త్రీడీలో చూసి షాక్‌ అయ్యాను | NikhilSiddhartha Swayambhu Launch | Sakshi
Sakshi News home page

త్రీడీలో చూసి షాక్‌ అయ్యాను

Feb 12 2026 4:12 AM | Updated on Feb 12 2026 4:12 AM

NikhilSiddhartha Swayambhu Launch

– నిఖిల్‌  

‘‘కార్తికేయ 2’ వంటి పాన్‌ ఇండియా విజయం తర్వాత అంతకంటే అద్భుతమైన ప్రాజెక్ట్‌తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ చిత్రం చూసిన తర్వాత నిఖిల్‌ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా సంతోషపడతారు’’ అని నిఖిల్‌ చె΄్పారు. నిఖిల్‌ హీరోగా, సంయుక్త, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘స్వయంభు’.  భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ నిర్మించారు. 

ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్‌ భాషల్లో త్వరలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిఖిల్‌ మాట్లాడుతూ– ‘‘వెయ్యేళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రాంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవారు. అల్లరిగా తిరిగే అండర్‌ డాగ్‌ రాజ్యాలను శాసించే స్థాయికి ఆయన ఎలా ఎదిగారు? అనేది మా సినిమాలో చూపించాం. ఈ మూవీని త్రీడీలో చూసినప్పుడు షాక్‌ అయ్యాను. ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్‌ చేస్తారు’’ అని చె΄్పారు. భరత్‌ కృష్ణమాచారి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా అందరికీ గొప్ప అనుభూతినిస్తుంది’’ అని పేర్కొన్నారు. 
‘‘ఈ సినిమాలో భాగం కావడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు కెమెరామేన్‌ సెంథిల్‌ కుమార్‌.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement