breaking news
Tollywood
-
ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రం ఇది
‘‘ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా కథ రాసుకున్నాడు సాయిలు. ప్రేమతో కూడిన విషాద భరితమైన ఈ సంఘటన ఆ ఊర్లోనే జరిగి, అక్కడే సమాధి అయ్యింది. ఎంటర్టైనింగ్గా, మాస్ అప్పీల్ ఉండేలా సాయిలు ఈ స్క్రిప్ట్ రాశాడు. ‘7/జీ బృందావన్ కాలనీ, ప్రేమిస్తే, ఆర్ఎక్స్ 100, బేబీ’ చిత్రాల్లా ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఇక నా దర్శకత్వంలోని సినిమాకు యూవీ క్రియేషన్స్ సంస్థలో ప్రీ ్ర΄÷డక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని దర్శక–నిర్మాత వేణు ఊడుగుల అన్నారు. అఖిల్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబరు 21న రిలీజ్ చేస్తున్నట్లుగా యూనిట్ ప్రకటించింది. వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ సినిమాను థియేట్రికల్గా రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఈ సినిమా చూశాక ప్రేక్షకులు ఓ ఎమోషనల్ ఫీల్తో థియేటర్స్ నుంచి బయటకొస్తారు’’ అని అన్నారు బన్నీ వాసు. ‘‘ఒకే ఒక నరేషన్లో వేణుగారు మా సినిమాను ఓకే చేశారు’’ అన్నారు సాయిలు. ‘‘ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇందులోని నటీనటులను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తు పెట్టుకుంటుంది’’ అని చెప్పారు వంశీ నందిపాటి. -
ప్రభాస్తో ఢీ
వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ వంటి ప్రాజెక్ట్స్కి పచ్చజెండా ఊపారు ప్రభాస్. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న చిత్రం ‘స్పిరిట్’. త్రిప్తీ దిమ్రి హీరోయిన్గా నటించనున్న ఈ మూవీలో కాంచన, ప్రకాశ్రాజ్, వివేక్ ఓబెరాయ్ ఇతర పాత్రలు పోషించనున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో కొరియన్ నటుడు డాన్ లీ విలన్గా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రభాస్కు సమానంగా పోటీ ఇచ్చే శక్తిమంతమైన ప్రతినాయకుడి పాత్రకి డాన్ లీ సరిపోతారంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నారు. అయితే ‘స్పిరిట్’లో డాన్లీ విలన్గా నటిస్తున్నారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. కాగా కొరియన్ మీడియాలో మాత్రం ప్రభాస్ సినిమాలో డాన్ లీ ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ‘‘స్పిరిట్’ అనే సినిమాలో డాన్ లీ నటిస్తున్నారు. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ‘బాహుబలి’ సినిమాతో ఫేమస్ అయిన ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో డాన్ లీ నెగటివ్ పాత్రలో కనిపిస్తారనే వార్త వినిపిస్తోంది’’ అని కొరియన్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ఇక దర్శక–నిర్మాతలు అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. -
టాలీవుడ్ స్పై డ్రామాగా 'చైనా పీస్'.. జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిస్తోన్న స్పై డ్రామా చైనా పీస్. ఈ మూవీని అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హర్షిత, శ్రీషా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా జేమ్స్ బాండ్ అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు దినేష్ కక్కర్ల లిరిక్స్ అందించగా.. స్పూర్తి జితేందర్, హారిక నారాయణ్ ఆలపించారు. ఈ పాటకు కార్తీక్ రోడ్రిగ్స్ సంగీతమందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. -
అందమే కుళ్లుకునేలా.. శ్రీలీల ఇలా మృణాల్ అలా!
చీరలో అందమే అసూయపడేలా శ్రీలీలజిగేలుమనే చీరలో మెరిసిపోతున్న మృణాల్బర్త్ డే సెలబ్రేషన్స్లో ప్రియా వారియర్అబుదాబి ట్రిప్ ఫొటోలు షేర్ చేసిన ప్రియాంకడిమ్ లైటింగ్ వెలుతురులో మానస వారణాసివంకాయ రంగు చీరలో ఈషా రెబ్బా గ్లామర్ View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) -
స్పిరిట్ మూవీ.. ప్రభాస్ను అలా చూపించనున్నారా?
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’. ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి టాలీవుడ్లో పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. స్పిరిట్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని తెగ టాక్ వినిపించింది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇటీవలే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డేను పురస్కరించుకుని ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్' అంటూ 1.31 నిమిషాల ఆడియో గ్లింప్స్ వదిలారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రం కోసం సందీప్ రెడ్డి వంగా బిగ్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. యానిమల్తో బోల్డ్ డైరెక్టర్గా ముద్ర వేసుకున్న సందీప్ రెడ్డి.. ప్రభాస్ స్పిరిట్లోనూ అదే పంథాను ఫాలో అవుతున్నట్లు అర్థమవుతోంది. అందుకే స్పిరిట్లోనూ బోల్డ్ సన్నివేశాలు ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ ఓ సీన్లో నగ్నంగా కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి.గ్లింప్స్ డైలాగ్ వల్లే రూమర్స్..ఇటీవల విడుదలైన గ్లింప్స్లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్.. ఈ వార్తకు బలం చేకూరుతోంది. ఖైదీని బట్టలూడదీసి టెస్టులకు పంపండి అనే చెప్పిన డైలాగ్తోనే టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ సినిమాలో నగ్నంగా కనిపించే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా యానిమల్లో రణ్బీర్ కపూర్ ఓ సీన్లో న్యూడ్గా కనిపించారు. అదే పంథాను స్పిరిట్ విషయంలో ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే స్టార్ హీరోలతో బోల్డ్ సీన్స్ చేయించడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యమని చెప్పొచ్చు. కాగా.. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీతో బాలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. -
ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన మెమొరీ కార్డ్ పోతే?
ఒకప్పుడు పెళ్లంటే పెళ్లి మాత్రమే. ఇప్పుడు పెళ్లి అంటే అంతకంటే ముందు చాలా ఉంటాయి. అందులో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్పై తెలుగులో ఓ కామెడీ సినిమా తీశారు. అదే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. మసూద మూవీ ఫేమ్ తిరువీర్ హీరోగా నటిస్తున్నాడు. టీనా శ్రావ్య హీరోయిన్. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. నవంబర్ 7న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది బాగానే నవ్విస్తోంది.(ఇదీ చదవండి: మహేశ్ ఫ్యామిలీ నుంచి 'ఏడుగురు' వారసులు)ట్రైలర్ బట్టి చూస్తే.. పల్లెటూరిలో ఉండే హీరో ఓ ఫొటోగ్రాఫర్. ఓసారి ఓ జంటకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. అనుకుని పరిస్థితుల్లో షూట్ చేసిన ఫుటేజీ ఉన్న మెమొరీ కార్డ్ పోతుంది. తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ గండం నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే నవ్విస్తోంది. కామెడీ కూడా సహజంగా కుదిరింది. మరి మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?నవంబర్ 7న రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్', సుధీర్ బాబు 'జటాధర' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితోపాటు ఈ సినిమా కూడా రానుంది. మరి మూడింటిలో ఏది ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి. ఇదే తేదీన తమిళ డబ్బింగ్ బొమ్మ 'ఆర్యన్' కూడా తెలుగులో విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
‘బాహుబలి: ది ఎపిక్’లో డిలీట్ చేసిన సీన్స్, పాటలు ఇవే : రాజమౌళి
బాహుబలి పార్ట్1, పార్ట్ 2 కలిసి ‘బాహుబలి: ది ఎపిక్’( Baahubali: The Epic)పేరుతో రీరిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న ఈ చిత్రం థియేటర్స్లో సందడి చేయబోతుంది. ఆరున్నర గంటల నిడివిని 3:45 గంటలకు కుదించి ‘బాహుబలి: ది ఎపిక్’ని తీర్చిదిద్దారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సినిమాలోని యాక్షన్స్ సీన్స్ అన్నింటిని కవర్ చేస్తూ ట్రైలర్ని కట్ చేశారు. అయితే రెండు సినిమాల్లోని సగం సన్నివేశాలను తీసేస్తేనే రన్టైమ్ 3.45 గంటలకు చేరింది. ఓ సినిమాకు ఇంత రన్టైమ్ ఉండడం కూడా ఇదే తొలిసారి. కానీ అంతకు మించి సన్నివేశాలను డిలీట్ చేసే అవకాశం లేదని రాజమౌళి అంటున్నారు. అప్పటికే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను లేపేశారట. అంతేకాదు సూపర్ హిట్ సాంగ్స్ని కూడా డిలీట్ చేసినట్లు రాజమౌళి చెప్పారు. తాజాగా ఆయన ప్రభాస్(Prabhas), రానా(rana Daggubati)లతో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో బాహుబలి చిత్రాల షూటింగ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే బాహుబలి ది ఎపిక్ లో కనిపించని సన్నివేశాలు ఏంటో కూడా రాజమౌళి చెప్పారు. ప్రభాస్-తమన్నాల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలను ‘ది ఎపిక్’లో చూడలేమట. అవంతిక లవ్స్టోరీ మొత్తాన్ని డిలీట్ చేసినట్లు రాజమౌళి చెప్పారు. అంతేకాదు పచ్చబొట్టేసిన, ఇరుక్కుపో, కన్నా నిదురించరా పాటలను కూడా తొలగించినట్లు రాజమౌళి పేర్కొన్నారు. యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా తొలగించామని రాజమౌళి అన్నారు. మొత్తంగా అవంతిక పాత్రకు సంబంధించిన సీన్లే ఎక్కువ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. పార్ట్ 1లో పచ్చబొట్టు పాటతో పాటు దానికి ముందు వచ్చే సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. -
మహేశ్ ఫ్యామిలీ నుంచి 'ఏడుగురు' వారసులు
ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి ఎక్కువమంది వారసులు అనగానే మెగా లేదంటే నందమూరి ఫ్యామిలీలే గుర్తొస్తాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి హీరోలు ఉన్నప్పటికీ వేళ్లపై లెక్కపెట్టేంత మంది ఉన్నారు. త్వరలో ఈ లిస్టులోకి ఘట్టమేనేని కుటుంబం కూడా చేరనుంది. ఎందుకంటే ఒకరిద్దరు కాదు ఏకంగా ఏడుగురు వరకు వారసులు.. రాబోయే కొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఏంటి సంగతి?(ఇదీ చదవండి: 'బాహుబలి', 'మాస్ జాతర' కోసం సైడ్ అయిపోయిన హీరో)సూపర్స్టార్ కృష్ణ వారసుడిగా రమేశ్ బాబు, మహేశ్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ రమేశ్ బాబు పెద్దగా నిలదొక్కుకోలేకపోయాడు. మహేశ్ బాబు మాత్రం స్టార్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం రాజమౌళితో మూవీ చేస్తున్నాడు. మహేశ్ అక్క మంజుల పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశారు తప్పితే హీరోయిన్ కాలేకపోయారు.తర్వాత తరానికి వస్తే.. మహేశ్ బాబు చెల్లి ప్రియదర్శని భర్త సుధీర్ బాబు ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. గల్లా జయదేవ్ కొడుకు అంటే మహేశ్కి మేనల్లుడు అశోక గల్లా కూడా హీరోగా రెండు మూడు మూవీస్ చేశాడు. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. వీళ్ల కాకుండా ఇప్పుడు తర్వాత తరం కూడా చాలామంది సిద్ధమైపోయారు. కొందరు అవుతున్నారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)ముందుగా మహేశ్ కొడుకు గౌతమ్ విషయానికొస్తే ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఎంట్రీ ఉండొచ్చు. కూతురు సితార ఇప్పటికే తండ్రితో కలిసి పలు యాడ్స్ చేసింది. సినిమాల్లోని పాటల్లోనూ అతిథిగా కనిపించింది. ఈమెది ఇంకా చిన్న వయసే. కాబట్టి హీరోయిన్ కావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కొడుకు జయకృష్ణ ఇప్పటికే హీరోగా తొలి సినిమా చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి తీయబోయే కొత్త సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నాడని టాక్. రమశ్ బాబు కుమార్తె భారతి కూడా నటి అయ్యేందుకు ఆసక్తి ఉందని తెలుస్తోంది.తాజాగా మహేశ్ సోదరి మంజుల కూడా తన కూతురు జాన్వి.. త్వరలో సినిమాల్లోకి రానుందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈమె కూడా త్వరలోనే హీరోయిన్ అయ్యేలా కనిపిస్తుంది. మరోవైపు సుధీర్ బాబు కూడా తన కొడుకుల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తానని చాన్నాళ్ల క్రితమే చెప్పాడు. అందుకు తగ్గట్లే పెద్ద కొడుకు చరిత్ మాసస్.. ఇప్పటికే అన్ని రకాల ట్రైనింగ్ తీసుకుంటుండగా.. చిన్న కొడుకు దర్శన్ కూడా 'ఫౌజీ'లో యంగ్ ప్రభాస్గా కనిపించబోతున్నాడని టాక్.పైన చెప్పిన లిస్ట్ చూస్తే ఒకరిద్దరూ కాదు ఏకంగా ఏడుగురు వారసులు.. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రాబోయే కొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి రాబోతున్నారనమాట. మరి వీళ్లలో ఎవరు ఎప్పుడొస్తారు? ఎవరు నిలదొక్కుకుంటారనేది చూడాలి?(ఇదీ చదవండి: నేను కూడా చిరుతో అప్పట్లో అనుకున్నా.. కానీ: మాళవిక మోహనన్) -
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్.. క్రేజీ సాంగ్ ఫుల్ వీడియో
కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన తాజా చిత్రం కె-ర్యాంప్. దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. జైన్స్ నాని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీని రాజేశ్ దండ, శివ బొమ్మ సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని ఓనమ్ అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ కిరణ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను అలరించింది. ఇంకెందుకు ఆలస్యం ఓనమ్ ఫుల్ సాంగ్ను చూసి ఎంజాయ్ చేయండి. -
రవితేజ ఫ్యాన్స్ సర్ప్రైజ్లు చూడబోతున్నారు
నేను రవితేజకి అభిమానిని. ఆయన ఖాకీ డ్రెస్ వేసిన సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలుసు. దానిని దృష్టిలో పెట్టుకొని ‘మాస్ జాతర’ స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. రవితేజ ఫ్యాన్స్ ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయి’ అన్నారు దర్శకుడు భాను భోగవరపు. ఆయన దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ భాను భోగవరపు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ మాస్ కథ అంటే మొదట గుర్తుకొచ్చే పేరు రవితేజ . ఆయనను దృష్టిలో పెట్టుకునే ఈ కథ(Mass Jathara Movie) రాశాను. రవితేజ పోలీస్ సినిమాలు కొన్ని చేశారు. అందుకే కొత్తగా ఉండేలా ఈ రైల్వే పోలీస్ కథని రాసుకున్నాను.→ ఇందులో మాస్ అంశాలు ఉంటాయి. అదే సమయంలో ఒక కొత్త పాయింట్ కూడా ఉంటుంది. రైల్వే పోలీస్ నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. ఆ నేపథ్యంలో జరిగే క్రైమ్ కొత్తగా ఉంటుంది. సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయి.→ 'మాస్ జాతర' అనే టైటిల్ రవితేజ గారే చెప్పారు. కథ విన్న తర్వాత వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయి అంటూ ఆయన ఈ టైటిల్ సూచించారు. ఆ టైటిల్ తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. మాస్ అంశాలు మరిన్ని జోడించాను. థియేటర్ లో ప్రేక్షకులు కొన్ని సర్ ప్రైజ్ లు చూడబోతున్నారు.→ ఇది కల్పిత కథే. అయితే ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాల గురించి, వారు ఎదుర్కొన్న సంఘటల గురించి తెలుసుకున్నాను. వాటి స్ఫూర్తితో ఈ కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం జరిగింది.→ రవితేజ(Ravi Teja)కు ఇది 75వ చిత్రమని మాకు ముందు తెలియదు. రవితేజకి కథ నచ్చి, సినిమా ఓకే అయిన తర్వాత.. అప్పుడు లెక్కేస్తే 75వ సినిమా అని తెలిసింది. కథ బాగుంది, ఈ నెంబర్ల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా సినిమా చేయమని రవితేజ నన్ను ఎంతో ప్రోత్సహించారు.→ ఈ కథను రాసుకున్నప్పడే తులసి పాత్రకు శ్రీలీల(Sreeleea)ను తీసుకోవాలనుకున్నాను. , కథ వింటున్నప్పుడు హీరో, నిర్మాతలు మాకు తెలియకుండానే.. హీరోయిన్ శ్రీలీల అని అనుకున్నారు. ధమాకా జోడి కాబట్టి శ్రీలీల తీసుకోవాలనే ఆలోచన మాకు లేదు. తులసి పాత్ర అనగానే మా అందరికీ శ్రీలీల గుర్తుకొచ్చారు. ఆమె పాత్రకు సినిమాలో ఎంతో ప్రాధాన్యముంది. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో శ్రీలీల కొత్తగా కనిపిస్తారు. గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి-విజయశాంతి మధ్య సన్నివేశాలు ఎలాగైతే కామెడీ టచ్ తో మాసీగా ఉంటాయో.. ఇందులో రవితేజ గారు-శ్రీలీల మధ్య సన్నివేశాలు అలా ఉంటాయి.→ దర్శకుడిగా నాకిది మొదటి సినిమా అయినప్పటికీ నిర్మాత నాగవంశీ ఎంతో మద్దతుగా నిలిచారు. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా ఆరున్నర కోట్లతో స్టేషన్ సెట్ వేయించారు. అలాగే జాతర ఎపిసోడ్ కోసం ఓ భారీ సెటప్ కూడా చేయించారు. ఓ కొత్త దర్శకుడికి ఎక్కడ రాజీపడకుండా ఇంతటి సహకారం అందించడం మామూలు విషయం కాదు.→ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం రవితేజ ఎంతో కష్టపడ్డారు. ఒకసారి కాలికి, మరోసారి చేతికి గాయాలయ్యాయి. అందుకే చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది. అయినప్ప్పటికీ, రవితేజ సహకారం వల్లనే ఈ సినిమాని ఒత్తిడి లేకుండా పూర్తి చేయగలిగాను.→ రచయితగా కొన్ని సినిమాలు చేస్తున్నాను. అలాగే, దర్శకుడిగా రెండో సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నాను. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాను. -
'బాహుబలి', 'మాస్ జాతర' కోసం సైడ్ అయిపోయిన హీరో
ఈ వీకెండ్ థియేటర్లలోకి 'బాహుబలి ఎపిక్' రానుంది. రెండు భాగాల్ని కలిపి ఒకే మూవీగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి స్పెషల్ వీడియో ఒకటి చేశారు. దాన్ని తాజాగా రిలీజ్ కూడా చేశారు. ఇది రిలీజైన ఒకరోజు తర్వాత రవితేజ 'మాస్ జాతర'.. బిగ్ స్క్రీన్పైకి రానుంది. ఇది కాకుండా ఓ తమిళ డబ్బింగ్ మూవీ కూడా రావాల్సింది. కానీ తెలుగు మూవీస్ కోసం సదరు తమిళ హీరో సైడ్ అయిపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)తమిళ హీరో విష్ణు విశాల్ లీడ్ రోల్ చేసి, నిర్మించిన సినిమా 'ఆర్యన్'. మానస చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ కె. దర్శకత్వం వహించారు. లెక్క ప్రకారం ఈ 31వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావాలి. శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్యన్ని విడుదల చేస్తున్నారు. కానీ బాహుబలి రీ రిలీజ్, మాస్ జాతర కారణంగా తెలుగులో ఈ చిత్రాన్ని వారం ఆలస్యంగా అంటే నవంబరు 7న రిలీజ్ చేయనున్నారు. తమిళంలో మాత్రం యధావిధిగానే థియేటర్లలోకి రానుంది.'మా 'ఆర్యన్' ఈ నెల 31న విడుదల కావాల్సి ఉంది. ఈ ప్రత్యేక తేదీన రవితేజగారి 'మాస్ జాతర'తో పాటు 'బాహుబలి ది ఎపిక్' సినిమాలు తెలుగు ప్రేక్షకులను ముందుకు రావడం మరింత ప్రత్యేకమైనది. ఆ సినిమాలను సెలబ్రేట్ చేసుకోవడం సరైనదని భావిస్తున్నాను. 'ఆర్యన్' నవంబరు 7న తెలుగులోకి వస్తుంది. నా నిర్ణయానికి అండగా నిలిచిన మా డిస్ట్రిబ్యూటర్లు సుధాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డికి థ్యాంక్స్' అని విష్ణు విశాల్ ఒక ప్రకటన విడుదల చేశాడు.(ఇదీ చదవండి: నేను కూడా చిరుతో అప్పట్లో అనుకున్నా.. కానీ: మాళవిక మోహనన్) View this post on Instagram A post shared by Vishnu Vishal (@thevishnuvishal) -
ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’ అప్డేట్.. ఆ రక్తం ఏంటి?
‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి వరుస ప్రాజెక్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘మహాకాళి’(Mahakali Movie ). ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ , స్క్రీన్ప్లే అందిస్తున్నారు. దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ రాబోతుంది. అక్టోబర్ 30న ఉదయం 10:08 గంటలకు 'మహాకాళి' నుంచి ఏదో పవర్ఫుల్ అప్డేట్ రిలీజ్ చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది. ఈ అనౌన్స్మెంట్తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇందులో రక్తంతో తడిసిన ఓ చేయి, దానికి నిండుగా బంగారు గాజులు ఉన్నాయి. నల్లటి నేలపై ఒక ఆయుధం పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చూపించారు. ఆ పోస్టర్పై అంతం లేని వినాశన జ్వాల మేల్కొంది అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. సినిమాలోని కాళిమాతా లుక్లా కనిపిస్తోంది. ఆమెను చాలా పవర్ఫుల్గా చూపించబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అయితే టైటిల్ రోల్ ఎవరు చేస్తున్నారనేది ఇంతవరకు రివీల్ చేయలేదు. రేపు ఇచ్చే అప్డేట్లో ఈ విషయం తెలియజేస్తారా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. కాగా, ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటించబోతున్నాడు. ఆయన ఫస్ట్లుక్ని కూడా రిలీజ్ చేశారు. ఇండియాలోనే తొలి లేడీ సూపర్ హీరో మూవీగా మహాకాళి రానుంది. #Mahakali 🔱@RKDStudios #RKDuggal @PujaKolluru #AkshayeKhanna#RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/CALH4jdCqV— Prasanth Varma (@PrasanthVarma) October 29, 2025 -
నేను కూడా అప్పట్లో అనుకున్నా.. కానీ అది అబద్ధం
చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్ గారు' అనే సినిమా చేస్తున్నారు. ఇది కాకుండా 'విశ్వంభర' కూడా లైన్లో ఉంది. లెక్క ప్రకారం విశ్వంభర ఈ పాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా చాలా ఆలస్యం చేసేశారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు కాకుండా మరో రెండు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి.చిరు.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఈ చిత్రంలో తమిళ హీరో కార్తీ నటించనున్నాడని, ఏకంగా రూ.23 కోట్ల రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేశాడనే రూమర్స్. సరే ఇదంతా పక్కనబెడితే ఈ ప్రాజెక్టులో చిరంజీవి సరసన మాళవిక మోహనన్ నటిస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా మాళవికనే స్పందించింది. క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం?)'డైరెక్టర్ బాబీ తీయబోయే 'మెగా 158' ప్రాజెక్టులో నేను ఉన్నానని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. నేను కూడా చిరంజీవి సర్తో నటించాలని ఓ దశలో అనుకున్నా. కానీ ఇప్పుడు క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. ఈ ప్రాజెక్టులో నేను లేను. వినిపిస్తున్న రూమర్స్ నిజం కాదు' అని మాళవిక మోహనన్ ట్వీట్ చేసింది.మాళవిక చెప్పేసింది కాబట్టి ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరనేది తేలాల్సి ఉంది. బాబీ కాకుండా యువదర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా చిరంజీవితో ఓ మూవీ చేయనున్నాడు. దీని గురించి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చేసింది. ఇది వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: హీరోయిన్గా మహేశ్బాబు మేనకోడలు ఎంట్రీ) -
మరోసారి పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తనపై ఎక్స్ (ట్విటర్)లో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ దయా చౌదరి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.డీప్ ఫేక్ వీడియోలుఇటీవల చిరంజీవి డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలపై పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే! ఏఐ సాయంతో కొందరు ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించి.. వాటిని పలు వెబ్సైట్లలో వైరల్ చేశారు. దీనిపై ఆగ్రహించిన చిరు.. సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కోర్టును సైతం ఆశ్రయించారు. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్ను ఎవరూ ఉపయోగించకూడదని సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.చదవండి: టాస్కుల్లో పవన్ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి! -
టాస్కుల్లో పవన్ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి!
తెలుగు బిగ్బాస్ సీజన్ 9.. ఇది చదరంగం కాదు, రణరంగమే అన్న ట్యాగ్లైన్కు నేటి ఎపిసోడ్ పూర్తిస్థాయిలో న్యాయం చేయనున్నట్లు కనిపిస్తోంది. రీఎంట్రీ కోసం శ్రీజ, భరణి.. ఇద్దరు రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ హౌస్మేట్స్లో నుంచి కొందరిని ఎన్నుకుని రెండు టీములుగా విడిపోవాల్సి ఉంటుంది. ఆ టీమ్ మెంబర్స్ ఆయా కంటెస్టెంట్ కోసం గేమ్ ఆడి గెలవాలి.కంటెస్టెంట్స్కి దెబ్బలురీఎంట్రీ అంటే మామూలు విషయం కాదు.. అందుకే ఏదో మామూలు టాస్క్లకు బదులుగా మంచి టాస్కులే ప్లాన్ చేశారు. అలా బిగ్బాస్ (Bigg Boss Telugu 9) పెట్టిన గేమ్లో హౌస్మేట్స్ కిందామీదా పడి ఆడి, దెబ్బలు తగిలించుకుని గాయపడ్డారట! భరణిని అయితే ఏకంగా గాయంతో హౌస్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఏమైనా ఫ్రాక్చర్ అయ్యారా? అని హాస్పిటల్కు తీసుకెళ్లి స్కానింగ్స్ చేయించారు.మట్టికరిపించిన పవన్అక్కడ బానే ఉందని రిపోర్ట్స్ రావడంతో తిరిగి అతడిని హౌస్కు పంపించారు. అయితే అందరి ఆట ఒకెత్తయితే.. డిమాన్ పవన్ ఆట మాత్రం మరో ఎత్తు. చేతులతో నిఖిల్ను కట్టడి చేస్తే కాళ్లతో భరణిని లాక్ చేసి ముందుకెళ్లనివ్వలేదు. ఇద్దరు స్ట్రాంగ్ పర్సనాలిటీలను ఒక్కడే కట్టడి చేయమనేది మామూలు విషయం కాదు. ఇప్పుడనే కాదు, పవన్ తనకు ఏ టాస్క్ ఇచ్చినా సరే గట్టిగా ఆడతాడు. గెలుపు కోసమే ప్రయత్నిస్తాడు. తోపు కంటెస్టెంట్.. కానీ!ఫిజికల్ టాస్క్లో తాండవం చూపిస్తాడు. కానీ, రీతూతో లవ్ ట్రాక్ వల్ల పవన్పై జనాల్లో చిన్నచూపు ఉంది. అటు బిగ్బాస్ టీమ్, నాగార్జున కూడా అతడిని ఎక్కువగా హైలైట్ చేయరు. ఆ ట్రాక్ గనక లేకుంటే పవన్ కూడా టాప్ 3 రేసులో ఉండేవాడే! మరి శ్రీజను గెలిపించడం కోసం దెబ్బలు తగిలించుకుని మరీ ఆడుతున్నాడు. అతడు కోరుకున్నట్లుగా శ్రీజ రీఎంట్రీ ఇస్తుందా? వీకెండ్లో నాగార్జున.. పవన్ ఆటను మెచ్చుకుంటాడా? చూడాలి! చదవండి: హీరోయిన్గా మహేశ్బాబు మేనకోడలు ఎంట్రీ -
హీరోయిన్గా మహేశ్బాబు మేనకోడలు ఎంట్రీ
తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరొకరు వెండితెరపై అడుగుపెట్టబోతున్నారు. మహేశ్ మేనకోడలు జాన్వీ స్వరూప్ (Jaanvi Swarup Ghattamaneni) త్వరలోనే బిగ్స్క్రీన్పై కనిపించనుంది. మహేశ్బాబు అక్క మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni)- సంజయ్ స్వరూప్ దంపతుల కూతురే జాన్వీ స్వరూప్. తన సినీఎంట్రీని మంజుల సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.ప్రపంచం ఎదురుచూస్తోంది'నా చిన్నారి జాన్వీ ఎంత ఎదిగిపోయిందో! ఇప్పుడు రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తనకు మంచి మనసుతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉంది. అవన్నీ త్వరలోనే ప్రపంచం చూడబోతోంది. నీకోసం వెండితెర ఎదురుచూస్తోంది మై డార్లింగ్.. ఐ లవ్యూ సో మచ్. హ్యాపీ బర్త్డే మై జాను' అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. కాగా జాన్వి చిన్నవయసులో ఓ సినిమా చేసింది. తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది (2018) సినిమాలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. ఈ మూవీకి మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు.పేరెంట్స్ కూడా యాక్టర్సే!జాన్వీ పేరెంట్స్ మంజుల- సంజయ్ స్వరూప్ కూడా యాక్టర్సే! మంజుల.. షో, కావ్యాస్ డైరీ, ఆరెంజ్, సేవకుడు, మళ్లీ మొదలైంది, హంట్, మంత్ ఆఫ్ మధు చిత్రాల్లో నటించింది. దర్శకురాలిగా మనసుకు నచ్చింది అని ఒకే ఒక్క మూవీ చేసింది. షో, నాని, పోకిరి, ఏ మాయ చేసావె వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. సంజయ్ స్వరూప్.. అర్జున్ రెడ్డి, చల్ మోహనరంగ వంటి పలు చిత్రాల్లో సహాయ నటుడిగా మెప్పించాడు. View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni)చదవండి: కుటుంబంతో సహా చనిపోదామనుకున్నా.. ఆ హీరో వల్లే బతికా! -
థియేటర్స్లోకి వచ్చేస్తున్న ‘కర్మణ్యే వాధికారస్తే’
బ్రహ్మాజీ, శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ ప్రోమోని విడుదల చేశారు మేకర్స్.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ "ఈరోజు మా చిత్రం 'కర్మణ్యే వాధికారస్తే' నుంచి రిలీజ్ ప్రోమో ను విడుదల చేసాం. రిలీజ్ ప్రోమో అదిరిపోయింది, చూసిన వాళ్లంతా ప్రోమో అద్భుతంగా ఉంది అని కొనియాడారు.ఇది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్, స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పేపర్స్ లో చూసే సంఘటనల ఆధారంగా నిర్మించాం. ఇటీవలే సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసి అద్భుతంగా ఉంది అని కొనియాడారు. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. మా చిత్రం అక్టోబర్ 31న భారీగా విడుదల అవుతుంది" అని తెలిపారు. -
‘నాకోసం ఆ వెన్నెల’ బాగుంది : జేడీ చక్రవర్తి
‘‘ఓ.. చెలియా’(O Cheliya) సినిమా నుంచి ‘నాకోసం ఆ వెన్నెల...’ అనే ప్రేమ గీతాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ పాట చాలా బాగుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చక్కగా ఉంది. సినిమా కూడా బాగుంటుందని, పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అని హీరో జేడీ చక్రవర్తి తెలిపారు. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ.. చెలియా’. ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎస్ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవి ప్రొడక్షన్స్పై రూపశ్రీ కోపూరు నిర్మించారు. ఎంఎం కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘నాకోసం ఆ వెన్నెల...’ అంటూ సాగే లవ్, మెలోడీ వీడియో సాంగ్ని జేడీ చక్రవర్తి రిలీజ్ చేశారు. ఈ పాటకి శివ సాహిత్యం అందించగా, మేఘన, మనోజ్ పాడారు. ‘‘అందమైన ప్రేమ కథగా రూపొందిన చిత్రం ‘ఓ.. చెలియా’. హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమను చాటేలా ఈ పాట ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నాం’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ బాలా. -
వదిలించుకుందామన్నా వదలరుగా! హౌస్లో శ్రీజ, భరణి రీఎంట్రీ!
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్లోకి వచ్చి ఒకర్ని నామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే! అలాగే తమకు నచ్చిన కంటెస్టెంట్కు నామినేషన్ చేసే పవర్ కూడా ఇస్తున్నారు. మరి ఎవరు నామినేషన్స్లో ఉన్నారు? రీఎంట్రీ కోసం ఎవరు రేసులో ఉన్నారో మంగళవారం (అక్టోబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..భరణి రాకతో ఆనందభాష్పాలుభరణి (Bharani Shankar) హౌస్లో అడుగుపెట్టగానే దివ్య పరుగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది. మిస్ అయ్యా నాన్నా అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్లను కాస్త పక్కకు వదిలించుకున్న భరణి.. బాడీ షేమింగ్ చేయడం తప్పంటూ సంజనాకు ఓ కత్తి పొడిచాడు. రెండో కత్తి నాక్కావాలి, మీ ముందే చెప్పాలని మీరొచ్చే వరకు వెయిట్ చేశా.. అని దివ్య డిమాండ్ చేసింది. కానీ భరణి తనను పట్టించుకోకుండా నిఖిల్కు ఇవ్వడంతో దివ్య ముఖం మాడ్చుకుంది.దివ్యను పట్టించుకోని భరణినిఖిల్.. కెప్టెన్సీ టాస్క్లో ఇమ్మాన్యుయేల్ను గేమ్ మీకోసం వదిలేయమని అడుక్కోవడం నచ్చలేదని తనూజను నామినేట్ చేశాడు. భరణి వెళ్లిపోతూ తనూజతో.. బాండ్స్ వల్లే ఇప్పుడిలా బాధపడుతున్నావ్, బాండ్స్ కలుపుకోకు అని సలహా ఇచ్చింది. నా వల్లే మీరు వెళ్లానంటున్నారని తనూజ ఏడవడంతో ఛ, అలా ఏం కాదని సముదాయించి వెళ్లిపోయాడు. ఈ బంధాల జోలికి వెళ్లకూడదనుకున్నాడో, ఏమో కానీ.. దివ్యను అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఆమె బాగానే హర్ట్ అయింది.నామినేషన్స్లో ఎనిమిది మందిశ్రష్టి.. డిమాన్ పవన్ (Demon Pavan)ను నామినేట్ చేసి, ఎనిమిదోవారం కల్యాణ్, డిమాన్ పవన్, రీతూ చౌదరి, సంజన, మాధురి, తనూజ, గౌరవ్, రాము నామినేషన్స్లో ఉన్నట్లు బిగ్బాస్ ప్రకటించాడు. తనవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని భరణిని తల్చుకుని దివ్య ఏడ్చేసింది. తర్వాతి రోజు భరణి, శ్రీజ హౌస్లో అడుగుపెట్టారు. వీరిలో ఒకరు మాత్రమే హౌస్లో ఉంటారన్నాడు బిగ్బాస్.రీఎంట్రీ.. ఒక్కరికే ఛాన్స్ఇక దివ్య.. భరణిని పక్కకు తీసుకెళ్లి.. నా నామినేషన్ ఎవరనుకుంటున్నారు? తనూజ అని బాంబు పేల్చింది. మొత్తానికి భరణి.. బంధాలకు దూరంగా ఉందామనుకున్నా అటు వాళ్లు వదిలేరా లేరు. ఇక శ్రీజ, భరణి కోసం హౌస్మేట్స్ గేమ్ ఆడనున్నారు. అలాగే వీరిలో ఎవరు హౌస్లో ఉండాలనేది ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా డిసైడ్ చేయనున్నారు. మరెవరు రీఎంట్రీ ఇస్తారో చూడాలి!చదవండి: సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రాజేంద్రప్రసాద్ -
కుటుంబంతో సహా చనిపోదామనుకున్నా.. ఆ హీరో వల్లే బతికా!
ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ నేడు ఎంతోమందికి ఛాన్సులిచ్చే స్థాయికి చేరుకున్నాడు. టాలెంట్ను ఎప్పుడూ ప్రోత్సహించే మాస్ మహారాజ తన 75వ సినిమాను కొత్త దర్శకుడితో చేశాడు. సామజవరగమన మూవీకి రచయితగా పని చేసిన భాను భోగవరపును డైరెక్టర్గా పరిచయం చేస్తున్నాడు. తన జీవితం ముగిసిపోయిందనుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోను ధమాకాతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మలిచాడు. అందుకే రవితేజ అంటే భీమ్స్కు ప్రాణం. అదే విషయాన్ని ఆయన మరోసారి వెల్లడించాడు.నా వెనక ఓ ధైర్యంరవితేజ ప్రధాన పాత్రలో నటించిన మాస్ జాతర అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. మంగళవారం (అక్టోబర్ 28న) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్స్ స్టేజీపై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ధమాకా తర్వాత నుంచి శివశంకర వరప్రసాద్ మూవీ చేసేవరకు నా వెనక ఓ ధైర్యం ఉంది. ఆయన గురించి మీ అందరికీ చెప్పాలి. ఎట్ల నేను సేద్దునో.. ఎట్ల పడి నేను సద్దునో.. అంటూ సెల్ఫోన్లో ఓ వీడియో తీసుకున్నాను. కుటుంబంతో కలిసి పైకి..అప్పుడు నా భార్యాపిల్లల్ని కూడా వీడియో తీశాను. నేనెందుకు వీడియో తీస్తున్నానో వాళ్లకు తెలియదు. ఇంటి అద్దె ఎలా కట్టాలి? పిల్లల్ని ఎలా చదివించాలి? ఎలా బతకాలి? రేపు ఎలా గడుస్తుంది? అని బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్న రోజుల్లో నాకో ఫోన్ కాల్ వచ్చింది. పీపుల్స్ మీడియా ఆఫీస్కు రమ్మని ఆహ్వానం వచ్చింది. నమ్మలేకపోయాను. ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి, నాకు జీవితం లేదు. నా భార్యాపిల్లలతో కలిసి కట్టకట్టుకుని పైకి వెళ్లిపోదామనుకున్నాను. దేవుడిలా కాపాడాడుఅలాంటి సమయంలో దేవుడిలా ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు. ఆ శక్తి పేరు, వ్యక్తి పేరు, వ్యవస్థ పేరు రవితేజ సర్. మాటల్లో చెప్పాలంటే ప్రేమ.. పాటల్లో చెప్పాలంటే భక్తి. ఈరోజు నోట్లోకి ఐదువేళ్లు వెళ్తున్నాయంటే కారణం ఆయనే! అమ్మానాన్న, నీ కొడుకు సజీవంగా ఉండటానికి రవితేజ సర్ కారణం. అవకాశాల కోసం చాలామంది కథలు, కహానీలు చెప్తారనుకుంటారు. సిసిరోలియో ఎప్పుడూ కహానీలు చెప్పడు. ఉన్నదే చెప్తాడు. అందుకే సర్కు నేనంటే ఇష్టం, నాకు ఆయనంటే ఇష్టం (దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రిగారి వాయిస్ని ఏఐ రూపంలో మీ ముందుకు తీసుకువచ్చినందుకు గర్వపడుతున్నాను (తూ మేరా లవర్ పాటని ఉద్దేశించి) అని భీమ్స్ సిసిరోలియో భావోద్వేగానికి లోనయ్యాడు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఆ సినిమా రిలీజయ్యాక ట్రోలింగ్.. తట్టుకోలేకపోయా! -
సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రాజేంద్రప్రసాద్
‘‘రవితేజ (Raviteja)గారికి నేను అభిమానిని. సూపర్ ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే అది మాస్మహారాజ రవితేజ. ఓ మామూలు మనిషిని స్క్రీన్పైకి తీసుకువచ్చి కింగ్ సైజ్లో సహజంగా చూపించే పాత్రలు చేస్తుంటారు. మన జీవితంలో కలలు నిజమౌతాయని ఆయన గుర్తు చేస్తుంటారు. ‘మాస్ జాతర’ బ్లాక్బస్టర్ కావాలి’’ అని హీరో సూర్య అన్నారు. రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. శ్రీలీల హీరోయిన్గా నటించగా, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. రవితేజపై సూర్య పొగడ్తల వర్షంభాను భోగవరపు దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన సూర్య మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులను నవ్వించడం కష్టమైన పని. ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులను రవితేజ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ తరహా నైపుణ్యం తక్కువమందికి ఉంటుంది.ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాంఅమితాబ్ బచ్చన్, రజనీకాంత్ గార్లు మంచి కామిక్ టైమింగ్తో యాక్ట్ చేస్తుంటారు. రవితేజ గురించి కార్తీ, నేను, జ్యోతిక మాట్లాడుకుంటూ ఉంటాం. ‘విక్రమార్కుడు, కిక్’ సినిమాలు చూశాను. తమిళంలో కూడా రవితేజకి అభిమానులు ఉన్నారు. అక్టోబరు 31న థియేటర్స్లో రవితేజ జాతర’’అని అన్నారు. రవితేజ మాట్లాడుతూ–‘‘సూర్యగారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి వ్యక్తి. ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అభిమానులను నిరాశపర్చదు: రవితేజ‘మాస్ జాతర’ సినిమా చూశాను. హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో నవీన్ నెక్ట్స్ లెవల్కి వెళ్తాడనిపిస్తోంది. రాజేంద్రప్రసాద్గారితో నా కాంబినేషన్ సీన్స్ అలరిస్తాయి. ఇందులో మాస్ క్యారెక్టర్ చేశారు శ్రీలీల. భానురూపంలో మన ఇండస్ట్రీకి ఓ మంచి దర్శకుడు వస్తున్నాడు. ఈ సినిమాలోని పాటలను, ముఖ్యంగా ఆర్ఆర్ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా నా అభిమానులను నిరాశపరచదు’’ అని చెప్పారు. శ్రీలీల మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో తులసి అనే మాస్ క్యారెక్టర్ చేశాను. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా!: రాజేంద్రప్రసాద్రవితేజగారిని చూసి చాలా నేర్చుకున్నాను. సూర్యగారికి నేను పెద్ద అభిమానిని’’ అన్నారు. ‘‘మాస్ జాతర’ సినిమా ఆడియన్స్ను అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు నిర్మాత నాగవంశీ. ‘‘అరవిందసమేత వీరరాఘవ’ చిత్రంలో నేను చేసిన బాల్ రెడ్డి పాత్ర తర్వాత ‘మాస్ జాతర’లో నేను చేసిన శివుడు క్యారెక్టర్ను ఆడియన్స్ గుర్తు పెట్టుకుంటారు’’ అని చెప్పారు నవీన్ చంద్ర. ‘‘రవితేజగారు నా కథ విని, సితార వంటి ఓ పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు’’ అని భాను భోగవరపు పేర్కొన్నారు. ‘‘మాస్ జాతర’ చూసి ప్రేక్షకులు షాక్ అవ్వకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను. నా క్యారెక్టర్ ఏంటో థియేటర్స్లో చూడండి’’ అని తెలిపారు రాజేంద్ర ప్రసాద్.చదవండి: ఆ సినిమా రిలీజయ్యాక ట్రోలింగ్.. తట్టుకోలేకపోయా! -
ఆ సినిమా రిలీజయ్యాక ట్రోలింగ్.. తట్టుకోలేకపోయా!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఈ బ్యూటీ హీరోయిన్గా తన పదేళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. 2015లో ప్రేమమ్ అనే మలయాళం చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో ఎంట్రీ ఇచ్చి ఈ రెండు భాషల్లోనూ మంచి అవకాశాలు పొందుతూ పేరు తెచ్చుకుంది. మొదట్లో పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకున్న ఈమె ఇటీవల కొన్ని చిత్రాల్లో మితిమీరిన అందాలారబోత, లిప్లాక్ సన్నివేశాల్లో నటించి విమర్శలను ఎదుర్కొంది. రెండు ఫ్లాప్స్.. వెంటనే సక్సెస్ఇకపోతే జయాపజయాలు ఎవరికైనా సహజమే. ఈ అమ్ముడు కూడా కొన్ని అపజయాలను చవిచూసింది. ముఖ్యంగా ఆ మధ్య తమిళంలో రవిమోహన్కు జంటగా నటించిన సైరన్, ఇటీవల తెలుగులో నటించిన పరదా చిత్రాలు అనుపమపరమేశ్వరన్ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అలాంటిది తాజాగా ఈమె నటించిన తెలుగుచిత్రం కిష్కింధపురి సక్సెస్ అందుకుంది. అదేవిధంగా తమిళంలో నటించిన బైసన్ విజయం ఈమెకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది అనే చెప్పాలి. ఇందులో అనుపమ పరమేశ్వరన్ పాత్ర పరిమితమే అయినా, ఉన్నంతవరకు ఆ పాత్రకు న్యాయం చేసిందంటూ ప్రశంసలు అందుకుంటోంది. యాక్టింగే రాదన్నారుఅలా మళ్లీ హిట్ట్రాక్లో పడ్డ ఈ బ్యూటీ ప్రస్తుతం లాక్డౌన్ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈసందర్భంగా ఒక ఇంటర్వ్యూలో అనుపవమా పరమేశ్వరన్ మాట్లాడుతూ.. తన తొలిచిత్రం ప్రేమమ్ విడుదల తర్వాత తనపై జరిగిన ట్రోలింగ్స్తో చాలా భయపడ్డానంది. ముఖ్యంగా తనకు నటనే రాదని మలయాళ చిత్ర పరిశ్రమలో విమర్శించారంది. అయినా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపింది. ఇప్పుడు తనను చూసి తానే గర్వపడుతున్నానని పేర్కొంది. నట జీవితంలో ఒక కొత్త చాప్టర్లో ప్రవేశించినట్లు చెప్పుకొచ్చింది.చదవండి: యానిమేటెడ్ బాహుబలి -
యానిమేటెడ్ బాహుబలి
‘బాహుబలి 3’ సినిమా కోసం దర్శకుడు రాజమౌళి సన్నాహాలు మొదలుపెట్టనున్నారనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. అయితే ఈ చిత్రం లైవ్ యాక్షన్ ఫిల్మ్ కాదట. యానిమేటెడ్ వెర్షన్ లో ఉండబోతుందని, ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించరట. కానీ, ఆయన పర్యవేక్షణలోనే ‘బాహుబలి 3’ యానిమేటెడ్ వెర్షన్ వస్తుందని ఫిల్మ్నగర్ భోగట్టా. ఈ విషయాలపై పూర్తిస్థాయి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ రెండు భాగాలు (బాహుబలి:ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్లూజన్ ) కలిపి ఒకే భాగంగా ‘బాహుబలి: ది ఎపిక్’గా ఈ నెల 31న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించగా రానా, అనుష్కా శెట్టి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ సినిమాని శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి: ది ఎపిక్’ ట్రైలర్కి మంచి స్పందన వస్తోంది. -
'రవితేజ మూవీ నా తమ్ముడికి టర్నింగ్ పాయింట్'.. కోలీవుడ్ హీరో సూర్య
మాస్ మహారాజా రవితేజ మరో ఫుల్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన మాస్ జాతర ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. రవితేజ యాక్షన్, డైలాగ్ మాస్ ఆడియన్స్ను అలరిస్తున్నాయి. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.రిలీజ్కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈవెంట్లో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల తన డ్యాన్స్తో మరోసారి ఆడియన్స్ను అలరించింది. రవితేజతో కలిపి స్టెప్పులతో అదరగొట్టేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.హీరో సూర్య మాట్లాడుతూ..' రవితేజకు నేను కూడా అభిమానినే. ఇది నాకు ఫ్యాన్ భాయ్ మూమెంట్. ఆయన ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ నటనకు బిగ్ ఫ్యాన్ నేను. తమిళంలోనూ రవితేజ సినిమాలకు అద్భుతమైన క్రేజ్ ఉంది. విక్రమార్కుడు మూవీ కార్తీ కెరీర్లో బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ మాస్ జాతర సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఈ మూవీలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ భాను కల నిజం కావాలి. ఈనెల 31 మరో బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం' అని అన్నారు. కాగా.. రవితేజ, శ్రీలీల జంటగా వస్తోన్న మాస్ జాతర అక్టోబర్ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. The joy, the excitement, and the MASS vibe all in one frame! 🔥Pics from the Grand Pre Release event of #MassJathara ❤️🔥Premieres Worldwide on Oct 31st from 6 PM Omwards! 😎🤘Mass Maharaja @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/bAqv31Lym8— Sithara Entertainments (@SitharaEnts) October 28, 2025 -
సినీ టికెట్ ధరల పెంపుపై సీఎం రేవంత్
హైదరాబాద్: సినిమా టికెట్ ధరల పెంపుపై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరలు పెంచితే మాత్రం అందులో కార్మికులకు 20 శాతం వాటా ఉండాలన్నారు. కార్మికులకు ఆరోగ్య బధ్రత చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలదేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్కు సినీ కార్మికులచే అభినందన సభ ఏర్పాటు చేశారు. తెలుగు సిని పరిశ్రమ 24 క్రాఫ్ట్ సంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వివేక్, పొన్నం, ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ చిన్న సినిమాలను తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదు. కార్మిక కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పిస్తాం. కార్మికులకు రాజీవ్ ఆరోగ్య పథకం అమలు చేస్తాం. కార్మికుల్ని కుటుంబాలుగా చూసుకోవాలని నిర్మాతకు చెప్పా. సినిమా టికెట్లు పెంచితే వచ్చే ఆదాయంతో 20 శాతం కార్మికులకు ఇవ్వాలి. 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు బదిలీ అవ్వాలి. ఆ రకంగా అయితే ిటికెట్ ధరలు ెపెంచుకునేందుకు జీవో ఇస్తాం. నా శక్తి మేర సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తా. గత పదేళ్లుగా నంది అవార్డులు ఇవ్వలేదు.. ఇప్పుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో ఆ అవార్డులు ఇస్తున్నాం. మహా భారతం లో నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు. ప్రాణం పోతుంది అని తెలిసిన స్నేహితుల వైపు ఉన్నాడు. అందుకే మిత్ర ధర్మాన్ని పాటించడంలో నేను కర్ణుడు లాంటి వాడిని. నిర్ణయం తీసుకున్నాక నేను ఆలోచించను. ఎన్ని అడ్డంకులు వచ్చిన కార్మికుల క్షేమం కోసం మిత్ర ధర్మం పాటిస్తాను. డిసెంబర్ 9 నాడు సినీ కార్మికుల కోసం దిశా నిర్దేశం చేసి ప్రణాళిక ఇస్తాము. కార్మికులు బాగుంటేనే దర్శక నిర్మాతలు బాగుంటారు అని చెప్పిన. కార్మికుల వెల్ఫేర్ కోసం 10 కోట్ల ఫండ్ కేటాయిస్తాము. టికెట్ ధరలు పెంచాలి అంటే అందులో కార్మికులకు వాటా ఇవ్వాలి. టికెట్ ధరలు పెంచితే హీరోలకు నిర్మాతలకు లాభం. మరి కార్మికులకు ఎం ఒరిగింది. కార్మికులకు అదనంగా ఒక్క రూపాయి రావట్లేదు. పెంచిన టికెట్ ధర లో 20 శాతం సినీ కార్మికులకు ఇస్తేనే ప్రభుత్వం జీవో ఇస్తాము. మీ శ్రమతో సంపాదించే ప్రతి దానిలో మీకు వాటా ఉండాలి. ఎంత పెద్ద నిర్మాత అయినా కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ జమ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తది. నేను ఈ విధంగా చేయాలనీ ఆదేశలు ఇస్తున్న’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
వర్కింగ్ అవర్స్పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినీ నటీనటుల పని గంటలపై గతకొంత కాలంగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) స్పందించారు. నిర్దిష్ట పనివేళలు ఉండాలని తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారు. ‘ది గర్ల్ప్రెండ్’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ‘నటీనటులకే కాదు దర్శకుల నుంచి లైట్మ్యాన్ వరకు అందరికీ నిర్దిష్ట పనివేళలు ఉంటే బాగుంటుంది. దాని వల్ల కుటుంబంతో గడిపే సమయం దొరుకుతుంది. ఇకపై నేను ఫ్యామిలీపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నా. భవిష్యత్తు గురించే నా ఆలోచనంతా. తల్లిని అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడే ఊహిస్తుంటా’ అని రష్మిక అన్నారు.ఎనిమిది గంటలే పని చేస్తానని డిమాండ్ చేయడంతో దీపికా పదుకొణెను స్పిరిట్ చిత్రం నుంచి తొలగించినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు వర్కింగ్ అవర్స్పై స్పందించారు. ది గర్ల్ఫ్రెండ్ విషయానికొస్తే.. ఇదొక ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీ. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7న రిలీజ్ కానుంది. -
తల్లి చనిపోయిన విషయం దాచి షూటింగ్ చేశాడు.. తిరువీర్పై దర్శకుడు ప్రశంసలు!
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’(The Great Pre Wedding Show ). సందీప్ అగరం, అశ్మితా రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కి దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. ‘తిరువీర్ను నేను ఓ నాటకంలో చూశాను. నేను మూవీ తీస్తే తిరువీర్కి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ‘పలాస’లో మూడు పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని అనుకున్నాను. ‘పలాస’ కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. తల్లి చనిపోయినా కూడా తిరువీర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్లో సీన్ చేశాడు. అలా తిరువీర్ మాకు ఎంతో సహకరించారు. డెబ్యూగా సినిమాలు తీసేటప్పుడు మేకర్లకు ఉండే కష్టాలు మా అందరికీ తెలుసు. ఈ చిత్రం వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రూటెడ్ కథల్నే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.హీరో తిరువీర్ మాట్లాడుతూ .. దర్శకుడు రాహుల్ ఈ కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి టూర్కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం. మంచి కంటెంట్తో మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న రాబోతోంది. మా చిత్రం అందరికీ నచ్చుతుంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మాకు అండగా నిలిచిన జీ సంస్థకు థాంక్స్. ’ అని అన్నారు.చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్లో హీరో తిరువీర్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ట్రైలర్కు వంద రెట్లు అనేట్టుగా సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా మా చిత్రం ఉంటుంది. నవంబర్ 7న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.అనగనగా దర్శకుడు సన్నీ మాట్లాడుతూ .. ‘‘పరేషాన్’లో తిరువీర్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. అన్ని రకాల ఎమోషన్స్ను తిరు అద్భుతంగా పలికిస్తారు. తనకంటూ ఓ మార్క్ను తిరు క్రియేట్ చేసుకున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథతో తీసిన ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. ‘దర్శకుడు రాహుల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. నవంబర్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని చిత్ర నిర్మాత సందీప్ అగరం అన్నారు. -
సమంత 'బంగారం'లో కాంతార విలన్
కొన్నిరోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'కాంతార 1'.. ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ శుక్రవారం ఓటీటీలోకి కూడా రానుంది. అయితే ఈ మూవీలో విలన్గా చేసిన గుల్షన్ దేవయ్య తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. గతంలో హిందీలో పలు చిత్రాలు, వెబ్ సిరీసులు చేసిన ఇతడు.. ఇప్పుడు తెలుగులో నటించేందుకు రెడీ అయిపోయాడు.(ఇదీ చదవండి: 'సలార్' కాటేరమ్మ ఫైట్లో నేనే చేయాలి.. కానీ: టాలీవుడ్ హీరో)మయాసైటిస్ కారణంగా చాన్నాళ్లుగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన సమంత.. ఈ ఏడాది నిర్మాతగా 'శుభం' అనే మూవీని రిలీజ్ చేసింది. ఇప్పుడు తనే నిర్మాత కమ్ హీరోయిన్గా 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తోంది. దసరాకు పూజతో లాంఛనంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా ఇప్పుడు షురా అయిపోయింది. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు.నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత.. గృహిణిగా ఉంటూనే గన్ పట్టి యాక్షన్ కూడా చేయబోతుంది. ఇదే మూవీలో 'కాంతార 1' ఫేమ్ గుల్షన్ దేవయ్య కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇతడే స్వయంగా బయటపెట్టాడు. సమంత పోస్ట్ని తన ఇన్ స్టా స్టోరీలో రీ పోస్ట్ చేసిన ఇతడు.. 'నేను కూడా ఇందులో ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇదే ఇతడికి తెలుగులో మొదటి సినిమా. మరి సమంత పక్కన నటిస్తాడా లేదంటే విలన్గా చేయబోతున్నాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: కొందరు నటులు అసలు సెట్కే రారు.. 'ఓజీ' విలన్ కామెంట్స్) -
అల్లు అర్జున్-అట్లీ కాంబో.. ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్!
పుష్ప -2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై కొన్ని నెలలుగా చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అంతే కాకుండా మరో ముగ్గురు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని టాక్ నడిచింది.ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్కు సంబంధించిన మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్లో సీతారామం బ్యూటీ హీరోయిన్గా కన్ఫామ్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మృణాల్ షూట్లో కూడా పాల్గొన్నారని లేటేస్ట్ అప్డేట్. అంతేకాకుండా అల్లు అర్జున్తో కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబోలో మృణాల్ ఎంట్రీలో మూవీపై మరింత బజ్ ఏర్పడింది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను AA22xA6 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ సైతం నటిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ను టార్గెట్ చేస్తూ మరికొందరిని హాలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులను ఈ మూవీ కోసం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.Buzz is that actress Mrunal Thakur has joined Allu Arjun in Atlee’s upcoming sci-fi action spectacle “AA22xA6”. Backed by Sun Pictures, the film is said to be a high-octane futuristic thriller packed with massive action sequences, time-travel elements, and cutting-edge VFX. The… pic.twitter.com/xqnzdR7DlJ— SIIMA (@siima) October 28, 2025 -
దాదాసాహెబ్ ఫాల్కే సలహా బోర్డ్ సభ్యురాలిగా సుధారెడ్డి
దాదా సాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సలహా బోర్డ్ సభ్యురాలిగా ప్రముఖ వ్యాపారవేత్త, సాంస్కృతిక రాయబారి సుధారెడ్డిని నియమితులయ్యారు. ఈమె కాకుండా బోర్డ్లో హిందూజా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ కల్నల్ పి.సి. సూద్, బరోడా మహారాణి హెచ్.హెచ్. రాధికరాజే గైక్వాడ్, వి.ఎం. సల్గావ్కార్ కార్పొరేషన్ చైర్మన్ దత్తరాజ్ సల్గావ్కార్, ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, ఇండియన్ కొరియోగ్రాఫర్ షియామక్ దావర్, దాదాసాహెబ్ ఫాల్కే ముని మనవరాలు గిరిజా ఫాల్కే మరాఠే, ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖలో గౌరవనీయ సాంస్కృతిక నిపుణుడు & మాజీ సెన్సార్ బోర్డు జ్యూరీ భావనా మర్చంట్, సినీపోలిస్ ఇండియా ఫిల్మ్ ప్రోగ్రామింగ్ &డిస్ట్రిబ్యూషన్ హెడ్ మయాంక్ ష్రాఫ్ మరియు భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ & మాజీ సెన్సార్ బోర్డు జ్యూరీ జ్యోతి బధేకా తదితరులు ఉన్నారు.భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే వారసత్వంలో డీపీఐఎఫ్ఎఫ్(DPIFF) సలహా బోర్డ్.. సాంస్కృతిక ప్రతిష్టకు నిలయంగా ఉద్భవించింది. కళాకారులు, చిత్రనిర్మాతలు, పరిశ్రమ నాయకులను నిరంతరం గౌరవిస్తూనే సినిమా రంగంలో ప్రపంచ కేంద్రంగా భారతదేశం యొక్క స్థాయిని బలోపేతం చేస్తుంది. ఇకపోతే అక్టోబరు 29-30వ తేదీల్లో ముంబై వేదికగా దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవ అవార్డులు-2025 కార్యక్రమం జరగనుంది. -
మలయాళ చిత్రాలే కాదు.. మేము సైతం అంటోన్న మృణాల్ ఠాకూర్!
ఇటీవల సౌత్లో మలయాళ సినిమాలకు డిమాండ్ పెరిగింది. అక్కడ సూపర్ హిట్ అయితే చాలు.. డబ్ చేసి ఇతర భాషల్లోకి వదులుతున్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ మలయాళ చిత్రాలను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ లాంటి సినిమాలు టాలీవుడ్లోనూ సత్తాచాటాయి. తాజాగా మోహన్ లాల్ తనయుడు నటించిన మరో చిత్రం వచ్చేనెలలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.మలయాళ సినిమాలు ఇతర భాషల్లో సత్తాచాడటం కామనైపోయింది. కానీ ఇప్పుడు దీనికి భిన్నంగా ఇతర భాషకు చెందిన సూపర్ హిట్ మూవీ.. ప్రస్తుతం మలయాళంలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ విషయాన్ని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక ఉద్యమం అంటూ పోస్టర్ను పంచుకుంది. మరాఠీ సినిమా మరో భాషలో రిలీజ్ కావడం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తెలిపింది. మరాఠీ సినీ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి అని పోస్టర్లో వెల్లడించారు.మరాఠీలో తెరకెక్కించిన దశవతార్ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మరాఠీలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఈ మూవీకి సుబోధ్ కనోల్కర్ దర్శకత్వం వహించారు. ప్రియదర్శిని ఇందల్కర్, సిద్ధార్థ్ మీనన్ జంటగా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని నవంబర్ 21 మలయాళంలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మలయాళ చిత్రాలు ఇతర భాషల్లో సత్తా చాటుతుంటే.. తొలిసారి మరాఠీ మూవీ మాలీవుడ్లో హిట్ కొడుతుందా? లేదా? అన్నది తెలియాలంటే నవంబర్ 21 వరకు ఆగాల్సిందే.Watched Dashavatar today and oh my god! It isn't just a film, it's a movement. The first Marathi blockbuster to reach Malayalam audiences. how amazing is that! So proud to see Marathi cinema crossing new screens and hearts💖#dashavatar #marathicinema pic.twitter.com/b43qKRcKkt— Mrunal Thakur (@mrunal0801) October 27, 2025 -
'ఈ సారి మామూలుగా ఉండదు'.. డకాయిట్ కొత్త రిలీజ్ డేట్
టాలీవుడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ఇంటెన్స్ యాక్షన్ ప్రేమకథా చిత్రం డకాయిట్(Dacoit). ఇప్పటికే రిలీజ్ తేదీ ప్రకటించినా అనివార్య కారణాలతో వాయిదా పడుతూనే వస్తోంది. గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి కోలీవుడ్ భామ శృతిహాసన్ అనూహ్యంగా తప్పుకుంది. ఇది కూడా సినిమా ఆలస్యానికి కారణం కావొచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్గా చేస్తోంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.కానీ వారు అనుకున్న తేదీ ప్రకారం కుదరకపోవడంతో తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు డకాయిట్ మేకర్స్. వచ్చే ఏడాది ఉగాది కానుకగా డకాయిట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. 'ఈ సారి మామూలుగా ఉండదు.. వెనక్కి తిరిగి చూసేదే లేదు' అంటూ అడివి శేష్ మూవీ పోస్టర్ను పంచుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో డకాయిట్ సందడి చేయనుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో అడివి శేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. (ఇది చదవండి: 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్ విడుదల)ఈ మూవీని షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘క్షణం’, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను ఆకట్టుకుంది. Ee Saari Mamulga undadhu ❤️🔥There’s NO LOOKING BACK#DACOIT This UGADI MARCH 19th 2026in Theaters WORLDWIDE pic.twitter.com/KaxruBidTN— Adivi Sesh (@AdiviSesh) October 28, 2025 -
'సలార్' కాటేరమ్మ ఫైట్లో నేనే చేయాలి.. కానీ
పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత ప్రభాస్ నుంచి వరస సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈయన చేసిన సలార్, ఫౌజీ చిత్రాల్లో తనకు అవకాశాలొచ్చినా కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యాయని తెలుగు యంగ్ హీరో తిరువీరు చెబుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఫ్యామిలీ మ్యాన్ 3')'ప్రభాస్ 'సలార్' కాటేరమ్మ ఫైట్లో విలన్గా నేనే చేయాలి. కానీ డేట్స్ సమస్య కారణంగా అది మిస్ అయింది. అలానే 'ఫౌజీ'లోనూ మంచి ఆఫర్ వచ్చింది. కానీ వేరే సినిమాలు, లుక్ కంటిన్యూటీ కారణంగా వాటిని వదులుకోవాల్సి వచ్చింది' అని తిరువీర్ చెప్పుకొచ్చాడు.టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్.. 'మసూద', 'పరేషాన్' చిత్రాలతో లీడ్ రోల్స్ చేశాడు. జార్జ్ రెడ్డి, టక్ జగదీష్ సినిమాల్లో విలన్గా ఆకట్టుకున్నాడు. త్వరలో 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే మూవీతో రాబోతున్నాడు. దీని ప్రమోషన్లలో భాగంగానే మాట్లాడుతూ తను చేస్తున్న సినిమాలు వల్ల ప్రభాస్ సలార్, ఫౌజీలో అవకాశాలు మిస్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్పై 'మోంథా' ప్రభావం ఎంతవరకు?) -
బైసన్ కలెక్షన్స్.. బిగ్ మార్క్ అందుకున్న ధ్రువ్
విక్రమ్ కుమారుడు ధ్రువ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం బైసన్(Bison). మొదట తమిళ్లో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 24న తెలుగులో కూడా రిలీజ్ అయింది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి ఈ మూవీని నిర్మించాయి. ధ్రువ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా బైసన్ రికార్డ్ క్రియేట్ చేసింది.బైసన్ చిత్రం కేవలం పదిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 55 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు దర్శకుడు మారి సెల్వరాజ్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. రెండో వారంలో ఈ చిత్రానికి భారీగా స్క్రీన్స్ పెరిగాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళలో అత్యధికంగా థియేటర్స్ పెరగడం విశేషం. అయితే, తెలుగులో మాత్రం కాస్త పర్వాలేదు అనిపించేలా బైసన్ ఉంది.ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. Ecstatic beyond measure and thankful beyond words!! #BisonKaalamaadan is unstoppable as he's breaking those barriers right away!!💥🦬55 Crores Worldwide in 10 days!! #Blockbuster Raid in the Theatres Near You! 💥💥💥@applausesocial @NeelamStudios_ @nairsameer @deepaksegal… pic.twitter.com/ozbbqRLl7S— Mari Selvaraj (@mari_selvaraj) October 27, 2025 -
ఆ విషయంలో ఎప్పుడూ బాధపడలేదు : ప్రియమణి
పారితోషికం విషయంలో ఎప్పుడూ డిమాండ్ చేయలేదని.. చాలా సినిమాలకు తనతో కలిసి నటించిన వారికంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నానని అన్నారు నటి ప్రియమణి. ఈ విషయంలో తాను ఎప్పుడూ బాధ పడలేదని చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పారితోషికం, షూటింట్ టైమింగ్స్ ఇష్యూపై స్పందించారు. మనకు ఉన్న స్టార్డమ్ ఆధారంగా నిర్మాతలు రెమ్యునరేషన్ ఇస్తారని...ఎక్కువ, తక్కువ అనేది తాను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు.‘నేనెప్పుడు రెమ్యునరేషన్కి ప్రాధాన్యత ఇవ్వలేదు. నాకున్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలను అడుగుతాను. చాలా సందర్భాలలతో నాతోటి నటించిన వారికంటే తక్కువ పారితోషికం తీసుకున్నాను. నా పాత్ర, నిడివి చూసుకొని సినిమాలను అంగీకరిస్తాను కానీ.. డబ్బులు ఎంత ఇస్తున్నారనేది నేను పట్టించుకోను. నేను అర్హురాలిని భావిస్తే.. పారితోషికం పెంచమని డిమాండ్ చేస్తా. అంతేకానీ.. అనవసరంగా ప్రతిసారి పారితోషికం పెంచమని కోరను’అని ప్రియమణి చెప్పుకొచ్చారు.సౌత్కి బాలీవుడ్కి తేడా అదే..ఇక షూటింగ్ టైమింగ్స్ గురించి మాట్లాడుతూ.. ఈ విషయంలో సౌత్కి నార్త్కి చాలా తేడా ఉందన్నారు. ‘సౌత్ ఇండస్ట్రీలో చెప్పిన టైమ్కి షూటింగ్ని ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటకు షూటింగ్ ప్రారంభిస్తామని షెడ్యూల్ ఇస్తే... కచ్చితంగా ఆ సమయానికి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ బాలీవుడ్లో అలా కాదు. ఉదయం 8 గంటలకు షూటింగ్ అంటే.. నటీనటులు అప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరుతారు. అక్కడ చెప్పిన సమయానికి షూటింగ్ స్టార్ట్ కాదు’ అని ప్రియమణి అన్నారు. ప్రియమణి సినిమాల విషయానికొస్తే..ఇటీవల ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’, అమెరికన్ షో ‘ది గుడ్ వైఫ్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’తో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్లోనూ నటిస్తోంది. -
టాలీవుడ్పై 'మోంథా' ప్రభావం ఎంతవరకు?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై మోంథా తుపాన్ గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. తెలంగాణలో అక్కడక్కడ ఓ మాదిరిగా వర్షాలు పడుతున్నాయి కానీ ఆంధ్రాలో మాత్రం ఎక్కడచూసినా సరే వానలు దంచికొడుతున్నాయి. తీరమంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రభుత్వం కూడా ప్రజలు ఎవరినీ బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది. అయితే మోంథా తుపాన్ ప్రభావం.. టాలీవుడ్పై ఎలా ఉండనుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మోంథా తుపాన్.. ఈ రోజు(అక్టోబరు 28) రాత్రికి కాకినాడ దగ్గర తీరదాటనుంది. దీంతో బుధవారం కూడా కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్ష ప్రభావం గట్టిగానే ఉండగా.. కొన్ని ప్రాంతాలు నీటమునిగే అవకాశం కూడా లేకపోలేదు. శుక్రవారానికి గానీ తుపాన్ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.అయితే ఈ శుక్రవారం 'బాహుబలి' రీ రిలీజ్తో పాటు 'మాస్ జాతర' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిపై ఇప్పటికైతే ఓ మాదిరి బజ్ మాత్రమే ఉంది. ఇప్పుడు తుపాన్ ప్రభావం వల్ల జనాలు ఈ వీకెండ్.. మూవీస్ చూసేందుకు ఆంధ్రాలో థియేటర్లకు వస్తారా అంటే సందేహమే. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం రవితేజ, ప్రభాస్ చిత్రాలకు కలెక్షన్స్ పెద్దగా రాకపోవచ్చనే మాట వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి? (ఇదీ చదవండి: 'సౌందర్య'ను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ (వీడియో))'బాహుబలి' రీ రిలీజ్ విషయానికొస్తే.. గతంలో విడుదలైన రెండు భాగాల్ని కలిపి ఇప్పుడు 'ఎపిక్' పేరుతో ఒకే పార్ట్గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాడు. 3 గంటల 44 నిమిషాల నిడివితో ఇది ఉండనుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. అయితే కొత్తగా ఓ సీన్ కూడా జోడిస్తున్నామని సినిమాటోగ్రాఫర్ సెంథిల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.'మాస్ జాతర' విషయానికొస్తే.. రవితేజ చేసిన రెగ్యులర్ కమర్షియల్ మూవీ. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆయన గత చిత్రాల మాదిరిగా రొటీన్లానే అనిపించింది. ట్రైలర్ ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ.. మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి? రవితేజకు ఇది 75వ మూవీ కావడం విశేషం. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించగా.. భాను భోగవరపు దర్శకత్వం వహించాడు.శ్రీలీల హీరోయిన్. -
తప్పు చేసి సారీ చెప్తే ఎలా.. బిగ్బాస్లో భరణి ఫైర్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా ఆసక్తిగా కొనసాగుతుంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఒక్కోక్కరిగా వచ్చి హౌస్లో ఉండే సభ్యులను నామినేట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రియా శెట్టి, మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ తమ ప్రక్రియను సోమవారం ఎపిసోడ్లో ముగించారు. అయితే, మంగళవారం ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. భరణితో పాటు శ్రేష్టి వర్మ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.భరణి ఎంట్రీ ఇవ్వగానే దివ్య చాలా సంతోషంగా వెళ్లి హగ్ చేసుకుని తన అభిమానాన్ని చూపింది. ఇంతలో ఇమ్మాన్యేయల్ దగ్గరికి వెళ్లిన భరణి.. కట్టప్ప చంపేశావ్ కదరా అంటూ సరదాగా పలకరిస్తాడు. అయితే, ఫైనల్గా సంజనాను భరణి నామినేట్ చేశారు. దీంతో వారిద్దరి మధ్య వాదన గట్టిగానే జరిగింది. 'భరణి అన్నయ్య అంటూ నువ్వు పిలిచిన ప్రతిసారి ఒక సిస్టర్గానే నేను చూశాను. ఏరోజు కూడా ఫేక్ రిలేషన్ కొనసాగించలేదు. తప్పు చేసి సారీ అని చెప్పితే సరిపోతుందా.. 'అంటూ సంజనపై భరణి ఫైర్ అవుతారు. అయితే, దివ్యను రోడ్ రోలర్ అని కామెంట్ చేయడం వల్లనే భరణి ఫైర్ అయ్యారని తెలుస్తోంది. ఇలా వారిద్దరి మధ్య జరిగిన ఫైట్ ఈ మంగళవారం ఎపిసోడ్లో హైలైట్ కానుంది.శ్రేష్టి వర్మ కూడా సరైన పాయింట్లతోనే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. పవన్ ఆటపై అభ్యంతరం తెలిపింది. రీతూ ట్రాప్లోనే ఉన్నావ్ అంటూ చెప్పింది. గేమ్ పట్ల రీతూకు ఉన్న క్లారిటీ కూడా లేదంటూ పవన్ను శ్రేష్టి నామినేట్ చేసింది. -
'ఫౌజీ'లో జూనియర్ ప్రభాస్గా ప్రముఖ హీరో కుమారుడు ఎంట్రీ
ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న 'ఫౌజీ' (Fauji) సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కిస్తున్నా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ 'చైత్ర జె ఆచార్' (Chaithra J Achar)కు ఛాన్స్ దక్కినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇదే సమయంలో నటుడు సుధీర్ బాబు రెండో కుమారుడు దర్శన్ ఫౌజీ మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.సుధీర్ బాబు కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు దర్శన్కు ఫౌజీలో ఛాన్స్ వచ్చినట్లు టాక్. ఇందులో ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో అతను కనపించనున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు మహేష్ బాబు నిర్మిస్తున్న గూఢచారి-2లో కూడా దర్శన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ ఉంది. అయితే, ఈ వార్తల గురించి ఫౌజీ యూనిట్, సుధీర్ బాబు కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఈ వార్తలు నిజమేనా అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే సుధీర్ బాబు తన పెద్ద కొడుకు చరిత్ మానస్ను వెండితెరకు పరిచయం చేశారు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు'లో కూడా ఓ చిన్న పాత్రలో చరిత్ నటించారు. గతంలో తను పలు సినిమాల్లో మెరిశాడు. భలే మగాడివోయ్ సినిమాలో జూనియర్ నానిగా కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత విన్నర్ సినిమాలో జూనియర్ సాయిధరమ్ తేజ్గా కనిపించాడు. కాగా మహేష్ బాబు తనయుడు గౌతమ్ కూడా '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సుదీర్ బాబు రెండో కుమారుడు దర్శన్ ఏకంగా ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. -
కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ (వీడియో)
ప్రముఖ నటులు జగపతి బాబు హోస్ట్గా చేస్తున్న టాక్ షోలో తాజాగా నటి రమ్యకృష్ణ(Ramya Krishnan) పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె తన స్నేహితురాలు, దివంగత నటి సౌందర్య(Soundarya)ను గుర్తు చేసుకున్నారు. తనతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిద్దరూ కలిసి గతంలో అమ్మోరు, నరసింహ, హలో బ్రదర్ లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలలో పనిచేశారు. ఆ షో మొత్తం చాలా ఎనర్జీగా కనిపించిన రమ్యకృష్ణను సౌందర్య గురించి చెప్పాలని జగపతి బాబు అడిగిన క్షణం నుంచి రమ్య కాస్త బాధగానే కనిపించారు.సౌందర్య, రమ్యకృష్ణ ఇద్దరూ కలిసి నటించిన నరసింహ సినిమా నుంచి కొన్ని సీన్స్ను జగపతి బాబు చూపించారు. స్క్రీన్ మీద వీడియో రన్ అయ్యేంత వరకు రమ్య కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సౌందర్యతో తన జ్ఞాపకాలను రమ్యకృష్ణ ఇలా పంచుకున్నారు. ' 1995లో అమ్మోరు షూటింగ్ సమయంలోనే సౌందర్యను మొదటిసారి చూశాను. అప్పుడే ఆమె గురించి తెలుసుకున్నాను. చిన్న తనం నుంచే తనను తాను తీర్చిదిద్దుకుంటూ ఎదిగింది. ఆమెకు ఎంత పేరు ప్రతిష్ట వచ్చినా సరే.. ఎవరినీ తక్కువగా చేసి మాట్లాడదు. ఆమె ఒక అద్భుతమైన వ్యక్తిగానే కాకుండా మాకు మంచి స్నేహితురాలిగా అనుబంధం ఉంది. ఆమెను ఎవరూ కూడా రీప్లేస్ చేయలేరు.' అని రమ్యకృష్ణ తెలిపారు. ఈ క్రమంలో ఆమె కంట కన్నీళ్లు మాత్రం ఆగలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలునరసింహ సినిమా విడుదల సమయానికి రమ్యకృష్ణకు సమానంగా సౌందర్యకు పాపులారిటీ ఉంది. ఈ మూవీ వరకు కేవలం నటిగా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణకు ‘నరసింహ’ సినిమాతో తన స్టార్డమ్ మరింత పెరిగింది. ఈ చిత్రంలో రజనీకాంత్కు విలన్గా నీలాంబరి పాత్రలో ఆమె కనబర్చిన నటనకు చాలామంది ఫిదా అయ్యారు. అయితే, ఇదే మూవీలో తాను సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిపడ్డానని కూడా ఆమె చెప్పారు. కానీ, ఆ సీన్ చేసేందుకు సౌందర్య ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమని రమ్య గుర్తు చేసుకుంది. 2004 ఏప్రిల్ 17న సౌందర్య తన సోదరుడు అమర్నాథ్తో కలిసి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.దేవుళ్లందరినీ తలుచుకున్నాకే ఆ సీన్ చేశారమ్యకృష్ణ మాట్లాడుతూ..' ఆ చిత్రంలో నా రోల్ సౌందర్యపై పగ తీర్చుకోవడం. అందుకే అలాంటి అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ మొదట ఆ సీన్ చేయలేకపోయా. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. చివరికి ఆ షాట్ నాకు ఇష్టం లేదు. సినిమా తప్పకుండా చేయాల్సి వచ్చింది. ఆ సీన్ చేసేటప్పుడు దేవుళ్లందరినీ మనసులో స్మరించుకున్నా. ఆ తర్వాతే సౌందర్యపై చెంపపై కాలు పెట్టా. ఆ సీన్లో నటించిన కొన్ని రోజుల తర్వాత అదే మూడ్లో ఉన్నా.' అని చెప్పుకొచ్చింది. -
శ్రీజ ప్లాన్ ఇదే.. అందుకే కల్యాణ్, తనూజలపై ఫైర్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఇప్పటికే అర్ధ సెంచరీ కొట్టేసింది. అక్టోబర్ 27న సోమవారం నామినేషన్ ప్రక్రియ మంచి బజ్తోనే మొదలైంది. సాధారణంగా హౌస్మేట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకునే విధానానికి బిగ్బాస్ ఫుల్స్టాప్ పెట్టేశాడు. ఈసారి నామినేట్ చేసే హక్కును ఎలిమినేట్ అయిన సభ్యులకు బిగ్బాస్ ఇచ్చారు. దీంతో ప్రియా శెట్టి, మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ ఒక్కొక్కరుగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుత హౌస్మేట్స్ను నామినేట్ చేశారు. వీరిలో దమ్ము శ్రీజ ప్రధానంగా హైలైట్ అయింది. కల్యాణ్, తనూజ, మాధురిని టార్గెట్ చేసి హౌస్లోకి దిగింది.సంజనపై ప్రియ ఫైర్నామినేషన్ ప్రక్రియ ప్రియాశెట్టితో మొదలైంది. దివ్యను రోడ్డు రోలర్ అని కామెంట్ చేసిన సంజనపై ఆమె భగ్గుమంది. సీజన్ ప్రారంభంలో కనిపించనంత నిజాయితీగా ఇప్పుడు లేరంటూనే కాస్త మాటలు అదుపులో పెట్టుకోవాలని సలహా ఇచ్చింది. తర్వాత హౌస్లోకి మర్యాద మనీష్ ఎంట్రీ ఇచ్చాడు. తనూజను నామినేట్ చేస్తానని చెప్పి ఇమ్మాన్యుయేల్ను్ మోసం చేశావ్ అంటూ కల్యాణ్ను నామినేట్ చేశాడు. కల్యాణ్ చేసిన పని ఒక నమ్మకద్రోహంగా మిగిలిపోయిందని మండిపడ్డారు.ఫ్లోరా షైనీ ఎంట్రీతోనే రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ.. ఎదురుదాడికి దిగింది. రీతూ కేవలం ఫేక్ లవ్ ట్రాక్ రన్ చేస్తున్నావ్ అంటూ మొదట కల్యాణ్ ఆ తర్వాత పవన్లతో గేమ్ ఆడుతుందని తెలిపింది. కనీసం పవన్తో కూడా రీతూ నిజాయితీగా లేదని కామెంట్ చేసింది. రీతూ ఎపిసోడ్ కాగానే సుమన్ శెట్టికి నామినేట్ చేసే అవకాశం ఇచ్చింది. సంజనను నామినేట్ చేస్తూ సుమన్ శెట్టి తన పాయింట్స్ చెప్పాడు. కెప్టెన్ని కూడా సంజన గౌరవించదు. తన మాట తీరు బాగాలేదు అంటూ నామినేట్ చేస్తాడు. దీంతో ఈ హౌస్లోనే చెత్త కెప్టెన్ సుమన్ శెట్టి అని ఆమె ఫైర్ అయింది.మాధురిని టార్గెట్ చేసిన శ్రీజబిగ్బాస్లోకి శ్రీజ ఎంట్రీనే పక్కా ప్లాన్తో వెళ్లింది. మొదట కావాలనే మాధురిని గెలికింది. ఏంటి మాధురి గారు ఎలా ఉన్నారు అంటూ మీ పేరు మాధురినా.. మాస్ మాధురినా లేదా రాజు గారా అంటూ ఎటకారం మొదలుపెట్టింది. మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా తెలియడం లేదని పంచ్లు వేసింది. మళ్లీ పేరు తెలీదని అంటారు కదా అని పాత గొడవని గుర్తుచేసింది. బయటికెళ్లిన తర్వాత మీ గురించి చాలా మందిని అడిగాను ఎవరూ కూడా చెప్పలేదు. ఆమె నాకు కూడా ఆమె తెలీదు నీకెలా తెలుస్తుందని చాలామంది చెప్పారని ఎటకారం మొదలపెట్టింది. అయితే, అదే సమయంలో మాధురి కూడా తగ్గలేదు. నువ్వు కూడా ఎవరో నాకు ఇంత వరకూ తెలీదు అంటూ చెప్పింది.కల్యాణ్, తనూజలపై టార్గెట్..పక్కా ప్లాన్తో శ్రీజశ్రీజ నామినేట్ చేసింది కల్యాణ్ను మాత్రమే.. కానీ, ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో పక్కాగా తన స్ట్రాటజీతో ఆట మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఫస్ట్ మాధురిని ఆ తర్వాత తనూజపై ఎదురుదాడికి దిగింది. శ్రీజ రీఎంట్రీ ఇచ్చాక తనకు కల్యాణ్ పోటీ రావచ్చని ఇలా తన ఇమేజ్ను తగ్గించేలా స్కెచ్ వేసి దెబ్బ కొట్టింది. అలా ప్రస్తుతం టాప్లో ఉన్న కల్యాణ్, తనూజలను టార్గెట్ చేసి బరిలోకి దిగేందుకు తను ప్లాన్ అమలు చేసింది. ఇదే సమయంలో మాధురి పట్ల సోషల్మీడియాలో నెగటివిటీతో పాటు ఎక్కువగా ట్రోల్స్ కూడా జరుగుతుంటాయి. అలా ఆమెను ద్వేషించే వారి ఓట్లను కూడా తనవైపు తిప్పుకునే ప్లాన్ వేసినట్లు అర్థం అవుతుంది. ఇలా గట్టిగానే తన రీఎంట్రీకి శ్రీజ ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది. అయితే, ఇక్కడ శ్రీజ నామినేషన్ పాయింట్లు ప్రతీది కూడా ఒక బుల్లెట్లా దూసుకుపోయాయి. వాటిలో ఒక్కదానికి కూడా కల్యాణ్ సమాధానం చెప్పలేకపోయాడు. తనూజ, మాధురి కూడా శ్రీజ వేసిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో ఆమె ప్లాన్ విజయవంతమైంది.కల్యాణ్,తనూజలను ఇరికించిన శ్రీజనువ్వు అమ్మాయిల పిచ్చోడివా..? అంటూ కల్యాణ్ను శ్రీజ నామినేట్ చేసింది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా సరిగ్గా ఎదిరించలేకపోయావ్.. అలాంటి కామెంట్లు చేసినా సరే లైట్ ఎందుకు తీసుకున్నావ్ కల్యాణ్.. ఎందుకు నోరుమూసుకొని కూర్చున్నావ్ అంటూ సరైన పాయింట్లే పట్టింది. వాటికి కల్యాణ్ సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. మరోవైపు తనూజను కూడా శ్రీజ గట్టిగానే టార్గెట్ చేసింది. ఇక్కడికి ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. ఇంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీ గురించి తప్పుగా మాట్లాడారు. రెండుడు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ ఎవరైతే కామెంట్ చేశారో అదే పర్సన్తో మీరు తిరుగుతున్నారు. మీరు ఆ పర్సన్ దగ్గరికే వెళ్లి రాజు రాజు అంటూ బాండింగ్ పెంచుకున్నారు. ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదని శ్రీజ పేర్కొంది. ఇలా కల్యాణ్, తనూజల ఇమేజ్ను తగ్గించాలనే పక్కా ప్లాన్తో ఇరికించేసింది. తన రీ ఎంట్రీ ఆట బలంగా ఉండాలంటే ఇలాంటి స్ట్రాటజీ వేయడంలో తప్పులేదు. -
హన్సిక ట్రిప్.. ఎవరితో తెలుసా..?
దక్షణాదిన ఒకప్పుడు క్రేజీ కథానాయకిగా వెలిగిన నటి హన్సిక. తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో 50 చిత్రాలకు పైగా నటించిన ఈ ముంబయి భామ ఆ మధ్య సోహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఇప్పటి వరకూ ఏ ఒక్క కొత్త చిత్రంలోనూ నటించలేదు. అయినప్పటికీ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల భర్తతో వివాదాలు అంటూ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దానికి బలం చేకూర్చే విధంగా నటి హన్సిక ఇటీవల దీపావళి పండగను ఒంటరిగానే జరుపుకోవడం, వివాహం అయిన రెండేళ్లలోనే భర్తను విడిచి తల్లితోనే ఉంటున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంపై హన్సిక ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. కాగా తాజాగా ఈ అమ్మడు రాజస్థాన్లోని రంతంబోర్ జాతీయ పార్క్ను తిలకించడానికి వెళ్లారు. అయితే ఆమె ఎవరితో కలిసి వెళ్లారో తెలుసా అమ్మ, సోదరుడితో కలిసి ఆ పార్క్కు వెళ్లారు. అక్కడ పులి, కుందేలు, ఎలుగుబంటులతో ఫొటోలు దిగారు. వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ విషయం అదికాదు. ఆ పార్క్కు హన్సిక తన తల్లి, సోదరుడితో కలిసి వెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం ఈసారి కూడా భర్త ఆమెతో లేకపోవడమే. దీంతో హన్సిక, సోహైల్ కతూరియా మధ్య వివేధాలు అనే ప్రచారం నిజమేనని అర్థమవుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా హన్సిక తన సోదరుడి భార్యను గృహ హింసకు గురి చేసిందే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ టాప్ హీరోయిన్ ఇలాంటి వివాదాలకు తావు ఇవ్వడంతో హన్సిక పేరు వార్తల్లో నానుతోంది. అయితే ఇలాంటివన్నీ లెక్క చేయని ఈ అమ్మడు విహార యాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) -
మహేశ్బాబు స్వాగతం చెప్పడం ఆనందం: శిల్పా శిరోద్కర్
‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘జటాధర’. ఇందులో స్టన్నింగ్ విజువల్స్, అద్భుతమైన సంగీతం, బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అని నటి శిల్పా శిరోద్కర్ చెప్పారు. సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా శిల్పా శిరోద్కర్ పంచుకున్న విశేషాలు...⇒ తెలుగులో నేను నటించిన తొలి చిత్రం ‘బ్రహ్మ’ (1992). ఆ తర్వాత తెలుగు సినిమా చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత ‘జటాధర’ చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇందులో శోభ అనే ప్రాధాన్యం ఉన్నపాత్ర చేశాను. తనకి డబ్బంటే అత్యాశ. ఎలాగైనా సరే అనుకున్నది చేరుకోవాలి అనుకునేపాత్ర. ఈ క్యారెక్టర్ చేయడం సవాల్గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటిపాత్ర నేనెప్పుడూ చేయలేదు. అయితే మా డైరెక్టర్స్ వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ క్లియర్ విజన్, సపోర్ట్తో ఈపాత్రని చేయగలిగా.⇒ మహేశ్బాబుగారు మా ‘జటాధర’ ట్రైలర్ లాంచ్ చేయడం, ట్రైలర్ బాగుందని ఆయన కితాబివ్వడంతోపాటు టాలీవుడ్కి నాకు స్వాగతం చెప్పడం సంతోషాన్నిచ్చింది. నమ్రత శిరోద్కర్ (శిల్ప సోదరి)కి కూడా ట్రైలర్, నాపాత్ర నచ్చాయి. సుధీర్బాబుగారు మాకు బంధువే అయినప్పటికీ సెట్లో మేం కేవలం ఆర్టిస్టులం మాత్రమే. సుధీర్గారితో కలిసి పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. సోనాక్షీ సిన్హా చేసిన ధన పిశాచిపాత్ర చాలా బాగుంటుంది. నిర్మాతలు రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు.⇒ చిత్ర పరిశ్రమలో తెలుగు, హిందీ వంటి సరిహద్దులు ఇప్పుడు లేవు. ప్రస్తుతం తెలుగు సినిమా బెస్ట్ ఫేజ్లో ఉంది. కంటెంట్ పరంగా, టెక్నికల్గా అడ్వాన్స్ అయ్యాం. ‘జటాధర’ సినిమా కోసం తెలుగు, హిందీ... ఇలా అన్ని చోట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబరు 7న ప్రేక్షకులు అద్భుతమైన సినిమాని చూడబోతున్నారు. నాకు రొమాంటిక్ కామెడీపాత్రలంటే ఇష్టం. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణం పట్ల హ్యాపీగా ఉన్నాను. మంచిపాత్రలు, సినిమాలు చేసి, ప్రేక్షకులను అలరించాలన్నదే నా కల. ఇకపై తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తాను. -
బంగారం ఆన్ సెట్
‘‘సన్నిహితులు, స్నేహితుల ప్రేమ, ఆశీర్వాదాల నడుమ ‘మా ఇంటి బంగారం’ ముహూర్తంతో మా ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ స్పెషల్ మూవీ ఆరంభించిన సందర్భంగా అందరి ప్రేమ, సహకారం మాకు కావాలి’’ అని సమంత పేర్కొన్నారు. ఆమె లీడ్ రోల్లో ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించి కొన్ని నెలలైంది. ఫైనల్గా సోమవారం ఈ చిత్రం సెట్స్కి వెళ్లింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ‘శుభం’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సమంత నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధానపాత్రల్లో, గౌతమి, మంజుషా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. ‘ఓ బేబి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ యాక్షన్ మూవీకి సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఓం ప్రకాశ్. -
రైల్వే కాలనీ డేట్ ఫిక్స్
‘అల్లరి’ నరేశ్ హీరోగా రూపొందిన ‘12ఎ రైల్వే కాలనీ’ థియేటర్లో కనిపించే తేదీ ఖరారైపోయింది. నాని కాసరగడ్డని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘పొలిమేర, పొలిమేర 2’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచుకున్న డా. అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రా నికి షో రన్నర్గా వ్యవహరించి, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించారు.ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసిన విషయాన్ని ప్రకటించి, స్పెషల్ వీడియోను, ΄పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘నవంబరు 21న ప్రపంచవ్యాప్తంగా మా ‘12ఎ రైల్వే కాలనీ’ని విడుదల చేయనున్నాం. ఆ వారంలో వేరే పెద్ద రిలీజులు లేకపోవడం బాక్సాఫీస్ వద్ద మా సినిమాకి అనుకూలంగా ఉంటుంది. ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్ చేసినపాత్రలో పలు కోణాలున్నాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ‘పొలిమేర’ సిరీస్లో ఆకట్టుకున్న డా. కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. కెమెరా: కుశేంద్ర రమేశ్ రెడ్డి. ’ -
అందమైన ఫిగరు నువ్వా...
నాగశౌర్య, విధి జోడీగా నటించిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేశ్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమా నిర్మించారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘అందమైన ఫిగరు నువ్వా...’ అంటూ సాగే వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటని శ్రీధర్ సేన, ప్రియా జెర్సన్పాడారు. ‘‘కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాగశౌర్య. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైనపాటలు సూపర్ హిట్ అయ్యాయి. టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా రిలీజైన ‘అందమైన ఫిగరు నువ్వా...’పాటలో నాగశౌర్య, విధి మధ్య కెమిస్ట్రీ అదిరి΄ోతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ.. గ్లింప్స్ రిలీజ్
లక్ష్మణ్ టేకుముడి , రాధికా జోషి హీరో, హీరోయిన్లుగా వస్తోన్న తాజా చిత్రం 'ప్రేమ లేదని'. ఈ మూవీకి జీడీ నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జీడీఆర్ మోషన్ పిక్చర్ బ్యానర్లో శ్రీని ఇన్ఫ్రా నిర్మిస్తున్నారు. హార్ట్ ఫుల్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.తాజాగా ఈ మూవీ గ్లింప్స్ మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వైజాగ్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని రూపొందించినట్లు గ్లింప్స్లో సీన్స్ చూస్తేనే అర్థమవుతోంది. మందు, సిగరెట్ కాదు.. అబ్బాయిలకు హానికరం అమ్మాయిలు అనే చివర్లో వచ్చే డైలాగ్ యూత్కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ రోజుల్లో ట్రెండ్కు తగినట్లుగానే ప్రేమలేదని మూవీని ప్రేక్షకుల ముందుకొస్తున్నట్లు గ్లింప్స్లో చూపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ సుహాస్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో సురేశ్ గురు, గాయత్రి కీలక పాత్రల్లో నటించారు. -
స్టార్ హీరో తనయుడి మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ రిలీజ్
మలయాళ స్టార్ మోహన్ లాల్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రణవ్. హృదయం మూవీతో భాషలకు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. తాజాగా డియాస్ ఇరాయ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ డియాస్ ఇరాయ్ని విడుదల చేస్తోంది.మలయాళ సినిమాలకు టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ మూవీ కావడంతో తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూత కాలం', మమ్ముట్టి 'భ్రమ యుగం' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు.ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. ఈ సినిమా మలయాళ, తమిళ భాషల్లో అక్టోబర్ 31న విడుదల కానుంది. తెలుగు వర్షన్ను నవంబర్ తొలి వారంలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా.. గతంలో రిలీజైన ప్రేమలు', '2018', 'మంజుమ్మెల్ బాయ్స్', 'కొత్త లోక' లాంటి మలయాళ సినిమాలు తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
మాస్ మహారాజా మాస్ జాతర.. యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది
మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ మాస్ జాతర. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజైన సూపర్ డూపర్ ఆనే సాంగ్ను రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.రిలీజ్ తేదీ మరో మూడు రోజులే ఉండడంతో ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే మాస్ జాతర ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్రలో మాస్ మహారాజా కనిపించనున్నారు. ఈ మూవీలో రవితేజకు ప్రతినాయకుని పాత్రలో నవీన చంద్ర నటించారు. ఈ భారీ యాక్షన్ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే రవితేజ మరోసారి మాస్ హీరోగా ఆడియన్స్ను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రైల్వే ఎస్సైగా మాస్ మహారాజా సరికొత్తగా కనిపించనున్నారు. ట్రైలర్ రైల్వేస్టేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఫైట్స్, విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్ ఉంటాయి.. నేను వచ్చాక ఒకటే జోన్.. వార్ జోన్ అనే డైలాగ్ మాస్ ఆడియన్స్ను అలరిస్తోంది. Ikkada antha okkate zone… adhi MASS MAHARAJ WAR ZONE! 👊⚔️🔥#MassJatharaTrailer Out Now – https://t.co/EsvmFE7ie0#MassJathara is set to deliver a full-on feast of action, fun & entertainment 💣This Oct 31st, theaters turn into a celebration! 🔥🔥#MassJatharaOnOct31st… pic.twitter.com/Ftd4xhug1r— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2025 -
శర్వా వరస సినిమాలు.. కానీ హిట్ కొట్టెదెప్పుడు?
ఒకప్పుడు అంటే ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీసినా సరే ఎలాగోలా హీరోల బండి నడిచేది. కానీ గత కొన్నాళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల్ని చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి దారుణంగా తయారైంది. దానికి తోడు పలువురు హీరోల మూవీస్ కూడా పెద్దగా వర్కౌట్ కావట్లేదు. అలాంటి వాళ్లలో శర్వానంద్ ఒకడు. ఇంతకీ ప్రస్తుతం ఈ హీరో ఏం చేస్తున్నాడు? కొత్త మూవీస్ సంగతేంటి?గమ్యం, ప్రస్థానం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. సోలో హీరోగా నిలదొక్కుకోవడానికి బాగానే కష్టపడ్డాడు. కానీ అదృష్టం త్వరగా కలిసి రాలేదు. మంచి నటుడే అని ప్రూవ్ చేసుకున్నప్పటికీ 2014లో 'రన్ రాజా రన్' హిట్ కొట్టి ట్రాక్లోకి వచ్చాడు. అలా 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత చేసిన రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం.. ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. చివరగా 2022లో 'ఒకే ఒక జీవితం' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)యంగ్ హీరోలు అంటే ఎలా ఉండాలి? పెద్ద హీరోల్లా కాకుండా ఏడాది కనీసం ఒకటి రెండు సినిమాలైనా చేస్తూ ప్రేక్షకుల దృష్టిలో ఉండాలి. లేదంటే ఆడియెన్స్ వీళ్లని మర్చిపోయే అవకాశముంది. అలాంటి శర్వానంద్ నుంచి గత మూడేళ్లలో ఒక్కటే సినిమా వచ్చింది. అది గతేడాది రిలీజైన 'మనమే'. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ ఏడాది ఏవైనా కొత్త చిత్రాలు తీసుకొస్తాడా అని చూస్తే ప్రస్తుతానికైతే ఆ సూచనలు కనిపించట్లేదు.2026లో శర్వానంద్ నుంచి ఏకంగా మూడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం సంక్రాంతిని టార్గెట్ చేశారు. కొన్ని రోజుల క్రితమే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ పండకు చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల మూవీస్ ఉన్నాయి. మరి వాళ్లతో పోటీపడి శర్వా బరిలోకి దిగుతాడా అనేది చూడాలి? మరోవైపు బైకర్ అనే స్పోర్ట్స్ డ్రామా మూవీ, భోగీ అనే యాక్షన్ మూవీ కూడా ఈ హీరో చేస్తున్నాడు. వీటితో హిట్ కొట్టి కమ్ బ్యాక్ అయితే సరేసరి. లేదంటే మాత్రం ప్రస్తుత జనరేషన్లో వెనకబడిపోయే ప్రమాదముంది? మరి 2026 అయినా శర్వాకు కలిసొస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
సమంత కొత్త సినిమా.. పూజ కార్యక్రమంలో రాజ్ నిడిమోరు!
టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) ఇటీవల దీపావళి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఈ వేడుకల్లో సందడి చేసింది. అఫీషియల్గా బయటికి చెప్పకపోయినా వీరిద్దరి రిలేషన్పై గత కొన్ని నెలలుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా వీరిద్దరు నోరు విప్పలేదు. ఇదంతా పక్కనపెడితే సామ్ తెలుగులో మరో సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె మరోసారి జతకట్టింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ దసరా సందర్భంగా సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించారు. ముహుర్తం షాట్తో ఈ మూవీ షూటింగ్ను ప్రారంభించారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా.. ఓ బేబీ మూవీ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో సమంత చేస్తోన్న రెండో చిత్రం కావడం విశేషం. ఈ మూవీని తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సామ్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ని స్థాపించిన సామ్.. శుభం అనే తొలి సినిమా నిర్మించింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారంతో పాటు ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్లో నటిస్తోంది. Started our journey with the Muhurtham of #MaaIntiBangaram, surrounded by love & blessings. ✨We can’t wait to share with you what we’re creating… need all your love and support as we begin this special film. ❤️#MIB #Samantha #TralalaMovingPictures @TralalaPictures… pic.twitter.com/PwICPNsP8R— Samantha (@Samanthaprabhu2) October 27, 2025 -
మొకాళ్లపై తిరుమల కొండపైకి టాలీవుడ్ నటి కూతురు.. వీడియో వైరల్!
టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లోనే ఉంటోంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఎక్కడికెళ్లినా ఫోటోలను షేర్ చేస్తోంది.ఇటీవల సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా తిరుమలను సందర్శించిన ఫోటోలు, వీడియోలను సుప్రీత మరోసారి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో తన తల్లితో కలిసి మొకాళ్లపై తిరుమల కొండను ఎక్కుతున్న వీడియోను కూడా పంచుకుంది. ఇది చూసిన అభిమానులు తల్లీకూతుళ్ల దైవభక్తికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
రుక్మిణి 'కాంతార 1' జ్ఞాపకాలు.. 'లిటిల్ హార్ట్స్' శివానీ ఇలా
'కాంతార 1' షూటింగ్ జ్ఞాపకాలతో రుక్మిణి వసంత్'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ గ్లామరస్ పోజులువర్కౌట్ చేస్తూ పెట్ డాగ్తో కీర్తి సురేశ్ సరదాజిమ్ ఫొటో పోస్ట్ చేసిన ముద్దుగుమ్మ సమంతఅందాల హరివిల్లులా జాన్వీ కపూర్ స్టిల్స్జిమ్ వీడియో పోస్ట్ చేసిన నభా నటేశ్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Namrata Purohit (@namratapurohit) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
'సంతాన ప్రాప్తిరస్తు' నుంచి 'తెలుసా నీ కోసమే' సాంగ్ లాంచ్
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకుడు. నవంబర్ 14న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సోమవారం సినిమాలోని ఓ పాట లాంచ్ చేశారు. తెలుసా నీ కోసమే అంటూ సాగే లిరికల్ గీతాన్ని అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్ సురేష్ బాబు రిలీజ్ చేశారు. 'ఆయ్', 'సేవ్ ది టైగర్స్' లాంటి సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ.. ఈ గీతాన్ని కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ మనసుకు హత్తుకునే పాడారు. -
'బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాడనేది కాదు.. రాజమౌళి ఆసక్తికర కామెంట్స్'
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి తన మ్యాజిక్తో మరోసారి ప్రేక్షకుల ముందుకుకొస్తున్నారు. బాహుబలి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి.. మరోసారి వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ రెండు చిత్రాలను ఓకేసారి వీక్షించేలా బాహుబలి ది ఎపిక్(Baahubali : The Epic) పేరుతో రానున్నారు. ఈ మూవీని అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమౌళితో హీరోలు ప్రభాస్, రానా కలిసి సరదాగా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తాజాగా ఈ ముగ్గురితో స్పెషల్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బాహుబలి చిత్రాల షూటింగ్ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.ఈ లేటేస్ట్ ప్రోమోలో ఈ పదేళ్లలో మీ అనుభవం ఏంటి? అని రాజమౌళిని ప్రభాస్ అడిగారు. దీనికి బదులిస్తూ.. బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాడనేది కాదు.. అతన్ని చంపేందుకు కట్టప్ప సిద్ధపడటమే నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిందన్నాడు. అంతేకాకుండా ఈ సినిమాల్లోని సీన్స్ను గుర్తు చేసుకుంటూ చాలా సరదాగా కనిపించారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి. The reunion we've all been waiting for ❤️https://t.co/SdR0HOUXQc @ssrajamouli, #Prabhas and @RanaDaggubati come together to talk about #BaahubaliTheEpic and much beyond! Out very soon! Stay tuned. 😉#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/57ueklNXJa— Baahubali (@BaahubaliMovie) October 27, 2025 -
ఒక్క సినిమాతో తెలుగు, తమిళంలో విలన్గా క్రేజ్.. గుర్తుపట్టారా?
భారతీయ సినిమాల్లో పరాయి దేశ నటీనటులు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. అయితే వాళ్లలో క్రేజ్ తెచ్చుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో ఇతడు ఒకడు. చేసింది ఒక్కటే సౌత్ మూవీ అయినప్పటికీ. తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఇతడి ఫొటోలు వైరల్ అయ్యేసరికి సినీ ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు. ఇతడెవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: తెలుగు ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గకి తమిళంలో హీరోయిన్ ఛాన్స్)పైన ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు జానీ ట్రింగ్యుయెన్. ఇలా చెబితే మీకు గుర్తురాకపోవచ్చు. డాంగ్లీ అని చెబితే ఇచ్చే కనిపెట్టేస్తారు. సూర్య హీరోగా చేసిన '7th సెన్స్' చిత్రంలో విలన్ ఇతడే. వియత్నాంలో పుట్టిన ఇతడు.. సొంత భాషతో పాటు హాలీవుడ్లోనూ పలు చిత్రాలు చేశాడు. మార్షల్ ఆర్ట్స్ గురువుగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 2017 వరకు పలు భాషల్లో నటించాడు. తర్వాత మాత్రం యాక్టింగ్ పక్కనబెట్టేశాడు.రీసెంట్గా సోషల్ మీడియాలో ఇతడు మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యేసరికి.. డాంగ్లీ ఇంతలా మారిపోయాడేంటి అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. సూర్య సినిమా వచ్చి దాదాపు 14 ఏళ్లు అయిపోయింది. వయసు కూడా 50 ఏళ్లు దాటేసింది. దీంతో కాస్త వృద్ధాప్య ఛాయలు కూడా డాంగ్లీ ముఖంలో కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక్క సినిమాతో అటు తెలుగు, ఇటు తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) View this post on Instagram A post shared by trippy[FX] (@trippy__reels) -
'అలాంటి సీన్స్కు నో.. అయినా కూడా'.. హీరోయిన్ ధన్య బాలకృష్ణన్
తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ధన్య బాలకృష్ణన్ (Dhanya Balakrishnan). హీరోయిన్గా మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు డిఫరెంట్ రోల్స్తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం ధన్య హీరోయిన్గా కృష్ణ లీల అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవన్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన ధన్య బాలకృష్ణన్ తన కెరీర్, అవకాశాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ ప్రారంభంలో చాలా ఫీలయ్యేదాన్ని ధన్య బాలకృష్ణన్ తెలిపింది. నేను తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని పేర్కొంది. గ్లామరస్ రోల్స్కు నేను పెట్టుకున్న నిబంధనలే కారణమని తెలిపింది. ఇంటిమేట్ సీన్స్ చేయాల్సిన రోల్స్ ఉంటే కూడా నో చెప్పేదాన్ని అని వెల్లడించింది. ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానంటే చాలా గర్వంగా ఉందన్నారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ నాకు హీరోయిన్ ఛాన్సులు వచ్చాయంటే నా సక్సెస్ కారణమన్నారు. నా ఫ్యామిలీని ఒప్పించి మరి ఇండస్ట్రీలోకి వచ్చానని ధన్య బాలకృష్ణన్ వెల్లడించారు. కాగా.. ధన్య బాలకృష్ణన్ తాజాగా నటించిన చిత్రం కృష్ణ లీల. దేవన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తిరిగొచ్చిన కాలం.. అనేది ఈ మూవీకి ట్యాగ్లైన్. ఈ సినిమాను మహాసేన్ విజువల్స్ బ్యానర్లో జ్యోత్స్న నిర్మిస్తున్నారు. -
ధన్య బాలకృష్ణన్ కొత్త సినిమా.. ట్రైలర్ చూశారా?
దేవన్, ధన్య బాలకృష్ణన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం కృష్ణ లీలా . దేవన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తిరిగొచ్చిన కాలం.. అనేది ఈ మూవీకి ట్యాగ్లైన్. ఈ సినిమాను మహాసేన్ విజువల్స్ బ్యానర్లో జ్యోత్స్న నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్.కృష్ణలీల ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఈ ప్రేమకథా చిత్రానికి మైథలాజికల్ టచ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. తన ప్రేమ కోసం హీరో చేసిన ప్రయత్నాలు చూస్తే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి కోర్టుకు వచ్చాడా? ఎవరీ క్రేజీ మ్యాన్ అనే డైలాగ్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో వినోద్ కుమార్, పృధ్వి (పెళ్లి), రవి కాలే , తులసి, 7ఆర్ట్ సరయు , ఆనంద్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. -
'మిరాకిల్ మ్యాన్' జి.డి.నాయుడు.. మూడో తరగతితోనే ఎన్నో అద్భుతాలు
ఆర్. మాధవన్(R. Madhavan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘జి.డి.ఎన్’ అనే టైటిల్ ఖరారైంది. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మేన్, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూరు’ వంటి పేర్లను గడించిన గోపాల స్వామి దొరైస్వామి నాయుడు(Gopala Swamy Doraiswamy Naidu) (జీడీఎన్) జీవితం ఆధారంగా ‘జి.డి.ఎన్’(GDN) మూవీ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ దేశానికి జి.డి.నాయుడు చేసిన సేవా ఎలాంటిదో తెలుసుకుందాం.1983లో కోయంబత్తూర్కు చెందిన ఒక వ్యవసాయ కుటుంబంలో జి.డి.నాయుడు జన్మించారు. ఆయనొక బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రయోగాలపై ఆసక్తితో పలు రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ రంగంలో ఒక విప్లవం సృష్టించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటార్ను రూపొందించి ఎంతో కీర్తి సంపాదించారు. దీంతో ఆయన్ను మిరాకిల్ మ్యాన్గా ఈ దేశం గుర్తించింది. జి.డి.నాయుడు వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరంగా ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి.. ఆపై ఆయన సాధించిన విజయాల ఎలాంటివి అనేది ఈ సినిమాలో చూపించనున్నారు.చదివింది మూడో తరగతి మాత్రమేజి. డి. నాయుడు మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ, భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ మోటారును తయారు చేశారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరుగానే కాకుండా నిరంతర అన్వేషకుడిగా గుర్తింపు పొందారు. ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్టైల్, ఫొటోగ్రఫీ వంటి సెక్టార్స్లో ఎన్నో పరికరాల ఆవిష్కరణలు చేశారు. దక్షిణ భారత్లో పారిశ్రామిక విప్లవానికి కారణభూతుడై భారతదేశపు ఎడిసన్ అని పేరు తెచ్చుకున్నారు. 1920లో ఒక చిన్న మోటారు వాహనాన్ని కొనుగోలు చేసి పొల్లాచి, పళనిల మధ్య నడిపారు. తర్వాత వెంటనే యునైటెడ్ మోటార్ సర్వీస్ (UMS) సంస్థను స్థాపించి దాని ద్వారా ద్వారా 1937లో భారత దేశపు మొదటి మోటారు వాహనాన్ని తయారు చేశారు.జి. డి. నాయుడు తనే సొంతంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక కెమెరాను తయారు చేశారు. ఆ కెమెరాతో అడాల్ఫ్ హిట్లర్, లండన్లో జార్జి రాజు అంత్యక్రియలు (1936), గాంధీ, నెహ్రు, సుభాష్ బోస్ వంటి గొప్ప వ్యక్తుల ఫొటోలు తీశారు. ఆయన తయారు చేసిన పరికరాలు, పనిముట్లు, కోయంబత్తూరులోని 'జి.డి. నాయుడు ప్రదర్శనశాల'లో ఇప్పటికీ ఉన్నాయి. తొలి ఇంజనీరింగ్ కళాశాల1944లో పారిశ్రామిక రంగానికి స్వస్తి చెప్పి నాయుడు.. సంఘసేవ వైపు అడుగులు వేశారు. బడుగు ప్రజల సేవకు అంకితమయ్యారు. పేద విద్యార్ఠులకు పలు ఉపకారవేతనాలు, సంక్షేమ కార్యక్రమాలు, కళాశాలకు దానధర్మాలు చేశారు. 1945లో కోయంబత్తూరులో తొలి ఇంజనీరింగ్ కళాశాలకు నాంది పలికారు. ఈ క్రమంలోనే ఆర్థర్ హోప్ పాలిటెక్నిక్, ఆర్థర్ హోప్ ఇంజినీరింగ్ కళాశాలలు స్థాపించారు. 1974లో అనారోగ్యంతో ఆయన మరణించారు.ఈ మధ్యకాలంలో మాధవన్ నటిస్తున్న రెండో బయోపిక్ ఇది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా (2022)లో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేసి మెప్పించారు మాధవన్. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో బయోపిక్లో మాధవన్ నటిస్తుండటం విశేషం. వెండితెరపై మిరాకిల్ మేన్గా మాధవన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి. -
మీసాల పిల్ల.. 13 రోజులుగా ట్రెండింగ్.. ఏకంగా ఎన్ని వ్యూస్ అంటే?
హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది పొంగల్కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్గారు మూవీతో బ్లాక్బస్టర్ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద రామచిలకవే.. పాట ఎంత వైరలయిందో ఇప్పుడు చిరంజీవి మూవీ (Mana Shankaravaraprasad Garu Movie)లోని మీసాల పిల్ల కూడా అంతే వైరలవుతోంది.36 మిలియన్ల వ్యూస్(Meesaala Pilla Song) యూట్యూబ్లో టాప్లో దూసుకుపోతోంది. 13 రోజులుగా ఫస్ట్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు 36 మిలియన్ల వ్యూస్ అందుకుంది. ఈ సాంగ్లో చిరు వేసే స్టెప్పులు సింపుల్గా కనిపిస్తూనే చాలా స్టైలిష్గా ఉంటాయి. లిరికల్ సాంగ్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తే ఇక వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో!సినిమాభీమ్స్ సంగీతం అందించిన మీసాల పిల్ల పాటను ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాశాడు. పోలకి మాస్టర్ కొరియోగ్రాఫీ చేశాడు. మన శంకరవరప్రసాద్గారు సినిమా విషయానికి వస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. The unanimous chartbuster continues to be the audience’s favourite song of the season ❤️🔥#MeesaalaPilla Trending #1 on YouTube for 13 days with 36MILLION + views 🔥🔥🔥-- https://t.co/4dgILT40kG #ManaShankaraVaraPrasadGaru Sankranthi 2026 RELEASE Megastar @KChiruTweets… pic.twitter.com/8sbxhs7BrY— Shine Screens (@Shine_Screens) October 27, 2025 చదవండి: కల్యాణ్ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్లో ఎవరున్నారంటే? -
కల్యాణ్ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్లో ఎవరున్నారంటే?
గత సీజన్లో జరిగిన నామినేషన్స్ ఇప్పుడు తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో (Bigg Boss Telugu 9) రిపీట్ కాబోతున్నాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్లో ఎంట్రీ ఇచ్చి నామినేట్ చేయనున్నారు. అయితే కాస్త డిఫరెంట్గా ఈ ప్రక్రియ జరగనుంది. కత్తితో పొడిచి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎలిమినేట్ అయినవాళ్లు ఒక కత్తితో వారే స్వయంగా నామినేట్ చేస్తారు. వాళ్లు ఎవరికైతే మరో కత్తిస్తారో.. వారు ఇంకొకర్ని నామినేట్ చేయాలన్నమాట!సంజనాకు క్లాస్ పీకిన ప్రియఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో మనీష్, శ్రీజ, ప్రియ, ఫ్లోరా.. హౌస్లో అడుగుపెట్టారు. బాడీ షేమింగ్ చేసిన సంజనాను ప్రియ నామినేట్ చేస్తూ ఆమెకు కత్తి గుచ్చింది. క్లాస్ అనే పదం వాడటం కూడా తప్పేనని క్లాస్ పీకింది. మనీష్.. కల్యాణ్కు కత్తి గుచ్చాడు. సర్ప్రైజ్ ఏంటంటే శ్రీజ కూడా కల్యాణ్నే నామినేట్ చేసిందట! ఇక ఇమ్మాన్యుయేల్.. తనూజను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.నామినేషన్స్లో ఎనిమిదిమందిసోషల్ మీడియాలో వైరలవుతున్న లీక్స్ ప్రకారం ఎనిమిదోవారం మాధురి, తనూజ, గౌరవ్, రీతూ, రాము, సంజనా, డిమాన్ పవన్, కల్యాణ్ నామినేషన్స్లో ఉన్నారు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. ఎలిమినేట్ అయినవారిలో కొద్దిమంది బిగ్బాస్ ట్రోఫీ కోసం మీతో పోటీపడి, మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంటూ రీఎంట్రీ గురించి హింట్ ఇచ్చాడు బిగ్బాస్. అందులో శ్రీజ పేరు ముందునుంచి వినిపిస్తున్నదే! మరి తనతో పాటు ఇంకెవరైనా హౌస్లో అడుగుపెడతారా? చూడాలి! చదవండి: అక్కడ ఫోకస్ చేయడం వల్లే రమ్య ఎలిమినేట్.. సంపాదన ఎంతంటే? -
రవితేజ 'మాస్ జాతర' కోసం వస్తున్న సూర్య
'మాస్ జాతర'(Mass Jathara) కోసం కోలీవుడ్ నటుడు 'సూర్య' వచ్చేస్తున్నారు. ధమాకా లాంటి భారీ విజయం తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జోడీగా నటిస్తున్న చిత్రం మాస్ జాతర.. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్ర చేస్తున్నారు రవితేజ. విలన్గా నవీన్ చంద్ర కనిపిస్తారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ నెల28న ప్రీ-రిలీజ్ ఈవెంట్ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.రవితేజ మాస్ జాతర ప్రీ- రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా నటుడు సూర్య వస్తున్నట్లు ఒక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. అక్టోబర్ 28న సాయంత్రం 5:30గంటలకు హైదరాబాద్లోని జేఆర్సీ (JRC) వేదికగా ఈ కార్యక్రమం జరగనుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సినిమా రన్టైమ్ 160 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.సూర్య 46వ సినిమాను కూడా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. దీంతో నాగవంశీతో సూర్యకు అనుబంధం ఏర్పడింది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్నంలో మమితా బైజు, రవీనా టాండన్, రాధిక శరత్కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.The celebration just got BIGGER! 💥🔥The one and only @Suriya_offl garu to grace the grand pre-release event of #MassJathara 😍📍TOMORROW from 5:30 PM Onwards at JRC CONVENTIONS, HYD!In cinemas worldwide #MassJatharaOnOct31st Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14… pic.twitter.com/IUkt8NgMbM— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2025 -
అక్కడ ఫోకస్ చేయడం వల్లే రమ్య ఎలిమినేట్.. సంపాదన ఎంతంటే?
పచ్చళ్ల వ్యాపారంతో అక్క అలేఖ్య ఫేమస్ అయితే.. ఫిట్నెస్ వీడియోలతో చెల్లి రమ్య పాపులర్ అయింది. పైగా వర్కవుట్స్ అంటూ గ్లామర్ వీడియోలు షేర్ చేయడంతో ఓ పక్క తిడుతూనే ఆమెను ఫాలో అయ్యారు చాలామంది. సోషల్ మీడియాలో విపరీతైమన నెగిటివిటీ తెచ్చుకున్న రమ్యకు బిగ్బాస్ ఛాన్స్ వచ్చింది. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా.. వచ్చేస్తున్నా అంటూ వైల్డ్కార్డ్గా ఎంట్రీ ఇచ్చింది. కానీ రెండువారాల్లోనే ఎలిమినేట్ అయింది. అందుకు గల కారణాలేంటో చూసేద్దాం..నో ట్రాక్స్బిగ్బాస్ హౌస్లో బంధాలు పెట్టుకోవడానికి రాలేదంది రమ్య. అన్నట్లుగానే ఫేక్ రిలేషన్స్, లవ్ ట్రాకుల జోలికి వెళ్లలేదు. కానీ ఇది ఒకరకంగా ఆమెకు మైనసే అయింది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్లో ఉన్న సంజనా సేవ్ అవడానికి కారణం.. ఇమ్మాన్యుయేల్తో తనకున్న బంధమే! ఇమ్మూ నామినేషన్స్లో లేడు కాబట్టి అతడి ఓట్లన్నీ ఆమెకు వేశారు. అలా సంజనా సేవ్ అయింది.అదే ముఖ్య కారణంరమ్య (Ramya Moksha) ఎలిమినేషన్కు ఆమె స్వయంకృతాపరాధం ముఖ్య కారణం. తను వచ్చీరావడంతో కుంభస్థలాన్ని కొట్టాలనుకుంది. తనూజ, కల్యాణ్లపై నోటికొచ్చినట్లు మాట్లాడింది. తనపై కల్యాణ్ చెయ్యేస్తే కిందపడేసి తొక్కుతానంది. తనూజను స్ట్రాంగ్ పాయింట్స్తో నామినేట్ చేసింది. కానీ చెప్పే విధానం సరిగా లేదు, హద్దులు దాటి మాట్లాడటంతో అది తనూజకే ప్లస్ అయింది. పైగా ఓసారి.. పక్కకెళ్లి ఆడుకోపో అని తనూజకు టిష్యూ పేపర్పై రాసివ్వడం చూసేవారికి కాస్త ఓవర్గా అనిపించింది.అది మర్చిపోతే ఎలా?తనూజ (Thanuja Puttaswamy) ఎలిమినేషనే టార్గెట్గా పెట్టుకుంది. కానీ, తనూజను కిందకు లాగాలంటే ముందు తాను హౌస్లో ఉండాలన్న విషయం మర్చిపోయింది. ఇప్పటికే బయటున్న నెగెటివిటీ చాలదన్నట్లు తనూజ- కల్యాణ్లపై నోరు జారడం.. దాన్ని నాగార్జున తప్పుపట్టినా మరేం పర్లేదన్నట్లుగా ప్రవర్తించడం, హైపర్ ఆది వచ్చినప్పుడు కూడా కాస్త యాటిట్యూడ్ చూపించడంతో విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. గేమ్పై కన్నా తనూజపైనే ఎక్కువ ఫోకస్ చేసి.. ఆమెను ఢీ కొట్టాలని చూసి బొక్కబోర్లాపడింది. రెమ్యునరేషన్ఇలా పదేపదే తనూజను టార్గెట్ చేయడం ఆమె అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఇంకేముంది, నామినేషన్స్లో ఎవరు బలహీనంగా ఉంటారో వారికి ఓట్లు గుద్ది.. రమ్యను డేంజర్ జోన్లో పడేశారు. నామినేషన్స్లో తప్ప గేమ్లో పెద్దగా కనిపించలేదు. దీంతో రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. ఆమెకు వారానికి రూ.1.50 -2 లక్షల మేర పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రెండువారాలకుగానూ దాదాపు రూ.4 లక్షల మేర రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.చదవండి: కల్యాణ్ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య -
ఓటీటీలో మెప్పిస్తున్న 'సన్ ఆఫ్ సర్దార్ 2'
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. సునీల్ హీరోగా రాజమౌళి తీసిన ‘మర్యాద రామన్న’ (2010) సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాని ‘సన్ ఆఫ్ సర్దార్’గా అజయ్ దేవగన్(Ajay Devgn) హీరోగా హిందీలో రీమేక్ చేశారు. అయితే ఇప్పటివరకు ‘మర్యాద రామన్న’కు సీక్వెల్ రాలేదు కానీ ‘సన్ ఆఫ్ సర్దార్’కు మాత్రం మళ్ళీ అజయ్ దేవగన్ హీరోగా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈసారి టైటిల్ మాత్రమే సీక్వెల్గా తీసుకున్నా కథను మాత్రం తమ పంథాలో తీసుకున్నారు మేకర్స్. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. దీనికి అజయ్ దేవగన్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. కథ దాదాపుగా స్కాట్ల్యాండ్లోనే జరుగుతుంది. ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తుందీ చిత్రం. ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ కథాంశానికొస్తే... జస్సీ సింగ్ రాండ్వా పెళ్లయినా పరిస్థితుల ప్రభావం వల్ల తన భార్య విదేశాలలో ఉంటుంది. జస్సీ మాత్రం తన తల్లితో భారత్లో ఉంటాడు. సినిమా ప్రారంభంలోనే జస్సీ భార్య డింపుల్ ఫోన్ చేసి, జస్సీకి వీసా అప్రూవ్ అయిందని, వెంటనే తను కూడా తన దగ్గరకు రావచ్చని చెబుతుంది. ఎంతో ఆనందంతో భార్యను కలవడానికి విదేశాలలో అడుగు పెట్టిన జస్సీతో విడాకులు కావాలని షాకిస్తుంది డింపుల్. ఖంగుతిన్న జస్సీ ఏం చేయాలో తోచని స్థితిలో ఫ్రెండ్ ఇంటికి వెళతాడు... అనుకోకుండా పాకిస్థాన్కి చెందిన రబియాని కలుస్తాడు జస్సీ. రబియాకి సాబా అనే కూతురు ఉంటుంది. భర్త వదిలేసి వెళ్ళిపోతాడు. రబియా కూతురు సాబా గ్యాంగ్స్టర్ రాజా సంధు కొడుకైన రాజాతో ప్రేమలో ఉంటుంది. రాజా సంధుకు భారత దేశమంటే ఎంత ప్రేమో అంతకు మించి పాకిస్థానీయులంటే ద్వేషం. అటువంటి అతని కొడుకు ఓ పాకిస్థానీ ప్రేమలో పడతాడు. జస్సీని తన భర్తగా ఉండమని చెప్పి తామిద్దరూ పంజాబీ దంపతులుగా నటించి, రాజా సంధుతో సంబంధం ఖాయం చేసుకోవాలని చూస్తుంటుంది రబియా. ఇదే సమయంలో రాజా సంధు ఓ పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు. ఆ ఫంక్షన్లో రబియా, జస్సీ తల్లిదండ్రులుగా సంబంధం ఖాయం చేసుకునే సమయంలో అటు రబియా అసలు భర్త రావడంతో పాటు ఇటు జస్సీ భార్య డింపుల్ కూడా తారసపడుతుంది. ఈ గందరగోళంలో రబియా తన కూతురు పెళ్ళి చేయగలుగుతుందా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా మంచి కామెడీ కాలక్షేపం. ఎందుకంటే ఇది కామెడీ ఆఫ్ సర్దార్ కాబట్టి. వర్త్ టు వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
కల్యాణ్ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య
జనాలకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నట్లే బిగ్బాస్కు కూడా ఎవరో ఒకరు నచ్చుతారు. వారికి హైప్ ఇవ్వడానికి, చేసిన తప్పులను కవర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆదివారం (అక్టోబర్ 26వ) ఎపిసోడ్ చూసిన అందరికీ ఈ విషయం మరోసారి అర్థమై ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది? రమ్య వెళ్లిపోయే ముందు ఏం చెప్పింది? అనేవి చూసేద్దాం..తప్పు చేసినా తనూజయే విన్నర్గోల్డెన్ బజర్ కోసం డిమాన్ పవన్, తనూజ, సుమన్, రీతూ పోటీపడ్డారు. ఈ గేమ్కు మాధురిని సంచాలకురాలిగా పెట్టారు. పజిల్ గేమ్ తనూజ పైపైనే పూర్తి చేసి, వెళ్లి బజర్ గెల్చుకుంది. నిజానికి ఆమె పజిల్ సరిగా అమర్చలేదు. అదే విషయాన్ని డిమాన్ పవన్ చెప్పాడు. తనూజ పజిల్ సరిగా పెట్టలేదని చెప్తుంటే.. సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అంటూ నాగార్జున డిక్లేర్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. తనూజకు ఫేవరిజం చేస్తున్నారని క్లియర్గా తెలిసిపోయింది.రమ్య ఎలిమినేట్ఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ పోగా చివరకు సంజనా, రమ్య (Ramya Moksha) మిగిలారు. వీళ్లిద్దరిలో రమ్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. రమ్య వెళ్లిపోతుంటే మాధురి.. ఆమెను పట్టుకుని ఏడ్చేసింది. తనపై ముద్దుల వర్షం కురిపించింది. ఇక స్టేజీపైకి వచ్చిన రమ్య.. ప్రతివారం నామినేషన్లో ఉంటానని ఫిక్సయి వచ్చాను, కానీ, ఇంత త్వరగా వెళ్తాననుకోలేదని కాస్త నిరాశచెందింది. చివరగా ఆమెకు నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్లో ఉన్న 13 మంది ఫోటోలు బోర్డ్పై ఉన్నాయి.. అందులో ఐదుగుర్ని చెత్తబుట్టలో వేయాలన్నాడు. కల్యాణ్ పరువు తీసిన రమ్యముందుగా కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫోటో చెత్తబుట్టలో వేస్తూ.. తనకు మెచ్యూరిటీ లేదు, నిబ్బానిబ్బీలా ప్రవర్తిస్తాడు. కాలేజీలో ఫస్ట్ టైమ్ లవ్లో పడినట్లుగా ఉంటాడు. తనకి సరిగా మాట్లాడటం కూడా రాదు అని చెప్పింది. దివ్య ఫోటోను డస్ట్బిన్లో పడేస్తూ.. భరణి వెళ్లిపోయాక దివ్య ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. ఊరికే కోప్పడటం, అవసరం లేకపోయినా వాదించడం చేస్తోంది. అవి కంట్రోల్ చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చింది.రీతూపై బిగ్బాంబ్తనూజ, గౌరవ్ ఫోటోలను కూడా చెత్తబుట్టలో పడేసింది. తనూజ.. వేరేవాళ్లు చెప్పిన మాటల్ని పట్టుకుని నన్ను మానిప్యులేటర్ అనుకుంటోంది. గౌరవ్ రాక్షసుడు.. చెప్పిన మాట వినడు. మనం మాట్లాడేందుకు 5 సెకన్ల గ్యాప్ కూడా ఇవ్వడు అంది. చివరగా డిమాన్ ఫోటో పడేస్తూ.. నువ్వు నీ గురించే ఆడు.. ఎక్కువ ఎమోషనల్ అవకు, గేమ్ మీద ఫోకస్ చేయ్.. కొన్నిసార్లు ఓవర్ హెల్ప్ చేస్తున్నావ్ అంటూ హెచ్చరించింది. చివరగా రమ్య చేతికి ఓ బిగ్బాంబ్ ఇచ్చాడు నాగ్. నీ వాష్ రూమ్ డ్యూటీని హౌస్లో ఒకరికి అప్పగించమన్నాడు. అందుకామె వెంటనే రీతూ పేరు చెప్పి.. ఏం చేసినా నీ మంచి కోసమేరా.. అని బిస్కెట్ వేసి వెళ్లిపోయింది.చదవండి: బైసన్ మూవీ టీమ్పై సీఎం ప్రశంసలు -
'మాయకర'గా రిషబ్ శెట్టి.. మేకప్ కోసం అన్ని గంటలా! (మేకింగ్ వీడియో)
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార మూవీకి ప్రీక్వెల్గా స్వీయ దర్శకత్వంలో రిషబ్శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ కోసం డూప్ ఉపయోగించకుండా రిషబ్ రిస్క్ చేశారని తెలిసిందే. ఈ మూవీకి ఎంతో కీలకమైన పాత్ర 'మాయకర'గా కూడా రిషబ్నే నటించారని ఒక మేకింగ్ వీడియోతో చిత్ర యూనిట్ పంచుకుంది. 'మాయకర' పాత్ర మేకప్ కోసం ఆయన పడిన శ్రమ ఎలాంటిదో చూపించారు. కేవలం మేకప్ కోసమే ఆరు గంటల పాటు శ్రమ పడాల్సి వచ్చిందని తెలిపారు. ఉదయం షూటింగ్ ఉందంటే అర్ధరాత్రి 12:30 నుంచే రిషబ్ మేకప్ పనులు మొదలౌతాయని పేర్కొన్నారు. మాయకర పాత్ర కోసం ఆయన చాలా శ్రమించడం వల్లనే తెరపై గుర్తించలేనంతగా మనకు కనిపించారని చెప్పొచ్చు. -
చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతీసేలా 'డీప్ఫేక్' ఫోటోలు.. కేసు నమోదు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్లను ఎవరూ ఉపయోగించకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా క్రియేట్ చేశారు. వాటిని పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలలో కొందరు వైరల్ చేశారు. ఈ విషయం చిరు దృష్టికి చేరడంతో ఆయన వెంటనే సీపీ వీసీ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ముఖ్యంగా AI మార్ఫింగ్ ద్వారా డీప్ఫేక్ వీడియోలు రూపొందించి తన పేరు, ప్రతిష్ట దెబ్బతీసేలా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చిరు కోరారు.డీప్ ఫేక్ ఫోటోల వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న చిరంజీవి కొద్దిరోజుల క్రితమే సివిల్ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా చిరుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన ఫోటోలను తమ వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవరూ వినియోగించవద్దని హెచ్చరించింది. ఈ క్రమంలోనే AI ద్యారా మార్ఫింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధిస్తూ సైబర్క్రైమ్ పోలీసులుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చిరుపై తప్పుడు పోస్టులు, వీడియోలను క్రియేట్ చేసిన 30 మందికి పైగానే నోటీసులు జారీ చేసింది. కోర్టు సూచనతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
హిట్ మూవీలో వేశ్యగా నటించిన బ్యూటీ.. 'ప్రభాస్' ఫౌజీలో ఛాన్స్
దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఫౌజీ' (Fauji)లో కన్నడ బ్యూటీ 'చైత్ర జె ఆచార్' (Chaithra J Achar)కు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. గతంలో సప్త సాగరాలు దాటి: సైడ్ బి, 3బీహెచ్కే వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించినుకున్నట్లు సమచారం. ఫౌజీలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తుండగా చైత్ర ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇందులో అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ కూడా భాగం కానున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఫౌజీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. 1940లో జరిగిన కథగా ఈ చిత్రం రానుంది. ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఒంటరిగా ఒక యోధుడు చేసే పోరాటం ఈ చిత్రంలో కనిపించనుంది. వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్ జోడించి హను రాఘవపూడి ఈ కథను రెడీ చేశారు.చైత్ర జె. ఆచార్ నటి మాత్రమే కాదు ఒక గాయని కూడా.. బెంగళూరులో పుట్టిన ఆమె మొదట మహీరా (2019)లో నటించింది. కన్నడ చిత్రం 'గరుడ గమన వృషభ వాహనం'లో ఆమె పాడిన 'సోజుగడా సూజు మల్లిగే' అనే పాట ఇంటర్నెట్లో అత్యధిక వీక్షణలతో సంచలనం సృష్టించింది. దీనికి గాను 2022లో ఆమెకు సైమా పురస్కారం కూడా దక్కింది. చైత్ర ప్రస్తుతం ఉత్తరకాండ, మై లార్డ్, స్ట్రాబెర్రీ, మర్ణామి వంటి చిత్రాల్లో నటిస్తోంది. సప్త సాగరాలు దాటి: సైడ్ బి సినిమాలో చైత్ర ఒక వేశ్యగా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Chaithra J Achar (@chaithra.j.achar) -
'డ్యూడ్' హీరోయిన్ మమితా బైజుకు బిగ్ ఛాన్స్
ధనుష్తో నటి మమితా బైజుకు(Mamitha Baiju) జత కుదిరింది. రీసెంట్గా డ్యూడ్తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మొదట మలయాళం మూవీతో తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ తమిళం, తెలుగు అంటూ చుట్టేస్తోంది. ప్రేమలుతో దక్షిణాది చిత్ర పరిశ్రమనే తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం రెబెల్ నిరాశపరచడంతో అక్కడ ఈ భామ పప్పులు ఉడకవు అనే విమర్శలను ఎదుర్కొంది. బాలా దర్శకత్వంలో వణంగాన్ చిత్రంలో కొన్ని రోజులు నటించి వైదొలగింది. దీంతో కోలీవుడ్లో చిన్న గ్యాప్ కూడా వచ్చింది. అలాంటిది ఇప్పుడు తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రదీప్ రంగనాథన్తో జతకట్టిన ద్విభాషా ( తమిళం, తెలుగు) చిత్రం డ్యూడ్ దీపావళి సందర్భంగా తెరపైకి వచ్చి ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన జననాయకన్ చిత్రంలో ఆయనకు చెల్లెలిగా కీలక పాత్రను పోషించింది. ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 9న తెరపైకి రానుంది. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రంలో కథానాయికిగా నటిస్తోంది. అదేవిధంగా ఇరెండు వారమ్ అనే మరో చిత్రంలో నటించిన మమితబైజు మలయాళంలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. కాగా తాజాగా మరో లక్కీచాన్స్ ఈ అమ్మడిని వరించింది. ధనుష్ సరసన నటించడానికి మలయాళీ బ్యూటీ రెడీ అవుతోంది. నటుడు ధనుష్ ప్రస్తుతం తేరే ఇష్క్మేన్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఈయన నటించే 54వ చిత్రం అవుతుంది. దీనికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించనున్నారు. దీనికి జీవీ.ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీని గురించిన అధికారిక పోస్టర్ను నిర్మాతల వర్గం విడుదల చేసింది. వచ్చే నెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో మమితబైజు నాయకిగా నటించనుందని సినీ వర్గాల సమాచారం. -
సూపర్ షీ మూవీ రెడీ
‘శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూర్వాజ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కిల్లర్’. ఉర్వీష్ పూర్వాజ్ సమర్పణలో పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జ్యోతి పూర్వాజ్ లీడ్ రోల్ చేశారు. విశాల్ రాజ్, దశరథ, చందు, గౌతమ్ కీలక పాత్రల్లో నటించారు.‘‘ఈ సూపర్ షీ మూవీని త్వరలో రిలీజ్కి రెడీ చేస్తున్నాం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్కు మంచి స్పందన లభించింది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్... ఇలాంటి ఎలిమెంట్స్తో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగు తున్నాయి’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. -
ఓ యోధుడి పోరాటం
యోధుడిగా శత్రువులతో వీరోచిత పోరాటం చేస్తున్నారు గోపీచంద్. ఈ యోధుడి శూరత్వం ఏ రేంజ్లో ఉంటుందనేది సిల్వర్ స్క్రీన్పై చూడాలి. గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ కెరీర్లోని ఈ 33వ సినిమాను పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు.‘‘విభిన్నమైన కథతో భారతదేశ చరిత్రలోని ఓ ప్రముఖ అధ్యాయాన్ని వెండితెరపైకి తీసుకువస్తున్నాం. గోపీచంద్ తన కెరీర్లో ఇప్పటివరకు చేయని ఓ విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు షెడ్యూల్స్లో 55 రోజుల షూటింగ్ను పూర్తి చేశాం. ప్రస్తుతం వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంట్రవెల్ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేస్తున్నాం. ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్గా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా కథ 7వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుందని, ఈ చిత్రానికి ‘శూల’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్, కెమెరా: సౌందర్ రాజన్. -
డ్రాగన్ చూపు... ఆఫ్రికా వైపు
‘డ్రాగన్’ చూపు నార్త్ ఆఫ్రికాపై పడిందట. హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ యాడ్ షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్కు స్వల్ప గాయాలైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది.కాగా ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ నార్త్ ఆఫ్రికా లొకేషన్స్లో... ముఖ్యంగా ట్యూనిషియా దేశంలో జరగనుందని సమాచారం. అక్కడి లొకేషన్స్ను ఫైనలైజ్ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ నెలాఖర్లో నార్త్ ఆఫ్రికాకు వెళ్తున్నారని, నవంబరు నెలలో ట్యూనిషియా లొకేషన్స్లో ‘డ్రాగన్’ చిత్రీకరణ జరగనుందనే టాక్ వినిపిస్తోంది. నవంబరు మొదటి వారంలో హైదరాబాద్లో కొంత చిత్రీకరణ జరిపి, ఆ తర్వాత అదే నెల చివర్లో ఆఫ్రికా వెళ్లే ఆలోచనలో ఉన్నారని భోగట్టా. టీ–సిరీస్ ఫిల్మ్స్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ల సమర్పణలో నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ యెర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
రకుల్ అందం.. కృతిశెట్టి గ్లామర్.. చీరలో మంచు లక్ష్మీ
అందంగా మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్గ్లామర్ అంతా చూపించేస్తున్న కృతి శెట్టితెల్లని చీరలో మంచు లక్ష్మీ దీపావళి సెలబ్రేషన్స్హీరోయిన్ పూజా హెగ్డే ఫన్నీ రెగ్యులర్ ఫొటోలుతెగ నవ్వేస్తూ ఎంజాయ్ చేస్తున్న రెజీనాభర్తతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్లో అమలాపాల్వైల్డ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న హన్సిక View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) ే View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Laxmi Raibagi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
వందల కోట్లు పోగొట్టుకుంటోన్న ప్రభాస్.. కారణం ఇదేనట!
టాలీవుడ్ ‘డార్లింగ్’ ప్రభాస్(Prabhas) దక్షిణాది నుంచి తొలి గ్లోబల్ స్టార్ హీరో అనేది అందరికీ తెలిసిందే. దేశ విదేశాల్లో ప్రభాస్కి ఉన్న క్రేజ్ సామాన్యమైనది కాదు. బాహుబలి సిరీస్తో పాటు సలార్, కల్కి వంటి సినిమాలు ప్రభాస్ను సమకాలీన హీరోలకు అందనంత ఎత్తులో నిలబెట్టాయి. అయితే తన క్రేజ్ను ఆదరాబాదరా క్యాష్ చేసుకునే రెగ్యులర్ స్టార్స్కు భిన్నంగా అందివచ్చిన రూ.వందల కోట్లను మన రెబల్ స్టార్ పోగొట్టుకుంటున్నాడు. దీనికి తొలి బీజం బాహుబలి సినిమా సమయంలోనే పడిందని సమాచారం.’బాహుబలి 2: ది కన్ క్లూజన్’ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టినప్పటి నుంచీ, అనేక టాప్ బ్రాండ్లు ప్రభాస్ను వాణిజ్య ప్రకటనల కోసం ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆయనకి పెద్ద మొత్తంలోనే డబ్బు ఆఫర్ చేస్తున్నాయి. దుస్తులు, ఫుట్వేర్, ఎలక్ట్రానిక్ ఫిట్నెస్ రంగాలకు చెందిన బ్రాండ్ల నుంచి అతనికి అంబాసిడర్గా ఉండేందుకు వచ్చిన ఆఫర్లను కాదని, ఒక్క సంవత్సరంలోనే రూ.150 కోట్లకు పైగా విలువైన బ్రాండ్ ఎండార్స్మెంట్ ఆఫర్లను తిరస్కరించడం ద్వారా ప్రభాస్ సినీ పరిశ్రమతో పాటు వ్యాపార రంగాల వారినీ ఆశ్చర్యపరచాడు. గతంలో బాహుబలి 2 కోసం రూ. 10 కోట్ల విలువైన బ్రాండ్ ఎండార్స్మెంట్లను వదులుకున్నాడని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించాడు. అయితే అనధికారికంగా ఆ సినిమా టైమ్లో ప్రభాస్ వదులకున్న ప్రకటనల విలువ రూ.80కోట్ల వరకూ ఉంటుందని అంచనా. తన లుక్లో మార్పు చేర్పులు చేసుకుంటే అది సినిమాకు నష్టం చేస్తుందనే ఆలోచనతోనే ఆయన అప్పట్లో వద్దనుకున్నాడట. ఆ తర్వాత కూడా అదే పంథా కొనసాగించాడు.మరోవైపు టాలీవుడ్లో ప్రభాస్ తో పాటు టాప్ ప్లేస్లో కొనసాగుతున్న మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు పెద్ద సంఖ్యలో ప్రకటనల్లో నటించడం గమనార్హం. ప్రభాస్ మాత్రం సమకాలీనుల మాదిరిగా కాకుండా వరుసగా అనేక ఆఫర్లను తిరస్కరిస్తూనే ఉన్నాడు. ఒక ప్రధాన కోలా కంపెనీ వివిధ ఆటోమొబైల్ ఎండార్స్మెంట్లతో సహా అగ్ర బ్రాండ్ల ఒప్పందాలను ఇటీవల ఆయన తిరస్కరించినట్లు సమాచారం. ‘ కేవలం మూడు రోజుల పనికి ప్రభాస్ రూ.25 కోట్లకు పైగా సంపాదించవచ్చు. ఒక రోజు ఫోటోషూట్ కోసం, మరొక రోజు వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం చివరి రోజు ప్రమోషన్స్ కోసం వెచ్చిస్తే సరిపోతుంది.‘ అని ఒక సెలబ్రిటీ మేనేజర్ వెల్లడించాడు. అయితే ‘ఈ బ్రాండ్ ఎండార్స్మెంట్లను తరచుగా అతను తిరస్కరించడానికి కారణం ఎండార్స్మెంట్లకు వ్యతిరేకమని కాదు. గతంలో బ్రాండ్లను ప్రమోట్ చేశాడు భవిష్యత్తులో కూడా చేస్తాడని, అయితే ఒక బ్రాండ్ను ఎండార్స్మెంట్ చేస్తున్నప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తాడని సదరు మేనేజర్ తెలిపాడు. తన విలువలకు అనుగుణంగా తన ప్రేక్షకులతో అనుబంధాన్ని చెడగొట్టని బ్రాండ్లను మాత్రమే అత్యంత జాగ్రత్తగా ఎంచుకుంటాడని వివరించాడు. ఇంత వరకూ ఈ స్థాయిలో బ్రాండ్లను స్క్రూటినీ చేసే మరో స్టార్ను చూడలేదంటున్నాడు. ప్రస్తుతం ఒక అగ్రగామి వాహన కంపెనీకి, మరో మొబైల్కి మాత్రమే ప్రభాస్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు.రూ.వందల కోట్ల సంపద ఉన్నా మద్యం ప్రకటనల నుంచి పాన్ మసాలా ప్రకటనల దాకా ఏదైనా సరే సై అనే నటీనటులున్న ఈ రోజుల్లో... తద్భిన్నంగా పైసా వెనుక పరుగులు తీయకుండా రూ.వందల కోట్లను వద్దు అనుకుంటున్న ఏకైక స్టార్గా ప్రభాస్ తన వ్యక్తిత్వంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడని చెప్పొచ్చు. -
డ్యూడ్ @ రూ.100 కోట్లు.. తెలుగు ప్రేక్షకుల వల్లే సాధ్యం!
‘‘డ్యూడ్’(Dude) సినిమా రూ. 100 కోట్లు వసూళ్లు దాటేసింది. నేను నటించిన ‘లవ్ టుడే, డ్రాగన్’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంత ఆదరించారో... ‘డ్యూడ్’కి అంతకంటే ఎక్కువ ఆదరణ అందించారు. మీరు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan ) చెప్పారు. ఆయన హీరోగా మమితా బైజు(Mamitha Baiju) హీరోయిన్గా నటించిన చిత్రం ‘డ్యూడ్’. శరత్కుమార్ కీలక పాత్ర పోషించారు. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. హైదరాబాద్లో నిర్వహించిన ‘డ్యూడ్ బ్లాక్ బస్టర్ 100 కోట్ల జర్నీ’ ఈవెంట్లో వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘డ్యూడ్’ విజయం చాలా ఆనందాన్నిచ్చింది. మా సినిమాకి అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. మా సంస్థలో దర్శకులుగా పరిచయమైన భరత్ కమ్మ, నితీష్ రానా, బుచ్చిబాబు పెద్ద దర్శకులు అయ్యారు. ఈ జాబితాలో కీర్తీశ్వరన్ ఉండటం ఆనందంగాఉంది’’ అని తెలిపారు. ‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు’’ అని కీర్తీశ్వరన్ అన్నారు. నిర్మాత ఎస్కేఎన్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, రచయిత కృష్ణ మాట్లాడారు. -
9 నెలల పిల్లాడు.. దెయ్యమై పగ తీర్చుకుంటే?
తెలుగులో ఇప్పటివరకు చాలా హారర్ సినిమాలు వచ్చాయి. దాదాపుగా ప్రతిదానిలోనూ పెద్దవాళ్లు లేదంటే ఓ వయసు ఉండే పిల్లలు చనిపోయి దెయ్యాలుగా మారడం చూస్తుంటాం. కానీ 9 నెలల పిల్లాడు దెయ్యమై పగ తీర్చుకుంటే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్తో టాలీవుడ్లో ఓ మూవీ తీస్తున్నారు. అదే 'నెపోలియన్ రిటర్న్స్'. గతంలో నీడ పోయింది సర్ అనే స్టోరీతో మూవీ తీసిన ఆనంద్ రవి అనే దర్శకుడు.. ఇప్పుడు ఈ మూవీతో వస్తున్నాడు.(ఇదీ చదవండి: పిల్లలతో తీసిన హారర్ సినిమా.. వాళ్లు చూడకపోవడమే బెటర్!)దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ ఆనంద్ రవి నటిస్తున్నాడు. ఆటో రాంప్రసాద్, దివి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతానికైతే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో గేదె దెయ్యం వచ్చింది, నన్ను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయమంది అనే డైలాగ్స్ చెప్పారు. కానీ ఆదివారం జరిగిన ఈవెంట్లో దర్శకహీరో ఆనంద్ రవి మాట్లాడుతూ.. మెయిన్ ప్లాట్ ఏంటో చెప్పాడు. 9 నెలల వయసు అంటే సరిగా నిలబడం, నడవడమే రాదు. అలాంటిది పిల్లాడు దెయ్యంగా మారి పగ తీర్చుకోవడం అనే పాయింట్ బాగానే ఉంది. కానీ దాన్ని ప్రెజెంట్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: కొద్దిరోజులుగా మాస్క్తోనే రష్మిక.. కారణం ఇదేనా..?) -
పసిబిడ్డను చంపేయమని అడిగా.. నాపై ఉమ్మేశారు!: కస్తూరి
ముక్కుసూటి వైఖరితో ఎప్పుడూ వివాదాల్లో నానుతూ ఉంటుంది నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar). తమిళనాడులోని అంతఃపురంలో సేవలు చేసేందుకు తెలుగువారు వచ్చారని.. అందులో కొందరు ఇప్పుడు తమిళులుగా చెలామణి అవుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ జైలుకు కూడా వెళ్లొచ్చింది. తాజాగా ఆమె తన సినీ జీవితం, జైలు జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిందిఅపార్థం చేసుకున్నారుకస్తూరి మాట్లాడుతూ.. 'నేను యాంకర్గా కెరీర్ ప్రారంభించాను. ఆ సమయంలో నాగార్జున షేక్హ్యాండ్ ఇచ్చారు. తర్వాత ఆయనతోనే అన్నమయ్య సినిమాలో నటించాను. అందుకు చాలా హ్యాపీ. గతేడాది నాకు అస్సలు కలిసిరాలేదు. ఓ రాజకీయ వేదికపై నేను చెప్పిన మాటల్ని ట్విస్ట్ చేసి వైరల్ చేశారు. నాపై నింద వేసి మరీ జైల్లో వేశారు. తెలుగు భాష అన్నా, ఇక్కడివారన్నా నా ఫ్యామిలీలాగా భావిస్తాను. ఆ అభిమానంతోనే ఇక్కడ సెటిలయ్యాను. అలాంటిది వీళ్లందరూ నన్ను అపార్థం చేసుకున్నారన్నదే నా పెద్ద బాధ!బ్లడ్ క్యాన్సర్సినిమాల్లో చూపించినట్లుగా జైలు జీవితం ఉండదు. జైలుకు వెళ్లిన రోజు నా జీవితంలోనే వరస్ట్. ఇకపోతే నా జీవితం అయిపోయింది అని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా అమ్మ ఆరోగ్యం బాగుచేయాలని ఆరేళ్లు కష్టపడ్డాం. కానీ చనిపోయింది. అమ్మ పోయిన ఐదు నెలలకే నాన్న మరణించాడు. తర్వాత మా అమ్మాయిని చావు అంచుల నుంచి బయటకు తీసుకొచ్చాం. తనకు బ్లడ్ క్యాన్సర్.. ట్రీట్మెంట్ పని చేయలేదు. ప్రపంచంలో 200 మందికి మాత్రమే వచ్చే అరుదైన బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. తనను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అదే నాకు పెద్ద పరీక్ష, బాధ! నా కూతురి పేరిట మను మిషన్ అని ఓ స్వచ్చంద సంస్థను ప్రారంభించాను. రైల్వే ట్రాక్పై పసిబిడ్డ దొరికిందిఈ చారిటీ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఏదైనా బహుమతులు, దుస్తులు ఇవ్వడం లాంటి చిన్నచిన్న పనులు చేస్తుంటాం. అలా చేస్తుండగా ఓసారి రైల్వే ట్రాక్పై ఓ పసిబిడ్డను చూశాను. తనకు రెండేళ్లు.. కానీ చూసేందుకు ఐదు నెలల పిల్లాడిలా ఉంటాడు. రోడ్లపై అడుక్కోవడం కోసం ఆ చిన్నారిని ఎదగనివ్వలేదు. నోట్లో సారా పోసి పడుకోబెట్టేవారు. ఆ బిడ్డను అవసరమైనంతవరకు వాడుకుని తర్వాత రైల్వే ట్రాక్పై పడేశారు. ఆ బాబును ఆస్పత్రికి తీసుకెళ్తే కాలేయం పూర్తిగా పాడైందన్నారు.చావును ప్రసాదించమన్నా..మానసిక ఎదుగుదల లేదని చెప్పారు. వారంపాటు నేన ట్రీట్మెంట్ చేయించాను. ఏమాత్రం బెటర్మెంట్ లేకపోయేసరికి నేను ధైర్యం తెచ్చుకుని ఓ మాట అడిగాను. తనకు ఎదుగుదల లేనప్పుడు వైద్యం చేయించి ఇంకా నరకంలోకి తోయడం ఎందుకు? తనను మెర్సీ కిల్లింగ్(చావు ప్రసాదించడం)కి వదిలేయొచ్చుగా అని అడిగాను. అందుకు డాక్టర్.. అలా చావాలని రాసుంటే ఆకలిదప్పికలతో ఎప్పుడో చచ్చిపోయేవాడు. బతికున్నాడంటే అతడొక ఫైటర్. నాపై ఉమ్మేశారుతనను బతికించడం మా బాధ్యత అన్నారు. ప్రస్తుతానికైతే బాబు పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చావును మనం నిర్ణయించకూడదు. బతకడం మాత్రమే మన కర్తవ్యం అని చెప్పుకొచ్చిందిది. తనకు ఎదురైన ఓ చెత్త అనుభవం గురించి చెప్తూ.. ఓసారి దగ్గర్లో ఉన్న ఏటీఎమ్ కోసం నడుచుకుంటూ వెళ్లాను. ఇంతలో ఓ బస్సులో నుంచి ఒకరు నా మీద ఉమ్మేశారు అని తెలిపింది.చదవండి: 'రూ.2 కోట్లిస్తావా? ప్రైవేట్ వీడియోలు బయటపెట్టమంటావా?' -
సల్మాన్ ఖాన్ను 'ఉగ్రవాది'గా ప్రకటించిన పాకిస్తాన్.. కారణం ఇదే..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) కొద్దిరోజుల క్రితం బలూచిస్తాన్ (Balochistan)ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాక్ మీడియాలో వస్తున్న నివేదికల ప్రకారం సల్మాన్ను ఒక ఉగ్రవాదిగా ముద్రవేసి.. పాకిస్తాన్ 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్ కింద ఆయన పేరును చేర్చారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానించబడిన వ్యక్తుల బ్లాక్లిస్ట్లో సల్మాన్ పేరును పొందుపరిచారు. పాక్ చట్టాల ప్రకారం ఈ లిస్ట్లో ఉన్న వారిపట్ల నిఘా, కదలికలపై ఆంక్షలతో పాటు చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది.పాక్ విషయంలో సల్మాన్ ఏమన్నారంటే..?కొద్దిరోజుల క్రితం సౌదీ అరేబియాలో ‘జాయ్ ఫోరమ్ 2025’ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.. ఇందులో కి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్తో పాటు షారుక్ ఖాన్, ఆమిర్ఖాన్ వంటి స్టార్స్ పాల్గొన్నారు. ఈ వేదికపై సల్మాన్ మాట్లాడుతూ.. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. ఒక హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే తప్పకుండా సూపర్హిట్ అవుతుంది. ఆపై తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలు కూడా ఇక్కడ కోట్ల రూపాయలు రాబడుతున్నాయి. దీనంతటికీ కారణం పలు దేశాలకు చెందిన ప్రజలు సౌదీలో ఉండటమేనని చెప్పాలి. బలూచిస్తాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ (Pakistan) నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. అంటూ ఆయన మాట్లాడారు.సల్మాన్పై బలూచిస్తాన్ ప్రశంసలుసల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. బలూచిస్తాన్, పాకిస్థాన్లను సల్మాన్ఖాన్ వేర్వేరుగా చెప్పడం ఏంటి అంటూ భగ్గుమంది. పాకిస్థాన్కు చెందిన బలోచిస్థాన్ను ఇలా వేరు చేసి మాట్లాడటం ఏంటి అంటూ అక్కడి మీడియా కూడా విమర్శలు చేసింది. అయితే, బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు మాత్రం సల్మాన్ చేసిన ప్రకటనను స్వాగతించారు. బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది మీర్ యార్ బలూచ్ ఒక ట్వీట్ కూడా చేశారు. సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఆరు కోట్ల బలూచిస్తాన్ ప్రజలకు ఆనందాన్ని కలిగించిందని కృతజ్ఞత తెలిపారు. ఇలా మాట్లాడేందుకు చాలా దేశాలు వెనకడుగు వేశాయని వారు గుర్తుచేశారు. బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించడాన్ని హైలైట్ చేసేలా సల్మాన్ వ్యాఖ్యలు చేరుతాయని అభిప్రాయపడ్డారు.ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ చాలా వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి తదితర వనరులు ఎక్కువగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానాను కాపాడుతుంది. కానీ, బలూచిస్తాన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పాక్ నిర్లక్ష్యంగా ఉండటంతో అక్కడ వ్యతిరేకత మొదలైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడటం ఆపై వేర్పాటువాదులు శక్తిమంతమయ్యారు. ఇప్పుడు ఏకంగా ఆక ప్రత్యేక ఆర్మీని ఏర్పాటు చేసుకునే రేంజ్కు బలూచిస్తాన్ చేరుకుంది. పాక్కు పక్కలో బల్లెంలా బలూచిస్తాన్ తయారైంది. పాక్ నుంచి వేరు కావడంతో పాటు ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.Salman Khan has been placed on the Fourth Schedule by the Government of Balochistan.@BeingSalmanKhan #Balochistan pic.twitter.com/Pbg1uaKiJU— Nasir Azeem (@BeloetsjNasir) October 25, 2025I don’t know if it was slip of tongue, but this is amazing! Salman Khan separates “people of Balochistan” from “people of Pakistan” . pic.twitter.com/dFNKOBKoEz— Smita Prakash (@smitaprakash) October 19, 2025 -
'బైసన్' కోసం ధ్రువ్ కష్టం.. మేకింగ్ వీడియో విడుదల
తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన చిత్రం బైసన్.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ తనకు జోడీగా నటించింది. అయితే, కోలీవుడ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. కబడ్డీ ఆటగాడిగా ధ్రువ్ పడిన కష్టం ఏంటి అనేది ఈ వీడియోలో కనిపిస్తుంది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సినిమాలో ధ్రువ్ నటన పట్ల విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే రూ. 45 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. -
కరూర్ ఘటన తర్వాత ప్రజల్లోకి విజయ్.. వేదిక ఫిక్స్
తమిళనాడులోని కరూర్ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిర్ణయించారు. సుమారు 30 రోజుల తర్వాత విజయ్ బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 27న చెన్నై కరూర్లో టీవీకే నేత విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెను విషాదం గురించి తెలిసిందే. మరణించిన 41 మంది బాధిత కుటుంబాలు, గాయపడ్డ 160 మందిని పరామర్శించేందుకు విజయ్ నిర్ణయించారు. బాధిత ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ. 20 లక్షలు విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి పరామర్శించడమే కాకుండా, నష్ట పరిహారంతో పాటు వారిని దత్తత తీసుకునే విధంగా విజయ్ కసరత్తులలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. కరూర్లో విజయ్ పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, భద్రత చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీవీకే వర్గాలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే, టీవీకే వర్గాలు ఎంపిక చేసిన వేదిక చిన్నదిగా ఉండడంతో ఏదేని కళాశాల మైదానాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని సూచించారు. దీంతో పరామర్శలను వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరకు కరూర్లో అతి పెద్ద మైదానం, ఆడిటోరియంలేని దృష్ట్యా, బాధితులను చెన్నైకు తీసుకొచ్చి పరామర్శ ఏర్పాట్లు చేయడానికి టీవీకే వర్గాలు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మహబలిపురం వద్ద అతి పెద్ద వేదికను ఎంపిక చేశారు. ఇక్కడకు బాధితులను తీసుకొచ్చి , వారికి అన్ని రకాల బస తదితర ఏర్పాట్లు చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు. ఈమేరకు (27వ తేదీ)సోమవారం బాధితులను విజయ్ పరామర్శించి, నష్ట పరిహారం అందించనున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
'కింగ్డమ్'కు భారీ నష్టాలు.. నాగవంశీ ఫస్ట్ రియాక్షన్ ఇదే
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా మూవీ ‘కింగ్డమ్’ (Kingdom). ఇందులో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించగా సత్యదేవ్, వెంకటేశ్, అయ్యప్ప పి.శర్మ, రాజ్కుమార్ కసిరెడ్డి వంటి వారు నటించారు. నిర్మాత నాగవంశీ భారీ బడ్జెట్తో నిర్మించిన కింగ్డమ్ మూవీ ఈ ఏడాది జులైలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలు వచ్చాయని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో తాజాగా కింగ్డమ్ కలెక్షన్స్పై నాగవంశీ రియాక్ట్ అయ్యారు.'అందరూ కింగ్డమ్ సినిమా ఫెయిల్యూర్ అయిందని అంటున్నారు. అందులో నిజం లేదు. అమెరికాలోనే సుమారు రూ. 28 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం నైజాంలోనే రూ. 12 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇలాంటి సినిమాను ఫెయిల్యూర్ అంటే ఎలా..? కింగ్డమ్ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్, గౌతమ్ తిన్ననూరి వంటి వారు పనిచేయడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను మేము రీచ్ కాలేకపోయాం. నా నుంచి కింగ్డమ్ సినిమాను కొన్న బయ్యర్లు అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. కలెక్షన్స్ పరంగా ఒకరో ఇద్దరో నష్టపోయిన బయ్యర్లకు జీఎస్టీ రూపంలో రిటర్న్ చేశాను. దీంతో వారు కూడా సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఈ సినిమాతో నాకు ఎలాంటి నష్టం జరగలేదు. అలాంటప్పుడు కింగ్డమ్ ప్లాప్ సినిమా ఎలా అవుతుంది..? కానీ, మేము అనుకున్నంత రేంజ్లో కింగ్డమ్ రన్ కాలేదు. బాక్సాఫీస్ లెక్కల పరంగా కింగ్డమ్ హిట్ చిత్రంగానే ఉంటుంది.' అని ఆయన అన్నారు. -
నారా రోహిత్-శిరీష పెళ్లి సందడి: హల్దీ వీడియో చూశారా?
తెలుగు హీరో నారా రోహిత్ (Nara Rohit) పెండ్లిపనులు షురూ అయ్యాయి. పెళ్లికూతురు శిరీష (Siree Lella) ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం ఇటీవలే జరిగింది. తాజాగా రోహిత్- శిరీషలు జంటగా హల్దీ ఫంక్షన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫామ్హౌస్లో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఆటలు, పాటలతో ఈ సెలబ్రేషన్స్ రెట్టింపు ఉత్సాహంతో సాగాయి. రోహిత్- శిరీష అక్టోబర్ 30న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు.అలా మొదలైందినారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష హీరోయిన్గా నటించింది. రోహిత్ ప్రియురాలిగా మెప్పించింది. సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ అతడితో ప్రేమలో పడింది. అదే విషయాన్ని ఇంట్లో చెప్పగా.. ఇరు కుటుంబాలు పెళ్లికి పచ్చజెండా ఊపాయి. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.సినీ జర్నీనారా రోహిత్ విషయానికి వస్తే.. బాణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సోలో సినిమాతో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి.. ఇలా పలు సినిమాలు చేసుకుంటూ పోయాడు. 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు బ్రేక్ తీసుకుని ప్రతినిధి 2తో రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈ ఏడాది భైరవం, సుందరకాండ సినిమాలతో అలరించాడు. Glimpses from the vibrant #Haldi ceremony of #NaraRohith & #SireeLella 💛A celebration filled with joy, love, and laughter!@IamRohithNara pic.twitter.com/Dm9Hxh62WG— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 26, 2025చదవండి: అల్లు అరవింద్ తిట్టినన్ని తిట్లు మా నాన్న కూడా తిట్టలేదు! -
అల్లు అరవింద్ తిట్టినన్ని తిట్లు మా నాన్న కూడా తిట్టలేదు!
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆ మధ్య జీవితమంతా అల్లు అర్జున్కు కాపలా కాయడమే సరిపోయింది, ఇంకా లవ్స్టోరీలకు ఛాన్స్ ఎక్కడిది? అన్నాడు. ఆ తర్వాత తనను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని.. తనపై చేస్తున్న కుట్రలన్నీ వెంట్రుకతో సమానం అంటూ మిత్రమండలి ఈవెంట్లో ఓ బూతు మాట కూడా అనేశాడు. ఈ కామెంట్స్పై నెట్టింట ట్రోలింగ్ జరిగింది.ది గర్ల్ఫ్రెండ్ ట్రైలర్లో బన్నీ వాసుఇలా హద్దులు దాటి మాట్లాడినందుకు అల్లు అరవింద్ (Allu Aravind).. బన్నీ వాసుకు గట్టిగానే క్లాస్ పీకాడట! ఈ విషయాన్ని బన్నీ వాసు స్వయంగా వెల్లడించాడు. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ఫ్రెండ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం జరిగింది. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు బన్నీ వాసు వచ్చాడు. ఆయన మైక్ అందుకుని ప్రసంగం ప్రారంభించేలోపే.. నిర్మాత ఎస్కేఎన్ కలగజేసుకుని ఇప్పుడు బన్నీ ఒక అగ్రెసివ్ స్పీచ్ ఇస్తాడన్నాడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని..దీంతో అప్పటికే జ్ఞానోదయం అయిన బన్నీ వాస్.. అగ్రెసివ్ లేదు, కాంట్రవర్సీ లేదు. ఇప్పుడు కూల్గానే మాట్లాడతాను. ఎందుకంటే ఆ కాంట్రవర్సీకి ఆయన (అల్లు అరవింద్) తిట్టినన్ని తిట్లు మా నాన్న కూడా తిట్టలేదు. అందుకే ఈరోజు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. వైరల్ కంటెంట్ ఇవ్వమంటారు.. మళ్లీ ఆయనే వైరు పట్టుకుని కొడతారు. ఇంకో నాలుగైదు నెలలు వైరల్ కంటెంట్కు ఛాన్సే లేదు అంటూ సరదాగా అనడంతో అంతా నవ్వేశారు.చదవండి: బాడీ షేమింగ్, తిట్లు.. ఇదేం బుద్ధి? సంజన, మాధురికి గడ్డిపెట్టిన నాగ్ -
బాడీ షేమింగ్, తిట్లు.. ఇదేం బుద్ధి? సంజన, మాధురికి గడ్డిపెట్టిన నాగ్
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ మొదలై 50 రోజులవుతోంది. ఇప్పటికీ అసలు సిసలైన విన్నింగ్ క్యాండిడేట్ అనేలా ఒక్కరూ లేరు. అంతో ఇంతో తనూజపై హైప్ ఉంది. కల్యాణ్ కూడా నెగెటివిటీని పాజిటివిటీగా మార్చేసుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ అసలు నామినేషన్స్లోకే రాకపోవడం మైనస్గా మారనుంది.తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో ఏడు వారాలు గడిచాయి. రానురాను కంటెస్టెంట్లు రాటుదేలతారనుకుంటే మరీ వరస్ట్గా తయారవుతున్నారు. సంజనా నోటికి హద్దే లేకుండా పోయింది. తొక్కిపడేస్తా, నేలకేసి కొడతా అంటూ మాధురి మరీ నీచంగా మాట్లాడుతోంది. వీళ్లకు సరైన కోటింగ్ ఇచ్చాడు నాగార్జున. మరి ఇంకా ఏమేం జరిగాయో శనివారం (అక్టోబర్ 25వ) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..రాజాతో రీప్లేస్ చేశావా?ఇమ్మాన్యుయేల్.. కల్యాణ్తో తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేయించాలనుకున్నాడు. అది నేరుగా చెప్పకుండా ఏదేదో వాగాడు. ఈ టాపిక్ను నాగ్ ప్రస్తావిస్తూ అది సేఫ్ గేమ్, డైరెక్ట్గా నువ్వు చేయొచ్చుగా? అని ఇమ్మాన్యుయేల్కు క్లాస్ పీకాడు. తనూజ-మాధురిని బంధాల గురించి అడిగాడు. నాన్నని రాజాతో రీప్లేస్ చేశావా? అని నిలదీశాడు. అందుకు తనూజ.. మాది ఫేక్ బాండ్ కాదు సర్. నేను ఆవిడపై అరిచేస్తున్నా, తిట్టేస్తున్నా.. కానీ ఆవిడ నాతో ఎక్కువ కనెక్ట్ అయ్యారు. తోసేసినా వెళ్లనంటోందివచ్చినప్పుడు నాన్న నాన్న అని నాపై చాలా చెప్పారు.. మరిప్పుడెందుకు క్లోజ్ అవుతున్నారు? ఇది నాకు నెగెటివ్ అవుతుంని చెప్పినా ఆవిడ ఒప్పుకోలేదు. నీతో జెన్యూన్గా ఉన్నా.. నువ్వు తోసేసినా వెళ్లనని నాతో అంది సార్. ఒకవేళ నాకంటే ముందే నువ్వు ఎలిమినేట్ అయితే నేను హ్యాపీగా ఫీలవుతా అని కూడా చెప్పాను అని పేర్కొంది. మాధురికి క్లాస్ఇక తనూజ-సాయి మాట్లాడుతుంటే మధ్యలో రాము వచ్చి కూర్చోగా.. తనూజ చిరాకుతో మాటలనేసి వెళ్లిపోయిన వీడియో వేసి క్లాస్ పీకాడు. అయితే అది మాకు అలవాటే అని రాము అనడం గమనార్హం. ఇక దివ్యను రోడ్ రోలర్, లావు అని మాటలనడం, సంజ్ఞలు చేయడం తప్పని సంజనాకు క్లాస్ పీకాడు. రీతూపై మాటలు తూలిన మాధురికి కూడా క్లాస్ పడింది. గేమ్లో రీతూ.. తన డబ్బులన్నీ పవన్కు ఇవ్వడం.. కంటెండర్షిప్ కోసం తనను సైడ్ చేయడం జీర్ణించుకోలేకపోయింది. అది కడుపులో పెట్టుకుని రీతూను నానామాటలంది. బయట తోపు.. ఇక్కడ కాదు!బయట ఇలా చేసుంటే నేలకేసి తొక్కుతా.. నీ బిహేవియర్ బాలేదు, నీ నోరే చెత్త.. ఇలా చాలానే వాగింది. దీనిపై నాగ్ స్పందిస్తూ.. మీరు బయట తోపైతే బయట చూసుకోండి. బిగ్బాస్ హౌస్లో కాదు అని కాస్త సాఫ్ట్గానే హెచ్చరించాడు. ఇక ఈ ఎపిసోడ్లో ఫేక్ బాండ్స్, ఇన్సెక్యూర్.. అంటూ ఎక్కువ బోర్డులు మాధురి మెడలోనే పడ్డాయి. దీంతో ఆమెకు ఓ పనిష్మెంట్ ఇవ్వనున్నారు. అది డైరెక్ట్ నామినేషన్ అని తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్లో కల్యాణ్ను మాత్రమే సేవ్ చేశారు. సేవ్ అయితే ఏదో చెప్తానన్నావ్.. అని నాగార్జున కూపీ లాగే ప్రయత్నం చేశాడు. కానీ కల్యాణ్ మెలికలు తిరుగుతూ తర్వాత చెప్తానంటూ దాటేశాడు.చదవండి: బిగ్బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్! -
వెండితెరపై ‘గుమ్మడి’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికీ సాధారణ జీవితం గడిపే గుమ్మడి నర్సయ్య గురించి తెలుసుకునేందుకు జెన్ జెడ్ తరం కూడా ఆసక్తి చూపిస్తోంది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమా తెరకెక్కనుంది. కన్నడ స్టార్హీరో శివరాజ్కుమార్ గుమ్మడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే తన జీవితంలో ఆచరించిన ఆదర్శాలను ఈ తరానికి మరింత స్పష్టంగా పరిచయం చేయబోతున్న దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే ఈ చిత్రం గురించి చెప్పిన విశేషాలు.మూడేళ్ల పాటు రీసెర్చ్మాది కామారెడ్డి. సినిమా రంగంలో పదేళ్లుగా ఉన్నాను. చిన్నప్పుడే కమ్యూనిస్టు యోధులు తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్యల జీవిత చరిత్ర చదివాను. ఆ తర్వాత అలాంటి ఆదర్శాలతో జీవించే రియల్టైం పొలిటీషియన్ కోసం ఆరా తీసే క్రమంలో ఇల్లెందు వచ్చి గుమ్మడి నర్సయ్యను కలిశాను. 2019 నుంచి మూడేళ్లపాటు ఆయనతో ట్రావెల్ చేసిన వారు, ఆయన చేతిలో ఓడిపోయిన వారు ఇలా అనేక మందిని కలిసి పూర్తి స్థాయిలో సినిమా స్క్రిప్టు రెడీ చేసుకున్నాను. ఐదు సార్లు ఒకే చోటనుంచి ఎన్నిక కావడమనేది సామాన్యమైన విషయం కాదు. ఎంతో నిజాయితీ ఉంటేనే ఇలా జరుగుతుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను తెరపై జరిగే సన్నివేశాలతో లీనమయ్యే చేయగలిగితే సినిమా హిట్టే. గుమ్మడి జీవిత చరిత్రలో ఐదు గంటల పాటు కూర్చోబెట్టగలిగేంత విషయం ఉంది.రెండేళ్లపాటుగుమ్మడి జీవిత కథతో సినిమా తీసేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. హీరోలకు కథ నచ్చితే నిర్మాతలు దొరకలేదు. నిర్మాతలు దొరికితే కథకు తగ్గ హీరోలు దొరకలేదు. ఇద్దరు లభిస్తే.. కథలో మార్పులు చేర్పులు సూచించేవారు. ఇలాంటి సినిమాలు తమిళ్, మలయాళంలో ఆడుతాయి కానీ మన దగ్గర నడవవు. చివరకు పాల్వంచకు చెందిన ఎన్.సురేశ్రెడ్డి ప్రవళ్లిక ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించేందుకు ముందుకు వచ్చారు.కేవలం 20 రోజుల్లో..ఏడాదిన్నర క్రితం స్క్రిప్టును కన్నడ స్టార్హీరో డాక్టర్ శివరాజ్కుమార్కు పంపించాను. బెంగళూరు రావాలని సెప్టెంబరులో ఆయన మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. అప్పటి నుంచి కేవలం ఇరవై రోజుల్లోనే శివరాజ్కుమార్ గుమ్మడి పాత్రను చేసేందుకు అంగీకరించడంతో పాటు ఒక రోజు షూట్లో పాల్గొనడంతో టీజర్ రిలీజ్ చేశాం. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్ జిల్లాలోని పలు లొకేషన్లలో షూటింగ్ జరిపేలా ప్లాన్ చేస్తున్నాం. గుమ్మడి పాత్రలో కనిపించేందుకు శివరాజ్కుమార్ చాలా ఉత్సాహంతో ఉన్నారు.వారిద్దరు ఇంకా కలుసుకోలేదురియల్ హీరో గుమ్మడి నర్సయ్య రీల్ హీరో శివరాజ్కుమార్లు ఇంకా నేరుగా కలుసుకోలేదు. కేవలం ఫోన్లోనే ఇద్దరూ మాట్లాడుకున్నారు. షూటింగ్కు ముందు ఒకసారి ఇద్దరు కలిసే అవకాశముంది. గుమ్మడి నర్సయ్య ట్రైలర్ రిలీజైన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా గుమ్మడి గౌరవం పెంచేలా భావి తరాలకు స్ఫూర్తిని ఇచ్చేలా ఈ చిత్రం ఉండబోతోంది. -
విజయ్ దేవరకొండతో పెళ్లి.. క్యూట్గా 'రష్మిక' సమాధానం (వీడియో)
టాలీవుడ్లో ఆన్స్క్రీన్ ఫేవరెట్ జంట ఎవరంటే.. విజయ్ దేవరకొండ- రష్మిక గురించే మొదట చెప్తారు. అక్టోబర్ 3న వీరి నిశ్చితార్థం జరిగిందని వారి సన్నిహితులు వెల్లడించారు. కానీ, ఈ జోడీ మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. అయితే, వీరిద్దరూ ఒకేరకమైన ఉంగరాలు పెట్టుకొని ఈ మధ్య కనిపించడంతో అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్మిక నటించిన కొత్త సినిమా ది గర్ల్ఫ్రెండ్ ట్రైలర్ ఈవెంట్లో తన పెళ్లి గురించి టాపిక్ రాగానే అవుననే సిగ్నల్ ఆమె ఇచ్చేసింది.ది గర్ల్ఫ్రెండ్ సినిమా ఈవెంట్లో యాంకర్ వేసిన ప్రశ్నతో రష్మిక పెళ్లి గురించి మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఒక వ్యక్తిని బాయ్ఫ్రెండ్గా ఎంపిక చేసుకోవాలంటే ఎలా జడ్జ్ చేయాలని రష్మికను యాంకర్ అడుగుతుంది. ఆ సమయంలో ప్రేక్షకుల నుంచి విజయ్ దేవరకొండను అడిగితే చెప్తారని సమాధానం వస్తుంది. అప్పుడు రష్మిక కూడా నవ్వుతూ కనిపిస్తుంది. రష్మిక ఎలాంటి అబ్బాయిని ఇష్టపడుతుంది అంటూ యాంకర్ మరో ప్రశ్న వేయగానే మళ్లీ ఆడియన్స్ నుంచి రౌడీ (విజయ్ దేవరకొండ) లాంటి వ్యక్తినే అంటూ ఆన్సర్ వస్తుంది. ఆ సమయంలో రష్మిక కూడా చిరునవ్వుతో అందరికీ తెలుసే.. అంటూ చేతులతో అవుననే సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఇలాగైనా ఫ్యాన్స్కు ఒక క్లారిటీ వచ్చినట్లు అయింది. అయితే, వచ్చే ఏడాదిలో రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Captures by Chan (@celebrities_tollywood_) -
కొద్దిరోజులుగా మాస్క్తోనే రష్మిక.. కారణం ఇదేనా..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొద్దిరోజులుగా మాస్క్లోనే కనిపించేది.. కానీ, తాను నటించిన కొత్త సినిమా ‘ది గర్ల్ఫ్రెండ్’ ట్రైలర్ ఈవెంట్ కోసం మాస్క్ లేకుండా మెరిసింది. ట్రైలర్ను చూస్తే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. తన నటనకు ఎక్కువ స్కోప్ ఉందని తెలుస్తోంది. అయితే, ఈ మూవీ విడుదల తర్వాత తన గురించి మరోసారి పాన్ ఇండియా రేంజ్లో గట్టిగా మాట్లాడుకోవడం ఖాయమని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అయితే, కొద్దిరోజులుగా రష్మిక ఎక్కడ కనిపించినా సరే మాస్క్ పెట్టుకునే ఉండేది. తాజాగా జరిగిన ట్రైలర్ ఈవెంట్కు మాత్రం మాస్క్ లేకుండానే వచ్చేశారు.రష్మిక తరచూ ముఖానికి మాస్క్ వేసుకుని కనిపించడంతో అభిమానులు కూడా ఏమై ఉంటుందనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఆమె గత వారం చెన్నై విమానాశ్రయంలో మాస్క్ ధరించే మెరిశారు. ఆ సమయంలో ముఖానికి మాస్క్ తొలగించమని ఫొటోగ్రాఫర్లు కోరగా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నందువల్ల కుదరదని ఆమె పేర్కొన్నారు. దీంతో రష్మిక మందన్నాకు ఏమైందని ఆరా తీయగా ఆమె తన అందాన్ని మరింత మెరుగు పరచుకునే విధంగా ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారని తెలిసింది. చాలారోజుల తర్వాత ‘ది గర్ల్ఫ్రెండ్’ సినిమా కోసం మాస్క్ లేకుండా కనిపించి ఫ్యాన్స్లో జోష్ నింపారు. మరింత గ్లామర్గా కనిపిస్తున్న రష్మిక ఫోటోలు, వీడియోలు నెట్టింట షేర్ అవుతున్నాయి.రీసెంట్గా థామా సినిమాతో మెప్పించిన రష్మిక.. ‘ది గర్ల్ఫ్రెండ్’ సినిమాతో మరోసారి అభిమానులను పలకరించనున్నారు. దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో నటించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా నవంబరు 7న విడుదల కానుంది. -
అందులో అసభ్యత ఎక్కడుంది: లియో నటి
బహు భాషా కథానాయికల్లో ఒకరు నటి మడోనా సెబాస్టియన్(Madonna Sebastian). ఈ మాలీవుడ్ బ్యూటీ మాతృభాషతో పాటు కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ దక్షిణాది కథానాయకిగా గుర్తింపు పొందారు. తమిళంలో విజయ్ సేతుపతికి కాదలుమ్ కడందు పోగుమ్, కవన్, జూంగా చిత్రాల్లో నటించారు. అదేవిధంగా ఇటీవల ప్రభుదేవా సరసన జాలీ ఓ జింఖానా చిత్రంలో నటించారు. అయితే తన 13 ఏళ్ల కెరీర్లో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించారు. ఏదేమైనా ఎందుకనో అనుకున్న స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేక పోయారు. ఇటీవల లియో చిత్రంలో విజయ్కు చెల్లెలిగా నటించారు. హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే ఇప్పుడు ఏకైక మార్గం గ్లామర్గా మారింది. ఇందుకు నటి మడోనా సెబాస్టియన్ అతీతం కాదనిపించారు. ఇటీవల గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తలో నానుతున్నారు. ఇదే క్రమంలో నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే విమర్శలు హీరోయిన్లకు కొత్తవి కాదు కాబట్టి ఈ అమ్మడు కూడా వాటిని తిప్పి కొడుతున్నారు. పైగా అందాలు ఆరబోత తప్పేమీ కాదు అంటూ సమర్ధించుకుంటున్నారు. గ్లామర్కు అసభ్యతకు మధ్య వ్యత్యాసం తెలిస్తే చాలు అని అన్నారు. గ్లామర్ను విమర్శించడానికి ఏమీ లేదన్నారు. మొత్తం మీద తను గ్లామర్కు గేట్లు తెలిసినట్లు ఈ అమ్మడు చెప్పకనే చెప్పారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) -
బాహుబలి తిరిగొచ్చాడు
‘‘నేను రాజైన తర్వాత నువ్వే నా సేనాధిపతివి’’ అనే డైలాగ్తో మొదలైంది ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ట్రైలర్. ప్రభాస్ హీరోగా రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బాహుబలి’. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా (బాహుబలి: ది బిగినింగ్ (2015), బాహుబలి: ది కన్క్లూజన్ (2017) విడుదలైంది.బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలూ బ్లాక్బస్టర్స్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ‘బాహుబలి: ది ఎపిక్’ టైటిల్తో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ‘వచ్చే విజయదశమికి అదే ముహూర్తంలో భళ్లాల దేవుడికి మహారాజా పట్టాభిషేకం’, ‘మీరు మాహిష్మతి సింహాసనాన్ని అధిష్ఠించాలి... అదే నా కోరిక’, ‘దేవసేన నీది... నేను మాటిస్తున్నాను...’, ‘నేను నీవాణ్ణి దేవసేన...’, ‘మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తానివి నువ్వు...’, ‘ఏది మరణం... మన గుండె ధైర్యంకన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం... ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను...’, ‘బాహుబలి తిరిగొచ్చాడు’ అనే డైలాగ్స్ ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ట్రైలర్లో ఉన్నాయి. -
ఇండో–కొరియన్ హారర్
వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా, హాస్య నటుడు సత్య మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్లోని ఈ 15వ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇండియా, విదేశీ లొకేషన్స్లో ఇప్పటికే మూడు మేజర్ షూటింగ్ షెడ్యూల్స్ను పూర్తి చేశారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. వరుణ్ తేజ్తో పాటు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘‘వరుణ్ తేజ్ కెరీర్లో స్పెషల్ ప్రాజెక్ట్ ఇది. హారర్–కామెడీ, ఇండో–కొరియన్ బ్యాక్డ్రాప్, యునిక్ కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ‘తొలి ప్రేమ’ (2018) తర్వాత వరుణ్ తేజ్–సంగీత దర్శకుడు ఎస్. తమన్ల కాంబినేషన్లో మరోసారి అదరగొట్టే ఆల్బమ్ రానుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఇక ఈ చిత్రానికి మేకర్స్ ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ అనుకుంటున్నారని, రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం కథనం సాగుతుందని సమాచారం. -
బైకర్... మేకోవర్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్’. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘‘శర్వానంద్ కెరీర్లో 36వ చిత్రంగా ‘బైకర్’ రూపొందుతోంది. స్పోర్ట్స్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రోఫెషనల్ మోటార్ సైకిల్ రేసర్ పాత్రలో కనిపించబోతున్నారాయన. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు శర్వా. పాత్రకు సరిపడేలా లీన్ అండ్ అథ్లెటిక్ బాడీని తీర్చిదిద్దుకున్నారు. శర్వా కొత్త లుక్, కథ, కాన్సెప్ట్, టాప్ టెక్నికల్ టీమ్.. ఇవన్నీ కలసి ‘బైకర్’ సినిమాను ఒక థ్రిల్లింగ్ ఎమోషనల్ రైడ్గా మార్చబోతున్నాయి. ఈ మూవీ ద్వారా అభిమానులు ఆయన్ని కొత్త లుక్లో చూడటానికి ఎదురు చూస్తున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన ‘బైకర్’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకి కెమెరా: జె. యువరాజ్, సంగీతం: జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎన్. సందీప్. -
లెక్క తగ్గేదే లే! నవంబరులోనూ సినిమాల సందడి
అక్టోబరు నెలలో చిన్నా పెద్దా కలుపుకుని దాదాపు డజను సినిమాలకు పైగానే విడుదలయ్యాయి. ఫైనల్లీ ‘మాస్ జాతర, ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమాల విడుదల (అక్టోబరు 31)తో ఈ నెల ముగుస్తుంది. ఆ తర్వాత మొదలయ్యే నవంబరులోనూ ‘లెక్క తగ్గేదే లే’ అంటూ... సినిమాల సందడి జోరుగా ఉండబోతోంది. ‘జటాధర, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా, ది గర్ల్ ఫ్రెండ్’ వంటి పలు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా పలు బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ కూడా ఆడియన్స్ ముందుకు రానున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం...యాక్షన్ డ్రామా... మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన మోహన్లాల్ లీడ్ రోల్లో నటించిన తాజా పాన్ ఇండియన్ చిత్రం ‘వృషభ’. రాగిణి ద్వివేది, సమర్జిత్ లంకేష్, నయన సారిక ముఖ్య పాత్రలు పోషించారు. నందకిశోర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్, అభిషేక్ ఎస్. వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం నవంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, మలయాళ భాషల్లోనే కాదు... హిందీ, కన్నడలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ‘‘హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘వృషభ’లో అద్భుతమైన విజువల్స్ ఉంటాయి. బంధాలు, త్యాగాల కలయికగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు గొప్పగా కనెక్ట్ అవుతుంది. అలాగే చక్కని అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. సరికొత్త ప్రేమకథ ఓ వైపు హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా దూసుకెళుతున్నారు రష్మికా మందన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాలో రష్మికకి జోడీగా దీక్షిత్ శెట్టి నటించారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ మూవీ నిర్మించారు.ఈ సినిమా నవంబరు 7న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ‘‘సరికొత్త ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ బ్యూటిఫుల్ లవ్స్టోరీని తనదైన శైలిలో చక్కగా తెరకెక్కించారు రాహుల్ రవీంద్రన్. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టిల జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్. సూపర్ నేచురల్ బ్యాక్డ్రాప్లో... సుధీర్ బాబు హీరోగా రూపొందిన పాన్ ఇండియన్ చిత్రం ‘జటాధర’. ఈ సినిమాలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, అవసరాల శ్రీనివాస్, రవిప్రకాశ్, ఇందిరా కృష్ణన్, రోహిత్ పాఠక్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సాల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న విడుదల కానుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో సుధీర్ బాబు పాత్ర కొత్తగా ఉండనుంది.బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా ధన పిశాచి అనే పవర్ఫుల్ రోల్ చేశారు. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘జటాధర’. అద్భుతమైన కథ, భావోద్వేగాలతో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతి ఇచ్చేలా ఉంటుంది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఎంతో కష్టపడ్డారు. రాయిస్, జైన్, సామ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే విడుదల కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సినీ ప్రయాణంలో ‘జటాధర’ ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.మైథలాజికల్ థ్రిల్లర్ రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘చిరంజీవ’. ఈ సినిమాకి ‘జబర్దస్త్’ ఫేమ్ అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కుషిత హీరోయిన్ గా నటించగా, శ్రీరంజని, అమిత్ భార్గవ్, గడ్డం నవీన్, ఇమ్మాన్యుయేల్, టేస్టీ తేజ కీలక పాత్రధారులు. స్ట్రీమ్ లైన్ ప్రోడక్షన్ బ్యానర్పై రాహుల్ యాదవ్, సుహాసిని నిర్మించారు. ఈ మూవీని నేరుగా ఆహా ఓటీటీలో నవంబరు 7న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దసరా పండగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం టీజర్లో ‘నీ స్పీడుకు నువ్వు చేయాల్సిన జాబ్ ఏంటో తెలుసా?.. అంబులెన్స్ డ్రైవర్.. ’ వంటి డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి. ‘‘మైథలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘చిరంజీవ’. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నారు. తనకి సూపర్ పవర్స్తో పాటు ఎవరి చావు ఎప్పుడు వస్తుందో ముందే తెలిసే పవర్ ఉంటుంది. ఈ పవర్స్ వల్ల శివ ఎలా లాభపడ్డాడు? ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాడు? వంటి విషయాలు మా చిత్రంలో ఆసక్తిగా ఉంటాయి’’అని మేకర్స్ తెలిపారు. నవ్వుల్ నవ్వుల్ ‘మసూద’ (2022) సినిమాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తిరువీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్గా నటించారు. 7 పి.ఎం ప్రోడక్షన్స్, పప్పెట్ షో ప్రోడక్షన్స్ బ్యానర్స్పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం రూపొందింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేసిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ టీజర్కి మంచి స్పందన వచ్చింది. ‘‘ఈ మూవీ టీజర్ చూడగానే సినిమా చూడాలనిపిస్తోంది. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించడానికి ధైర్యం, ΄్యాషన్ ఉండాలి’’ అంటూ శేఖర్ కమ్ముల చెప్పడంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కథ వింటున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. మా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్విస్తుంది. ఈ కథ నచ్చడంతో పప్పెట్ షో అనే బ్యానర్ని స్థాపించి, పారితోషికం తీసుకోకుండా ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యాను’’ అని తిరువీర్ పేర్కొనడం విశేషం. పీరియాడికల్ డ్రామా ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సముద్ర ఖని కీలక పాత్ర పోషించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ ΄÷ట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న రిలీజ్ కానుంది.‘‘పీరియాడికల్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘కాంత’. 1950 చెన్నై నేపథ్యంతో పాటు గోల్డెన్ ఏజ్ బ్యాక్డ్రాప్లో రూపొందిన చిత్రమిది. అద్భుతమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఝను చంతర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ, వింటేజ్ లవ్స్టోరీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. వినోదాల సంతాన ప్రాప్తిరస్తు విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, తరుణ్ భాస్కర్, శ్రీలక్ష్మి, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్యకృష్ణ, తాగుబోతు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న రిలీజ్ అవుతోంది.‘‘మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఒక సమకాలీన అంశాన్ని కథలో చూపిస్తూ వినోదాత్మకంగా తీశాడు సంజీవ్ రెడ్డి. విక్రాంత్, చాందినీ చౌదరి జోడీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలోని వినోదం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కల్యాణి ఓరుగంటి పాత్రలో చాందినీ చౌదరి ఆకట్టుకోనున్నారు. రచయిత షేక్ దావూద్ జి. అందించిన స్క్రీన్ ప్లే మా చిత్రానికి అదనపు ఆకర్షణ. సునీల్ కశ్యప్ సంగీతం హైలైట్గా నిలుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. వీరాభిమాని సందడి రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ ΄÷లిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఈ మూవీలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, తులసి రామ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబరు 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో సూర్య కుమార్ అనే ఆన్ స్క్రీన్ సూపర్ హీరో పాత్రలో నటిస్తున్నారు ఉపేంద్ర. ఆయన వీరాభిమానిగా రామ్ కనిపించనున్నారు.వివేక్– మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పాటలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం కోసం రామ్ స్వయంగా ఓ పాట పాడటం విశేషం. ‘‘ఈ చిత్రంలో సూపర్ స్టార్ సూర్య కుమార్ (ఉపేంద్ర) వీరాభిమాని సాగర్గా రామ్ నటిస్తున్నారు. ఆయన నటన సూపర్బ్గా ఉంటుంది. ప్రతి హీరో అభిమాని... రామ్ పాత్రలో తమను తాము చూసుకుంటారు. భాగ్యశ్రీ అందం, అభినయం ఈ చిత్రానికి ప్లస్. తొలి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ ΄÷లిశెట్టి’తో పెద్ద విజయాన్ని అందించిన డైరెక్టర్ మహేశ్బాబు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే మరో మంచి కథతో రాబోతున్నాడు. టీజర్తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు నవంబరులో విడుదలకు ముస్తాబయ్యే అవకాశాలున్నాయి. టాలీవుడ్లోనే కాదు... బాలీవుడ్లో, హాలీవుడ్లోనూ పలు చిత్రాలు నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇమ్రాన్ హష్మి, యామీ గౌతమ్ జోడీగా నటించి ‘హక్’ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. అలాగే ‘ప్రిడేటర్: బాడ్ల్యాండ్స్’ అనే హాలీవుడ్ మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ఇక అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, రకుల్ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ ‘దే దే ΄్యార్ దే 2’ నవంబరు 14న విడుదల కానుంది. అదే విధంగా అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్లో నటించిన ‘120 బహదూర్’ అనే హిందీ చిత్రం, ‘వికెడ్ 2’ అనే హాలీవుడ్ మూవీ నవంబరు 21న రిలీజ్ అవుతున్నాయి. అలాగే ధనుష్, కృతీ సనన్ జోడీగా నటించిన హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మే’, ‘జూటోపియా 2’ అనే హాలీవుడ్ మూవీ నవంబరు 28న విడుదలకు ముస్తాబయ్యాయి. వీటితో పాటు మరికొన్ని మూవీస్ కూడా రిలీజ్కి రెడీ అవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
ఆషికా స్పెయిన్ ట్రిప్.. 'అత్త' బర్త్ డే సెలబ్రేషన్స్!
స్పెయిట్ ట్రిప్లో 'విశ్వంభర' బ్యూటీ ఆషికా'అత్తారింటికి దారేది' నదియా బర్త్ డే సెలబ్రేషన్స్అబుదాబి ట్రిప్ వీడియో షేర్ చేసిన ప్రియాంకఓరకంట చూస్తూ వయ్యారంగా బిగ్బాస్ దివిలూజు షర్ట్తో అందంగా రకుల్ ప్రీత్ సింగ్వాణీ కపూర్తో రాశీఖన్నా క్యూట్ మూమెంట్స్ View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nadiya Moidu (@simply.nadiya) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
అర్థరాత్రి 2 వరకు షూటింగ్.. డ్రెస్సింగ్ రూమ్లోనే రెస్ట్, రష్మిక కష్టాలు!
ఒకవైపు తెలుగు మరోవైపు బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయారు నేషనల్ క్రష్ రష్మిక(Rashmika). పుష్ప సినిమా తర్వాత ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది. చేతిలో మూడు, నాలుగు పాన్ ఇండియా సినిమా ఉన్నాయి. అయినా కూడా లేడీ ఓరియెంటెండ్ ఫిల్మ్ ‘ది గర్ల్ఫ్రెండ్’కి ఓకే చెప్పింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం కోసం రష్మిక చాలా కష్టపడాల్సి వచ్చిందట. అంతేకాదు ముందుగా పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సినిమా రిలీజ్ తర్వాతే తన రెమ్యునరేషన్ ఇవ్వమని చెప్పిందట. ఈ విషయం స్వయంగా చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలేనియే చెప్పారు.నేడు(అక్టోబర్ 25) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధీరజ్ మాట్లాడుతూ..‘నా కెరీర్ మొత్తంలో పది సినిమాలు చేసినా అవి గుర్తుండిపోవాలి అనుకుంటాను. వాటిలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు ఈ సినిమాను తప్పకుండా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం. రష్మికకు కథ వినిపించగానే వెంటనే ఓకే చెప్పేసింది. తర్వాత రెమ్యునరేషన్ కోసం తన మేనేజర్ని కలిసేందుకు ప్రయత్నించాడు. ఆయన సరిగా స్పందించకపోవడంతో నేరుగా రష్మికనే కలిసి పారితోషికం గురించి అడిగాను. అప్పుడు ఆమే‘నాకు ఇప్పుడు ఏం ఇవ్వకండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నా పారితోషికం ఇవ్వండి’ అని చెప్పింది. ఆమె చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక చాలా బిజీగా ఉంది. ఒకవైపు పుష్ప 2 షూటింగ్లో పాల్గొంటూనే.. మరోవైపు మా సినిమా కోసం టైం కేటాయించింది. అర్థరాత్రి 2 గంటల వరకు పుష్ప 2 షూటింగ్ చేసుకొని.. ఉదయం 7 గంటలకల్లా మా సినిమా సెట్లో ఉండేది. రెండు, మూడు నెలల పాటు ఆమె సరిగ్గా నిద్రపోలేదు. ఓ సినిమా కోసం ఫారిన్ వెళ్లి..తెల్లవారుజామున 4 గంటలకల్లా హైదరాబాద్ వచ్చేది. డ్రెస్సింగ్ రూమ్లోనే కాసేపు రెస్ట్ తీసుకొని..ఉదయం 8 గంటలకల్లా సెట్స్లో ఉండేది. అలాంటి సపోర్ట్ మరెవరూ ఇవ్వలేరు అనిపించింది. రష్మిక లేకుంటే "ది గర్ల్ ఫ్రెండ్" సినిమానే లే లేదు’ అని ధీరజ్ ఎమోషనల్గా చెప్పారు. -
నాగార్జున రూట్లోనే చిరంజీవి.. కోర్ట్ ఆదేశాలు
మెగాస్టార్ చిరంజీవి ఫొటోలు, గొంతు లాంటివి ఇకపై ఎవరైనా సరే అనుమతి లేకుండా ఉపయోగిస్తే అంతే సంగతులు. ఎందుకంటే చిరు వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్.. శనివారం (అక్టోబరు 25) మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పిటిషన్లో పేరు పొందిన పలువురితోపాటు ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అయినా చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన పేరు, గాత్రం తదితర అంశాల్ని వినియోగించడాన్ని న్యాయస్థానం నిషేధించింది.అలానే కృత్రిమ మేథస్సు (ఏఐ)తో తయారు చేసిన మార్ఫ్ ఫొటోలు, వీడియోలు వినియోగించడాన్ని కూడా ఆపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు దృష్టికి చిరంజీవి తీసుకువచ్చారు. ఆయన పేరుతో వీడియో, మీమ్స్ చేసి అనుమతి లేకుండా వినియోగిస్తున్నారని.. తద్వారా ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలుగుతోందని చిరంజీవి తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. (ఇదీ చదవండి: నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్)ఈ ఆదేశాల ప్రకారం చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్, గొంతు, ఆయనకు మాత్రమే సొంతమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలని ఏ రూపంలోనైనా ఏ మాధ్యమంలోనైనా ఉపయోగించొద్దని న్యాయస్థానం ఆదేశించింది. గతంలో నాగార్జున కూడా ఇలానే న్యాయస్థానం నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు.ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలు చేస్తున్నారు. వీటిలో 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. వచ్చే వేసవిలో 'విశ్వంభర' థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: 'కాంతార' రిషభ్ ఇంట్లో ఇన్ని కార్స్ ఉన్నాయేంటి?) -
మరో సీక్వెల్లో ప్రభాస్.. రెండేళ్లు ఆగాల్సిందే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) షెడ్యూల్ ఇప్పుడు చాలా బిజీగా ఉంది. ఆయన నటించిన ది రాజాసాబ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పౌజీ’(Fauzi) సినిమా చేస్తున్నాదు. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయబోతున్నాడు. మరోవైపు సలార్, కల్కి చిత్రాలకు సీక్వెల్స్ కూడా చేయబోతున్నాడు. ఇంత బిజీగా ఉన్న ప్రభాస్.. తాజాగా మరో సీక్వెల్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అదే ది రాజాసాబ్ 2.మారుతి స్టైల్ నచ్చి..మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’(The Raja Saab) సినిమా చేశాడు. ఇప్పటికే షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా సీక్వెల్పై స్పష్టత ఇచ్చాడు. ‘రాజాసాబ్ 2’ ఉంటుందని.. కాకపోతే ఇది తొలి భాగానికి కొనసాగింపులా ఉండదని.. థీమ్, సెటప్ ఒకే తరహాలో ఉంటాయని ఓ ప్రెస్మీట్లో ఆయన చెప్పారు. అయితే అప్పటికీ మారుతి కథ సిద్ధం చేయలేదు. కానీ ప్రభాస్ మాత్రం మారుతితో మరోసారి పని చేయడానికి ఆసక్తి చూపించాడట. దీంతో మారుతి ఇటీవల రాజాసాబ్ 2 స్టోరీకి సంబంధించిన లైన్ని ప్రభాస్కి చెప్పాడట. అది బాగా నచ్చడంతో ‘చేసేద్దాం డార్లింగ్’అని ప్రభాస్ చెప్పినట్లు సమాచారం.రెండేళ్ల వరకు ఆగాల్సిందే..ప్రభాస్ ఇప్పుడు పౌజీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే..వెంటనే ‘స్పిరిట్’చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. ఆ తర్వాత సలార్ 2 లేదా కల్కి 2 చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లాలి. ఇవన్నీ పూర్తయ్యేవరకు దాదాపు రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాతే ప్రభాస్ మరో కొత్త సినిమాని ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే రాజాసాబ్ సీక్వెల్ ఉన్నా.. రెండేళ్ల తర్వాత దాన్ని సెట్స్పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రభాస్తో సినిమా కాబట్టి మారుతి కచ్చితంగా ఆగుతాడు. అందులో నో డౌట్. ది రాజాసాబ్ రిలీజ్ తర్వాత రిజల్ట్ని బట్టి పార్ట్ 2 ఉంటుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. -
'వార్ 2' నష్టం.. షారుఖ్ ఖాన్ సాయం..!
ఎన్టీఆర్, హృతిక్రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’(WAR 2). భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో మెప్పించలేదు. దీంతో యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా వచ్చే తదుపరి చిత్రం 'ఆల్పా'పై ఎక్కవ ప్రభావం చూపనుంది. ఈ స్పై యూనివర్స్ నుంచి ఇప్పటికే వచ్చిన పఠాన్, వార్-1 చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే, వార్ 2తో ఈ ఫ్రాంచైజీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. దీంతో స్పై యూనివర్స్ నుంచి రానున్న చిత్రాలపై మిశ్రమ స్పందన వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఫ్రాంచైజీని కాపాడుకునేందుకు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)ను నిర్మాత ఆదిత్య చోప్రా సంప్రదించారని తెలుస్తోంది. యశ్రాజ్ ఫిల్మ్స్; స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో విడుదల కానున్న చిత్రం 'ఆల్ఫా'.., ఇందులో అలియా భట్( Alia Bhatt), శార్వరి వాఘ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఇందులో బాబీ డియోల్, అనిల్ కపూర్ కూడా నటించారు. వార్ 2 పరాజయం కారణంగా, YRF అధినేత ఆదిత్య చోప్రా తమ ఫ్రాంచైజీ ఉణికిని కాపాడుకునేందుకు షారుఖ్ ఖాన్ సాయం కోరారని తెలుస్తోంది. 'ఆల్ఫా' చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటించాలని నిర్మాత ఆదిత్య చోప్రా కోరినట్లు బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆల్ఫా దర్శకుడు శివ్ రావేల్ కూడా షారుఖ్ కోసం సరైన పాత్రను ప్లాన్ చేశారని టాక్.యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలోని షారుఖ్ పాత్రకు బాలీవుడ్లో భారీ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల, ఆల్ఫాలో అతిధి పాత్రలో షారుఖ్ నటిస్తే సినిమాకు లాభం చేకూరుతుందని ఆదిత్య చోప్రా అభ్యర్థించినట్లు చెబుతున్నారు. కానీ, షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం కింగ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే, ఆదిత్య కోరికమేరకు షారుఖ్ ఖాన్ తన షెడ్యూల్స్ను మార్చుకోనున్నారట. 'ఆల్పా'లో ఆయన అతిధి పాత్రలో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ స్పై యూనివర్స్లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంగా 'ఆల్ఫా' రానుంది. మునుపెన్నడూ చూడని భారీ యాక్షన్ సన్నివేశాలను ఇందులో చూడొచ్చని గతంలో ఈ చిత్ర దర్శకుడు శివ్ రావేల్ చెప్పారు. -
'ది గర్ల్ఫ్రెండ్' ట్రైలర్: బ్రేక్ తీసుకుందామా?
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి జంటగా నటించిన చిత్రం ది గర్ల్ఫ్రెండ్ (The Girlfriend Movie). హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో యాక్ట్ చేసింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమాను నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. శనివారం (అక్టోబర్ 25న) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.అదిరిపోయిన ట్రైలర్అందులో 'మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? చిన్న అంటే చిన్న కాదు.. ఒక బ్రేక్లా..' అని రష్మిక డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. నువ్వు విక్రమ్తో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావా? విక్రమ్కైతే నీలాంటి అమ్మాయి పర్ఫెక్ట్.. కానీ, వాడు నీకు కరెక్ట్ కాదు అని రష్మికకు సలహా ఇచ్చింది అను ఇమ్మాన్యుయేల్. ఇక మరో సీన్లో.. ఇంత క్యారెక్టర్లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడు అంటూ రావు రమేశ్.. రష్మిక చెంప పగలగొట్టాడు. అలా ఫుల్ ఎమోషనల్గా ట్రైలర్ కొనసాగింది. ఆ ట్రైలర్ మీరూ చూసేయండి.. -
తండ్రి కాబోతున్న దగ్గుబాటి హీరో?
టాలీవుడ్ హీరో రానా(Rana Daggubati ) తండ్రి కాబోతున్నారు. త్వరలోనే దగ్గుబాటి ఇంట్లోకి వారసుడు/ వారసురాలు రాబోతున్నారు. రానా సతీమణి మిహిక బజాజ్(Miheeka Bajaj) గర్భం దాల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని రానా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఓ మంచి రోజు చూసి ఈ గుడ్ న్యూస్ని తన అభిమానులతో పంచుకోవాలని రానా భావిస్తున్నారట. గతంలోనూ మిషికా ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఈ వార్తలను రానా దంపతులిద్దరూ కొట్టిపారేశారు. చాలా కాలం తర్వాత మరోసారి రానా తండ్రి కాబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ సారి కూడా పుకారుగానే మిగిలిపోతుందా? లేదా నిజంగానే రానాకి ప్రమోషన్ వచ్చిందా అనేది తెలియాలంటే వాళ్లు స్పందించేవరకు ఆగాల్సిందే. రానా, మిహికాలది ప్రేమ వివాహం. ముంబైలో ఇంటీరియర్ డిజైనర్గా పని చేసే మిహీకా స్వస్థలం హైదరాబాద్. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. కానీ లాక్డౌన్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడినట్లు ఓ ఇంటర్వ్యూలో రానా చెప్పారు. వీరిద్దరి పెళ్లి 2020 ఆగస్టు 8న జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. రానా వారసత్వంగా వస్తున్న వ్యాపారాలను చూసుకుంటూనే.. నిర్మాతగా, నటుడిగానూ కొనసాగుతున్నాడు. -
బిగ్బాస్లో బాడీ షేమింగ్.. దివ్యపై సంజన వ్యాఖ్యలు
బిగ్బాస్ షో అంటేనే బూతులకు కేరాఫ్ అంటూ చాలామంది విమర్శించడం చూస్తూనే ఉన్నాం. గతంలో సీపీఐ నారాయణ మరో అడుగు ముందుకేసి ఏకంగా బ్రోతల్ హౌస్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుబట్టారు. అయితే, గతంలో ఎప్పుడూ లేనంత విమర్శలు బిగ్బాస్ 9వ సీజన్ మీద వస్తున్నాయి. రోజురోజుకూ షో మరీ దిగజారిపోయిందనే అభిప్రాయం కనిపిస్తుంది.హౌస్లో నటి సంజన గల్రానీ ప్రవర్తన, ఆమె చేస్తున్న కామెంట్లు చాలా అభ్యంతరకంగానే ఉన్నాయి. వాటిని ఏకంగా టెలికాస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏకంగా దివ్య అనే కామనర్ పట్ల సంజన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసింది. దివ్య ఒక రోడ్ రోలర్ మాదిరిగా మీదికి ఎక్కేస్తుందంటూ రమ్యతో చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోసారి కల్యాణ్ పట్ల కూడా ఆమె ఇలాగే ప్రవర్తించింది. తాను క్లాస్ అంటూ 'కల్యాణ్' లో క్లాస్ అంటూ పేర్కొంది. ఒక సెలబ్రిటీ (తనూజ) చుట్టూ తిరుగుతున్నావ్ అంటూ కల్యాణ్పై చీప్ కామెంట్లు చేసింది.మరోసారి తనూజ పట్ల కూడా జలసీ రాణీ అంటూ హైపర్ అయిపోయింది. ఇలా సంజన పదేపదే నోరు జారడం పరిపాటిగా మారిపోయింది. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని షోలో టెలికాస్ట్ అవుతున్నాయి. మరికొన్ని లైవ్ ఎపిసోడ్స్లో వస్తున్నాయి. ఒకసారి తనూజ కూడా రాము రాథోడ్ను చాలా చులకన చేసి మాట్లాడిన సందర్భం ఉంది. ఇలాంటి ధోరణితో సమాజానికి ఏం చెప్పాలని బిగ్బాస్ చూస్తున్నాడు అంటూ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్లో సంజనను హోస్ట్ నాగార్జున నిలదీస్తారా..? లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బిగ్బాస్లో ఎప్పుడూ అరుపులు, బూతులు మాత్రమే వినిపిస్తున్నాయ్ అంటూ అభిప్రాయం కనిపిస్తుంది. బిగ్బాస్లో ఈసారి ఎక్కువగా కాంట్రవర్సీ కేరక్టర్లను ప్రవేశపెట్టారని తెలుస్తోంది. దీంతోనే ఎక్కువ వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.Can I get answer from #sanjanagalrani for this body shaming I this weekend @iamnagarjuna ??Rt for more visibility#biggbosstelugu9 #biggboss9telugupic.twitter.com/loa7fPlY3b— Edits reposter (@Inspiritmodee) October 24, 2025 -
అల్లు అర్జున్ స్పెషల్ వీడియో.. రెండు లారీల థాంక్స్ చెప్పిన నాగ్
తెలుగు ఇండస్ట్రీలో కొత్త శకానికి నాంది పలికిన సినిమా శివ (Shiva Movie). రాంగోపాల్వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) హీరోగా నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమా నవంబర్ 14న రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో విడుదల చేశాడు. మన శివ మూవీ రిలీజ్ అయి దాదాపు 36 ఏళ్లవుతోంది. తెలుగు సినీ చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనూ ఇదొక ఐకానిక్ సినిమాగా నిలిచింది.రెండు లారీల పేపర్స్ఈ క్లాసిక్ సినిమాను సెలబ్రేట్ చేసుకునే సమయం వచ్చింది. ఈసారి థియేటర్స్కు రెండు లారీల పేపర్స్ తీసుకెళ్లండి అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను నాగార్జున షేర్ చేస్తూ.. డియర్ అల్లు అర్జున్ (Allu Arjun), నీకు రెండు లారీల థాంక్స్ అని ట్వీట్ చేశాడు. కాగా శివ సినిమాలో అమల హీరోయిన్గా నటించింది. 1989 అక్టోబర్ 5న రిలీజైన ఈ సినిమాకు అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మాతలుగా వ్యవహరించగా ఇళయరాజా సంగీతం అందించారు. ఇది తెలుగులో సెన్సేషన్ హిట్ అవడంతో శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నాడు ఆర్జీవీ. Dear @alluarjun rendu lorryla thanks to you !!!💥💥💥#Shiva4KOnNovember14th #50YearsOfAnnapurna #SHIVA #ANRLivesOn@RGVzoomin @amalaakkineni1 @ilaiyaraaja @AnnapurnaStdios #SGopalReddy @adityamusic pic.twitter.com/5FSZAyqpp5— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2025చదవండి: సౌత్ సినిమాలు ఇప్పటికైనా చూస్తున్నారు: ప్రియమణి -
సౌత్ సినిమాలు ఇప్పటికైనా చూస్తున్నారు: ప్రియమణి
ఇప్పుడంటే దక్షిణాది సినిమాలను దేశమంతా ఎగబడి చూస్తున్నారు కానీ, ఒకప్పుడు ఇక్కడి సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు! ఈ పరిస్థితి మారినందుకు ఆనందంగా ఉందని చెప్తోంది హీరోయిన్ ప్రియమణి (Priyamani). దశాబ్ద కాలంగా పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది సినిమాలు ఆడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది. అందుకు హ్యాపీఇండియా టుడేతో ప్రియమణి మాట్లాడుతూ.. జనాలు ఇప్పటికైనా దక్షిణాది సినిమా (South Indian Movies)లను చూస్తున్నందుకు హ్యాపీ. ప్రాంతీయ భాషా చిత్రాలను ఎంతో బాగా ఆదరిస్తున్నారు. అక్కడ ఎప్పటినుంచో మంచి సినిమాలున్నాయి. కానీ, గతంలో వాటికంత ప్రాధాన్యత దక్కకుండా పోయింది. ప్రతి భాషలోనూ అద్భుతమైన సినిమాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే వాటి గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఇప్పుడలాంటి చిత్రాలు భారీ విజయాలు అందుకోవడం నిజంగా గొప్ప విషయం. గీత చెరిగిపోవాలని కోరుకుంటున్నాసినిమాలే కాదు, దానికోసం పని చేసిన నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్ల గురించి కూడా చర్చించుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. ప్రాంతీయ సినిమాకు, హిందీ సినిమాకు మధ్య ఉన్న అడ్డుగోడలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ఏదో ఒకరోజు ఆ సరిహద్దులు పూర్తిగా చెరిగిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియమణి ద ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఈ సిరీస్లో మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.చదవండి: ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్ -
ఏనుగు దంతాల కేసులో మోహన్ లాల్కు ఎదురుదెబ్బ
మలయాళ నటుడు మోహన్ లాల్కు కేరళ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన ఇంట్లో రెండు జతల ఏనుగు దంతాలు (Ivory Tusks) ఉన్న విషయం తెలిసిందే. వాటిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే ఇంట్లో ఉంచానని గతంలో న్యాయస్థానానికి ఆయన తెలిపారు. అందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అనుమతి పత్రాలను కూడా చూపారు. ఏనుగు దంతాల విషయంలో మోహన్ లాల్ చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఆయన ఇంట్లో ఉన్నవి చనిపోయిన ఏనుగు దంతాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోర్టుకు తెలిపింది. అయితే, తాజాగా ఈ కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మోహన్లాల్కు ఇచ్చిన యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను న్యాయస్థానం రద్దు చేసింది. ఏనుగు దంతాల విషయంలో ఇలా అనుమతి ఇవ్వడం చట్టవిరుద్ధం.. మీకు నచ్చినట్లు అనుమతి ఎలా ఇస్తారని కేరళ ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.15 ఏళ్ల నుంచి ఏనుగు దంతాల కేసు మోహన్లాల్ను వెంటాడుతున్న సంగతి తెలిసిందే. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్లాల్ దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేసింది. 2012లో ఐటీ శాఖ అధికారులు మోహన్ లాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రెండు జతల ఏనుగు దంతాలను గుర్తించారు. దాంతో వన్యప్రాణుల చట్టం ప్రకారం మోహన్ లాల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమంగా ఏనుగు దంతాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. అయితే తాను చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్లు మోహన్ లాల్ చెప్పడంతో కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో 2016 జనవరి, ఏప్రిల్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ద్వారా మోహన్లాల్కు జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ పత్రాలను వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు తాజాగా కొట్టివేసింది. -
హీరోయిన్గా బిగ్బాస్ బ్యూటీ రతిక.. ఏకంగా మూడు భాషల్లో!
తెలుగు బిగ్బాస్ 7వ సీజన్లో పాల్గొని బాగా పాపులర్ అయింది రతిక (Rathika Ravinder). ఈ షోలో ఏకంగా రెండుసార్లు ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ తనపై వచ్చిన నెగెటివిటీ పోగొట్టుకోలేకపోయింది. ఇక సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు వేసే రతికా హీరోయిన్గా నటిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎక్స్వై. సీవీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్రానా, అనిజ్ ప్రభాకర్, శ్రీధర్ ఇతర పాత్రలు పోషించారు. ఎంకే సాంబశివం నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది.సినిమాఇటీవల ఈ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పిజ్జా, సూదు కవ్వుమ్, ఇరుది సుట్రు వంటి ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించడంతో పాటు మాయవన్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీవీ కుమార్. తాజాగా ఓ వైవిధ్యమైన కథాంశంతో ఆయన దర్శకత్వం వహించిన మరో ప్రయోగాత్మక చిత్రం ఎక్స్ వై. ఇదొక డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్ మూవీ అని ప్రేక్షకుల నుంచి కచ్చితంగా కితాబులు అందుకుంటుంది అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: హరిహరన్ ఆనందరాజా, సంగీతం: శ్రీకాంత్ కృష్ణ. చదవండి: ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్ -
సమంత 'మా ఇంటి బంగారం' షురూ!
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) నటిస్తున్న తాజా చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram Movie). ఇందులో సామ్ గృహిణిగా యాక్ట్ చేస్తోంది. సమంత బర్త్డే సందర్భంగా 2024లోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. కానీ, షూటింగ్ ప్రారంభించలేదు. అయితే ఈ వారంలోనే సినిమా చిత్రీకరణ షురూ అయిందని ఫిలిం నగర్ సమాచారం. ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. హైదరాబాద్లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో సమంత పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఇక ఈ సినిమాలో నటించడంతో పాటు సమంత తన నిర్మాణ సంస్థ ట్రలాలా పిక్చర్స్పై నిర్మిస్తున్నారు.సినిమాసమంత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. మహేశ్బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, రామ్చరణ్, నాగచైతన్య, నాని, నితిన్, విజయ్ దేవరకొండ... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించింది. ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లోనూ తనదైన నటనతో ఆకట్టుకుంది. ‘ఖుషి’ (2023) చిత్రం తర్వాత హీరోయిన్గా మరే సినిమా చేయలేదు. కాగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ని స్థాపించి శుభం అనే తొలి సినిమా నిర్మించింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారంతో పాటు ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్లో నటిస్తోంది.చదవండి: కమల్-రజనీ మూవీ.. శృతి హాసన్, సౌందర్య ఏమన్నారంటే? -
ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్!
Bigg Boss Telugu 9లో అనుకున్నదే జరిగింది. హౌస్ నుంచి ఆయేషా వెళ్లిపోయింది. మరోవైపు తనూజకు ఫెవికిక్లా అతుక్కుపోయింది మాధురి. తనకోసం రమ్యతో సైతం గొడవపడింది. తనూజనే ముఖ్యం అంటూ ఏదో నిజమైన అమ్మలా ఫీలైపోయింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (అక్టోబర్ 24వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..రీతూ కంటెండర్.. తట్టుకోలేకపోయిన మాధురివాంటెడ్ పేట టాస్క్లో సంజనాని పోలీసులకు పట్టించినందుకు తనూజ (Thanuja Puttaswamy) కెప్టెన్సీ కంటెండర్ అయింది. మాస్క్ మాధురి కటౌట్పై కిల్ అని రాసినందుకు రీతూ కూడా కంటెండర్ అయంది. కానీ, దీన్ని జీర్ణించుకోలేక రీతూపై విషం ఏదో ఒకరకంగా కక్కుతూనే ఉంది. డబ్బులు ఎక్కువ సంపాదించిన కంటెస్టెంట్లు నిఖిల్, కల్యాణ్, దివ్య, ఇమ్మాన్యుయేల్ సైతం కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఈ గేమ్లో చివరి వరకు తనూజ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు.స్పృహ తప్పిన తనూజ.. ఏడ్చేసిన కల్యాణ్కెప్టెన్సీ చేజారడంతో తనూజ ఎమోషనల్ అయింది. సడన్గా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను డాక్టర్ రూమ్కు తీసుకెళ్లారు. తనూజను అలా చూసి ఇమ్మూ, కల్యాణ్ (Pawan Kalyan Padala) తెగ ఏడ్చేశారు. కల్యాణ్ అయితే.. తనూజకు ఏదో అయిపోయినట్లు వెక్కెక్కి ఏడ్చాడు. అది చూసిన మాధురి.. హే, నువ్వెందుకు ఏడుస్తున్నావ్? జనాలు చూస్తే నవ్వుతారు. తను వీక్నెస్తో కళ్లు తిరిగి పడిపోతే నీకెందుకు ఏడుపొస్తుంది.. ఛీఛీ అని చీవాట్లు పెట్టింది.సేవ్ అయితే ఒకటి చెప్తా!అర్ధరాత్రి తనూజ.. ఎందుకు ఏడ్చావ్? అని కల్యాణ్ను అడిగింది. అందుకతడు ఓడిపోయినందుకు ఏడ్చానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది ఉట్టి అబద్ధం అని తెలిసిన తనూజ.. నిజం చెప్పు, ఎందుకు ఏడ్చావ్? అని మరోసారి నిలదీసింది. దీంతో అతడు అది నేను చెప్పలేను.. సర్లే బజ్జో.. నేను సేవ్ అయితే నీకొకటి చెప్తా అంటూ నిద్రపోతున్న తనూజతో అన్నాడు. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయేషాను మెడికల్ రూమ్కు పిలిచారు. టైఫాయిడ్తో పాటు, డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని డాక్టర్ చెప్పాడు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకో ఛాన్స్ఇక బిగ్బాస్.. మీ అనారోగ్యం దృష్ట్యా చికిత్స అవసరం. అలాగే ఇతర హౌస్మేట్స్ ఆరోగ్య భద్రత కూడా అవసరమే! అందుకే మిమ్మల్ని హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నా అన్నాడు. అప్పుడు ఆయేషా.. నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ బిగ్బాస్.. ఫ్యూచర్లో ఇంకో ఛాన్స్ ఇస్తారనే నమ్మకంతో వెళ్తున్నా.. అంటూ వీడ్కోలు చెప్పింది. ఇక వెళ్లేముందు తనూజతో.. జాగ్రత్త.. మళ్లీ ఫేక్దాంట్లో పడొద్దు. ఇదొక్కటే చెప్తున్నా అంటూ పిచ్చి లవ్ట్రాకులు వద్దని హెచ్చరించి వెళ్లిపోయింది.చదవండి: కమల్-రజనీ మూవీ.. సౌందర్య, శృతి హాసన్ ఏమన్నారంటే? -
భరించలేనంత బాధ.. కర్నూల్ ఘటనపై రష్మిక ఎమోషనల్
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కలచి వేసింది. ఈ ఘటన గురించి సినీ నటి రష్మిక మందన్న స్పందించారు. 'కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదం నా గుండెను చాలా తీవ్రంగా బాధపెడుతోంది. తగలబడుతున్న బస్సులో కాలిపోయే ముందు ప్రయాణికుల బాధను ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చిన్న పిల్లలతో పాటు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబం మొత్తం నిమిషాల్లోనే తమ ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకుంటే చాలా బాధేస్తుంది. నిజంగా ఈ సంఘటన వినాశకరమైనది. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ ప్రమాదంలో మరణించిన వారికి నా నివాళి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. మృతుల కుటుంబాలకు నా సానుభూతి.. దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా'అంటూ సోషల్మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేశారు.ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. నెల్లూరుకు చెందిన అనూష ఆ మంటల్లో ఎలాగైనా తన కుమార్తెను కాపాడుకోవాలని బిడ్డను కౌగిలించుకుని అలాగే కాలిపోయిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. మృతుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాసులున్నారు. వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద సమయంలో బస్సు అద్దాలను ధ్వంసం చేసి అతి కష్టంగా 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు.The news from Kurnool has been weighing heavily on my heart. Imagining what those passengers must’ve gone through inside that burning bus is just unbearable..To think that an entire family, including little kids, and so many others lost their lives in minutes it’s truly…— Rashmika Mandanna (@iamRashmika) October 24, 2025 -
డ్రగ్స్ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణలకు నోటీసులు
మత్తుపదార్థాల కేసులో కోలీవుడ్ నటులు శ్రీరామ్(శ్రీకాంత్), కృష్ణ బెయిల్పై ఇప్పటికే విడుదలయ్యారు. అయితే, తాజాగా వారిద్దరికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీచేసింది. ఈ ఏడాది జూన్లో మొదట ప్రదీప్కుమార్ అనే వ్యక్తి వద్ద మాదక ద్రవ్యాలు దొరికాయి. అతన్ని విచారిస్తే గనా దేశానికి చెందిన జాన్ అనే వ్యక్తి సరఫరా చేశాడని తేలడంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే ఇదే కేసులో అన్నాడీఎంకే మాజీ నేత ప్రశాంత్తో పాటు సినీనటులు శ్రీరామ్, కృష్ణ మొదలైన వారిని అరెస్టు చేశారు. అయితే, పోలీసుల విచారణలో తమ తప్పును అంగీకరించిన శ్రీరామ్, కృష్ణ బెయిల్ కోసం చెన్నై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కోర్టు సూచనతో విడుదలయ్యారు. కానీ, తాజాగా ప్రత్యేక కోర్టు అనుమతితో పుళల్ జైల్లో ఉన్న ప్రశాంత్, జవహర్, ప్రదీప్కుమార్లను ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28న నటుడు శ్రీరామ్, 29న నటుడు కృష్ణ విచారణకు రావాలని ఈడీ అధికారులు సమన్లు పంపారు.తప్పు చేశాను.. నా బిడ్డను చూసుకోవాలి డ్రగ్స్ ఉపయోగించి తప్పు చేశానని కోర్టులోనే శ్రీరామ్ ఇప్పటికే ఒప్పుకున్నారు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తుపదార్థాలను అలవాటు చేసినట్లు పోలీసుల విచారణలో శ్రీరామ్ తెలిపారు. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ‘తీంగిరై’ అనే సినిమాలో నటించానని, ఆ ప్రాజెక్ట్కు సంబంధించి తనకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో డబ్బు అడిగినప్పుడల్లా ఆయన కొకైన్ ఇచ్చేవారని పేర్కొన్నారు. రెండుసార్లు వాడిన తర్వాత మూడోసారి తానే అడిగే పరిస్థితి ఏర్పడిందని పోలీసులకు శ్రీరామ్ వెల్లడించారు. అయితే, తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నారు. తన కుమారుడిని చూసుకోవాల్సి ఉందని అందుకు బెయిల్ మంజూరు చేయాలని శ్రీరామ్ కోరారు. దీంతో కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు అప్పట్లో న్యాయస్థానం పేర్కొంది. -
పూజా హెగ్డేకు రూ. 5 కోట్లా..?
సక్సెస్ వల్ల ఇమెజ్ వస్తుంది. ఆ ఇమేజ్ను వాడుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు తెరపైకి వచ్చే మొదటి విషయం పారితోషకం. సాధారణంగా ఇప్పుడు హీరోయిన్ల పారితోషకం రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకూ ఉంటోంది. అది వారి ఇమేజ్ను బట్టి పెరగొచ్చు, తగ్గొచ్చు. అయితే క్రేజ్ ఉన్న హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటించడానికి పారితోషికాన్ని కాస్త ఎక్కువగానే డిమాండ్ చేస్తుంటారు. చాలా మంది హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటిస్తూ పారితోషకాన్ని అధిక మొత్తంలో పుచ్చుకుంటున్నారు. ఇందుకు పూజా హెగ్డే అతీతం కాదు. ఈ అమ్మడు ఇంతకుముందు తెలుగులో రంగస్థలం చిత్రంలో జిల్జిల్జిగేలు రాజా అనే ఐటమ్ సాంగ్లో నటించి బాగా పాపులర్ అయ్యారు. ఆ తరువాత కూలీ చిత్రంలో మోనికా పాటలో నటించి అందరిని అలరించారు. తాజాగా మరో భారీ చిత్రంలో ప్రత్యేక పాటలో చిందేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే 5, 6 మంది హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో దీపికా పడుకొనే, జాన్వీకపూర్, మృణాల్ఠాకూర్, రష్మిక మందన్నా వంటి స్టార్ హీరోయిన్ల పేరు చోటు చేసుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో పూజాహెగ్డేను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. 5నిమిషాలపాటు సాగే ఈ పాటలో నటించడానికి ఈ అమ్మడు రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ మధ్య అవకాశాలు లేని ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు. -
శ్రీలంకలో పెద్ది పాట
ప్రేయసితో ప్రేమ పాట పాడుతున్నారు ‘పెద్ది’. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా, ఈ సినిమా తాజా షెడ్యూల్ శ్రీలంకలోప్రారంభమైంది. నేటి (శనివారం) నుంచి రామ్చరణ్, జాన్వీలపై అక్కడి లొకేషన్స్లో ఓ పాటను చిత్రీకరిస్తారు. ఇందుకోసం శుక్ర వారం సాయంత్రం రామ్చరణ్, బుచ్చిబాబు, ఇతర యూనిట్ సభ్యులు శ్రీలంక వెళ్లారు. అక్కడి షెడ్యూల్ వారం రోజుల పాటు ఉంటుందట. ‘‘ఈ సినిమా కోసం రామ్చరణ్ సరి కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్పై చూడని చరణ్ను ఈ సినిమాలో చూస్తారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి’’ అని యూనిట్ పేర్కొంది. వచ్చే మార్చి 27న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
ఊహకి కూడా అందదు
హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కానుంది.ఈ చిత్రం నుంచి బ్లాస్టింగ్ రోర్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘ఊహకి కూడా అందదు’’ అని బాలకృష్ణ పలికే డైలాగ్ ఈ వీడియోలో ఉంది. బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్లోనే వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్గా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. -
బాహుబలి: ది ఎపిక్.. రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ (Baahubali: The Epic) పేరుతో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. రన్ టైమ్ ఎంతంటే?బాహుబలి: ది ఎపిక్ మూవీ రన్టైమ్ 3 గంటల 40 నిమిషాలని నిర్మాత శోభు యార్లగడ్డ ఇటీవలే వెల్లడించారు. బాహుబలి 1 ముగిశాక ఇంటర్వెల్.. ఆ తర్వాత ‘బాహుబలి 2 ఉంటుందని తెలిపారు. దాన వీర శూర కర్ణ (3 గంటల 46 నిమిషాలు) తర్వాత ఎక్కువ నిడివి ఉన్న సినిమాల జాబితాలో బాహుబలి: ది ఎపిక్ చేరనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఓ సర్ప్రైజ్ కూడా ఉంటుందని తెలిపారు. బాహుబలి డాక్యుమెంటరీ ఈ ఏడాది చివరిలో ఓటీటీలో స్ట్రీమింగ్ రావొచ్చని కూడా తెలిపారు. Two Films, One Epic Experience! Here's the Release Trailer of @ssrajamouli's #BaahubaliTheEpic.Telugu https://t.co/2vVWqhKDVUHindi https://t.co/xgsE1i0CBGIn Cinemas worldwide from 31st October 2025. #BaahubaliTheEpicOn31stOct #Prabhas @RanaDaggubati @MsAnushkaShetty… pic.twitter.com/VqlURRhbpg— Baahubali (@BaahubaliMovie) October 24, 2025 -
శర్వానంద్ లేటేస్ట్ లుక్.. ఇంతలా మారిపోయాడేంటి?
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ దీపావళి టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. బైకర్ అనే మూవీలో శర్వానంద్ నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పోస్టర్ను రిలీజ్ చేసింది. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో బైక్ రేసర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్లో 36వ సినిమాగా రానుంది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్గా కనిపించనుంది.అయితే తాజాగా శర్వానంద్ సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేశారు. షర్ట్ లెస్తో ఉన్న ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాకింగ్కు గురవుతున్నారు. ఇవీ చూసిన అభిమానులు.. శర్వానంద్ ఇలా మారిపోయాడేంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బైకర్ మూవీ కోసమే ఇలా పూర్తిగా తన బాడీని మార్చుకున్నారని తెలుస్తోంది. నిజమైన బైక్ రేసర్గా కనిపించేందుకు బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫిజిక్ కోసం కొన్ని నెలల పాటు వర్కవుట్స్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కుల్కర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) -
'కుందనాల బొమ్మ' పాట లాంచ్ చేసిన డైరెక్టర్ బాబీ
దర్శకుడు రాజేష్ జైకర్ రూపొందించిన 'కుందనాల బొమ్మ' వీడియో పాటని ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ గీతంలో విరాజ్, సంస్కృతి నటించారు. ప్రకృతి సౌందర్యాన్ని, మహిళా ఆత్మసౌందర్యాన్ని కలుపుతూ సందేశాన్ని ఇచ్చేలా పాటని తెరకెక్కించారు. ఈ పాటని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన 'శేఖర్ మ్యూజిక్' ఛానెల్ ద్వారా విడుదల చేశారు.దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. ఈ గీతాన్ని తీనిన రాజేష్ జైకర్, శ్రవణ్ జి కుమార్.. ప్రకృతిని ఆత్మబలానికి ప్రతిరూపంగా చూపించారు. ప్రతి ఫ్రేమ్, ప్రతి లిరిక్ మనసుని తాకేలా రూపుదిద్దుకుంది. విరాజ్, సంస్కృతి ఈ పాటకు ప్రాణం పోశారు అని ప్రశంసించారు. బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
'ఓజీ' బ్యూటీ దుబాయి ట్రిప్.. అందమైన రుక్మిణి
దుబాయి ట్రిప్ వేసిన 'ఓజీ' బ్యూటీ ప్రియాంకచీరలో అందంగా కనిపిస్తున్న రుక్మిణి వసంత్గ్లామరస్ లుక్లో కె ర్యాంప్ హీరోయిన్ యుక్తికలరిపయట్టు ప్రాక్టీసులో 'సలార్' శ్రియారెడ్డిఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు.. రెజీనా ఎమోషనల్బ్లాక్ శారీలో పద్ధతిగా హీరోయిన్ శ్రుతి హాసన్ View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Anandhi (@officialkayalanandhi) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) -
నాగార్జున 'శివ' రీ రిలీజ్.. బన్నీ పోస్టర్ రిలీజ్..!
అక్కినేని నాగార్జున నటించిన కల్ట్ బ్లాక్బస్టర్ మూవీ 'శివ'. ఈ మూవీ నాగ్ కెరీర్లోనే చాలా ప్రత్యేకం. ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో రామ్గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజైంది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్గానూ నిలిచింది. ఈ సినిమాని శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు.ఈ సినిమా 4కె వర్షన్, డాల్బీ అట్మాస్లో ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. తెలుగులో మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. ఈ మూవీ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. టాలీవుడ్ సినిమా శివ మూవీ తెచ్చిన మార్పు గురించి ప్రస్తావించనున్నారు. ఈ శుక్రవారం ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మాట్లాడనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది. దీంతో బన్నీ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శివ మూవీ గురించి ఏం మాట్లాతారనే విషయంపై అభిమానులతో పాటు అందరిలోనూ ఆతృత నెలకొంది. కాగా.. ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. కాగా.. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్ని సృష్టించారు వర్మ. ICON STAR of Indian Cinema 🔥🔥🔥× ICONIC FILM of Indian Cinema ❤️🔥❤️🔥❤️🔥Watch India's Favourite Star, @alluarjun talks about the Impact of SHIVA, Tomorrow at 11:07 AM💥💥💥#SHIVA4K with Dolby Atmos Grand Re-Release in theatres on NOVEMBER 14TH, 2025. #50YearsOfAnnapurna… pic.twitter.com/b2sB6nLIk5— Annapurna Studios (@AnnapurnaStdios) October 24, 2025 -
బాలయ్య అఖండ-2.. బ్లాస్టింగ్ రోర్ వచ్చేసింది!
బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్లో వస్తోన్న యాక్షన్ మూవీ అఖండ 2 తాండవ. 2021లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా.. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.తాజాగా అఖండ-2 నుంచి ఓ వీడియోను రిలీజ్ చేశారు. బ్లాస్టింగ్ రోర్ అనే పేరు ఈ వీడియోను పంచుకున్నారు. ఇందులో ఈ చిత్రంలోని ఫైట్ సీన్, డైలాగ్ బాలయ్య అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియోను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ మూవీని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.WHEN HE ROARS..THE WORLD TREMBLES💥💥💥#Akhanda2 BLASTING ROAR out now❤🔥Telugu - https://t.co/S6tFj0DKz3 Hindi - https://t.co/k0jOLGVJPITamil - https://t.co/HOylJFE0TSKannada - https://t.co/WNySTgpaPdMalayalam - https://t.co/XC4HA7vqrA IN CINEMAS WORLDWIDE FROM… pic.twitter.com/l6fQ0sux4I— 14 Reels Plus (@14ReelsPlus) October 24, 2025 -
రెండోసారి తల్లి కాబోతున్న 'జయం' చైల్డ్ ఆర్టిస్ట్
'జయం' సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఈ మూవీలో నటించిన హీరోహీరోయిన్తో పాటు మిగిలిన యాక్టర్స్, డైరెక్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్ర చేసిన బాలనటి యామిని కూడా బాగానే క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె.. ఇప్పుడు మరోసారి తల్లికాబోతున్నట్లు శుభవార్త చెప్పేసింది. ఈ మేరకు ఫొటో షేర్ చేసింది.సీరియల్, సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న జయలక్ష్మి కూతురే యామిని శ్వేత. 'జయం' సినిమాలో నటించడాని కంటే ముందు దాదాపు 10 సీరియల్స్లో చేసింది. సీతామహాలక్ష్మీ అనే సీరియల్ చేస్తున్న టైంలో 'జయం' ఆడిషన్స్ గురించి ప్రకటన వచ్చింది. ఇది చూసిన యామిని తండ్రి.. కూతురు ఫొటోలని డైరెక్టర్ తేజకు పంపారు. స్క్రీన్ టెస్ట్ అయిపోయిన తర్వాత యామిని.. హీరోయిన్ చెల్లి పాత్రకు ఎంపికైంది. తన నటనతో నంది అవార్డ్ కూడా అందుకుంది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు) చైల్డ్ ఆర్టిస్ట్గా మాత్రమే శ్వేత.. సినిమాల్లో కనిపించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. దీంతో చిన్నప్పుడు పలు సినిమాలు, సీరియల్స్లో నటింపజేశారు. తర్వాత మాత్రం నో చెప్పేశారు. ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు తదితర మూవీస్ చేసిన తర్వాత యామిని పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. విదేశాల్లో మాస్టర్స్ చేసి అక్కడే ఉద్యోగం సంపాదించుకుంది. తర్వాత పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడిపోయింది. కొన్నేళ్ల క్రితం ఈమెకు ఓ కూతురు పుట్టింది. ఇప్పుడు మరోసారి ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు యామిని బయటపెట్టింది.దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన యామిని.. ముగ్గురుగా ఉన్న తన కుటుంబం త్వరలో నలుగురిగా మారబోతుందని చెప్పింది. అలానే బేబీ బంప్ ఫొటోని కూడా పంచుకుంది. ఈ క్రమంలోనే నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ) View this post on Instagram A post shared by Yamini Swetha Naidu (@yamini_swetha) -
సుమ తనయుడి కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
యాంకర్ సుమ తనయుడు రోషన్ (Roshan Kanakala) హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'మోగ్లీ' (Mowgli). ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. బబుల్గమ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్.. ప్రస్తుతం సందీప్ రాజ్తో జతకట్టారు. ఈ చిత్రంలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ నుంచి లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ను రిలీజ్ చేశారు. సయ్యారే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కాల భైరవ, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫారెస్ట్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు. కాగా.. మోగ్లీ డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
కోలీవుడ్లో విషాదం.. మనోరమ కుమారుడు కన్నుమూత
దాదాపు వెయ్యికి పైగా చిత్రాల్లో మెప్పించిన నటి మనోరమ కుమారుడు కన్నుమూశారు. దివంగత నటి కుమారుడు భూపతి(70) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చైన్నైలోని త్యాగరాయ నగర్లోని తన ఇంట్లోనే మరణించినట్లు పీఆర్ఓ నిఖిల్ వెల్లడించారు. అతని మరణ వార్త విన్న కోలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.కాగా.. తమిళ సినిమా చరిత్రలో మనోరమ దాదాపు 1000 కి పైగా చిత్రాలలో నటించింది. ఆమె వృద్ధాప్య సమస్యలతో అక్టోబర్ 2015లోనే మరణించింది. మనోరమ ఏకైక కుమారుడు భూపతిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అతన్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడానికి మనోరమ అనేక ప్రయత్నాలు చేసింది. కానీ భూపతి చేసిన చిత్రాలు ఆశించిన విజయం సాధించలేకపోయాయి. అతను 'కుడుంబం ఓరు కదంబం' అనే మూవీలో నటించాడు. అయితే తీసిన సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాలేదు. కాగా.. భూపతి అభిరామి (25) అనే కూతురు ఉన్నారు. కాగా.. నటి మనోరమను అప్పట్లో ‘లేడీ శివాజీ గణేశన్’ అని గుండెలకు హత్తుకున్నారు ప్రేక్షకులు. దాదాపు 1500 చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్లోకి ఎక్కి ప్రపంచ చరిత్రను తిరగరాసింది. பிரபல நடிகை மனோரமா மகன் மற்றும் நடிகருமான பூபதி (வயது 70) இன்று (23.10.2025) காலை 10.40 மணிக்கு இயற்கை எய்தினார்.அவரின் உடலானது பொதுமக்கள் அஞ்சலிக்காக Door No. 9/5, நீலகண்ட மேத்தா தெரு, T Nagar இல்லத்தில் வைக்கப்படும். அவரின் இறுதி சடங்கு நாளை (24.10.2025) மதியம் 3 மணிக்கு… pic.twitter.com/jBkrC7zsUm— Nikil Murukan (@onlynikil) October 23, 2025 -
కళ్లు తిరిగి పడిపోయిన తనూజ.. ఆరుగురి రీఎంట్రీ !
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. అయితే ఇప్పటికే అందిన లీకుల ప్రకారం ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు. ఈ కెప్టెన్సీ టాస్క్కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సర్కిల్లో టోపీ పెట్టారు. బజర్ మోగినప్పుడు టోపీని చేజిక్కించుకున్న వ్యక్తి.. కెప్టెన్సీ రేసులో లేనివాళ్లకు ఇవ్వాలి. వారు కెప్టెన్గా ఎవర్ని చూడొద్దనుకుంటున్నారో వారిని రేసు నుంచి తప్పించాలి. కెప్టెన్సీ గేమ్అలా నిఖిల్ పోటీ పడి.. టోపిని గెలిచి గౌరవ్ చేతిలో పెట్టాడు. దీంతో గౌరవ్.. కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎలిమినేట్ చేశాడు. ఇమ్మాన్యుయేల్.. సంజనాకు టోపీ ఇవ్వగా ఆమె దివ్యను ఎలిమినేట్ చేసింది. మరో రెండు మాధురికి ఇవ్వగా ఆమె నిఖిల్ను సైడ్ చేసింది. అలా చివరకు ఇమ్మాన్యుయేల్, తనూజ మిగలగా.. ఇమ్మూ గెలిచాడు. అయితే చివర్లో తనూజ కళ్లు తిరిగి పడిపోయినట్లు కనిపిస్తోంది. అటు ఆయేషా.. ఇప్పుడు తనూజ?నీళ్లు కొట్టి లేపినా ఆమె కళ్లు తెరవకపోయేసరికి హౌస్మేట్స్ కాస్త కంగారుపడ్డారు. అయితే అలిసిపోయి అలా పడిపోయింది తప్ప భయపడాల్సిందేమీ లేదు. మరోవైపు ఆయేషా కూడా డీహైడ్రేషన్కు గురైంది. దీనివల్ల టాస్కుల్లోనూ పాల్గొనలేకపోతోంది. ఆమెకు టైఫాయిడ్ అని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే తనను షో నుంచి పంపించేయనున్నారని రూమర్స్ వస్తున్నాయి.రీఎంట్రీ?హౌస్మేట్స్తో కొన్ని టాస్కులాడించేందుకు లేదా, నామినేట్ చేయడానికి.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మళ్లీ బిగ్బాస్ హౌస్లోకి రానున్నారని ఓ వార్త వైరలవుతోంది. దాదాపు నామినేట్ చేసేందుకే వస్తారు! అలా వచ్చినప్పుడు ఒకరిద్దరు హౌస్లోనే పాగా వేయనున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముంది? ఏంటి? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. చదవండి: సంజనా కోసం త్యాగం.. మళ్లీ సాధించిన ఇమ్మాన్యుయేల్ -
‘కాంతార’పై ఆలస్యంగా స్పందించిన అల్లు అర్జున్..కారణం?
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన కాంతార: చాప్టర్ 1(Kantara: Chapter 1) సినిమా ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 818 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ ఇప్పటికే రూ. 110 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. సినిమా అదిరిపోయిందని సోషల్ మీడియా వేదికగా రిషబ్పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా కాంతార: చాప్టర్పై ప్రశంసలు జల్లు కురిపించారు. ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని ట్వీట్ చేశాడురిషబ్..వన్మ్యాన్ షో‘నిన్న రాత్రి కాంతార చాప్టర్ 1 సినిమా చూశాను. వావ్..ఎంత అద్భుతమైన సినిమా. ఈ మూవీ చూస్తూ నేను ట్రాన్స్లోకి వెళ్లిపోయా. రచయితగా, డైరెక్టర్గా, యాక్టర్గా రిషబ్ శెట్టి వన్మ్యాన్ షో అని చెప్పాలి. ప్రతి క్రాప్ట్లో ఆయన రాణించారు. రుక్మిణి, జయరామ్, గుల్షన్ దేవయ్యతో పాటు మిగతా నటీనటులంతా చక్కగా నటించారు. టెక్నికల్ టీమ్ పనితీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అజనీష్ సంగీతం, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, ధరణి ఆర్ట్ డైరెక్టన్, అరుణ్ రాజ్ స్టంట్స్ చాలా బాగున్నాయి. నిర్మాత విజయ్ కిరంగదూర్, హోంబులే బ్యానర్కి శుభాకాంక్షలు’ అని బన్నీ తన ఎక్స్లో రాసుకొచ్చాడు.లేట్ ఎందుకు?కాంతార సినిమా అక్టోబర్ 2న విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన వారం రోజులలోపే సినీ ప్రముఖులంతా ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా లేట్గా స్పందించాడు. సూపర్ హిట్ టాక్ వచ్చిన ఓ సినిమాను ఇంత ఆలస్యంగా చూడడానికి గల కారణం ఏంటని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అసలు విషయం ఏంటి అంటే..బన్నీ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ముంబైలో ఓ భారీ సెట్ కూడా వేశారు. అందులోనూ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్తో బిజీగా ఉండడం వల్లే అల్లు అర్జున్ కాంతార సినిమాను చూడలేకపోయాడు అట. ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరకడంతో సినిమా చూసి..వెంటనే సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.Watched #Kantara last night. Wow, what a mind-blowing film. I was in a trance watching it.Kudos to @shetty_rishab garu for a one-man show as writer, director, and actor. He excelled in every craft.Aesthetic performances by @rukminitweets garu, #Jayaram garu, @gulshandevaiah… pic.twitter.com/qneOccCjvd— Allu Arjun (@alluarjun) October 24, 2025 -
మేనేజర్ని తొలగించిన అనసూయ.. ఇన్స్టా పోస్ట్ వైరల్!
ఒకవైపు సినిమాలు..మరోవైపు టీవీ షోలతో ఫుల్ బిజీ అయిపోతుంది అనసూయ(Anasuya Bharadwaj). యాంకర్గా కెరీర్ని ప్రారంభించి..ఇప్పుడు నటిగా కొనసాగుతుంది. అయితే మధ్య మధ్యలో టీవీ షోలలోనూ మెరుస్తూ..అటు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె చేసే హడావుడి గురించి అందరికి తెలిసిందే. నెట్టింట చాలా యాక్టివ్గా ఉంటూ.. తన సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది. నెటిజన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది పట్టించుకోకుండా..తను చెప్పాల్సిన విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. తాజాగా అనసూయ తన ఇన్స్టా ఖాతాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. తనకు మేనేజర్గా పని చేసిన మహేంద్ర రిలీవ్ అయ్యారంటూ చెబుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది.నా సుధీర్ఘమైన సీనీ ప్రయాణంలో తోడుగా ఉన్న నా మేనేజర్ మిస్టర్ మహేంద్ర.. తన పదవి నుంచి రిలీవ్ అవుతున్నారు. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎన్నో ఏళ్ల మా అనుబంధంలో ఎంతో నేర్చుకున్నాం. ఇన్నాళ్లుగా నాకు మేనేజర్గా ఆయన చూపిన సమయం, కృషి, నిబద్ధతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇకపై ఏదైనా అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల కోసం, వృత్తిపరమైన విషయాల కోసం దయచేసి enquiry.anusuyabharadwaj@gmail.com మెయిల్ చేయండి. మీ కాంటాక్ట్ నెంబర్కి మా టీం కాంటాక్ట్ అవుతారు’ అని అనసూయ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ
అక్టోబర్ చివరకొచ్చేసింది. ఈ కొద్దిరోజుల్లోనే టాలీవుడ్లో పలు శుభకార్యాలు జరగబోతున్నాయి. అల్లు శిరీష్ నిశ్చితార్థం ఈనెల చివర్లో ఉండగా, నారా రోహిత్-శిరీష పెళ్లి కూడా రాబోయే కొన్నిరోజుల్లోనే జరగనుంది. మరోవైపు ఫేమస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పుడు పెళ్లి పనులు మొదలైపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.'నాటు నాటు' పాటతో ఆస్కార్ వరకు వెళ్లిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. రెండు నెలల క్రితం అంటే ఆగస్టులో హరిణ్య అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ముందుగా ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఫొటోలు పోస్ట్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈనెల మొదట్లో రాహుల్, హరిణ్య కలిసి బ్యాచిలర్ పార్టీ లాంటిది సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలు కొన్ని వైరల్ అయ్యాయి కూడా.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'లోక' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)ఇప్పుడు హరిణ్య స్వయంగా తమ పెళ్లిపనులు మొదలయ్యాయని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. లగ్నపత్రిక కార్యక్రమం జరిగిందని చెబుతూ మూడు ఫొటోలని పోస్ట్ చేసింది. ఇందులో రాహుల్, హరిణ్య జంట చూడముచ్చటగా కనిపించింది. రాహుల్లానే హరిణ్య కూడా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయే. బిగ్బాస్ షోలో రాహుల్ పాల్గొన్నప్పుడే వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడిందట. అప్పటినుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. మరికొన్నిరోజుల్లో కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు.రాహుల్ సిప్లిగంజ్ విషయానికొస్తే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కుర్రాడు. మాస్ సాంగ్స్ పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'కాలేజ్ బుల్లోడా', 'వాస్తు బాగుందే', 'రంగా రంగా రంగస్థలానా', 'బొమ్మోలే ఉన్నదిరా పోరి' లాంటి సినిమా పాటలు ఇతడి పాడాడు. బోనాలు, వినాయక చవితి ఆల్బమ్ సాంగ్స్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ అందించిన నాటు నాటు పాటలోనూ ఓ గొంతు ఇతడిదే.(ఇదీ చదవండి: నాపై చేతబడి చేశారు.. ఎవరూ తప్పించుకోలేరు : హీరో సుమన్) -
నాపై చేతబడి చేశారు.. ఎవరూ తప్పించుకోలేరు : హీరో సుమన్
సుమన్(Suman)..ఒకప్పుడు స్టార్ హీరో. చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చిన నటుల్లో ఆయన ఒకరు. అనుకోకుండా ఆయన జైలుకు వెళ్లడం.. ఆరు నెలల పాటు అక్కడే ఉండడంతో ఆయన కెరీర్కి పెద్ద దెబ్బ తగిలింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా హీరోగా సినిమాలు చేసినా.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూనే..మరోవైపు టీవీ సీరియల్స్లోనూ నటిస్తున్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరిగిన చేతబడి గురించి వివరించాడు. కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో ఆయనకు చేతబడి చేశారట. కేరళకు వెళ్లి విరుగుడు పూజ చేయింకున్నాని సుమన్ చెప్పారు.‘నాపై చేతబడి జరిగిన మాట వాస్తవం. అయితే ఎవరు చేయించారనేది తెలియదు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. బిజినెస్ రంగంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ చేతబడి అనేది కేరళలో చాలా ఫేమస్. అక్కడ చోటనికరే అనే ప్లేస్ ఉంది. అక్కడ చేతబడి జరిగిన వాళ్లకి విరుగుడు పూజ చేస్తుంటారు. ఇందులో రకరకాలుగా ఉంటుంది. ఎందుకు? ఎవరు చేయించారనేది తెలియదు. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కేరళ వాళ్లకి దీని గురించి బాగా తెలుసు చేతబడి ఎలా ప్రయోగిస్తారు? దాన్ని తగ్గించడం.. మనస్పర్థలు తీసుకుని రావడం లాంటి విద్యలు చేస్తుంటారు. అది ఇప్పటికీ ఉంది.అప్పట్లో నాకు వరుసగా ఎదురుదెబ్బలే తగులుతుండడంతో కొంతమంది చెబితే అక్కడకు వెళ్లాను. విరుగుడు పూజ ఏదో చేయించారు. అది తప్పు ఒప్పు... ఉంది లేదని నేనేం చెప్పను. కానీ నేను టైమ్ని బాగా నమ్ముతా. ఈరోజు ఇది.. ఈ నెల ఇది.. ఈ సంవత్సరం ఇది అంటే అది జరిగితీరుతుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా.. మనం చెప్పుకోవడానికి చాలా చెప్పొచ్చు. వాడు తొక్కేశాడు.. వీడు నొక్కేశాడు.. ఎక్కేశాడు. వీడి వల్ల అలా జరిగింది.. ఇలా జరిగిందని. బట్.. ఆ టైమ్ అలా జరిపిస్తుంది. ఆ టైమ్ కొందరితో అలా చేయిస్తుంది. నిజానికి వాళ్లకి అలా చేయాలనే ఉద్దేశం ఉండదు. కానీ టైమ్ వాళ్లని అలా చేయిస్తుంది. అది కూడా వాళ్ల రాతే. దాన్నే కర్మ అని అంటారు. కర్మను నేను బాగా నమ్ముతాను. రోగాలు రావడం కూడా కర్మే. టైమ్ని బట్టి రోగాలు వస్తుంటాయి. కర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అని సుమన్ చెపుకొచ్చారు. -
సంజనా కోసం త్యాగం.. మళ్లీ సాధించిన ఇమ్మాన్యుయేల్
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో కెప్టెన్సీకి చాలా పవర్ ఉంది. అందర్నీ ఆజమాయిషీ చేయడం కన్నా ఒక వారం ఇమ్యూనిటీ వస్తుందన్న క్రేజే ఎక్కువ. కెప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ ఎంచక్కా నామినేషన్స్ తప్పించుకుని కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చని హౌస్మేట్స్ భావిస్తుంటారు. అలాంటి కెప్టెన్సీని గతంలో ఇమ్మాన్యుయేల్ (Emmanuel) చేతులారా వదిలేసుకున్నాడు.సంజనా కోసం త్యాగంసంజనా (Sanjana Galrani)ను హౌస్మేట్స్ మిడ్వీక్లో ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే కదా! తను హౌస్లోకి రావాలంటే కొన్ని త్యాగాలు చేయాలని నాగార్జున కండీషన్ పెట్టారు. తనూజ కాఫీ వదిలేయాలని, రీతూ జుట్టు కత్తిరించుకోవాలని, భరణి.. తనకిష్టమైన లాకెట్ స్టోర్ రూమ్లో పెట్టేయాలని, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ వదిలేయాలన్నారు. వీళ్లందరూ ఆ త్యాగాలు చేశారు కాబట్టే సంజనా హౌస్లో ఉంది.మళ్లీ సంపాదించిన ఇమ్మూఅలా ఇమ్మాన్యుయేల్ తన కెప్టెన్సీని కనీసం ఒకరోజైనా ఫీల్ అవలేకపోయాడు. అయితేనేం మళ్లీ ఆడి గెలిచే సత్తా తనకుంది. అది ఈ వారం మరోసారి రుజువు చేసుకున్నాడని తెలుస్తోంది. ఫోకస్ టాస్క్లో ఇమ్మాన్యుయేల్ గెలిచి కెప్టెన్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి కెప్టెన్గా ఇమ్మూ రూలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం! చదవండి: బిగ్బాస్ దరిద్రపుగొట్టు ఐడియా.. నీళ్లు ఉమ్మే టాస్క్ ఏంటయ్యా! -
ముద్దు సన్నివేశం.. డిలీట్ చేయమన్న తెలుగు హీరోయిన్
కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశంలోనైనా నటించేందుకు సిద్ధమే అంటుంటారు తారలు. కొందరు మాత్రం అసభ్యత, అశ్లీలతకు ఇసుమంత చోటు కూడా ఇవ్వని సినిమాలే చేస్తామంటారు. మరికొందరు మాత్రం మూడో కేటగిరీ.. ఫస్ట్ సీన్లో నటిస్తారు.. తర్వాత మళ్లీ మనసు మార్చుకుని అది లేకపోయుంటే బాగుండంటూ లోలోనే మథనపడుతుంటారు. వారి ఇబ్బందిని గమనించి ఆయా సీన్లను ఎత్తేసేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.హీరోయిన్ అభ్యంతరంహీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ఇప్పుడదే పని చేశాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్. శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ఈ మూవీలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది. అందులో ఒక ముద్దు సన్నివేశం షూట్ చేశాం. అంతా అయిపోయాక దానిపై మానస (Maanasa Choudhary) అభ్యంతరం చెప్పింది. ఆ సీన్ను తీసయమని దర్శకుడిని కోరింది.కత్తిరించేశాంఅదే మాట డైరెక్టర్ నాకొచ్చి చెప్పాడు. తన ఇబ్బంది నాకర్థమైంది. సరే, ఆ సీన్ తీసేద్దాం.. అది లేకుండా డిఫరెంట్గా పాటను పూర్తి చేద్దాం అని చెప్పాను. సినిమా ఫైనల్ ఎడిటింగ్లో ఆ సన్నివేశాన్ని కత్తిరించేశాం అని చెప్పుకొచ్చాడు. మానస చౌదరి తెలుగమ్మాయి. చిత్తూరుకు చెందిన ఈ బ్యూటీ.. యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన బబుల్గమ్ మూవీతో తెరంగేట్రం చేసింది. లక్కీ భాస్కర్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ఇప్పుడు ఆర్యన్తో కోలీవుడ్లో అడుగుపెట్టనుంది.చదవండి: ట్రెండింగ్లోకి 'ఇదేమిటయ్యా మాయా..'. ఆ హీరోయిన్ ఇప్పుడెలా? -
శ్రీనువైట్ల కొత్త సినిమా.. హీరో ఎవరంటే..
ఈ మధ్యకాలంలో శ్రీను వైట్లకు సరైన హిట్ అయితే లేదు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘విశ్వం’ (2024) బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో ఆయన కాస్త సమయం తీసుకొని.. ఇప్పుడు మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో శర్వా హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ శర్వాకి శ్రీను వైట్ల కథ వినిపించారట. శ్రీను వైట్ల మార్క్తో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా కథ శర్వానంద్కు నచ్చిందని సమాచారం. దీంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట శర్వా. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని భోగట్టా. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమా నిర్మించనున్నారని, త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్నగర్ టాక్. మరోవైపు ప్రస్తుతం ‘భోగి’, ‘బైకర్’ సినిమాల చిత్రీకరణలతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతి రిలీజ్కు ముస్తాబవుతోంది. -
స్టార్ హీరోల సినిమా.. హీరోయిన్స్ వీళ్లేనా?
‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా... నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా’.. ఈ పాట మహేశ్బాబు హీరోగా చేసిన బ్లాక్బస్టర్ మూవీ ‘మురారి’ లోనిదని ప్రత్యేకించి చెపక్కర్లేదు. ఇప్పుడు ఈ పాటను సరదాగా కొందరు తెలుగు హీరోలు పాడుకుంటున్నారట... ఎందుకంటే ఈ హీరోలు కమిట్ అయిన తాజా చిత్రాల్లో ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు. అయితే ఫలానా హీరో సరసన ఫలానా హీరోయిన్ నటించనున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరి... ఈ కొత్త ఊహా తారల కహానీ ఏంటో మీరూ ఓ లుక్ వేయండి. గ్యాంగ్స్టర్ డ్రామాలో... చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. కాగా, ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) తెరకెక్కించనున్న గ్యాంగ్స్టర్ డ్రామాలో చిరంజీవి హీరోగా నటిస్తారు. కేవీన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్హిట్ తర్వాత చిరంజీవి, బాబీల కాంబినేషన్లో రూపొందనున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ వర్క్స్లో భాగంగానే దర్శకుడు బాబీ ఈ చిత్రంలోని ఇతర నటీనటుల ఎంపికపై కూడా దృష్టి పెట్టారని తెలిసింది. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్కు చాన్స్ ఉందట. ఈ హీరోయిన్స్ రోల్స్కు మాళవికా మోహనన్, రాశీ ఖన్నాలను సంప్రదించారట బాబీ. అలాగే ఈ మూవీలో ఓ పవర్ఫుల్ రోల్ కూడా ఉందని, ఈ పాత్ర కోసం చిత్రయూనిట్ మోహన్లాల్ వంటి యాక్టర్స్తో చర్చలు జరుపుతోందనే టాక్ తెరపైకి వచ్చింది. మరి... చిరంజీవి సినిమాలో మాళవికా మోహనన్, రాశీ ఖన్నా భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. జోడీ రిపీట్ నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). నాగార్జున కెరీర్లో ఇది వందో సినిమా. తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్కు చాన్స్ ఉందట. ఇప్పటికే అనుష్కా శెట్టి, టబు భాగమయ్యారనే టాక్ తెరపైకి వచ్చింది. 2005లో వచ్చిన ‘సూపర్’ సినిమా కోసం నాగార్జున, అనుష్క తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా ‘డాన్’, ‘రగడ’, ‘ఢమరుకం’ చిత్రాల్లో నటించారు. అలాగే ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో నాగార్జున, అనుష్కా శెట్టి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇంకా నాగార్జున ‘కింగ్, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి చిత్రాల్లో అనుష్క అతిథిగా నటించారు. మరి... ‘కింగ్ 100’లో కూడా అనుష్కా శెట్టి భాగం అవుతారా? అయితే హీరోయిన్గా నటిస్తారా? లేక ఏదైనా ఇంపార్టెంట్ రోల్ చేస్తారా? అనే అంశాలపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ‘నిన్నే పెళ్లాడతా.., ఆవిడా మా ఆవిడే!’ వంటి సినిమాల్లో నాగార్జున – టబు హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ‘కింగ్ 100’ సినిమాలో టబు కూడా కనిపిస్తారా? ఈ జోడీలు రిపీట్ అవుతాయా? వేచి చూడాలి. ఇక ‘కింగ్ 100’ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కబురు వెళ్లిందా? ‘రంగస్థలం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో రామ్చరణ్(Ram Charan), దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చి ఏడాదిన్నర పైనే అవుతున్నా ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. రామ్చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతనే సుకుమార్తో చేయాల్సిన మూవీని సెట్స్కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట రామ్చరణ్. ఈలోపు ఈ సినిమా స్క్రిప్ట్కు సంబంధించిన పనులపై దర్శకుడు సుకుమార్ మరింత ఫోకస్ పెట్టారట. అలాగే ఇందులోని నటీనటుల ఎంపిక గురించి కూడా సుకుమార్ ఆలోచిస్తున్నారట. ఆల్రెడీ సమంత, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో మహేశ్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో కృతీ సనన్ హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి... రామ్చరణ్తో సుకుమార్ చేయబోయే సినిమా గురించిన కబురు కృతీ సనన్కు వెళ్లిందా? ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అంతర్జాతీయ స్థాయిలో... అల్లు అర్జున్( Allu Arjun) హీరోగా అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్కు చాన్స్ ఉందట. ఆల్రెడీ దీపికా పదుకోన్ ఈ చిత్రంలో భాగమయ్యారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ చిత్రంలో హీరోయిన్స్గా నటిస్తారనే ప్రచారం టాలీవుడ్లో తెరపైకి వచ్చింది. అయితే ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. ఇక మిగతా హీరోయిన్స్ ఎంపికలపై కూడా త్వరలోనే ఓ ప్రకటన రానుందని ఫిల్మ్నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్నగర్ భోగట్టా. అంతర్జాతీయ స్థాయిలో 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని, ఈ దిశగా అల్లు అర్జున్, అట్లీ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. జూలియట్ ఎవరో! ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం నాని బిజీగా ఉన్నారు. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అయితే నాని హీరోగా సుజిత్ డైరెక్షన్లోని సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత సుజిత్తో చేసే చిత్రం షూటింగ్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట నాని. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ను అనుకుంటున్నారని, ఇదో గ్యాంగ్స్టర్ సినిమా అనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు తొలుత ప్రియాంకా అరుళ్ మోహన్ పేరు వినిపించింది. నాని – ప్రియాంక ‘నానీస్ గ్యాంగ్లీడర్, సరిపోదా శనివారం’ చిత్రాల్లో జోడీగా నటించారు. కానీ ‘బ్లడీ రోమియో’ సినిమాలోని హీరోయిన్గా పూజా హెగ్డే కనిపిస్తారనే ప్రచారం లేటెస్ట్గా ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఫైనల్గా ఈ ‘బ్లడీ రోమియో’ సరసన జూలియట్గా ఎవరు కనిపిస్తారనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. 2026 చివర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి... ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి రిపీట్ కానుందని ఫిల్మ్నగర్ సమాచారం. ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. రాయలసీమ నేపథ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలోనే విజయ్–రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మరి... విజయ్–రష్మిక మందన్నాల జోడీ మళ్లీ స్క్రీన్పై మ్యాజిక్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దేవి సరసన.... సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా రానుందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ‘బలగం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ అనే ఓ రూరల్ బ్యాక్డ్రాప్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తారంటూ నాని, నితిన్, శర్వానంద్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఫైనల్గా ఈ చాన్స్ దేవిశ్రీ ప్రసాద్కు లభించిందని, కథ నచ్చడంతో దేవిశ్రీ కూడా ‘ఎల్లమ్మ’ సినిమా చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో దేవి సరసన హీరోయిన్గా కీర్తీ సురేష్ దాదాపు ఖరారు అయ్యారని, త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. డబుల్ ఎంట్రీ సూపర్స్టార్ మహేశ్బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా కెరీర్ను స్టార్ట్ చేయనున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని టాక్. ఈ సినిమాలో రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ హీరోయిన్గా నటిస్తారని, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ కూడా జరిగిందట. ఈ యూత్ఫుల్ లవ్స్టోరీ సినిమాను వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయని ఫిల్మ్నగర్ భోగట్టా. ఇక జయకృష్ణకు యాక్టర్గా ఇది తొలి చిత్రం అయితే, రాషాకు తెలుగులో ఇది తొలి మూవీ అవుతుంది. అయితే ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇలా హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కావాల్సిన మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
ట్రెండింగ్లోకి 'ఇదేమిటయ్యా మాయా..'. ఆ హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే?
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కె ర్యాంప్ మూవీ (K Ramp Movie) హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ మూవీ ప్రారంభంలో హీరో.. ఇదేమిటమ్మా మాయా మాయా.. అంటూ రాజశేఖర్ సాంగ్ను రీక్రియేట్ చేశాడు. మాస్ స్టెప్పులతో ప్రారంభంలోనే కావాల్సినంత ఊపు తెప్పించాడు. సినిమాకు మంచి ఎనర్జీనిచ్చిన ఈ సాంగ్ వీడియోను గురువారం నాడు యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఒరిజినల్ సాంగ్ రిలీజ్దీంతో అది టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇదేమిటమ్మా మాయా... ఒరిజినల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాట ఆయుధం సినిమాలోనిది. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా చిన్ని చరణ్ లిరిక్స్ రాశారు. కుమార్ సాను, నిష్మా ఆలపించారు. ఈ సాంగ్లో రాజశేఖర్, గుర్లీన్ చోప్రా (Gurleen Chopra) జంటగా స్టెప్పులేశారు. ఎన్.శంకర్ దర్శకత్వం వహించారు. రాజశేఖర్తో స్టెప్పేసిన బ్యూటీ ఎవరు?చండీగఢ్కు చెందిన గుర్లీన్ చోప్రా ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. ఒక పెళ్లాం ముద్దు- రెండో పెళ్లాం వద్దు, నేను సైతం, ఖాకీ, పాండవులు పాండవులు తుమ్మెద, శివ కేశవ్ చిత్రాలు చేసింది. హిందీ, కన్నడ, తమిళ, పంజాబి, మరాఠి భాషల్లోనూ యాక్ట్ చేసింది. 2020 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంది. నటుడు డేవిందర్ రాంధ్వాను పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ కౌన్సెలింగ్ విత్ జీసీ పేరిట ఓ వెబ్సైట్ నడిపిస్తోంది. ఇందులో ఆమె పోషకాహార నిపుణురాలిగా సేవలందిస్తోంది. View this post on Instagram A post shared by ACTRESS GURLEEN CHOPRA (@igurleenchopra)చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా? -
బిగ్బాస్ దరిద్రపుగొట్టు ఐడియా.. నీళ్లు ఉమ్మే టాస్క్ ఏంటయ్యా!
బిగ్బాస్కు కొత్త ఐడియాలు రావడం లేదేమో! కొన్నిసార్లు పిచ్చి టాస్కులిస్తున్నాడు. నీళ్లు ఉమ్మే టాస్క్ అయితే మరీ దారుణం. అమర్దీప్- అర్జున్ ఎంట్రీ ఇవ్వడం కాస్త ఉపశమనంగా కనిపిస్తుంది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో గురువారం (అక్టోబర్ 23వ) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..మట్టి కరిపించిన డిమాన్ పవన్సంజనా సైలెన్సర్- మాస్ మాధురి గ్యాంగ్స్కు జెండాలే ఎజెండా టాస్క్ ఇచ్చాడు. ఇందులో సంజనా తరపు నుంచి బరిలో దిగిన డిమాన్-గౌరవ్.. మాధురి గ్యాంగ్ నుంచి వచ్చిన ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ను మట్టి కరిపించారు. డిమాన్ పవన్ మరోసారి టాస్కుల వీరుడు అని నిరూపించుకున్నాడు. సంజనా రాను రాను శృతి, గతి అన్నీ తప్పుతోంది. నోటికి ఏదొస్తే అది అనేస్తోంది. చెత్తబుట్ట తీసుకొచ్చి.. ఇది ఖాళీ చేయలేదు.. పని చేయకుండా పిక్నిక్కు వచ్చారా? అని అరిచేసింది. చెండాలం టాస్క్కెప్టెన్స్ గౌరవ్, సుమన్తోనూ.. నేనేమైనా మీ పనిమనిషినా? నేను మీ సర్వెంట్ కాదంటూ చిందులు తొక్కింది. తర్వాత బిగ్బాస్ ఓ దరిద్రపు టాస్క్ ఇచ్చాడు. నోట్లో నీళ్లు పోసుకుని ఎక్కువ దూరంలో ఉన్న బకెట్లో ఉమ్మితే ఎక్కువ పాయింట్లు అట! ఇదే ఒక చెత్త టాస్క్ అంటే.. మా బకెట్లో చుక్క నీరు పడింది.. అక్కడ పడలేదంటూ గొడవ పెట్టుకున్నారు. ఈ గేమ్లో సంజన టీమ్ గెలిచింది. మీరు తోపు.. మేము తుప్పాస్దీంతో బిగ్బాస్ చెప్పినట్లుగా మాధురి టీమ్ మెంబర్స్ అంతా మోకాళ్లపై కూర్చుని మీరు తోపు.. మేము తుప్పాస్ అని సంజనాకు చెప్పారు. ఇక ఈ వాంటెడ్పేట గేమ్లో రాము, రమ్య దగ్గర ఒక్క రూపాయి లేకపోవడంతో కంటెండర్ రేసు నుంచి తప్పుకున్నారు. తర్వాత బిగ్బాస్ 7 కంటెస్టెంట్లు అమర్దీప్-అర్జున్ పోలీస్ గెటప్స్లో హౌస్లో ఎంట్రీ ఇచ్చారు. కాసేపు కామెడీ చేసి నవ్వించారు. ఇది నేటి ఎపిసోడ్లో కూడా కొనసాగనుంది.చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా? -
కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?
మెగా ఫ్యామిలీలో మరోసారి ఆనందాలు వెల్లివిరాశాయి. హీరో రామ్చరణ్ (Ram Charan), ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపావళి పండగ సందర్భంగా చిరంజీవి ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగాయి. అప్పుడే ఉపాసనకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. రామ్చరణ్-ఉపాసన 2012 జూన్ 14న వివాహం చేసుకోగా 2023 జూన్లో తొలి సంతానంగా క్లీంకార పుట్టిన సంగతి తెలిసిందే! కవలలు రాబోతున్నారుమళ్లీ రెండేళ్ల తర్వాత మెగా కుటుంబంలో రెండింతల సంతోషం (కవలలు) రాబోతోంది. ఈ విషయాన్ని ఉపాసన తెలుపుతూ తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసి.. ఈ దీపావళి డబుల్ సంతోషాన్ని తెచ్చింది. డబుల్ ప్రేమ, డబుల్ బ్లెస్సింగ్స్ అని పేర్కొన్నారు. ఇలా డబుల్ అని ఉపాసన పేర్కొనడం వెనక కారణం ఉంది. ఆమె కవలలకు జన్మనివ్వనున్నారు.చిరంజీవి కుటుంబంచిరంజీవి (Chiranjeevi Konidela)- సురేఖ దంపతులకు రామ్చరణ్, సుస్మిత, శ్రీజ.. అని ముగ్గురు సంతానం.. సుష్మితకు విష్ణుప్రసాద్తో పెళ్లవగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. శ్రీజకు శిరీష్ భరద్వాజ్తో పెళ్లవగా వీరికి నివృతి పాప పుట్టింది. తర్వాత వీళ్లు విడాకులు తీసుకున్నారు. అనంతరం కల్యాణ్ దేవ్ను పెళ్లాడగా.. ఈ జంటకు కూతురు నవిష్క జన్మించింది. కొంతకాలానికి శ్రీజ, కల్యాణ్ దేవ్ మధ్య అభిప్రాయపభేదాలు రావడంతో విడిపోయారు. రామ్చరణ్-ఉపాసన దంపతులకు క్లీంకార పాప పుట్టింది. అలా మొత్తంగా చిరంజీవికి ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు.చిరంజీవి కోరిక నెరవేరేనా?దీంతో ఓ ఈవెంట్లో చిరు.. ఇంట్లో ఉంటే నాకు మనవరాళ్లతో ఉన్నట్లుగా లేదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉన్నట్లు అనిపిస్తోంది. చుట్టూ ఆడపిల్లే.. ఒక్క మగాడు కూడా లేడు. చరణ్.. ఈసారైనా ఒక అబ్బాయిని కనరా.. నా వారసత్వం ముందుకెళ్లాలని కోరిక.. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదాస్పదమయ్యాయి. అందరూ ఆడపిల్లలే ఉన్నారు, కాబట్టి ఓ మగపిల్లాడిని కోరుకోవడం తప్పు లేదని, కానీ ఆడపిల్ల పుడుతుందని భయపడటమే తప్పని పలువురూ అభిప్రాయపడ్డారు. మరి ఈసారి పుట్టే కవలల్లో ఒక్కరైనా మగపిల్లాడు ఉంటాడేమో చూడాలి! View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: హీరోగా ఎంట్రీ ఇస్తున్న బ్లాక్బస్టర్ డైరెక్టర్! -
స్పిరిట్ సర్ప్రైజ్.. చిన్నప్పటినుంచి నాకో చెడ్డ అలవాటుందన్న ప్రభాస్!
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం స్పిరిట్ (Spirit Movie). అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు వంగా. తన సినిమాతో ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించే ఈ డైరెక్టర్ ఈసారి ప్రభాస్తో ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిన్న (అక్టోబర్ 23న) ప్రభాస్ (Prabhas) బర్త్డేను పురస్కరించుకుని ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆడియో గ్లింప్స్గురువారం రాత్రి 11 గంటలకు 'సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్' అంటూ 1.31 నిమిషాల ఆడియో గ్లింప్స్ వదిలారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఐపీఎస్ అధికారి ప్రభాస్ గురించి ప్రకాశ్రాజ్ ఇలా అంటాడు. వీడి గురించి విన్నాను.. యూనిఫామ్ ఉన్నా, లేకపోయినా ప్రవర్తనలో తేడా ఉండదని! ఖైదీ యూనిఫాంలో ఎలా ప్రవర్తిస్తాడో చూద్దాం! ప్రభాస్ డైలాగ్వీడి బట్టలూడదీసి మెడికల్ టెస్ట్కు పంపించండి అంటాడు. అందుకు ప్రభాస్.. మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటినుంచి ఒక చెడ్డ అలవాటుంది.. అని సగం చెప్పడంతోనే గ్లింప్స్ వీడియో పూర్తయింది. ప్రభాస్ను ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్స్టార్గా అభివర్ణిస్తూ టైటిల్ కార్డ్ వేయడం విశేషం! గ్లింప్సే ఈ రేంజ్లో ఉంటే టీజర్, ట్రైలర్ ఇంకెలా ఉంటుందో అని అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్దన్ రాణె సంగీతం అందిస్తున్నాడు. స్పిరిట్ వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చదవండి: ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత -
ఉన్నట్టా... మరి లేనట్టా...
త్రినాథ్ కఠారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. ‘వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో తెలుగమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్గా నటించారు. సంజీవని ప్రొడక్ష న్స్ బ్యానర్పై బళ్లారి శంకర్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఉన్నట్టా... మరి లేనట్టా...’ అంటూ సాగే పాటని హీరో శ్రీకాంత్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా ఉంది. ‘ఉన్నట్టా... మరి లేనట్టా...’ పాట చాలా అద్భుతంగా ఉంది. ఆర్పీ పట్నాయక్గారు బాగా కం పోజ్ చేశారు. త్రినాథ్, సాహితీ జోడీ చాలా బాగుంది. ప్రొడ్యూసర్ శంకర్, కెమెరామేన్ జగదీష్ నాకు మంచి మిత్రులు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘ఉన్నట్టా... మరి లేనట్టా...’ పాటకి పూర్ణాచారి లిరిక్స్ అందించగా, ఎస్పీ చరణ్, శ్రుతిక సముద్రాల పాడారు. -
తెలుసు కదా కొన్నేళ్లు మీతో ఉండి పోతుంది
‘‘డీజే టిల్లు’ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం తర్వాత ఒక నమ్మకాన్ని ఫీల్ అయ్యాను. ‘జాక్’ మూవీ రిలీజ్ తర్వాత ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను. వీటన్నిటికంటే ఒక ముఖ్యమైన అనుభూతిని, మనశ్శాంతిని ‘తెలుసు కదా’ చిత్రం రిలీజ్ తర్వాత ఫీలయ్యాను. ఈ సినిమా నన్ను ప్రశాంతంగా నిద్ర పోయేలా చేసింది’’ అని సిద్ధు జొన్నలగడ్డ చె΄్పారు. ఆయన హీరోగా, శ్రీనిధీ శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. ఈ చిత్రం అప్రిషియేషన్ మీట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతోంది... చూసినవాళ్లకు గుర్తుండి పోతుంది. కొన్నేళ్ల పాటు మీతో ఉండి పోతుంది’’ అని చె΄్పారు. ‘‘మా చిత్రానికి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు విశ్వప్రసాద్. ‘‘నన్ను నమ్మి సినిమా నిర్మించిన విశ్వప్రసాద్గారికి «థ్యాంక్స్’’ అని తెలిపారు నీరజ కోన. ‘‘తెలుసు కదా’ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది’’ అని నిర్మాత, రచయిత కోన వెంకట్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, నిర్మాతలు బండ్ల గణేశ్, ఎస్కేఎన్, డైరెక్టర్ సందీప్ రాజ్, నటుడు వైవా హర్ష, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ పేర్కొన్నారు. -
వెల్కమ్ వెంకీ
‘వెల్కమ్ వెంకీ... మై బ్రదర్!’ అంటూ వెంకటేశ్ని ఆప్యాయంగా సెట్స్కి ఆహ్వానించారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్లైన్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, కేథరిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వెంకటేశ్ కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్లో జాయిన్ అయ్యారు వెంకటేశ్. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించి, ఓ వీడియోను విడుదల చేసింది. ‘వెల్కమ్ వెంకీ... మై బ్రదర్...’ అంటూ చిరంజీవి ఆప్యాయంగా వెంకటేశ్ని పిలవగా, ‘చిరు సార్... మై బాస్...’ అంటూ చిరంజీవిని హత్తుకున్నారు వెంకటేశ్. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్ ట్రీట్. చిరంజీవి– వెంకటేశ్ ఒకే ఫ్రేమ్లో కనిపించడం ఫ్యాన్స్కి డబుల్ ఫెస్టివల్. ఈ సినిమాలో వెంకటేశ్ లెంగ్తీ, క్రూషియల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ఓ భారీ సెట్లో చిరంజీవి–వెంకటేశ్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. కాగా.. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. -
దీపావళి వెలుగుల్లో మెరిసిపోతున్న పూనమ్ బజ్వా.. డిఫరెంట్గా శ్వేతాబసు ప్రసాద్!
ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ పూనమ్ బజ్వా..దీపావళి సెలబ్రేషన్స్లో బాలీవుడ్ బ్యూటీ శివాంగి జోషి..ఎల్లో శారీలో బుల్లితెర నటి మంజుల అందాలు..హీరోయిన్ కావ్య థాపర్ స్మైలీ లుక్స్..ఢిఫరెంట్ అవుట్ఫిట్లో శ్వేతాబసు ప్రసాద్.. View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by C Sharp (@c___sharp) View this post on Instagram A post shared by Sai Praseedha Uppalapati (@praseedhauppalapati) View this post on Instagram A post shared by Nandiniii🕊 (@nandiniguptaa13) View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Manjula Paritala (@paritala_manjula_official) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) -
ఓటీటీల్లో పండగే.. ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్!
దీపావళి సెలవులు ముగిసిపోయాయి. చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. గతవారం థియేటర్లలో దీపావళికి టాలీవుడ్ చిత్రాలు చేశాయి. ఇక ఈ వారంలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. బాక్సాఫీస్ వద్ద విక్రమ్ తనయుడు హీరోగా వస్తోన్న బైసన్ రిలీజవుతోంది. ఇది తప్ప పెద్దగా బజ్ ఉన్న సినిమాలేవీ రావడం లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే ఇప్పటికే హిట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఓటీటీల వైపు చూస్తున్నారు ఆడియన్స్. ఈ శుక్రవారం జాన్వీ కపూర్ పరమ్ సుందరి, విజయ్ ఆంటోనీ భద్రకాళి, కురుక్షేత్ర లాంటి యానిమేషన్ సినిమాలు సందడి చేసేందుకు వస్తున్నాయి. ఓటీటీ ప్రియులు ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్కురుక్షేత్ర - 2 (యానిమేటెడ్ సిరీస్) - అక్టోబర్ 24ఎ హౌజ్ ఆఫ్ డైనమైట్ - అక్టోబర్ 24పరిష్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 24ది డ్రీమ్ లైఫ్ ఆఫ్ మిస్టర్ కిమ్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 25అమెజాన్ ప్రైమ్..ఈడెన్ (హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24పరమ్ సుందరి(బాలీవుడ్ సినిమా) - అక్టోబర్ 24అడ్వెంచర్ టైమ్- ఫియాన్ అండ్ కేక్-సీజన్2 (యానిమేషన్)- అక్టోబర్ 24బోన్ లేక్(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24(రెంట్ పద్దతిలో)జియో హాట్స్టార్..భద్రకాళి(తమిళ సినిమా) - అక్టోబర్ 24ది కర్దాసియన్స్ (సీజన్-7)- అక్టోబర్ 24మహాభారత్: ఏక్ ధర్మయుధ్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 25ఆహా..అక్యూజ్డ్(తమిళ సినిమా)- అక్టోబర్ 24లయన్స్ గేట్ ప్లే..ది అప్రెంటిస్(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24నడికర్(మలయాళ సినిమా)- అక్టోబర్ 24ఫ్రీ లాన్స్ (హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24యాపిల్ టీవీ ప్లస్..స్టిల్లర్ అంజ్ మియారా నథింగ్ ఈజ్ లాస్(హాలీవుడ్)- అక్టోబర్ 24సన్ నెక్ట్స్..టేల్స్ ఆఫ్ ట్రేడిషన్(తమిళ సినిమా)- అక్టోబర్ 24జంబూ సర్కస్(కన్నడ సినిమా)- అక్టోబర్ 24హెచ్బీవో మ్యాక్స్..వెపన్స్-(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24 -
రెబల్ స్టార్ బర్త్ డే.. 20 ఏళ్ల నాటి సినిమాను గుర్తు చేసుకున్న ఛార్మి!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. ఇక డార్లింగ్ కొత్త సినిమాల అప్డేట్స్ సైతం అభిమానులకు డబుల్ డోస్ ఇచ్చాయి. ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హనురాఘవపూడితో చేస్తోన్న సినిమాకు సంబంధించి పోస్టర్ను రిలీజ్ చేశారు. అందరూ ఉహించినట్లుగానే ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు.రెబల్ స్టార్ ప్రభాస్కు పలువురు టాలీవుడ్ సినీతారలు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియాలో ప్రభాస్తో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. తాజాగా హీరోయిన్ ఛార్మి సైతం డార్లింగ్కు పుట్టినరోజు విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రభాస్తో నటించిన పౌర్ణమి రీ రిలీజ్ కావడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది.(ఇది చదవండి: ప్రభాస్, హను రాఘవపూడి కొత్త సినిమా టైటిల్ ప్రకటన)ఈ సినిమాలో ప్రతి సీన్ ఇప్పటికీ గుర్తుందని రాసుకొచ్చింది. పౌర్ణమి మూవీతో నాకున్న ఉత్తమ జ్ఞాపకాలలో ఒకటని ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ సినిమాతో మొదలైన ప్రభుదేవా, త్రిషతో స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని వెల్లడించింది. మా అభిమాన రెబెల్స్టార్ ప్రభాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి విష్ చేసింది. కాగా..2006లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఛార్మి, త్రిష హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. After 20years,#Pournami a film which is very very close to all of us is re-releasing today on our darling #Prabhas’s birthday. I still remember each and every moment so strong and so beautiful, one of my best memories i have with pournami and even after 20years,… pic.twitter.com/kbGKXmhlmI— Charmme Kaur (@Charmmeofficial) October 23, 2025 -
ముచ్చటగా మూడో సినిమాకు సెంచరీ కొట్టిన 'డ్యూడ్'
కాస్త నెగెటివ్ టాక్ వచ్చిందంటే సినిమా బండి ముందుకెళ్లడం కష్టమే! కానీ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) మాత్రం మిక్స్డ్ టాక్నే ఇంజనుగా మార్చుకుని రయ్యిమని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన డ్యూడ్ సినిమా (Dude Movie) ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. బ్లాక్బస్టర్ దివాళీ సీజన్ అంటూ రూ.100 కోట్ల పోస్టర్ను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. మూడు సినిమాలకు వరుస సెంచరీ సాధించిన హ్యాట్రిక్ హీరోగా ప్రదీప్ చరిత్ర సృష్టించాడు. డ్యూడ్ సినిమాలో మమిత బైజు హీరోయిన్గా నటించగా శరత్కుమార్ కీలక పాత్ర పోషించాడు.సినిమాప్రదీప్ రంగనాథన్.. ఎల్కేజీ సినిమాకు డైలాగ్స్ రాశాడు. కోమలి సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇందులో అతిథి పాత్రలోనూ మెరిశాడు. లవ్ టుడే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. స్వీయదర్శకత్వం వహించిన ఈ సినిమా వంద కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. రెండో సినిమా డ్రాగన్ సైతం సెంచరీ దాటేసి ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ముచ్చటగా మూడో సినిమా కూడా సెంచరీ దాటేసింది. మరి డ్యూడ్ ఇంకా ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి! DUDE SMASHES A CENTURY AT THE BOX OFFICE 💥💥💥#Dude collects a gross of over 100 CRORES WORLDWIDE, making it the biggest blockbuster of the Diwali season ❤🔥Book your tickets now and celebrate #DudeDiwali 🔥🎟️ https://t.co/JVDrRd4PZQ🎟️ https://t.co/4rgutQNl2n⭐ing… pic.twitter.com/maxHJwy3uo— Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2025 చదవండి: బిగ్బాస్ 9: సడన్గా రౌడీ బేబి ఎలిమినేట్! ఎందుకంటే? -
బిగ్బాస్ 9: సడన్గా రౌడీ బేబి ఎలిమినేట్! ఎందుకంటే?
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో ఇప్పటివరకు ఏడుగురు వెళ్లిపోయారు. ఒకరు మళ్లీ తిరిగొచ్చారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, హరిత హరీశ్, శ్రీజ, భరణి వరుసగా వెళ్లిపోయారు. మధ్యలో సంజనాను మిడ్వీక్లో హౌస్మేట్స్ ఎలిమినేట్ చేశారు. కానీ, బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఆమెను సీక్రెట్ రూమ్కు పంపించాడు. వీకెండ్లో సంజనా వెళ్లిపోతుందని సంబరపడ్డారా? ఛాన్సే లేదంటూ మళ్లీ హౌస్లోకి పంపించారు.నామినేషన్స్లో 8 మందిఇక ఏడోవారం నామినేషన్స్లో ఎనిమిది మందున్నారు. వారే.. తనూజ, పవన్ కల్యాణ్, రీతూ చౌదరి, సంజన గల్రాని, రాము రాథోడ్, దివ్య, రమ్య, శ్రీనివాస్ సాయి. వీరిలో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన రమ్య, శ్రీనివాస్, రాము రాథోడ్ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్లోనే లేని వ్యక్తి ఒకరు ఎలిమినేట్ కావొచ్చు. ఆ కంటెస్టెంటే ఆయేషా. తను హైపర్ యాక్టివ్. ఫుల్ జోష్తో హౌస్లో అడుగుపెట్టింది. ఆరోగ్య సమస్యలుఅరుపులు, కేకలతో హౌస్ దద్దరిల్లేలా చేసింది. చీటికిమాటికి గొడవలు పడుతూ జనాలకు మాత్రం చిరాకు తెప్పించింది. వచ్చిన వారంలో ఉన్నంత జోష్ తర్వాతి వారంలో లేదు. కారణం.. ఆయేషా (Ayesha Zeenath)కు ఆరోగ్య సమస్యలున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎపిసోడ్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే డాక్టర్ రూమ్కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. వైద్యులు ఓకే అంటేనే హౌస్లో కొనసాగుతుంది. లేదంటే మాత్రం ఆమెను బయటకు పంపించే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. రీతూను టార్గెట్ చేసి..నిజానికి ఆమె హౌస్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మంచి ఫైర్ బ్రాండ్ అవుతుందనుకున్నారంతా! కానీ అనవసరపు గొడవలు, అరుపులతో అందరికంటే వరస్ట్ అనిపించుకుంది. రీతూను టార్గెట్ చేసి ఆమె నెగెటివిటీని కాస్త పోగొట్టేందుకు సాయపడింది. ఆమె నామినేషన్స్లోకి వస్తే పంపించేందుకు జనాలు రెడీగా ఉన్నారు. కానీ, వాళ్లకు పని చెప్పకుండా తనే స్వయంగా వాకౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగా వెళ్లిపోతుందా? వెళ్తే తిరిగొస్తుందా? ఆరోగ్యం కుదుటపడి హౌస్లోనే కొనసాగుతుందా? అనేది చూడాలి!చదవండి: సంజనా నోటి దురుసు.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమన్న మాధురి -
పెళ్లి తర్వాత తొలి దీపావళి.. అక్కినేని అఖిల్ భార్య స్పెషల్ విషెస్!
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చైతూ పెళ్లికి ముందే తన ప్రియురాలు జైనాబ్ రవ్దీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్.. జూన్లో ఆమె మెడలో మూడుముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరిగింది. తమ్ముడి పెళ్లిలో నాగచైతన్య తన సతీమణి శోభిత ధూళిపాలతో కలిసి సందడి చేశారు.ఈ ఏడాది పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి తొలిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పండుగ సెలబ్రేషన్స్ ఫోటోను అఖిల్ సతీమణి జైనాబ్ రవ్దీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీపావళి శుభాకాంక్షలు.. ఈ పండుగ అందరికీ శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, శాంతి, ప్రేమతో నిండిన ఏడాదిగా నిలవాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ జంటను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే అఖిల్- జైనాబ్ జంటగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. View this post on Instagram A post shared by Zainab Ravdjee (@zainabravdjee) -
మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు.. తెలుగు సినీ చరిత్రలో తొలిసారి!
మెగాస్టార్ - అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్ ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. మొదటిసారి వీరిద్దరి మూవీ కోసం టాలీవుడ్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారుకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది.ఈ మూవీలో వెంకీమామ సైతం నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్((Chiranjeevi) ) సైతం ట్వీట్ చేశారు. వెల్కమ్ టూ మన శంకర వరప్రసాద్ గారు ఫ్యామిలీ అంటూ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో వెంకటేశ్ను చిరంజీవి మై బ్రదర్ అని పిలవగా.. చిరుసర్.. మై బాస్ అంటూ వెంకీ మామ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఓకే మూవీలో నటించడం తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Welcoming my dear friend, Victory @VenkyMama to our #ManaShankaraVaraPrasadGaru Family 💐💐💐Let’s celebrate the joy this Sankranthi 2026 in theatres 🤗 pic.twitter.com/3kITC2RlBU— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2025 -
ప్రభాస్ బావ.. అరడజనుమంది పిల్లలతో హ్యాపీగా ఉండు: మోహన్బాబు
కన్నప్ప సినిమాలో ప్రభాస్ (Prabhas) నటించడానికి ప్రధాన కారణం మోహన్బాబు (Mohan Babu). ఆయన మీదున్న గౌరవంతోనే విష్ణు సినిమాలో నటించేందుకు ముందుకొచ్చాడు. తన లుక్తోనే సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చాడు. ప్రభాస్ను మోహన్బాబు ముద్దుగా బావ అని పిలుస్తుంటాడు. ఈ రోజు (అక్టోబర్ 23) డార్లింగ్ బర్త్డే.. ఈ సందర్భంగా మోహన్బాబు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.బావకు బర్త్డే విషెస్మై డియర్ డార్లింగ్ బావా ప్రభాస్.. దేశానికే నువ్వు గర్వకారణం. నువ్వు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. అంతులేని సంతోషంతో ఆనందంగా గడపాలి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి. అలాగే త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని, అరడజను మంది పిల్లల్ని కని సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో, నిన్ను ఎప్పుడూ ప్రేమించే బావ అని ట్వీట్ చేశాడు. భలే సరదా..ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ప్రభాస్ను అలా ఊహించుకుంటే భలే సరదాగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. ఇంకా పెళ్లి ఊసే లేదంటే.. పిల్లల వరకు వెళ్లిపోయారా.. అని ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్, మోహన్బాబు.. బుజ్జిగాడు సినిమాలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరిద్దరూ ఒకరినొకరు బావ అని పిల్చుకుంటారు. My Dear Darling Bava #Prabhas , the pride of the entire nation —May you be blessed with endless happiness, and celebrate many more birthdays in grand style, may you live in good health and joy for a hundred years,And may you soon get married and live a happy life with half a… pic.twitter.com/tiPFY5t7Vu— Mohan Babu M (@themohanbabu) October 23, 2025 చదవండి: బ్లాక్బస్టర్ మూవీతో బ్రేక్.. వస్తున్నా, ఇప్పుడు అసలు సినిమా -
ధ్రువ్ విక్రమ్ సినిమా.. భారీగా 'బైసన్' కలెక్షన్స్
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ వ్రికమ్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం బైసన్(Bison).. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. అక్టోబర్ 17న కేవలం తమిళ్లో మాత్రమే విడుదలైన బైసన్ భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ధ్రువ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.బైసన్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే కోలీవుడ్లో విడుదలైంది. దీంతో మొదటిరోజు అనుకున్నంత రేంజ్లో ఓపెనింగ్స్ రాలేదు. కానీ, సినిమా బాగుందని టాక్ రావడంతో కలెక్షన్ల జోరు పెరిగింది. దీంతో కేవలం ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం తమిళ్లో మాత్రమే బైసన్ విడుదలైంది. ఇప్పుడు తెలుగులో కూడా అక్టోబర్ 24న విడుదల కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ మూవీ కనెక్ట్ అయితే ఇక్కడ కూడా ధ్రువ్ మార్కెట్ పెరగనుంది. ఫైనల్గా వంద కోట్లకు దగ్గర్లో బైసన్ కలెక్షన్స్ ఉండొచ్చని అంచనా వేయవచ్చు. కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం బైసన్.ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. కొన్ని సన్నివేశాల్లో తన తండ్రి విక్రమ్ను గుర్తు చేశారు. Extremely grateful for all your love! #BisonKaalamaadan grows over a hundred percent over day one and is roaring at the box office. Just Tamil version collects 35cr gross collections worldwide New Raid #Bison ready for Telugu release 🦬#BisonKaalamaadan 🦬 #DiwaliWinner 💥… pic.twitter.com/FqeV8unvls— Mari Selvaraj (@mari_selvaraj) October 22, 2025 -
బ్లాక్బస్టర్ మూవీతో బ్రేక్.. వస్తున్నా, ఇప్పుడు అసలు సినిమా షురూ!
తెలుగు నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడు. నిర్మాతగా హిట్లు, బ్లాక్బస్టర్స్ అందుకున్న ఆయన సినిమా నిర్మించి చాలా ఏళ్లవుతోంది. అయితే ఇటీవల దీపావళి పండక్కి టాలీవుడ్ సెలబ్రిటీలను పిలిచి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకకు చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, రోషన్, శివాజీ, తేజ సజ్జ, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, బెల్లంకొండ శ్రీనివాస్, తరుణ్.. తదితరులు హాజరయ్యారు.సిద్ధుపై పొగడ్తలుఈ హడావుడి అంతా చూస్తుంటే బండ్ల గణేశ్ టాలీవుడ్లో రీఎంట్రీకి రెడీ అయ్యాడని అందరికీ అర్థమైపోయింది. తాజాగా అదే నిజమని ధ్రువీకరించాడు. తెలుసు కదా సినిమా (Telusu Kada Movie) బ్లాక్బస్టర్ సక్సెస్ ఈవెంట్కు బండ్ల గణేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నటుడు అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. నేనైతే ఈ సినిమా తీయనుజోష్ సినిమాలో చిన్న వేషం కోసం తపించిన సిద్దు.. మరో రవితేజ అవుతాడు. సిద్దు, తేజ సజ్జ.. ఈ యంగ్ జనరేషన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. మీరు రెండు దశాబ్దాలపాటు సినీ ఇండస్ట్రీకి హిట్స్ ఇవ్వడానికి పుట్టినవాళ్లు! నేనైతే నిర్మాతగా తెలుసు కదా సినిమా తీయను. ఈ మూవీ తీయడానికి దమ్ము, ధైర్యం కావాలి. ఈ విషయంలో విశ్వప్రసాద్ను అభినందించాల్సిందే! మీరు మా తోటి నిర్మాత అవడం సంతోషంగా ఉంది. రీఎంట్రీ అడిగారుగా..నీరజ కోన.. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది. అయినా కూడా అందరినీ కలుపుకుపోతూ దర్శకురాలిగా మారడం అంటే మాటలు కావు. హ్యాట్సాఫ్. నిర్మాత ఎస్కేఎన్ నన్ను రీఎంట్రీ ఇవ్వమని అడిగాడు. నేను టెంపర్ సినిమాతో బ్రేక్ తీసుకున్నాను. ఫ్లాప్ మూవీతో కాదు, బ్లాక్బస్టర్ సినిమా ఇచ్చి బ్రేక్ తీసుకున్నా.. ఇప్పుడు మొదలవుతుంది సెకండాఫ్! అసలు సినిమా మొదలు కాబోతుంది అంటూ సెకండ్ ఇన్నింగ్స్ ఉండబోతుందని చెప్పకనే చెప్పాడు.చదవండి: సినిమా ఇండస్ట్రీలో రూ.1000 కోట్లు నష్టపోయా! లైన్లో నిలబడి..


