదంబరంగారు’తో నెరవేరింది’’ అన్నారు వంశీ తుమ్మల. -
ప్రేక్షకుల డబ్బుకి విలువ ఇస్తాను: గుణశేఖర్
‘‘లాఠీ’ (1992) చిత్రంతో చిత్ర పరిశ్రమకి వచ్చాను. ‘యుఫోరియా’ నా 14వ సినిమా. నా మొదటి చిత్రానికి ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు కూడా అదే ఫీల్తో ఉన్నాను. నేను ప్రేక్షక దేవుళ్లని నమ్ముతాను. వారి సమయం, డబ్బు, విజ్ఞతకు విలువ ఇస్తాను. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ఒళ్లు దగ్గర పెట్టుకుని ‘యుఫోరియా’ తీశాను. ఈ మూవీ వల్ల వారి టైమ్, మనీ... ఏదీ వృథా కాదు’’ అని డైరెక్టర్ గుణశేఖర్ తెలి పారు. భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత, పృథ్వీరాజ్ నటించిన చిత్రం ‘యుఫోరియా’.గుణశేఖర్ దర్శకత్వంలో రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించారు. ఈ మూవీ నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో గుణశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి భూమిక బ్యాక్ బోన్. వింధ్య వేములపల్లి పాత్రలో తను జీవించింది’’ అన్నారు. భూమిక మాట్లాడుతూ– ‘‘యుఫోరియా’ సినిమా చూశాను. అర్ధరాత్రి ఒంటి గంట, రెండు గంటల సమయంలో లేచి నా పాత్ర గురించే ఆలోచించాను (భావోద్వోగంతో)’’ అని పేర్కొన్నారు. ‘‘మా సినిమా అందరి మనసుల్ని తాకుతుందని భావిస్తున్నాను’’ అని నీలిమ గుణ చెప్పారు. -
తెలుగు సినిమా నాటి నుంచి నేటి దాకా...
తెలుగు సినిమాకు ఇవాళ పండగ రోజు. తొలి పూర్తి నిడివి తెలుగు చలనచిత్రం ‘భక్త ప్రహ్లాద’ ఇప్పటికి 94 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. దానినే కొన్నేళ్ళుగా ‘తెలుగు సినిమా దినోత్సవం’ (తెలుగు సినిమా డే)గా సినీ పరిశ్రమ, సంస్థలు చేస్తున్నారు. హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో తయారై, 1932 ఫిబ్రవరి 6న రిలీజైన ఆ సినిమాతో పూర్తి నిడివి తెలుగు టాకీల నిర్మాణం ఆరంభమైంది. అంతకు ముందు మాటలు, పాటలు ఏమీ లేకుండా బొమ్మలు మాత్రం కదిలే మూగ సినిమాలు వచ్చేవి. భాషతో ప్రమేయం లేని సినిమాలు గనక అవి భాషా, ప్రాంతీయ సరిహద్దులు చెరిపేసి, అందరినీ ఆకర్షించేవి. 1931 మార్చి 14న హిందీ, ఉర్దూల సమ్మిశ్రమ భాషలో తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ విడుదలైంది. అక్కడ నుంచి క్రమంగా వివిధ భారతీయ భాషల్లో మాటలున్న సినిమాలు (టాకీలు) రావడం మన దేశంలో మొదలైంది. ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పని చేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. అదీ బొంబాయిలోనే తీశారు! నిజానికి, తెరపై తొలిసారిగా మన తెలుగు మాటలు, తెలుగు త్యాగరాయ కీర్తనలు వినిపించింది ఆ ‘కాళిదాస్’ సినిమాలోనే! అది 1931 అక్టోబర్ 31న మద్రాసులో విడుదలైంది. ఆ వెనువెంటనే మళ్ళీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోనే ఈసారి ఏకంగా 10 రీళ్ళ పూర్తి నిడివి తెలుగు టాకీగా ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది. ‘‘100% సంపూర్ణ తెలుగు టాకీ’’గా ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా బొంబాయిలోనే జరిగాయి. ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న జనం ముందుకు వచ్చింది. ఆ తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ విడుదలై, నేటితో 94 ఏళ్ళు పూర్తయ్యాయి. మన ‘భక్త ప్రహ్లాద’ రూ. 18 వేలతో, 18 రోజుల్లో నిర్మాణమైంది. ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, ప్రసిద్ధ సురభి నాటక సంస్థ నటీనటులతోనే ఎక్కువ వేషాలు వేయించి ఆ సినిమా తీశారు. అప్పటికే తెలుగునాట నాటక రచయితగా ప్రసిద్ధుడైన చందాల కేశవదాసు ఆ సినిమాలో పాటలు అందించారు. తొలి తెలుగు సినీ గేయరచయితగా కీర్తి గడించారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలా బాయి, వారి కుమారుడైన ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్య పాత్రలు పోషించారు. తరువాతి కాలంలో తెలుగు సినీ దిగ్గజంగా ఎదిగిన ఎల్.వి. ప్రసాద్ మొద్దబ్బాయిగా నటించారు. బొంబాయిలోని కృష్ణా సినిమా హాలులో ఈ ‘భక్త ప్రహ్లాద’ ముందుగా విడుదలైంది. అటుపైన విజయవాడ (శ్రీమా రుతి హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా హాలు)ల్లో ప్రదర్శితమైంది. తర్వాత మద్రాసులో ఏప్రిల్ 2న రిలీజైంది. అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన ప్రేక్షకులకు... తెరపై బొమ్మలు మాట్లాడడం, అదీ మన సొంత తెలుగు భాషలోనే ఆడడం, పాడడం పెద్ద విడ్డూరమైంది. దాంతో, ‘కాళిదాస్’, ఆ వెంటనే ‘భక్త ప్రహ్లాద’ టాకీల విడుదల సంచలనం సృష్టించింది. అలా మొదలైన మన తెలుగు సినిమా ప్రభ ఎందరో మహామహుల జీవితకృషి కారణంగా ఇవాళ దేశాల సరిహద్దుల్ని దాటింది. ఇటీవలి ‘ఆర్.ఆర్.ఆర్’తో అంతర్జాతీయంగా ఆస్కార్ అవార్డు అందుకొనే దాకా ఎదిగింది. అలనాటి ‘మల్లీశ్వరి’, ఆ మధ్య ‘శంకరాభరణం’ నుంచి నిన్నటి ‘బాహుబలి’ మీదుగా రానున్న రాజమౌళి – మహేశ్బాబుల ‘వారణాసి’ దాకా మన తెలుగు సినిమా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. -
ఉదయ్పూర్లో పెళ్లి
గత ఏడాది అక్టోబరులో విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నాల నిశ్చితార్థం జరిగినప్పట్నుంచి వీరి వివాహ తేదీ ఎప్పుడు? అనే విషయంపై చర్చ మొదలైంది. ఈ నెల 26న ఈ ప్రేమికులు... భార్యాభర్తలు కానున్నారు. రాజస్తాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్ వీరి పెళ్లికి వేదిక కానుంది. ఇంకా 20 రోజులే ఉన్నందున ఇటు విజయ్ అటు రష్మిక కుటుంబ సభ్యులు జోరుగా పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.ఇరువైపు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. అలాగే హైదరాబాద్లో మార్చి 4న సినీ, రాజకీయ ప్రముఖులు, ఇతర సన్నిహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇక గతంలో ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో విజయ్–రష్మిక జంటగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా వీరి కాంబినేషన్లో మూడో సినిమాగా ‘రణబాలి’ రూపొందుతోంది. ఈ చిత్రం సెప్టెంబరు 11న విడుదల కానుంది. -
కలర్ఫుల్ శారీలో బిగ్బాస్ దివి అందాలు.. జిమ్లో వరలక్ష్మీ శరత్కుమార్..!
జిమ్లో చిల్ అవుతోన్న వరలక్ష్మీ శరత్కుమార్..స్విమింగ్ పూల్లో నటాషా స్టాంకోవిచ్ చిల్...పింక్ శారీలో బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్స్..బ్లూ డ్రెస్లో బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ హోయలు..ట్రేడిషనల్ డ్రెస్లో సురేఖవాణి కూతురు సుప్రీత అందాలు.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pragyaa Kapoor (@pragyakapoor_) -
పెద్ది, డకాయిట్.. ఇక ది ప్యారడైజ్ వంతు..!
ఇటీవల కొద్దికాలంగా టాలీవుడ్ సినిమా పరిస్థితి కాస్తా అయోమయానికి గురి చేస్తోంది. పెద్ద హీరోల చిత్రాల రిలీజ్ డేట్లను ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుందనేది పక్కాగా ముందే చెప్పేస్తున్నారు. ఆ రోజే గ్రాండ్ రిలీజ్ అంటూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తీరా డేట్ దగ్గరికొచ్చేసరికి వాయిదా వేసుకుంటూ పోతున్నారు. భారీ బడ్జెట్, స్టార్ హీరో ఉన్నా సరే విడుదలకు వెనకాడుతున్నారు. తాజాగా టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. ఏకంగా ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. గ్లోబల్ స్టార్ చెర్రీ- బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ వాయిదా పడడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ మార్చిలో పెద్ది చూడాలనుకున్న సినీ ప్రియులకు కూడా ఈ నిరాశే మిగిల్చింది.అంతేకాకుండా అడివి శేష్ డకాయిట్ సైతం మరోసారి వాయిదా పడింది. గతంలో చాలాసార్లు వాయిదా పడినా.. ఈ ఏడాది మార్చి 19న వస్తామని ప్రకటించారు. అంతలోనే డకాయిట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఇక మార్చిలో వస్తోన్న టాలీవుడ్ మూవీ ది ప్యారడైజ్. నాని హీరోగా వస్తోన్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అదే రోజు ఉస్తాగ్ భగత్ సింగ్ విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో నాని మూవీ కూడా దాదాపు వాయిదా పడిందనే వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. దీంతో ఈ చిత్రాలన్నీ సమ్మర్కు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.దురంధర్-3 దెబ్బకేనా?ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేయడం అభిమానుల్లో నిరాశ పెంచుతోంది. తమ అభిమాన హీరోల చిత్రాలు పోస్ట్పోన్ కావడం వల్ల ఫ్యాన్స్లో ఉన్న క్యూరియాసిటీ తగ్గుతోంది. అయితే ఇలా వరుసగా టాలీవుడ్ సినిమాలు వాయిదా పడడానికి ప్రధాన కారణం ఆ ఒక్క సినిమానేనా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మార్చి 19న రానున్న దురంధర్-2 దెబ్బకేనని సగటు సినీ ప్రియుడు భావిస్తున్నారు. లేదంటే నిజంగానే షూటింగ్ పెండింగ్ వల్ల వాయిదా వేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. వరుసగా మూడు టాలీవుడ్ చిత్రాలు వాయిదా పడడంతో సినీ ప్రియుల్లో అసలేం జరుగుతోందనే డౌటానుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం శ్రీ చిదంబరం గారు, సుమతీ శతకం, యూఫోరియా, బరాబర్ ప్రేమిస్తా లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో సుమతీ శతకం, యూఫోరియా లాంటి సినిమాలపై కాస్తా బజ్ ఉంది. పెద్ద సినిమాలేవీ ఈ ఫ్రైడే బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో సినీ ప్రియులు కాస్తా నిరాశకు గురవుతున్నారు.ఇక ఈ శుక్రవారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే సంక్రాంతి మూవీ సందడి చేయనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఈ ఫ్రైడ్ ఓటీటీకి వస్తోంది. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ మూవీ రాణించలేకపోయింది. ఈ మూవీతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ ఫ్రైడే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 06 సాల్వడార్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 06 ట్రాన్స్ఫార్మర్స్ వన్(యానిమేటేడ్ మూవీ)- ఫిబ్రవరి 06 యో బెస్టీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 06అమెజాన్ ప్రైమ్ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 06 ఎల్ఓఎల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 06 వయోలెంట్ ఎండ్స్(హాలీవుడ్ మూవీ)-ఫిబ్రవరి 06జియో హాట్స్టార్ ది రాజాసాబ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06జీ5 షాబాద్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06 పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 07సన్ నెక్స్ట్ నీలకంఠ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06సోనీ లివ్ జాజ్ సిటీ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06టెంట్ కోట్టాకోంబుసివీ(తమిళ సినిమా)- ఫిబ్రవరి 06హెచ్బీవో మ్యాక్స్బాయ్స్ గో టూ జూపిటర్(యానిమేషన్ చిత్రం)- ఫిబ్రవరి 06ముబీ..లా గ్రేజియా(హాలీవుడ్)- ఫిబ్రవరి 06హులు..స్పిట్స్విల్లే(హాలీవుడ్)- ఫిబ్రవరి 06 -
ఉపాసనకు ట్విన్స్.. ఇంటికి వెళ్తున్న వీడియో వైరల్..!
ఈ ఏడాది జనవరి మాసం మెగా ఫ్యామిలీలో సంబురాన్ని తీసుకొచ్చింది. ఇటీవల ఉపాసన కవలలకు జన్మనివ్వడంతో మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. రామ్ చరణ్ దంపతులు సారి తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానలంతా సంబురాలు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు రామ్ చరణ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.తాజాగా ఉపాసన అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఉపాసన.. ట్విన్స్ను తీసుకుని ఇంటికెళ్లారు. ఆస్పత్రి నుంచి కారులో వెళ్తున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. Visuals of Mega Power Star @AlwaysRamCharan and #UpasanaKonidela as they take the #MegaTwins home!📸🫶#RamCharan #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/bkTROvEsgC— Telugu FilmNagar (@telugufilmnagar) February 5, 2026 -
అర్ధరాత్రి అదే ఆలోచన.. స్టేజీపై ఏడ్చేసిన భూమిక
హీరోయిన్ భూమిక చావ్లా చాలాకాలం తర్వాత యుఫోరియా మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమ్ మీనన్, సారా అర్జున్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదలవుతోంది. ఈక్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో భూమిక భావోద్వేగానికి లోనైంది. ఏడుపు ఆపుకోలేకపోయిన భూమికయుఫోరియాలాంటి సినిమాను తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. నిన్ననే సినిమా మొత్తం చూశాను. రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. అర్ధరాత్రి ఒంటి గంట, రెండు గంటల సమయంలో లేచి ఆ పాత్ర గురించే ఆలోచించా.. అంటూ ఏడ్చేసింది. దాంతో అక్కడే ఉన్న గుణశేఖర్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయితే దుఃఖంతో గొంతు కూరుకుపోవడంతో ఆమె ఇక మాట్లాడలేకపోయింది. ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా తీశా..తర్వాత గుణశేఖర్ మాట్లాడుతూ.. 1992లో వచ్చిన లాఠీ నా మొదటి సినిమా. యుఫోరియా నా పద్నాలుగో సినిమా. కొత్త కథ చెప్పాలని సాయశక్తులా ప్రయత్నించాను. ప్రేక్షక దేవుళ్ల సమయం, డబ్బు, విజ్ఞతకు విలువిస్తాను. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశాను. మీ సమయం, డబ్బు.. ఏదీ వృథా చేయను. తొలిసారి చూస్తున్నా..మీకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ కథకు వెన్నెముక భూమిక. తను చాలా స్ట్రాంగ్ లేడీ. తనలా ఎమోషనల్ అవడం తొలిసారి చూస్తున్నాను. సినిమా చూసిన కొందరు భయపడ్డామన్నారు. యుఫోరియా అనే టైటిల్ ఎందుకు పెట్టామో రేపు సినిమా చూశాక మీకే అర్థమవుతుంది అని చెప్పుకొచ్చాడు.చదవండి: కాబోయే భార్యపై అల్లు శిరీష్ ప్రేమ వర్షం -
'నన్ను ఛీ కొట్టిన సందర్భాలే ఎక్కువ'.. బిగ్బాస్ అమర్దీప్
బిగ్బాస్ అమర్దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్లో పాల్గొన్న హీరో అమర్ దీప్ తన కెరీర్ గురించి మాట్లాడారు. ఒక యూట్యూబర్గా తన జీవితం ప్రారంభించానని తెలిపారు. దాదాపు 13 ఏళ్ల పాటు అక్కడక్కడ చిన్న సినిమాలు చేస్తూ వచ్చానని వెల్లడించారు. ఆడిషన్స్కు వెళ్లినప్పుడు నన్ను ఛీ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఇవన్నీ చెప్పి నాపై సంపతీ క్రియేట్ చేయాలనే ఉద్దేశం లేదన్నారు. నా కష్టమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని అమర్దీప్ వెల్లడించారు. కాగా.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు.అవకాశాల కోసం తిరుగుతూ ఛీ కొట్టించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.. ఇదేదో సింపతీ కోసం చెప్పడం లేదు#AmardeepChowdary #SaylimChaudhari #SumathiSathakam pic.twitter.com/WmxM6pwUdO— Filmy Focus (@FilmyFocus) February 5, 2026 -
'ఆ స్ట్రెస్ ఏంటో నాకు కూడా తెలుసు'.. నిహారిక ఆసక్తికర కామెంట్స్
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం శ్రీ చిదంబరంగారు.ఈ మూవీకి వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా నిహారిక ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా టీమ్పై ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్తో పాటు నటులపై కొనియాడారు. మరి ముఖ్యంగా నిర్మాతలను ఉద్దేశించి మాట్లాడారు. సినిమా నిర్మించడం అనేది అంత సులభం కాదని అన్నారు. కమిటీ కుర్రోళ్లు లాంటి సినిమా నా వీపు మీద వేసుకున్నందుకు.. ఒక నిర్మాతకు ఉండే స్ట్రెస్ ఎలాంటిదో నాకు కూడా తెలుసన్నారు. మీలాంటి వాళ్లు ఇండస్ట్రీలోకి వస్తేనే సినిమా ఊపిరి తీసుకుంటుందని నా నమ్మకమని అన్నారు. ఎవరికైనా సరే మొదటి సినిమా ఫీలింగ్ అనేది లైఫ్లో ఎప్పటికీ రాదని మూవీ టీమ్ను ఉద్దేశించి మాట్లాడారు. కమిటీ కుర్రాళ్లు నా వీపు మీద వేసుకున్నందుకు.. నాకు తెలుసు ఆ స్ట్రెస్ ఎలా ఉంటుంది అనేది#VamsiTummala #SandhyaVasishta #Gopinath #VinayRatnam pic.twitter.com/86RQYx2iTc— Filmy Focus (@FilmyFocus) February 4, 2026 -
కాబోయే భార్యపై ముద్దుల వర్షం.. అల్లు శిరీష్ వీడియో
అల్లు కుటుంబంలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ గతేడాది అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లికి రెడీ అయింది. శిరీష్- నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. ఆరోజు అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు కావడం విశేషం!బ్యాచిలర్ పార్టీపెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఉండకపోతే ఎలా? సింగిల్ లైఫ్కు చెక్ పెట్టబోతున్నాడు కాబట్టి బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలిగా! అందుకే దుబాయ్లో శిరీష్- నయనిక గ్రాండ్గా బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. ఓ పడవలో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తాజాగా ఆ వీడియోను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో అల్లు అర్జున్, స్నేహతో పాటు మిగతా అందరూ నచ్చిన ఫుడ్ ఆస్వాదిస్తూ, డ్యాన్స్ చేస్తూ, ఫోటోలు దిగుతూ సంతోషంగా గడిపారు. శిరీష్ కాబోయే భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. దుబాయ్లో జనవరి 30, 31 తేదీల్లో ఈ సెలబ్రేషన్స్ జరిగాయన్నాడు శిరీష్.అలా మొదలైంది.2023 అక్టోబర్లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం జరిగింది. వీరి పెళ్లి సందర్భంగా హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక వచ్చింది. అదే పార్టీకి శిరీష్ కూడా వెళ్లగా.. అక్కడ నయనికను చూసి తొలిచూపులోనే ఇష్టపడ్డాడు. ఇద్దరి మనసులు కలవడంతో పెద్దలు కూడా ప్రేమకు పచ్చజెండా ఊపారు. అలా ఈ ప్రేమకథ వచ్చే నెలలో పెళ్లిపుస్తకంగా మారనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి: 36 తులాల బంగారం.. చెత్త శుభ్రం చేసే మహిళ కాళ్లు మొక్కిన నటుడు -
హీరో బూతు పాట.. అక్కడున్నవారికి తెలీదు: నిర్మాత
సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో ప్రమోషన్స్ది కీలక పాత్ర. కానీ, ప్రమోషన్స్లో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా రిజల్ట్ దెబ్బతింటుంది. అందుకు దండోరా సినిమాయే సాక్ష్యం. సినిమా బాగున్నప్పటికీ శివాజీ ఆడవారి వస్త్రధారణపై చేసిన నీచపు కామెంట్స్ వల్ల జనాలు దండోరాను లైట్ తీసుకున్నారు. ఇదంతా చూశాక కూడా జాగ్రత్తపడకపోతే మొదటికే మోసం వస్తుంది.బూతు పాటవిషయమేంటంటే.. బుల్లితెర హీరో ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించిన రెండో సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ తనలో సింగింగ్ టాలెంట్ బయటపెట్టాడు. అయితే అత్యుత్సాహంతో అసభ్య పదాలున్న పాట పాడాడు. స్టేజీపై అందరిముందు ఇలా బూతు పాట పాడటంతో అతడిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రహాస్పై పోలీస్ కేసు కూడా నమోదైంది.పొరపాటుకు చింతిస్తున్నాంఈ క్రమంలో బరాబర్ ప్రేమిస్తా టీమ్ ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. నిర్మాత చిన్ని మాట్లాడుతూ.. హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పాలన్న ఉద్దేశంతో ఒక పాట పాడాడు. ఆ పాటలో కొంచెం పొరపాటు జరిగింది. దానిగురించి ఈవెంట్లో ఉన్న ఎవరికీ తెలియదు. అతడు కావాలని చేయలేదు. ఏదేమైనా పొరపాటు జరిగినందుకు మేము బాధపడుతున్నాం అన్నాడు.సినిమాలో అలాంటి పాటల్లేవ్దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ.. చంద్రహాస్ పాటలో తప్పులు దొర్లాయి. అందుకు చింతిస్తున్నాం. సినిమాలో మాత్రం అలాంటి పాటలు లేవు అని వెల్లడించాడు. అటు జేడీ చక్రవర్తి కూడా ఆ పాట పాడినప్పుడు తాను అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. సినిమా ప్రమోషన్స్ డిఫరెంట్గా చేయడం తప్పు కాదని, కానీ, అవి అసభ్యంగా, ఆడవారిని కించపర్చేలాగా ఉండకూడదన్నాడు.చదవండి: మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. ఆరుసార్లు రక్తమార్పిడి: ప్రియాంక భర్త ఎమోషనల్ -
'మన శంకర వరప్రసాద్గారు' 25 రోజుల కలెక్షన్స్.. ఇండస్ట్రీ రికార్డ్
మన శంకర వరప్రసాద్ గారు ఆల్టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేశారు. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. 25రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 375 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేశారు.మొదటివారంలోనే మన శంకర వరప్రసాద్ గారు రూ.292 కోట్లు వసూలు చేసింది. కేవలం ఫస్ట్ వీక్లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు 25 రోజుల్లో రూ. 375 కోట్లు రాబట్టి ఆల్టైమ్ రీజనల్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం తెలుగు భాషలోనే విడుదలై ఈ స్థాయి కలెక్షన్స్ సాధించిన చిత్రం ఇప్పటి వరకు ఏదీ లేదు. ఇప్పటి వరకు రూ. 300 కోట్ల కలెక్షన్స్తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అత్తారింటికి దారేది, గుంటూరు కారం, సర్కారు వారి పాట, మహార్షి వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు వర్షన్లో మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే.ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం సుమారు రూ. 5 మిలియన్ల డాలర్లు రాబట్టింది. చిరు (Chiranjeevi) కెరీర్లోనే 5 మిలియన్ల డాలర్లు సాధించిన సినిమాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డు నెలకొల్పింది. ఆపై బుక్మైషోలో ఏకంగా 40 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇలా ప్రతి అంశంలో మన శంకర వరప్రసాద్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. -
ఓటీటీలో 'ది రాజాసాబ్'.. ఫ్యాన్స్కు జియో హాట్స్టార్ గుడ్న్యూస్
ప్రభాస్, మారుతి కాంబినేషన్ సినిమా ది రాజాసాబ్.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే అధికారికంగా జియో హాట్స్టార్ ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ను విడుదల చేశారు. అయితే, ఎక్స్టెండెడ్ కట్ను OTTలో విడుదల చేయనున్నట్లు జియో హాట్స్టార్ ప్రకటించింది. ప్రభాస్ ఓల్డ్ గెటప్లో ఉన్న పలు సీన్స్ను కలుపుతున్నట్లు తెలిపింది. ట్రైలర్లలో ప్రభాస్ ఓల్డ్ గెటప్ను చూపించ మేకర్స్ సినిమాలో అది కనిపించకపోవడంతో చాలా మంది సినిమాని ఆస్వాదించలేకపోయారు. ఆ తర్వాత తక్కువ నిడివితో ఉన్న కొన్ని సీన్స్ను థియేటర్ రన్లో కలిపారు. ఇప్పుడు ఓటీటీ కోసం మరికొన్ని సన్నివేశాలు కలిపేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.'రాజాసాబ్' విషయానికొస్తే.. దేవనగర సంస్థాన ఒకప్పటి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్).. ప్రస్తుతం తన మనవడు రాజు(ప్రభాస్)తో చాలా సాధారణ జీవితం గడుపుతుంటుంది. వయసు కారణంగా ఈమెకు మతిమరుపు సమస్య ఉంటుంది. కానీ తన భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తన కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా తీసుకురమ్మని మనవడికి చెబుతుంది. కానీ కనకరాజు.. రాజుని నర్సాపుర్లోని రాజ మహల్కి రప్పించుకుంటాడు. మార్మిక విద్యలెన్నో తెలిసిన కనకరాజుని రాజు అలియాస్ రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? కనకరాజు గతమేమిటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
యాటిట్యూడ్ కాదది అహంకారం.. చంద్రహాస్పై కేసు
బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్పై కేసు నమోదైంది. తను నటించిన బరాబర్ ప్రేమిస్తా అనే మూవీలో బూతు పాటపై సోషల్మీడియాలో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇటీవల జరిగిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ పాడిన పాట వివాదాలకు కారణమైంది. అందులో అసభ్య పదాలు ఉండడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో జర్నలిస్ట్ అశోక్కుమార్ తప్పబడుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. పాటలో చంద్రహాస్ ఉపయోగించిన భాష చాలా అభ్యంతరకంగా ఉందని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన చంద్రహాస్ కౌంటర్గా సదరు జర్నలిస్టును బెదిరిస్తూ ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారు. దీంతో అశోక్కుమార్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తండ్రిగా ప్రభాకర్ వైఫల్యం.. చంద్రహాస్పై సైకాలజిస్ట్ విశేష్ కామెంట్సినిమా సక్సెస్ కోసం సభ్యతాసంస్కారాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడిపోయారన్నది ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ల పేరుతో జరుగుతున్న వికృత చేష్టలు చూస్తుంటే అర్థమవుతోంది.ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ వికృత ప్రవర్తన అందుకు తాజా ఉదాహరణ. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, అది కుళ్ళిపోతున్న సామాజిక ధోరణికి నిదర్శనం.'తప్పుడు' ప్రయాణంపిల్లలకు ఆస్తులు ఇవ్వడం కంటే, సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పడం ముఖ్యం. వేదికపై మహిళలు ఉన్నారనే కనీస జ్ఞానం లేకుండా బూతు పదాలతో పాట పాడటం 'యాటిట్యూడ్' కాదు, సంస్కారహీనత. తండ్రి వెనక ఉండి నడిపిస్తున్నాడా? లేక కొడుకు దారి తప్పుతుంటే మౌనంగా చూస్తున్నాడా? కారణం ఏదైనా, పక్కనే ఉండి అసభ్యతను ప్రోత్సహించడం "తండ్రిగా పేరెంటింగ్ వైఫల్యమే." సైకాలజీ ఏం చెబుతోంది?సైకాలజీ పరిభాషలో దీనిని 'Attention Seeking Narcissism' అంటారు. అంటే, మంచిగా గుర్తింపు రానప్పుడు, అసభ్యతతోనైనా సరే వార్తల్లో ఉండాలనే పైశాచిక ఆనందం. "నేను సారీ చెప్పను" అనడం మొండితనం కాదు, తనలోని ఇన్సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి 'అహంకారం' అనే ముసుగు వేసుకుంటున్నాడు.విమర్శలను స్వీకరించలేని వాడు విజ్ఞుడవ్వలేడు, ప్రజాదరణ పొందిన నటుడవ్వలేడు.షార్ట్ కట్ సక్సెస్... లాంగ్ టర్మ్ ఫెయిల్యూర్వైరల్ అవ్వడం అంటే విజయం సాధించడం కాదు. నెగటివ్ పబ్లిసిటీతో సినిమాను గట్టెక్కించవచ్చు ఏమో కానీ, వ్యక్తిగా ప్రజల గుండెల్లో గౌరవాన్ని కోల్పోతే దాన్ని సంపాదించుకోవడానికి జీవితకాలం సరిపోదు. జెడి చక్రవర్తి వంటి సీనియర్ల అసహనం చూసైనా మారాలి.'యాటిట్యూడ్ స్టార్' కాదు... 'అజ్ఞాన స్టార్'స్టార్డమ్ అనేది ప్రవర్తనలో ఉండాలి, పిచ్చి చేష్టల్లో కాదు. సభ్యత నేర్వని విద్య, సంస్కారం లేని కళ రెండూ వ్యర్థమే. సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు... కానీ మనిషిగా ఓడిపోకూడదు. ఇప్పటికైనా ఆ తండ్రీ కొడుకులు తమ ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే, ప్రేక్షకులు ఇచ్చే తీర్పు చాలా ఘోరంగా ఉంటుంది. -
ఎవరూ సాయం చేయలేదు.. ప్రముఖ నటి మృతి
టాలీవుడ్లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్ పద్మక్క అనారోగ్యంతో మరణించారు. ఆమె కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. తన వైద్యం కోసం రూ. 35 లక్షలు ఖర్చు అవుతుందని నటి కరాటే కల్యాణి సోషల్మీడియా వేదికగా కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు పంపేందుకు ఫోన్పే, గూగుల్పే నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేశారు కూడా.. ఆయితే, దాతల నుంచి సరైన సాయం అందకపోవడంతో వాహిని మరణించడం బాధాకరం.ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వాహిని బుధవారం సాయంత్రం (2026 ఫిబ్రవరి 4న) తుదిశ్వాస విడిచారు. ఇదే విషయాన్ని నటి కరాటే కల్యాణి తెలిపారు. తనను కాపాడేందుకు చాలా ప్రయత్నం చేశానని బాధతో ఆమె పోస్ట్ చేశారు. తన సొంత ఊరు విజయనగరంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కళ్యాణి చేసిన పోస్ట్, సినీ అభిమానులను, నెటిజన్లని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.ఎవరీ వాహిని?విజయనగరంలో జన్మించిన వాహిని.. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. జయవాహిని పేరుతో ఎక్కువ ఫేమస్ అయింది. చివరగా పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో నటించింది. నరేశ్, విజయకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో కథానాయికగా వాహిని నటించి ప్రశంసలు పొందింది.కొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్తో పోరాడుతున్నారని తనకు ఆర్థిక సాయం చేయాలని కరాటే కల్యాణి కోరారు. బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్స మొత్తానికి రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల మేర అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత ఖర్చు ఆమె కుటుంబం భరించలేదని కల్యాణి చెప్పుకొచ్చారు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు ఇవ్వాలని కల్యాణి కోరారు. కానీ, సరైన సమయంలో ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడంతో మరణించారు. కేవలం డబ్బు కారణంగా వాహిని మరణించారని తెలుసుకున్న నెటిజన్లు బాధతో పోస్టులు పెడుతున్నారు. -
'యానిమల్' సీక్వెల్పై ఆప్డేట్ ఇచ్చిన సందీప్రెడ్డి
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా మూవీ ‘యానిమల్’ భారీ విజయం అందుకుంది. దీంతో సీక్వెల్గా ‘యానిమల్ పార్క్’ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ‘యానిమల్’ వచ్చి సుమారు 3ఏళ్లు కావస్తుంది. కానీ, సీక్వెల్ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు సందీప్రెడ్డి పార్ట్-2 గురించి పలు విషయాలు పంచుకున్నారు.ఫిబ్రవరి 13న యానిమల్ సినిమా జపాన్లో విడుదల కానుంది. ఈ క్రమంలో రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి ప్రమోషన్స్లో పాల్గొన్నారు. జపాన్ అభిమానులతో సందీప్ మాట్లాడుతూ ‘యానిమల్ పార్క్’ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. 2027లో షూటింగ్ ప్రారంభిస్తామని ప్రకటించారు. 2028లో విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో రణ్బీర్ హీరోగా, విలన్గా నటించనున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రాజెక్ట్ స్పిరిట్ పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుందని సందీప్ వెల్లడించారు. ఈ సీక్వెల్ మొదటి భాగం కంటే మరింత దూకుడుగా ఉంటుందని పేర్కొన్నారు. 2023లో విడుదలైన యానిమల్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ ఫ్రాంచైజీలో మూడు సినిమాలుంటాయని గతంలో రణ్బీర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు
జాగ్రత్త... ఈ సినిమాలో దెయ్యం ఉంది, ఇదో హారర్ సినిమా. అయినా కంగారుపడకుండా సరదాగా సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా సర్వం మాయ. హారర్ సినిమా అంటే దెయ్యం, అస్థిపంజరం, స్మశానం... ఇవే ఇప్పటి ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే తరుణంలో దర్శకుడు అఖిల్ సత్యన్ ఓ మాయ చేసి ఈ సర్వం మాయ హారర్ సినిమాలోని దెయ్యాన్ని చూసే ప్రేక్షకులు కూడా ఇష్టపడేట్టు చేశాడు. నిజానికి ఇది ఓ గొప్ప ప్రయోగమనే చెప్పాలి. ఆ ప్రయోగంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించాడు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం. సర్వం మాయ (Sarvam Maya movie) ఓ మళయాళ సినిమా. ఈ సినిమాలో కథానాయకుడైన ప్రబేందు స్వతహాగా నాస్తికడైనా కుల వృత్తి ప్రకారం అర్చకాలు, పూజా పునస్కారాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రబేందు మంచి గిటారిస్టు కూడా. ప్రబేందు తన బంధువైన రూపేష్ బలవంతం చేయడంతో అనుకోకుండా ఓ రోజు దెయ్యం వదిలించే పూజను ఒప్పుకుంటాడు. ఆ పూజలో తాను వదిలించిన దెయ్యం తననే పట్టుకుంటుంది. ఇక అక్కడ నుండి కథ రసరంజకంగా సాగుతుంది. దెయ్యం అంటే ఆషామాషి దెయ్యం కాదు. ఆ దెయ్యాన్ని చూస్తే ప్రేక్షకులు కూడా తమకూ అలాంటి దెయ్యం కనిపిస్తే బాగుండునని అనుకోక మానరు. అన్నట్టు ఆ దెయ్యానికి ఓ పేరు కూడా ఉంటుంది అదే డెలలూ. ఈ కథలో ప్రబేందును కలిసిన ఆ డెలలూ చేసే అల్లరి, చిలిపితనం ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ డెలలూ తాను ఎవరినో, ఎందుకు చనిపోయి దెయ్యం అయిందో అన్న సమాధానం కోసం వెతుకుతూ ప్రబేందుని పట్టుకుంటుంది. మరి ఆ డెలలూ ఆచూకీ కనిపెట్టడంలో ప్రబేందు డెలలూకి సాయపడతాడా, అలాగే ఆ డెలలూ వల్ల ప్రబేందుకి కలిగిన ఇబ్బందులు ఏంటి అనేవి మాత్రం హాట్ స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న సర్వం మాయ చూడాల్సిందే. ఈ సినిమా కాస్త నెమ్మదిగా ప్రారంభమైనా దెయ్యం వచ్చినప్పటి నుండి మహా సరదాగా సాగిపోతుంది. కాకపోతే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజన్లో పడేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా మొత్తం డెలలూ కోసం ఓసారి చూడాల్సిందే. ఇంకెందుకాలస్యం వీకెండ్ హాట్ స్టార్ ట్యూన్ చేసి డెలలూతో జత కట్టండి. -
ఓటీటీలో 'పరాశక్తి.. తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్
సంక్రాంతి సందర్భంగా శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి’ కోలీవుడ్లో విడుదలైంది. తెలుగులో థియేటర్స్ కొరత కారణంగా ఇక్కడ రిలీజ్ కాలేదు. అయితే, డైరెక్ట్గా తెలుగు వర్షన్ను ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. సినిమా విషయంలో పలు విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా రూ. 100 కోట్లకు పైగానే రాబట్టింది.పరాశక్తి(Parasakthi) సినిమా జనవరి 7న జీ5(ZEE5) ఓటీటీలోకి రానుంది. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ వర్షన్ కూడా విడుదల కానుంది. టాలీవుడ్లో శివకార్తికేయన్కు భారీ క్రేజ్ ఉండటంతో పరాశక్తి చిత్రాన్ని చూసేందుకు తెలుగు ఫ్యాన్స్ ఆసక్తి కనపరుస్తున్నారు. ఇదే సినిమాతో నటి శ్రీలీల హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయం అయిన విషయం తెలిసిందే.1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి సినిమా తెరకెక్కింది. ఆ సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. ఆ గొడవల సమయంలో ఇద్దరు సోదరులు, చెజియాన్, చిన్నదురై జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయనేది కథ యొక్క ముఖ్యాంశం. ఇందులో బాలీవుడ్ నటి సంధ్య మృదుల్ ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ప్రీ-క్లైమాక్స్ లో రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్, డాలీ ధనంజయ కీలకమైన అతిధి పాత్రలో కనిపిస్తారు. -
శింబు కొత్త చిత్రం షురూ!
లిటిల్ స్టార్ నుంచి లిటిల్ సూపర్స్టార్ వరకు ఎదిగిన నటుడు శింబు. ఈయన నటించే నూతన చిత్రం ప్రారంభం కాబోతోందంటేనే అభిమానులకు పండగ. అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా బాధ పడరు. శింబు కొత్త చిత్రంలో నటించడమే చాలు అభిమానులకు. కాగా ఈయన మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న కమలహాసన్తో కలసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్స్ లైఫ్ చిత్రం డిజాస్టర్గా మారింది. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ అనే గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంలో శింబు హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ రేర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అరసన్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా శింబు కథానాయకుడిగా నటించనున్న చిత్రం షురూ అయ్యింది. దీన్ని డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు తెరకెక్కించనున్నారు. వరుస విజయాలతో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు గాంచిన ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మంగళవారం శింబు పుట్టిన రోజు సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం శింబు నటిస్తున్న అరసన్ చిత్రం పూర్తి అయిన తరువాత ఈ చిత్రం ప్రారంభం అవుతుందని మీడియాకు విడుదల చేసిన ప్రకనటనలో యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. కొద్ది రోజులు ఆగండి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం అని దర్శకుడు అశ్వద్ మారిముత్తు ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. కాగా తన 43వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న శింబుకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆయన అభిమానులు అయితే పుల్ ఖుషీ అవుతున్నారు. -
మా సినిమా హాయిగా ఉంటుంది
శ్రీ చిదంబరంగారు’ని క్రౌడ్ ఫండెడ్ మూవీగా ఈ టీమ్ ఆరంభించింది. నాలుగేళ్లుగా వీళ్లు పడుతున్న కష్టం చూసి మా అమ్మాయి వినీషా రెడ్డి... ఈ సినిమా మనం చేద్దామని చెప్పింది. ఈ కథ వినగానే మాకూ బాగా నచ్చింది. కొత్తవాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘శ్రీ చిదంబరంగారు’ చిత్రాన్ని నిర్మించాం’’ అని నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరంగారు’. వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చింతా గోపాలకృష్ణా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ కథతో తీసిన ఈ మూవీలో ఫైట్స్, యాక్షన్ గోల ఉండదు. ప్రేక్షకులు రెండు గంటల పాటు హాయిగా సేద తీరేలా మా సినిమా ఉంటుంది. వంశీ, సంధ్య పాత్రలు చాలా బాగుంటాయి. వినయ్ రత్నం చక్కగా తెరకెక్కించాడు. మా సినిమా ‘పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం’ చిత్రాలకంటే ఇంకా బాగుంటుందని చెప్పగలను. చందు రవి సంగీతం, కీరవాణిగారు పాట పాడటం మాకు ప్లస్. మా మూవీని వంశీ నందిపాటి పంపిణీ చేస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ వారం మా సినిమాతో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలూ ప్రేక్షకాదరణ పొందాలి. మా సినిమా టిక్కెట్ ధర కేవలం 99 రూపాయలుగా నిర్ణయించాం. భవిష్యత్లో కె. విశ్వనాథ్గారి తీసిన తరహా సినిమాలు తీయాలని ఉంది. మా సంస్థలో ప్రస్తుతం ‘రావు బహదూర్’ అనే సినిమాతో పాటు కొత్త దర్శకుడితో మరో మూవీ చేస్తున్నాం. అదే విధంగా 2027లో ‘క’ మూవీ సీక్వెల్ను రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు. -
చిన్న సినిమాలను ప్రోత్సహించాలి
‘‘ఎర్ర చీర’ మూవీ ట్రైలర్ చాలా కొత్తగా అనిపించింది. కచ్చితంగా టికెట్ కొనుక్కుని ఈ సినిమా చూస్తాను. చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ సినిమాలు తీస్తున్నారు. చిన్న సినిమాలకు ప్రోత్సాహం లభించాలి. సీఎం రేవంత్ రెడ్డిగారు అందుకు కృషి చేస్తున్నారు. ‘ఎర్ర చీర’ విజయం సాధించాలి’’ అని మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు. సుమన్ బాబు దర్శకత్వం వహించి, లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఎర్ర చీర’. కారుణ్య చౌదరి హీరోయిన్గా, బేబీ సాయి తేజస్విని ముఖ్య పాత్ర పోషించారు. బేబీ డమరి సమర్పణలో ఎన్వీవీ సుబ్బారెడ్డి, సీహెచ్ వెంకట సుమన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 6న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి మధు యాష్కీ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్వీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘300 థియేటర్స్లో మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అని చెప్పారు. -
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
దర్శకుడు రాజమౌళి సినిమాలకు పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో హడావుడి చేయడం ఆయన స్టైల్. తాజాగా వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ రిలీజ్ తర్వాత కేవలం రెండు ఫ్లెక్సీలు వారణాసిలో కట్టడం ద్వారా సోషల్ మీడియాలో భారీ చర్చ రేపారు. విడుదల ఇంకా ఏడాది దూరంలో ఉన్నప్పటికీ, ఇప్పటికే ఓటీటీ అమ్మకాలపై మార్కెటింగ్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్ చిన్నది కాదు. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. సినిమాకు మాక్సిమమ్ రాబడి ఓటీటీ రైట్స్ ద్వారానే వస్తుంది. వరల్డ్ వైడ్ రైట్స్ రూపంలో అమ్మకం జరిగాలి. దానికి నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలే ఆ స్థాయి డీల్ క్లోజ్ చేయగలవు. లేదా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో జియో, హాట్స్టార్ వంటి సంస్థలు ముందుకు రావచ్చు. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ డౌన్లో ఉంది. ఏడాది క్రితం అయితే భారీ రేటు సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ రిలీజ్ సమయంలోనే డీల్ క్లోజ్ కావాల్సింది. కానీ అది జరగలేదు. నెలలు గడిచిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటించారు. అంతేకాక రాజమౌళి ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఓటీటీ డీల్ కోసం జరుగుతోందని అనుకోవాల్సి వస్తోంది. సోషల్ మీడియాలో వారణాసి ఓటీటీ రైట్స్ 600 కోట్లకు పైగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ నటించిన స్పిరిట్ ఓటీటీ డీల్ 170 కోట్లుగా టాక్ ఉంది. అది కూడా పాన్ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెక్ట్. కానీ పాన్ వరల్డ్ స్థాయికి చేరలేదు. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా క్రేజ్ వేరే. రాజమౌళి సినిమాల స్పాన్ వేరే అయినప్పటికీ లెక్కలు వేసుకుంటే 340–440 కోట్ల మధ్యే డీల్ సాధ్యపడొచ్చని అంచనా.650 కోట్ల రేంజ్లో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. అవి కేవలం క్రేజ్ కోసం పుట్టినవే. నిజంగా అలాంటి హెవీ డీల్ జరిగితే, అమౌంట్ బయటకు రాకపోయినా, డీల్ ఫైనల్ అయిన వార్త మాత్రం ముందుగానే బయటకు వచ్చేది. డీల్ క్లోజ్ అయితే సినిమా చకచకా ఫినిష్ చేయడంపై టీమ్ దృష్టి పెట్టేది. ప్రస్తుతం వారణాసి ఓటీటీ రైట్స్ 600–650 కోట్ల రేంజ్లో క్లోజ్ అయ్యాయని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇది సోషల్ మీడియా హైప్ మాత్రమే. వాస్తవానికి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో 400 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయితే అదే పెద్ద డీల్ అని చెప్పొచ్చు. -
బంగారంలా మెరిసిపోతున్న కాజోల్.. పొట్టి డ్రెస్లో జ్యోతి పూర్వాజ్ అందాలు..!
బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసిన వితికా శేరు..పొట్టి డ్రెస్లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ హోయలు..బంగారంలా మెరిసిపోతున్న బాలీవుడ్ భామ కాజోల్..అమ్మకు బర్త్ డే విషెస్ చెప్పిన హీరోయిన్ శ్రీలీల..టాలీవుడ్ నటి సాహితి దాసరి లేటేస్ట్ పిక్స్.. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) -
ఓటీటీకి మనశంకర వరప్రసాద్గారు... అఫీషియల్ డేట్ వచ్చేసింది
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది.బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను జీ5 సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. అయినప్పటికీ ఫిబ్రవరి 11 నుంచే ఓటీటీకి రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా జీ5 తమ ఫ్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల జాబితాను రివీల్ చేసింది. ఇందులో మనశంకర వరప్రసాద్గారు ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్కు రానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో టాలీవుడ్ సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. -
బూతు పాటపై కాంట్రవర్సీ.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రియాక్షన్
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాడు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు పాటలో ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చకు తెరతీశాడు. ఈ కార్యక్రమానికి నటుడు జేడీ చక్రవర్తి కూడా హాజరయ్యారు. ఆ పాట పాడుతున్నప్పుడు అక్కడి వెళ్లిపోవాలనిపించిందని జేడీ అన్నారు. తాజాగా ఈ వివాదానికి కారణమైన హీరో చంద్రహాస్ రియాక్ట్ అయ్యారు. ఆ పాట పాడినందుకు తనకెలాంటి బాధ లేదన్నారు. నేను ఎవరికీ సారీ చెప్పాల్సిన పనిలేదని చంద్రహాస్ అన్నారు. ఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదని తెలిపారు. మూడున్నర నిమిషాల పాటలో 5 సెకన్స్ కట్ చేసి బూతు పురాణం అంటున్నారని చంద్రహాస్ చెప్పారు. నేను చాలామందితో పనిచేశానని.. ఎవరితోనూ తప్పుగా వ్యవహరించలేదని యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వెల్లడించారు.(ఇది చదవండి: యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ)అంతేకాకుండా ఓ మీడియా ప్రతినిధిపై చంద్రహాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మా ఇంట్లో మహిళలను కించపరిచేలా మాట్లాడారని చంద్రహాస్ ఆరోపించారు. లాయర్లతో మాట్లాడుతున్నానని నిన్ను మాత్రం వదిలిపెట్టనని చంద్రహాస్ అన్నారు. నీకు కేవలం 24 గంటలు మాత్రమే టైమ్ ఇస్తున్నానని చంద్రహాస్ డెడ్లైన్ విధించారు. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చంద్రహాస్ వెల్లడించారు. ఆ పాట పాడినందుకు బాధపడటం లేదునేను ఎవరికీ సారి చెప్పనుఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదుమూడున్నర నిమిషాల పాటలో 5 సెకండ్లు కట్ చేసి బూతు పురాణం అంటున్నారుఎన్ని సినిమాల్లో బీప్ సౌండ్ వాడరు?- Attitude Star Chandrahas https://t.co/L4wWEoG8US pic.twitter.com/dIggklzmj4— cinee worldd (@Cinee_Worldd) February 4, 2026 -
ఓ టార్చర్ ప్రేమ కథా చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల
సన్నీ మాదాల, మౌనిక జంటగా నటిస్తోన్న చిత్రం ఓ టార్చర్ ప్రేమ. ఈ మూవీకి శ్రీకర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా మాదాల రంగారావు మనవడు మాదాల రవి తనయుడు సన్నీ మాదాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మౌనిక సైతం ఈ చిత్రం ద్వారానే హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ను ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ' మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల మూడోతరం హీరో పరిచయం అవుతున్నాడు. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం ప్రేమ మార్గంని ఎన్నుకున్నాడు. ఓ టార్చర్ ప్రేమ అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రం విజయవంతం కావాలి అని అన్నారు. దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ.. "ఇది ఒక మంచి ప్రేమకథా చిత్రం. ఈ చిత్రంలో నవ్వులు చిందించే సన్నివేశాలతో పాటు ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు. ఈ మూవీలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధర్థ్ వర్మ, విష్ణు ప్రియా, యాదమ్మ రాజు కీలక పాత్రలు పోషించారు. -
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్.. నానితో పోటీ పడాల్సిందే..!
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.అయితే అదే రోజున నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే డేట్ కూడా ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తోన్న నాని మూవీ వాయిదా పడుతుందా? లేదంటే అదే రోజు రిలీజవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేశారు. మార్చి 27న రావాల్సిన పెద్ది ఏకంగా ఏప్రిల్ 30కి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నాని ప్యారడైజ్ పోస్ట్ పోన్ అవుతుందా?.. ఉస్తాద్ భగత్ సింగ్తో బాక్సాఫీస్ బరిలో నిలుస్తుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
జెనీలియా వేగన్గా ఎందుకు మారిపోయిందో తెలుసా?
జెనీలియా.. ఈ పేరు చెప్పగానే చాలామందికి హ..హ.. హాసిని అన్న డైలాగ్ గుర్తుకొస్తుంది. సై, హ్యాపీ, బొమ్మరిల్లు, రెడీ వంటి పలు సినిమాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించింది. తర్వాత హిందీ, మరాఠి సినిమాలతో బిజీ అయిపోయింది. అయితే గతేడాది జూనియర్ మూవీతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చింది.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి తప్పకుండా టైం కేటాయిస్తుంది. భర్త రితేశ్, పిల్లలు రియాన్, రాహుల్తో సరదాగా గడుపుతుంది. అయితే కొడుకు అడిగిన ఒకే ఒక్క ప్రశ్నతో జెనీలియా పూర్తి శాకాహారిగా మారిపోయిందన్న విషయం మీకు తెలుసా?కొడుకు అమాయక ప్రశ్నజెనీలియా (Genelia D'souza) జంతు ప్రేమికురాలు. కానీ చిన్నప్పటినుంచి పుష్టిగా మాంసం లాగించేది. ఒకరోజు ఆమె పెద్ద కొడుకు రియాన్ స్కూల్ నుంచి రాగానే తల్లిని ఓ ప్రశ్న అడిగాడు. అమ్మా.. నువ్వు మన ఫ్లాష్ (కుక్క)ను ప్రేమిస్తావు, కానీ కోడిని మాత్రం తింటావు. రెండింటికి మధ్య తేడా ఏముంది? రెండూ జంతువులే కదా? అని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న ఆమెను ఆలోచనలో పడేసింది. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న ఆలోచనవైపు నడిపించింది. భార్యాభర్తలిద్దరూ..అలా జెనీలియా 2017లో శాకాహారిగా మారింది. నాన్వెజ్కు దూరంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తోంది. అయితే మొదట్లో కోడిగుడ్లు, చీజ్, ఇతరత్రా డెయిరీ పదార్థాలు మాత్రం ఆహారంలో తీసుకునేది. శాఖాహారం తీసుకున్నప్పుడు తన శరీరంలో పాజిటివ్ మార్పులు వచ్చాయని సంతోషించింది. జెనీలియా భర్త రితేశ్ దేశ్ముఖ్ కూడా ఒకప్పుడు మాంసప్రియుడే. కానీ ఒకానొక సమయంలో అది కరెక్ట్ కాదనిపించడంతో 2016లో నాన్వెజ్ తినడం మానేశాడు.వేగనిజం2020లో కరోనా తాండవిస్తున్న సమయంలో దంపతులిద్దరికీ ఇంట్లో బోలెడంత సమయం దొరికింది. అప్పుడే వీరిద్దరూ నెమ్మదిగా డెయిరీ పదార్థాలకు కూడా స్వస్తి పలికి వేగన్కు జై కొట్టారు. వేగన్ అంటే.. జంతు సంబంధిత ఆహారాలకు (మాంసంతో పాటు పాలు, గుడ్లు, నెయ్యి వంటివి) దూరంగా ఉంటూ మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకోవడం. దీన్నే వేగనిజం అని కూడా అంటారు.చదవండి: బుల్లెట్ సునీల్గా రాజశేఖర్.. గ్లింప్స్ చూశారా? -
మెగా ఫ్యాన్స్కు షాక్.. పెద్ది మూవీ రిలీజ్ వాయిదా
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా అభిమానులకు బిగ్ షాకిచ్చింది మూవీ టీమ్. పెద్ది విడుదలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.పెద్ది మూవీ కొత్త రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమాను వాయిదా వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీంతో మార్చిలో పెద్ది చూడాలనుకున్న మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. దురంధర్-2 వల్లేనా?అయితే పెద్ది మూవీ వాయిదా వేయడంపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ దురంధర్-2 మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సారి దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దిని వాయిదా వేసి ఉంటారని నెటిజన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే అడివి శేష్ నటించిన డకాయిట్ సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే. #PEDDI will see you on 30th APRIL, 2026 💪🏻🔥@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @vriddhicinemas @VenkataSKilaru @MythriOfficial @SukumarWritings @PeddiMovieOffl pic.twitter.com/TTfrxi773W— Ram Charan (@AlwaysRamCharan) February 4, 2026 -
బుల్లెట్ సునీల్గా రాజశేఖర్.. గ్లింప్స్ చూశారా?
'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు హీరో శర్వానంద్. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం బైకర్. ఇందులో శర్వానంద్ బైకర్గా నటించాడు. పర్ఫెక్ట్ బైకర్గా కనిపించేందుకు ప్రత్యేకమైన ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్నాడు. బాగా బరువు తగ్గాడు కూడా! ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదల కానున్నట్లు ప్రకటించారు.బుల్లెట్ సునీల్బుధవారం (ఫిబ్రవరి 4న) నాడు బైకర్ నుంచి బుల్లెట్ సునీల్ను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్ వదిలారు. ఈ స్పోర్ట్ క్రికెట్ కాదు సునీల్, ఎవరూ పట్టించుకోరు. టైం వేస్ట్ చేసుకోకు అన్న వాయిస్తో టీజర్ మొదలైంది. 'సునీల్ మాజీ మోటోక్రాస్ రేసర్, అప్పట్లో బుల్లెట్ సునీల్ అనేవారు.కీలక పాత్రలో రాజశేఖర్18 ఇండియన్ ఛాంపియన్షిప్స్.. 57 సౌత్ జోన్ టైటిల్స్.. 100కి పైగా రేసుల్లో పాల్గొన్నాడు' అంటూ రాజశేఖర్ను రేసర్గా పరిచయం చేశారు. గ్లింప్స్లో రాజశేఖర్ లుక్స్ చూస్తుంటే గట్టి కమ్బ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో సింహరాశి, అల్లరి ప్రియుడు వంటి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజశేఖర్. 2017లో పీఎస్ గరుడవేగతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తర్వాత కొన్ని సినిమాలు చేశాడు కానీ ఆకట్టుకోలేకపోయాడు.సినిమాబైకర్ విషయానికి వస్తే మూడు తరాల నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బైక్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్లను ఇండోనేషియాలో చిత్రీకరించారు. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించాడు. చదవండి: 2 నెలలుగా నరకం చూస్తున్నా: వడాపావ్ గర్ల్ -
రవితేజ సోదరుడి తనయుడి చిత్రం.. టీజర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనున్నారు.తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మకు పూజలు చేయడం టీజర్లో చూపించారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. -
ఓటీటీకి వచ్చేసిన సంక్రాంతి సూపర్ హిట్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ది రాజాసాబ్తో పాటు చిరంజీవి మనశంకర వరప్రసాగద్గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో ప్రభాస్ మూవీ అంత మెప్పించలేపోయింది. మిగిలిన నాలుగు చిత్రాలు ఆడియన్స్ను అలరించాయి.అంతేకాకుండా చివర్లో విడుదలైన శర్వానంద్ మూవీ నారీ నారీ నడుమ మురారి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.love met chaos and chose to arrive on your screens 👀#NaariNaariNadumaMurariOnPrime, Watch Now https://t.co/JCx7tvOlqr@ImSharwanand @AnilSunkara1 @iamsamyuktha_ @sakshivaidya99 @RamAbbaraju @ItsActorNaresh @Composer_Vishal @dopyuvraj @gnanashekarvs @ramjowrites @brahmakadali… pic.twitter.com/KxGZsv5EGZ— prime video IN (@PrimeVideoIN) February 3, 2026 -
'ఆట' డ్యాన్స్ షో కొత్త సీజన్.. ఎప్పటినుంచంటే?
డ్యాన్స్ రియాలిటీ షోలలో ఒక ప్రభంజనం ఆట. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన ‘ఆట’మరోసారి వచ్చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మరోసారి ఎందరో ప్రతిభావంతులైన డ్యాన్సర్లను వెలుగులోకి తీసుకురాబోతోంది. బుల్లితెర పాపులర్ డ్యాన్స్ షో ‘ఆట’ సరికొత్త సీజన్ ఫిబ్రవరి 7న ప్రారంభమవుతోంది. జీ తెలుగులో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. టీవీలో కంటే రెండు రోజుల ముందుగా ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఎపిసోడ్స్ రిలీజ్ కానున్నాయి.16 మంది మధ్య పోటీఈసారి ఆట షోకి ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఆట టైటిల్ కోసం నలుగురు మెంటార్స్ కావ్య, విష్ణుప్రియ, వంశీ, సమీరా భరద్వాజ్ మార్గదర్శకత్వంలో 16 మంది ప్రతిభావంతులు పోటీపడనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రాధికా శరత్కుమార్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మెగా డాటర్ నిహారిక కొణిదెల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఆట షో ప్రారంభ ఎపిసోడ్లో అద్భుతమైన ప్రదర్శనలతో కంటెస్టెంట్స్ పోటీపడేందుకు సిద్ధమయ్యారు. హిట్ సాంగ్స్తో మొదలుఇటీవల బ్లాక్బస్టర్ హిట్ సాంగ్స్ ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి..’, ‘చుట్టమల్లే..’, ‘గిర గిర గిర గింగిరానివే..’ వంటి పాటలకు అద్భుతమైన కొరియోగ్రఫీతో కంటెస్టెంట్లు, మెంటర్లు డ్యాన్స్ చేసి అలరించనున్నారు. అంతేకాదు, యాంకర్ సుధీర్ ప్రస్థానంపై కంటెస్టెంట్ అక్షత ప్రదర్శన అందరినీ ఆకట్టుకోనుంది. కొరియోగ్రాఫర్గా రాణిస్తున్న రాప్టర్ యువరాజ్ కంటెస్టెంట్గా ఆట టైటిల్ పోరులో దిగనున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు, భావోద్వేగ క్షణాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగనున్న ఈ షోను ఈ వీకెండ్ నుంచి చూసేయండి.. -
అసభ్య కామెంట్స్.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇన్స్టాగ్రామ్లో ఈషా రెబ్బ పెట్టిన పోస్ట్కు ఓ వ్యక్తి అసభ్యంగా కామెంట్ పెట్టాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఈషా.. అతడి ఐడీతో పాటు కామెంట్ను చూపించింది.కేసు నమోదుఆమె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇలా చెండాలంగా కామెంట్స్ పెట్టినట్లు గుర్తించారు. ప్రస్తుతం కేసు విచారణ జరుపుతున్నారు. కాగా ఈషా రెబ్బ.. ఇటీవల 'ఓం శాంతి శాంతి శాంతిః' సినిమాలో నటించింది.చదవండి: చిన్నతనంలో నేను పడ్డ బాధ.. అందుకే పిల్లలు వద్దు: నటి -
'ధురంధర్ 2'కి భయపడుతున్నారా? ఎందుకీ వాయిదాలు?
కొన్ని సినిమాల విషయంలో అప్పుడప్పుడు ఊహలకు అందనివి జరుగుతుంటాయి. రెండు నెలల క్రితం అలాంటి ఓ సంచలనానికి కారణమైంది 'ధురంధర్' అనే మూవీ. రిలీజ్ వరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. రెగ్యులర్ ఆడియెన్స్ కాస్తోకూస్తో ఆసక్తి చూపించారు గానీ సాధారణ ప్రేక్షకుడికి అయితే థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో సినిమా ఉందని కూడా తెలియదు. అలాంటిది బ్లాక్బస్టర్ హిట్ కొట్టేసరికి.. దేశవ్యాప్తంగా పెద్ద డిస్కషన్కి కారణమైంది. త్వరలో రాబోతున్న దీని సీక్వెల్ ప్రభావం.. తెలుగు చిత్రసీమపై గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)సాధారణంగా వేసవిని తెలుగు దర్శకనిర్మాత మిస్ చేసుకోరు. ఈసారి కూడా అందుకు తగ్గట్లే డకాయిట్, పెద్ది, ప్యారడైజ్ లాంటి మూవీస్ రిలీజ్ అవుతాయని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్, సినిమా లవర్స్ చాలా ఉత్సాహపడ్డారు. తీరా చూస్తే ఈ తెలుగు చిత్రాలన్నీ ఇప్పుడు వాయిదా పడటం గ్యారంటీ. అధికారిక ప్రకటనలు రాలేదు గానీ వాయిదా పడటం అయితే పక్కా.చరణ్ 'పెద్ది', నాని 'ప్యారడైజ్' సినిమాల షూటింగ్ చాలా పెండింగ్లో ఉంది. దీంతో ఇవి వాయిదా పడ్డాయంటే సరేలే ఏదో అనుకోవచ్చు. కానీ అడివి శేష్ 'డకాయిట్' మాత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మార్చి 19న పక్కా వస్తామని శేష్ కూడా కొన్నాళ్ల ముందు జరిగిన ప్రెస్మీట్లో చెప్పాడు. ఇదంతా 'ధురంధర్' విడుదలకు ముందు జరిగింది. కానీ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యేసరికి.. రిస్క్ ఎందుకని 'డకాయిట్' టీమ్ వెనకడుగేసింది. ఏప్రిల్లో రావాలని ప్లాన్స్ చేసుకుంటున్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)మరోవైపు 'పెద్ది' కోసం అనుకున్న రిలీజ్ తేదీకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం వరకు రూమర్స్ వచ్చాయి. ఎప్పుడైతే 'ధురంధర్ 2' రిలీజ్ పక్కా అని క్లారిటీ వచ్చిందో.. 'ఉస్తాద్' టీమ్ రిస్క్ వద్దులే అనుకుందనే టాక్ వినిపిస్తుంది. వీళ్లు కూడా ఏప్రిల్ నెలనే టార్గెట్ చేస్తున్నారని టాక్. ఈ లెక్కన చూసుకుంటే మార్చిలో ప్రామిసింగ్ తెలుగు సినిమా ఒక్కటి కూడా వచ్చే సాహసం చేయట్లేదనిపిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2'కి దాదాపు లైన్ క్లియర్.అయితే ఈ చిత్రానికి 'టాక్సిక్' పోటీగా నిలబడుతోంది. కన్నడ స్టార్ యష్ నటించిన గ్యాంగస్టర్ డ్రామా మూవీ ఇది. మార్చి 19నే 'ధురంధర్ 2'తో పాటు ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. కాకపోతే ప్రమోషన్ పరంగా చాలా వీక్గా ఉన్నారు. సాంగ్స్, ట్రైలర్స్ లాంటివి రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు 'టాక్సిక్' వాయిదా పడటానికి అవకాశాల్లేవని తెలుస్తోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. విజయ్ 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థనే యష్ మూవీ కూడా తీసింది. ఇది కూడా వాయిదా పడితే కోట్లలో నష్టాలు ఉండొచ్చు. అందుకే 'ధురంధర్ 2' పోటీలో ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదు.(ఇదీ చదవండి: 'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?) -
యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ
ఈ మధ్యన తెలుగు సినిమాల్లోని పాటల్లో బూతు సాహిత్యం ఎక్కువవుతోంది. సోషల్ మీడియాలో ఉపయోగించే కొన్ని పదాల్ని.. రచయితల ట్రెండింగ్ పేరిట యదేచ్ఛగా వాడేస్తున్నారు. తాజాగా యాటిట్యూడ్ స్టార్ అనబడే హీరో చంద్రహాస్.. అందరూ చూస్తుండగా ఏకంగా స్టేజీపైనే బూతు పాట పాడాడు. దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ పాట విని జేడీ చక్రవర్తి చప్పట్లు కొట్టాడని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అదే విషయమై జేడీ స్పందించాడు. చంద్రహాస్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.'చంద్రహాస్ ఆ పాట పాడుతున్నప్పుడు షాక్లో ఉన్నా. ఏం పాడుతున్నాడో మొదట నాకు అర్థం కాలేదు. కానీ తన పాటని నేను ఎంజాయ్ చేస్తున్నట్లు, చప్పట్లు కొడుతున్నట్లు కొందరు ఎడిట్ చేసి నన్ను ట్రోల్ చేస్తున్నారు. అసలు నేనా పని చేయలేదు. కావాలంటే పూర్తి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. ఈవెంట్లలో గెస్టులు.. స్టేజీపై ఎవరేం మాట్లాడుతున్నారో సరిగా పట్టించుకోరు. అలాంటి పరిస్థితుల్లో ఉండటం వల్లే అతడి పాటని సరిగా పట్టించుకోలేదు. నా పక్కనున్న అమ్మాయికి తెలుగు అర్థంకాక పాప చప్పట్లు కొట్టింది. అది చూసిన చాలామంది నేను కూడా చప్పట్లు కొట్టాననుకున్నారు. నేను బూతులు మాట్లాడను. నా ముందు ఎవరు మాట్లాడినా సహించను'(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. 'జబర్దస్త్' కమెడియన్ కన్నుమూత)'ఓసారి సెట్లో బూతులు మాట్లాడాడని ఓ దర్శకుడిని కొట్టా. నా పక్కన అమ్మాయికి అతడు బూతులు పాడుతున్నాడని చెబితే చప్పట్లు కొట్టడం ఆపేసి షాకైంది. పాట టైంలో జయంత్, నేను ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. అప్పుడే లేచి వెళిపోదామనుకున్నాను. కానీ పూజా బేడీ.. అలా చేయొద్దని నన్ను వారించింది. అందుకే సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. చంద్రహాస్ అలా చేయడాన్ని సమర్థించను. ఇలాంటి చెత్త ప్రమోషన్లతో సినిమాలు ఆడతాయనుకుంటే అది వాళ్ల భ్రమ మాత్రమే' అని జేడీ చక్రవర్తి క్లారిటీ ఇచ్చాడు.టీవీ నటుడు ప్రభాకర్ కొడుకే చంద్రహాస్. గతంలో వచ్చిన 'రామ్నగర్ బన్నీ' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ మూవీ ప్రమోషన్ల టైంలోనే యాటిట్యూడ్ చూపించడం, చిత్రమైన హావభావాలతో యాటిట్యూడ్ స్టార్గా అందరూ ట్రోల్ చేశారు. ఆ పదాన్నే తన పేరుకి ముందు తగిలించుకున్నాడు. తొలి మూవీ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు 'బరాబర్ ప్రేమిస్తా' చిత్రంతో వస్తున్నాడు. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: రాజమౌళినా మజాకా.. 2 సీన్ల కోసం మహేశ్కి 6 నెలలు ట్రైనింగ్) -
ఘోర ప్రమాదం.. 'జబర్దస్త్' కమెడియన్ కన్నుమూత
యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న ఓ ఎంటర్టైన్మెంట్ షో, 'జబర్దస్త్' కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ బాబీ అలియాస్ లక్ష్మినారాయణ.. రెండు రోజుల క్రితం జరిగిన ఘోర ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ క్రమంలోనే 'జబర్దస్త్' కమెడియన్స్ నవీన్, బాబీ తదితరులు ఇతడి మృతిపై మిస్ యూ పోస్టులు పెడుతున్నారు. యాంకర్ సుమ కూడా బాబీ ఇంటికి వెళ్లి, అతడి మృతదేహానికి నివాళులు అర్పించింది. ఇంతకీ అసలేమైంది? ఎప్పుడీ ప్రమాదం జరిగింది?(ఇదీ చదవండి: కొడుకు చనిపోయిన నెలకే టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత)సోమవారం రాత్రి కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై రెండు బైక్స్.. ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సీఐ విశ్వం చెప్పిన ప్రకారం.. కొవ్వూరుకు చెందిన ముగ్గురు యువకులు బైక్పై రాజమండ్రిలో సినిమా చూసేందుకు వెళ్తున్నారు. మరోవైపు రాజమండ్రి క్వారీ మార్కెట్కు చెందిన ఆనపు లక్ష్మీనారాయణ మోటార్ సైకిల్ ఎదురుగా వచ్చేసరికి రెండు బైకులు బలంగా ఢీకొన్నాయి. ఆనపు లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదం జరగడానికి ఒకటి రెండు రోజుల క్రితమే ఇతడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇంతలోనే విషాదం జరిగిపోయింది.(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు) -
నాకు స్టార్డమ్ తెచ్చిన సినిమా అదే! రాముడి పాత్రకోసం..
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ వారణాసి. మహేశ్బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. 2025 చివర్లో వారణాసి గ్లింప్స్ రిలీజ్ చేయగా మూవీకి భారీ హైప్ వచ్చింది. ఈ మధ్యే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా చిత్రయూనిట్ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను రిలీజ్ చేసింది.స్టార్గా మారిందే ఆ సినిమాతోఅందులో మహేశ్బాబు తనకు స్టార్డమ్ తెచ్చిన సినిమా ఏదో వెల్లడించాడు. అలాగే వారణాసిలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. 'పోకిరి సినిమా నన్ను స్టార్గా నిలబెట్టింది. ఆ మూవీ చాలా పెద్ద విజయం సాధించింది. వారణాసి విషయానికి వస్తే.. రాజమౌళి నాకు ఈ కథ చెప్పగానే ఆశ్చర్యపోయాను. తర్వాత ఓసారి.. మీ దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది. మీరు హీరోలను చాలా బాగా చూపిస్తారు, మీకు హీరోలంటే చాలా ప్రేమ అని రాజమౌళికి మెసేజ్ పెట్టాను. అందుకాయన థాంక్యూ, కానీ నా సినిమాల్లో నాకు విలన్లంటేనే ఎక్కువ ఇష్టం అని రిప్లై ఇచ్చాడు.మొదట్లో భయపడ్డా..రాజమౌళి అభిమానిగా నేను కూడా వారణాసి మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇందులో హీరోగా చేయడానికి నేను మొదట్లో భయపడ్డాను. కానీ ఆయన కథను వివరించి చెప్పాక ఆ భయం పోయింది. ఇందులో రాముడి పాత్ర పోషించాను. రాముడు అంటేనే హుందాతనం. నిలబడే దగ్గరనుంచి పాత్రలో నటించేవరకు ఎన్నో రిహార్సల్స్ చేశాం అని చెప్పాడు. తనకు ఇష్టమైన వంటకం ఏంటని అడగ్గా హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఇష్టమని మహేశ్బాబు తెలిపాడు.చదవండి: చిరంజీవిపై ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు -
రాజమౌళినా మజాకా.. 2 సీన్ల కోసం మహేశ్కి 6 నెలలు ట్రైనింగ్
మహేశ్ బాబు పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది అతడి రన్నింగ్. ఇతడు చేసిన ఏ సినిమా చూసినా మిగతా వాళ్లతో పోలిస్తే మహేశ్ కాస్త డిఫరెంట్గా పరుగెత్తుతాడు. అయినా సరే ఇది అభిమానులకు బాగానే నచ్చేసింది. ఎవరైనా మహేశ్ గెటప్ వేయాలన్నా సరే అతడి రన్నింగ్ స్టైల్నే ఫాలో అయిపోతుంటారు. అలాంటిది కెరీర్ మొదలుపెట్టిన ఇన్నేళ్ల తర్వాత మహేశ్.. ఈ విషయంలో కొత్తగా కనిపించనున్నాడు. లేదు రాజమౌళి ఏకంగా ట్రైనింగ్ ఇచ్చి మరీ మార్చేశాడు. దీని గురించి స్వయంగా మహేశ్ బాబే చెప్పాడు.మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'వారణాసి'. రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ.. గతేడాది నవంబరులో టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు మూవీ ఎలా ఉండబోతుందనేది మూడు నిమిషాల వీడియోతో రివీల్ చేశారు. ప్రస్తుతం, గతం, భవిష్యత్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో మహేశ్.. శ్రీ రాముడి పాత్రలోనూ కాసేపు కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా కోసమే తన రన్నింగ్ స్టైల్ కూడా మార్చుకున్నానని మహేశ్ చెప్పాడు.(ఇదీ చదవండి: మహేశ్తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్పై రాజమౌళి క్లారిటీ)రాముడి పాత్ర కోసం ఆహార్యం మెంటైన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దాదాపు ఏడాది ప్రిపరేషన్ చేశాం. 2-3 నెలలు కలరీ యుద్ధవిద్య కూడా నేర్చుకున్నాను. అలానే రాజమౌళి.. నా రన్నింగ్ టెక్నిక్ మార్చాలని అన్నాడు. దీనికోసం ఏకంగా 6 నెలలపాటు ట్రైనింగ్ తీసుకున్నాం. కాకపోతే 2 సీన్లు మాత్రమే తీశారు. అలాంటి నిబద్ధత 'వారణాసి' కోసం నేను చూపించాను అని మహేశ్ బాబు.. తాజాగా రిలీజ్ చేసిన 'వారణాసి' ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్నికొన్నిరోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా.. కీరవాణి సంగీతమందిస్తున్నారు. రాజమౌళి కొడుకు కార్తికేయ.. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. ఇప్పటివరకు పాన్ ఇండియా వరకే తమ మూవీస్ రిలీజ్ చేసిన జక్కన్న.. 'వారణాసి'తో గ్లోబల్ వైడ్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు) -
చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు
2026 మెగా ఫ్యామిలీకి బాగానే కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో వచ్చిన చిరంజీవి.. చాన్నాళ్ల తర్వాత అద్భుతమైన హిట్ కొట్టారు. జనవరి చివరి రోజున చిరు మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కవలలు(మగబిడ్డ, ఆడబిడ్డ) పుట్టారు. రెండు మూడు రోజుల క్రితం ఈ న్యూస్ తెగ వైరల్ అయింది. అదే టైంలో చిరు గతంలో 'మెగా వారసుడి' అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు వాటిని తీసుకొచ్చి చిరంజీవిపై దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. వీటిపై మెగాకోడలు లావణ్య త్రిపాఠి స్పందించింది. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.(ఇదీ చదవండి: మహేశ్తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్పై క్లారిటీ)మెగా కుటుంబంలో ఇప్పటి జనరేషన్లో దాదాపు అందరూ అమ్మాయిలే ఉన్నారు. దీని గురించి గతంలో ఓ సందర్భంలో మాట్లాడిన చిరు.. మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసుడి కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్న కొందరు.. ఆడపిల్లలు, మహిళలని చిరంజీవి చులకనగా చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన లావణ్య.. ఇలాంటి చీప్ కామెంట్స్ ఊహించలేదని ఒక యూజర్కి గట్టిగా ఇచ్చిపడేసింది.'సాధారణంగా ఇలాంటి ట్వీట్లని పట్టించుకోకుండా వదిలేస్తాను. ఈసారి మాత్రం స్పందించక తప్పలేదు. ఓ సంతోషకరమైన క్షణాన్ని ఇలా విషపూరితంగా మార్చడం చాలా నీచమైన ఆలోచన. చిరంజీవి కుటుంబంలోని మహిళలని, ముఖ్యంగా తన మనవరాళ్లని ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో.. ఈ విమర్శలు చేసేవారికి అసలు అవగాహన లేదు. చిరంజీవి తన కుటుంబానికి ఇచ్చే విలువ చాలామందికి సాధ్యం కాదు. ఆయన చేసే పనుల్లో 1 శాతం కూడా చేయలేని వాళ్లు.. ఆయన వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం సరికాదు' అని లావణ్య ట్వీట్ చేసింది. ఈమె ట్వీట్ చేసిన కాసేపటికే.. సదరు యూజర్ తన ట్వీట్ డిలీట్ చేశాడు.(ఇదీ చదవండి: 2026పై నెట్ఫ్లిక్స్ దండయాత్ర.. ఇన్ని సినిమాలు, సిరీస్లా?) -
మహేశ్తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్పై క్లారిటీ
'ఆర్ఆర్ఆర్' తర్వాత దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న సినిమా 'వారణాసి'. 2024లో షూటింగ్ మొదలైనప్పటికీ.. గతేడాది నవంబరులోనే అన్ని విషయాలు బయటపెట్టారు. టైటిల్తో సహా మూవీ ఎలా ఉండబోతుందనే విషయాన్ని గ్లింప్స్ రూపంలో రివీల్ చేశారు. దానికోసం భారీ ఎత్తున ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ టైంలో మహేశ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, రాజమౌళి.. పలు హాలీవుడ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిని ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ చేసేశారు. ఇందులోనే రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీక్వెల్ అంటూ వస్తున్న రూమర్స్పైనా క్లారిటీ ఇచ్చేశారు.15 ఏళ్ల క్రితమే మహేశ్ బాబు, మీరు కలిసి పనిచేయాలనుకున్నారు? మరి దానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది? అనే ప్రశ్నకు బదులిచ్చిన రాజమౌళి.. '2010లో నేను-మహేశ్ మొదటిసారి కలుసుకున్నాం. అప్పుడే సినిమా చేద్దామని ఫిక్సయ్యాం. కాకపోతే నాకున్న మూడు కమిట్మెంట్స్ పూర్తి చేసి వస్తానని మాటిచ్చాను. ఆరు నెలల్లో ఈగ తీద్దామనుకుంటే రెండేళ్లు పట్టేసింది. రెండేళ్లలో బాహుబలి తీద్దామనుకుంటే మూడేళ్లు పట్టేసింది. కొవిడ్ వల్ల 'ఆర్ఆర్ఆర్' చాలా ఆలస్యమైపోయింది. అందుకే మహేశ్ బాబుతో చేయడానికి ఇన్నేళ్లు పట్టేసింది' అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన రాజమౌళి.. మేం ఆలోచించుకున్న తర్వాత సీక్వెల్ వద్దని డిసైడ్ అయ్యాం. దాదాపు 3 గంటల నిడివితోనే మూవీ థియేటర్లలోకి వస్తుంది అని క్లారిటీ ఇచ్చేశాడు. అలానే ఇప్పటి జనరేషన్ ఆడియెన్స్.. ఐదు నిమిషాలు బోర్ కొట్టినా సరే ఫోన్ చూసుకుంటాడు. స్టోరీ విషయంలో ప్రేక్షకుడు తల పక్కకు తిప్పకుండా ఉండేలా మూవీని తీస్తున్నాం. అదే అతిపెద్ద ఛాలెంజ్ అని అన్నాడు. 'వారణాసి'లో రామాయణం సీన్స్ ఉండటానికి గల కారణాన్ని కూడా రాజమౌళి వెల్లడించాడు. 'నా సినిమాలన్నీ కూడా రామాయణ, మహాభారత నుంచి స్ఫూర్తి పొందినవే. కానీ ఈసారి స్ఫూర్తి కాకుండా 'రామాయణం' ఓ భాగాన్ని 'వారణాసి'లో చూపించే అవకాశం దొరికింది' అని జక్కన్న అన్నాడు.మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారులు కాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్..'వారణాసి'లో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కీరవాణి సంగీతమందిస్తుండగా.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. మొన్నటివరకు విడుదల తేదీపై కూడా రకరకాల రూమర్స్ వచ్చాయి. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న అంటే ఉగాది సందర్భంగా పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాని విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ బల్లగుద్ది చెప్పింది.(ఇదీ చదవండి: సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్గా తెలుగు హీరో.. టీజర్ రిలీజ్) -
యాసలందు అన్నియాసలూ భేషు
రోల్ డిమాండ్ చేస్తే నోరు తిరగని యాస నేర్చుకుని మరీ డైలాగులు చెప్పేస్తారు స్టార్స్. రామ్చరణ్ ఉత్తరాంధ్ర యాస మాట్లాడారు. అఖిల్, వరుణ్ తేజ్ రాయలసీమలో సంభాషణలు చెప్పారు. విజయ్ దేవరకొండ అయితే ఈస్ట్ గోదావరి, రాయలసీమ యాసలు నేర్చుకున్నారు. హీరోలేనా? హీరోయిన్ కావ్యా థాపర్ తెలంగాణ యాసలో రెచ్చిపోయారు. ఈ ఉత్తరాది బ్యూటీ ఈ యాస నేర్చుకుని మరీ తెలంగాణ అమ్మాయిలా మారిపోయారు. ‘యాసలందు అన్ని యాసలూ భేషు’ అన్నట్లుగా ఈ స్టార్స్ ఏయే సినిమాల్లో ఏయే యాసలో మాట్లాడారో తెలుసుకుందాంసేసేయాల... ‘ఓటే పని చేసే నాకి, ఒకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతుకెందుకు?’, ‘ఏదైనా ఈ నేలమీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ ఉత్తరాంధ్ర యాసలో రామ్చరణ్ పలికిన సంభాషణలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక, థియేటర్లో వింటున్నప్పుడు ఈలలు, గోలలు పక్కా. ‘పెద్ది’ సినిమాలో చేస్తున్నప్పాత్రకి అనుగుణంగా రామ్చరణ్ ఉత్తరాంధ్ర యాస మాట్లాడారు. గుబురు గడ్డం, ఒత్తయిన జుట్టు, మాస్ లుక్తో రామ్చరణ్ హీరోగా ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరో యిన్గా నటిస్తు న్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న రిలీజ్ కానుంది.సామి సాచ్చిగా...‘‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈతూరి నవ్వించేకి వస్తుండా..’ అంటూ వరుణ్ తేజ్ తన కెరీర్లోని 15వ సినిమాను ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ను ఖరారు చేసి, ఇటీవల టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో కనకరాజుప్పాత్రలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. ఈ చిత్రం రాయలసీమలోని అనంతపురం బ్యాక్డ్రాప్లో సాగుతుందని తెలిసింది. దీంతో ఈ సినిమా కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్నారు వరుణ్ తేజ్. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హాస్యనటుడు సత్య ప్రధానప్పాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇండో–కొరియన్ బ్యాక్డ్రాప్లో సాగే హారర్ కామెడీ సినిమా ఇది. ఈస్ట్ గోదావరి... రాయలసీమ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ పీరియాడికల్ చిత్రాలే. ‘రణబాలి’ సినిమా కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్న విజయ్ దేవరకొండ, ‘రౌడీ జనార్ధన’ చిత్రం కోసం ఈస్ట్ గోదావరి యాసలో డైలాగ్స్ చెబుతున్నారు. ఇలా ఒకే సమయంలో రెండు భిన్నమైన యాసలతో కూడిన క్యారెక్టర్స్లో విజయ్ దేవరకొండ నటిస్తుండటం విశేషం. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ‘రణబాలి’. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పరిపాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా, ఆర్నాల్డ్ వోస్లూ కీలకప్పాత్రల్లో నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 11న విడుదల కానుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్ధన’. 1980 దశకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుంది. ఏంది మీ లొల్లి...‘పండగ పూట మా బాబుకి బియ్యమిచ్చి నాలుగు ముక్కలు తిందమంటే ఏంది మీ లొల్లి..., ఏయ్ పండగ కాబట్టే కక్క ముక్క వండినం... చెప్పురంకుల్’ అంటూ తెలంగాణ యాసలో రెచ్చిపోయారు కావ్యా థాపర్. ‘నేను రెడీ’ చిత్రం కోసమే కావ్య ఇలా తెలంగాణ మాట్లాడటానికి రెడీ అయ్యారు. ‘నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘నేను రెడీ’. ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోదాత్మక, కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోన్న ‘నేను రెడీ’ వేసవిలో రిలీజ్ కానుంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే ఇంటెన్స్ లవ్స్టోరీ ‘లెనిన్’ కోసం అక్కినేని అఖిల్ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్నారు. ఈ సినిమా ప్రధాన కథనం రాయలసీమ ్రపాంతంలోని చిత్తూరు నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇంకా రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా కోసం ‘ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండ ఈతూరి నరికినానంటే అరుపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాల్లోన్నించి వస్తాది’ అంటూ రాయలసీమ యాసలో సాయిధరమ్ తేజ్ సంభాషణలు పలికారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘ఎల్లమ్మ’. వేణు యెల్దండి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం రూటెడ్ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారట దేవిశ్రీ ప్రసాద్. అలాగే ‘డెకాయిట్’ సినిమా కోసం అడివి శేష్ రాయలసీమ యాసలో, ‘భోగి’ సినిమా కోసం తెలంగాణ యాసలో శర్వానంద్, ‘క్రేజీ కల్యాణం’ కోసం అనుపమా పరమేశ్వరన్ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతున్నట్లుగా తెలిసింది. వీరే కాదు... తమ కొత్త సినిమాల కోసం విభిన్న యాసల్లో డైలాగ్స్ చెబుతున్న నటీనటులు మరికొంతమంది ఉన్నారు. -
ఐదు భాషల్లో పళ్లి చట్టంబి
‘2018’ మూవీ ఫేమ్ టొవినో థామస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పళ్లి చట్టంబి’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 9న తెలుగు, మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.కాగా మంగళవారం కయాదు లోహర్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. ‘‘1950, 1960 దశకాల నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీ ‘పళ్లి చట్టంబి’. భారీ బడ్జెట్తో రూ పొందుతోన్న ఈ మూవీలో ఇప్పటివరకూ చూడని సరికొత్త పాత్రలో టొవినో థామస్ కనిపించనున్నారు. ‘డ్రాగన్’ మూవీ సక్సెస్ తర్వాత కయాదు లోహర్కి ప్రేక్షకుల్లో పెరిగిన క్రేజ్ మా సినిమాకి ప్లస్ కానుంది.ఇటీవలే ఐదు భాషల్లో రిలీజ్ చేసిన ‘పళ్లి చట్టంబి’ మోషన్ పోస్టర్కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి’’ అని మేకర్స్ తెలి΄ారు. విజయ రాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెగ్జాండర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: టిజో టోమీ, సంగీతం: జేక్స్ బిజోయ్, అసోసియేట్ ప్రోడ్యూసర్స్: మేఘ శ్యామ్, తంజీర్. -
వన్స్ మోర్
చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కొనసాగుతుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ... ఇలా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో సూపర్ హిట్గా నిలిచిన మూవీస్ని ‘వన్స్ మోర్’ అంటూ మళ్లీ చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. ఈ కారణంగా తమ సినిమాలను మరోసారి విడుదల చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.హీరోల పుట్టినరోజు కావచ్చు... లేదా ఆ సినిమాకి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు.. అదీ కాకుంటే ఆ సినిమాకి ఆడియన్స్లో ఉన్న ప్రత్యేకమైన క్రేజ్... ఇలా సందర్భాలను బట్టి తమ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తుండటంతో ఆయా హీరోల అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మరోసారి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ కారణంగానే రీ రిలీజ్లో కూడా ఆయా సినిమాలు భారీగానే వసూలు చేస్తున్నాయి. పైగా గత చిత్రాలను 4కె క్వాలిటీకి మార్చి అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ధనుష్ నటించిన ‘3’ సినిమా, రామ్చరణ్ నటించిన ‘ఆరెంజ్’, రాఘవ లారెన్స్ ‘కాంచన’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, ‘ఏమాయ చేసావె’, ఉదయ్ కిరణ్ ‘మనసంతా నువ్వే’ వంటి అరడజను సినిమాలు రీ రిలీజ్కి ముస్తాబవుతున్నాయి. ఆ వివరాలు, విశేషాలు తెలుసుకుందాం.పదమూడేళ్ల తర్వాత... ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘3’. ఆయన సతీమణి ఐశ్వర్య (ఐశ్వర్యా రజనీకాంత్) ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. ప్రభు, భానుప్రియ, రోహిణి ఇతర పాత్రలు పోషించారు. కె. విమలాగీత, ధనుష్ నిర్మించిన ఈ సినిమా 2012 మార్చి 30న విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా హిట్గా నిలిచింది. ప్రధానంగా ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రత్యేకించి.. ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి...’ పాట యూత్ని ఉర్రూతలూగించింది. ‘కొలవెరి డి...’ పాటతో రిలీజ్కు ముందే ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు జనాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీ అదే స్థాయిలో ఓపెనింగ్స్ని రాబట్టింది. తొలి భాగం అందమైన ప్రేమకథను ఆవిష్కరించిన ఈ చిత్రం సెకండాఫ్లో మాత్రం విషాదాంత ప్రేమ కథగా మిగిలింది. ఈ చిత్రంలో రామ్ పాత్రలో ధనుష్, జనని పాత్రలో శ్రుతీహాసన్ అద్భుతంగా నటించారు. తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా పదమూడేళ్ల తర్వాత ఈ నెల 6న మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది.పదిహేనేళ్ల తర్వాత... ‘మగధీర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆరెంజ్’. ‘బొమ్మరిల్లు’ మూవీ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించారు. ప్రకాశ్రాజ్, షాజాన్ పదంసీ, ప్రభు, బ్రహ్మానందం, శ్రీనివాస్ అవసరాల, మధురిమ, మంజుల, సంజయ్, సమీర్, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్, సంచిత, నాగబాబు ఇతర పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ సినిమా 2010 నవంబరు 26న విడుదలైంది. ‘మగధీర’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకోవడంతో పాటు వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు రామ్చరణ్. ఆ మూవీ తర్వాత పూర్తి లవర్ బాయ్ లుక్లో నటించిన చిత్రం ‘ఆరెంజ్’.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక΄ోయింది. కానీ, ఈ మూవీ బుల్లితెరపై మాత్రం సూపర్హిట్గా నిలిచింది. ప్రత్యేకించి హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ మూవీలోని పాటలు యూత్ని ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియా నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ పాత్రలో రామ్చరణ్, జాను క్యారెక్టర్లో జెనీలియా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. పదిహేనేళ్ల తర్వాత మరోసారి ఈ నెల 7న ‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్ అవుతుండటం విశేషం. పద్నాలుగేళ్ల తర్వాత... ‘ముని’ సినిమాతో తనదైన నటనతో ప్రేక్షకులను భయపెట్టారు రాఘవ లారెన్స్. ఆ సినిమాకి సీక్వెల్గా ఆయన లీడ్ రోల్లో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘కాంచన’. ఈ సినిమాలో రాయ్లక్ష్మి హీరోయిన్గా నటించారు. శరత్కుమార్, కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ ఇతర పాత్రల్లో నటించారు. రాఘవ లారెన్స్, ఎన్. రాధ నిర్మించిన ఈ సినిమా 2011 జూలై 15న విడుదలైంది. ఈ సినిమాని తెలుగులో నిర్మాత బెల్లంకొండ సురేష్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మరోసారి భయపెట్టింది. ముఖ్యంగా రాఘవ లారెన్స్, శరత్ కుమార్ నటన హైలెట్గా నిలిచింది. ప్రత్యేకించి శరత్కుమార్ ఈ మూవీలో హిజ్రా పాత్రలో అద్భుతంగా నటించారు. రాయ్లక్ష్మి తనదైన గ్లామర్తో కుర్రకారుని అలరించారు. కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే పాటలో లారెన్స్ నటన, హావభావాలు అద్భుతంగా పండించారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. పద్నాలుగేళ్ల తర్వాత ‘కాంచన’ చిత్రాన్ని ఈ నెల 13న మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా... రేవంత్–మౌనికల ప్రేమకథ మరోసారి సిల్వర్ స్క్రీన్పై కనిపించనుంది. ఈ లవ్స్టోరీ సరిగ్గా ప్రేమికుల దినోత్సవానికి రానుంది. రేవంత్గా నాగచైతన్య, మౌనికగా సాయి పల్లవి నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. 2020లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ కారణంగా వాయిదా పడి, 2021 సెప్టెంబరు 24న విడుదలైంది. శేఖర్ కమ్ముల తనదైన శైలిలో సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రానికి అద్భుత స్పందన లభించింది.తెలంగాణ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అందించిన పాటల్లో ‘నీ చిత్రమ్ చూసి...’, ‘సారంగ దరియా...’ పాటలకు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. అందమైన ప్రేమకథా చిత్రంగా రూ పొందిన ‘లవ్ స్టోరి’ని ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ నెల 14న మళ్లీ విడుదల చేస్తోంది చిత్రయూనిట్. సో... నాలుగున్నరేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రేవంత్–మౌనిక తమ ప్రేమకథతో మరోసారి అలరించనున్నారన్న మాట. పదిహేనేళ్ల తర్వాత... కార్తీక్, జెస్సీలు తమ ప్రేమకథతో వెండితెరపై ప్రేక్షకులను మాయ చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా మరోసారి మాయ చేసేందుకు వస్తున్నారు ఈ ప్రేమికులు. నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘ఏమాయ చేసావె’. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సమంత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. కృష్ణుడు, తాన్య, సురేఖా వాణి, సంజయ్ స్వరూప్, దేవన్, లక్ష్మి, త్రిష అలెక్స్ ఇతర పాత్రలు పోషించారు. ఇందిరా ప్రోడక్షన్స్పై మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్ నిర్మించారు. ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది.లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూ పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీలో కార్తీక్ పాత్రలో నాగచైతన్య, జెస్సీగా సమంత తమదైన నటనతో ఆకట్టుకున్నారు. తన రెండవ సినిమాతోనే నాగచైతన్య తన నటనలో పరిణితి చూపించారనే ప్రశంసలు దక్కాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తనదైన శైలిలో ఈ అందమైన ప్రేమకథని తెరపైకి తీసుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. మనోజ్ పరమహంస విజువల్స్ కూడా అద్భుతంగా నిలిచాయి. చివరి సన్నివేశంలో త్రిష, శింబు కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పదిహేనేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ఈ మూవీ రీ రిలీజ్ అవుతోంది. 24 ఏళ్ల తర్వాత... ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘మనసంతా నువ్వే’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రీమా సేన్ హీరోయిన్గా నటించారు. తనూ రాయ్, పరుచూరి వెంకటేశ్వరరావు, చంద్ర మోహన్, తనికెళ్ల భరణి, శివ పార్వతి, బ్రహ్మానందం, సునీల్, సుధ, దేవదాస్ కనకాల, శివారెడ్డి, పావలా శ్యామల ఇతర పాత్రలు పోషించారు. సుమంత్ ఆర్ట్స్ ప్రోడక్షన్స్పై ఎంఎస్ రాజు ఈ మూవీ నిర్మించారు. అంతేకాదు... ఈ చిత్రానికి ఆయనే కథ అందించడం విశేషం. ఈ చిత్రంలో వేణుగా ఉదయ్ కిరణ్, రేణు పాత్రలో రీమా సేన్ కనిపిస్తారు.బాల్య స్నేహితులైన వీరి మధ్య ప్రేమని ఎంతో అందంగా, అద్భుతంగా తెరకెక్కించారు వీఎన్ ఆదిత్య. ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం, నేపథ్య సంగీతం ఎంతో ప్లస్ అయ్యాయి. 2001 అక్టోబరు 19న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ప్రత్యేకించి యువతరం ఈ మూవీని విపరీతంగా చూశారు. 24 ఏళ్ల తర్వాత ఈ సినిమాని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న రీ రిలీజ్ చేస్తున్నారు. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. ఇప్పటికే మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ కాగా ఇంకొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
కంటెంట్ బాగా నచ్చింది: రవితేజ
‘‘సుమతీ శతకం’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఇందులోని కంటెంట్ బాగా నచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వాలి. అమర్దీప్ భవిష్యత్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటు న్నాను’’ అని హీరో రవితేజ తెలిపారు. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సుమతీ శతకం’. ఎంఎం నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ని చూసిన రవితేజ... ‘సుమతీ శతకం’ యూనిట్కి అభినందనలు తెలిపారు. -
రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ రెండు భాగాలుగా?
బాహుబలి ఫ్రాంచైజీతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్ను ప్రారంభించిన దర్శకధీరుడు రాజమౌళి, మళ్లీ అదే పద్ధతిలోకి అడుగుపెడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత ఆయన ఆర్ఆర్ఆర్ను సింగిల్ మూవీగా తెరకెక్కించినా, ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే టాక్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో ఇంత త్వరగా సినిమా వస్తోందంటే అది పార్ట్-1 అయి ఉంటుందనే వాదన మొదలైంది. దీంతో నెటిజన్లు టైటిల్స్ కూడా ఊహించేశారు. వారణాసి పార్ట్-1: గ్లోబ్ ట్రోటర్, వారణాసి పార్ట్-2: టైమ్ ట్రోటర్ అనే పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై యూనిట్ ఇంకా స్పందించలేదు. ఐమ్యాక్స్ ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఆఫ్రికా, ఐరోపా దేశాలను కూడా టార్గెట్ చేస్తూ భారీ ప్రమోషన్కు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ‘వారణాసి’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ ఎపిసోడ్లో మహేష్ బాబు శ్రీరాముడి రూపంలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. ‘వారణాసి’ రాజమౌళి కెరీర్లోనే మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. -
రామ్ చరణ్ దంపతులకు ట్విన్స్.. అభిమానులకు మెగా సర్ప్రైజ్ గిఫ్ట్స్..!
మెగా ఫ్యామిలీ ఇంట మరో సంబురం నెలకొంది. ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో మరోసారి పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే ఈ జంటకు క్లీంకార అనే కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసనకు ట్విన్స్ జన్మించడంతో సంతోషం మరింత రెట్టింపైంది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టారే అభిమానులతో పంచుకున్నారు. అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్..అయితే ఈ శుభ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సంతోషం సమయంలో ఫ్యాన్స్కు స్వీట్స్ పంపించారు. ఓ అభిమాని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో రెండు రకాల స్వీట్స్ ఉన్నాయి. ఈ బహుమతిపై రామ్ చరణ్ -ఉపాసనకు అభినందనలు. అపోలో నుండి ఈ బహుమతి వచ్చిందని క్యాప్షన్ రాశారు. ఈ మెగా ఫ్యామిలీ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందిని ఫ్యాన్స్ అంటున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by Lakshmi Vadupu (@lakshmi_naidu_10) -
రష్మిక- విజయ్ పెళ్లి తేదీపై కన్ఫ్యూజన్.. కన్ఫామ్ చేసినట్టేనా?
టాలీవుడ్లో ఇప్పుడంతా వీరిద్దరి పెళ్లి గురించి చర్చ నడుస్తోంది. డేటింగ్ నుంచి ఎంగేజ్మెంట్ వరకు ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్ అలాగే ఉంది. గతేడాది నిశ్చితార్థం జరిగినట్లు వార్తలొచ్చినప్పటికీ ఇంకా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ ఎవరి పెళ్లి అనుకుంటున్నారా? అదేనండి మన రష్మిక- విజయ్ దేవరకొండ జంట గురించే. గత కొద్ది రోజలుగా ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అంతేకాకుండా ఈనెల 2న రష్మిక- విజయ్ వెడ్డింగ్ అంటూ ఇద్దరు అమ్మాయిలు మాట్లాడిన వీడియో తెగ వైరలైంది. కానీ అదంతా ఫేక్ అని తర్వాత తెలిసిపోయింది.అయితే తాజాగా మరో మ్యారేజ్ డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. రష్మిక ఎయిర్పోర్ట్లో వెళ్తుండగా ఓ అభిమాని ఫోటో తీసుకుంటానంటూ రష్మికను రిక్వెస్ట్ చేశాడు. దీంతో వెంటనే మాస్క్ తొలగించి ఫోటోలకు పోజులిచ్చింది. ఆ తర్వాత వెంటనే అతను రష్మికకు కంగ్రాట్స్ చెప్పాడు. దీనికి రష్మిక దేనికి రా అంటూ అతన్ని నవ్వుతూ అడిగింది. వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 26 ఫర్ వెడ్డింగ్ మేడం అన్నాడు. దీనికి రష్మిక క్యూట్గా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన స్మైల్తో పెళ్లి తేదీ ఫిక్సయినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక పరోక్షంగా తన పెళ్లి తేదీని రివీల్ చేసిందని అంటున్నారు.గత డిసెంబర్లో వచ్చిన సమాచారం ప్రకారం రష్మిక- విజయ్ ఫిబ్రవరి 26న ఉదయపూర్లోని ప్యాలెస్లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్లో తమ సినీ ఇండస్ట్రీ స్నేహితుల కోసం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే వీటిపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. కాగా.. వీరిద్దరు జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
నేరుగా ఓటీటీకి ఆనంద్ దేవరకొండ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
అనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తక్షకుడు. ఈ సినిమాకు వినోద్ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మిడిల్క్లాస్ మెలొడీస్ సూపర్హిట్గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. టీజర్ చూస్తుంటే ఆనంద్ దేవరకొండ మునుపెన్నడు చేయని డిఫరెంట్ రోల్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. 'వాడు ఇక్కడే ఉన్నాడు.. నా కళ్లముందే ఉన్నాడు.. కానీ కనిపెట్టలేకపోతున్నాను..' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.కాగా.. ఈ మూవీలో లపతా లేడీస్ ఫేమ్ నీతాన్షీ గోయెల్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. -
శర్వానంద్ బైకర్.. రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు.ఈ సమ్మర్ కానుకగా బైకర్ థియేటర్లలో సందడి చేయనుందని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. The engine's revved up 🏍️The track is ready 🛣️Now, THERE IS NO STOPPING HIM ❤️🔥#BIKER grand release worldwide on April 3rd, 2026 💥💥#BIKERMovie #GoAllTheWay 🏁#BikerOnApril3rdCharming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha… pic.twitter.com/HhIsmshA7i— UV Creations (@UV_Creations) February 3, 2026 -
పడుకుని పోజులిచ్చిన మీనాక్షి.. బ్లాక్ డ్రస్లో మాళవిక
కింద పడుకుని పోజులిచ్చేసిన మీనాక్షి చౌదరిబ్లాక్ డ్రస్లో రచ్చ లేపుతున్న మాళవిక మోహనన్క్యూట్ అండ్ స్వీట్ లుక్స్లో అనన్య నాగళ్లముంబై జ్ఞాపకాలు పోస్ట్ చేసిన రుక్మిణి వసంత్తెగ నవ్వేస్తున్న యాంకర్ రష్మీ గౌతమ్ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sai Dhanshika (@saidhanshika) -
ఈ హీరోల టాలెంట్.. వాళ్లకు శాపమవుతోంది!
టాలీవుడ్లో ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు చాలా మారాయి. కమర్షియల్ సినిమాలు ఒకటో రెండు ఆడుతున్నాయి తప్పితే కంటెంట్ బేస్డ్ చిత్రాలకే ఎక్కువగా ప్రేక్షకాదరణ లభిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోలు, మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. అంటే రైటింగ్ లాంటి వాటిలో పాలుపంచుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్ధు జొన్నలగొడ్డ పేర్లు ప్రముఖమైనవి. వీళ్ల ప్రతిభని అందరూ మెచ్చుకుంటున్నారు. కాకపోతే నాణెనికి మరోవైపు చూస్తే పరిస్థితి చిత్రంగా ఉంటుంది.(ఇదీ చదవండి: మహేశ్కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్)అడివి శేష్, నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ.. వీళ్లు డైరెక్ట్గా హీరోలు అయిపోలేదు. చాన్నాళ్ల పాటు సైడ్ క్యారెక్టర్స్ చేశారు. గుర్తింపు రావడానికి చాలా టైమ్ పట్టింది. ఈ టైంలోనే కేవలం యాక్టింగ్ని నమ్ముకోకుండా రైటింగ్పై కూడా పట్టుసాధించారు. తమ సినిమాలకు కథలు, సీన్స్ విషయంలో వీళ్ల వైపు నుంచి అద్భుతమైన తోడ్పాటు అందించారు. ఇదే ఆయా చిత్రాల తీసే దర్శకులకు మైనస్ అవుతుందా అనే సందేహం కలుగుతోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి.అడివి శేష్నే తీసుకుందాం. క్షణం, గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో అదిరిపోయే హిట్స్ అందుకున్నాడు. తక్కువ బడ్జెట్తోనే తీసిన ఈ మూవీస్.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. వీటి సక్సెస్లో శేష్ సహకారం చాలానే ఉంది. కానీ ఈ చిత్రాలు తీసిన దర్శకులు రవికాంత్ పేరేపు, శశికిరణ్ తిక్క.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు. ఆయా చిత్రాల రిలీజ్కి ముందు, తర్వాత కూడా శేష్కే చాలా పేరొచ్చింది తప్పితే దర్శకులని పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. శేష్ ప్రస్తుతం చేస్తున్న డకాయిట్, గూఢచారి 2 సినిమాలకు దర్శకులు ఎవరని అడిగితే చాలామంది చెప్పలేరు. అది పరిస్థితి.(ఇదీ చదవండి: ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి?)నవీన్ పొలిశెట్టి విషయానికొస్తే.. స్వతహాగా తెలుగు కుర్రాడే కానీ మొదట హిందీలో పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, వన్ నేనొక్కడినే, డీ ఫర్ దోపిడి లాంటి చిత్రాల్లో యాక్టింగ్ చేశాడు. కాకపోతే వాటి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు! హీరోగా చేసిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ'.. నవీన్ కెరీర్ని మలుపు తిప్పింది. ఈ మూవీ దర్శకుడు ఎవరని అడిగితే.. చాలామంది చెప్పలేరు. అంతెందుకు రీసెంట్గా సంక్రాంతికి వచ్చిన 'అనగనగా ఒక రాజు' మూవీకి కూడా కర్త కర్మ క్రియ నవీనే.. దర్శకుడిగా మారి అనే కుర్రాడు ఉన్నప్పటికీ.. క్రెడిట్ అంతా నవీన్కే వచ్చింది.సిద్ధు జొన్నలగడ్డ.. కెరీర్ ప్రారంభంలో 'ఆరెంజ్'తో పాటు పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసినప్పటికీ 'డీజే టిల్లు' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు దక్కింది. 'టిల్లు స్కేర్'తో ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడు. ఈ రెండు మూవీస్కి దర్శకులు ఎవరంటే? చాలామంది చెప్పలేరు. ఎందుకంటే ఈ చిత్రాల రైటింగ్ విషయంలో సిద్ధు కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమాల తర్వాత సదరు దర్శకులు కొత్తగా ఏం మూవీస్ చేస్తున్నారో? ఎక్కడున్నారో తెలీదు? ఇలా పైన చెప్పిన హీరోలు తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నప్పటికీ.. వీళ్ల సినిమాలకు దర్శకులుగా చేస్తున్న వాళ్లు మాత్రం.. తర్వాత నుంచి పెద్దగా కనిపించకుండా పోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?) -
సినిమా ప్రమోషనా.. బూతు కచేరీనా?.. ఇంత బరి తెగించాలా?
ఈ రోజుల్లో సినిమాకు ప్రమోషన్స్ చేయడం చాలా ముఖ్యం. కథపై దర్శకుడికి నమ్మకమున్నా సరే మూవీ ప్రమోషన్స్ చేస్తే జనాల్లోకి వెళ్తుంది. అందుకే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్స్తో పాటు ప్రీ రిలీజ్, సాంగ్ రిలీజ్ల పేరుతో ప్రమోషన్స్ నిర్వహిస్తుంటారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలను ఆడియన్స్తో పంచుకుంటారు. దీనివల్ల సినిమాపై అభిమానుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ పెరుగుతుంది. అలా సినిమాలకు ప్రేక్షకులను తీసుకొచ్చేందుకు ప్రమోషన్స్ అనేది సినీ ఇండస్ట్రీలో తప్పనిసరి.అయితే ప్రమోషన్స్ పేరిట ఆడియన్స్ను తమవైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీలు కూడా జరుగుతుంటాయి. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి అలాంటిదే జరిగింది. బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ ఈనెల 6వ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ యాక్టర్ చంద్రహాస్ నటించారు. రిలీజ్కు దగ్గరవుతున్న వేళ సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు మేకర్స్.అంతా బాగానే ఉన్నా.. ఈవెంట్లో పాడిన ఓ సాంగ్ తీవ్ర వివాదానికి దారితీసింది. హీరో చంద్రహాస్ ఒక వివాదాస్పదమైన బూతు పాట పాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దీంతో సినీ ప్రియులే కాదు.. నెటిజన్స్ సైతం తీవ్రస్తాయిలో అతనిపై మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత బరితెగించాలా అంటూ గడ్డిపెడుతున్నారు. అసలు ఆ బూతు పాటలేంటని మండిపడుతున్నారు. కేవలం నెగెటివ్ పబ్లిసిటీ కోసమే ఇంతలా అసభ్యకర భాషను వాడతారా అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Attitude Star Chandrahas Singing Performance 🤯pic.twitter.com/C24OQSnpEG— cinee worldd (@Cinee_Worldd) February 2, 2026 -
ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి?
2026ని టాలీవుడ్ ఘనంగా ప్రారంభించింది. జనవరిలో చాలానే సినిమాలు రిలీజైనప్పటికీ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' చిత్రాలు ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ఏడాదిని ఘనంగా మొదలుపెట్టాయి. మరి ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి? ఏయే చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి?సంక్రాంతి సినిమాల హడావుడి వల్ల జనవరి మూడో, నాలుగో వారంలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రాలేదు. చివరలో 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే మూవీ వచ్చింది గానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఫిబ్రవరి తొలివారంలో మాత్రం ఏకంగా 10 వరకు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో గుణశేఖర్ 'యుఫోరియా' మాత్రమే ఏమైనా వర్కౌట్ అవుతుందేమోనని అనిపిస్తోంది. దీనితో పాటు సుమతీ శతకం, శ్రీ చిదంబరం గారు, చాయ్ వాలా, హనీ, బ్లడ్ రోజెస్, ఆపరేషన్ పద్మ, బరాబర్ ప్రేమిస్తా లాంటి తెలుగు సినిమాలతో పాటు విత్ లవ్ అనే డబ్బింగ్ బొమ్మ కూడా తొలి వీకెండ్ థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి? 'ఆరెంజ్' చిత్రాన్ని ఇదేవారంలో రీ రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది)ఇకపోతే వాలంటైన్స్ డే వీక్ అయిన రెండోవారంలో విశ్వక్ సేన్ 'ఫంకీ', సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాలతో పాటు సీతా పయనం అనే డబ్బింగ్ చిత్రం కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది. తమిళ సెన్సేషన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా ఈ వీకెండ్లోనే రావొచ్చని అంటున్నారు కానీ సరైన క్లారిటీ అయితే లేదు. అలానే లవ్ స్టోరి, మనసంతా నువ్వే లాంటి రీ రిలీజులు కూడా ఇదే వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ప్రేమికుల ఓటు దేనికి వేస్తారో చూడాలి?మూడో వారం సుహాస్ హీరోగా.. 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ హీరోయిన్గా చేసిన కామెడీ సినిమా 'హే భగవాన్' థియేటర్లలోకి రానుంది. టీజర్ అయితే బాగానే ఉంది. కాకపోతే రిలీజ్ తర్వాత హిట్టా? ఫట్టా అనేది తెలుస్తోంది. దీనితో పాటు 'చైనా పీస్' అనే తెలుగు మూవీ కూడా రాబోతోంది. ఈ వీకెండ్లోనే మృణాల్ ఠాకుర్ హిందీ మూవీ 'దో దివానే సెహర్ మే' రానుంది. రొమాంటిక్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. చివరి వారంలో ప్రస్తుతానికైతే 'స్క్రీమ్' అనే మూవీ మాత్రమే షెడ్యూల్ అయినట్లు సమాచారం. ఇప్పటికైతే ఫిబ్రవరిలో దాదాపు 20 మూవీస్ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ అయితే లేదు. మరి ఏమైనా సర్ప్రైజ్ హిట్స్ అవుతాయేమో చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్) -
ఓటీటీలో 'మన శంకరవరప్రసాద్ గారు'.. వీడియో విడుదల
చిరంజీవి- అనిల్ రావిపూడి హిట్ సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తాజాగా ఒక వీడియోతో ప్రముఖ ఓటీటీ సంస్థ పంచుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు పైగా రాబట్టిన ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రకటన వచ్చేసింది.మన శంకరవరప్రసాద్ గారు చిత్రం త్వరలో జీ5లో విడుదల కానున్నట్లు ఒక వీడియోను పంచుకున్నారు. అయితే ఓటీటీ వర్షన్లో తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్, మరాఠిలో విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో చిరుకు ఫ్యాన్స్ ఉండటం వల్లే పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. అయితే, ఫిబ్రవరి 11న ఓటీటీలోకి మన శంకరవరప్రసాద్ గారు రావచ్చని టాక్ ఉంది.‘మన శంకరవరప్రసాద్గారు’ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేశ్ ముఖ్య పాత్ర చేశారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu) -
'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది
గతేడాది డిసెంబరులో రిలీజై సెన్సేషన్ సృష్టించిన హిందీ సినిమా 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకుడు. ఈ చిత్ర సీక్వెల్.. వచ్చే నెల 19న థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)విలన్ రహమాన్ డకాయిట్ని హంజా అలీ చంపడంతో తొలి పార్ట్ని ముగించారు. హంజా అలీ.. లయరీ ప్రాంతానికి డాన్ ఎలా అయ్యాడు? భారత్ వ్యతిరేకంగా పనిచేస్తున్న మిగతా విలన్స్ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలతో సీక్వెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తొలి పార్ట్ చివరలో వేసిన విజువల్స్ నే ఇప్పుడు టీజర్ గా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?) -
'శృతి హాసన్ వల్లనే మా పాప ప్రాణాలతో ఉంది'
సినీ నటి శృతి హాసన్ పలు సేవా కార్యక్రమాలతో అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధానంగా పిల్లల ఆరోగ్యం, HIV/AIDS బాధితుల సంక్షేమంతో పాటు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాలను ఆదుకుంటుంది. "Charity Closet" ద్వారా నిధులు సేకరించి, అవసరమైన వారికి అందజేస్తుంది. శృతి హాసన్ ప్రతి సంవత్సరం తన వ్యక్తిగత దుస్తులు, ఆభరణాలు అభిమానులకు విక్రయిస్తుంది. ప్రతి సంవత్సరం తన వ్యక్తిగత దుస్తులు, ఆభరణాలు అభిమానులకు విక్రయించిన డబ్బుతో పేదలకు సాయం చేస్తుంది. తాజాగా అరుదైన జబ్బుతో బాధపడుతున్న మూడేళ్ల ఆజ్వి అనే చిన్నారి ప్రాణాలను రక్షించింది. ఇదే విషయాన్ని చెబుతు ఆ చిన్నారి తల్లిదండ్రులు ఒక పోస్ట్ చేశారు.'ఆజ్వి' అరుదైన 'ఎంఎస్ఎమ్డి' (MSMD - మెండీలియన్ ససెప్టిబిలిటీ టు మైకోబాక్టీరియల్ డిసీజెస్) అనే జన్యు సంబంధిత వ్యాధితో 2023లో జన్మించింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ (ఎముక మజ్జ మార్పిడి) చేయాల్సి ఉందని వైద్యులు చెప్పారు. అందుకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు. సరైన సమయంలో ఆపరేషన్ చేయకపోతే పాప బతకడం కష్టమని వ్యైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె బరువెక్కింది. చారటీ సాయం కోసం వెతుకుతున్న సమయంలో వారి జీవితంలో వెలుగులు నింపేందుకు శృతి హాసన్ వచ్చింది. తనకు తెలిసిన ప్రముఖ వైద్యులు ధరణి, దివ్యలను ఆ కుటుంబానికి పరిచయం చేసింది. ఆపై దేశంలోని అత్యుత్తమ స్పెషలిస్టుల ద్వారా పాపకు మెరుగైన వైద్యం అందేలా చూడటంతో పాటు ఆర్థిక సాయం కూడా చేసింది. గతేడాదిలో జరిగిన ఆపరేషన్ తర్వాత ఆ చిన్నారి పూర్తిగా కోలుకుంది. తాజాగా శృతి హాసన్తో అజ్వి గడిపిన క్షణాలను తల్లిదండ్రులు పంచుకున్నారు. శృతి హాసన్ కేవలం ఒక స్టార్ మాత్రమే కాదని, అంతకుమించిన గొప్ప వ్యక్తి అంటూ వారు ప్రశంసించారు. ఈరోజు తమ పాప అజ్వి బతికి ఉందంటే దానికి కారణం శృతి గారే అని కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by 𝑺𝒓𝒊𝒓𝒂𝒎 (@sriramshruti) -
మైకేల్ జాక్సన్గా మేనల్లుడు.. బయోపిక్ ట్రైలర్
మైకేల్ జాక్సన్ను కొన్ని దశాబ్దాల పాటు 'పాప్ రారాజు'గా పిలుచుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సూపర్స్టార్లలో ఆయన ముందు వరుసలో ఉంటారు. కానీ, జాక్సన్ లెగసీని ఆయన కుటుంబం నుంచి ఎవరూ కొనసాగించలేదు. అయితే, మైకేల్ జాక్సన్ బయోపిక్ను ప్రపంచానికి చూపించాలని ఆయన మేనల్లుడు జాఫర్ ముందుకొచ్చారు. తాజాగా ఆ మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు.మైకేల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మైకేల్ జాక్సన్గా ఆయన మేనల్లుడు జాఫర్ కనిపించనున్నారు. ఆయన మరణించిన 16 ఏళ్ల తర్వాత ఈ మూవీ రానుంది. మైకేల్ బాల్య నుంచి సూపర్స్టార్గా ఎదిగిన ప్రయాణాన్ని ఈ మూవీలో చూపించనున్నారు. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం వరల్డ్వైడ్ రూ. 10 వేల కోట్లు రాబట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు 400 కోట్లకు పైగానే ఫ్యాన్స్ ఉన్నారని అంచనా ఉంది. -
'ధురంధర్-2' టీజర్ ప్రకటన వచ్చేసింది
బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, థియేటర్ వర్షన్ ఒక భాషలో మాత్రమే విడుదలై దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ధురంధర్ రికార్డ్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్ల మేరకు రాబట్టింది. సినిమాకు మంచి ఆదరణ రావడంతో పార్ట్-2పై దర్శకుడు ఆదిత్యధర్ ప్రకటించారు. ఈ క్రమంలో నేడు (ఫిబ్రవరి 3)న టీజర్ను విడుదల చేయనున్నారు. ధురంధర్ సీక్వెల్ కోసం పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 12:12 గంటలకు టీజర్ విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ధురంధర్ 2 మూవీ మ్యూజిక్ సంగీత హక్కులను సారెగామా నుండి టి-సిరీస్కు మార్చారు. ఇది ఈ మూవీ ఫ్రాంచైజీకి గణనీయమైన క్రేజ్ను తెచ్చింది. ఈ మూవీ ఆడియో హక్కుల కోసం భూషణ్ కుమార్ భారీ ఆఫర్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని సమాచారం. ధురంధర్-2 టీజర్ ప్రకటన కూడా టి-సిరీస్ నుండి రావడం విశేషం. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్తో పాటు ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తిరిగి రానున్నారు. మార్చి 19, 2026న ఒకేసారి పాన్-ఇండియా రేంజ్లో ఈ మూవీ విడుదల కానుంది. -
'నాని'తో భారీ రిస్క్ చేస్తున్న నిర్మాత.. బెడిసి కొడితే కష్టమే
టాలీవుడ్లో నాని నటించిన ‘దసరా’ భారీ విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 120 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. నాని కెరీర్లోనే మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది. ఇదే మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానితో రెండో చిత్రం ‘ది ప్యారడైజ్’ పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీలో మోహన్బాబు, కయాదు లోహర్, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ మూవీ ముందుగా అనుకున్నదాని కంటే బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి.ఇండస్ట్రీలో ప్రతి నటుడికి ఒక మార్కెట్ ఉంటుంది. దానిని బట్టే వారికి రెమ్యునరేషన్ ఉంటుందని తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద నాని సినిమాల మార్కెట్ రూ. 100 కోట్లకు పైగానే ఉండొచ్చని ఒక అంచనా ఉంది. ఓటీటీ, టెలివిజన్ మార్కెట్లో నానికి మంచి డిమాండ్ ఉండటంతో ‘ది ప్యారడైజ్’ చిత్రానికి రూ. 75 కోట్ల వరకు ఢీల్ సెట్ అయినట్లు టాక్ ఉంది. ఎటుచూసినా సరే నాని సినిమాలకు ఫైనల్ మార్కెట్ విలువ రూ. 200 కోట్ల మేరకు ఉంటుంది. అది కూడా సినిమా భారీ హిట్ అందుకుంటేనే.. ఒకవేళ సినిమాపై ఏమాత్రం టాక్ మారిందా ఈ నంబర్స్ అన్నీ తారుమారు అయిపోతాయి.టైర్- 2 హీరోల్లో చాలా ఎక్కువది ప్యారడైజ్ సినిమాకు మొదట బడ్జెట్ రూ.150 కోట్లు అనుకుంటే.. ఇప్పుడు రూ.200 కోట్లు దాటేసిందట. టైర్- 2 హీరోల్లో ఈ బడ్జెట్ చాలా ఎక్కువని ఇండస్ట్రీ సూచిస్తుంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ సినిమా దసరా భారీ హిట్ కావడంతో ది ప్యారడైజ్పై నిర్మాత ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారట. ఆపై సినిమా కూడా చాలా బలంగా ఉండటంతో ఖర్చ ఎంతైనా సరే అనేంత రేంజ్లో ఆయన ఫ్రీడమ్ ఇచ్చారని తెలుస్తోంది. బడ్జెట్ గురించి వచ్చిన పుకార్లు నిజమైతే.., ఈ సినిమా సురక్షితమైన స్థానంలో ఉండాలంటే అనూహ్యమైన భారీ విజయాన్ని అందుకోవాల్సిందే.. ఏమాత్రం తేడా వచ్చినా భారీ నష్టాలు తప్పవని ముందే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అయితే, నాని తన కెరీర్లోనే అత్యంత ఎక్కువ మొత్తంలో రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా మార్చి 26, 2026న విడుదల కావాల్సి ఉంది, కానీ నిర్మాణ జాప్యాల కారణంగా వాయిదా పడుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాలో జడల్ అనే పవర్ఫుల్ రా రస్టిక్ పాత్రలో నాని కనువిందు చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.నిర్మాత చెరుకూరి సుధాకర్ గురించిచెరుకూరి సుధాకర్ సినిమాల పట్ల ఆసక్తితో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ను స్థాపించి 2016లో రన్ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, విరాట పర్వం, వంటి సినిమాలను నిర్మించారు. 2023లో విడుదలైన దసరా సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్న ఆయన రీసెంట్గా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో మంచి లాభాలు అందుకున్నారు. అయితే, నిర్మాతగా రంగబలి, రామారావు ఆన్డ్యూటీ వంటి డిజాస్టర్స్ కూడా తన ఖాతాలో ఉన్నాయి. ది ప్యారడైజ్ మూవీ తరవఆ మెగాస్టార్ 157వ సినిమాను ఆయన నిర్మించనున్నారు. అయితే, ది ప్యారడైజ్ మూవీ విషయంలో నిర్మాత చెరుకూరి సుధాకర్ భారీ రిస్క్ చేస్తున్నారని -
ఆరేళ్ల తర్వాత బిగ్ ప్రాజెక్ట్ లోడింగ్.. కర్ణుడిగా సూర్య
నటుడు సూర్య ఒక్కసారి కథను నమ్మితే, ఆ చిత్రం కోసం ప్రాణం పెడతారనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. అలా ఆయన ప్రతి చిత్రానికి తన వంతు కృషి చేస్తారు. ఇక జయాపజయాలు అన్నది ఎవరి చేతిలోనూ ఉండవు. కంగువా చిత్రం విషయంలో కూడా జరిగింది ఇదే. భారీ బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం అది. ఆ చిత్రంలో నటుడు సూర్య నటనను ఎవరూ విమర్శించలేదు సరికదా విమర్శకులు సైతం ప్రశంసించారు. అనివార్య కారణాల వల్ల కంగువా చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇకపోతే ఆ తరువాత సూర్య నటించిన రెట్రో చిత్రం కమర్శియల్గా మంచి విజయాన్నే అందుకుంది. కాగా సూర్య ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు చిత్రాన్ని పూర్తి చేశారు. ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా మాలీవుడ్ దర్శకుడు జీతు మాదవన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఈయన నటిస్తున్న 47వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో ఆయన మరోసారి తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. కర్ణుడిగా సూర్యహిందీ చిత్రంలో నటించడానికి సూర్య సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మహాభారతం ఇతిహాసంలోని కర్ణుడి ఇతి వృత్తంతో పాన్ ఇండియా స్థాయిలో కర్ణ పేరుతో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు,అందులో కర్ణుడి పాత్రలో నటుడు సూర్య, నటి జాన్వీకపూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు 2024లో ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.దీంతో కర్ణ చిత్రం అనివార్య కారణాల వల్ల డ్రాప్ అయ్యిందనే ప్రచారం వైరల్ అయ్యింది. అలాంటిది ఇటీవల దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ ఒక భేటీలో పేర్కొంటూ కర్ణ చిత్రం డ్రాప్ కాలేదనీ, దీని కోసం ఆరేళ్ల క్రితమే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించినట్లు చెప్పారు.ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీనికి స్క్రీన్ప్లేను పూర్తిగా రాసినట్లు ఇక షూటింగ్ను ప్రారంభించడమే తరువాయి అని చెప్పారు. కొన్ని కారణాల వల్ల చిత్ర షూటింగ్ వాయిదా పడింది కానీ, డ్రాప్ కాలేదని స్పష్టం చేశారు.ఈ చిత్రం కోసం ఏఆర్.రెహామాన్ ఆరు పాటలను రెడీ చేశారని దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ తెలిపారు. మొత్తం మీద సూర్యను ఆయన అభిమానులు కర్ణుడిగా చూడబోతున్నారన్నమాట. -
ది ఇండియా హౌస్తో ఎంట్రీ
నిఖిల్ సిద్ధార్థ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్’. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ కథానాయికగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కంపోజర్ శాశ్వత్ సచ్దేవ్ ‘ది ఇండియా హౌస్’ ద్వారా తెలుగులోకి అడుగుపెడుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘‘ధురంధర్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, ఆర్టికల్ 370’ చిత్రాలతో పాపులర్ అయిన శాశ్వత్ సచ్దేవ్ మా సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఐదు ఆకట్టుకునే పాటలను కంపోజ్ చేశారాయన. 1905 నాటి రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ‘ది ఇండియా హౌస్’ విప్లవం, ప్రేమ, త్యాగం.. వంటి భావోద్వేగాలో అద్భుతంగా ఉండబోతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: మయాంక్ సింఘానియా, కెమెరా: కేకే సెంథిల్ కుమార్. -
"ది ప్యారడైజ్" రిలీజ్పై క్లారిటీ.."పెద్ది" ఇంకా సస్పెన్స్లోనే!
నాని, రామ్ చరణ్ సినిమాలు అనధికారికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు కొత్త రిలీజ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో "ది ప్యారడైజ్" సినిమాపై దాదాపు స్పష్టత వచ్చింది. మార్చి నుంచి తప్పుకున్న ఈ సినిమాను జూన్ చివర్లో విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. షూటింగ్తో పాటు గ్రాఫిక్స్ పనులకు కూడా ఓ డెడ్లైన్స్ పెట్టి, ఆ గడువులోగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇవి కేవలం యూనిట్ నిర్ణయించిన తేదీలు మాత్రమే. పూర్తిగా క్లారిటీ వచ్చాకనే అధికారికంగా రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు కాస్త ఎక్కువ టైమ్నే తీసుకుంటున్నారు. మరోవైపు రామ్ చరణ్ "పెద్ది" సినిమా రిలీజ్ విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ప్యారడైజ్తో పోలిస్తే పెద్ది షూటింగ్ ముందే పూర్తి అవుతోంది. మొన్నటి వరకూ మే 1న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీపై కూడా యూనిట్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన "చికిరి" సాంగ్ పెద్ద హిట్ అయింది. త్వరలోనే సెకండ్ సింగిల్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఇక అదే సమయంలో రిలీజ్ డేట్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. -
వ్యోమగామిగా వితికా శేరు.. ఆసక్తికరంగా గ్లింప్స్
వరుణ్ సందేశ్ సతీమణి వితికా శేరు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం డియర్ ఆస్ట్రోనాట్. ఈ మూవీకి కార్తిక్ భాగ్యరాజా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వితికా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో వితికా శేరు భర్త వరుణ్ సందేశ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ వితికా శేరు బర్త్ డే కావడంతో స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ మూవీలో ఆస్ట్రోనాట్గా వితికా షేరు కనిపించనున్నారు. అంజలి అనే వ్యోమగామి పాత్రలో మెప్పించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన గ్లింప్ల్ విజువల్స్ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తున్నాయి. అంతేకాకుండా నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీని యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైత్ర పెద్ది, గీతా భాస్కర్, దేవి ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ కొడకండ్ల సంగీతమందిస్తున్నారు. -
దేవగుడి సక్సెస్.. ఆనందంగా ఉందన్న డైరెక్టర్
అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం దేవగుడి. ఈ మూవీని బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్ను నిర్వహించారు.దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..'మా సినిమాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఆకట్టుకుందని ప్రశంసలు వస్తున్నాయి. రివ్యూస్ అన్నీ పాజిటివ్గా వచ్చాయి. అభినవ శౌర్య నరసింహ, అనుశ్రీ నటనతో కూడా అందరిని ఆకట్టుకున్నారు. కొందరు ఆడియెన్స్ సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారని' అన్నారు.హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ..' కొన్నేళ్లుగా హీరో కావాలనే కలను ఈ సినిమాకు వస్తున్న స్పందనతో మర్చిపోయాను. థియేటర్స్లో నన్ను నేను చూసుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. ఈ క్రెడిట్ అంతా మా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డికే చెందుతుంది. మీ ఆదరణ మా సినిమా పట్ల ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు.హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ.. 'ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్గా మీ ముందుకు వచ్చా. తిరుపతిలో మా సినిమా చూసి బయటకు వస్తుంటే శ్వేతా రెడ్డి అని పిలుస్తున్నారు. ఇది నటిగా నాకు దక్కిన రియల్ గుర్తింపు. ఈ చిత్రంలో శ్వేతారెడ్డిగా నన్ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి గారు సినిమాలోని ప్రతి పాత్రను అంత బాగా తెరకెక్కించారు' అని అన్నారు. -
తన అనుభవం అంతవరకే.. అది మారదు: తమన్పై కోటి కామెంట్స్
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి (సాలూరి కోటేశ్వరరావు) పేరు పరిచయం అక్కర్లేదు. తెలుగులో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన సినీ కెరీర్ గురించి మాట్లాడారు. అంతేకాకుండా తెలుగు సినిమాపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సంగీత దర్శకుల గురించి ఆయన కామెంట్స్ చేశారు. ఏఆర్ రెహమాన్తో పాటు ఎస్ఎస్ తమన్ గురించి వ్యాఖ్యానించారు.టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీ గుర్తిస్తుందని కోటి అన్నారు. తమన్ కూడా మంచి మ్యూజిక్ అందించారని.. నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడని.. వరల్డ్ మ్యూజిక్కు దగ్గరగా ఉంటుందని తెలిపారు. బీజీఎం పరంగా తమన్ స్టైల్ చాలా బాగుంటుందని అన్నారు. తమన్ రిపీటెడ్గా చేయడంపై చేస్తారన్న ప్రశ్నకు కోటి స్పందించారు.ఇక్కడ అతనికి ఒక ప్రొగ్రెషన్ అనేది రిపీట్ అవుతుందని కోటి అన్నారు. తన అనుభవం అంతవరకే.. అది మారదని తెలిపారు. ఎవరికైనా ఒక టైమ్ ఉంటుందని.. అంతవరకే చేయగలరని వెల్లడించారు. కొత్త నీరు వస్తూనే ఉంటోంది.. దాన్ని మనం అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఇక్కడ ఎవరి స్టాండర్స్ వాళ్లవని సంగీత దర్శకుడు కోటి అన్నారు. మార్కెట్ ప్రకారమే మనం ముందుకు వెళ్లాలని సూచించారు. మ్యూజిక్లో ప్రజంటేషన్ అనేది చాలా ముఖ్యమని తెలిపారు. ఇప్పుడున్న జనరేషన్లో నాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని అన్నారు. -
ఆ ముగ్గురి వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నా: బ్రహ్మనందం
టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం తన 70వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనదైన కామెడీతో సినీ ప్రియులను దశాబ్దాలుగా అలరించిన బ్రహ్మనందం 42 ఏళ్లుగా వెండితెరపై అలరిస్తున్నారు. తాజాగా తన 70వ బర్త్ డే వేడుకలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు.ఇన్నేళ్లుగా తాను నటుడిగా కొనసాగుతున్నానంటే అదంతా ప్రేక్షకులు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలే కారణమని అన్నారు. నా సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇవాళ ఈ స్థితిలో ఉన్నందుకు తెలుగు కళామతల్లికి శిరస్సు వంచి పాదాభినందనాలు చేస్తున్నానన్నారు. ఇన్ని సినిమాలు నిర్మించిన నిర్మాతలు, దర్శకులు గొప్పతనం వల్లే ఇది సాధ్యమైందన్నారు. నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని బ్రహ్మనందం తెలిపారు.నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి కీర్తిశేషులు జంధ్యాల గారు, చిరంజీవి, రామానాయుడే కారణమని బ్రహ్మనందం అన్నారు. నాలో టాలెంట్ను గుర్తించి చంటబ్బాయి సినిమాలో నన్ను చిరంజీవి పరిచయం చేశారు. ఆ తర్వాత జంధ్యాల నాకు ఆహా నా పెళ్లంట మూవీలో అవకాశమిచ్చారని తెలిపారు. ఇన్ని వందల సినిమాలు చేయడంలో నా గొప్పతనం ఏమీ లేదన్నారు. మీ అందరి ఆదరణ, ప్రేమ వల్లే ఈ బ్రహ్మనందం ఇక్కడ ఉన్నారని అన్నారు. -
కూతురు తెచ్చిన అదృష్టం.. హీరోల రేంజ్ మారిపోయింది!
ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలంటారు. కానీ, ఆ పాప పుడుతూనే అదృష్టాన్ని మోసుక్తుందని ఎవరూ ఊహించి ఉండరు.. అదెలాగంటే స్టార్ హీరోలకు పాప పుట్టాక దశ తిరిగిపోయింది. హిట్లు, సూపర్ హిట్లు కాదు ఏకంగా ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ చూశారు. ఆ సంగతులు ఓసారి చూసేద్దాం..పాప తెచ్చిన సంతోషంబాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ 2023లో 'యానిమల్' మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఏకంగా రూ.917 కోట్లు రాబట్టింది. రణ్బీర్ కెరీర్లోనే ఇది అత్యధికం. అయితే ఈ సినిమా కంటే ముందు అతడి జీవితంలో ఓ అద్భుతం జరిగింది. 2022లో రణ్బీర్- ఆలియా భట్ పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్లో కూతురు రాహా పుట్టింది. పాప పుట్టిన వేళా విశేషం.. రణ్బీర్కు బాగా కలిసొచ్చింది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో రికార్డులు తిరగరాశాడు. ఈ మూవీకి సీక్వెల్గా యానిమల్ పార్క్ రాబోతోంది.అదృష్టంబాలీవుడ్లో మరో స్టార్ జోడీ రణ్వీర్ సింగ్ - దీపికా పదుకొణె. వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్లకు అంటే 2024 నవంబర్లో ఈ దంపతులకు కూతురు పుట్టింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా జన్మించడంతో తనకు దువా అని నామకరణం చేశారు. పాప పుట్టాక రణ్వీర్ కెరీర్కు కూడా మంచి బూస్ట్ లభించింది. 2025 చివర్లో వచ్చిన ధురంధర్ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు కూడా సీక్వెల్ వస్తోంది. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుంది.పెద్ది కూడా బ్లాక్బస్టర్!టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్చరణ్-ఉపాసన పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. ఉపాసన కడుపుతో ఉండగానే చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. RRR మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో సగర్వంగా నిలబెట్టింది. ఈసారి చరణ్కు కవలలు (పాప, బాబు) పుట్టారు. చరణ్ నెక్స్ట్ మూవీ పెద్ది. ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి హీరోలు ఊహించలేనంత విజయాల్ని అందుకుంటున్నారు. ఈ లెక్కన చరణ్కు మళ్లీ బ్లాక్బస్టర్ హిట్ రావడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.చదవండి: 50 మంది సెలబ్రిటీలు.. వీరిలో కరెక్ట్ విన్నర్ను గెస్ చేస్తే రూ.50 లక్షలు! -
అక్కా.. నిన్ను ఇప్పటికైనా అర్థం చేసుకున్నా: చెల్లి ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సతీమణి వితికా శేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'పడ్డానండి ప్రేమలో మరి' అనే చిత్రంలో మొదలైన వీరిద్దరి జర్నీ పెళ్లి పీటలవరకు తీసుకెళ్లింది. ఈ సినిమాతోనే ప్రేమలో పడిన ఈ జంట కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి బిగ్బాగ్ 3వ సీజన్లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే గతేడాది వరుణ్ సందేశ్ బర్త్ డే కానుకగా ఏకంగా సొంతింటినే గిఫ్ట్గా ఇచ్చింది వితికా శేరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. అంతేకాకుండా 2025 నవంబర్లో తన చెల్లి సీమంతం వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. తన చెల్లి సీమంతాన్ని తానే దగ్గరుండి మరీ నడిపించింది. అక్కగా అన్నీ తానై చెల్లి క్రితిక శేరు సీమంతాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది.తాజాగా ఇవాళ తన అక్క వితికా శేరు బర్త్ డే కావడంతో చెల్లి క్రితిక శేరు విషెస్ తెలిపింది. తన కోసం అక్క చేసిన క్షణాలను గుర్తు చేసుకుంది. తన వెంట ఉంటూ అండగా నిలిచిన అక్కకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. చాలా కాలంగా నేను నిన్ను నిజంగా అర్థం చేసుకోలేదంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. నువ్వు ఎప్పుడు బిజీగా ఉన్నా.. బాధ్యతలను మోస్తూ.. మన కుటుంబాన్ని చూసుకోవడానికి నీ కెరీర్ను నిర్మించుకుంటూనే ఉన్నావంటూ రాసుకొచ్చింది. నా చిన్నప్పుడు ఇతరుల్లో ఉన్నంత అనుబంధం మనలో లేదని నాకు అనిపించింది.. కారణాలు తెలియకుండానే నిన్ను చాలాసార్లు ప్రశ్నించానంటూ భావోద్వేగానికి గురైంది క్రితిక శేరు.క్రితిక శేరు తన ఇన్స్టాలో రాస్తూ..' నా పెళ్లి తర్వాత.. ముఖ్యంగా ఈ గర్భధారణ సమయంలో ప్రతిదీ మారిపోయింది. దూరం వల్ల నీ ప్రేమ నాకు చాలా స్పష్టంగా కనిపించింది. నువ్వు చిన్న చిన్న విషయాలను గమనించావు. నన్ను భావోద్వేగంగా.. మానసికంగా ఆదుకున్నావు. ఈ ప్రయాణాన్ని నాకు చాలా సులభతరం చేసి మరింత అందంగా మార్చావ్. నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా నా కోసం నువ్వు నిలబడ్డావ్. చివరికీ ఈరోజు నేను నిన్ను అర్థం చేసుకున్నా అక్కా. నీ ప్రేమ నాపై ఎల్లప్పుడూ బలంగా ఉంది. నువ్వు నా కోసం చేసిన ప్రతి చిన్న పనికి ధన్యవాదాలు. ఈ రోజు నా బలం, నా మద్దతు.. నాకు అతిపెద్ద ఆశీర్వాదం నువ్వే అక్కా. నీకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది తెలుసుకున్న అభిమానులు వితికా శేరుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru) -
మృణాల్ కాస్త డిఫరెంట్గా.. జాన్వీ వెనక్కి తిరిగి!
వెనక్కి తిరిగి పోజులిచ్చేస్తున్న జాన్వీ కపూర్ఆరెంజ్ డ్రస్లో మృణాల్ డిఫరెంట్ లుక్క్యూట్ అండ్ స్వీట్గా కాజల్ అగర్వాల్వీకెండ్ ఎంజాయ్ వీడియోతో అనసూయహాట్ చాక్లెట్లా ముద్దుగుమ్మ సన్నీ లియోన్దుబాయి ట్రిప్లో హీరోయిన్ దివ్య భారతి View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) -
'బెల్లా బెల్లా.. రసగుల్లా' వీడియో సాంగ్ వచ్చేసింది
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒకటి! మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. కిషోర్ తిరుమల దర్వకత్వం వహించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. వీడియో సాంగ్ రిలీజ్ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ జనవరి 13న విడుదలవగా మంచి స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'బెల్లా బెల్లా.. ఈసబెల్లా.. బాగున్నావే రసగుల్లా' వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో రవితేజ, ఆషికా హుషారుగా స్టెప్పులేశారు. సురేశ్ గంగుల లిరిక్స్ సమకూర్చిన ఈ పాటను నకాశ్ అజీజ్, రోహిని ఆలపించారు. ఈ పాటను మీరూ చూసేయండి.. చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ -
లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్.. 'కపుల్ ఫ్రెండ్లీ' ట్రైలర్ రిలీజ్
హీరోగా పలు సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్న హీరో సంతోష్ శోభన్.. కాస్త గ్యాప్ తర్వాత 'కపుల్ ఫ్రెండ్లీ' అనే మూవీ చేశాడు. వాలంటైన్స్ డే కానుకగా ఈనెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్ని విడుదల చేశారు. లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్తో చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు కాగా సంతోష్ శోభన్ సరసన మానస వారణాసి హీరోయిన్గా నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ దీన్ని రిలీజ్ చేయనున్నారు. అనుకోకుండా ఓసారి కలిసిన హీరోహీరోయిన్లు.. కొన్నాళ్లకు ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటూ లివింగ్ రిలేషన్షిప్ మెంటైన్ చేస్తారు. తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏం జరిగిందనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: మహేశ్కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్) -
మహేశ్కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్
ఇప్పుడంటే టాలీవుడ్లో తమన్, దేవిశ్రీ ప్రసాద్ హవా చూపిస్తున్నారు కానీ 2000-10 మధ్యలో వరస సినిమాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. చాలా తక్కువ టైంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చిత్రం, నువ్వు నేను, జయం, మనసంతా నువ్వే, నీ స్నేహం, సంతోషం తదితర చిత్రాలతో మ్యూజికల్ హిట్స్ అందుకున్నారు. అలాంటి ఈయన.. మహేశ్ బాబు సినిమాకు పాటలు పాడి తప్పు చేశానని అంటున్నారు. గతంలోనే ఈ విషయం చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి అదే అన్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)''నిజం' కంటే ముందు 'ఒక్కడు' రిలీజ్ కాకపోయుంటే.. 'నిజం' ఫలితం వేరేలా ఉండేది. ఎందుకంటే 'ఒక్కడు' విడుదలైన తర్వాత ఇది చిన్న సినిమా అయిపోయింది. 'ఒక్కడు'లో హీరోయిజం ఫుల్ ఎలివేట్ అయిపోయిన తర్వాత 'నిజం' వచ్చేసరికి హీరోని తల్లిచాటు బిడ్డగా అంగీకరించలేకపోయారు. పాటల విషయానికొస్తే.. నా గొంతుతోనే పాడేశాను. కానీ విడుదలైన తర్వాత వేరే వాళ్లతో పాడించుంటే బాగుండేదని కృష్ణ(మహేశ్ తండ్రి) ఫోన్ చేసి చెప్పారు. వాయిస్ వేరే వాళ్లు కూడా ఉంటే బాగుండేమో చూడండి అని అన్నారు. నిజంగా అప్పుడు ప్రయత్నించాం. తెలుగుని తెలుగులా పాడే వాళ్లతో పాడించాలనేది నా ఉద్దేశం. తెలుగుని ఖూనీ చేసేవాళ్లతో నేను పాడించను. శంకర్ మహదేవన్, కేకే.. వీళ్ల వాయిస్ నాకు ఓకే. కానీ రికార్డింగ్ టైంకి వాళ్లు అందుబాటులో లేరు. దీంతో నేను పాడేశా. నా వాయిస్ మహేశ్కి సూట్ కాలేదు. అది నేను ఒప్పుకొంటాను' అని ఆర్పీ పట్నాయక్ చెప్పుకొచ్చారు.2003లో మహేశ్ బాబు హీరోగా చేసిన రెండు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో మొదటగా వచ్చిన 'ఒక్కడు' బ్లాక్బస్టర్గా నిలిచింది. దీని తర్వాత కొన్ని నెలలకు 'నిజం' థియేటర్లలోకి వచ్చింది. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్.. భయస్తుడిగా, తల్లిచాటు బిడ్డగా నటించాడు. ఇది ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ మూవీలో మహేశ్ లుక్ కూడా ఏమంత ఇంప్రెసివ్గా ఉండదు. ఇప్పుడు ఆర్పీ పట్నాయక్ ఇంటర్వ్యూ వల్ల 'నిజం' మరోసారి చర్చనీయాంశమైంది.ఆర్పీ పట్నాయక్ విషయానికొస్తే.. కెరీర్ పీక్లో ఉండగానే సంగీత దర్శకత్వాన్ని పక్కనబెట్టారు. దర్శకుడు కొన్ని సినిమాలు చేశారు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతానికైతే ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. మహేశ్ బాబు విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ మూవీ థియేటర్లలోకి రానుందని ఇటీవలే ప్రకటించారు.(ఇదీ చదవండి: ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఇలా అనేసిందా?) -
'ఒక్క ఛాన్స్ ప్లీజ్'.. అనుకున్నంత ఈజీ కాదు!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే పదుల సంఖ్యలో హీరోలున్నారు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు వస్తూనే ఉన్నారు. ఈ వారం కూడా తెలుగు బిగ్బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా పరిచయమవుతున్న 'సుమతీ శతకం' అనే మూవీ విడుదలకు సిద్ధమైంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని వేడుకుంటున్న అమర్దీప్.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడు? అసలు ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? గతంలో బిగ్బాస్ నుంచి వచ్చి హీరోలు అయినవాళ్లు ఎక్కడున్నారు?ఇండస్ట్రీలో హీరోగా నిలబడటం అంత సులభం కాదు. తెలుగు రియాలిటీ షో బిగ్బాస్లో ఫేమ్ తెచ్చుకుంటున్న సొహైల్, సన్నీ లాంటి వాళ్లు.. ఆ క్రేజ్ నిజమనుకుని హీరోలుగా పలు మూవీస్ చేశారు. కాకపోతే రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీసే చేయడంతో అవి సక్సెస్ కాలేదు. దీంతో కొన్నాళ్లకే ఇండస్ట్రీని పూర్తిగా వదిలేశారు. అమర్దీప్ కూడా కొన్నిరోజుల క్రితం ఇదే చెప్పాడు. బిగ్బాస్ ఓట్లు దేనికీ పనికిరావు అని అన్నాడు. కానీ ఇండస్ట్రీలో పరిస్థితులు కొత్త హీరోలకు కలిసొచ్చేలా ఉన్నాయా అంటే లేవనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)ఎందుకంటే పాన్ ఇండియా కల్చర్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత తెలుగు ఆడియెన్స్.. చిన్న సినిమాలని అందులోనూ రొటీన్ కమర్షియల్ చిత్రాలు చూసేందుకు మునుపటిలా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అమర్దీప్ 'సుమతీ శతకం' ట్రైలర్ చూస్తుంటే ఇది కూడా సాధారణ సినిమాలానే అనిపిస్తుంది. దానికితోడు ఈ వారం దాదాపు 10 వరకు మూవీస్, థియేటర్లలోకి రానున్నాయి. వీటన్నింటిని దాటుకుని అమర్దీప్ చిత్రానికి ప్రేక్షకులు వస్తారా అనేది చూడాలి.అలానే రీసెంట్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన అమర్దీప్.. 'ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో చూపిస్తా. ఇది హిట్ కాకపోతే మరెప్పుడు ఇలా ఒక్క ఛాన్స్ అని అడగను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. సుమతీ శతకం చూస్తారు. నేనేంటో మీకు తెలుస్తుంది' అని అన్నాడు. మరి ఈ మాట మీద ఎంతవరకు నిలబడతాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?) -
రామ్ చరణ్ దంపతులకు బన్నీ విషెస్.. చిరంజీవి ఫేస్ చూస్తుంటే?
రామ్ చరణ్ దంపతులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో ఆనందం మరింత రెట్టింపైదన్నారు. ట్విన్స్ రాకతో చిరంజీవి ముఖంలో ఆ గర్వం, సంతోషం కనిపిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులందరి చిరునవ్వుల ముఖాలను చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అందమైన కొత్త ప్రారంభానికి రెట్టింపు ప్రేమ, ఆనందం కలుగుతోందన్నారు.కాగా.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విన్స్కు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉపాసనకు ఓ బాబు, పాప పుట్టారని అన్నారు. బిడ్డలతో పాటు తల్లి కూడా క్షేమంగా ఉన్నారని తెలిపారు. కవలల రాకతో తమ కుటుంబంతో పాటు అభిమానులు సంతోషంలో మునిగిపోయారని అన్నారు. మాపై మీరందరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఉపాసన- చెర్రీ దంపతులకు ఇప్పటికే క్లీంకార అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే. Congratulations to @AlwaysRamCharan & @upasanakonidela on being wonderful parents once again. Immense joy and celebration all around. The pride and happiness are radiating on @KChiruTweets garu’s face and Chittika’s as well. So happy to see them and the entire family’s smiling…— Allu Arjun (@alluarjun) February 2, 2026 -
'హైకూ' షూటింగ్ స్టార్ట్.. ఓటీటీ రైట్స్ కొనేసిన నెట్ఫ్లిక్స్
తమిళ చిత్రం ‘హైకూ’ షూటింగ్ కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో పూజా కార్యక్రమాలతో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. పేరన్బు, తరమణి వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ ముహూర్తపు సన్నివేశంపై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. ఈ సినిమాకు యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్పై డా.డి.అరుళనందు, మాథ్యూ అరుళనందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘జో’ వంటి సూపర్ హిట్ సినిమాతో గుర్తింపు పొందిన హరిహరన్ రామ్ ఈ చిత్రానికి అడిషనల్ స్క్రీన్ప్లే అందిస్తున్నారు.ఈ సినిమాకు ప్రియేష్ గురుస్వామి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేస్తుండగా.. శక్తి ప్రణేశ్ ఎడిటర్గా, ‘బేబీ’, ‘కోర్ట్’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. నటీనటుల విషయానికి వస్తే.. ‘జో’, ‘కోళి పన్నై చెల్లదురై’ చిత్రాల ఫేమ్ ఏగన్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఆయన సరసన ‘మిన్నల్ మురళి’, ‘శేషం మైకిల్ ఫాతిమా’ వంటి చిత్రాల్లో మెప్పించిన ఫెమినా జార్జ్, అలాగే ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నిస్తాయి. కానీ ‘హైకూ’ సినిమా విడుదలకు ముందే డిజిటల్ డీల్ క్లియర్ కావడం పెద్ద విషయం. -
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
బిగ్బాస్ షో లోపల ఉన్న కంటెస్టెంట్ల కోసం బయట ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఓ పట్టాన అయిపోవు. షో అయిపోయాక కూడా అవతలి కంటెస్టెంట్పై విషం చిమ్ముతూనే ఉంటారు. ఏం పని చేసినా కూడా విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. ఈ అనవసరపు ట్రోలింగ్ వల్ల తాను మానసిక వేదన అనుభవిస్తున్నానంటోంది తెలుగు బిగ్బాస్ 7 రన్నరప్ , నటి తనూజ పుట్టస్వామి.ఎవరి జీవితాల్లో వారు బిజీఈ మేరకు తనూజ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. చాలాకాలంగా నా మనసులో తిరుగుతున్నదంతా మీతో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నన్ను నిందించడం ఆపండి. మీ అందరిలాగే నాకూ ఓ జీవితం ఉంది. నా పనేదో నేను చేసుకుంటున్నాను. నా బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఎవరి జీవితాల్లో వారందరూ బిజీ అయిపోయాం.పీఆర్ టీమ్ లేదుప్రతిదానికి పీఆర్(డబ్బులు పెట్టి ఒక టీమ్ నడపడం) అనడం మానేయండి. నాకు పీఆర్ టీమ్ అంటూ ఏదీ లేదు. నా సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నారంతే! ఈరోజుకూ నాపై తీవ్రమైన నెగెటివిటీ వస్తోంది. ప్రతిరోజు అసభ్యంగా దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నేను ఒకర్ని టార్గెట్ చేశానని, ఒకర్ని చెడుగా చిత్రీకరించాలని చూస్తున్నానని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నరకం అనుభవిస్తున్నా..అవతలివారిపై మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను. కానీ, నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానో మీకు తెలుసా? నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? ప్రతిరోజు చెండాలమైన మాటలంటున్నారు. నా క్యారెక్టర్ను తప్పుపడుతున్నారు, అవమానిస్తున్నారు. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా క్యారెక్టర్ను వక్రీకరిస్తుంటే మహిళగా భరించలేకపోతున్నాను. నోటికొచ్చిన మాటలనడం మీకు చిన్న విషయమేమో! గుండె నిండా బాధనన్ను మాత్రం ఎంతో బాధిస్తున్నాయి. గుండె లోతులో గాయాలు చేస్తున్నాయి. ఈ బాధనంతా భరిస్తూ ఎక్కడికని వెళ్లను? ఎవరితో పంచుకోను? అందుకే.. మౌనాన్ని ఆశ్రయించాను. నా తప్పు ఉందని కాదు, ధైర్యాన్ని కూడదీసుకునేందుకు నిశ్శబ్ధంగా ఉంటున్నాను. మీలాగే నాకూ ఓ కుటుంబం ఉంది. మీరు నా గురించి వాగే చెత్తవాగుడు, చెత్త కామెంట్స్ నా కుటుంబసభ్యులు కూడా చదువుతారు. అప్పుడు వాళ్లెంత బాధపడతారు? మానసికంగా చిత్రవధఅసభ్య కామెంట్లు పెట్టే ఫేక్ అకౌంట్స్ ఎక్కడినుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. నేనే కాదు, నాకు సపోర్ట్గా నిలబడ్డవారిని కూడా ద్వేషిస్తున్నారు. ఒకర్ని మానసికంగా చిత్రవధ చేస్తే ఏమొస్తుంది? ఒకరిపై విషం చిమ్మితే ప్రశాంతంగా ఉండొచ్చనుకుంటున్నారా? ఇక్కడ నేనెవర్నీ కిందకు లాగాలనుకోవడం లేదు. డ్రామా క్రియేట్ చేయాలని అసలే అనుకోవట్లేదు. నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా, గౌరవంగా జీవించాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. మరి ఇకమీదటైనా ఈ ట్రోలింగ్ తగ్గుతుందేమో చూడాలి!తనూజ వర్సెస్ కల్యాణ్బిగ్బాస్ 7 షోలో తనూజ, పవన్ కల్యాణ్ మంచి ఫ్రెండ్స్లా ఉన్నారు. కానీ బయట మాత్రం వారి అభిమానులు రెండుగా విడిపోయారు. మా కంటెస్టెంటే గొప్ప అని ఎప్పుడూ తగువులాడేవారు. ఈ క్రమంలోనే అవతలి కంటెస్టెంట్ను విమర్శించేవాళ్లు! చివరకు కల్యాణ్ ట్రోఫీ గెలవడంతో తనూజ వల్లే గెలిచాడని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో తనూజకు వ్యతిరేకంగా ఉన్నవారు ఆమెను ట్రోల్ చేశారు.చదవండి: ఈ వారం ఓటీటీలో సంక్రాంతి సినిమాలు.. డోంట్ మిస్ -
చిరు, నయన్ 'మీసాల పిల్ల' వీడియో సాంగ్ రిలీజ్
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. ఈ చిత్రం నుంచి తాజాగా మీసాల పిల్ల వీడియో వర్షన్ సాంగ్ వచ్చేసింది. భీమ్స్ సిసిరోలియో సంగీతంలో ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడిన ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ రచించారు. ఇందులో చిరంజీవి డ్యాన్స్ మూవ్స్తో పాటు నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా బాగా పాపులర్ అయిన సాంగ్స్లో మీసాల పిల్ల చేరిపోయింది. కేవలం ఆడియో వర్షన్ సుమారు 15రోజుల పాటు యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న ఈ సాంగ్ ఇప్పుడు వీడియో వర్షన్ ఎంత రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. -
చూడగానే దేవుడిలా కనిపించాలి.. ఆదిపురుష్తో పోల్చకండి: అరుణ్ గోవిల్
రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణ్ (1987–88) టెలివిజన్ సీరీస్ ఒకప్పుడు పాపులర్.. శ్రీరాముడి పాత్రలో అరుణ్ గోవిల్ మెప్పించారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. రామాయణ్ సీరియల్లో శ్రీరాముడిగా కనిపించిన ఆయన పాత్రకు అపారమైన ప్రజాదరణను తెచ్చింది. ఆ పాత్ర కారణంగా ఆయనను ప్రజలు నిజ జీవితంలో కూడా "రాముడు" ఇలాగే ఉంటారేమోనని భావించారు. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న కొత్త 'రామాయణ' మూవీతో పాటు ప్రభాస్ ఆదిపురుష్పై స్పందించారు.బాలీవుడ్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘రామాయణ’. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. దశరథుడిగా అరుణ్ గోవిల్ నటిస్తున్నారు.రామాయణ సినిమాకు సంబంధించి రాముడి లుక్లో రణ్బీర్ కపూర్ ఫోటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది రామాయణ్ సీరియల్లోని అరుణ్ గోవిల్ రాముడి గెటప్తో పోల్చారు. ఈ అంశంపై ఆయన ఇలా స్పందించారు. ' రాముడి రూపం ఇలా ఉంటుంది అని ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చినప్పుడు ఇలాంటి పోలికలు రావడం సహజం. ఈ క్రమంలోనే చాలామంది నన్ను రణ్బీర్తో పోలుస్తున్నారు. అందుకు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడి పాత్రలో ఎవరైనా నటించాలంటే ఆ రూపం చాలా ముఖ్యమైనది. ప్రజలు మిమ్మల్ని చూడగానే దేవుడిలా కనిపించాలి. దేవుడు బహుశా ఇలాగే ఉంటాడేమో అనే భావన వారిలో కలగాలి.' అని ఆయన అభిప్రాయపడ్డాడు.ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' బాక్సాఫీస్ వద్ద విమర్శలతో పాటు డిజాస్టర్గా నిలిచింది. రాముడి పాత్రతో పాటు రావణాసురుడి గెటప్ సరిగా లేదని చాలామంది తప్పుబట్టారు. ఈ క్రమంలో కొత్తగా రానున్న రామాయణ సినిమాను ఆదిపురుష్తో ఎట్టిపరిస్థితిల్లో పోల్చవద్దని అరుణ్ గోవిల్ కోరారు. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ, ఓం రౌత్ ఆదిపురుష్ మధ్య చాలా తేడా ఉంది. రేపొద్దున సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులకు ఈ విషయం అర్థం అవుతుందని ఆయన అన్నారు. -
ఓటీటీ 'కింగ్' శంబాల.. రికార్డ్ క్రియేట్ చేసిన ఆది
నటుడు ఆది సాయికుమార్ నటించిన 'శంబాల' థియేటర్లో భారీ హిట్ అందుకుంది. ఓటీటీలో కూడా దూకుడు చూపుతుంది. జనవరి 21న ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసిన శంబాల ఇక్కడ కూడా మెప్పిస్తుంది. సరైన విజయం కోసం ఆది చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్రమంలోనే శంబాల సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. బక్సాఫీస్ వద్ద సుమారు రూ. 12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటిందని తెలుస్తోంది.జనవరి 21, 2026న ఓటీటీలోకి వచ్చిన శంబాల.. 'ఆహా'తో మరో అద్భుతమైన ఫీట్ను సాధించింది. 11 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటింది. ఓటీటీలో చిన్న బడ్జెట్ సినిమాల పరంగా భారీ రికార్డ్ అని చెప్పొచ్చు. కేవలం తెలుగులోనే ఈ రేంజ్లో ఆదరణ లభించడం అంత సులభం కాదని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఓటీటీ కింగ్లా శంబాల నిలిచిందని కామెంట్లు పెడుతున్నారు. హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో అందుబాటులోకి వస్తుందని సమాచారం.శంబాల చిత్రాన్ని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఇందులో అర్చన అయ్యర్, స్వసిక, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. అయితే, దర్శకుడు చాలా అద్భుతంగా సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. 100 million+ minutes streamed.The fear just got bigger 🔥Watch #AadiShambhala now only on #aha@iamaadisaikumar @tweets_archana @ugandharmuni pic.twitter.com/ds0ZOXpz9E— ahavideoin (@ahavideoIN) February 1, 2026 -
చంద్రహాస్ 'బరాబర్ ప్రేమిస్తా' ట్రైలర్
టాలీవుడ్ యంగ్ యాక్టర్ చంద్రహాస్ హీరోగా నటించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటించగా.. అర్జున్ మహీ (‘ఇష్టంగా’ ఫేమ్) ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సంపత్ రుద్ర దర్శకత్వంలో కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 6న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఘర్షణ పడితే ఎలా ఉంటుంది? అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. తెలంగాణ బ్యాక్డ్రాప్లో వినోదాత్మకంగా ఈ చిత్రం ఉండనుంది. -
దలైలామాకు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డ్
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా 68వ గ్రామీ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా తమ పాటలతో, ఆల్బమ్లతో మెప్పించిన వారు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే బెస్ట్ ఆడియో బుక్ 'మెడిటేషన్- ది రిఫ్లెక్సన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలైలామా' అనే ఆల్బమ్కు గాను దలైలామాకు ఈ అవార్డు లభించింది. 90 ఏళ్ల వయసులో గ్రామీ అవార్డు దక్కడం ఇదే తొలిసారి.గ్రామీ అవార్డును దలైలామా తరఫున సంగీతకారుడు రూఫస్ వైన్రైట్ స్వీకరించారు. దలైలామా తరుఫున ఈ అవార్డ్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమవడం గౌరవంగా ఉందన్నారు. 'మెడిటేషన్- ది రిఫ్లెక్సన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలైలామా' (Meditations: The Reflections of His Holiness the Dalai Lama) అనే ఆల్బమ్ ద్వారా దలైలామా తన ఆలోచనలను పంచుకున్నారు. జీవితంలో ధ్యానం, శాంతి వంటి అంశాలు ఎంత ముఖ్యమో ఆయన పంచుకున్నారు. ఆయన చేసిన ఈ ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. -
'మ్యాడ్-3'లో యంగ్ బాయ్స్ ఎంట్రీ.. ఈసారి హరర్
నాన్ స్టాప్ పంచులతో 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇదే ఊపులో గతేడాదిలో వచ్చిన మ్యాడ్ స్క్వేర్(Mad Square) కూడా భారీ విజయం అందుకుంది. ఈ రెండు చిత్రాలలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మెప్పించారు అయితే, ఈ ఏడాదిలో మ్యాడ్ క్యూబ్ రానుంది. ఇందులో కొత్త వారు ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా మొదలైన ఈ ప్రాజెక్ట్ను కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.మ్యాడ్ క్యూబ్ చిత్రంలోకి కొత్తవారు ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్లలో ఎవరో ఒక్కరు మాత్రమే పార్ట్-3లో ఉంటారట. ఈసారి కొత్తవారితో ప్రేక్షకులను మెప్పించాలని చిత్ర యూనిట్ ఉన్నట్లు టాక్. ఈ క్రమంలోనే మ్యాడ్ క్యూబ్ ప్రాజెక్ట్లోకి లిటిల్ హార్ట్స్ ఫేమ్ జై కృష్ణ, కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది.మ్యాడ్ 3ని హారర్ కామెడీగా తెరకెక్కించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుకాకముందే ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మ్యాడ్ 3 హారర్ కామెడీగా రూపొందనున్నట్లు క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాయ్స్ హాస్టల్లోకి ఓ లేడీ దయ్యం వస్తే ఎలా ఉంటుంది..? ఆ దయ్యం కారణంగా ముగ్గురు హీరోలు పడే ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. -
నాలుగేళ్లు ఒత్తిడిలోనే ఉన్నాను: శ్రుతి హాసన్
నటి శ్రుతిహాసన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బహుభాషా నటిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. అంతే కాకుండా సినిమా విక్కీపీడియాగా పేర్కొనే నటుడు కమలహాసన్, సారికల వారసురాలు అనే చిరునామా కలిగిన నటి ఈ బ్యూటీ. ఇక ప్రేమ వ్యవహారంలో పలుమార్లు వార్తల్లోకెక్కిన ఈ భామ ఇటీవలే 40వ పుట్టిన రోజును జరుపుకున్నారు. శ్రుతిహసన్ నాయకిగా తమిళంలో నటించిన ట్రెయిన్ చిత్రం విడుదల కావలసి ఉంది. ప్రస్తుతం తెలుగులో ఆకాశంలో ఒక తార చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన, గాయని, సంగీతం, రచన అంటూ పలు రంగాల్లో కొనసాగుతున్నానని పేర్కొన్నారు. తాను చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన తల్లిదండ్రులతో పెరిగడమే ఇందుకు కారణం అన్నారు. 2018 నుంచి కొన్ని కారణాల వల్ల కొంత విరామం తీసుకున్నానని చెప్పారు. ఆ సమయంలో తానెవరు అన్నది పునః పరిశీలంచుకోవడానికి ఉపయోగించుకున్నానని చెప్పారు. తాను పలు ఏళ్లుగా చాలా ఒత్తిడితోనే బాధపడుతున్నట్లు చెప్పారు. ఆ ఒత్తిడి కారణంగా ఆయా పరిస్థితుల కనుగుణంగా పయనించలేకపోయానని చెప్పారు. తన విరామ కాలాన్ని లండన్లో గడిపానని, ఆ సమయంలో తన వంట తనే చేసుకున్నానని, తన బట్టలు తానే ఉతుక్కున్నానని, మెట్రో రైలులో పయనించానని, సంగీతం సాధన చేశానని చెప్పారు. ప్రస్తుతం ఒక కళాకారిణిగా కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు.అది ఆనందాన్ని కలిగిస్తోందని, ఇకపై చాలెంజ్తో కూడిన కథా పాత్రల్లో నటించడానికి ప్రాముఖ్యతనిస్తానని శ్రుతిహాసన్ అన్నారు. -
హైకూ ఆరంభం
ఏగన్ హీరోగా ఫెమీనా జార్జ్, తెలుగు మూవీ ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి అప్పల్ల హీరోయిన్లుగా ‘హైకూ’ అనే చిత్రం ఆరంభం అయింది. కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, అనంతరం షూటింగ్ కూడా మొదలుపెట్టారు. యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో డా. డి. అరుళనందు, మ్యాథ్యూ అరుళ నందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.‘జో’ వంటి సూపర్ హిట్ మూవీతో గుర్తింపు పొందిన హరిహరన్ రామ్ అడిషనల్ స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ‘‘సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నిస్తాం. కానీ మా సినిమా షూటింగ్ పూర్తికాక ముందే డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఇలా మా సినిమా విడుదలకు ముందే డిజిటల్ డీల్ క్లియర్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. -
మన జీవితాల్లోని మహిళలే మనకు బలం: రామ్చరణ్
జనవరి 31న (శనివారం) రామ్చరణ్–ఉపాసన కవలలకు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రామ్చరణ్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరచి, ఓ స్పెషల్ ఫొటోను షేర్ చేశారు. ‘‘మాకు బాబు, పాప జన్మించారన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండటాన్ని ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాం.మన జీవితాల్లోని మహిళలే మనకు అత్యంత బలం. ప్రతి క్షణం మాకు అండగా నిలుస్తున్న మా అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’’ అని రామ్చరణ్ షేర్ చేశారు. ఇక 2023 జూన్ 20న ఈ దంపతులకు తొలి సంతానంగా కుమార్తె క్లింకార జన్మించిన విషయం తెలిసిందే. చాలా సంతోషంగా ఉన్నాం: చిరంజీవి ఆదివారం మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘భగవంతుడు, హనుమాన్ కృప వల్ల ఒక పాప, ఒక బాబు జన్మించారు. ఉపాసన, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. మా అభిమానులు, మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరితో ఈ శుభవార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కొణిదెల, కామినేని... రెండు కుటుంబాల సభ్యులు సంతోషంగా ఉన్నాం. ఇంత సుఖ ప్రసవం జరిగినందుకు అ΄ోలో వైద్యులకు, వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పారు. -
దసరాకి కింగ్
హీరో నాగార్జున ఒక స్పెషల్ మూవీ చేస్తున్నారు. మరి... కెరీర్లో నూరవ చిత్రం అంటే ప్రత్యేకమే కదా. అందుకే దసరా పండగకి సందడి చేయాలని నిర్ణయించుకున్నట్లున్నారు. అభిమానులు కూడా తమ కింగ్ (నాగార్జునని అలానే పిలుస్తారు) సెంచురీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం రూ పొందుతోంది. తమిళ చిత్రం ‘నిదమ్ ఒరు వానమ్’తో దర్శకుడిగా పరిచయమైన ఆర్ఏ కార్తీక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూ పొందిస్తున్నారని సమాచారం.లాటరీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని భోగట్టా. అందుకే ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ని అనుకుంటున్నారట. ఇంకా ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్’ టైటిల్స్ని కూడా పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో టబు నటిస్తున్నారు. టబు ఎంట్రీని అధికారికంగా ప్రకటించారు. అలాగే అనుష్క కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. అయితే ఈ విషయంపై ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారనే వార్త తెరపైకి వచ్చింది. -
చలో జార్జియా
హీరో మహేశ్బాబు జార్జియా వెళ్లనున్నారట. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. మహేశ్బాబు–ప్రియాంకా చోప్రా పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.కాగా, ‘వారణాసి’ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జార్జియాలో మొదలు కానుందని సమాచారం. అక్కడ షూటింగ్ చేసేందుకు సంబంధించిన కార్యాచరణను ఆల్రెడీ ప్రారంభించారట రాజమౌళి. అలాగే ఓ కీలక షెడ్యూల్ను అంటార్టికాలోనూ ప్లాన్ చేశారని ఫిల్మ్నగర్ భోగట్టా. ఒకవేళ అంటార్టికా లొకేషన్స్లో చిత్రీకరణ జరిగితే, అక్కడి క్లిష్టమైన లొకేషన్స్లో చిత్రీకరణ జరుపుకునే తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ సినిమా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. -
సంక్రాంతి 2027.. సీనియర్ హీరోల పోటీ?
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ఘన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. మార్చిలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ, విడుదలను నేరుగా 2027 సంక్రాంతికి లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి సరసన ప్రియమణి భార్య పాత్రలో నటించనున్నారు. కూతురి పాత్రకు కీర్తి సురేష్ను పరిశీలిస్తున్నారు. కానీ మరో ఆప్షన్ కూడా పరిశీలనలో ఉంది. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉండటంతో షూటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జనవరిలో మన శంకర వరప్రసాద్ విడుదల కాగా, జూలైలో విశ్వంభర థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాల మధ్య కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారు. 2027 సంక్రాంతికి బరిలో దింపాలని చూస్తున్నారు. అయితే అదే సంక్రాంతికి వెంకటేష్, అనిల్ రావిపుడి కాంబినేషన్ సినిమా ఉంది. బాలయ్య చిత్రం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక నాగార్జున కూడా రంగంలోకి దిగితే 2027 సంక్రాంతి సీనియర్ల సంక్రాంతి అయిపోతుంది. ప్రస్తుతాకి ఇవన్నీ అధికారికంగా ప్రకటించలేదు కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం సీనియర్ల మద్య పోటీ ఉండే అవకాశం ఉంది. -
ఉంగరం పెట్టుకుంటే స్టార్ అయిపోతానన్నారు
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర కెరీర్ చాలా డిఫరెంట్. ఎందుకంటే 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత హీరోగా చేసిన మూవీస్ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. దీంతో 'అరవింద సమేత' చిత్రంతో విలన్గానూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే తనకు సరైన గుర్తింపు రాక ఇబ్బంది పడుతున్న టైంలో చాలామంది తనకు మూఢనమ్మకాల గురించి చాలా చెప్పి చూశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: గుండె లోతుల్లో బాధ.. ఎలా చెప్పాలో తెలీదు: నిహారిక)నేను కూడా సరైన ఛాన్సులు రాక ఇబ్బంది పడుతున్నప్పుడు ఇండస్ట్రీలోని వ్యక్తులు చాలా చెప్పారు. ఇన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నావ్. ఈ ఉంగరం వేసుకుంటే స్టార్ అయిపోతావ్ అని అన్నారు. రాగి రేకుపై ఏదో రాసిచ్చి, అది జేబులో పెట్టుకుని తిరిగితే.. నీతో మాట్లాడిన దర్శకనిర్మాతలు వెంటనే అవకాశాలు ఇచ్చేస్తారని కూడా అన్నారు. కానీ నేను అవేవి నమ్మలేదు. కేవలం మీ(అభిమానుల) అభిమానం వల్లే ఇలా ఉన్నాను అని నవీన్ చంద్ర చెప్పుకొచ్చాడు.ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హనీ'. మూఢ నమ్మకాలు, చేతబడులు, బలులు తదితర అంశాలతో తీసిన సినిమా ఇది. దివ్య పిళ్లై హీరోయిన్ కాగా కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఆదివారం హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే నవీన్ చంద్ర తన జీవితంలో జరిగిన తనతో చాలామంది ఇప్పటికీ చెప్పిన మూఢనమ్మకాల గురించి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఆ పిల్లి ఉంటే అందరూ దాసోహమే.. 'హనీ' ట్రైలర్ రిలీజ్) -
గుండె లోతుల్లో బాధ.. ఎలా చెప్పాలో తెలీదు: నిహారిక
యాంకర్గా, నటిగా, నిర్మాతగా.. అన్నిరకాలుగా తన టాలెంట్ నిరూపించుకుంది నిహారిక. ప్రస్తుతం ప్రొడక్షన్పైనే ఎక్కువ ఫోకస్ చేసిన నిహారిక తాజాగా జిమ్లో వర్కవుట్ చేస్తున్న వీడియో షేర్ చేసింది. అయితే చెమటలు చిందించే ఎక్సర్సైజ్లను చూపించడమే కాకుండా మనసులోని సంఘర్షణను బయటపెట్టింది.గుండె లోతుల్లో బాధనిహారిక మాట్లాడుతూ.. నా లోపల ఏదో తెలీని బరువు మోస్తున్నా.. అది ఒత్తిడా? బాధనా? అంటే నాకే తెలీదు. కానీ, మనసంతా బరువుగా ఉంది. దాన్ని చెప్పడానికి నాకు పదాలు కూడా దొరకడం లేదు. ఈ భారాన్ని తల్చుకుని కుంగిపోకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. కొన్నిసార్లు నేను జిమ్కు వెళ్తుంటాను, బరువులు ఎత్తుతాను. మనసు ఇప్పుడిప్పుడే..మరికొన్నిసార్లు వాకింగ్ చేస్తాను. ఇందులో ప్లానింగ్ చేసుకోవడానికంటూ ఏమీ లేదు. గుండెనిండా ఊపిరి పీల్చుకుంటూ నడుస్తానంతే! ఇంకొన్నిసార్లు డ్యాన్స్ చేస్తాను, యోగా చేస్తాను. ఇవన్నీ చేస్తుంటే మనసు తేలికపడుతోంది. బయటకు ఏమీ మారలేదు అనిపించొచ్చేమో, కానీ నాలోపల మాత్రం మార్పు మొదలైంది అని చెప్పుకొచ్చింది. వ్యాయామం ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చని ఆమె చెప్పకనే చెప్పింది. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) చదవండి: ఆడవారిపై ఇలాంటి ట్రోల్సా? చెండాలంగా ఉంది: బిగ్బాస్ బ్యూటీ -
కాయదు ఓరచూపు.. ఓ రేంజు గ్లామర్తో రష్మీ
ఓరచూపుతో మాయ చేసేస్తున్న కాయదు లోహర్మత్తెక్కించే పోజులతో బ్యూటీ మృణాల్ ఠాకుర్గ్లామరస్ స్టిల్స్ ఇచ్చి రచ్చ లేపుతున్న రష్మీజనవరి జ్ఞాపకాల్లో చాహల్ మాజీ భార్య ధనశ్రీచీరలో నవ్వుతూ మైమరిపించేస్తున్న అనికామరింత అందంగా అదిరిపోతున్న అషూరెడ్డి View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
ఆ పిల్లి ఉంటే అందరూ దాసోహమే.. 'హనీ' ట్రైలర్ రిలీజ్
నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హారర్ సినిమా 'హనీ'. కరుణ కుమార్ దర్శకుడు. ఓవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఫిబ్రవరి 6న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ని లాంచ్ చేశారు. ఇది భయపెట్టేలా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు వైరల్)నిజ జీవిత సంఘటనల ప్రేరణతో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ అంశాలతో 'హనీ' మూవీ తీశారు. ఈ మూవీలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి తదితర ఇతర కీలక పాత్రలు పోషించారు. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో దీన్ని తెరకెక్కించారు. ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ దేవత వాహనంగా పిల్లిని చూపించారు. ఇది ఎవరి దగ్గర ఉంటే అందరూ వాళ్లకు దాసోహం అవుతారనే పాయింట్ చెప్పుకొచ్చారు. ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది.(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత) -
విషాదం.. టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత
తెలుగు చిత్రసీమలో విషాదం. 350కి పైగా సినిమాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న రఘునాథ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. హైదరాబాద్లోని కుషాయిగూడలో ఉంటున్న ఈయనకు శనివారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. నెలరోజుల క్రితమే ఈయన కొడుకు కూడా గుండెపోటుతో చనిపోయారు. కుమారుడిని కోల్పోయిన బాధతోనే ఈయన కూడా కాలం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పలువురు నటీనటులు ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు వైరల్)రఘునాథరెడ్డి మృతదేహాన్ని సందర్శించిన నటి శివ పార్వతి.. ఈయనకు నివాళి అర్పించారు. ఇంత సీనియర్ నటుడు చనిపోతే.. టాలీవుడ్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. రఘునాథ రెడ్డి చేసిన మూవీస్ విషయానికొస్తే.. కలిసుందాం రా, ఒసేయ్ రాములమ్మ, ఇంద్ర, డాన్, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, మల్లీశ్వరి, సంక్రాంతి, శ్రీరామరాజ్యం తదితర చిత్రాలో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.శోభన్ బాబు హీరోగా చేసిన 'సర్పయాగం' సినిమాతో రఘునాథరెడ్డి.. నటుడిగా పరిచయమయ్యారు. చివరగా 2018లో సుమంత 'సుబ్రహ్మణ్యపురం'లో నటించారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్న కారణంగా.. నటనకు వీడ్కోలు చెప్పేశారు. గతేడాది పలు యూట్యూబ్ ఛానెల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు కొడుకుని కోల్పోయిన బాధతో ఈయన కూడా తనువు చాలించారు.(ఇదీ చదవండి: 'చరణ్' చేతిలో రెండేళ్ల బిడ్డ.. మెగా ఫ్యాన్స్ అత్యుత్సాహం) -
ప్రేమను కాపాడిన పోలీసోడి కథ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్లలో చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం సిరై ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా కథలనేవి సమాజం నుండి పుట్టినవే. మన చుట్టూ జరిగిన ఘటనలను కాల్పనిక సన్నివేశాలతో జనరంజకంగా రూపొందిస్తారు దర్శకులు. అందుకే అడపాదడపా కొన్ని సినిమాలకు వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా అని ముందే చెబుతారు. నిజానికి వాస్తవ ఘటనలతో సినిమా తీయడం కత్తి మీద సామే అని చెప్పవచ్చు. ఎందుకంటే తీసే సినిమా ఎవ్వరి మనోభావాలను దెబ్బ తీయకుండా, అలాగే వాస్తవంగా జరిగిన ఘటనను అంతే స్పష్టంగా చెబుతూ ప్రేక్షకులను కట్టిపడేయడమంటే కష్టమే. అదే కోవలో వచ్చిన తమిళ చిత్రం ‘సిరై’(Sirai). తమిళ రచయిత తమీజ్ అందించిన కథతో దర్శకుడు సురేశ్ రాజకుమారి తెరకెక్కించిన చిత్రమే ఈ ‘సిరై’. విక్రమ్ ప్రభు కథానాయకుడిగా ఈ సినిమాలో అలరించారు. సున్నిత మనస్కులు ఈ సినిమాని చూస్తే మాత్రం కంట నీరు పెట్టక మానరు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం. కానిస్టేబుల్ కదిరవన్ ఓ అండర్ ట్రైల్ ఖైదీని జైలు నుండి కోర్టుకు విచారణకై తీసుకెళ్లడమే ఈ సినిమా కథాంశం. అబ్దుల్ అనే ఖైదీ చుట్టూ సాగుతుందీ కథ. అబ్దుల్ ఓ హత్య కేసులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉంటాడు. కోర్టులో తన కేసు విచారణకు రావడంతో కదిరవన్తో కలిసి కోర్టుకు బయలుదేరతాడు అబ్దుల్. మార్గ మధ్యంలో అబ్దుల్ తన కథను కానిస్టేబుల్ కదిరవన్కు చెబుతాడు. అబ్దుల్ అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నాడని తెలుసుకున్న కానిస్టేబుల్ కదిరవన్ కోర్టు ప్రాంగణంలోనే సాయపడాలని నిర్ణయించుకుంటాడు. అయితే కోర్టులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు కానిస్టేబుల్ కదిరవన్కు అబ్దుల్ వినిపించిన కథేంటి? ఈ కథలో తనకు న్యాయం జరిగిందా? కోర్టులో జరిగిన ఘటనలు ఏంటి? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే జీ5 (Zee5) వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ‘సిరై’ చూడాల్సిందే. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడుస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కంట తడిపెట్టిస్తాయి. మరి... ప్రేమను కాపాడిన ఈ పోలీస్ కథను మీరూ చూసేయండి. – హరికృష్ణ ఇంటూరు -
దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు వైరల్
అల్లు కుటుంబంలో పెళ్లి సందడి. అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్.. వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నాడు. నయనిక అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరగ్గా.. మరికొన్ని రోజుల్లో వివాహ వేడుక గ్రాండ్గా జరగనుంది. దీంతో ఇప్పుడు అందరూ కలిసి బ్యాచిలరేట్ పార్టీ చేసుకున్నాడు. దీనికి దుబాయి వేదికగా నిలిచింది.(ఇదీ చదవండి: నిజంగా పెళ్లాన్ని అడిగినట్లే అడిగారు: శ్రీలీల)అల్లు శిరీష్, నయనికల బ్యాచిలరేట్ పార్టీ.. శనివారం రాత్రి దుబాయిలో జరిగింది. ఓ పడవలో వీళ్లంతా గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ అన్న బాబీ కూడా తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలని పోస్ట్ చేయగా.. బన్నీ భార్య స్నేహ కూడా పలు ఫొటోలని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'చరణ్' చేతిలో రెండేళ్ల బిడ్డ.. మెగా ఫ్యాన్స్ అత్యుత్సాహం)#AlluSirish Pre Wedding shooting Dubai ♥️ pic.twitter.com/HFrY0ux2Rs— Swaasthi (@swaasthi) January 31, 2026 -
కవలలు పుట్టాక రామ్చరణ్-ఉపాసన ఫస్ట్ పోస్ట్
కవలల రాకతో మెగా ఫ్యామిలీలో సంతోషాలు వెల్లివిరిశాయి. రామ్చరణ్- ఉపాసనలకు జనవరి 31న రాత్రి బాబు, పాప పుట్టాడని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా గుడ్న్యూస్ చెప్పాడు. తాజాగా ఈ శుభవార్తను చరణ్- ఉపాసన దంపతులు ఓ స్పెషల్ ఫోటో ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు.వాళ్లే గొప్ప బలంబాబు, పాప పుట్టారన్న విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడిని కలిగి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన జీవితంలో మహిళలే గొప్ప బలం. మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్కు భార్య గర్భంతో ఉన్నప్పుడు దిగిన ఓ ఫోటోను జత చేశారు. పెళ్లిఅందులో చరణ్ దంపతులు బ్లాక్ డ్రెస్ ధరించగా.. రెండు శునకాలను పట్టుకుని ఠీవీగా నిల్చున్నారు. కాగా రామ్చరణ్, ఉపాసన 2011 డిసెంబర్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 2012 జూన్లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023లో కూతురు క్లీంకార జన్మించింది. ఇప్పుడు క్లీంకారతో ఆడుకునేందుకు మరో బుజ్జి పాపాయి, బుడ్డోడు కుటుంబంలో చేరారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)చదవండి: తండ్రి బాటలో రామ్చరణ్.. ఎంత గొప్ప మనసు -
రూ.30 లక్షలు మోసపోయా.. డిప్రెషన్, చచ్చిపోవాలనుకున్నా!
బంధువును నమ్మి డబ్బులిచ్చి మోసపోయానంటున్నాడు బిగ్బాస్ కంటెస్టెంట్, మోడల్ ప్రిన్స్ యావర్. తన డబ్బు ఇవ్వమని అడిగితే.. పెద్ద పెద్దవార్ల పేరు చెప్పి బెదిరిస్తున్నాడంటూ ఓ వీడియో షేర్ చేశాడు. అందులో ప్రిన్స్ యావర్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ బలవంతం చేయడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. నా బంధువుల్లో ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడు. స్థలం విషయంలో రూ.30 లక్షలు ముంచేశాడు. అయితే నా ఫ్యామిలీతో మాట్లాడి రూ.23 లక్షలు తిరిగిస్తానని నన్ను ఒప్పించాడు.పైసా ఇవ్వడం లేదు15 రోజుల్లో ఇచ్చేస్తానన్నాడు. కానీ, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తిరిగివ్వలేదు. అన్ని చోట్లా నన్ను బ్లాక్ చేశాడు. అతడి స్నేహితుడికి ఫోన్ చేస్తే నువ్వేం చేయలేవంటూ రివర్స్లో నన్నే బెదిరిస్తున్నారు. పెద్దవాళ్ల పేర్లు చెప్పి భయపెడుతున్నారు. అందులో కేటీఆర్ సర్ పేరు కూడా ఉంది. ఈ వీడియో కేటీఆర్ సర్ దగ్గరికి చేరాలని కోరుకుంటున్నాను. ఆయన వెనకాల ఇంత జరుగుతుందని కేటీఆర్ సర్కు తెలియదనే అనుకుంటున్నాను. చచ్చిపోదామనుకున్నాఇకపోతే అతడు చేసిన మోసం వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. భయంకరమైన ఆలోచనలు వచ్చాయి. చచ్చిపోవాలనుకున్నాను. కానీ, నాకు నా అభిమానులున్నారు. వారికోసం ఆలోచించి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన విరమించుకున్నాను. నాలా ఇంకెవరూ మోసపోకూడదు అని చెప్పుకొచ్చాడు. ప్రిన్స్ యావర్.. తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతకుముందు సీరియల్స్ కూడా చేశాడు. పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు. View this post on Instagram A post shared by Yawar Ahmed (@princeyawar) చదవండి: మీరే నా బలం.. 30 ఏళ్లర్నీపై కిచ్చా సుదీప్ ఎమోషనల్ -
'చరణ్' చేతిలో రెండేళ్ల బిడ్డ.. మెగా ఫ్యాన్స్ అత్యుత్సాహం
రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార ఫొటోను పూర్తిగా ఇప్పటికీ వారు రివీల్ చేయలేదు. కానీ, ఏదైన వారు ప్రయాణం చేస్తున్న సమయంలో కొందరు కెమెరాలతో క్లిక్మనిపించి సోషల్మీడియాలో షేర్ చేసిన సందర్భాలు మాత్రమే ఉన్నాయి. అయితే, తాజాగా ఇప్పుడు కూడా రామ్ చరణ్తో క్లీంకార ఉన్న ఒక వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతుంది.నటుడు రామ్చరణ్ సతీమణి ఉపాసన అపోలో ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఉపాసన పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. దీంతో పెద్ద కూతురు క్లీంకారను తీసుకుని తాజాగా రామ్ చరణ్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ భారీ ఎత్తున చుట్టుముట్టడంతో అతి కష్టం మీద ఆయన లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి అయింది. చరణ్ చేతిలో రెండేళ్ల బిడ్డ ఉంది అనే కామన్సెన్స్ కూడా మెగా ఫ్యాన్స్ ప్రవర్తించారు. వారు చేసిన హంగామాకు ఆ చిన్నారి కూడా ఆందోళన చెందింది. దీంతో తొలిసారి చరణ్ కూడా సహనం కోల్పోవాల్సి వచ్చింది. సిబ్బంది రక్షణలో క్లీంకారను ఎంతో జాగ్రత్తగా తీసుకుని ఆసుపత్రిలోకి చరణ్ వెళ్లారు. ఈ క్రమంలో క్లీంకార వీడియోను కొందరు తమ మొబైల్స్తో చిత్రీకరించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాపీరైట్స్ చర్యలుక్లీంకారకు సంబంధించిన Klin Kaara విజువల్స్ ఎవరైనా పబ్లిష్ చేస్తే కాపీరైట్స్ చర్యలు తీసుకుంటామని రామ్ చరణ్ టీమ్ హెచ్చరించింది. ఈరోజు అపోలో హాస్పిటల్ దగ్గర ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల క్లీంకార విజువల్స్ పలు కెమెరాలలో దొరికాయి. దీంతో అవి సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. (క్లీంకార పూర్తి ఫోటోలను కాకుండా తన మొఖం కనిపించని వీడియో, ఫోటోను మాత్రమే ఇక్కడ షేర్ చేశామని గమనించగలరు)This is yet another reckless act by fans. They mobbed #RamCharan while he was carrying his child into the hospital, completely ignoring basic safety and privacy. pic.twitter.com/Y73DymwaDN— Gulte (@GulteOfficial) February 1, 2026 -
కవల పిల్లలు.. ముందుగా ఎవరు జన్మించారంటే: చిరంజీవి
రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. వారికి ఇప్పటికే క్లీంకార కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక మగ, ఆడ బిడ్డ జన్మించడంతో మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా చిరంజీవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చాలా సంతోషంగా కనిపించారు. ఇద్దరూ మెగా క్వీన్స్తో పాటు మెగా వారసుడు వచ్చాడని అభిమానులు కేరింతలకు చిరు మరింత సంతోషంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.'కవల పిల్లల రాకతో మాలో మరింత సంతోషం పెరిగింది. ఈ వార్త తెలుసుకున్న తర్వాత కొణిదెల ఫ్యామిలీతో పాటు కామినేని కుటుంబ సభ్యులందరం చాలా సంతోషంగా ఉన్నాం. రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చారు. ఉపాసన , బిడ్డలిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పటి నుంచో ఎక్కడెక్కడి నుంచో మా ఇంట శుభం కలగాలని కోరుకున్నారు. ఆ భగవంతుడు దయ వల్ల హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ ఒక మగ బిడ్డ జన్మించారు. ఈ వార్తను మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఈ సందర్భాన్ని అభిమానులు పండుగ లాగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల ఆనందానికి అవధులు లేవు. మా కుటుంబంపై ప్రేమను చూపించే అందరికీ కృతజ్ఞతలు' అంటూ చిరంజీవి పేర్కొన్నారు. అయితే, కవల పిల్లల్లో ముందుగా అబ్బాయి జన్మించాడని.. కొన్ని నిమిషాల తర్వాతే అమ్మాయి జన్మించదని కామినేని కుటుంబ సభ్యులు తెలిపారు. -
నిజంగా పెళ్లాన్ని అడిగినట్లే అడిగారు: శ్రీలీల
'పెళ్లి సందD' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల తక్కువకాలంలోనే టాప్ హీరోయిన్గా ఎదిగింది. స్టార్ సినిమాలతో అవకాశాలు అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది. అయితే కొంతకాలంగా తనకు హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పాటు హిందీలోనూ కార్తీక్ ఆర్యన్తో ఓ సినిమా చేస్తోంది. అలాగే ధనుష్ సినిమాలోనూ హీరోయిన్గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇకపోతే సినిమాలతో పాటు ఈవెంట్స్కు కూడా హాజరయ్యే ఈ బ్యూటీ తాజాగా ఓ కాలేజీ ఫెస్ట్కు వెళ్లింది. నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఫంక్షన్కు హాజరై సందడి చేసింది. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ.. మిమ్మల్ని చూసిన జోష్లో అరిచి అరిచి గొంతు పోయిందంది. అందుకు అక్కడున్న అబ్బాయిలు.. అయితే డ్యాన్స్ చేయమని అరిచారు. అది విన్న శ్రీలీల.. నిజంగా పెళ్లాన్ని అడిగినట్లు అడిగారు, డ్యాన్స్ చేద్దాం.. కమాన్ అంటూ పాజిటివ్గా స్పందించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Cine Grammm (@cine_grammm) చదవండి: మరోసారి అత్తయ్యను అయ్యా: సుస్మిత -
క్లీంకారకు ప్రమోషన్.. మెగా కోడలు ఆసక్తికర ట్వీట్
మెగా హీరో రామ్ చరణ్ దంపతులు మరోసారి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన సతీమణి ఉపాసన కొణిదెల పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఓ పాప, బాబు పుట్టారని చిరు రివీల్ చేశారు. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ సైతం ఆనందంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.తాజాగా హీరో రామ్ చరణ్ దంపతులకు మెగా కోడలు లావణ్య త్రిపాఠి అభినందనలు తెలిపారు. ట్విన్స్కు జన్మనిచ్చిన ఉపాసనకు కంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేశారు. హాయ్ చిట్టి కవలలు.. ఈ ప్రపంచంలో మీకు స్వాగతం.. ఇప్పటికే మిమల్ని అందరూ చాలా ప్రేమిస్తున్నారంటూ లావణ్య రాసుకొచ్చింది. క్లీంకార ఇప్పుడు అఫీషియల్గా అక్కగా ప్రమోషన్ పొందిందని లావణ్య త్రిపాఠి ట్లీట్ చేసింది. మీ చిన్న కజిన్ వాయువ్ మీతో కలిసి పెరిగేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ గతేడాది ఓ కుమారుడు జన్మించారు. తమ ముద్దుల కుమారుడికి వాయువ్ అని నామకరణం చేశారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. లావణ్య త్రిపాఠి మాత్రం ఎలాంటి కొత్త సినిమాలైతే ప్రకటించలేదు. Hi tiny twins 💫💙💖Welcome to this world, you’re already soo loved!Big hugs to Kaara, now officially promoted to big sister 🌸A huge congratulations to @upasanakonidela & @AlwaysRamCharan on this double blessing 🤍✨Love, cuddles, and lots of fun coming your way from…— Lavanya konidela tripathi (@Itslavanya) February 1, 2026 -
మరోసారి అత్తయ్యను అయ్యాను: సుస్మిత
మెగా ఫ్యామిలీలో ట్విన్స్ రాకతో సందడి నెలకొంది. సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు చెబుతున్నారు. జనవరి 31న ఉపాసనకు ఓ మగ, ఆడ శిశువు జన్మించారు. ఇదే విషయాన్ని అధికారికంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తల్లీ, ఇద్దరు బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేసింది. ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా ట్విన్స్ రాకతో సుస్మిత స్పందించారు.మరోసారి అత్తయ్యను అయ్యానురామ్ చరణ్ దంపతులకు సుస్మిత కొణిదెల తన సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేసింది.2026 సంవత్సరం ప్రారంభం నుంచే తమ కుటుంబానికి ఆనందాన్ని తెచ్చిందని పేర్కొంది. సోదరుడు చరణ్, ఉపాసనలు తనను మరోసారి అత్తయ్యను చేశారని సంతోషంగా చెప్పుకొచ్చింది. అయితే, ఈసారి తన ఆనందం రెట్టింపుగా ఉందని సుస్మిత తెలిపింది.మీ అన్నయ్య ఎదురుచూస్తున్నాడురామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో నటి లావణ్య త్రిపాఠి సంతోషం వ్యక్తం చేసింది. 'చిన్న కవలలకు స్వాగతం. మీరిద్దరూ ఇప్పటికే ఎంతో ప్రేమను పొందారు. క్లింకార ఇప్పడు అందరికంటే పెద్ద అక్కగా ప్రమోట్ అయిపోయింది. మీతో కలిసి ఆడుకునేందుకు మీ అన్నయ్య వాయువ్ ఎదురుచూస్తున్నాడు. రామ్ చరణ్, ఉపాసనలకు డబుల్ అభినందనలు' అంటూ లావణ్య ట్వీట్ చేసింది. లావణ్య, వరుణ్ దంపతులకు గతేడాదిలో వాయువ్ జన్మించిన విషయం తెలిసిందే. -
'నాకు నిజంగానే తెలియదండి'.. హీరోయిన్ లయ కామెంట్స్
నితిన్ మూవీ తమ్ముడుతో రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ లయ. ప్రస్తుతం హీరోయిన్ కాకపోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలతో దూసుకెళ్తోంది. తమ్ముడు మూవీ హిట్ కొట్టకపోయినా లయకు మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. అప్పట్లో సూపర్ హిట్ కాంబో అయిన శివాజీతో జతకట్టింది. వీరిద్దరు నటించిన తాజా చిత్రం సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. తాజాగా ఈ మూవీ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్కు హాజరైన లయ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు పాయ అంటే కూడా తెలియదని చెప్పింది. ఈ మూవీలో పాయా అంటూ సాగే సాంగ్ను ఉద్దేశించి లయ మాట్లాడింది. ఆ మాత్రం కూడా తెలియదా అని మీరు అనుకోవచ్చు కానీ.. నిజంగానే నాకు పాయా అంటే ఏంటో తెలియదండీ అని లయ అమాయకంగా చెప్పుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు లయకు నిజంగానే తెలియదా అంటూ నోరెళ్లబెడుతున్నారు. పాయా అంటే ఓ రకమైన నాన్ వెజ్ వంటకమని మనందరికీ తెలిసిందే. ఆమాత్రం కూడా తెలియదా అని మీరు అనుకోవచ్చు కానీ.. నిజంగానే నాకు పాయా అంటే తెలియదండీ - లయ#Sivaji #Laya #SampradayiniSuppiniSuddapoosani pic.twitter.com/LzxH38gThy— Filmy Focus (@FilmyFocus) January 31, 2026 -
'జన నాయగన్' సెన్సార్పై తొలిసారి స్పందించిన విజయ్
విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో తెలీదు. ఈ అంశంపై ఆయన అభిమానులు భగ్గుమంటున్నారు. నిర్మాతకు కోట్లలో నష్టం వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే దర్శక నిర్మాతలు స్పందించారు. అయితే, తాజాగా విజయ్ తొలిసారి జన నాయగన్ వాయిదాపై మాట్లాడారు.ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ పలు వ్యాఖ్యలు చేశారు. సినిమాను ఇలా అడ్డుకోవడం చాలా బాధ అనిపించిందని పేర్కొన్నారు. ఈ మూవీ నిర్మాతను తలుచుకుంటేనే తనకు బాధ కలుగుతోందని పేర్కొన్నారు. తాను రాజకీయ ప్రవేశం చేయడం వల్ల తనకు ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించానన్నారు. అందుకు తాను మెంటల్గా సిద్ధం అయినట్లు నటుడు విజయ్ పేర్కొన్నారు. ఈ సినిమా నిర్మాత వెంకట్ కె.నారాయణ కూడా పలుమార్లు విడుదల ఆలస్యంపై బాధపడ్డారనేది తెలిసిందే.సెన్సార్ చిక్కువల వల్ల జనవరి 9న విడుదల కావాల్సిన ‘జన నాయగన్’ వాయిదా పడింది. కనీసం విడుదల ఎప్పుడు అనేది కూడా క్లారిటీ లేదు. దర్శకుడుహెచ్ .వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రం విజయ్ కెరీర్లో చివరిది కావడం విశేషం. ఇందులో పూజా హెగ్డే కథానాయకిగా నటించగా మలయాళ బ్యూటీ మమిత బైజు కీలక పాత్ర పోషించారు. -
రష్మిక- విజయ్ పెళ్లి డేట్ ఫిక్స్.. వీడియో వైరల్..!
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పుష్ప మూవీతో నేషనల్ క్రష్గా మారిపోయింది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకున్న రష్మిక.. బాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తోంది ముద్దుగుమ్మ.అయితే రష్మిక సినీ కెరీర్ పక్కనపెడితే.. వ్యక్తిగతంగా ఎన్నో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతేడాది విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ అయిందని వార్తలొచ్చినా.. వీళ్లు మాత్రం అఫీషియల్గా ప్రకటించలేదు. అయితే ఈవెంట్స్లో మాత్రం చెప్పి చెప్పనట్లుగా మాట్లాడుతూ వచ్చారు. అలా అభిమానుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల వీరిద్దరి పెళ్లి ఉదయ్పూర్లో జరగనుందని వార్తలొచ్చాయి. దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అటు విజయ్ దేవరకొండ కానీ.. రష్మిక కానీ ఎక్కడా బయటికి చెప్పలేదు.కానీ తాజాగా వీరి పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరలవుతోంది. ఇద్దరు ఈవెంట్ ప్లానర్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఇది రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నామంటూ ఇద్దరు అమ్మాయిలు వీడియోలో మాట్లాడారు. రష్మిక- విజయ్ ఈ నెల 2న పెళ్లి చేసుకోబోతున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్స్ ఇదంతా ఫేక్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే రష్మిక కానీ.. విజయ్ కానీ క్లారిటీ ఇవ్వాల్సిందే. Rashmika Mandanna and Vijay Devrakonda are getting married in Udaipur on Feb 2 😲-Confirmed by the Event Planners.pic.twitter.com/HXGUS8RdOE— Christopher Kanagaraj (@Chrissuccess) January 31, 2026 -
తండ్రి బాటలో రామ్ చరణ్.. మాట నిలబెట్టుకున్న గ్లోబల్ స్టార్
మెగా ఫ్యామిలీ ఇంట సంబురం నెలకొంది. మెగా కోడలు ఉపాసనకు కవలలు జన్మించారు. అర్ధరాత్రి ఉపాసన ఓ బిడ్డ, పాపకు జన్మనిచ్చింది. దీంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా.. ఇప్పటికే రామ్ చరణ్- ఉపాసనకు ఓ కూతురు ఉన్న సంగతి తెలిసిందే. తమ ముద్దుల కూతురి క్లీంకార అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే.మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్....గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్లోని సుమారు 500 మంది సభ్యులు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చారు. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. హెల్త్ కార్డుల పంపిణీకి సంబంధించి చేసిన ప్రతిపాదనను తాజాగా ఆమోదించారు. సినిమా షూటింగ్లలో ఎంతో శ్రమించే డ్యాన్సర్లు ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అనారోగ్యం బారిన పడినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రామ్ చరణ్ ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు.ఈ పథకం ద్వారా ప్రతి డ్యాన్సర్ కుటుంబానికి సమగ్ర ఆరోగ్య బీమా అందనుంది. ఇందుకోసం ఆయన సుమారు రూ.50 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి బాటలోనే సామాజిక బాధ్యతను రామ్ చరణ్ కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తన భార్య ఉపాసనతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. సినీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంపై డ్యాన్సర్ సంఘాలు, పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం 500 కుటుంబాలకు వైద్యపరమైన భరోసా లభించనుంది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిన్న సినిమా చేసిన పెద్ద మ్యాజిక్... ‘పెళ్ళి సందడి’
చిన్న పాత్రలతో పేరు తెచ్చుకున్న ఓ నటుడు సినిమాలో హీరో. ఆయన కథానాయకుడిగా చేస్తున్న ప్రయత్నాల్లో అక్షరాలా అది రెండో సినిమానే! ఉత్తరాది నుంచి ఒక హీరోయిన్కు తెలుగులో అదే తొలి సినిమా. మరో హీరోయినేమో అప్పడప్పుడే పైకొస్తున్న వర్ధమాన నటి. ఈ కాంబినేషన్లో ఓ టాప్ మోస్ట్ డైరెక్టర్ సినిమా చేస్తే? ఆ డైరెక్టర్తో సినిమా చేసేందుకు అగ్రతారలు ఉవ్విళ్ళూరే సమయంలో... అలాంటి చిరు ప్రయోగానికి ముగ్గురు అగ్ర నిర్మాతలు సిద్ధపడితే..? అదే... శ్రీకాంత్, దీప్తీ భట్నాగర్, రవళి తారాగణంగా దర్శకుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఆనాటి ‘‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డ్’’ అయిన ‘పెళ్ళి సందడి’ చిత్రం. 1996 జనవరి 12న రిలీజైన ఆ ఆల్టైమ్ మ్యూజికల్ హిట్కు 30 వసంతాలు దాటినా... జనం మర్చిపోలేదు. ‘కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా?’ అన్న అందులోని విచిత్ర సంభాషణను ప్రజల భాష నేటికీ వదులుకోలేదు. ఒక చిన్న పంతం... ఓ పెద్ద ఇండస్ట్రీ హిట్ సినిమాకు దారి తీసిందంటే నమ్ముతారా? అవును... మూడు దశాబ్దాల క్రితం తెలుగు సినీ పరిశ్రమను వసూళ్ళ వర్షంతో తడిసి ముద్ద చేసిన ‘పెళ్ళిసందడి’ (1996) అక్షరాలా అలానే పుట్టింది.మాటల యుద్ధంలో పుట్టిన కుటుంబ కథదర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అంటే... అప్పట్లో టాప్ స్టార్లతో, భారీ చిత్రాలతో బ్రహ్మాండ విజయాల సృష్టికర్త. ఆయన పేరు చెప్పగానే సాధారణంగా అందరికీ అవే గుర్తొస్తాయి. ‘టాప్ హీరోలు లేకుండా మీరు సినిమాలు తీయలేరండీ’ అని నిర్మాత అల్లు అరవింద్ ఒకరోజు ఏదో చర్చల్లో... కాస్తంత ఉడికిస్తున్నట్టుగా రాఘవేంద్రరావుతో అన్నారు. అంతే... కెరీర్ ఆరంభంలోనే ‘జ్యోతి’ (1976) లాంటి చిన్న చిత్రాలతో సాహసం చేసి, హిట్లందుకున్న దర్శకేంద్రుడికి సహజంగానే కోపం వచ్చింది. ‘మీ నిర్మాతలందరూ అగ్రహీరోల డేట్ల కోసం వెంటపడుతున్నారు కాబట్టే, ఈ పరిస్థితి. నిర్మాతలు ముందుకొస్తే చిన్న హీరోతో, మంచి కథతో సినిమా తీసేందుకు నేను రెడీ’ అన్నది రాఘవేంద్రుడి జవాబు. ‘మంచి కథ చెబితే మేమూ రెడీ’ అన్నది అరవింద్ సవాలు. ‘రెండు రోజుల్లో రండి. కథ చెబుతా’ అని దర్శకేంద్రుడు ఛాలెంజ్ స్వీకరించారు.అప్పటికే రాఘవేంద్రరావు మనసులో ఓ ఆలోచన మెదులుతోంది. అంతకు ఏడాది క్రితం రిలీజైన హిందీ చిత్రం ‘హమ్ ఆప్కే హై కౌన్’(1994) దేశమంతటినీ ఊపేసింది. కుటుంబకథా నేపథ్యంలో అలాంటి మాంచి మ్యూజికల్ లవ్స్టోరీని తెలుగులో తీస్తే? అంతకు ముందే ‘అల్లరి ప్రియుడు’ (1993)ను పాపులర్ పాటలతో, సిల్వర్ జూబ్లీ హిట్ చేసిన ఘనత ఆయనది. ఈసారి సినిమా ఉండాల్సింది... అంతకు మించి! అదే శ్వాస, అదే ధ్యాస!! రచయిత సత్యానంద్ను పిలిచారు. శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ కాలపు అక్కినేని ‘పెళ్ళి కానుక’ (1960 – తమిళ ‘కల్యాణ పరిసు’కు రీమేక్) ఫక్కీలో అక్కాచెల్లెళ్ళ సెంటిమెంటల్ ప్రేమకథ ఎప్పుడూ మంచి పేయింగ్ ఎలిమెంట్ అని సత్యానంద్ ప్రగాఢ నమ్మకం. అదే స్ఫూర్తితో అంతకు ముందు రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే డి. రామానాయుడు నిర్మించిన శోభన్బాబు ‘దేవత’ (1982) లాంటి కొన్ని చిత్రాలు వచ్చాయి. ‘దేవత’కు సత్యానందే మాటల రచయిత. అయినా, ఇంకా ఏదో అసంతృప్తి. దాన్ని తీర్చేలా... ఈసారి మరింత పక్కాగా కుటుంబ నేపథ్యం, అక్కాచెల్లెళ్ళ సెంటిమెంట్, ప్రేమ – త్యాగం నిండిన మంచి మ్యూజికల్ ముక్కోణపు ప్రేమకథ సిద్ధమైపోయింది. కథ విని, అరవింద్ ఎగిరి గంతేశారు. ఆ కథే... ఆ తరువాత తెరకెక్కిన ‘పెళ్ళి సందడి’.అగ్రశ్రేణి పంపిణీదారులే... నిర్మాతలుగా!‘పెళ్ళిసందడి’ నిర్మాణం గమ్మత్తుగా జరిగింది. దర్శకుడు రాఘవేంద్రరావు ఒకటే షరతు పెట్టారు. ‘వీలైనంత తక్కువ ఖర్చులో సినిమా తీద్దాం. తీసిన సినిమాను వేరొకరి అమ్మేయకుండా, సొంతంగా రిలీజ్ చేయాలి. లాభమైనా, నష్టమైనా భరించాలి’ అన్నారు. అరవింద్ ఓకే అన్నారు. దాని ఫలితంగా... ‘పెళ్ళిసందడి’ ఒకరికి నలుగురు నిర్మాతల సమష్టి ప్రయత్నంగా రూపొందింది. దర్శకుడు రాఘవేంద్రరావును సైతం నిర్మాణ భాగస్వామిగా చేసుకొని, మూడు ప్రముఖ పంపిణీ సంస్థలు... ‘గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్’ (అల్లు అరవింద్), ‘వైజయంతీ ఎంటర్ప్రైజెస్’ (సి. అశ్వినీదత్), ‘లక్ష్మీ ఫిలిమ్స్’ (కె. జగదీశ్ ప్రసాద్) కలసి ‘శ్రీరాఘవేంద్ర మూవీ కార్పొరేషన్’ అనే కొత్త బ్యానర్పై నిర్మించారు. అసలు అల్లు అరవింద్, అశ్వినీదత్లు అప్పటికి పూర్తిగా క్రేజీ ప్రాజెక్టులే నిర్మిస్తున్నారు. జగదీశ్ప్రసాద్ యాజమాన్యంలో పంపిణీ సంస్థగా పేరున్న లక్ష్మీ ఫిలిమ్స్ అయితే అంతకు ముందు రాఘవేంద్రరావు – హీరో కృష్ణల కాంబినేషన్లో ‘వజ్రాయుధం’ (1985), దర్శకుడు కోదండరామిరెడ్డి – హీరో చిరంజీవితో ‘కిరాతకుడు’ (1986) లాంటి భారీ చిత్రాలే నిర్మించింది. అలాంటి ఆ ముగ్గురు బడా నిర్మాతలూ కలసి ‘పెళ్ళి సందడి’ లాంటి చిన్న ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడం విచిత్రమే!నిజానికి, అంతకు అయిదేళ్ళ ముందు దర్శకుడు దాసరి నారాయణరావు ఇలాంటి చిరు ప్రయత్నమే చేశారు. అగ్ర నిర్మాతలు కె. దేవీవరప్రసాద్, టి. త్రివిక్రమరావు, అశ్వినీదత్లు ముగ్గురి సమష్టి నిర్మాణంలో, శారద ప్రధాన పాత్రధారిణిగా ‘అమ్మ రాజీనామా’ (1991 డిసెంబర్ 27) అనే చిన్న బడ్జెట్ లేడీ ఓరియంటెడ్ కుటుంబ కథాచిత్రాన్ని రూపొందించి, వార్తల్లో నిలిచారు. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి... తన విలువను గుర్తించని ఆ కుటుంబసభ్యులతో వేసారి, తన బాధ్యతలు మానేస్తే ఏమవుతుందన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న ఆ చిన్న సినిమా అప్పట్లో మధ్యతరగతి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మళ్ళీ ఆ తరహాలో పెద్ద నిర్మాతలు చేసిన చిన్న బడ్జెట్ ప్రయత్నం... ఈ ‘పెళ్ళి సందడి’.లక్షలు ఖర్చు పెడితే... కోట్లు వచ్చాయ్!కేవలం కోటి రూపాయల పరిమిత బడ్జెట్లో తీయాలని టార్గెట్. రాఘవేంద్రరావు పారితోషికంగా రూ. 15 లక్షలు కూడా అందులోనే లెక్క. అయితే, అన్ని విధాలా సంతృప్తికరంగా సినిమాను పూర్తి చేసేసరికి అనుకున్నదాని కన్నా రూ. 5 లక్షలు ఎక్కువైంది. ఆ పెరిగిన కొద్దిపాటి వ్యయాన్ని తన పారితోషికపు మొత్తం నుంచి రాఘవేంద్రరావే భరించారు. మరో గమ్మత్తు జరిగింది. సెన్సార్ నిబంధనల ప్రకారం ఫీచర్ ఫిల్మ్ అంటే 11 వేల అడుగుల పైనే నిడివి ఉండాలి. ‘పెళ్ళి సందడి’ చిత్రీకరణ అంతా పూర్తయ్యాక సెన్సార్కు ముందు చూసుకుంటే, నిబంధనల కన్నా తక్కువ నిడివి ఉంది. దాంతో, రాఘవేంద్రరావు బృందం తెలివిగా అప్పటికప్పుడు వినోదాత్మకమైన కోడిపుంజు ఎపిసోడ్ సృష్టించి, నటులు ఏవీఎస్, శ్రీలక్ష్మి, బ్రహ్మానందం తదితరులపై చిత్రీకరించి, ఇంటర్వెల్ తర్వాత జత చేశారు.ముందుగా అనుకున్నట్టే... సినిమాను అమ్ముకోకుండా, సొంతంగానే రిలీజ్ చేశారు. ఆంధ్రా, నైజామ్ లాంటి మిగతా ప్రధాన ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకుంటూ, సీడెడ్ ఏరియాలో మాత్రం నిర్మాత – పంపిణీదారు వి. దొరస్వామిరాజు సంస్థ ‘వి.ఎం.సి’ ద్వారా విడుదల చేశారు. అలా నలుగురు నిర్మాతలుగా కలసి, సరదాగా చేసిన ఈ ప్రయోగాత్మక ప్రయత్నం గురించి మొదట్లో ఎవరికీ ఏమంత అంచనాలు లేవు. సినిమా రిలీజ్ కన్నా ముందే ఆడియో సూపర్హిట్తో సంచలనం మొదలైంది. చివరకు ఆ ఏటి సంక్రాంతి చిత్రాలన్నిటిలోకీ మేటిగా... ‘పెళ్ళి సందడి’ నిలిచింది. కోటి రూపాయల్లో తీసిన చిన్న సినిమా కనివిని ఎరుగని రీతిలో రూ. 14 – 15 కోట్ల షేర్ వసూలు చేసింది. కమిషన్లు పోగా, దాదాపు రూ. 10 కోట్ల లాభం వచ్చింది. వెరసి, కలెక్షన్లలో అప్పటికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్టైమ్ రికార్డ్ సృష్టించింది.వసూళ్ళలో అసలు సిసలు ‘ఇండస్ట్రీ రికార్డ్’ చిత్రాలు ఇవీ..!‘పెళ్ళి సందడి’ లాంటి ఒక చిన్న సినిమా అలా వసూళ్ళలో ‘ఇండస్ట్రీ రికార్డ్’ నెలకొల్పడం అదే ప్రప్రథమం. అంతకు మునుపటి ఇండస్ట్రీ రికార్డ్ సినిమాలన్నీ దాదాపు పెద్ద హీరోలు, పేరున్న హీరోయిన్లతో రూపొందినవే! బాక్సాఫీస్ చరిత్ర పూర్వాపరాలు గమనిస్తే... ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, 1984లో తెలుగునాట సినిమా టికెట్లపై వినోదపు పన్నులో మార్పులు తెచ్చి, అమ్ముడైన టికెట్లతో సంబంధం లేకుండా థియేటర్లోని సీటింగ్ కెపాసిటీ మొత్తానికీ పన్ను విధించే ‘శ్లాబ్ సిస్టమ్’ను ప్రవేశపెట్టారు. ఫలితంగా 1984 నాటి నాన్ ఏసీ థియేటర్లలో బాల్కనీ టికెట్ రేటు రూ. 2.60 నుంచి అమాంతం రూ. 4.50కి ఎగబాకింది. అలా పెరిగిన టికెట్ రేట్ల పుణ్యమా అని ఆ వెంటనే కృష్ణంరాజు ‘బొబ్బిలి బ్రహ్మన్న’ (1984 మే 25 రిలీజ్) కళ్ళు తిరిగే కలెక్షన్లు రాబట్టింది. వసూళ్ళలో ఆనాటి ‘ఇండస్ట్రీ రికార్డ్ సినిమా‘ అయింది. ఆ వెనువెంటనే, ఎన్టీఆర్ ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ (1984 నవంబర్ 29) కనివిని ఎరుగని ప్రేక్షకాదరణతో దిమ్మతిరిగేలా కలెక్షన్లు కొల్లగొట్టింది. అలా ఆ చిత్రం కొత్త ‘ఇండస్ట్రీ రికార్డ్’ అయింది. ఆ తర్వాత విజయశాంతి ‘ప్రతిఘటన’ (1985) దాన్ని దాటి, ఆ స్థానాన్ని అందుకుంది. అటు తర్వాత వెంకటేశ్ ‘చంటి’ (1992), దాన్ని దాటి ‘పెదరాయుడు’ (1995), దాన్ని కూడా అధిగమించి అటుపైన ‘పెళ్ళి సందడి’ (1996) తిరుగులేని బాక్సాఫీస్ ఇండస్ట్రీ రికార్డయ్యాయి.‘పెళ్ళి సందడి’ ఇండస్ట్రీ రికార్డ్ను విజయశాంతి ‘ఒసేయ్ రాములమ్మా’ (1997), ఆ తర్వాత బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ (1999), ఆ తర్వాత ‘నరసింహ నాయుడు’ (2001)... వరుసగా ఒకదానినొకటి వసూళ్ళలో అధిగమిస్తూ పోయాయి. ఇక, కొత్త మిలీనియమ్లోకి వచ్చాక వరుసగా చిరంజీవి ‘ఇంద్ర’ (2002), మహేశ్ బాబు ‘పోకిరి’ (2006), అటుపైన రామ్చరణ్ ‘మగధీర’ (2009 జూలై 31), ఆ తర్వాత త్రివిక్రమ్ – పవన్ కల్యాణ్ల ‘అత్తారింటికి దారేది’ (2013 సెప్టెంబర్ 27) వసూళ్ళలో మునుపటి చిత్రాన్ని దాటి, కలెక్షన్లలో ఇండస్ట్రీ రికార్డులయ్యాయి. ఆ తర్వాత రాజమౌళి ‘బాహుబలి–1’ (2015 జూలై 10), అటుపైన ‘బాహుబలి–2’ (2017) చిత్రాలు ఆల్టైమ్ ఇండస్ట్రీ రికార్డులయ్యాయి. విచిత్రంగా ఆ తర్వాత దాన్ని అధిగమించిన సినిమా ఏదీ రాలేదు. అలా ఇప్పటికి దాదాపు తొమ్మిదేళ్ళుగా తెలుగు సినిమాకు ఇండస్ట్రీ రికార్డ్ అక్కడే స్తంభించి పోయి ఉండడం గమనార్హం. అచ్చమైన తెలుగింటి అక్కాచెల్లెళ్ళ పెళ్ళికళ‘పెళ్ళి సందడి’ పూర్తి సంగీతాత్మక, వినోదభరిత, సకుటుంబ చిత్రం. బొడ్డు పక్కన అందమైన పుట్టుమచ్చ, ఆ పక్కనే దోపుకున్న వెండి తాళాల గుత్తితో ఉన్న ఓ స్వప్నసుందరిని హీరో (శ్రీకాంత్) ప్రేమిస్తుంటాడు. ఊరు, పేరు, ముక్కూ ముఖం తెలియని ఆ అమ్మాయిని కలల్లో ప్రేమిస్తున్నా... అనుకోకుండా మరో అమ్మాయి (రవళి)తో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది. తీరా తన స్వప్నసుందరి (దీప్తీ భట్నాగర్) నిజజీవితంలో ఎదురయ్యేసరికి, ఆమెతో ప్రేమముడి వేసుకొని, ఖరారైన పెళ్ళిని కాదనే దాకా వస్తాడు. అక్కను చేసుకోవాల్సిన వాడే తనను గాఢంగా ప్రేమిస్తున్న ప్రియుడని తెలిశాక ఆ స్వప్న సుందరి త్యాగానికి సిద్ధపడుతుంది. అక్క కోసం చెల్లెలు... చెల్లెలి కోసం అక్క... త్యాగాల పరిణామం మిగతా కథ. అక్క కల్యాణి పాత్రలో రవళి, చెల్లెలు స్వప్న పాత్రలో దీప్తీ భట్నాగర్ నటించిన ఈ సినిమా నిండా కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులే. గోదావరి జిల్లా తాలూకు గౌరవాలు, పెళ్ళి వారింటి సరదాలు, సరసాలు, మర్యాదలు, కుటుంబ ఆప్యాయతలతో ప్రతి సీనూ అచ్చమైన వివాహ భోజనమే! సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్ కెమెరా పనితనంలో పశ్చిమ గోదావరి జిల్లా అల్లంపురం, కోసూరి నగర్, తొర్రేడు, తణుకు తదితర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఆ సీన్లు, వాటికి ప్రాణం పోసిన నటీనటుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!సంక్రాంతి రేసులో... ఊహించని సూపర్విన్నర్!ఆ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిత్రాల్లో బాలకృష్ణ ‘వంశానికొక్కడు’ (1996 జనవరి 5) మంచి హిట్టయితే, అదే రోజున మలయాళ హిట్కు తెలుగు రీమేక్గా వచ్చిన నాగార్జున ‘వజ్రం’ బొత్తిగా సానబెట్టని రాయిగా మిగిలిపోయింది. అప్పట్లో వరుస విజయాలతో దూకుడు మీదున్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జోరుకు ‘వజ్రం’ ఠక్కున బ్రేకులు వేసింది. ఇక, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే హీరో కృష్ణ ‘సంప్రదాయం’ (జనవరి 11), సురేశ్ కృష్ణ నిర్దేశకత్వంలో సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకటేశ్ ‘ధర్మచక్రం’ (జనవరి 13) కూడా ఆ ఏటి సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో కోడిపుంజులే. ఇక, అంతకు ముందు ఏడాదే ‘పెదరాయుడు’తో కలెక్షన్లలో ఇండస్ట్రీ రికార్డ్ హిట్ సాధించిన మోహన్బాబు కాస్త ఆలస్యంగా ఆ సంక్రాంతి రేసులోకి వచ్చారు. పండగ వెళుతూనే 1996 జనవరి 20న ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో, రమ్యకృష్ణ జోడీగా ‘సోగ్గాడి పెళ్ళాం’తో పలకరించారు. కానీ, ఆ పోటాపోటీ సంక్రాంతి సినిమాల బరిలో అనూహ్యంగా అన్నింటినీ ఓడించి పందెం గెలిచింది మాత్రం ‘పెళ్ళి సందడే’!మనసును తాకిన సంగీతం... మెప్పించిన సాహిత్యం ‘పెళ్ళి సందడి’లో ఏ పాటకు ఆ పాటే గొప్ప. అన్నీ కథకు నప్పినవే... జనం మెచ్చినవే! ప్రేమను నిర్వచిస్తూ, పతాక సన్నివేశ గీతంగా వచ్చే ‘హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం... ప్రేమ ప్రేమ ప్రేమ...’ అన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన సినిమా క్లైమాక్స్కు ఆయువుపట్టయింది. ఇక, సిరివెన్నెలే రాసిన మరో గీతం ‘సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి...’ ఆల్టైమ్ హిట్. అలాగే, అక్కాచెల్లెళ్ళు ప్రియుణ్ణి గురించి చెప్పుకొంటున్నట్టు సామవేదం షణ్ముఖశర్మ రచించగా, చిత్ర పాడిన ‘నవ మన్మథుడా అతి సుందరుడా... నిను వలచిన ఆ ఘనుడు...’ పాట ఆడపిల్లల నోట మారుమోగింది.ఇక, ‘నీ ఊహల్లోని స్వప్న సుందరి ఎలా ఉంటుం’దంటూ హీరోను అతని బావలు ప్రశ్నించే సందర్భంలో ముందుగా పాట అనుకోలేదు. హీరో నోట నాలుగైదు డైలాగులతో సరిపెడదామని భావించారు. కానీ, చివరి క్షణంలో మనసు మార్చుకొని, జొన్నవిత్తులతో పాట రాయించారు. అదే... పాపులర్ సినిమా హీరోయిన్ల పేర్లతో జనరంజకమైన హాస్యరసస్ఫోరక గీతం – ‘రమ్యకృష్ణ లాగ ఉంటదా... రంభ లాగ రంజుగుంటందా... అరె చెప్పర కన్నా...’ ఇవి కాక ‘మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగె...’, ‘చెమ్మచెక్క చెమ్మచెక్క చేరడేసి మొగ్గ...’, అలాగే స్వర – పద సంయోజనంగా సాగే ‘కిల కిల కిల కిల కిల... పడుచు కోకిల – పలికె ప్రియగీతిక పెళ్ళికిలా...’ వేటూరి మాత్రమే చేయగల పదాల గారడీలు.వర్ధమాన చంద్రబోస్కు విలువైన ఛాన్స్ఇవాళ సుప్రసిద్ధ సినీ గీత రచయిత అయిన చంద్రబోస్కు ‘పెళ్ళి సందడి’ ఓ కెరీర్ టర్నింగ్ పాయింట్. అప్పటికి ఆయన అప్పుడప్పుడే సినిమాల్లో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. శ్రీకాంతే హీరోగా నటించిన ‘తాజ్మహల్’లో, అలాగే వెంకటేశ్ ‘ధర్మచక్రం’లో... ఇలా ఒకట్రెండు సినిమాలకే పాటలు రాశారు. ఆయనను పిలిచి, రాఘవేంద్రరావు అవకాశమిచ్చారు. అలా అప్పట్లో తిరుపతిలో మ్యూజికల్ సిట్టింగ్స్కు పిలిస్తే వెళ్ళిన చంద్రబోస్ ‘పెళ్ళి సందడి’కి ‘సరిగమ పదనిస రాగం – త్వరపడుతున్నది మాఘం...’, అలాగే ‘అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకీ – చెప్పరాని ఆశలన్ని హుష్కాకి...’ పాటలు రాశారు. అప్పుడు అలా కీరవాణి, రాఘవేంద్రరావులతో పరిచయం జరిగి, అప్పటికప్పుడు కీరవాణి మాటతో అటునుంచి అటే వారితో కలసి మద్రాసు వెళ్ళిన చంద్రబోస్ ఇక కెరీర్లో వెనక్కి తిరిగిచూసుకోలేదు. ‘పెళ్ళి సందడి’ మ్యూజికల్ హిట్తో రాఘవేంద్రరావు, కీరవాణి బృందంలో ఆయనా ఒకరయ్యారు. సినీ రంగంలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. నాడు కేవలం రూ. 8 వేల పారితోషికం అందుకున్న ఆ వరంగల్ కుర్రాడు ఇవాళ అక్షర లక్షలు గడిస్తూ, ‘ఆస్కార్’ విజేతగా ఎదగడం అసాధారణ విజయం. మ్యూజికల్ మాయాజాలంఅప్పట్లో ఊరూవాడా ఎక్కడ విన్నా... ‘పెళ్ళి సందడి’ పాటలే! మ్యూజికల్ లవ్స్టోరీగా తీర్చిదిద్దిన ఈ ఫిల్మ్లో మొత్తం 9 పాటలు. ఫస్టాఫ్లో 6 పాటలు, సెకండాఫ్లో 3 పాటలు. సంగీత దర్శకుడు కీరవాణి అప్పటికే మంచి రేజ్లో ఉన్నారు. కీరవాణి – రాఘవేంద్రరావుల కాంబినేషన్ క్రేజు మీదుంది. అంతకు కొన్నేళ్ళ ముందే వారి కలయికలోనే వచ్చిన ‘అల్లరి ప్రియుడు’ (1993 మార్చి 5) సూపర్హిట్. ఆ పాటలు ఊరూరా మారుమోగాయి. ఆ నేపథ్యంలో వారిద్దరి కాంబినేషన్లోనే సిద్ధమైంది ‘పెళ్ళి సందడి’. ఆ సినిమా రిలీజుకు ముందే పాటలన్నీ సూపర్ డూపర్ హిట్.‘లహరి’ సంస్థ రిలీజ్ చేసిన ఆడియోకు పిచ్చ క్రేజొచ్చింది. ఎంతగా అంటే... అప్పట్లోనే ‘పెళ్ళి సందడి’ ఏకంగా 3 లక్షల క్యాసెట్లు అమ్ముడుపోయాయి. అలా ఆ చిత్ర ఆడియో ‘ప్లాటినమ్ డిస్క్’ సాధించింది. దాంతో దర్శక, నిర్మాతలు మద్రాస్లోని ‘చోళా హోటల్’లో దాసరి, కె. విశ్వనాథ్, దేవీవరప్రసాద్, ఏడిద నాగేశ్వరరావు లాంటి సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖ దర్శక, నిర్మాతల సమక్షంలో ప్రత్యేకంగా ప్లాటినమ్ డిస్క్ వేడుకలు నిర్వహించారు. క్యాసెట్లకున్న క్రేజ్ను చూశాక, ఇక తెరపై పాటల చిత్రీకరణ కూడా తోడయ్యాక సినిమా పెద్ద మ్యూజికల్ హిట్టవడం ఖాయమని దర్శక, నిర్మాతలు ముందుగానే అభిప్రాయపడ్డారు. అక్షరాలా అదే నిజమైంది. పాటలు బంపర్ హిట్. సినిమా సూపర్హిట్. బాక్సాఫీస్ కలెక్షన్లలో సినిమా ఇండస్ట్రీ హిట్.నృత్య దర్శకుడిగా... రాఘవేంద్రరావుకు ‘నంది’!సౌందర్య పిపాసిగా పూలు, పండ్లు, గ్లామర్ దుస్తులతో తన ప్రతి సినిమాలో పాటల చిత్రీకరణలో ప్రత్యేకత చాటుకోవడం దర్శకుడు కె. రాఘవేంద్రరావు మార్కు శైలి. అలాంటిది... ఈ ‘పెళ్ళి సందడి’లో పాటలన్నిటికీ ఆయనే స్వయంగా నృత్యదర్శకత్వం కూడా వహించడం విశేషం. వేరే డ్యాన్స్ మాస్టర్ ఎవరూ లేకుండా అలా ఆయనే పాటలు తీసి, ఏకంగా ప్రేక్షకులందరితో డ్యాన్స్ చేయించారు. అంతకన్నా విశేషం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమిచ్చే ప్రతిష్ఠాత్మక నంది అవార్డుల్లో ఆ ఏడాది బెస్ట్ కొరియోగ్రాఫర్గా గుర్తింపు ఆయనకే దక్కింది. ‘పెళ్ళి సందడి’ పాటలు వినడానికే కాదు... చూడడానికీ అంతే బాగుంటాయనడానికి అదో నిదర్శనం. ‘పెళ్ళి సందడి’ బాణీల్లో తన స్వర విశ్వరూపం చూపిన కీరవాణే ఆ ఏడాది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ‘నంది’ పురస్కారం నిర్ద్వంద్వంగా వరించింది.ఈ సినిమా కోసం ఊటీ, బెంగుళూరు, శివసముద్రం తదితర అందమైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించారు. ఓ పాట కోసం రాఘవేంద్రరావు దాదాపు 40 రోజుల పాటు రోజూ షూటింగ్ జరిగే ప్రతి అందమైన లొకేషన్లో షాట్లు తీసుకుంటూ, చివరకు దాన్ని అందంగా కూర్చి, అబ్బురపరిచారు. రాఘవేంద్రరావు కెరీర్పై ఈ సినిమా, ఈ పాటలు ఎంత ప్రభావం చూపాయంటే... తరువాత 2010 దశకంలో రాఘవేంద్రరావు తొలిసారిగా పెదవి విప్పి, కెమెరా ముందు తన సినీజీవితానుభవాలను సహచరులతో కలసి పంచుకుంటున్నప్పుడు ఆ టీవీ షోకు కూడా ‘పెళ్ళి సందడి’లోని హిట్ పాట ప్రేరణతో ‘సౌందర్యలహరి’ అనే పేరే పెట్టారు. ఆ హిట్ పాట ట్యూన్నే తమ కార్యక్రమానికి థీమ్ మ్యూజిక్గా ఎంచుకున్నారు.ఊరూరా... విజయయాత్ర‘పెళ్ళి సందడి’కి ముందు ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల రోజుల నుంచే సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో కొత్త సినిమాల యూనిట్కు అభినందన సభలు, పాత్రికేయులతో ఇష్టాగోష్ఠి సమావేశాలు జరపడం ఆనవాయితీగా ఉండేది. పత్రికలన్నీ ప్రధానంగా విజయవాడలో కేంద్రీకృతమై, పంపిణీదారులు ప్రధాన పాత్ర పోషించే ఆ రోజుల్లో అదొక మంచి పబ్లిసిటీ మార్గంగా కూడా ఉపకరించేది. అలాగే, 1950లు – 1970ల మధ్యలో అక్కినేని ‘రోజులు మారాయి’ లాంటి సినిమాల మొదలు పలు సినీ విజయయాత్రలు జరిగేవి. క్రమంగా అవి తగ్గుముఖం పట్టాయి. పాతికేళ్ళ తర్వాత మళ్ళీ ‘పెళ్ళి సందడి’ ఆ ట్రెండ్ను పునరుద్ధరించింది. సక్సెస్ టూర్ల పేరిట చిత్ర ప్రధాన తారాగణం, దర్శక – నిర్మాతలు ప్రధాన కేంద్రాల్లో థియేటర్లను సందర్శిస్తూ, నేరుగా ప్రేక్షకులను కలుసుకొనే సంప్రదాయం నెలకొంది. అలా 1996 ఏప్రిల్లో ‘పెళ్ళి సందడి’ యూనిట్ గూడూరు, నెల్లూరు సహా అనేక కేంద్రాల్లో పర్యటించి, సక్సెస్ టూర్లను మళ్ళీ పాపులర్ చేసింది. అప్పటి నుంచి మూడు దశాబ్దాల తర్వాత తాజా 2026 సంక్రాంతికి సైతం పలు చిత్రాల యూనిట్లు తెలుగు నేలపైనే కాక, అమెరికా గడ్డ మీదా విజయయాత్రలు చేసి, ప్రేక్షకులతో మమేకమయ్యే మార్కెటింగ్ వైఖరిని అవలంబించడం విశేషం. ఆ రకంగా 1990ల నుంచి ఆ ట్రెండ్ను మళ్ళీ సెట్ చేసింది ‘పెళ్ళి సందడే’!తొలిసారిగా అమెరికాలోనూ సినీ ప్రదర్శనలు!ఇవాళంటే, మన సినిమాలు ఓవర్సీస్లో ప్రదర్శితం కావడం, ఇండియాలో రిలీజయ్యే టైమ్కే అక్కడా రిలీజ్ కావడం లాంటివి సర్వసాధారణమైపోయాయి. కానీ, ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది కాదు. 1996 నాటికి ఓవర్సీస్ రిలీజ్ అనే మాట తెలుగు సినిమాకు కొత్త. అలాంటి సమయంలో... అమెరికాలో తొలిసారిగా ఎగ్జిబిషన్ షోలు ప్రదర్శితమైంది కూడా ‘పెళ్ళి సందడే’! అప్పట్లో గుంటూరుకు చెందిన ‘పద్మావతీ’ సుబ్బారావు అమెరికాలో ఈ ‘పెళ్ళి సందడి’ ప్రదర్శనలు జరిపారు.సినిమాను అక్కడ ప్రదర్శించడానికని నిర్మాత అల్లు అరవింద్ను అభ్యర్థించి, సినిమా ప్రింట్లు తీసుకున్నారు. ఆ ప్రింట్లు తీసుకువెళ్ళి, అమెరికాలో శుభ్రంగా ప్రత్యేక రుసుము వసూలు చేసి మరీ, ‘పెళ్ళి సందడి’ ఎగ్జిబిషన్ షోలు వేయడం విశేషం. అలా ‘పెళ్ళి సందడి’ బాగానే వసూళ్ళు సాధించింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో, ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే నాగార్జున హీరోగా వచ్చిన ‘అన్నమయ్య’ (1997) తొలిసారిగా కొంత పెద్దస్థాయిలో కమర్షియల్గా థియేటర్లలో ప్రదర్శితమైంది. అదిగో... అలా తెలుగు సినిమా ఓవర్సీస్ రిలీజులకూ ఒక రకంగా రాఘవేంద్రరావు సినిమాలే శ్రీకారం చుట్టాయన్న మాట!సరికొత్త ‘ఇండస్ట్రీ రికార్డ్’ల సందడి...అప్పట్లో ఊరూరా... థియేటర్లలో ‘పెళ్ళి సందడే’! కోటి రూపాయల బడ్జెట్లో తీసిన సినిమా అందుకు అనేక రెట్లు సంపాదించడమే గొప్ప అనుకుంటే, కేవలం కలెక్షన్లలోనే కాదు రన్లోనూ ఆ సినిమా ఓ ఊపు ఊపేసింది. ఫస్ట్ బ్యాచ్లో 40 ప్రింట్లతో రిలీజ్ చేస్తే... ఏకంగా 34 కేంద్రాల్లో వంద రోజులాడింది. లేట్గా రిలీజైన మరో 10 కేంద్రాల్లోనూ శతదినోత్సవం జరుపుకొంది. ఇంకా విశేషమేమంటే, అంతకు ముందు అప్పటి పెద్ద హీరోల్లో ఒకరైన మోహన్బాబు ‘పెదరాయుడు’ చిత్రం 7 సెంటర్లలో సిల్వర్ జూబ్లీతో ఇండస్ట్రీ రికార్డ్. కానీ, ఏ పెద్ద హీరో లేని సోకాల్డ్ స్మాల్ ఫిల్మ్ ‘పెళ్ళి సందడి’... అంతకు మునుపెన్నడూ ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని రీతిలో 27 కేంద్రాల్లో నేరుగా సిల్వర్ జూబ్లీ (175 రోజులు) జరుపుకొంది. కొత్త ‘ఇండస్ట్రీ రికార్డ్’ సృష్టించింది. అంతేకాదు... 28వ కేంద్రంగా షిఫ్టులతో నెల్లూరులోనూ ‘పెళ్ళి సందడి’ పాతిక వారాల పండగ చేసుకుంది. (ఆ తర్వాత రోజుల్లో బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ 30 కేంద్రాల్లో డైరెక్ట్గా, ఒక కేంద్రంలో షిఫ్టులతో... మొత్తం 31 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ చేసుకొని, ఆ రికార్డ్ను తిరగరాసింది. సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ను నెలకొల్పింది).ఒక్క సిల్వర్జూబ్లీ కేంద్రాల సంఖ్యలోనే కాదు... ద్విశత దినోత్సవ సెంటర్ల సంఖ్యలోనూ అప్పట్లో ‘పెళ్ళి సందడి’ సరికొత్త ఇండస్ట్రీ రికార్డే. మొత్తం 15 కేంద్రాల్లో ఆ చిత్రం 200 రోజులు విజయవంతంగా ప్రదర్శితమవడం ఆనాటికి తెలుగు సినీసీమ కనివిని ఎరుగని విషయం. (ఆ తర్వాత రోజుల్లో తరుణ్ నటించిన ‘నువ్వే కావాలి’ చిత్రం 18 సెంటర్లలో ఆ ఫీట్ సాధించి, పాత ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది). (pelli sandadi movie @30 years)డైలీ ‘హౌస్ఫుల్’ సందడి! సంవత్సర కాలం గారడీ!! ఒక్క విజయవాడ కేంద్రమే తీసుకుంటే... ప్రేక్షకులపై ‘పెళ్ళి సందడి’ చేసిన మాయాజాలం అంతా ఇంతా కాదు. విజయవాడలోని ‘స్వర్ణా ప్యాలెస్’లో ఆ సినిమా 301 రోజులు ఆడింది. రోజుకు 4 ఆటల చొప్పున అలా ఒక సింగిల్ స్క్రీన్లో 1200 ఆటలకు పైగా ఒక చిత్రాన్ని ప్రదర్శించడం కోస్తా ఆంధ్రలో అప్పటికీ, ఇప్పటికీ హయ్యస్ట్ రికార్డ్. చెప్పుకోవాల్సినదేమిటంటే... విజయవాడ ‘స్వర్ణ ప్యాలెస్’లో ‘పెళ్ళి సందడి’ ప్రదర్శితమైన ఆ 301 రోజుల్లోనూ... రోజుకు 4 ఆటల వంతున 200 రోజులూ థియేటర్ హౌస్ఫుల్లే! అలాగే, గుంటూరులోని బాలభాస్కర్ థియేటర్లోనూ డైలీ 4 షోస్ చొప్పున 150 రోజుల పాటు ప్రతిరోజూ థియేటర్ బయట హాలు నిండినది బోర్డే!! విజయవాడలో భారీయెత్తున బహిరంగంగా సినిమా సిల్వర్జూబ్లీ ఫంక్షన్ చేస్తే, ప్రముఖ హీరో చిరంజీవి దానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, యూనిట్ను అభినందించారు. తర్వాత అదే విజయవాడ, హైదరాబాద్లలో ‘పెళ్ళి సందడి’ చిత్రం షిఫ్టులతో 365 రోజుల పాటు ఆడింది. అలా సంవత్సరం రన్తో ‘గోల్డెన్ జూబ్లీ’ చేసుకుంది.రెండు దశాబ్దాలు... రెండు సినిమాలు... రాఘవేంద్రజాలంహైదరాబాద్ కేంద్రమే తీసుకుంటే, సంధ్య 35 ఎం.ఎం. థియేటర్లో ‘పెళ్ళి సందడి’ 233 రోజులు ఆడి, కనివిని ఎరుగని రీతిలో కోటి రూపాయల గ్రాస్ సాధించింది. ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒక తెలుగు సినిమా కోటి రూపాయల మొత్తం వసూలు చేయడం చరిత్రలో అదే తొలిసారి. తెలుగు సినీచరిత్ర పరికిస్తే... సింగిల్ స్క్రీన్ థియేటర్లో తొలిసారిగా రూ. 10 లక్షల గ్రాస్ సాధించిన చిత్రం... హైదరాబాద్లోని ‘వెంకటేశ థియేటర్’లో ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ (1977). దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ‘పెళ్ళి సందడి’ (1996)తో ఓ తెలుగు సినిమా తొలిసారిగా కోటి రూపాయల గ్రాస్ వసూళ్ళు సాధించిన ఘనత దక్కించుకుంది. రెండు దశాబ్దాల వ్యవధిలో తెలుగు సినిమా బాక్సాఫీస్కు అలాంటి కీర్తి కిరీటం కట్టబెట్టిన ఆ రెండు సినిమాలూ... మెగాఫోన్ మెజీషియన్ కె. రాఘవేంద్రరావు అందించినవే! అదీ దర్శకేంద్రుడి కమర్షియల్ స్టామినా! (మల్టీప్లెక్సులు వచ్చాక, హైదరాబాద్ ‘ప్రసాద్– ఐమ్యాక్స్’లో హాలీవుడ్ చిత్రం ‘అవతార్–పార్ట్1’ (2009 డిసెంబర్ 18న ఇండియా రిలీజ్) ఏకంగా ఏడాది పాటు ఆడి, దాదాపు రూ. 6 కోట్ల గ్రాస్ సాధించి, బాక్సాఫీస్ రికార్డులకెక్కింది). ఎందరికో... కెరీర్లో కొత్త మలుపు‘పెళ్ళి సందడి’ ఎంతో మంది కెరీర్లను మార్చేసింది. అంతకు ముందు అనేక చిన్న పాత్రలు, ప్రతినాయక ఛాయలున్న పాత్రలు కూడా చేసిన శ్రీకాంత్కు హీరోగా అది రెండో సినిమా. హీరోగా తొలి చిత్రం ‘తాజ్మహల్’ విజయవంతమైనా, కథానాయక పాత్రలతో ప్రమోషన్ కోసం తండ్లాటలో ఉన్న శ్రీకాంత్ ‘పెళ్ళి సందడి’తో ఒక్కసారిగా హీరోగా స్థిరపడ్డారు. అలా చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉండే మరో మంచి హీరో ఇండస్ట్రీకి దొరికారు. ఈ సినిమాలో చెల్లెలు పాత్ర ధరించిన దీప్తీ భట్నాగర్కు తెలుగులో ఇదే మొదటి సినిమా. ఆమె అందరినీ ఆకర్షించారు. ఇక, అక్క పాత్రకు ముందుగా అనుకున్నది హీరోయిన్ రవళిని కాదు... సంఘవిని! ఆమెకు డేట్లు కుదరకపోవడంతో ఆ అదృష్టం రవళిని వరించింది. అటుపైన రవళికి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వెంకటేశ్ సరసన ‘చిన్నబ్బాయి’ (1997 జనవరి 10) సహా ఎన్నో ఊహించని ఆఫర్లు వెల్లువెత్తాయి. అలాగే, ఈ సినిమాతో గీత రచయితగా చంద్రబోస్ పరిశ్రమలో నిలబడ్డారు.అప్పటికే జోరు మీదున్న రాఘవేంద్రరావు – కీరవాణి జోడీ అప్పటి నుంచి విడదీయరానిదైంది. సాక్షాత్తూ రాఘవేంద్రరావు కెరీర్ సైతం మారిపోయింది. ‘పెళ్ళి సందడి’ లాంటి అందమైన ప్రేమకథతో సెల్యులాయిడ్పై శృంగారాన్ని బంగారంగా పండించిన దర్శకేంద్రుడి ప్రస్థానం ఆ వెంటనే అదే 1996లో మరో కొత్త మలుపు తిరిగింది. నాగార్జునతో ‘అన్నమయ్య’ చిత్రీకరణ మొదలైంది. అలా సెల్యులాయిడ్ కామి కాస్తా మోక్షగామి అయి, రక్తిరస లాహిరి నుంచి భక్తిరస భావన వైపు మళ్ళి, ఆ జానర్లో తనదైన ముద్ర వేయడం మరో అసాధారణ విషయం.అదే బ్యానర్పై రిపీట్ అవని సక్సెస్!‘పెళ్ళి సందడి’ సాధించిన విజయంతో రాఘవేంద్రరావు తమ సొంత ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్పై ఆ వెంటనే అదే ఏడాది జె.డి. చక్రవర్తి హీరోగా ‘బొంబాయి ప్రియుడు’ (1996 సెప్టెంబర్ 5) తీశారు. మునుపటి చిత్రం అంత పెద్ద హిట్టయినా, ఈ సినిమా మాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోయింది. సక్సెస్ఫుల్ సినిమాగా పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకొచ్చింది. ఇక, ఆ వెంటనే ‘పెళ్ళి సందడి’ నిర్మాతలు తమ చిత్రాన్ని రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ‘మేరే సప్నోం కీ రాణీ’ (1997) పేరిట ఊర్మిళా మాతోండ్కర్, మధుబాల హీరోయిన్లుగా, సంజయ్ కపూర్ హీరోగా నిర్మించారు. విచిత్రమేమిటంటే, ఆనంద్ – మిళింద్ సంగీతంలో వచ్చిన ఆ రీమేక్ తెలుగులోని మ్యాజిక్ను రీక్రియేట్ చేయలేకపోయింది. ఉత్తరాది జనానికి పట్టకపోవడంతో తెలుగు ఇండస్ట్రీ హిట్... హిందీలో అట్టర్ఫ్లాపైంది. ‘పెళ్ళి సందడి’ వచ్చిన సరిగ్గా రెండేళ్ళ తర్వాత 1998 సంక్రాంతికి ఆ దర్శక, నిర్మాతల టీమ్, అదే బ్యానర్పై నూతన తారలతో ‘పరదేశి’ (1998 జనవరి 14) ప్రయత్నం చేసింది. కానీ, అదీ ఘోరంగా ఫ్లాపైంది. దాంతో ‘పెళ్ళి సందడి’ చేసిన బ్యానర్కు పూర్తిగా తెరపడింది. ఆ తరువాత అయిదేళ్ళకు దర్శకుడు రాఘవేంద్రరావు తన 100వ సినిమాగా అల్లు అర్జున్ను హీరోగా పరిచయం చేస్తూ, ‘గంగోత్రి’ (2003) రూపొందించారు. లక్ష్మీ ఫిలిమ్స్ జగదీశ్ ప్రసాద్ను మినహాయించి, మళ్ళీ అల్లు అరవిందే సమర్పకుడిగా, అశ్వినీదత్ నిర్మాతగా, వారితో కలసి, రాఘవేంద్రరావు ‘యునైటెడ్ ప్రొడ్యూసర్స్’ అనే వేరొక కొత్త బ్యానర్పై ఆ చిత్రాన్ని అందించడం గమనార్హం.ఆ ముగ్గురి కెరీర్కీ స్వర్ణోత్సవం!దర్శక, నిర్మాతలుగా రాఘవేంద్రరావు, అశ్వినీదత్, అల్లు అరవింద్ల మధ్య అప్పటికీ ఇప్పటికీ మంచి అనుబంధం, స్నేహం. గమ్మత్తేమిటంటే, ఈ ముగ్గురూ ఇప్పటికి 50 ఏళ్ళ పైగా సినీ రంగ ప్రస్థానం సాగిస్తూనే ఉన్నారు. 1965లో సహాయ దర్శకుడైన రాఘవేంద్రరావు సినీ రంగానికి వచ్చి 60 ఏళ్ళు నిండింది. శోభన్బాబు ‘బాబు’ (1975)తో తొలిసారి స్వతంత్ర దర్శకుడై, 50 ఏళ్ళు పూర్తయింది. ఇక, ‘వైజయంతీ’ పతాకంపై ఎన్టీఆర్ ‘ఎదురులేని మనిషి’ (1975)తో అశ్వినీదత్ స్వతంత్ర నిర్మాతై 50 ఏళ్ళు నిండాయి. అలాగే, వేరొకరితో కలిసే అయినప్పటికీ ‘గీతా ఆర్ట్ ప్రొడక్షన్స్’ పతాకంపై ‘బంట్రోతు భార్య’ (1974 జూన్ 7)తో నిర్మాత అయిన అల్లు అరవింద్ సైతం చిత్రనిర్మాణంలో యాభై వసంతాలు పూర్తి చేసేసుకున్నారు. ఆ రకంగా ‘పెళ్ళి సందడి’తో పరిశ్రమ రికార్డు సృష్టించిన ఆ ముగ్గురు మిత్రుల కెరీర్కీ ఇది ‘గోల్డెన్జూబ్లీ’ సెలబ్రేషన్స్ ఇయర్.ఏమైనా... సినిమా రిలీజ్కు ముందే... ఓ వేడుకలో దర్శకుడు దాసరి అన్నట్టు... ‘పెళ్ళి సందడి’ ఫక్తు వాణిజ్య ఘనవిజయాల దర్శకేంద్రుడి సినిమా కాదు... కసికొద్దీ ‘జ్యోతి’ (1976), ‘ఆమె కథ’ (1977) లాంటి సిసలైన చిన్న బడ్జెట్ సాహస ప్రయోగాలు చేసిన దర్శకుడి సినిమా. ఇంకా చెప్పాలంటే... స్టార్ హీరోల, భారీ చిత్రాల రాఘవేంద్రరావు తనను తాను స్వయంగా సవాలు చేసుకొని, కథ, కథనం, సాంకేతిక నైపుణ్యాలను నమ్ముకొని చేసిన సినిమా. సృజనాత్మకత ఉంటే చిన్న బడ్జెట్లోనూ అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన సినిమా. అప్పట్లో అందరినీ అవాక్కయ్యేలా చేసిన బాక్సాఫీస్ ఇండస్ట్రీ రికార్డ్ సినిమా. నేటికీ జనం మర్చిపోలేని మ్యూజికల్, ఫ్యామిలీ సినిమా... ‘పెళ్ళి సందడి’. – రెంటాల జయదేవ -
రామ్చరణ్, ఉపాసనకు కవలలు.. ఆనందంలో చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు రామ్చరణ్ మరోసారి తండ్రి అయ్యారు. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో ఆయన భార్య ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒక పాప, బాబుకు ఉపాసన జన్మనిచ్చారని చిరంజీవి శనివారం ’ఎక్స్’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. తల్లి, శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని, గ్రాండ్ పేరెంట్స్గా ఈ శిశువులను తమ ఫ్యామిలీలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. రామ్చరణ్, ఉపాసనలకు 2023, జూన్ 20న తొలి సంతానంగా క్లీంకార కొణిదెల జన్మించిన విషయం తెలిసిందే. With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins - a baby boy and a baby girl.Both the babies and the mother are healthy and doing well. ✨Welcoming these little ones into our family…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2026 -
ఆ ఆనందమే వేరు: తరుణ్ భాస్కర్
‘‘యాక్టర్గా వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ నా ప్రయారిటీ డైరెక్షనే. ఒక క్రియేటివ్ థాట్తో కథ రెడీ చేసుకుని, ఆ కథను స్క్రీన్పై చూసుకుంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఈ ఏడాది నేను నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. వీటి తర్వాత దర్శకత్వంపై మరింత ఫోకస్ పెడతాను’’ అని తరుణ్ భాస్కర్ చె΄్పారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళ హిట్ ఫిల్మ్ ‘జయ జయ జయ జయహే’కు రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కింది. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మించిన ఈ చిత్రం జనవరి 30న విడుదలైంది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను చూసిన ఆడియన్స్ ఇదొక ఒరిజినల్ సినిమాలానే ఫీలవుతున్నారు. కథకు కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో ఓంకార్ నాయుడు పాత్ర చేశాను. యాక్టర్గా నేనిప్పటివరకు చేసిన రోల్స్లో నాకు ఇది చాలెంజింగ్. నేను పుట్టి పెరిగింది అంతా తెలంగాణలోనే. కానీ ఓంకార్ నాయుడు పాత్ర గోదావరి యాస మాట్లాడాలి.నా మిత్రుడు వర్మ, లాంగ్వేజ్ కోచ్ వినోద్గార్ల సహాయంతో ఈ రోల్ చేశాను. డైలాగ్స్ లేకుండా ఎమోషన్ చూపించడం టఫ్. ఈషా ఈ పాత్రను అద్భుతంగా చేసింది. ఈ సినిమా క్రెడిట్ అంతా సజీవ్దే. ‘ఈ నగరానికి ఏమైంది?’ పార్టు 2 చిత్రీకరణ జరుగుతోంది. 30 ఏళ్లు దాటిన తర్వాత అబ్బాయిలకు ఉండే సమస్యలు, టెన్షన్స్తో ఈ సినిమా కథ సాగుతుంది. వెంకటేశ్గారు హీరోగా నా డైరెక్షన్లోని సినిమాకు ఇంకా వర్క్ చేయాలి’’ అని చెప్పారు. -
ఎస్ఎస్ఆర్ 61 ఆరంభం
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ‘ఎస్ఎస్ఆర్ 61’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్పై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారు. ఈ మూవీ ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన వీడియోలో సింగీతం క్రియేటివిటీ, ఆయనకి సినిమాలపై ఉన్న ప్రేమ, తరతరాల దర్శకులపై ఆయన ప్రభావాన్ని గుర్తు చేసే క్లిప్స్ ఆకట్టుకున్నాయి.‘‘సింగీతం శ్రీనివాసరావుగారు తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్తో ముందుకు వస్తున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీకి క్రియేటివ్ సహకారం అందించిన ఆయన... ఇప్పుడు స్వయంగా ‘ఎస్ఎస్ఆర్ 61’ కోసం దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం మరింత ఎనర్జీని తీసుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ భారతీయ సినిమాలో ఒక మైలురాయిలా నిలిచేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
ఏడు తరాలు గుర్తుండిపోతుంది: నవీన్ పొలిశెట్టి
'‘నిర్మాత నాగవంశీ సినిమాని ఎంతో ప్రేమిస్తాడు. సినిమాని ఎంత ప్రేమిస్తే, అంత మంచి విజయం వస్తుందని మాలాంటి వారు కూడా వంశీని చూసి నేర్చుకోవాలి. మూవీ కోసం నవీన్ పొలిశెట్టి ప్రాణం పెడతాడు. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని చెప్పడానికి ఉదాహరణ ‘అనగ నగా ఒక రాజు’’ అని నిర్మాత, టీఎఫ్డీసీ చైర్మన్ ‘దిల్’ రాజు చెప్పారు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జోడీగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా జనవరి 14న విడుదలై, రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన విజయోత్సవానికి ‘దిల్’ రాజు, దర్శకుడు బాబీ కొల్లి అతిథులుగా హాజరయ్యారు.బాబీ మాట్లాడుతూ– ‘‘ఇటీవల నేను చిరంజీవిగారిని కలిసినప్పుడు... ‘అనగనగా ఒక రాజు’ బాగుందట కదా... ఈ తరంలో నాకు బాగా నచ్చిన హీరో నవీన్’’ అన్నారు. ‘‘ఈ సంక్రాంతి మా యూనిట్కి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది’’ అని నవీన్ పొలిశెట్టి చెప్పారు. ‘‘మా డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు చూశామనడం సంతోషాన్నిచ్చింది’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. ‘‘ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం చూసి మా కష్టమంతా మర్చిపోయాను’’ అని మారి తెలిపారు. మీనాక్షీ చౌదరి, రచయిత్రి, క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి, రచయిత చంద్రబోస్ మాట్లాడారు. -
సింగీతం శ్రీనివాసరావు కొత్త సినిమా ప్రకటన
లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు 94ఏళ్ల వయసులో మళ్లీ మెగా ఫోన్ పెట్టారు. దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తెరకెక్కించారు. తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకలోకాన్ని పుష్పక విమానంపై ఊయలలూగించారు. జానపదాన్ని ప్రేమించడమేకాదు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అద్భుత ప్రయోగాలతో అపురూప కళాఖండాలను ఆవిష్కరించిన తెరమాంత్రికుడాయన. కేవలం దర్శకుడిగానే కాదు, సంగీతంలోను ఔరా అనుపించుకున్నారు. ఆదిత్య 369, భైరవ ద్వీపం, పుష్పక విమానం, మయూరి, బృందావనం వంటి అద్భుతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు.ప్రయోగాత్మక చిత్రాలు తీయాలంటే సింగీతం శ్రీనివాసరావు తర్వాతనే ఎవరైనా అనేలా చెరగని ముద్ర వేశారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన ఒక కొత్త సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తుండగా రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ మూవీని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఒక వీడియోను పంచుకుంది. అయితే, సినిమా పేరుతో పాటు నటీనటుల విషయాలను త్వరలో ప్రకటించనున్నారు. -
శ్రీలీలకు గోల్డెన్ ఛాన్స్.. బిగ్ ప్రాజెక్ట్కు ఎంపిక
నటుడు ధనుష్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. కుబేర, ఇడ్లీకడై, హిందీ చిత్రం తేరేఇష్క్మే వంటి ప్రాజెక్ట్లతో పాన్ ఇండియా రేంజ్లో తన సత్తా చాటుతున్నాడు. తాజాగా తన 55వ సినిమా వివరాలను ఆయన పంచుకున్నాడు. అమరన్ వంటి సంచలన విజయాన్ని సాదించిన చిత్ర దర్శకుడు రాజ్కుమార్ పెరియసామితో ధనుష్ సినిమా ప్రకటన ఇప్పటికే వచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్లోకి హీరోయిన్గా శ్రీలీల ఎంట్రీ ఇచ్చేసింది. ఈమేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఇందులో ధనుష్తో పాటు మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయిఅభయంకర్ పనిచేస్తున్నారు ఈ విషయాన్ని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి.ఐసరిగణేశ్ తమ వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని సమ్మర్ ముగింపు సమయంలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళుతుంది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో మెప్పిస్తుంది. ఇప్పటికే ‘పరాశక్తి’ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు ధనుష్తో మరో భారీ ప్రాజెక్ట్లో భాగమైంది.You didn't see this coming 😉Welcoming the dazzling damsel @sreeleela14 on board #D55 🔥@dhanushkraja @Rajkumar_KP @wunderbarfilms @RTakeStudios @SaiAbhyankkar @Shra2309 @azy905 @theSreyas @sandy_sashr @vishurams pic.twitter.com/fROtGwO0T2— Wunderbar Films (@wunderbarfilms) January 31, 2026 -
బిగ్బాస్ తర్వాత పని దొరకదు, డిప్రెషన్: ఆర్జే కాజల్
బిగ్బాస్ షోలో పార్టిసిపేట్ చేసినవాళ్లు ఒక్కసారిగా సెలబ్రిటీలు అయిపోతారు. కానీ ఆ ఫేమ్ కొంతకాలమే ఉంటుంది. పైగా దానివల్ల అవకాశాలు వస్తాయా? అంటే అదీ అంతంతమాత్రమే! చాలా తక్కువమందికి మాత్రమే బిగ్బాస్ కలిసొస్తుంది. విన్నర్స్తో సహా అనేకమందికి షో వల్ల ఎటువంటి ఫాయిదా ఉండదు. అదే బల్లగుద్ది చెప్తోంది నటి ఆర్జే కాజల్.బిగ్బాస్ సెలబ్రిటీస్ఈమె తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్లో పాల్గొంది. బిగ్బాస్ నిజస్వరూపం ఇదేనంటూ తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో కాజల్ మాట్లాడుతూ.. బిగ్బాస్ సెలబ్రిటీస్.. జనాలు వాళ్లను సెలబ్రిటీలనే పిలుస్తారు. కానీ, అసలు బిగ్బాస్ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొంతమందికి వాళ్ల రెగ్యులర్ వర్క్స్, సినిమాలు, షోస్, అవార్డ్స్ బానే ఉంటాయి. కానీ చాలామంది విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి?ఎక్కడికి వెళ్లినా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే అడుగుతారు. దానికి ఇబ్బందిగానే ఏమీ లేదని బదులిస్తారు. బద్ధకం వల్లనో, టాలెంట్ లేకనో కాదు అవకాశాలు రాక! బిగ్బాస్ తర్వాత ఫుల్ బిజీ, ఫుల్ వర్క్ అని అందరూ అనుకుంటారు, కానీ అది మూడు, నాలుగు నెలల వరకు మాత్రమే పరిమితం. దానికి తోడు బిగ్బాస్ ట్రామా, డిప్రెషన్! ఇంతకుముందు చేసుకున్న పని మనస్ఫూర్తిగా చేసుకోలేక, కెరీర్లో ఎదుగుదల లేక, ముందుకెళ్లలేక, వెనకడుగు వేయలేక సతమతమవుతూ ఉంటారు. జీవితాంతం ఎదురుచూపులుయాక్టర్స్ పరిస్థితి మరీ దారుణం.. ఆ బిగ్బాస్ సీజన్లో నిన్ను చాలామందే చూశారు, కొత్త ముఖాలు కావాలి అంటారు. చాలామంది ప్రధాన పాత్రల కోసం జీవితాంతం ఎదురుచూస్తూనే ఉంటారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోతారు. ఇంకొందరు సోషల్ మీడియా, యూట్యూబ్తో సరిపెట్టుకుంటారు. రోడ్డుమీదకెళ్తే అందరూ గుర్తుపడతారు, సెల్ఫీలడుగుతారు. ఫేమ్ వల్ల ఏదీ మారదుకానీ పని విషయానికి వచ్చేసరికి మాత్రం ఎంతమంది ఫాలోవర్లున్నారు? ఎంత రీచ్ ఉంది? అని డబ్బు దగ్గర బేరాలడతారు. బతకడం కోసం కొందరు తక్కువ డబ్బు ఇచ్చినా కాదనలేక చేసుకుంటూ పోతారు. కొంతమంది వేరే కెరీర్ ఎంచుకుంటారు. మరికొందరు సైలెంట్గా మాయమైపోతారు. బిగ్బాస్ వల్ల రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవచ్చు కానీ ఫేమ్ ఒక్కటే కెరీర్ను నిర్మించదు. బిగ్బాస్ వల్ల ఏదీ మారిపోదు. అది కేవలం ఫేమస్ రియాలిటీ షో. అంతే! అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by RJ Kajal️️️️️️ (@kajalrj) చదవండి: ఐశ్వర్యరాయ్ తొలి సంపాదన ఎంతో తెలుసా? -
వాళ్లు కేవలం అమ్మాయిల కోసమే సినిమాలు తీస్తున్నారు: తమ్మారెడ్డి
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని మెగస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను సింగర్ చిన్మయి విభేదించిన విషయం తెలిసిందే.. సినిమాలో ఛాన్స్ రావాలంటే తమ శరీరం అప్పగించాల్సిందేనని ఆమె ఓపెన్గానే చెప్పారు. చిరు జనరేషన్లో కనిపించిన పరిస్థితిలు ఇప్పుడు లేవని ఆమె అన్నారు. అందుకే మెగాస్టార్ ఇలాంటి వ్యాఖ్యలు చేసివుంటారని ఆమె పేర్కొంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.క్యాస్టింగ్ కౌచ్ గురించి తమ్మారెడ్డి భరద్వాజ ఇలా అన్నారు. 'పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అయితే, అదీ వారిద్దరి అంగీకారంతోనే కొనసాగుతుంది. ఈ రకంగా చూస్తే చిరంజీవి చెప్పింది కొన్ని సందర్భాల్లో నిజమే. ఆయన చేసిన వ్యాఖ్యలను నేను తప్పబట్టను. కానీ, నా అభిప్రాయం ప్రకారం క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అయితే, టాలెంట్ ఉంటే ఏ అమ్మాయి కూడా ఇబ్బందులు పడదని చెప్పగలను. సింగర్ చిన్మయి చేసిన వ్యాఖ్యలు కూడా నిజమే.. ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి ప్రతి ఏడాది 200 పైగా సినిమాలు వస్తున్నాయి. అందులో కొందరు ఎందుకు సినిమాలు తీస్తున్నారో వాళ్లకే తెలియదు. కేవలం అమ్మాయిలను లోబర్చుకునేందుకే కొందరు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. కానీ, సీరియస్గా సినిమాలు తీసే పెద్ద దర్శకులు, నటులు, నిర్మాతలు అలాంటి వాటికి దూరంగా ఉంటారు. లైంగిక వేధింపులను ఎదిరించినందుకు సింగర్ చిన్మయిని నిషేధించారు. ఆమె ఎవరికీ తల వంచలేదు. ఛాన్స్లు ఇవ్వకున్నా సరే ఆమె ఎవరికీ లొంగలేదు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. చిరంజీవి వంటి వారు క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పడం వెనుక ప్రధాన కారణం టాలెంట్ ఉన్న వాళ్లు ధైర్యంగా ముందుకు రావాలనే చెప్పారనుకుంటున్నాను.' అని ఆయన అన్నారు. -
ఫంకీలో రామ్ మిర్యాల పాడిన జోష్ సాంగ్.. విన్నారా?
మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఫంకీ. కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ సినిమా నుంచి ధీరే.. ధీరే సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా సెకండ్ సాంగ్ను వదిలారు. 'ఒప్పేసుకుంట పిల్ల తప్పు అంత నాదేనంటు రట్టాటటావ్.. తప్పించుకోను పిల్ల సారీ నీకు చెప్పుకుంట రట్టాటటావ్.. అరెరె కుక్క పిల్లలాగా తిప్పుకోకే పిల్లా..' అంటూ పాట మొదలవుతుంది. అంటూ సాగే ఈ పాట ప్రారంభం నుంచి చివరి వరకు ఫుల్ జోష్తో కొనసాగింది. భీమ్స్ సంగీతం అందించిన ఈ పాటకు దేవ్ పవార్ లిరిక్స్ సమకూర్చాడు. రామ్ మిర్యాల ఆలపించాడు. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం ఫిబ్రవరి 13న విడుదలవుతోంది. చదవండి: నవీన్ పొలిశెట్టి ఆంధ్ర టూ తెలంగాణ సాంగ్ రిలీజ్ -
ప్రభాస్-మారుతి మరో సినిమా ప్లాన్.. టీమ్ క్లారిటీ ఇదే
ప్రభాస్-దర్శకుడు మారుతి కాంబినేషన్లో తాజాగా తెరకెక్కిన మూవీ ది రాజాసాబ్.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఆశించినంత రేంజ్లో మెప్పించలేదు. దీంతో ఫ్యాన్స్ దర్శకుడిపై ట్రోల్స్కు దిగారు. అయితే, మరోసారి మారుతితో ప్రభాస్ సినిమా చేయనున్నట్లు సోషల్మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్ పెట్టనుందని నెట్టింట వైరల్ అయింది. దీంతో ప్రభాస్ టీమ్ స్పందించింది.రాజాసాబ్ తర్వాత ప్రభాస్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ, స్పిరిట్, కల్కి మూవీలతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభాస్ సినిమాల గురించి సోషల్మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్ అని పేర్కొంది. దీంతో మారుతితో ప్రభాస్ మరోసారి ప్రభాస్ నటించడం లేదని క్లారిటీ వచ్చేసింది. హోంబలే ఫిల్మ్స్ ఎలాంటి పెట్టుబడులు పెట్టడం లేదని తేలిపోయింది. అయితే, మారుతి దర్శకుడిగా ఒక మిడ్ రేంజ్ హీరోతో హోంబలే ఫిల్మ్స్ ఒక మూవీ తీస్తుందని ప్రచారం జరుగుతుంది. -
'ఆంధ్ర టూ తెలంగాణ'ను ఊపేసిన వీడియో సాంగ్ విడుదల
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే మాస్ వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. 'ఆంధ్ర టూ తెలంగాణ' అంటూ సాగే ఈ పాటలో నవీన్ స్టెప్పులకు శాన్వీ మేఘన గ్లామర్తో ఆకట్టుకుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను ధనుంజయ్ సీపానా, సమీర్ భరద్వాజ్ పాడారు. సంగీతం మిక్కీ జె. మేయర్ అందించారు. -
'ప్రేమికుల దినోత్సవం' నాడు ప్రదీప్ రంగనాథన్ సినిమా
నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడు నటించిన తాజా చిత్రం ఎల్ ఐ కే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈయన ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నీ ఒకదానికి మించి ఒకటి సంచలన విజయాలు సాధించాయనేది తెలిసిందే. ఇటీవల విడుదలైన డ్యూడ్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రంతోపాటు ప్రారంభమైన మరో చిత్రమే ఎల్ఐకే. కృతిశెట్టి నాయకిగా నటించిన ఇందులో ఎస్జే సూర్య, సీమాన్ ముఖ్యపాత్రలు పోషించారు. సెవెన్ స్క్రీన్స్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని దర్శకుడు విఘ్నేష్ శివణ్ తెరకెక్కించారు.అనిరుధ్ సంగీతాన్ని అందించారు. అయితే, ముందుగా ఈ చిత్రాన్ని గత దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతల వర్గం ప్రకటించింది. కానీ, అదే సమయంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడంతో ఎల్ఐకే చిత్ర విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12 లేదా 13వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. ఫాంటసీ లవ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్ర షూటింగ్ను మలేషియా, సింగపూర్లో అధిక భాగాన్ని చిత్రీకరించినట్లు యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. అదేవిధంగా వరుస విజయాలతో జోరుపై ఉన్న నటుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపైన మంచి అంచనాలే నెలకొంటున్నాయి. -
చిరు సూపర్ డ్యాన్స్.. 'హుక్ స్టెప్' వీడియో సాంగ్ రిలీజ్
చిరంజీవి 'మన శంకరవరప్రసాద్' సినిమాలో బాగా వైరల్ అయిన పాట హుక్ స్టెప్. చిరంజీవి వింటేజ్ స్టెప్పులతో కొరియోగ్రాఫీ చేసిన ఈ సాంగ్.. మూవీ రిలీజ్కి ముందు నుంచే తెగ ట్రెండ్ అయిపోయింది. థియేటర్లలోనూ ఇది వస్తున్న జనాలు బాగానే ఎంజాయ్ చేశారు. అలాంటి పాట ఫుల్ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో రిలీజైంది.(ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)ఇందులో చిరు డ్యాన్స్లని ఆట సందీప్, జ్యోతి కలిసి కొరియోగ్రాఫీ చేశారు. వీటికి మంచి ప్రశంసలు కూడా లభించాయి. సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైనే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సంతోషంతోనే కొన్నిరోజుల క్రితం దర్శకుడు అనిల్ రావిపూడికి లగ్జరీ రేంజ్ రేవర్ కారుని కూడా చిరంజీవి బహుమతిగా ఇచ్చారు. ఇదే మూవీలో చిరుతో పాటు విక్టరీ వెంకటేశ్ కూడా నటించడం విశేషం.(ఇదీ చదవండి: టాలీవుడ్ జనవరి రిపోర్ట్ కార్డ్.. పైచేయి ఎవరిది?) -
టాలీవుడ్ జనవరి రిపోర్ట్ కార్డ్.. పైచేయి ఎవరిది?
2026లో అప్పుడే మొదట నెల పూర్తయిపోయింది. కళ్లు మూసి తెరిచేలేపో జనవరి అయిపోయింది. ఈ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే సందడి వినిపించింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలే దీనికి కారణం. ఇంతకీ తెలుగు ఇండస్ట్రీకి ఈ నెల ఎలా గడిచింది? ఏమేం జరిగింది? అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా)నెల ప్రారంభంలోనే సైక్ సిద్ధార్థ్, వనవీర, 45, గులాబీ తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ వచ్చాయి. వీటిలో ఒక్కటి కూడా మెప్పించలేకపోయాయి. మరోవైపు సంక్రాంతి సినిమాల గురించి జనాల ఎదురుచూడటంతో తొలివారం ముగిసిపోయింది. రెండోవారం వచ్చేసరికి ప్రభాస్ 'రాజాసాబ్' థియేటర్లలోకి వచ్చింది. ట్రైలర్స్, దర్శకుడి మారుతి మాటలు వినేసరికి అభిమానులు చాలా అంచనాలు పెంచుకున్నారు. కట్ చేస్తే తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. లాంగ్ రన్లో డిజాస్టర్గా మిగిలింది.ఈసారి చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు'.. ఓ మాదిరి అంచనాలతోనే థియేటర్లలో రిలీజైంది. కానీ ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన వారం పదిరోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల హౌస్ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి. కంటెంట్ పరంగా పెద్దగా మెరుపులేం లేనప్పటికీ చిరంజీవి మ్యాజిక్ బాగానే వర్కౌట్ అయింది. రూ.350 కోట్ల కలెక్షన్స్తో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. దీని తర్వాత రోజు 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రిలీజైంది. చిరు సినిమాకు అదిరిపోయే టాక్ రావడంతో దీన్ని జనాలు లైట్ తీసుకున్నారు. రవితేజ గత చిత్రాలతో పోలిస్తే ఇది కాస్త బెటర్ అనే మాట వినిపించింది కానీ పెద్దగా వసూళ్లు రాబట్టుకోలేకపోయింది.(ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)తర్వాత నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు' వచ్చింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీతో సక్సెస్ అందుకుంది. నాగవంశీ నిర్మాత కావడంతో ఉన్నంతలో థియేటర్లు కూడా బాగానే దొరికాయి. శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి'కి హిట్ టాక్ వచ్చింది గానీ అప్పటికే జనాలు చిరంజీవి మూవీ మూడ్లో ఉండటంతో దీన్ని కొందరు మాత్రమే చూశారు. పండగ మూవీస్ హడావుడి ఉంటుందని మూడో వారం ఒక్క కొత్త చిత్రం కూడా రిలీజ్ కాలేదు. చివరి వారంలో తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా 'ఓం శాంతి శాంతి శాంతిః' రిలీజైంది. మక్కీకి మక్కీ రీమేక్ కావడం, కంటెంట్ ఓకే ఓకే ఉండటంతో జనాల్లోకి పెద్దగా వెళ్లలేదు. హిట్ అయ్యే అవకాశాలు తక్కువే. అలానే 'దేవగుడి'తో పాటు ఒకటి రెండు చిన్న చిత్రాలు కూడా రిలీజయ్యాయి. కానీ వీటిని పట్టించుకునే నాథుడు లేడు.ఓవరాల్గా చూసుకుంటే చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారీ' మాత్రమే ఈ నెలలో హిట్స్ అయ్యాయి.(ఇదీ చదవండి: నమ్మలేని పనులన్నీ చేస్తున్న రాజమౌళి)


