బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్కుమార్ హిరాణి 3 ఇడియట్స్’ మూవీ సీక్వెల్ ప్రకటించాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయి అని తెలిపాడు. విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ చిత్రం 2009లో విడుదలై, బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో ఆమిర్ఖాన్ హీరోగా, ఆర్. మాధవన్ , శర్మన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ప్రధానపాత్రల్లో నటించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో 3 ఇడియట్స్ సీక్వెల్ గురించి రాజ్కుమార్ హిరాణి ఇలా అన్నారు. 3 ఇడియట్స్ సీక్వెల్ కథ కోసం పనులు ప్రారంభించామన్నారు. స్టోరీ విషయంలో సరికొత్త ఆలోచన వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయితే, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆలోచన కూడా ఉంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టలేదంటూనే దాదాపు అంతా సిద్ధమైందన్నారు. ప్రధానపాత్రధారులు 15 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో ‘3 ఇడియట్స్’ సీక్వెల్ కథనం సాగుతుందని బాలీవుడ్ భోగట్టా. మరోవైపు మున్నాభాయ్ సీక్వెల్ కూడా కథ పూర్తి అయినట్లు ఆయన పేర్కొన్నారు.


