Tollywood
-
భార్య పుట్టినరోజు.. ఎన్టీఆర్ లవ్లీ పోస్ట్
జూ.ఎన్టీఆర్ (Ntr) ప్రస్తుతం జపాన్ లో ఉన్నాడు. గతేడాది మన దగ్గర రిలీజైన దేవర (Devara Movie).. ఈ 28న జపాన్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇదివరకే ప్రీమియర్స్ పడగా.. వాటికి తారక్ తోపాటు దర్శకుడు కొరటాల శివ కూడా హాజరవడం విశేషం.సతీసమేతంగా జపాన్ వెళ్లిన ఎన్టీఆర్.. తన భార్య ప్రణతి పుట్టినరోజు (Birthday) వేడుకల్ని మంగళవారం రాత్రి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన రెండు ఫొటోలని షేర్ చేసుకోవడంతో పాటు క్యూట్ క్యాప్షన్ కూడా పెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా)'అమ్మలు.. హ్యాపీ బర్త్ డే' అని తారక్ తన ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. దీనికి నెటిజన్ల లైకులు కొట్టేస్తున్నారు. 2011లో తారక్-ప్రణతికి పెళ్లయింది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.సినిమాల విషయానికొస్తే జపాన్ నుంచి వచ్చిన వెంటనే ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. తర్వాత షెడ్యూల్ బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య) View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
అభినవ్ సాహసాలు
‘ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్’ వంటి సందేశాత్మక బాలల చిత్రాలను తెరకెక్కించిన దర్శక–నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన తాజా చిత్రం ‘అభినవ్’. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ బాలల చిత్రం నవంబరు 14న విడుదల కానుంది.ఈ చిత్రం విలేకరుల సమావేశంలో భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘స్వాతంత్య్ర సమరయోధుడైన తన తాతయ్య నారాయణరావు స్ఫూర్తితో అభినవ్ అనే సాహస బాలుడు ఓ గంజాయి మాఫియాను ఎలా అడ్డుకున్నాడు? అన్నదే ‘అభినవ్’ చిత్రం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు డ్రగ్స్ రహిత సమాజం కోసం సినిమా వాళ్లు చిన్న వీడియో చేయాలని కోరారు. నేను డ్రగ్స్ రహిత సమాజం కోసం నా వంతుగా ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించాను’’ అని అన్నారు. -
ఎక్కడికెళ్లినా గర్వంగా ఇక్కడికే వస్తా!: శ్రీలీల
‘‘ఒక సినిమాతో ప్రేక్షకులకు వినోదం పంచితే, మరో సినిమాతో సందేశం ఇవ్వాలి. ఇలా నా సినిమాలను బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నాను. తెలుగు అమ్మాయిగా, హీరోయిన్గా నాపై ఆ బాధ్యత ఉంటుంది’’ అని హీరోయిన్ శ్రీలీల అన్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘రాబిన్హుడ్’. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ అతిథి పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక శ్రీలీల పంచుకున్న విశేషాలు. ⇒ ‘రాబిన్హుడ్’ సినిమాలో ఫారిన్ నుంచి ఇండియాకు వచ్చిన నీరా వాసుదేవ్ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తన ప్రపంచంలో తను ఉంటుంది. ఈ ప్రపంచం అంతా తన చుట్టూనే ఉంటుందని అనుకుంటుంది. నా కెరీర్లో నీరా వాసుదేవ్ లాంటి ఫన్ రోల్ను ఇప్పటివరకూ చేయలేదు. నితిన్గారితో వర్క్ చేయడం ఇది రెండోసారి (గతంలో ‘ఎక్స్ట్రా’ మూవీలో కలిసి నటించారు). చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓ ఫ్యామిలీ మెంబర్లా ఉంటారు. ఈ సినిమాతో మాకు హిట్ పెయిర్గా పేరు వస్తుంది. ‘రాబిన్హుడ్’ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ⇒ నీరా వాసుదేవ్ పాత్రకు రష్మికా మందన్నాను అనుకున్నారు. రష్మికకు కూడా నచ్చిన పాత్ర ఇది. కానీ కాల్షీట్స్ విషయంలో సమస్యలు రావడం వల్ల రష్మిక తప్పుకున్నారు. ఆ సమయంలో వెంకీగారు నాకు ఫోన్ చేసి, ఈ రోల్ గురించి చెప్పారు. నాకు నచ్చి ఓకే అన్నాను. ఇటీవల ‘పుష్ప: ది రూల్’ షూటింగ్లో మేం కలుసుకున్నప్పుడు రష్మిక నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేను మైత్రీ ఫ్యామిలీలో ఉన్నానని గర్వంగా చెప్పగలను. మన ఫ్యామిలీతో సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో, వారితో మూవీ చేస్తే అలా ఉంటుంది. ⇒ ‘పుష్ప ది రూల్’ సినిమాలో ‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్ చేశాను. ఈ సాంగ్ సక్సెస్ తర్వాత ఆ తరహా స్పెషల్ సాంగ్స్ చేసేందుకు నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ ‘పుష్ప: ది రూల్’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిన భారతీయ సినిమా. సో... ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశాను. అయితే ఇకపై ఇలాంటి పెద్ద సినిమాల్లో సాంగ్స్కి బదులుగా మంచి రోల్స్ చేయాలనుకుంటున్నాను. ⇒ 2023లో నావి ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంతో త్రీ షిఫ్ట్స్ కూడా వర్క్ చేశాను. అయితే గత ఏడాది హీరోయిన్గా ఒకే ఒక్క సినిమా (‘గుంటూరు కారం) లో కనిపించాను. నా ఫైనల్ ఇయర్ మెడికల్ ఎగ్జామ్స్ వల్ల ఎక్కువ సినిమాలు చేయలేదు. ఈ గ్యాప్లో ఎన్నో మంచి రోల్స్, మంచి చిత్రాలు వదులుకున్నాను.⇒ ప్రస్తుతం రవితేజగారితో ‘మాస్ జాతర’, శివ కార్తికేయన్గారితో ‘పరాశక్తి’, కన్నడ–తెలుగు భాషల్లో ‘జూనియర్’ సినిమా చేస్తున్నాను. ‘రాబిన్ హుడ్’లో కేతికా శర్మ చేసిన స్పెషల్ సాంగ్ ‘అదిదా సర్ప్రైజ్’లోని కొన్ని డ్యాన్స్ మూమెంట్స్కి భిన్నాబిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మీరు అద్భుతమైన డ్యాన్సర్. ఆ తరహా డ్యాన్స్ మూవ్స్, కొరియోగ్రఫీ గురించి ఓ హీరోయిన్గా ఏం చెప్తారు? ‘‘ఒక అమ్మాయి దృష్టి కోణంలో చెప్పాలంటే... మనం కంఫర్టబుల్గా ఉన్నామా? లేదా? అనేది ముఖ్యం. స్టెప్స్ అనేవి చేసేవారి కంఫర్ట్ లెవల్స్పై ఆధారపడి ఉంటాయి. కంఫర్ట్ జోన్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది. అయితే... అమ్మాయి ఇబ్బంది పడలేదు అన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. హీరోయిన్గా నేను ఎన్నో సాంగ్స్ చేశాను. శేఖర్ మాస్టర్తో కూడా చేశాను. అందరం హ్యాపీ’’ అంటున్న శ్రీలీలతో బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలోని డ్యాన్స్ మూవ్స్, అలాగే వేరే సినిమాల్లోని ఈ తరహా డ్యాన్స్ మూవ్స్పై మహిళా కమిషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరేం అంటారు? అన్న ప్రశ్నకు శ్రీలీల బదులిస్తూ... ‘‘మహిళా కమిషన్కి మంచి స్థాయి ఉంది. ఏది సరైనదో వారికి తెలుసు. పాత సినిమాల పట్ల కూడా వారికి నాలెడ్జ్ ఉంది. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాను’’ అన్నారు.హిందీ చిత్ర పరిశ్రమలో బిజీ అవుతున్నారు... అక్కడికే వెళ్లిపోతారని కొందరు అంటున్నారు.. అన్ని భాషల్లో సినిమాలు చేయాలనుకుంటున్నాను. కానీ శ్రీలీల అంటే ఎవరు? తెలుగింటి అమ్మాయి. తెలుగు∙చిత్ర పరిశ్రమ నాకు ఇల్లులాంటిది. ఒకవేళ బయటకు వెళ్లినా గర్వంగా ఇక్కడికే (తెలుగు) తిరిగి వస్తాను. మన పిల్లలు చదువుకోవడానికి మరొక చోటుకు వెళతారు. కానీ మళ్లీ మన ఇంటికే వస్తారు కదా! సరిహద్దులు మారినంత మాత్రాన గాలి మారదు. నేను అన్ని భాషలనూ బ్యాలెన్స్ చేస్తూ, సినిమాలు చేయాలనుకుంటున్నాను. -
మంచు విష్ణు కన్నప్ప.. మరో రెండు పాత్రలు రివీల్
టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. ఇప్పటికే రిలీజైన కన్నప్ప పోస్టర్లు, టీజర్లు, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం కన్నప్ప మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో రెండు పాత్రలను రివీల్ చేశారు. రఘుబాబు, శివబాలాజీ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రఘు బాబు మల్లు అనే ఓ పాత్రను పోషిస్తుండగా.. శివబాలాజీ కుమారదేవ శాస్త్రిగా కనిపించనున్నారు.కాగా.. ఈ చిత్రంలో శివయ్యగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్, రుద్రుడిగా ప్రభాస్, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్రలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు కన్నప్ప టీం సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Revealing Sivabalaji's enlightened transformation as #KumaradevaShastri and Raghubabu as #Mallu in #Kannappa🏹!A journey of wisdom and unwavering devotion etched in divine history. 🔱Har Har Mahadev 🔱Har Ghar Mahadev 🔥@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas… pic.twitter.com/hRO4MPWFQ5— Mukesh Kumar Singh (@mukeshvachan) March 25, 2025 -
నభా నాభి అందాలు.. సాయిపల్లవి రెట్రో లుక్!
నాభి అందాలతో క్యూట్ పోజుల్లో నభా నటేశ్బ్లాక్ ఔట్ ఫిట్ తో పిచ్చెక్కిస్తున్న రష్మికచాన్నాళ్ల తర్వాత ఫొటో పోస్ట్ చేసిన సాయిపల్లవిమార్చి ఫొటో డంప్ బయటపెట్టిన ఆలియా భట్చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న రీతూ చౌదరిహాట్ డ్యాన్స్ తో రచ్చలేపిన ఊర్వశి రౌతేలామక్కా వెళ్లిపోయిన హీరోయిన్ హెబ్బా పటేల్ View this post on Instagram A post shared by Izzy⭐️Krishnan (@izzykrishnan) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shriya Sharma (@shriyasharma9) -
ఉద్యోగం కోసం ఫారిన్కే పోవాలా?.. ఆసక్తిగా హోమ్ టౌన్ ట్రైలర్
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు మరో వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తెలుగు వెబ్ సిరీస్ హోమ్ టౌన్(Home Town). ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పడే కష్టాల నేపథ్యంలోనే ఈ సిరీస్ను తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ ఫ్యామిలీ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. తమ పిల్లలు బాగా చదివి గొప్పవాళ్లుగా ఎదిగితే చూడాలని ఆశపడే తండ్రి తపనే ట్రైలర్లో ప్రధానంగా కనిపిస్తోంది. మధ్య తరగతి కుటుంబాల పరిస్థితులు ఎలా ఉంటాయనేదే హోమ్ టౌన్లో ట్రైలర్లో చూపించారు. ఈ వెబ్ సిరీస్కు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. వచ్చేనెల నాలుగో తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.You can leave your hometown, but can you ever leave the memories?The streets, the friendships, the late-night dreams Srikanth’s journey is ours too.https://t.co/T4V4GXBJWL#Hometown premieres from April 4 on #aha#ahaOriginal #RajeevKanakala #Jhansi pic.twitter.com/D523DRCH1s— ahavideoin (@ahavideoIN) March 25, 2025 -
‘బ్యూటీ’ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డు
‘బ్యూటీ’ అనే చిత్రంతో నీలఖి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను గీతా సుబ్రమణ్యం, ‘హలో వరల్డ్’ ఫేమ్ వర్ధన్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య హీరోగా, నీలఖి హీరోయిన్గా నటించారు.నీలఖి తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టకముందే ఒడిశాలో తన ప్రతిభను చాటుకున్నారు. ఒడిశాలోని ప్రముఖ ఛానెల్ తరంగ్ టీవీ నిర్వహించిన ‘తరంగ్ సినీ ఉత్సవ్’ కార్యక్రమంలో ‘యంగ్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ - డెబ్యూ ఫీమేల్’ విభాగంలో నీలఖి అవార్డును గెలుచుకున్నారు. తెలుగు ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకుంటారని ‘బ్యూటీ’ టీమ్ గట్టి విశ్వాసంతో ఉంది.ఇప్పటికే విడుదలైన ‘బ్యూటీ’ సినిమా పోస్టర్లు, టీజర్లో నీలఖి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె నటనలో భావోద్వేగాలను అద్భుతంగా పండించారని టీమ్ గతంలోనే వెల్లడించింది. ‘బ్యూటీ’ చిత్రంతో నీలఖి తెలుగు సినిమా పరిశ్రమలోకి ఘనంగా అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.వానరా సెల్యులాయిడ్ బ్యానర్పై మారుతి టీమ్తో కలిసి జీ స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
పౌరాణికంలో 11 పాత్రలు .. ఆ రికార్డు నాదే: డా.లయన్ సాయి వెంకట్
లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "జయహో రామానుజ" (Jayaho Ramanuja ). ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర సాంగ్స్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ -పాన్ ఇండియా భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ, హిందీ, సంస్కృతంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారంటే ఇది చిన్న సినిమా అనకూడదు. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయడంలో మా వంతు సపోర్ట్ చేస్తాం. జయహో రామానుజ సాయి వెంకట్ కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – మన తెలుగు రాష్ట్రాల్లో రామానుజాచార్యుల గురించి పెద్దగా తెలియదు. కానీ తమిళనాట ప్రతి ఒక్కరికీ ఆయన ఎవరో తెలుసు. చినజీయర్ స్వామి సమతామూర్తి విగ్రహాన్ని మన దగ్గర ప్రధాని, రాష్ట్రపతి వంటి పెద్ద వాళ్లు వచ్చి ఆవిష్కరించినప్పుడు తెలుగు రాష్ట్రాల వారికి బాగా ఆయన గురించి తెలిసింది. తెలుగు ప్రజలకు రామానుజాచార్యుల వారి గొప్పదనం తెలియజేసే ప్రయత్నంలోనే ఈ చిత్రాన్ని రూపొందించాను. వెంకటేశ్వర స్వామికే గురువు లాంటి వారు రామానుజులు. వెంకటేశ్వరుడికి శంఖు చక్రాలు రామానుజాచార్యుల వారే బహూకరించారు. కమల్ హాసన్ గారు సోషల్ మూవీలో 10 పాత్రలు చేశారు. కానీ పౌరాణికంలో ఎవరూ 11 పాత్రల్లో నటించలేదు. నేను "జయహో రామానుజ" చిత్రంలో 11 పాత్రలు చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నా. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయండి అని మిత్రులు ఇచ్చిన సలహాతో తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ, హిందీ, సంస్కృతంతో పాటు మిగతా ప్రపంచ భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం’ అఅన్నారు.నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ – ముందుగా నాన్నకు బర్త్ డే విషెస్ చెబుతున్నా. "జయహో రామానుజ" వంటి భారీ చిత్రాన్ని నేను నిర్మించగలను అని నమ్మి నన్ను సపోర్ట్ చేస్తున్న నాన్నకు థ్యాంక్స్. ఆయన ప్రోత్సాహం లేకుంటే నేను ఈ సినిమా ప్రొడ్యూస్ చేసేదాన్ని కాదు. రాజమౌళి గారి సినిమాలు కూడా రిలీజ్ వాయిదా పడుతుంటాయి. క్వాలిటీ కోసం కొంత టైమ్ తీసుకోవడం మంచిదే. భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో జయహో రామానుజ చిత్రాన్ని నిర్మించాం. ఈ రోజు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని నిర్మించాను. త్వరలోనే మా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. మీరంతా మీ ఆదరణ చూపిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు -
హ్యాపీ డేస్ నటుడికి సర్జరీ.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ప్రాక్టీస్!
టాలీవుడ్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆదర్శ్ బాలకృష్ణ. తెలుగులో బిగ్బాస్ మొదటి సీజన్లో కంటెస్టెంట్ కూడా పాల్గొన్నారు. టాలీవుడ్లో పలు సినిమాల్లో తనదైన నటనతో ఆదర్శ్ బాలకృష్ణ అభిమానులను మెప్పించారు. గతంలో ఝాన్సీ వెబ్ సిరీస్తో అభిమానులను మెప్పించిన ఆదర్శ్.. ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఆయనతో దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.అయితే తాజాగా ఆదర్శ్ బాలకృష్ణ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సర్జరీ తొలి రోజు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసిన వీడియోను పంచుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ మొదటి రోజు చిన్నచిన్న కసరత్తులు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తానని పోస్ట్ చేశారు. అయితే ఇంతకీ ఆదర్శ్ బాలకృష్ణకు అసలేం జరిగిందో తెలియాల్సి ఉంది. మోకాలికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారా? లేదంటే మరేదైనా కారణాలున్నాయా? అనే వివరాలపై క్లారిటీ లేదు.సినీ కెరీర్ విషయానికొస్తే హ్యాపీ డేస్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత టాలీవుడ్ పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్లో మెప్పించారు. గత రెండేళ్లలో రంగమార్తాండ, శాకుంతలం, మిక్సప్ సినిమాలలో అభిమానులను అలరించారు. -
దర్శకుడితో నయనతార గొడవ.. ఆగిపోయిన సినిమా!
స్టార్ హీరోయిన్ నయనతార ( Nayanthara) ఈ మధ్య ఎక్కువ విమర్శలకు గురవుతుంది. రీసెంట్ గానే ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. మూకుత్తి అమ్మన్ 2 సినిమా పూజా కార్యక్రమాల్లో తోటి నటి మీనాను అవమానపరిచారు అంటూ ఆమెను ట్రోల్ చేశారు. తాజాగా నయనతారపై మరో పుకారు నెట్టింట హల్చల్ చేస్తోంది. మూకుత్తి అమ్మన్ 2 సినిమా సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్తో నయనతార గొడవపడిందట. ఇదే విషయంపై దర్శకుడు సుందర్.సీ, నయనతారల మధ్య విభేధాలు రావడంతో షూటింగ్ నిలిపివేసిట్లు తెలుస్తోంది.నయనతార హీరోయిన్గా సుందర్ సి దర్శకత్వంలో ‘మూకుతి అమ్మన్ 2’ (Mookuthi Amman 2) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా కాస్ట్యూమ్ విషయంలో నయనతార , ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మధ్య చిన్నపాటి వివాదం జరిగినట్లు సమాచారం. ఈ సంఘటన నయనతారకు నచ్చకపోవడంతో ఆమె ఆ అసిస్టెంట్ డైరెక్టర్ను తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. ఈ చిన్న విషయం కాస్త పెద్ద వివాదంగా మారడంతో దర్శకుడు సుందర్ సి షూటింగ్కు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు వినికిడి. నయనతార ప్రవర్తన సుందర్ సికి సంతృప్తి కలిగించకపోవడంతో, ఆమెను సినిమా నుంచి తొలగించి, మరో సీనియర్ నటిని తీసుకొని చిత్రాన్ని కొనసాగించాలనే ఆలోచన చేశాడట. అయితే నిర్మాత ఇషారి కె. గణేష్ జోక్యం చేసుకుని నయనతారతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారట. ప్రస్తుతం చెన్నైలోని ఓ దేవాలయంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.'మూకుత్తి అమ్మన్ 2' విషయానికొస్తే.. 2020లో సూపర్ హిట్గా నిలిచిన ‘మూకుత్తి అమ్మన్' సినిమాకు సీక్వెల్ ఇది. ‘మూకుత్తి అమ్మన్' చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా.. సీక్వెల్ని సుందర్.సి తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో నయనతారతో పాటు ఇనియా, రెజీనా కసెండ్రా, మైనా నందిని, దునియా విజయ్, సింగం పులి, యోగిబాబు లాంటి పెద్ద స్టార్స్ ఉన్నారు. ఈ సినిమాలో అమ్మన్ క్యారెక్టర్లో నటించడానికి నయనతార నెల రోజులకు పైగా ఉపవాసం ఉండి నటిస్తున్నారు. ఈ సినిమాకి హిప్ హాప్ ఆది మ్యూజిక్ డైరెక్టర్. -
'రాబిన్ హుడ్' టికెట్ రేట్ల పెంపు.. కొన్ని చోట్ల మాత్రమే
ఒకప్పటితో పోలిస్తే జనాలు ఇప్పుడు థియేటర్ కి రావడం బాగా తగ్గించేశారు. సమ్ థింగ్ డిఫరెంట్ లేదా మూవీ హిట్ అనిపించుకుంటేనే వస్తున్నారు. ఇలాంటి టైంలో ఈ వారం రాబోతున్న రెండు మీడియం బడ్జెట్ సినిమాల టికెట్ రేట్లు కూడా పెంచారు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. దీంతో ఓ నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: క్రికెటర్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్)ఈ శుక్రవారం నితిన్ 'రాబిన్ హుడ్', మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు రాబోతున్నాయి. వీటిపై ఓ మాదిరి హైప్ ఉంది. అలా అని ఇవేం భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్ తో తీసిన సినిమాలైతే కాదు. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు లేదు కానీ ఆంధ్రాలో మాత్రం సింగిల్ స్క్రీన్ కి రూ.50, మల్టీప్లెక్స్ కి రూ.75 పెంపు ఇచ్చారు. దీంతో ఈ సినిమాలకు పెంపు అవసరమా అనే కామెంట్స్ వినిపించాయి.దీంతో 'రాబిన్ హుడ్' నిర్మించిన మైత్రీ మూవీస్ ఓ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ అంతా టికెట్ రేట్ల పెంపు లేదని, కొన్నిచోట్ల మాత్రం ఈ రేట్స్ అమల్లోకి వస్తాయన చెప్పింది. వీళ్లు చెప్పిన దానిబట్టి వైజాగ్, విజయవాడ, తిరుపతి లాంటి కొన్నిచోట్ల మాత్రమే పెంపు ఉండొచ్చు. మిగిలిన చోట్ల సాధారణ ధరలే ఉండనున్నాయి.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య) -
'నాకు శ్రీలీల తప్పితే ఎవరూ నచ్చరు'.. వార్నర్ మామ తెలుగు ప్రాక్టీస్ చూశారా?
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రాబిన్హుడ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ అభిమానులను మెప్పించనున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా డేవిడ్ వార్నర్ సందడి చేశారు. అంతేకాదు తెలుగులోనూ ఏకంగా డైలాగ్స్ కూడా చెప్పి అలరించారు.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డేవిడ్ వార్నర్కు తెలుగు నేర్పించే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు నితిన్, శ్రీలీల. వార్నర్ మామకు తెలుగు నేర్పిద్దామని నితిన్ చెప్పారు. నాకు తెలుగు సినిమాలో నితిన్ అంటే పిచ్చి అని వార్నర్తో చెప్పించగా.. ఆ తర్వాత నాకు శ్రీలీల తప్పితే ఎవరూ నచ్చరు.. అంటూ వార్నర్తో శ్రీలీల తెలుగు ప్రాక్టీస్ చేయించారు. అయితే ఇదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముందు సరదాగా చేసినట్లు తెలుస్తోంది. ప్రీరిలీజ్ వేడుకకు ముందు డేవిడ్ వార్నర్కు తెలుగు నేర్పిస్తున్న ఈ వీడియోను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. Secret behind @davidwarner31's Telugu or actually not 😅Book your tickets for #Robinhood now!🎟️ https://t.co/ogblfmwZTd#RobinhoodTrailer TRENDING on YouTube.▶️ https://t.co/h2nhPhMrqEGRAND RELEASE WORLDWIDE ON MARCH 28th.@actor_nithiin @sreeleela14 @VenkyKudumula… pic.twitter.com/7rdEnEeoPT— Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2025 -
క్రికెటర్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్
సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. తిరిగి క్షమాపణలు చెబుతుంటారు. తాజాగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అలానే క్రికెటర్ వార్నర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీంతో వార్నర్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్.. బహిరంగంగా సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: స్టేజీపైనే స్టార్ సింగర్ కి అవమానం.. గో బ్యాక్ నినాదాలు)ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్.. నితిన్ హీరోగా నటించిన 'రాబిన్ హుడ్' మూవీతో నటుడిగా మారాడు. తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దీనికి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... వార్నర్ ని దొంగ ముం* కొడుకు అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. దీంతో ఈవెంట్ కి తాగొచ్చారా అని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. త్వరలో రిలీజ్ పెట్టుకుని ఇలాంటివి సరికాదని అర్థం చేసుకున్నారేమో రాజేంద్రప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పారు.తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధించలేదని, నితిన్- వార్నర్ తనకు పిల్లల్లాంటి వారని.. సరదాగా చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా ఇబ్బందిపడుంటే క్షమించమని రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)డేవిడ్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్#DavidWarner #RajendraPrasad #Robinhood pic.twitter.com/TxOFoaVdt3— Milagro Movies (@MilagroMovies) March 25, 2025 -
దేశానికి సేవ చేస్తున్నావా.. బిగ్ జోక్ : హీరోయిన్పై ట్రోలింగ్
బాలీవుడ్ బ్యూటీ మన్నారా చోప్రా (Mannara Chopra) ఇటీవల ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక సంఘటన వల్ల సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్కు గురైంది. ఆమె హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తూ, జైపూర్కు వెళ్లే ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో ఎక్కకుండా సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపించింది. ఈ విషయంపై ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో వీడియోలు పోస్ట్ చేసి, సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని, తన పేరు పిలవకపోవడంతో విమానం ఎక్కలేకపోయానని చెప్పింది. ఎయిర్పోర్ట్ సిబ్బందిపై కేకలు వేస్తూ, అరుస్తూ మన్నారా చోప్రా రచ్చ రచ్చ చేసింది. అదే సమయంలో పక్కనే ఉన్న మరో ప్రయాణికురాలు ఆమెకు మద్దతు పలుకుతూ..‘ఆమె పెద్ద సెలబ్రిటీ, దేశానికి సేవ చేస్తోంది’.. మీరు ఇలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించింది. మన్నారా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కొంతమంది ఆమెకు మద్దతు తెలిపిస్తే.. మరికొంతమంది విమర్శిస్తున్నారు. ‘ఎయిర్లైన్ నిబంధనల ప్రకారం బోర్డింగ్ 30 నిమిషాల ముందు మూసివేస్తారు, ఆమె సకాలంలో రాకపోతే సిబ్బందిని నిందించడం సరికాదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరు "ఆమె దేశానికి సేవ చేస్తోందని చెప్పడం హాస్యాస్పదం" అని, "ఇంత పెద్ద సెలబ్రిటీ ఎవరు? ఆమె ఏ సినిమాల్లో నటించింది?" అంటూ ఎగతాళి చేశారు. ‘ఇండిగో తరచూ ఇలాంటి పొరపాట్లు చేస్తుంది’ అని కొంతమంది, చాలా మంది ఆమె ప్రవర్తనను ‘అతిగా ఉంది’ అని ట్రోల్ చేస్తున్నారు.మన్నారా చోప్రా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ భాషల సినిమాల్లో నటించింది. తెలుగులో "ప్రేమ గీమ జాంత నై" చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత సునీల్తో "జక్కన్న", సాయి ధరమ్ తేజ్తో "తిక్క" వంటి సినిమాల్లో నటించింది. అలాగే "రోగ్" మరియు "సీత" చిత్రాల్లో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ఇద్దరు లెజండరీ పర్సన్స్ క్రియేట్ చేసిన సాంగ్.. చూశారా
'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి నటించిన చిత్రం 'షష్టి పూర్తి'.. తాజాగా ఈ మూవీ నుంచి ఒక మెలోడీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఎన్నో పాటలకు మ్యూజిక్ అందించడమే కాకుండా రచయితగా కూడా కీరవాణి గుర్తింపు తెచ్చకున్నారు. అయితే, ఈ సినిమాతో తొలిసారి ఇళయరాజా సంగీతంలో ఆయన ఈ సాంగ్ను రచించడం విశేషం. ‘షష్టిపూర్తి’ సినిమాలో రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా.. రాజేంద్ర ప్రసాద్, అర్చన మరో జోడీగా నటించారు. ఈ మూవీని పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. ‘లేడీస్ టైలర్’ తర్వాత ఈ చిత్రంలో వారిద్దరూ మరోసారి నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తికలిగించేలా ఉంది. తాజాగా విడుదలైన సాంగ్ రూపేష్, ఆకాంక్షా సింగ్ మధ్యే ఉంటుంది. మంచి లవ్ ట్రాక్తో పాటు చక్కటి మెలోడీనిచ్చేలా పాట ఉంది. -
యాడ్కి, సినిమాకి ఒకే రెమ్యునరేషన్..సుహాస్ ఏమన్నారంటే..?
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న హీరో సుహాస్. ఒకవైపు సహాయక నటుడి పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు హీరోగాను రాణిస్తున్నాడు. జూనియర్ ఆర్టాస్ట్గా కేరీర్ ఆరంభించి..ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్లో ఎదిగినట్లుగానే తన రెమ్యునరేషన్ని కూడా పెంచేశాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్టర్ ఒక్కో సినిమాకు రూ. 2.5 నుంచి రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే రెమ్యునరేషన్ గురించి మీడియా అడిగిన ప్రతిసారి హాస్యాస్పదంగా స్పందిస్తూ తప్పించుకుంటున్నాడు. అయినా కూడా మీడియా ప్రతినిధులు మాత్రం సుహాస్ రెమ్యునరేషన్ గురించి ప్రతి ప్రెస్మీట్లోనూ అడుగుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి సుహాస్కు మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురవ్వగా.. ‘ఏం టార్చర్ ఇది.. యాక్టింగ్ గురించి మానేసి నా రెమ్యూనరేషన్ గురించి ఎందుకు,’ అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు.సుహాస్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓ భామ అయ్యో రామ'.తాజాగా ఈ మూవీ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘యాడ్కి, సినిమాకే ఒకే రకమైన రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట కదా?’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దానికి సుహాస్ సమాధానం చెబుతూ.. ‘ప్రతిసారి నా రెమ్యునరేషన్ గురించే అడుగున్నారు? ఏం టార్చర్ అయిపోయింది ఇది.. జీవితమో..(నవ్వుతూ..). మీరు అనుకున్నంత కాదు కాని మంచిగానే ఇచ్చారు. ఇదేంటో.. యాక్టింగ్ బాగా చేస్తాననేది వదిలేసి..రెమ్యునరేషన్ భారీగా తీసుకుంటున్నారనేదే ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు’అని సుహాస్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడంటూ వస్తున్న వార్తలో నిజం లేదని, తనకు ఇప్పటివరకు ఆ మూవీ టీమ్ నుంచి కాల్ రాలేదని స్పష్టం చేశాడు.ఇక ‘ఓ భామ అయ్యో రామ’ విషయానికొస్తే.. సుహాస్ నటిస్తున్న తొలి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. -
'రాబిన్హుడ్' టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతి
టాలీవుడ్ హీరో నితిన్(Nithiin), శ్రీలీల( Sreeleela) జోడీగా నటించిన చిత్రం 'రాబిన్హుడ్'(Robinhood).. ఉగాది కానుకగా మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ టికెట్ల ధరలను పంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించారు. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. గతంలో భీష్మ సినిమాతో నితిన్ - వెంకీ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రాబిన్హుడ్ కూడా భారీగా క్లిక్ అవుతుందని ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.రాబిన్హుడ్ చిత్ర మేకర్స్కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 28 నుంచి ఏడు రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్లో ఒక్కో టికెట్పై రూ.50 , మల్టీప్లెక్స్ లలో టికెట్కు రూ.75 ధరను అదనంగా పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. జీఎస్టీతో కలిపే ఈ ధరలు ఉంటాయని అందులో పేర్కొంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.రేట్లు పెంపు సరే.. తేడా వస్తే..భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రమే గతంలో టికెట్ల రేట్లు పెంపునకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేవి. అయితే, ఇప్పుడు మీడియమ్ బడ్జెట్ చిత్రాలకు కూడా ఇలా రేట్లు పెంచడం ఏంటి అంటూ విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి సమయంలో గేమ్ ఛేంజర్, డాకూమహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలకు టికెట్ ధరలు పెంచారు. అయితే, ప్రేక్షకులు థియేటర్స్కు వెళ్లడం బాగా తగ్గిపోయింది. దీంతో వెంటనే ఆ ధరలను మళ్లీ తగ్గించేశారు. ఇప్పుడు రాబిన్హుడ్ చిత్రానికి టికెట్ ధరలను పెంచాలనే నిర్ణయం సరైంది కాదని విమర్శలు ఉన్నాయి. సినిమా బాగుందని టాక్ వస్తే సరే.., ఒకవేళ మిక్స్డ్ టాక్ వస్తే మాత్రం రిస్క్ తప్పదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ధరల పెంపు వల్ల థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది. రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉండకపోవచ్చని చెప్పవచ్చు. -
మరోసారి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
నటి అమీ జాక్సన్ మరోసారి తల్లయ్యారు. రెండోసారి కూడా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె వెల్లడించారు. 2019లో జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసిన అమీ జాక్సన్.. వారి ప్రేమకు గుర్తుగా 'ఆండ్రూ' అనే బాబుకు జన్మనిచ్చారు. ఆయనతో విడిపోయిన తర్వాత హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ (Ed Westwick)ను నటి అమీ జాక్సన్ (Amy Jackson) ప్రేమించి గత ఏడాదిలో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఈ దంపతులకు జన్మించిన బిడ్డకు 'ఆస్కార్ అలెగ్జాండర్' అని నామకరణం చేశారు.చిత్రపరిశ్రమలో ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అమీ జాక్సన్ సుపరిచితమే అని తెలిసిందే. ఆమె కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ పెళ్లికాకుండానే 'ఆండ్రూ' అనే కుమారుడికి మొదట జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత 2020లో పెళ్లి చేసుకుంటామని వారు ప్రకటించారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అది కాస్త వాయిదా పడింది. ఇంతలో వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ను ప్రేమించి 2024లో వివాహ బంధంలోకి ఆమె అడుగు పెట్టారు. ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లిగా ఆమె జీవిత ప్రయాణం సంతోషంగా ఉంటుందని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ed Westwick (@edwestwick) -
సినిమాల్లో నటించడంపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినీరంగంలో కొనసాగుతారా..? మళ్లీ కొత్త సినిమాలు చేస్తారా..? అని అభిమానుల్లో చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ విషయంపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం రావడం కష్టమేనని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, ఈ మూడు సినిమాల కోసం పవన్ ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారు. దీంతో నిర్మాతలకు బడ్జెట్ పెరిగి తలనొప్పిగా మారిందని కూడా చెబుతున్నారు.తమిళ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. తనకు డబ్బు అవసరం ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటానని చెప్పారు. అయితే, తాను సినిమా నిర్మాణరంగంలో మాత్రం భాగం కానన్నారు. 'నాకు ఉన్న ఏకైకా ఆదాయమార్గం నటన మాత్రమే.. నాకు డబ్బు అవసరం ఉన్నంతవరకూ నటిస్తూనే ఉంటాను.' అని పవన్ అన్నారు. 2020 ముందు వరకు పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ కేవలం రూ. 15 కోట్ల లోపు మాత్రమే అని ఇండస్ట్రీలో చెబుతున్న మాట.. అయితే, వకీల్సాబ్ సినిమా నుంచి ఆయన రూ. 50 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీలో ట్విస్ట్ ఇచ్చిన ధనుష్.. తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
కోలీవుడ్ స్టార్ హీరో డైరెక్ట్ చేసిన ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో తమిళ్ వర్షన్ అందుబాటులో ఉంది. అయితే, తెలుగు స్ట్రీమింగ్ గురించి మేకర్స్ ప్రకటించలేదు. ఈ క్రమలో తాజాగా సింప్లీ సౌత్ ఓటీటీ సంస్థ ఈ మూవీ తెలుగు రైట్స్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది తెలుపలేదు. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్లోకి వచ్చేసింది. అయితే, రీసెంట్గా తమిళ్ వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి త్వరలో తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వస్తుందని అందరూ ఆశించారు. కానీ, తెలుగు స్ట్రీమింగ్ మాత్రం సింప్లీ సౌత్ ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇండియాలో ఈ ఓటీటీ సంస్థకు అనుమతి లేదు. కానీ, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు అందరూ ఈ చిత్రాన్ని సింప్లీ సౌత్ ఓటీటీలో చూడొచ్చు. కొద్దిరోజుల తర్వాత అమెజాన్, ఆహాలో ఈ సినిమా అందుబాటులోకి రావచ్చని సమాచారం ఉంది. -
పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత
తమిళనాడుకు చెందిన కోలీవుడ్ నటుడు, కరాటే మాస్టర్ షిహాన్ హుస్సేని (60) అనారోగ్యంతో కన్నుమూశారు. కోలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన ఆయనకు మంచి గుర్తింపే ఉంది. మార్షల్ ఆర్ట్స్లో చాలామందికి శిక్షణ ఇచ్చిన షిహాన్ హుస్సేనికి ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు. పవన్ కల్యాణ్, దళపతి విజయ్ ఇద్దరూ కూడా ఆయన వద్దే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా పవన్ ఆయన వద్దే మార్షల్ ఆర్ట్స్తో పాటు కరాటే, కిక్ బాక్సింగ్లో శిక్షణ తీసుకున్నారు.కొన్ని నెలలుగా షిహాన్ హుస్సేని బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. అయితే, తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని అందుకోసం తను నిర్మించుకున్న మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రాన్ని అమ్మేస్తున్నట్లు ఆయన చెప్పాడు. దానిని తన శిష్యుడు పవన్ కల్యాణ్ కొనుగోలు చేస్తే సంతోషిస్తానని ఆయన చివరగా కోరాడు. తన వేదన పవన్ వరకు వెళ్తే తప్పకుండా సాయం చేస్తాడని కూడా షిహాన్ హుస్సేని ఆశించాడు. ఆయన అభ్యర్తన పవన్ కల్యాణ్ వరకు చేరిందో లేదో తెలియదు. ఇప్పుడు షిహాన్ హుస్సేని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన వద్ద శిక్షణ పొందిన కొందరు శిష్యులు మాట్లాడుతూ.. మాస్టర్ చివరి కోరిక తీరకుండా వెళ్లిపోయారని వాపోతున్నారు.పదిరోజుల క్రితం పవన్ను అభ్యర్థించిన షిహాన్ హుస్సేనికొద్దిరోజుల క్రితం షిహాన్ హుస్సేన్ తన శిష్యుడు పవన్ కల్యాణ్ తన శిక్షణా కేంద్రాన్ని కొనమని కోరారు. ఈ క్రమంలో పవన్తో కొన్ని విషయాలను పంచుకున్నారు ' నా వద్ద శిక్షణ తీసుకుంటున్న సమయంలో అతనికి పవన్ అని పేరు పెట్టాను. ఈ మాటలు అతని చెవులకు చేరితే అతను తప్పకుండా స్పందిస్తాడని తెలుసు. అతను ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రాన్ని కొనుగోలు చేసి భవిష్యత్ తరాల కోసం నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. అతను ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అని నాకు తెలుసు. కానీ, అతను నా దగ్గర శిక్షణ పొందిన రోజులు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. శిక్షణా కేంద్రాన్ని శుభ్రం చేయడమే కాదు.. ప్రతిరోజు నాకు టీ అందించే వాడు కూడా.. మార్షల్ ఆర్ట్స్ ను దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలని ఇద్దరమూ మాట్లాడుకునే వాళ్లం. ఇప్పుడు దానిని పవన్ పూర్తి చేస్తాడని ఆశిస్తున్నాను.' అని హుస్సేని అన్నారు. ఈ శిక్షణ కేంద్రాన్ని వాణిజ్య సముదాయంగా లేదా నివాస అపార్ట్మెంట్గా మార్చే వ్యక్తికి అమ్మే బదులు, ఇది తన వారసత్వాన్ని సజీవంగా ఉంచడంలో సహాయపడుతుందని ఆయన నమ్మారు. ఆర్చరీలోనూ షిహాన్ హుస్సేని శిక్షణ ఇచ్చాడు. మార్షల్ ఆర్ట్స్ సుమారు 10 వేల మందికి పైగా ఆయన వద్ద ట్రైన్ అయ్యారు.. ఆర్చరీలో 1000 మందికి పైగా విద్యార్థులను ఆయన తయారు చేశారు.పవన్ కల్యాణ్ స్పందనమార్షల్ ఆర్ట్స్లో తనకు శిక్షణ ఇచ్చిన షిహాన్ హుస్సేని మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి సమయంలో హుస్సేని కుటుంబ సభ్యులకు మరింత బలాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వద్ద కరాటేలో శిక్షణ పొందానని పవన్ చెప్పుకొచ్చారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారనే వార్త తనకు తెలిసిందని, ఈనెల 29న ఆయన్ని పరామర్శించడానికి చెన్నై వెళ్లాలనుకున్నానని ఆయన అన్నారు. ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు. -
ఆస్కార్ దర్శకుడిపై దాడి.. ఆచూకీ కూడా గల్లంతు
అస్కార్ అవార్డ్ గ్రహిత దర్శకుడు హమ్దాన్ బల్లాల్పై ఇజ్రాయెల్ స్థిరనివాసులు దాడి చేశారు. 'నో అదర్ ల్యాండ్' డాక్యుమెంటరీ చిత్రానికి ఆయన కో-డైరెక్టర్గా పనిచేశారు. ఈ చిత్రం విడుదల సమయంలో ఇజ్రాయెల్తో పాటు చాలా విదేశాల్లో ఉన్న ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. పాలస్తీనాకు చెందిన బల్లాల్ ఈ సినిమాలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా చూపారు. దీనిని వారు జీర్ణించుకోలేకపోయారు. ఆయనపై దాడి చేస్తామని గతంలోనే వారు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కొన్నేళ్లుగా హింస జరుగుతున్న నేపథ్యంలో 'నో అదర్ ల్యాండ్' అనే డాక్యుమెంటరీతో దర్శకుడు హమ్దాన్ బల్లాల్ సంచలనం రేపాడు. దీంతో ఆగ్రహం చెందిన ఇజ్రాయెల్లోని వలసదారులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. కారులో వెళ్తున్న బల్లాల్ను అడ్డగించిన ఇజ్రాయెల్ స్థిరనివాసులు సుమారు 20 మంది ముసుగులు ధరించి రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. ఆపై ఇజ్రాయెల్ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుందని సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు చెప్పినట్లు ఆయన మిత్రుడు యువల్ అబ్రహం తెలిపారు. తీవ్రంగా గాయపడిన బల్లాల్ తల నుంచి అధిక రక్తస్రావం అవుతుందని ఆయన పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు అతని ఆచూకి ఎక్కడ ఉందో తెలియదని ఆయన చెప్పుకొచ్చాడు. -
నన్ను దెబ్బ కొట్టేందుకు వాళ్లు కోట్లు ఖర్చు పెట్టారు: పూజా హెగ్డే
హిందీ, తెలుగు, తమిళం అంటూ అన్ని ఇండస్ట్రీలలో పరుగులు పెడుతున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే( Pooja Hegde). మొదట్లో మాతృభాషలో నటించడం ప్రారంభించిన ఈ మరాఠీ బ్యూటీ ఆ తరువాత హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్నారు. అయితే ప్రతి విజయం వెనుక కఠిన శ్రమ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఎన్నో అవమానాలు, బాధలు, మనస్థాపం వంటి చేదు అనుభవాలు ఉంటాయి. ఇందుకు నటి పూజా హెగ్డే అతీతం కాదు. తెలుగులో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్తో బీస్ట్ చిత్రంలో జత కట్టారు. ప్రస్తుతం నటుడు సూర్య సరసన నటించిన రెట్రో చిత్రం మే 1వ తేదీన తెరపైకి రానుంది. కాగా తాజాగా విజయ్కి జంటగా మరోసారి జననాయకన్ చిత్రంలో నటిస్తున్నారు. నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్కు జంటగా కాంచన 4 లో నటిస్తున్నారు.కాగా అగ్ర కథానాయకి రాణిస్తున్న పూజా హెగ్డే తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. తన గురించి సామాజిక మాధ్యమాల్లో ఎన్నో రకాలుగా ట్రోలింగ్స్ చేశారన్నారు. అవి తన కుటుంబాన్ని చాలా బాధించాయని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంకో విషయం ఏమిటంటే నటిగా తన ఎదుగుదలను దెబ్బ కొట్టాలని కొందరు కోట్ల రూపాయలు ఇచ్చి ట్రోలింగ్స్ చేయించారని అర్ధం అయ్యిందన్నారు. అయితే, తనపై వచ్చిన ట్రోలింగ్ చూసి తల్లిదండ్రులు బాధపడినట్లు ఆమె చెప్పారు. ఆ ట్రోలింగ్ ఆపేయాలన్నా డబ్బు చెల్లించాలని తనను కొందరు కోరారని ఆమె తెలిపారు. అయితే, తానెవరికీ ఎలాంటి చెడు చేయలేదని, అయినా తనపై ఎందుకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. అయితే కొంత కాలం తర్వాత అలాంటి ట్రోలింగ్స్ను పట్టించుకోవడం వదిలేశానని పూజా హెగ్డే చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల పైనేనని నటి పూజా హెగ్డే పేర్కొన్నారు. -
హారర్ కామెడీ షురూ
వరుణ్ తేజ్ హీరోగా ‘వీటీ 15’(వర్కింగ్ టైటిల్) సినిమా షురూ అయింది. రితిక నాయక్ హీరోయిన్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లోప్రారంభమైంది.‘‘ఇండో–కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతోన్న చిత్రం ‘వీటీ 15’. సోమవారం నుంచే హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ప్రారంభించాం. వరుణ్ తేజ్ సరికొత్త పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
మా కెరీర్లో రాబిన్ హుడ్ బెస్ట్: వెంకీ కుడుముల
‘‘అవసరం ఉన్న వారి కోసం నిలబడే హీరో ‘రాబిన్హుడ్’. మా చిత్ర కథకి ఈ టైటిల్ యాప్ట్. ఈ మూవీ చాలా వైవిధ్యంగా ఉంటుంది. మంచి సందేశం కూడా ఉంటుంది. నితిన్, నా కెరీర్లో ‘రాబిన్ హుడ్’ బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇది’’ అని డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘భీష్మ’ సినిమా తర్వాత చిరంజీవిగారి కోసం ఒక కథ అనుకున్నాను. ఆయనకి ఫస్ట్ ఐడియా చెప్తే చాలా ఎగై్జట్ అయ్యారు. అయితే ఎక్కడో ఓ దగ్గర చిరంజీవిగారిని సంతృప్తి పరచలేకపోయాను. దీంతో మరో కథతో వస్తానని ఆయనకి చెప్పాను. కచ్చితంగా చిరంజీవిగారితో సినిమా చేస్తాను. నేను చెప్పిన ‘రాబిన్ హుడ్’ ఐడియా నితిన్కి నచ్చింది. ‘భీష్మ’ సినిమాతో నాకు, నితిన్కి మధ్య మంచి బంధం ఏర్పడింది. మైత్రీ మూవీ మేకర్స్ రాజీ పడకుండా సినిమాని నిర్మించారు’’ అని తెలిపారు.వార్నర్ సరదాగా తీసుకున్నారుఇదిలా ఉంటే... ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ గురించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మీ అబీప్రాయం ఏంటి? అని వెంకీని అడిగితే... ‘‘ఫంక్షన్ అయిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్గారి మాటలకు అర్థం ఏమిటనేది నేను వార్నర్గారికి చెప్పాను. ఆయన నవ్వి.. క్రికెట్లో కూడా ఇలాంటివి సహజమే అన్నారు. సీనియర్ ఆర్టిస్టుగా రాజేంద్ర ప్రసాద్గారు తన కోస్టార్స్ని చిన్న పిల్లల్లా అనుకుని, అలా సరదాగా అంటుంటారు. వార్నర్గారిని కూడా అలా సరదాగా అన్నారు’’ అని పేర్కొన్నారు. -
శివభక్తుడిగా మారిపోయా: విష్ణు మంచు
‘‘నేను ఆంజనేయస్వామి భక్తుడిని. కానీ ‘కన్నప్ప’ సినిమా ప్రయాణంతో శివభక్తుడిగా మారిపోయాను. మా చిత్రం అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని విష్ణు మంచు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూపొందిన సినిమా ‘కన్నప్ప’. మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. కాగా హైదరాబాద్లో జరిగిన ‘రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘కన్నప్ప’ యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్రని ఆడియన్స్ ఎంత ఊహించుకున్నా.. అంతకుమించి ఉంటుంది’’ అని తెలిపారు.‘‘2016 జనవరిలో నేను శ్రీకాళహస్తికి వెళ్లి శివుణ్ణి దర్శించుకున్నాను. ఆ శివుడే నన్ను ‘కన్నప్ప’ప్రాజెక్ట్లోకి పంపించాడు. అదే శివ లీల’’ అని చెప్పారు ముఖేష్ కుమార్ సింగ్. బ్రహ్మాజీ, రఘుబాబు పాల్గొన్నారు. -
'చనిపోయిన వాళ్లు మళ్లీ తిరిగొస్తారా?'.. ఆసక్తిగా 28 డిగ్రీల సెల్సియస్ ట్రైలర్
నవీన్ చంద్ర, షాలిని జంటగా నటించిన చిత్రం '28 డిగ్రీస్ సెల్సియస్'(28°C Movie). ఈ చిత్రానికి పొలిమేర సిరీస్ చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ కరోనాకు ముందే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా హైదరాబాద్లో ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించారు.ట్రైలర్ చూస్తే హారర్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక అమ్మాయిని 28 డిగ్రీల సెల్సియస్లోనే కాపాడుకునే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ట్రైలర్లో సీన్స్ చూస్తే ఓ ఇంటి చుట్టే ఈ కథ తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించారు. -
గేమ్ ఛేంజర్లో ఛాన్స్.. ఎలా వచ్చినా నాకైతే గర్వంగా ఉంది: నవీన్ చంద్ర
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర నటించిన చిత్రం '28 డిగ్రీ సెల్సియస్'. ఈ మూవీకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో షాలిని హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. కరోనాకు ముందే రావాల్సిన ఈ మూవీ పలు కారణాలతో వాయిదా పడింది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన హీరో నవీన్ చంద్ర గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ చిత్రంలో అవకాశం రావడంపై ఆయన మాట్లాడారు. అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వపడతానని నవీన్ చంద్ర అన్నారు. నన్ను ఎలా సెలెక్ట్ చేసినప్పటికీ ఆ మూవీ చేయడం నా కెరీర్లో ఓ గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు.నవీన్ చంద్ర మాట్లాడుతూ..'పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా.. అందరు ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకుని గేమ్ ఛేంజర్ తీశారు. నేను బళ్లారి నుంచి వచ్చా. అలాంటి పెద్ద సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వంగా ఉంది. ఫలితం పక్కనపెడితే ఆ బిగ్గెస్ట్ బడ్జెట్.. బిగ్గెస్ట్ స్టార్ సినిమాలో ఛాన్స్ రావడమే చాలా గొప్పగా ఫీలయ్యా. నేను కొత్తవారితోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంటాను. అయితే నేను చేసిన మొదటి పెద్ద సినిమా నేను లోకల్.. ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవ. మధ్యలో ఎక్కువగా చిన్న చిన్న బడ్జెట్ చిత్రాలే చేశా. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్కు వాళ్లు ఎలా సెలెక్ట్ చేసినా శంకర్ సార్తో, దిల్రాజ్ ప్రొడక్షన్లో వర్క్ చేయాలనే లక్ నాకు ఉంది. అందుకే గేమ్ ఛేంజర్లో అవకాశం వచ్చింది' అని అన్నారు. -
కూర్చునే నిహారిక డ్యాన్స్.. కొత్త కారుతో తెలుగు యాంకర్
కాస్ట్ లీ బెంజ్ కారు కొన్న తెలుగు యాంకర్ సోనియాబేబీ బంప్ ఫొటోలతో యూట్యూబర్ మహాతల్లిచీరల మెరుపు తీగకంటే సన్నగా జ్యోతిరాయ్చెన్నై మ్యాచ్ చూసేందుకు వచ్చిన యషికా-పార్వతిడార్క్ చాక్లెట్ లా మెరిసిపోతున్న అదితీ రావ్ హైదరీగాయం తాలుకు జ్ఞాపకాల్ని పంచుకున్న అన్షుబాలిలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న నటి నవ్య స్వామి View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by SONIYA SINGH (@soniya_singh31) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
జపాన్లో దేవర ఫీవర్.. ఆయుధ పూజ సాంగ్కు ఫ్యాన్స్ స్టెప్పులు
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన ఫుల్ యాక్షన్ మూవీ దేవర పార్ట్-1. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే మన టాలీవుడ్ సినిమాలకు జపాన్లో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను జపాన్లోనూ విడుదల చేయనున్నారు. ఇప్పటికే మన యంగ్ టైగర్ జపాన్ చేరుకుని ప్రమోషన్లతో బిజీ అయిపోయారు. తాజాగా అక్కడి ఫ్యాన్స్తో కలిసి ఓ థియేటర్లో సందడి చేశారు.ఈ సందర్భంగా దేవర మూవీలోని ఆయుధ పూజ సాంగ్కు జపాన్ ఫ్యాన్స్ డ్యాన్స్ చేశారు. వారితో కలిసి మన జూనియర్ ఎన్టీఆర్ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను దేవర టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. దేవరను మార్చి 28న జపాన్లో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో దేవర-2 కూడా ఉంటుందని డైరెక్టర్ కొరటాల ఇప్పటికే ప్రకటించారు.#Devara fever grips Japan! 🌊🔥Man of Masses #NTR stuns the Japanese audience as he grooves to Ayudha Pooja with a fan! 🤙🏻@tarak9999 #デーヴァラ #KoratalaSiva @anirudhofficial @devaramovie_jp pic.twitter.com/y9ybqaAYsT— Devara (@DevaraMovie) March 24, 2025┼─映画『#デーヴァラ』ジャパンプレミア@新宿ピカデリー🔱┼─1日目 無事に終わりました🦈サプライズゲストで登場した#キンタロー 。さんと#NTRJr がダンス🕺✨お越しいただいたみなさま、ありがとうございました❗️ pic.twitter.com/QvMutZAyYB— 【公式】映画『デーヴァラ』 (@devaramovie_jp) March 24, 2025 -
నెల క్రితం గాయం.. 'మన్మథుడు' హీరోయిన్ కి ఏమైంది?
'మన్మథుడు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అన్షు (Anshu Sagar).. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లండన్ లో సెటిలైపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి తెలుగు సినిమా చేసింది. అదే 'మజాకా' (Mazaka Movie). ఈ మూవీ థియేటర్లలో సరిగా ఆడలేదు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ టైంలో అన్షు.. నుదుటిపై ప్లాస్టర్ తో కనిపించింది. ఏం జరిగిందా అనుకున్నారు గానీ ఈమె చెప్పకపోవడంతో ఎవరూ దీని గురించి అడగలేదు.(ఇదీ చదవండి: 'సలార్' విలన్ కి కారు ఈఎంఐ కష్టాలు)ఇప్పుడు స్వయంగా అన్షునే తనకు గాయమైన విషయాన్ని బయటపెట్టింది. దాదాపు నెల క్రితం ఊహించని విధంగా గాయపడ్డానని చెప్పింది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ప్రేమ వల్ల ప్రస్తుతం కోలుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్లాస్టర్ కెమెరాల కోసం పెట్టుకున్నది కాదని, అది నిజమేనని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.నుదుటిపై పెద్ద గాయం కావడంతో ఆస్పత్రికి అన్షు వెళ్లడంతో కుట్లు వేశారు. తర్వాత దానిపై ప్లాస్టర్ పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని.. వీడియోగా చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలాంటి గాయాలు తనని ఆపలేవని, మరింత బలంగా బౌన్స్ బ్యాక్ అవుతానని అన్షు చెప్పుకొచ్చింది. మజాకా మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది గానీ ఇదేమంత పెద్దగా ఆడకపోవడంతో తిరిగి లండన్ వెళ్లిపోయింది.(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) -
రికార్డ్ మార్క్ దాటేసిన 'కోర్ట్' కలెక్షన్స్
కొన్నిసార్లు అదృష్టం కలిసొచ్చి చిన్న సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. రెండు మూడు రెట్ల లాభాలు గడించేస్తుంటాయి. అలా రీసెంట్ టైంలో 'కోర్ట్' మూవీ సూపర్ హిట్ అయింది. నాని నిర్మించిన ఈ చిత్రం ఊహించని వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఓ రికార్డ్ మార్క్ చేరుకుంది.(ఇదీ చదవండి: బాలీవుడ్ నిర్మాతల పరువు తీసేసిన హిందీ స్టార్ హీరో)కేవలం రూ.9-10 కోట్లతో నిర్మించిన కోర్ట్ మూవీ.. రిలీజ్ కి ముందు ఓటీటీ డీల్ పూర్తయింది. అలా సేఫ్ జోన్ లోకి వెళ్లింది. ఇక థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రీమియర్ల నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి వీకెండ్ లోనే లాభాల్లోకి వెళ్లిపోయిన ఈ చిత్రం.. 10 రోజుల్లో రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.మైనర్ బాలికల రక్షణ కోసం ఉన్న పోక్సో చట్టం బ్యాక్ డ్రాప్ స్టోరీతో కోర్ట్ మూవీ తీశారు. మంగపతిగా శివాజీ, లాయర్ గా ప్రియదర్శి చేయగా.. టీనేజీ ప్రేమికులుగా హర్ష రోషన్, శ్రీదేవీ ఆకట్టుకున్నారు. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. మరి ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారనేది చూడాలి?(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు) -
'సలార్' విలన్ కి కారు ఈఎంఐ కష్టాలు
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అనగానే కోట్ల రూపాయల రెమ్యునరేషన్, లగ్జరీ లైఫ్.. ఇవే మన కళ్ల ముందు కనిపిస్తాయి. కానీ తాను కూడా కారుకి ఈఎంఐ కడుతున్నానని సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చాడు. ఎల్ 2 ఎంపూరన్ మూవీ ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశాడు. అలానే డైరెక్షన్ అనేది తన తెలివి తక్కువ నిర్ణయమని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బాలీవుడ్ నిర్మాతల పరువు తీసేసిన హిందీ స్టార్ హీరో)'నాకు డబ్బు సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ కారు ఈఎంఐ కడుతున్నాను. దర్శకత్వం చేయడం ఆర్థికంగా నేను తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయం. ఎందుకంటే ‘ఎల్-2: ఎంపురాన్’ కోసం రెండేళ్లు అయిపోయింది. ఆ టైంలో నటుడిగా ఎన్నో సినిమాలు పక్కనబెట్టేశా. అవి చేసుంటే బోలెడు డబ్బులు సంపాదించేవాడిని. అలా అని ఎప్పుడూ డబ్బు కోసం సినిమాలు చేయలేదు. కానీ యాడ్స్ మాత్రం చేశాను. రెండు గంటల యాడ్ షూటింగ్ లో పాల్గొంటే చాలా డబ్బులిచ్చేవారు. కానీ నేను ప్రమోట్ చేసే ఉత్పత్తుల విషయంలో మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడిని' అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.మోహన్ లాల్ ని హీరోగా పెట్టి ‘ఎల్-2: ఎంపురాన్’ సినిమా తీసిన పృథ్వీరాజ్.. గతంలో సలార్ మూవీలో చేశాడు. ప్రస్తుతం రాజమౌళి-మహేశ్ బాబు ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరిన్ని సినిమాలు చేసేందుకు ఇతడికి ఆఫర్స్ వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం లాంబోర్గిని అనే ఖరీదైన కారు కొన్నాడు. దానికే ఈఎంఐ కడుతున్నానని ఇప్పుడు చెప్పాడు.(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు) -
బౌలర్గా శ్రీలీల .. బ్యాట్స్మెన్గా ఎవరంటే?.. రాబిన్హుడ్ టీమ్ ప్రకటించిన నితిన్!
టాలీవుడ్ హీరో నితిన్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వెంకీ కుడుముల డైరెక్షన్లో వస్తోన్న రాబిన్హుడ్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కాంబోలో భీష్మ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా డేవిడ్ వార్నర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నితిన్కు యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. రాబిన్హుడ్ టీమ్ నుంచి క్రికెట్ జట్టును తయారు చేయాలంటే ఎవరూ దేనికి సూట్ అవుతారో చెప్పాలంటూ హీరోను అడిగింది. దీనికి నితిన్ స్పందిస్తూ.. మా క్రికెట్ టీమ్లో శ్రీలీల బౌలర్.. ఎందుకంటే ఆమె వయ్యారంగా బౌలింగ్ చేస్తే ఎవరైనా అవుట్ కావాల్సిందే.. వికెట్ కీపర్గా మా మైత్రి నిర్మాత రవిశంకర్.. అంపైర్గా వెంకీ కుడుముల.. బ్యాట్స్మెన్గా నేనే.. మా టీమ్లో క్యాచ్లో పట్టేది నవీన్.. మా టీమ్ ఓనర్గా డేవిడ్ వార్నర్ అంటూ ఫన్నీగా తమ రాబిన్హుడ్ టీమ్ను ప్రకటించారు. -
వికటకవి సిరీస్కు ఉత్తమ దర్శకుడిగా ప్రదీప్.. ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉందంటే?
హిందూస్తాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 (OTTPlay Awards 2025) మూడవ ఎడిషన్ మార్చి 22న ముంబైలో ఘనంగా జరిగింది. అపరశక్తి ఖురానా, కుబ్రా సైత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు దక్కాయి. 'డిస్పాచ్' సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా మనోజ్ బాజ్పాయ్, 'భామ కలాపం 2' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ప్రియమణి, 'ది రాణా దగ్గుబాటి షో'తో ఉత్తమ టాక్ షో హోస్ట్గా రానా దగ్గుబాటితో సహా పలువురికి అవార్డులు ప్రదానం చేశారు. ఓటీటీలో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్జీ5లో స్ట్రీమ్ అవుతున్న సూపర్ హిట్ సిరీస్ వికటకవి (Vikkatakavi Web Series)కి గాను ప్రదీప్ మద్దాలి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. నిఖిల్ అద్వానీ (ఫ్రీడమ్ ఎట్ నైట్)తో కలిసి ఉత్తమ దర్శకుడు (వెబ్ సిరీస్) అవార్డును ప్రదీప్ మద్దాలి పంచుకున్నారు. అనంతరం ప్రదీప్ మద్దాలి.. హిందూస్తాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్కు, అతని తల్లిదండ్రులకు, సిరీస్ యూనిట్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపుతో తనపై బాధ్యత మరింత పెరిగినట్లు చెప్పారు. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు సిరీస్ ఇదే1970ల నాటి కల్పిత గ్రామమైన అమరగిరిలో ప్లేగు వ్యాధి నేపథ్యంలో ఆకట్టుకునే గ్రామీణ థ్రిల్లర్ వికటకవి. ఈ సిరీస్లో నరేష్ అగస్త్య డిటెక్టివ్ రామ కృష్ణగా నటించారు. మేఘా ఆకాశ్ మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. వర్ధమాన దర్శకుడు ప్రదీప్ మద్దాలి.. ఇంజనీరింగ్, ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. '47 డేస్', 'సర్వం శక్తి మయం'తో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వికటకవితో దర్శకుడిగా మరో స్థాయికి వెళ్ళారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించిన మొదటి తెలుగు వెబ్ సిరీస్ వికటకవి కావడం విశేషం.చదవండి: హీరో నితిన్పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్కు రానన్నా: హర్షవర్ధన్ -
సెన్సార్ పూర్తి చేసుకున్న మ్యాడ్ స్క్వేర్.. ఇక థియేటర్లలో నవ్వులే!
గతంలో బాక్సాఫీస్ వద్ద యూత్ను అలరించిన సినిమా మ్యాడ్. ఈ సినిమాకు సీక్వెల్గా వస్తోన్న మ్యాడ్ స్క్వేర్తో మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మన యంగ్ హీరోలు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్. ఈ చిత్రాన్ని కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే మ్యాడ్ మూవీ మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. మ్యాడ్ స్క్వేర్ సెన్సార్ పూర్తయినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ సినిమా మార్చి 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.Manaki yedi thinnaga jaragavu gaa…Idhi anthe …Mission Censor: Completed ☑️#MADSquare certified U/A for a fun packed theatrical ride ❤️Theatres lo kooda anni light lu velige entertainment tho siddam 😎In cinemas worldwide from MARCH 28th! 🥳@NarneNithiin… pic.twitter.com/HRDODIX4ib— Sithara Entertainments (@SitharaEnts) March 24, 2025 -
రెమ్యునరేషన్పై హీరోకు ప్రశ్న.. నాకు ఇదేం టార్చర్ రా బాబు!
సరికొత్త సినిమాలతో టాలీవుడ్ ప్రియులను అలరిస్తోన్న యంగ్ హీరో సుహాస్(Suhas). తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సుహాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామా'(O Bhama Ayyo Rama). ఆ మూవీలో మాళవిక మనోజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సుహాస్కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు యాడ్లకు ఎంత తీసుకుంటారో.. అలాగే సినిమాకు అంతే రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్ ఉంది.. దీనిపై మీరేమంటారు అని సుహాస్ను ప్రశ్నించారు. దీనిపై సుహాస్ కూడా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.సుహాస్ మాట్లాడుతూ..' ఇదేంటీ నాకు టార్చర్. నేను అనుకున్నంత నంబర్ అయితే లేదు. అయినా కూడా నా యాక్టింగ్ బాగుందో లేదో చూడాలి కానీ.. ఈ రెమ్యునరేషన్ గోల ఏంది? అన్నారు. అలాగే ప్రభాస్ స్పిరిట్లో నటిస్తున్నారా? అని ప్రశ్నించగా..అదేం లేదు అని సుహాస్ సమాధానమిచ్చారు. కాగా.. ఈ చిత్రంలో అనిత హస్సానందాని, అలీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
రిలీజ్ కి ముందే రూ.58 కోట్ల కలెక్షన్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ 'ఎల్ 2: ఎంపురన్'. గతంలో రిలీజైన 'లూసిఫర్' చిత్రానికి ఇది సీక్వెల్. కాకపోతే అప్పట్లో తక్కువ బడ్జెట్ తో సింపుల్ గా తీశారు. ఇప్పుడు భారీగా తీశారు. మార్చి 27న థియేటర్లలోకి రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ.. రిలీజ్ కి ముందే కళ్లు చెదిరే వసూళ్లు సాధిస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు)మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడు. లూసిఫర్ చిత్రాన్ని అప్పట్లో మలయాళంతో పాటు తెలుగులోనూ డబ్బింగ్ చేశారు. కాకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం బడ్జెట్ గట్టిగానే పెట్టి సినిమా భారీగా తీశారు. అంతే భారీగా రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు.తెలుగులో దిల్ రాజు.. ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రీ సేల్స్ ద్వారానే దాదాపు రూ.58 కోట్ల వరకు సొంతం చేసుకుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తెలుగులో ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. దీనికి విక్రమ్ 'వీరధీర శూర', 'మ్యాడ్ స్క్వేర్', 'రాబిన్ హుడ్' చిత్రాలు పోటీగా ఉన్నాయి. మరి తెలుగులో మోహన్ లాల్ మూవీ ఏం రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్) -
గోపీచంద్ మలినేని ఫస్ట్ బాలీవుడ్ మూవీ 'జాట్' ట్రైలర్
దర్శకుడు గోపీచంద్ మలినేని ఫస్ట్ బాలీవుడ్ సినిమా 'జాట్' ట్రైలర్ వచ్చేసింది. పవర్ఫుల్ యాక్షన్ ఫ్యాక్డ్ మూవీలో సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో ఏప్రిల్ 10న జాట్ సినిమా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 2023లో వీరసింహారెడ్డి చిత్రం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జాట్' కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డాన్ శీను, క్రాక్, బలుపు వంటి సినిమాల్లో తన యాక్షన్ ఫ్యాక్డ్ సిన్స్ జాట్లో భారీగానే ఉన్నాయి. ఆటమ్ బాంబ్ లాంటి డైలాగ్స్తో ట్రైలర్ మెప్పించేలా ఉంది. -
హీరో నితిన్పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్కు రానన్నా..: హర్షవర్ధన్
'అమృతం' సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నటుడు హర్షవర్ధన్. (Harsha Vardhan) నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. తాజాగా ఇతడు హీరో నితిన్పై అలిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. హర్షవర్ధన్ మాట్లాడుతూ.. 'గుండెజారి గల్లంతయ్యిందే సినిమా (Gunde Jaari Gallanthayyinde) ఈవెంట్లో స్టేజీపైకి వెళ్లి మాట్లాడదామనుకున్నాను. అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. యాంకర్ అందరి పేర్లు చదువుతోంది. హర్షవర్ధన్ అని పిలిచింది. నన్ను పిలవలేదునేనే అనుకుని లేచా.. ఇంతలో బాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణె టకటకా స్టేజీపైకి వెళ్లి మాట్లాడాడు. ఓర్నీ.. పిలిచింది మనల్ని కాదా అనుకుని ఎవరూ చూడలేదుగా అని కూర్చున్నాను. రైటర్ అయి ఉండి నిన్ను పిలవలేదేంటి? అని పక్కనవాళ్లు అన్నారు. అంతే.. నేను హర్టయ్యాను. నన్ను పిలుస్తారేమోనని చివరిదాకా చూశాను. కానీ పిలవలేదు. బార్కు వెళ్లిపోదామనుకున్నాను. సినిమాలో ఒకే ఒక్క సీన్ మిగిలిపోయి ఉంది. దాన్ని ఈవెంట్ అయ్యాక షూట్ చేద్దామన్నారు. ఈ షూటింగ్కు కాస్త లేట్గా వస్తానని నితిన్ ఫోన్ చేశాడు. సారీ చెప్తాడని వెళ్లా..అప్పటికే బాధలో ఉన్న నేను నాకేం సంబంధం లేదు, నేనే రావట్లేదు అని చెప్పా. నితిన్ ఆశ్చర్యపోతూ.. ఏమైంది? నువ్వెళ్లకపోతే ఎలా? అని ఆరా తీశాడు. వద్దులే.. ఇప్పటికే అయింది చాలు అని దిగులుగా మాట్లాడాను. అప్పుడు నితిన్కు నేను స్టేజీపైకి రాలేదన్న విషయం గుర్తొచ్చి రమ్మని పిలిచాడు. నాకు సారీ చెప్తాడేమో అన్న ఆశతో వెళ్లాను. ప్రాబ్లమేంటి? అన్నాడు. నన్ను పిలవకపోవడం బాధగా అనిపించిందన్నాను. నీ పేరు పిలిచారు కదా.. అంటే హర్షవర్దన్ రాణె స్టేజీ ఎక్కాడు. దానికి నాకు ఏంటి సంబంధం? అన్నాను. చదవండి: రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే డ్యాన్స్ చేస్తావా?: రెచ్చిపోయిన నటుడునీకు బాధ్యత లేదా? క్లాసు పీకిన నితిన్యాంకర్ హర్షవర్ధన్ రాణె అని పిలవలేదు.. హర్షవర్ధన్ అని పిలిచింది. నువ్వెందుకు రాలేదు? పైగా అక్కడున్న 30 మందిలో నువ్వు రాలేదన్న విషయం గుర్తించి యాంకర్కు చెప్పలేదనా నీ బాధ. దీనికే షూటింగ్కు రాను, నాతో మాట్లాడను అంటున్నావా? పేరు పిలిచింది నేను కాదు, యాంకర్. పోనీ పిలవలేదే అనుకో.. ఇది నీ సినిమా కాదా? నీ బాధ్యత కాదా? నీ అంతటగా నువ్వు స్టేజీపైకి రావాలిగా! నేను కదా నితిన్కు సారీ చెప్పాలి!స్టేజీపై ఉన్నవాళ్లందరినీ గుర్తుపెట్టుకుని మాట్లాడటం ఎంత కష్టమో రేపు పొద్దున నువ్వు మైక్ పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. అక్కడంతా యాంత్రికంగా ఉంటుంది అని చెప్పుకుంటూ పోయాడు. విషయం అర్థమైంది. నేను కదా నితిన్కు సారీ చెప్పాలి అనిపించింది. ఇంత తప్పు చేశానేంటనుకున్నాను. ఈ విషయంలో నన్ను నేను ఈ రోజుకూ క్షమించుకోలేను. నితిన్ ఇదంతా ఎప్పుడో మర్చిపోయి ఉండొచ్చు' అని హర్షవర్ధన్ చెప్పుకొచ్చాడు. ఈయన చివరగా కోర్ట్ సినిమాలో న్యాయవాదిగా నటించాడు.చదవండి: ఆ బాలనటి గుర్తుందా? ఇప్పుడు పెళ్లికూతురయ్యింది! -
'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు
మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా కన్నప్ప(Kannappa Movie). ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఈ మూవీపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇదివరకే విష్ణు ఈ విషయమై స్పందించగా.. ఇప్పుడు నటుడు రఘుబాబు (Raghu Babu) మాత్రం వింత కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.'ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెబుతున్నా ఇప్పుడే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు. గుర్తు పెట్టుకోండి. ఎవరైనా 100 శాతం కరెక్ట్ ఇది. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు ఫినిష్' అని నటుడు రఘుబాబు తాజాగా జరిగిన ఈవెంట్ లో అన్నారు. ఇది విన్న నెటిజన్స్ షాకవుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్)ఎందుకంటే గతంలో ఈ చిత్ర టీజర్ రిలీజైనప్పుడు దారుణమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో పలువురు యూట్యూబర్స్ పై హీరో, నిర్మాత మంచు విష్ణు (Manchu Vishnu) సీరియస్ అయ్యాడనే టాక్ వినిపించింది. ఆ తర్వాత మరో టీజర్ రిలీజ్ చేశారు. రెండు పాటలు కూడా విడుదల చేశారు. కాకపోతే ఈసారి అంత నెగిటివిటీ రాలేదు. ఎక్కడో చోట ట్రోలింగ్ జరుగుతుంది. అంతమాత్రాన దేవుడి పేరు చెప్పి శాపానికి గురవుతారని భయపెట్టడం ఏంటో అర్థం కావట్లేదు.కంటెంట్ లో దమ్ముంటే సినిమాని ఎంత ట్రోల్ చేసినా సరే హిట్ అవుతుంది. కన్నప్ప మూవీలోనూ ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. కాబట్టి హిట్ అవ్వొచ్చేమో చెప్పలేం. కానీ ఇలా శాపానికి గురవుతారని భయపెట్టడం మాత్రం కాస్త వింతగా ఉందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఆ బాలనటి గుర్తుందా? ఇప్పుడు పెళ్లికూతురయ్యింది!) -
ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
జీవా(jeeva), అర్జున్ సర్జా(arjun sarja) హీరోలుగా నటించిన 'అగత్యా' (Aghathiyaa) చిత్రం ఓటీటీలోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఫాంటసీ హారర్ కాన్సెప్ట్తో ఈ మూవీ తెరకెక్కింది. రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన పాన్ ఇండియా మూవీని ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహించారు. డా.ఇషారి కె.గణేశ్, అనీశ్ అర్జున్దేవ్ నిర్మాతలు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదల అయింది. ట్రైలర్కు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు.గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రం.. సన్ నెక్స్ట్ వేదికగా మార్చి 28 నుంచి స్ట్రీమింగ్కు రానుందని ప్రకటన వచ్చేసింది. పాన్ ఇండియా రేంజ్లో తమిళ్,హిందీ,తెలుగు,మలయాళం, కన్నడలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఎన్ని భాషలలో విడుదల అవుతుంది అనేది మాత్రం ఆ సంస్థ చెప్పలేదు. కానీ, అన్ని లాంగ్వేజెస్లో అగత్యా స్ట్రీమింగ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెజాన్ ప్రైమ్లో కూడా ఈ మూవీ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.కథేంటంటే..అగత్య(జీవా) ఓ ఆర్ట్ డైరెక్టర్. ఓ పెద్ద సినిమా చేసే చాన్స్ వస్తుంది. ఓ భారీ సెట్ వేసిన తర్వాత నిర్మాత షూటింగ్ నిలిపివేస్తాడు. దీంతో ప్రియురాలు వీణా(రాశీ ఖన్నా) ఇచ్చిన సలహాతో ఆ సెట్ని స్కేరీ హౌస్లా మార్చుతాడు. అయితే నిజంగానే ఆ బంగ్లాలో దెయ్యాలు ఉంటాయి. అసలు ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలు ఎవరు? ఓ ఆడ దెయ్యం అగత్యను ఎందుకు బయటకు పంపించాలనుకుంటుంది? అసలు 1940లో ఆ బంగ్లాలో ఏం జరిగింది? సిద్ద వైద్యం కోసం డాక్టర్ సిద్ధార్థ్(అర్జున్) ఎలాంటి కృషి చేశాడు? బ్రిటిష్ గవర్నర్ ఎడ్విన్ డూప్లెక్స్ చేసిన అరాచకం ఏంటి? అతని చెల్లెలు జాక్వెలిన్ పూవిలేకి సిద్ధార్థ్ చేసిన సహాయం ఏంటి? ఫ్రీడం ఫైటర్ నాన్సీకి అగత్యకు ఉన్న సంబంధం ఏంటి? కాన్సర్తో బాధపడుతున్న తల్లిని రక్షించుకునేందుకు అగత్యా ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
సిద్ శ్రీరామ్ మరోసారి మ్యాజిక్.. 'హిట్-3' నుంచి అదిరిపోయే సాంగ్ రిలీజ్
నాని(Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ నుంచి లవ్ ట్రాక్ సాంగ్ విడుదలైంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. యునానిమస్ ప్రోడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రంలో అర్జున్ సర్కార్ పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఆయన కనిపించనున్నారు.హిట్ సినిమా నుంచి తాజాగా విడుదలైన సాంగ్ను సిద్ శ్రీరామ్, నూతన మోహన్ ఆలపించారు. లవ్ ట్రాక్ సాంగ్స్ పాడటంలో సిద్ శ్రీరామ్కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉందని అభిమానులు చెబుతుంటారు. ఇప్పుడు హిట్ మూవీలో 'ప్రేమ వెల్లువ' అనే సాంగ్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. మిక్కీ జె. మేయర్( Mickey J Meyer) ఇచ్చిన మ్యూజిక్ కూడా బాగుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చాలా సాంగ్స్ భారీ హిట్ అయ్యాయి. -
అమ్మాయిల్ని నమ్మొదంటూ 'సుహాస్' కొత్త సినిమా టీజర్
టాలీవుడ్ హీరో సుహాస్(Suhas) నటించిన కొత్త సినిమా 'ఓ భామ అయ్యో రామ'(Oh Bhama Ayyo Rama) నుంచి టీజర్ వచ్చేసింది. మాళవిక మనోజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని వీ ఆర్ట్స్ బ్యానర్పై హరీశ్ నల్ల నిర్మించారు. ఈ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త కథలతో ఆడియన్స్ను అలరిస్తోన్న సుహాస్ మరో కథతో ప్రేక్షకులను మెప్పించేలా టీజర్ ఉంది. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో అనిత హాసానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ , ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాథ్విక్ ఆనంద్, నాయని పావని కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే డ్యాన్స్ చేస్తావా?: రెచ్చిపోయిన రాజేంద్రప్రసాద్
కథల ఎంపికలో తడబడి ట్రాక్ తప్పాను. కానీ ఈసారి కచ్చితంగా హిట్ కొడతాను అని గట్టి నమ్మకంతో ఉన్నాడు హీరో నితిన్ (Nithiin). భీష్మ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం రాబిన్హుడ్ (Robinhood Movie). శ్రీలీల కథానాయిక. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలు పోషించారు. కేతిక శర్మ ఐటం సాంగ్లో మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.ప్రీరిలీజ్ ఈవెంట్కు అతిథిగా వార్నర్ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమాలో అతిథి పాత్ర చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) గెస్ట్గా విచ్చేశాడు. అయితే వార్నర్ను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అతడి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేసినప్పుడు లేడీస్ టైలర్ నుంచి హీరోగా నటించిన రోజులు గుర్తుకొచ్చాయి. ప్రతి ఇంట్లో ఒక రాబిన్హుడ్ ఉండాలనే కథ ఇది. వార్నర్పై సెటైర్లుసినిమాలో అదిదా సర్ప్రైజు అనే పాట ఉన్నట్లే.. మా వెంకీ కుడుముల, నితిన్ ఇద్దరూ డేవిడ్ వార్నర్ను పట్టుకొచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ వార్నర్ను.. క్రికెట్ ఆడవయ్యా అంటే డ్యాన్సులేశాడు అంటూ మూతి అష్టవంకర్లు తిప్పుతూ అతడిపై సెటైర్లు వేశాడు. చివర్లో వీడు మామూలోడు కాదు.. రేయ్ వార్నరూ.. నువ్వొక దొంగ.... అంటూ ఒక బూతుపదం కూడా వాడాడు.రాజేంద్రప్రసాద్పై అభిమానుల ఆగ్రహంఅది అర్థం కాని వార్నర్ నవ్వుతూ కనిపించాడు. ఇది చూసిన అభిమానులు రాజేంద్రప్రసాద్పై మండిపడుతున్నారు. వార్నర్ సినిమా పాటలకు స్టెప్పులేయడం చూసే కదా సినిమాలోకి తీసుకున్నారు.. అలాంటప్పుడు అతడి డ్యాన్స్ గురించి వంకరగా మాట్లాడటం దేనికని విమర్శిస్తున్నారు. వయసులో పెద్దవాడివైన నువ్వు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదని నటుడిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: 'పుష్ప' ఫస్ట్ ఛాయిస్ సమంత కాదు.. సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత -
ఉగాది, రంజాన్ స్పెషల్స్.. థియేటర్లో 5, ఓటీటీలో 6 క్రేజీ సినిమాలు
మార్చి చివరి వారంలో సినిమాల జాతర భారీగానే ఉండనుంది. తెలుగు సంవత్సరాది ఉగాది, రంజాన్ వరుసగా వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో థియేటర్స్ అన్నీ కూడా కళకళలాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషల నుంచి కూడా భారీ మూవీస్ విడుదల కానున్నడంతో సినిమా అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఓటీటీ నుంచి కూడా పలు హిట్ సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి.ధియేటర్స్లో విడుదలయ్యే సినిమాలు🎥 లూసిఫర్2- మార్చి 27🎥 వీర ధీర శూర- మార్చి 27🎥 రాబిన్హుడ్- మార్చి 28🎥 మ్యాడ్ స్క్వేర్- మార్చి 28🎥 సికందర్- మార్చి 30ఓటీటీ సినిమాలునెట్ఫ్లిక్స్🎥మిలియన్ డాలర్ సీక్రెట్ (రియాల్టీ షో) మార్చి 26🎥కాట్ (థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 26 🎥దేవా -మార్చి 29అమెజాన్ ప్రైమ్🎥హాలెండ్ (ఇంగ్లీష్) మార్చి 27🎥శబ్ధం (తెలుగు)- మార్చి 28🎥మలేనా - మార్చి 29జియో హాట్స్టార్🎥ముఫాసా: ద లయన్ కింగ్ (హిందీ/తెలుగు) మార్చి 26🎥ఓం కాళీ జై కాళి (తెలుగు/వెబ్ సిరీస్) - మార్చి 28జీ5🎥విడుదల పార్ట్-2 (హిందీ) మార్చి 28🎥మజాకా - మార్చి 28ఆహా🎥ది ఎక్స్టార్డనరీ జర్నీఆఫ్ ది ఫకీర్ (తెలుగు) మార్చి 26🎥మిస్టర్ హౌస్ కీపింగ్ ( తమిళ్)- మార్చి 25 -
మన ఆస్కార్ అవార్డ్స్ను లాక్కున్నారు.. దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) అస్కార్ అవార్డ్స్-2025 గురించి మాట్లాడారా. ఈ ఏడాదిలో భారత్కు అవార్డ్స్ రాకపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేశారు. పారిస్లో జరుగుతున్న లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ లూయిస్ విట్టన్ (Louis Vuitton) షోలో ఆమె పాల్గొంటుండగా ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.ఆస్కార్ అవార్డులు గెలుపొందే అన్ని అర్హతలు ఉన్న అనేక భారతీయ చిత్రాలు ఉన్నాయని దీపికా పదుకొణె చెప్పారు. భారతీయ అభిమానుల హృదయాలను గెలుచుకున్న 'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్, మిస్సింగ్ లేడీస్' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికల మీద ప్రశంసలు అందుకున్నాయి. అయినప్పటికీ ఈ రెండు చిత్రాలు ఆస్కార్- 2025 తుది జాబితాలో చోటు దక్కలేదు. ఇలా చాలాసార్లు మనకు రావాల్సిన ఆస్కార్లను లాగేసుకుంటూనే ఉన్నారు. భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి. కానీ, ఆ సినిమాలకు, ఆ కథలకు, నటీనటుల ప్రతిభకు గుర్తింపు ఇవ్వడం లేదు. కారణం ఏంటో తెలియదు. కానీ, ఆస్కార్ మాత్రం మన సినిమాలను తిరస్కరిస్తుంది. అయితే, ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులలో ది బ్రూటలిస్ట్ చిత్రానికి గాను నటుడు అడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు రావడం నాకు సంతోషాన్ని ఇచ్చింది.RRR అవార్డ్.. ఎంతో భావోద్వేగం చెందాను:దీపికాభారత్ నుంచి ఎన్నో విలువైన చిత్రాలు వచ్చినప్పటికీ అస్కార్ అవార్డ్ దక్కకపోవడం చాలా బాధాకరం అని చెప్పిన దీపికా పదుకొణె.. ఆర్ఆర్ఆర్ గురించి కూడా మాట్లాడారు. '2023 ఆస్కార్ అవార్డ్స్ నేను వ్యాఖ్యతగా ఉన్నాను. కానీ, ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ ప్రకటించిన సమయంలో నేను ప్రేక్షకుల్లో కూర్చొని ఉన్నాను. అప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను. అవి నాకు ఎంతగానో ప్రత్యేకమైన క్షణాలు. ఆ సినిమాలో నేను భాగం కాకపోయినప్పటికీ ఒక భారతీయురాలిగా ఆ విజయం నా సొంతం అనిపించింది. ఆ గొప్ప క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను.'అని చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్చరణ్,ఎన్టీఆర్ నటించారు. ఇందులో నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ను దక్కించుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
'పుష్ప' ఫస్ట్ ఛాయిస్ సమంత కాదు.. సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత
‘ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ’ సాంగ్ టాలీవుడ్లో ఇప్పటికీ కూడా ప్రత్యేకమే.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప (2021) చిత్రంలో ఈ పాట పాన్ ఇండియా రేంజ్లో క్లిక్ అయిపోయింది. సమంత స్టెప్పులకు దేవిశ్రీ ప్రసాద్ తనదైన మ్యూజిక్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. పుష్ప2లో కిస్సిక్ సాంగ్ కంటే కూడా సమంత పాటనే సూపర్ హిట్ అనేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఈ సాంగ్లో స్టెప్పులేసే ఫస్ట్ ఛాయిస్ సమంత కాదని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి తాజాగా చెప్పారు.మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘రాబిన్ హుడ్’.. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రీలీజ్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ సమంత స్టెప్పులు వేసిన పుష్ప సాంగ్ గురించి ఇలా చెప్పుకొచ్చారు. '‘రాబిన్ హుడ్’ స్పెషల్ సాంగ్ కోసం కేతిక శర్మను సంప్రదించగానే ఆమె ఒప్పుకున్నారు. పుష్ప-1 సమయంలో సమంతతో చర్చలు జరపకముందే కేతిక శర్మను తీసుకోవాలని అనుకున్నాం. అప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది.. మళ్లీ ఈ సినిమాలో (రాబిన్ హుడ్) కుదిరింది. మేము అడగంగానే కేతిక ఒప్పకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నాను.' అని రవి చెప్పుకొచ్చారు.రాబిన్హుడ్లో 'అది దా సర్ప్రైజ్' అంటూ కేతిక శర్మ వేసిన స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. నెట్టింట ఈ సాంగ్ వైరల్ అవుతుంది. ఇప్పటికే లెక్కలేనన్ని రీల్స్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఈ పాట ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
షాప్ ఓపెనింగ్ అంటూ ట్రాప్.. నటికి చుక్కలు చూపించిన యువతి
హైదరాబాద్లో బాలీవుడ్ నటిని ట్రాప్ చేసి వ్యభిచారం కూపంలో దింపే ప్రయత్నం చేశారు. ఈ ఘటన మార్చి 18న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన టీవీనటి (30)ని హైదరబాద్లో ఉండే ఆమె స్నేహితురాలు ఆహ్వానించింది. ఇక్కడ ప్రముఖ షాప్ ప్రారంభోత్సవంలో అతిథిగా రావాలని పిలుపునిచ్చింది. అందుకు గాను విమానఛార్జీలతో పాటు తగిన రెమ్యునరేషన ఇస్తారని చెప్పింది. దీంతో ఆ నటి హైదరాబాద్కు వచ్చేసింది. ఆమెకు మాసబ్ట్యాంక్ వద్ద ఉన్న శ్యామ్నగర్ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లో బస ఏర్పాటు చేశారు. ఆమెకు అవసరం అయ్యే పనులు చేసేందుకు ఒక వృద్ధురాలిని ఏర్పాటు చేశారు.ఇక్కడి వరకు అంతా బాగుంది. కానీ, 21న రాత్రి 9 గంటల సమయంలో నటి ఉన్న గదిలోకి వెళ్లి తమతో పాటుగా వ్యభిచారం చేయాలని, ఇద్దరు కస్టమర్స్ ఉన్నారంటూ బలవంతం చేశారు. ఆమె నో చెప్పడంతో రెండు గంటల తర్వాత ముగ్గురు వ్యక్తులు ఆమె గదిలోకి ఎంట్రీ ఇచ్చి తమతో గడపాలని బెదిరింపులకు దిగారు. ఆమె కేకలు వేయడంతో దాడి చేసి వారు పారిపోయారు. ఇంతలో వృద్ధురాలు, ఇద్దరు మహిళలు నటి గదిలోకి ప్రవేశించి ఆమెను బంధించి తన వద్ద ఉన్న రూ.50 వేల నగదుతో పారిపోయారు. ఈ క్రమంలో తన స్నేహితురాలికి ఫోన్ చేసినా స్పందించలేదని ఆ నటి పేర్కొంది. దీంతో బాధితురాలు 100కు ఫోన్ చేసి పోలీసులకు చెప్పడంతో వారు ఆమెను రక్షించారు. నటి ఫిర్యాదుతో మాసబ్ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం విచారణ ప్రారంభించారు. -
అజిత్ను డైరెక్ట్ చేయనున్న స్టార్ హీరో
నటుడు ధనుష్ ఇప్పుడు నటనతో పాటూ దర్శకత్వం పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఈయన ఇటీవల వరుసగా మూడు చిత్రాలకు దర్శకత్వం వహించడం విశేషం. అందులో ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన రాయన్ చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది. ఇది ఈయన కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా కొత్త తారలతో నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోపం అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రానికీ దర్శక ,నిర్మాత బాధ్యతలను నిర్వహించారు. తాజాగా కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇడ్లీ కడై. ఇందులో నటి నిత్యామీనన్ నాయికిగా నటించారు. ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. కాగా ఈయన కథానాయకుడిగా నటిస్తున్న మరో ద్విభాషా చిత్రం కుబేర. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ నటిస్తున్నారు. కాగా త్వరలో డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మించే చిత్రంలో కథానాయకుడుగా నటించరనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి అజిత్ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరందుకుంది. దీని గురించి డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాష్ భాస్కరన్ ధృవపరిచారు. ఆయన ఓ భేటీలో పేర్కొంటూ తాను త్వరలో ధనుష్ కథానాయకుడిగా చిత్రం నిర్మించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా అజిత్ హీరోగా ధనుష్ దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయని, అజిత్ కోసం ధనుష్ కథను సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే అజిత్ను కలిసి కథను వినిపించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్ వస్తుందనే తాను భావిస్తున్నట్లు నిర్మాత ఆకాష్ భాస్కర్ పేర్కొన్నారు. ఇకపోతే అజిత్ కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకొని ఏప్రిల్ 10వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అదేవిధంగా ఈయన నటించే తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. దీంతో ధనుష్ దర్శకత్వంలో నటించడానికి పచ్చ జెండా ఊపుతారా అన్న ఆసక్తి కూడా నెలకొంది. -
బ్రిటిష్ పాత్రలో...
సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల యేటిగట్టు’. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. నూతన దర్శకుడు కేపీ రోహిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.కాగా ఈ సినిమాలో బ్రిటిష్ అనే పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్ను ఆదివారం రిలీజ్ చేశారు. రగ్డ్ హెయిర్, బ్లాక్ కోట్తో బ్రిటిష్ పాత్రలో శ్రీకాంత్ లుక్ వినూత్నంగా ఉంది. ఆదివారం (మార్చి 23) శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. -
రాజకీయం... సందేశం
ఇంద్రజ, అజయ్, జయసుధ, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. గడ్డం రమణా రెడ్డి దర్శకత్వంలో బొల్లా రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో ఇంద్రజ మాట్లాడుతూ– ‘‘మీ రియల్ లైఫ్లో చూసినవి, విన్నవి, జరిగిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో దర్శకుడు చక్కగా చూపించారు. ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఆలోచింపజేసే చిత్రం ఇది’’ అన్నారు.‘‘ఈ సినిమాలో నేను సీఎంగా నటిస్తే, నా భార్య పాత్రలో ఇంద్రజ నటించారు. ఈ ప్రమోషనల్ సాంగ్ చూసి ఎమోషనల్ అయ్యాను’’ అని తెలిపారు అజయ్. ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే సందేశాత్మక చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు బొల్లా రామకృష్ణ. ‘‘మన నగరం ఎలా ఉంది? అనేది ఈ పాటలో చూపించాను. నేను అమెరికాలో ఉంటాను. కుండపోత వర్షం వచ్చినా చుక్క నీరు నిలవదు. ఇక్కడ వర్షం వస్తే అంతే. నేను ఎవరినీ విమర్శించడం లేదు. నగరం బాగుండాలనే తపనతో చెబుతున్నాను. సామాజిక నేపథ్యం ఉన్న చిత్రం ‘సీఎం పెళ్లాం’’ అని అన్నారు గడ్డం రమణారెడ్డి. -
అందాల సిరి
‘మా అందాల సిరి మీద పడనీకు ఏ కళ్లు... ఆ చిరునవ్వే పచ్చంగా ఉండాలి నూరేళ్లు... వేయాలి పరదాలు... చేయాలి సరదాలు... అమ్మా... నీ దీవెనలు తోడుంటే అంతే చాలు... మా ఊరి పొలిమేర దాటవుగా సంతోషాలు’ అంటూ సాగుతుంది ‘పరదా’ సినిమాలోని ‘మా అందాల సిరి’ పాట. అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత లీడ్ రోల్స్లో నటించిన ‘పరదా’ సినిమాలోని పాట ఇది.‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఆనంద మీడియా పతాకంపై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ ఈ సినిమాను నిర్మించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘మా అందాల సిరి...’ పాట లిరికల్ వీడియోను ఆదివారం రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు గోపీసుందర్ స్వరపరచిన ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా, శ్రీ కృష్ణ, రమ్య బెహరా పాడారు. -
జపాన్లో దేవర
జపాన్ వెళ్లారు ఎన్టీఆర్. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవర’. కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాలోని తొలి భాగం ‘దేవర: పార్ట్ 1’ 2024 సెప్టెంబరు 27న విడుదలైంది. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా (తండ్రి పాత్ర దేవర, కొడుకు పాత్ర వర) నటించి, ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్స్ను సాధించినట్లుగా మేకర్స్ పేర్కొన్నారు.ఇక ఈ నెల 28న ‘దేవర: పార్ట్ 1’ సినిమా జపాన్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ టూర్లో భాగంగా ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. ఈ ప్రమోషనల్ టూర్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాను హీరోగా చేస్తున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా షూట్లో ఎన్టీఆర్ పాల్గొంటారని సమాచారం.అలాగే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్లో నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయ్యాక ‘దేవర 2’ సినిమా షూట్లో పాల్గొంటారని, ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నారని సమాచారం. -
మీ ఫ్యామిలీలోకి ఆహ్వానించినందుకు థ్యాంక్స్: డేవిడ్ వార్నర్
‘‘నమస్కారం... ‘రాబిన్ హుడ్’లో నటించే చాన్స్ రావడాన్ని గౌరవంగా ఫీలవుతున్నా. మీ ఫ్యామిలీలోకి నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్స్. ఈ సినిమాలోని నా కోస్టార్స్ చాలా కష్టపడ్డారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ‘రాబిన్ హుడ్’ పెద్ద సక్సెస్ కావాలి’’ అని ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నారు. నితిన్ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రల్లో నటించారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రీ రీలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ సినిమాలో అతిథి పాత్ర చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ వేడుకకు అతిథిగా హాజరై, ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ– ‘‘రాబిన్ హుడ్’ విజయంపై కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఒక సినిమాకు రియల్ హీరోలు నిర్మాతలే. ఇండియాలో మైత్రీ టాప్ ప్రొడక్షన్ హౌస్ అని ‘పుష్ప’ సినిమాతో నిరూపితమైంది. ‘రాబిన్ హుడ్’ని మైత్రీ వాళ్లు కాబట్టే ఇంత భారీగా తీశారు. నాపై ఉన్న ప్రేమను వెంకీ ఈ సినిమా రూపంలో చూపించాడు. డేవిడ్ వార్నర్గారి వల్ల ఈ సినిమా నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. ప్రపంచ క్రికెట్లో ఆయన పెద్ద లెజెండ్ క్రికెటర్. కానీ తెలుగువారికి వార్నర్గారు.. డేవిడ్ భాయ్... వార్నర్ మామానే’’ అన్నారు.‘‘రాబిన్ హుడ్’ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ ట్రైలర్ చూడగానే ఈ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్బస్టర్ అని వెంకీతో చెప్పాను’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘నితిన్ , డేవిడ్ వార్నర్గార్లు, చాలా బిజీగా ఉండి కూడా ఈ సినిమా చేసిన శ్రీలీల, ‘అదిదా సర్ప్రైజ్’ పాట చేసిన కేతికా, ఇతర టీమ్కి థ్యాంక్స్’’ అని తెలిపారు వై. రవిశంకర్. ‘‘భీష్మ’ తర్వాత నితిన్ అన్న, నేను ‘రాబిన్ హుడ్’తో వస్తున్నాం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం నితిన్ అన్న, బాగా తీయడానికి కారణం నవీన్ , రవిగార్లు. ఈ సినిమాకు బజ్ రావడానికి ఒక కారణం కేతికా ‘అదిదా సర్ప్రైజ్’ సాంగ్.. రెండోది డేవిడ్ వార్నర్గారు ఇండియన్ సినిమాకు రావడం’’ అని చెప్పారు వెంకీ కుడుముల.‘‘రాబిన్ హుడ్’తో హీరోగా కమర్షియల్ స్పేస్లో నితిన్ మరో లెవల్కి వెళ్తాడు. ఇలాంటి మరిన్ని సినిమాలు చేసి, వెంకీ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. మైత్రీ మూవీ మేకర్స్ లిస్ట్లోని పెద్ద హిట్స్ మూవీలో ‘రాబిన్ హుడ్’ ఉండాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు రాజేంద్రప్రసాద్. ‘‘ఆల్మోస్ట్ ఏడాది తర్వాత నేను హీరోయిన్గా వస్తున్న ‘రాబిన్ హుడ్’ని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు శ్రీలీల. ఈ వేడుకలో ‘పుష్ప’ సినిమాలోని ఫుట్ స్టెప్, ‘రాబిన్ హుడ్’లోని ‘అదిదా సర్ప్రైజ్’ పాట హుక్ స్టెప్స్ ట్రై చేసి, అలరించారు డేవిడ్ వార్నర్. -
రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అది దా డేవిడ్ వార్నర్ సర్ప్రైజ్!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ 'రాబిన్హుడ్'.'భీష్మ' హిట్ ఫిల్మ్ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తాజాగా రాబిన్హుడ్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథి డేవిడ్ వార్నర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్నర్ తన డ్యాన్స్తో ఆడియన్స్ను అలరించారు. పుష్ప చిత్రంలో చూపే బంగారమాయమే శ్రీవల్లి.. అనే పాటకు అల్లు అర్జున్ స్టైల్లో హుక్ స్టెప్కు కాలు కదిపారు. అంతేకాకుండా రాబిన్ హుడ్ మూవీలో అది దా సర్ప్రైజ్ అంటూ సాగే కేతిక శర్మ పాటకు సైతం డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. The fan-favorite @davidwarner31 does the blockbuster #Pushpa hookstep at the #Robinhood trailer launch & Grand Pre-Release Event ❤️🔥Watch Live now!▶️ https://t.co/lbpuVoSvra#Robinhood Trailer Out Now ▶️ https://t.co/h2nhPhMrqE@actor_nithiin @sreeleela14 @VenkyKudumula… pic.twitter.com/fUUihxlejF— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2025 The stars of #Robinhood - @actor_nithiin, @sreeleela14, @davidwarner31 & @TheKetikaSharma - dance to the trending chartbuster #AdhiDhaSurprisu at the #Robinhood trailer launch & Grand Pre-Release Event 💥💥❤️🔥Watch Live now!▶️ https://t.co/lbpuVoSvra#Robinhood Trailer Out Now… pic.twitter.com/mmISnN1ula— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2025 -
రాబిన్హుడ్ వచ్చేశాడు.. ట్రైలర్ రిలీజ్ చేసిన డేవిడ్ వార్నర్
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్హుడ్.'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా రాబిన్హుడ్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే నితిన్ పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. వెన్నెల కిశోర్, నితిన్ మధ్య వచ్చే సన్నివేశాలతో థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్ చివర్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఓ రేంజ్లో అదిరిపోయింది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్కుమార్ అందించారు. -
సన్రైజర్స్ మ్యాచ్లో వెంకటేశ్ సందడి.. జెండా పట్టుకుని హుషారు
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్కు క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం. గతంలో చాలాసార్లు టీమిండియా మ్యాచ్ల్లోనూ సందడి చేశారు. తాజాగా ఐపీఎల్ సీజన్లో మరోసారి స్టేడియంలో మెరిశారు. ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్కు ఆయన హాజరయ్యారు. ఎస్ఆర్హెచ్ జెండాను పట్టుకుని టీమ్కు మద్దతుగా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోను సన్రైజర్స్ హైదరాబాద్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది.కాగా.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు మన హీరో విక్టరీ వెంకటేశ్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు.Anytime, Uppal center lo Single handedly support chese our Victory Venkatesh is here 💪🧡#PlayWithFire | #SRHvRR | #TATAIPL2025 pic.twitter.com/2v4qDKh4bI— SunRisers Hyderabad (@SunRisers) March 23, 2025 -
పవన్ కొత్త సినిమాలు క్యాన్సిల్?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలుగులో స్టార్ హీరో. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో చేతిలో ఉన్న సినిమాలే పూర్తి చేయలని పరిస్థితి. అలాంటి కొత్త చిత్రాలంటే అస్సలు అయ్యే పనికాదు. ఈ క్రమంలోనే కొత్త సినిమాలు రెండు క్యాన్సిల్ అయ్యాయనే మాట వినిపిస్తోంది.పవన్ చేతిలో ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'ఓజీ' (OG Movie) సినిమాలున్నాయి. వీటిలో 'హరిహర..' లెక్క ప్రకారం ఈ మార్చి 27న రిలీజ్ కావాలి. కానీ మే 9కి వాయిదా వేశారు. పవన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ పెండింగ్ ఉన్నాయని అంటున్నారు. మరి మేలో అయినా సరే సినిమా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ.. ఇప్పుడు ఎలా ఉందంటే?)పవన్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్న 'ఓజీ'కి దాదాపు 20 రోజుల డేట్స్ పవన్ ఇవ్వాల్సి ఉందట. అది ఎప్పుడు జరిగితే దానిబట్టి రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉంది. ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లి చాలా ఏళ్లు అయిపోయాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితి.ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaab Bhagath Singh) షూటింగ్ కొన్నిరోజులు చేశారు. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీని హోల్డ్ లో పెట్టేశారనే టాక్ ఉంది. అలానే సురేందర్ రెడ్డితో కమిట్ అయిన ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ చేసేశారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే పవన్ చివరి చిత్రం 'ఓజీ'నే!(ఇదీ చదవండి: రామ్ చరణ్- అల్లు అర్జున్.. ఈ సారికి లేనట్టే!) -
ఐపీఎల్ కోసం దిశా.. ఓదెల కోసం తమన్నా!
ఐపీఎల్ కోసం హాట్ గా ముస్తాబైన దిశా పటానీఓదెల 2 మూవీ ఈవెంట్ లో చీరలో తమన్నాచీరలో అందాల జాబిలిలా ప్రియాంక మోహన్నాభి అందాలు చూపించేస్తున్న రీతూ చౌదరికూతురితో ఆడుకుంటున్న హీరోయిన్ ప్రణీతబేబీ బంప్ ఫొటోలతో యూట్యూబర్ మహాతల్లిమనాలిలో సురేఖావాణి.. కూతురు సుప్రీత కూడాఆఫ్రికన్ డ్యాన్స్ చేసిన టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Sushanth (@isushanthreddy) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) -
రామ్ చరణ్- అల్లు అర్జున్.. ఈ సారికి లేనట్టే!
ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్ (Allu Arjun).. పాన్ ఇండియా హీరోలుగా పుల్ క్రేజ్ సంపాదించారు. చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఓ మూవీ చేస్తున్నాడు. మరో మూవీ లైనులో ఉంది. బన్నీ కూడా రెండు సినిమాల కోసం సిద్ధమవుతున్నాడు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ బ్యాడ్ న్యూస్ అభిమానుల మధ్య చర్చకు కారణమవుతోంది.హీరోలన్నాక సినిమాలు చేస్తుంటారు. మంచి రోజులు చూసుకుని అప్డేట్స్ ఇస్తుంటారు. ఇక పుట్టినరోజున గ్లింప్స్, పోస్టర్స్ లాంటివి రిలీజ్ చేస్తుంటారు. త్వరలో చరణ్ (మార్చి 27), బన్నీ (ఏప్రిల్ 8) బర్త్ డేలు రాబోతున్నాయి. దీంతో కొత్త మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఈసారి అలాంటివేం ఉండవని తెలుస్తోంది.(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్)చరణ్-బుచ్చిబాబు సినిమాకు ఏఆర్ రెహమాన్ (Ar Rahman) సంగీత దర్శకుడు. కొన్నిరోజుల క్రితం ఈయన గుండెల్లో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. డిశ్చార్జ్ కూడా అయిపోయి ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే గ్లింప్స్ విజువల్స్ రెడీ అయిపోయినా సరే మ్యూజిక్ బాకీ ఉండటంతో చరణ్ పుట్టినరోజు దీన్ని రిలీజ్ చేయడం కష్టమేనని మాట్లాడుకుంటున్నారు.మరోవైపు అల్లు అర్జున్ కొత్త మూవీస్ కి సంబంధించి పుట్టినరోజున అనౌన్స్ మెంట్స్ ఉండొచ్చని అనుకున్నారు. కానీ బన్నీ నానమ్మ ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సినిమాల ప్రకటన సరికాదని, వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ రూమర్స్ బట్టి చూస్తే త్వరలో మంచి రోజు చూసుకుని చరణ్, బన్నీ మూవీస్ అప్డేట్స్ రిలీజ్ చేస్తారనిపిస్తుంది.(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ.. ఇప్పుడు ఎలా ఉందంటే?) -
హైదరాబాద్ లో వేడుకగా జరిగిన కీరవాణి కన్సర్ట్
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి నిర్వహించిన కన్సర్ట్.. హైదరాబాద్ లో శనివారం రాత్రి వేడుకగా జరిగింది. హైటెక్స్ గ్రౌండ్ లో దాదాపు 10 వేల మంది ఆహుతుల ఈ ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది.(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ!)ఇటీవలే ఒడిశాలో షూటింగ్ ముగించుకుని వచ్చేసిన రాజమౌళి.. 'నా టూర్ ఎమ్ఎమ్ కే' పేరుతో నిర్వహించిన ఈ కన్సర్ట్ లో పాల్గొన్నారు. ఇకపోతే ఈ సంగీత కార్యక్రమంలోనే కీరవాణి.. తన స్వరపరిచిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్ర గీతాలని ఆలపించారు. ఈయనతో పాటు 83 మంది సింగర్స్-టెక్నీషియన్స్ కన్సర్ట్ జరిగే ప్రాంతాన్ని సంగీతమయం చేశారు. ఈ కన్సర్ట్ ని నా జీవితంలో మర్చిపోనని కీరవాణి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: లేడీ కమెడియన్ కొడుక్కి పేరు పెట్టిన కమల్ హాసన్) -
వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ!
అల్లు అర్జున్ నానమ్మ ఆస్పత్రిలో చేరారు. 95 ఏళ్ల వయసున్న ఈమెకు గత కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఈమె వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: లేడీ కమెడియన్ కొడుక్కి పేరు పెట్టిన కమల్ హాసన్)అల్లు అర్జున్ నానమ్మ పేరు కనక రత్నం. తాత పేరు అల్లు రామలింగయ్య. ఈయన నటుడిగా మనందరికి తెలుసు. వీళ్లకు నలుగురు పిల్లలు. అల్లు అరవింద్ కొడుకు కాగా.. సురేఖ (చిరంజీవి భార్య), వసంత, భారతి కూతుళ్లు.అల్లు అర్జున్ కి నానమ్మ అంటే రామ్ చరణ్ కి ఈమె స్వయానా అమ్మమ్మ అవుతుంది. బహుశా మనవళ్లు ఇద్దరూ ఈ పాటికే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి వచ్చుంటారు. కాకపోతే ఇది బయటకు రానట్లు ఉంది. ప్రస్తుతం చరణ్, బన్నీ ఎవరి మూవీస్ తో వాళ్లు బిజీగా ఉన్నారు.(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్) -
ఖరీదైన బెంజ్ కొన్న 'విరూపాక్ష' నటి.. రేటు ఎంతో తెలుసా?
యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి ఓవైపు రియాలిటీ షోలు.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న సోనియా సింగ్ (Soniya Singh) ఇప్పుడు ఖరీదైన బెంజ్ కారు కొనేసింది. తాజాగా హైదరాబాద్ లో తన ప్రియుడితో కలిసి కొత్త కారులో షికారు వేసింది. ఇంతకీ కారు మోడల్ ఏంటి? ఖరీదెంత?(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్)యూట్యూబర్ గా పవన్ సిద్ధు అనే కుర్రాడితో ఎక్కువగా వీడియోలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సోనియా సింగ్.. 2023లో వచ్చిన 'విరూపాక్ష' (Virupaksha Movie) మూవీతో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. నితిన్ 'ఎక్స్ ట్రా' మూవీలోనూ కామెడీ రోల్ చేసింది. ప్రస్తుతం ఢీ షోలో యాంకర్ గా చేస్తోంది.ప్రియుడితో కలిసి రెండు చేతులా సంపాదిస్తున్న సోనియా.. మెర్సిడెజ్ బెంగ్ సీ క్లాస్ కారుని కొనుగోలు చేసింది. దీని ఖరీదు మార్కెట్ లో రూ.60-80 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: లేడీ కమెడియన్ కొడుక్కి పేరు పెట్టిన కమల్ హాసన్) View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
హైదరాబాద్ చేరుకున్న డేవిడ్ వార్నర్.. ఐపీఎల్ మ్యాచ్ కోసం కాదు!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన లేటేస్ట్ మూవీ రాబిన్హుడ్. ఈ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్తో అదరగొట్టేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు కాలేజీల్లో ఈవెంట్స్ నిర్వహించారు.అయితే మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా హాజరు కానున్నారు. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా వార్నర్ పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న వార్నర్కు ఘనస్వాగతం లభించింది. డైరెక్టర్ వెంకీ కుడుముల స్వయంగా పూల బొకే అందించి డేవిడ్కు వెల్కమ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే గతంలోనే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ నటిస్తున్నారని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ రివీల్ చేశారు. ఈ మూవీ ద్వారా డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. పుష్ప మేనరిజంతో అభిమానులను అలరించిన క్రికెటర్.. ఇప్పుడు ఏకంగా సినిమాతోనే ఫ్యాన్స్ ముందుకు రానున్నారు. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
ఫస్ట్ లుక్ తోనే షాకిచ్చిన 'పూర్ణ చంద్రరావు'
తెలుగులో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు కాస్త డిఫరెంట్ మూవీస్ కూడా వస్తుంటాయి. అలా పో*ర్న్ అడిక్షన్ కథతో తీసిన మూవీ 'పూర్ణ చంద్రరావు'. తారక రామ దర్శకుడు. విజయ్ రాజ్ కుమార్ హీరోగా నటించాడు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో రెస్పాన్స్ గట్టిగానే వచ్చింది. (ఇదీ చదవండి: లేడీ కమెడియన్ కొడుక్కి పేరు పెట్టిన కమల్ హాసన్)సోఫాలో అర్ధనగ్నంగా కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్న హీరో.. వెనుక స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్ ఫోటోలు – ఇవన్నీ కలిపి ప్రేక్షకులకు ఓ మెసేజ్ ఇస్తున్నాయి. టెక్నాలజీ, పో*ర్న్ అడిక్షన్, మానసిక స్థితి అన్నీ కలిపి ఓ డీప్ అర్ధం చెప్పేలా ఉంది. మామూలుగా మనం మద్యం, డ్రగ్స్, సోషల్ మీడియా అడిక్షన్ గురించి సినిమాలు చూస్తాం. కానీ పోర్న్ అడిక్షన్ గురించి ఓ ఫీచర్ ఫిల్మ్ రావడం ఇదే మొదటిసారి. ఒక పోస్టర్ తోనే అందరిని ఆకట్టుకున్న ఈ 'పూర్ణ చంద్రరావు' ముందు ముందు ఇంకేం చేస్తాడో చూడాలి.(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్) -
నిజం ఎంతోకాలం దాగదు, ఈ రోజు వస్తుందని తెలుసు: మంచు లక్ష్మి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ (Sushant Singh Rajput) మృతి కేసులో రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదు. తను ఆత్మహత్యకు ప్రేరేపించలేదు అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వెల్లడించింది. ఈ మేరకు కేసును క్లోజ్ చేసింది. దీంతో ఐదేళ్లుగా నిందలు మోస్తూ ఒంటరి పోరాటం చేస్తున్న రియా చక్రవర్తికి ఎట్టకేలకు ఉపశమనం లభించినట్లయింది. సుశాంత్ మృతి.. మాజీ ప్రేయసిపై ట్రోలింగ్సుశాంత్ సింగ్ 2020లో జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన మృతి వెనక కుట్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) కూడా అందులో భాగమై ఉండొచ్చన్న ప్రచారం జరిగింది. దీంతో ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. తనను ఈసడించుకున్నారు. ఒక విలన్గా చూశారు. దీని పర్యవసానంగా సినిమా అవకాశాలకు ఫుల్స్టాప్ పడింది. అరెస్టు, జైలు జీవితం, విచారణతో రియా మానసికంగా కుంగిపోయింది.కేసులో నిర్దోషిగా తేలిన నటితాను తప్పు చేయలేదన్న మాటను ఎవరూ లెక్కచేయలేదు. తప్పంతా నీదేనని నోరు నొక్కేశారు. ఎంతో భవిష్యత్తున్న హీరో ప్రాణాలు తీసుకోవడానికి కారణమయ్యావని అభాండాలు వేశారు. గుండె నిండా బాధను మోస్తూనే ఒంటరిగా పోరాడింది.. చివరకు కేసులో నిర్దోషిగా తేలింది. ఐదేళ్లుగా రియా అనుభవించిన బాధని, పోరాటాన్ని గుర్తు చేస్తూ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నిజం ఎంతోకాలం దాగదురియా చక్రవర్తికి, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ వచ్చింది. ఇలాంటి రోజొకటి వస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే నిజం ఎంతోకాలం దాగదు.. కాస్త ఆలస్యమైనా సరే బయటకు రాక తప్పదు. రియా, ఆమె కుటుంబం.. భరించలేని బాధను అనుభవించింది. సమాజం మిమ్మల్ని తప్పని నిందిస్తుంటే, మీతో రాక్షసంగా ప్రవర్తిస్తుంటే మీరు పోరాడిన విధానం ఆదర్శవంతం. మిమ్మల్ని అవమానించారు, చీల్చి చెండాడారు. అయినా ఎంతో హుందాగా నిలబడ్డారు.క్షమాపణలు చెప్పండి: మంచు లక్ష్మినిజానిజాలు తెలుసుకోకుండా మీపై నోరు పారేసుకున్నవారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. అన్యాయంగా ఒక కుటుంబాన్ని ఎంత బాధపెట్టారో గుర్తు చేసుకుని పశ్చాత్తాపపడాలి. రియా.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నీకు మరింత శక్తి చేకూరాలి. ఇది ఒక ఆరంభం మాత్రమే.. ఇకపై అంతా మంచే జరుగుతుంది. నువ్వు అనుభవిస్తున్న బాధ ఇప్పటికైనా తగ్గుతుందని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చింది. దీనికి #Justice, #TruthWins, #RheaChakraborty అన్న హ్యాష్ట్యాగ్స్ ఇచ్చింది.చదవండి: 'ఖుషి' ఫ్లాప్ అయితే నేను బతికేవాడిని కాదు: ఎస్జే సూర్య -
వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్
'పుష్ప 2'తో దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం కొత్త సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన రానుంది. అయితే తనకు దొరికిన విరామాన్ని ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా దుబాయి వెళ్లిన బన్నీ.. అక్కడే కట్టిన హిందూ దేవాలయాన్ని సందర్శించాడు. (ఇదీ చదవండి: జపాన్ లో 'దేవర'.. భార్యతో కలిసి వెళ్లిన తారక్)అబుదాబిలో ప్రఖ్యాత హిందూ దేవాలయం స్వామి నారాయణ్ మందిర్ ని కొన్నాళ్ల క్రితం స్థాపించారు. ఇప్పుడు దీన్నే అల్లు అర్జున్ సందర్శించారు. శనివారం అక్కడికి వెళ్లిన బన్నీకి ఆలయ ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజాలు కూడా చేయించారు.ఇకపోతే ఆలయ ప్రతినిధులు..బన్నీకి ఈ ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల విషయానికొస్తే.. త్వరలో అట్లీతో ఓ మూవీ చేయబోతున్నాడు. దీని తర్వాతే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 25 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతున్న సినిమా)Bunny Boyy visits the #AbuDhabiMandir ❤️#AlluArjun pic.twitter.com/PHjmE8FGp9— Bunny_boy_private (@Bunnyboiprivate) March 22, 2025 -
జపాన్ లో 'దేవర'.. భార్యతో కలిసి వెళ్లిన తారక్
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు కొన్ని జపాన్ లోనూ రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే కొన్ని నెలల తర్వాత అక్కడి థియేటర్లలోకి వస్తున్నాయి. అలా ఈ ఏడాది జనవరిలో 'కల్కి' రిలీజైంది. ఇప్పుడు 'దేవర'.. మార్చి 28న జపాన్ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రమోషన్స్ జరుగుతున్నాయి.(ఇదీ చదవండి: 'రాను.. బొంబాయి'కి అంటూనే లక్షల్లో కొల్లగొట్టేశారు)తాజాగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అక్కడి ప్రేక్షకులతో కలిసి 'దేవర' చూసేందుకు స్వయంగా ఎన్టీఆర్ జపాన్ వెళ్లాడు. భార్య ప్రణతీతో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ కోసం పనిచేస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ లో 'వార్ 2' కూడా చేస్తున్నాడు. ఇది ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలోకి రానుండగా.. ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే జనవరి టార్గెట్ గా ప్లాన్ చేస్తున్నారు. కానీ అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 25 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతున్న సినిమా)#YoungTiger ..జపాన్ లో pic.twitter.com/zM0Y53gPj7— devipriya (@sairaaj44) March 23, 2025 -
ఆ రూమర్స్తో హర్టయ్యా.. కానీ అది కిక్కిచ్చింది: కన్నప్ప హీరోయిన్
కన్నప్ప సినిమాలోని ‘సగమై – చెరి సగమై’ పాటతో అందరి దృష్టినీ ఆకర్షించింది హీరోయిన్ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). తమిళనాడుకు చెందిన ప్రీతి ముకుందన్ మలబార్ గోల్డ్, శరవణన్ స్టోర్స్, చెన్నై సిల్క్స్ వంటి సంస్థల కమర్షియల్ యాడ్స్లో మోడల్గా నటించింది. తండ్రి గోపాల్ ముకుందన్ వ్యాపారవేత్త. తల్లి చెన్నైలో డెంటిస్ట్గా ప్రాక్టీసు చేస్తోంది. తల్లి ప్రోత్సాహంతోనే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఆసక్తి పెంచుకుంది. తల్లే దగ్గరుండి భరతనాట్యం నేర్పించి, ప్రదర్శనలు ఇప్పించింది.ప్రీతియే కాదు తల్లి కూడా నటించింది!తల్లికి యాక్టింగ్ పట్ల ఎంత ఇష్టమంటే కన్నప్ప సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తే, తల్లి కూడా ఓ క్యారెక్టర్లో నటించింది. నటి లక్ష్మి కుమార్తె, ఒకనాటి హీరోయిన్ ఐశ్వర్య.. ప్రీతి ముకుందన్ తల్లి కాలేజీలో క్లాస్మేట్స్. న్యూజిలాండ్లో కలుసుకున్నప్పుడు ఇద్దరు స్నేహితురాళ్ళూ ఎంతో థ్రిల్ ఫీలయ్యారు. కాలేజీ కబుర్లు నెమరేసుకున్నారు. 2001 జులై 30 సోమవారం నాడు పుట్టింది ప్రీతి ముకుందన్. సోమవారం శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు. అయితే, శివ భక్తుడు కన్నప్ప మీద తీస్తున్న సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లే వచ్చి పోయింది.ఆ హీరోయిన్ తప్పుకోవడం వల్ల..కన్నప్పలో హీరోయిన్ క్యారెక్టర్ ఆడిషన్కి ప్రీతి ముకుందన్ వచ్చింది. కానీ, నుపూర్ సనన్ని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. కన్నప్ప సినిమా ఓపెనింగ్లో కూడా నుపూర్ సనన్ పాల్గొంది. అప్పుడు ఎంతో బాధ పడినట్లు ప్రీతి ముకుందన్ చెప్పింది. అయితే తర్వాత నుపూర్ సినిమా మానేయడంతో– మళ్ళీ హీరోయిన్ చాన్స్ ప్రీతి ముకుందన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ శివుడే తనకు ఈ అవకాశం ఇచ్చాడని ప్రీతి నమ్మకం.(చదవండి: మొదటి భార్యకు విడాకులు.. దేవదాసులా తాగుడుకు బానిసయ్యా..: హీరో)ఆ రూమర్స్తో హర్టయ్యామ్యూజికల్ వీడియో ఆల్బమ్స్తో ప్రీతి చాలా పాపులర్. ముత్తు–2, ఆశాకాండ, మోరిని మొదలైన వీడియోల్లో డ్యాన్స్ చేసింది. కన్నప్ప మొదటి తెలుగు సినిమా కాదు. అంతకు ముందు ‘ఓం భీమ్ బుష్’ అనే సినిమాలో శ్రీ విష్ణు పక్కన హీరోయిన్గా నటించింది. తమిళంలో స్టార్ అనే సినిమాలో మొదటిసారి నటించింది. ఆ సినిమా హీరో కెవిన్తో తన పేరు జత చేసి, రూమర్స్ వచ్చినప్పుడు కొంచెం ఫీలయ్యాను అంది. ప్రభాస్తో నటించడం..కన్నప్ప సినిమా కోసం హార్స్ రైడింగ్, కత్తిసాములో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది. గ్లామరస్గా ఎక్స్పోజ్ చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇన్స్టాగ్రామ్లో తన ఫోటో షూట్స్తో ప్రపంచానికి చాటి చెబుతూనే ఉంది. మలయాళంలో మైనే ప్యార్ కియా అనే సినిమా కూడా చేసింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ను కలుస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ ఆయనతో కలిసి యాక్ట్ చేయడం కెరీర్లోనే కిక్ ఇచ్చిన హయ్యస్ట్ మూమెంట్ అంది ప్రీతి ముకుందన్.చదవండి: నలుగురు సంతానం, ఇంకా పిల్లలు కావాలన్నా.. కుటుంబ నియంత్రణపై విష్ణు కామెంట్స్ -
'ఖుషి' ఫ్లాప్ అయితే నేను బతికేవాడిని కాదు: ఎస్జే సూర్య
ఎస్జే సూర్య (S. J. Suryah) మంచి నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా! వాలి, ఖుషి(తమిళ, తెలుగు, హిందీ), నాని, అంబే ఆరుయిరే, పులి, ఇసై వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఖుషి (Kushi Movie) తను డైరెక్ట్ చేసిన రెండో మూవీ. అయితే తొలిరోజు సరిగా రెస్పాన్స్ రాకపోవడం చూసి పిచ్చెక్కిందంటున్నాడు సూర్య. వీర ధీర శూరన్ సినిమా ప్రమోషన్స్లో ఎస్జే సూర్య మాట్లాడుతూ.. ఒక సినిమా డైరెక్ట్ చేయడమంటే.. ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వడంతో సమానం. దర్శకత్వం అనేది చాలా కష్టం.శ్మశానంలో కూర్చున్నట్లు..మనం ఏదైనా మనసుకు నచ్చినట్లు చేసుకుపోతుంటాం. కానీ డైరెక్షన్ చాలా ఒత్తిడితో కూడుకున్న పని. ఖుషి మూవీ ఇప్పుడు సూపర్ హిట్ అని అంటున్నారు. కానీ ప్రీమియర్ రోజు సినిమావాళ్లంతా ఏదో శ్మశానంలో కూర్చున్నట్లుగా సైలెంట్గా సినిమా చూస్తున్నారు. ఎవరి ముఖంలో చిన్న నవ్వు లేదు. నాకు భయమేసింది. అది మాత్రం ఫ్లాప్ అయిందంటే ఈరోజు నేనిక్కడ ఉండేవాడిని కాదు. నాకసలే కొంచెం పిచ్చి. నా సినిమా పోయిందంటే చనిపోయేందుకు కూడా వెనుకాడను. రెండో రోజు సీన్ మారింది.. లేదంటేనా..కానీ తర్వాతి రోజు నుంచి థియేటర్ శ్మశానంలా కాకుండా ఐపీఎల్ స్టేడియంలా మారిపోయింది. చప్పట్లు, విజిల్స్.. సంతోషమేసింది. సినిమా వైఫల్యాన్ని తట్టుకోవడం దర్శకుడికి చాలా కష్టం. సినిమా రిలీజ్కు ముందు కూడా ఇది బాగుందా? లేదా? అని డైలమాలో పడిపోతాడు. తనపై తాను నమ్మకాన్ని కోల్పోతాడు. డైరెక్షన్ చాలా టఫ్ అని చెప్పుకొచ్చాడు సూర్య. ఈయన డైరెక్షన్ను వదిలేసి పదేళ్లవుతోంది. నటుడిగా ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఈయన చేతిలో వీర ధీర శూరన్, ఇండియన్ 3, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సర్దార్ 2 చిత్రాలున్నాయి.చదవండి: నలుగురు సంతానం, ఇంకా పిల్లలు కావాలన్నా.. కుటుంబ నియంత్రణపై విష్ణు కామెంట్స్ -
ఓటీటీలో 25 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతున్న సినిమా
సుమారు 25 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. 2000 ఏడాదిలో థియేటర్స్లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ 'మలేనా' ఓటీటీ ప్రియుల కోసం రానుంది. లూసియానో విన్సెంజోని కథ నుండి గియుసేప్ టోర్నాటోర్ రచించి దర్శకత్వం వహించిన ఈ శృంగార నాటక చిత్రం అప్పట్లో సంచలనం రేపింది. 73వ అకాడమీ అవార్డ్స్లో సత్తా చాటిన మలేనా.. బాక్సాఫీస్ వద్ద ఆరోజుల్లోనే రూ. 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్కు కూడా నామినేట్ అయింది.'మలేనా' చిత్రం సడెన్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ మూవీ చూడాలంటే రూ. 99 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 29 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. టైటిల్ పాత్రలో ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి (Monica Bellucci) కనిపిస్తుంది. ఆమె ఒక ఆర్మీ ఆధికారి భార్యగా అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. 12 ఏళ్ల బాలుడి రెనాటో పాత్రలో గియుసేప్ సల్ఫారో (Giuseppe Sulfaro) మెప్పించాడు. సినిమా మొత్తం వీరిద్దరి మధ్య జరిగే ఆర్షణ, ప్రేమ చుట్టూ ఉంటుంది. ఒక అందమైన అమ్మాయి ఒంటరిగా జీవిస్తుంటే ఈ సమాజం ఏ విధంగా చిత్రీకరిస్తుంది అనేది ప్రధాన కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు.కథేంటి..?ఆ నగరంలో అత్యంత అందమైన యువతిగా మలేనా ఉంటుంది. ఆమె భర్త దేశ సరిహద్దుల్లో ఉద్యోగ రిత్యా ఉండటంతో ఆమెకు దగ్గర కావాలని చాలామంది ఆశ పడుతుంటారు. కానీ, తను మాత్రం వాటిని పట్టించుకోకుండా వెళ్లిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో 12 ఏళ్ల బాలుడు రెనాటో కూడా ఆమెను ఇష్టపడుతాడు. అయితే, ఆమెను షాడోగా మాత్రమే వెంబడిస్తూ ఆమె విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. మెలేనాకు దగ్గర కావాలని కలలు కంటూ ఉంటాడు. ఇంతలో ఆమె భర్త మరణించారని వార్త రావడంతో ఆమెకు చాలా ఇబ్బందులు ఎదురౌతాయి.. వాటిని అధిగమించేందుకు ఆమె ఒక వేశ్యగా మారుతుంది. దీంతో నగరంలోని చాలామంది మహిళలు ఆమెను దూషించడం జరుగుతుంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న ఆమె ముందుకు ఒకరోజు సడెన్గా తన భర్త ప్రత్యక్షమౌతాడు. తాను మరణించలేదని, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్తాడు. అయితే, ఒక వేశ్యగా మారిన ఆమెతో అతను కలిసి జీవిస్తాడా..? ఆమె ఎందుకు అలాంటి పని చేయాల్సి వచ్చింది..? ఆమెకు 12 ఏళ్ల రెనాటో చేసిన సాయం ఏంటి..? వంటి అంశాలతో పాటు సమాజంలో ఒంటరి మహిళ పట్ల ఉన్న అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఇందులో చక్కడ చూపారు. ఈ కథ అంతా 1940 నాటి కాన్సెప్ట్తో చిత్రీకరించారు. -
నలుగురు సంతానం, ఇంకా పిల్లలు కావాలన్నా.. కుటుంబ నియంత్రణపై విష్ణు కామెంట్స్
మంచు విష్ణు (Vishnu Manchu) హిట్ అందుకుని చాలాకాలమే అయింది. ఈసారి హిట్ కాదు ఏకంగా బ్లాక్బస్టర్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు. అందుకోసం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie)ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇందులో మంచు విష్ణు కన్నప్పగా నటించాడు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్బాబు నిర్మించాడు. అక్షయ్కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.కుటుంబ నియంత్రణ?దీంతో ప్రమోషన్స్ షురూ చేశాడు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడికి కుటుంబ నియంత్రణ గురించి ప్రశ్న ఎదురైంది. అందుకు మంచు విష్ణు స్పందిస్తూ.. అది వ్యక్తిగత అభిప్రాయం. నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పటికే నాకు నలుగురు పిల్లలున్నారు. ఇంకా పిల్లలు కావాలన్నాను. దానికి నా భార్య విరానిక (Viranica Manchu) అలాగైతే వేరొకరిని వెతుక్కుపో.. అంది. విరానిక బెదిరింపులుఅయితే సరేనన్నాను. అవునా.. అయితే వెతికి చూడు అని విరానిక బెదిరించింది.. అందుకే ఆగిపోయాను అన్నాడు మంచు విష్ణు. విష్ణు.. 2009లో విరానికను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2011లో కవలలు జన్మించారు. వారికి అరియానా, వివియానా అని నామకరణం చేశారు. 2018లో కుమారుడు అవ్రమ్ పుట్టాడు. 2019లో కూతురు ఐరా జన్మించింది. కన్నప్ప సినిమాలో అవ్రమ్.. బాల తిన్నడు/కన్నప్పగా నటించాడు.చదవండి: మొదటి భార్యకు విడాకులు.. దేవదాసులా తాగుడుకు బానిసయ్యా..: హీరో -
'రాను.. బొంబాయి'కి అంటూనే లక్షల్లో కొల్లగొట్టేశారు
అద్దాల మేడలున్నాయే.. మేడల్లా మంచి చిరాలున్నాయే అంటూనే 'రాను బొంబాయికి రాను' అనే లిరిక్స్తో ఒక ఫోక్ సాంగ్ రెండు నెలలుగా నెట్టింట దుమ్మురేపుతుంది. ఈ పాట కోసం రాము రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులకు సోషల్మీడియా దద్దరిల్లిపోయింది. అయితే, ఈ పాటను రాము రాథోడ్ రచించడమే కాకుండా సింగర్ ప్రభతో ఆలపించాడు. శేఖర్ వైరస్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన ఈ పాటను వాలి నిర్మించారు. కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. అయితే, ఇప్పటికే వారి అధికారిక యూట్యూబ్ ఛానల్లోనే 115 మిలియన్లకు పైగానే వ్యూస్ సాధించి టాప్ వన్ మ్యూజిక్ వీడియో విభాగంలో కొనసాగుతుంది. భాషతో సంబంధం లేకుండా ఇతరులు కూడా వేలల్లో తమ కామెంట్లతో వారిని ప్రశంసిస్తున్నారు. ఈ సాంగ్ నిర్మించడం కోసం సుమారు రూ. 5 లక్షల వరకు ఖర్చు చేశామని రాము రాథోడ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, ఇప్పటి వరకు ఈ సాంగ్ వల్ల తమకు సుమారు రూ. 20 లక్షల వరకు ఆదాయం వచ్చిందని చెప్పడం విశేషం. ఈ సాంగ్ మీద మిలియన్ల కొద్ది రీల్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఏడాదిలో వచ్చిన ఫోక్ సాంగ్స్లలో ఇది టాప్లో ట్రెండ్ అవుతుంది.'సొమ్మసిల్లి పోతున్నవే ఓచిన్న రాములమ్మ' సాంగ్ను కూడా రాము రాథోడ్ రచించడమే కాకుండా ఆలపించాడు కూడా.. 2022లో రిలీజైన ఈ పాట 290+ మిలియన్ (29 కోట్లకుపైగా) వ్యూస్ సాధించింది. అప్పట్లో ఈ సాంగ్ యూట్యూబ్లో ఓ సెన్సేషన్.. అందుకే ఇదే సాంగ్ను ‘మజాకా’ సినిమాలో రీ క్రియేట్ చేశారు. -
ఓటీటీలో 'మజాకా'.. స్ట్రీమింగ్ వైరల్
సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపోందిన సినిమా ‘మజాకా’(Mazaka) . ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ‘మజాకా’ నవ్వుల కోసమే... లాజిక్స్ కోసం కాదని చెప్పినట్లుగాను ఈ మూవీ ఉంటుంది. పూర్తి వినోదాన్ని అందించిన ఈ చిత్రంలో రావు రమేశ్( Rao Ramesh), రీతూవర్మ(Ritu Varma), అన్షు ప్రధాన పాత్రలలో నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేశ్ దండా, నిర్మాత అనిల్ సుంకర తెరకెక్కించారు.మజాకా సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 28న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు నెట్టింట ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. సినిమా వినోదాత్మకంగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా సందీప్ కిషన్, 'మన్మథుడు' పేమ్ అన్షు భారీగానే కష్టపడ్డారు. అయినప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఓటీటీ డీల్ మాత్రం మంచి ధరకే కుదిరినట్లు తెలుస్తోంది.కథేంటంటే.. వెంకటరమణ అలియాస్ రమణ(రావు రమేశ్) ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని కొడుకు కృష్ణ(సందీప్ కిషన్) ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. రమణ మాత్రం ఇంట్లో ఆడదిక్కు లేదని.. కొడుక్కి త్వరగా పెళ్లి చేసి ఓ ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలని ఆశ పడుతుంటాడు. కానీ..ఆడదిక్కు లేని ఇంటికి పిల్లని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో పెళ్లిళ్ల బ్రోకర్ ఇచ్చిన సలహాతో ముందుగా తానే పెళ్లి చేసుకొని..ఆ తర్వాత కొడుక్కి పిల్లని వెతుకుదామని ఫిక్స్ అవుతాడు. అదే సమయంలో బస్స్టాఫ్లో యశోద(అన్షు)ని చూసి ఇష్టపడతాడు.మరోవైపు కృష్ణ కూడా మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. ఇలా తండ్రికొడుకులిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకేసారి ప్రేమలో పడిపోతారు. వీరిద్దరి ప్రేమలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఇంజనీరింగ్ చదివే కొడుకు ఉన్న రమణ ప్రేమను యశోద ఎలా ఒప్పుకుంది? పగతో రగిలిపోయే వ్యాపారవేత్త భార్గవ్ వర్మ(మురళీ శర్మ)తో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు తండ్రికొడుకుల ఆశపడినట్లు ఇంట్లోకి ఫ్యామిలీ ఫోటో వచ్చిందా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
500 మంది డ్యాన్సర్లతో త్రిష మాస్ జాతర సాంగ్
కోలీవుడ్ నటుడు సూర్య, నటి త్రిష మాస్ జాతర సాంగ్తో తెరపై దుమ్ము రేపటానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఈ పాటలో 500 మంది డాన్సర్లు పాల్గొనబోతున్నారు. ఇది ఏచిత్రం కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సూర్య తన 45వ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో ఆయన ప్రతి నాయకుడిగానూ నటిస్తున్నట్లు సమాచారం. కాగా నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఇందులో నటి శ్వాసిక , ఇందిరస్, యోగిబాబు, షివాద, సుప్రీత్రెడ్డి, నట్టి నటరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటుడు సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసింది. అందులో ఒకటి న్యాయవాది పాత్ర అని సమాచారం. అదేవిధంగా ఇది న్యాయస్థానంలో జరిగే కేసు నేపథ్యంగా సాగే వైవిద్య భరిత కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. తదుపరి చెన్నైలోని ఈ సీ ఆర్రోడ్లో వేసిన భారీ సెట్లో ఈ చిత్రానికి సంబంధించిన ఒక మాస్ జాతర పాటను చిత్రీకరించడానికి యూనిట్ సన్నద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన ఫోక్ సంగీత బాణీలు కట్టిన ఈ మాస్ జాతర పాటలో సూర్య, త్రిషలతో పాటు 50 మంది డాన్సర్లు నటించబోతున్నట్లు తెలిసింది. దీనికి శోభి మాస్టర్ నృత్య దర్శకత్వం వహించనున్నారని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఈ ఒక్క పాట కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. నటుడు సూర్య నటించిన రెట్రో మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. నటి పూజా హెగ్డే కథానాయకిగా నటించిన ఈ చిత్రం మే 1న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. -
ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, ధోనీ.. హెయిర్ కట్ కోసం ఎంత చెల్లిస్తారంటే..
జీవితంలో ఏదైనా జరగవచ్చు. సాధారణ వృత్తి అనుకున్న దానిలో కూడా లక్షలు గడించవచ్చు. అందరూ చేసే అదే వృత్తిలో కొందరు మాత్రమే పాపులర్ అవుతుంటారు. దీన్నే లక్ అంటారనుకుంటా.. కానీ, దాని వెనుక ఎంతో కష్టం కూడా ఉండొచ్చు. కొందరి జీవిత సక్సెస్ స్టోరీలు చూస్తే మనకు నిజమే అనిపిస్తుంది. అందుకు చిన్న ఉదాహరణ ఆలీమ్ హకీమ్. సాధారణంగా ఒక సెలూన్ షాప్నకు వెళితే అక్కడ ఒక మనిషి హెయిర్ కటింగ్కు రూ.150 తీసుకుంటారు. లగ్జరీ సెలూన్ అయితే రూ.500 తీసుకుంటారు. ఇక సెలబ్రిటీస్కు ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తుండవచ్చు. అయితే ఒక్కసారి కటింగ్కు లక్షల్లో చెల్లించడం అనేది ఎప్పుడైనా విని ఉంటామా..? మనం విని ఉండకపోవచ్చు. ఇది జరుగుతున్న వాస్తవం. ఆలీమ్ హకీమ్ అనే హెయిర్స్టర్ గురించే ఇదంతా. ఇతను హాలీవుడ్ హెయిర్స్టర్. మొదట్లో ఒకరికి హెయిర్ కట్ చేస్తే రూ.20 తీసుకునేవారట. ఆ తరువాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఇప్పుడు మినిమమ్ లక్ష రూపాయల వరకూ తీసుకుంటున్నారని సమాచారం. ఏంటి ఒకసారి జుత్తు కట్ చేస్తే లక్ష ఎవరు చెల్లిస్తారు ? అని ఆశ్చర్యపోతున్నారా. నిజమేనండి..? ఇది కూడా మినిమమ్ ధర మాత్రమేనట.. అత్యధికంగా ఆయన రూ.2.5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని సమాచారం. ఆలీమ్ హకీమ్ ఇప్పుడు సాదారణ హెయిరిస్ట్ కాదు. సెలబ్రిటీల హెయిరిస్ట్. అదీ మామూలు సెలబ్రిటీలకు కాదు. సూపర్స్టార్స్కు హెయిర్స్టర్. ఈయన తల మీద కత్తెర పెట్టారంటే అక్షరాలు లక్ష చెల్లించాల్సిందేనట. హాలీవుడ్కు చెందిన ఈయనకు కస్టమర్స్ అందరూ ఇండియాకు చెందిన వారే కావడం విశేషం. ఆలీమ్ హకీమ్ కస్టమర్స్ లిస్ట్ ఇదేఈయనకు సినీ, క్రికెట్ క్రీడాకారుల మధ్య మంచి క్రేజ్ ఉంది. ఈయన కస్టమర్లంతా సినీస్టార్స్, క్రికెట్స్టార్స్ వంటి వారే. అందులో సూపర్స్టార్ రజనీకాంత్,విజయ్ సేతుపతి, టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అభిషేక్ బచ్చన్, క్రికెట్ స్టార్ ఎంఎస్.ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్,చాహల్ వంటి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. రజనీకాంత్ తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు హెయిర్స్టర్గా పని చేసింది ఆలీమ్ హకీమే. అటువంటింది ఆయన హెయిర్స్టైల్ పని తనం. ఏదైనా ఒక్కసారి పాపులర్ అయితే ఆ తరువాత పేరైనా, డబ్బైనా వెతుక్కుంటూ వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. -
తమన్నా కోసమే ఈ పాత్ర పుట్టింది: సంపత్ నంది
‘‘ఓ పల్లెటూరి కథని ఎగ్జయిటింగ్గా, థ్రిల్లింగ్గా చెప్పడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అశోక్ ‘ఓదెల 2’ని ఓ రేంజ్లో తీశారు. నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు కొత్త అనుభూతి దక్కాలని కోరుకుంటాను. అలాంటి సరికొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. భైరవి క్యారెక్టర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తమన్నా తెలిపారు. ఆమె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ రూపొందింది.అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా ఇతర పాత్రల్లో నటించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మించారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘ఓదెల రైల్వేస్టేషన్’ చూసినప్పుడే పార్ట్ 2 ఉండాలని భావించాను. సంపత్ నందిగారు పార్ట్–2 ఐడియా చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను.నా కెరీర్లో అత్యధిక ఐ షాట్ క్లోజప్స్ ఉన్న సినిమా ‘ఓదెల 2’’ అన్నారు. ఈ మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘నేను ఓదెల అనే ఊర్లో పుట్టి, పెరిగాను. చాలా గౌరవంగా, ప్రేమతో ఈ కథ రాశాను. ఓదెలకు ఒక కష్టం వస్తే... ఆ ఊరిలో కొలువై ఉన్న ఓదెల మల్లన్న నాగ సాధు పాత్ర ద్వారా ఆ సమస్యని ఎలా పరిష్కరించారు? అనేది ఈ చిత్రకథ. ఈ పాత్ర తమన్నా కోసమే పుట్టింది’’ అని చెప్పారు. ‘‘కథని నమ్ముకుని తీసిన ‘ఓదెల 2’ని ప్రేక్షకులు థియేటర్స్లో చూసి, ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు డి. మధు. ‘‘ఆకలిగా ఉందని అన్నం కోసం సంపత్ నందిగారి దగ్గరికి వెళ్లాను... ‘ఓదెల 2’ రూపంలో ఆయన బిర్యానీ తినిపించారు’’ అని అశోక్ తేజ అన్నారు. -
ఒకటికి రెండు
తెలుగు సినిమాల గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్, కల్కి 2898 ఏడీ, దేవర, పుష్ప’ వంటి చిత్రాల విజయాలు అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలన్నింటిలోని కామన్ పాయింట్ ఏంటంటే... ఈ సినిమా కథలన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి.అందుకే ఒకటి కాదు... రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సినిమాలన్నీ సూపర్హిట్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఒకటికి రెండు ట్రెండ్ టాలీవుడ్లో ఊపందుకుంది. భారీ కథలు ఎంపిక చేసుకుని, ఆ కథను పలు భాగాలుగా ఆడియన్స్కు చూపిస్తున్నారు మేకర్స్. ఈ కోవలో పెద్ద కథలతో రానున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.ఉగాదికి రిలీజ్ హీరో మహేశ్బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ చిత్రీకరణ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ను ఇటీవలే ఒడిశాలోని కోరాపుట్లో పూర్తి చేశారు. నెక్ట్స్ షెడ్యూల్ను విదేశాల్లో ప్లాన్ చేశారు.కాగా దక్షిణాఫ్రికా, కెన్యా దేశాల్లో ఈ మూవీ చిత్రీకరణ జరగనుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, తొలి భాగం 2026 చివర్లో లేదా 2027 ఉగాది సమయంలో ప్రేక్షకుల ముందుకు రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ‘బాహుబలి’ సినిమా ‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్క్లూజన్’ అంటూ రెండు భాగాలుగా వచ్చి, బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే.ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు కెరీర్లోని ఈ 29వ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైతే, మహేశ్బాబు కెరీర్లో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం ఇదే అవుతుంది.ఈ ఏడాదిలోనే రాజా సాబ్ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా చేసే సినిమాలు భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. రెండు భాగాలుగా వచ్చిన ‘బాహుబలి’ సినిమా బ్లాక్బస్టర్ సాధించడంతో ప్రభాస్ నెక్ట్స్ సినిమాలు కూడా భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ, సలార్’ చిత్రాలు ఫ్రాంచైజీలుగా రానున్నాయి. ఈ రెండు సినిమాల తొలి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్హిట్గా నిలిచిన విషయం తెలిసిందే.మలి భాగాల చిత్రీకరణకు ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ప్రభాస్ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘రాజా సాబ్’ కథ కూడా పెద్దదే. ఈ హారర్ కామెడీ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మూడేళ్లుగా కొనసాగుతోంది. మూడు తరాలు, ఆ తరాలకు చెందిన ఆత్మలు, హారర్ ఎలిమెంట్స్ వంటి అంశాలతో ‘రాజా సాబ్’ మూవీ రెండు భాగాలుగా రానుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు.ఇప్పటికే ‘రాజా సాబ్’ సినిమా నుంచి ప్రభాస్కు చెందిన రెండు డిఫరెంట్ లుక్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది. కానీ కొంత టాకీ పార్టు, సాంగ్స్ షూట్, వీఎఫ్ఎక్స్... వంటివి పెండింగ్ ఉండటంతో ‘రాజా సాబ్’ సినిమా రిలీజ్ వాయిదా పడనుంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందని సమాచారం. వీరమల్లు పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగంగా ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మే 9న విడుదల కానుంది. 17వ శతాబ్దంలో జరిగే ఈ కథలో పవన్ కల్యాణ్ కథ రీత్యా ఓ దొంగ తరహా పాత్రలో కనిపిస్తారని తెలిసింది. ఈ మూవీలో నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, సత్యరాజ్, బాబీ డియోల్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. డబ్బింగ్ పనులూ మొదలయ్యాయి. ఏఎమ్ రత్నం, అద్దంకి దయాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త.కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారట విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో విజయ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నామని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తొలి భాగం మే 30న రిలీజ్ కానుంది. ఈ పీరియాడికల్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్లో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని సమాచారం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరకర్త.కోహినూర్ వజ్రం కోసం...‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందనున్న హిస్టారికల్ ఫిల్మ్ ‘కోహినూర్’. ‘ది కింగ్ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్’ అనేది క్యాప్షన్. గత ఏడాది దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించనున్నారని, 2026 జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామని కూడా అప్పట్లో మేకర్స్ వెల్లడించారు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం అనే అంశం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంది.‘భద్రకాళి దేవత మహిమగల వజ్రం సామ్రాజ్యవాదుల చేతుల్లోకి వెళ్లింది. కోహినూర్ వజ్రాన్ని తిరిగి మూలాలకు తీసుకు రావడానికి ఓ యువకుడు సాగించే, చారిత్రాత్మక ప్రయాణం నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుంది’’ అని ఈ మూవీ గురించి మేకర్స్ పేర్కొన్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ కాంబినేషన్లో ‘క్షణం, కృష్ణ అండ్ హీజ్ లీల’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మూడో చిత్రంగా ‘కోహినూర్’ తెరకెక్కనుంది.ఏటిగట్టు కథలు హీరో సాయిదుర్గా తేజ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న పీరియాడికల్ మాస్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీని దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ యాక్షన్ ఫిల్మ్ కోసం విదేశాల్లో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నారు సాయిదుర్గా తేజ్.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ మూవీలో సంజయ్ దత్ మరో లీడ్ రోల్ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. కాగా ఈ మూవీ కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.స్వయంభూ నిఖిల్ నటిస్తున్న హిస్టారికల్ అండ్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో, భారీ స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సునీల్ ఓ సర్ప్రైజింగ్ క్యారెక్టర్లో కనిపించనున్నారని తెలిసింది. కాగా ఈ మూవీ చిత్రీకరణ 95 శాతం పూర్తయినట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నిఖిల్.‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుందని ఫిల్మ్నగర్ సర్కిల్స్లో ప్రచారం సాగుతోంది. తొలి భాగాన్ని ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ వంటి విద్యల్లో నిఖిల్ ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. మిరాయ్ సాహసాలు ‘హను–మాన్’తో భారీ బ్లాక్బస్టర్ హిట్ను సాధించారు హీరో తేజ సజ్జా. ఆ మూవీ తర్వాత తేజ సజ్జా చేస్తున్న మరో మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్నారు.ఈ సినిమాలో తేజ సజ్జా సాహసాలు, యాక్షన్ సీక్వెన్స్ సూపర్గా ఉంటాయట. కాగా ‘మిరాయ్’ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాను ఈ ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. సో... ఆ రోజున ‘మిరాయ్’ సినిమా తొలి భాగం విడుదల కావొచ్చని ఊహించవచ్చు. ఇలా రెండు భాగాలుగా విడుదల కానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
జూన్లో థగ్ లైఫ్
కమల్హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. ‘నాయగన్’ (1987) వంటి హిట్ మూవీ తర్వాత 38 సంవత్సరాలకు వీరి కాంబినేషన్లో వస్తున్న ద్వితీయ చిత్రమిది. శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.కమల్హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకుడిగా, రవి కె. చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. -
ప్రభాస్కి అన్నయ్యగా..?
ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించనున్నారట. అది కూడా ప్రభాస్కి అన్నయ్య పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్. తనదైన యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాని తీర్చిదిద్దనున్నారట సందీప్. ఈ మూవీలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు ప్రభాస్.ఇందులో యాక్షన్ ఓ రేంజ్లో ఉంటుందని భోగట్టా. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందనుంది. బాలీవుడ్లో సంజయ్ దత్కి ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్కి అన్నయ్యగా ఆయన్ని తీసుకోనున్నారట సందీప్. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కి సంజయ్ అయితే పక్కాగా సరితూగుతారన్నది దర్శకుడి ఆలోచనట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. మరి ‘స్పిరిట్’లో సంజయ్ దత్ భాగం అవుతారా? లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. -
ఇఫ్తార్ పార్టీలో నమ్రత-ఉపాసన.. ఫొటోలు వైరల్
పార్టీలంటే మహేశ్-నమ్రత ఎప్పుడూ జంటగానే వెళ్తారు. కానీ ప్రస్తుతం రాజమౌళి మూవీ వల్ల మహేశ్ బయటకు రాకూడదు కాబట్టి నమ్రత ఒక్కతే పార్టీలకు వెళ్తోంది. ఈమెకు తోడుగా చరణ్-ఉపాసన కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి మరో పార్టీ జరిగింది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. ఇప్పటికీ తెగని పంచాయితీ!)నమ్రత-ఉపాసనలకు ఫ్రెండ్ అయిన షీమా నజీర్.. శుక్రవారం రాత్రి ఇఫ్తార్ పార్టీ ఇచ్చింది. ఈ వేడుకకు వీళ్లిద్దరు మాత్రమే హాజరయ్యారు. మహేశ్ ఎలానూ ఇప్పుడు రావడానికి కుదరదు. కానీ ఈసారి చరణ్ కూడా రాలేకపోయాడు. దీంతో నమ్రత-ఉపాసన మాత్రమే పార్టీకి వచ్చినట్లు కనిపిస్తుంది. తాజాగా నమ్రత.. కొన్ని ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. వీటిలో ఈమెతో పాటు ఉపాసన.. ముస్లిం ట్రెడిషన్ కి తగ్గ లుక్స్ లో కనిపించడం విశేషం. ప్రస్తుతం రంజాన్ సీజన్ నడుస్తోందిగా. మళ్లీ పండగ రోజు వీళ్లు ఏమైనా పార్టీ చేసుకుంటారేమో చూడాలి?(ఇదీ చదవండి: యష్ 'టాక్సిక్'.. చరణ్ కి కాస్త ఇబ్బందే?) -
'న భూతో న భవిష్యత్' అనేలా నాట్స్ 8వ తెలుగు సంబరాలు.. సెలబ్రిటీలకు ఆహ్వానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society - NATS) 8వ వార్షికోత్సవ తెలుగు సంబరాల ఈవెంట్కు సిద్ధమవుతోంది. అమెరికాలోని టంపాలో జూలై 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తాజాగా హైదరాబాద్లో నాట్స్ 8వ తెలుగు సంబరాల కార్యక్రమ కర్టెన్ రైజర్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సంబరాలు కాన్ఫరెన్స్ కన్వీనర్ అండ్ పూర్వపు చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనిలు అమెరికా నుండి విచ్చేసి మీడియా సమావేశం నిర్వహించారు. నటి జయసుధ, ఆమని, దర్శకులు హరీశ్ శంకర్, మెహర్ రమేష్, సంగీత దర్శకుడు తమన్, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, కళ్యాణ్ చక్రవర్తి, తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని మాట్లాడుతూ.. నాట్స్ అంటే సేవ, భాష.. ఈ రెండు పదాలు గుర్తుకువస్తాయి. అమెరికాలోని తెలుగు వారికి అండగా నిలబడేందుకు 2009లో ఈ ఆర్గనైజేషన్ స్థాపించాం. మా సంస్థ 8వ తెలుగు సంబరాలు కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ వేడుకల్లో 10 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నాం అన్నారు.కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ మాట్లాడుతూ.. తెలుగు భాష చాలా గొప్పది, అలాంటి భాషను కాపాడుకుంటూ మన సంస్కృతీ సంప్రదాయాలను ముందు తరాలకు అందించాలనే ప్రయత్నం నాట్స్ ద్వారా చేస్తున్నాం. మన నాట్స్ సంస్థ 8వ తెలుగు సంబరాలు కార్యక్రమం నభూతో న భవిష్యతి అనేలా చేయబోతున్నాం అన్నారు. నటి జయసుధ మాట్లాడుతూ.. నాట్స్ గత తెలుగు సంబరాలకు కూడా నన్ను ఆహ్వానించారు. అయితే మా మదర్ చనిపోవడం వల్ల వెళ్లలేకపోయాను. ఈ సారి తప్పకుండా వెళ్తాను. ఇటీవల నేను ఇంగ్లీష్ మూవీలో నటించాను. ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు నాట్స్ తెలుగు సంబరాలు జరిగే ప్లేస్ కు దగ్గరలోనే జరిగింది అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ - నాట్స్ గత తెలుగు సంబరాలు ఈవెంట్ లో నేను పాల్గొన్నాను. ఇప్పుడు సెకండ్ టైమ్ వారికి కన్సర్ట్ చేయబోతున్నా. నాతో పాటు దేవిశ్రీ ప్రసాద్ కూడా కన్సర్ట్ లో పాల్గొంటాడు. సంగీత విభావరితో పాటు జూలై 1,2,3 తేదీల్లో క్రికెట్ టోర్నమెంట్ ఆడబోతున్నాం. నాట్స్ 11 టీమ్ మేము మరో టీమ్ పోటీ పడుతున్నాం. అఖిల్, సుధీర్ బాబు.. ఇలా మా టీమ్ అంతా మ్యాచ్ కు రెడీ అవుతున్నాం అన్నారు.చదవండి: నాకు కోపమొస్తే తెలుగులోనే బూతులు తిడతా..: తమన్నా -
విక్రమ్ 'వీర ధీర శూర' ట్రైలర్ రిలీజ్
ప్రయోగాత్మక సినిమాలు తీసే విక్రమ్ లేటెస్ట్ మూవీ 'వీర ధీర శూర'. ఈ మార్చి 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. మాస్ కంటెంట్ తో తీసిన ఈ చిత్ర ట్రైలర్ ని తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. ఇప్పటికీ తెగని పంచాయితీ!)కంటెంట్ ఎక్కువగా రివీల్ చేయకుండా విక్రమ్ పాత్ర ఏంటనేది చూపించారు. కేవలం నిక్కర్ తో నడిచొచ్చే షాట్ బాగుంది. ఈ సినిమాలో ఎస్జే సూర్య, మలయాళ నటుడు సూరజ్ వెంజుమోడు కీలక పాత్రలు పోషించారు. దుషారా విజయన్ హీరోయిన్.ఇప్పుడు పార్ట్-2ని తొలుత రిలీజ్ చేయబోతున్నారు. ఇది హిట్ అయితే తొలి భాగాన్ని తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. 'చిన్నా' ఫేమ్ అరుణ్ కుమార్ దర్శకుడు.(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో) -
ఐపీఎల్ ఆరంభం.. తెలుగు పాటతో అదరగొట్టిన శ్రేయా ఘోషల్
క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ కొత్త సీజన్ (IPL 2025) మొదలైంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మొదటగా స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ప్రసంగించాడు. అనంతరం సింగర్ శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) తన గాత్రంతో అందరినీ మైమరిపించింది. బ్లాక్బస్టర్ హిందీ సాంగ్స్తో ఆడియన్స్లో జోష్ నింపింది. అలాగే అల్లు అర్జున్ బ్లాక్బస్టర్ మూవీ 'పుష్ప 2' (Pushpa 2: The Rule)లోని సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ.. పాటను తెలుగులో పాడి అదరగొట్టింది.టాప్ సింగర్..శ్రేయా ఘోషల్ విషయానికి వస్తే.. ఈమె ఏ భాషలోనైనా ఇట్టే పాటలు పాడగలదు. తెలుగులో.. నువ్వేం మాయ చేశావో గానీ.. (ఒక్కడు), నమ్మిన నా మది.. (రాఘవేంద్ర), కోపమా నాపైనా.. (వర్షం), నీకోసం నీకోసం..(నేనున్నాను), అందాల శ్రీమతికి (సంక్రాంతికి), పిల్లగాలి అల్లరి (అతడు), జలజలజలపాతం నువ్వు.. (ఉప్పెన), సూసేకి అగ్గిరవ్వమాదిరి (పుష్ప 2), హైలెస్సో హైలెస్సా.. (తండేల్).. ఇలా చెప్పుకుంటూ పోతే వందలకొద్దీ పాటలు పాడింది.చదవండి: నాకు కోపమొస్తే తెలుగులోనే బూతులు తిడతా..: తమన్నా -
'గేమ్ ఛేంజర్'.. ఇప్పటికీ తెగని పంచాయితీ!
ఈ సంక్రాంతికి వచ్చిన 'గేమ్ ఛేంజర్' (Game Changer) ఘోరమైన ఫ్లాప్. ఇది అందరికీ తెలుసు. తప్పు ఎవరిదనేది పక్కనబెడితే అక్కడితో టాపిక్ ఎండ్ అయిపోయింటే బాగుండేదేమో! కానీ రిలీజై రెండు నెలలు దాటిపోయినా సరే ఎక్కడో చోట సినిమా టాపిక్ వినిపిస్తూనే ఉంది. తాజాగా నిర్మాత దిల్ రాజు (Dilraju) వల్ల మరోసారి సోషల్ మీడియాలో ఇది చర్చకు కారణమైంది.ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ విషయానికొస్తే.. మోహన్ లాల్-పృథ్వీరాజ్ 'ఎల్ 2: ఎంపురన్' (L2 Empuran) మూవీ వచ్చే వారం రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. తాము ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోలేదని, లాభాల్లో వాటా తీసుకుంటామని నటుడు పృథ్వీరాజ్ చెప్పారు. అయితే 'గేమ్ ఛేంజర్'కి కూడా తొలుత ఇలానే ఫ్రాపిట్ షేర్ ప్లాన్ అనుకున్నామని.. తర్వాత ప్లాన్ మారిపోయిందని దిల్ రాజు చెప్పారు.(ఇదీ చదవండి: యష్ 'టాక్సిక్'.. చరణ్ కి కాస్త ఇబ్బందే?)అంతకు ముందు 'గేమ్ ఛేంజర్' రిలీజైన కొన్నిరోజులకు మీడియాతో మాట్లాడిన దర్శకుడు శంకర్.. 5 గంటల పుటేజీ రావడంతో తాను అనుకున్న మంచి సీన్లు సినిమాలో పెట్టలేకపోయానని, అందుకే ఫ్లాప్ అయిందని చెప్పుకొచ్చాడు.రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. హుక్ స్టెప్స్ లేకపోవడం వల్లే 'గేమ్ ఛేంజర్' పాటలు ఫెయిల్ అయ్యాయని అన్నాడు. కొరియోగ్రాఫర్, హీరోనే దీనికి కారణమన్నట్లు కామెంట్స్ చేశాడు. ఇలా ఎవరికీ వాళ్లు ఏదో ఒకటి చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఈ 'గేమ్ ఛేంజర్' పంచాయితీ ఎప్పుడు ఆగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో) -
నాకు కోపమొస్తే తెలుగులోనే బూతులు తిడతా..: తమన్నా
పదిహేనేళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. ఇది 2021లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్కు సీక్వెల్గా తెరకెక్కింది. హెబ్బా పటేల్, వశిష్ట సింహ కీలక పాత్రలు పోషించారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించాడు.శనివారం నాడు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 17న ఓదెల 2 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో తమన్నా ముఖం రక్తసిక్తంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. అందరూ నన్ను తెలుగమ్మాయే అనుకుంటారు. నేను కూడా అలాగే ఫీలవుతాను. నాకు కోపం వచ్చినప్పుడు తెలుగే మాట్లాడతాను. తెలుగులోనే తిడతాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఓదెల 2 కోసం తమన్నా మాంసాహారం తినడం కూడా మనేసింది. A PRESENCE TO BE FELT. #Odela2 on April 17th. 🙏@iamsampathnandi @dimadhu @alle_ashok_teja @ihebahp@imsimhaa @b_ajaneesh @soundar16 @neeta_lulla@madhucreations9 pic.twitter.com/ihUozJX6Rt— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 22, 2025 చదవండి: నన్ను తిట్టించడం కోసం లక్షలు ఖర్చు చేశారు: పూజా హెగ్డే -
యష్ 'టాక్సిక్'.. చరణ్ కి కాస్త ఇబ్బందే?
'కేజీఎఫ్' పేరుతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ గుర్తొస్తారు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలతో వీళ్ల కెరీరే మారిపోయింది. ప్రస్తుతం నీల్.. తారక్ తో మూవీ చేస్తుండగా, యష్ 'టాక్సిక్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తీస్తున్న 'టాక్సిక్'.. భారీ స్థాయిలో తీస్తున్నారు. కొన్నిరోజుల క్రితం బెంగళూరులో షూటింగ్ వల్ల ఈ మూవీ వివాదంలోనూ చిక్కుకుంది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలోకి వస్తామని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)మార్చిలో అంటే పరీక్షల సీజన్. అయినా సరే యష్ వస్తున్నాడంటే సాహసమనే చెప్పాలి. మరోవైపు తర్వాత వారమే అంటే మార్చి 26న నాని 'ప్యారడైజ్' రిలీజ్ కానుంది. మరోవైపు రామ్ చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్టుని కూడా 26నే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది ఫిక్స్ అయితే మాత్రం 'టాక్సిక్' వల్ల చరణ్ కి కాస్త ఇబ్బంది ఉండొచ్చు.ఎందుకంటే యష్, చరణ్.. ఇద్దరివీ పాన్ ఇండియా మూవీసే. వారం గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రిలీజై హిట్ అయితే పర్లేదు. లేదంటే మాత్రం ఒకరి వల్ల మరొకరికి వసూళ్లపై దెబ్బ పడే ఛాన్స్ ఉండొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా) -
నన్ను తిట్టించడం కోసం లక్షలు ఖర్చు చేశారు: పూజా హెగ్డే
సెలబ్రిటీలకు పొగడ్తలే కాదు విమర్శలు కూడా వస్తుంటాయి. హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా ఎన్నోసార్లు ట్రోలింగ్ బారిన పడింది. అయితే డబ్బులిచ్చి మరీ తనను తిట్టించడం షాక్కు గురి చేసిందంటోందీ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. పీఆర్(Public Relations) స్ట్రాటజీలతో నాపై ట్రోలింగ్ చేయించారు. అది నన్నెంతగానో షాక్కు గురి చేసింది. డబ్బు ఖర్చు చేసి మరీ తిట్టించారుమీమ్ పేజెస్ వరుసగా నన్ను తిడుతూ పోస్టులు పెడుతున్నాయి. అరె, ఇదేంటి? నా గురించి కంటిన్యూగా తిడుతూనే ఉన్నారేంటి.. అనుకున్నాను. కావాలనే టార్గెట్ చేశారని తర్వాత తెలిసింది. నన్ను కిందకు లాగడానికి కొందరు ఈ రకంగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తెలుసుకున్నాను. అప్పుడు నేను, నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డాం. ఇంత దిగజారతారా? అని షాకయ్యాను. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ట్రోలింగ్ (Trolling) చేయించారు. లక్షలు ఖర్చు చేశారునన్ను కిందకు లాగాలని చూస్తున్నారంటే వారికంటే ఒక మెట్టు పైనున్నట్లే కదా! నా పేరెంట్స్కు ఆందోళన పడొద్దని ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాను. మరోవైపు ట్రోలింగ్ తారాస్థాయికి చేరింది.. నన్ను ట్రోల్ చేయడానికి లక్షలు ఖర్చు పెట్టారు. అసలు వారి బాధేంటో కనుక్కోమని నా టీమ్కు చెప్పాను. వాళ్లు మీమ్ పేజెస్ను సంప్రదించగా.. నన్ను తిట్టేందుకు ఫలానా మొత్తం ఇస్తున్నారని చెప్పారు. చెప్పినంత డబ్బిస్తే ట్రోలింగ్ ఆపేస్తారట!ట్రోలింగ్ను ఆపేయాలన్నా.. అవతలివారిని తిట్టాలన్నా మీరు కూడా ఇంత మొత్తం ఇస్తే సరిపోతుందని ఆఫర్ ఇచ్చారు. నాకది మరీ వింతగా అనిపించింది. ఇలాంటి పీఆర్ స్టంట్లు నాకు నచ్చవు. కొన్నిసార్లు భయంకరమైన కామెంట్లు పెడుతుంటారు. చెడుగా కామెంట్ చేసిన వ్యక్తి ప్రొఫైల్లోకి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. కనీసం ఒక ఫోటో, పోస్ట్లాంటివేవీ ఉండదు. కేవలం ఎవరో ఆశ చూపించిన డబ్బుకోసం కక్కుర్తి పడి ఇలా తిడుతున్నారని ఇట్టే అర్థమైపోతుంది అని చెప్పుకొచ్చింది.టాలీవుడ్కు దూరమైన బుట్టబొమ్మఒకప్పుడు టాలీవుడ్(Tollywood)లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన పూజా హెగ్డే.. తెలుగు వెండితెరపై కనిపించి చాలాకాలమే అవుతోంది. 2022లో రాధేశ్యామ్, ఆచార్య సినిమాలతో మెరిసింది. ఎఫ్ 3లో లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా పాటలో తళుక్కుమని మెరిసింది. మళ్లీ ఇంతవరకు తెలుగులో కనిపించనేలేదు. ప్రస్తుతం హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. సూర్యతో రెట్రో, రాఘవ లారెన్స్తో కాంచన 4, విజయ్తో జన నాయగన్లో నటిస్తోంది. బాలీవుడ్లో వరుణ్ ధావన్తో హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ చేస్తోంది.చదవండి: నీదీ నాది ఒకే కథ.. బంధువులే అసభ్యంగా.. ఏడ్చేసిన వరలక్ష్మి -
పూజా హెగ్డే భక్తి.. జిగర్తాండతో దివ్య భారతి!
సమ్మర్ హీట్.. జిగర్తాండతో హాట్ హీరోయిన్ దివ్య భారతిపెయింటింగ్ వేస్తూ చిల్ అవుతున్న 'మన్మథుడు' అన్షుపాలరాతి శిల్పంలా తళతళా మెరిసిపోతున్న తమన్నాఇద్దరు పిల్లలకు తల్లయినా అందంలో ప్రణీత తగ్గేదే లేరిషికేష్ లో గంగా హారతి కార్యక్రమంలో పూజా హెగ్డేఫన్నీ పోజులిచ్చిన యాంకర్ రష్మీ గౌతమ్వయసుతో పాటే అందాన్ని పెంచేస్తున్న శ్రియ శరణ్ View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Akshay Amberkar (@akshay_26) -
నిధి అగర్వాల్.. ఓ వింత కండీషన్
హీరోయిన్లు చాలామంది సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో ఛాన్సుల్ని అందుకునే విషయంలో పలు సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ నిధి అగర్వాల్ కి మాత్రం తొలి మూవీ చేసేటప్పుడు వింతైన కండీషన్ పెట్టారట. అది చూసి ఈమె షాకైందట.(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)''మున్నా మైకేల్' మూవీతో నా కెరీర్ మొదలైంది. ఇదో బాలీవుడ్ మూవీ. టైగర్ ష్రాఫ్ హీరో. ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత నాతో ఓ కాంట్రాక్ట్ పై సంతకం చేయించారు. అందులో నో డేటింగ్ అనే కండీషన్ కూడా ఉంది. అంటే సినిమా పూర్తయ్యేవరకు హీరోతో నేను డేటింగ్ చేయకూడదనమాట.కాంట్రాక్ట్ మీద సంతకం పెడుతున్నప్పుడు ఇవన్నీ గమనించలే గానీ తర్వాత వీటి గురించి తెలిసి ఆశ్చర్యపోయాను' అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం తెలుగులో హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలు చేస్తున్న నిధి.. ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడింది. 'మంచి, చెడు చెప్పడానికి పద్ధతి ఉంది. హద్దులు దాటి అసభ్యంగా మాట్లాడటం మాత్రం సరికాదు. నేను అస్సలు ఇలాంటివి పట్టించుకోను' అని నిధి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా) -
బాలీవుడ్లో ఒక్క హీరోకు కూడా చేతకాలేదు, కానీ అల్లు అర్జున్..: గణేశ్ ఆచార్య
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. అలాగే 24 విభాగాలు సరిగా పనిచేస్తేనే సినిమా సంపూర్ణమవుతుంది. కానీ సినిమా విజయం సాధించినప్పుడు చాలామంది కేవలం దర్శకులు, హీరోలను మాత్రమే మెచ్చుకుంటారు. ఆ విజయానికి దోహదపడ్డవారిని ప్రత్యేకంగా గుర్తించరు. అయితే దక్షిణాదిన మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందంటున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య (Ganesh Acharya). ముఖ్యంగా అల్లు అర్జున్ పిలిచి మరీ అభినందించడం మర్చిపోలేనంటున్నాడు. ఇతడు పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ అందించాడు.ఒకేసారి మేకప్తాజాగా కమెడియన్ భారతీ సింగ్ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గణేశ్ ఆచార్య మాట్లాడుతూ.. 'దక్షిణాదిలో టెక్నీషియన్లకు గుర్తింపు, గౌరవం ఇస్తారు. నటీనటులు పదేపదే మేకప్స్ వేసుకోరు. ఉదయం ఒక్కసారి మేకప్ వేసుకున్నాక నేరుగా లంచ్కు వెళ్లిపోతారు. ఆ మధ్యలో మళ్లీ ముఖానికి రంగు పూసుకోవడం ఉండదు. మేనేజర్ల హడావుడి అసలే ఉండదు. అంతా ఒక పద్ధతిగా సాగిపోతుంది.చివరి నిమిషంలో డ్యాన్స్ స్టెప్పులు మార్చమంటారుడ్యాన్స్ విషయానికి వస్తే.. చాలామంది దర్శనిర్మాతలు మా కొరియోగ్రఫీ బాగుందని, దాన్ని యథాతథంగా పాటలో ఉంచాల్సిందేనని మా ముందు బీరాలు పలుకుతారు. కానీ స్టార్ హీరోల ముందు మాత్రం మౌనంగా ఉండిపోతారు. వారు అభ్యంతరం చెప్పగానే చివరి నిమిషంలో స్టెప్పుల్ని మార్చేయమంటారు. ఆ పాట కోసం మేమెంత కష్టపడ్డామన్నది పట్టించుకోరు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా నాకెంతో బాధగా అనిపిస్తుంది.మనకు ఇగో ఎక్కువ.. కానీ సౌత్లో..బాలీవుడ్లో జనాలు కేవలం హీరోనే పొగుడుతారు. దర్శకుడు, కొరియోగ్రాఫర్, టెక్నీషియన్ల ప్రతిభను, కష్టాన్ని ఏమాత్రం గుర్తించరు. పైగా మనకు ఇగోలు ఎక్కువ. కానీ సౌత్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పుష్ప పాటలకు నేను కొరియోగ్రఫీ చేసిన కొద్ది రోజుల తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) నన్ను పిలిచి మరీ అభినందించాడు. మాస్టర్, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది అని మెచ్చుకున్నారు. బాలీవుడ్లో అలా అభినందించిన హీరో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. (చదవండి: విశాల్ చెల్లెలి భర్తపై సీబీఐ కేసు)పుష్ప సక్సెస్ పార్టీకి ఆహ్వానంకానీ అల్లు అర్జున్ నన్ను గుర్తించాడు. జనాలు నా డ్యాన్స్ చూసి పొగుడుతున్నారంటే దానికి కారణం మీరే అన్నారు. మనసు సంతోషంతో నిండిపోయింది. అక్కడితో ఆగలేదు. హైదరాబాద్లో జరిగిన పుష్ప సక్సెస్ పార్టీకి నన్ను ఆహ్వానించాడు. తాగి తూలుతూ డ్యాన్స్ చేసే పార్టీ కాదది. ప్రతి టెక్నీషియన్ ఆ పార్టీలో భాగమయ్యాడు. స్టేజీపై పుష్ప సినిమాకు పని చేసిన లైట్మెన్ను కూడా అవార్డుతో సత్కరించారు.బాలీవుడ్ను తక్కువ చేయాలని కాదు!నేను బాలీవుడ్ను తక్కువ చేసి మాట్లాడటం లేదు. హిందీ ఇండస్ట్రీ మాకెంతో ఇచ్చింది. దానివల్లే ఈ స్థాయిలో ఉన్నాం. కానీ కొందరి కారణంగా మన చిత్రపరిశ్రమ అద్వాణ్నంగా మారిపోతోంది. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గణేశ్ ఆచార్య చెప్పుకొచ్చాడు. ఈయన పుష్ప 1లో దాక్కో దాక్కో మేక.., ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా పాటకు కొరియోగ్రఫీ చేశాడు. పుష్ప 2లో సూసేకి అగ్గిరవ్వ మాదిరి.., కిస్సిక్.. పాటకు స్టెప్పులు నేర్పించాడు.చదవండి: ఇంట్లో ఉన్నప్పుడు ఐదారుగురు మంది అసభ్యంగా తాకారు.. ఏడ్చేసిన వరలక్ష్మి -
అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో
తెలుగులో పలు సినిమాల్లో సహాయ పాత్రలు, మరికొన్ని చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు.. రీసెంట్ టైంలో 'మసూద' మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. అలాంటిది తల్లి చివరి కోరిక తీర్చానని చెప్పి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?)2016 నుంచి నటుడిగా అడపాదడపా సినిమాలు చేస్తున్న తిరువీర్.. ఇన్నాళ్లకు సొంతూరిలో ఇల్లు కట్టుకున్నాడు. తాజాగా తన భార్యతో కలిసి గృహప్రవేశం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలు షేర్ చేసుకుని మురిసిపోయాడు. పరేషాన్, టక్ జగదీష్, పలాస్ 1978, జార్జ్ రెడ్డి తదితర చిత్రాల్లోనూ తిరువీర్ నటించాడు. సిన్, మెట్రో కథలు, కుమారి శ్రీమతి తదితర వెబ్ సిరీసుల్లోనూ కనిపించాడు. గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సొంతిల్లు కట్టుకుని తల్లి చివరి కోరికని నెరవేర్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా) -
లూసీఫర్ 2 తెలుగు వెర్షనే చూడండి : పృథీరాజ్ సుకుమార్
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్(Mohanlal), పృథ్వీరాజ్ సుకుమార్(Prithviraj Sukumaran) కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘లూసిఫర్2: ఎంపురాన్’. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మురళీ గోపి కథను అందించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం చిత్రబృందం ప్రీరిలీజ్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పృథ్విరాజ్ సినిమా గురించి మాట్లాడుతూ.. తెలుగులోనే ఈ చిత్రాన్ని చూడాలని కోరాడు. ‘మాములుగా ఏ డెరెక్టర్ అయినా కూడా తన సినిమాను ఒరిజినల్ వెర్షన్ చూడమని చెపుతారు. నేను మాత్రం లూసీఫర్ 2 తెలుగు వెర్షన్ చూడమని సలహా ఇస్తున్నాను. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని తెలుగులోనే చూడండి. ఒరిజినల్ వెర్షన్ చూసిన ఫీలింగే కలుగుతుంది. డబ్బింగ్ విషయంలో టీమ్ బాగా కష్టపడి మంచి ఔట్పుట్ ఇచ్చింది. దిల్ రాజుగారు తెలుగు రాష్ట్రాల్లో మలయాళ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు కానీ.. నేను మాత్రం తెలుగులోనే చూడమని కోరుతున్నాను’ అన్నారు. మోహన్ లాల్ మాట్లాడుతూ.. ‘టాలీవుడ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగులో సినిమా చేయాలని నేను కూడా ఎదురుచూన్నాను. మంచి కథ వస్తే కచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఏ సినిమా ఫైనల్ కాలేదు.అయితే కచ్చితంగా చెబుతాను’ అన్నారు. -
హీరోయిన్తో శ్రీకాంత్ అడ్డాల డేటింగ్.. దర్శకుడి రియాక్షన్
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala) పేరు చెప్పగానే కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, ముకుందా చిత్రాలే ప్రధానంగా గుర్తుకు వస్తాయి. ఆయన డైరెక్ట్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అవి ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండే శ్రీకాంత్ అడ్డాల గురించి కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తన సతీమణితో పలు విబేదాలు రావడంతో ఆయన కోలీవుడ్ హీరోయిన్తో కొంత కాలంగా కలిసి జీవిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కోలీవుడ్ నటుడు, దర్శకుడు పార్ధిబన్ పలు విషయాలు పంచుకున్నారు.ఆర్. పార్తీబన్ (R. Parthiban) నటుడు మాత్రమే కాదు.. దర్శకుడు, నిర్మాత కూడా! దాదాపు 16 సినిమాలకు దర్శకుడిగా, 14 సినిమాలకు నిర్మాతగా పని చేయడం కాకుండా వందకుపైగా సినిమాల్లో యాక్టర్గా మెప్పించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి మాట్లాడారు. కోలీవుడ్లో పార్తీబన్ పరిచయం చేసిన హీరోయిన్తోనే శ్రీకాంత్ అడ్డాల రిలేషన్లో ఉన్నారని రూమర్స్ రావడంతో ఆ ఇంటర్వ్యూలో ఆయనకొక ప్రశ్న ఎదురైంది.వారిద్దరి మధ్య రిలేషన్ రూమర్స్ మాత్రమే..శ్రీకాంత్ అడ్డాల- నటి బ్రిగిడా సాగా మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లుగా వస్తున్న గాసిప్స్ నిజమేనా అని ఆయన్ను ప్రశ్నించగా.. పార్తీబన్ ఇలా చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయిని చిత్రపరిశ్రమకు నేను పరిచయం చేశాను కాబట్టి ఈ ప్రశ్న చాలామంది నన్ను అడిగారు. వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నాకు తెలియదు. కానీ, ఆ అమ్మాయి మాత్రం మంచి నటి. చాలా కష్టమైన పాత్రను కూడా సులువుగా చేస్తుంది. తనలో నటన పరంగా చాలా టాలెంట్ ఉంది. అయితే, ఇలాంటి గాసిప్స్ లను ఆమె పెద్దగా పట్టించుకోదు. ఆమె ఇప్పుడు నాతో టచ్లో లేదు. ఆమె డ్రీమ్ సినిమా మాత్రమే.. ఇలాంటి రిలేషన్స్ పెట్టుకుని తన కెరీర్ను నాశనం చేసుకోదు. వారిద్దరి మధ్య ఇవన్నీ రూమర్స్ మాత్రమేనని నేను అనుకుంటున్నాను.' అని క్లారిటీ ఇచ్చారు.శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో నటించిన బ్రిగిడా సాగాబ్రిగిడా సాగా తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. సింధూరం, పెద కాపు-1 (2023) సినిమాల్లో ఆమె ప్రధాన పాత్రలలో కనిపించింది. అయితే, పెద కాపు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని తెలుస్తోంది. ఇప్పటికే చెన్నైలో బ్రిగిడా సాగాతో శ్రీకాంత్ కలిసే ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆయన సతీమణి రాగసుధాతో విభేదాలు వచ్చాయని సమాచారం అయితే, ఈ రూమర్స్ గురించి వారిద్దరూ ఎక్కడా కూడా రియాక్ట్ కాలేదు. -
‘కాలమేగా కరిగింది’ మూవీ రివ్యూ
ఇండియన్ సినిమాల్లో లవ్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జోనర్. టాలీవుడ్లో అయితే ప్రేమ కథలకు కొదవే లేదు. స్వచ్ఛమైన ప్రేమ కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అలా స్వచ్ఛమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘కాలమే కరిగింది’ (Kalamega Karigindi Telugu Movie Review). ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మించారు. శింగర మోహన్ దర్శకత్వం వహించిన ఈ పొయెటిక్ లవ్ స్టోరీ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఫణి(వినయ్ కుమార్/ అరవింద్(చిన్నప్పటి పాత్ర) ఉన్నత చదువు చదివి బాగా సెట్ అయినా లైఫ్లో ఏదో తెలియని వెలితి ఉంటుంది. తన తొలి ప్రేమ గుర్తుకు వచ్చి.. ప్రియురాలి బిందు((శ్రావణి/నోమిన తార(చిన్నప్పటి పాత్ర)) కోసం సొంత ఊరికి బయలుదేరుతాడు. వీరిద్దరి మధ్య టెన్త్ క్లాస్ టైమ్లోనే ప్రేమ చిగురిస్తుంది. అమాయకత్వం నిండిన స్వచ్ఛమైన ప్రేమ వారికి ఎంతో సంతోషాన్నిస్తుంది. తమ ప్రేమే లోకంగా జీవిస్తుంటారు ఇద్దరు. అయితే ఓ కారణంగా వీరిద్దరు దూరం అవుతారు. లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఫణి.. తొలి ప్రేమ జ్ఞాపకాలు వెతుక్కుంటూ ఊరికి వస్తాడు. అసలు బిందు ఎక్కడ ఉంది? ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఫణికి బిందు కలిసిందా లేదా? అప్పటికే బిందుకి పెళ్లి అయిందా లేదా ఫణి కోసం అలాగే ఉండిపోయిందా? అసలు వీరిద్దరు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు కలిశారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే..ఈ సినిమా కథంతా స్కూల్ లవ్స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు శింగర మోహన్ ఎంచుకున్న లవ్స్టోరీ పాయింట్ కొత్తదేమి కాదు. కానీ అప్పటి ప్రేమకథల్లో ఉండే మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని కవితాత్మకంగా మలిచి సరికొత్తగా చూపించారు. స్కూల్ డేస్ లోని బాల్యప్రేమను మధురంగా మలిచారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే.. ఈ సినిమాలో సారీ, థ్యాంక్స్ మినహా ఎక్కడా ఇంగ్లీష్ పదాలనే వాడలేదు. సంభాషణలు అన్ని పొయెటిక్గానే ఉంటాయి. ఈ సినిమాకు నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఆయువుపట్టులా నిలిచాయి. సంగీత దర్శకుడు తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలను ప్రాణం పోశాడు. అయితే, కమర్షియల్ ఫార్మట్కి దూరంగా ఉండడం.. సినిమా మొత్తం నెమ్మదిగా సాగడం.. స్కూల్ ఎపిసోడ్లో కొన్ని సీన్లను తిప్పి తిప్పి చూపించడం ఈ సినిమాకు మైనస్. హీరోహీరోయిన్ల సంభాషణలు కూడా కవితాత్మకంగా ఉండడం వాస్తవికంగా అనిపించదు. ఫస్టాఫ్లోబిందు, ఫణిల లవ్స్టోరీ చూపించి.. సెకండాఫ్లో వాళ్లు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేది చూపించారు. బిందు, ఫణి కలుస్తారా లేదా? బిందుకి పెళ్లి అయిందా లేదా? అనేది చివరి వరకు చూపించకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచారు. స్లోనెరేషన్తో అప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రేక్షకుల సహనానికి పరీక్షలా ప్రీక్లైమాక్స్ ఉంటుంది. పొయెటిక్ లవ్స్టోరీలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ( Kalamega Karigindi Review )ఎవరెలా చేశారంటే...ఈ సినిమా మొత్తం బిందు, ఫణి పాత్రల చుట్టే తిరుగుతుంది. మధ్యలో ఒకటి రెండు పాత్రలు వచ్చి వెళ్తాయి అంతే. బాల్యంలో ఫణి బిందు క్యారెక్లర్లను అరవింద్, నోమిన తార పోషించారు. పెద్దయ్యాక ఆ పాత్రల్లో వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి కనిపిస్తారు. స్కూల్ లవ్స్టోరీకే ఎక్కువ ప్రాధన్యత ఉంటుంది. ఆయా పాత్రల్లో అరవింద్, నోమిన చక్కగా నటించారు. వినయ్ కుమార్ కూడా సెటిల్గా ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నీకల్ విషయాలకొస్తే.. ముందు చెప్పినట్లు ఈ సినిమాకు ప్రధాన బలం గుడప్పన్ నేపథ్య సంగీతం. చాలా సన్నివేశాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో ప్రాణం పోశాడు. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. వినీతి పబ్బతి సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. సీన్లను చాలా సహజత్వంగా చిత్రీకరించారు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో చాలా రిపీటెడ్ సీన్లు ఉన్నాయి. వాటిని కట్ చేసి సినిమా నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
కారవాన్లో డ్రెస్ చేంజ్ చేస్తుండగా.. ఆ దర్శకుడి తీరు నచ్చలేదు: షాలిని పాండే
అర్జున్ రెడ్డి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ షాలిని పాండే(Shalini Pandey).. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె మహానటి, 100% కాదల్, గొరిల్లా, 118 వంటి సినిమాలతో సౌత్ ఇండియాలో మెప్పించింది. కానీ, తర్వాత తను నటించిన సినిమాలు ఎవీ పెద్దగా మెప్పించలేదు. దీంతో ప్రస్తుతం బాలీవుడ్లో ఆమె ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలిని.. తన కెరీర్ ఆరంభంలో ఒక దర్శకుడు వల్ల ఇబ్బందిపడినట్లు ఆమె చెప్పింది. షాలినీ పాండే తాజాగా 'డబ్బా కార్టెల్' వెబ్ సిరీస్లో నటించింది. ఇందులో షబానా అజ్మీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో షాలినీ పాండే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఒక దర్శకుడి గురించి ఆమె ఇలా చెప్పింది. 'సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే కోరికతో నేను మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నుంచి వచ్చాను. ఒక రోజు దర్శకులు సందీప్ రెడ్డి వంగా నా ఫోటోలను ఫేస్బుక్లో చూసి ఆయన తన టీమ్తో నన్ను సంప్రదించారు. అలా అర్జున్ రెడ్డిలో ఛాన్స్ దక్కింది. సుమారు ఏనిమిదేళ్లుగా చిత్రపరిశ్రమలో ఉన్నాను. ఈ ప్రయాణంలో ఎందరో నటీనటులతో పాటు మేకర్స్ నాకెంతో అండగా నిలిచారు. అయినప్పటికీ నాకు కూడా కొన్ని సవాళ్లు ఇక్కడ ఎదుర్కొవాల్సి వచ్చింది. నా కెరీర్ ప్రారంభంలో సౌత్ ఇండియాలో ఒక సినిమా చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇప్పటికీ మరిచిపోలేను. ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా కారవాన్లో నేను దస్తులు మార్చకుంటున్నాను. ఆ సమయంలో నా అనుమతి లేకుండానే దర్శకుడు డోర్ తీశాడు. వెంటనే చాలా కోపంతో అరిచేశాను. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, కొంత సమయం తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్లు ఒక సలహా ఇచ్చారు.. అలా కోపంగా తిట్టడం కరెక్ట్ కాదని చెప్పారు. నేను సైలెంట్గానే వెళ్లిపోయాను. ఈ ఘటన తర్వాత నాకు ఎక్కడా కూడా అలాంటి సమస్య రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా కోప్పడకుండా వారికి ఎలా సమాధానం చెప్పాలో తెలుసుకున్నాను.' అని షాలినీ చెప్పింది. -
ఓటీటీలో ధనుష్ ఫస్ట్ హాలీవుడ్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ టాప్ హీరో ధనుష్ (Dhanush) నటించిన తొలి హాలీవుడ్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. 2019లో ఆయన నటించిన ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ (The Extraordinary Journey of the Fakir) ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం ‘యాపిల్ టీవీ+’లో ఇంగ్లీష్ వర్షన్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం తెలుగులో అందుబాటులో రానుందన ఆహా ప్రకటించింది.ధనుష్ నటించిన ఈ చిత్రం ఆరేళ్ల తర్వాత ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ చిత్రాన్ని మార్చి 26న తమ ఓటీటీ ఫ్లాట్ఫామ్లో విడుదల చేస్తున్నట్లు ఆహా ప్రకటించింది. అయితే, ‘ఆహా గోల్డ్’ సబ్స్క్రిప్షన్ ఉంటే ఈ నెల 25 నుంచే ఈ మూవీని చూడొచ్చని ఆ సంస్థ తెలిపింది. ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ మూవీని 24 గంటలు ముందుగానే చూడొచ్చు.కేవలం 92 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని కెన్ స్కాట్ డైరెక్ట్ చేశాడు. రూ. 175 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజ్టార్గా మిగిలిపోయింది. కేవలం రూ. 30 కోట్ల వరకు మాత్రమే ఈ చిత్రం రాబట్టింది. ఈ చిత్రంలో అజాతశత్రు లవష్ పటేల్ అనే ఓ మెజీషియన్గా తన నటనతో ధనుష్ మెప్పించినప్పటికీ.. కథలో సరైన బలం లేకపోవడంతో ఫలితం దక్కలేదు.ముంబయికి చెందిన అజాతశత్రు అలియాస్ లవశ్ పటేల్గా ధనుష్ ఒక స్ట్రీట్ మెజీషియన్గా ఇందులో నటించారు. తనకు మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని చెబుతూ అందరినీ నమ్మిస్తుంటాడు. ఈ క్రమంలో తన తల్లి మరణించడంతో తన తండ్రి కోసం పారిస్ వెళ్తాడు. అక్కడ ఒక యువతితో ప్రేమలో పడిన అజాతశత్రుకు ఊహించని ప్రమాదంలో చిక్కుకుంటాడు. అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు..? ఇష్టపడిన అమ్మాయితో ప్రేమ ఫలిస్తుందా..? తన తండ్రిని కలుస్తాడా..? అనేది సినిమాలో చూడండి.Dhanush’s #TheExtraordinaryJourneyOfTheFakir is streaming from Mar 26 on AHA. pic.twitter.com/s2gMrbxDFL— Christopher Kanagaraj (@Chrissuccess) March 22, 2025 -
ఓల్డ్ స్టైల్ స్టెప్పులతో సూర్య, పూజా హెగ్డే 'రెట్రో' సాంగ్
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కొత్త సినిమా 'రెట్రో' నుంచి తాజాగా మరో సాంగ్ విడుదలైంది. ఇందులో సూర్య, పూజా హెగ్డే పాత కాలం నాటి స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ సాంగ్లో చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సినిమాల్లో కనిపించే ఐకానిక్ స్టెప్స్ కూడా ఉండటంతో కోలీవుడ్లో ఈ పాట వైరల్ అవుతుంది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రెట్రో సినిమాపై హైప్ పెరిగిపోయింది. భారీ బడ్జెట్తో 2డీ ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
లూసిఫర్2: 'మోహన్లాల్' రెమ్యునరేషన్పై పృథ్వీరాజ్ కామెంట్స్
మలయాళ టాప్ హీరో మోహన్లాల్ నటించిన 'లూసిఫర్2: ఎంపురాన్' (L2 Empuraan) మార్చి 27న విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆయన ఒక కీలకమైన పాత్రలో కూడా కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా రెమ్యునరేషన్ వివరాల గురించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. 2019లో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుమారు రూ.140 కోట్ల బడ్జెట్తో లూసిఫర్2 చిత్రాన్ని నిర్మించారు.'లూసిఫర్2' కోసం మోహన్లాల్ ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్లే ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ముందుగా అనుకున్నదానికంటే బడ్జెట్ పెరగడంతో సినిమా చిత్రీకరణ విషయంలో కాస్త జాప్యం ఏర్పడిందని పృథ్వీరాజ్ తెలిపారు. ‘‘ఎల్ 2 ఎంపురాన్’లో స్టీఫెన్ గట్టుపల్లి (ఖురేషి అబ్రమ్)గా మోహన్లాల్, ఆయనకు రైట్ హ్యాండ్లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.మోహన్లాల్ రెమ్యునరేషన్ గురించి గతంలో కూడా పలు వార్తలు వచ్చాయి. లూసిఫర్ భారీ హిట్ కావడంతో దానికి సీక్వెల్ తీయాలని ఆయన అనుకున్నారు. ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్ ముందుకు రావడంతో సినిమా మొదలైంది. అయితే, బడ్జెట్ పెరిగిపోవడంతో ఆ ఇబ్బందులు గ్రహించిన మోహన్లాల్ తనకు రెమ్యునరేషన్ వద్దని చెప్పారట. అదే విషయాన్ని ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. అయితే, ఈ సినిమాలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలను సుకుమారన్ తీసుకున్నారు. అందుకు గాను ఆయన కూడా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. కానీ, సినిమా నుంచి లాభాలు ఏమైనా వస్తే అందులో షేర్ తీసుకునే ఛాన్స్ ఉంది.కన్నప్పకు కూడా అండగా నిలిచిన మోహన్లాల్మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న కన్నప్పలో మోహన్లాల్ కూడా కీలకపాత్రలు పోషించారు. ఇందులో నటించాలని మోహన్లాల్ను కోరిన వెంటనే ఆయన ఒప్పుకున్నారని ఒక ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి విష్ణు తెలిపారు. 'అంకుల్.. రెమ్యునరేషన్ గురించి మీ మేనేజర్తో ఏమైనా మాట్లాడమంటారా అని అడిగాను. అప్పుడు ఆయన నవ్వుతూనే.. ‘నువ్వు అంత పెద్ద వాడివయ్యావా..?’ అని అన్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ కూడా ఎలాంటి రెమ్యునరేషన తీసుకోలేదని విష్ణు చెప్పిన విషయం తెలిసిందే. -
పదేళ్ల జర్నీ.. నాగ్ అశ్విన్పై వైజయంతీ మూవీస్ స్పెషల్ వీడియో
డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin).. ఆయన మాటలు చాలా పొదుపు కానీ, తనలోని ప్రతిభకు అవధులంటూ ఉండవు. నాగ్ అశ్విన్ గురించి తెలియని వారు ఆయన సింప్లిసిటీని చూస్తే ఇతను దర్శకుడా..? అని ఆశ్చర్యపోతారు. సెట్స్లో నాగ్ అశ్విన్ ప్రతిభను చూసి మెచ్చుకోని వారు అంటూ ఉండరు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ మూవీతోనే ఆయన ప్రయాణం మొదలైంది. ఇందులో నాని, విజయ్ దేవరకొండ,మాళవిక నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రలలో మెప్పించారు. డైరెక్టర్గా పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న నాగ్ అశ్విన్పై ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) ఒక వీడియో విడుదల చేసింది. మహానటి, కల్కి 2898 ఏడీ చిత్రాలతో ఆయన కీర్తి మరింత ఉన్నత స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.నాగ్ అశ్విన్ కుటుంబంఅసలు పేరు నాగ్ అశ్విన్ రెడ్డి.. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యులు జయరాం రెడ్డి, జయంతి దంపతులకు నాగ్ జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన నాగ్ అశ్విన్ ఆపై మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. స్కూల్లో టాప్ టెన్ ర్యాంక్లో ఉన్న నాగ్ తల్లిదండ్రుల మాదిరి డాక్టర్ అవుతాడని అనుకుంటే.. మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరారు. అక్కడ వీడియో ఎడిటింగ్తో పాటు సినిమాకు అవసరమైన నాలెడ్జ్ను సంపాదించుకున్నాడు.సినిమాల్లోకి ఎంట్రీ ఎలా..?సినిమాలపై నాగ్ అశ్విన్ చూపుతున్న ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించారు. ఈ క్రమంలో వారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్దకు నాగ్ అశ్విన్ను పంపారు. ఆ సమయంలో 'గోదావరి' సినిమా చిత్రీకరణ జరుగుతుండటంతో తర్వాత ప్రాజెక్ట్లో తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకుంటానని శేఖర్ కమ్ముల మాట ఇచ్చారు. ఈ గ్యాప్లో మంచు మనోజ్ హీరోగా నటించిన 'నేను మీకు తెలుసా?' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అందుకు రెమ్యునరేషన్గా రూ. 4 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి పిలుపు వచ్చింది. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో నాగ్ ప్రతిభను శేఖర్ కమ్ముల మెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.డైరెక్టర్గా ఛాన్స్ ఎవరిచ్చారు..?శేఖర్ కమ్ముల నుంచి నేర్చుకున్న పాఠాలతో 'యాదోం కీ బరాత్' అనే ఇంగ్లీష్ లఘు చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాత కావడం విశేషం. కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఈ చిత్రం ఎంపిక చేయబడింది. దీంతో ఆయన జీవితం టర్న్ అయిపోయింది. ఆ షార్ట్ఫిల్మ్ వల్ల నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అప్పుడు వారికి 'ఎవడే సుబ్రమణ్యం' కథను నాగ్ వినిపించారు. ఆ చిత్రాన్ని నిర్మిస్తామని ప్రియాంక, స్వప్న మాట ఇచ్చారు. అలా నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో 2015లో నాగ్ అశ్విన్ తొలి సినిమా వెండితెరపై మెరిసింది. -
విశాల్ చెల్లెలి భర్తపై సీబీఐ కేసు
కోలీవుడ్ హీరో విశాల్ చెల్లెలు ఐశ్వర్య కుటుంబం చిక్కుల్లో పడింది. చెన్నైలోని ప్రముఖ నగల వ్యాపారి ఉమ్మిడి ఉదయ్కుమార్, జయంతి దంపతుల కుమారుడు ఉమ్మిడి క్రితీష్తో 2017లో వివాహం జరిగింది. చాలు ఏళ్లుగా క్రితీస్ నగల వ్యాపారం చేస్తున్నాడు. విశాల్ చెల్లెలి భర్త క్రితీష్, ఆయన నిర్వహిస్తున్న నగల షాపుపైనా సీబీఐ అధికారులు తాజాగా కేసు పెట్టారు. వివరాలు చూస్తే స్థానిక అయ్యప్పన్ తంగల్లోని ఒక బ్యాంకులో నకిలీ పత్రాలతో రూ.5.5 కోట్ల రుణం తీసుకున్న కేసులో, ఆ మోసానికి సహకరించి రూ.2.5 కోట్లు లబ్ధి పొందినట్లు క్రితీష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ కేసులో క్రితీష్తో పాటు, మోసం వెనుక భూ యజమాని, నిర్మాణ సంస్థ, బ్యాంకు అధికారులు, బ్యాంకు రుణగ్రహీతలు తదితరలు ఈ స్కామ్లో ఉన్నారని తెలుస్తోంది. వారందరూ తప్పుడు పత్రాలు క్రియేట్ చేసి ప్రముఖ బ్యాంకు నుంచి ఐదున్నర కోట్ల రూపాయల రుణం పొందినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన ఏడుగురిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. -
ఓ తండ్రి కథ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తెలుగు చిత్రం రామం రాఘవం ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండేది మమకారం. వారి మాట వినకూడదని పిల్లల మూర్ఖత్వం. జన్మనిచ్చిన తల్లి... జీవితాన్నిచ్చే తండ్రి తమ కన్నపిల్లల బంగారు భవిష్యత్తు కోసమే కాస్తంత కటువుగా మారతారు. ఆ కటుత్వం మాటున ఆప్యాయత, అనురాగాలుంటాయి. అవి అర్థం చేసుకోని పిల్లలు ఎంతో నష్టపోతారు. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమానే ‘రామం రాఘవం’. తల్లి ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. తండ్రి ప్రేమను ఇంత లోతుగా చూపించిన సినిమా ఇదే. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు సముద్రఖని అందించిన ఈ కథకు నటుడు ధన్రాజ్ దర్శకత్వం వహించారు. ‘రామం రాఘవం’ అనేది పిల్లలకు పెద్దలు చెప్పిన పాఠం అయితే, పిల్లలకు ఇదో గుణపాఠం. అంతలా ఏముందీ సినిమాలో ఓ సారి చూద్దాం. దశరథ రామం కోనసీమ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఓ నిజాయితీ గల అధికారి. తనలాగే తన కొడుకు రాఘవను నీతీ నిజాయితీతో నిండిన మంచి వ్యక్తిలా తీర్చిదిద్దాలనుకుంటాడు. కానీ రాఘవ చదువు కూడా కనీసం సరిగ్గా చదువుకోకుండా ఇంటా బయటా తండ్రికి తలవంపులు తెస్తుంటాడు.అంతేకాదు తనను మందలించిన తండ్రి మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుని ఆఖరికి తన తండ్రి అడ్డు తొలగించుకోవాలి అనుకుంటాడు. రాఘవ చేసిన ప్రతి తప్పును క్షమించి కాస్తంత మందలిస్తూ అంతులేని బాధను అనుభవిస్తుంటాడు రామం. ఆఖరికి రాఘవ తన తండ్రి కోసం చేసిన ప్రయత్నమేంటి? దాని వల్ల రాఘవ పొందిన లాభం ఏంటి? అన్నది మాత్రం ఓటీటీ వేదికైన సన్ నెక్ట్స్లో చూడాల్సిందే. నటుడిగా ధన్రాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.మరీ ముఖ్యంగా కామెడీ పాత్రలతో ప్రేక్షకులను బాగానే మెప్పించారు. నటుడిగా ధన్రాజ్ నాణేనికి ఓ వైపు మాత్రమే, ఈ సినిమాతో ధన్రాజ్ తన దర్శకత్వ ప్రతిభను ఘనంగా చాటారనే చెప్పుకోవాలి. ఓ పక్క కథను అందించి, కథలోని తండ్రి పాత్రకు ఊపిరి పోసింది సముద్రఖని అయితే మరో పక్క అదే కథకు దర్శకత్వం వహించి, కొడుకు పాత్రలో ఒదిగిపోయి ఆ కథకు జీవితాన్నిచ్చింది ధన్రాజ్.కొన్ని సినిమాలు ఆనందం కోసం చూస్తాం. ఇలాంటి సినిమాలు మాత్రం మన జీవితం కోసం చూడాలి. మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రుల కోసం చూడాలి. వీలైతే మీ తల్లిదండ్రులతో కలిసి ఈ ‘రామం రాఘవం’ చూడండి. – హరికృష్ణ ఇంటూరు -
రెండు భాగాలుగా కింగ్డమ్
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కింగ్డమ్’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో విజయ్ కనిపించనున్నారు. ఈ సినిమాను తొలుత మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.అయితే ఆ తర్వాత మే 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే... ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. కథ డిమాండ్ మేరకే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ– ‘‘కింగ్డమ్’ని తొలుత రెండు భాగాలుగా రూపొందించాలనుకోలేదు. అయితే స్టోరీ డిమాండ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.రెండో భాగం కోసమని మొదటి పార్ట్ కథను పెంచలేదు. రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’.. ఏ టైటిల్ పెట్టాలి? అన్నది తొలి భాగం ఫలితం తర్వాత నిర్ణయిస్తాం’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ నటించిన ఏ సినిమా ఇప్పటివరకూ రెండు భాగాలుగా రాలేదు. అలా వస్తున్న ఆయన మొదటి చిత్రం ‘కింగ్డమ్’ కానుండటం విశేషం. ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్. -
మీరు లేకుండా నేను లేను: సమంత
‘‘సాధారణంగా హీరో లేదా హీరోయిన్లకు తాము నటించిన సినిమా హిట్ అయితేనే అభిమానం, ప్రేమ చూపేవారు ఎక్కువ ఉంటారు. కానీ, గత రెండేళ్లుగా నేను ఒక్క తమిళ సినిమా కూడా చేయలేదు. పైగా ఇటీవల నా ఖాతాలో ఏ హిట్ మూవీ లేదు. అయినా నాపై మీ (అభిమానులను ఉద్దేశించి) ప్రేమ, అభిమానం ఏమాత్రం తగ్గలేదు. మీ అభిమానం, ప్రేమ చూస్తుంటే మాటలు రావడం లేదు. మీ నుంచి ఈ స్థాయిలో ప్రేమాభిమానాలు పొందేందుకు నేను ఏం చేశానో కూడా అర్థం కావడం లేదు.ఏది ఏమైనా మీరు లేకుండా నేను లేను... మీ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను’’ అని సమంత అన్నారు. స్ఫూర్తిదాయక పాత్రల్లో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నందుకు ‘కె. బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్’ అవార్డుతో చెన్నైలో జరిగిన ‘బిహైండ్వుడ్స్ అవార్డ్స్’ వేడుకలో సమంతను సత్కరించారు నిర్వాహకులు. ఈ వేదికపై సమంత మాట్లాడుతూ–‘‘కె. బాలచందర్ సార్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన సినిమాల్లో మహిళల పాత్రలు ఎంతో సహజంగా ఉంటాయి.ఆయన నుంచి నేనెంతో స్ఫూర్తి పొందాను. అలాంటి బాలచందర్ సార్ అవార్డుని అందుకోవడంతో నా జీవితం పరిపూర్ణం అయినట్లు భావిస్తున్నాను. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినవారికి కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ఈ అవార్డు మాత్రమే కాదు... ‘సిటాడెల్: హనీ బన్నీ’ టీవీ సిరీస్కిగాను ఉత్తమ నటి అవార్డును కూడా సమంతకు ప్రదానం చేశారు. ఇదిలా ఉంటే... 2022లో విడుదలైన ‘కాత్తు వాక్కుల రెందు కాదల్’ తర్వాత ఆమె తమిళంలో ఏప్రాజెక్ట్కు ఓకే చెప్పలేదు.అలాగే తెలుగులో ‘ఖుషి’ (2023) సినిమా తర్వాత మరో చిత్రంలో నటించలేదు సమంత. ప్రస్తుతం ఆమె ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. అలాగే తన సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్పై సమంత నిర్మిస్తున్న తొలి చిత్రం ‘శుభం’ షూటింగ్ పూర్తయింది. -
రెడ్ శారీలో విష్ణు ప్రియ.. యానిమల్ బ్యూటీ ప్యాషన్ లుక్!
బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ జ్యోతి పూర్వాజ్...రెడ్ శారీలో మెరిసిపోతున్న బిగ్బాస్ బ్యూటీ విష్ణు ప్రియ..భర్త నిక్ జోనాస్తో కలిసి ప్రియాంక చోప్రా చిల్..యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఫ్యాషన్ లుక్..ప్రకృతి పచ్చదనాన్ని ఆస్వాదిస్తోన్న బిగ్బాస్ ముద్దుగుమ్మ అశ్విని శ్రీ.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
రాజేంద్రప్రసాద్ మనవరాలి చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ మూవీలో సుమన్ బాబు కీలక పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే శివరాత్రికే విడుదల కావాల్సిన ఈ చిత్రం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ వేసవి సీజన్లో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన ఎన్వీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్, అనేకమంది అఘోరాలతో శివుడిని అత్యద్భుతంగా చూపిస్తూ షూట్ చేసిన సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది. కుటుంబం అంతా పిల్లలతో సహా చూసి ఆనందించదగ్గ సినిమా' అని అన్నారు.దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. "ఈ సినిమాలో 45 నిముషాలు పాటు ఉండే గ్రాఫిక్స్ చాలా హైలెట్గా నిలుస్తాయి. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారు. రిలీజ్ ఆలస్యమైనా కంటెంట్ మాత్రం ఖతర్నాక్గా ఉందని అందరూ అంటున్నారు. ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని నమ్ముతున్నాం" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఎన్వీవీ సుబ్బారెడ్డి, సీహెచ్ వెంకట సుమన్ నిర్మించారు. ఈ మూవీకి ప్రమోద్ పులిగిల్ల సంగీతమందించారు. -
కోటి రూపాయలకు మళ్లీ అమ్మేస్తావా?.. శుభలగ్నం సీన్ గుర్తు చేసిన జగపతిబాబు
టాలీవుడ్ నటుడు జగపతి బాబు విలక్షణ పాత్రలతో వెండితెరపై అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. గతేడాది పుష్ప-2తో ప్రేక్షకులను మెప్పించిన జగపతిబాబు.. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న కీ రోల్ ప్లే చేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లోనే ఉంటారు. తాను ఎక్కడికెళ్లినా వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా మరో ఆసక్తికర వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు.ఇందులో ఆమని, జగపతిబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది. ఓ మూవీ షూటింగ్ సెట్లో వీరిద్దరు సరదాగా ఒకరినొకరు ఆట పట్టించారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అందులో పార్ట్-1.. కోటి రూపాయలకు నా భార్య నన్ను అమ్మేసే ముందు.. పార్ట్-2 మేకప్ వేస్తున్నావ్ ఏంటి? నన్ను మళ్లీ మార్కెట్లో పెడతావా ఏంటి? అని సరదాగా క్యాప్షన్ రాసుకొచ్చాడు. మొదటి వీడియోలో ఆమనికి జగపతిబాబు మేకప్ వేయగా.. రెండో పార్ట్లో ఆమనికి జగపతి బాబు మేకోవర్ చేశారు. ఇదంతా షూటింగ్ సెట్లో సరదా కోసమే చేశారు.అయితే గతంలో వీరిద్దరు జంటగా నటించిన బ్లాక్బస్టర్ చిత్రం శుభలగ్నం. ఈ సినిమాలో తన భర్త అయిన జగపతిబాబును అమ్మకానికి పెడుతుంది. ఆ సీన్ను గుర్తుకు తెచ్చుకున్న జగపతి బాబు సరదాగా ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మళ్లీ ఇద్దరు కలిసి సరదాగా ఇలా చేయడంతో ఇది చూసిన అభిమానులు శుభలగ్నం సినిమాను గుర్తు చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
'ద సస్పెక్ట్' రివ్యూ.. ఈ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?
థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. కొత్త దర్శకులు ఇండస్ట్రీలో తొందరగా పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి సినిమాలను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూ ఉంటారు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కూడా ‘ది సస్పెక్ట్’ పేరుతో మిస్టరీ థ్రిల్లర్ను తెరకెక్కించారు. రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. టెంపుల్ టౌన్ టాకీస్పై కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 21న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథప్రత్యూష(షిరిగిలం రూప) దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును ఇన్స్పెక్టర్ అర్జున్(రుషి కిరణ్) విచారిస్తాడు. అతనికి సహాయకునిగా సదాశివ(శివ యాదవ్) అంట్ టీమ్ సహకరిస్తూ ఉంటుంది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అర్జున్కు ఎదురయ్యే ప్రతి వ్యక్తి సస్పెక్ట్గానే కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తన ప్రేయసి మీరా (శ్వేత)ను కూడా అనుమానించాల్సి వస్తుంది. అలాగే పోలీసు ఉన్నతాధికారిని, తన స్నేహితులను ఇలా ప్రతి ఒక్కరినీ సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. మరి అసలైన హంతకుడిని అర్జున్ పట్టుకుంటాడా? ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? ప్రత్యూషను ఎందుకు చంపారు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!విశ్లేషణఈ మధ్య కాలంలో థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఒక చిన్న లైన్ తీసుకుని దాని చుట్టూ ఆసక్తికరమైన కథనాన్ని అల్లుకుంటున్నారు. ఆ కథనం మెప్పిస్తేనే సినిమా సక్సెస్ అవుతుంది. లేదంటే బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడుతుంది. తాజాగా ‘ది సస్పెక్ట్’పేరుతో తెరకెక్కిన మూవీ ఆద్యంతం ఆడియన్స్ను థ్రిల్కు గురి చేసేందుకు ప్రయత్నించింది. చివరి వరకూ హంతకులెవరన్నది ఆడియన్స్ గుర్తు పట్టలేనంత సస్పెన్స్తో సినిమాను ముందుకు నడిపించారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులకు ఎదురయ్యే అనేకమంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోణంలో సస్పెక్ట్ గానే కనిపిస్తుంటారు. తీరా వారు కాదని తెలుస్తుంది. ప్రీ క్లైమాక్స్లో అసలు హంతకులు ఎవరనేది తెలిసినప్పుడు షాకవుతారు. ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఎవరినీ కించపరిచి మాట్లాడకూడదు, ఎగతాళి చేయకూడదన్న మెసేజ్ ఇచ్చారు.ముఖ్యంగా విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే... వారి మనసుమీద ఎలాంటి ప్రభావం చూపి... ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయనేది చక్కగా చూపించారు. ఓపక్క మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా మరోవైపు హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్.. వారి లవ్ బ్రేకప్, మళ్లీ కలుసుకోవడం చూపిస్తారు. ఇదంతా చూసే జనాలకు కాస్త బోరింగ్గా అనిపిస్తుంది. సెకెండాఫ్లో సినిమా ఊపందుకుంటుంది. అక్కడక్కడా సన్నివేశాలు బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తాయి. కొత్తవారైన హీరో రుషి కిరణ్... ఇన్స్పెక్టర్ అర్జున్ పాత్రలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కొన్నిచోట్ల మాత్రం అతడి నటన సహజంగా అనిపించదు. కొన్ని యాక్షన్ సీన్స్ బాగా చేశారు. అతనికి జంటగా నటించిన శ్వేత గ్లామరస్గా కనిపించింది. ప్రత్యూష పాత్రలో రూప కూడా పర్వాలేదనిపించింది. లావణ్య పాత్రలో రజిత బాగా చేసింది. మిగతా అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.దర్శకుడు రాధా కృష్ణ ఎంచుకున్న ప్లాట్ బాగుంది. దాని చూట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం కాస్త గందరగోళంగా ఉంది. కొన్ని సీన్లు బోరింగ్గా అనిపించినా సెకండాఫ్లో ఇన్వెస్టిగేషన్ ఊపందుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ రాఘవేంద్ర అందించిన విజువల్స్ పర్వాలేదనిపించాయి. ప్రజ్వల్ క్రిష్ బీజీఎం బాగుంది. పాటలు బాగోలేవు. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్గా చేయాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.చదవండి: ప్రముఖ నటి రజిత ఇంట విషాదం.. తల్లి కన్నుమూత -
గోదారిగట్టు, బుజ్జితల్లి.. ఇప్పుడు ప్రేమలో.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది
కొన్ని సాంగ్స్ వింటే పదే పదే వినాలనిపిస్తుంది. అంతేకాదు డ్యాన్స్ కూడా చేయాలనిపిస్తుంది. అలాంటి పాటలు ఇటీవల తెలుగు సినిమాల్లో అభిమానులను అలరిస్తున్నాయి. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి గోదారి గట్టు సాంగ్, అలాగే తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి సాంగ్ సినీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఎక్కడ చూసిన ఈ పాటలకు ఆడియన్స్ కాలు కదిరాపు. దీంతో ఈ రెండు పాటలకు ఓ రేంజ్లో క్రేజ్ వచ్చింది కొంతమంది ఏకంగా ఈ పాటలకు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అలా ఇదే జాబితాలో మరో హిట్ సాంగ్ వచ్చి చేరింది. అదేనండి ఇటీవల సోషల్ మీడియాను ఊపేస్తోన్న కోర్ట్ మూవీ సాంగ్. ఇంకేంటీ మీకోసమే తాజాగా ఫుల్ సాంగ్ కూడా వచ్చేసింది. మరెందుకు ఆలస్యం చూసి ఎంజాయ్ చేయండి.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సంచలనం.. నాలుగో రోజు ఊహించని కలెక్షన్స్!)ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం కోర్ట్(Court: State Vs Nobody). కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలా ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. పాజిటివ్ మౌత్టాక్తో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 28.9 కోట్లు రాబట్టింది. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ వల్ల బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. -
బాలకృష్ణ షో వల్లే బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా: బాధితుడి ఆవేదన
బెట్టింగ్ యాప్ కేసు టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ఇలాంటి యాప్లను కొందరు టాలీవుడ్ బుల్లితెర నటులతో పాటు పలువురు అగ్ర సినీతారల పేర్లు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు ముందు యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరి హాజరైన తమ స్టేట్మెంట్ ఇచ్చారు. యాప్లను ప్రమోట్ చేసినట్లు విచారణలో అంగీకరించారు.అయితే ఈ బెట్టింగ్ యాప్ల వలలో చిక్కుకుని అప్పులపాలైన వారు చాలామందే ఉన్నారు. అలా ఈ బెట్టింగ్ భూతానికి బలైన ఓ సామాన్యుడు పంజాగుట్ట పీఎస్కు వచ్చారు. తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్కు వచ్చిన వ్యక్తిని మీడియా ప్రశ్నించింది. తాను ఈ యాప్ను ఉపయోగించడానికి కారణం ఆ టాలీవుడ్ షోనే కారణమని బాధితుడు చెప్పారు.టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న షో వల్లే తాను బెట్టింగ్ యాప్ను ఉపయోగించానని నెల్లూరు చెందిన రాంబాబు వాపోయారు. బాలయ్య షోకు అతిథులుగా వచ్చిన గోపీచంద్, ప్రభాస్కు బాలకృష్ణ కొన్ని బహుమతులిస్తారు.. ఈ గేమ్ ఆడండి.. గిఫ్ట్లు గెలుచుకోండి అని చూపించారని అన్నారు. నేను మొదటి నుంచి ప్రభాస్ అన్నకు ఫ్యాన్ అని.. అందువల్లే తాను కూడా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత ట్రాప్లో పడి దాదాపు రూ.80 లక్షలు కోల్పోయినట్లు సదరు వ్యక్తి వివరించాడు. ఆ యాప్ వాళ్లు మోసం చేయడం వల్లే తాను అప్పుల పాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల భారంతో ఎనిమిది నెలలుగా ఇంటికి దూరంగా ఉంటున్నట్లు బాధితుడు రాంబాబు చెప్పుకొచ్చారు. -
సారీ చెప్పిన అనన్య నాగళ్ల.. మరి ఇదేంటని ప్రభుత్వానికి సూటి ప్రశ్న!
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవారిలో యూట్యూబర్ల నుంచి సినిమా స్టార్ల వరకు చాలామంది ఉన్నారు. అయితే వీరిలో కొంతమందికి ఈ యాప్స్ గురించి కనీస అవగాహన లేదు. నిమిషానికి లక్షలు ఇస్తున్నారనగానే ముందూవెనకా ఆలోచించకుండా ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడేమో కేసు (Betting App Case)లో ఇరుక్కుని బాధపడుతున్నారు. ఆ జాబితాలో హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla) కూడా ఉంది.అనన్య క్షమాపణలుఅవగాహన లేకపోవడం వల్లే సదరు యాప్స్ను ప్రమోట్ చేశామని అంగీకరించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు క్షమాపణలు తెలియజేసింది. నేను తెలిసి ప్రమోషన్స్ చేయలేదు. అందరు సెలబ్రిటీలు చేస్తున్నారు.. కాబట్టి అందులో తప్పేం లేదనుకున్నాను. కానీ ఇకమీదట జాగ్రత్తగా ఉంటాను. బాధ్యతగా మసులుకుంటాను అని పోస్ట్ పెట్టింది.మరి ఇదేంటి? మాకెలా తెలుస్తుంది?అదే సమయంలో మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడాన్ని తప్పు పట్టింది. ప్రభుత్వ ఆస్తులపై బెట్టింగ్ యాప్స్ను ఇలా యథేచ్చగా ప్రమోట్ చేస్తున్నారు. అలాంటప్పుడు అది చట్టరీత్యా నేరమని మాకెలా తెలుస్తుంది? అని ప్రశ్నించింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు.. ఆమె తెలియక చేశానని చెప్పాక నిందించడం సరి కాదని భావిస్తున్నారు. మల్లేశంతో కెరీర్ మొదలుమరికొందరేమో.. లక్షల మంది అభిమానులున్నప్పుడు ఏ చిన్న పోస్ట్ పెట్టాలన్నా దాని దుష్ప్రభావాలను ముందుగానే బేరీజు వేసుకోవాలి అని సూచిస్తున్నారు. మల్లేశం సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైంది అనన్య నాగళ్ల. ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మాస్ట్రో, మళ్లీ పెళ్లి వంటి పలు సినిమాలు చేసింది. గతేడాది.. తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలతో మెప్పించింది.చదవండి: ప్రముఖ నటి రజిత ఇంట విషాదం.. తల్లి కన్నుమూత -
రెడ్ చెర్రీలా జాన్వీ.. అవార్డ్ ఫంక్షన్ లో సమంత!
అవార్డ్ వచ్చిన వేళ.. పుల్ హ్యాపీగా సమంతరెడ్ కలర్ గౌనులో జిగేలుముంటున్న జాన్వీ కపూర్బ్లాక్ కలర్ తుమ్మెదలా కిక్కిస్తున్న తృప్తి దిమ్రిచీరలో ముద్దమందారంలో ముద్దుగా హనీరోజ్హాట్ నెస్ తో మెంటలెక్కిస్తున్న ప్రణీత సుభాష్సింపుల్ చీరలో చందమామలా హాట్ బ్యూటీ జ్యోతిరాయ్ఐస్ క్రీమ్ షాపువాడితో కీర్తి సురేశ్ ఫన్ గేమ్స్ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) -
ప్రముఖ నటి రజిత ఇంట విషాదం.. తల్లి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటి రజిత (Actress Rajitha) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయ లక్ష్మి (76) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ప్రముఖ క్యారెక్టర్ నటులు కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మికి చెల్లెళ్లు అవుతారు. విజయలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. శనివారం (మార్చి 22న) ఉదయం 11 గంటలకు ఫిలింనగర్లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.కెరీర్ అలా మొదలైంది..రజిత 18 ఏళ్ల వయసులోనే వెండితెరపై అరంగేట్రం చేసింది. ఆమె నటించిన మొదటి సినిమా బ్రహ్మ రుద్రులు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు కూతురిగా నటించింది. ఆ తర్వాత సహాయనటిగా తెలుగులో దాదాపు 200 సినిమాలు చేసింది. పెళ్లి కానుక సినిమాకుగానూ ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డు అందుకుంది. కూలీ నెం.1, ప్రేమ ఖైదీ, పెళ్లి సందడి, జులాయి, వర్షం, మల్లీశ్వరి, సరైనోడు, పండగ చేస్కో, పిల్లా నువ్వు లేని జీవితం, వీర సింహా రెడ్డి వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరగా గతేడాది రిలీజైన ఉషా పరిణయం మూవీలో యాక్ట్ చేసింది. తమిళంలో కుసేలన్, లింగా, విశ్వాసం, అన్నాత్తె, చంద్రముఖి 2 చిత్రాల్లో నటించింది. మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో ఒక్కటి చొప్పున సినిమా చేసింది.చదవండి: బిగ్బాస్ నుంచి నాగార్జున తప్పుకోవాలి.. రానా బెటర్: సోనియా -
తప్పెవరిదైనా సారీ చెప్పేదొకరే.. భార్య కోసం వంట చేసిపెడ్తున్న చై!?
టాలీవుడ్ జంట నాగచైతన్య (Naga Chaitanya)- శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. ప్రముఖ మ్యాగజైన్ వోగ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్స్టాగ్రామ్లోనే తమ ప్రేమ మొదలైందని వెల్లడించారు. తాజాగా ఎవరు సారీ చెప్తారు? పెళ్లి తర్వాత వంట ఎవరు చేసిపెడ్తున్నారు? వంటి విషయాలను అన్నింటినీ వోగ్ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.సారీ ఎవరు చెప్తారు?తప్పు ఎవరిదైనా సరే ఎవరు సారీ చెప్తారు? అన్న ప్రశ్నకు శోభిత తనే క్షమాపణలు చెప్తానంది. అది విని ఆశ్చర్యపోయిన చై.. నువ్వసలు సారీలు, థాంక్స్ నమ్మవు కదా అన్నాడు. అందుకామె ప్రేమలో క్షమాపణలు, కృతజ్ఞతలకు చోటు లేదు అని పేర్కొంది. దాంతో నవ్వేసిన చైతూ.. తనే సారీ చెప్తానని ఒప్పుకుంటూనే మొదటగా ప్రేమను వ్యక్తపరిచింది కూడా తానే అని ఒప్పుకున్నాడు. నీకది లేదులే.. చై సెటైర్లుఎవరు బాగా వంట చేస్తారంటే తామిద్దరికీ వంట రాదన్నారు. కాకపోతే ప్రతిరోజు షూట్ నుంచి ఇంటికి రాగానే చై.. హాట్ చాక్లెట్ చేసిస్తాడంది శోభిత. అది వంట కిందకు రాదని, అది ప్రతి ఒక్కరికీ ఉండే కనీస నైపుణ్యం. కానీ నీకు లేదులే అని సెటైర్ వేశాడు. సినిమాలు చూడటం ఇష్టమని చై అంటుంటే.. చైను చూస్తూ ఉండిపోవడం నాకిష్టం అని పేర్కొంది శోభిత. చై 100 సినిమాలు చూస్తే నేను ఐదు చూసుంటానంది. వాదనల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్నకు ఎప్పుడూ చైతూయే గెలుస్తాడంది.అదే శోభిత హాబీశోభిత ఎక్కువ సరదాగా ఉంటుంది. నాకు ఫేమస్ పాటల హుక్ స్టెప్స్ నేర్పిస్తూ ఉంటుంది. అది తనకు హాబీ.. కాకపోతే అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రం ప్రాణం పోయినట్లే చేస్తుంది. కాస్త అస్వస్థతకు గురైనా అసలు ఓర్చుకోలేదు. నీరసంతో కింద పడిపోతుంది అన్నాడు నాగచైతన్య.చదవండి: బిగ్బాస్ నుంచి నాగార్జున తప్పుకోవాలి.. రానా బెటర్: సోనియా -
‘అదిదా..’ కాంట్రవర్సీ.. ట్రోల్స్ చూసిన తర్వాతే ఆ విషయం తెలిసింది : నితిన్
నితిన్(Nithiin) హీరోగా నటించిన రాబిన్హుడ్ (Robinhood) సినిమాలోని ‘అదిరా సర్ప్రైజ్’ పాట ఎంత వైరల్ అయిందే.. ఆ స్టెప్పులు అంతే కాట్రవర్సీని క్రియేట్ చేశాయి. ఈ పాటలో కేతికా శర్మతో వేయించిన స్టెప్పులపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఒక అమ్మాయితో అలాంటి స్టెప్పులు ఎలా వేయిస్తారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె క్యాస్టూమ్స్పై కూడా విమర్శలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సైతం ఇలాంటి అసభ్యకరమైన స్టెప్పులను నిలిపివేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే కొంతమంది మాత్రం ఆ స్టెప్పులను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ హుక్ స్టెప్పులు వేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి అదిరా సర్ప్రైజ్ అయితే సినిమాకు బజ్ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ పాట కాంట్రవర్సీ గురించి నితిన్ స్పందించాడు. అసలు ఆ పాట షూటింగ్ సమయంలో తాను లేనని, ట్రోల్స్ చూసిన తర్వాతే తనకు ఆ స్టెప్పుల గురించి అర్థమైందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.అదిరా సర్ప్రైజ్ సాంగ్లో నేను లేను. షూటింగ్ సమయంలో కూడా నేను చూడలేదు. సాంగ్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. కొంతమంది ఆ స్టెప్పు గురించి నెగెటివ్ కామెంట్ చేశారు. మేం అందరి అభిప్రాయలను గౌరవిస్తున్నాం. సినిమా చూస్తున్నప్పుడు కూడా నేను ఆ స్టెప్పుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. సినిమా బాగొచ్చిందనే ఆనందంలో ఉండిపోయి..పాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ట్రోల్స్ చూసిన తర్వాత నాక్కుడా ఆ పాటకి వేసిన స్టెప్పుల గురించి అర్థమైంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియదు కానీ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’ అన్నారు. కాగా ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.ఇక రాబిన్హుడ్ విషయానికొస్తే.. 'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రమిది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందించారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 28న రిలీజ్ కానుంది. -
ఆది సాయికుమార్ లేటేస్ట్ థ్రిల్లర్ మూవీ.. ఎలా ఉందంటే?
టైటిల్: షణ్ముఖనటీనటులు: ఆది సాయికుమార్, అవికా గోర్, ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా గ్లోరీ తదితరులుదర్శకత్వం: షణ్ముగం సప్పని నిర్మాతలు: తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాణ సంస్థ: సాప్బ్రో ప్రొడక్షన్స్సంగీతం: రవి బస్రూర్విడుదల తేదీ: మార్చి 21, 2025టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. మరోసారి డిఫరెంట్ స్టోరీతో అభిమానుల ముందుకొచ్చారు. గతంలో ప్రేమకథా చిత్రాలు ఎక్కువగా చేసిన ఆది సాయికుమార్.. టాప్ గేర్ తర్వాత గేర్ మార్చాడు. వరసగా క్రైమ్, యాక్షన్ జోనర్తో అభిమానులను మెప్పిస్తున్నారు. సీఎస్ఐ సనాతన్ క్రైమ్ థ్రిల్లర్ తర్వాత ఆది హీరోగా నటించిన మరో యాక్షన్ అండ్ డివోషనల్ థ్రిల్లర్ 'షణ్ముఖ'. ఈ మూవీలో ఆది సరసన ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్ గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.షణ్ముఖ కథేంటంటే..చిరాగ్ జానీ(విగాండ) దంపతులకు ఓ విచిత్రమైన రూపంలో కుమారుడు జన్మిస్తాడు. అతన్ని అలా చూసిన తండ్రి కొడుకు రూపాన్ని మార్చాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్లి క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత తిరిగొచ్చిన అతను తన కుమారుడి సాధారణ రూపం కోసం బామ్మర్ది సాయంతో తాంత్రిక పూజలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఎస్సైగా పనిచేస్తున్న కార్తీ వల్లభన్(ఆది సాయికుమార్) ఓ డ్రగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతాడు. వారం రోజుల్లోనే తన తప్పును సరిదిద్దుకోవాలని కార్తీని కమిషనర్ ఆదేశిస్తాడు. ఆ తర్వాత బెంగళూరులో జర్నలిజం చేస్తున్న సారా మహేశ్(అవికా గోర్) తన ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్కు వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఎస్సై కార్తీ వల్లభన్ సాయం కోరుతుంది. ఆ సమయంలోనే సారా తన రీసెర్చ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని కార్తీకి చెబుతుంది. అసలు ఆమె చేస్తున్న రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏంటి? ఆరేళ్లుగా చేస్తున్న ఆ పరిశోధనలో కనిపెట్టిన అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్లకు ఏంటి సంబంధం? దీని వెనక ఏదైనా హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా ఉందా? అసలు సారాను చంపాలనుకున్నది ఎవరు? చివరికీ ఈ ఇన్స్టిగేషన్ ప్రాజెక్ట్లో కార్తీ, సారా సక్సెస్ అయ్యారా? లేదా? అన్నదే అసలు స్టోరీ.ఎలా ఉందంటే.. మనదేశంలో మూఢ నమ్మకాలు, క్షుద్రపూజలను నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తమ స్వార్థం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారనే పాయింట్ను కథగా ప్రేక్షకుల ముందుకొచ్చారు డైరెక్టర్ షణ్ముగం. గతంలోనూ ఇలాంటి జోనర్లో ఎన్నో సినిమాలు వచ్చినా ఈ స్టోరీని కాస్తా భిన్నంగా చూపించారు. కథను అడవుల్లో మొదలుపెట్టిన షణ్ముగం.. చివరికీ అడవుల్లోనే ముగించాడు. ఫస్ట్ హాఫ్ అంతా రోటీన్గా అనిపిస్తుంది. అద్భుతమైన ఫైట్ సీన్తో ఆది సాయి కుమార్ను ప్రేక్షకులను పరిచయం చేస్తాడు. ఆ తర్వాత జరిగే సీన్స్ ప్రేక్షకులకు ఊహకందేలా ఉంటాయి. ఆది సాయికుమార్, అవికా గోర్ లవ్ స్టోరీ కూడా అంతగా ఎమోషనల్గా కనెక్ట్ కాలేదు. మొదటి భాగం అంతా ఇన్స్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. కథలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్కు అంతగా కనెక్ట్ కాలేదు. అక్కడక్కడ కృష్ణుడు(సుబ్రమణ్యం)తో వచ్చే కామెడీ సీన్స్ కాస్తా నవ్వించినా అంతగా మెప్పించలేదు. కార్తీ, సారాల ఇన్స్టిగేషన్ ప్రాజెక్ట్ ట్విస్ట్లతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.సెకండాఫ్కు వచ్చేసరికి కథ మొత్తం సారా, కార్తీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్ ట్విస్ట్లతో ఆడియన్స్లో కాస్తా కన్ఫ్జూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. కొన్ని చోట్ల సీరియస్గా కథ సాగుతున్న సమయంలో కామెడీని తీసుకొచ్చి ప్రేక్షకుల్లో కనెక్షన్ మిస్సయ్యేలా చేశాడు. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ మంచిదే.. కానీ తెరపై ఆవిష్కరించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. లాజిక్ పరంగా ఆలోచిస్తే కొన్ని చోట్ల సన్నివేశాల్లోనూ అది పూర్తిగా మిస్సయినట్లు కనిపించింది. కొన్ని సీన్స్ ఆడియన్స్ ఊహకందేలా ఉండడంతో కథనంలో క్యూరియాసిటీ మిస్సయింది. కథను మరింత ఆసక్తిగా మలచడంలో డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడు. క్లైమాక్స్ సీన్లో వచ్చే ట్విస్ట్లతో ప్రేక్షకులను కాసేపు కట్టిపడేశాడు. కానీ కొన్ని లాజిక్ లెస్ సీన్స్తో కథలో సీరియస్నెస్ అలాగే కొనసాగించలేకపోయాడు. ఓవరాల్గా దర్శకుడు తాను చెప్పాలనుకున్నా సందేశం మంచిదే అయినప్పటికీ.. కథనం, స్క్రీన్ప్లేపై మరింత ఫోకస్ చేసుంటే ఇంకా బాగుండేది. ఎవరలా చేశారంటే..ఆది సాయికుమార్ ఎస్సై పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. పోలీస్గా తన అగ్రెసివ్నెస్ చూపించాడు. చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ తెరపై కొత్తగా కనిపించింది. అయినప్పటికీ తన నటనతో మెప్పించింది. ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని కృష్ణుడు, అరియానా గ్లోరీ తమ పాత్రల పరిధిలో ఫర్వాలేదనిపించారు. సాంకేతికత విషయానికొస్తే ఆర్ఆర్ విష్ణు సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎంఏ మాలిక్ ఎడిటింగ్లో తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన నేపథ్యం సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.-మధుసూధన్, సాక్షి వెబ్ డెస్క్ -
బిగ్బాస్ నుంచి నాగార్జున తప్పుకోవాలి.. రానా బెటర్: సోనియా
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show) వల్ల కంటెస్టెంట్లకు పాపులారిటీ వస్తుందనేది నిజం. కానీ చాలామంది పాజిటివ్ పాపులారిటీకి బదులుగా నెగెటివిటీని మూటగట్టుకునే బయటకు వస్తుంటారు. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్కు వెళ్లిన సోనియా ఆకుల (Soniya Akula) విషయంలోనూ ఇదే జరిగింది. నాదే పెత్తనం ఉండాలి.. నేను చెప్పిందే వేదం అన్నట్లుగా మాట్లాడటంతో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె చేష్టల వల్ల విపరీతంగా ట్రోల్ అయింది. తాజాగా ఆమెకు బిగ్బాస్లో ఛాన్స్ వస్తే మళ్లీ వెళ్తారా? అన్న ప్రశ్న ఎదురైంది.నాగార్జున వద్దుఅందుకు సోనియా మాట్లాడుతూ.. నాకైతే వెళ్లాలని లేదు. కానీ ఈసారి మాత్రం హోస్ట్గా నాగార్జున (Nagarjuna Akkineni) సార్ ఉండకూడదని కోరుకుంటున్నాను. హౌస్లో నేనొకటి మాట్లాడితే దాన్ని బాడీ షేమింగ్ అని ముద్ర వేశారు. అది చాలా తప్పు కదా! హోస్ట్గా సరైన జడ్జిమెంట్ ఇవ్వాలి. ఉన్నది లేనట్లుగా మాట్లాడకూడదు. అందుకే ఆయన వెళ్లిపోతే బాగుండు. తన స్థానంలో రానా దగ్గుబాటి రావాలనుకుంటున్నాను.రానాకు ఎలా మాట్లాడాలనేది తెలుసురానా.. ఫ్రెండ్షిప్ను లవ్ అని ముద్ర వేయరనుకుంటున్నాను. తనకెలా మాట్లాడాలనేది తెలుసు. నాగార్జున హోస్ట్ అయితే మాత్రం నేను కచ్చితంగా బిగ్బాస్కు వెళ్లను. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమా అవకాశాలొస్తున్నాయి. సెలక్టివ్గా సినిమాలు చేస్తున్నాను. అందుకే నా కెరీర్ నెమ్మదిగా ముందుకుసాగుతోంది అని చెప్పుకొచ్చింది. సోనియా ప్రధాన పాత్రలో నటించిన కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ నేడు (మార్చి 21న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: బెట్టింగ్ యాప్స్.. సడన్గా ఇలా చేయడం సరికాదు: ఆర్జీవీ -
‘మార్కో’ డైరెక్టర్తో దిల్ రాజు పాన్ ఇండియా ప్రాజెక్ట్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ‘మార్కో’ మూవీ చిత్ర దర్శకుడు హనీఫ్ అదేనితో ఓ మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టారు. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించనున్న ఈ కొత్త చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ‘‘మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘మార్కో’తో దర్శకుడు హనీఫ్ అదేని పేరు బాగా ట్రెండ్ అయింది. అలాంటి ఓ క్రేజీ డైరెక్టర్తో హై బడ్జెట్తో పాన్ ఇండియా మల్టీస్టారర్ ఫిల్మ్ని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఈ మూవీతో హనీఫ్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. గురు ఫిల్మ్స్ సునీత తాటి ఈ ప్రాజెక్ట్లో భాగస్వామి అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు.ఈ బిగ్ ప్రాజెక్ట్లో హీరోలుగా ఎవరు నటిస్తారు..? ఎప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందనే విషయాలపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది డిసెంబరులో విడుదలలైన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మార్కో’.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 100 కోట్లకుపైగానే కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. హనీష్ అదేని డైరెక్షన్కు ఉన్ని ముకుందన్ నటన తోడు కావడంతో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. -
Killer Artiste Review :'కిల్లర్ ఆర్టిస్ట్' మూవీ రివ్యూ
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్ ఆర్టిస్ట్’ మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రతన్ రిషి దర్శకత్వంలో ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిగా.. నైజాం ఏరియాలో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేసింది. దీంతో ఈ సినిమా సోషల్మీడియాలో ట్రెండ్ అయిపోయింది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో మొదలై, రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్గా టర్న్ తీసుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటంటే..మన సమాజంలో జరుగుతున్న ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. హత్య చేయడాన్ని కళగా భావించే ఓ వ్యక్తి కథనే కిల్లర్ ఆర్టిస్ట్లో చూపించారు. విక్కీ (సంతోష్) స్వాతి (స్నేహ మాధురి) అన్నాచెల్లెలుగా సంతోషంగా తమ ఇంట్లో ఉన్న సమయంలో గుర్తుతెలియని కొందరు వారిపై దాడి చేస్తారు. ఈ క్రమంలో స్వాతిని హింసించి చంపేస్తారు. ఈ ఘటన విక్కీ జీవితాన్ని మార్చేస్తుంది. తన కళ్ల ముందే చెల్లెలు మరణించడం తట్టుకోలేడు. ఆమె గుర్తులు తనను వెంటాడుతూనే ఉంటాయి. దీంతో బాగా కుంగిపోతాడు. ఈ క్రమంలో విక్కీ ప్రియురాలు జాను (క్రిషేక్ పటేల్) తెరపైకి వస్తుంది. అతన్నీ మళ్లీ మామూలు వ్యక్తిగా మార్చేందుకు ప్రయత్నం చేస్తుంది. అలాంటి సమయంలో ఒక హీరోయిన్ మాస్క్ ధరించిన 'పిచ్చి రవి' అనే సైకో నగరంలోని అమ్మాయిలను టార్గెట్ చేస్తూ చంపేస్తుంటాడు. ఈ కేసును పోలీసులు ఛేదించి అతన్ని అరెస్ట్ చేస్తారు. టీవీలో వార్తలు చూసిన విక్కీకి ఆ సైకో ధరించిన మాస్క్ తన ఇంట్లో కూడా కనిపిస్తుంది. దీంతో తన చెల్లిని చంపింది ఈ సైకోనే ఉంటాడని అతను అనుకుంటాడు. ఇంతలో పోలీసుల నుంచి ఆ సైకో తప్పించుకొని పారిపోతాడు. అలా విక్కీ ప్రియిరాలు జాను పుట్టినరోజు వేడుకలో అతను ప్రత్యక్షమవుతాడు. కొన్ని సంఘటనల ద్వారా తన చెల్లిని చంపింది ఈ సైకో కాదని విక్కీ నిర్ణయించుకుంటాడు. అయితే, ఇంతకు స్వాతిని చంపింది ఎవరు..? సిటీలోని మర్డర్స్ చేస్తున్నది ఒకరా? లేక ఇద్దరా? ఆ సైకో జాను పార్టీకి ఎందుకు వచ్చాడు..? ఫైనల్గా తన చెల్లిని హత్య చేసిన వారిని విక్కీ ఎలా పట్టుకుంటాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో మొదలైన ఈ సినిమా.. ఒక హత్యతో థ్రిల్లర్ సినిమాగా మారుతుంది. కుటుంబ సభ్యులను ఎవరైన హత్య చేస్తే అందుకు ప్రతికారం తీర్చుకున్న హీరో కథలు చాలానే తెరపైకి వచ్చాయి. ఈ కిల్లర్ ఆర్టిస్ట్ చిత్రంలో కూడా తన చెల్లెల్ని చంపిన వారిపై రివేంజ్ తీర్చుకున్న యువకుడి కథ అని చెప్పవచ్చు. అయితే, ఇందులో ఎవరూ ఊహించని విధంగా మర్డర్ మిస్టరీని ప్రేక్షకులకు దర్శకుడు చూపాడు. కానీ, హత్యలకు ప్రధాన కారణం ఏంటి అనేది సరైన క్రమంలో దర్శకుడు చెప్పలేకపోయాడు. రొటీన్ పాయింట్తోనే ప్రేక్షకులను కన్వెన్స్ చేసేలా ఉంది. మొదటి గంట వరకు విక్కీ, జాను ప్రేమ కథతో పాటు స్వాతి హత్య చుట్టే ఉంటుంది. ఇంటర్వెల్కు ముందు సైకో నిజమైన హంతకుడు కాదని దర్శకుడు రివీల్ చేస్తాడు. అయితే, ఈ పాయింట్ను చక్కగా చూపాడు. సిస్టర్ సెంటిమెంట్ను ప్రధానంగా చూపాలని దర్శకుడు అనుకున్నప్పటికీ దాన్ని సరైన డ్రామాగా చిత్రీకరించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. సైకో పాత్రలో కాలకేయ ప్రభాకర్ నటన బాగున్నప్పటికీ అతని పాత్రను ఎక్కువసేపు తెరపై చూపించడం వల్ల ప్రేక్షకులకు విసుగొస్తుంది. క్లైమాక్స్లో విలన్ ఇతనే అని సర్ ప్రైజ్ చేసి చివర్లో ఓ మెసేజ్తో ముగించేస్తారు. ఇందులో అన్నాచెల్లెలు సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. కథ పాతదే అయినప్పటికీ స్క్రీన్ ప్లేలో కొత్తదనం కనిపిస్తుంది. మర్డర్ చేయడం ఒక ఆర్ట్, నేను ఆర్టిస్ట్ అంటూ ప్రభాకర్తో చెప్పించిన సైకో డైలాగ్స్ కొత్తగా ఉంటాయి.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాకు ప్రధనా బలం హీరో సంతోష్, కాలకేయ ప్రభాకర్... చెల్లి చనిపోతే ఒక అన్న ఎలా బాధపడుతాడో విక్సీ పాత్రలో సంతోష్ అదరగొట్టాడు. మరోవైపు క్రిషేక పటేల్ అందాలు ఆరబోస్తూనే పర్వాలేదనిపించింది. చెల్లి పాత్రలో నటించిన స్నేహ మాధురి కనిపించింది కొద్దిసేపు మాత్రమే.. అయినప్పటికీ ఆమె బాగానే నటించింది. సత్యం రాజేష్ పోలీస్ పాత్రలో మెప్పిస్తాడు. తనికెళ్ళ భరణి, బిగ్ బాస్ సోనియా అక్కడక్కడా కనిపించినా తమ పాత్రలకు న్యాయం చేస్తారు. సినిమాకు తగిన విధంగానే సాంకేతిక విలువలు ఉన్నాయి. -
నెల రోజుల నుంచి ఏకాకిగా.. కమెడియన్కు మంచి జీవితం ఇవ్వండి: బ్రహ్మానందం
‘‘తమ్ముడు సప్తగిరి సినిమా ఇది. ఒక హాస్యనటుడు సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను’’ అన్నారు బ్రహ్మానందం (Brahmanandam). సప్తగిరి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘పెళ్లికాని ప్రసాద్’. ఈ చిత్రంలో ప్రియాంకా శర్మ హీరోయిన్. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో కేవై బాబు, భానుప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది.పవిత్రమైన వృత్తిహైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను పది కాలాల పాటు నవ్వించాలని తపన పడేవాడు హాస్యనటుడు. హాస్యనటుడిది మనల్ని నవ్వించే వృత్తి. నిజంగా ఇది పవిత్రమైనది. ‘పెళ్లికాని ప్రసాద్’ సినిమా కోసం సప్తగిరి చాలా కష్టపడ్డాడు. నెల రోజుల నుంచి ఏకాకిగా తిరిగాడు. కనిపించే, కనిపించని దేవుళ్లందరికీ మొక్కుకున్నాడు. మంచి జీవితం ఇవ్వండిఈ సినిమా సక్సెస్ అయితే ఈ ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చినందుకు హాయిగా నాలుగు మెతుకులు తిని బతుకుతానన్నా అన్నాడు. కమెడియన్ ఎప్పుడూ ఒంటరి కాకూడదు. ఈ సినిమాను హిట్ చేసి, హాస్య నటుడికి మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కాన్సెప్ట్ బాగుంది’’ అని మరో ముఖ్య అతిథి, దర్శక–నిర్మాత మారుతి తెలిపారు. ‘‘ఈ సినిమాను తప్పకుండా థియేటర్స్లో చూడండి’’ అని పేర్కొన్నారు కేవై బాబు. పెళ్లి కాని ప్రసాద్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
శ్రీ విష్ణు '#సింగిల్' రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీవిష్ణు హీరోగా రూపొందుతోన్న సినిమా '#సింగిల్'. 'నిను వీడని నీడను నేనే' మూవీ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకుడు. ఈ చిత్రంలో ఇవానా, కేతికా శర్మ హీరోయిన్లు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మే 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి పోస్టర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: కాలమే సమాధానమిస్తుంది.. పోలీసు విచారణ తర్వాత విష్ణుప్రియ)యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ని అలరించే చిత్రంగా ‘సింగిల్’ ఉంటుంది. ఈ వేసవిలో శ్రీవిష్ణు తన నవ్వులతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఆయన పాత్రలోని రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి అని చిత్రయూనిట్ పేర్కొంది. వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతమందిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు) -
బెట్టింగ్ యాప్స్.. సడన్గా ఇలా చేయడం సరికాదు: ఆర్జీవీ
‘‘సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అనే నేపథ్యంలో ‘శారీ’ రూపొందింది. నేనీ చిత్రానికి మూల కథ రాశాను. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించాడు. ‘శారీ’లో సందేశం ఉంటుందని చెప్పను గానీ, ఈ సినిమా చూశాక అమ్మాయిలు జాగ్రత్త పడతారు’’ అని రామ్గోపాల్ వర్మ చెప్పారు. సత్య యాదు, ఆరాధ్యా దేవి ప్రధాన పాత్రల్లో గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శారీ’. Cబెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవారిపై కేసులు పెట్టడంపై స్పందిస్తూ.. తాము చేస్తున్న యాడ్స్ లీగలా? కాదా? అనేది యాక్టర్స్కు, స్టార్స్కు తెలియకపోవచ్చు. దానిపై అధికారులు నటీనటులకు అవగాహన కల్పించాలి. అంతేగానీ సడెన్గా చర్యలు తీసుకోవడం సరికాదు’’ అన్నారు. ‘‘ఆరాధ్య, సత్య బాగా నటించడం వల్ల దర్శకుడిగా నాపై ఒత్తిడి తగ్గింది’’ అని గిరి కృష్ణకమల్ చెప్పారు. ‘‘ఈ సినిమాలో నా పాత్ర చిన్నదే అయినా కథలో కీలకంగా ఉంటుంది’’ అని సత్య యాదు తెలిపారు.చదవండి: పాన్ ఇండియా సినిమాకు నిర్మాతగా 20ఏళ్ల యువతి సక్సెస్ -
కాలమే సమాధానమిస్తుంది.. పోలీసు విచారణ తర్వాత విష్ణుప్రియ
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, పలువురు ఇన్ఫ్లూయెన్సర్స్ పై పోలీస్ కేసుల హడావుడి నడుస్తోంది. నిన్నటికి నిన్న యాంకర్స్ విష్ణుప్రియ, రీతూ చౌదరి.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి విచారణ కోసం హాజరయ్యారు. ఇద్దరినీ కొన్ని గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. అయితే స్టేషన్ కి వచ్చినప్పుడు ముఖం మొత్తం కప్పేసేలా స్కార్ఫ్ కట్టుకుని వచ్చిన వీళ్లిద్దరూ ఒక్కటంటే ఒక్క మాట కూడా మీడియాతో మాట్లాడలేదు. కానీ విచారణ అంతా ముగిసి ఇంటికెళ్లిన తర్వాత మాత్రం విష్ణుప్రియ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అందులో ఏమందంటే?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు)'కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. అప్పటివరకు ఓర్పుతో ఉండటమే' అని విష్ణుప్రియ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీనిబట్టి చూస్తుంటే ఈ కేసులో ఏదో ఒకటి తేలేంత వరకు స్పందించనని క్లారిటీ ఇచ్చినట్లయింది.విష్ణుప్రియ విచారణ విషయానికొస్తే.. ఈమె లాయర్ తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చింది. దాదాపు 10 గంటల పాటు విచారించారు. మూడింటికి మాత్రమే ప్రమోషన్ చేశానని ఈమె చెప్పగా.. తమ దగ్గర 15 వీడియోలు ఉన్నాయని పోలీసులు ఈమెతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈమె బ్యాంక్ లావాదేవీలని కూడా పరిశీలించి, నిధులపై పోలీసులు ఆరా తీశారని అంటున్నారు. ఈనెల 25న మరోసారి విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించారట.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?) -
పాన్ ఇండియా సినిమాకు నిర్మాతగా 20ఏళ్ల యువతి సక్సెస్
రియా షిబు.. 20 ఏళ్ల ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్లో ట్రెండ్ అవుతుంది. హీరోయిన్గా మెప్పించిన రియా ఇప్పుడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్గా రాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా తాను నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'వీర ధీర శూరన్'( Veera Dheera Sooran) నుంచి ట్రైలర్ విడుదలైంది. చియాన్ విక్రమ్(Vikram ) కథానాయకుడిగా నటిస్తున్న 62వ సినిమాలో నటి దుషార విజయన్( Dushara Vijayan) నాయకిగా నటిస్తుండగా ఇందులో నటుడు ఎస్జే సూర్య విలన్గా కనిపించనున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా షిబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సేతుపతి, చిత్తా చిత్రాల ఫేమ్ అరుణ్ కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.వీర ధీర శూరన్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం తాజాగా చెన్నైలో జరిగింది. వేదికపై నిర్మాత రియా షిబు మాట్లాడిన మాటలు చాలా ఎనర్జిటిక్గా ఉన్నాయంటూ ప్రశంసిస్తున్నారు. ఒక యాంకర్ కంటే స్పీడ్గా మాట్లాడటమే కాకుండా.. హీరోయిన్ కంటే గ్లామర్గా కనిపించడంతో అందరిని ఆకర్షించింది. నటి దుషార విజయన్ నటన గురించి ఆమె ప్రశంసించిన తీరు అందరినీ మెప్పించేలా ఉంది. అలా ప్రేక్షకులను కట్టిపడేశాల కనిపించడంతో ఈ అమ్మాయి ఎవరంటూ ఆశ్చర్యపోయారు. ఇంతలో నటుడు ఎస్జే సూర్య(S. J. Suryah) మాట్లాడుతూ రియాను మెచ్చుకున్నారు. ప్రముఖ నిర్మాత షిబు వారసురాలిగా ఆమె మరింత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. హెచ్ఆర్ పిక్చర్స్కు ప్రధాన బలం ఆమె అంటూ ప్రశంసించారు. ఆమెను హీరోయిన్ లేదా ప్రొడ్యూసర్ ఎలా పిలవాలో తనకు అర్థం కావడం లేదని సరదాగా అన్నారు. కోలీవుడ్లో 'ఆర్ఆర్ఆర్' డిస్ట్రిబ్యూటర్గా రియాకోలీవుడ్ నిర్మాత, పంపిణీదారుడు షిబు తమిన్స్ కుమార్తెనే ఈ రియా షిబు (20).. కేరళకు చెందిన రియా శిబు చెన్నైలోని లయోలా కాలేజీలో చదువుతోంది. రియా శిబు ఒక వైపు చదువులు, మరోవైపు నిర్మాతగా అనేక బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇవన్నీ కాకుండా కప్స్ అనే మలయాళ సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. తమ హెచ్ఆర్ పిక్చర్స్ నుంచి పులి,ఇంకొక్కడు, సామీ వంటి చిత్రాలను నిర్మించడమే కాకుండా ఆర్ఆర్ఆర్(RRR Movie), డాన్, విక్రమ్, జిగ్రా వంటి సినిమాలను కోలీవుడ్లో పంపిణీ చేశారు. ఈ బాధ్యతలన్నీ కూడా ఆమె విజయవంతంగా పూర్తి చేసింది. హెచ్ఆర్ పిక్చర్స్ నిర్మిస్తున్న నాల్గవ చిత్రం వీర ధీర శూరన్. ఈ నిర్మాణ సంస్థ వెనుక 20 ఏళ్ల కాలేజీ విద్యార్థి ఉండటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు.#RiyaShibu wat an energy 😂💪 Pesama avangaley host pannalam pola event ah 😄👌#VeeraDheeraSooran pic.twitter.com/Zw5ARbBDzC— Kolly Corner (@kollycorner) March 20, 2025🔥 #SJSuryah on Producer #RiyaShibu at #VeeraDheeraSooran Audio Launch! 🔥🔥 Daughter of legendary Shibu sir— a man of his word & a pillar of support for directors!🔥A powerhouse of energy! From heroine to producer, she’s setting new benchmarks!pic.twitter.com/BDlYDQBUYe— Movie Tamil (@MovieTamil4) March 20, 2025 -
మహేశ్ కుమారుడు గౌతమ్ ఫస్ట్ యాక్టింగ్ వీడియో
హీరో మహేశ్ బాబు కొడుకు గౌతమ్ (Gautam Ghattamaneni) గురించి చాలామందికి తెలుసు. గతంలో మహేశ్ నటించిన 'వన్ నేనొక్కడినే' మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగానూ చేశాడు. రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ కుర్రాడు.. న్యూయార్క్ లోని యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. తాజాగా గౌతమ్ యాక్టింగ్ చేసిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు)న్యూయార్క్ లోని టిస్క్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. తాజాగా తన తోటి స్నేహితులతో కలిసి స్కిట్ చేశారు. ఇందులో గౌతమ్.. ఓ అమ్మాయితో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నట్లు కనిపించాడు. తొలుత నవ్వుతూ, తర్వాత కోప్పడుతూ ఎమోషన్స్ బాగానే పలికిస్తున్నట్లు కనిపించాడు.ఈ వీడియోతో పూర్తి యాక్టింగ్ జడ్జ్ చేయలేం గానీ మహేశ్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మరోవైపు సితార (Sitara) ఇప్పటికే డ్యాన్స్ వీడియోలు చేస్తూ పలు యాడ్స్ లోనూ నటిస్తోంది. ఇదంతా చూస్తుంటే మహేశ్ వారసులిద్దరూ త్వరలోనే తెరంగేట్రం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?)#GautamGhattamaneni shines at NYU Tisch School of the Arts! His latest act with his mates is winning hearts. Wishing him the best on this creative journey! ✨🎭 #MaheshBabupic.twitter.com/6nkLVztKLw— Milagro Movies (@MilagroMovies) March 20, 2025 -
‘పెళ్లికాని ప్రసాద్’ మూవీ రివ్యూ
కమెడియన్ గా పీక్స్ లో ఉన్న సమయంలోనే సప్తగిరి హీరోగా టర్న్ తీసుకున్నాడు. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ‘పెళ్లికాని ప్రసాద్’అనే సినిమాతో మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రంతో సప్తగిరికి హిట్ పడిందా లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.‘పెళ్లికాని ప్రసాద్’ కథేంటంటే..?ప్రసాద్(సప్తగిరి) కి 38 ఏళ్లు. మలేషియాలో మంచి ఉద్యోగం.. భారీ జీతం. అయినా ఆయనకి పెళ్లి కాదు. దానికి ఒక కారణం వాళ్ళ నాన్నే(మురళీధర్). రెండు కోట్ల కట్నం ఇచ్చే అమ్మాయినే చేసుకోవాలని కండిషన్ పెడతాడు. చివరకు ఓ సంబంధం సెట్ అయి ప్రసాద్ ఇండియాకు తిరిగి వస్తాడు. అయితే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది. కట్ చేస్తే... ప్రియా(ప్రియాంక శర్మ) ఎప్పటికైనా పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ కావాలనుకుంటుంది. ఆమెతోపాటు అమ్మ నాన్న లను, బామ్మను కూడా విదేశాలకు తీసుకెళ్లాలనుకుంటుంది. ప్రియ ఫ్యామిలీ మొత్తం ఓ ఎన్నారై సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రసాద్ గురించి తెలిసి.. ఫ్యామిలీ మొత్తం డ్రాప్ చేసి పెళ్లి చేయిస్తారు. పెళ్లి తర్వాత ప్రసాద్ ఇండియాలోనే ఉండాలనుకుంటాడు. ఈ విషయం ప్రియకి తెలిసిన తర్వాత ఏం జరిగింది? అసలు ప్రసాద్ పెళ్లి తరువాత ఇండియాలోనే ఎందుకు ఉండాలనుకున్నాడు? పెళ్లి తర్వాత ప్రసాద్కి ఎదురైన సమస్యలు ఏంటి? విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రియ ఫ్యామిలీ కోరిక నెరవేరిందా? లేదా? అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఏజ్ బార్ అవుతున్న హీరోకి పెళ్లి కాదు. పెళ్లి కోసం నానా కష్టాలు పడడం.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. పెళ్ళికానీ ప్రసాద్ సినిమా కథ కూడా ఇదే. దర్శకుడు ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్ ని కథగా ఎంచుకున్నారు. ఉద్యోగం, ఆస్తి ఉన్నా అబ్బాయిలకు పెళ్లి కావడం కష్టంగా ఉంది. అలాంటి సమయంలో హీరో తండ్రి కట్నం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. ఇదంతా మనకి తెలిసిన..చూసిన కథే. అయితే తెరపై చూస్తే మాత్రం... కొంతమేర ఎంటర్టైన్ అవుతాం. కొన్ని చోట్ల కామెడీ అతిగా అనిపించినా.. మరికొన్ని చోట్ల మాత్రం బాగా పేలింది.హీరోయిన్ ఫ్యామిలీ ఎందుకు విదేశాలల్లో సెటిల్ కావాలనుకుంటుందో తెలియజేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో మలెషియా నుంచి పెళ్లి కోసం ఇండియాకు రావడం..పెళ్లి చూపులు..ఇవన్నీ పాత సినిమాలను గుర్తు చేస్తాయి. హీరో హీరోయిన్లు కలిసినప్పటి నుంచి కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. ప్రసాద్ని ట్రాప్ చేయడానికి ఖుషీ సీన్ రిపీట్ చేయడం.. అలాగే అర్జున్ రెడ్డి స్టోరీ చెప్పడం.. ఇవన్నీ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తి పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథనం సాగదీతగా అనిపిస్తాయి. నవ్వించడానికే పెట్టిన కొన్ని సీన్లు.. అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. సెకండాఫ్ కథను ఇంకాస్త బలంగా రాసుకొని.. క్లైమాక్స్ విషయంలో జాగ్రత్త పడితే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఓవరాల్గా ఈ సినిమాలో కథ పెద్దగా లేకపోయినా.. సిచువేషనల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. ఎవరెలా చేశారంటే..సప్తగిరి వన్ మాన్ ఆర్మీగా నవ్వించే బాధ్యతలు తీసుకున్నాడు. వయసు పైపడుతున్న ఇంకా పెళ్లి కాక, తండ్రిని ఎదిరించలేక ఇబ్బంది పడే కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. డ్యాన్స్ కూడా బాగానే చేశాడు. సప్తగిరి తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర మురళీధర్ గౌడ్ ది. పూర్వికుల ఆచారాన్ని పాటిస్తూ కట్నం కోసం కన్నకొడుకు జీవితాన్నే ఇబ్బందులకు గురి చేసే నాన్న పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.హీరోయిన్ ప్రియాంక్ శర్మ పాత్రకి నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు కానీ కథ మొత్తం ఆమె చుట్టునే తిరుగుతుంది. అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, పాషా ట్రాక్ ఆకట్టునేల ఉంది. మిగతా నటీనట్లు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.టెక్నికల్ టీం విషయానికి వస్తే .. శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా చాలా సీన్స్ లో ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా వాడిన మీమ్ కంటెంట్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని సాంగ్స్ చిత్రీకరణ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘పెళ్లికాని ప్రసాద్’ టీమ్ వివరాలుదర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడినిర్మాతలు: K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాలబ్యానర్: థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్ డిఓపి: సుజాత సిద్దార్థ్సంగీతం: శేఖర్ చంద్రఎడిటర్: మధు- రేటింగ్: 2.5/5 -
బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?
బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్లను ప్రమోట్ చేసిన వారు భారీగా సంపాధించారని పోలీసుల విచారణలో తెలుస్తోంది. ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం వల్ల సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్ యాప్స్ ఉచ్చు బిగుస్తుంది. బెట్టింగ్ యాప్ప్ ప్రమోట్ చేసి డబ్బలు దండుకున్న వారిలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అయితే, వారు ఒక్కో యాప్ను ప్రమోట్ చేసినందుకు గాను ఎంతమొత్తంలో డబ్బు తీసుకుంటారో అధారాలతో సహా బయటకొస్తున్నాయి.బెట్టింగ్ యాప్స్ గురించి ఒక నిమిషం వీడియోకు రూ.90వేలకు పైగానే చార్జ్ చేసినట్లు సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో 1 మిలియన్కు పైగా ఫాలోవర్స్ ఉంటే నెలకు రూ. 30 లక్షలు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఎక్కువ మంది సుమారు15 వీడియోలకు పైగానే ప్రమోట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో తేలింది. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ.. అన్వేష్కు ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహుకులు ఏకంగా కోటి రూపాయలు ఆఫర్ చేసినట్లు ఆయన చెప్పాడు. అదే సమయంలో బ్యాంకాక్ పిల్ల యూట్యూబర్ను(శ్రావణి ) కూడా వారు సంప్రదించారట. ఆమెకు రూ. 70 లక్షలు ఇస్తామని బెట్టింగ్ యాప్స్ వాళ్లు ఆఫర్ చేసినట్లు తన యూట్యూబ్ ఛానల్లో పంచుకుంది. ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటే అధికమొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు ఈ గేమింగ్ యాప్స్ నిర్వాహుకులు ఏమాత్రం వెనకడుగు వేయడంలేదని చెప్పవచ్చు. ఇన్స్టాగ్రామ్లో 5వేల మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా నెలకు 20వేల వరకు ఇచ్చారని చెబుతున్నారు. ఇలా వారికి ఉన్న గుర్తింపును బట్టి డబ్బులు ఇచ్చేవారని తెలుస్తోంది. ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారు కనీసం రూ. 50 లక్షలకు పైగానే సంపాధించారని సమాచారం. వారి బ్యాంకు లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరెన్ని వీడియోలు చేశారు.. ఎంత డబ్బు సంపాధించారు అనే కోణంలో విచారిస్తున్నారు.ఎవరెవరు ఏ యాప్స్లో.. ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్మీడియాలో పాప్అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్లు జంగిల్రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్విన్ సైట్లు, యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు.సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. -
Tuk Tuk Movie: ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ
మన తెలుగమ్మాయి శాన్వి మేఘన, ఇటీవల కోర్ట్ సినిమాతో హిట్ కొట్టిన హర్ష్ రోషన్, సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్, సోషల్ మీడియా ఫేమ్ స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి.. ముఖ్య పాత్రల్లో ఈ టుక్ టుక్ సినిమా తెరకెక్కింది. మూడు చక్రాల బండిని టుక్ టుక్ అంటాం. మరి ఈ సినిమాలో టుక్ టుక్ చేసిన విన్యాసాలు ఏంటి అనేది రివ్యూలో(Tuk Tuk Telugu Movie Review) చూద్దాం. కథేంటంటే..ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు(హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బుల కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకచవితి చేస్తారు. ఆ ఊళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉండటం, నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక పాత స్కూటర్ ని ముగ్గురు కూర్చునే టుక్ టుక్ బండిలా తయారుచేస్తారు. ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు. ఆ తెల్లారి నుంచి ఆ బండి దానంతట అదే ఆపరేట్ అవుతుండటంతో అందులో దేవుడు వచ్చాడు అనుకుంటారు. దీంతో స్కూటర్ లో దేవుడు ఉన్నాడు, ఏం అడిగినా హ్యాండిల్ అటు ఇటు ఊపి అవునా, కదా అని సమాధానాలు చెప్తాడు అని ఊళ్ళో ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు.ఈ క్రమంలో ఆ స్కూటర్ లో ఉంది దేవుడు కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఈ ముగ్గురు కుర్రాళ్ళని కాస్త భయపెడుతుంది కూడా. మరి ఆ స్కూటర్ లో ఉన్న ఆత్మ ఎవరిది? ఆ స్కూటర్ లో ఎందుకు ఉంది? ఈ ముగ్గురు కుర్రాళ్ళు అందులో ఆత్మ ఉందని తెలిసాక ఏం చేసారు? నవీన్(నిహాల్ కోదాటి) - శిల్ప(శాన్వి మేఘన)ల ప్రేమ కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..వెహికల్ దానంతట అదే ఆపరేట్ అవ్వడం, భయపెట్టడం, నవ్వించడం గతంలో తెలుగులో బామ్మ మాట బంగారు బాట, కారా మజాకా, మెకానిక్ మామయ్య లాంటి పలు సినిమాల్లో చూసాం. ఈ టుక్ టుక్ కూడా అలాంటిదే. మూడు చక్రాల బండిలో ఆత్మ ఉంటే అది ఎలాంటి విన్యాసాలు చేసింది అని సరదాగా చూపించారు. ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళు ఓ బండి తయారు చేయడం, ఆ బండిలో దేవుడు ఉన్నాడు అని దాంతో డబ్బులు సంపాదించడం సీన్స్ అన్ని కాస్త నవ్విస్తూనే ఆసక్తిగా ఉంటాయి.ఆ బండిలో ఆత్మ ఉందని తెలిసాక వాళ్ళు భయపడటం, అది వీళ్ళను పరిగెత్తించడం బానే నవ్విస్తాయి. స్కూటర్ మాట్లాడలేదు కానీ అది పిల్లలు అడిగే ప్రశ్నలకు ఇండికేషన్స్ ఇస్తూ సమాధానాలు చెప్పడం కొత్తగా ఉంటుంది. అయితే ఆ ఆత్మ కథేంటి అని ఫ్లాష్ బ్యాక్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. అసలు ఆ ఆత్మ అందులోకి ఎలా వచ్చింది అనేది మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేదు. లవ్ స్టోరీ కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా సింపుల్ గా ముగించినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ పాత్రను బాగా రాసుకున్నారు. అలాగే సినిమాలో ఓ మెసేజ్ చెప్పడానికి కూడా ప్రయత్నించారు. సినిమాకు సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.ఎవరెలా చేశారంటే..మన తెలుగమ్మాయి శాన్వి మేఘన తన క్యూట్ అందంతో మెప్పిస్తునే ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో చక్కగా నటించింది. ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళ పాత్రల్లో హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు ఫుల్ ఎనర్జీతో నవ్విస్తూనే బాగా నటించారు. నిహాల్ కోదాటి పర్వాలేదనిపిస్తాడు. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పచ్చని లొకేషన్స్ ని సినిమాటోగ్రఫీ విజువల్స్ తో మరింత అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. టుక్ టుక్ బండిని బాగా డిజైన్ చేసారు. దర్శకుడు ఓ కొత్త పాయింట్ ని టుక్ టుక్ (Tuk Tuk Movie Review)బండితో నవ్విస్తూ చెప్పాడు. నిర్మాణవిలువలు చిన్న సినిమా అయినా ఉన్నతంగా ఉన్నాయి.నటీనటులు: హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి.. తదితరులునిర్మాత: రాహుల్ రెడ్డి దర్శకత్వం: సి.సుప్రీత్ కృష్ణసంగీతం: సంతు ఓంకార్ సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయి కుమార్ ఎడిటర్: అశ్వత్ శివకుమార్ విడుదల తేది: మార్చి 21, 2025 -
'హరిహర వీరమల్లు'కు ఏకైక దిక్కు ఆమె మాత్రమే
పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన 'హరిహర వీరమల్లు'(Hari Hara Veera Mallu ) సినిమా మే 9న రిలీజ్ కానుంది. సరిగ్గా 50 రోజుల్లోనే ఈ చిత్రం థియేటర్స్లోకి వచ్చేస్తుంది. ఇప్పటికే విడుదల విషయంలో పలుమార్లు తేదీలు మారుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్పై హీరోయిన్ నిధి అగర్వాల్( Nidhhi Agerwal) భారీ ఆశలే పెట్టుకుంది. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకులు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆపై ఈ చిత్రానికి ప్రధాన బలం పవన్ కల్యాణ్(Pawan Kalyan) అని తెలిసిందే. కానీ, ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎక్కువగా లీడ్ తీసుకునేది మాత్రం హీరోయిన్ నిధి అగర్వాల్ అని చెప్పాలి.హరిహర వీరమల్లు సినిమాను పవన్ కల్యాణ్ ఎక్కడా కూడా ప్రచారం చేయడం లేదు. తన స్టార్డమ్ వల్ల సినిమా ఆడేస్తుందిలే అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు ఉన్నారు. వాస్తవంగా ఆయన తన సినిమాల ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోరని అందరికీ తెలిసిందే.. ఆపై ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అస్సలు ఇటువైపు చూసే ఛాన్స్ లేదు. అయితే, దర్శకుడు క్రిష్ ఈ సినిమా ప్రచారానాకి దాదాపు రాకపోవచ్చనే సందేహాలు వస్తున్నాయి. రెండో దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా పెద్దగా బజ్ క్రియేట్ చేయలేరని తెలిసిందే. అయితే, ఈ పాన్ ఇండియా సినిమా ప్రచారం కోసం మిగిలిన ఏకైకా పెద్ద దిక్కుగా నిధి అగర్వాల్ మాత్రమే మిగిలిందని చెప్పవచ్చు.‘హరి హరవీరమల్లు’ విడుదల కోసం నిధి అగర్వాల్ చాలా ఏళ్ల నుంచి ఎదురుచూస్తుంది. అందుకే ఈ మూవీ ప్రచార బాధ్యతల్ని కూడా తన భుజానికెత్తుకుంది. ఈ క్రమంలో పలు టీవీ షోలలో పాల్గొని తనదైన స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులకు దగ్గరౌతుంది. సుమారు ఇంకో 20రోజుల పాటు ‘హరి హరవీరమల్లు’ ప్రచారంలో ఆమె ఉండనున్నారు. అందులో భాగంగా ఆమె పలు నగరాల్లో కూడా సందడి చేయనున్నారు. ఈ సినిమా హిట్ అయితే తన కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందని ఆశగా ఈ బ్యూటీ ఎదురుచూస్తుంది. -
'భారతరత్న' అవార్డ్స్.. రేసులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్
దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’( Bharat Ratna) అవార్డును ప్రముఖ సంగీత దర్శకుడు అందుకోనున్నారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి, అత్యుత్తమ పనితీరును కనబరచినవారికి ఈ అవార్డును అందజేస్తారు. ఒక ఏడాదిలో గరిష్ఠంగా ముగ్గురికి మాత్రమే ఈ పురస్కారాన్ని ప్రకటించవచ్చు. అయితే, 2025 ఏడాదికి గాను మేస్ట్రో ఇళయరాజాను (Ilaiyaraaja) భారతరత్న అవార్డ్తో కేంద్ర ప్రభుత్వం గౌరవించనుందని తెలుస్తోంది. ఈ ఉగాదిలోపు ప్రకటించే అవకాశం ఉంది.మేస్ట్రో ఇళయరాజా... ఈ పేరు వింటే చాలు సంగీత ప్రియులు ఆయన సినిమాల్లోని పాటలతో కూని రాగాలు తీస్తుంటారనడంలో సందేహం లేదు. తన పాటలతో అంతలా సంగీత ప్రియులను అలరించారాయన. తనకంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఇళయరాజాను భారతరత్న అవార్డ్తో కేంద్ర ప్రభుత్వం గౌరవించనున్నట్లు దాదాపు ఖాయం అయిందని సమాచారం. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5వేల పాటలతో పాటుగా 1000 సినిమాలకు పైగానే సంగీత దర్శకత్వం వహించి రికార్డ్ క్రియేట్ చేశారు. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఆయన కొనసాగుతున్న విషయం తెలిసిందే.2010లో భారత ప్రభుత్వం ఆయనను "పద్మభూషణ్" పురస్కారంతో సత్కరించగా.. 2018లో "పద్మవిభూషణ్" అవార్డ్ వరించింది. ఉత్తమ సంగీత దర్శకుడుగా ఏడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. దేశంలోనే అత్యున్నతమైన 24 అవార్డ్స్ను ఇళయరాజా అందుకున్నారు.లండన్లో ఇటీవల ఇళయరాజా ‘వాలియంట్’ పేరుతో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ వెస్ట్రన్ క్లాసికల్ సింఫొనీ నిర్వహించిన తొలి ఆసియా మ్యూజిక్ కంపోజర్గా ఇళయరాజాకు గౌరవం దక్కింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా ఇళయరాజా కలిశారు. -
డిటెక్టివ్–2 తర్వాత మరో ప్రాజెక్ట్కు విశాల్ గ్రీన్ సిగ్నల్
కోలీవుడ్ నటుడు విశాల్ జయాపజయాలకు అతీతుడనే చెప్పాలి. 2023లో మార్క్ ఆంటోనీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన విశాల్ ఆ తర్వాత నటించిన రత్నం చిత్రం 2024లో విడుదలై పూర్తిగా నిరాశపరిచింది. అయితే ఆ లోటు భర్తీ చేసే విధంగా గత 12 ఏళ్ల క్రితం కథానాయకుడుగా నటించిన మదగజరాజా చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం విశాల్ డిటెక్టివ్–2 చిత్ర రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఇందులో కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. అదేవిధంగా గౌతమ్మీనన్ దర్శకత్వంలో నటించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఇంతకుముందు ఈటీ, ఐంగరన్ చిత్రాల ఫేమ్ రవి అరసు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. అయితే విశాల్ ముందుగా గౌతమ్మీనన్ దర్శకత్వంలో నటిస్తారా, లేక రవి అరసు దర్శకత్వంలో నటిస్తారా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం విశాల్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న డిటెక్టివ్ –2 చిత్రం తర్వాతే మరో చిత్రంలో నటించే అవకాశం ఉంది. ఇకపోతే ఇటీవల విశాల్ అనారోగ్యానికి గురి కావడంతో ఆయనపై రకరకాల ట్రోల్స్ చేశారు. అయితే చాలా త్వరగా రికవరీ అయిన విశాల్ మళ్లీ షూటింగ్తో బిజీ కావడం ద్వారా తన గురించి కామెంట్ చేసిన వారికి స్ట్రాంగ్గా బదులు ఇచ్చారనే చెప్పాలి. -
స్పెషల్ సాంగ్స్కి సై
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనేది సామెత. చిత్ర పరిశ్రమలో ఈ సామెత బాగా వర్తిస్తుంది. ప్రత్యేకించి హీరోయిన్ల విషయంలో.. క్రేజ్ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి, అటు ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఇటు బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవాలి. ఇందుకు కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా ట్రెండ్కి తగ్గట్టుగా కెరీర్ని మలచుకుంటూ స్పెషల్ సాంగ్స్కి కూడా సై అంటున్నారు పలువురు కథానాయికలు.పైగా ప్రత్యేక పాటల్లో నటించే వారికి పారితోషికం కూడా భారీగా ఇస్తుండటంతో స్పెషల్ సాంగ్స్లో నర్తించేందుకు హీరోయిన్లు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే, శ్రియ, నేహా శెట్టి, కేతికా శర్మ, రెబా మోనికా జాన్, చంద్రికా రవి వంటి హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్లో నటిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.రెట్రోకి హైలైట్ ‘ఇష్టం’ (2001) సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రియా శరణ్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్బాబు, ఎన్టీఆర్... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించి, స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు శ్రియ. ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్పెషల్ సాంగ్స్పై దృష్టి పెట్టారు శ్రియ. ప్రత్యేక పాటల్లో నర్తించడం ఆమెకు కొత్త కాదు. రామ్ని హీరోగా, ఇలియానాని హీరోయిన్గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ‘దేవదాసు’ (2006) సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో చిందేశారు శ్రియ.ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007), వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన ‘తులసి’ (2007), పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ‘పులి’, సందీప్ కిషన్, సాయిదుర్గా తేజ్ నటించిన ‘నక్షత్రం’ (2017) వంటి తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ, హిందీ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన శ్రియ తాజాగా ‘రెట్రో’ సినిమాలో ప్రత్యేక పాటలో సందడి చేయనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొదుతున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటించారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్లో సూర్యతో కాలు కదిపారు శ్రియ. గోవాలో ప్రత్యేకంగా వేసిన సెట్స్లో సూర్య, శ్రియలపై ఈ పాట చిత్రీకరించారు మేకర్స్. సూర్య, జ్యోతిక, కార్తికేయ సంతానం నిర్మించిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ముచ్చటగా మూడోసారినాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు పూజా హెగ్డే. ప్రభాస్, మహేశ్బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్చరణ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్ వంటి హీరోలకి జోడీగా నటించి, తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నర్తించారు.రామ్చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ (2018) సినిమాలోని ‘జిల్ జిల్ జిగేల్ రాణి...’ పూజా చేసిన తొలి స్పెషల్ సాంగ్. ఈ పాటలో రామ్చరణ్, పూజా హెగ్డే మాస్ డ్యాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘ఎఫ్ 3’ (2022) సినిమాలో ‘అధ్యక్షా... లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా...’ అనే సాంగ్లో రెండోసారి చిందేసిన పూజ ముచ్చటగా మూడోసారి ‘కూలీ’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు.రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొదిన చిత్రం ‘కూలీ’. అనిరు«ధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీలోని ప్రత్యేక పాట చాలా వెరీ వెరీ స్పెషల్గా ఉంటుందట. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సన్న్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘కూలీ’ నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించలేదు.అది దా సర్ప్రైజ్అది దా సర్ప్రైజ్ అంటున్నారు కేతికా శర్మ. ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు కేతిక. 2021 అక్టోబరు 21న విడుదలైన ఈ మూవీలో ఈ అమ్మడు అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘లక్ష్య, రంగరంగ వైభవంగా, బ్రో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కేతికా శర్మ తొలిసారి ‘రాబిన్హుడ్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొదిన ద్వితీయ చిత్రం ‘రాబిన్హుడ్’.శ్రీలీల హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో ‘అది దా సర్ప్రైజ్...’ అంటూ సాగే ప్రత్యేక పాటలో కేతికా శర్మ సందడి చేశారు. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందించిన ఈ పాటని ఇటీవలే విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి పాడగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.నా ముద్దుపేరు స్వాతి రెడ్డి శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవర గమన’ (2023) సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు రెబా మోనికా జాన్. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ బ్యూటీ క్రేజ్ ఓ రేంజ్కి వెళ్లింది. ప్రస్తుతం ఆమె ‘మృత్యుంజయ్’ మూవీలో శ్రీవిష్ణుతో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. ఓ వైపు హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీ మరోవైపు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’.కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంకా జవాల్కర్, మురళీధర్ గౌడ్, డైరెక్టర్ కేవీ అనుదీప్ కీలక పాత్రలు పోషించారు. ‘మ్యాడ్’కి (2023) సీక్వెల్గా రూపొదిన ‘మ్యాడ్ స్క్వేర్’లో రెబా మోనికా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.‘నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి... నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి...’ అంటూ సాగే ఈ పాటలో హుషారైన స్టెప్పులు వేశారు రెబా. సురేష్ గంగుల సాహిత్యం అందించిన ఈ పాటని స్వాతి రెడ్డి, భీమ్స్ ఆలపించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది.మొదటి సారి...ఆకాశ్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘మెహబూబా’ (2018) సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగుకి పరిచయం అయ్యారు కన్నడ బ్యూటీ నేహా శెట్టి. ఆ సినిమా తర్వాత ‘గల్లీ రౌడీ, డీజే టిల్లు, బెదురులంక 2012, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి సినిమాల్లో నటించి, మెప్పించారామె. సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాలో రాధిక పాత్రతో కుర్రకారు మనసులు దోచేశారీ బ్యూటీ. ఈ మూవీలో ఆమె నటన, గ్లామర్కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇదిలా ఉంటే నేహా శెట్టి తొలిసారి ఓ ప్రత్యేక పాటలో చిందేశారు. పవన్ కల్యాణ్ హీరోగా ‘సాహో’ మూవీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్). డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్, శ్రియా రెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో పవన్ కల్యాణ్తో కలిసి చిందేశారట నేహా శెట్టి. థాయ్ల్యాండ్లో ఈ పాటని చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందని ఫిల్మ్నగర్ టాక్.టచ్లో ఉండు ఓ రబ్బీ...తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా నటించిన చంద్రికా రవి ఓ స్పెషల్ సాంగ్తో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు. 2019లో విడుదలైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాలో ఓ ప్రత్యేక పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారీ బ్యూటీ. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ (2023) మూవీలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే...’ అనే స్పెషల్ సాంగ్లో తనదైన గ్లామర్, డ్యాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేశారు చంద్రిక.తాజాగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేశారామె. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దర్శక ద్వయం నితిన్, భరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పిల్లి కథానాయికగా నటించారు. యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొదిన ఈ మూవీలో ‘టచ్లో ఉండు ఓ రబ్బీ... ఓ రబ్బీ...’ అంటూ చిందేశారు చంద్రిక.ఈ పాటకి చంద్రబోస్ మాస్ లిరిక్స్ అందించగా, లక్ష్మీ దాస, పి. రఘు పాడారు. రధన్ తనదైన హుషారైన సంగీతం అందించారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్పై రూపొదిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఏప్రిల్ 11న విడుదల కానుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో చిరంజీవితో కలిసి ఊర్వశీ రౌతేలా చిందేయనున్నారని టాక్. ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలో ‘వేర్ ఈజ్ ద పార్టీ...’ అనే ప్రత్యేక పాటలో చిరంజీవి– ఊర్వశీ రౌతేలా తమదైన స్టెప్పులతో అలరించిన సంగతి తెలిసిందే.ఈ పాట సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ‘విశ్వంభర’లోనూ చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్లో ఊర్వశి మెరవనున్నారట. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ మూవీ ఈ వేసవిలో విడుదల కానుందని టాక్. ఇదిలా ఉంటే... బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం ‘జాట్’. ఈ మూవీలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర కీలక పాత్రధారులు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో హీరోయిన్ నిధీ అగర్వాల్ మెరవనున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. కాగా ‘విశ్వంభర’లో ఊర్వశీ రౌతేలా, ‘జాట్’లో నిధీ అగర్వాల్ స్పెషల్ సాంగ్స్ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.వీరే కాదు.. మరి కొందరు హీరోయిన్లు కూడా ప్రత్యేక పాటల్లో సందడి చేయనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
జిమ్లో నేషనల్ క్రష్ రష్మిక.. వింత డ్రెస్లో మిల్కీ బ్యూటీ!
వారణాసిలో అనసూయ ప్రత్యేక పూజలు..ప్రత్యేక ఇంటర్వ్యూ ఫోటోలు షేర్ చేసిన శోభిత ధూళిపాల..వైట్ గౌనులో మిల్కీ బ్యూటీ హోయలు..బ్లూ శారీలో మెరిసిపోతున్న జ్యోతి పూర్వాజ్..జిమ్లో రష్మిక మందన్నా కసరత్తులు.. View this post on Instagram A post shared by Meghana S Shankarappa ✨ (@meghanasshankarappa_) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మెగాస్టార్ ఆగ్రహం
యూకే పర్యటనపై మెగాస్టార్ చిరంజీవి మరో ట్వీట్ చేశారు. తన పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని పోస్ట్ చేశారు. అయితే ఇదే క్రమంలో కొందరు డబ్బులు వసూలు చేశారని నాకు సమాచారం వచ్చిందన్నారు. అభిమానుల సమావేశాల పేరుతో ఇలా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మెగాస్టార్ ట్విటర్లో రాసుకొచ్చారు. ఇలాంటి చర్యలకు తాను పూర్తిగా వ్యతిరేకమని చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సందేశమిచ్చారు. లండన్లో తనని కలిసేందుకు ఫ్యాన్స్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.చిరు తన ట్వీట్లో రాస్తూ..'నా ప్రియమైన అభిమానులారా.. యూకేలో నన్ను కలవాలనుకునే మీ అందరి ప్రేమ, ఆప్యాయత నా మనస్సును తాకింది. అయితే కొంతమంది వ్యక్తులు అభిమానుల సమావేశాల కోసం డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు సమాచారం అందింది. ఇలాంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవరైనా డబ్బులు వసూలు వస్తే వెంటనే వారికి తిరిగి ఇవ్వండి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను ఎక్కడా కూడా ఇలాంటి చర్యలను అనుమతించను. మీ ప్రేమ, ఆప్యాయత, బంధం వెలకట్టలేనిది. దీన్ని ఎవ్వరూ ఏ విధంగానూ వ్యాపారంగా మార్చలేరు. ఇలాంటి దోపిడీకి దూరంగా ఉందాం' అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో మెగాస్టార్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.(ఇది చదవండి: నా హృదయం సంతోషంతో నిండిపోయింది: మెగాస్టార్ చిరంజీవి)కాగా.. చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. My Dear Fans , I am deeply touched by all your love and affection in wanting to meet me in UK. However, I’ve been informed that some individuals are attempting to charge a fee for the fan meetings. I strongly condemned this behaviour. Any fee collected by any one will be refunded…— Chiranjeevi Konidela (@KChiruTweets) March 20, 2025 -
జాన్వీ కపూర్ ఫాదర్తో ఎవరైనా పెట్టుకుంటారా?.. నిర్మాత నాగవంశీ కామెంట్స్
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ మూవీని 2023లో వచ్చిన మ్యాడ్కు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే థియేటర్లలో కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే వచ్చార్రోయ్.. మళ్లొచ్చార్రోయ్ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రనిర్మాత సూర్య దేవర నాగవంశీ, డైరెక్టర్ కల్యాణ్ శంకర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిద్దరిని సంగీత్ శోభన్ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. వీరి మధ్య జరిదిన సరదా సంభాషణలో బోనీకపూర్ అంశం తెరపైకి వచ్చింది. బోనీ కపూర్తో జరిగిన డిబేట్లో ఆయనను కొంత డిస్రెస్పెక్ట్గా మాట్లాడారని వార్తలొచ్చాయి. ఇంతకీ అక్కడ అసలేం జరిగిందని సంగీత్ శోభన్ ప్రశ్నించారు.దీనిపై నాగవంశీ స్పందిస్తూ..'అసలు అక్కడ ఏం జరిగిందనేది పక్కన పెడితే.. జాన్వీ కపూర్ లాంటి అమ్మాయికి ఫాదర్ ఆయన. అలాంటి వ్యక్తితో ఎవరైనా గొడవ పెట్టుకుంటారా? అలాంటి వ్యక్తిని ఎవరైనా డిస్రెస్పెర్ట్ చేస్తారా? అది కూడా ఆలోచించకుండా నేను బోనీ కపూర్ను గౌరవించలేదని అంటున్నారు' అంటూ సరదాగా సమాధానమిచ్చారు.కాగా.. ముంబయిలో జరిగిన నిర్మాతల డిబేట్లో బాలీవుడ్, దక్షిణాది సినిమాల విషయంలో గతంలో నాగవంశీ మాట్లాడారు. నిర్మాతల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ కేవలం బాంద్రా, జుహుకు మాత్రమే పరిమితమైందని నాగవంశీ అన్నారు. అయితే నాగవంశీ వ్యాఖ్యలను బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఖండించారు. -
రానాపై బెట్టింగ్ యాప్ కేసు.. స్పందించిన టీమ్
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటిపై వస్తున్న ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రానాపై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రానా పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. స్కిల్ ఆధారిత గేమ్లకు బ్రాండ్ అంబాసిడర్గా రానా దగ్గుబాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. అయితే ఈ అగ్రిమెంట్ 2017లోనే ముగిసిందని వెల్లడించింది. కేవలం చట్టబద్ధమైన కంపెనీలకే రానా ప్రమోట్ చేశారని పీఆర్ రిలీజ్ చేసిన ప్రకటనలో పేర్కొందిఏదైనా ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి న్యాయ బృందం అన్నింటినీ క్షుణ్ణంగా సమీక్షిస్తుందని వివరించారు. చట్టపరంగా అనుగుణంగా ఉంటేనే రానా అంగీకరిస్తారని తెలిపారు. రానా దగ్గుబాటి ప్రమోట్ చేసిన యాప్ చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉందని చెప్పడానికే ఈ ప్రెస్ నోట్ జారీ చేశామని వెల్లడించారు. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ఆన్లైన్ గేమ్లను హైలైట్ చేయడం చాలా అవసరమని.. ఇలాంటి గేమ్లు నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయని.. అందువల్ల చట్టబద్ధంగా వీటిని అనుమతించారని గతంలో కోర్టు తీర్పు ఇచ్చిందని నోట్లో ప్రస్తావించారు.బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారంటూ ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్, యూట్యూబర్స్తో పాటు పలువురు బుల్లితెర నటీనటులపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియతో పాటు రీతూ చౌదరి పంజాగుట్ట పీఎస్లో పోలీసులకు వివరణ ఇచ్చారు. -
జాన్వీ కపూర్కు ఉపాసన స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?
దేవర సినిమాతో చుట్టమల్లే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఈ సినిమా విడుదలకుముందే రామ్చరణ్ (Ram Charan)తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ #RC16 మూవీ నుంచి జాన్వీ బర్త్డే రోజు స్పెషల్ పోస్టర్ కూడా వదిలారు. దక్షిణాది వంటకాలంటే ఇష్టంజాన్వీ ఉండేది ముంబైలో అయినా దక్షిణాది వంటకాలంటే తనకెంతో ఇష్టం. వీలు దొరికినప్పుడల్లా తిరుపతికి వస్తుంది. అప్పుడు సౌత్ ఫుడ్ను ఎంతో ఇష్టంగా తింటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఉపాసన (Upasana Konidela) ఓ గిఫ్ట్ ఇచ్చింది. ఆ బహుమతి మరేంటో కాదు.. అత్తమ్మాస్ కిచెన్ నుంచి ఓ గిఫ్ట్ హ్యాంపర్ను ఇచ్చింది. అసలే భోజనప్రియురాలైన జాన్వీ దాన్ని ఎంతో సంతోషంగా స్వీకరించింది జాన్వీ.ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే..దూర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇంటిభోజనాన్ని మిస్ అవకూడదన్న ఆలోచనలో నుంచి పుట్టిందే అత్తమ్మాస్ కిచెన్. అప్పటికప్పుడు ఈజీగా ఇంటి భోజనం తయారయ్యేలా ఇన్స్టంట్ మిక్స్లు రెడీ చేసి అమ్ముతున్నారు. ఎలాంటి కృత్రిమ ప్రిజర్వేటివ్స్ వాడకుండా వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఉప్మా, పులిహోర, రసం, పొంగల్.. ఇలా పలురకాల ఉత్పత్తులను వీరు విక్రయిస్తున్నారు. View this post on Instagram A post shared by Athamma`s Kitchen (@athammaskitchen) చదవండి: ఫిబ్రవరిలో ఒక్కటి తప్ప అన్నీ ఫ్లాపే.. ఒక సినిమాకైతే రూ.10 వేలే -
రాబిన్హుడ్ మూవీ ఈవెంట్.. ముఖ్య అతిథిగా సన్రైజర్స్ మాజీ కెప్టెన్!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. భీష్మ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండగా.. మూవీ టీమ్ ప్రమోషన్ల జోరుతో దూసుకెళ్తోంది. కాలేజీల్లో వరుస ఈవెంట్లతో నితిన్ టీమ్ సందడి చేస్తోంది.అయితే ఈ మూవీలో పుష్ప మేనరిజంతో అభిమానులను ఆకట్టుకున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ పాత్రలో కనిపించనున్నారు. ఓ సినిమా ఈవెంట్లో ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ద్వారా డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు టీమ్కు కెప్టెన్గా పనిచేశారు. దీంతో వార్నర్కు టాలీవుడ్ ఫ్యాన్స్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడేమో ఏకంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.టతాజాగా రాబిన్హుడ్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు డేవిడ్ వార్నర్ హాజరు కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్కు అనుమతుల కోసం చిత్రబృందం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకునే పనిలో రాబిన్హుడ్ టీమ్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా తెలుగు సినిమా ఈవెంట్కు డేవిడ్ వార్నర్ హాజరైతే మాత్రం ఓ రేంజ్లో ఉంటుందని టాలీవుడ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న థియేటర్లలో సందడి చేయనుంది. -
శోభితలో నాకు బాగా నచ్చేదదే.. తన నుంచి నేర్చుకోవాలి: నాగచైతన్య
పెళ్లయ్యాక అదృష్టం కలిసొస్తుందంటారు. కిరణ్ అబ్బవరం.. రహస్యను పెళ్లి చేసుకున్నా 'క' మూవీతో బ్లాక్బస్టర్ కొట్టాడు. అటు నాగచైతన్య (Naga Chaitanya).. శోభిత (Sobhita Dhulipala)ను పెళ్లాడాక 'తండేల్'తో పెద్ద హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ అవకపోతే ఇంట్లో పరువు పోతుందని తెగ భయపడిపోయాడు. చివరకు విజయం దక్కడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ మధ్యే ఇద్దరూ మెక్సికోలో హనీమూన్కు కూడా వెళ్లొచ్చారు.అప్పటిదాకా చైను ఫాలో కాలేతాజాగా ఈ జంట వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శోభిత మాట్లాడుతూ.. ఓసారి నేను సోషల్ మీడియాలో అభిమానులడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాను. అప్పుడో వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతున్న అక్కినేని నాగచైతన్యను తిరిగి ఎందుకు ఫాలో అవడం లేదు? అని ప్రశ్నించారు. అవునా అని ఆశ్చర్యపోతూ అతడి ప్రొఫైల్ చెక్ చేశా.. తను కేవలం 70 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. అందులో నేనూ ఉన్నాను. నచ్చినవాటి కోసం..అది చూసి కాస్త ఖుషీ అయ్యాను. వెంటనే నేనూ ఫాలో కొట్టాను. అప్పటినుంచి అతడి పోస్టులు రావడం.. ఒకరికొకరం మెసేజ్ చేసుకోవడం మొదలైంది. 2022 ఏప్రిల్లో తొలిసారి ఇద్దరం కలుసుకుని లంచ్ డేట్కు వెళ్లాం. తను చాలా సింపుల్గా ఉంటాడు. తను ఇష్టపడే బైక్ను రెండు గంటల సమయం కేటాయించి తనే శుభ్రం చేసుకుంటాడు. తనకు నచ్చిన వస్తువుల కోసం, వ్యక్తుల కోసం ఏదైనా చేస్తాడు. (చదవండి: సినిమాల్లో అసభ్యకర స్టెప్పులు... మహిళా కమిషన్ సీరియస్)శోభితలో బాగా నచ్చే అంశం అదే!జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాడు. కస్టడీ ఫ్లాప్ అయినప్పుడు, తండేల్ హిట్టయినప్పుడు ఒకేలా ఉన్నాడు అని చెప్పుకొచ్చింది. నాగచైతన్య మాట్లాడుతూ.. శోభిత చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. అది నాకు బాగా నచ్చుతుంది. మా ఇంట్లో వారంతా కూడా తెలుగులోనే మాట్లాడతారు. కానీ నేను చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళం భాష వచ్చేసింది. బయటకు వెళ్తే తమిళం, ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడేవాడిని. ఫోటోలో స్మైల్ ఇవ్వు అంటే..శోభిత మాట్లాడే తెలుగు ముందు నా భాష దేనికీ పనికిరాదు. ఈ విషయంలో ఆమెను మెచ్చుకోవాల్సిందే! నాకూ తెలుగు నేర్పించమని అడుగుతూ ఉంటాను. అలాగే తన మేధస్సును కూడా పంచమని చెప్తుంటాను. ఇకపోతే శోభిత ఫోటోల్లో పెద్దగా నవ్వనే నవ్వదు. ఎందుకలా ఉంటావ్, కాస్త నవ్వుతూ దిగొచ్చుగా అంటే నేను లోపల నవ్వుతున్నాను, కానీ మీరెవరూ చూడలేకపోతున్నారు అని నాకే డైలాగ్స్ వేస్తుంది అని చై చెప్పుకొచ్చాడు. చై-శోభిత 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు.చదవండి: తమన్ని అన్ఫాలో చేసిన రామ్ చరణ్..నిజమెంత? -
నా హృదయం సంతోషంతో నిండిపోయింది: మెగాస్టార్ చిరంజీవి
యూకే పార్లమెంట్లో తనకు జరిగిన సన్మానంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చాలా మంది గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, సెక్రటరీలు, దౌత్యవేత్తలు సమక్షంలో అందుకున్న గౌరవంతో నా మనసు నిండిపోయిందని పోస్ట్ చేశారు. టీమ్ బ్రిడ్జ్ ఇండియా ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించడంతో మనస్ఫూర్తిగా సంతోషాన్ని ఇచ్చిందని రాసుకొచ్చారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ..' నాకు దక్కిన ఈ గౌరవం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కానీ నా అద్భుతమైన ప్రేమగల అభిమానులకు, నా సోదర, సోదరిమణులకు, నా కుటుంబం, శ్రేయోభిలాషులు, స్నేహితులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ప్రయాణానికి నాకు అన్ని విధాలుగా సహకరించి.. నా మానవతా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ గౌరవం నన్ను మరింత కష్టపడేందుకు ప్రేరేపిస్తుంది. నాకు మరింత శక్తిని అందిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Heart filled with gratitude for the honour at the House of Commons - UK Parliament by so many Esteemed Members of Parliament , Ministers & Under Secretaries, Diplomats. Humbled by their kind words. Heartened by the Life Time Achievement Award by Team Bridge India. Words are not… pic.twitter.com/XxHDjuFIgM— Chiranjeevi Konidela (@KChiruTweets) March 20, 2025 -
బెట్టింగ్ యాప్స్ కేసు.. స్పందించిన విజయ్ దేవరకొండ టీమ్!
బెట్టింగ్ యాప్స్ కేసులో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పేరు కూడా నమోదైన సంగతి తెలిసిందే. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై ఆయనర్ టీమ్ స్పందించింది. బెట్టింగ్ యాప్స్ (Betting App Case)కి విజయ్ దేవరకొండ ప్రచారం చేయలేదని.. స్కిల్ బేస్డ్ గేమ్స్కు మాత్రమే ప్రమోషన్స్ చేశారని క్లారిటీ ఇచ్చింది. విజయ్ ప్రచారం చేసిన కంపెనీలు అన్ని చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని , ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని పీఆర్ టీమ్ తెలియజేసింది.విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసింది. ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదు’అని ఆయన పీఆర్ టీమ్ పేర్కొంది. -
బెట్టింగ్ యాప్ కేసు.. భారీగా డబ్బులు వచ్చాయన్న విష్ణుప్రియ
బెట్టింగ్ యాప్స్ కేసు టాలీవుడ్ను కుదిపేస్తోంది. ఈ కేసులో బిగ్బాస్ బ్యూటీ, యాంకర్ విష్ణుప్రియ ఇవాళ పోలీసుల విచారణకు హాజరైంది. తన లాయర్తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చింది. ఈ విచారణలో విష్ణు ప్రియ పలు కీలక విషయాలను వెల్లడించింది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినట్లు పోలీసుల ఎందుట అంగీకరించింది.అయితే తాను దాదాపు 15 రకాల బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినట్లు పోలీసులకు వివరించింది. అలా ఒక్కో యాప్నకు దాదాపు రూ.90 వేలు ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఈ విచారణలో విష్ణుప్రియ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు.. ఆమె మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ఈ కేసులో ఆమెను సుమారుగా రెండు గంటలకు పైగా విచారించినట్లు తెలుస్తోంది.కాగా.. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు యూట్యూబర్లతో పాటు సినీతారలపై కూడా కేసులు నమోదయ్యాయి. విష్ణు ప్రియతో పాటు సుప్రీత, టేస్టీ తేజ మరో 11 మంది బుల్లితెర నటులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇలాంటి ప్రాంతాలను రక్షించుకోవడం మన బాధ్యత: ఎస్ఎస్ రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 మూవీతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ పర్వత ప్రాంతాల్లో జరిగింది. అక్కడ మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్యాకప్ చెప్పేసింది. దీంతో మూవీ టీమ్ అంతా తమ లోకేషన్ నుంచి తిరుగుపయనమయ్యారు. ప్రియాంక చోప్రా తాను ఎయిర్పోర్ట్కు వెళ్తుండగా తీసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.తాజాగా ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీ షూటింగ్ లోకేషన్ సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒడిశాలోని అత్యంత ఎత్తైన, అద్భుతమైన శిఖరం డియోమాలికి ట్రెక్కింగ్ చేసినట్లు వెల్లడించారు. పైనుంచి చూస్తే అత్యంత ఉల్లాసభరితంగా అనిపించిందని ట్విటర్లో పోస్ట్ చేశారు.అయితే ఆ పర్వతంపై పర్యాటకులు చెత్త చెదారం అలాగే ఉంచడం చూసి నిరుత్సాహానికి గురైనట్లు తెలిపారు. ఇటువంటి సహజమైన అద్భుతమైన ప్రాంతాలను ఎంతో బాగా చూసోకోవాలి.. ఒక ఒక్కరూ పౌరుడు బాధ్యతగా తీసుకుంటే చాలా పెద్ద మార్పు వస్తుంది... ప్రతి సందర్శకుడు ఇలాంటి ఆహ్లాదకరమైన స్థలాలను రక్షించడంలో సహాయపడటానికి మీ వ్యర్థాలను తిరిగి మీరే తీసుకువెళ్లాలని రాజమౌళి సూచించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Had an amazing solo trek to Deomali, Odisha’s highest and most stunning peak. The view from the top was absolutely breathtaking.However, it was disheartening to see the trail marred by litter. Such pristine wonders deserve better. A little civic sense can make a huge… pic.twitter.com/8xVBxVqQvc— rajamouli ss (@ssrajamouli) March 19, 2025 -
తమన్ని అన్ఫాలో చేసిన రామ్ చరణ్..నిజమెంత?
సంగీతం దర్శకుడు తమన్ (SS Thaman) పై మెగా అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నారు. రామ్ చరణ్(Ram Charan ) నటించిన ‘గేమ్ ఛేంజర్’ పాటలపై ఆయన చేసిన కామెంట్సే అందుకు కారణం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. ‘గేమ్ ఛేంజర్’(Game Changer) పాటలకు యూట్యూబ్లో ఎక్కువ అనుకున్నంత వ్యూస్ రాబట్టలేకపోయాయి. ఆ పాటలకు సరైన హుక్ స్టెప్పులు లేకపోవడమే అందుకు కారణం. ‘రా మచ్చా..’, ‘నానా హైరానా’, ‘జరగండి జరగండి..’ ఈ పాటల్లో ఒక్క దాంట్లో కూడా హుక్ స్టెప్ లేదు. ఒక మంచి పాటకి మంచి స్టెప్పులు ఉంటేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు’అని చెప్పుకొచ్చాడు.తమన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ అతన్ని బాగా ట్రోల్ చేశారు. అంతేకాదు రామ్ చరణ్ సైతం సోషల్ మీడియాలో తమన్ని అన్ఫాలో చేశారనే వార్తలు కూడా వచ్చాయి. మెగా అభిమానులే ఈ పుకారుని బాగా వైరల్ చేశారు. అయితే తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. రామ్ చరణ్ అసలు తమన్ని ఫాలోనే అవ్వడం లేదట. అన్ఫాలో చేశారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ‘రామ్ చరణ్ ఇన్స్టాలో కానీ ఎక్స్లో కానీ తక్కువ మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. తమన్ని చరణ్ అన్ఫాటో చేశారనే వార్తల్లో నిజం లేదు’ అని చరణ్ టీమ్ వెల్లడించింది. -
ముద్దు పెట్టుకోవడానికి నాకంటూ ప్లేస్ లేదా.. పదా అంటూ 'జాక్' సాంగ్
సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) , ‘బేబీ’ ఫేమ్ వైష్ణవీ చైతన్య( Vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఎస్ఎన్స్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇంతటి భాగ్యనగరంలో ముద్దు పెట్టుకునేందుకు మనకు ప్లేస్ లేకపోవడమా అంటూ సిద్ధు చెప్పిన డైలాగ్తో సాంగ్ మొదలౌతుంది. ఈ ఫన్స్ రైడర్ మూవీలో ప్రకాష్రాజ్, నరేష్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. -
సినిమాల్లో అసభ్యకర స్టెప్పులు... మహిళా కమిషన్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా (Tollywood) పాటల్లో ఈ మధ్య డ్యాన్స్ అసభ్యకరంగా ఉంటున్నాయని మహిళా కమిషన్ (Telangana State Women's Commission) ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను తక్కువ చేసి చూపించే డ్యాన్స్ స్టెప్పులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల సినిమా పాటల్లో డ్యాన్స్ స్టెప్స్ అసభ్యంగా ఉండటంతో పాటు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా కమిషన్కు పలు ఫిర్యాదులు అందాయి. అసభ్య స్టెప్పులు ఆపేయండిదీనిపై గురువారం నాడు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద స్పందిస్తూ.. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం. ఇందులో మహిళల్ని అవమానించేలా, అసభ్యంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ విషయంలో సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లతో పాటు సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మహిళల్ని చులకన చేసి చూపించే స్టెప్పులను వెనక్కు తీసుకోవాలి. లేదంటే చర్యలు తప్పవు. (చదవండి: నందమూరి 'తమన్'పై మెగా ఫ్యాన్స్ ఫైర్)స్వీయ నియంత్రణ పాటించండిసినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించాలి. మహిళల గౌరవాన్ని కాపాడటమనేది నైతిక బాధ్యత. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చలన చిత్ర పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్కు తెలియజేయవచ్చు. ఈ విషయంపై నిశితంగా పరిశీలన కొనసాగించి తగు చర్యలు తీసుకుంటాం అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దబిడి దిబిడి పాటపై ట్రోలింగ్కాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి పాటపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ పాటలో బాలయ్య.. ఊర్వశి రౌతేలాను కొట్టడం చూడటానికే చండాలంగా ఉందని పలువురూ విమర్శించారు. ఇటీవల రాబిన్హుడ్ నుంచి రిలీజైన అదిదా సర్ప్రైజు పాటలోనూ కేతిక శర్మతో అసభ్యకర స్టెప్పులు వేయించారు. ఈ రెండు పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం గమనార్హం.చదవండి: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం.. సారీ చెప్పాం.. ఇంకేంటి? సురేఖావాణి ఫైర్ -
నిర్మాత ఎస్కేఎన్తో ఇబ్బందేమి లేదు : ‘బేబీ’ హీరోయిన్
కొద్ది రోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్లో బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ (SKN) తెలుగమ్మాయిలపై చేసిన కామెంట్స్ వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏం అవుతుందో బాగా తెలిసిందని..ఎస్కేఎన్ అనడం.. ఆ వాఖ్యలు తన చివరి సిసిమా ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించే చేశారంటూ బాగా ట్రోల్ చేశారు. ఆ మరుసటి రోజే ఎస్కేఎన్ దీనిపై వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పటికే తాను ఆరుగురు తెలుగమ్మాయిలను హీరోయిన్గా మార్చానని.. మరో 25 మందిని కూడా పరిచయం చేస్తానని చెప్పారు. దీంతో ఆ వివాదానికి పుల్స్టాప్ పడింది. తాజాగా హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ఈ వివాదంపై స్పందించారు.ఆమె హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘జాక్’(Jack). సిద్ధు జొన్నలగడ్డ హీరో. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీ నుంచి ‘కిస్’ (kiss Song) సాంగ్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఎస్కేఎన్ కామెంట్స్పై వైష్ణవికి ప్రశ్న ఎదురైంది. దీనిపై వైష్షవి స్పందిస్తూ.. ‘ఎన్కేఎన్ గారితో నాకు ఇబ్బంది ఉందని ఎవరు చెప్పారు. ఆయనతో నాకు ఎలాంటి సమస్యలు లేవు. ఆయన చేసిన కామెంట్స్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వివాదంపై ఆయన ఓ వీడియో కూడా చేసి పెట్టారు. నా పేరు మెన్షన్ చేయనప్పుడు నేనెందుకు స్పందిస్తాను’ అని బదులిచ్చింది. అలాగే ఎస్కేఎన్ బ్యానర్లో చేయాల్సిన సినిమా ఆగిపోవడం గురించి స్పందిస్తూ.. ‘బేబీ టీమ్తో చేయాల్సిన మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మరో చాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. ఆ టీమ్తో కలిసి పని చేయడం నాకు మంచి అనుభవం’ అని చెప్పుకొచ్చింది. -
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం.. సారీ చెప్పాం.. ఇంకేంటి? సురేఖావాణి ఫైర్
ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ (Betting App Case) ప్రమోట్ చేసినవారిపై పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. ఈ జాబితాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, నటీనటులు ఉన్నారు. ఈ క్రమంలోనే నటి సురేఖావాణి కూతురు సుప్రీత (Supritha), టేస్టీ తేజ, రీతూ చౌదరి వంటివారు తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని లెంపకాయలు వేసుకున్నారు. ఇకపై దాని జోలికి వెళ్లమని.. ఎవరూ బెట్టింగ్ యాప్స్ను నమ్మొద్దని వీడియోలు రిలీజ్ చేశారు.అడిగారు.. చేశాం.. అంతే!ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ వ్యవహారం గురించి ప్రశ్నించిన యాంకర్తో నటి సురేఖావాణి (Surekha Vani) దురుసుగా మాట్లాడింది. అందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయమని ఎవరు అప్రోచ్ అయ్యారు? అని యాంకర్ అడిగింది. అందుకు సురేఖ.. మేము బెట్టింగ్ యాప్స్ను పెద్దగా ప్రమోట్ చేయలేదమ్మా.. వాళ్ల పోస్టులను రీపోస్ట్ చేయమంటే చేశామంతే! అని బదులిచ్చింది.తెలీక చేశాం.. సారీ చెప్పాంబెట్టింగ్ యాప్స్ గురించి తెలియనప్పుడు అలా పోస్టులు చేసి మళ్లీ ఇప్పుడెందుకు సారీ చెప్తున్నారు? అని యాంకర్ ప్రశ్నించింది. తెలియకుండా చేశాం కాబట్టే సారీ చెప్పాం.. అయినా తెలియకుండా ఎందుకు చేశారు? అంటున్నారు.. తెలీదు కాబట్టే చేశాం కదా.. మళ్లీ ఇదేం ప్రశ్న? అని సీరియస్ అయింది. పోస్టులో ఏముందో తెలుసుకోకుండా రీపోస్ట్ చేయొద్దు కదా? అని యాంకర్ అంటుంటే అందుకే కదా సారీ చెప్పింది అని సురేఖ విసుక్కుంది. మాకింకా తెల్లారలేదు.. విసుక్కున్న సురేఖఅంటే తెలియకుండానే ఆ యాప్స్ ప్రమోట్ చేశారంటారు.. అని యాంకర్ అడుగుతుంటే.. మీకు తెల్లారిందేమో.. కానీ మాకింకా తెల్లారలేదమ్మా.. నేను తర్వాత మాట్లాడతా.. అని ఫోన్ కట్ చేసింది. ఇకపోతే బెట్టింగ్ యాప్స్ కేసులో బుల్లితెర స్టార్స్తో పాటు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా, నిధి అగర్వాల్ వంటి టాలీవుడ్ స్టార్స్ సైతం ఉన్నారు.చదవండి: బెట్టింగ్ యాప్స్ కేసు: విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మిపై కేసు! -
రెమ్యునరేషన్ మోడల్ను మార్చేసిన ఫస్ట్ హీరో 'మహేష్బాబు'
స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనేది ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి పారితోషికానికి సంబంధించిన గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కానీ, సినిమా హిట్ అయితే నిర్మాతకు భారీగానే లాభాలు వస్తాయి. ఒకవేళ నష్టం వస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ప్రస్తుతం హీరోల అధిక రెమ్యునరేషన్లు చిత్ర పరిశ్రమ మనుగడకు ఇబ్బందిగా మారుతోందని పలువురు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. అధిక నష్టాల ఎఫెక్ట్ వల్ల కొత్తగా నిర్మాతలు ఎవరూ కూడా సినీ పరిశ్రమలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. రీసెంట్గా తీరని నష్టాల వల్ల లైకా ప్రొడక్షన్స్ సంస్థను షట్డౌన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనంతటికీ కారణం సినిమా బడ్జెట్ పెరగడమే అని చెప్పవచ్చు. అందులో అధిక భాగం హీరో రెమ్యునరేషన్ అనే ఎక్కువమంది చెబుతున్న మాట. అయితే, ఈ రెమ్యూనరేషన్ మోడల్ మొత్తంగా మహేష్బాబు మార్చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే, అది నిర్మాతలకు భారీ ఊరటను కల్పించేలా ఉండటంతో ప్రిన్స్ మహేష్ బాబును అభినందిస్తున్నారు.నష్టం వస్తే జీరో రెమ్యునరేషన్దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రూ. 300 కోట్లతో (పుష్ప2) టాప్లో ఉన్నారు. అయితే, పుష్ప2 మూవీకి భారీ లాభాలు వచ్చాయి కాబట్టి సరిపోయింది. ఒకవేళ రిజల్ట్లో తేడా వచ్చింటే ఎవరూ ఊహించలేని నష్టాలను ఆ చిత్ర నిర్మాణ సంస్థ భరించాల్సి వచ్చిండేది. ఇప్పుడు మహేష్బాబు- రాజమౌళి (SSMB29) ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 1000 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ మూవీ కోసం మహేష్బాబు తన రెమ్యునరేషన్గా సినిమాకు ఫైనల్గా వచ్చిన లాభాల్లో షేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అది కూడా లాభాల్లో 35 శాతం వరకు ఉండోచ్చని సమాచారం. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగానే వైరల్ అవుతుంది. సినిమాకు నష్టాలు వస్తే జీరో రెమ్యనరేషన్ అని ముందే డీల్ సెట్ చేసుకున్నారట.. ఇదే ప్లాన్ను దర్శకులు రాజమౌళి కూడా అనుసరిస్తున్నారట. అసలు రెమ్యూనరేషన్ అంటూ తీసుకోకుండా కేవలం వచ్చే ప్రాఫిట్లో షేర్ తీసుకోవడం నిర్మాతలకు భారీ ఊరట కల్పించే అంశమని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్లో ఇదే దారిలో చాలామంది హీరోలు వెళ్లే అవకాశం ఉంది. రెమ్యునరేషన్ విషయంలో ట్రెండ్ సెట్ చేసిన హీరోగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పవచ్చు.