Amaravati
-
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు (BIEAP) అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫలితాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సమాచారం వెల్లడించారు.రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదేఈసారి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించగా, ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి జూన్ 11 వరకు జరిగాయి. రెగ్యులర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (IPE) 2026లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వడం కోసం ఈ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలు విద్యార్థుల అకడమిక్ సంవత్సరం వృథా కాకుండా ముందుకు సాగేందుకు కీలకంగా మారాయి.ఇప్పటికే విడుదలైన రెగ్యులర్ ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం సుమారు 77 శాతం కాగా, సెకండ్ ఇయర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 81 శాతంగా నమోదైంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, తొలిసారిగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశం కూడా కల్పించబడింది, ఇది విద్యార్థులకు తమ మార్కులను మెరుగుపరుచుకునే అవకాశం అందించింది. -
బాసు, బిగ్బాసే సూత్రధారులు
సాక్షి, అమరావతి: సంచలనం కలిగిస్తున్న గాదె సాయి కృష్ణ లాకప్ డెత్కు గురయ్యారనే వ్యవహారం వెనుక సూత్రధారి విజయవాడ పోలీస్ బాసేనన్నది స్పష్టమవుతోంది. బిగ్ బాస్ ఆదేశాలతోనే పోలీస్ బాస్ చెలరేగిపోయారన్నది తాజాగా వెలుగులోకి వస్తోంది. బిగ్ బాస్, విజయవాడ బాస్ సూత్రధారులుగా పాల్పడిన ఈ దారుణంలో పలువురు పోలీసు అధికారులు పాత్రధారులుగా వ్యవహరించారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ వీరవిధేయ ఐపీఎస్లుగా చెలరేగిపోతున్న ఆ ఇద్దరు అధికారులే కర్త, కర్మ, క్రియగా మొత్తం వ్యవహారం సాగిందన్నది బట్టబయలవుతోంది.సీఐ నాగరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా సరే.. అసలు కథ నడిపించింది పోలీస్ బాస్లేనన్నది నిగ్గు తేలుతోంది. ఈ దారుణంతో కూటమి ప్రభుత్వ దురాగతాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. దాంతో మూడు రోజుల తర్వాత తీరుబడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సమావేశమై వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడకు తెరతీశారు.విచారణ పేరుతో కాలయాపన చేసి, విషయాన్ని మరుగున పరచాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా ఉంది. ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం సాయికృష్ణ లాకప్ డెత్ పూర్తి వివరాలతో నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. సాయి కృష్ణ లాకప్ డెత్కు గురయ్యారనే ఆయన కుటుంబ సభ్యుల ఆందోళన వెనుక విశ్వసనీయ సమాచారం మేరకు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. పోలీస్ బాస్ ఆదేశాలతోనే పోలీసు అధికారుల బరితెగింపు ఓ కేసులో సాయికృష్ణను నేరం అంగీకరించేలా చేయాలని పోలీస్ బాస్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మీరేం చేస్తారో చేయండి.. అతను నేరాన్ని ఒప్పుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ కేసుపై బిగ్బాస్ తరచూ అడుగుతున్నారని కూడా వ్యాఖ్యానించారు. దాంతో ఇద్దరు మహిళా పోలీసు అధికారులతో కూడిన టాస్క్ఫోర్స్ అధికారుల బృందం సాయి కృష్ణను అదుపులోకి తీసుకుంది.అతడిని కొన్ని రోజులపాటు పోలీసు శైలిలో చిత్రహింసలకు గురి చేసిన అనంతరం సీఐకి అప్పగించారు. అప్పటికే కొన్ని రోజులపాటు చిత్రహింసలకు గురైన ఆయనపై సీఐ ఆధ్వర్యంలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. పోలీసుల టార్చర్ తట్టుకోలేక సాయికృష్ణ సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయనకు హడావుడిగా చికిత్స చేయించేందుకు పోలీసులు యత్నించినట్టు సమాచారం. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. ఇక చేసేదేమీ లేదన్నది స్పష్టమైంది. కథ నడిపించిన పోలీస్ బాస్ విషయన్ని పోలీస్ బాస్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాలతోనే సాయికృష్ణను కనిపించకుండా చేశారు. గుట్టుచప్పుడు కాకుండా పక్కాగా మాయం చేశారు. ఏకంగా జిల్లా దాటించి అజ్ఞాత ప్రదేశంలో తతంగాన్ని పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై బిగ్బాస్కు కూడా ముందస్తుగా పూర్తి సమాచారం ఉంది. మొత్తం పోలీసు వ్యవస్థ అంతా ఒక్కటై గుట్టు చప్పుడు కాకుండా సాయి కృష్ణను ‘మాయం’ చేశారు. అసలు సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకోనే లేదని నమ్మించేందుకు బరితెగించారు.కాగా, తమ కొడుకు సాయికృష్ణను పోలీసులు అపహరించారని, కనిపించకుండాపోయాడని ఆయన తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో పోలీసుల కుట్ర కథ అడ్డం తిరిగింది. దీంతో బెంబేలెత్తిన ఓ మహిళా పోలీసు అధికారి ఈ విషయాన్ని పోలీస్ బాస్ దృష్టికి తీసుకువెళ్లారు. ‘ఏం పర్వా లేదు. అంతా నేను చూసుకుంటా..’ అని వ్యాఖ్యానించారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. బిగ్ బాస్ కూడా ఈ విషయంలో ఏం ఆందోళన వద్దు.. అంతా మేం చూసుకుంటాం.. అని భరోసా ఇచి్చనట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల నుంచి ఆశీస్సులు ఉండటం వల్లే వారు ఇలా భరోసా ఇచి్చనట్లు తెలుస్తోంది. నన్ను ఇరికిస్తే.. మొత్తం బయట పెడతా సాయి కృష్ణ లాకప్ డెత్కు గురయ్యారనే అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో విజయవాడ పోలీసు వర్గాలు హడలి పోతున్నాయి. ఈ వ్యవహారాన్ని సీఐ నాగరాజు వరకే పరిమితం చేసి, ముగించాలని పోలీస్ బాస్ ఎత్తుగడ వేశారు. అందుకే ఆయన్ను వీఆర్కు పంపించి విషయాన్ని కప్పిపుచ్చే ఎత్తుగడ వేశారు. కానీ సాయికృష్ణ కుటుంబ సభ్యులతోపాటు మానవ హక్కుల వేదిక సభ్యులు, ఇతర ప్రజా సంఘాలు పోలీసుల తీరుకు ఎదురు తిరిగాయి. సాయికృష్ణను చూపించాల్సిందేనని పట్టుబట్టాయి.బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇందుకు బాధ్యత వహించాలని తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం, విజయవాడ పోలీసు కమిషనరేట్ కార్యాలయం కొత్త ఎత్తుగడకు తెరతీశాయి. సీఐ నాగరాజు వరకు కఠిన చర్యలు తీసుకుని.. విషయాన్ని కప్పిపుచ్చాలని భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని సీఐ నాగరాజు దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. పోలీసు శాఖ తీసుకునే కఠిన చర్యలను వ్యతిరేకించవద్దని, సహకరించాలని సూచించినట్టు సమాచారం. కొన్ని నెలల్లోనే మళ్లీ పోస్టింగు ఇస్తామని, ఏమీ కంగారు పడవద్దని ఆయనకు హామీ ఇచి్చనట్టు తెలుస్తోంది. కానీ ఈ వ్యవహారాన్ని కేవలం తన ఒక్కడి మెడకే చుడితే సమ్మతించేదే లేదని ఆయన చెబుతున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఈ వ్యవహారం వెనుక ఉన్న పోలీస్ బాస్తోపాటు అందరి పేర్లు బయట పెడతానని ఆయన చెబుతున్నారన్నది కూడా విశ్వసనీయ సమాచారం. పోలీస్ బాస్ల ఆదేశాలను పాటించిన తానొక్కడినే ఎందుకు బాధ్యుడిని కావాలని ఆయన ప్రశి్నస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయి కృష్ణ లాకప్ డెత్కు గురయ్యారనే అంశంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది పోలీసు వర్గాలతోపాటు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాపులంటే అంత చిన్నచూపాఅడవుల్లో, మారుమూల గ్రామాల్లో వినే లాకప్ డెత్లు ఇప్పుడు విజయవాడ నడిబొడ్డున చేయడం కూటమి ఘనకార్యం. లాకప్లో చనిపోయిన వ్యక్తి శవాన్ని పోలీసులు మాయం చేయడం నా అనుభవంలో మొదటిసారి. బాధిత కుటుంబం కోర్టుకు వెళితే తప్ప కేసు కదలేదు. ఇదేనా మార్పు? ఇదేనా మంచి పరిపాలన. కందుకూరులో కాపు యువకులపై కారు ఎక్కించిన ఘటనను 15 రోజులు దాచిపెట్టారు. పేద కులాలు, బీసీ, ఎస్సీ వర్గాలంటేనే చిన్నచూపా? ఈ దుర్మార్గాలను అదుపు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే. – దాసరి రాము, కన్వీనర్, తెలగ, బలిజ, కాపు జేఏసీ పవన్కళ్యాణ్ నోరు విప్పాలికాపు యువకుడు సాయికృష్ణ కేసును పక్కదారి పట్టించేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. సాయికృష్ణ మృతదేహాన్ని అప్పగించి అతడి కుటుంబానికి న్యాయం చేయాలి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సైతం నోరు విప్పాలి. – అపోజీ, అధ్యక్షుడు, శ్రీకృష్ణదేవరాయల బలిజ సంక్షేమ సంఘం, చిత్తూరుకాపులపై దాడులు, హత్యా రాజకీయాలుకాపు సామాజిక వర్గం లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం దాడులు, హత్యా రాజకీయాలకు పాల్పడుతోంది. సాయికృష్ణ లాకప్ డెత్ దుర్మార్గం. కాపులపై టీడీపీ నేతలు, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నా పవన్కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. – అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త నిజాలు బయటకు రావాలివిజయవాడలో సాయికృష్ణ లాకప్డెత్ ఘటనలో నిజాలు బయటకు రావాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. న్యాయం జరిగే వరకూ ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా మా పోరాటం కొనసాగుతుంది. – పన్నాస పూర్ణచంద్రరావు, ఆంధ్ర–తెలంగాణ రాధారంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, కాళ్లపాలెం, కలిదిండి మండలంగెలిపించిన వారినే చంపుతారా?కాపులతో చేతులు కలిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అధికారంలోకి వచ్చాక కాపుల్ని విస్మరించడం తగదు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ తక్షణమే స్పందించి సాయికృష్ణ లాకప్డెత్కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – మామిడి శ్రీకాంత్, వైఎస్సార్సీపీ తూర్పుకాపు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వానిదే బాధ్యతకాపు కులానికి చెందిన గాదె సాయికృష్ణను వెంటనే అతని కుటుంబానికి అప్పగించాలి. రాష్ట్రంలో కాపులను ద్వితీయశ్రేణి పౌరులుగా ప్రభుత్వం చూస్తోంది. సాయికృష్ణకు ఏదైనా జరిగితే దానికి పోలీసులే పూర్తి బాధ్యత వహించాలి. – కొండాల గణేష్, తూర్పుకాపు సంక్షేమ సంఘం, జిల్లా అధ్యక్షుడు, శ్రీకాకుళంపూర్తిస్థాయిలో విచారణ చేయాలికాపు యువకుడు సాయికృష్ణ అదృశ్యంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. బాధ్యుల్ని శిక్షించాలి. యువకుడు కనిపించకపోవడం దారుణమైన విషయం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. – కొక్కిరాల సంజీవకుమార్, జిల్లా అధ్యక్షుడు, కాపు సంఘం, ఒంగోలు కాపులకు రక్షణ లేదుకూటమి ప్రభుత్వంలో కాపులకు రక్షణ లేదు. సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపటం దుర్మార్ఘం. ఇటీవల గుంటూరులోనూ ఓ వ్యక్తిని ఇలాగే చంపారు. పది రోజులు గడవకుండానే విజయవాడలో మరో ఘోరం జరగటం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. – తాడిశెట్టి శ్రీనివాసరావు, కాపు సంఘ నాయకుడు, పామర్రు, కృష్ణాజిల్లా రెడ్బుక్ రాజ్యాంగం వల్లే..టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాపులపై పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి. వీటికి కొనసాగింపుగా విజయవాడలో సాయికృష్ణ అదృశ్యమయ్యాడు. రెడ్బుక్ రాజ్యాంగం వల్ల జనసేన కార్యకర్తలు కూడా బాధితులుగా మారుతున్నారు. – సలాది సతీష్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, విలసవిల్లి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
కుదేలవుతున్న కర్షకుడు
సాక్షి, అమరావతి: పెరిగిన ఖర్చులు, గిట్టుబాటు ధర అందని అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాత.. ఇప్పుడు బయో ప్రొడక్ట్స్ వివాదంలో మరోసారి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కంపెనీలు, హోల్సేలర్లు, డీలర్లు, అధికారుల మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంలో రైతే బలిపశువుగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది.ఎరువులతో పాటు ఇతర ఉత్పత్తుల కొనుగోలుకు రైతును బలవంతం చేయొద్దని డీలర్లకు స్పష్టంచేస్తూ వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే వ్యవసాయ శాఖ జారీ చేసిన ఆదేశాలపై డీలర్లు మండిపడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండే యూరియా, డీఏపీ కావాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బయో ప్రొడక్ట్స్ తీసుకోవాలని కంపెనీలు, హోల్సేలర్స్ తమపై ఒత్తిడి తీసుకొస్తారని, విధిలేని పరిస్థితుల్లోనే వాటిని రైతులకు అవసరం లేకున్నా అంటగట్టాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. తమపై ఇలాంటి ఒత్తిడి వద్దని కంపెనీలు, హోల్సేలర్స్కు తొలుత స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే యూరియా, డీఏపీ అమ్మకాలు నిలిపివేస్తామని తేల్చి చెబుతున్నారు. ఈ వివాదం ఎటు తిరిగినా చివరికి ఆర్థికంగా నష్టపోయేది రైతేనన్న ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. రైతుల నుంచి రూ.1,000 కోట్లకుపైగా దోపిడీ» రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 18 లక్షలు, రబీలో 23 లక్షల టన్నుల ఎరువుల వినియోగం ఉంటుంది. కాంప్లెక్స్ ఎరువులతో పోలిస్తే కాస్త చౌకగా లభించే యూరియాతో పాటు డీఏపీ ఎరువుల వినియోగం కాస్త ఎక్కువగా ఉంటుంది. » ఇందులో ప్రధానంగా ఖరీఫ్లో 7 లక్షల టన్నులు యూరియా, 2.50 లక్షల టన్నులు డీఏపీ, రబీలో 9.38 లక్షల టన్నుల యూరియా, 2.20 లక్షల టన్నుల డీఏపీ ఎరువులు వినియోగిస్తారు. వీటి కోసం సీజన్లో ఎనలేని డిమాండ్ ఉంటుంది. » ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకొని సాగులో పెద్దగా అవసరం లేని బయో ఫెర్టిలైజర్లు, బయో స్టిమ్యులెంట్లు, పురుగుమందులు, సూక్ష్మపోషకాలు, ఇతర వ్యవసాయ ఇన్పుట్స్ను రైతులకు బలవంతంగా అంట గట్టడం పరిపాటిగా మారింది. » యూరియా, డీఏపీ బస్తాలు కొనుగోలు చేసే పరిమాణంలో కనీసం 40–50 శాతం ఈ బయో ప్రొడెక్ట్స్ను కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తారు. చేసేది లేక చేతిచమురు వదులుతున్నా విధిలేని పరిస్థితుల్లో వీటిని కొనుగోలు చేసి, అవసరం లేకున్నా మోతాదుకు మించి అన్నదాతలు వినియోగిస్తుంటారు. » ప్రతీ ఏటా ఈ చట్ట వ్యతిరేక లింక్ ప్రొడెక్ట్స్ వ్యాపారం అక్షరాల రూ.1000 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. » ఈ తరహా అమ్మకాలను నిలిపివేయాలన్న రైతుల డిమాండ్ను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రెండేళ్లుగా ఓ వైపు యూరియా, డీఏపీ అదునుకు దొరక్క రైతులు పడరాని పాట్లు పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నుంచి ఏపీ వ్యవసాయ సమాచార, నిర్వహణా వ్యవస్థ (ఏపీఏ ఐఎంఎస్) యాప్ ద్వారా విక్రయాలకు శ్రీకారం చుట్టగా, లింక్ ప్రొడెక్ట్స్ ట్యాగింగ్, అమ్మకాలపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. » 100 బస్తాల యూరియా కావాలంటే వాటితో పాటు కనీసం 10 బస్తాల సల్ఫర్, 5 బాక్సుల బయో ప్రొడెక్ట్స్ తీసుకోక తప్పని పరిస్థితి కల్పించడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. » కొన్ని కంపెనీలు తమ డీలర్లకు సబ్సిడీ ఎరువుల కేటాయింపును ఇతర ఉత్పత్తుల కొనుగోలుతో అనుసంధానం చేస్తున్నారు. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. » దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, విస్తృత తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసుల నమోదు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. » దీంతో రాష్ట్ర వ్యవసాయశాఖ డీలర్లకు స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. » చట్ట వ్యతిరేక బలవంతపు విక్రయాలకు పాల్పడే వారిపై సంబంధిత వ్యవసాయ అధికారి, ఎరువుల ఇన్స్పెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారులకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ ఆదేశాలు ఇచ్చారు. కంపెనీలు, హోల్సేలర్లకు కూడా ఆదేశాలు ఇవ్వండి యూరియా, డీఏపీతో పాటు లింక్ ప్రొడెక్ట్స్ బలవంతపు విక్రయాలపై వ్యవసాయ శాఖ జారీ చేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నాం. బలవంతపు ట్యాగింగ్ను ఆపాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. అయితే కంపెనీల ఒత్తిడి మేరకే విధిలేని పరిస్థితుల్లో రైతులకు అమ్మాల్సి వస్తోంది. తమపై ఒత్తిడి తెచ్చే ముందు తయారీ దారులు, హోల్సేల్ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – వజ్రాల వెంకటనాగిరెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్ర ఎరువులు, పురుగు మందులు, విత్తన డీలర్ల సంక్షేమ సంఘం -
‘ఈ–స్టాంపు’ల కుంభకోణం దర్యాప్తు పురోగతి ఏంటి?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన కంపెనీ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేల కోట్ల రూపాయల భారీ ‘ఈ–స్టాంప్’ కుంభకోణానికి పాల్పడిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు పురోగతి పూర్తి వివరాలను (స్టేటస్ రిపోర్ట్) తమ ముందుంచాలని సీఐడీ దర్యాప్తు అధికారిని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతక్రితం పిటిషనర్ మాజీ ఎంపీ తలారి రంగయ్య తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘ఇది రూ.2,500 కోట్ల కుంభకోణం. ఎంతో పలుకుబడి కలిగిన ఎమ్మెల్యే సురేంద్రబాబుది ఇందులో కీలక పాత్ర. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ గత ఏడాది అక్టోబర్ 7న హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశాం. ఆ మరుసటి రోజే ప్రభుత్వం కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. అయితే సీఐడీ ఇప్పటి వరకు ఏం చేసిందో తెలియడం లేదు’ అని వివరించారు.ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి ఈ సందర్భంగా స్పందిస్తూ కుంభకోణంపై మూడు కేసులు నమోదయ్యాయని ధర్మాసనానికి తెలిపారు. 14వేల లావాదేవీలు జరిగాయని, మొత్తం రికార్డులను జప్తు చేశామని పేర్కొంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రాగానే సంబంధిత కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. పిల్ వివరాలుఅనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో బోయ యర్రప్ప.. ‘బాబు మీ సేవా కేంద్రం’ నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం లైసెన్స్ భార్య భార్గవి పేరు మీద ఉంది. అయితే ఇప్పటి వరకు యర్రప్ప 15,851 ఈ–స్టాంపులను తారుమారు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుతో కలిసి భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఎమ్మెల్యేకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ బెంగళూరులో ఉన్నప్పటికీ, కళ్యాణదుర్గం మీ సేవా కేంద్రం నుంచి తక్కువ విలువ కలిగిన ‘ఈ–స్టాంపు’లను కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ విలువ కలిగిన ఈ స్టాంపులుగా మార్చి పలు బ్యాంకుల్లో భారీ ఆర్థిక లావాదేవీలు నిర్వహించింది.ఈ భారీ కుంభకోణంపై స్టాంప్స్ ఐజీ, డీజీపీ, జిల్లా ఎస్పీకి పిటిషనర్ ఫిర్యాదు చేశారు. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సీరియస్ ఫ్రాండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) నుంచి డీజీపీకి లేఖ వెళ్లింది. అయినా ఎవ్వరినుంచీ స్పందనలేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు, దర్యాప్తుపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండేందుకు దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.36 గంటలు ఎలా పని చేయిస్తున్నారు?పీజీ వైద్య విద్యార్థుల పనిగంటలపై హైకోర్టు ఆందోళనవారి ఉపశమనం కోసం ఏం చేస్తున్నారో చెప్పండిరాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశంసాక్షి, అమరావతి: ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల సుదీర్ఘ పనిగంటల పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిరంతరాయంగా వారి చేత 36 గంటలు ఎలా పని చేయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అత్యవసర పరిస్థితుల్లో వారు ఏకంగా 72 గంటలు ఏకబిగిన పనిచేస్తున్న విషయాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది. అసాధారణ పని గంటల నుంచి పీజీ వైద్య విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు ఆలా వెంకటేశ్వర్లు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) తాజా విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఠాకూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ, ‘నిబంధనల ప్రకారం పీజీ వైద్య విద్యార్థులు 12 గంటలకు మించి పని చేయడానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలకు మించి సేవలు అందించాల్సిన అవసరం లేదు. నిబంధనలకు అనుగుణంగా పనిగంటలు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వండి’ అని విన్నవించారు. -
మా ఆకలి కేకలు చెవికెక్కవా?
సాక్షి, అమరావతి : ‘కోవిడ్లో ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలు అందించిన మేమంటే ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు? నాలుగు నెలలుగా వేతనాల్లేక మా కుటుంబాల్లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. వేతనాలు ఇవ్వమని ఎంతగా ప్రాథేయపడుతున్నా పట్టించుకోవడంలేదు. మా ఆకలి కేకలు ప్రభుత్వం చెవికెక్కవా?’.. అంటూ స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికల్ సిబ్బంది చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంటి అద్దెలు, కుటుంబ అవసరాలతో పాటు పిల్లల స్కూలు ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ కొనుగోలుకు చేతిలో చిల్లిగవ్వలేక నానాపాట్లు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్ వేతనాల మంజూరుతో పాటు, ఇతర సమస్యల పరిష్కారం కోసం వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది విజయవాడ ధర్నాచౌక్లో బుధవారం భారీ నిరసనకు దిగారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది చిరుద్యోగులు ఈ నిరసనలో పాల్గొన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ మొండివైఖరిని నిరసించారు.కడుపు మాడుస్తున్నారు..ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలిస్తామని మేనిఫెస్టోలో హామీలిచ్చి ఇప్పుడు గద్దెనెక్కాక తమ కడుపు మాడుస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పుల పాలవుతున్నామని మహిళా ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. కొత్తగా అప్పు కూడా పుట్టట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగులకు వంద శాతం గ్రాస్ వేతనం చెల్లింపు ఉత్తర్వుల అమలులోను ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. ఈ ధర్నాకు ప్రభుత్వ వైద్యులు, ఎన్హెచ్ఎం, వైద్య శాఖలోని ఇతర ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.పిల్లల చదువులు కష్టమవుతున్నాయిప్రభుత్వం నాలుగు నెలలుగా వేతనాలు ఆపేసింది. ఇలా అయితే మా కుటుంబాలు ఎలా బతకాలి? ఇప్పుడు పిల్లల ఫీజులు, యూనిఫాం, పుస్తకాల కొనుగోలుకు రూ.వేలల్లో ఖర్చు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నెలలకొద్దీ జీతాలు ఇవ్వకపోతే ఎలా? కోవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తే మమ్మల్ని దేవుళ్లుగా కీర్తించారు. ఇప్పుడు జీతాల కోసం రోడ్డెక్కాల్సి వచ్చింది.– జె. విజయ, స్టాఫ్ నర్సు, పల్నాడు జిల్లాసమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి..కాంట్రాక్టు ఉద్యోగులపట్ల ప్రభుత్వం ఎంతో వివక్ష చూపుతోంది. శాశ్వత ఉద్యోగులతో సమానంగా మేం పనిచేస్తున్నాం. కానీ, వేతనాల చెల్లింపులో మాత్రం మాపట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. – మంగ, స్టాఫ్ నర్సు, ఏలూరు జిల్లాఎంతో వేడుకున్నాం.. అయినా ఫలితంలేదు..వేతనాలు అందక చిరుద్యోగులందరూ ఎంతో ఇబ్బందిపడుతున్నారని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం. అధికారుల చుట్టూ తిరిగి నా ఫలితంలేదు. గత్యంతరంలేని పరిస్థితుల్లో రోడ్డెక్కాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించాలి . – అజయ్, రాష్ట్ర కన్వీనర్, ఏపీ కాంట్రాక్టు స్టాఫ్ నర్సెస్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ యూనియన్ ప్రధాన డిమాండ్లు..» కాంట్రాక్టు నర్సులు, అలైడ్ హెల్త్ కేర్ సిబ్బంది అందర్నీ క్రమబద్ధీకరించాలి. అప్పటివరకూ 100 శాతం గ్రాస్ వేతనం వెంటనే అమలుచేయాలి.» విధుల్లో మరణించిన కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం అందించాలి. అలాగే, ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలి. » పరస్పర, స్పౌజ్ కోటా బదిలీలకు అవకాశం కల్పించాలి.» శాశ్వత ఉద్యోగులకు ఇచ్చినట్లే కాంట్రాక్టు ఉద్యోగులకు పెయిడ్ సిక్ లీవ్స్, ఈహెచ్ఎస్ కార్డులు మంజూరుచేయాలి. -
చంద్రబాబు సర్కారుపై సమరానికి సన్నద్ధం
నెల్లూరు (అర్బన్): ‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని రెండేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాం. ప్రభుత్వంతో చర్చించాం. అయినా ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా పీఆర్సీ లేదు.. ఐఆర్ ఇవ్వరు.. డీఏ ఊసెత్తడం లేదు. అందుకే ప్రభుత్వంతో పోరాటానికి సన్నద్ధంగా ఉన్నాం. పోరాట కార్యాచరణ ప్రకటిస్తున్నాం’ అని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించి పోరాటాన్ని ప్రారంభించేందుకు బొప్పరాజు బుధవారం నెల్లూరులో జేఏసీ భాగస్వాములైన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం కనీసం చైర్మన్ను కూడా నియమించలేదని బొప్పరాజు మండిపడ్డారు. ఐదు డీఏలు ఇవాల్సి ఉందని, వాటి పైనా మాట్లాడడం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో మంచి ఐఆర్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు కూటమి.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదఅన్నారు. తెలంగాణలో మధ్యంతర భృతి (ఐఆర్) తీసుకుంటుంటే, ఏపీలో జీతాలకే పరిమితం కావాల్సి వచ్చిందని అన్నారు. మరోపక్క ఆర్జిత సెలవుల నగదు, డీఏలు, ఇతరత్రా రూ.30 వేల కోట్ల బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. వీటిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఉద్యోగులు నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నారని, సంవత్సరం పనిచేస్తే.. 9 నుంచి 10 నెలల జీతాలు మాత్రమే తీసుకుంటారని, మిగతా నగదును ప్రభుత్వమే ట్యాక్స్ రూపంలో కట్ చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, ఆస్పత్రుల ఖర్చులు, ఈఎంఐ, ఎల్ఐసీ వంటి సేవింగ్స్కు ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్యోగులు ఖర్చు చేస్తారన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆ ప్రణాళిక సర్వనాశనమైందన్నారు. చిన్న ఉద్యోగులందరూ అప్పుల పాలవుతున్నారన్నారు. ఇవి చాలవన్నట్టు ప్రభుత్వ శాఖలకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ విడుదల చేయకపోవడంతో కార్యాలయాల్లో పరికరాలకు ఉద్యోగుల జేబుల్లో నుంచే ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలిపారు.ప్రభుత్వ ఒత్తిడి వల్లే గుండెపోటు, ఆత్మహత్యలు ప్రభుత్వం కలెక్టర్లకు ర్యాంక్లు ఇస్తుందని, ఆ ర్యాంకుల కోసం కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు రెండు, మూడు రకాల పనులు ఒకే దఫా అప్పగిస్తున్నారన్నారు. ఇద్దరు, ముగ్గురు చేయాల్సిన పనిని ఒక ఉద్యోగి మెడపై కత్తి పెట్టి చేయిస్తున్నారని, కాస్త ఆలస్యం జరిగినా టార్చర్ పెడుతున్నారని చెప్పారు. దీంతో ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురై పలువురు గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారని, మరికొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.తప్పని పరిస్థితుల్లోనే పోరాటాలుఉద్యమాలు తమకు సరదా కాదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే పోరాటానికి పూనుకున్నామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఈ విషయాలను అందరి దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులను సంప్రదించి ఐక్య పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చామని చెప్పారు. తన తండ్రి కూడా ఓ పోలీసు ఉద్యోగేనని, ఉద్యోగుల బాధలు తెలుసని మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇప్పుడు ఉద్యోగుల బాధలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ ఖజానా ఉద్యోగుల జీతాలకే సరిపోతుందని కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని, ఆ లెక్కలు కూడా తేలుస్తామని చెప్పారు. యూపీ వంటి రాష్ట్రాల్లో ఉద్యోగులకు బోనస్లుఉద్యమ కార్యాచరణ రాష్ట్ర కమిటీ చైర్మన్ ఫణి పేర్రాజు మాట్లాడుతూ యూపీ వంటి రాష్ట్రాల్లో ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నారని, తాము బోనస్లు అడగడంలేదని, న్యాయపరంగా రావాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఉద్యోగులతో చర్చించి పీఆర్సీ, ఇతర సమస్యలు పరిష్కరించి, బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యోగుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్నారు. సమావేశంలో ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా..?
సాక్షి,అమరావతి: అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని గతంలో తాము ఆదేశాలు జారీ చేసినా ఇప్పటికీ నిర్మాణాలు కొనసాగుతుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా పెద చెరువులో నిర్మాణాలకు ఎలా అనుమతులు జారీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్మాణాలు ఆపాలంటూ గతంలో తామిచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అసలు నీటి వనరుల్లో నిర్మాణాలు చేయవచ్చా? అన్న అంశంపై ఇరుపక్షాలు వాదనలు వినిపించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు ప్రోద్బలంతో పెద చెరువును ఆక్రమించి ‘సృష్టిక్షేత్రం’ పేరుతో చేస్తున్న నిర్మాణాలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ ఏడాది ఏప్రిల్ 1న విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆదేశించింది. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. వాదోపవాదనలు ఇలా... పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై తాము కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశాం. ధర్మాసనం ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారు. స్పీకర్ ఆధ్వర్యంలో విగ్రహాలు ఏర్పాటు అవుతుండటంతో అధికారులు కోర్టు ఆదేశాల కన్నా రాజకీయ నేతలకే ప్రాధాన్యతనిస్తున్నారు’అని వివరించారు.కాగా, వ్యాజ్యంలో అయ్యన్నపాత్రుడి తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ ‘స్పీకర్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చి, ఆయనే చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నట్లు ఆరోపణలు చేయడం సరికాదు. పిల్ దాఖలు చేసిన వ్యక్తి ప్రతిపక్ష రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి. ఎమ్మెల్యే హోదాలో అయ్యన్నపాత్రుడు కేవలం భూమి పూజలో మాత్రమే పాల్గొన్నారు. పిల్ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి’ అని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాజకీయాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. -
సర్ ప్రక్రియలోకి టీడీపీ వైరస్లా చొరబడింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) లోపభూయిష్టంగా మారిందని, మై టీడీపీ యాప్ ద్వారా ఓట్ల చోరీకి అధికార పార్టీ మరోసారి ప్రయత్నిస్తోందని, సర్ ప్రక్రియలోకి టీడీపీ వైరస్లా చొరబడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మై టీడీపీ యాప్లో ఎన్నికల కమిషన్ ప్రచురించిన దానికంటే స్పష్టంగా ఓటర్ల వివరాలు ఉన్నాయని అన్నారు.బీఎల్వో ప్రక్రియ పూర్తయిన తర్వాత వివరాలు ఫొటో తీసుకుని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారని తెలిపారు. భారీ ఎత్తున దళితులు, మైనార్టీలు, పేదల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈసీ వెంటనే అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల కన్నుసన్నల్లో సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను తాము అడ్డుకుని ప్రశ్నిస్తే పొరబాటు జరిగిందని చెప్తున్నారని తెలిపారు. ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడు తరహాలోనే ఏపీలోనూ ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని చెప్పారు.అనంతపురంలో టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్రఅనంతపురం జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 20కి పైగా బూత్లను పరిశీలించగా.. చంద్రబాబు, ఆయన పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు ముసుగులు తీసేసి మరీ ప్రత్యక్షంగా బరి తెగిస్తున్న విషయం వెల్లడైందన్నారు. టీడీపీ యాప్ ప్రభుత్వ అధికారులు పెట్టిన గ్రూప్స్లో వచ్చిందని, దానిని ప్రశ్నిస్తే పొరబాటున పెట్టామని చెప్పి తీసేశారని అన్నారు. బుధవారం శింగనమలలోని ఓ బూత్లో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పంచాయతీ కార్యదర్శి సీట్లో కూర్చుని ఎస్ఐఆర్ ప్రక్రియలో దూరాడని, తాము అడ్డుకుంటే పొరపాటు అంటున్నారన్నారు. ఇది పొరబాటు కాదని, టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్ర అని చెప్పారు. అక్కడికక్కడే ఫొటోలు తీయడం, కులం, మతం రాసుకుని వెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఓటరుకు సంబంధించిన ప్రతి విషయం గోప్యంగా ఉండాలన్న విషయం తెలియదా అని అన్నారు. అధికారుల్ని బెదిరించి, ఎన్యుమరేషన్ ఫారంలు తీసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్నారు, ఎస్ఐఆర్ ఫారం నింపి ఇస్తే అది కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తుందా లేదా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తుందా అని జనానికి అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎన్నికల సంఘం నుంచి మా ఫిర్యాదుపై తగిన సమాధానం రాకపోతే వైఎస్సార్సీపీ పోరాటాలకు సిద్ధంగా ఉందని చెప్పారు. -
తప్పుల తడకగా ఓటరు జాబితా
కడప కార్పొరేషన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ముసుగులో వైఎస్సార్సీపీ ఓట్లను గంపగుత్తగా తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కడపలో విలేకరుల సమావేశంలో వారు ఎన్నికల కమిషన్ ఆన్లైన్లో ఉంచిన ఓటరు జాబితాలోని ఘోరాలను సాక్ష్యాధారాలతో సహా ఎండగట్టారు. తప్పులను సవరించకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అధికారులు అధికార పార్టీ తొత్తులుగా మారకుండా, పారదర్శకమైన ఓటరు జాబితాను తయారు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్, జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.నా డోర్ నంబరే లేదు: అంజద్ బాషాకడపలోని ఎస్ఎఫ్ఎస్ వీధిలో ఉన్న డోర్ నంబర్ 19/420 ఇంటిలో నేను 60 ఏళ్లుగా ఉంటున్నాను. నేను పుట్టింది, పెరిగింది, చదివింది ఇక్కడే. 30 ఏళ్లుగా ఇదే చిరునామాపై ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. 2005లో కార్పొరేటర్గా, 2014, 2019లో రెండు సార్లు శాసన సభ్యుడిగా గెలిచి డిప్యూటీ సీఎంగా సేవలు అందించాను. అలాంటి నా డోర్ నంబరే ఓటరు లిస్టులో లేదు. జాబితాలో 19/417 నుంచి 19/425 వరకు అసలు డోర్ నంబర్లే గల్లంతు చేశారు. మా లాంటి ప్రజాప్రతినిధుల ఇళ్లను, ఓట్లనే మాయం చేస్తే ఇక సామాన్య ఓటరు పరిస్థితేమిటి? ఒక్కో పోలింగ్ బూత్లో కనీసం 50 ప్రతిపక్ష ఓట్లను తగ్గించాలనే దుర్బుద్ధితోనే ఈ అస్తవ్యస్త జాబితాను తెచ్చారు. బీఎల్ఓలు దరఖాస్తు ఫారాలు ఇళ్ల వద్ద పడేసి వెళ్తున్నారే తప్ప వాటిని ఎలా నింపాలో ప్రజలకు చెప్పడంలేదు. తక్షణమే ఈ తప్పుల తడక జాబితాను సవరించకపోతే న్యాయపోరాటం చేస్తాం.2002లో ఎమ్మెల్యేగా ఉన్నా ప్రస్తుత ఓటరు జాబితాలో నా పేరు లేదు: శెట్టిపల్లె రఘురామిరెడ్డి2002లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అయినా ప్రస్తుత ఓటరు జాబితాలో నా పేరే లేకపోవడం ఆశ్చర్యకరం. నా స్వగ్రామమైన చాపాడు మండలం నక్కలదిన్నెలో 2002 ఓటరు లిస్టు ప్రకారం 1142 ఓట్లు ఉన్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. కానీ, ఆ జాబితాలో నా పేరు, నా కుటుంబ సభ్యుల పేర్లుగానీ, కనీసం మా గ్రామస్తుల పేర్లుగానీ ఎక్కడా లేవు. నక్కలదిన్నె లిస్టులో రాజుపాలెం గ్రామానికి చెందిన వారి పేర్లను చొప్పించి తారుమారు చేశారు.వైఎస్సార్సీపీకి మెజార్టీ వచ్చిన పోలింగ్ బూత్లను టార్గెట్ చేసి ఓటర్లను తగ్గించడమే వీరి లక్ష్యం. నక్కలదిన్నె గ్రామంలో 2014లో 6,200 ఓట్లు, 2019 నాటికి 8,400 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నింటినీ అక్రమంగా ఏరివేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది. అధికారులకు ఈ తప్పులు చూపిస్తున్నా పట్టించుకోవడం లేదు. దేశీ మద్యం విక్రయాలకు అనుమతి లేదు. » ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయాలు ఉంటాయి. » విశాఖపట్నం, సూర్యలంక బీచ్ల్లో ఏర్పాటు చేసే బీచ్ బార్లకు మూడేళ్ల కాలపరిమితితో లైసెన్స్ మంజూరు చేస్తారు. ఈ ఏడాది సెపె్టంబరు 1 నుంచి 2029 ఆగస్టు 31 వరకు లైసెన్స్ గడువుగా నిర్ణయించారు. » లైసెన్స్ కోసం దరఖాస్తు చేసే వారు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతోపాటు రూ.10వేలు దరఖాస్తు రుసుం చెల్లించాలి. వార్షిక రీటైల్ ట్యాక్స్(ఆర్ఈటీ) మొదటి ఏడాది రూ.7.50లక్షలు చెల్లించాలి. ఆర్ఈటీ ఏటా 10శాతం పెంచుతారు. -
రాష్ట్రంలో 76.36% ఓట్లు మ్యాపింగ్
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో అత్యంత కీలకమైన మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా మొదటి స్థానంలో నిలవగా, నెల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇంటింటి సర్వే ప్రారంభమయ్యే నాటికి 90 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, 76.36 శాతం ఓట్లను మాత్రమే మ్యాపింగ్ చేయగలిగారు. 2024 ఓటర్ల జాబితాలో ఉన్న ఓట్లను 2002లో జరిగిన సర్ ఓటర్ల జాబితాతో సరిపోల్చడాన్ని మ్యాపింగ్ అంటారు. మ్యాపింగ్ అయిన ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలు పూర్తి చేసి ఇస్తే చాలు.. ఆ ఓట్లన్నీ కొనసాగుతాయి. 2024 ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉంటే అందులో 76.36 శాతం ఓట్లు మ్యాపింగ్ అయ్యాయి. మ్యాపింగ్ కాని 98,39,351 ఓట్లే ఇప్పుడు కీలకం కానున్నాయి. మ్యాపింగ్ కాని ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 11 ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకటి ఇచ్చి ఓటరుగా నమోదు చేసుకోవాలి. అంతేకాదు మ్యాపింగ్ అయితే ఇంటింటి సర్వేలో ఎన్నికల సంఘమే ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి ప్రింట్ కాపీతో ఓటరు ఇంటికి వస్తుంది. కేవలం దానిపైన సంతకం చేసి, ఈ మధ్యే తీసుకున్న ఒక ఫొటో ఇస్తే సరిపోతుంది. మ్యాపింగ్ కాకపోతే ఖాళీ ఎన్యూమరేషన్ ఫారాన్ని ఇస్తారు. దాంట్లో అన్ని వివరాలు పూర్తి చేసి ధృవీకరణ పత్రం ఇస్తే వాటిని పరిశీలించి మీరిచ్చిన వివరాలతో అధికారులు సంతృప్తి చెందితేనే ఓటు కొనసాగుతుంది. అందుకనే ఇప్పుడు మ్యాపింగ్ కాని 98.39 లక్షల ఓట్లపై రాజకీయపార్టీలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి.ఆ 86 నియోజకవర్గాలు కీలకం89.38 శాతం ఓట్లను మ్యాపింగ్ చేయడం ద్వారా అనకాపల్లి జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే, 66.55 శాతం మ్యాపింగ్తో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. అదే నియోజకవర్గాల విషయానికి వస్తే అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం 94.58 శాతం మ్యాపింగ్తో మొదటి స్థానంలో నిలవగా, 94.50 శాతంతో కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రెండోస్థానంలో నిలిచింది. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో మొత్తం ఓట్లలో కేవలం 50.11 శాతం ఓట్లు మాత్రమే మ్యాపింగ్ అయ్యాయి. ఇక్కడ సగం ఓట్లు మ్యాపింగ్ కాకపోవడంతో సుమారు 1,40,836 మంది ఓటర్లు వారికి వారు ఓటరుగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 76.36 శాతం ఓట్లు మ్యాపింగ్ అయితే 86 నియోజకవర్గాల్లో ఈ సగటు కంటే తక్కువగా మ్యాపింగ్ జరిగింది. దీంతో ఓట్లు నిలబెట్టుకోవడంలో ఈ 86 నియోజకవర్గాలు అత్యంత కీలకం కానున్నాయి. తొమ్మిదికిపైగా నియోజకవర్గాలు 90 శాతం పైగా మ్యాపింగ్ పూర్తి కావడంతో అక్కడ ఓట్ల తొలగింపు సంఖ్య తక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
లాకప్డెత్తో సర్కారు ఉక్కిరిబిక్కిరి
సాక్షి, టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో సంచలనం రేసిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ ఘటన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు ప్రజలను మభ్యపెట్టి, ఈ ఘటనను తాము సీరియస్గా తీసుకున్నట్లు ప్రభుత్వం కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. నెల రోజులుగా సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై ఏమాత్రం స్పందించని ప్రభుత్వం.. లాకప్డెత్ అని బయట పడగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సమీక్ష నిర్వహించి, కంటి తుడుపు చర్యగా సీఐ నాగరాజును సస్పెండ్ చేయడం డ్రామాలో భాగమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి సీఐ సస్పెన్షన్ ద్వారా బాధితులను శాంతపరిచే ఎత్తుగడ వేసినట్లు.. సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారా విచారణ పేరుతో నిదానంగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే యత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తెలివిగా తప్పుకున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాపులు రగిలిపోతున్నారని, కాపుల్లో చీలిక వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారాన్ని పవన్కళ్యాణ్ చూస్తారని, అన్ని విషయాలు ఆయనకే వివరించాలని సీఎం చంద్రబాబు.. డీజీపీకి సూచించడం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తద్వారా ఈ వివాదం నుంచి చంద్రబాబు తెలివిగా తప్పుకొని, పవన్ కళ్యాణ్కు అంట గట్టినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో వైపు ఎవరి ప్రోద్బలం లేకుండానే ఒక సీఐ.. కాపు యువకుడిని కొట్టి చంపి, శవాన్ని తగలబెట్టేంత సాహసం ఎలా చేస్తారని పోలీసు వర్గాల్లో సైతం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం ఇంకా ముదరకుండా చూసుకోవాలంటూ అటు డీజీపీకి, ఇటు పవన్ కళ్యాణ్కు సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు కాపు ప్రముఖులతో మాట్లాడాలంటూ పవన్కు సూచించినట్లు తెలిసింది. అయితే మొన్నటిదాక కులం అవసరం లేదంటూ చెబుతూ వచ్చిన వపన్ కళ్యాణ్, ఇప్పుడు ఉన్నట్లుండి కాపులను బుజ్జగించాల్సి రావడం తలనొప్పేనని జనసేన వర్గాలు అంతర్మథనం చెందుతున్నాయి. జనసేనలో కలకలం‘అన్యాయంగా మా బిడ్డను తీసుకొచ్చి చంపేస్తే, జనసేన తూర్పు ఇన్చార్జి అమ్మిశెట్టి వాసు వచ్చి రూ.50 లక్షలు ఇప్పిస్తా.. రాజీ చేసుకుందామని బేరం పెట్టారని బాధిత కుటుంబం వెల్లడించడం జనసేనలో కలకలం రేపుతోంది. ఇక్కడ లాకప్డెత్ అయింది కాపు యువకుడు, జనసేన కుటుంబ సభ్యుడు. అయితే బాధిత కుటుంబం వద్దకు కేసు రాజీ కోసం ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా వచ్చింది కాపు నేత కావడం జనసేనలో కలకలం రేపుతోంది. బాధిత కుటుంబం తరఫున గట్టిగా నిలబడి పోరాటం చేయాల్సిందిపోయి.. చంద్రబాబుకు, టీడీపీకి ఊడిగం చేసేలా ఇదేం పనంటూ ఆ పార్టీ శ్రేణుల్లో.. ప్రత్యేకించి కాపుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ‘మేమూ జనసేనకు చెందిన వాళ్లమే’ అంటూ కుటుంబ సభ్యులు ఐడీ కార్డులతో ప్రెస్ మీట్ పెట్టడం జనసేనకు ఇబ్బందిగా మారింది. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పందించాలంటూ సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్ చేసిన వ్యాఖ్యలు జనసేనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా కేసు రాజీ చేసుకోకపోతే జనసేన పార్టీకి ఇబ్బందులు తప్పవని గ్రహించి, రాజీ కోసం కొత్త దారులు వెతుకుతున్నట్లు తెలిసింది.ప్రభుత్వంపై మండిపడుతున్న కాపులుసాయికృష్ణ ఉదంతంతో చంద్రబాబు ప్రభు త్వంపై కాపు సామాజిక వర్గం మండిపడుతోంది. అధికారంలోకి రావడం కోసం 2024 ఎన్నికల్లో తమను వాడుకున్న చంద్రబాబు, లోకేశ్లు.. అధికారంలోకి వచ్చాక కరివే పాకులా తీసిపారేశారని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో టీడీపీ నేతలు, కాపు వర్గీయులపై దాడులకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంతో కళ్లుమూసుకుపోయి వ్యవహ రిస్తున్నారని కాపు నేతలు ధ్వజమెత్తుతున్నారు. కాపు సామాజిక వర్గాన్ని చూపించి, చంద్రబాబుతో పొలిటికల్ డీల్ కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తరు వాత రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని చెబుతున్నారు. ఆయన రాజ కీయ అధికారం కోసం ఉపయోగపడిన కాపు లను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.ఇప్పుడేం చేద్దాం?సాయికృష్ణ వ్యవహారంపై సీఎం, డిప్యూటీ సీఎం మంతనాలుఆందోళనల నేపథ్యంలో డీజీపీతో చర్చసాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంపై ఆందోళనలు వెల్లువెత్తడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటన నుంచి బుధవారం తిరిగి వచ్చిన చంద్రబాబు.. వెలగపూడి సచివాలయానికి చేరుకుని పవన్తో కలిసి ఈ ఘటనపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్బాబులతో ఏం చేద్దామని చర్చించినట్లు తెలిసింది. విజయవాడ నగరంలో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వం ఇరుకున పడాల్సి వస్తుందని తెలియదా.. అని పోలీస్ కమిషనర్ను సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. ఘటనకు కారణమైన సీఐ నాగరాజును ఇప్పటికే వీఆర్కు పంపామని చెప్పగా, సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులు ఎవరో తేల్చాలని చెప్పారు. ఈ వ్యవహారంలో నాగరాజు ఎందుకు అంత దూకుడుగా వ్యవహరించాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లు తెలిసింది. సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అతని మేనమామ జనసేన పార్టీ కీలక కార్యకర్త కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇకపై ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రతి అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చెప్పాలని డీజీపీకి సూచించినట్లు తెలిసింది. రాజకీయంగా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఎలా స్పందించాలనే దానిపైనా పవన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. మీడియా ద్వారా ప్రభుత్వ వాదన వినిపిస్తే ఎలా ఉంటుందని చర్చించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు మాట్లాడితే ప్రజల్లో ఇంకా ఆగ్రహం పెల్లుబికే అవకాశం ఉందని, ఆచితూచి వ్యవహరిద్దామని నిర్ణయించారు. మీడియాకు మాత్రం ఈ ఘటనపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, నిష్పాక్షికంగా విచారణ జరపాలని చెప్పినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు సీఎంవో వర్గాలు బుధవారం రాత్రి అధికారికంగా వెల్లడించాయి. సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ నిర్వహించాలని కూడా సీఎం ఆదేశించినట్టు తెలిపాయి. -
సమాధానం చెప్పలేక ఉత్తర కుమార సవాళ్లా?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 స్కామ్పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో చర్చకు తాను సిద్ధమని.. సమయం, తేదీ, వేదిక లోకేష్ చెప్పినా సరే.. లేదా తనను చెప్పమన్నా రెడీ అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రతి సవాల్ విసిరారు. దీనిపై లోకేష్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని.. ఈలోగా డీఎస్సీ స్కామ్పై మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజల ఎదుట ఉంచిన అంశాలను మరోసారి గుర్తు చేస్తున్నామని.. ముందు వాటికి జవాబు చెప్పాలని సూచించారు. ‘లోకేశ్..! సరుకు లేక సవాళ్లు విసరడం ఏమిటి? వైఎస్ జగన్ ప్రెస్మీట్ విన్నావా అసలు? నువ్వుగానీ, మీ నాన్న గానీ వాటికి సమాధానం చెప్పాలని అడిగారు. వినలేదా? లేక విని కూడా వినపడనట్లు నటిస్తున్నారా? అని ఈ రాష్ట్రంలో యువత అడుగుతోంది.. తల్లిదండ్రులు అడుగుతున్నారు.. ప్రజలు అడుగుతున్నారు.. జగన్ ప్రశ్నలకు జవాబు చెబుతారని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న ప్రతి నిరుద్యోగి నీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు. వైఎస్ జగన్ సూటిగా, స్పెసిఫిక్గా ప్రశ్నలు అడిగారు. వాటికి నేరుగా జవాబు చెప్పే ధైర్యం లేక 200 మీటర్ల దూరంలో నీ ఇల్లు ఉంది అని సవాల్ విసురుతావా? మీ నాన్న సవాల్ విసిరితే ఏదైనా అర్ధం ఉంటుంది. మెగా డీఎస్సీ స్కామ్పై అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? దీన్ని బట్టి తప్పు జరిగిందని అర్థమవుతోంది. అది నీకు కూడా తెలుసు. దాన్ని డైవర్ట్ చేయటానికే సవాల్ అంటూ కొత్త నాటకానికి తెర తీశారు. అయినా నువ్వు అడుగుతున్నావ్ కాబట్టి.. ఆ దగా పడ్డ డీఎస్సీ అభ్యర్థులతోనే కలసి వస్తా. వాటికి సమాధానం చెప్పు.. మనిద్దరం మంత్రులుగా చేశాం కాబట్టి సమ ఉజ్జీలం.. నీ స్థాయికి నేను చాలు.. అయినా నీకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటా. అందుకే ఆ ప్రశ్నలన్నీ మళ్లీ నిన్ను అడుగుతున్నా. నీకు గుర్తుండేలా ఈసారి అన్ని పత్రికల్లో ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా పెట్టి ప్రచురించమని కోరుతున్నా. పార్టిసిపెంట్కు ఉద్యోగం ఇచ్చేసి.. గోల్డ్మెడల్ సాధించిన వారికి పోస్టు ఎందుకు ఇవ్వరని గోల్డ్మెడల్ విజేత, డీఎస్సీ అభ్యర్థి దుర్గయ్య అడిగిన ప్రశ్నకు నీ దగ్గర జవాబేది లోకేశ్? ముందు దుర్గయ్య ప్రశ్నకు జవాబు చెప్పు. తరువాత నేను వస్తా.. ’అని పేర్ని నాని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ స్కామ్పై చర్చ విషయంలో లోకేష్ చేస్తున్న సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాలు లాంటివని వ్యాఖ్యానించారు. డీఎస్సీ స్కామ్ను బయటపెట్టి చాలా రోజులు అయ్యిందని, స్కామ్ జరిగిన తీరును ఆధారాలతో సహా బయటపెట్టామని, ప్రతి అంశాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారని గుర్తు చేశారు. సీబీఐ విచారణ కోరే ధైర్యం వారికి లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత వివాదాస్పదమైన, అవినీతిమయమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదన్నారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతకు రక్షణగా ఉన్న ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రశ్నలకు జవాబేది లోకేశ్..?1. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు అప్పగించారు? ఎస్సీఈఆర్టీలో పనిచేసిన ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (నవీన్) ఈ పరీక్షల ప్రక్రియలో పాల్గొనలేదా? అదే వ్యక్తికి మెగా డీఎస్సీలో మొదటి ర్యాంకు, తెలుగు టీజీటీ పరీక్షలో జోనల్లో ఆరో ర్యాంకు రాలేదా? మరి మొదటి ర్యాంకు వచ్చిన నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? లాగిన్ ఐడీ ఎందుకు బ్లాక్ చేశారు? డేటా ఎందుకు తొలగించారు? అతడి వివరాలను మెరిట్ జాబితా నుంచి ఎందుకు తొలగించారు? సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు? అంటే పేపర్ లీకేజీ జరిగిందని మీరు ఒప్పుకున్నట్లే కదా? వెరిఫికేషన్కు రాలేదు కాబట్టే ఉద్యోగం ఇవ్వలేదని ఎలా సమర్థించుకుంటారు? అదే నిజమైతే అతడు ఎందుకు హైకోర్టుకు వెళ్లాడు?2. ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం స్పోర్ట్స్ కోటా. 2012లో జారీ చేసిన జీఓ నెం.74 ప్రకారం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా సంబంధిత ఎలిజిబిలిటీ పరీక్షలో తప్పకుండా అర్హత సాధించాలి. కానీ జీవో నెం:4, జీఓ నెం:47 ద్వారా ఆ నిబంధనను ఎందుకు మార్చేశారు? దీనికి వెనుక ఉన్న మతలబు ఏమిటి? అసలు డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఎలా ఇస్తారు? చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? పోనీ మీరు చేసింది కరెక్టే అనుకుంటే మళ్లీ ఈ నిబంధనను ఎత్తివేస్తూ జీవో నెం:23, జీఓ నెం:25, జీఓ నెం:56 ఎందుకు ఇచ్చారు? అంటే మీ వాళ్లకోసం గేట్లు ఎత్తారు. మీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం పూర్తికాగానే మళ్లీ గేట్లు మూసేశారు. ఇది స్కామ్ కాదా?3. సాఫ్ట్ బాల్ అసోసియేషన్కు అధ్యక్షుడు మీ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కాదా? జూడో అసోసియేషన్కు మీ ఎంపీ, లోకేశ్ తోడల్లుడు భరత్ గౌరవ అధ్యక్షుడు కాదా? స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లు ఇచ్చిందీ ఆ అసోసియేషన్లే.. అలాగే ధృవీకరించిందీ వాళ్లే కదా? అవునా? కాదా?4. క్రీడాకారులకే ఇవ్వాలనుకున్నప్పుడు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వారికి టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు? ప్రతిభ ఉన్న క్రీడాకారులకు కాకుండా కేవలం పార్టిసిపెంట్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?5. మెరిట్, ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా ఎవరు, ఏ కోటా కిందకు వస్తారు? వారి ర్యాంకులు ఏమిటి? అనే విషయాలన్నీ మీకు ముందుగానే తెలుసు కాబట్టి అన్నీ పరిశీలించాకే రూల్ నంబర్ 20 ప్రకారం వెరిఫికేషన్కు 1 : 1 పద్ధతిలో పిలిచారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్సర్వీస్ మెన్, జోన్.. ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. కానీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తరువాత, అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలాక కూడా అర్హులకు ఉద్యోగాలు ఇవ్వలేదంటే దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరిని డ్రాప్ చేశారు? ఎవరి కోసం ఆ సర్దుబాటు? ఇది దగా.. మోసం.. స్కామ్ కాదా?6. టీచర్ల పోస్టులు రూ.15 – 20 లక్షలకు అమ్ముకుంటూ బేరసారాలు జరిగిన ఓ వీడియో బయటకు వచ్చింది. దానికి సమాధానం ఏది? పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకొన్నారు? ఫోన్ నంబర్ తెలిసినా, సంబంధిత వ్యక్తి పేరు ప్రస్తావించకుండా విచారణను ఎందుకు నీరుగార్చారు?7. డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీకి, పరీక్షల నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్కు అప్పగించేవారు. గోప్యత, పారదర్శకత కోసం వేర్వేరు వ్యక్తులకు అప్పగించేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. డీఎస్సీ కన్వీనర్ను పక్కన పెట్టి ప్రశ్నాపత్రాల తయారీతో పాటు పరీక్షల నిర్వహణ అనే రెండు కీలక బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. దీనిపై సమాధానం ఏది?8. డీఎస్సీల చరిత్ర చూస్తే.. కలెక్టరేట్ వద్ద నోటీస్ బోర్డులపై మెరిట్ లిస్టులు, మెరిట్–కమ్–రోస్టర్ జాబితాలు ప్రదర్శించేవారు. ఈసారి ఆ పద్ధతిని రద్దు చేసి కేవలం ఆన్లైన్ ప్రదర్శనకే ఎందుకు పరిమితం చేశారు? అందులో కూడా మార్పులు చేర్పులు ఎందుకు చేశారు?9. పీఈటీ ఉపాధ్యాయులకు డీఎస్సీ పరీక్షతోపాటు సంబంధిత డిగ్రీ నుంచి కూడా ఎందుకు వెసులుబాటు ఇచ్చారు? ఎప్పుడూ లేని విధంగా ఐదేళ్లపాటు వెసులుబాటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?10. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలను, జీవితాలను ప్రభుత్వం అత్యంత దారుణంగా, అమానుషంగా తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ కుంభకోణం లోతుగా పాతుకుపోయిన అవినీతి వ్యవహార మే కదా? మరి దీనికి బాధ్యత ఎవరిది? రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు మీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో నిజాలు బయటకు వస్తాయా? ఆ నిజాలన్నీ వెలికి తీయాలంటే సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం లేదా? డీఎస్సీ 2025లో టీజీటీ (తెలుగు) జోన్–2లో తనకు 6వ ర్యాంకు వచ్చినట్లు హైకోర్టుకు తెలిపిన నవీన్ -
‘డీఎస్సీలో అక్రమాలపై చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమా?’
సాక్షి, తాడేపల్లి: తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో నారా లోకేష్ విర్రవీగి ప్రవర్తిస్తున్నాడని, డీఎస్సీ అవకతవకలపై చర్చను పక్కదారి పట్టించడానికే ఆయన సవాల్ చేసి పారిపోయాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ–2025 పై లోకేష్ సవాల్ని వైఎస్సార్సీపీ స్వీకరిస్తుందని.. బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మన్నా తాము సిద్ధంగా ఉన్నామని, మా వెంట దగా పడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తామని చెప్పారు.డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలను వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయట పెడితే ఇంతవరకు నారా లోకేష్ ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే డీఎస్సీలో అక్రమాలు జరగలేదని వారికి చెప్పి నమ్మించాలని సవాల్ చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరగలేదనేది నిజమైతే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించవచ్చు కదా అని ప్రశ్నించారు.కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ చేసి చంపేస్తే దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం, ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్ గురించి మాట్లాడుతోందని విమర్శించారు. హోంమంత్రి మేకప్కి ఉన్న విలువ బిడ్డను కోల్పోయిన తల్లి కడుపుకోతకు లేదా అని కురసాల కన్నబాబు ప్రశ్నించారు. గురువారం (18వ తేదీ) శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు గవర్నర్ని కలిసి డీఎస్సీ నిర్వహణలో అవకతవకలపై విచారణకు ఆదేశించాలని కోరబోతున్నట్టు చెప్పారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏమన్నారంటే..:దమ్ముంటే డీఎస్సీ నిర్వహణపై మాట్లాడు లోకేష్:డీఎస్సీ–2025 నిర్వహణపై ప్రజల్లో ఉన్న అనుమానాలను లేవనెత్తుతూ వైఎస్ జగన్ చాలా ప్రశ్నలు సంధిస్తే దానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంతవరకు కనీసం సమాధానం చెప్పిన పాపానపోకుండా సవాల్ విసిరి పారిపోయాడు. ప్లేస్ ఆయన చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, డీఎస్సీ పై బహిరంగ చర్చకు మేం సిద్ధమే. మాతోపాటు దగా పడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తాం. అధికారం ఉంది కదా అని విర్రవీగిపోతే సరికాదు. డీఎస్సీ నిర్వహణలో తప్పే జరగలేదనుకుంటే మేం అడిగినట్టు సీబీఐ విచారణ కోరాలి.సీబీఐ అంటే చంద్రబాబు ఎంక్వయిరీ అని మాత్రం అనుకోవద్దు. తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో విర్రవీగిపోతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కవ్వింపు చర్యలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే 200 మీటర్ల దూరంలో ఉన్నానని నారా లోకేష్ ఛాలెంజ్. స్పోర్ట్స్ కోటాలో అడ్డదారిలో ఉద్యోగాలిచ్చిందే కాకుండా ఎన్ని జన్మలెత్తినా మీరు డీఎస్సీ నిర్వహించలేరని వాగడం సిగ్గుమాలినతనం తప్ప మరోటి కాదు.సొంత ఛానెళ్లలో తొడలు కొట్టడం, భజన చేయంచుకోవడం కాదు:పరీక్ష నిర్వహణలో ఉద్దేశపూర్వకంగానే కాంప్రమైజ్ అయ్యారని పలు విధాలుగా ఆధారాలతో వైఎస్ జగన్ నిరూపించారు. పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి ఫలితాలు వెల్లడించే వరకు పారదర్శకత లేదని జీవొలతో సహా నిరూపించారు. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలిచి సెలెక్ట్ అయ్యారని పంపిన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. పరీక్ష కూడా రాయకుండా డిగ్రీ ఉత్తీర్ణత కావాల్సిన అవసరమే లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చారని తేలింది.ఇవన్నీ కాదని నిరూపించండి చూద్దాం. ఇంతపెద్ద స్కామ్ జరిగిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదు? కొంతమంది అధికారులను పంపించి మాట్లాడించడమే తప్ప, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు భయపడిపోతున్నాడు? టీచర్ పోస్టులు వచ్చిన వారిని భయపెట్టి పిలిచి, టీడీపీ నాయకుల సమక్షంలో వైఎస్ జగన్ని తిట్టించడం కాదు. దమ్ముంటే, మెరిట్ ఉన్నా ఉద్యోగం రాలేదని కోర్టులు చుట్టూ, మీ చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులతో మీటింగ్ పెట్టండి. వారడిగే ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు. తప్పు జరగలేదని వారిని ఒప్పించండి. సొంత ఛానెల్లో తొడలు కొట్టించుకోవడం కాదు.. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితులు తెచ్చుకోవద్దు.లోకేష్ని మందలించే ధైర్యం చంద్రబాబుకే లేదు:బెంగళూరులో కాపురం ఉంటాడని జగన్ని విమర్శించడం కాదు.. నారా లోకేష్ ఎక్కడ కాపురం ఉంటున్నాడు. వీకెండ్ వస్తే ఎక్కడుంటున్నాడు. తెలంగాణలో ఆధార్ కార్డు పెట్టుకుని ఆంధ్రాలో రాజకీయాలు చేస్తే ఎలా? 2019–24 ఎప్పుడైనా లోకేష్ ఆంధ్రాలో ఉన్నాడా? ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత చంద్రబాబుకి లేదా? లేక ఆయన్ను నోరెత్తనీయకుండా లోకేష్ అడ్డుకుంటున్నాడా? డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగిన ఈ సందర్భంలో ఒకవేళ నారా లోకేష్ స్థానంలో విద్యాశాఖ మంత్రిగా మరెవరైనా ఉండుంటే.. వారిపై చంద్రబాబు సీరియస్ అని ఎల్లో మీడియాలో హెడ్లైన్స్ వచ్చి ఉండేవి.విద్యాశాఖ మంత్రిని త్వరలోనే మార్చేస్తున్నారని బ్రేకింగ్లు వేసేవాళ్లు. కానీ లోకేష్ని పిలిచి మందలించే ధైర్యం చంద్రబాబుకి కూడా లేదని టీడీపీ నాయకులే చెబుతున్నారు. డీఎస్సీపై చర్చకు ఏ ఛానెల్కి రమ్మన్నా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో డీఎస్సీ అక్రమాలను నిగ్గుతేల్చకుండా వదిలిపెట్టం. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది. ఎవరి బెదిరింపులకు, కేసులకు భయపడటం అనేది జరగదు.గవర్నర్కి ఫిర్యాదు చేస్తాం:శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు గురువారం (18వ తేదీ) గవర్నర్ని కలిసి డీఎస్సీ నిర్వహణపై విచారణకు ఆదేశించాలని కోరబోతున్నారు. కాపు యువకుడు సాయికృష్ణను పోలీసులు అన్యాయంగా లాకప్లో చంపేశారని లాకప్ డెత్ గురించి రాష్ట్రమంతా చర్చిస్తుంటే దాన్ని పక్కనపెట్టి ప్రభుత్వం, ఎల్లో మీడియా మేకప్ మీద చర్చిస్తోంది.రాజధానిలో శాంతిభద్రతలు గాడితప్పి ప్రశ్నార్థకంగా మారితే దానికి సమాధానం చెప్పకుండా మేకప్ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది. తన బిడ్డ కోసం తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తుంటే దాన్ని పక్కనపెట్టి మేకప్ ఉద్యమం చేపట్టారు. హోంమంత్రి, డీజీపీ, సిటీ కమిషనర్ ఎక్కడున్నారు?. అసలు లాకప్ డెత్ జరగలేదని చెప్పై ధైర్యం కూడా ప్రభుత్వానికి లేదా? మహిళల గురించి లోకేష్ ఎంత నీచంగా మాట్లాడిన మాటలన్నీ తీస్తే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడు?ఇలాంటి వ్యక్తి నీతులు చెబితే రాష్ట్ర ప్రజలు వినాలా? సాయికృష్ణ తల్లి కూడా మహిళ కాదా? ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్కి ఇచ్చిన విలువ సాయికృష్ణ తల్లి కడుపుకోతకు ఇవ్వలేదా? సాయికృష్ణ ఆచూకీ గురించి తల్లి రోదిస్తుంటే రౌడీ షీటర్ అని ప్రచారం చేస్తున్నారు. రౌడీ షీటర్ అయితే చంపేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. -
రేపు రంపచోడవరం నియోజకవర్గ కేడర్తో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: రంపచోడవరం నియోజకవర్గ కేడర్తో రేపు(జూన్ 18, గురువారం) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. -
ఏపీ బీచ్లలో మద్యం అమ్మకాలు.. ఎప్పటి నుంచంటే?
సాక్షి,విజయవాడ: ఏపీలో బీచ్ బార్ల పేరిట మందు బాబులతో భారీగా మద్యం తాగించాలని చంద్రబాబు సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. బీచ్లలో బార్లు ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. బీచ్ షాక్స్ పేరుతో ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ 362 జీవో ఇచ్చింది.12 జిల్లాల్లో ఏపీటీడీసీ గుర్తించిన చోట్ల బీచ్ షాక్స్ ఏర్పాటుకు విధివిధానాల్ని రూపొందించింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు ఎంపిక చేసిన బీచ్లలో ఏర్పాటు కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 2029 ఆగస్టు వరకు బీచ్ షాక్స్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద సూర్యలంక, విశాఖ బీచ్లలో ఏర్పాటుకు ప్రతిపాదన తెచ్చింది.బీచ్లలో మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోస్తుంటే.. ‘విశాఖ బీచ్లో బీచ్ షాక్స్ పేరిట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తప్పేంటి..? అంటూ బాలకృష్ణ అల్లుడు, టీడీపీ విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖ బీచ్లో బీచ్ షాక్స్ అందుబాటులోకి తేవడంలో నాకెలాంటి తప్పు కనిపించడం లేదు. ఈ రోజుల్లో తాగని వారు ఎవరున్నారు? అందరూ తాగుతున్నారు కదా.. ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ లేదంటున్నారే.. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో మహిళలకు భద్రత, రక్షణ ఉందా..? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు ఎక్కువవుతున్నాయని, అందుకనే వాటిని తొలగిస్తున్నట్టు చెప్పారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్తో కలిసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవా తరహాలో విశాఖ బీచ్లో ‘బీచ్ షాక్స్’ పేరిట మద్యం పాలసీ తీసుకొస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన వెల్లడించారు. -
‘సర్’ పేరుతో భారీ ఎత్తున ఓట్లు తొలగించే కుట్ర’
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ లోపభూయిష్టంగా మారిందని, మై టీడీపీ యాప్ ద్వారా ఓట్ల చోరీకి అధికార పార్టీ మరోసారి ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల కన్నుసన్నల్లో సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను తాము అడ్డుకుని ప్రశ్నిస్తే పొరబాటు జరిగిందని చెప్తున్నారని శైలజానాథ్ తెలిపారు.రాష్ట్రంలో ఎస్ఐఆర్ను అడ్డుపెట్టుకుని భారీ ఎత్తున దళితులు, మైనార్టీలు, పేదల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఈసీ వెంటనే జోక్యం చేసుకుని అక్రమాలను అడ్డుకోవాలని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సాకే శైలజానాథ్ ఇంకేమన్నారంటే..ఎస్ఐర్ పేరుతో భారీగా ఓట్లు తొలగించే కుట్రఎస్ఐర్ పేరు మీద ఓట్ల సవరణ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోంది. దీన్ని పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్దంగా దీన్ని చేపట్టాలని ముందు నుంచీ కోరుతున్నాం. మా పార్టీ గతంలో ఎన్నోసార్లు అనేక వేదికలపై ఈ డిమాండ్ చేసింది. 16వ తేదీన ఎస్ఐఆర్ ప్రక్రియపై మాకు ఉన్న అనుమానాలు, మై టీడీపీ యాప్ ద్వారా ఓటర్ల డేటా చోరీపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఫిర్యాదు చేశాం. దీనిపై మా నాయకులు సచివాలయంలో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఎవరికి మేలు చేయానుకుంటున్నాయి?చంద్రబాబు ఎలాగో తనకు తాను తప్ప ఎవరికీ మేలు చేయడు. గతంలో సేవామిత్ర పేరు పెట్టి దాదాపు వైఎస్సార్సీపీకి చెందిన 30 లక్షల ఓట్ల గల్లంతు చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై న్యాయస్థానాల్ని ఆశ్రయించి వాటిని కాపాడుకున్నాం. కాబట్టి ఎన్టీయే నుంచి, టీడీపీ నుంచి పారదర్శకత ఊహించలేం. పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల్ని చూసిన తర్వాత, బీహార్లో మేం బతికే ఉన్నాం అని సుప్రీంకోర్టుకు ఓటర్లు చెప్పుకున్న తర్వాత కూడా న్యాయం జరగలేదు.ఆయా రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా వచ్చాయో చూశాం. వీటిని అనూహ్యం అనుకోవడానికి కూడా వీల్లేదు. ఏపీలోనూ అదే తంతు కొనసాగుతుందని చెప్పడానికి మేం వెనుకాడట్లేదు. ఎస్ఐర్ ప్రక్రియలో వైరస్ తరహాలో టీడీపీ చొరబడింది. మై టీడీపీ యాప్ పెట్టుకుని కుట్రకు తెరలేపింది. ఈ యాప్లో ఎన్నికల కమిషన్ ప్రచురించిన దాని కంటే స్పష్టంగా ఓటర్ల వివరాలు ఉన్నాయి. బీఎల్వో ప్రక్రియ పూర్తయిన తర్వాత వివరాలు ఫొటో తీసుకుని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారు.అనంతపురంలో టీడీపీ కన్నుసన్నల్లో ఎస్ఐఆర్అనంతపురం జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 20కి పైగా బూత్లను మేం పరిశీలించాం. చంద్రబాబు, ఆయన పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు ముసుగులు తీసేసి మరీ ప్రత్యక్షంగా బరి తెగిస్తున్నారు. టీడీపీ యాప్ ప్రభుత్వ అధికారులు పెట్టిన గ్రూప్స్లో వచ్చింది. ప్రశ్నిస్తే పొరబాటున పెట్టామని చెప్పి తీసేశారు. టార్గెట్గా ఓట్లను తొలగిస్తున్నారు. ముఖ్యంగా దళితులు, మైనార్టీలు, అన్ని కులాల్లో పేదల ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతోంది. దీనికి పరాకాష్టగా ఇవాళ శింగనమలలోని ఓ బూత్లో నాయీ బ్రహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్ పంచాయతీ కార్యదర్శి సీట్లో కూర్చుని ఎస్ఐర్ ప్రక్రియలో దూరాడు.పంచాయతీ కార్యదర్శి నిలబడి సమాధానం చెప్తున్నారు. మేం అడ్డుకుంటే పొరబాటు అంటున్నారు. ఇది పొరబాటు కాదు, టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్ర. దళితులు, మైనార్టీలు, పేదల హక్కుల్ని హరించే కుట్ర ఇది. గతంలోనే ఇది నిరూపితమైంది. ఎన్నికల కమిషన్ అధికారులు ప్రజల ఓట్లను న్యాయంగా కాపాడుతున్నారా లేదా అని అడుగుతున్నాం. అక్కడికక్కడే ఫొటోలు తీయడం, కులం, మతం రాసుకుని వెళ్తుంటే మీరు ఏం చేస్తున్నారు. ఒకాయన ఇందులో ఏం తప్పుందని అడుగుతున్నారు. ఓటరుకు సంబంధించిన ప్రతీ విషయం గోప్యంగా ఉండాలన్న విషయం మీకు తెలియదా? ప్రజల ఓట్లు లేకుండా చేయడానికి భారీ కుట్ర జరుగుతుందని దీన్ని బట్టి అర్థమవుతోంది.ఈసీ పారదర్శకంగా ఎస్ఐఆర్ నిర్వహించాలిశింగనమల నియోజకవర్గ కేంద్రంలోనే ఇలా జరుగుతోందంటే ఇక మారుమూల ప్రాంతాల్లో ఏం జరుగుతోందో ఊహించుకోవచ్చు. మీ సీఐలు ఉన్నా ఇలాఖాలో అధికారుల్ని బెదిరించి, ఎన్యుమరేషన్ ఫామ్లు తీసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. ఇది వదిలేసి, బుక్క రాయసముద్రంలో ఏటీఎం ఎత్తుకుపోతే అది పెద్ద విషయమని పోలీసులంతా అక్కడికి వెళ్లిపోయారు. ప్రజాస్వామ్యంలో ఓటర్ల హక్కు ముఖ్యం కాదా? ఎస్ఐర్ ఫారం నింపి ఇస్తే అది కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తుందా లేదా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తుందా అని జనానికి అనుమానాలు వస్తున్నాయి.క్షేత్రస్దాయిలో టీడీపీ కార్యకర్తలు, నాయకుల తీరు చూస్తుంటే ఇది అర్థమవుతోంది. సర్ ప్రక్రియ కట్టుదిట్టంగా జరగాలి. ఎన్నికల సంఘం నుంచి మా ఫిర్యాదుపై తగిన సమాధానం రాకపోతే ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు వైఎస్సార్సీపీ భారీ పోరాటాలకు సిద్ధంగా ఉంది. కులం, మతం, పార్టీ, ప్రాంతం, అధికారం పేరు చెప్పి ఓటర్లను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ఎన్నికల కమిషన్ అధికార పార్టీ ప్రభావానికి లోనుకాకుండా ఎస్ఐర్ ప్రక్రియను నిర్వహించాలి. ఈ ప్రక్రియలో తప్పిదాలు జరిగితే అంతిమంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని సాకే శైలజానాథ్ హెచ్చరించారు. -
"ఎమ్మెల్యే చింతమనేనికి సేమ్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు?"
తాడేపల్లి: ఏపీ హోంమంత్రి అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ మనుషుల ప్రాణాల మీద లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల అన్నారు. జ్ఞానేశ్వరి, సాయికృష్ణ కేసులపై హోంమంత్రి ఎందుకు మాట్లాడబోరని నిలదీశారు. సాయికృష్ణ మీద కేసులుంటే అతన్ని లాకప్ డెత్ చేస్తారా అని ప్రశ్నించారు. మరి ఇంకా ఎక్కువ కేసులున్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కూడా అదే ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదని అడిగారు.తాడేపల్లిలో బుధవారం ఆరె శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హోంమంత్రి అనిత మహిళల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. అనిత అధికార మదంతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల గురించి అనిత అత్యంత నీచంగా మాట్లాడారు. మేము ఏదైనా మాట్లాడితే మహిళకు అవమానం అంటూ రచ్చ చేస్తారు. ఇదేనా మీ ఎల్లోమీడియా, ఐ-టీడీపీ చేసే నీచ రాజకీయం? రాష్ట్రంలో రాజకీయ సంభాషణను మార్చేసింది టీడీపీనే. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలపై హోంమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు? హోంమంత్రి బాధ్యత మహిళలకు రక్షణ కల్పించటం. అది వదిలేసి నోటికి వచ్చినట్టు మాట్లాడితే జనమే తగిన బుద్ది చెబుతారు. కాకినాడలో చిన్నారి మిస్సింగ్ ఐతే హోంమంత్రి మాట్లాడరు’’ అని విమర్శలు గుప్పించారు. -
అందుకే అనిత ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: పేర్ని నాని
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వైఖరి దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడ సీపీ విజయవాడలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని చెప్పారు. కృష్ణలంక పీఎస్ లో జరిగిన దారుణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గాదె సాయికృష్ణ కేసును సీబీఐతో విచారించాలని డిమాండ్ చేశారు. లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని అన్నారు.తాడేపల్లిలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అనిత మేకప్ గురించి మాత్రమే మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లోని మొత్తం స్త్రీ సమాజం మాట్లాడినట్లేనని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అమర్ ఏదో అన్నారని, విపరీతమైన మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్ ఆదేశాలతో ఇదంతా జరుగుతుంది. పవన్ దీనిమీద ట్వీట్ చేస్తారు. కట్టు, బొట్టు అంటూ ఏదేదో చెప్పారు. అనిత నోరు పారేసుకోబట్టి అమర్ మాట్లాడారు. ఆమె కూడా సంప్రదాయబద్ధంగా ఉండాలి కదా. రాజకీయాల్లో కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. కొందరికి లూజ్ మోషన్ లాగా మాటలు విపరీతంగా వస్తాయి. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతారు..సమాజం నుంచి మర్యాద, మన్నన, గౌరవం కోరుకుంటారు. సమాజం మీదకు రాళ్లు వేస్తే అవే తిరిగి వస్తాయని లోకేశ్, పవన్ గుర్తుంచుకోవాలి. మీ చుట్టూ దిగజారిన మనుషులు ఉన్నారు. హోంమంత్రి ఎప్పుడైనా బాధ్యతగా మాట్లాడారా. నాలుకకు హద్దు ఉండాలి.. సభ్యతగా విమర్శించండి. పవన్, లోకేశ్ సూక్తులు చెబుతున్నారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు హోదాలో అనిత స్పీచ్లు విన్నారా?విన్నవాళ్లు ఆమె మాటలను ఏమనాలి? ఆమె భాషను సరిదిద్దే ప్రయత్నం చేశారా? జగన్ ను తిట్టడం కోసమే వాడుకుంటున్నారు. ఆమెతో అలా మాట్లాడించి నజరానాగా హోంమంత్రి పదవిని ఆమెకు ఇచ్చారు. కొన్ని మాటలు ఎవరు మాట్లాడినా నీచం కాదా. గతంలో బండారు సత్యనారాయణ అనే వ్యక్తి మాజీమంత్రి రోజాను ఎలా మాట్లాడారో అందరూ చూశారు. అసహ్యంగా, జుగుప్సాకరంగా మాట్లాడితే చంద్రబాబు, లోకేశ్, పవన్ ఏం చేశారు?’’ అని ప్రశ్నించారు.రోజా గురించి నీచంగా మాట్లాడారు..రోజాను నీచంగా తిట్టిన బండారు సత్యనారాయణను పవన్ బాగా చేశావని మెచ్చుకున్నారని పేర్ని నాని అన్నారు. ‘‘గతంలో పవన్ కూడా రోజాపై దారుణమైన మాటలు మాట్లాడారు. మంత్రితో పాటు ఆయనకు ఇప్పుడే సంస్కారం వచ్చిందా? గతంలో మా పార్టీ నేతలను ఏదో చేస్తామని మాట్లాడారు.. ఏం చేశారు అని అడుగుతున్నా. సుగాలి ప్రీతి కోసం పార్టీ పెట్టా అని చెప్పారు. హోంమంత్రి అనితను కూడా అమాయకురాలిని చేసి వాడుకుంటున్నారు. లోకేశ్ గతంలో మా నాయకుడు జగన్ గురించి.. ఆయన భార్యాపిల్లల గురించి మాట్లాడుతారు. మీ అమ్మగారు ఒక్కరే స్త్రీ నా? మీరు సంస్కారం గురించి మాట్లాడుతారు. అమర్ మాటల్లో తప్పేముంది.. అందులో అసభ్యత ఏముంది. లోకేశ్ నోరు ఉంది కదా అని అధికార మదంతో మాట్లాడితే వైసీపీ వాళ్లు కూడా అలాగే మాట్లాడుతారు. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబం గురించి అలా మాట్లాడవచ్చా. ఎర్ర బుక్కు పేరుతో రాష్ట్రాన్ని దిగజార్చారు. అమర్ అనే వ్యక్తిని చిన్న వయస్సులోనే తండ్రి చనిపోతే తల్లిచాటున పెరిగారు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతారు? అమర్ పై 10, 15 కేసులు పెట్టి తిప్పాలని చూస్తున్నారని మాకు సమాచారం ఉంది. మీ తప్పుడు కేసులు, అరెస్టులు అతని రోమాన్ని కూడా కదల్చలేరు’’ అని విమర్శించారు. -
నారా లోకేష్కు వైఎస్సార్సీపీ మహిళా నేతల సవాల్
సాక్షి, తాడేపల్లి: మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ మహిళా నేతలు సవాల్ విసిరారు. డీఎస్సీలో అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధమంటూ ప్రకటించారు. తాడేపల్లి భరతమాత విగ్రహం వద్దకు చేరుకున్న మహిళా నేతలు లక్ష్మీ పార్వతి, శ్యామల, నాగమల్లేశ్వరి, జమ్మలమడక నాగమణి, మంజరీచౌదరి.. లోకేష్ స్థాయికి వైఎస్ జగన్ అవసరం లేదని.. దమ్ముంటే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. లోకేష్తో చర్చకు భరతమాత విగ్రహం దగ్గరే వేచి ఉంటామని మహిళా నేతలు తెలిపారు. -
‘సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపేశారు’
సాక్షి,గుంటూరు: 23ఏళ్ల యువకుడు సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో హత్య చేసి.. ఆనవాళ్లు లేకుండా చేసి డెడ్బాడీని దహనం చేశారు. ఈ అంశంలో జనసేన అధ్యక్షుడు పవన్ ఎందుకు మాట్లాడరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.సాయికృష్ణ మృతిపై గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. సాయికృష్ణ లాకప్ డెత్ చర్చనీయాంశమైంది. గాదె సాయి కృష్ణ మేనమామ నవరంగ్ నా దగ్గరకు వచ్చారు. నేను జనసేన కార్యకర్తను అని నవరంగ్ చెప్పారు. సాయికృష్ణ తల్లి వేదన బాధ కలిగించింది. పార్టీలకు అతీతంగా ఉద్యమ రూపం ఇవ్వాలి. దేశంలోనే ఇటువంటి ఘటన ఎక్కడా జరగలేదు. ఎన్నో లాకప్ డెత్స్ జరిగాయి.కానీ ఇక్కడ చనిపోయితే శవాన్ని మాయం చేశారు. ఏపి పోలీస్ మర్డర్ చేసి శవాన్ని మాయం చేశారు.హెబియస్ కార్పస్ కేసు వేస్తే సాయికృష్ణ కోసం వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు.సాయికృష్ణ మృతికి పోలీసులే కారణంసాయికృష్ణ మృతిపై సీబీఐ ఎంక్వయిరీ వేసి న్యాయం చేయండి.పవన్ కల్యాణ్ కు రిక్వెస్ట్ చేస్తున్నాను. చేతులు జోడించి అడుగుతున్నాను పవన్ కల్యాణ్.. ఎంక్వయిరీ వేయండి.మనం మానవులు అన్నది గుర్తించాలి. మర్డర్ చేసి కాల్చేయడం చట్టం చేసే పనా. తమిళనాడు ఘటన కన్నా ఘోరమైన ఘటన. చట్టప్రకారం ఉరిశిక్ష వేయాలి. సాయికృష్ణను లాకప్డెత్ చేశారు. సీబీఐ ఎంక్వైరీ వేసి న్యాయం చేయండి. సాయికృష్ణను దహనం చేసి ఉంటే కనీసం బూడిదనైనా ఇవ్వమని అతని తల్లి కోరుతోంది. సీబీఐ విచారణ కోరుతున్నా. లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని అంబటి రాంబాబు కోరారు. అనంతరరం సాయికృష్ణ మేనమామ నవరంగ్ మీడియాతో మాట్లాడారు. నవరంగ్, సాయి కృష్ణ మేనమామ సాయి కృష్ణ మృతిని పార్టికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఆ తల్లి బాధ చూసి అందరూ చలించిపోతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే దాడి చేసి హత్య చేసి దహనం చేయడమా..సాధారణ వ్యక్తి చనిపోతే ఎవరూ స్పందించ కూడదా. ఆ తల్లి బాధ మరొకరికి రాకూడదు. .దారుణంగా చంపేశారు కాబట్టే న్యాయం చేయమని అడుగుతున్నాం.సాయి కృష్ణ మంచోడు కాదు. మరి మీరు హంతకులు కాదా’అని ప్రశ్నించారు.వంగవీటి నరేంద్రమానవతా దృక్పధంతో స్పందించాం.వంగవీటి కుటుంబంతో సంబంధ బాంధవ్యాలున్నాయి. రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాకుండా హత్య చేశారు.సాయికృష్ణపై ఒక్క కేసు ఉన్నా బయట పెట్టాలి. తల్లి అడిగినట్లు మృతదేహం అన్నా ఇవ్వాలి లేకపోతే బూడిదన్న ఇవ్వాలి.హోంమంత్రి... సాయికృష్ణ హత్య గురించి తప్ప అన్ని విషయాలు మాట్లాడారు. -
అబ్బో.. అతి పెద్ద బోర్ టెక్ ఐటీ కంపెనీ!
సాక్షి, అమరావతి: ‘నేను ఐటీ కంపెనీ నడుపుతున్నా.. నాకు తెలిసిన చాలా మందికి వివిధ దేశాల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నెల్లిమర్లను హైదరాబాద్లా ఐటీ హబ్ చేస్తాను’.. ఎన్నికల ముందు జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన లోకం మాధవి చెప్పిన మాటలివి. ఇప్పుడు అవన్నీ పక్కనపెట్టి చేతిపంపులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.దాన్ని చూసిన జనం సామాజిక మాధ్యమాల్లో అబ్బో చాలా పెద్ద బోర్ టెక్ ఐటీ కంపెనీ తెచ్చారు ఎమ్మెల్యే.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్తో సహా అందరూ ఇలానే ఉన్నారని, వారు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదని విమర్శలతో పోస్టులు వైరల్ చేస్తున్నారు. చదవండి: పవన్.. మీరా యువతకు ప్రతినిధి? -
గ్రిడ్ కనెక్టివిటీ బదిలీకి కొత్త షరతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధికి కీలకమైన గ్రిడ్ కనెక్టవిటీ బదిలీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) కొత్త షరతులు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీ ట్రాన్స్కో) విజ్ఞప్తి మేరకు ఏపీఈఆర్సీ ఇచి్చన స్పష్టీకరణలు.. పునరుత్పాదక విద్యుత్ రంగంలో సందిగ్ధ పరిస్థితులకు దారితీస్తున్నాయి. గ్రిడ్కు విద్యుత్ను సరఫరా చేయడానికి కనెక్టివిటీ అత్యంత కీలకం. ఒక సోలార్ లేదా విండ్ ప్రాజెక్టును ట్రాన్స్మిషన్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు మంజూరయ్యే హక్కునే కనెక్టివిటీగా పరిగణిస్తారు. ఈ హక్కును ఒక ప్రాజెక్టు నుంచి మరో ప్రాజెక్టుకు లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ చేయడాన్ని కనెక్టివిటీ బదిలీగా వ్యవహరిస్తారు. అయితే, కనెక్టివిటీ అనేది ప్రాజెక్టు నిర్దిష్ట హక్కు మాత్రమేనని, దాన్ని స్వేచ్ఛగా ఇతరులకు బదిలీ చేయలేమని ఏపీఈఆర్సీ తాజాగా స్పష్టం చేసింది. క్లస్టర్ విధానంలో మంజూరైన కనెక్టివిటీ కూడా అదే క్లస్టర్లోని ఇతర ప్రాజెక్టులకు ఆటోమేటిక్గా వర్తించదని తేల్చిచెప్పింది. కనెక్టివిటీ బదిలీ, విభజన లేదా కేటాయింపునకు సంబంధించిన ప్రతి ప్రతిపాదనను ఏపీ ట్రాన్స్కో.. కేసు వారీగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల మధ్య వివాదాలకు ఆస్కారం! రాష్ట్ర అంతర్గత ప్రసార వ్యవస్థలో కనెక్టివిటీ బదిలీకి ప్రస్తుతం ప్రత్యేక నిబంధనలు లేవు. కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్(సీఈఆర్సీ) నిబంధనలు నేరుగా వర్తించవని.. వాటి సూత్రాలను మాత్రమే మార్గదర్శకంగా తీసుకోవచ్చని ఏపీఈఆర్సీ పేర్కొంది. దీంతో భవిష్యత్లో అనుమతుల ప్రక్రియలో స్పష్టత కంటే అధికారుల విచక్షణకు ఎక్కువ ప్రాధాన్యం లభించే పరిస్థితి ఏర్పడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇప్పటికే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించి.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు లేదా ఓపెన్ యాక్సెస్ కింద పనిచేస్తున్న ప్రాజెక్టులకు కనెక్టివిటీ బదిలీకి అవకాశం కల్పించినప్పటికీ.. అసలు కనెక్టివిటీ పొందిన డెవలపర్ సమ్మతి తప్పనిసరి అని తేల్చిచెప్పింది. దీంతో ప్రాజెక్టుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెట్టుబడులపై ప్రభావం.. కనెక్టివిటీ బదిలీపై కఠిన నిబంధనల వల్ల పెట్టుబడిదారుల్లో అనిశ్చితి పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పష్టమైన విధానాల కంటే కేసు వారీ పరిశీలనకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రాజెక్టుల అమలు ఆలస్యమయ్యే అవకాశముందని వారు చెబుతున్నారు. పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని ప్రోత్సహించాలంటే కనెక్టివిటీ బదిలీపై స్పష్టమైన, పారదర్శక విధానాన్ని ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు రూపొందించాలని సూచిస్తున్నారు. -
పవన్.. మీరా యువతకు ప్రతినిధి?
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)పై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. వ్యవస్థలోని లోపాలు, నిరుద్యోగం, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలు, రాజకీయ పార్టీల వైఫల్యాలపై యువత వ్యక్తం చేస్తున్న అసంతృప్తికి ప్రతీకగా రూపుదిద్దుకున్న కాక్రోచ్ ఉద్యమాన్ని పవన్ కళ్యాణ్ తీవ్ర పదజాలంతో విమర్శించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఢిల్లీలో జరిగిన జనసేన సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. సుమతీ శతకంలోని ఉదాహరణను చెబుతూ చిన్న చీమలు కూడా బలమైన సర్పాన్ని చంపగలవని, అలాగే చిన్న చిన్న వ్యక్తులు, చిన్న చిన్న ఆలోచనలతో దేశ సమగ్రతకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. ఇలాంటి విభజనవాద ఆలోచనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ అలాంటి వాటికి సపోర్ట్ చేయవద్దని సూచించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. ‘కాక్రోచ్’కు దేశవ్యాప్తంగా మద్దతిస్తే పవన్కు తప్పుగా కనిపిస్తోందా..? నీట్ అక్రమాలపై నిరసనగా మే 16న అభిజీత్ డిప్కే అనే యువకుడు సీజేపీని ప్రారంభించాడు. ఈ పార్టీకి స్వల్ప వ్యవధిలోనే సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభించింది. సామాజిక వేదికలకు లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు. ‘ఒక ఉద్యమాన్ని మీరు ఎప్పటికీ అణచివేయలేరు. వ్యవస్థ పగుళ్లలో సైతం మేము జీవిస్తాం’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా యువత ఈ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో లక్షలాది మంది యువత ఈ ఉద్యమానికి మద్దతుగా పోస్టులు, మీమ్స్, వీడియోలు పెడుతున్నారు. రాజకీయ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తడం, పాలక వర్గాల వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అందుకే యువతలో దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువత ఆవేదన వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోకుండా, ఆ ఉద్యమాన్ని అవమానకర పదజాలంతో పవన్ కళ్యాణ్ కొట్టిపారేయడం సరైన రాజకీయ వైఖరి కాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు, నిరసనలు సహజమని, వాటిని వినిపించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని పవన్కు వారు గుర్తు చేస్తున్నారు. ఒక ఉద్యమంతో ఏకీభవించకపోవచ్చు కానీ దాని వెనుక ఉన్న భావజాలాన్ని, సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా పవన్కు ఉన్నప్పటికీ తెర వెనుక అజెండాతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని వారు చెబుతున్నారు. యువతకు మీరా ప్రతినిధి...?? యువతకు ప్రతినిధిగా, మార్పు కోసం, ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇలా జెన్జీ యువతను, వారు ఆదరిస్తున్న సీజేపీని ఎగతాళిగా మాట్లాడటంపై యువతరం మండిపడుతోంది. యువత వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని దేశద్రోహంగా లేదా సమాజ వ్యతిరేక ధోరణిగా చిత్రీకరించడం సమస్యల మూలాలను కప్పిపుచ్చే ప్రయత్నంగా మారుతుందని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు యువత నిరుద్యోగం, అవకాశాల కొరత, పాలనలో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతుంటే, మరోవైపు వారి ఆలోచనలను కొట్టిపారేస్తూ పవన్ మాట్లాడటం యువతను పవన్కు మరింత దూరం చేసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీపై వచ్చిన స్పందనను పవన్ చెప్పినట్లు కేవలం సోషల్ మీడియా ట్రెండ్గా కాకుండా, యువతలో పెరుగుతున్న అసంతృప్తికి అద్దం పట్టే సామాజిక సంకేతంగా చూడాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. యువత స్వరాన్ని వినేందుకు జనసేన నాయకత్వం సిద్ధంగా ఉందా? లేక తమకు నచ్చని అభిప్రాయాలను ఎగతాళి చేస్తూ చిన్నచూపు చూస్తుందా? అనే ప్రశ్నలు పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఏకిపడేస్తున్న నెటిజన్లు కాక్రోచ్ జనతా పార్టీ గురించి, జెన్ జీ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్లు, రీల్స్, వార్తా కథనాలు సోషల్ మీడియా వేదికల్లో షేర్ అవుతున్నాయి. ‘నీట్ పేపర్ లీక్ అవ్వడాన్ని పవన్ సమర్థిస్తున్నారా’ అని పలువురు నిలదీశారు. ‘నిలకడ లేదు.. విలువలు లేవు’ అంటూ పవన్ ద్వంద్వ వైఖరిని మరికొందరు తప్పుబట్టారు. ‘విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేస్తే విభజనవాదం ఎలా అవుతుంది’ అంటూ ఇంకొందరు నిలదీస్తున్నారు. ప్రధానంగా ‘నేషన్ ఫస్ట్ అనేది వాస్తవమేగానీ, యువత లేకుండా దేశం ఎక్కడుంది’ అని పవన్ కళ్యాణ్ను దుమ్మెత్తి పోస్తున్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపైన, విద్యార్థుల భవిష్యత్తుపైన పవన్ కళ్యాణ్ మాట్లాడాలని సామాజిక మాధ్యమాల వేదికగా యువత పవన్ను డిమాండ్ చేస్తున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామని, అధికారంలోకి వచ్చాక ఏపీలో జరిగే ఏ తప్పునూ ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి మరీ కాక్రోచ్ జనతాపార్టీ, జెన్ జీ యువతని కించపరుచ్తూ మాట్లాడి సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా ట్రోలింగ్కు గురవుతున్నారు. -
ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై ఆ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని భారతదేశంలో నిలిపివేయడానికి ఏ ప్రభుత్వ అధికారి ఉత్తర్వులిచ్చారు?, ఏ నిర్దిష్ట కంటెంట్ ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు?అనే పూర్తి వివరాలను, నోటీసుల అసలు ప్రతులను వెంటనే తమకు అందజేసేలా మెటాను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద ఏదైనా ఖాతాదారుడి కంటెంట్ను తొలగించినప్పుడు, ప్రభుత్వ నోటీసు నకలును సదరు ఖాతాదారుడికి అందించాల్సిన బాధ్యత సంబంధిత సోషల్ మీడియా సంస్థ అయిన మెటాపై ఉందన్నారు. వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేసే విషయంలో మెటా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపారు. ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడానికి గల కారణాలను తెలియజేయకపోవడం, అందుకు సంబంధించిన నోటీసు కాపీని ఇవ్వకపోవడం చట్టవిరుద్ధం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని ఆయన హైకోర్టును అభ్యరి్థంచారు. ఈ వ్యాజ్యం తేలేంతవరకు, సదరు బ్లాకింగ్కు దారితీసిన ప్రభుత్వ నోటీసులు, కమ్యూనికేషన్ల కాపీలను తక్షణమే పిటిషనర్లకు సమర్పించేలా మెటా సంస్థను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ‘మెటా అధికార పార్టీకి సహకరిస్తోంది’ ‘శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రభుత్వ నోటీసులను సాకుగా చూపి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ బ్లాకింగ్ ప్రభుత్వ ‘సహయోగ్ పోర్టల్’ ద్వారా జరిగిందని భావిస్తున్నారు. అయితే, నోటీసు ఇచ్చిన సంస్థ అసలు చట్టబద్ధంగా నోటిఫై చేయబడిన సంస్థేనా కాదా అనే వివరాలు దాచారు. ఐటీ బ్లాకింగ్ రూల్స్–2009లోని రూల్ 16 ప్రకారం కొన్ని విషయాలు రహస్యంగా ఉంచవచ్చు. కానీ అది సెక్షన్ 69ఏ కింద చేసే బ్లాకింగ్కు మాత్రమే వర్తిస్తుంది. సెక్షన్ 79(3)(బీ) కింద మెటా తీసుకునే చర్యలకు ఈ రహస్య నిబంధన వర్తించదు. తటస్థ వేదికగా ఉండాల్సిన మెటా, అధికార పక్షం చెప్పినట్లు వింటూ ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కడానికి సహకరిస్తోంది. తద్వారా అది తన తటస్థతను కోల్పోయింది’ అని వివరించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డిజిగ్నేటెడ్ ఆఫీసర్, మెటా ప్లాట్ఫామ్ ఇంక్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘మా భావ ప్రకటన స్వేచ్ఛ హరించడమే’ ‘2026 జూన్ 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని భారతదేశంలో ఎవరికీ కనిపించకుండా మెటా సంస్థ నిలిపివేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద భారత ప్రభుత్వం, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి వచ్చిన నోటీసు ఆధారంగా ఈ పేజీని నిలిపివేసినట్టు మెటా పేర్కొంది. అయితే, ఏ అధికారి లేదా ఏ శాఖ నోటీసు ఇచ్చిందో మెటా స్పష్టం చేయలేదు. ఎటువంటి ముందస్తు నోటీసు లేదా సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేశారు. రాజకీయ పార్టీగా ప్రజలతో, లక్షలాది మంది ఫాలోవర్లతో కమ్యూనికేట్ చేయడం మా పార్టీ ప్రాథమిక హక్కు. మా పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడం రాజ్యాంగం మాకు ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛను హరించడమే. ఏదైనా నిర్దిష్ట పోస్ట్, వీడియో లేదా ఇమేజ్ చట్టవిరుద్ధంగా ఉంటే దాన్ని తొలగించవచ్చు. కానీ, కేవలం ఒక అస్పష్టమైన నోటీసుతో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన మొత్తం ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడం చట్టపరిధిని మించిన చర్య’ అని అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. -
సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గాదె సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసులు కొట్టి చంపేసి, శవాన్ని తగులబెట్టేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సాయికృష్ణకు పెట్టిన చిత్రహింసలు, సాయికృష్ణ మృతదేహం∙ఫొటోలను ఆయన బయటపెట్టారు. ఇందుకు సంబంధించి ఒక సంచలన వీడియోను మంగళవారం రాత్రి విడుదల చేశారు. అందులో అంబటి ఏం చెప్పారంటే.. ‘23 ఏళ్ల గాదె సాయికృష్ణ కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న యువకుడు అని, అతనిపై కొన్ని కేసులు ఉన్నాయని మే 9న మార్కాపురం నుంచి విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు కస్టడీలోకి తీసుకుని స్టేషన్కు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ప్రశ్నగా మిగిలింది. సాయికృష్ణ ఉన్నాడా? చనిపోయాడా? సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రశ్నగా మారింది. వాస్తవానికి గాదె సాయికృష్ణ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. ఆయన మేనమామ, వారి కుటుంబం రాధా, రంగాతో పనిచేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే గాదె సాయికృష్ణ మీద కొన్ని కేసులు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కృష్ణలంకలో అతన్ని తీవ్రంగా హింసించారు. ఆ క్రమంలో గాదె సాయికృష్ణ చనిపోయాడని మాకు సమాచారముంది. సహజంగా లాకప్ డెత్ జరిగితే మసిపూసి మారేడు కాయ చేసి, కుటుంబ సభ్యులకు అప్పజెప్పి.. రాజీ కుదుర్చుకుని వెళ్లిపోతారు. ఇక్కడ దానికి భిన్నంగా మృతదేహాన్నే మాయం చేశారు. మృతదేహాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేసేశారు. టూ వీలర్పై ముందు ఒక కానిస్టేబుల్.. వెనుక మరో కానిస్టేబుల్ కూర్చుని.. మధ్యలో శవాన్ని పెట్టుకుని వెళ్లారు. అక్కడ దహనం చేసి, బూడిద కూడా మాయం చేశారు. అయితే పోలీసులు.. కోర్టుకు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు.. వెతుకుతున్నాము. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతుకుతున్నామని చెబుతున్నారు. సాయికృష్ణ తల్లికి సీఐ నాగరాజు ‘మీ అబ్బాయ్ నాకు ఎదురు తిరిగాడు. వాడిని చంపేస్తాను. దండ రెడీ చేసుకో.. అని చెప్పి, మరీ చంపేసిన ఘటన ఇది. నీపై దాడిచేసి ఉండవచ్చు. అయితే పోలీసులు తీసుకొచ్చి చంపేస్తారా? రక్షకభట నిలయంలోనే భక్షణ చేసే కార్యక్రమం పోలీసులు చేస్తున్నారంటే ఏమిటి ధైర్యం? నేరం చేస్తే వారిని శిక్షించాల్సింది కోర్టులుఇటీవల తమిళనాడు మధురై కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తండ్రీకొడుకులు.. ఇద్దరినీ తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి పోలీసులు చంపేస్తే, దానిపై న్యాయ విచారణ జరిపి తొమ్మిది మంది పోలీసులను దోషులుగా నిర్ణయించి, తొమ్మిది మందికి ఉరిశిక్ష వేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఘటనలో బాధితుల కుటుంబానికి రూ.కోటి 40 లక్షలు నష్టపరిహారం చెల్లించారు. అలాంటి కఠిన నిర్ణయం కోర్టు తీసుకుంది. ఎందుకంటే పౌరుడికి జీవించే హక్కు ఉంది. నేరం చేస్తే వారిని శిక్షించాల్సింది పోలీసులు కాదు.. న్యాయస్థానాల అధికారాన్నీ పోలీసులు చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తుంటే ఇది ధర్మమేనా? సాయికృష్ణ నేరస్తుడైనా కూడా శిక్షను కోర్టులు నిర్ణయించాలి తప్ప.. సీఐలు, ఎస్సైలు కాదు. సాయికృష్ణను చంపేశారు.. కాబట్టి తల్లిదండ్రులు, బంధువులతో బేరాలు ఆడుతున్నారు. కోటి రూపాయలు ఇస్తాం.. మీరు కేసు వెనక్కు తీసుకోండని బతిమాలుతున్నారు. రేటు కూడా పెంచుతున్నారు. పోలీసులు సఫలమవుతారో, విఫలమవుతారో చూడాలి. డీజీపీ నుంచి కమిషనర్ వరకు ఈ నేరం తెలిసే జరిగిందని బయట చర్చ జరుగుతోంది. ఎవరైతే పోలీసులు మనిషి ప్రాణాన్ని తీసేశారో ఆ పోలీసు అధికారులకు శిక్ష పడేంత వరకు సమాజం కూడా పోరాటానికి మద్దతు ఇవ్వాలి’ అని అంబటి కోరారు.సాయికృష్ణ ఉంటే చూపించండిపోలీసులు చంపేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు హోం మంత్రి సమాధానం చెప్పాలి...బాధ్యులపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ కృష్ణలంకకి చెందిన గాదె సాయికృష్ణ కనిపించకుండాపోవడానికి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు డీసీపీ కేజీవీ సరితను మంగళవారం కలిసి వినతిపత్రమిచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజులుగా సాయికృష్ణ కనిపించడం లేదని, పోలీసులే తీసుకెళ్లి చంపేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్న సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడో తెలియజేయాలని, ఈ ఘటన వెనుక దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయవాడ పోలీసులపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని, సివిల్ సెటిల్మెంట్లు, స్టేషన్ సెటిల్మెంట్లతో వారు బిజీ అయిపోయారన్నారు. వాస్తవాలు తెలియాలి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గాదె సాయికృష్ణ కనబడటం లేదని ఆయన తల్లి చెప్పిన మాటల ఆధారంగా వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణను ఇంటినుంచి తీసుకెళ్లినట్టు తల్లి చెబుతోందన్నారు. పోలీసులు ఇష్టానుసారంగా కొట్టి చంపేశారని ఆమె,ఇతర కుటుంబ సభ్యులు చెబుతున్నారని వివరించారు. సాయికృష్ణ విషయంలో పోలీసులు మౌనం వీడాలని, రాష్ట్ర హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో పోలీసుల తీరుపై ఎన్నో విమర్శలు వస్తున్నాయన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోలేరని చెప్పారు. వైఎస్సార్సీపీ తరఫున సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, తూర్పు నియోజకవర్గ పరిశీలకుడు సర్నాల తిరుపతిరావు, సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీతో కట్టుకట్టి కాలిగోళ్లు పీకేసి!
సాక్షి, టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో సంచలనంగా మారిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఏపీలో పోలీసుల పనితీరు, దారుణంగా క్షీణించిన శాంతి భద్రతల దుస్థితిని బట్టబయలు చేస్తోంది. సాయికృష్ణను చిత్ర హింసలకు గురిచేసి కటకటాల వెనకే కనుమరుగు చేశారా? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. పోలీసులు చంపేశారయ్యా..! శవాన్ని అయినా ఇప్పించండయ్యా..! అంటూ సాయికృష్ణ తల్లి, మేనమామ ప్రాథేయపడటం దీనికి బలం చేకూరుస్తోంది. పోలీసులు తన కుమారుడిని తీసుకొచ్చారని సాయికృష్ణ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నా.. తమ ముందు వెంటనే హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశించినా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. కేసు వాపసు తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అక్రమ కేసుల్లో ఇరికిస్తామని హెచ్చరిస్తున్నట్లు సాయికృష్ణ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ ఎక్కడ ఉన్నారనేది మిస్టరీగా మారింది. అయితే సాయికృష్ణ లాకప్ డెత్కు గురైనట్లు అత్యధికులు భావిస్తున్నారు. చంద్రబాబు సర్కారు రెడ్బుక్ పాలనలో పోలీసుల అరాచకానికి సాయికృష్ణ ఉదంతం తాజా తార్కాణంగా నిలుస్తోందని పేర్కొంటున్నారు. 2025 డిసెంబరు 3 తరువాత కేసులు ఏవీ లేకున్నా పోలీసులు ఎలా అదుపులోకి తీసుకున్నారు? దీని వెనుక కుట్రదాగి ఉందనే అనుమానం వ్యక్తం అవుతోంది. సాయికృష్ణను పోలీసులు ఏ విధంగా తీసుకెళ్లారు? ఎంతగా చిత్రహింసలు పెట్టారు? అనేది అతడి మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు ‘సాక్షి’ చానల్లో బహిర్గతం చేశారు. ఆయన ఏమన్నారంటే.. కూటమి ఎక్కడికి పోయింది? సాయికృష్ణ వంద శాతం లేడు. హ్యూమన్ రైట్స్ లాయర్లు, బార్ కౌన్సిల్ ద్వారా తొమ్మిది మందిని వెంట పెట్టుకుని మార్కాపురం వెళితే.. అయ్యా అరెస్టు చేసిన మాట వాస్తవమే. ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు. ఫలానా పేర్లు ఇవీ..! ఇలా మాట్లాడుకున్నారు. చేతులు వెనక్కి కట్టి జంతువుల కన్నా హీనంగా తీసుకువచ్చారన్నారు. నా మేనల్లుడు నాకు కావాలి. ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. 45 రోజులుగా ఈ పార్టీలన్నీ ఏమై పోయాయి? కూటమి ఎక్కడికిపోయింది?మాకు మా బిడ్డ కావాలి. ఆ నాగరాజు మీద కేసు కూడా వద్దండీ. మాకు ఆఫర్ చేసిన రూపాయి కూడా వద్దు. ఈ రూపాయి ఎవరెవరు ఆఫర్ చేశారో, వాళ్లకు తెలుసు! తగలబెట్టే అధికారం ఎవరిచ్చారు..? పిల్లవాడ్ని చంపే అధికారం ఎవరిచ్చారండి? తగలబెట్టే అధికారం ఎవరిచ్చారండి? మీరు అరెస్టు చేశారు.. కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి.. బెయిల్ పెట్టుకుని బయటకు తెచ్చుకుంటాం. అనేక సంవత్సరాలుగా అరెస్టు వారెంట్లు రీకాల్ చేసుకునే వారున్నారు. వాడేమైనా కసబ్.. బర్మా నుంచి వచ్చిన కాందిశీకుడా? ఐఎస్ఐ తీవ్రవాదా? మావాడి బాడీ ఇవ్వాలి.. లేదంటే బూడిద ఇవ్వండి మాకు సపోర్ట్ చేస్తున్న లాయర్లను కూడా భయపెడుతున్నారు. మేం చావుకైనా సిద్ధమే! మా మేనల్లుడి చావు బతుకులు గురించి తెలియాలి. మావాడి బాడీ ఇవ్వాలి. లేదంటే బూడిద ఇవ్వండి.. లేదా డేట్ చెప్పండి.. కర్మకాండలు చేసుకుంటాం. మాకు కేసులు, కులాలు, పార్టీలు కాదు కావాల్సింది. అన్నీ వదిలేసి ప్రశాంతంగా బతుకుతున్నా. మమ్మల్ని కెలికారు. ఈ విషయంలో ఎక్కడికైనా వెళతా. సుప్రీం కోర్టు, హ్యూమన్ రైట్స్కు వెళతా. సీబీఐ వద్దకు వెళతా. వదిలే సమస్యే లేదు. ఆ ఏడుగుర్ని సస్పెండ్ చేయకపోతే.. ఈయన కొట్టుడు మొదలుపెడితే ఆగడండి..! గోళ్లు పీకే అవసరం ఎవరికి ఉందండి? గోళ్లు పీకాల్సిన పని ఏంటండి? ఎంత మంది పిల్లల గోళ్లు పీకేశాడండి..! అదే డాక్టరు వచ్చి పట్టకారు పెట్టి గోళ్లు పీకేయటం.. మళ్లీ కట్టుకట్టడం..! ఈయన సెటిల్మెంట్లు, యవ్వారాలు విజయవాడలో నాయకులకు తెలియదా? మా ఆవేదన ఆలోచించండి. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కక్ష లేదు. తప్పు చేసిన ఆ ఏడుగురు మినహాయించి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాకు గౌరవం. ఆ ఏడుగుర్ని సస్పెండ్ చేయకపోతే డిపార్ట్మెంట్ మీద పోరాటం చేస్తాం. కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి నేను ఎలాంటి వెనుకడుగు వేయను. అమ్మా.. లేడమ్మా..! ‘అమ్మా.. లేడమ్మా! ఆయనకు మేం చెప్పలేం.. ఆయన మామూలుగా కొట్టలేదు. అమ్మా.. మామీద పెట్టమాకమ్మా.. మీ పిల్లోడు లేడమ్మా.. చచ్చిపోయాడు... అమ్మా ఏమనుకోవద్దమ్మా.. నన్ను మాత్రం ఇరికించవద్దమ్మా..’ అని ఆ స్టాఫే మాకు మొత్తం చెప్పారు. గోళ్లు తీసిన దగ్గర నుంచి.. కొట్టి పారేసిన దగ్గర నుంచి.. చంపి బాత్రూమ్లో పడేసిన దగ్గర నుంచి.. మొత్తం సమాచారం ఉంది. బాడీ తీసుకువెళ్లిన విధానం అంతా ఉంది. సాయికృష్ణ మిస్సింగ్పై విచారణాధికారిగా ఏసీపీ దుర్గారావు.. సాయికృష్ణ మిస్సింగ్పై విచారణ నిమిత్తం ప్రత్యేక అధికారిగా పశ్చిమ ఏసీపీ ఎన్.వి దుర్గారావును నియమిస్తూ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు ఉత్తర్వులు జారీ చేశారు. మిస్సింగ్పై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గోళ్లు పీకింది.. చంపింది వాస్తవం..!మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవు. ఇప్పుడు కూడా సీఐ నాగరాజు అంటే మాకు గౌరవమే. మాకు మా పిల్లాడి బాడీ కావాలి. అతడిని చంపింది వాస్తవం. కొట్టింది వాస్తవం. ఆస్పత్రికి తీసుకెళ్లి ఆర్ఎంపీతో గోళ్లు పీకించింది వాస్తవం. ఇంకా నేను చెప్పకూడదు. ఈ కేసుకు సంబంధించిన రహస్యాలు ఉన్నాయి. మీడియాలో పెట్టలేను. పార్టీలకు అతీతంగా వాస్తవాన్ని మాట్లాడా. ఇదే కూటమికి సపోర్ట్ చేశా. ఇదే కూటమి ఇప్పుడు ఏం చేస్తుందా? అని ఎదురు చూస్తున్నా. నీ కొడుకుకు దండ వేసుకో.. ఫొటో రెడీ చేసుకో.. చంపేస్తున్నా..! మా బాబును తీసుకెళ్లే ముందు తల్లి వద్దనున్న ఫోన్ తీసుకున్నారు. ఫోన్ ట్యాప్ చేసి మార్కాపురంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు. మా చెల్లికి అనుమానం వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్లు వెళ్లటం లేదు. మీ అబ్బాయిని అరెస్టు చేశారని, కృష్ణలంక స్టేషన్లో లాకప్లో ఉన్నాడని మా ప్రాంతానికి చెందిన వ్యక్తులు చెబితే అక్కడకు వెళ్లాం. కానీ కృష్ణను చూపించలేదు. ఫోన్ ఇవ్వలేదు. 24 సంవత్సరాల కుర్రాడు. వాయిదాకు రాలేదని ఇంత చేయటం అవసరమా? మీరు కొడుతున్నారని భయపడి ఎక్కడికో పారిపోయి బతుకుతుంటే వాడి వల్ల సమస్య ఏమైనా ఉందా? వారెంట్ పెండింగ్ ఒక్కటే కదా.. కొత్త కేసులు ఏమైనా ఉన్నాయా? బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చాడు కదా.. ఎందుకయ్యా వాడిని ఇలా చేస్తున్నారని అడిగితే సీఐ దుర్భాషలాడారు. నీ కొడుకుకు దండ వేసుకో.. ఫొటో రెడీ చేసుకో.. నీ కొడుకుని చంపేస్తున్నా..! అని అన్నారు. -
అప్పులే అప్పులు.. సర్కారు గొప్పలు!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే భారీగా అప్పులు చేస్తోంది. ఫలితంగా రాష్ట్ర అప్పుల చిట్టా రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రతి నెలా అప్పులతో పాటు చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్లతోనే పాలన కొనసాగుతోంది. అప్పు చేయకుండా రోజు గడవడం లేదని, రోజువారీ ఖర్చులకు అప్పులు చేస్తున్నారని, ఏడాదిలో 357 రోజులు చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్లేనని కాగ్ కూడా ఎత్తి చూపింది. అయినా సరే చంద్రబాబు సర్కారు అప్పులు చేయడంలో వేగంగా దూసుకుపోతోంది తప్ప వెనకడుగు వేయడం లేదు. మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.4,600 కోట్ల అప్పును ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల.. కేవలం రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా రూ.3,51,695 కోట్లకు చేరాయి. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసిన ఘనత చంద్రబాబు సర్కారుకే దక్కుతుంది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వాలు ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా అప్పులు చేయలేదు. ఒక పక్క అప్పులు భారీగా.. వేగంగా పెరిగిపోతుండగా, మరో పక్క రాష్ట్ర రాబడులు తగ్గిపోతున్నాయి. ఇంత అప్పు చేసినా అభివృద్ధి లేదు. సంక్షేమ కార్యక్రమాల అమలు లేదు. అప్పులతో కొత్తగా ఆస్తులు సృష్టించకపోగా, ఉన్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగిందంటూ ఒక పక్క చంద్రబాబు గొప్పలు చెబుతుండగా, అందుకు తగినట్లు రాష్ట్ర రాబడులు పెరగనందున బాబు గొప్పలన్నీ అబద్ధాలని తేలిపోతోంది. చేసిన అప్పులను సంక్షేమ పథకాల అమలుకు గానీ, ప్రభుత్వ రంగంలో వైద్య, విద్యా మౌలిక సదుపాయాల కల్పనకు గానీ వెచ్చించకుండా రెవెన్యూ వ్యయాలకు మళ్లించేస్తోంది. దీంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించక పోవడంతో ప్రస్తుతమే కాకుండా భవిష్యత్ అభివృద్ధిని సైతం శూన్యం చేశారని కాగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేంద్ర నిబంధనలు, ఎఫ్ఆర్బీఎం నిబంధనలను తుంగలో తొక్కి.. దొరికిన చోటల్లా అప్పులు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోంది. మద్యం ఆదాయంతో పాటు, గనులను తాకట్టు పెట్టి, బడ్టెట్ బయట చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తూనే ఉంది. కొత్తగా ఆస్తులు, సంపద సృష్టి లేకపోగా, ఉన్న ఆస్తులు సైతం ప్రైవేట్ పరం చేస్తుండటం గమనార్హం. -
నాతోపాటు కుటుంబ సభ్యుల ఓట్లు లేవు
మైదుకూరు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)కు ఆధారంగా చెబుతున్న 2002 ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, దానిలో తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఓట్లు లేవని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి చెప్పారు. ‘సర్’ పేరుతో వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను తొలగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ధ్వజమెత్తారు. రఘురామిరెడ్డి మంగళవారం వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను 2002 ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహిస్తున్నప్పుడు దానిని ఆన్లైన్లో ఎందుకు సక్రమంగా ఉంచలేదని ప్రశ్నించారు. ఇప్పుడు చూపిస్తున్న 2002 ఓటర్ల జాబితాలో మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలంలో ఒక గ్రామానికి చెందిన ఓటర్ల జాబితాలో మరొక గ్రామానికి చెందిన వారి పేర్లు ఉన్నాయని తెలిపారు. తన సొంత గ్రామమైన నక్కలదిన్నె ఓటర్ల జాబితాలో స్థానిక ఓటర్ల పేర్లు లేవని చెప్పారు. తన ఓటుతో సహా తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా లేవని రఘురామిరెడ్డి వివరించారు. చిన్నగురువలూరు గ్రామంలో తన కుమారుడు, కోడలి ఓట్లను తొలగించారని మీడియాకు ఆధారాలు చూపారు. తిప్పిరెడ్డిపల్లె, అన్నవరం, పల్లవోలు గ్రామాల్లోనూ స్థానిక ఓటర్ల పేర్లు లేవని తెలిపారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సోమవారమే ప్రారంభం కాగా, ఇప్పటికే 80 శాతం మ్యాపింగ్ జరిగిందని అధికారులు చెబుతున్నారని రఘురామిరెడ్డి తెలిపారు. ఈ విధంగా తుది ఓటర్ల జాబితా వస్తే, అందులో అసలైన ఓటర్ల పేర్లు లేకపోతే ఏం చేయాలని ప్రశి్నంచారు. మైదుకూరు నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి (ఈఆర్వో)తో మాట్లాడేందుకు ప్రయతి్నస్తున్నా అందుబాటులో లేరని చెప్పారు. 2002 ఓటర్ల జాబితాను సరిదిద్దాలని, లేదంటే న్యాయం కోసం కోర్టుకు వెళతామని స్పష్టంచేశారు. -
ఫీడ్ ధరలు తగ్గించాల్సిందే.. ‘ఆక్వా’పై అల్టిమేటం
సాక్షి, అమరావతి: దారుణంగా పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను ఈ నెలాఖరులోగా తగ్గించాలని.. లేని పక్షంలో వచ్చే నెల 1 లేదా 2వతేదీన రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని చంద్రబాబు సర్కార్కు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. 2019–24 మధ్య ఆక్వా రంగానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని, 57 నెలల్లో ఆక్వా విద్యుత్ సబ్సిడీ కింద రూ.3,306 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అదే యూనిట్ విద్యుత్కు 2014–19 మధ్య రూ.3.85 చొప్పున వసూలు చేసిన చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.2కే అంటూ జీవోతో సరిపుచ్చి అమలు చేయలేదని ధ్వజమెత్తారు. జోన్ లోపల రైతులకు సబ్సిడీ కత్తిరింపులపై బెదిరిస్తున్నారని.. ఆ దిశగా వారం క్రితం జీవో ఆర్టీ 169 జారీ చేశారని.. క్లాజ్ నెం 4లో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) నిర్వహణపై రూల్ పెట్టారని దుయ్యబట్టారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కట్ చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. తాము అప్పుడైనా, ఇప్పుడైనా.. ఎప్పుడూ ఆక్వా రంగానికి పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులతో పాటు ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. ఆక్వా రైతులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు.. ఫిషరీస్ అసిస్టెంట్లు.. అప్సడా ఈరోజు అత్యంత దారుణ స్థితిలో రైతులు, ఆక్వా రైతులు ఉన్నారు. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన హయాంలో రైతులు, ఆక్వా రైతుల సంతోషం కోసం చాలా ఆలోచన చేశాం. అందుకే గతంలో ఏనాడూ చూడని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి అడుగులో రైతుల చేయి పట్టుకుని నడిపించాం. 10 వేలకు పైగా ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. వాటిలో 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్స్ను నియమించాం. ఆక్వా సాగులో నాణ్యతతో కూడిన సీడ్, ఫీడ్ టెస్టింగ్ కోసం 35 ఆక్వా సాగు ప్రాంతాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్లు, వీటికి తోడు అప్సడా ఏర్పాటు చేశాం. సీఎం దానికి ఛైర్మన్గా ఉంటూ ఎక్కడా సిండికేట్ ఏర్పాటు కాకుండా, రైతులకు ద్రోహం జరగకుండా చూశాం. రూ.1.50కే యూనిట్ విద్యుత్..యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇచ్చి ఆక్వా రంగాన్ని ఆదుకున్నాం. అందుకోసం రూ.3,306 కోట్లు ఖర్చు చేశాం. మనం ఆ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాక.. చంద్రబాబు యూనిట్ విద్యుత్ రూ.3.85 నుంచి రూ.2కి తగ్గిస్తానని ఆదేశాలు జారీ చేసినా అమలు మాత్రం చేయలేదు. అక్కడా విద్యుత్ సబ్సిడీ రూ.340 కోట్లు ఎగ్గొట్టాడు.అవార్డులు, భారీగా ఎగుమతులు.. రూ.వంద కోట్లతో ఆక్వా వర్సిటీ..మన హయాంలో ఆక్వా రంగానికి అన్ని విధాలుగా తోడుగా నిలవడం ద్వారా ఆక్వా సాగు ఒక పండగలా సాగింది. దీంతో డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్లో స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24 సంవత్సరాలకు రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు కూడా దక్కాయి. నాడు ఆక్వా ఉత్పత్తులు కూడా గణనీయంగా పెరిగాయి. అంతకు ముందు 2018–19లో 38 లక్షల టన్నులు ఉన్న రొయ్యలు, మత్స్య ఉత్పత్తులు 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయి. మంచినీటి రొయ్యలు 4.55 లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు.. ఉప్పునీటి రొయ్యలు 5.28 లక్షల టన్నుల నుంచి 7.15 లక్షల టన్నులకు పెరిగాయి. అలా ఆ ఐదేళ్లలో సముద్ర, మంచినీటి, ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తి 11 లక్షల టన్నుల నుంచి 18.50 లక్షల టన్నులకు పెరిగింది. అంతకు ముందు చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే.. 2022–23లో రూ.19,847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇవన్నీ జరిగాయి. అందుకే ఆక్వా వర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. రూ.100 కోట్లు కేటాయించి భవనాల నిర్మాణం మొదలుపెట్టాం. తాత్కాలిక భవనాల్లో క్లాస్లు కూడా మొదలు పెట్టించాం. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది.నెలాఖరులోగా ధరలు తగ్గించాల్సిందేఫిబ్రవరి నుంచి జూన్ నాటికి కిలో ఫీడ్ దాదాపు రూ.16 వరకు పెరిగింది. ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికల్లా ధరలు తగ్గించాలి. లేని పక్షంలో జూలై 1 లేదా 2న ఆక్వా రైతులతో కలిసి ఆందోళన చేస్తాం. రాష్ట్రమంతా చూసేలా సమస్యను ఎలుగెత్తి చాటుదాం. అప్పటిలోగా ఫీడ్ రేట్లు తగ్గిస్తారేమో చూద్దాం. అప్పటి వరకు వారికి టైమ్ ఇచ్చినట్లు కూడా ఉంటుంది. రేట్లు తగ్గించకపోతే ఆరోజు ఆక్వా రైతుల సమస్యలు యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నిద్దాం. తీవ్ర కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులు క్రాప్ హాలీడే కూడా ప్రకటించుకోలేని పరిస్థితి. అలా చేస్తే ఆక్వా సాగులో ఉపయోగించే పరికరాలు, ఉపకరణాలు తుప్పు పట్టి పోతాయి. చెరువులు తవ్వారు కాబట్టి ఆ భూములు ఎందుకూ పనికిరావు. 3 సార్లు ఉపసంహరించేలా చర్యలు..నాడు ‘అప్సడా’ ద్వారా సిండికేట్ ఆట కట్టించడమే కాకుండా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచితే మూడుసార్లు ఉపసంహరించేలా చర్యలు తీసుకున్నాం. థాయ్లాండ్కు చెందిన సీపీఎఫ్ కంపెనీ ఒకేసారి కిలోకు రూ.6.8 పెంచడానికి సిద్ధపడితే ఆక్వా రైతులు మన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వారిని పిలిపించి ధరల పెంపును విత్డ్రా చేసుకోవాలని, లేకపోతే ఫీడ్ యాక్ట్ ప్రయోగిస్తామని నోటీస్ ఇవ్వడంతో దారికొచ్చారు. ఆ విధంగా ఆక్వా రైతుల కోసం చిత్తశుద్ధితో పని చేశాం. ఇప్పుడు ఆక్వా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ఒకే వర్గం వారి చేతుల్లో ఉన్నాయి. వారంతా ఆయనకు సన్నిహితులు. అందుకే వారిపై ఎలాంటి చర్యలు లేవు. రొయ్యల ధరలపై నిరంతర సమీక్షనాడు ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరల హెచ్చు తగ్గులను ‘అప్సడా’ ద్వారా సమీక్షిస్తూ ప్రతి రైతుకూ ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దక్కేలా చేశాం. 100 కౌంట్ రొయ్యలు రూ.245 చొప్పున, 30 కౌంట్ రొయ్యలు రూ.470 చొప్పున కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాం. ఇప్పుడు రొయ్యల ఉత్పత్తి వ్యయం పెరిగింది. కానీ రొయ్యల ధరలు పెరగకపోగా తగ్గాయి. దీంతో ఆక్వా రైతులు నష్టాల పాలవుతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ వడ్డి ర«ఘురాంనాయుడు, పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుతో పాటు ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు ఐపీఆర్ మోహన్రాజు, దుగ్గినేని గోపీనాథ్, జి.రాజ్కుమార్, నడింపల్లి సూర్యనారాయణరాజు, ఆర్.వెంకటరాజు, జి.ధర్మరాజు, కె.శ్రీనాథ్రెడ్డి, మేకా వెంకటేశ్వరరావు, కె.సుబ్బారెడ్డి, రమేష్రెడ్డి, సీహెచ్ కుమార దత్తాత్రేయవర్మ, జి.నారాయణమూర్తి, కె.నరసింహారావు, గుంటూరి పెద్దిరాజు, ఎ.చల్లారావు, బొక్కా రాధాకృష్ణతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.మరి ఇది.. సీబీఎన్ ట్యాక్సా? లోకేశ్ ట్యాక్సా?నాడు ఆక్వా ఫీడ్ కొంచెం పెరిగితే అది జగన్ ట్యాక్స్ అని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు చాలా దారుణంగా రేట్లు పెంచారు. మరి ఇది ఏ ట్యాక్స్? ఎవరికి పోతోంది? ఈరోజు మీరు (ఆక్వా రైతులు) నన్ను కలుస్తున్నారని తెలియడంతో ఆక్వా సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులు తాము ధర ఎందుకు పెంచాల్సి వచ్చిందో చెబుతూ పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఇప్పుడు అంతా సిండికేట్గా మారారు. అంతా కూడబలుక్కుని ఇష్టానుసారం రేట్లు పెంచారు. చేపలవేట నిషేధ సమయంలో ధరలు సమీక్షిస్తున్నారు. ఆ సాకు చూపి ఫీడ్ రేటు పెంచుతున్నారు. అది సరైన విధానం కాదు. ఫిషరీ సంపద ఎక్కువగా ఉన్నప్పుడు సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి. ఆక్వా ఫీడ్, సీడ్ రంగంలో సహకార వ్యవస్థ వస్తే ఇలా సిండికేట్గా మారడం, దోపిడీ చేయడం సాధ్యం కాదు. మనం డెయిరీ రంగంలో అమూల్ను తీసుకురావడం వల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరిగింది. అంతకు ముందు ప్రభుత్వంలో సిండికేట్ కావడం వల్ల ఆక్వా రైతుల పరిస్థితి దారుణంగా మారింది. మన ప్రభుత్వం రాగానే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేయడంతో పాటు వారికి తోడుగా నిలిచేలా ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సాగు అభివృద్ధి సంస్థ’ (అప్సడా) ఏర్పాటు చేశాం. ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్–2020 అమలు చేసి ఆక్వా కంపెనీలు రైతులకు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ‘అప్సడా’ను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో అప్సడా ఆమోదం, అనుమతి లేకుండా ఫీడ్ ధరలు దారుణంగా పెంచారు. వనామీ ఫీడ్పై కేజీకి రూ.10, టైగర్పై కేజీకి రూ.12 చొప్పున పెంచారు. మరి ఇప్పుడు ఏ ట్యాక్స్ పడింది? సీబీఎన్ ట్యాక్సా? లోకేశ్ట్యాక్సా? వెంటనే పెంచిన ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి.బాబు బంధువులే ఉత్పత్తిదారులుటీడీపీ కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి శాపంలా మారింది. పీఎఫ్ ఫ్యాక్టర్తో ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ ఎత్తివేసే కుట్ర జరుగుతోంది. గతంలో ఆక్వాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందలేదు. మీరు (వైఎస్ జగన్) వచ్చాకే విద్యుత్ సబ్సిడీతో పాటు అప్సడా ఏర్పాటు ద్వారా ఆక్వా రంగాన్ని నిలబెట్టారు. ఇప్పుడు ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో ఉంది. చంద్రబాబు బంధువులే ఆక్వా సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులు. అందుకే ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడుజీవామృతంలా అప్సడా ఏర్పాటుఆక్వా రైతులకు జీవామృతంలా వైఎస్ జగన్ ‘అప్సడా’ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అప్సడాను బైపాస్ చేసి ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. వేట నిషేధ సమయంలో ఫిష్ మీల్ రేట్లు పెరుగుతాయి. దాన్ని బూచిగా చూపించి రేట్లు పెంచుతున్నారు. ఫీడ్ కంపెనీలకు సపోర్టు వ్యవస్థ ఉన్నప్పటికీ రైతులను దోచుకు తింటున్నారు. తద్వారా రైతులు రూ.10 వేల కోట్లు నష్టపోతున్నారు. రైతులను దోచుకునే విధానాలకు ముగింపు పలకాలి. కోవిడ్ సమయంలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత సమర్థంగా వ్యవహరించింది. లోకల్ మార్కెట్ పెంచడానికి ఫిష్ ఆంధ్రా కార్యక్రమం చాలా ఉపయోగపడింది. – ఐపీఆర్ మోహన్రాజు, భీమవరంఫిబ్రవరి నుంచి రెండుసార్లు పెంచారుఆక్వా ఫీడ్ ధర ఫిబ్రవరిలో టన్నుకు రూ.4 వేలు పెంచారు. మళ్లీ ఈనెల 13న రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. వంద కౌంట్ రొయ్యలకు పెట్టుబడి ఖర్చు రూ.275 అయ్యింది. నెల క్రితం వరకూ రూ.250కు కొనుగోలు చేశారు. ఫీడ్ ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో ఇప్పుడు రూ.225కు తగ్గించేశారు. నాడు వైఎస్ జగన్ రాకముందు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాడు కరెంట్ సబ్సిడీ రూపాయిన్నరకు ఇవ్వడంతో రైతులు పండుగ చేసుకున్నారు. – జి.శ్రీనాథ్రెడ్డి, నెల్లూరు జిల్లాకోవిడ్లోనూ సరుకు అమ్ముకున్నాంవైఎస్ జగన్ ఆక్వా రైతులకు అప్సడా ద్వారా రక్షణ కవచం ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయంలో మా పంట ఎవరూ కొనకపోతే జగన్ ప్రభుత్వం దగ్గరుండి కొనుగోలు చేయించింది. ప్రాసెసింగ్ ప్లాంట్ల సిండికేట్ ఆగిపోయింది. సీడ్ కారణంగా రైతులు నష్టపోతే సంబంధిత కంపెనీలను పిలిపించి మళ్లీ సీడ్ ఉచితంగా ఇప్పించారు. అంతర్జాతీయ కంపెనీ సీపీఎఫ్ ఛైర్మన్నే రాష్ట్రానికి రప్పించి ఫీడ్ ధరలు తగ్గించారు. ఫిబ్రవరిలో అప్సడా అనుమతి లేకుండా కంపెనీలు సిండికేట్ అయ్యి ఫీడ్ రేట్లు పెంచాయి. మళ్లీ మే 11న ఫీడ్ ధరలు పెంచారు. రైతుల అభ్యంతరాలను పట్టించుకోలేదు. వైఎస్ జగన్ తెచ్చిన చట్టాన్ని గట్టిగా అమలు చేయాలి. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి. మేం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాం. – దుగ్గినేని గోపినాథ్, ప్రకాశం జిల్లాసబ్సిడీని దూరం చేసే కుట్ర..ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీవో నంబర్ 169 కాలమ్ నెం:4లో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) గురించి ఉంది. పవర్ ఫ్యాక్టర్ పేరుతో రైతులకు సబ్సిడీని దూరం చేసే కుట్ర చేస్తున్నారు. నిర్దేశించిన పీఎఫ్ రావాలంటే కెపాసిటర్లు పెట్టుకోవాలి. అవి ఏర్పాటు చేసుకోవాలంటే ఎకరాకు రూ.లక్షన్నర ఖర్చు అవుతుంది. ఎకరా లీజు రూ.లక్ష నుంచి లక్షన్నర అవుతుంది. సీడ్ రూ.యాభై వేలు అవుతుంది. రెండు టన్నుల మేత అవసరం. మొత్తానికి ఎకరా సాగుకు రూ.5 లక్షలు అవుతుంది. రైతులపై విపరీతమైన భారం పడుతోంది. – సీహెచ్ కుమారదత్తాత్రేయ వర్మ, పాలకొల్లుసొంత మనుషుల కంపెనీలకు వత్తాసుడాలర్ విలువ రూ.90 అయినా ఆక్వా రైతుకు రేటు రూ.240 దాటడం లేదు. డాలర్ విలువ రూ.40 ఉన్నప్పుడు వనామీ రేటు రూ.300 పలికేది. కరెంట్ సబ్సిడీ బూచిగా చూపించి ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. సొంత మనుషుల కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారు. ఫీడ్ రేట్లు పెంచుకోవడానికి వారికి అనుమతి ఇస్తున్నారు. – ప్రసాదరాజు, పశ్చిమ గోదావరి జిల్లాథాయ్లాండ్ విధానాలు అనుకూలం థాయిలాండ్లో ఆక్వా సాగు బాగుంది. అక్కడి విధానాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయి. వాటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, మన రాష్ట్రంలోనూ అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – రాజ్కుమార్ప్రభుత్వం నిద్రపోతోంది..ఆక్వా కంపెనీలు ముంబై మాఫియాలా నడుస్తున్నాయి. సీజన్ చూసి రేట్లు తగ్గించేస్తున్నారు. ప్రభుత్వం నిద్రపోతోంది. ఆర్నెల్ల క్రితం ముడిసరుకు రేట్లు తగ్గినప్పుడు కిలోకు రూ.4 తగ్గించామని చెబుతున్నారు. కాని దాన్ని డీలర్ కమీషన్ తగ్గించినట్టు చూపించారు. క్రాప్ హాలిడే ఇస్తే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తుప్పుపట్టిపోతుంది. – పెద్దిరాజు, పశ్చిమ గోదావరి జిల్లాఆక్వాకు జగన్ తోడుగా నిలబడాలిగత ప్రభుత్వంలో రైతులకు తోడుగా నిలబడ్డారు. ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీడ్, సీడ్ ఇచ్చేవి అవే కంపెనీలు. ప్రాసెసింగ్ ప్లాంట్లూ వారివే. పంట వేసినప్పుడు మంచి రేటు ఆశ చూపిస్తున్నారు. తీరా పంట చేతికి వచ్చే సరికి రేట్లు దించేస్తున్నారు. నర్సాపురంలో మీరు ఫిషరీస్ యూనివర్శిటీ మంజూరుచేశారు. ఇప్పుడు పనులు ముందుకు పోవడంలేదు. ఆక్వాకు జగన్ మరింత తోడుగా నిలబడాలి. – జి.నారాయణమూర్తి, మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లామిమ్మల్ని ఓడించినందుకు ఇలా..ఆక్వా రైతులు దీన పరిస్థితుల్లో ఉన్నారు. మిమ్మల్ని ఓడించినందుకు మాకు ఇది శాపంలా తగిలింది. ఆక్వా రైతులకు మీరు అండగా నిలబడ్డారు. బలమైన వ్యవస్థలు ఏర్పాటు చేసి రైతుకు మద్దతుగా నిలబడ్డారు. ఇప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందినవారివే ఫీడ్, సీడ్. ఆక్వాపై ఆధారపడ్డ వారి జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. – జయకృష్ణంరాజు, ఉండిఆక్వా సంక్షోభంతో ఉపాధికి గండిఆక్వా సాగు సంక్షోభంలో ఉంటే ఉపాధి తగ్గిపోతుంది. ప్రభుత్వానికి రెవిన్యూ తగ్గిపోతుంది. కరెంటు సబ్సిడీని పీఎఫ్కి లింకు చేయడం అన్యాయం. కరోనా సమయంలో కూడా గత ప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది. కనీస మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేశారు. ఆ రోజు జగన్ చర్యలు తీసుకోకుంటే ఆక్వా రంగం కుదేలయ్యేది. – ధర్మరాజుజగన్ గళం విప్పితే.. పరిష్కారంనాణ్యమైన సీడ్ ఇవ్వడం లేదు. జగన్ గళం విప్పితే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు మేం ఇక్కడ మీటింగ్కు వస్తుంటే అక్కడ వేరే పార్టీ వాళ్లు ఆందోళనకు దిగారు. – నానిరాజు, అమలాపురంఫీడ్ కంపెనీలపై తిరగబడతాంఫీడ్ కంపెనీల మీద తిరగబడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక్క మాట చెబితే చాలు. మేం ధైర్యంగా పోరాడగలం. ఫీడ్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ఒకే వర్గం వారి చేతుల్లో ఉన్నాయి. దీంతో మాకు చాలా అన్యాయం జరుగుతోంది. – అండ్రాజు చల్లారావు, ఆప్కాబ్ మాజీ ఛైర్మన్ఆర్బీకేల ద్వారా పంపిణీవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా సర్టిఫికేషన్ చేసేవాళ్లు. ఇవాళ అందుకోసం ఎకరాకు రూ.5 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అప్పట్లో భూసార పరీక్షలు జరిగాయి. ఇప్పుడు జరగడం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్పుడు ఫీడ్ పంపిణీ జరగేది. ఇప్పుడు జరగడం లేదు. చిన్న, సన్నకారు రైతులు రోజువారీ కూలీలుగా మారిపోతున్నారు. – నరసింహారావు, ఆక్వా రైతు -
ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)పై నియోజకవర్గాల్లోని కో–ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలని, ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని, సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. సర్ ప్రక్రియపై చర్చిస్తూ.. ఈ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత, దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, తన అధికార దుర్వినియోగంతో ఏదో రకంగా వైఎస్సార్సీపీకి చెందిన ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, బూత్కు కనీసంగా 50 ఓట్లు తొలగించాలని చూస్తున్నారని ఎత్తిచూపారు. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు దీన్ని అడ్డుకోవాలని, ప్రతి ఓటునూ కాపాడుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సర్ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలని పార్టీ నేతలను ఆదేశించారు. -
‘అసలు సమస్యలు పక్కనపెట్టి ‘కూటమి’ డైవర్షన్ డ్రామా’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళల భద్రత, చిన్నారుల అదృశ్య ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు, పెరుగుతున్న అప్పులు, సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలు వంటి అసలు సమస్యలపై సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ కొత్త వివాదాలకు తెరలేపారని ఆక్షేపించారు.రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై చర్చ జరగకుండా దృష్టి మళ్లించడమే ఈ రాజకీయ రచ్చ వెనుక ఉద్దేశమని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రెస్మీట్లో వీరశేఖర్రెడ్డి ఏమన్నారంటే..అప్పుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డుఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ప్రభుత్వంపై రాష్ట్రం రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పుల్లో ఉందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేశారు. కేవలం జూన్ నెల తొలి 15 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిది. మరోవైపు కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైయస్ జగన్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లి, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, మెడికల్ కాలేజీలు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించింది.ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సూడాన్, సోమాలియా వంటి నిరుపేద దేశాల కంటే దారుణంగా తయారైంది. ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోంది. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందడం లేదు. చేయూత, చేదోడు వంటి సంక్షేమ పథకాలు అటకెక్కాయి. రైతులకు మద్దతు ధర లేదు.. రైతు భరోసా లేదు.రాష్ట్ర ఆదాయం ఆవిరివైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో తలసరి ఆదాయం, జీఎస్డీపీ, జీఎస్టీఎన్ వసూళ్లు, పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ వృద్ధి, సేవారంగ వృద్ధి గణనీయంగా పెరిగాయి. కానీ నేడు ఆ ప్రగతి కనిపించడం లేదు. సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, రాష్ట్ర సంపదనే ఆవిరి చేస్తున్నారు. క్వార్ట్జ్, మట్టి, ఇసుక, మద్యం, సిలికా, భూములు అన్నింటినీ టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు దారి మళ్లిపోవడంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది.మద్యం ఏరులై పారుతున్నా రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోపిడీ చేస్తున్నారు. కూటమి పాలనలోనే రాష్ట్రం దివాళా దిశగా వెళ్తోందని కాగ్ లెక్కలే చెబుతున్నాయి. సంక్షేమ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఈ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్న నిరంకుశ ధోరణితో పాలన సాగుతోంది.గాడితప్పిన శాంతి భద్రతలురాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో హోంమంత్రి అనిత అసెంబ్లీలో ఇచ్చిన సమాధానమే చెబుతోంది. గంటకు ముగ్గురు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె స్వయంగా వెల్లడించారు. ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు వారం రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. విజయవాడలో సాయికృష్ణ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. రాప్తాడులో మైనర్ బాలికపై అత్యాచారం, గుంటూరులో టీడీపీ నేతల ఆగడాలు, మహిళలపై వేధింపుల ఘటనలపై మౌనం పాటిస్తున్న ప్రభుత్వం.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను మాత్రం రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తోంది.'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యా?రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, బడుగు బలహీన వర్గాల భద్రత కంటే హోంమంత్రిపై చేసిన 'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యగా చూపించడం దురదృష్టకరం. టీడీపీ, జనసేన నేతలు గతంలో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మరిచి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. అసలు సమస్యలపై సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. నా కూతురు ఎక్కడ? నా కొడుకు ఎక్కడ? అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ రచ్చ చేయడం మానుకోవాలి. ఈ కీచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలే తగిన తీర్పు ఇస్తారు అని వీరశేఖర్రెడ్డి హెచ్చరించారు. -
‘ప్రజల ప్రాణాలంటే బాబు సర్కార్కు లెక్కే లేదు’
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో 16 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఘటనపై ప్రభుత్వ స్పందన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కల్తీ పాల ఘటనపై ఇప్పటివరకు పూర్తి నివేదిక ఇవ్వలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మార్గాని భరత్ విమర్శించారు. ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.బాధిత కుటుంబాలను పరామర్శించే తీరిక లేదా?రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి కూడా బాధితులను కలవలేదు. ఇదే ఘటనలో చికిత్స పొందుతున్న చిన్నారి రుహానియా పూర్తిగా కోలుకోలేదు. మొదట పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన అధికారులు తర్వాత డిశ్చార్జ్ చేయాలని ఒత్తిడి చేయడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కల్తీ పాల ఘటనపై ఇప్పటికీ పూర్తి నివేదిక కూడా ఇవ్వలేదు.ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలిమీకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా చంద్రబాబు? గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 26 మంది చనిపోతే అది భక్తుల అత్యుత్సాహం వల్లే అని నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పించుకోవడానికి ప్రజలపై నెపం మోపారు. మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్లో పిరియాడిక్ చెకప్ జరగాలని వైయస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. కల్తీ పాల ఘటనలో బాధిత కుటుంబాలకు ఇచ్చిన రూ.10 లక్షల పరిహారం తక్కువ, వెంటనే దాన్ని రూ.20 లక్షలకు పెంచాలి. భవిష్యత్తులో చికిత్స ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలి. ఈ ఘటనలో బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం” అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు.ఎవరూ పట్టించుకోవడం లేదు: రితిక్ తండ్రి లవ్రాజుకల్తీ పాలు తాగి మా బాబు రితిక్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం. మొదటి మూడు రోజులు కలెక్టర్, అధికారులు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత మా బాబును ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించమని స్థానిక ఎమ్మెల్యేను కలిస్తే కలెక్టర్ను కలవమన్నారు. ఎవరూ మాకు న్యాయం చేయలేదు. ఎవరూ పట్టించుకోలేదు.ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి: రుహానియా తండ్రి రాకేష్ఫిబ్రవరి 16వ తేదీన మా పాప కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైంది. 17వ తేదీన ఆసుపత్రిలో చేర్పించాం. రెండు ఆసుపత్రుల్లో కలిపి మాకు రూ.3.50 లక్షల వరకు ఖర్చు అయింది. తర్వాత రాజమండ్రి రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేర్పించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చికిత్స జరుగుతోంది. మా పాప కిడ్నీ ట్యూబ్స్ ఇంకా పూర్తిగా రికవరీ కాలేదు. కానీ పాపను డిశ్చార్జ్ చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అధికారులను కలిస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలుగు నెలలుగా డాక్టర్లు కృషి చేసి మా పాపను బతికించారు. ప్రభుత్వం మొదట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లిఖితపూర్వకంగా భరోసా ఇవ్వాలి. ఇవాళ మాజీ ఎంపీ మార్గాని భరత్ ద్వారా వైఎస్ జగన్ను కలిశాం. ఆయన మాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు” అని రాకేష్ తెలిపారు. -
వైఎస్ జగన్ను కలిసిన రాజమండ్రి కల్తీ పాల బాధితులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమండ్రి కల్తీ పాల బాధితులు ఇవాళ(మంగళవారం) కలిశారు. గత ఫిబ్రవరిలో కల్తీ పాలు తాగి తమ పిల్లలు అనారోగ్యానికి గురైన విషయాన్ని వైఎస్ జగన్కు తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మూడు రోజులు హడావుడి చేసి ఆపై పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా నిలుస్తామని వైఎస్ జగన్ తెలిపారు. -
‘సర్’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పార్టీ సీనియర్ నాయకులతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ‘సర్’ జరుగుతున్న తీరు, అక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. ఈ నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు రోజూ సమీక్ష చేయాలన్న వైఎస్ జగన్.. ఏదో రకంగా వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు.‘‘అధికార దుర్వినియోగంతో ఓట్లు తీసివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి బూత్కు 50 వైయస్సార్సీపీ ఓట్లు తీసేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు దీన్ని అడ్డుకోవాలి. ప్రతి ఓటునూ కాపాడుకోవాలి. ‘సర్’పై నియోజకవర్గాల్లోని కో-ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ‘సర్’ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి. ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయలి..అప్పటికీ సమస్య పరిష్కారంకాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకు రావాలి. సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దు. సర్ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుంది. ప్రతి నియోకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత అవసరం. నిరంతరం సమీక్షలు నిర్వహించాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు. -
పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారు?: గడికోట శ్రీకాంత్ రెడ్డి
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో సాధించింది ఏమీ లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు.‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. ఎమ్మెల్యేలే జనం ఇళ్లపైకి వెళ్లి దాడులు చేస్తున్నారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. అధికార పార్టీ నేతల చెప్పుచేతుల్లో పోలీసులు పని చేయటం సిగ్గుచేటు. ఎమ్మెల్యే చింతలపూడి ప్రభాకర్ రౌడీయిజం చేయటం దుర్మార్గం. ఇలాంటివి జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? పైగా బాధితుడి మీదే కేసు పెడతారా? ప్రశ్నిస్తాననే పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారు? రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే ఢిల్లీ వెళ్లి మీటింగులు పెట్టటం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి మంచోడట, కాంగ్రెస్ అంతుచూస్తాడట. లాలూచీలకు అలవాటు పడిన పవన్ ఇంతకంటే ఇంకేం మాట్లాడుతారు? విజయవాడకు చెందిన సాయికృష్ణను పోలీసులు లాకప్ లో చంపేశారు. అతన్ని వెతుకుతున్నామంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యవస్థలను ఇంతగా దిగజార్చుతారా? హోంమంత్రి అనిత ఒక మహిళ అయి ఉండి మహిళలకు రక్షణ కల్పించలేరా? పసిపిల్లలు తప్పి పోయినా తెలుసుకునే పరిస్థితి లేదు. నియంత దేశాల్లో కూడా ఇలాంటి పోకడలు లేవు’’ అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. -
చంద్రబాబు సర్కార్ గుట్టు రట్టు..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభలో ప్రసంగించిన నేతలలో ఏదో తెలియని భయం వెన్నాడుతున్నట్లు అనిపిస్తే, వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన నిరసనలలో ఉత్సాహం, తెగింపు కనిపిస్తాయి. కూటమి నేతలు తమ ప్రసంగాలలో సాధించిన విజయాల గురించికన్నా మాజీ సీఎం జగన్ను దూషించడానికి, ద్వేషించడానికే ప్రాధాన్యం ఇచ్చారు.గత ప్రభుత్వం విధ్వంసం చేసిందంటూ ఒక పడికట్టు పదాన్ని పదే, పదే చెప్పి జనాన్ని నమ్మించడానికి యత్నం చేశారే తప్ప, ఏ రకమైన విధ్వంసమో వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు. అదేమంటే ప్రజావేదికను గత ప్రభుత్వం కూల్చడాన్ని ఆయన ఉదహరించారు. ఇది పాడిందే పాడరా అన్న చందంగా ఉంది తప్ప ఒక పాలకుడు చెప్పదగిన మాటగా కనిపించదు.నదీ గర్భంలో ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేపడితే అది సరైన విధానం కాదని ప్రజావేదిక పేరుతో ఉన్న ఒక షెడ్ను గత ప్రభుత్వం కూల్చింది. ఆ మాటకు వస్తే కృష్ణానది తీరాన అక్రమం నిర్మించిన భవనాలలో చంద్రబాబు, కీలక మంత్రి లోకేష్లతో పాటు పలువురు పలుకుబడి కలిగినవారు నివసించడం ఏ రకంగా చట్టబద్దమో ఇన్నేళ్లలో వివరించలేకపోయారు.అమరావతి గ్రామాలలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ చంద్రబాబు ఎదురు జగన్పై ఆరోపణలు చేయడం అర్ధరహితంగా కనిపిస్తుంది. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు అంటూ రాజమండ్రి, యలమంచిలి మొదలైన చోట్ల పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేసింది. కాని ఉండవల్లిలో కరకట్ట అక్రమ కట్టడంలో ఆయన ఎలా నివసిస్తున్నారో అర్థం కాదు. చంద్రబాబు మాట్లాడిన విషయాలలో ఎన్ని అసత్యాలు ఉన్నాయో చూడండి. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు స్పీచ్కి ఎల్లో మీడియా హెడింగ్ పెట్టింది.అందులో నిజం ఉంటే సంతోషించవచ్చు. కాని ఏది విధ్వంసం, ఏది వికాసం అన్నదానిపై ముందుగా చంద్రబాబు క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తేవడం, నాలుగు ఓడరేవులు నిర్మించడం, ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రిని నిర్మించడం, గ్రామ, గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం వంటివి నిర్మించడం విధ్వంసం ఎలా అవుతుంది? మెడికల్ కాలేజీలను, పోర్టులను, ఆర్టీసీ బస్టాండ్లను, ఏవి వీలైతే వాటన్నిటిని ప్రైవేటువారికి అప్పగించడాన్ని కదా విధ్వంసం అనాల్సింది. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయయడాన్ని మాట నిలబెట్టుకున్నట్లని అంటారు. అది 95 శాతం వైఎస్ జగన్ చేసి చూపించారు.మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నారు? ఒక్కటి, అరా తప్ప, ఏదైనా స్కీమ్ ను నిక్కచ్చిగా అమలు చేశామని చెప్పే పరిస్థితి లేదు. అన్ని చేసేశామని బుకాయించడంలోనే వీరి బలహీనత కనిపిస్తుంది. జగన్ యువత భవిష్యత్తును దెబ్బతీశారట. ఆయన టైమ్లో లక్షన్నర ఉద్యోగాలు ఏకకాలంలో ఇస్తే అది భవిష్యతుత్తు ఇచ్చినట్లు కాదన్నది చంద్రబాబు అభిప్రాయమా? కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మెగా డీఎస్సీ అంటూ హడావుడి చేశారు కాని, అందులో జరిగిన అక్రమాలపై జగన్ వీటిపై సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక ఎదురుదాడి చేస్తున్నారు.తనకు నోటీసులు ఇవ్వకుండా 53 రోజులు జైలులో ఉంచారని ఆయన అన్నారు. స్కిల్ స్కామ్పై కోర్టులో విచారణ జరగకుండా ఇప్పుడు ఎందుకు మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్ పేరుతో కేసును ఎలా ఉపసంహరించుకుంది కూడా చెబితే బాగుండేది కదా! అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పిన చంద్రబాబు దాదాపు ఏభై వేల కోట్ల అప్పు తీసుకువచ్చి ఒకేచోట ఖర్చుచయడాన్ని, కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు ఆరువేల లోపు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 17 వేల నుంచి ఇరవై వేల వరకు వ్యయం చేయడం వల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయా?లేదా? అన్నది చేస్తున్నది వివరించాలి కదా!ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీపై నిధులు లేవని చేతులు ఎత్తివేయడం సరైనదేనా? సంపద సృస్టించడం తెలుసునని ఎన్నికల ముందు కొట్టిన గప్పాలన్నీ అబద్దాలనేనని ఒప్పుకుంటారా? ఈ స్కీమ్ను అమలు చేయలేదన్న నిజాన్ని ఎంతో కొంత ఒప్పుకున్నందుకు సంతోషించాలి. మామూలుగా అయితే సూపర్ సిక్స్ అన్నీ చేసేశాం అంటూ చెబుతుండడం అసత్యమేనని అంగీకరించారన్నమాట. టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని అని అన్నారు. మరి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేని ఎందుకు కొనసాగిస్తున్నారు?ఇరాన్ యుద్దంతో మామిడి, అరటి తదితర పండ్ల ధరలు పడిపోయాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని అన్నారు. గతంలో కరోనా వచ్చినప్పుడు జగన్ ఈ రైతులను ఎలా ఆదుకుంది తెలియదా? అయినా తాను ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లు అంటూ స్పీచ్లు ఇచ్చింది చంద్రబాబే కదా! మరి ఇప్పుడు యుద్దం వస్తే రైతులను ఎలా ఆదుకోవాలో తెలియకపోతే ఆయన సీనియారిటీ ఏమైనట్లు? పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గిస్తామని చెప్పిన కబుర్లు అన్నీ అబద్దాలేనని ఒప్పుకుంటున్నారా? గత ప్రభుత్వంలో పది లక్షల కోట్ల అప్పు జరిగిందని చెప్పడం అబద్దమా? నిజమా? అన్నది చంద్రబాబుకు తెలియదా?వైఎస్ జగన్ టైమ్లో కరోనా ఉన్నప్పటికీ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ఈ రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పు ఎలా చేశారో చంద్రబాబు చెప్పాలి కదా!ఎంతసేపు బురద వేయడమేనా? వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు, లోకేష్లు వ్యాఖ్యానించడంపై సజ్జల, కొడాలి నాని ఇచ్చిన కౌంటర్కు వీరు సమాధానం ఇవ్వలేకపోయారు. తమది పరశురాముడి గొడ్డలి అని, అవినీతి కూటమి ప్రభుత్వాన్ని గొడ్డలి కూకటి వేళ్లతో పెకలిస్తుందని వారు ధైర్యంగా చెప్పారు.టీడీపీ వెన్నుపోటు పార్టీ అన్న విమర్శను చంద్రబాబు, లోకేష్ లు తిప్పికొట్టలేకపోయారు. తమది వెన్నుపోటు పార్టీ అని చెప్పలేరు. అలాగని వెన్నుపోటు పొడవలేదని వాదించలేని నిస్సహాయ స్థితి కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వంతు అబద్దాలతో పాటు కులం, మతం వద్దని, భారతీయత ముఖ్యమంటూ నీతులు చెప్పే యత్నం చేశారు. కాని ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎంతగా కుల, మత, విద్వేషాలు రేకెత్తించింది ప్రజలకు తెలియదా! లోకేష్ తన స్పీచ్లో జగన్పై అమర్యాదకర వ్యాఖ్యలు చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.ఎందుకంటే గతంలో నార్నె శ్రీనివాసరావు, కోలా కృష్ణమోహన్లు ఆయనపై చేసిన ఆరోపణల వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వైఎస్ జగన్పై అనవసర వ్యాఖ్యలు చేసి.. ఈ సమస్య తెచ్చుకోవడం లోకేష్కు ప్రయోజనమా? అవి ప్రచారంలోకి రావడం లోకేష్ కు ప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. విమర్శలలో హుందాతనం ఉండాలి. సంస్కారయుతంగా ఉండాలి. కాని చంద్రబాబు మాదిరి ఏదిపడితే అది మాట్లాడితే సరిపోతుందని అనుకుంటే లోకేష్ పొరబడుతున్నట్లే. కాలం మారిందన్న సంగతి గుర్తించకపోతే ఆయనకే నష్టం.రెడ్బుక్ గురించి ప్రస్తావించి ఏపీలో ఎంత అరాచక పాలన సాగుతోందో లోకేష్ గుర్తు చేసినట్లయింది. కాగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ధైర్యంగా ప్రభుత్వం అణచివేత చర్యలను ఎదుర్కుంటూ నిరసనలు తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ నినదించడానికి ఎక్కడా వెనుకాడలేదు. కూటమి సభలో జనం చాలావరకు మొక్కుబడిగా ఉన్నట్లు కనిపిస్తే, వైఎస్సార్సీపీ క్యాడర్ హోరెత్తించినట్లు అనిపిస్తుంది. కూటమి ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ప్రస్తావించి వాటిని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా పచ్చి అబద్ధాల ప్రచారం, మోసం, కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్బుక్ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు.వైఎస్ జగన్కు, చంద్రబాబుకు ఉన్న ఒక తేడా స్పష్టంగా కనిపించింది. వైఎస్ జగన్ తన మానిఫెస్టోని సచివాలయంలో తన ఎదుట పెట్టుకున్నారు. అధికారులకు ఇచ్చి అమలు చేయాలని ఆదేశించారు. చంద్రబాబేమో ఆ మానిఫెస్టోని, ఎన్నికలలో ఇచ్చిన బాండ్ల గురించి ఎన్నడూ ప్రస్తావించినట్లు కనబడదు. తిరుపతి సభకు హెలికాఫ్టర్ లో వస్తూ చదువుకున్నారట! ఎన్ని అబద్ధపు వాగ్దానాలు ప్రకటించి, ప్రజలను మభ్య చేసింది గుర్తు చేసుకుని నవ్వుకుని ఉండాలి. గత ఎన్నికలలో ప్రజలు విజ్ఞత ప్రదర్శించారని ఆయన అన్నారు కానీ.. ఏభై లక్షల మాయ ఓట్లు పోలైన సంగతిని పదే, పదే చెబుతున్న ప్రముఖ మేధావి, చంద్రబాబు వద్ద సలహాదారుగా గతంలో పనిచేసిన పరకాల ప్రభాకర్ ఆరోపిస్తున్న అంశంపై మాత్రం నోరు మెదపలేకపోతున్నారు.ఈ నేపథ్యంలోనే కూటమిలో విజయోత్సవ సంరంభం పెద్దగా కనిపించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్సీపీ ప్రజలలో దూసుకువెళ్లడానికి వెన్నుపోటుకు రెండేళ్ల నిరసనను వాడుకుందని చెప్పాలి. ప్రజలలో ఏర్పడుతున్న అసంతృప్తిని ఎలా తగ్గించాలో తెలియక కూటమి తికమక పడుతుంటే, జనం తమవైపు చూస్తున్నారన్న ఉత్సాహం వైఎస్సార్సీపీలో తొణికిసలాడుతోంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు సర్కార్కు వైఎస్ జగన్ అల్టిమేటం
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు సర్కార్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరల్ని ఈ నెలాఖరులోగా తగ్గించాలని.. లేకుంటే జులై 1, లేదా 2న ఆక్వా రైతుల తరుఫున పోరాటం చేస్తామన్నారు. తాను కూడా ఆక్వా రైతులకు మద్దతుగా వెళ్తానని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) వైఎస్ జగన్తో ఆక్వా రైతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్ పాలనతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వైఎస్ జగన్కు వివరించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, ఆక్వా రైతులు దారుణమైన స్థితిలో ఉన్నారని.. రైతులు, ఆక్వా రైతులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ హయాంలో మంచి ఆలోచనలు చేశామన్నారు. ‘‘రైతులు చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థలో భాగంగా ఆర్బీకేలను అందుబాటులోకి తీసుకొని వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేలకుపైగా ఆర్బీకేలను తీసుకొచ్చాం. రాష్ట్రంలో వ్యాప్తంగా 10వేలకుపైగా ఆర్బీకేలు తీసుకు వచ్చాం. ఆక్వా రైతులకు తోడుగా 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబులు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను పెట్టాం. అప్సడా చట్టాన్ని సైతం తెచ్చాం. ముఖ్యమంత్రేనే అప్సడా ఛైర్మన్గా చేశాం. రైతులకు నష్టం రాకుండా సిండికేట్కు స్థానం లేకుండా చేశాం. రూపాయిన్నరకే యూనిట్ కరెంటును సబ్సిడీపై ఇచ్చాం. మన ప్రభుత్వమే ఇవ్వగలిగిందని గర్వంగా చెప్తున్నా. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశాం. అలా 57 నెలల్లో రూ.3,306 కోట్లు విద్యుత్ సబ్సిడీ కింద చెల్లించాం. 2014-19 మధ్య చంద్రబాబు యూనిట్కు రూ.3.82లు వసూలు చేసేవాడు.మనం పాదయాత్రలో ఉనప్పుడు చివరి ఆరునెలల్లో యూనిట్కు రూ.2లకు ఇస్తానని ఒక జీవో విడుదల చేశాడు. కాని అక్కడ కూడా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. చివరకు చంద్రబాబు కట్టాల్సిన బకాయిలు రూ.340 కోట్లు కూడా మనమే కట్టాం. చిత్తశుద్ధితో మనం చేసిన కార్యక్రమాల వల్ల ఆక్వా రంగం నిలదొక్కుతుంది.చంద్రబాబు హయాంలో 2018–19లో 38 లక్షల టన్నులు ఉన్న రొయ్య, మత్స్య ఉత్పత్తులు 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. 2021-22,2022-23లో రెండుసార్లు బెస్ట్ మెరైన్ అవార్డులు వచ్చాయి. ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచితే, మూడు సార్లు ఉప సంహరించుకునేలా చేశాం.చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే.. 2022–23లో రూ.19.847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. మన ప్రభుత్వ చిత్తశుద్దికి ఇదే నిదర్శనం. ఫిషరీస్ యూనివర్శిటీ ద్వారా ఆక్వాసాగుకు నిపుణులను తయారుచేసేలా ఏర్పాటు చేశాం. క్లాసులు కూడా మొదలు పెట్టించాం. చంద్రబాబు మిగిలిన పనులు చేయకుండా విడిచిపెట్టారు. ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాససింగ్ యూనిట్లు అన్నీ చంద్రబాబు సానుభూతిపరులవే. సిండికేటై పంట చేతికి అందేనాటికి రేట్లు తగ్గించేస్తున్నారు.ఫిబ్రవరిలో ఫీడ్ రేట్లు కిలో రూ.4 పెంచారు. జూన్లో మరో రూ.10, రూ.12 పెంచారు. ఈ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధిచెప్పాల్సిందేనని’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
నాడు ఆరోగ్య బీమాలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించడంతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2023–24 స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో 60.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించగా, ఆంధ్రప్రదేశ్లో 91.9 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించినట్లు సర్వే పేర్కొంది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాలు ఇంత పెద్ద సంఖ్యలో కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించలేదని సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్లో మాత్రమే 90.5 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించినట్లు సర్వే తెలిపింది.ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైఎస్ జగన్ అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కటుంబాలకు ఆరోగ్యానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వార్షికాదాయ పరిమితిని పెంచారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రంలోని 91.9 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కలిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 95.1 శాతం కటుంబాలకు, పట్టణాల్లో 85.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించినట్లు సర్వే పేర్కొంది. -
చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైనట్టో?
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ నేటికీ తెలియరాలేదు. చిన్నారి అదృశ్యమై సోమవారానికి పదోరోజు కావడం గమనార్హం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ టీమ్, ఫారెస్టు, పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగించాయి. సాయంత్రం నాలుగు గంటలకు భారీ వర్షం కురవడంతో గాలింపు చర్యలకు కొంత అంతరాయం ఏర్పడింది.ఆయిల్పామ్ తోటలో పచ్చిగడ్డి తొలగిస్తే ఏమైనా ఆనవాళ్లు లభిస్తాయేమోనని గడ్డి తొలగిస్తున్నారు. పెద్దాపురం డీఎస్పీ ఘటనా స్థలంలో ఉండి గాలింపు చర్యలను సమీక్షిస్తున్నారు. అనుమానితులను, సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా స్థానికులను, అటుగా రాకపోకలు సాగించిన వ్యక్తులను వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. తమ కుమార్తె క్షేమంగా ఇంటికి వస్తుందన్న ఆశతో తల్లిదండ్రులు, బంధువులు ఎదురు చూస్తున్నారు. థర్మల్ డ్రోన్ల ప్రవేశంఅటవీ ప్రాంతంలో జంతువుల కదలికలను గుర్తించేందుకు ఫారెస్టు అధికారులు «థర్మల్ డ్రోన్లు, ట్రాకర్లను వినియోగించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కాకినాడ రేంజర్ శ్రీదీప్తి ఆధ్వర్యంలో శ్రీశైలం నుంచి వచ్చిన హనుమాన్ టీమ్, ఫారెస్టు అధికారులు నాలుగు ప్రదేశాల్లో ట్రాకర్లు అమర్చారు. మరోపక్క పెంపుడు కుక్కకు పోస్టుమార్టం నివేదిక వచ్చేందుకు వారం రోజులు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ నివేదికపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.కిడ్నాప్ కోణంలో లభించని ఆధారాలుకాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గ్రామాన్ని పరిశీలించి, చిన్నారి తల్లిదండ్రులైన సుంకర గణేష్ , భవానీని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిన్నారి కిడ్నాప్కు గురైందనేందుకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని చెప్పారు. పెంపుడు కుక్క మరణంపై వస్తున్న అనుమానాలపై విచారణ జరుగుతోందన్నారు. చిన్నారి ఆచూకీని గుర్తించేందుకు అన్ని కోణాల్లోనూ ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలతో జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు, బంధువుల్లో మరింత ఆందోళన, అభద్రతా భావాన్ని పెంచుతున్నారన్నారు. ప్రజలు, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించి, అధికారిక సమాచారాన్ని చేరవేయాలన్నారు. -
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: గ్రేటర్ రాయలసీమ ప్రజల నీటి అవసరాలు గుర్తించి ఇప్పటికైనా రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్సీపీ రాయలసీమ నాయకులు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్టీ రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ కన్వీ నర్ సాకే శైలజానాథ్, సభ్యులైన పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కందుల నాగార్జునరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను శైలజానాథ్ మీడియాకు వెల్లడించారు. సీమ ప్రాజెక్టులపై చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం ‘‘రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిసినా, సీఎం చంద్రబాబు స్వార్థంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టడం హేయం. అమరావతి కోసం రాయలసీమ భవిష్యత్తును చంద్రబాబు ప్రశ్నార్థకం చేస్తున్నారు. సీఎం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ, కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులు నిరి్మస్తూ కృష్ణా నీటిని తరలించుకుపోతున్నారు. మాయమాటలతో గ్రేటర్ రాయలసీమ ప్రజలను వంచనకు గురి చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుందని గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల ద్వారా రోజూ 7 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర, ఆల్మట్టి ప్రాజెక్టులు పూర్తయితే కనీసం 130 టీఎంసీల నీరు ఆగిపోయే ప్రమాదం ఉంది.ఈ పరిస్థితుల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తే రాయలసీమ నీటి ఇబ్బందులకు పరిష్కారం చూపినట్టవుతుందని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు రూ.1000 కోట్లతో 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయాలని గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఆరు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి వివరించాం. కానీ వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే అక్కసుతో రెండేళ్లుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టేశారు.బనకచర్ల ప్రాజెక్టు పేరుతో గాల్లో లెక్కలు చెప్పి కాలయాపన చేస్తున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పణంగా పెడుతున్నాడు. గ్రేటర్ రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేయాలనే డిమాండ్తో ముందుకెళ్లాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి విడతలో అనంతపురం, నెల్లూరులోని ప్రాజెక్టులను సందర్శిస్తాం’’ అని శైలజానాథ్ తెలిపారు. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ‘‘రాయలసీమ రైతులకు చంద్రబాబు నుంచి భరోసా లభించడం లేదు. హార్టికల్చర్ హబ్గా ఉన్న ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడింది. నీళ్లు లేక చీనీ తోటలు ఎండిపోతున్నాయి. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సభలో వైఎస్ జగన్ని తిట్టడం తప్పితే, రెండేళ్లలో ఏం సాధించారో చెప్పుకోలేకపోయారు.దుబారా ఖర్చులను తగ్గించాలని పిలుపునిస్తూ ఆర్భాటపు సభలతో, జగన్ని దూషించడానికి పదుల కోట్లు ఖర్చు చేయడం అవసరమా?. రెండేళ్ల తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి పంగనామాలు పెట్టేశారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారు. స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగిన నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని రుజువైంది. కానీ ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పందించలేదు. కనీసం ఒక్క కొత్త పింఛన్ ఇచి్చన పాపాన పోలేదు. ఓటేసిన ప్రజల నమ్మకానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు’ అని శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
ఆర్టీసీ ఆస్తులపై చంద్రబాబు కన్ను
సాక్షి, అమరావతి/బస్డాండ్ (విజయవాడ పశ్చిమ): ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి జేబులు నింపుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (వైఎస్సార్టీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మండిపడ్డారు. రూ.లక్ష కోట్ల విలువైన ఆర్టీసీ డిపోలు, భవనాలు, మౌలిక సదుపాయాలను ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు 99 ఏళ్ల లీజుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.మాజీ సీఎం జగన్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆదుకుంటే.. చంద్రబాబు మాత్రం సంస్థను దివాలా తీయించేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ లీజు ప్రక్రియను విరమించుకోకపోతే ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. తాము విద్యుత్ బస్సులకు వ్యతిరేకం కాదని, ఆ నెపంతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తమ ట్రేడ్ యూనియన్ తరఫున ప్రతి జిల్లాలో వచ్చే సోమవారం కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని, అప్పటికీ స్పందన లేకపోతే మిగిలిన కారి్మకసంఘాల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకున్న వైఎస్ జగన్ విజయవాడ ఆర్టీసీ హౌస్ ఏదుట వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గౌతంరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్రభుత్వం కుట్రలు పన్నిందని మండిపడ్డారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యంకు వినతి పత్రాలు అందజేశారు. -
అన్నదాత.. ‘ఆత్మ’ఘోష!
(పంపాన వరప్రసాదరావు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి): రెండేళ్ల ‘కాల కూటమి’ పాలనలో అన్నదాతలు అ«ధోగతి పాలయ్యారు! నష్టాల సాగులో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. సాగు భారమై... బతుకు బరువై సంక్షోభంలో కూరుకుపోయారు. ఏ పంటకూ మద్దతు ధర దక్కపోవడం.. చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలకు బలైపోతున్నారు. కొనేవారు లేక.. అమ్ముకునే దారిలేక.. పెట్టుబడి ఖర్చులు దక్కక.. అప్పులు తీర్చలేక రైతన్నల బతుకు దుర్భరంగా తయారైంది. దేశానికి అన్నంపెట్టే రైతులు భార్య పిల్లలకు పట్టెడన్నం పెట్టలేక పురుగు మందులను ఆశ్రయిస్తున్నారు. ఇంతటి విపత్తులో ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే కాడిపారేయడంతో ఆసరా లేక, భరోసా కరువై అన్నదాతలు విగత జీవులుగా మారుతున్నారు. ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటంతో రైతు ఆత్మహత్యల వార్త లేని రోజు లేదనే చెప్పాలి. ఉత్తరాంధ్ర మొదలు రాయలసీమ వరకూ ఏ పల్లెకు వెళ్లినా ఇదే దుస్థితి. ఏ రైతును కదిపినా కన్నీటి గాధలే. విత్తు నుంచి విక్రయం వరకు గతంలో ఐదేళ్ల పాటు గ్రామ స్థాయిలో చేయిపట్టి నడిపించిన తోడు కరువైందంటూ విలపిస్తున్నారు. మేమున్నామంటూ తమకు భరోసా ఇచ్చే నాధుడు లేకుండా పోయారంటూ వాపోతున్నారు. రెండేళ్ల చంద్రబాబు సర్కారు పాలనలో రైతుల వెతలపై అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దాదాపు ఏడు నియోజకవర్గాల్లో సుమారు 30కిపైగా పల్లెల్లో ‘సాక్షి ప్రతినిధి’ బృందం రెండు రోజుల పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించింది. అన్నదాతలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కళావిహీనంగా సీమ పల్లెలు.. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు చోటు చేసుకున్న రాయలసీమ జిల్లాల్లో రైతన్నల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. ఉద్యాన హబ్లో ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. సీమలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ఉల్లి మొదలు టమాటా, బత్తాయి (చీని), మామిడి, బొప్పాయి, అరటి, పత్తి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, పప్పుశనగ.. ఇలా ఏ పంట పండించే రైతు పరిస్థితి చూసినా దయనీయంగా ఉంది.సాగుభారమై బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు వలస పోతుండడంతో సీమ పల్లెలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. సీజన్కు ముందే పెట్టుబడి సాయం లేదు.. అదునుకు విత్తనం లేదు.. కట్ట యూరియాకు దిక్కులేదు.. కరువు కాటకాలు, వైపరీత్యాల బారిన పడి పంటలు దెబ్బ తింటే పైసా పరిహారం లేదు... ఉచిత పంటల బీమాకు మంగళం పాడేశారు.. ఏ పంటకూ మద్దతు ధర లేక, కొనేవారు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతన్నలు మండిపడుతున్నారు. ఏ పంట చూసినా కన్నీళ్లే..మామిడి, బత్తాయి, అరటి, ఉల్లి, వేరుశనగ, కూరగాయలు లాంటివి రాయలసీమలో ప్రధాన పంటలు. వేరుశనగలో 90 శాతం.. పత్తి, సజ్జ లాంటి పంటలు సగానికిపైగా సీమ జిల్లాల్లోనే సాగవుతుండగా.. జొన్న, మొక్కజొన్న సైతం 40 శాతానికిపైగా సీమ జిల్లాల్లోనే సాగు చేస్తున్నారు. రెండేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎగుమతి రకమైన జీ–9 అరటితో పాటు తోతాపురి మామిడి, బత్తాయి, ఉల్లి, పత్తి, పుచ్చకాయ, కర్భూజ, బొప్పాయి లాంటి పండ్లను సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరలు లేక రోడ్డు ఎక్కి ఆందోళనకు దిగడం సర్కారు నిర్వాకాలకు నిదర్శనం.పత్తి మద్దతు ధర రూ.8110 కాగా మార్కెట్లో రూ.5 వేలకు మించి కొనలేదు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400 కాగా మార్కెట్లో రూ.1,400–1,600 మించి ఇవ్వడం లేదు. అరటి రైతులైతే ఖరీఫ్లో రూపాయికి తెగనమ్ముకోగా రబీలో రూ.5కు మించి దక్కలేదు. సజ్జ మద్దతు ధర రూ.2,750 కాగా మార్కెట్లో రూ.1,800–1,900 మధ్య అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది.తోతాపురి మామిడికి కిలో రూ.4–6కు మించి దక్కలేదు. చివరికి బత్తాయికి కూడా ఖరీఫ్లో కిలో రూ.6మించి లభించలేదు. ఉల్లి, టమాటా రైతుల పరిస్థితి మరీ దారుణం. కిలో రూపాయి.. అర్ధ రూపాయి పలకడంతో చేసేదిలేక వేలాది టన్నులు రోడ్లపైనే పారబోసిన ఘటనలు కోకొల్లలు. రెండేళ్లుగా కర్భూజ, పుచ్చకాయ పంటకు ధర లేదు. చివరికి పూలకు కూడా రేటు లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. అన్నదాతకు సున్నం.. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతీ రైతుకు ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయాన్ని చంద్రబాబు సర్కారు తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టింది. రెండో ఏడాది ఏడు లక్షల మందికి కోతపెట్టి 46.85 లక్షల మంది భూ యజమానులకు అరకొరగా రూ.14 వేల చొప్పున రూ.6,560.18 కోట్లతో సరిపెట్టారు. రెండేళ్లలో భూ యజమానులకే రూ.14,873.28 కోట్లు ఎగ్గొట్టారు. ఇక కౌలు రైతులకైతే రెండేళ్లూ పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టారు. దాదాపు 16 లక్షలమంది కౌలు రైతులుండగా ఏడాదికి రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.6,400 కోట్లను చంద్రబాబు ఎగ్గొట్టారు. పెట్టుబడి కోసం రైతులు సీజన్లో పడరాని పాట్లు పడ్డారు. రూ.3–5 వడ్డీలకు అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.బలవన్మరణాలు..సాగు కలిసి రాకపోవడంతో అప్పుల పాలైన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వర్షాభావం, వరదలు, తుపాన్లు.. ఒక్కొక్కటిగా వైపరీత్యాలు విరుచుకుపడటంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతన్నల పాలిట చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న విధానాలు మృత్యుపాశాలుగా మారాయి.టమాటా నుంచి పొగాకు వరకు పంట ఉత్పత్తులను కొనే నాథుడు లేక, అప్పులు తీర్చే దారిలేక 2024–25లో 150 మందికి పైగా అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడగా.. ఇక 2025–26లో 393 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టినట్లు పోలీస్ శాఖ అధికారికంగా ప్రకటించింది. వీరిలో అత్యధికులు సీమ జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ప్రభుత్వం పైసా పరిహారం ఇచి్చన పాపాన పోలేదు.చేయిపట్టి నడిపించిన ఆర్బీకేలు నిర్వీర్యంవిత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా గ్రామ స్థాయిలో అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలు కూటమి పాలనలో నిరీ్వర్యమైపోయాయి. 10,778 ఆర్బీకేలు కాస్తా రేషనలైజేషన్ పేరిట 8451 క్లస్టర్లుగా కుదించారు. నాణ్యమైన సాగు ఉత్పాదకాలు అందించే సంకల్పంతో గత ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ల్లో సగానికి పైగా మూతపడగా మిగిలినవి అలంకారప్రాయంగా తయారయ్యాయి. సిబ్బందిని సర్వేలు, ఇతర అవసరాలకు వినియోగిస్తుండడంతో ఆర్బీకేలకు వెళ్తే పలుకరించే నాధుడే కరువయ్యారు.అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన భవనాలను ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారు. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీని నిలిపి వేశారు. సబ్సిడీ విత్తనాల పంపిణీలో అడ్డగోలుగా కోత పెట్టారు. అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఎరువులను పక్కదారి పట్టిస్తుండడంతో రైతులకు యూరియా, డీఏపీ దొరకని పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా కట్ట యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నామని వాపోతున్నారు.మరోవైపు కాంప్లెక్స్ ఎరువుల ధరలు రెండేళ్లలో 50–70 శాతం మేర పెరిగిపోవడంతో సాగు భారం మారింది. మత్స్యకార, పశుసంవర్ధక శాఖలకు చెందిన సాగు ఉత్పాదకాల సరఫరాకు మంగళం పాడేశారు. వరుస వైపరీత్యాలు, కరువు సాయం కలిపి దాదాపు 7 లక్షల మంది రైతులకు చంద్రబాబు సర్కారు దాదాపు రూ.1,100 కోట్లకు పైగా పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇప్పటి వరకు చెల్లించిన పాపాన పోలేదు.అటకెక్కిన ఉచిత పంటల బీమా రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు రైతులకు అండగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ప్రభుత్వం వచీ్చరాగానే మంగళం పాడేసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన 2023–24 సీజన్కు సంబంధించిన ప్రీమియం బకాయిలు రూ.930 కోట్లు చెల్లించకుండా చంద్రబాబు సర్కారు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. ఖరీఫ్ 2024 సీజన్ వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పంటల బీమా పథకం కొనసాగగా.. రబీ–2024–25 సీజన్ నుంచి చంద్రబాబు సర్కారు స్వచ్ఛంద నమోదు పద్ధతి తెచ్చింది.2024–25 వ్యవసాయ సీజన్తో పాటు ఖరీఫ్–2025–26 సీజన్లో ప్రభుత్వం చెల్లించాల్సిన బీమా ప్రీమియం బకాయిలు రూ.1,095.11 కోట్లు ఎగ్గొట్టడంతో కంపెనీలు ఏపీని బ్లాక్లిస్ట్లో పెట్టాయి. రబీ –2025–26 సీజన్లో కనీసం బీమా పోర్టల్ కూడా తెరవలేదు. ఫలితంగా ఒక్క రైతు కూడా స్వచ్ఛందంగా బీమా చేయించుకోలేకపోయారు. ఇక రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీని రెండేళ్లుగా చెల్లించకుండా చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. మద్దతు ధర కోసం ఆందోళనలు.. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. ధరల స్థిరీకరణ నిధి కింద పైసా ఇచి్చన పాపాన పోలేదు. ఉల్లి, టమాటా, కందులు, మినుము, పెసలు, శనగ, వేరుశనగ, పసుపు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, పొగాకు, కోకో, మామిడి.. ఇలా ఏ పంట చూసినా మద్దతు ధర దక్కని పరిస్థితి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 2024–25 సీజన్లో 75 కేజీల ధాన్యం బస్తాకు రూ.1,725 దక్కాల్సి ఉండగా ఏ ఒక్క రైతుకు రూ.1,150–1,450కి మించి దక్కలేదు.2025–26లో 75 కేజీల బస్తాకు రూ.1,777 దక్కాల్సి ఉండగా రూ.1,250 నుంచి రూ.1,500 మధ్య దక్కింది. మద్దతు ధర కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం, మామిడి, జొన్న, మొక్కజొన్న, పొగాకు రైతులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలకు దిగారు. 2023–24లో క్వింటా రూ.27 వేలకు పైగా పలికిన మిర్చి రైతుకు గతేడాది రూ.6–8 వేలకు మించి దక్కలేదు. మొక్కజొన్న ఎమ్మెస్పీ క్వింటాకు రూ.2,400 అయితే రైతులకు దక్కింది కేవలం రూ.1,400 నుంచి రూ.1,600 మధ్యే. టమాటా, ఉల్లి రైతుల పరిస్థితి రెండేళ్లుగా దారుణంగా ఉంది. పైసా సాయం అందలేదు.. గత ఖరీఫ్లో 10 ఎకరాల్లో శనగ, మినుము, నాటుపొగాకు సాగు చేశా. దాదాపు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. పత్తి తెగుళ్ల బారిన పడింది. నాటు పొగాకు కొనేవారు లేకుండా పోయారు. శనగ, మినుము పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. అధికారులు రాసుకుని వెళ్లారే గానీ పైసా సాయం అందలేదు. – సుద్దాల సుబ్బరాయుడు, కొనకుంట్ల, నంద్యాల జిల్లారూ.60 లక్షలు నష్టపోయా.. 4 ఎకరాల్లో దానిమ్మ, మరో 4.5 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టా. ముంపునీటి బారిన పడి గతేడాది అరటి పంట దెబ్బతింటే.. ఈ ఏడాది బాక్టీరియల్ బ్లైట్ తెగులు బారిన పడి దానిమ్మ పూర్తిగా నాశనమైంది. మరో 15–20 రోజుల్లో పంట కోతకొచ్చే దశలో అకాల వర్షాలు, వడగండ్లతో తెగులు సోకింది.చెట్టుకు 28 కేజీలకు తక్కువ కాకుండా ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి వస్తుందని ఆశించా. బెంగళూరు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టన్ను రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. ఆ లెక్కన రూ.60 లక్షల వరకు నష్టపోయా. ఇది వాణిజ్య పంట కాబట్టి మీకు పరిహారం రాదని అధికారులు చెబుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఉద్యాన పంటలన్నింటికి ఉచితంగా బీమా పరిహారం ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో పైసా సాయం లేదు. – ధర్మవరపు రవిశేఖర్రెడ్డి, కందుకూరు, అనంతపురం జిల్లాపరిస్థితి దారుణంగా ఉంది.. ఐదెకరాల్లో మొక్క జొన్న, వేరుశనగ వేశా. మొక్కజొన్నకు ఎకరాకు రూ.లక్ష, వేరుశనగకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. మొక్కజొన్న 125 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మద్దతు ధర రూ.2,400 కాగా మార్కెట్లో రూ.1,500కి మించి ధర రాలేదు. క్వింటాకు రూ.900 చొప్పున దాదాపు రూ.1.13 లక్షల మేర నష్టపోయా. వేరుశనగ అకాల వర్షాల బారిన పడి ఎందుకు పనికి రాకుండా పోయింది. రూ.8 లక్షలు అప్పు మిగిలింది. వైఎస్ జగన్ హయాంలో పైసా కట్టించుకోకుండా రూ.లక్షన్నరకు పైగా పంటల బీమా పరిహారం ఇచ్చారు. సీజన్ ముగియకుండానే పంట నష్టపరిహారం ఇచ్చేవారు. నేడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. – మన్నెపూల శివశంకర్, మద్దాలపురం, అనంతపురం జిల్లాపాడి రైతులకు దగా.. మాకు మూడు ఆవులున్నాయి. రోజుకు నాలుగైదు లీటర్ల పాలు ఇస్తాయి. మా గ్రామంలో లీటర్ గేదె పాలకు రూ.40, ఆవుపాలకు రూ.20 మించి ఇవ్వడం లేదు. అదేమిటని అడిగితే వెన్న శాతం లేదంటారు. గత ప్రభుత్వ హయాంలో మంచి రేటు వచ్చేది. అమూల్ కేంద్రాల్లో పాలు పోసేవాళ్లం. లీటర్ గేదె పాలకు రూ.80, ఆవుపాలకు రూ.50కిపైగా ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇలా అయితే పాడి రైతులు బతికేదెలాగో అర్ధం కావడం లేదు. – ఎం.జానకమ్మ, మద్దాలపురం, అనంతపురం జిల్లాపరిహారం లేదు.. వితంతు పింఛనూ ఇవ్వరు.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్ఠూరు గ్రామానికి చెందిన రాగులపాడు సురేష్ (35) తనకున్న 1.5 ఎకరాల సొంత భూమితోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని గత ఖరీఫ్లో మొక్కజొన్న, శనగ సాగుచేశాడు. పెట్టుబడి కోసం నాలుగు తులాలు బంగారు ఆభరణాలు బ్యాంకులో కుదవ పెట్టాడు. తీరా పంట చేతికొచ్చే సరికి మద్దతు ధరలేక పెట్టుబడి కూడా రాలేదు.అప్పులు రూ.5 లక్షలకు చేరుకోవడంతో ఒత్తిళ్లు భరించలేక మార్చిలో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురు బిడ్డలను పోషించుకునేందుకు కూలి పనులకు వెళ్తున్నట్లు సురేష్ భార్య సునీత కన్నీటిపర్యంతమైంది. తన భర్తకు పరిహారం ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోందని, కనీసం వితంతు పింఛన్ అయినా ఇప్పించండి బాబూ అంటూ కాళ్లా వేళ్లా పడినా పట్టించుకోవడంలేదంటూ వాపోయింది. పిల్లలతో కలిసి కూలి పనులకు పోతున్నా.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం చెరుకులపాడు మజర కోసనా పల్లె గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కురువ రామచంద్రుడు (45)కి సొంతంగా 2.5 ఎకరాలు, మరో 2 ఎకరాల డీ పట్టా భూమి ఉంది. రెండు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. దాదాపు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి, పొగాకు సాగు చేసినా పంటలు కొనేవారు లేక తీవ్రంగా నష్టపోయాడు.ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు. అప్పులు కాస్తా వడ్డీలతో రూ.12 లక్షలకు చేరుకున్నాయి. అప్పులోళ్ల వేధింపులు తాళలేక ఉల్లి, తెగులు నివారణకు తెచ్చిన పురుగుల మందు తాగి గతేడాది సెప్టెంబర్ 14న ఆత్మహత్యకు ఒడిగట్టడంతో రామచంద్రుడి కుటుంబం దిక్కుతోచక అల్లాడుతోంది. ఇద్దరు కుమార్తెలను పోషించుకునేందుకు కూలి పనులకు పోతున్నానంటూ రామచంద్రుడు భార్య లక్ష్మీ వాపోయింది. తనకు భర్తకు కౌలు కార్డు లేదనే సాకుతో పరిహారం రాదు పొమ్మంటున్నారని.. అప్పులోళ్లు భూమిని లాగేసుకున్నారని.. ఎలా బతకాలో తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమైంది.భూములు అమ్ముకుంటున్న అన్నదాతలు ఈ ఫొటోలో కనిపిస్తున్న వారంతా అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం దోసులుడికి గ్రామానికి చెందిన రైతులు. గ్రామంలో 2,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఉల్లి, శనగ, వేరుశనగ, బంతి, చామంతి సాగు చేస్తారు. రెండేళ్లుగా వ్యవసాయం కలిసి రాకపోవడంతో గ్రామంలో 90 శాతం మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు తీర్చేదారిలేక కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న భూములను తెగనమ్ముకుంటున్నారు. అప్పులోళ్ల వేధింపులు తాళలేక ఇప్పటికే 500 ఎకరాలకు పైగా అమ్ముకున్నామంటూ వాపోతున్నారు.వేరుశనగకు దూరమైన పల్లెలు.. ఈ ఫొటోలో ఉన్నవారంతా అనంతపురం జిల్లా గార్లెదిన్న మండలం కోటంక గ్రామానికి చెందిన రైతులు. గ్రామంలో దాదాపు 3 వేల ఎకరాల సాగు భూమి ఉండగా 95 శాతం మంది రైతులు వేరుశనగ సాగు చేస్తుంటారు. రెండేళ్లుగా చీడపీడలతో దిగుబడులు తగ్గిపోవడం.. పెట్టుబడులు పెరిగిపోవడంతో పాటు ఏ ఒక్క సీజన్లోనూ మద్దతు ధర దక్కక పోవడంతో ప్రతీ ఒక్కరూ రూ.లక్షల్లో అప్పుల పాలయ్యారు. దీంతో వేరుశనగ సాగుకు గ్రామం పూర్తిగా దూరమైంది. ప్రత్యామ్నాయ పంటలు సైతం కలసి రావడం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా కింద ఒక్క అనంతపురం, కర్నూలు జిల్లాలకే రూ.1,000 కోట్లకు పైగా పరిహారం దక్కింది. దాదాపు ప్రతీ రైతు రూ.లక్ష నుంచి రూ.నాలుగైదు లక్షల వరకు పరిహారం అందుకున్నారు. కానీ రెండేళ్లుగా తమ పరిస్థితి దారుణంగా ఉందంటూ గ్రామానికి చెందిన రైతు టి.నారాయణ ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరీ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి ఏలూరు/అనంతపురం టౌన్: వాళ్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. పేరుకు ఎమ్మెల్యేలైనా రౌడీలను మించి చెలరేగిపోతున్నారు. అరాచకాలు, అకృత్యాలతో బరితెగిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు, దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తమకు అడ్డుచెప్పే వారే లేరంటూ పేట్రేగిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యకాండలే తాండవమాడుతున్నాయి. అర్ధరాత్రి జేసీబీలతో సొంత పార్టీకి చెందిన న్యాయవాది ఇంటిపై దండయాత్రకు దిగిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చట్టాన్నీ, పోలీసు యంత్రాంగాన్నీ ఖాతరు చేయలేదు. తన అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్నాడని న్యాయవాది ఇంటిపై దాడికి యత్నించారు. ‘‘వాడో.. నేనో ఉండాలి’ అంటూ బీభత్సం సృష్టించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా అరాచకాలతో రెచ్చిపోతున్నారు. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని సొంత పార్టీ నేత సెల్ఫీ వీడియో విడుదల చేయడం ప్రసాద్ అకృత్యాలకు అద్దంపడుతోంది. ఓ ఎన్ఆర్ఐ కష్టార్జితంతో కట్టుకున్న రూ.60 కోట్ల మాల్ను చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కబ్జా చేశారు. తననెవరు అడ్డుకునేది అన్నట్టు పేట్రేగిపోతున్నారు. ఇవే కాదు.. జిల్లా ఎస్పీ కార్యాలయాన్నే 10 గంటలు ముట్టడించిన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్బాబు, అర్ధరాత్రి వీడియో కాల్స్తో కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ను వేధించిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, సొంత పార్టీ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్, అటవీ శాఖాధికారులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డిల తీరు రాక్షసకాండను తలపిస్తున్నాయి.. ఇవన్నీ రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత దుర్మార్గంగా ఉందో చెప్పడానికి మచ్చుతునకలు.అరాచకానికి కేరాఫ్ అడ్రస్ చింతమనేని అరాచకాలు, అడ్డగోలు తనానికి మారుపేరైన ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోమారు రెచ్చిపోయారు. ఆదివారం అర్ధరాత్రి ఏలూరు నగరంలో రచ్చరచ్చ చేశారు. సొంత పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసాన్ని కూలగొట్టడానికి ఏకంగా పొక్లెయిన్లు, వందల మంది అనుచరులతో దండయాత్రగా వెళ్లారు. ఆయన ఇల్లు కూల్చివేస్తానని నానా బీభత్సం చేశారు. అడ్డుకున్న పోలీసులనూ పక్కకు నెట్టేసి దుర్భాషలాడారు. వాడో, నేనో ఉండాలంటూ హల్చల్ చేశారు. ఇంత చేసినా ఎమ్మెల్యేను పోలీసులు రాచ మర్యాదలతో ఇంటికి పంపించారు. బాధితుడైన శ్రీనివాస్, ఆయన కుమారుడిని మాత్రం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు తరలించారు. చివరికి టీడీపీ అరాచకవాది చింతమనేనికే వత్తాసు పలికింది. బాధితుడైన న్యాయవాది శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చింతమనేని ఇలా చేయడం కొత్త కాదు. కొద్దిరోజుల క్రితం సాక్షి ఏలూరు కార్యాలయంపై దాడి చేశారు. ఆ తర్వాత కార్యాలయానికి తన అనుచరులతో కలిసి నిప్పు పెట్టించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఆయన వ్యవసాయ తోటలో అరాచకం సృష్టించారు. 2014–19 మధ్య ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ముసునూరు మహిళా తహశీల్దార్ వనజాక్షిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. అధికారులపై దాడి చేయడం, ప్రజలపై నోరుపారేసుకోవడం, దుర్భాషలాడడం ఆయనకు నిత్యకృత్యం. ఇసుక, మట్టి దోపిడీ, కోడి పందేలతో దెందులూరు నియోజకవర్గాన్ని చింతమనేని ప్రభాకర్ రౌడీరాజ్యంగా మార్చివేశారు.అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నారనే..!బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఎమ్మెల్యే చింతమనేని మా ఇంటి ముందుకు వచ్చి వందలాది మందితో మాపై దాడి చేయడానికి యత్నించి, ఇల్లు కూల్చడానికి తెగబడ్డారు. అందరినీ దుర్భాషలాడారు. పోలీసులు చింతమనేనిని వదిలివేసి, ఏ తప్పూ చేయని నా భర్తను, కుమారుడిని అర్ధరాత్రి పూట పోలీస్స్టేషన్కు తరలించారు. ఇదేమి అన్యాయం? నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్నారనే నా భర్తపై కక్షగట్టారు. ఇదేనా చంద్రబాబు సుపరిపాలన? – ఈడ్పుగంటి పద్మజ, న్యాయవాది, చింతమనేని బాధితుడి సతీమణికబ్జాల ప్రత్తిపాటి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కబ్జాలకు, అరాచకాలకూ అంతేలేదు. చిలకలూరిపేటలోని ఎన్ఆర్ఐ రావి మురళీమోహన్కు చెందిన రూ.60 కోట్ల విలువైన సాయి కార్తీక్ సిటీ సెంటర్ను ప్రత్తిపాటి ఆక్రమించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు 5న తన మాల్ను ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఎన్ఆర్ఐ మురళీమోహన్ వెల్లడించారు. రెండు థియేటర్లు, రెండు ఫంక్షన్ హాళ్ళు, వాణిజ్య ప్రాంతాలు ఉన్న ఈ కాంప్లెక్స్లో ఎవరినీ ప్రవేశించనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లోనూ బాధితుడు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదని, బాధితుడు కోర్టుకు వెళ్లారు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. చంద్రబాబు, లోకేశ్కి ఫిర్యాదు చేసినా కబ్జా చేసిన పుల్లారావుకే వత్తాసు పలుకుతుండడం గమనార్హం.సొంత పార్టీ నేతలనూ వదలని దగ్గుపాటి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సొంతపార్టీ నేతలనూ వదలడం లేదు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని టీడీపీ మైనార్టీ నేత మహబూబ్ బాషా సెల్ఫీ వీడియో విడుదల చేయడమే దీనికి నిదర్శనం. తనకు ఏమి జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యత అని ఆ వీడియోలో బాధితుడు స్పష్టం చేశారు. మైనార్టీలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని అడగడమే తన తప్పులా ఎమ్మెల్యే వ్యవహరించారని వివరించారు. ‘‘నాకు ఎవరూ ఉచితంగా ఓటు వేయలేదని, నేనెందుకు ఇంటి పట్టాలు ఇవ్వాలి’’ అంటూ దగ్గుపాటి ఫోన్లో బెదిరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పట్టాలు అడిగితే చంపేస్తారా అని ప్రశ్నించారు. పదేళ్లుగా పార్టీకి పనిచేస్తున్నానని, ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టానని వివరించారు. ఎమ్మెల్యే అరాచకాలపై పార్టీ పెద్దలకు చెప్పినా స్పందన లేదని వివరించారు. అనంతపురం టీడీపీలో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలపై మంగళవారం ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దీక్ష చేపడుతున్నట్లు మహబుబ్బాషా తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటిపై గతంలోనూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మద్యం షాపుల వద్దకు నేరుగా తన మనుషులను పంపడం, కమీషన్ల కోసం ఇష్టానుసారం వ్యవహరించడం ఆయనకు అలవాటుగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను తన నియోజకవర్గంలో విడుదల కాకుండా అడ్డుకునేందుకు థియేటర్ యజమానులను బెదిరించారు.ఎస్పీనే బెదిరించిన ఎమ్మెల్యే అరవిందబాబునరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కొద్దిరోజుల క్రితం పోలీసులపైనే చెలరేగిపోయారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు బైఠాయించి అధికారులకే సవాల్ విసిరారు. తాను సూచించిన వ్యక్తికి లీగల్ అడ్వైజర్ పోస్టు ఇవ్వాలని ఏకంగా ఎస్పీనే బెదిరించారు. ఎస్పీ బయటకు వెళ్లిపోవడంతో ఆయన చాంబర్లోనే తలుపులు వేసుకుని కూర్చోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఎమ్మెల్యేను బయటకు తీసుకు రావాల్సి వచ్చింది. గతంలోనూ అరవిందబాబు తాను చెప్పిన వారికి కాంట్రాక్టు పోస్టులు ఇవ్వాలని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో హంగామా సృష్టించారు.ఎమ్మెల్యే నసీర్ వేధింపులకు మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వేధింపులు తట్టుకోలేక ఒక టీడీపీ మహిళా కార్యకర్త ఆయన కార్యాలయం ఎదుటే ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో బయటకు రావడంతో ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే వెంటాడి వేధించారు. తన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అయినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. కేజీబీవీ ప్రిన్సిపాల్కు కూన రవికుమార్ వేధింపులు ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ బయటపెట్టడం కొద్ది నెలల క్రితం చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి వేళ అడ్మిషన్ల పేరిట మీటింగ్కు రమ్మని ఫోన్ కాల్స్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వం ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.అటవీ శాఖ ఉద్యోగులనే కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే బుడ్డా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి గత ఏడాది చెక్పోస్టు వద్ద తన కారును ఆపారని ఏకంగా అటవీ శాఖ ఉద్యోగులనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. తన కారులోనే వారిని తీసుకెళ్లి దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పలు సందర్భాల్లో నియోజకవర్గంలో ఆయన గొడవలు సృష్టించారు. తనకు తెలియకుండా ఎంపీ రావడాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలతో దాడులు చేయించారు. ఇవే కాదు.. అనేక నియోజకవర్గాల్లో అధికార కూటమి ఎమ్మెల్యేలు తాము సర్వాధికారులమనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, దౌర్జన్యంగా అరెస్టు చేయించడం, దాడులు చేయడం ప్రతిచోటా జరుగుతూనే ఉంది. చంద్రబాబు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు. -
మంత్రుల సింగపూర్ పర్యటన ఖర్చు 1.01 కోట్లు
సాక్షి, అమరావతి: సింగపూర్ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం, దేశాధ్యక్ష నాయకత్వంపై శిక్షణ కోసం ఏడుగురు రాష్ట్ర మంత్రులు ఏప్రిల్ 21 నుంచి 27 వరకు వారం రోజులపాటు సింగపూర్లో పర్యటించిన విషయం తెలిసిందే. వారి పర్యటనకు రూ.1.01 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.మంత్రులు సింగపూర్ పర్యటనకు తొలుత రూ.95.19 లక్షల బడ్జెట్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం మరో రూ.6.27 లక్షల అదనపు బడ్జెట్ను విడుదల చేస్తూ పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంత్రుల సింగపూర్ పర్యటనకు రూ.1.01 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేశారు. -
కాపు యువకుడిది లాకప్ డెత్తేనా!
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు, చినబాబు రెడ్బుక్ అరాచక పాలనలో మరో సమాధానం లేని ప్రశ్న.. కాపు యువకుడు గాదె సాయికృష్ణ ఏమయ్యాడు? సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై, శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర సందేహాలు లేవనెత్తుతోంది. సాయికృష్ణ బ్రతికే ఉన్నాడా? లాకప్లో చంపేశారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, బలవంతంగా ఎత్తుచికెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతుండగా, అతని ఆచూకీ గురించి పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంది. ఒక తల్లి తన కుమారుడు బతికున్నాడో, లేదో తెలియక హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం రాష్ట్ర పరిపాలనపై ప్రజల్లో అనుమానాలు పెంచుతోంది. ప్రజల ప్రాణాలు, స్వేచ్ఛలను కాపాడాల్సిన వ్యవస్థే ఒక వ్యక్తి ఆచూకీపై స్పష్టత ఇవ్వలేకపోతే, సాధారణ పౌరుడు తన భద్రత గురించి ఎలా నమ్మకం కలిగి ఉంటాడు? సమాధానాలు లేని ప్రశ్నలు ఈ వ్యవహారంలో హైకోర్టు స్పందించి సాయికృష్ణ ఆచూకీ కనుగొని తన ముందు హాజరుపరచాలని ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకవేళ పోలీసులు చెప్పినట్లే సాయికృష్ణ వారి అదుపులో లేకపోతే, అతను చివరిసారిగా ఎక్కడ కనిపించాడు? అతని కదలికలపై స్పష్టమైన వివరాలు ఎందుకు లేవు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా అలాగే పోలీసు శాఖపైనా ఉంది. సాయికృష్ణను ఈ నెల 29వ తేదీలోపు తన ముందు ప్రవేశపెట్టి తీరాల్సిందేనంటూ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే కృష్ణలంక సీఐ నాగరాజును హడావిడిగా వీఆర్కు పంపినట్లు తెలుస్తోంది. స్వతంత్ర విచారణకు ఆదేశించాలి చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్ల కింద పనిచేస్తోందన్నది ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టమైంది. ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారనే అనుమానం ఉన్నప్పుడు భారత రాజ్యాంగం అత్యవసర పరిష్కారంగా ‘హెబియస్ కార్పస్ పిటిషన్’ను తన ప్రజల ముందు ఉంచింది. అలాంటి పరిస్థితి ఏర్పడటమే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక హెచ్చరికగా చూడాలి. ఇలాంటి పిటిషన్లు ఇప్పుడు హైకోర్టులో పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే విషయం. ఇక్కడ సమస్య ఒక్క సాయికృష్ణ గురించే కాదు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఎలా అమలవుతోంది? పోలీసుల చర్యలపై పర్యవేక్షణ ఎంత సమర్థంగా ఉంది? పౌర హక్కులకు ఎంత విలువ ఇస్తున్నారు? అనే తీవ్ర ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై స్వతంత్ర విచారణకు ఆదేశించి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పోలీసు శాఖ చట్టానికి మాత్రమే విధేయంగా ఉండాలి. కానీ ఒక వ్యక్తి ఆచూకీపై హైకోర్టు పదేపదే జోక్యం చేసుకోవాల్సి రావడం పరిపాలనా వైఫల్యంగా కనిపిస్తోంది. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడు? అతని పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు త్వరితగతిన, విశ్వసనీయ సమాధానం రాకపోతే, ఈ ఘటన చంద్రబాబు ప్రభుత్వ పాలనపై మరింత తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తుంది. సీఐ బెదిరించారంటున్న తల్లి ‘నీ కొడుకును చంపేస్తా.. చచ్చిపోయాడనుకో.. వాడిపై ఆశలు వదులుకో... వాడు ఇకపై నీవద్దకు రాడు’ అంటూ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించాడని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. గత మే నెల 9, 10 తేదీలలో మార్కాపురం నుండి తన కుమారుడు గాదె సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు ఎవరికి చెప్పకుండా స్టేషన్కు తీసుకువచ్చారని, అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘బ్రతికి ఉంటే కోర్టుముందు హాజరుపరచండి.. లేదంటే మృతదేహాన్ని అప్పగించండి’ అంటూ కన్నీటి పర్యంతమవుతుండడం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలనూ తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.ఈ విషయమై ఆమె బెజవాడ బార్ అసోసియేషన్ మానవహక్కుల కమిటీ చైర్మన్ను సంప్రదించి, తనకు న్యాయం చేయాలని అర్థించారు. ‘మే నెలలో కృష్ణలంక పోలీసులు నా ఇంటివద్దకు వచ్చారు. సీఐ పోలీసుస్టేషన్కు రమ్మంటున్నారంటూ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ నా సెల్ఫోన్ను లాక్కొని, కొద్దిరోజులు వారి వద్దే ఉంచుకొన్నారు. ఫోన్ను తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా, రోజుల తరబడి తిప్పించుకొన్నారే తప్ప తిరిగి ఇవ్వలేదు’అంటూ ఆమె చెబుతున్న మాటలు రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పోలీసుల అరాచకాన్ని కళ్లకు కడుతోంది. తన కొడుకును చంపేసి ఉంటారని ఆమె హైకోర్టు ధర్మాసనం సాక్షిగా ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘నా కొడుకును చంపేశారేమోనని చివరికి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి కూడా వెళ్లి చూశా’ అన్న ఆమె ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. సాయికృష్ణను మా ముందు హాజరుపరిచి తీరాల్సిందేకృష్ణలంక పోలీసులకు 29 వరకు గడువు పొడిగించిన హైకోర్టువిజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29వ తేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఆలోపు సాయికృష్ణ ఆచూకీ లభించినా కూడా.. వెంటనే తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, పోలీసులు చంపేసి ఉంటారన్న అనుమానాలను సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వ్యక్తం చేశారు.సాక్షి, అమరావతి: విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29 వతేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు, కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఆలోపు సాయికృష్ణ ఆచూకీ లభించినా కూడా.. వెంటనే తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కొంత కాలంగా మార్కాపురంలో ఉంటున్నాడు.అయితే పలు కేసులు ఉన్నాయన్న కారణంతో సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు ఇటీవల మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చారని, ఆ తరువాత నుంచి ఆచూకీ తెలియడంలేదని, తన కుమారుడు అసలు బతికున్నాడో లేదో కూడా తెలియడం లేదని, అతడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం, ఈ నెల 15న సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.సోమవారం విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ఏజీపీ కృష్ణ ప్రణీత్ వాదనలు వినిపిస్తూ, సాయికృష్ణ ఆచూకీ తెలియలేదని, అందుకే అతడిని కోర్టు ముందు హాజరుపరచలేదని తెలిపారు. అతడిని వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కోర్టు ముందు హాజరుపరిచేందుకు మరింత సమయం కావాలని కోరారు. విజయలక్ష్మి తరఫు న్యాయవాది ఆదిత్య చౌదరి వాదనలు వినిపిస్తూ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై సాయికృష్ణ మరణించి ఉంటాడని తల్లి ఆందోళన చెందుతోందన్నారు. -
‘సర్’లో టీడీపీ చొరబాటు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలోకి అధికార తెలుగుదేశం పార్టీ అక్రమంగా చొరబడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తూ.. టీడీపీ కేంద్ర కార్యాలయం స్థావరంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డదారులు తొక్కుతోంది. రాజకీయ ప్రత్యర్థి వైఎస్సార్ సీపీ ఓట్లను పెద్ద ఎత్తున తొలగించడమే లక్ష్యంగా ‘సర్’ పేరుతో టీడీపీ ఏకంగా ఒక యాప్ను రూపొందించింది. ఓటర్ల కులం ఏమిటి? ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు? అనే వ్యక్తిగత వివరాలను టీడీపీ బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా సేకరించి గోప్యతకు తూట్లు పొడుస్తూ ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేస్తోంది. టీడీపీకి చెందిన ప్రతీ బీఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించాలని, ఇందుకోసం ఫారం–7 వాడాలని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్ జిరాక్స్లు, సాఫ్ట్ కాపీలు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బీఎల్ఏల వాట్సాప్లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓటర్ల జాబితాతో కూడిన ఫిజికల్ కాపీల కలర్ ప్రింటవుట్లతో టీడీపీ బీఎల్ఏలు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ వ్యక్తిగత వివరాలను గుచ్చి గుచ్చి ఆరా తీస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన బీఎల్వోలకు బ్లాక్ అండ్ వైట్ లిస్ట్ మాత్రమే ఇవ్వడం.. టీడీపీ ఏజెంట్లకు మాత్రం కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను అందచేయడం అధికార దుర్వినియోగం కాక మరేమిటని రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ప్రక్రియలో అధికార పార్టీ తలదూర్చడం ఏమిటని నిలదీస్తున్నారు.టీడీపీ కార్యాలయంలో బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణప్రత్యేకంగా సిద్ధంచేసుకున్న యాప్ ద్వారా ప్రత్యర్థి పార్టీ ఓట్లను గుర్తించి వాటిని తొలగించే విధంగా పథకం టీడీపీ కేంద్ర కార్యాలయం పక్కా పథకాన్ని రచించింది. ‘సర్’లో భాగంగా సోమవారం నుంచి వచ్చేనెల 14వతేదీ వరకు జరిగే ఇంటింటి సర్వేలో పాల్గొనేందుకు అధికారులతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ)ను ఎన్నికల సంఘం అనుమతిస్తోంది. దీన్ని అదునుగా తీసుకుని వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించేందుకు ‘మై టీడీపీ పాస్పోర్టు’లో సర్ పేరుతో టీడీపీ ఒక యాప్ను రూపొందించింది. ఎన్నికల సంఘం వద్ద గోప్యంగా ఉంచాల్సిన ఓటర్ల జాబితా, కలర్ ఫోటోలతో కూడిన మాస్టర్ డేటాను సేకరించి టీడీపీ అధికార దుర్వినియోగానికి తెగబడింది. ఈ మాస్టర్ డేటాను బూత్లవారీగా ఓటర్ల కలర్ ఫోటోలతో యాప్లో అప్లోడ్ చేసి టీడీపీ బూత్ ఏజెంట్లకు అందచేసింది. అధికారులతో పాటు ఇంటింటి సర్వేలో పాల్గొన్న సమయంలో టీడీపీ ఏజెంట్లు ఈ డేటా ఆధారంగా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఓటరు బూత్ నంబర్, ఓటరు ఐడీతో పాటు మొబైల్ నంబర్, ఓటరు కులం, ఏ పార్టీ సానుభూతిపరుడనే వివరాలను ఇంటింటి సర్వే సమయంలో టీడీపీ బీఎల్ఏలు సేకరిస్తున్నారు. ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరవేసేలా బీఎల్ఏలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.టీడీపీ రూపొందించిన యాప్లో ‘సర్’ విభాగం ఒక్కో టీడీపీ బీఎల్ఏ పరిధిలో 50 ఓట్ల తొలగింపే టార్గెట్ఇంటింటి సర్వేలో ఎవరైనా ఓటరు వైఎస్సార్సీపీ మద్దతుదారుడని తేలితే వారి ఓట్లను తొలగించేందుకు కుట్రకు తెరతీశారు.ప్రతీ బీఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించడంతో పాటు టీడీపీకి చెందిన ఓట్లను చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫారం–7 ఉపయోగించాల్సిందిగా ఆదేశించారు. ఒక్కో బీఎల్ఏ 50 వరకు ఫారం –7 దరఖాస్తులను బల్క్గా సమర్పించేందుకు అనుమతిస్తుండటంతో దీన్ని ఆసరాగా చేసుకుని వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే విధంగా వారికి టీడీపీ శిక్షణ ఇచ్చింది. దీనికి సహకరించే విధంగా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి బీఎల్వోలను లోబర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నాడు ‘సేవామిత్ర’ పేరుతో ఇదే రీతిలో.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా 2019లో తెలుగుదేశం పార్టీ ఇదే విధానాన్ని అనుసరించడం ద్వారా వైఎస్సార్ సీపీకి చెందిన 39 లక్షల ఓట్లను తొలగించింది. ఈవీఎంలను అపహరించిన వేమూరి హరిప్రసాద్తో పాటు లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ కలిసి 3.50 కోట్ల మంది ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను దొంగిలించి ఈ మొత్తం డేటాను టీడీపీకి ‘సేవామిత్ర’ యాప్లో నిక్షిప్తం చేసినట్లు బహిర్గతమైంది. ఈ మాస్టర్ డేటాలోని ఓటర్ల వివరాలను ఒక్కో సేవా మిత్రకు, పార్టీ బూత్ కన్వీనర్కు సేవా మిత్ర యాప్లో అందుబాటులో ఉంచారు. వాటి ద్వారా ఓటర్ ఏ కులానికి చెందిన వారు? ఏ పార్టీ సానుభూతిపరుడు? ఓటరు ఏ ఊరిలో ఉంటున్నారు? అనే వివరాలను సేకరించి ఐటీ గ్రిడ్కు పంపించారు. ఈ సమాచారం ఆధారంగా ఆన్లైన్లో ఫారం 7 దాఖలు చేయడం ద్వారా వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించారు. ఈ కుట్రపై అప్పట్లో వైఎస్సార్ సీపీ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తొలగించిన ఓట్లను తిరిగి చేర్చే విధంగా పోరాడింది. ‘సర్’లో కూడా అదే రీతిలో ఓట్లను తొలగించడానికి టీడీపీ కుట్రలు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్కు ఫిర్యాదు చేశారు. -
‘సర్’లో టీడీపీ అక్రమాలపై ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో టీడీపీ సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని సోమవారం సచివాలయంలో కలిశారు. ‘సర్’ ప్రక్రియ సందర్భంగా ‘మై టీడీపీ యాప్’ ద్వారా ఓటర్ల కులం, ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు? అనే వ్యక్తిగత వివరాలను అధికార టీడీపీ సేకరించడంపై ఫిర్యాదు చేశారు.అనంతరం వారంతా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఉన్న సచివాలయం ఐదో బ్లాక్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం కాగా, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎదురుగా మరో బ్లాక్ ఎదుట మాట్లాడేందుకు వెళ్తుండగా అడ్డుకోవడం, సచివాలయ ఆవరణలో మాట్లాడకుండా నిరోధించటాన్ని వైఎస్సార్ ఎమ్మెల్సీలు తీవ్రంగా ఆక్షేపించారు. సచివాలయం బయట మాట్లాడాలని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు చెప్పడంపై మండిపడ్డారు.రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన తర్వాత ప్రతిపక్షంగా తాము ఏం చెప్పామో వివరాలు వెల్లడించకూడదా? అంటూ నిలదీశారు. తాము ఎమ్మెల్సీలమని, సచివాలయంలో ఎమ్మెల్సీలను మీడియాతో మాట్లాడనివ్వకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సచివాలయం ఐదో బ్లాక్ ముందు మెట్లపై బైఠాయించారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన తెలిపారు. మైక్లు లేకుండానే వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ‘సర్’ తొలిరోజే డేటా చోరీ..⇒ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా ⇒ ‘మై టీడీపీ’ యాప్ ద్వారా వ్యక్తిగత వివరాల సేకరణ ⇒ సీఈవోను కలిసి అక్రమాలపై ఫిర్యాదు చేశాంరాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే టీడీపీ నిస్సిగ్గుగా యాప్ ద్వారా ఓటర్ల డేటా చోరీకి తెర తీసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. సహచర ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తితో కలిసి సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి వివేక్యాదవ్ని కలిసి సర్ ప్రక్రియ సందర్భంగా టీడీపీ చేస్తున్న అక్రమాలు, ఓటర్ల డేటా గోప్యతలో లోపాలపై ఫిర్యాదు చేశారు.అనంతరం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గోప్యంగా ఉండాల్సిన ఓటర్ల వ్యక్తిగత వివరాలను టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని యాప్ ద్వారా సేకరిస్తున్నట్లు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాం. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా ఒక్కో ఓటరును మీరు ఏ రాజకీయ పార్టీ? ఏ కులం? అని అడుగుతూ ఓటర్ల వివరాలను యాప్లో నమోదు చేసుకుంటున్నారు. ఇలాంటి అంశాలపై గోప్యత పాటించాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఎక్కడా అది కనిపించడం లేదు. గోప్యంగా ఉండాల్సిన సమాచారం సేకరించి ప్రత్యర్థుల ఓట్లు తొలగించేందుకు ప్రయతి్నస్తున్నారు.ఎన్నికల కమిషన్, అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన జాబితాలు టీడీపీకి చెందిన బీఎల్ఏల చేతుల్లో కనిపిస్తున్నాయి. మాకు కూడా అలాంటి జాబితాలు ఇవ్వాలని అడిగాం. యాప్ లను అనుమతించే అవకాశం ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా యాప్లను వినియోగించుకుంటుందని చెప్పాం. మ్యాపింగ్ కాని ఓటర్లను నమోదు చేసే ప్రక్రియలో డాక్యుమెంట్లు ఇస్తే తీసుకోవాలి.కానీ చాలాచోట్ల బీఎల్వోలు మాత్రం ఓటర్ల లిస్ట్ ప్రచురణ అయిన తర్వాత తీసుకుంటారని చెబుతున్నారు. అది సరికాదు. ఇప్పుడే డాక్యుమెంట్స్ ఇస్తే తీసుకోవాలి. అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వాలని కోరాం. బీఎల్వోకు రాజకీయ పార్టీలు ఐడీ కార్డులు ఇస్తే వాటిని ఈసీ అధికారులు ధృవీకరించాలని కోరాం. ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లను నమోదు చేశారు? ఎన్ని ఓట్లు మ్యాప్ చేశారు? ఎన్ని కాలేదు? అనే వివరాలు ఆన్లైన్లో పెట్టాలని సీఈవోను కోరాం. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు’ అని అప్పిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీలకు గొంతెత్తి మాట్లాడే అవకాశం లేదా..? రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని తరహాలో కూటమి ప్రభుత్వం ప్రజల గొంతులను నొక్కేందుకు యత్నిస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నేతలు దుయ్యబట్టారు. ‘ఈ ప్రభుత్వం ఏ దిశగా పాలన చేయాలని ఆలోచిస్తోందో అర్థం కావడం లేదు. ఎమ్మెల్సీలుగా మాకు గొంతెత్తి మాట్లాడేందుకు మాకు అవకాశం లేదా? నియంత రాజ్యంలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. అధికారులను అడ్డుపెట్టుకుని మా గొంతు నొక్కాలని చూస్తోంది. ఎవరినీ అభిప్రాయాలు, సమస్యలు చెప్పుకోనివ్వడం లేదు. అంతా రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎన్ని నిర్భంధాలు పెట్టినా మేం ప్రజల గొంతుకగా మాట్లాడుతూనే ఉంటాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేస్తాం’ అని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. -
సాయికృష్ణ బతికే ఉన్నాడా?.. లేదంటే చంపేశారా?
సాక్షి,విజయవాడ: నెల రోజుల క్రితం ఆచూకీ గల్లంతయిన గాదె సాయి కృష్ణ కేసుపై ఏపీ హైకోర్టులో ఈవాళ విచారణ జరిగింది. విచారణలో న్యాయస్థానం సీఐ నాగరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 29లోగా బాధితుణ్ని హైకోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. లేదంటే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. నెల రోజుల క్రితం ‘నీ కొడుకును చంపేస్తా.. చచ్చిపోయాడనుకో.. వాడిపై ఆశలు వదులుకో... వాడు ఇకపై నీవద్దకు రాడు’.. అంటూ విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని మార్కాపురం జిల్లాకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విజయవాడలో మీడియా ఎదుట కన్నీటి పర్యంతరమయ్యారు. తన కుమారుడిని చంపేస్తానని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో కూడా చూసి వచ్చానన్నారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని ఇవ్వాలని కోరారు.తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆ సమయంలో ఆమె న్యాయవాదులతో కలిసి విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ధర్నా సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడ కృష్ణలంక పోలీసులు గతనెల (మే)9వ తేదీ రాత్రి జిల్లా కేంద్రం మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను విజయవాడ తీసుకొచ్చారని చెప్పారు. అప్పటి నుంచి అతడి సమాచారం ఏమీ తెలియడంలేదన్నారు. తరువాత సీఐ నాగరాజు తీసుకురమ్మన్నారని చెప్పి కృష్ణలంక పోలీసులు తనను మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారని తెలిపారు.తన సెల్ఫోన్ను పోలీసులు లాక్కున్నారన్నారు. ఎన్నిసార్లు పోలీసులకు వద్దకు వెళ్లి తన కుమారుడి గురించి, తన ఫోన్ గురించి అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. తన కొడుకును తీసుకొచ్చి 20 రోజులు దాటిపోయిందని, ఇప్పటికీ కోర్టులో హాజరుపర్చలేదంటే అతడిని చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని అయినా ఇవ్వాలని కన్నీటితో వేడుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు గురించి సమాచారం ఇవ్వాలని కోరుతూ గాదె సాయికృష్ణ తల్లి ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని సీఐ నాగరాజును ఆదేశించింది. -
ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలు
సాక్షి,విజయవాడ: ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సచివాలయంలో వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడకూడదని ఆంక్షలు విధించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఆంక్షలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం (జూన్ 15) ఎస్ఐఆర్లో పలు సమస్యలపై వైఎస్సార్సీపీ నేతలు ఎమ్మెల్సీ లు అప్పిరెడ్డి, రాహుల్లాలు, లీగల్ సెల్ మనోహర్ సహా పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ సీఈవోకి వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చారు. ఎన్నికల కమిషన్ సీఈవోకి లేఖ ఇచ్చారు.అనంతరం లేఖపై మీడియాతో మాట్లాడేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నం చేశారు. అయితే, సెక్రటరియేట్లో మీడియాతో మాట్లాడడంపై ఆంక్షలు అమలులో ఉన్నాయంటూ వారిని పోలీసులు అధికారులు అడ్డుకున్నారు. ఆ ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైఎస్సార్సీపీపై మాత్రమే జరిగిన దాడి కాదని.. ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడి అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు తక్షణమే వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సేవ్ డెమొక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హ్యాష్ ట్యాగ్తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పీఎంవో, కేంద్ర ప్రసార, సమాచార శాఖ, మెటా, ఫేస్బుక్ను ట్యాగ్ చేస్తూ ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ⇒ ‘చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్షాల గొంతులను నులిమేయడం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మా అధికారిక ఇన్స్ట్రాగామ్ హ్యాండిల్ను తొలగించింది. ఇప్పుడు దేశంలో వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేశారు. ⇒ ఇది కేవలం వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి. మేము కేవలం వాస్తవాలను వెల్లడిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అవకతవకలను సాక్ష్యాధారాలతో బయట పెడతాం. ప్రజా సమస్యలపై జనం గొంతుకను వినిపిస్తాం. దీంతో ప్రతిపక్ష పార్టీ అధికారిక హ్యాండిళ్లను.. తద్వారా నిజం మాట్లాడే ప్రతిపక్ష గొంతులను నొక్కేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రమాదకరమైన సంప్రదాయాన్ని నెలకొల్పుతోంది. ఇది అత్యంత అప్రజాస్వామికం. ⇒ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించిన అధిక వ్యయాలు, డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లలో అక్రమాలు, విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని సరైన ఆధారాలతో బట్టబయలు చేస్తున్న వారిపై.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం నుంచి.. ఆ విమర్శనాత్మక సమాచారాన్ని ఆన్లైన్లో ప్రజలు చూడకుండా నిరోధించడం వరకు ఒక ఆందోళనకరమైన ధోరణి కనిపిస్తోంది. ⇒ ఈ అన్యాయమైన చర్యలపై మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ దుశ్చర్యలను చట్టపరంగా.. రాజ్యాంగ పరమైన మార్గాల ద్వారా సవాల్ చేస్తాం. బెదిరింపులు, సెన్సార్íÙప్, సంస్థల దురి్వనియోగం వంటివేవీ ప్రజల గొంతును అణచి వేయలేవు. అధికారంలో ఉన్న వారిని జవాబుదారీగా నిలబెట్టడంలో.. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును పరిరక్షించడంలో మా నిబద్ధత కొనసాగుతుంది. ⇒ ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు మా అధికారిక ఫేస్బుక్ పేజీని తక్షణమే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే న్యాయ పోరాటం చేస్తాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
కొత్త పింఛన్ కాకమ్మ కథే!
సాక్షి, అమరావతి: ‘‘ప్రస్తుతం కొత్త పింఛన్ల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు వెలువడలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు వెలువడిన వెంటనే ప్రజలకు తెలియచేయబడును’’ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయాలకు ఫోన్లు చేసి విచారిస్తున్న వారికి ఉద్యోగులు తెలియజేస్తున్న సందేశమిది. ఎక్కువ మందికి ఇదే సమాచారం చెప్పాల్సి వస్తుండడంతో ఈ సందేశాన్ని పలువురు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ వాట్సాప్ స్టేటస్ మెసేజ్లుగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ సైతం నిలిచిపోయింది. అయితే, నెలన్నర నుంచి అధికార టీడీపీ అనుకూల మీడియాలో ‘వితంతువులకు పింఛను భరోసా – జూన్ నుంచి కొత్త వారికి– కూటమి ప్రభుత్వం మూడో వసంతంలోకి అడుగిడే వేళ మంజూరు’ అంటూ ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఇదే అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు సహా కొందరు మంత్రులు ప్రకటన చేసినట్టు కథనాలు వచ్చాయి. ఇవి చూసి రెండేళ్లగా కొత్త పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది అర్హులైన అవ్వాతాతలు, వితంతువులు దరఖాస్తు చేసుకోవడానికి రోజూ సచివాలయాలకు వచ్చి పోతున్నారు. అయితే సచివాలయ ఉద్యోగుల సందేశాలను బట్టి ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని తేలిపోయింది. కూటమి ప్రభుత్వం మభ్యపుచ్చే పథకాలలో ఇది కూడా భాగమేనని స్పష్టమయ్యింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలతో ఉత్తుత్తి దరఖాస్తుల డ్రామా.. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల మౌఖిక సూచనలతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొత్త పింఛన్ల పేరిట ఉత్తుత్తి దరఖాస్తుల డ్రామా మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పీఏల ద్వారా వాళ్ల పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాలకు ఫోన్లు చేసి కొత్త పింఛన్ల కోసమంటూ ఎవరు వచ్చినా వాళ్లకు ‘ప్రభుత్వం ఇప్పుడు కొత్తవి ఇవ్వడం లేద’ని చెప్పకుండా వాళ్లిచ్చే కాగితాలు తీసుకోవాలంటూ మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో.. ఉమ్మడి పశ్చిమ గోదావరి సహా పలు జిల్లాల్లో పింఛన్ల కోసమని సచివాలయాలకు వచ్చే వారి నుంచి దరఖాస్తులను తీసుకొని సిబ్బంది వాటన్నింటినీ పక్కన పడేశారు. ‘ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇస్తుందంట..’ అన్న ఉత్తుత్తి ప్రచారాన్నే నమ్మి మే నెలలో ఏలూరు జిల్లా ఉంగటూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని భీమడోలు మండలం పూళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంఎంపురం సచివాలయంలో 44 మంది పింఛను ఫారాలు ఇచ్చి వెళ్లారు. అందులో 16 మంది అవ్వాతాతల పింఛన్ కోసమైతే, మరో 28 మంది వితంతు, దివ్యాంగుల పింఛన్ల కోసం. మరోవైపు.. అదే పూళ్ల గ్రామ పంచాయతీలోనే పూళ్ల – 1 సచివాలయంలో మరో 30 మంది ఇలాంటి పింఛన్ ఫారాలు ఇచ్చి వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గం దువ్వ గ్రామ పంచాయతీ పరిధిలోనూ ఇదే పరిస్థితి. దువ్వ –1 సచివాలయంలో కూడా 29 మంది కొత్త పింఛన్ల కోసం ఫారాలు ఇవ్వగా, దువ్వ రెండో సచివాలయంలో మరో 20 మంది కొత్త పింఛన్ల ఫారాలు ఇచ్చి వెళ్లారు. ఆరు నెలలకొకసారి ఇలాంటి మభ్య పెట్టే ప్రకటనలతోనే.. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఈ జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు అంటూ ప్రచారం చేశారు. గత ఏడాది డిసెంబరు నెలలో జరిగిన కలెక్టర్ల సదస్సులోనూ జిల్లాకు రెండు వందల కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు, కేన్సర్ రోగులు, వికలాంగులకు ప్రాధాన్యత ఇచ్చి జిల్లాకు రెండు వందల చొప్పున ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నటు ప్రకటించింది. కానీ, దానికి సంబంధించి ఇప్పటిదాక అధికారిక ఉత్తర్వులైతే వెలువడలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయస్సు 60 ఏళ్లు కాగా గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కొత్తగా 50 ఏళ్లకే మంజూరు చేయనున్నట్టు హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరే ఆగిపోయింది. 2024 జూన్ నుంచి రాష్ట్రంలో అర్హులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ పోర్టల్ను ప్రభుత్వం పూర్తిగా మూతపెట్టేసింది. రెండేళ్లలో పింఛన్ల సంఖ్య ఆరు లక్షలపైనే తగ్గుదల.. చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం ఒక ఎత్తయితే.. ఇచ్చే పింఛన్ల సంఖ్య కూడ గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాటి సంఖ్యతో పోల్చితే ఆరు లక్షలకు పైబడి తగ్గిపోయాయి. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్దిదారులు పింఛను పొందారు. తర్వాత కాలంలో పెన్షన్ల సంఖ్య సాధారణంగా పెరగాలి. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఈ నెల 1, 2 తేదీల్లో పూర్తయిన పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం డబ్బులు పంపిణీ చేసిన లబ్దిదారుల సంఖ్య 60,19,920 మాత్రమే. అంటే గత ప్రభుత్వంలో పెన్షన్లు పొందిన లబ్ధిదారుల సంఖ్య కన్నా ప్రస్తుతం దాదాపు 6.14 లక్షల వరకు తగ్గిపోయాయి. అదే వైఎస్జగన్ ప్రభుత్వ హయాంలో (2019–24 మధ్య ఆ ఐదేళ్ల కాలంలో) అప్పటి ప్రభుత్వం 29.51 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసినట్టు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారికంగా ప్రకటించింది. దివ్యాంగుల మెడపై కత్తి... పింఛన్లలో మరిన్ని కోతలు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం దారులు వెతుకుతోంది. పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగుల్లో పెద్ద సంఖ్యలో అనర్హులు ఉన్నారంటూ ప్రచారం చేస్తుండడంతో ఎవరి పింఛన్ ఆపేస్తారోనని వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. పింఛన్లు పొందుతున్న దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులకు ఇప్పుడు కొత్తగా అర్హత నిర్ధారణ కోసమంటూ డాక్టర్ల ద్వారా రీ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టారు. దివ్యాంగులు, మెడికల్ పింఛన్లు తీసుకునే 8 లక్షల మందికీ రీ వెరిఫికేషన్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ గ్రామాల్లో టీడీపీ సానుభూతిపరులు అనుకునే వారికి ఇప్పటి దాక పరీక్షల నోటీసులు ఇవ్వలేదు. అలా రెండు లక్షల మందిని ఈ పరీక్షల నుంచి మినహాయించి మిగిలిన ఆరు లక్షల మంది దివ్యాంగులకు మాత్రమే ఈ రీ వెరిఫికేషన్ పరీక్షలు చేపట్టడం గమనార్హం. -
సెలవు రోజూ యోగాంధ్రే!
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మెడపై ప్రభుత్వం కత్తి పెట్టి పని చేయిస్తోంది. ఈ ఆదివారం కూడా వారికి సెలవు లేకుండా పోయింది. యోగాంధ్ర రిజిస్ట్రేషన్ల టార్గెట్లు పూర్తి చేయనిపక్షంలో చర్యలు ఉంటాయని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఆదేశించడంతో సెలవు రోజూ సాయంత్రం దాకా విధుల్లో పాల్గొన్నారు. ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు కోటి మందిని రిజిస్ట్రేషన్లు చేయాలంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు టార్గెట్లు పెట్టగా.. శుక్రవారం నాటికి కేవలం 25 లక్షల మంది రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి కాకపోవడంతో శనివారం కూడా ప్రతి ఉద్యోగి కనీసం 25 మంది చొప్పున రిజిస్ట్రేషన్లు చేయాలని టార్గెట్లు పెట్టి పని చేయించారని ఉద్యోగ సంఘ నేతలు వాపోతున్నారు.శనివారం రాత్రే పలు జిల్లాల్లో ఆదివారం ఎవరికీ సెలవు లేదంటూ ఉద్యోగులకు మెసేజ్లు పంపించారు. ఆదివారం ఉదయం యోగాంధ్ర శిక్షణ తరగతుల నిర్వహణ, ఆ తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించాలని ఆదేశాలు ఇచి్చనట్టు పలువురు సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. ఆదివారం కూడా మండల, జిల్లా అధికారులు విడతల వారీగా సచివాలయ ఉద్యోగులతో టెలీకాన్ఫరెన్స్లు నిర్వహించడంతో సాయంత్రం వరకు పనిచేసినట్లు పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పేరుకే పాలనా సౌలభ్యం.. అంతా వసూళ్ల పర్వం!
సాక్షి, అమరావతి: బాబు పాలనలో ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఉద్యోగులు, అధికారుల బదిలీల్లోనూ అవినీతి కంపు కొడుతోంది. ఈ పరంపరలో వైద్య, ఆరోగ్య శాఖలోని ఔషధ నియంత్రణ విభాగంలో బదిలీల పేరిట భారీ దందాకు తెరలేపారు. సాధారణ బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో కూడా పరిపాలన సౌలభ్యం ముసుగు తొడిగి ఏకంగా 30 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు(డీఐ), ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)లకు స్థాన చలనం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఒకే స్థానంలో మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రాంతాన్ని బట్టి రేటు మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయడానికి రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ గత వారమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఐల్లో 70 శాతం మందిని, ఏడీల్లో సగం మంది బదిలీ చేసేలా రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఫార్మా కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఉమ్మడి విశాఖ, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు అదే విధంగా హోల్సేల్, రిటైల్ షాపులు అధికంగా ఉండే ప్రాంతాలను పలు కేటగిరీలుగా విభజించి వసూళ్ల దందా నడిచిందని ఆ విభాగంలో చర్చనడుస్తోంది.స్థానాన్ని బట్టి ఒక్కో డీఐ నుంచి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు, ఏడీ నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మేర చేతులు మారేలా డీల్స్ నడిచాయని ఔషధ నియంత్రణ విభాగం వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా కీలక ఉన్నతాధికారి ఆకస్మిక బదిలీతో కోరుకున్న చోట పోస్టింగ్ దక్కుతుందా లేదోనని ఇప్పటికే డీల్స్ కుదుర్చుకున్న డీఐలు, ఏడీలు ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. అడ్డగోలు నిర్ణయాలు మరోవైపు కొద్ది నెలలుగా ఈ విభాగంలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నట్టు విమర్శలున్నాయి. ఏసీబీకి పట్టుబడిన ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా వర్క్ ఆర్డర్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలంటే విజిలెన్స్ కమిషన్ అనుమతి తీసుకోవాలి. అయితే ఈ ప్రక్రియ ఏమీ లేకుండానే నేరుగా ఓ అధికారికి పోస్టింగ్ ఇచ్చారు. దీనిపై ఏసీబీ అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన డీఐను అనతికాలంలోనే కీలక స్థానంలో వర్క్ ఆర్డర్పై నియమించారు. ఇలా వర్క్ఆర్డర్ల రూపంలోనూ పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు ప్రచారం సాగుతోంది. -
‘కనెక్టివిటీ’ బాదుడు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తిదారులపై అదనపు భారం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్కో) లిమిటెడ్ సిద్ధమైపోయింది. రాష్ట్రంలో విద్యుత్ గ్రిడ్కు అనుసంధానం కావాలనుకునే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పరిశ్రమలు, భారీ విద్యుత్ వినియోగదారులపై ఆర్థిక భారం వేయడానికి రంగం సిద్ధం చేసింది. గ్రిడ్లోకి విద్యుత్ను పంపినా, తీసుకున్నా అదనపు చార్జీలు మోపుతూ ‘కనెక్టివిటీ ఒప్పందం’ పేరుతో ముసాయిదా నిబంధనలు రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) అనుమతి కోసం పంపిన ముసాయిదాలో అనేక సాంకేతిక, ఆర్థిక భారాలను పూర్తిగా వినియోగదారులపైనే మోపడం చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ ఉత్పత్తిదారులు 132 కేవీ పైబడి ఉన్న కనెక్షన్లకు ఏపీ ట్రాన్స్కోతో, 33 కేవీ స్థాయిలో ఉన్న వాటికి ఏపీ ట్రాన్స్కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కొత్తగా గ్రిడ్కు అనుసంధానమయ్యే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సింక్రనైజేషన్కు ముందే ఒప్పందం కుదుర్చుకోవాలి. అలాగే కొత్త వినియోగదారులకు విద్యుత్ సరఫరా ప్రారంభించే ముందు ఈ ఒప్పందం అమలులో ఉండాలి. ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థలు, వినియోగదారులు మూడు నెలల్లోగా ఒప్పందాలను పూర్తి చేయాలి. ఒప్పందం వరకే అయితే పర్లేదు కానీ ఆ తర్వాత మోపే భారాలను చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయంటున్నారు పారిశ్రామికవేత్తలు. ఒప్పందం చేసుకోకుంటే జరిమానాలు ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ వినియోగం లేదా విక్రయం జరిగితే ట్రాన్స్మిషన్, వీలింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గ్రిడ్కు అనుసంధానం కోసం అవసరమైన ఇంటర్ కనెక్షన్ సదుపాయాల నిర్మాణ వ్యయం మొత్తాన్ని అభివృద్ధిదారులు లేదా వినియోగదారులే భరించాలి. అంతేకాకుండా నిర్వహణ, మరమ్మతులు, పరికరాల మార్పిడి ఖర్చులు కూడా వారిపైనే ఉంటాయి. దీంతో కొత్తగా విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలపై అదనపు భారం పడనుంది. ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ విక్రయాలు లేదా వినియోగం చేపట్టే సంస్థలు ట్రాన్స్మిషన్, వీలింగ్, ఆంధ్రప్రదేశ్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఏపీఎస్ఎల్డీసీ) ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెరుగుతున్న నిర్వహణ వ్యయాలకు ఇవి అదనంగా చేరనున్నాయి. వాణిజ్య ఒప్పందం లేకుండా గ్రిడ్లోకి విద్యుత్ను పంపినా, గ్రిడ్ నుంచి తీసుకున్నా జరిమానాలు, అదనపు చార్జీలు విధిస్తామని ముసాయిదా హెచ్చరిస్తోంది. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న చిన్న సంస్థలకు ఇది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సౌర, పవన ప్రాజెక్టులపై కఠిన నిబంధనలు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు లో ఓల్టేజ్ రైడ్ త్రూ(ఎల్వీఆర్టీ), హై ఓల్టేజ్ రైడ్ త్రూ(హెచ్వీఆర్టీ), రియాక్టివ్ పవర్ సపోర్ట్ వంటి ప్రత్యేక సాంకేతిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదనంగా పవర్ కంట్రోల్ వ్యవస్థలు కూడా తప్పనిసరి చేశారు. దీంతో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయం పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ప్రాజెక్టు ఏపీఎస్ఎల్డీసీతో అనుసంధానమయ్యేలా స్కాడా, కమ్యూనికేషన్, డేటా టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు కూడా పూర్తిగా వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే మీటరింగ్, రక్షణ వ్యవస్థలు, పరికరాల పరీక్షలు, నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు వంటి ఖర్చులన్నీ వినియోగదారులపైనే వేశారు. వీటిలో ఏవైనా లోపాలు తలెత్తినా సంబంధిత సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలపై పరిశ్రమవర్గాల్లో ఆందోళన ఇప్పటికే విద్యుత్ రంగంలో పెట్టుబడుల వ్యయం పెరుగుతున్న నేపధ్యంలో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ప్రైవేట్ విద్యుత్ ప్రాజెక్టులు, పరిశ్రమలు వెనుకడుగు వేసే అవకాశముందని పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పునరుత్పాదక విద్యుత్ రంగంలో కొత్త పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఇంధనరంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నిబంధనలన్నీ గ్రిడ్ భద్రత, విద్యుత్ నాణ్యత, వ్యవస్థ విశ్వసనీయత కోసం అవసరమని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను వెల్లడించాల్సిందిగా (ఏపీఈఆర్సీ) ఆహ్వానించింది. ఈ – మెయిల్ లేదా పోస్టు ద్వారా జూన్ 19 లోపు కమిషన్ కార్యదర్శికి పంపవచ్చని తెలిపింది. -
పాలకూట విషం!
చీరాల టౌన్: చాలామంది యజమానులు ఎక్కువ పాలు సేకరించేందుకు పాడి గేదెలకు చెందిన దూడలకు సరిపడా పాలు తాగకుండా తల్లి నుంచి దూరం చేస్తున్నారు. అవి పాలు సరిపడక అనారోగ్యానికి గురై చనిపోతున్నాయి. గేదెకు పొదుగు నుంచి రొమ్ముల వరకు పాలు రావాలంటే దూడ కొద్దిసేపు పొదుగు వద్ద సేపేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంది. దూడ లేకుంటే మిగులు పాలన్నీ అమ్మవచ్చనే దూరాలోచనతో దూడ బదులు నిషేధిత డ్రగ్ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను రోజుకు రెండుసార్లు గేదెలకు వేసి మొత్తం పాలు పిండుతున్నారు.ఈ ఇంజెక్షన్ హర్మోన్లను ప్రభావితం చేస్తుంది. గేదె సేపాలంటే దూడ కనీసం పది నిమిషాలపాటు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ అదే రెండు రూపాయలు విలువైన ఆక్సోటోసిన్ ఒక్క ఇంజెక్షన్ వేస్తే చాలు క్షణాల్లో గేదె సేపి పొదుగు నుంచి పాలు కారిపోతాయి. గేదెలకు ఉదయం 2 ఎంఎల్, సాయంత్రం 2 ఎంఎల్ చొప్పున ఒక్కో గేదెకు వేస్తున్నారు. అంత ప్రమాదకర ఈ ఇంజెక్షన్ను నోరులేని జీవాలు తట్టుకోవడం చాలా కష్టం. బాపట్ల జిల్లాలోని చీరాల, బాపట్ల, పర్చూరు, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో 2024లో నిర్వహించిన 21వ పశుగణన ప్రకారం ఆవులు 21,930, గేదెలు 3,81,764, గొర్రెలు 2,49,394, మేకలు 30,691 ఉన్నాయి. వీటిలో పశువుల నుంచి పాలు తాగే దూడలు చాలా తక్కువే అని చెప్పవచ్చు. ప్రమాదకర హర్మోన్లు ఉన్న ఇంజెక్షన్లను పాడి గేదెలకు వేయడం వలన గేదెలు ఎదకు రాకపోవడం, గర్భసంచి వంటి భాగాలకు జబ్బులు సోకడంతోపాటు తక్కువ కాలానికే ఆ గేదెలు చనిపోతున్నాయి. నిషేధించిన ప్రభుత్వం ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల వాడకంతో ఆ పాలు తాగిన వారితోపాటు పశువులు అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో చాలా కాలంగా ఈ ఇంజెక్షన్లను ప్రభుత్వం నిషేధించింది. కానీ చాటుమాటున చెన్నై వంటి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. చీరాల పట్టణంలోని పశువు మందులు అమ్మే దుకాణాల్లో చాలా వాటిల్లో వీటి అమ్మకాలు చేస్తున్నారు. రూరల్ గ్రామాల్లోని పశుపోషకులకు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అయినా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మూమూళ్ల మత్తులో పడి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ పరంగా కూడా కనీస చర్యలు కొరవడ్డాయి. ఆ పాలు తాగితే అనర్థాలు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వాడిన గేదెల పాలు తాగితే అనేక అనర్థాలు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రమాదకర హర్మోన్లు కలిసిన పాలు తాగితే క్యాన్సర్ వంటి జబ్బులు వస్తాయని చెబుతున్నారు. కళ్ల జబ్బులతోపాటు ఆడ పిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ కావడం, రొమ్ములు పెరగడంతోపాటు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. తనిఖీలు శూన్యం చీరాలతోపాటుగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సేపు ఇంజెక్షన్లు విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నా కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు కనీసం మూడు నెలలకు ఒకసారి కూడా తనిఖీలు చేయడం లేదు. చీరాల్లో ప్రాంతీయ డ్రగ్ ఇన్స్పెక్టర్ (ఔషధ నియంత్రణ అధికారి) కార్యాలయం ఉన్నా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు రవాణా అవుతున్నా కూడా కట్టడి చేయలేని స్థితిలో ఉన్నారు. -
జెన్ ఆల్ఫా.. జెట్ స్పీడ్
సాక్షి, అమరావతి: ఒరే కన్నా దుకాణానికి వెళ్లి అది తెచ్చు. తల్లీ టిఫిన్ షాపునకు వెళ్లి ఇడ్లీ తెచ్చు. కరోనా ముందు వరకూ పిల్లలకు తల్లిదండ్రులు చెప్పినమాటలు. ప్రస్తుతం ఆ రోజులు మారాయి. టెక్నాలజీ పుణ్యమా అని జెన్ ఆల్ఫా( పిల్లలు) తల్లిదండ్రులకే కొనుగోలు పాఠాలు చెబుతున్నారు. ఫుడ్ నుంచి పానీయాలు, ఇతర వస్తువులు సైతం ఏమి కొనుగోలు చేయాలో.. ఏ వస్తువు ఎక్కడ కొనాలో పిల్లలే డిసైడ్ చేస్తున్నారు. 2010–2024 మధ్య జన్మించిన పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రుల కొనుగోలు విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నట్లు ప్రైస్ వాటర్హౌస్ కూపర్ (పీడబ్ల్యూసీ) విడుదల చేసిన జెనరేషన్ ఆల్ఫా 2026లో పేర్కొంది. కరోనా సమయంలో క్లాసులు ఆన్లైన్లో జరగడంతో జెన్ ఆల్ఫా పిల్లలు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్ల వినియోగంలో ఆరితేరినట్టు ఆ నివేదిక వెల్లడించింది. 70 శాతం చిన్నారులకు సొంత ఫోన్లు, ట్యాబ్లు ఏడు నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 70 శాతం మంది సొంత ఫోన్ లేదా ట్యాబ్ కలిగి ఉన్నారని వెల్లడించింది. వీరిలో 97 శాతం మంది కొనుగోళ్ల విషయంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. రోజులో 3.6 గంటలు ఫోన్లతోనే.. జనరేషన్ ఆల్ఫా పిల్లలు బయట ప్రపంచంతో కంటే ఫోన్ చూస్తూ కాలక్షేపం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సర్వే వెల్లడించింది. సగటున కనీసం 3.6 గంటలు వినోదం కోసం ఫోన్లు చూస్తున్నట్లు పేర్కొంది. బయట ఆడుకోవడానికి లేదా చదువుకోవడానికి వెచ్చించే సమయం కంటే రెట్టింపు సమయం ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. 68 శాతం మంది యూట్యూబ్ చూస్తుంటే, 54 శాతం మంది గేమింగ్ ప్లాట్ఫామ్స్, 49 శాతం స్ట్రీమింగ్ సర్వీసెస్, 29 శాతం మంది టిక్టిక్తో కాలక్షేపం చేస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్లలో అగ్రస్థానం ఆహారం, పానీయాలదే ఆన్లైన్ వ్యయాల్లో చూస్తే ఆహారం, పానీయాలదే తొలిస్థానం. జెన్ ఆల్ఫా ఆన్లైన్షాపింగ్లో 72 శాతం ఫుడ్ అండ్ డ్రింక్స్ ఉండగా, 57 శాతంతో బొమ్మలు కొనుగోళ్లు రెండోస్థానంలో ఉంది. దుస్తులు 55 శాతం, 53 శాతం డిజిటల్ యాప్స్ ఉన్నాయి. పిల్లలు ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నా నగదు చెల్లింపులు పెద్దలే చేస్తుండడం గమనార్హం. జెన్ఆల్ఫా పిల్లలు కేవలం కంటెంట్ను వినియోగించుకోవడమే కాకుండా ఆన్లైన్లో నేర్చుకున్న వాటిని ఉపయోగించి తమ కుటుంబాలు డబ్బు ఖర్చు చేసే విధానాన్ని కూడా మారుస్తున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. -
22 జిల్లాల్లో పూర్తిస్థాయి డీఈవోలు లేకుండానే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో పాలన గాడితప్పింది. జిల్లా వ్యవహారాలు పర్యవేక్షించే జిల్లా విద్యాశాఖాధికారులు(డీఈవోలు) లేకుండానే 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభమైపోయింది. స్కూళ్ల పర్యవేక్షణ, ఉచిత పుస్తకాల పంపిణీ, విద్యార్థుల బాగోగులతో పాటు విద్యాసంబంధమైన అన్ని వ్యవహారాలు చక్కబెట్టే కీలక అధికారులు లేకుండానే ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. రాష్ట్రంలో 22 జిల్లాలకు పూర్తిస్థాయి డీఈవోలు లేరు. వీరిస్థానంలో అసిస్టెంట్ డైరెక్టర్లు, డైట్ లెక్చరర్లు డీఈవో కేడర్లో కొనసాగుతున్నారు.అర్హతలున్న సీనియర్ అధికారులను పక్కనబెట్టి జూనియర్లను ఉన్నతస్థాయి పోస్టుల్లో నియమించారు. పూర్తిస్థాయి డీఈవోలు ఉంటే తమ పనులకు అడ్డు తగులుతారనుకున్నారో లేక సొంత పనులు చేసేవారు ఉండరనుకున్నారోగానీ డీఈవోలను నియమించేందుకు మాత్రం ప్రభుత్వం సుముఖత చూపడం లేదన్న విమర్శలు విద్యాశాఖలో వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరుకు డీఈవోను నియమించలేని దయనీయస్థితిలో విద్యాశాఖ ఉంది. గత డిసెంబర్లో సర్వీస్ రూల్స్ను పక్కనబెట్టి అనర్హులకు డీఈవోలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించి స్థానిక కూటమి నాయకులు సొంత వ్యవహరాలు చక్కబెట్టుకుంటున్నట్టు విమర్శలున్నాయి. సీనియారిటీకి, అర్హతలకు తిలోదకాలు విశాఖ, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలు తప్ప మిగిలిన 22 జిల్లాల్లో డీఈవోలుగా జూనియర్ అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగుల సర్వీస్ నిబంధనల ప్రకారం రెగ్యులర్ డీఈవో పోస్టుకు ఏ అర్హతలు ఉండాలో పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) ఇవ్వాలన్నా అవే అర్హతలు తప్పనిసరి. కానీ ప్రభుత్వం కరెన్సీకి ప్రాధాన్యమిచ్చి నిబంధనలకు తిలోదకాలిచ్చిందన్న ఆరోపణలున్నాయి. గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం 13 జిల్లాల డీఈవోలను బదిలీ చేసింది. అంతకుముందు మరికొందరిని సర్దుబాటు చేసింది.ఈ ప్రక్రియలో ఎక్కడా సీనియారిటీని పట్టించుకోలేదు. డీఈవోల నియామకంలో తొలుత డిప్యూటీ డైరెక్టర్లకు అవకాశం కల్పించాలి. కానీ వారిని ప్రాధాన్యం లేని శాఖల్లో సర్దుబాటు చేశారు. ఇక గతేడాది పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ సుమారు 100 మంది అసిస్టెంట్ డైరెక్టర్ల సీనియారిటీ లిస్టును విడుదల చేసింది. ఇందులో అత్యంత జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్లకు 22 జిల్లాల డీఈవోలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే 78 డీవైఈవో పోస్టుల్లో అసిస్టెంట్ డైరెక్టర్లను నియమించాల్సి ఉన్నా, పలుచోట్ల టీచర్లకు అదనపు బాధ్యతలు, మరికొన్నిచోట్ల ఫిజికల్ డైరెక్టర్లను నియమించడంపై విమర్శలొస్తున్నాయి. ఉపాధ్యాయులకు ‘పేమెంట్’ బదిలీలు!ఏటా ఉపాధ్యాయ బదిలీలుంటాయని, ఇందులో ఎవరి సిఫారసులు ఉండవని, అంతా పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో చేపడతామని గతేడాది చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం–2025 తీసుకొచ్చింది. దీని ప్రకారం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బదిలీలు ఉంటాయన్నారు. కానీ చట్టంలోని ఓ నిబంధనను అడ్డుపెట్టుకుని రెండేళ్లుగా ‘పేమెంట్ బదిలీలు’ చేపడుతున్నారు. చట్టంలో అభ్యర్థన/పరస్పర/అంతర్ జిల్లా/అంతర్ రాష్ట్ర బదిలీలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్న క్లాజ్తో అంతా చక్కబెట్టుకుంటున్నారు.స్థానిక నాయకుల సిఫారసు లేఖలతో ఇన్చార్జి డీఈవోలతో అక్రమ బదిలీలకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది బదిలీల నిషేధ సమయంలో 150 మందికి పైగా సిఫారసు లేఖలు తెచ్చుకున్న ఉపాధ్యాయులకు అంతర్ జిల్లాల బదిలీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కూడా భారీగా సిఫారసు బదిలీలు చేపట్టారు. ఒక్కో బదిలీకి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్టు ఉపాధ్యాయులే చెబుతున్నారు. తాజాగా విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో మరిన్ని బదిలీలకు రంగం సిద్ధం చేశారంటే పాఠశాల విద్యాశాఖలో అక్రమాలు ఎంత యథేచ్ఛగా జరుగుతున్నాయో తెలుస్తోంది. -
పీహెచ్డీ చేసిన వారికన్నా... ఎంఫిల్ వారికి రూ. 5వేలు ఎక్కువ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిపాలనా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది. ఒక్కో వర్సిటీ.. ఒక్కోదారి చందాన వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ జీవోలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన ఆర్థికపరమైన అంశాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకుల సిఫారసులు, మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్ కార్యకలాపాలు సాగిస్తూ వర్సిటీ ప్రతిష్టను మసకబారుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవో నంబర్ 110కు పూర్తి విరుద్ధంగా అంబేడ్కర్ వర్సిటీలో పని చేస్తున్న 15 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు ఏకంగా రూ.5వేలు జీతం పెంచిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పీహెచ్డీ చేసిన వారికన్నా ఎంఫిల్ డిగ్రీ ఉన్నవారికి రూ.5వేలు అదనంగా చెల్లిస్తుండటం గమనార్హం. అదేవిధంగా ఏపీలోని 19 యూనివర్సిటీల్లో కేవలం అంబేడ్కర్ వర్సిటీలో మాత్రమే కాంట్రాక్టు అధ్యాపకులకు జీతాలు పెంచడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు అధ్యాపకులకు మేలు చేస్తూ జీవో 110 జారీ దశాబ్దాలుగా యూనివర్సిటీల్లో కాంట్రాక్టు పద్ధతిపై అరకొర జీతాలతో సేవలందిస్తూ మగ్గిపోతున్న అధ్యాపకులకు మేలు చేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవో 110 జారీ చేసింది. నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్(నెట్), స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్(సెట్), స్టేట్ లెవల్ ఎలిజిబులిటీ టెస్ట్(స్లెట్)లో యూజీసీ నిబంధనలకు అనుగుణంగా అర్హత సాధించిన వారికి రూ.35వేల ఏకరూప జీతాలను తీసుకొచ్చింది. దీనికి అదనంగా పీహెచ్డీ ఉన్నవారికి మరో రూ.5వేలు పెంచింది. దీనితోపాటు కాంట్రాక్టు ఉద్యోగి సర్వీసును బట్టి ఏడాదికి మరో వెయ్యి చొప్పున అదనంగా పెంచుతూ రూ.50 వేల నుంచి రూ.60వేలకు పైగా జీతాలను పెంచారు. ఆ తర్వాత కూడా ఏడాదిలో రెండు పరిశోధన పత్రాలు సమర్పించిన కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనిని దిగ్విజయంగా అన్ని వర్సిటీల్లో అమలు చేసి కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అంబేడ్కర్ యూనివర్సిటీలో జీవో 110ను తుంగలో తొక్కి ఎంఫిల్ ఉంటే అదనంగా మరో రూ.5వేలు పెంచుతూ ఈ ఏడాది జనవరి 19న ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నంబర్ 110లో ఎంఫిల్ ప్రస్తావన లేకపోయినా వర్సిటీ అధికారులు మాత్రం నెట్, సెట్, స్లెట్తోపాటు పీహెచ్డీ అర్హతలు గలవారికి గతంలో పెంచిన జీతానికి అదనంగా ఎంఫిల్ ఉంటే మరో రూ.5వేలు పెంచడంతో మిగిలిన వర్సిటీ అధ్యాపకులు కూడా తమకు అదే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 15 మందికి ఎంఫిల్ పేరుతో జీతాలు పెంచగా, ఇందులో నలుగురైదుగురికి ఎంఫిల్ పట్టా లేకపోవడం గమనార్హం. దీనిపై వర్సిటీల వర్గాలు చాన్సలర్, గవర్నర్కు ఫిర్యాదు చేయడం గమనార్హం. రాజకీయ పీఠానికి వీసీ దాసోహం.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 18 వర్సిటీల్లోని 17 మంది వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించారు. అంబేడ్కర్ వర్సిటీ వీసీ మాత్రం యథావిధిగా పదవిలో కొనసాగుతున్నారు. స్థానిక రాజకీయ నాయకుల సిఫారసుతో వీసీ కుర్చీని కాపాడుకున్న కారణంగా, వారు చెప్పింది చేయడమే పరమావధిగా పెట్టుకున్నారు. ఫలితంగా వర్సిటీలో పరిపాలనా వ్యవస్థ గాడితప్పింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా గతంలో ఇద్దరు ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించి వార్తల్లో నిలిచారు. 11 మంది గెస్ట్ ఫ్యాకల్టీలను కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మార్పు చేశారు. రాజకీయ నాయకుల సిఫారసు లేఖల ఆధారంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందారనే కారణంతో ఏకంగా 34 మంది చిరుద్యోగులను అర్ధాంతరంగా తొలగించి నడిరోడ్డుపై పడేశారు. ఆ వెంటనేమరో 65 మందికి ఎటువంటి నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కొలువుల్లో కూర్చోబెట్టడం గమనార్హం. వర్సిటీలో అర్హతలు, నిబంధనలను కాలరాస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్సీ చిరంజీవి, ఎమ్మెల్యే కూన రవికుమార్ లేఖల ఆధారంగా ఉద్యోగాలు కట్టబెట్టేయడమే వీసీ పనిగా పెట్టుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం కూడా తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. -
అంగన్వాడీలు ఉద్యమానికి సిద్ధం కండి
సాక్షి, అమరావతి: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు ఉద్యమానికి సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. జూలై 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలను విజయవంతం చేయాలని కోరారు. విజయవాడలో ఆదివారం యూనియన్ అధ్యక్షురాలు జి.బేబీరాణి అధ్యక్షతన అంగన్వాడీల రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. అనంతరం సుబ్బరావమ్మ మీడియాతో మాట్లాడుతూ..అంగన్వాడీలకు కనీస వేతనమివ్వాలని, పెన్షన్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఐసీడీఎస్కు నిధులు తగ్గించి లబ్ధిదారులకు ఫీడింగ్ సక్రమంగా అందకుండా చేస్తోందన్నారు. అనేక రకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీలపై పనిభారం పెంచి ప్రీసూ్కల్ జరగనివ్వకుండా చేస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు ఏడాదికి 10 శాతానికి పైగా పెరుగుతున్నాయని, ప్రభుత్వం మాత్రం అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. బాబు ప్రభుత్వం పెట్టుబడిదారులకు రూ.లక్షల కోట్లు రాయితీలు ఇస్తోందని, పారిశ్రామికవేత్తలకు 99పైసలకే భూములను ధారాదత్తం చేస్తోందని, అంగన్వాడీల సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదన్నారు. -
ఆర్యవైశ్యుల పాలిట ద్రోహి చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఆర్యవైశ్యుల పాలిట ద్రోహిగా సీఎం చంద్రబాబు మిగిలిపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో వెలంపల్లి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని, చంద్రబాబు పాలనలో తమ సామాజికవర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో డీబీటీ పథకాల ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి వ్యాపారులకు వైఎస్ జగన్ ఊతమిచ్చారని చెప్పారు. ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య వంటి పథకాల ద్వారా అగ్రవర్ణ పేదలకు పెద్ద ఎత్తున మేలు జరిగిందని వివరించారు. తద్వారా వ్యాపారాలు బాగా జరిగాయని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నీ నిలిచిపోయాయని, మహిళలకు హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి అమలు కాకపోవడంతో పాటు తల్లికి వందనం వంటి పథకాలూ నిర్వీర్యమయ్యాయన్నారు. దీంతో ఆర్యవైశ్యుల వ్యాపారాలు దెబ్బతిన్నాయని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎండోమెంట్ పరిధిలోని ఆర్యౖవెశ్య సత్రాలు, ట్రస్టులను వారే నిర్వహించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. విజయవాడలో ఆర్యవైశ్య భవనం నిర్మాణం, కర్నూలులో పేద ఆర్యవైశ్య విద్యార్థుల హాస్టల్ భవనం కోసం నిధులు మంజూరు, పెనుగొండలో వాసవీ మాత ఆలయాభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయించడం వంటి అనేక చర్యల ద్వారా ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్ జగన్ చేసినంతగా మరే నాయకుడు చేయలేదని వివరించారు. వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ పరిరక్షణకు వైఎస్ జగన్ విశేష కృషి చేశారు. చింతామణి నాటకాన్ని నిషేధించి ఆ వర్గం మనోభావాలను గౌరవించిన ఘనత ఆయనకే దక్కుతుంది. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ రఘురామకృష్ణరాజు మాట్లాడితే.. ఆయన్ను చంద్రబాబు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ని చేశారు. ఆర్యవైశ్యులకు మంచి రోజులు త్వరలోనే వస్తాయి’ అని చెప్పారు.వైఎస్సార్సీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ఆర్యవైశ్యులకు వైఎస్సార్సీపీ జెండా అండగా నిలిచింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంఅన్ని వర్గాలపై వేధింపులే లక్ష్యంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్ హయాంలో కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు శాశ్వతం కావు. ప్రజలకు మళ్లీ మంచి రోజులు వస్తాయి. ఆర్యవైశ్యులు శాంతియుత వాతావరణాన్ని కోరుకునే వర్గం. తమ కష్టంతో ఎదిగే వారికి ప్రభుత్వం భద్రత, ప్రశాంతత కల్పించాలి. వారి సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచి్చన తర్వాత కృషి చేస్తుంది’ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ ఆర్యవైశ్య విభాగం నాయకులు గుబ్బా చంద్రశేఖర్, రేబాల శ్రీను, మిట్టా కరుణాకర్, మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి కనికరమే లేదు
సాక్షి, అమరావతి: ‘వారం కిందట కర్నూల్లో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య.. మొన్న గుంటూరులో ఉద్యోగికి బ్రెయిన్ స్ట్రోక్.., రెండు రోజుల కిందట అనకాపల్లి జిల్లాలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య... పని ఒత్తిడి భరించలేక ఉద్యోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి ఏ మాత్రం కనికరం కలగడం లేదు’ అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మకమైన సచివాలయ వ్యవస్థ, ప్రస్తుత ప్రభుత్వ మితిమీరిన ఒత్తిడి, వేధింపులతో ఉద్యోగుల పాలిట యమపాశంగా మారుతోందని తప్పుపట్టారు. వారం రోజుల్లో జరిగిన ఈ మూడు సంఘటనలు ఇందుకు నిదర్శనమని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ ఉద్యోగులకు ఒక టైమింగ్ లేదు, ఒక సెలవు లేదు, ఒక పండగ లేదని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోగా.. సచివాలయం ఉద్యోగులకు పని లేదంటూ వేల మందిని డిప్యుటేషన్ పేరుతో బదిలీ చేసి మిగిలిన ఉద్యోగులకు ఇన్చార్జి పేరుతో పనిభారం వేసిందని పేర్కొన్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులు తమ పనే కాకుండా అదనపు పనితో పాటు వలంటీర్ల పని కూడా చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ‘ఇంకా ఎంత మంది చనిపోతే సీఎం స్పందిస్తారు. వంద మంది ప్రాణాలు పోయినా మీకు కనికరం కలగడం లేదా? సచివాలయ ఉద్యోగుల మీద ఎందుకు ఇంత కక్ష? ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారే, ఇదేనా అనుకూల వాతావరణం? ఉద్యోగులకు గుండెపోటు తెప్పించడమేనా అనుకూల పనివాతావరణం? ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వేధించడమేనా అనుకూల పని వాతావరణం?’అని ప్రశ్నించారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సక్రమంగా ఇవ్వండినిరంతరం ఇంటింటి సర్వేలతో పాటు యోగాంధ్ర, అక్షరాంధ్ర కార్యక్రమాలు ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసే కార్యక్రమాలను సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తున్న ప్రభుత్వం.. అన్ని పనులు ఒకే సారి చెప్పి ఒత్తిడి చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు వారి జాబ్ చార్ట్ ప్రకారం పనులు అప్పగించాలని, వారికి న్యాయబద్ధంగా రావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సక్రమంగా ఇవ్వాలని కోరారు. ‘సచివాలయ ఉద్యోగ మిత్రులారా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా నిలబడండి. మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తోడుగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
మీ ఇంటికే వస్తున్నాం ‘సర్’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్)లో భాగంగా సోమవారం నుంచి ఇంటింటా సర్వే ప్రారంభం అవుతోంది. బీఎల్వో (బూత్ లెవెల్ ఆఫీసర్), రాజకీయ పార్టీలు నియమించుకున్న బీఎల్ఏ (బూత్ లెవెల్ ఏజెంట్)లతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాల్లో పేర్లను సరిచూస్తారు. రాష్ట్రంలో 2002లో చివరిసారిగా ఎస్ఐఆర్ (సర్) జరిగింది. తిరిగి 24 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే 13 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాగా.. మూడో దశలో 16 రాష్ట్రాల్లో జరగనుంది. ఏపీ,తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఈ విడతలోనే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే జరుగుతోంది. ఏపీకి చెందిన ఓటర్లలో కొందరు ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లడంతో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి జూన్ 15 నుంచి ఏపీలో జరిగే ఎస్ఐఆర్లో ఓటు హక్కును కాపాడుకునే బాధ్యత ఆయా ఓటర్లపైనే ఉంది. 3.75 కోట్ల ఓట్లు సేఫ్ ఎస్ఐఆర్లో అత్యంత కీలకమైనది ఓటర్ మ్యాపింగ్. 2002 ఎస్ఐఆర్ తర్వాత ప్రకటించిన తుది ఓటరు జాబితాతో 2024 ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేస్తున్నారు. 2024 ఓటరు జాబితాలో ఓటుహక్కు ఉన్నవారు 2002 ఓటర్ల జాబితాలో ఓటుహక్కు కలిగి ఉండటం లేదా వారి తల్లిదండ్రులు, సమీç³ బంధువుల ఓటు ఉంటే వాటితో మ్యాపింగ్ చేస్తారు. ఇలా మ్యాపింగ్ జరిగిన ఓట్లు కొనసాగుతాయి. జూన్ 14న మధ్యాహ్నంతో మ్యాపింగ్ను ముగించారు. జూన్ 13 సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 76% ఓటర్ల మ్యాపింగ్ జరిగిందని, ఇది 80% దాటుతుందని అంచనా వేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ‘సాక్షి’కి తెలిపారు. 2024 ఓటర్ల జాబితా ప్రకారం ఏపీలో 4,16,27,694 మంది ఓటర్లు ఉంటే.. అందులో ఇప్పటివరకు 3.75 కోట్ల మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. 42 లక్షల ఓట్లు మాత్రం మ్యాపింగ్ కాలేదు. జూన్ 15 నుంచి ఇంటింటా జరిగే సర్వేలో ఈ 42 లక్షల మంది సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే తమ ఓటుహక్కును కాపాడుకోగలుగుతారు. మ్యాపింగ్ పూర్తయిన వారు ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికి రాష్ట్రంలో ఎన్నిసార్లు ఎన్నికల్లో పాల్గొన్నా.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా విధిగా ఎన్యుమరేషన్ ఫారం పూర్తిచేసి ఇవ్వాల్సిందే. ఆ ఫారాలు సకాలంలో ఇచ్చిన వారి ఓట్లు మాత్రమే కొనసాగుతాయి. ఎన్యుమరేషన్ ఫారం, ఫొటో తప్పనిసరి సర్ ప్రక్రియలో బీఎల్వో కీలకపాత్ర పోషించనున్నారు. ప్రతి పోలింగ్ బూత్కు ఒక బీఎల్వోను నియమించారు. ఏపీలో 46,397 మంది బీఎల్వోలున్నారు. మీ బీఎల్వో ఎవరన్నది సులభంగా తెలుసుకోవచ్చు. voters.eci.gov.in లేదా ఈసీఐనెట్ యాప్లో ‘నో యువర్ బీఎల్వో’ లేదా ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్వో’ ఆప్షన్ వినియోగించుకోవడం ద్వారా మీ బీఎల్వో పేరు, ఫోన్ నంబర్ తెలుసుకోవచ్చు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు బీఎల్వోను సంప్రదించి ముందస్తుగా మీ ఇంటికి వచ్చే తేదీని తెలుసుకుంటే ఆ సమయానికి ఓటర్లు అక్కడ ఉండి ఓటును కాపాడుకోవచ్చు.ఇంటింటా సర్వే సమయంలో బీఎల్వో ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం ఇస్తారు. మ్యాపింగ్ పూర్తయిన ఓటర్ వివరాలను ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారం ఇస్తారు. దానిపై ఈ మధ్యనే తీయించుకున్న ఒక కలర్ ఫొటో అతికించి ఇస్తే సరిపోతుంది. మ్యాపింగ్ పూర్తికాని వారికి ఖాళీ ఎన్యుమరేషన్ ఫారం ఇస్తారు. ఆధార్, మొబైల్ నంబర్తో పాటు తల్లి/తండ్రి లేదా సమీప బంధువుల ఓటరు ఐడీ నంబర్లను అందులో పేర్కొనాలి. మ్యాపింగ్ కానివారు కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన సమాచారంతో బీఎల్వో సంతృప్తి చెందితేనే మీ ఓటు కొనసాగుతుంది. 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో అన్నది https:// voters. eci. gov. in/ అనే వెబ్సైట్లో ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్’ అనే ఆప్షన్ను క్లిక్ చేసి చూసుకోవచ్చు. ముసాయిదా ఓటర్ల జాబితాయే కీలకం ఇంటింటా సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితా ప్రతి బీఎల్వో దగ్గర ఉంటుంది. http:// www. ceoandhra. ap. gov. in/ నుంచి డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఈ జాబితాలో మీ ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరు విధిగా సరిచూసుకోవాలి. ఈ జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయండి. ఈ అభ్యంతరాలను ఆగస్టు 20లోపే స్వీకరిస్తారు. ఇలా వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 18లోగా పరిష్కరించి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి 3 రకాల ఫారాలు ఉంటాయి. జూలై 1లోగా మీకు 18 ఏళ్లు నిండినా.. కొత్తగా ఓటరుగా నమోదు కాకపోతే ఫారం–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అలాగే చనిపోయిన లేదా వలస వెళ్లిన వారిని ఓట్లు ఉంటే వాటిని తొలగించడానికి ఫారం–7, జాబితాలో ఓటు లేకపోయినా.. వేరే చోటుకు ఓటు బదలాయించడానికి ఫారం–8ని ఉపయోగించాలి. ఈ తేదీలను గుర్తుంచుకోండి» జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్వోలు సర్వే కోసం ఇంటింటికీ వస్తారు » జూలై 21న ముసాయిదా జాబితా విడుదల » ఆగస్టు 20 వరకు అభ్యంతరాల స్వీకరణ » సెప్టెంబర్ 18లోగా అభ్యంతరాల పరిష్కారం » సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల » జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు.మ్యాపింగ్ కానివారు వీటిలో ఏదో ఒక ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి1. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఉద్యోగి లేదా పెన్షన్ వంటి ఏదైనా గుర్తింపు కార్డు 2. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్ఐసీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు జారీ చేసిన గుర్తింపు కార్డులు లేదా ధ్రువీకరణ పత్రాలు 3. జనన ధ్రువీకరణ పత్రం 4. పాస్పోర్టు 5. విశ్వవిద్యాలయాలు లేదా సంబంధిత బోర్డులు జారీ చేసిన విద్యార్హత కార్డులు 6. సంబంధిత రాష్ట్రాలు జారీ చేసిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం 7. అటవీ హక్కులకు చెందిన పత్రం 8. సంబంధిత శాఖలు జారీ చేసిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు 9. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ 10. రాష్ట్ర, స్థానిక అథారిటీలు జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టర్ 11. ప్రభుత్వం జారీ చేసిన భూమి, గృహ కేటాయింపుల సర్టిఫికెట్ -
‘సర్’తో కొన్ని వర్గాల ఓట్లు తొలగించే కుట్ర
నెల్లూరు(అర్బన్): దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో ఎన్నికల కమిషన్, మిలిటరీ దళాలను గుప్పెట్లో పెట్టుకుని కొన్ని వర్గాల ప్రజలకు ఓట్లు లేకుండా చేస్తున్నారని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆరోపించారు. సర్ ప్రక్రియలో భాగంగా ఓట్లు తొలగించిన 20 మంది సుప్రీంకోర్టుకు వెళ్లి తాము బతికే ఉన్నామని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. నెల్లూరులో ఆదివారం డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో జెట్టి శేషారెడ్డి 18వ స్మారక రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘వికసిత్ భారత్– భ్రమలు, వాస్తవాలు’ అనే అంశంపై పరకాల మాట్లాడారు. ఇప్పటి వరకు సర్ ప్రక్రియ ద్వారా 6.5 కోట్ల మంది ఓట్లను తొలగించారని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికల ముందు సర్ పేరుతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని తెలిపారు. రానున్న రోజుల్లో 16 కోట్ల మంది ఓట్లను తొలగిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వాటిపై ప్రశ్నించకుండా ఉండేందుకు వికసిత్ భారత్ పేరుతో డ్రామాలాడుతూ కుల, మత, భాషాపరంగా ప్రజలను విభజన చేస్తున్నారని వివరించారు. ఇలాంటి దారుణాలను ఎదుర్కోవాలంటే ప్రజలు రోడ్ల మీదకు రావాలని, పోరాటాలు చేయాలని పరకాల పిలుపునిచ్చారు. స్కిల్ ఇండియా ఒక స్కామ్దేశంలో గడిచిన వందేళ్లలో లేనంతగా ప్రస్తుతం ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోయాయని, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పరకాల ప్రభాకర్ చెప్పారు. విద్య, వైద్యం, అక్షరాస్యత... ఇలా పలు రంగాల్లో అనేక చిన్న దేశాల కంటే భారత్ వెనుకబడి ఉందన్నారు. ఉత్పాదక రంగంలో 133వ స్థానానికి, ఆకలి సూచీలో 102 స్థానానికి మన దేశం దిగజారిపోయిందని తెలిపారు. అయినా భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిలో 5వ స్థానంలో ఉందని పాలకులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దేశంలో ప్రధాన మంత్రి కౌసల్ యోజన (స్కిల్ ఇండియా) పెద్ద స్కామ్గా మారిపోయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసిందని చెప్పారు. స్కిల్ ఇండియా ద్వారా శిక్షణ పొందినట్లు చెబుతున్న వారిలో 61 లక్షల మంది పేర్లు, ఊçర్లు లేవన్నారు. 12 వేల మంది మళ్లీ మళ్లీ శిక్షణలో పాల్గొంటున్నట్లు తేలిందన్నారు. శిక్షణ పొందిన 34 లక్షల మంది ఇళ్లకు వెళ్లి పరిశీలించగా, వారికి స్టైఫండ్ అందలేదన్నారు. కాగ్ నివేదిక ప్రకారం 95 శాతం బోగస్ అకౌంట్లు ఉన్నాయని, స్కిల్ ఇండియా పేరుతో డబ్బును దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. -
108 కుయ్యో మొర్రో!
చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం జి.గొల్లపల్లి గ్రామానికి చెందిన జ్యోత్స్న ఏడు నెలల గర్భిణి. మే 15న చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో 800 గ్రాముల శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించాలని వైద్యులు సూచించారు. అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో 108 అంబులెన్స్లో పసికందును వెంటిలేటర్పై ఉంచి తిరుపతికి బయలుదేరారు. మురకంబట్టు దగ్గర అంబులెన్స్ ఉన్నట్టుండి ఆగిపోయింది. వెంటిలేటర్పై ఉన్న శిశువుతో రెండు గంటల పాటు నడిరోడ్డుపై కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవించారు. 60 కిలోమీటర్ల దూరంలోని పీలేరు నుంచి మరో అంబులెన్స్ రప్పించి తిరుపతికి తరలించారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో దుస్థితి ఇది.మే 2వ తేదీన ప్రకాశం జిల్లా రాయివారిపాలెంకు చెందిన కట్టా శంకరమ్మ ఇంటి వద్ద స్పహ కోల్పోయి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే 108కు ఫోన్ చేసి అంబులెన్స్ సాయం కోరారు. 10.. 20.. 30.. నిమిషాలు గడిచినా అంబులెన్స్ రాలేదు. మళ్లీ 108కు ఫోన్ చేయగా ఇదిగో వచ్చేస్తోంది.. అదిగో వచ్చేస్తోందంటూ ఏకంగా గంటన్నర ఆలస్యం చేశారు. చివరకు అంబులెన్స్ గ్రామానికి చేరుకునే సరికే శంకరమ్మ తుది శ్వాస విడిచారు. అంబులెన్స్ సకాలంలో వచ్చి ఉంటే శంకరమ్మ బతికేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.సాక్షి, అమరావతి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో నిర్వీర్యమైన 108 అంబులెన్స్ సేవలను ఈ ఘటనలు ఎత్తిచూపుతున్నాయి. ఇక్కడ ఉదహరించిన ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. 2024లో చంద్రబాబు గద్దెనెక్కాక 108, 104 సేవలను అవకతవకలకు కేంద్ర బిందువుగా మార్చేశారు. టీడీపీ నేతకు చెందిన ‘భవ్య’ అనే సంస్థకు అడ్డదారుల్లో 104, 108 నిర్వహణ కాంట్రాక్ట్ను కట్టబెట్టేశారు. అస్మదీయులకు నిర్వహణ కాంట్రాక్ట్ను కట్టబెట్టడంపై చూపిన శ్రద్ధ.. పకడ్బందీగా సేవలు అమలు చేయడంపై పెట్టలేదు. దీంతో రోడ్డు.. ఇతర ప్రమాదాలు, అనారోగ్య బాధితులకు ప్రాణాపాయ పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన అంబులెన్స్లు సకాలంలో స్పందించడం లేదు. నిర్వహణ సరిగా లేక అంబులెన్స్లు మొరాయించడం, ఆపద సమయంలో ఫోన్ చేస్తే సకాలంలో ఘటనా స్థలికి చేరుకోకపోవడం వంటి ఘటనలు రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక మూలన చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రాష్ట్రంలో 768 అంబులెన్స్లు ఉండగా, అందులో 731 ఆన్ రోడ్ సేవలు అందించాలి. మిగిలినవి బ్యాకప్ కింద ఉంటాయి. కాగా, రాష్ట్రంలో ఏ ఒక్క రోజు 731 వాహనాలు ఆన్ రోడ్ సేవల్లో ఉండటం లేదని ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో 108 అంబులెన్స్లు రోజుకు సగటున మూడు వేల కేసులకు అటెండ్ అయ్యేవి. చంద్రబాబు గద్దెనెక్కాక ఒక్కసారిగా పరిస్థితి తారుమారైందని తెలుస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున 1,500 నుంచి 2 వేల మేర సేవలను అంబులెన్స్లు అందిస్తున్నాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే రోజువారీ వెయ్యికి పైగా సేవలు తగ్గిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో డయాలసిస్ చేయించుకోవాల్సిన కిడ్నీ వ్యాధి రోగులకు ఉచితంగా 108 అంబులెన్స్ సేవలు అందేవి. 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఈ సర్వీస్ను పూర్తిగా ఎత్తేసింది. దీంతో కిడ్నీ బాధితులు ప్రైవేట్ వాహనాల్లో ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. మరో వైపు ఒక ప్రభుత్వాస్పత్రి నుంచి మరో ప్రభుత్వాస్పత్రికి మెరుగైన వైద్యం కోసం రోగులను తరలించే సేవలు సైతం పడిపోయాయి. రోగులను తరలించాలని వైద్యులు రెఫర్ చేసినప్పటికీ, ఎమర్జెన్సీ కేసు కాదని నిర్వహణ సంస్థ తిరస్కరిస్తోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఆపద సమయంలో నిర్ధేశిత సమయం కంటే ఆలస్యంగా అంబులెన్స్లు ఘటనా స్థలికి చేరుకుంటున్నాయి. ఫలితంగా అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. సమయానికి వచ్చి ఉంటే ఒట్టు!మార్చి 29న శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. బైక్పై ఉన్న ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించడం కోసం స్థానికులు 108కు ఫోన్ చేశారు. క్షతగాత్రులను అంబులెన్స్ ఎక్కించిన కాసేపటికి అది మొరాయించింది. పోలీసులు, స్థానికులు తలా ఓ చేయి వేసి ఎంత నెట్టినా ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు. 20 నిమిషాల పాటు అష్టకష్టాలు పడ్డాక ఇంజిన్ స్టార్ట్ అయింది. చికిత్స ఆలస్యం అవ్వడంతో క్షతగాత్రులు విలవిల్లాడిపోయారు. » మూడు నెలల కిందట కాకినాడ జిల్లా సర్పవరం సమీపంలో రాత్రి సమయంలో ఓ టిప్పర్ కారును ఢీ కొట్టింది. కారులో విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు. ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళను ఆస్పత్రికి తరలించడం కోసం స్థానికులు 108 అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. అంబులెన్స్లు అందుబాటులో లేవని కాల్ సెంటర్ సిబ్బంది సమాధానం ఇచ్చారు. తీవ్ర గాయాలపాలైన మహిళ విలవిల్లాడుతూ కొద్దిసేపటికే మరణించింది. కాకినాడ నగరానికి కూత వేటు దూరానికి అంబులెన్స్ను పంపక పోవడం దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. » మార్చి 26 తెల్లవారుజామున మార్కాపురం వద్ద ప్రైవేట్ బస్సు నడిరోడ్డుపై దగ్ధం అయింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడం కోసం 108కు ఫోన్ చేశారు. 20 సార్లు ఫోన్ చేసినా కనీస స్పందన లేదని ప్రమాదానికి గురైన బస్సులోని యువతి కన్నీరుమున్నీరైంది.» గతేడాది మే 13వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలు నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య బాధితులు అత్యవసర సాయం కోసం 108కు డయల్ చేసినా కాల్స్ కలవలేదు. ఏకంగా ఐదు గంటలకు పైగా సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డు ప్రమాదాలు, గుండె పోటు, ఇతర తీవ్ర అనారోగ్యం పాలైన వారికి సత్వరమే వైద్య సేవలు అందక తీవ్ర అవస్థలు పడ్డారు. పలువురు ఏకంగా మత్యువాత పడ్డారు.నాడు ఏడాదిలో బలోపేతంగతంలో చంద్రబాబు 108 వ్యవస్థను అస్తవ్యస్థంగా మార్చగా, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఏడాది వ్యవధిలో ఈ వ్యవస్థను బలోపేతం చేశారు. 2019కి ముందు 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. కనీసం మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని దుస్థితి. అత్యవసర వైద్య సేవల సంస్కరణల్లో భాగంగా మండలానికి రెండు అంబులెన్స్లు సమకూరుస్తూ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఏడాది తిరక్కుండానే 412 అంబులెన్స్లు కొనుగోలు చేశారు. వీటిని 2020 జూలై1న వైఎస్ జగన్ ప్రారంభించారు. 26 నియోనాటల్ అంబులెన్స్ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కి పెరిగింది. ఇందు కోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. 2022 అక్టోబర్లో అదనంగా మరో 20 కొత్త 108 అంబులెన్స్లను గిరిజన ప్రాంతాలకు సమకూర్చారు. వీటి కోసం రూ.4.76 కోట్లు వెచ్చించారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. అత్యవసర సేవలను బలోపేతం చేయడం ద్వారా ఐదేళ్లలో 45 లక్షల మంది బాధితులకు అత్యవసర వేళ అండగా నిలిచారు. -
ఇది ప్రజాస్వామ్య విలువలు, భావప్రకటనా స్వేచ్ఛపై దాడి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్ష నేతల గళాన్ని నులిమేస్తోందని, ఈ ఏడాది ఆరంభంలో తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించారని, ఇప్పుడు అధికారిక వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని భారత్లో అందుబాటులో లేకుండా చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.‘‘ఇది కేవలం వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదు. ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి. మేము వాస్తవాలను మాత్రమే బయటపెడతాం, ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి పద్ధతులను బహిర్గతం చేస్తాం. ప్రజలను ప్రభావితం చేసే అంశాలను వెలుగులోకి తీసుకొస్తాం. నిజం మాట్లాడినందుకు ప్రతిపక్ష పార్టీ అధికారిక ఖాతాలను, తద్వారా ప్రతిపక్ష స్వరాలను అణచివేయడం ప్రమాదకర ధోరణికి నాంది. ఇది అత్యంత ప్రజాస్వామ్య విరుద్ధ చర్య.అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించిన అధిక వ్యయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం, డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు, టీటీడీ నెయ్యి టెండర్లు, ప్రజా ప్రాధాన్య అంశాల్లో భారీ అవినీతికి సంబంధించిన తగిన ఆధారాలను వెలుగులోకి తీసుకువస్తున్నాం. ఇటువంటి వంటి విషయాల నుంచి.. విమర్శనాత్మక సమాచారాన్ని ప్రజలు చూడకుండా నిరోధించడం వరకు ఆందోళనకర ధోరణి కనిపిస్తోంది.ఈ అన్యాయపూరిత చర్యలను ప్రతి చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ మార్గంలో సవాలు చేస్తాం. బెదిరింపులు, సెన్సార్ చర్యలు, సంస్థల దుర్వినియోగం వంటివి ప్రజల గళాన్ని అణచివేయలేవు. అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా నిలబెట్టడంలో, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే మౌలిక హక్కును పరిరక్షించడంలో మా నిబద్ధత కొనసాగుతుంది. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో మా అధికారిక పేజీని వెంటనే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే న్యాయపోరాటం చేస్తాం’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. The @ncbn government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India.This is not just an attack on YSRCP; it is an… pic.twitter.com/rJHq8BZ2pm— YS Jagan Mohan Reddy (@ysjagan) June 14, 2026 -
మళ్లీ మంచి రోజులు వస్తాయి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మళ్లీ మంచి రోజులు వస్తాయని.. త్వరలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులు అత్యంత సున్నిత మనస్కులు.. ఘర్షణ లేని వాతావరణం కోరుకునేవారిలో ఆర్యవైశ్యులు ముందుంటారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.‘‘ఇప్పుడు ఏపీలో ప్రశాంత వాతావరణం లేనే లేదు. కూటమి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్నదంతా అరాచకమే. తమ పార్టీ కాని వారందరినీ వేధించి.. వైఎస్సార్సీపీ ముద్ర వేస్తున్నారు. ప్రజల పక్షాన బలంగా ప్రశ్నించేది వైఎస్సార్సీపీ మాత్రమే. వైఎస్సార్సీపీ 10 వేల మంది ఆర్యవైశ్యులు ఉన్నారు. మహిళలు కూడా రాజకీయంగా బయటికి వస్తున్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి కూడా వైఎస్ జగన్ అండగా నిలిచారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘ఒకప్పుడు ప్రభుత్వ బడులకు వెళ్లడం నామోషీగా భావించేవారు. ప్రభుత్వ బడులకు వెళ్లడం గొప్పగా భావించేలా చేసిన ఘనత జగన్కు దక్కింది. స్కూల్ బ్యాగ్ నుంచి ప్రతి అంశంలోనూ జగన్ కేర్ తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో అకడమిక్ ప్రారంభమైనప్పటికీ స్కూల్ బుక్స్, బ్యాగ్ల ఊసే లేదు. రాష్ట్ర ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని వైఎస్ జగన్ చూశారు. చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాడు’’ అంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.సొమ్ము ఆర్యవైశ్యులది.. సోకు మాత్రం చంద్రబాబు, పవన్దిమాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘వాసవీమాత ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండొద్దని జీవో తెచ్చిన ఘనత వైఎస్సార్ , రోశయ్యలదే. ఆర్యవైశ్యులకు సంబంధించి కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి. ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉన్న ఆర్యవైశ్యుల ట్రస్ట్లపై వైఎస్ జగన్ ఆర్యవైశ్యులకే హక్కులు కల్పించారు. ఎండోమెంట్ పరిధి నుంచి తప్పించి దుర్వినియోగం కాకుండా జీవో ఇచ్చారు. వైఎస్ జగన్ చేసినంత మేలు ఆర్యవైశ్యులకు మరెవరూ చేయలేదు. ఎండోమెంట్ పరిధిలో ఉన్న ఆర్య వైశ్యుల ట్రస్ట్లపై ఆర్య వైశ్యులకే వైఎస్ జగన్ హక్కులు కల్పించారు...గతంలో రాష్ట్రంలో ఉన్న ఆర్య వైశ్యులంతా ఆలయాల్లో దర్శనాలకు వెళ్లేవారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల్లో ఆర్య వైశ్యులకు అవకాశం లేకుండా చేశారు. అమరావతిలో వృధాగా పడి ఉన్న స్థలంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంపై ఆర్యవైశ్యులకు ఎలాంటి హక్కు లేదంటున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టడానికి డబ్బులిచ్చింది ఆర్య వైశ్య సంఘం. సొమ్ము ఆర్యవైశ్యులది సోకు మాత్రం చంద్రబాబు, పవన్ది’’ అంటూ వెలంపల్లి దుయ్యబట్టారు. -
ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి: రాగల మూడు గంటల్లో ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లాలో 16 మండలాలు, నంద్యాల జిల్లాలో 10 మండలాల్లో వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో వర్షం తేలిక పాటికే పరిమితమైంది. అయితే కర్నూలు నగరంలో భారీ వర్షం కురిసింది.కర్నూలు రూరల్లో 56.2 మి.మీ, కర్నూలు అర్బన్లో 48.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాలువలు పొంగిపొర్లాయి. జిల్లా మొత్తంగా సగటున 9 మి.మీ వర్షం కురిసింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా ఇప్పటి వరకు 46.1 మి.మీ వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా మొత్తంగా సగటున 1.7 మి.మీ వర్షం కురిసింది. నంద్యాల జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 77 మి.మీ కాగా ఇప్పటి వరకు 58.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తొలకరి నిరాశాజనకంగా సాగుతోంది. -
పల్నాడు జిల్లాలో విషాదం
సాక్షి,పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గం కోనూరు గ్రామం వద్ద కృష్ణా నదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. కుంకలగుంట నుంచి కోనూరులోని ఒక ఫంక్షన్కు వచ్చిన 10 మంది నది దాటేందుకు పడవ ఎక్కారు. మధ్యలో పడవ ఒక్కసారిగా బోల్తా పడడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరి మృత దేహం కోసం ఈతగాళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పడవ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇసుక కోసం తవ్విన గుంతలు పడవకు అడ్డంకిగా మారి ప్రమాదానికి కారణమయ్యాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కోసం తవ్వకాలు జరగకపోయి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. ఇలాంటి తవ్వకాలను అధికారులు నియంత్రించకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇవాళ(ఆదివారం, జూన్ 14) వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ బాధితులు.. టీడీపీ నేతలు ఫేక్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడా కోటా పేరుతో జరిగిన అక్రమాలను బాధితులు వివరించారు. అధికారులు చెప్పేవన్ని అబద్ధాలేనని మండిపడ్డారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవకతకవలు జరిగాయని.. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్సీపీ గట్టిగా నిలదీస్తుందన్నారు. యువత భవిష్యత్తో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆయన మండిపడ్డారు. బెదిరింపులను అడ్డుకోవడానికి అండగా ఉంటామని.. అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సజ్జల డిమాండ్ చేశారు.‘‘డీఎస్సీలో కుట్ర పూరితంగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రి తప్పు ఒప్పుకుని సీబీఐ విచారణ జరిపించాలి. డీఎస్సీ రాసి క్వాలిఫై అయితేనే ఉద్యోగం ఇవ్వాలి. డీఎస్సీ అభ్యర్థుల పోరాటంలో న్యాయ సహాయం అందిస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డీఎస్సీ.. మంత్రులు సమాధానం చెప్పలేరా: పర్వతనేని
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. అక్రమాలపై ప్రతిపక్షంగా తాము నిరంతరం పోరాడుతున్నామని, అయితే ప్రభుత్వం, మంత్రులు.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారులను ముందుకు నెడుతున్నారని విమర్శించారు. అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ తాడేపల్లిలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏపీలో డీఎస్సీ పరీక్ష రాసిన 3.50 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం, మంత్రులు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. అధికారులను ఎందుకు ముందు పెడుతున్నారు. డీఎస్సీ నిర్వహణపై మంత్రులు కాకుండా అధికారులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఎస్సీఈఆర్టీ (SCERT)లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు రావడం, అలాగే టీజీటీ తెలుగులో ఆరో ర్యాంకు సాధించడం అనేక అనుమానాలకు కారణమైంది.ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో నవీన్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నవీన్ ద్వారానే అనేక మందికి ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఈ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నుంచి సరైన స్పందన లేదు. ఈవిషయం కోర్టులో ఉంది, చెప్పలేం అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాటవేత ధోరణి ఉంది. ఆయన ఎప్పుడూ స్పోర్ట్స్ డీఎస్సీ గురించి మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు. ఫలితాలు మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణలోనే అనేక అవకతవకలు జరిగాయి. రిజర్వేషన్ల ఉల్లంఘన వల్ల వేలాది మంది అర్హులైన అభ్యర్థులు నష్టపోయారు. సీబీఎస్ఈ, నవోదయ ఇంగ్లిషు మీడియం విద్యార్థులను డీఎస్సీకి దూరం పెట్టడం అన్యాయం.టెట్ రాసినా కూడా వేలాది మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనే నార్మలైజేషన్ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. జిల్లా స్థాయి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం నార్మలైజేషన్ ప్రక్రియను ఎందుకు తెచ్చింది?. నార్మలైజేషన్ పేరుతో నచ్చిన సెషన్స్లో 7, 8 మార్కులు కలిపి అక్రమాలకు పాల్పడ్డారు. రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై నిరుద్యోగుల పొట్టకొట్టారు. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులను మానసికంగా వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సోషల్ మీడియా వింగ్ నిరుద్యోగులపై రకరకాల ముద్రలు వేస్తూ అవమానిస్తోంది. కష్టపడి చదువుకున్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మానసిక వ్యధకు గురిచేస్తున్నారు. -
అమరావతిలో దేవుడి భూములకు ఎసరు.. పల్నాటి వీరులను వదల్లేదు?
సాక్షి, గుంటూరు: అమరావతి ప్రాంతంలో దేవాదాయ శాఖకు చెందిన భూముల కేటాయింపుపై మరోసారి వివాదం చెలరేగింది. తుళ్లూరు మండలంలోని పల్నాటి వీరుల దేవాలయానికి చెందిన భూములను దేవాలయానికి తిరిగి కేటాయించాల్సి ఉండగా, వాటిని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులకు కట్టబెట్టారు.వివరాల ప్రకారం.. తుళ్లూరులోని పల్నాటి వీరుల దేవాలయానికి చెందిన సర్వే నంబర్ 161లో సుమారు 6 ఎకరాల 44 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని అమరావతి భూసమీకరణ (Land Pooling)లో భాగంగా తీసుకున్న అధికారులు, అనంతరం ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను దేవాలయానికి కాకుండా ఇతరులకు కేటాయించారు. దేవాలయ భూములకు సంబంధించి ఫామ్-8 రికార్డుల్లో "నో ట్రాన్స్ఫర్" అనే స్పష్టమైన నిబంధన ఉన్నప్పటికీ, దానిని పట్టించుకోకుండా కేటాయింపులు జరిగాయి. ఈ భూములకు బదులుగా రావాల్సిన 21 రిటర్నబుల్ ప్లాట్లు దేవాలయానికి అందకుండా, టీడీపీకి చెందిన కొందరు నేతల పేర్లపై నమోదు చేశారు.ప్రస్తుతం ఈ ప్లాట్ల విలువ రూ.35 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పల్నాటి వీరుల దేవాలయ నిర్వహణ, నిత్యకైంకర్యాలు, ఉత్సవాల నిర్వహణ కోసం దాదాపు ఆరు దశాబ్దాల క్రితం దాతలు ఈ భూములను దానం చేసినట్లు సమాచారం. అలాంటి భూములకు సంబంధించిన హక్కులను విస్మరించి కేటాయింపులు చేయడం దేవాదాయ ఆస్తుల రక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇదిలా ఉండగా, ఇటీవల వెలగపూడి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, ఇప్పుడు పల్నాటి వీరుల దేవాలయ భూముల అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. -
‘స్త్రీలోలుడు, వికృత చేష్టల్లో ఆరితేరినవాడు బీఆర్ నాయుడు’
సాక్షి,తిరుపతి: మహానేత వైఎస్సార్ఆర్పై శివానంద స్వామి తదితరులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు.కొంతమంది స్వాములు టీడీపీ నేతలు కంటే దిగజారారు. కాషాయ స్వాములు పచ్చ జెండా ఎత్తుకుని మహానేత వైఎస్ఆర్పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బూతు సినిమాల నిర్మాత అట్లూరి నారాయణ కొండ మీద బ్లాక్ టికెట్లు అమ్ముతాడు. శ్రీను బాలికను అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ఆదేశాలతో ఆధ్యాత్మిక సభ జరిగింది. స్త్రీలోలుడు, వికృత చేష్టల్లో ఆరితేరినవాడు బీఆర్ నాయుడు. అలాంటి బీఆర్ నాయుడికి కొంత మంది స్వాములు తొత్తులుగా మారారు. శ్రీను నీవు కాషాయం వేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతావా?.కొంత మంది స్వాములను టీడీపీ జెండాలు మార్చే కూలీలుగా బీఆర్ నాయుడు మార్చాడు. కొంత మంది సాధువులు కాషా వస్త్రాలు వదిలి పచ్చ చొక్కాలు వేసుకోవాలి. దేవుడిని రాజకీయ వనరుగా వాడుకుంది చంద్రబాబే. వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిన చంద్రబాబుపై సాధువులు ఎందుకు మాట్లాడరు?.చంద్రబాబు పాలనను రామరాజ్యం అంటున్నారంటే మూటలు బాగానే అంది ఉంటాయి. రెండు కొండలను ఏడు కొండలుగా మార్చి జీవో ఇచ్చింది వైఎస్ఆరే. వేద విశ్వవిద్యాలయం స్థాపించింది వైఎస్ఆర్. పేదలకు పెళ్లిళ్లు చేసిన గొప్ప మనసున్న నాయకుడు వైఎస్ఆర్.ఊరువాడా భజన మండళ్లు నిర్మించిన గొప్ప నాయకుడుకు వైఎస్ఆర్. వెంకటేశ్వర భక్తి ఛానల్ తీసుకొచ్చింది వైఎస్ఆర్. వెంకటేశ్వర భక్తి ఛానల్ వద్దన్నది చంద్రబాబు. గోమాతను పరిరక్షించాలని కంకణం కట్టుకున్న నాయకుడు వైఎస్ జగన్. నవనీత సేవ తీసుకొచ్చింది వైఎస్ జగన్’ అని భూమన గుర్తు చేశారు. -
చార్జింగ్ స్టేషన్లకు ‘టెండర్’!
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో కొందరు పెద్దలు మరోసారి అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. విద్యుత్ శాఖలో తమకు నచ్చినవారికి రూ.62.94 కోట్ల విలువైన పనులను ఏకపక్షంగా కట్టబెట్టేందుకు టెండర్ నిబంధనలను రూపొందించేలా చక్రం తిప్పారు. నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ–నెడ్క్యాప్) విద్యుత్ వాహనాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 131 ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 20,832 కిలోవాట్ల సామర్థ్యంతో ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని టెండర్ పిలిచింది. అయితే, టెండర్లోని అర్హత నిబంధనలు మాత్రం అతి కొద్దిమందికే అవకాశం కల్పించేలా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నిటికీ ఒక్కటే టెండర్... రూ.62.94 కోట్ల ఈ భారీ ప్రాజెక్టును పోటీ లేకుండా ప్రభుత్వ పెద్దలకు కావాల్సినవారికి కట్టబెట్టేలా నిబంధనలు తయారు చేశారు. నెడ్క్యాప్ అధికారులు చెప్పినదాని ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 131 ప్రాంతాలకు ఒకే బిడ్ సమరి్పంచాల్సి ఉంటుంది. అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మొత్తం ప్రాజెక్టును ఒకే సంస్థ లేదా ఒకే కన్సార్షియం నిర్వహించాలి. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులను జోన్లుగా లేదా జిల్లాల వారీగా విభజించి టెండర్లు పిలవడం ద్వారా ఎక్కువ కంపెనీలకు అవకాశం కల్పిస్తారు. కానీ ఈ టెండర్లో అలాంటి అవకాశం లేదు. ఇది పోటీని పరిమితం చేసేలా ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థలు, మధ్య తరహా కంపెనీలు, కొత్తగా ఈవీ రంగంలోకి వచ్చిన స్టార్టప్లకు కనీసం టెండర్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం కూడా లేకుండా చేశారు. సాధారణంగా విద్యుత్, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టుల్లో పనులను ప్యాకేజీలుగా విభజించడం ద్వారా ఎక్కువ మంది కాంట్రాక్టర్లకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రాజెక్టులో అలాంటి విధానం ఎందుకు అనుసరించలేదన్నది చర్చనీయాంశంగా మారింది. బడా సంస్థల కోసమే ఈ నిబంధనలు? టెండర్ నిబంధనల ప్రకారం బిడ్డర్ గత ఐదేళ్లలో కనీసం 8 వేల కిలోవాట్ల ఈవీ చార్జింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసి ఉండాలి. 65 వేర్వేరు ప్రాంతాల్లో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉండాలి. కనీసం 170 చార్జర్ల నిర్వహణలో ఏడాది అనుభవం ఉండాలి. రూ.31 కోట్ల సగటు వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలి. రూ.12 కోట్ల నికర ఆస్తులు ఉండాలి. ఈ నిబంధనలను చూస్తే ప్రభుత్వ పెద్దలు ఎవరికి టెండర్ ఇవ్వదలిచారో వారికి మాత్రమే ఉంటాయని, మిగతా సంస్థలు పోటీకి అర్హత సాధించలేవని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెక్నికల్ మూల్యాంకనంలో ఆంధ్రప్రదేశ్లో ఈవీ చార్జర్ తయారీ యూనిట్ ఉన్న కంపెనీలకు 15 మార్కులు కేటాయించారు.స్థానిక తయారీని ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని పైకి చెబుతున్నప్పటికీ, అసలు ఉద్దేశం వేరే ఉన్నట్లు కనిపిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్రంలో తయారీ యూనిట్లు ఉండకపోవచ్చు. వారు ఒక రాష్ట్రంలో తయారీ యూనిట్లు పెట్టి తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తుండవచ్చు. అలాంటి సంస్థలు పోటీలో లేకుండా ఈ నిబంధన పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల చిన్న, మధ్య తరహా సంస్థలతోపాటు పలు భారీ సంస్థలు కూడా టెండర్లు వేయలేవు. అంతిమంగా తాము ముందుగా నిర్ణయించుకున్న సంస్థకే ఈ భారీ టెండర్ను కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. -
గుండెల్లో బెంబేళ్లు
సాక్షి, అమరావతి: పొగాకు సగటు అమ్మకం ధర రోజురోజుకు దిగజారిపోతోంది. ఓ వైపు వేలం కేంద్రాలు ప్రారంభించి రెండు నెలలు పూర్తయినా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు ఊపందుకోవట్లేదు. మరొక వైపు పెద్ద ఎత్తున బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇంకొక వైపు సగటు ధరలు పతనమవుతున్నాయి. ఈ పరిణామాలు పొగాకు రైతులపాలిట అశనిపాతంగా మారాయి. కానీ ప్రభుత్వం మాత్రం మార్కెట్ స్థిరంగా కొనసాగుతుందని, కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయంటూ చేస్తున్న ప్రకటనలపై రైతులు మండిపడుతున్నారు. గతేడాది కొనేవారు లేక నల్లబర్లీ పొగాకు రైతులు నష్టపోతే, ఈసారి ప్రభుత్వ నిర్వాకంతో ఆశించిన ధరలు రాక నష్టపోతున్నారు.ఉత్పత్తి 2.65 లక్షల టన్నులు..వేలం జరిగింది 17,290 టన్నులు..2025–26 సీజన్లో 2.93 లక్షల ఎకరాల్లో పొగాకు సాగవగా.. రెండో ముందస్తు అంచనా ప్రకారం హెక్టార్కు 2,276 కిలోల చొప్పున ఈ ఏడాది కనీసం 2.65 లక్షల టన్నులు(265 మిలియన్ కిలోలు) దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 63 రోజులు పూర్తికావస్తోంది. కానీ ఇప్పటి వరకు 17,290 టన్నులు(17.29 మిలియన్ కిలోలు)కు మించలేదు. గతేడాది ఇదే సమయానికి 48,840 టన్నులు (48.84 మిలియన్ కేజీలు) కొనుగోళ్లు జరిగాయి. కొనుగోళ్ల తీరు చూస్తుంటే, మొత్తం ఉత్పత్తిలో కనీసం 5 శాతం పంటకు వేలం జరగలేదని స్పష్టమవు తోంది. ఈ స్థాయిలో కొనుగోళ్లు కొనసాగితే ఏడాదైనా సరే రైతుల వద్ద ఉన్న పంట పూర్తి స్థాయిలో అమ్ముడుపోయే అవకాశం లేదు.రూ.211కు దిగజారిన సగటు ధరమరొక వైపు 2023–24 సీజన్లో సగటుఅమ్మకం ధర కిలోకు రూ.288.65 పలుకగా, 2024–25లో కిలోకు రూ.248.86కి పడిపోయింది. కాగా 2025–26లో సగటు అమ్మకం ధర ప్రస్తుతం కిలో రూ.211కి దిగజారిపోయింది. మే 25న సరాసరి అమ్మకం ధర కిలోకు రూ.237.21 పలికింది. జూన్ 1వ తేదీ నాటికి రూ.235.63కు పడిపోగా,12వ తేదీ నాటికి రూ.211కు దిగజారిపోయింది. దక్షిణాది తేలిక నేలల్లో పండిన పొగాకు జూన్ 1న కిలోకు రూ.231.02 పలకగా, ప్రస్తుతం రూ.211.04 మాత్రమే పలుకుతోంది. ఉత్తరాదితేలిక నేలల్లో పండిన పొగాకు జూన్ 1న కిలోకు రూ.260.29 పలకగా, ప్రస్తుతం రూ.255.98కు దిగజారింది. ఒంగోలు దక్షిణాది నల్ల నేలల్లో పండిన పొగాకు జూన్ 1న సగటు ధర కిలోకు రూ.224.45 పలకగా, ప్రస్తుతం రూ.200.41కి పడిపోయింది. అంటే 2023–24 సగటు ధరతో పోలిస్తే గరిష్టంగా కిలోకు రూ.77.65 మేర రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వ ప్రకటనల పట్ల తీవ్ర అసంతృప్తిఓ వైపు ఆశించిన స్థాయిలో వేలం జరగడం లేదు. మరొక వైపు సగటు ధరలు దిగజారిపోతున్నాయి. అయినా సరే పొగాకు కొనుగోళ్లు ఊపందుకున్నాయంటూ మంత్రి అచ్చెన్నాయుడు రోజు విడిచి రోజు జారీ చేస్తున్న ప్రకటనలు విస్మయానికి గురిచేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. తిరస్కరణలు, నో బిడ్ల స్థాయి 20 శాతం కంటే తగ్గిపోయిందంటూ చెబుతుండడం పట్ల రైతులు మండిపడుతున్నారు. సగటు ధరలు కిలోకు కనీసం రూ.350 తక్కువ కాకుండా పలికేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.కొనసాగుతున్న బేళ్ల తిరస్కరణ..మరోవైపు బేళ్ల తిరస్కరణ కొనసాగుతూనే ఉంది. తొలుత 43శాతం నుంచి 55 శాతం తిరస్కరణకు గురికాగా, ప్రస్తుతం సగటున 21.81 శాతం బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. తిరస్కరించిన బేళ్లను వెనక్కి తీసుకెళ్లడానికి ఒక్కో బేలుకు రూ.2వేలు అదనంగా ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. ఈసారి మంచి దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తి సాధించినా అమ్మకం ధరలు కుప్పకూలుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పొగాకు రైతుల్లో మెజార్టీ రైతులు కౌలు దారులే. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కంపెనీలిచి్చన బాండ్లకనుగుణంగానే నాణ్యమైన పంటను పండించినప్పటికీ ధర లేక నష్టపోవాల్సి వస్తోందని సన్న, చిన్నకారు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతున్నారు. -
నారాయణ.. నారాయణ.. జిత్తులమారి 'లెక్కలు'!
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని రీతిలో రాజధాని అమరావతిలో భవనాలు, రోడ్ల నిర్మాణ వ్యయం భారీగా పెంచేసి, అధిక ధరలకు సిండికేటు కాంట్రాక్టర్లకు అప్పగించిన చంద్రబాబు సర్కారు.. నీకింత నాకింత అంటూ పంచుకుతింటున్న తీరును సాక్ష్యాధారాలతోసహా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నారు. రాజధాని సెంట్రల్ సెక్రటేరియట్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన వ్యయం సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాల బండారం బట్టబయలైంది. దీంతో ఆ అక్రమాల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ యథాప్రకారం తప్పుడు లెక్కలు వల్లె వేశారు. శనివారం రాజధాని ప్రాంతంలో కొండవీటివాగు, పాలవాగులపై చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్ నివాస సముదాయాలకు రూ.984 కోట్లతో టెండర్ ఖరారైందని, నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు కేవలం రూ.3,393 మాత్రమే అవుతోందని పేర్కొన్నారు. గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణానికి రూ.1,003 కోట్లతో టెండర్ ఖరారైందని, చదరపు అడుగుకు రూ.3,684 మాత్రమే వ్యయం అవుతోందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.1,234 కోట్లతో టెండర్ ఖరారైందని, దాని నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,945గా ఉందని మంత్రి వెల్లడించారు. దీనితో పోల్చి చూస్తే రాజధానిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్, గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కంటే తక్కువగా ఉందని వివరించారు. అవినీతి బట్టబయలవడంతో బెంబేలుసచివాలయం ‘శాశ్వత’ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చదరపు అడుగుకు రూ.20,439.58 వ్యయం చేస్తుంటే.. గ్రిహ 4–స్టార్, ఎనర్జీ కన్సర్వేషన్ అండ్ సస్టెయినబుల్ బిల్డింగ్ కోడ్(ఈసీఎస్బీసీ)– 2024 ప్రమాణాలతో కట్టే కేంద్రప్రభుత్వ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్కు చదరపు అడుగుకు రూ.5,587.44 మాత్రమే కేంద్రం మంజూరు చేయడంతో చంద్రబాబు సర్కార్ అవినీతి బట్టబయలైంది. ఇక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ కోసం చదరపు అడుగుకు రాష్ట్ర ప్రభుత్వం సగటున రూ.10 వేల నుంచి రూ.12 వేలు వ్యయం చేస్తుంటే.. గ్రిహ–4, ఈసీఎస్బీసీ–2024, ఎకో–నివాస్ సంహిత–2024 ప్రమాణాల ప్రకారం నిర్మించే రెసిడెన్షియల్ కాంప్లెక్స్కు చదరపు అడుగుకు రూ.3,945.39 మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కారు అంచనా వ్యయాన్ని ఇష్టారాజ్యంగా పెంచేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అవినీతి బట్టబయలవడంతో బెంబెలెత్తిపోయిన చంద్రబాబు సర్కారు.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తప్పుడు లెక్కలు వల్లె వేస్తూ యథావిధిగా అబద్ధాలు చెబుతోంది. తప్పు లెక్కలు చెబితే అక్రమం సక్రమమవుతుందా?రాజధానిలో నేలపాడు వద్ద 14.46 ఎకరాల్లో జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 ప్లాట్లను హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తోంది. మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చదరపు అడుగులు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను రూ.856.31 కోట్లకు ఎన్సీసీ దక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్ వంటి సీనరేజీ పన్నుల రూపంలో రూ.153.05 కోట్లు సీఆర్డీఏ రీయింబర్స్ చేస్తుంది. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.1,009.36 కోట్లు. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణానికి కాంట్రాక్టు విలువ రూ.4,689.48. హ్యాపీనెస్ట్ పూర్తయ్యే సరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు చేరుతుందో! దీన్ని బట్టి చూస్తే హ్యాపీనెస్ట్ నిర్మాణ వ్యయంపై మంత్రి నారాయణ చెప్పిన లెక్కలన్నీ తప్పేనన్నది స్పష్టమవుతోంది. తప్పుడు లెక్కలు చెబితే అక్రమం సక్రమం అవుతుందా? కాదు కదా. ఈ చిన్న లాజిక్ను మరచిపోతే ఎలా అంటూ మంత్రి నారాయణను ఇంజినీరింగ్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక రాజధానిలో గెజిటెడ్ అధికారులకు నివాసాల కోసం ఎస్+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ప్లాట్లను 27,24,080 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో సీఆర్డీఏ చేపట్టింది. ఈ పనులను 2018లో రూ.707.40 కోట్లకు షాపూర్జీ పల్లోంజీకి అప్పగించింది. 2019 నాటికి రూ.389.11 కోట్ల విలువైన పనిని పూర్తి చేసింది. అంటే.. మిగిలిన పనుల విలువ రూ.318.29 కోట్లు. ఆ మేరకు బిల్లులు చెల్లించింది. కానీ.. 2024లో ఆ కాంట్రాక్టును రద్దు చేసింది. మిగిలిన పనులను రూ.514.40 కోట్లకు అదే సంస్థకు గతేడాది అప్పగించింది. మరో రూ.89.27 కోట్లను పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. ఇక ఆ భవనాలకు ప్రహరి, ఎస్టీపీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు రూ.67.69 కోట్లతో ఇటీవల టెండర్లు పిలిచింది. పన్నుల రూపంలో మరో రూ.12.42 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. కాంట్రాక్టర్కు చెల్లించిన బిల్లులు, మిగిలిన పనులను కాంట్రాక్టర్కు అప్పగించిన విలువతో కలిపి నిర్మాణ వ్యయం ఇప్పటికే రూ.1,072.89 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఇప్పటికే రూ.3,938.54కు చేరింది. పనులు పూర్తయ్యే సరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు చేరుతుందో? -
కూటమిది నమ్మకద్రోహ సభ
సాక్షి,అమరావతి/నెహ్రూనగర్(గుంటూరు)/సాక్షి,విశాఖపట్నం/నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభ ‘నమ్మకద్రోహ సభ’ అని వైఎస్సార్సీపీ మహిళా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి ప్రతి ఇంటికి వెళ్లి సంతకాలతో కూడిన బాండ్ పేపర్లు పంచి, ఓట్లు వేయించుకున్న చంద్రబాబు.. నేడు ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా 2 కోట్ల మంది మహిళలను వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తాడేపల్లితోపాటు వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ మహిళా నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించారు. కూటమి పాలకుల తీరుపై ధ్వజమెత్తారు.పీ–4తో వంచన : విడదల రజిని తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ పీ–4 అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలను బాబు వంచిస్తున్నారని విమర్శించారు. ఆడబిడ్డ నిధి హామీ ప్రకారం.. ఒక్కో మహిళకు రెండేళ్లకు రూ. 36 వేల చొప్పున, రాష్ట్రంలోని 2 కోట్ల మంది మహిళలకు కూటమి ప్రభుత్వం రూ. 72 వేల కోట్లు బాకీ పడిందని వివరించారు. ఎన్నికల ముందు రజినీకాంత్లా హామీలు గుప్పించిన బాబు ఇప్పుడు గజినీలా నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. నారా వారికి ‘నారీ శక్తి’ తడాఖా చూపించి గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు.చంద్రబాబు చీటింగ్, బోగస్ నాయుడు: వరుదు కళ్యాణి విశాఖపట్నం మద్దిలపాలెంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. చంద్రబాబు ‘చీటింగ్ బోగస్ నాయుడు’ అని విమర్శించారు. రెండేళ్లుగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఆడబిడ్డ నిధి హామీకి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ‘స్వాతిముత్యం’ సినిమాలో కమల్హాసన్లా అమాయకంగా నటించిన బాబు.. నేడు ‘నాయకుడు’ సినిమాలోని కన్నింగ్ పాత్రలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహిళల ఉసురు తగులుతుంది : కాకాణి పూజిత బాబు సర్కారు తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత శనివారం ఓ వీడియో విడుదల చేశారు. సర్కారుకు మహిళల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. టీడీపీ అంటే తప్పుడు దొంగల పార్టీ అని దుయ్యబట్టారు. ఆడబిడ్డ నిధి హామీని బాబు అటకెక్కించారని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్ సర్కారు ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాల ద్వారా మహిళలకు భారీ లబ్ధి చేకూర్చారని గుర్తుచేశారు. చీటింగ్ కేసు పెట్టాలి : బండి పుణ్యశీలవైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి బండి పుణ్యశీల మాట్లాడుతూ హామీలు గుప్పించి మోసం చేసిన చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళలను మోసగించిన చంద్రబాబు సర్కారుకు పతనం తప్పదని ధ్వజమెత్తారు. బాబు సర్కారు ఘోర వైఫల్యం: నూరి ఫాతిమా గుంటూరులోని వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ.. రెండేళ్లలో బాబు సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో బాబు చతికిల పడ్డారని, ఆడబిడ్డ నిధి పథకానికి ఒక్కరూపాయి కేటాయించలేదని ధ్వజమెత్తారు. బాబు సర్కారు తీరు వల్ల పనిఒత్తిడితో సచివాలయ సిబ్బంది ప్రాణాలొదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అనుచరులతో మాకు ప్రాణహాని
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులతో తమకు ప్రాణహాని ఉందని నెల్లూరు జిల్లా జలదంకి మండలం కమ్మపాలెం గ్రామానికి చెందిన వెనిగంట్ల వరమ్మ, ఆమె కుమార్తె రజిత మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలను రజిత వెల్లడించారు. ‘నా తల్లి వరమ్మ పేరు మీద కమ్మపాలెంలో ఐదెకరాల భూమి ఉంది. ఇందులో నా అన్న రమేష్ కు 3 ఎకరాలు, పసుపు కుంకుమ కింద నాకు 2 ఎకరాలు వచ్చాయి. పెళ్లి తర్వాత నేను విజయవాడలో నివాసం ఉంటున్నాను. నాకు మా అమ్మ ఇచ్చిన భూమికి పక్కనే మరో రెండెకరాల భూమిని కొనుగోలు చేశా. కమ్మపాలెంకు దగ్గరగా జాతీయ రహదారి రావడంతో భూముల విలువ అమాంతం పెరిగింది. దీంతో కమ్మపాలెంలో ఉన్న మా అమ్మ ఇంటిపైనా, అలాగే నా భూమిపైనా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు దివి శ్రీను, ఘంటా అశోక్, ఘంటా సుబ్బనాయుడు కన్నుపడింది. అప్పటి నుంచి వారు నా నాలుగు ఎకరాల భూమిలోకి వెళ్లనీయకుండా బెదిరిస్తున్నారు. పైగా భూమిని వారి కబ్జాలోకి తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా తల్లిని ఇంట్లోకి రానీయకుండా సైతం ఇబ్బందులకు గురి చేశారు. ఇంటిని కబ్జా చేయడంతో భయపడి విజయవాడలో నా వద్దనే ఉంటోంది. మాకు జరిగిన అన్యాయాన్ని అధికారులకు చెప్పుకునేందుకు వెళితే ఎమ్మెల్యే తన అధికారాన్ని ప్రయోగిస్తున్నారు. జేసీ, ఆర్డీఓలకు ఫిర్యాదు చేయగా వారు జలదంకి పోలీసుల వద్దకు పంపించారు. పోలీస్ స్టేషన్కు వెళితే.. అప్పుడే అక్కడకు దివి శ్రీను, ఘంటా అశోక్; సుబ్బనాయుడు వచ్చారు. మాపై పోలీసుల ఎదుటే దౌర్జన్యం చేశారు. నా తల్లిని తలపై కొట్టారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని మా భూమిని, ఇంటిని మాకు దక్కేలా చూడాలి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యే అనుచరుల నుంచి తమకు రక్షణ కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. -
రేపు సింగపూర్కు చంద్రబాబు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజులపాటు సింగపూర్లో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి సీఎం సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. సింగపూర్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆ దేశంలోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో సమావేశం అవుతారు. పర్యటనలో తొలిరోజు స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు హాజరవుతారు. అనంతరం యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాచ్తో విందు సమావేశంలో పాల్గొంటారు.సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ సింగ్తో సీఎం సమావేశమవుతారు. తర్వాత గూగుల్ క్లౌడ్ ఏపీ అధ్యక్షుడు కరణ్ భజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్తో చర్చిస్తారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్తోనూ, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యెంగ్ చెయ్తోనూ భేటీ అవుతారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తోనూ పలు అంశాలపై చంద్రబాబు చర్చిస్తారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో భేటీ అవుతారు. సీఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతో కూడా సమావేశమవుతారు. సింగపూర్ హోం మంత్రి కె.షణ్ముగ, మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్తో చివరిగా భేటీ అవుతారు. మంగళవారం ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ సీబీఎన్–361ను సీఎం ప్రారంభిస్తారు. ఏపీఏసీ సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్–అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో సమావేశమవుతారు. తర్వాత ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’ లీడర్షిప్ ప్లీనరీలో పాల్గొని ప్రసంగిస్తారు. సీట్రియమ్ సమావేశంలోనూ పాల్గొంటారు. పర్యటనలో చివరిగా సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్– 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొంటారు. సీఎం వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఈడీబీ సీఈఓ షణ్మోహన్, సీఆర్డీఏ అధికారుల బృందం కూడా సింగపూర్ వెళ్లనుంది. -
భూ వ్యవస్థ అస్తవ్యస్తం
సాక్షి, అమరావతి: భూమి అంటే సామాన్యుడికి కేవలం ఆస్తి మాత్రమే కాదు.. తరాల కష్టం, బతుకునకు భరోసా. ఆ భరోసాను ప్రభుత్వమే కూల్చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? రీ సర్వేకు తూట్లు.. 22ఏ జాబితాలో 20 లక్షల ఎకరాలు.. పేదల ఫ్రీహోల్డ్ హక్కులు రెండేళ్లుగా ఫ్రీజ్.. కలెక్టరేట్ల వద్ద ప్రతి సోమవారం పెరుగుతున్న బాధితుల క్యూలు.. పాస్బుక్ల దందా.. అధికార పార్టీ అండతో సాగుతున్న భూ బాగోతాలు.. ఈ రెండేళ్లలో రాష్ట్రంలో భూముల వ్యవస్థ సాధించిన ప్రగతి ఇదే. ఈ అస్తవ్యస్త పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదేనని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్ర భూ పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చారిత్రక భూ సంస్కరణలను చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే నిలిపివేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులు, సామాన్య భూ యజమానులు వారి సొంత భూమిపై హక్కులు కోల్పోయారు. ఫలితంగా బ్యాంకు రుణాలు అందక, విక్రయ రిజిస్ట్రేషన్లు ఆగిపోయి అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు తమ భూములు వివాదాల్లో కూరుకుపోవడంతో పరిష్కారం కోసం వేలాది మంది ప్రతి సోమవారం కలెక్టరేట్ల ముందు పడిగాపులు పడుతున్నారు. విజయవాడ కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో వినతులు అందజేయటానికి వచ్చిన రైతులు, ప్రజలు(ఫైల్) 22ఏ జాబితాలో ఏకంగా 20 లక్షల ఎకరాలు ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు పైగా భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టింది. 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములు, 40 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములు, 50 వేల ఎకరాల అనాధీనం భూములు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా పలు జిల్లాల్లో గతంలో 22ఏ జాబితా నుంచి విముక్తి పొందిన లక్షల ఎకరాల భూములను టీడీపీ ప్రజాప్రతినిధులు 22ఏ జాబితాలో పెట్టించారు. అసలు వివాదమే లేని ప్రైవేట్ పట్టా భూములు, తరతరాలుగా అనుభవంలో ఉన్న పూర్వీకుల ఆస్తులను సైతం ఈ జాబితాలోకి నెట్టేశారు. దీంతో ఆ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. తనఖా పెట్టుకునే అవకాశం లేదు, బ్యాంకు రుణం రాదు. ఒక సర్వే నంబర్లో కొంత భాగంపై వివాదం ఉంటే మొత్తం సర్వే నంబర్నే నిషేధిత జాబితాలో పెట్టిన ఘటనలు కోకొల్లలు. ఫ్రీహోల్డ్ భూములపై పగబట్టిన చంద్రబాబు 20 ఏళ్లకు పైగా అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న పేదలకు 2023లో జగన్ ప్రభుత్వం యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) కల్పించింది. 27 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పరిధిలోకి రాగా, ఎన్నికలు పూర్తయ్యే నాటికి 13.59 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి విముక్తి పొందాయి. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల పేదలు పట్టాదారులయ్యారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే అక్రమాల పేరుతో ఫ్రీ హోల్డ్ భూములను మళ్లీ 22ఏ జాబితాలో పెట్టేసింది. రెండేళ్లయినా ఆరోపణలు నిరూపించలేకపోయింది. కానీ ఆ భూములపై రైతులకు హక్కులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒకవైపు లక్షలాది ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి.. పైకి మాత్రం 22ఏ జాబితా నుంచి భూములను తొలగిస్తున్నట్లు చంద్రబాబు సర్కారు డబ్బా కొట్టుకుంటుండటం విస్తుగొలుపుతోంది. జగన్ సంస్కరణలతో రూ.500 కోట్లు ప్రోత్సాహకాలు వైఎస్ జగన్ హయాంలో అమలైన భూ సంస్కరణలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ప్రారంభమై విజయవంతంగా జరుగుతున్న రీసర్వేపై విష ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక కొద్ది నెలలు దాన్ని నిలిపివేసి.. తప్పు తెలుసుకుని మళ్లీ తూతూ మంత్రంగా కొనసాగిస్తోంది. ఇప్పుడు తానే రీ సర్వేను మొదలు పెట్టినట్లు ప్రచారం చేసుకుంటోంది. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా సమగ్ర భూ రీసర్వేను చేపట్టింది. శాటిలైట్, డ్రోన్, జీపీఎస్ సాంకేతికతతో గ్రామ గ్రామాన సర్వే జరిగింది. రికార్డుల ట్యాంపరింగ్, నకిలీ డాక్యుమెంట్లు, భూ కబ్జాలకు తావులేని వ్యవస్థ దిశగా అడుగులు పడ్డాయి. భూ రికార్డుల డిజిటలీకరణలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక ధృవీకరించింది. ఈ పనితీరుకు ప్లాటినం గ్రేడింగ్, కేంద్ర ఆర్థిక శాఖ ప్రోత్సాహకాలు రూ.500 కోట్లు కూడా దక్కాయి. జగన్ అమలు చేసిన కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలు అందుకుంది. పీజీఆర్ఎస్కు బాధితుల క్యూ ప్రతి సోమవారం రాష్ట్రంలోని కలెక్టరేట్లు, మండల కార్యాలయాల వద్ద జరిగే పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికం భూ సమస్యలే ఉంటున్నాయి. పట్టా ఉన్నా రిజిస్ట్రేషన్ కాని భూములు, 22ఏ జాబితాలో ఇరుక్కుపోయిన ఆస్తులు, పాస్బుక్లు రాని రైతులు, ఇచ్చిన పాస్బుక్కుల్లో తప్పులు, రికార్డుల్లో పేర్లు మాయమైన బాధితులు దరఖాస్తులు పట్టుకుని క్యూ కడుతున్నారు. అర్జీలు తీసుకుని రశీదులు ఇవ్వడమే తప్ప ఆ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. బాధితులు పది సోమవారాలు తిరిగినా సమస్య మాత్రం అలాగే ఉంటోంది. దీనికితోడు మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆర్భాటంగా వినతులు తీసుకుని పక్కన పడేస్తున్నారు. చంద్రబాబు స్వయంగా తీసుకున్న అర్జీలకే దిక్కులేని పరిస్థితి నెలకొంది. ఆయన కొడుకు, ఇతర మంత్రులు పీజీఆర్ఎస్ను ప్రచారానికి వాడుకోవడమే తప్ప.. సమస్యలను పరిష్కరించడంపై శ్రద్ధ చూపడం లేదు. సమస్యలు పరిష్కారం కాకుండానే పరిష్కారం అయిపోయినట్లు బాధితులకు మెసేజ్లు పంపిస్తున్నారు. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో కలెక్టరేట్ల వద్ద పలువురు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటుండటం తెలిసిందే.మా భూమి లోంచి మమ్మల్ని వెళ్లగొడుతున్నారు పది ఎకరాల భూమిని మా తాతలు, ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుని బతుకుతున్నాం. ఇప్పుడు కొందరు రాజకీయ పలుకుబడితో మా భూములు ఖాళీ చేయాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని కలెక్టరేట్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకునే వాళ్లే లేరు. ఆదివాసీలమైన మేం ఎక్కడికి పోవాలి? – చీడిపల్లి దేముడమ్మ, జెడ్ జోగుంపేట, రావికమతం మండలం, అనకాపల్లి జిల్లా దొంగ రికార్డులతో బెదిరిస్తున్నారు సర్వే నంబర్ 49లో ఉన్న నా విలువైన భూమిని కాజేయడానికి ఊళ్లో కేటుగాళ్లు నా పేరుతో ఉన్న పత్రాలను మార్ఫింగ్ చేసి దొంగ రికార్డులు సృష్టించారు. వాటి ద్వారా నా భూమిని కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు. కలెక్టరేట్కు వచ్చి మొరపెట్టుకుంటే రెవెన్యూ వాళ్లు నా ఫైలును పక్కనపెట్టి కాలయాపన చేస్తున్నారు. కళ్ల ముందే నా భూమి చేజారిపోతోంది. – టి.గిరిజమ్మ, ఒడ్డుపల్లి, శ్రీరంగరాజపురం మండలం, చిత్తూరు జిల్లా ఆన్లైన్లో నా పేరు మారిపోయింది నా భర్త ఆర్మీలో దేశ సరిహద్దుల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆర్మీ కోటా కింద 2022లో బురుజుపల్లిలో ఆయనకు ఐదు ఎకరాల భూమి కేటాయించారు. ఆయన చనిపోవడంతో ఆ భూమిని నా పేరుపైకి మార్పించుకున్నా. ఎవరో ఏదో చేయడంతో ఇప్పుడు మళ్లీ నా భర్త పేరే ఆన్లైన్లో కనిపిస్తోంది. ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈ వయసులో తిరగలేక చచ్చిపోతున్నా. – కె.సరస్వతి, జవాన్ చిన్న రామయ్య భార్య, బురుజుపల్లి, గుర్రంకొండ మండలం, అన్నమయ్య జిల్లాకూటమి నేతల బెదిరింపులు..గుండెపోటుతో దళిత రైతు మృతి బుచ్చెయ్యపేట: కూటమి నేతలు భూమిని లాక్కుంటారన్న భయంతో తీవ్రవేదనకు గురైన అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలంలోని రాజాం గ్రామానికి చెందిన దళిత రైతు నందికొళ్ల నూకరాజు(36) గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే... నూకరాజు తండ్రి సాంబయ్య 40 ఏళ్లుగా తైపురంలో ఐదు ఎకరాల డి–పట్టా భూమిని సాగు చేసేవాడు. ఆయన మరణం తరువాత నూకరాజు సాగు చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని 22ఎలో పెట్టి హోల్డ్లో ఉంచింది. ఇటీవల తైపురానికి చెందిన కూటమి నేతలు నూకరాజు భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ కలెక్టర్, టీడీపీ ఎమ్మెల్యే కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల రెవెన్యూ అధికారులు పలుసార్లు ఆ భూమిని సర్వే చేశారు. నూకరాజు అడ్డుకుని తన తండ్రి పేరుపై ఉన్న డి–పట్టా రికార్డులను చూపించాడు. రెండు రోజుల కిందట ఎమ్మెల్యే రాజు చోడవరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కూటమి నేతలు మళ్లీ నూకరాజు భూమిపై ఫిర్యాదు చేశారు. దీంతో నూకరాజు తన భూమిని కూటమి నేతలు లాక్కుంటారని ఆందోళన చెందాడు. తమ గతేంటని భార్య భవానీతో శుక్రవారం రాత్రి చెబుతూ బాధపడ్డాడు. అనంతరం గుండెపోటుకు గురై మృతిచెందాడు. కూటమి నేతల ఫిర్యాదుల వల్లే నూకరాజు మృతిచెందాడని ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జెడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరిసా శ్రావణ్ తదితరులు నూకరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నూకరాజు కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నూకరాజు మృతదేహానికి శనివారం రాజాంలో అంత్యక్రియలు నిర్వహించారు. మాటలు కబ్జాలపై.. చేతలు కబ్జాలతోకబ్జాలు అరికట్టడానికి గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చామని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు, టీడీపీ శ్రేణులే ఆచరణలో కబ్జాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను 22ఎ జాబితా నుంచి తొలగించి, అధికార పార్టీకి చెందిన ప్రైవేట్ వ్యక్తులకు బదలాయిస్తూ.. ఆ గుట్టు బయట పడడంతో చివరి నిమిషంలో ఆగిపోయారు. విశాఖ, తిరుపతి, అన్నమయ్య సహా పలు జిల్లాల్లో టీడీపీ నేతలు ఖాళీ భూములను కబ్జా చేసినట్లు రోజుకో ఘటన వెలుగు చూస్తోంది.కళ్లెదుటే భూ ఆక్రమణవైఎస్సార్ కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్దపసుపులకు చెందిన ఈమె పేరు వెంకట లక్ష్మమ్మ. సర్వే నంబర్లు 1,470, 1,471లో ఈమెకు 3.32 ఎకరాల పట్టా భూమి ఉంది. అందులో ఎకరంన్నర భూమిని ఊళ్లో పెత్తందార్లు ఆక్రమించారు. తిరిగి ఈ భూమిని దక్కించుకోవడానికి ఆమె ఎన్నో ఏళ్లు పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు కోర్టు ద్వారా సాధించుకున్నారు. అయితే కోర్టు ఆదేశాలున్నప్పటికీ, రెవెన్యూ వాళ్లు ఈ భూమిని 1బీ రికార్డుల్లో చేర్చి, ఆన్లైన్ చేయడం లేదు. ఫలితంగా తన భూమి దక్కడం లేదని ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు.78 ఏళ్ల నాటి భూమిని నకిలీ పత్రాలతో అమ్మేశారు ఇతని పేరు చంద్రాయుడు. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు. ఇతని తాత బాలయ్య.. సర్వే నంబర్ 676/2లో 0.68 సెంట్ల స్థలాన్ని 1948లోనే కొన్నారు. 78 ఏళ్లుగా ఈ భూమి వీరి స్వాధీనంలోనే ఉంది. అందులో మూడు సెంట్లు జాతీయ రహదారి విస్తరణలోకి వెళ్తే ప్రభుత్వం వీరికి రూ.23,287 పరిహారం కూడా ఇచ్చింది. అంత పక్కా రికార్డు ఉన్న ఈ భూమిని కబ్జాదారులు నకిలీ పత్రాలు సృష్టించి వేరే వాళ్లకు అమ్మేశారు. సబ్ రిజిస్ట్రార్ దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేశారు. రికార్డులన్నీ పట్టుకుని పీజీఆర్ఎస్ మెట్లు ఎక్కినా తనకు సమాధానం చెప్పేవారే లేరని చంద్రాయుడు వాపోతున్నారు. -
మెగా డీఎస్సీ పేరుతో 'మెగా స్కామ్'
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ–2025 మోసం, దగా, స్కామ్ డీఎస్సీగా మారిందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఈనెల 11న ఆయన మీడియా సమావేశం ద్వారా సాక్ష్యాధారాలతో సహా ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మెగా స్కామ్ జరిగిన తీరుకు ఆధారాలు జత చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శనివారం పోస్టు చేశారు. ఈ మెగా స్కామ్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హస్తం ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన మెగా డీఎస్సీ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగు తొలగాలంటే స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతుండటాన్ని వైఎస్ జగన్ ఆ పోస్టులో ప్రస్తావించారు. లక్షలాది మంది ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలతో సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు నారా లోకేశ్ చెలగాటమాడిన తీరును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ చేసిన పోస్టు సంచలనం రేపింది. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. ప్రతిభావంతుల జీవితాలతో చెలగాటం‘మెగా డీఎస్సీ పేరుతో సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తూ, అత్యంత చాకచక్యంగా మెగా స్కామ్కు తెర తీసి.. చీకటి దందాకు పాల్పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ అవకతవకలు, మోసాల వల్ల నేడు లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతటి దారుణమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదు. 16,000 డీఎస్సీ పోస్టుల నియామక ప్రక్రియలో పారదర్శకతను పూర్తిగా తుంగలో తొక్కారు. డీఎస్సీ నియామకాలను డబ్బులు గుంజే కుంభకోణంగా మార్చాలన్న దుర్బుద్ధితో అత్యంత పకడ్బందీగా, సంస్థాగతంగా తనిఖీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంతటి దారుణమైన అక్రమాలు, అవతవకలు చోటుచేసుకున్న నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ జరగలేదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక డీఎస్సీ. నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యా శాఖ నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, అవినీతి అత్యంత తీవ్రంగా ఖండించదగినవి. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక పర్వాలు (మల్టీ లేయర్)గా సాగిన ఈ మెగా స్కామ్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..వ్యవస్థల ధ్వంసం.. కుట్రకు తొలి అడుగు!డీఎస్సీ నిర్వహణలో దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. పరీక్షల గోప్యతను కాపాడటం కోసం గతంలో ప్రశ్నపత్రాల తయారీని ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)కి, పరీక్ష నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్కు వేర్వేరుగా అప్పగించేవారు. కానీ.. ఈ ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేస్తూ డీఎస్సీ కన్వీనర్ను పక్కనబెట్టారు. ఈ రెండు కీలక బాధ్యతలను ఒకే వ్యక్తికి.. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే కట్టబెట్టారు. తద్వారా పారదర్శకతను ఉద్దేశ పూర్వకంగా దెబ్బతీసి, అక్రమాలకు దారి సుగమం చేస్తూ ఈ మెగా స్కామ్కు తొలి అడుగు వేశారు.అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాధ్యతలు.. పేపర్ లీక్పరిస్థితిని మరింత దిగజారుస్తూ, అత్యంత రహస్యంగా ఉంచాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, ఆన్లైన్లో అప్లోడ్ చేసే బాధ్యతలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. ఒకవేళ వ్యవహారం బయటపడితే వారిని బలిపశువులను చేయవచ్చనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ఈ అక్రమాలకు పరాకాష్టగా ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే బాధ్యతలో భాగస్వామిగా ఉన్న ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగే ఈ డీఎస్సీ పరీక్షలో ఏకంగా మొదటి ర్యాంక్ సాధించడం గమనార్హం. ఇది పేపర్ లీక్ కుంభకోణానికి ప్రత్యక్ష నిదర్శనం కాదా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు వ్యవస్థ ఎంత బలహీన పడిందో స్పష్టం చేస్తున్నాయి. మొదటి ర్యాంక్ సాధించినప్పటికీ ఆ వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? మెరిట్ జాబితా నుండి అతడి ఐడీ, డేటాను ఎందుకు రాత్రికి రాత్రే తొలగించారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు అతడిని ఎందుకు పిలవలేదు? ఆ బాధితుడు కోర్టును ఆశ్రయించడానికి ఇవే కారణాలు కాదా? ఎస్సీఈఆర్టీలో ఉంటూ ప్రశ్నపత్రాలను అప్లోడ్ చేసే ప్రక్రియలో పాలుపంచుకున్న వ్యక్తికి టాప్ ర్యాంక్ రావడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, పేపర్ లీక్ లోతును వెలికి తీయాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గం.ఫలితాల ప్రకటనలో లోపించిన పారదర్శకతడీఎస్సీ ఫలితాల ప్రకటనలో పారదర్శకత పూర్తిగా మృగ్యమైంది. గతంలో మెరిట్, రోస్టర్ జాబితాలను కలెక్టరేట్ నోటీస్ బోర్డులపై ఉంచే సంప్రదాయం ఉండేది. దాన్ని పక్కనబెట్టి, కేవలం ఆన్లైన్ డిస్ప్లే, మొబైల్ మెసేజ్లకే పరిమితం చేస్తూ కేంద్రీకరించారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్ర అనిశ్చితికి లోనై, తమ ఫిర్యాదులు చెప్పుకోవడానికి కలెక్టరేట్ల చుట్టూ, హెడ్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చింది. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. 1ః1 నిష్పత్తిలో కాల్ లెటర్లు అందుకుని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న పలువురు అభ్యర్థుల పేర్లు తుది ఎంపిక జాబితా నుంచి మాయమయ్యాయి. ‘స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ రూల్స్ 2025’ లోని రూల్ 20ని కచ్చితంగా పాటిస్తే.. మార్కులు, కటాఫ్, స్పోర్ట్స్, వికలాంగుల కోటా వంటి అన్ని హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్నాక, వెరిఫికేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికీ తుది జాబితాలో చోటు దక్కాలి. కానీ, అర్హులైన ఎంతో మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది.సీబీఐ దర్యాప్తే శరణ్యంలక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను, కలలను కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా సమాధి చేసింది. ఈ కుంభకోణం వెనుక ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న పెద్దల హస్తం ఉంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వారి పరిధిలోనే పనిచేస్తాయి కాబట్టి, వారు నిజాలు నిగ్గు తేల్చలేరు. అందుకే, బాధితులకు న్యాయం జరగాలన్నా, ఈ మెగా స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగు తొలగాలన్నా స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతోనే సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.స్పోర్ట్స్ కోటా మళ్లింపు.. దొడ్డిదారి నియామకాలకు బ్లూప్రింట్!ఈ కుంభకోణంలో అత్యంత వివాదాస్పదమైనది స్పోర్ట్స్ కోటా వ్యవహారమే. నియామక ప్రక్రియలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలుగా జీవోలను మార్చేసిన తీరు క్రీడాలోకాన్ని విస్మయానికి గురి చేసింది. 2012 నాటి జీవో నంబర్ 74 ప్రకారం క్రీడాకారులు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలనే నిబంధన ఉండేది. కానీ, చంద్రబాబు, లోకేశ్ ద్వయం ఈ నిబంధనను తొలగిస్తూ 2024 డిసెంబర్లో కొత్తగా జీవో నంబర్ 8, జీవో నంబర్ 4, 47లను తీసుకొచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డీఎస్సీ రాత పరీక్ష నుంచే మినహాయింపు ఇచ్చారు. అంటే, తమకు కావాల్సిన వారిని దొడ్డిదారిలో (బ్యాక్ డోర్ ఎంట్రీ) చొప్పించడానికి ముందే ఒక పక్కా బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు. తీరా అనుకున్న విధంగా రాత పరీక్ష లేకుండా నియామకాలు పూర్తి కాగానే.. మళ్లీ పాత పద్ధతిని పునరుద్ధరిస్తూ జీవో నంబర్ 23, 25, 56లను జారీ చేశారు. క్రీడాకారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఇబ్బందులు ఎదురయ్యాయని సాకులు చెబుతూ.. పని పూర్తయ్యాక దొడ్డి దారిని మూసి వేయడం వీరి కపట నీతికి అద్దం పడుతోంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ‘ఉపాధ్యాయ పోస్టు బేరసారాల’ వీడియోపై అధికారులు నామమాత్రంగా స్పందించారు. నిందితుడి ఫోన్ నంబర్ స్పష్టంగా తెలిసినప్పటికీ, ఎఫ్ఐఆర్లో పేరు కూడా చేర్చకుండా, కేవలం స్టేషన్ బెయిల్పై వదిలేయడం వెనుక ఉన్న హస్తమెవరిదో అర్థమవుతూనే ఉంది. -
ఆర్టీసీపై పీపీపీ పిడుగు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)పై ప్రై‘వేటు’కు చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరింత పదును పెడుతోంది. దాదాపు 50 వేల మంది ఉద్యోగులతో ప్రధాన పబ్లిక్ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో ఒక్కో అంకాన్ని వేగవంతం చేస్తోంది. అందుకోసం ఆర్టీసీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ ఆర్టీసీని దివాలా తీయించేందుకు సిద్ధపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యంత విలువైన ఆర్టీసీ బస్ స్టేషన్ల భూములను అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ఆర్టీసీకి సొంత బస్సులు లేకుండా చేసి, సొంత ఆస్తులను అన్యాక్రాంతం చేసి.. అనంతరం ఆర్టీసీ గొంతు నొక్కాలన్న కుతంత్రానికి ప్రభుత్వం బరితెగిస్తోంది. రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ బస్ స్టేషన్లు, బస్ డిపోలే ఆర్టీసీకి ప్రాణాధారం. ఆ ఆయువుపట్టుపై చంద్రబాబు ప్రభుత్వం దెబ్బ కొడుతోంది. ఇప్పటికే ఇ–బస్సుల విధానం ముసుగులో రూ.6,600 కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన ప్రభుత్వం.. ఆ కుతంత్రంలో రెండో అంకానికి తెరతీసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాన ఆర్టీసీ బస్ స్టేషన్ల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే కార్యాచరణకు ఉపక్రమించింది. పబ్లిక్ –ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ముసుగులో అందుకు సిద్ధపడింది. ప్రభుత్వ పెద్దల అత్యంత ముఖ్యులకే బినామీ పేర్లతో, బినామీ సంస్థల ముసుగులో కట్టబెట్టేందుకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అందుకోసం మొదటి దశలో విశాఖపట్నంలోని మద్దెలపాలెం, విజయవాడ ఆటోనగర్, తిరుపతి, గుంటూరు, కడప, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, రాజమండ్రి, ఏలూరు బస్ స్టేషన్లను గుర్తించింది.రూ.వేల కోట్ల భూములను కారు చౌకగా కట్టబెట్టే కుట్ర ⇒ అత్యంత విలువైన ఆర్టీసీ బస్ స్టేషన్లను పీపీపీ విధానంలో కారు చౌకగా తమ అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ఏకంగా 99 ఏళ్ల లీజు రూపంలో కట్టబెట్టాలని ఎత్తుగడ వేశారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం ఆర్టీసీ బస్ స్టేషన్ 12 ఎకరాల్లో విస్తరించి ఉంది. అత్యంత విలువైన ఆ ప్రాంతంలో మార్కెట్ ధర ఎకరం రూ.200 కోట్ల పైమాటే. ఆ ప్రకారం ఆ 12 ఎకరాల మార్కెట్ విలువ రూ.2,400 కోట్లు పలుకుతుంది. కానీ ఆ బస్ స్టేషన్ను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసేందుకు రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతుందని డీపీఆర్ను ప్రతిపాదించడం గమనార్హం. అంటే రూ.500 కోట్ల పెట్టుబడి పెడతామనే ఓ ప్రైవేటు సంస్థకు రూ.2,400 కోట్ల విలువైన భూములు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం తెగబడుతోందన్నది స్పష్టమవుతోంది. ⇒ అదే రీతిలో ఇతర బస్ స్టేషన్లను పీపీపీ విధానంలో కట్టబెట్టేందుకు ప్రైవేటు సంస్థల పెట్టుబడి కోసం డీపీఆర్ను అడ్డగోలుగా రూపొందించడం గమనార్హం. తిరుపతి బస్ స్టేషన్కు రూ.300 కోట్లు, విజయవాడ ఆటోనగర్ బస్ స్టేషన్కు రూ.150 కోట్లు, గుంటూరు బస్ స్టేషన్కు రూ.60 కోట్లు పెట్టుబడి పెడతారనే పేరుతో తమ అస్మదీయ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. విజయవాడలోని ఆటోనగర్ బస్టాండ్ ⇒ కర్నూలు, అనంతపురం, కడప, ఒంగోలు, ఏలూరు, రాజమహేంద్రవరం బస్ స్టేషన్ల భూములను కూడా ప్రైవేటుపరం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేవలం నామమాత్రపు లీజుతో ఈ భూములను ధారదత్తం చేసేందుకు ప్రతిపాదనలు ఖరారు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆర్టీసీ ఉన్నతాధికారులకు మౌఖికంగా ఆదేశించినట్టు తెలుస్తోంది. ⇒ మొత్తం మీద దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ ఆందోళనలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం బరితెగిస్తోందని మండిపడుతున్నాయి. -
‘తిరుపతి సభ విజయోత్సవం కాదు.. వెన్నుపోటు ఉత్సవం’
సాక్షి, తాడేపల్లి: తిరుపతిలో ఈ నెల 12న కూటమి ప్రభుత్వం నిర్వహించిన రెండేళ్ల విజయోత్సవ సభ వాస్తవానికి విజయాలను చెప్పుకునే సభ కాదని, ఆరు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ప్రస్తుతం "క్యాష్–రాజేష్–లోకేష్" ఫార్ములాతో పాలన సాగుతోందని ఆరోపించిన ఆయన, డీఎస్సీ నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రెస్మీట్లో తాటిపర్తి చంద్రశేఖర్ ఏమన్నారంటే..అది వెన్నుపోటు పొడిచిన సభతిరుపతిలో ఈ నెల 12న జరిగినది కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ కాదు.. ఆరు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ. చంద్రబాబు రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు ఏంటో గూగుల్లో వెతికినా కనిపించవు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుకోవడం పరీక్ష రాయకుండానే పాస్ అయినట్లు ఉంది. ఆ రోజు సూపర్ సిక్స్ అన్న చంద్రబాబు, ఈ రోజు సూపర్ సైలెంట్ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోను మూసేసి ఎర్రబుక్ పాలన ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ పని జరగాలన్నా 'క్యాష్–రాజేష్–లోకేష్' అనే కొత్త ఫార్ములానే అమలవుతోంది. రాజేష్ స్కెచ్ వేస్తే, లోకేష్ దాన్ని అమలు చేస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి రాష్ట్ర వ్యవస్థలను భ్రష్టు పట్టించారు.డీఎస్సీపై సమాధానం చెప్పలేని మంత్రి రాష్ట్రాన్ని నడిపిస్తారా?డీఎస్సీ -2025 వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై ప్రెస్మీట్ పెట్టి సమాధానం చెప్పలేని వ్యక్తి మంత్రి ఎలా అవుతారు? డీఎస్సీ అక్రమాలపై వివరణ ఇవ్వలేని సకల విఫల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారా? అలాంటి వ్యక్తి విజయోత్సవ సభ వేదికపై నిలబడి వైఎస్ జగన్ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. దూకుడు సినిమాలో బ్రహ్మానందం పాత్రను ఎలా ఉపయోగించారో, అలాగే చంద్రబాబు–లోకేష్లు పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకుంటున్నారు.ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినప్పుడల్లా పవన్ను రంగంలోకి దింపుతున్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రత్యర్థులను దూషించడానికే పరిమితమయ్యారు. పుట్టిన పసిబిడ్డల నుంచి రైతుల వరకు ప్రతి వర్గాన్నీ మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. తిరుపతిలో నిర్వహించిన సభ విజయోత్సవ సభ కాదు.. ఆరు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ అని వారి ప్రసంగాలే నిరూపించాయి.సింగిల్ విండో పాలనరాష్ట్రంలో ప్రస్తుతం 'క్యాష్–రాజేష్–లోకేష్' అనే సింగిల్ విండో పాలన నడుస్తోంది. ఈ కొత్త ఫార్ములాతో పుట్టిన పసిబిడ్డల నుంచి రైతుల వరకు ప్రతి వర్గాన్నీ మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. రెండేళ్లలోనే చంద్రబాబు రెండు చేతులు ఎత్తేశారు. రూ.3.60 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఆర్థిక లోటును పెంచి ఖజానాను ఖాళీ చేశారు. ఈ రెండేళ్లలో సాధించిన విజయాలు చెప్పుకునే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదు. నారా లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖలో అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అక్కడే రాష్ట్ర తిరోగమనం మొదలైంది. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటుకు అప్పగించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోయాయి, ఫలితాలు పడిపోయాయి, పేపర్ లీకులు పెరిగాయి. ఉద్యోగాలు సూట్కేసులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. డీఎస్సీలో విద్యాశాఖ ఉద్యోగులకే మొదటి ర్యాంకులు రావడం, గోల్డ్ మెడలిస్టులకు ఉద్యోగాలు రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తల్లికి వందనం అని చెప్పి పిల్లలకు మంగళం పాడారు. సుమారు 20 లక్షల మంది విద్యార్థులను అర్హుల జాబితా నుంచి తొలగించారు. ఒకవైపు తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని సినిమా డైలాగులు చెబుతుంటే, మరోవైపు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. సొంత పార్టీ నేతల తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.కరెంట్ చార్జీలు తగ్గించినట్లు నిరూపించగలరా?తిరుపతి విజయోత్సవ సభలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. రెండేళ్లలో ఒక్క రూపాయి అయినా కరెంట్ చార్జీలు తగ్గించినట్లు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నిరూపించలేకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తమ పదవులకు రాజీనామా చేస్తారా? పని కంటే ప్రచారానికే ఈ త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.వైఎస్ జగన్ పాలనలో సంక్షేమం, పారదర్శకత, గ్రామ స్వరాజ్యం కనిపించాయి. కానీ రూ.3.60 లక్షల కోట్ల అప్పులు చేసినా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం మహిళలు, రైతులు, యువత సహా అన్ని వర్గాలను మోసం చేసింది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు హామీలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలి.ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, అప్పులు–అవినీతితో పాలన సాగిస్తున్నారు. తిరుపతి విజయోత్సవ సభతోనే కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను తానే అంగీకరించుకుందని స్పష్టమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 143 హామీలపై సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ మోసాలను గుర్తించి తిప్పికొట్టే సమయం ఆసన్నమైందని తాటిపర్తి చంద్రశేఖర్ హెచ్చరించారు. -
యూట్యూబర్ నందు కేసులో విస్తుపోయే అంశాలు
సాక్షి, హైదరాబాద్: జాగర్లమూడి మధుకర్, రమానందన వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేసి సీవోఎస్లు ఇవ్వడం జాగర్లమూడి కపుల్కు వెన్నతో పెట్టిన విద్య అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు నందు దంపతులు వసూలు చేశారు. యూకేలో వీసా, జాబ్స్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు.యూకేలో సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన నందు దంపతులపై చట్టపరంగా పోరాటానికి రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్తో రమానందన మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇచ్చే అర్హతను నందూస్ వరల్డ్ కిచెన్ కోల్పోయింది. జాగర్లమూడి కంపెనీలకు యూకే సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇవ్వకుండా బ్రేక్ పడింది.యూకే వీసా కేసులో నందూస్ వరల్డ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీసా కేసులో బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. నేరం రుజువైతే రమానందన, మధుకర్కు యూకేలో పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. జైలు శిక్ష తర్వాత పాస్పోర్టు రద్దు చేసి ఇండియాకు పంపే అవకాశాలు ఉన్నాయి. -
ఏం బాబూ.. ఇదేనా పొదుపు?
సాక్షి, టాస్క్ ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేశారు. పబ్లిసిటీ కోసం పొదుపు పాటిస్తున్నాం అని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు.. ఆచరణలో మాత్రం అమలు చేయకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద శుక్రవారం టీడీపీ ప్రభుత్వం విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరయ్యే నేతలు నాలుగు విమానాలు, ఓ హెలికాప్టర్ వినియోగించినట్లు రేణిగుంట విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్లో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక చాపర్లో రేణిగుంటకు చేరుకున్నారు. మంత్రి లోకేశ్, జిల్లా టీడీపీ ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, మరి కొందరు మంత్రులు మరో మూడు ప్రత్యేక విమానాల్లో రేణిగుంటకు చేరుకున్నట్లు తెలిపారు. పొదుపు మంత్రంలో భాగంగా వారంలో ప్రతి శుక్రవారం నో వెహికల్స్ డే అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ విజయోత్సవ సభకు భారీఎత్తున వాహనాలు వినియోగించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు దామినేడు సభాస్థలి వరకు కాన్వాయ్లో చేరుకున్నారు. విజయోత్సవ సభకు జన సమీకరణ కోసం ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలోని మారుమూల గ్రామాలకు సైతం ప్రత్యేక వాహనాలను పంపి స్థానికులను రప్పించుకున్నారు. ఈ వాహనాల కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ నెల 7 నుంచి 12 వరకు ఉండేలా సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లకు మొత్తంగా రూ.3 కోట్లు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. -
ఏపీలో బా‘ధర’బందీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర ధరలు, ప్రధానంగా ఆహార ధరలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే మేలో రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణంలో పాటు ఆహార ధరలు పెరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక స్పష్టం చేసింది. మే నెలలో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు, ప్రధానంగా ఆహార ధరలు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో మే నెలలో సాధారణ ద్రవ్యోల్బణం 4.90 శాతం ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 6.93 శాతంగా ఉంది. ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణం 4.20 శాతం ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 5.64 శాతం ఉంది. అంటే ఏప్రిల్ కన్నా మే నెలలో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం పెరిగినట్లు స్పష్టమైంది. మే నెలలో రాష్ట్రంలో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనేద్రవ్యోల్బణం అత్యధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో 5.09 శాతం ద్రవ్యోల్బణం ఉండగా పట్టణాల్లో 4.61 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. జాతీయ సగటు కన్నా రాష్ట్రంలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం ఉంది. జాతీయ స్థాయిలో సాధారణ ద్రవ్యోల్బణం 3.93 శాతం ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 4.78 శాతమే ఉంది. గత నెలతో పోల్చితే మేలో వంట నూనెలతో పాటు పప్పులు, కూరగాయలు ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు రెండో స్థానం, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. ఆ తరువాత కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. -
స్కాములు.. లీకులు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికల్లో కూటమి వైఫల్యాలను ఎత్తి చూపుతూ పోస్టులు పెడుతున్నారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్గా మారింది. సూపర్ సిక్స్.. సూపర్ ప్లాప్, స్కాములు.. లీకులు, డీఎస్సీ అక్రమాలు, రైతులకు వెన్నుపోటు వంటి పోస్టులు వైరల్ అవుతున్నాయి. కూటమి పరిపాలనను వైఎస్సార్సీపీ పాలనతో పోల్చుతూ కామెంట్లు పెడుతున్నారు. కేవలం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని ఇంతలా అప్పుల పాలు చేసి, ఇన్ని స్కాములకు పాల్పడ్డ చంద్రబాబు అండ్కో నేతలపై సామాజిక మాధ్యమాల్లో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. -
పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం ప్రభుత్వాల విధి
సాక్షి, అమరావతి: రాజ్యాంగ ఆదేశిక సూత్రాల ప్రకారం పబ్లిక్ టాయిలెట్స్ను ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రభుత్వాల విధి అని హైకోర్టు పేర్కొంది. ఈ సౌకర్యం కల్పించలేని ప్రభుత్వాలు తమను తాము సంక్షేమ ప్రభుత్వాలుగా చెప్పుకోలేవని స్పష్టంచేసింది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన జీవనమన్నది జీవించే హక్కులో భాగమని తేల్చి చెప్పింది. రోడ్ల పక్కన తగినన్ని పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడం వల్ల మహిళలు, ట్రాన్స్జెండర్ల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడంతో పాటు వారికి ఉండే భయాలను తొలగించినట్లవుతుందని పేర్కొంది.అయితే పబ్లిక్ టాయిలెట్స్ను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటామంటే సరిపోదని, ఏడాది పొడవునా వాటిని సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉందని ఉద్ఘాటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల ఒక వ్యాజ్యంలో తీర్పు వెలువరించారు.విశాఖపట్నం, పిఠాపురం కాలనీలో, మద్దిలపాలెం బస్డిపో సమీపంలో తమ ఇళ్ల ఎదురుగా ఉన్న జీవీఎంసీ స్థలంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ కె.చిన్నస్వామి శెట్టి మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి కొట్టివేశారు. నిర్వహణ విషయంలో అశ్రద్ధ చూపితే ఆ విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చునని పిటిషనర్లకు సూచించారు. -
స్కీములు రద్దు.. స్కామ్లే ముద్దు!
సాక్షి, అమరావతి: గతంలో ఉన్న పథకాలన్నీ రద్దు.. సూపర్ సిక్స్లు, సెవెన్లు పేరుతో మోసాలు! కొత్తగా సంపద సృష్టించకపోగా ఉన్న సంపదే ఆవిరి! విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం..! విప్లవాత్మక కార్యక్రమాలు, వ్యవస్థలకు మంగళం! పిల్లల నుంచి మహిళలు వరకు ప్రతి ఒక్కరికీ ఎడాపెడా ఎన్నికల హామీలిచ్చి నిస్సిగ్గుగా నయవంచన! ఇదీ రెండేళ్ల పాలనలో చంద్రబాబు సర్కారు సాధించిన ఘనత!! రైతులకు ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఉచిత పంటల బీమా ఎగిరిపోయి వ్యవసాయం కుదేలు కాగా విద్యాదీవెన, వసతి దీవెన అందక విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా తొక్కిపెట్టడంతో పిల్లల చదువులు ఆగిపోతున్న దుస్థితి నెలకొంది. ప్రభుత్వ స్కూళ్లలో నాడు – నేడు పనులను నిలిపివేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడమే ఆలస్యం.. ప్రభుత్వ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించి పిల్లల చదువులను గాలికి వదిలేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన ఆరోగ్యశ్రీని నీరుగార్చి బిల్లులు చెల్లించకపోవడంతో వైద్య సేవలు అందక పేదలు అల్లాడుతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. సచివాలయాల వ్యవస్థను ఛిద్రం చేస్తూ ఇంటి వద్దకే పౌరసేవలు, పాలన వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు. రెండేళ్లలో అంతా స్కామ్ల మయంగా మార్చేశారు! హామీలు ఎగ్గొట్టి.. విచ్చలవిడిగా అప్పులు.. ప్రకృతి వనరుల దోపిడీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. సంపద సృష్టించి సంక్షేమాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికి ఇప్పుడు ఉన్న సంపదనే ఊడ్చేస్తున్నారు. విచ్చలవిడిగా అప్పులు చేయడంతో చంద్రబాబు పాలనలో ఆర్థిక ప్రతిష్ట దిగజారినట్లు ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక సాక్షిగా వెల్లడైంది. 365 రోజుల్లో 357 రోజులు అప్పులపైనే చంద్రబాబు సర్కారు మనుగడ సాగించినట్లు ‘కాగ్’ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ, స్థానిక సంస్ధల ఆస్తులను తాకట్టు పెట్టి బడ్జెట్ లోపల, బడ్టెట్ బయట చంద్రబాబు సర్కారు ఏకంగా రూ.3.47 లక్షల కోట్లు మేర అప్పులు చేసింది. రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టేయడంతో పాటు ఎడాపెడా అప్పులతో ఆర్ధిక విధ్వంసం సృష్టించారు. ప్రజల తలసరి ఆదాయం, ప్రభుత్వ రాబడిని పెంచకుండా ఇసుక నుంచి మద్యం దాకా సిలికా నుంచి లేటరైట్ వరకు ప్రకృతి వనరుల దోపిడీకి తెర తీసి పచ్చ ముఠాలకు పంచి పెట్టారు. విలువైన ప్రభుత్వ భూములను బంధు గణానికి అప్పనంగా దోచి పెట్టారు. సొంత కుటుంబ సంస్థకు రాయితీల పేరుతో ప్రజా ధనాన్ని మళ్లించారు. విచ్చలవిడిగా అప్పులు చేసినా సూపర్ సిక్స్, సెవెన్, ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి అమలు చేయకుండా యువతకు.. ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు రెండేళ్ల పాలన నమ్మక ద్రోహం, మోసం, వెన్నుపోట్లు, ప్రశ్నించే గొంతులను అణగదొక్కడమే లక్ష్యంగా సాగింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన సభలో దొంగే.. దొంగ దొంగ..! అని అరిచినట్లుగా చంద్రబాబు సూక్తులను విని రాష్ట్ర ప్రజలు విస్తుపోయారు. రెండేళ్ల పాలనలో తన నిర్వాకాలను వైఎస్సార్ సీపీకి ఆపాదిస్తూ నిస్సిగ్గుగా నిందలు మోపారు. రెండేళ్ల నమ్మకం అంటూ కూటమి ప్రభుత్వం సభ నిర్వహించడంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. సూపర్ సిక్స్లతో సహా ఎన్నికల హామీలను నెరవేర్చకపోగా.. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను సైతం రద్దు చేసిన సీఎం చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ‘నమ్మకం’ పేరుతో సభ నిర్వహిస్తారని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. హామీలు అమలు చేసి నిజాయతీ నిరూపించుకున్నామంటూ చంద్రబాబు చెప్పడంపై నివ్వెరపోతున్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్ లాంటి అనేక హామీలను రెండేళ్లు గడిచినా అమలు చేయకుండా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందని, నమ్మి ఓట్లేసిన ప్రజలను నిలువునా వంచించారని సర్వత్రా చర్చ జరుగుతోంది. మద్యం ఆదాయాన్నీ వదలకుండా.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీఎస్బీసీఎల్ నుంచి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి బాండ్లు జారీ ద్వారా భారీ అప్పులు చేసింది. 2025 డిసెంబర్లో ఏపీఎస్బీసీఎల్ ద్వారా బాండ్లు జారీ చేసి రూ.5,750 కోట్లు అప్పు చేయగా ఇటీవల కేబినెట్ సమావేశంలో ఈ మొత్తాన్ని రూ.11,850 కోట్లకు పెంచారు. ఇలాంటి అప్పులు ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం, కాగ్ వారించినా చంద్రబాబు ఖాతరు చేయలేదు. రాజధాని ముసుగులో.. రాజధాని నిర్మాణం పేరుతో భూములను తాకట్టు పెట్టడం ద్వారా భారీగా అప్పులు చేస్తున్నారు. సంపద సృష్టించేవారే సంక్షేమం గురించి మాట్లాడాలని.. ఆదాయం పెంచేవాళ్లకే సంక్షేమం పంచే అధికారం ఉంటుందంటూ ఎన్నికల ముందు గంభీరంగా చెప్పిన చంద్రబాబు ఇప్పటికే ఉన్న ఆస్తులను సైతం కరిగించేస్తున్నారు. మరోవైపు తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా వైఎస్సార్ సీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలను సైతం నిలిపివేశారు. సంపద సృష్టించకుండా, హామీలు అమలు చేయకుండానే నెరవేర్చినట్లు పచ్చి అబద్ధాలు చెబుతుండటం పట్ల అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. ప్రైవేట్ చేతికి ఖజానా తాళాలు! రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమే. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా అప్పులను రికవరీ చేసుకునే వెసులుబాటు ప్రైవేట్ వ్యక్తులకు కల్పించింది. ఏపీఎండీసీకి రూ. 1,91,000 కోట్ల విలువైన 436 మైనింగ్ లీజులను బదిలీ చేసి వాటిని సెక్యురిటీగా బాండ్లు జారీ చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు భారీగా అప్పులు చేసింది. ఆ అప్పులకు గ్యారెంటీ ఇవ్వడమే కాకుండా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా అప్పులను రికవరీ చేసుకునే వెసులుబాటును కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వసూలు చేసుకునేలా అనుమతించింది. ఇంత దారుణంగా ఆర్ధిక విధ్వంసానికి తెగబడి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందంటూ రెండేళ్ల సభలో చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలాడటాన్ని చూసి అధికార యంత్రాంగం సైతం విస్తుపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఎమ్మార్వో ఆఫీసులను, ఆస్పత్రులను తాకట్టు పెట్టినట్లు చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లించారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ రంగంలో ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను చేపట్టగా వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకున్నది చంద్రబాబు ప్రభుత్వమే. అలాగే పౌర సేవలను ప్రైవేట్ పరం చేయాలని, మున్సిపల్ ఆస్తులను ప్రైవేట్ సంçస్థలు, వ్యక్తులకు దీర్ఘకాలిక లీజుకు లేదా విక్రయించేందుకు అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. -
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. శుక్రవారం అన్నమయ్య జిల్లా కలికిరిలో 3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా నిమ్మనపల్లెలో 2.9, చిత్తూరు జిల్లా పలమనేరులో 2.4, కార్వేటినగరంలో 2.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే, ఆవర్తనం ప్రభావంతో శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు ఆస్కారమున్నట్లు పేర్కొంది. గంటకు 40– 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు శుక్రవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎండ విజృంభించింది. ప్రకాశం జిల్లా కారేడులో 43.1 డిగ్రీలు, నెల్లూరు జిల్లా గూడూరులో 43, మన్యం జిల్లా భామినిలో 41.7, అనకాపల్లి జిల్లా చీడికాడలో 41.4 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతిలో కుండపోత వర్షం.. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో ఉకిరిబిక్కిరికి గురైన తిరుపతి జిల్లా ప్రజలను వరుణుడు కరుణించాడు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు తిరుపతిలో కుండపోత వర్షం కురిసింది. దీంతో మురుగు కాలువలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు పెద్ద ఎత్తున చేరడంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో ఎండ వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. -
టీడీపీ స‘మేత’ దోపిడీ ముఠా
సాక్షి, అమరావతి: టీడీపీ ‘మేత’వన్నె పులులు తెగపడ్డాయి. ‘రొయ్య’ రైతులను దోచుకునేందుకు బరితెగించాయి. ఏకపక్షంగా మేత ధరలను పెంచేశాయి. ఆక్వా రంగ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా టన్నుకు వెనామీ ఫీడ్పై రూ.10వేలు, టైగర్ ఫీడ్పై రూ.12 వేలు చొప్పున పెంచాయి. ఈ పెంపు శనివారం నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించాయి. తొలుత టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావుకు చెందిన బీఏంఆర్ కంపెనీతోపాటు టీడీపీ నేతలకే చెందిన అవంతి ఫీడ్స్ కంపెనీలు ధరలను పెంచుతూ ప్రకటనలు విడుదల చేయడంతో ఇదే బాటలో మిగిలిన కంపెనీలూ ఒకదాని తర్వాత మరొకటి ప్రకటనలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆది నుంచి మేత తయారీదారులతో కుమ్మక్కైన చంద్రబాబు ప్రభుత్వం దొడ్డిదారిన ఫీడ్ ధరల పెంపునకు పచ్చజెండా ఊపడంతో ఆక్వా రైతులు మండిపడుతున్నారు.అప్సడా చట్టానికి తూట్లు నిబంధనల ప్రకారం.. ధరల పెంపు అనివార్యమైతే అప్సడా స్టేక్ హోల్డర్స్ (ఆక్వా రైతులు, సంఘాల నేతలు)తో సమావేశమై నిర్ణయించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టానికి రెండేళ్లుగా తూట్లు పొడుస్తోంది. రొయ్య రైతుల అంగీకారం లేకుండానే కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇదే రీతిలో టన్నుకు రూ.4వేల చొప్పున ధరలు పెంచేశాయి. తాజాగా ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో టన్నుకు కనీసం వెనామీ ఫీడ్పై రూ.12వేలు, టైగర్ ఫీడ్పై రూ.14వేలు పెంచేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఏప్రిల్ 30న మత్స్యశాఖ కమిషనర్కు రొయ్య మేత తయారీదారుల సంఘం లేఖ రాసింది. రైతులతో సమావేశమై నిర్ణయం తీసుకుందామని కమిషనర్ చెప్పారు.కానీ పట్టించుకోకుండా మే 11న వెనామీ ఫీడ్పై రూ.8,420, టైగర్ ఫీడ్పై రూ.10,520 చొప్పున పెంచుతూ కంపెనీలు ప్రకటనలు చేశాయి. దీంతో ఆక్వా రైతులు భగ్గుమన్నారు. ఆ వెంటనే «మత్స్యశాఖ మంత్రి అచ్చెన్ననాయుడు స్పందించి ఆక్వా రైతులతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కోరడంతో తాత్కాలికంగా కంపెనీలు పెంపును వాయిదా వేశాయి. రైతులు వ్యతిరేకిస్తున్నా..మే 15న సచివాలయంలో అప్సడా ఆధ్వర్యంలో రైతులు, కంపెనీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశానికి మంత్రి అచ్చెన్న కావాలనే డుమ్మా కొట్టారు. రైతులు మేత ధరల పెంపును వ్యతిరేకించారు. సరిగ్గా ఇదేసమయంలో ధరల పెంపునకు వత్తాసు పలుకుతూ సీఎం చంద్రబాబు కేంద్ర వాణిజ్య మంత్రికి లేఖ రాయడంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న మంత్రి అచ్చెన్న సమక్షంలో మరోసారి టీడీపీ అనుకూల రైతులతో కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. టీడీపీ అనుకూల రైతులు నెల పాటు రూ.6వేలు పెంపునకు అంగీకరించారు. దీన్ని ఆక్వా రైతులు వ్యతిరేకించారు. అయినా శుక్రవారం రాత్రి బీఎంఆర్, అవంతి, ఫెడోరో, నెక్స్జెన్ కంపెనీలు భారీగా మేత ధరలు పెంచేస్తూ ప్రకటనలు చేశాయి. మిగిలిన కంపెనీలు ఇదే బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. భారీగా పెరగనున్న ఉత్పత్తి వ్యయం 2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.72వేలు ఉండగా, శుక్రవారం మేత ధరలు పన్నులతో కలిపి టన్నుకు వెనామీ ఫీడ్ 1,01,720 కాగా, టైగర్ ఫీడ్ రూ.1,12,520గా ఉంది. శనివారం నుంచి పెరిగిన ధరలతో ఉత్పత్తి వ్యయం కాస్తా వెనామీ రొయ్యలపై రూ.3 లక్షలకు, టైగర్ రొయ్యలపై రూ.4 లక్షలకు చేరుతుందని చెబుతున్నారు. -
అన్యాయంగా తీసేశారు.. న్యాయం చేయండి
సాక్షి, అమరావతి: అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించి పద్మావతి ఏజెన్సీ తమ పొట్టకొట్టిందని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతోసహా రాయలసీమ జోన్లోని పలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో దశాబ్దాలుగా పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి సమావేశమై గోడును వెళ్లబోసుకున్నారు. తమ ఆవేదనను మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. బాధిత కార్మికులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని సజ్జల వారికి హామీ ఇచ్చారు. బాధితులు మాట్లాడుతూ కరోనా మహమ్మారిసహా ఎన్నో క్లిష్ట సమయాల్లో దశాబ్దాలుగా ప్రజాసేవలు అందించిన తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఆవేదన ఇది.. ‘కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతోసహా రాయలసీమ జోన్లోని పలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో దశాబ్దాలుగా పని చేస్తున్న దాదాపు 500 మంది పారిశుద్ధ్య కార్మికులం ఇప్పుడు రోడ్డున పడ్డాం. ఒక్క కర్నూల్ జీజీహెచ్లో ఈ సంఖ్య దాదాపు 50గా ఉంది. ‘50 ఏళ్ల వయసు’ పేరుతో ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా అర్ధంతరంగా మమ్మల్ని విధుల నుంచి తొలగించారు. సీఎం సమీప బంధువు ఒకరు ‘పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ ఏజెన్సీ’ పేరుతో పారిశుద్ధ్య కార్మికుల కాంట్రాక్ట్ను చేజిక్కించుకున్న నేపథ్యం మాకు శాపంగా మారింది.అయితే ఏజెన్సీ కొత్త వారిని చేర్చుకుంటూ వారి దగ్గర నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేస్తోంది. 54 ఏళ్లు ఉన్న వారిని కూడా కొత్తగా పనిలోకి చేర్చుకుంటున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి మద్దతు ఇచ్చిన వారినికూడా పనిలోంచి తీసేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. రాయలసీమ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6 వేల మందికి పైగా పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు రూ.13,640 జీతం పొందుతున్నారు. వీరిలో చాలా మంది 25 ఏళ్లకు పైగా, రూ.400 ప్రారంభ జీతం ఉన్నప్పటి నుంచి ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది’ అని కార్మికులు తెలిపారు. 50 ఏళ్ల వయో పరిమితి దారుణం.. ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు ఉండగా, పారిశుద్ధ్య కార్మికులకు 50 ఏళ్లకే పరిమితి విధించడం ఏ మేరకు సమంజసమని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా చట్టవిరుద్ధంగా ఈ నిబంధనను చేర్చారని విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర జోన్లలో లేని ఈ 50 ఏళ్ల నిబంధన కేవలం రాయసీమ జోన్లో మాత్రమే ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏజెన్సీ యాజమాన్యం తమకు రాజకీయ పెద్దల అండ ఉందంటూ అక్రమాలకు పాల్పడుతోందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. -
రెండేళ్ల నారాసుర పాలన.. రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి : ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ 143 హామీలు ఇచ్చిన చంద్రబాబునాయుడు ఈ రెండేళ్లలో వాటిని అమలు చేయకుండా అటు రాష్ట్రానికి, ఇటు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రెండేళ్ల నారాసుర పాలన రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఇంటింటికీ బాండ్లు రాసిచ్చి మరీ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పిన మాటలకు, ఈ రెండేళ్లలో చేసిన పనులకు ఏమాత్రం పొంతన లేదని చెప్పారు. నిత్యం మోసాలు, రాజకీయ కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలన వైఫల్యంపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున నిరసన ర్యాలీలు జరిగాయి. వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు, చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మోసపోయిన, దగా పడిన యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై నిరసన గళం వినిపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకాలపై వైఎస్ జగన్ శుక్రవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ప్రజాగ్రహానికి అద్దం పట్టిన వైఎస్సార్సీపీ ప్రజలతో కలిసి నిర్వహించిన ర్యాలీల ఫొటోలను ట్యాగ్ చేశారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రెండేళ్ల క్రితం నారా చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలో.. బాండ్ల రూపేనా పెట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు ఇచ్చారు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబూ అని అడుగుతున్నారు.రైతులను మోసం చేశారు. మహిళలను మోసం చేశారు. యువతను మోసం చేశారు. విద్యార్థులను మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్నీ మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగా, స్కామ్ల మయమే. ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు. పచ్చి అబద్ధాల ప్రచారం. సంక్షేమం కాదు.. రాష్ట్ర ప్రజలు చూసింది మోసం. ప్రజా పాలన కాదు.. రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్బుక్ రాజ్యాంగంతో భయానక పాలన.వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బ తీశారు. జంగిల్ రాజ్లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడిని ఏమంటాం?అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక, మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నింటిలోనూ మాఫియా నడుపుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు చార్జీలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్, బస్సు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పన్నులు పెరిగాయి. కానీ ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది. విద్యా రంగం దెబ్బతింది. వైద్య రంగం దెబ్బతింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశ చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు. ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దం పట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయ పూర్వక అభినందనలు.చంద్రబాబుకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. అబద్ధాలతో కొంత కాలం ప్రజలను మోసం చేయొచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్నీ లెక్కపెడుతున్నారు. ఈ ‘నారాసుర పాలన’కు వ్యతిరేకంగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం. ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్ని వర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు. -
వెన్నుపోటుపై తిరుగుబాటు
సాక్షి, అమరావతి, నెట్వర్క్: సూపర్ సిక్స్ సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలను అమలు చేయకుండా చంద్రబాబు సర్కార్ దగా చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగ్రహ జ్వాల నింగికెగిసింది. చంద్రబాబు మోసాల పాలనపై ప్రజలతో కలసి ఎక్కడికక్కడ వైఎస్సార్ సీపీ క్యాడర్, నాయకులు తిరగబడ్డారు. నల్ల బెలూన్లు ఎగరవేశారు.. బైక్ ర్యాలీలు నిర్వహించారు.. కూటమి మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెడతామంటూ అడుగడుగునా బారికేడ్లు, చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసుల ద్వారా సర్కారు బెదిరింపులకు దిగినా ప్రజలు ఖాతరు చేయలేదు. మా పేర్లు రాసుకోండి..! ఏమేం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి..! వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీల్లో పాల్గొని తీరుతామంటూ నియోజకవర్గాల కేంద్రాలకు శుక్రవారం జనం స్వచ్ఛందంగా, తండోపతండాలుగా తరలివచ్చారు. యువత, మహిళలు, రైతులు పోటెత్తారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వెన్నుపోటు పొడిచిన టీడీపీ–జనసేన కూటమి సర్కార్ తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి సమరశంఖం పూరించారు. పులివెందులలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిరసన ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు నెల్లూరులో బైక్ ర్యాలీ చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ప్రజా ఉద్యమానికి వైఎస్ జగన్ పిలుపు.. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో టీడీపీ–జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోతో ఎన్నికల ప్రచారం చేసింది. కానీ.. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోను తుంగలో తొక్కింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు రెండేళ్ల దగా పాలనపై ఈనెల 4 నుంచి 12వతేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆమేరకు నిరసన కార్యాచరణ షెడ్యూలును ప్రకటించారు.చంద్రబాబు చేసిన మోసం, దగా, వెన్నుపోటుకు సంబంధించి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్లెట్ను విడుదల చేసి.. అది గ్రామ గ్రామానా, ఇంటింటికీ చేర్చాలని దిశా నిర్దేశం చేశారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈనెల 4న అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీల్లో జనం స్వచ్ఛందంగా కదలివచ్చి కదం తొక్కుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను దహనం చేశారు. ఈనెల 8, 9న నియోజకవర్గాల కేంద్రాల్లో చంద్రబాబు సర్కార్ దగా పాలనపై వైఎస్సార్సీపీ నిర్వహించిన సదస్సులకు ప్రజలు కదలివచ్చి.. కూటమి సర్కార్ మోసాలను వివరిస్తూ గళం విప్పారు. రెండేళ్లలో ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న సర్కారిదే.. నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలకు భారీ ఎత్తున జనం కదలివస్తారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పసిగట్టిన చంద్రబాబ సర్కార్ యధావిధిగా పోలీసులను ప్రయోగించింది. నియోజకవర్గాల కేంద్రాలకు ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీన్ని ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఏమాత్రం లెక్క చేయకుండా ఉప్పెనలా కదిలి రావడంతో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలు, కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని సర్వత్రా చర్చ జరుగుతోంది. -
ఆ హామీలు ఏమయ్యాయి బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’’ కార్యక్రమం సక్సెస్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల తరపున పోరాటం ఆగదు.. మోసాలను నిలదీస్తాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. 2YearsForCBNBackStabbing హ్యాష్ ట్యాగ్తో ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. రెండేళ్ల ‘నారాసుర’ పాలన-రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు.. ర్యాలీలు ప్రజాగ్రహానికి అద్దం పట్టాయని ఆయన ట్వీట్ చేశారు.‘‘రెండేళ్ల క్రితం చంద్రబాబు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మరి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబూ’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మయమే!’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధాల ప్రచారం. సంక్షేమం కాదు... రాష్ట్ర ప్రజలు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్బుక్ రాజ్యాంగంతో భయానక పాలన. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్రాజ్లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది...విద్యా రంగం దెబ్బతింది. వైద్య రంగం దెబ్బతింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు, సూపర్-6, సూపర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు! ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు...ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు...చంద్రబాబుకి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు. ఈ ‘నారాసుర పాలన’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు’’ అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు.రెండేళ్ల “నారాసుర’’ పాలన - రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు !ప్రజాగ్రహానికి అద్దంపట్టిన ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ ర్యాలీలు1.రెండేళ్ల క్రితం @ncbn గారు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన… pic.twitter.com/07PTqq4ojb— YS Jagan Mohan Reddy (@ysjagan) June 12, 2026 -
ట్రెండింగ్లో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’
సాక్షి, తాడేపల్లి: 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' ట్రెండింగ్లో నిలిచింది. వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. వైఎస్సార్సీపీ నిరసన వీడియోలు 'ఎక్స్'లో బాగా వైరల్ అవుతున్నాయి. #2yearsforTdpbackstabbing పేరుతో ట్రెండింగ్ అవుతోంది. చంద్రబాబు మోసాలపై జనం స్పందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.మేనిఫెస్టోను డెస్ట్బిన్లో వేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు రెండేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా దగా పడ్డారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు.ఆయన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలిపారు. దీంతో పాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపట్టారు. చంద్రబాబు పాలనలో దగాపడిన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ ర్యాలీలు నిర్వహించారు. దగా పడిన రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులందరూ ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సమర శంఖం(ఫోటో గ్యాలరీ) -
‘రెండేళ్లలోనే బాబు పాలనపై జనం విసిగిపోయారు’
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా చంద్రబాబు పాలనలో దోపిడీ, హింస కొనసాగుతోంది. చంద్రబాబుకు రాజకీయంగా ఇదే లాస్ట్ టర్మ్. చంద్రబాబు పాలన అవినీతిలో కొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు.‘‘సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజల్ని దగా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచే మోసాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ను గద్దెదించి చంద్రబాబు సీఎం పీఠమొక్కారు. వైఎస్సార్ ఆదర్శవంతమైన పాలన అందించారు. వైఎస్ జగన్ ఆచరణలో మంచి పాలన తీసుకొచ్చారు. చంద్రబాబు పాలనలో మార్పు వస్తుందని ఆశించాం.. కానీ అది జరగలేదు.సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారు. చంద్రబాబు జీవితమంతా ప్రజలను వంచించడమే. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజలంతా విసిగిపోయి.. వైఎస్ జగన్ వైపు చూస్తున్నారు. ప్రజల గొంతుక వినిపించేలా ఇవాళ నిరసనలు బ్రహ్మాండంగా జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్డు మీదకు వస్తున్నారు. కూటమి సర్కార్ నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. పోలీసులతో నిరసనలను అణచివేయాలని చూశారు. పోలీసుల ఆంక్షలను దాటుకుని ప్రజలు నిరసనలను విజయవంతం చేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
‘లోకేష్ ఆలిండియా.. పవన్ ఆంధ్రా మోసగాడు’
సాక్షి, గుంటూరు: గుంటూరులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించారు. లాడ్జి సెంటర్లో అంబటి రాంబాబుని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి సర్కార్ వచ్చి రెండేళ్లయింది.. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదని మండిపడ్డారు.‘‘సూపర్ సిక్స్లో ముఖ్యమైనవి అసలు అమలు చేయలేదు. స్త్రీ నిధి ఇవ్వలేదు. ప్రధాన వాగ్ధానాన్ని వదిలేశారు. నిరుద్యోగి భృతి ఇవ్వలేదు. యువగళం గాలికి పోయింది. యాభై ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ అన్నారు. ముగ్గురు మోసగాళ్ల ప్రభుత్వం ఇది. చంద్రబాబు ప్రపంచ మోసగాడు. లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు.. పవన్ కల్యాణ్ ఆంధ్రా మోసగాడు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.డీఎస్సీపై మాట్లాడటం లేదు. లోకేష్ డీఎస్సీలో ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నాడు. చంద్రబాబ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే డీఎస్పీ అడ్డుకున్నారు. తెలుగుదేశం నాయకులు వైఎస్ జగన్ దిష్టి బొమ్మ తగులపెడితే పోలీసులు రక్షణ కల్పిస్తారు. గుంటూరు పోలీసులకు ఏం పోయేకాలం?. రాబోయేది జగన్ పాలనే. వచ్చే నెల 29 తేదీన వినతి పాదయాత్ర చేస్తాను’’ అని అంబటి రాంబాబు వెల్లడించారు. -
దేవుడి భూములు రక్షించే దిక్కు లేదు..!
సాక్షి, అమరావతి : దేవుడి భూముల ఆక్రమణల కట్టడిని చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. దేవాలయాల భూముల ఆక్రమణలు, ఇతర వివాదాలు పరిష్కరించే దేవదాయశాఖ ట్రిబ్యునల్కు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిన్నరగా చైర్మన్ను కూడా నియమించలేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియమితులైన ట్రిబ్యునల్ చైర్మన్ పదవీ కాలం ముగియక ముందే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే 2024 అక్టోబరులో ఆ పదవికి రాజీనామా చేశారు. రిటైర్డు జిల్లా జడ్జి స్థాయికి తక్కువ కాని వ్యక్తులే దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్గా కొనసాగుతారు. అయినప్పటికీ, అప్పట్లో ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి కారణంగానే ఆయన పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర దేవదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాలు, సత్రాలు, మఠాల పేరిట మొత్తం 4.67 లక్షల ఎకరాల దేవుడి భూములు ఉండగా... ప్రభుత్వ గణాంకాల ప్రకారమే అందులోని 87 వేలకు పైగా ఎకరాల భూమి ఆక్రమణదారుల చెరలో ఉంది. దేవదాయ శాఖ భూ వివాదాలకు సంబంధించి అధికారులు ఆక్రమణల తొలగింపునకు చిన్న చర్య తీసుకోవాలన్నా ట్రిబ్యునల్ ఆదేశాలతోనే ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఏ భూ వివాదానికి సంబంధించైనా ముందు ట్రిబ్యునల్ గడప తొక్కకుండా నేరుగా హైకోర్టులో కేసులు ఫైల్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఒకవైపు వేల ఎకరాల దేవుడి భూములను ఆక్రమణదారులు కబ్జా చేస్తుండగా.. ప్రభుత్వం ఆక్రమణల కట్టడికి ఆదేశాలు జారీ చేసే ట్రిబ్యునల్ చైర్మన్ స్థానం భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఉండడంపై దేవదాయ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వమే ఆక్రమణదారులకు కొమ్ముకాస్తోందన్న ఆరోపణలున్నాయి. నాలుగు వేల కేసులు పెండింగ్లోనే.. దేవదాయ శాఖ ట్రిబ్యునల్లో సుమారు 4 వేల కేసుల విచారణ పెండింగ్లో ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రిబ్యునల్లో దేవుడి భూముల వివాదాలతోపాటు ఆలయాలకు సంబంధించి వంశపారంపర్య ధర్మకర్తల వివాదాలకు సంబంధించిన కేసులు నమోదవ్వగా.. అందులో 95 శాతం కేసులు భూ వివాదాలకు సంబంధించినవే ఉంటాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రిబ్యునల్లో సిబ్బందీ కొరతే.. దేవదాయ శాఖ ట్రిబ్యునల్లో సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఏపీలోని దేవదాయ శాఖ ట్రిబ్యునల్ను విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా విడదీశారు. తెలంగాణ దేవదాయ శాఖ ట్రిబ్యునల్లో కేవలం 1000 కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ, ఆ రాష్ట్ర ట్రిబ్యునల్లో మొత్తం 24 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ ట్రిబ్యునల్లో నాలుగు రెట్లు ఎక్కువగా నాలుగు వేలకు పైగా పెండింగ్ కేసులు ఉన్నప్పటికీ కేవలం 12 మంది సిబ్బందే పనిచేస్తున్నారని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.వారిలోనూ ఏడుగురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కావడం గమనార్హం. రాష్ట్ర పరిస్థితులు నేపథ్యంలో వివిధ ప్రాంత కక్షిదారుల సౌకర్యం కోసం ప్రతీ నెలలో కనీసం ఒక్క రోజు చొప్పునైనా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో ప్రాంతీయ కోర్టులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్లో 14 మంది అదనపు సిబ్బందిని అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకానికి అవకాశం కల్పించాలని ప్రతిపాదనలు పంపినప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో దేవుడి భూముల పరిస్థితి ఇదీ మఠాలు : 135 దేవదాయ శాఖ పరిధిలో గుళ్ల సంఖ్య : 26,970 ఆయా ఆలయాలు, గుళ్లు పేరిట ఉన్న దేవదాయ శాఖ భూములు : 4,67,283.28 ఎకరాలు దేవదాయశాఖ అధికారులు లీజుకిచ్చిన భూములు : 1,60,767 ఎకరాలు వివిధ సర్వీసుదారుల ఆదీనంలో ఉన్న భూములు : 1,21,596.04 ఎకరాలు వ్యవసాయానికి పనికి రాని కొండలు, బంజరు భూములు : 85,200 ఎకరాలు గుళ్లు, ఆ చుట్ట పక్కల భూములు : 4355.29 ఎకరాలు ఆక్రమణలలో ఉన్న భూములు : 87,167 ఎకరాలు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు భూ సేకరణ జరిగి, అందుకు నిధులు విడుదల కాని భూములు : 8,196.63 ఎకరాలు -
ఏపీ విత్తన క్షేత్రాల భూములపై సర్కార్ కన్ను
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని భూములను అతి చవగ్గా కార్పొరేట్లకు కట్టబెడుతున్న చంద్రబాబు సర్కారు కన్ను ఇప్పుడు వ్యవసాయ విత్తన క్షేత్రాల భూములపై కన్నుపడింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం మహదేవమంగళం గ్రామంలో సుమారు 436 ఎకరాల్లో బహుళ విత్తనోత్పత్తి క్షేత్రం (సీడ్ మల్టీప్లికేషన్ ఫామ్) ఉంది. ఇక్కడ వరి, వేరుశనగ, జొన్న విత్తనాలను ఉత్పత్తి చేస్తుంటారు.ఈ వ్యవసాయ క్షేత్రానికి చెందిన 46.69 ఎకరాల భూమిని సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం కేటాయిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ ఫామ్లో పెద్ద ఎత్తున మట్టి దోపిడీ జరుగుతోంది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు ఎలాంటి అనుమతుల్లేకుండా ఫామ్లోని మట్టిని తవ్వి దొడ్డిదారిన అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. -
తొలిరోజే తడ‘బడి’!
సాక్షి, అమరావతి: కానరాని స్టూడెంట్ కిట్లు.. ఊసేలేని ‘తల్లికి వందనం’ దుస్థితి నడుమ శుక్రవారం విద్యా సంవత్సరం 2026–27 ప్రారంభం అవుతోంది. శుక్రవారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కనీస అవసరాలను సైతం సమకూర్చలేని దయనీయ పరిస్థితులను చంద్రబాబు సర్కారు కల్పించింది. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే స్టూడెంట్ కిట్లు హామీని అటకెక్కించింది. కనీసం అందరికీ పుస్తకాలైనా అందించకుండా సర్దుకోమంటోంది. రాష్ట్రంలో మొత్తం 62 వేల పాఠశాలలు ఉండగా ప్రభుత్వ యాజమాన్యంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యార్థులుండగా అదే అంచనాతో ఈ ఏడాది పుస్తకాల ముద్రణ చేపట్టారు. అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర కిట్ల పంపిణీ సాధ్యం కాదని ఇటీవల ప్రకటించి ప్రభుత్వం చేతులెత్తేసింది. గతేడాది కిట్లలో విద్యార్థులకు సరిపోని బూట్లు, బెల్టులు, మిగిలిన యూనిఫారం క్లాత్ను కొన్ని మండలాల్లో సర్దుబాటు చేశారు. తొలిరోజే ఇస్తామని గొప్పలు చెప్పి... జూన్ 12న బడులు తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు కిట్లను అందిస్తామని గతంలో గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తమవల్ల కాదని ప్రకటించింది. గ్యాస్ కొరత, క్రూడ్ ఆయిల్ సంక్షోభం, ఫైబర్ లాంటి ముడి పదార్థాల కొరతను సాకుగా చెబుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘జగనన్న విద్యా కానుక’ పేరును మార్చేసి మొదటి ఏడాది (2024 జూన్) వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన కిట్లను ఇచ్చింది. 2025 వచ్చేసరికి ప్రభుత్వం బకాయి బిల్లులు చెల్లిస్తేనే కిట్లు ఇస్తామని కాంట్రాక్టర్లు తేల్చి చెప్పారు. దాంతో అధికారులు తమ సొంత హామీతో కిట్లు తీసుకొచ్చి ఆగస్టు తర్వాత పంపిణీ చేశారు. ప్రభుత్వం నిధుల చెల్లింపులో ఆలస్యం చేయడంతో ఈ ఏడాది కిట్ల కొనుగోలుకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. తమకు రెండేళ్లకు సంబంధించి రూ.1372 కోట్ల బకాయిల మొత్తం చెల్లించకుండా బిడ్డింగ్లో పాల్గొనలేమని ఆయా కంపెనీలు తేల్చి చెప్పాయి. ఇక 2026–27 విద్యా సంవత్సరంలో 35 లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయాలని అంచనాలు రూపొందించారు. ముద్రణ సమయంలో సర్కారు పిల్లిమొగ్గలు వేయడంతో పాటు ఇంటర్ పాఠ్యపుస్తకాల పీడీఎఫ్ లీకేజీ స్కామ్కు కారణమైన ప్రైవేటు ముద్రణ సంస్థ వీజీఎస్కు భారీగా కాంట్రాక్టు కట్టబెట్టారు. సకాలంలో ప్రింటింగ్ పూర్తి చేయకపోవడంతో ఇప్పటికీ చాలా మండలాలకు పుస్తకాలు చేరలేదు. గతేడాది మిగిలిపోయినవే దిక్కు.. – సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాల్లో 1,40,012 యూనిఫారాలు అవసరమైతే 20,618 మాత్రమే అందించారు. కుప్పం, శాంతిపురం మండలాలకు సరఫరా చేశారు. షూలు, బ్యాగులు లేవు. 80 వేల మందికి నోటు పుస్తకాలు ఇవ్వాల్సి ఉండగా 70 వేల మందికి మాత్రమే వచ్చాయి. పాఠ్యపుస్తకాలు సైతం 10 శాతం పెండింగ్. వర్క్బుక్స్ ఒక్కటీ రాలేదు. – విజయనగరం జిల్లాలో 27 మండలాలు ఉండగా ఆరు మండలాలకు పాత యూనిఫారం ఇచ్చారు. పుస్తకాలు 11 మండలాలకు పుస్తకాలు రాలేదు. పాత బూట్లు కొన్ని మండలాలకు సర్దుబాటు చేశారు. – ఎన్టీఆర్ జిల్లాలో కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే స్కూళ్లకు చేరాయి. – కర్నూలు జిల్లాలోని 26 మండలాల్లో పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్ మాత్రమే వచ్చాయి. యూనిఫామ్ 4 మండలాలకు, నోట్ బుక్స్ 9 మండలాలకు, పిక్టోరియల్ డిక్షనరీలు 8 మండలాలకు మాత్రమే వచ్చాయి. – పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని టైటిల్స్ కలిపి 4.80 లక్షల పుస్తకాలు అవసరముంటే 4 లక్షలు మాత్రమే అందించారు, వర్కుబుక్స్ మాత్రం అందలేదు. బ్యాగులు, బెల్టులు, బూట్లు లేనేలేవు. – కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాలకు యూనిఫారం లేదు, 1.20 లక్షల మంది విద్యార్థులకు బూట్లు ఆర్డర్ పెట్టగా, 25 వేల మందికి 8 మండలాల్లో పాక్షికంగా సరఫరా చేశారు. బెల్టులు కూడా 10 శాతం సరఫరా చేశారు. జగన్ ప్రభుత్వంలో చదువులకు భరోసా.. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు ఏటా స్కూళ్లు తెరిచిన మొదటి రోజే టంచన్గా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్–తెలుగు) నోట్ బుక్స్, వర్క్ బుక్స్, కుట్టు కూలితో 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లి‹Ù–తెలుగు డిక్షనరీ, ఒకటో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన కిట్ను మొదటి రోజే విద్యార్థుల చేతికందేది. తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లో నిధులు జమచేసి పిల్లల చదువులకు పూర్తి అండగా నిలిచారు. ‘‘ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తాం’ అని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తల్లికి వందనం పూర్తిగా ఎగరగొట్టారు. -
62 ఏళ్లు.. 517 రకాల వంగడాలు
సాక్షి, అమరావతి: దేశంలో పురాతనమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) శుక్రవారం 62 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో వర్సిటీ ఎన్నో విజయాలు సాధించింది. మొత్తం 517 రకాల వంగడాలను రూపొందించింది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, రెట్టింపు ఆదాయం లక్ష్యంగా ఏటా పదుల సంఖ్యలో కొత్త రకాల వంగడాలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తెగుళ్లు, కీటకాలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను తట్టుకునే వంగడాల అభివృద్ధి మాత్రమే కాదు సన్నరకాల సృష్టికర్తగా ఖ్యాతి గడించింది. ఫలితంగా దశాబ్దాలుగా వరి సాగులో ఈ వర్సిటీ రూపొందించిన రకాలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఆరు కళాశాలలు, 41 పరిశోధన కేంద్రాలతో 1964లో ఈ యూనివర్సిటీ ప్రారంభమైంది. రాష్ట్ర విభజన తరువాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 13 కళాశాలలు, 33 పరిశోధన కేంద్రాలు, 27 విస్తరణ విభాగాలతో సేవలందిస్తున్న ఈ వర్సిటీలో 973 మంది అధ్యాపకులున్నారు. ఇప్పటివరకు 36,664 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 11,668 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు కలిపి 48,332 మంది పట్టభద్రులను తయారు చేసింది. ఏటా బ్యాచిలర్ కోర్సుల్లో 2 వేలమంది, పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో 33 మంది విద్యార్థులు ప్రవేశం పొందుతున్నారు. వరిలోనే 136 రకాల అభివృద్ధి ఇప్పటివరకు వర్సిటీ 225 ధాన్యాలు, 87 పప్పు ధాన్యాలు, 56 నూనెగింజలు, 92 వాణిజ్య పంటలు, 57 పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాల పంటలకు చెందిన విత్తనాలను అభివృద్ధి చేసింది. ధాన్యాల్లో ఒక్క వరిలోనే 136 రకాలను అభివృద్ధి చేశారు. ఈ కోవలో అభివృద్ధి చేసిన ఎంటీయూ 7029 (స్వర్ణ), బీపీటీ 5204 (సాంబామసూరి), కాటన్ దొర సన్నాలు వంటి వరిరకాలు జాతీయస్థాయిలో విశేష ప్రజాదరణ పొందాయి. రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణంలో 88 శాతం ఈ రకాలే సాగవుతున్నాయి. వేరుశనగలో కే–6, నారాయణి, లేపాక్షి వంటి రకాలు ఈ వర్సిటీ అభివృద్ధి చేసినవే. రాష్ట్రంలో వేరుశనగ సాగు విస్తీర్ణంలో 90 శాతం కే–6 రకమే సాగవుతోంది. బయో పోర్టిఫైడ్ సజ్జ రకం ఏబీవీ 04, పోర్టిఫైడ్ రాగి రకాలు వేగావతి (వీఆర్ 929), ఇంద్రావతి (వీఆర్ 1101) రకాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలోనే మొట్టమొదటి బూజుతెగులు నిరోధక మినుము రకం ఎల్బీజీ 17 (కృష్ణయ్య) ఈ వర్సిటీ అభివృద్ధి చేసిందే. ప్రభుత్వరంగంలో మొదటిసారిగా బీటీ పత్తి రకమైన లాం బీజీ టూ–2208 (ఆదిత్య బీజీ–2) రకాన్ని ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ స్థాయిలో నూతన వంగడాలను అభివృద్ధి చేసిన వర్సిటీ దేశంలో మరొకటి లేదనే చెప్పాలి.దేశంలోని 46 మిలియన్ హెక్టార్ల వరి సాగువిస్తీర్ణంలో 14 మిలియన్ హెక్టార్లలో ఈ వర్సిటీ రూపొందించిన రకాలే సాగవుతున్నాయంటే ఈ వంగడాలు ఏ స్థాయిలో రైతులకు చేరువయ్యాయో అర్థమవుతుంది. జాతీయస్థాయి వరి ఉత్పత్తి 131 మిలియన్ టన్నుల్లో 33.15 శాతం (37.76 మిలియన్ టన్నులు) ఈ వర్సిటీ రూపొందించిన రకాలే కావడం గమనార్హం. ఆంధ్రలో వరిసాగు విస్తీర్ణంలో 90.29 శాతం అంటే అక్షరాల 21.78 లక్షల హెక్టార్లలో ఈ వరి రకాలే సాగవుతున్నాయి. ఆంగ్రూ రకాల బియ్యం ఎగుమతి ద్వారా దేశం ఏటా సగటున రూ.8 వేలకోట్ల నుంచి రూ.10 వేలకోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఆ ఐదేళ్లూ సువర్ణయుగమే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామస్థాయిలో ఏర్పాటైన రైతు సేవాకేంద్రాలు వ్యవసాయ పరిశోధన ఫలాలను రైతులకు చేరువచేయడంలో వర్సిటీకి, అన్నదాతలకు మధ్య వారధిగా పనిచేశాయి. జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో వర్సిటీ అన్ని రంగాల్లోను అగ్రగామిగా నిలిచింది. అత్యాధునిక సౌకర్యాలు, అధునాతన భవనాలు సమకూర్చడంతో విస్తృత పరిశోధనలతో దూసుకెళ్లింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదించిన డ్రోన్ శిక్షణ కేంద్రాన్ని గుంటూరు లాంలోని అప్సరా సెంటర్లో ప్రారంభించారు. పురుగు, తెగులుమందుల పిచికారికి ఆంగ్రూ పుష్పక్–1, విత్తనాలు, ఎరువులు చల్లేందుకు పుష్పక్–2 డ్రోన్లను అభివృద్ధి చేశారు. 10 పంటల్లో పిచకారీ చేసి సత్ఫలితాలను సాధించారు. జాతీయస్థాయిలో డ్రోన్ పైలెట్ శిక్షణ కోసం డీజీసీఏ సర్టిఫికేషన్ పొందిన తొలి వర్సిటీగా ఆంగ్రూ నిలిచింది. ఇక్కడ ఇప్పటివరకు 534 మంది డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇచ్చారు. 2021లో సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పాలసీ రీసెర్చ్ను ఏర్పాటు చేసి డేటా ఆధారిత విశ్లేషణాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఐసీఏఆర్ ర్యాంకింగ్స్లో 2022–23లో జాతీయస్థాయిలో వర్సిటీ ఏడోస్థానంలో, పీజీ అడ్మిషన్లలో రెండోస్థానంలో నిలిచింది. అన్ని ఇన్స్టిట్యూట్లలో 11వ స్థానం సాధించింది. అగ్రిప్రెన్యూర్షిప్ ఓరియంటేషన్, ఇంక్యుబేషన్ ప్రోగ్రాం (సంకల్ప–2021)లో 55 ఇంక్యుబేట్లు ఎంపికయ్యాయి. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్) అభివృద్ధి చేసిన మల్టీటాస్క్ టూల్బార్, నాప్సాక్ వీడర్ను వినూత్న వ్యవసాయ యంత్రాలుగా ఎంపికచేశారు. ఆ ఐదేళ్లు అవార్డులకు కొదవే లేదు. 2020లో రెండో అత్యధిక సంఖ్యలో ఐసీఏఆర్ పీజీ స్కాలర్íÙప్లు పొందిన వర్సిటీగా జాతీయ అవార్డు లభించింది. గిరిజన వ్యవసాయ వ్యవస్థల్లో అత్యుత్తమ పరిశోధన కోసం ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అవార్డు–2020 వరించింది. వర్సిటీకి వ్యవసాయ పరిశోధన, విద్యారంగ కేటగిరిలో 2022లో స్కాచ్ సిల్వర్,, స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ సర్టిఫికెట్ తదితర అవార్డులెన్నో దక్కాయి. 2023–24లో ఏ కేటగిరిలో లాంలోని ఆర్ఏఆర్ఎస్కు, బీ కేటగీరిలో రాగోలులోని ఏఆర్ఎస్కు ఉత్తమ పరిశోధన కేంద్రం అవార్డు, కేవీకే కొండెంపూడిలోని కేవీకేకి ఉత్తమ కేవీకే అవార్డు, ఏలూరులోని డీఏఏటీటీసీకి ఉత్తమ డాట్ సెంటర్ అవార్డు లభించాయి. డయోబ్లైట్ స్మార్ట్ రైస్కుక్కర్, పాలిమర్ పుల్లీ డ్రివైన్ సెంట్రిప్యూగల్ పంప్ వంటి ఆవిష్కరణకు పేటెంట్ హక్కులు లభించాయి. అలాంటి యూనివర్సిటీ 2024–25లో వ్యవసాయ వర్సిటీల్లో 26వ స్థానానికి, ఓవరాల్గా 151వ స్థానానికి దిగజారిపోయింది. నేడు 63వ వ్యవస్థాపక దినోత్సవం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం యూనివర్సిటీలోని కృష్ణ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు. నాబార్డు మాజీ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు విశిష్ట అతిధిగా పాల్గొనే ఈ వేడుకలో ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, రైతులకు దాతృత్వనిధి పురస్కారాలు అందించనున్నారు. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు వర్సిటీ నిరంతరం కృషిచేస్తోందని వీసీ డాక్టర్ పి.వి.సత్యనారాయణ తెలిపారు. విద్య, పరిశోధన, విస్తరణ సేవలను సమన్వయపర్చుకుంటూ, వర్సిటీ ఘన చరిత్రను స్మరించుకుంటూ భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యేందుకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. -
వర్సిటీ కొలువుల భర్తీలో గందరగోళం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 1,523 అధ్యాపక పోస్టుల (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) భర్తీ ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారింది. ఆన్లైన్ దరఖాస్తు విధానంలో నెలకొన్న సాంకేతిక సమస్యలు, అస్పష్టమైన నిబంధనలు దశాబ్దాల అనుభవం ఉన్న బోధనా సిబ్బందిని, పీజీ, పీహెచ్డీ అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒక అప్లికేషన్ను పూర్తి చేయడానికి అభ్యర్థులు గంటల తరబడి కంప్యూటర్ల ముందు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒక్కటే దరఖాస్తు.. అంతుచిక్కని ప్రశ్నలు ఒక విశ్వవిద్యాలయంలోని బ్యాక్లాగ్, రెగ్యులర్, రిజర్వేషన్ కేటగిరీ పోస్టులకు విడివిడిగా కాకుండా.. అన్నింటికీ కలిపి ఒకే అప్లికేషన్గా పరిగణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అభ్యర్థి దరఖాస్తు సమర్పించిన తర్వాత వచ్చే ఫారంలో ఎక్కడా ఏ నోటిఫికేషన్ ప్రకారం, ఏ కేటగిరీ పోస్టుకు దరఖాస్తు చేశారనే స్పష్టత లేదు. బ్యాక్లాగ్ అసిస్టెంట్ పోస్టులకు 12 కంటే తక్కువ దరఖాస్తులు వస్తే రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్టు) ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, తాము అసలు బ్యాక్లాగ్ పోస్టుకే దరఖాస్తు చేశామా లేదా అనేది తెలుసుకునే మార్గం లేకపోవడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. యూజీసీ నిబంధనలకు పాతర? నియామకాల్లో యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కారనే విమర్శలు విద్యావేత్తల నుంచి వ్యక్తమవుతున్నాయి. పరిశోధన పత్రాల వివరాల్లో ‘యూజీసీ అప్రూవ్డ్ జర్నల్స్’ ఆప్షన్ను తొలగించి, కేవలం ’పీర్ రివ్యూడ్’ ఆప్షన్ మాత్రమే ఇచ్చారు. తమకు కావలసిన వారికి అక్రమంగా లబ్ధి చేకూర్చేందుకే ఈ విధమైన కుట్రకు తెరలేపారనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. కాగా, ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 15ను చివరి తేదీగా నిర్ణయించగా, హార్డ్ కాపీలను వర్సిటీలకు పంపేందుకు ఈ నెల 22 వరకు గడువుపొడిగించారు. ఆర్జీయూకేటీలో వింత పరిస్థితి రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో దరఖాస్తుల పరిశీలన వ్యవహారం మరీ విచిత్రంగా తయారైంది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన అభ్యర్థుల డేటా నమోదు ప్రక్రియను తీవ్ర నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పంపిన దరఖాస్తుల ఫిజికల్ కాపీలను కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డిప్లొమో అర్హత గల ల్యాబ్ స్టాఫ్తో కంప్యూటర్లలో నమోదు చేయిస్తున్నారు. పీజీ, పీహెచ్డీ చేసిన ఉన్నత విద్యావంతుల దరఖాస్తులను డిప్లొమా సిబ్బందితో ప్రాసెస్ చేయించడం ఎంతవరకు సమంజసమని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. నోడల్ ఆఫీసర్ నియామకంలోనూ వివాదాలు ఇటీవల పీహెచ్డీ పూర్తి చేసిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కు వర్సిటీ నియామక నోడల్ ఆఫీసర్ బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమైంది. త్వరలో చేపట్టే అసోసియేట్ ప్రొఫెసర్ల ఎంపికలో ఈయనే కీలకం కానున్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్ల ద్వారా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు దక్కించుకునేలా లబ్ధి చేకూర్చేందుకు, ఈ నోటిఫికేషన్లో ఒక్క రెగ్యులర్ అసిస్టెంట్, ప్రొఫెసర్ పోస్టు కూడా లేకుండా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దగా డీఎస్సీ.. మెగా స్కామ్
ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. స్కామ్కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు.కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనం తటికి అర్థం పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? ఈ లీక్ ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్లింది? ఎంత మందికి లీక్ అయిన పేపర్ చేరింది? దీన్ని పొందిన వాళ్లు ఎంతమంది పరీక్షలు రాశారు? వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది.గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు.. పబ్లిక్గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. ఇలా వెరిఫికేషన్కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైనా ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్లో కూడా చూపలేదు. దీనిపై ప్రశ్నిస్తే ‘సర్దుబాటు’ అంటున్నారు. ఎవరి కోసం ఈ ‘సర్దుబాటు?’ అంటే సమాధానం లేదు.పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి.. అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకూ వెళ్లిందో? దీనిపై సీబీఐ విచారణ వద్దా? ఆ వ్యక్తి (నవీన్) నిజంగానే మెరిట్తో ర్యాంక్ సాధించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? దీని అర్థం.. తప్పు జరిగిందనేగా?ఈ రాష్ట్రంలో.. చంద్రబాబే పోలీసు.. ఆయనే లాయరు..! ఆయనే ఆదేశాలు ఇస్తారు.. ఆయనే పర్యవేక్షిస్తారు..! అధికారంలో ఉన్నది ఆయనే. పైగా ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అందుకే సీబీఐతో విచారణకు డిమాండ్ చేస్తున్నాం..చంద్రబాబు రాజకీయ జీవితం.. గత రెండేళ్ల పాలన.. సూపర్ సిక్స్లు.. మేనిఫెస్టో హామీలు.. టీచర్ పోస్టుల భర్తీ.. ఇలా దేన్ని చూసినా మోసం, దగా, స్కామ్లే కనిపిస్తాయి...!– వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన ‘మెగా డీఎస్సీ 2025’.. మోసం, దగా, స్కామ్గా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ప్రతి దశలోనూ అవకతవకలే కనిపిస్తున్నాయని, లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్కు పాల్పడ్డారని, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారని.. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? అంటూ నిప్పులు చెరిగారు. డీఎస్సీ ప్రక్రియలో తప్పులను ఎత్తి చూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కామ్.. అసలు పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలంటారా? ఆ సర్టిఫికెట్లు ఇచ్చేదీ మీరే.. ధ్రువీకరించేది కూడా మీరే..! అని మండిపడ్డారు. కొత్తగా జీవో నంబర్ 4, జీవో 47 ఎందుకు ఇచ్చారు..? మీ పని పూర్తయ్యాక మళ్లీ ఆ జీవోలు ఎందుకు మార్చారు? మెరిట్ లిస్టులు ఎందుకు డిస్ప్లే చేయలేదు? అని సూటిగా ప్రశ్నించారు. మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ కింద చేపట్టిన 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను గమనిస్తే ఎంతో మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం చేసిన గోల్మాల్తో ఎంతోమంది కన్నీళ్లు పెడుతున్నారు. ప్రభుత్వం అంటే ఓ భరోసా. అలాంటిది ఆ భరోసా పోయిన పరిస్థితుల్లో మన జెన్జీ పిల్లలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు..’ అని చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెగా డీఎస్సీలో అవకతవకలను వైఎస్ జగన్ బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు..డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టే టీచర్ ఉద్యోగాల భర్తీలో కొన్ని లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అంత కీలకమైన డీఎస్సీ పరీక్షలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన విధానం తీవ్ర విస్మయానికి గురి చేస్తోంది. లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్కు పాల్పడ్డారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? సాక్షాత్తూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరూ కలిసి ఎంతో దారుణానికి ఒడిగట్టారు. అబద్ధం.. మోసం.. వెన్నుపోటు.. దగా.. స్కామ్కు చొక్కా, ఫ్యాంట్ తగిలిస్తే చంద్రబాబే కనిపిస్తారు. ఆయన రాజకీయ జీవితం, గత రెండేళ్ల పాలన, సూపర్ సిక్స్లు, మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలు, టీచర్ పోస్టుల భర్తీ.. ఇలా దేన్ని చూసినా మోసం, దగా, స్కామ్లే కనిపిస్తాయి. అధికారం చేపట్టగానే చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. అందులో మెగా డీఎస్సీ అనేది తొలి సంతకం. వాస్తవానికి మెగా డీఎస్సీలోని 6,100 పోస్టులు గతంలో మేం ఇచ్చిన నోటిఫికేషన్లోనివే. మేమిచ్చిన ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి నియామక ప్రక్రియను ఆలస్యం చేశారు. ఆ 6,100 పోస్టులతో కలిపి 16 వేల పోస్టులకు చంద్రబాబు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో లీకులు, అక్రమాలు, స్కామ్లు, అవకతవకలు చూస్తున్నాం. పేపర్ లీక్ దాచేందుకు చెవిలో పూలు..!కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనంతటికి అర్థం పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? ఈ లీక్ ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్లింది? ఎంత మందికి లీక్ అయిన పేపర్ చేరింది? దీన్ని పొందిన వాళ్లు ఎంతమంది పరీక్షలు రాశారు? వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది. అభ్యర్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ‘ఫస్ట్ ర్యాంకు సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదు. కాబట్టే పోస్టు ఇవ్వలేదు..’ అని సమర్థించుకుంటున్నారు. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, అభ్యర్థి డేటాను మాయం చేసి, కాల్లెటర్ ఇవ్వనప్పుడు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎలా వస్తాడు? మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? ఆ వ్యక్తి (నవీన్) కోర్టులో వేసిన అఫిడవిట్ చూస్తే మీ కాకమ్మ కబుర్లన్నీ బయటపడతాయి. పేపర్ లీక్లు దాచిపెట్టడానికి చెవిలో పూలు పెడుతూ నానా తంటాలు పడుతున్నారు. అవన్నీ తేలాలంటే సీబీఐతో విచారణ చేపట్టాలి..పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్లింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి కారణం.. ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఆయనే లాయరు, ఆయనే ఆదేశాలు ఇస్తారు. ఆయనే పర్యవేక్షిస్తారు. అధికారంలో ఉన్నది ఆయనే. పైగా ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? మరి విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే «థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అప్పుడే రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం కలుగుతుంది.స్కామ్ల కంపు కనిపించడం లేదా? ఉద్యోగాలకు సంబంధించి ఏ పోటీ పరీక్ష ఫలితాలనైనా తీసుకోండి. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ పరీక్షలను పరిశీలిస్తే పారదర్శకంగా మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. యూపీఎస్సీ సహా ఎక్కడైనా సరే అదే విధానం అవలంభిస్తారు. కానీ చంద్రబాబు డీఎస్సీ దీనికి పూర్తిగా విరుద్ధంగా సాగింది. గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు.. పబ్లిక్గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది? ఇందులో స్కామ్ల కంపు కనిపించడం లేదా? ఆన్లైన్ పేరిట మొత్తం ప్రక్రియను దాదాపుగా కేంద్రీకృతం చేశారు. ఇలా ఎందుకు చేశారు? దీనికి కారణం.. మీ ఉద్దేశాలు వేరే కాబట్టే కదా! సమస్యలు ఎదుర్కొన్న అభ్యర్థులు కలెక్టరేట్కు వెళితే పైకి వెళ్లండని సమాధానం చెప్పారు. అష్టకష్టాలు పడి వాళ్లు వస్తే.. మాకు సంబంధం లేదు.. కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లమని చెప్పారు. ఇలా ఎంతో మంది అభ్యర్థులు అవస్థలు పడ్డారు. పారదర్శకంగా జాబితాలు ప్రకటించకుండా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి మెసేజ్లు పంపారు. ఎవరికి మేలు చేయడానికి ఈ సర్దుబాటు?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. డీఎస్సీ నిబంధనలు కూడా అవే చెబుతున్నాయి. అన్ని నిబంధనలు, జీవోలను పరిగణనలోకి తీసుకుని డీఎస్సీ కమిటీ మెరిట్, రోస్టర్ను సిద్ధం చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రూల్ నంబర్ 20 చెబుతోంది. ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకుని కాల్ లెటర్ పంపి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టారు. అంటే.. అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? వారు ఓపెన్లోకి వస్తారా? లేక రిజర్వేషన్లోకి వస్తారా? వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్సర్వీస్ మెన్ ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. అందుకే 1 : 1 పద్ధతిలో పిలిచారు. కానీ ఇలా వెరిఫికేషన్కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్లో కూడా చూపలేదు. దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరికి అన్యాయం చేశారు? ఇది దగా, మోసం, దోపిడీ, స్కామ్ కాదా? ఇప్పుడేమో కాల్లెటర్ జారీ చేస్తే ఉద్యోగం వచ్చినట్లు కాదని అంటున్నారు. మరి 1:1 పద్ధతికి అర్థమేమిటి? మీరు పిలిచింది 1:5 లేదా 1:3 అయితే మీరు చెప్పిన వాదన కరెక్టు. 1:1 పద్ధతిలో పిలిచి అన్నీ సక్రమంగా ఉన్నా కూడా సర్దుబాట్లు చేశారంటే ఎవరి కోసం చేశారు?ముందస్తు వ్యూహంతోనే గోప్యతకు తూట్లు..ఏ పరీక్షకైనా ప్రశ్నాపత్రం తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ.. ఇవన్నీ కూడా అత్యంత గోప్యంగా (కాన్ఫిడెన్షియల్) జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో గోప్యతకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ ప్రశ్నాపత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రూపొందిస్తుంది. పరీక్ష నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ కన్వీనర్ను పక్కన పెట్టేశారు. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. స్కామ్కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ చేసే బాధ్యతలను అవుట్సోర్స్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. ఇందులో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్.. కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంకర్గా నిలిచాడు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) తెలుగు పరీక్షలో కూడా జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకూ వెళ్లిందో..! దీనిపై సీబీఐ విచారణ వద్దా? ఆ వ్యక్తి (నవీన్) నిజంగానే మెరిట్తో ర్యాంక్ సాధించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. దీని అర్థం తప్పు జరిగిందనేగా? మరోవైపు అతడి లాగిన్ ఐడీ కనిపించకుండా, డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్టు నుంచి పేరు ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? -
పరీక్ష లేకుండానే పోస్టులిచ్చేశాం
సాక్షి, అమరావతి : మెగా డీఎస్సీ–2025లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం పలాయనం చిత్తగించింది. వాస్తవాలు చెప్పాల్సిన విద్యాశాఖ, క్రీడా శాఖల మంత్రులు అధికారులతో ప్రెస్మీట్లు పెట్టించి తప్పుకున్నారు. దగా డీఎస్సీపై గత 20 రోజులుగా ఆధారాలతో సహా వస్తున్న వరుస కథనాలపై నేరుగా సమాధానం చెప్పకుండా చెప్పిన కథలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే రెండుసార్లు విలేకరుల సమావేశాలు నిర్వహించిన విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్, రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం సంయుక్తంగా మరోసారి మీడియా ముందుకొచ్చారు. నిజానికి స్పోర్ట్స్ డీఎస్సీలో పతకాలు సాధించిన వారికే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా, పోటీల్లో పాల్గొన్న వారికి ఇవ్వాల్సి వచ్చిందని, అది ప్రభుత్వ నిర్ణయం అని స్పష్టం చేశారు. పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వడం ప్రభుత్వం నిర్ణయం మేరకు జరిగిందని, క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో డీఎస్సీ లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. నియామక ప్రక్రియ ముగిశాక మళ్లీ తన నిర్ణయం మార్చుకుని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాలని జీవో ఇచ్చిందన్నారు. ఇది ప్రభుత్వ నిర్ణయమని, ఆ మేరకు తాము పని చేశామని వివరణ ఇచ్చారు. కీలక ఆరోపణలపై సమాధానం దాటవేత కృష్ణా జిల్లాకు చెందిన నవీన్ ఎస్సీఈఆర్టీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తూ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో జిల్లా మొదటి ర్యాంకు, టీజీటీలో ఆరో ర్యాంకు ఎలా వచ్చిందనే అంశంపై అధికారులు సమాధానం దాటవేశారు. నవీన్ సర్టిఫికెట్ల పరిశీలనకు రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని సమర్థించుకున్నారు. వాస్తవానికి నవీన్కు కాల్ లెటర్ రాకుండా అతడి లాగిన్ ఐడీని ప్రభుత్వం బ్లాక్ చేసింది. కాల్ లెటర్ లేకుండా ఎలా హాజరు కాగలడన్న ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లేదు. డీఎస్సీ కన్వీనర్ను తొలగించి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ను నియమించడం, ప్రశ్నావళిని రూపొందించే వారికే పగ్గాలు అప్పగించడాన్ని కూడా అధికారులు సమర్థించుకున్నారు. ఈ రెండు విభాగాలు విద్యా శాఖలోనే ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వాస్తవానికి పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా, ప్రభుత్వ పాలసీ మేరకు పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చిందని మరోమారు వెల్లడించారు. పరీక్ష లేకుండా పోస్టు.. ప్రభుత్వ పాలసీ స్పోర్ట్స్ డీఎస్సీలో దేశంలో ఎక్కడా జరగని రీతిలో అత్యంత నిర్భీతిగా అక్రమాలు జరిగాయి. పరీక్ష లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా ఇస్తారన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష లేకపోగా, అభ్యర్థుల అర్హతలు సైతం అస్తవ్యస్తంగా నిర్ణయించారు. కనీస అర్హత లేకపోయినా డిగ్రీ పొందేందుకు ఐదేళ్ల వరకు సమయం ఇచ్చారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే అది ప్రభుత్వ పాలసీగా చెప్పడం గమనార్హం. తమిళనాడులో పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇస్తున్నారని, స్పోర్ట్స్కు ప్రోత్సాహం ఇచ్చేందుకు అర్హత లేకపోయినా ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించడం విస్తుగొలుపుతోంది. మళ్లీ క్రీడా పాలసీ జీవో మార్చి.. ఇకపై పరీక్షలు ఉంటాయని ఎందుకు పెట్టారన్న అంశంపైనా సరైన సమాధానం రాలేదు. అది ప్రభుత్వ పాలసీ అని, తామేమీ చేయలేమన్నారు. అంతా పారదర్శకంగానే చేశామంటూ.. 1:1 నిష్పత్తి డైనమిక్ థింగ్ అని చెప్పుకొచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్ను అర్థం చేసుకోవడం కష్టమన్నారు. అన్ని రకాల రిజర్వేషన్లు పరిశీలించిన తర్వాతే 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్లు పంపినప్పుడు.. దానిని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని అధికారులు చెప్పడం చూస్తుంటే ఉద్దేశ పూర్వకంగానే అక్రమాలను దాస్తున్నారని ఇట్టే తెలుస్తోంది. వాస్తవానికి మెరిట్లో ఉండి కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థుల్లో మొదటి విడత సర్టిఫికెట్ పరిశీలనకు తొలిరోజు హాజరైన వారే అధికంగా ఉన్నారు. వారంతా రిజర్వేషన్ పరిధిలో ఉన్నప్పటికీ, లేరని చెప్పడం విస్తుగొల్పుతోంది. -
‘అగ్రి డిస్కం’కు కొత్త చిక్కులు
సాక్షి, అమరావతి: వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్(ఏపీఆర్ఏపీఎల్)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సౌర విద్యుత్ను వ్యవసాయ అవసరాలకు అందించడం కోసం అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి ఏపీఆర్ఏపీఎల్ మే 25న దరఖాస్తు చేసింది. ఈ ప్రతిపాదనపై ప్రజలు, రైతులు, సంస్థలు అభ్యంతరాలు లేదా సూచనలను జూన్ 11లోపు పంపించాలని ఏపీఈఆర్సీ సూచించింది. అయితే ఈ గడువు సరిపోదని, అగ్రి డిస్కంపై అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయని, గడువు పెంచాల్సిందిగా ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘంతో పాటు పలు యూనియన్లు ఏపీఈఆర్సీని అభ్యర్థించాయి. దీంతో ఈ నెల 22 వరకూ గడువు పొడిగించడంతో పాటు ఏపీఆర్ఏపీఎల్ బదులిచ్చేందుకు ఈ నెల 30 వరకూ అవకాశం కల్పిస్తూ ఏపీఈఆర్సీ గురువారం ఆదేశాలు జారీ చేసింది.నిర్ణయానికి ముందు అందరినీ సంప్రదించాలి..ఈ కొత్త డిస్కం ఏర్పాటుతో పాటు దానితో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అదే విధంగా వ్యవసాయ ఫీడర్లకు సంబంధించిన 11 కేవీ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, లో వోల్టేజ్ లైన్లను దశల వారీగా కొత్త డిస్కంకు బదిలీ చేసేందుకు ఏప్రిల్ 20న ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీఆర్ఏపీఎల్ ఏప్రిల్ 27న రాష్ట్రంలోని మూడు డిస్కంలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఏపీఆర్ఏపీఎల్కు డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనపై ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘంతో పాటు పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఏపీఈఆర్సీకి లిఖిత పూర్వకంగా ఓ లేఖ కూడా రాశాయి. ఉద్యోగ సంఘాలు చెబుతున్నదాని ప్రకారం.. ఈ ప్రతిపాదన అమలైతే విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఆర్థిక, పరిపాలనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యవసాయ వినియోగదారులకు సేవలందిస్తున్న ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్పై ప్రభావం పడుతుంది. వ్యవసాయ విద్యుత్ పంపిణీని వేరే సంస్థకు బదిలీ చేయడం వల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. అలాగే కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ముందుగా సిబ్బంది పునర్విభజన, బదిలీలు, పదోన్నతులు, వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వాలని, నిర్ణయం తీసుకునే ముందు ఉద్యోగులు, రైతులు, వినియోగదారుల అభిప్రాయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. -
30 ఏళ్లకు లీజు.. ఏడాదికి రూ.31 వేల ఫీజు
సాక్షి, అమరావతి: గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల పేరుతో వైఎస్సార్ కడప జిల్లాలోని వందల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకుగానూ కూటమి ప్రభుత్వం గురువారం ఒక్కరోజే నాలుగు జీవోలను జారీ చేసింది. ఈ జిల్లాలో మొత్తం 283.39 ఎకరాల ప్రభుత్వ భూమిని కార్పొరేట్ సంస్థలకు 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. బి.మఠం మండలంలోని పలుగురాళ్లపల్లి, పాపిరెడ్డిపల్లి గ్రామాల్లో 176.33 ఎకరాలు, పలుగురాళ్లపల్లిలో మరో 9.25 ఎకరాలు ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 50 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం కేటాయించింది. అలాగే, తొండూరు మండలంలోని మల్లెల, తొండూరు, బుచ్చుపల్లి గ్రామాల్లో 70.04 ఎకరాలు అంప్లస్ ఐఐఎఫ్ఏ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కు 126 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కేటాయించింది. ముద్దనూరు మండలం కొలవలి గ్రామంలో మరో 27.77 ఎకరాలు అంప్లస్ ఎవరెస్ట్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించింది. ఈ నాలుగు చోట్లా ఎకరాకు ఏడాదికి లీజు రుసుంను కేవలం రూ.31 వేలుగా నిర్ణయించింది. ప్రతి రెండేళ్లకు 5 శాతం పెంపు ఉంటుందని పేర్కొంది. గరిష్టంగా 30 ఏళ్లపాటు ఈ భూములు ఆయా కంపెనీల ఆ«దీనంలో ఉండనున్నాయి. భూముల మార్కెట్ విలువ కోట్ల రూపాయల్లో ఉండగా, స్వల్ప లీజు రుసుముతో దీర్ఘకాలికంగా అప్పగించడం గమనార్హం. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయి? ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
రికార్డు అంటే మాదే..
సాక్షి, అమరావతి: అక్రమాలు, అవకతవకలతో డీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టి దాన్నే రికార్డుగా చంద్రబాబు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నారని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దునుమాడారు. మెగా డీఎస్సీ అని పేరుపెట్టి డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. అసలు రికార్డు అంటే ఏమిటో చరిత్ర తెరిచి చూస్తే అర్థం అవుతుందన్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా వైఎస్సార్సీపీ హయాంలో కేవలం నాలుగు నెలల వ్యవధిలో సచివాలయాల్లో కొత్తగా 1.30 లక్షల ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. ఒక్క తప్పు, ఎలాంటి లోపం లేకుండా నియామక ప్రక్రియ చేపట్టి చరిత్ర సృష్టించామన్నారు.ఒకే నోటిఫికేషన్ ద్వారా..2019 మే 30న నేను సీఎంగా ప్రమాణం చేస్తే.. ఆ తర్వాత 50 రోజుల్లోనే అంటే జూలై 19న జీవో ఇచ్చాం. జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8 వరకూ పరీక్షలు నిర్వహించాం. 2,800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పు కూడా జరగలేదు. ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేశాం.మే 30 నుంచి అక్టోబర్ రెండో తేదీ మధ్య నాలుగు నెలల్లో అత్యంత పారదర్శకంగా, ఒక్క తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం. ఆ ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ద్వారా ఏకకాలంలో 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర మాదే అని గర్వంగా చెబుతున్నాం. అసలు రికార్డు అంటే అదీ. గ్రామ స్వరాజ్యం, సుపరిపాలన లక్ష్యంగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం రాశాం. ఎవరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డును సృష్టించాం. -
రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు
సాక్షి, అమరావతి: ‘మేనిఫెస్టోను డెస్ట్బిన్లో వేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు రెండేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా దగా పడ్డారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాం. ఈ ర్యాలీల్లో ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు వివరిస్తాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై దుమ్మెత్తి పోశారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆందోళనల్లో డీఎస్సీ అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నామని, పరీక్ష నిర్వహణలో అక్రమాల వల్ల జరిగిన నష్టాన్ని ప్లకార్డులతో ఎత్తి చూపుతామన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని గుర్తు చేశారు. ‘నిరుద్యోగ యువతకు నెల నెలా రూ.3 వేలు ఇస్తామన్నారు. రూ.3 వేల మాట దేవుడెరుగు.. వాళ్లకు హక్కు(రైట్పుల్)గా రావాల్సిన ఉద్యోగాలను సైతం ఇవ్వకుండా లాక్కొని స్కామ్లు చేశారు.అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలన్నీ పక్కన పడేశారు. బాబు పాలనలో రైతులు అన్ని విధాలుగా అధోగతి పాలయ్యారు. మహిళలు నాశనమైపోయారు. యువత ఆశలను నిర్దాక్షిణ్యంగా చిదిమేశారు. దగా పడ్డ ప్రజలకు న్యాయం చేయనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది’ అని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలతో, ఎన్నికల్లో వారిచ్చిన బాండ్లతో పాటు డీఎస్సీలో జరిగిన మోసాలు, అన్యాయాలు, దగా స్కామ్లను ప్రదర్శిస్తూ ప్రజలకు సంఘీభావంగా ప్రతి నియోజకవర్గంలో తలపెట్టిన ఈ నిరసన ర్యాలీలు గట్టిగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చామన్నారు. చంద్రబాబు పాలనలో దగాపడిన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ ర్యాలీలు నిర్వహిస్తారన్నారు. దగా పడిన రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులందరూ ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. -
268 టన్నుల ఇనుమును కొట్టేశారు
ప్రొద్దుటూరు: హౌసింగ్ డిపార్ట్మెంట్కు చెందిన రూ.2 కోట్ల విలువైన 268 టన్నుల ఇనుప కడ్డీల మాయం వెనుకప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి హస్తం ఉందని, ఆయన నిర్మిస్తున్న సన్ రైజ్ కౌంటీ అపార్ట్మెంట్కు ఈ కడ్డీలే వినియోగించారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి స్పష్టంచేశారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ఇనుప కడ్డీలు మాయమైతే తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోయాయంటూ వరదరాజులరెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు.2025 సెప్టెంబర్ 4వ తేదీ వరకు మార్కెట్యార్డు గోడౌన్లో కడ్డీలు ఉన్నాయని, ఆ తర్వాత మాయమయ్యాయని స్వయంగా హౌసింగ్ పీడీ రాజారత్నం ప్రకటించిన వీడియోను రాచమల్లు చూపించారు. ‘గత నెల 14వ తేదీన పీడీ గోడౌన్ను సందర్శించిన అనంతరం ఏఈ సుబ్రహ్మణ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, 28న కేసు నమోదు కావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ దొంగతనం జరిగిందని ఈ విషయాలు స్పష్టం చేస్తున్నాయి. పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించాల్సిన టన్నుల కడ్డీలు మాయమైతే పోలీసులు ఎందుకు విచారణ జరపడం లేదు? కేవలం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఒత్తిడి కారణంగానే కేసు ముందుకు సాగడం లేదు. సస్పెండ్ అయిన ఏఈ సుబ్రహ్మణ్యంను విచారిస్తే ఒక్క రోజులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మార్కెట్ యార్డు గోడౌన్కు ఇన్చార్జ్ ఉన్నారు. లోపల, బయట సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు పెట్టుకుని కేసు విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదు? ఇప్పటికైనా పోలీసులు విచారించి ఈ దోపిడీ విషయాన్ని తేల్చాలి. దోషులపై చర్యలు తీసుకోకపోతే త్వరలో శివాలయం వద్ద నడిబొడ్డున రిలే నిరాహార దీక్ష చేపడుతా’ అని రాచమల్లు హెచ్చరించారు. ‘తనను గెలిపిస్తే పీఎంఎఫ్ను తెరిపిస్తానని, మెడికల్ కాలేజీని తీసుకొస్తానని, వరద కాలువను నిర్మిస్తానని, అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతానని ఎమ్మెల్యే చెప్పిన మాటలు డొల్ల అని అందరికీ అర్థమైంది. క్రికెట్ బుకీలంతా ఎమ్మెల్యే పంచనే ఉన్నారు. అండర్ డ్రైనేజీ కాలువను నిర్మించలేదు. వర్షాలు వచ్చినప్పుడు కాలువను తలదన్నేలా రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. విచ్చల విడిగా ఇసుకను అమ్ముకుంటున్నారు. బెల్టు షాపులను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు’ అని రాచమల్లు ధ్వజమెత్తారు. -
వచ్చే ఐదు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: రాబోయే ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని పేర్కొంది. మరో రెండు నుంచి మూడు రోజుల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో వచ్చే మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.కొవ్వూరులో అత్యధిక ఉష్ణోగ్రతఇదిలా ఉండగా గురువారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అత్యధికంగా 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 44.2 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.9 డిగ్రీలు, బాపట్ల జిల్లా ఇంకొల్లు, పోలవరం జిల్లా కూనవరంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురం, విశాఖ జిల్లా గాజువాక, విజయనగరం జిల్లా రాజాంలో 43.6 డిగ్రీలు నమోదయ్యాయి. కోనసీమ జిల్లా శివలలో 43.3, శ్రీకాకుళం జిల్లా రావివలసలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక వర్షపాతంమరోవైపు బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 5.7 సెంటీ మీటర్లు, ఏలూరు జిల్లాలో 3.7 మిల్లీమీటర్లు, బాపట్ల జిల్లాలో 3.49 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లాలో 3.2, గుంటూరు జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అతిపెద్ద స్కామ్
స్పోర్ట్స్ కోటా అన్నది పెద్ద కుంభకోణం. నిజంగా కష్టపడ్డ క్రీడాకారులకు అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష, టెట్ రాయాల్సిన అవసరం లేకుండా, బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. అనుకున్న వారితో పోస్టులు నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకున్నారు. కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా.. అదీ పతకాలు లేకపోయినా పర్వాలేదు.. పాల్గొంటే చాలంటూ ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనను మార్చారు. ఇందుకోసం జీవోల జారీకి ముందుగానే వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇవ్వడం దారుణం. స్పోర్ట్స్లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్లోనూ పోస్టులు ఇచ్చేశారు. ఆయా గేమ్స్లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. ఇలా బాల్ బాడ్మింటన్లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి.డీఎస్సీ స్కామ్కు సంబంధించి ఆధారాలు సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఇంత క్రిస్టల్ క్లియర్గా కన్పిస్తున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తోంది. పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే.. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణలో న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐతో విచారణ జరిపించాలి. ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలాగని నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్గా కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. -వైఎస్ జగన్సాక్షి, అమరావతి : డీఎస్సీలో మోసపోయిన ప్రతి విద్యార్థి ఒక కాక్రోచ్ (బొద్దింక)గా మారి చంద్రబాబును కాటేస్తారని.. ఈ జెన్ జెడ్, జెన్ ఆల్ఫా కాలంలో విద్యార్థులను ఎవరూ నియంత్రించలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు దగాపడ్డ యువత కాక్రోచ్లై బాబును కాటేయడం ఖాయమని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా రూపంలో చంద్రబాబు సర్కారు డీఎస్సీలో భారీ స్కామ్ చేసిందని, దొడ్డిదారిన తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి జీవోల పేరిట స్కామ్కు స్కెచ్ వేశారని మండిపడ్డారు. డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఎటువంటి డిగ్రీ అర్హత లేకుండానే.. ఆటల్లో ఎటువంటి ప్రతిభ కనపర్చకుండానే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, హిందీ టీచర్లుగా చంద్రబాబు సర్కారు వందలాది మందిని నియమించేసిందని ఎత్తి చూపారు. జిల్లా, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో పతకాలు గెలవకపోయినా కేవలం పాల్గొన్నారని వీళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు అధ్యక్షులుగా ఉన్న క్రీడా సంఘాల చేత సర్టిఫికెట్లు ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆధార సహితంగా వివరించారు. ఇందుకోసం జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లను తీసుకొచ్చిన చంద్రబాబు సర్కారు.. నియామక ప్రక్రియ పూర్తికాగానే వాటిని రద్దు చేసి, కొత్త జీవోలు తీసుకొచ్చిందని నిప్పులు చెరిగారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు పక్కా సాక్ష్యాలతో కనపడుతున్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగుతోందని, మొత్తం డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వం దిగిరాకపోతే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ వేసి మోసపోయిన విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..నిజమైన క్రీడాకారులకు అన్యాయం» ‘‘స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద కుంభకోణం. ప్రతిభ ఉన్న వారికే కాదు, నిజంగా కష్టపడ్డ క్రీడాకారుడికి కూడా అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా, ఒక బ్యాక్ డోర్ పెట్టి.. దాని ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. పని అయిపోయాక, అనుకున్న వారితో నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. తెచ్చిన జీవోలను తీసేశారు. » గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్మెంట్లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉంది. అయితే ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్లో మిగతా అభ్యర్థులతోపాటు వీరు కూడా ఎగ్జామ్స్ రాసి కచ్చితంగా క్వాలిఫై కావాలన్న నిబంధన ఉండేది. అలాంటి నిబంధనను చంద్రబాబు మొత్తం మార్చేశారు. » స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకువచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త జీవోలు నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారు. గతంలో జీవో నంబర్ 74 ప్రకారం డీఎస్సీ తప్పకుండా ఉత్తీర్ణత కావాలి. ఈ నిబంధనను రద్దు చేస్తూ స్పోర్ట్స్ కోటా రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచారు. డీఎస్సీ ఎగ్జామ్ రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా ఇచ్చేలా నిబంధనను మార్చారు.» ఇంగ్లిష్, హిందీ, మాథ్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టులకు డీఎస్సీ ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగాలిచ్చారు. ఇందుకోసం జీవోలు జారీకి ముందుగానే వారి దగ్గర నుంచి వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలు పెట్టారు. ఇంకా కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన ఆటగాళ్ల ప్రతిభకు గౌరవం. దీన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా ఈ ప్రభుత్వం మార్చేసింది. డీఎస్సీ 2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీ చేసిన జీవో నెం.23 క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్స్పోర్ట్స్లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఎటువంటి పతకాలు, సర్టిఫికెట్స్ లేకుండా కేవలం ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ స్పోర్ట్స్ కూడా ఏమిటంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ (అంతర్ జిల్లా), ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పాల్గొంటే చాలు. అక్కడ కూడా మెడల్స్ అవసరం లేదు. కేవలం పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్తో పోస్టులు ఇచ్చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆయా గేమ్స్లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. బాల్ బాడ్మింటన్లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి.. కేవలం ఆయా గేమ్స్లో పాల్గొన్నందుకే ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ నేత, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్. అంటే వీళ్లే పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్ ఇస్తారు.. వీళ్లే ధ్రువీకరిస్తారు. క్రీడల్లో పాల్గొంటే చాలు ఉద్యోగంవివిధ కాలేజీల మధ్య ఆటల పోటీల్లో పాల్గొన్నందుకు 99 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో పతకాలు, ట్రోఫీలు రాని 86 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. వీళ్లకు పతకాలు రాలేదు, చెప్పకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు. జస్ట్ పార్టిసిపేట్ (పాల్గొన్నారు) చేశారంతే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే.. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆది కవి నన్నయ యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగి వేమన వర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి 4, సంస్కృత యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీల నుంచి ఒక్కో సర్టిఫికెట్ ఉన్నాయి. ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో.. అంటే వివిధ కాలేజీల మధ్య జరిగే పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసినందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లా తరఫున ఆడితే చాలు.. గెలుపుతో సంబంధం లేకుండా, డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన వసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు.నా పక్కనే ఉన్న (వైఎస్ జగన్ పక్కన కూర్చున్నారు) పోలవరానికి చెందిన గిరిజన క్రీడాకారుడు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అనిగి దుర్గయ్యకు ఉద్యోగం రాలేదు. 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు. డేటా అప్లోడ్లో సిల్వర్ మెడల్ అని రాయడంతో ఇవ్వలేదంటున్నారు. గోల్డ్ మెడల్ వచ్చినవాడు ఎవడైనా సిల్వర్ మెడల్ అని రాస్తాడా? అయినా ఆటల్లో పాల్గొంటేనే ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, ఇక్కడ ఏదో మెడల్ వచ్చినా ఎందుకు ఇవ్వలేదు? ఆయన 2002లో విశాఖ, హైదరాబాద్లో జరిగిన నేషనల్ గేమ్స్లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్స్, జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, యూత్ స్పోర్ట్స్ కలకత్తాలో మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయినా ఉద్యోగం ఇవ్వలేదు.అయినా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ ఆటల్లో పాల్గొంటేనే ఇస్తున్నావు కదా.. అదే జాతీయ స్థాయిలో పతకం సాధించినవాడికి ఎందుకు ఇవ్వలేదు? ఇదెక్కడి న్యాయం? నిజంగా ఇది కచ్చితమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా? ఇది క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్ కాదా? ముందు తన వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చి గేట్లు తెరిచాడు. వాళ్ల వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చేశాక జీవో నంబర్ 23, జీవో 25, జీవో 56లతో పాత జీవోలను రద్దు చేస్తూ గేట్లు మూసేశారు. ఇదిస్కాం కాకపోతే ఏమిటి స్వామీ?నీ బుద్ది పుట్టినప్పుడు జీవోలు ఇస్తున్నావు.. నీ బుద్ది పుట్టినట్లు జీవోలు రద్దు చేస్తున్నావు. ఇవి అంత మంచి జీవోలు అని నువ్వు అనుకున్నట్లయితే జీవో నంబర్ 4, జీవో నంబర్ 47ని ఎందుకు రద్దు చేశావు చంద్రబాబూ? సెలక్టయిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే ఇంకో ఆశ్చర్చకరమైన విషయం కనిపిస్తోంది. ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీల్లో కేవలం పాల్గొన్నందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్లకు పతకాలు లేవు, చెప్పుకోదగ్గ టోర్నమెంట్స్లో పాల్గొనలేదు. కేవలం పార్టిసిపేట్ చేశారంతే.ఒక్కో ఉద్యోగానికి రూ.15–20 లక్షలు» స్పోర్ట్స్ కోటా పోస్టులను ఒక్కొక్కటి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి (ఆ వీడియో, ఆడియోను ప్రదర్శించారు). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను డీపీ (డిస్ప్లే పిక్చర్)గా పెట్టుకొని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయట పడింది. విషయం బయటకు రాగానే నామమాత్రంగా కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్తో వదిలేశారు. » ఇవన్నీ చూస్తుంటే స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగింది పారదర్శక నియామక ప్రక్రియ కాదు. ఇది ఒక వ్యవస్థీకృత స్కామ్ అని ప్రజలు భావిస్తున్నారు. ఆ కేసులో చేసిన విచారణ శూన్యం. ఏ విషయాలు కూడా బయటకు రాకుండా దాచిపెట్టారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ గమనించండి. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఆ నంబర్ ఎవరిదో నిమిషాల్లో కనిపెట్టేస్తారు. కానీ, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో చెప్పకుండా, పేరు కూడా తెలపకుండా అనుమానిత వ్యక్తి అని మాత్రమే రాశారు. ఆ అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. దీంతో ఆ కేసు ప్రక్రియ కూడా చాలా ఆలస్యం చేశారు. » ఇలా ఎందుకు అయ్యిందంటే.. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల ఆలస్యం అయ్యిందంట. దీని అర్థం ఈ వీడియో కాల్ ఆషామాషీది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేలిపోతుంది. స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాల భర్తీ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరో పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలే డీల్ చేస్తున్నారు.. అది వేరే విషయం అనుకోండి. ఇంకా అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకుండా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇది అన్నింటికంటే దారుణం. కోట్లాది కాక్రోచ్ల్లో నేనూ ఒకడినవుతా... కాక్రోచ్ పార్టీనా, ఇంకోటా అనేది పక్కన పెడితే.. వీళ్లంతా యువత. వీళ్లకు న్యాయం చేయకపోతే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. జెన్ జీ ఇందులో భాగమే. వారి ఆశలను నువ్వు నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్గా, కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో నేనూ ఒకడినవుతా.ఇది జెన్జెడ్ కాలం» చంద్రబాబూ.. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇది జెన్జెడ్, జెన్ ఆల్ఫా కాలం. దేన్నీ నువ్వు ఆపలేవు. నువ్వు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు పెరుగుతుంది. దగాపడ్డ యువత నిన్ను విడిచిపెట్టదు. నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. కాక్రోచెస్ లేస్తాయి. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. » విద్యా శాఖ మంత్రిగా సాక్షాత్తు చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు సరికదా, ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే వారం రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నా వద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తానని. ఒకవేళ అప్పటికీ కాకపోతే, మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని చెప్పా. » రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం. దగాపడ్డ రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పిల్లలు.. ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకొంటూ ప్రజల తరఫున నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కామ్లను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతాం. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతాం. » ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించాలనో.. ఎవరినో ఎత్తిచూపాలనో కాదు. ప్రతి విషయంలో ఆధారాలతో సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్తో వివరించడం జరిగింది. ఇంత క్రిస్టల్ క్లియర్గా కన్పిస్తున్నప్పుడు సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తే అది ఏరోజుకైనా దేవుడు, ప్రజలు హర్షించరు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంక్వైరీలో న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐ లాంటి ఎంక్వైరీ సంస్థ దర్యాప్తుతోనే న్యాయం, ధర్మం జరుగుతుంది. -
డీఎస్సీలో ఆరోపణలపై బాబు సర్కార్ పలాయనం
సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీలో ఆరోపణలపై ప్రభుత్వం పలాయనం చిత్తగించింది.. అధికారులతో మంత్రులు ప్రెస్మీట్ పెట్టించారు. అయితే, నవీన్కి మొదటి ర్యాంక్పై సమాధానం దాటవేశారు. నవీన్.. సోషల్లో ఫస్ట్ ర్యాంక్, టీజీటీలో ఆరో ర్యాంక్ పొందగా.. వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం సమర్థించుకుంది. నవీన్ లాగిన్ బ్లాక్ చేసిన ప్రభుత్వం.. లాగిన్ బ్లాక్పై సమాధానం చెప్పలేదు. డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఈఆర్ టి కన్వీనర్ ఒక్కరినే నియమించడంపై ప్రభుత్వం సమర్థించుకుంది.అన్ని విభాగాలు విద్యాశాఖ కమిషనర్ ఆధీనంలో ఉన్నాయంటూ కవరింగ్ ఇచ్చింది. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష ఎందుకు పెట్టలేదంటూ మీడియా ప్రశ్నించింది. క్వాలిఫికేషన్ లేకుండా ఎలా అర్హత కల్పించారంటూ మీడియా నిలదీయగా.. అది పాలసీ నిర్ణయం అంటూ చంద్రబాబు సర్కార్ తప్పించుకుంది. తమిళనాడులో పరీక్ష లేకుండా ఇస్తున్నారంటూ సమర్థించుకుంది. స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం క్వాలిఫికేషన్ లేకపోయినా తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.ఐదేళ్ల సమయం వాళ్లకి క్వాలిఫికేషన్ సాధించడానికి ఇచ్చామంటూ అధికారులు చెప్పుకొచ్చారు. మళ్లీ ఎందుకు పాలసీ మార్చారంటూ మీడియా ప్రశ్నించగా.. అది ప్రభుత్వం పాలసీ అంటూ సమాధానం దాటవేశారు. అది డీఎస్సీ కోసం మారిన పాలసీ కాదు.. సాధారణంగా మార్చిన పాలసీ అంటూ అధికారులు బుకాయించారు. -
తల్లికి వందనం పథకానికి పంగనామాలు
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి పంగనామాలు పెట్టింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం ఈ ఏడాది అమలు కాని పరిస్థితి ఏర్పడింది. జూన్ 12న పథకం అమలు జరగదని స్పష్టమైంది. రెండో ఏడాదికే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఈ పథకాన్ని కొనసాగించలేక చేతులెత్తేశారు. ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయితే స్కూల్ తెరిచేనాటికి ప్రతిఏటా తల్లికివందనం ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండేళ్లలో ప్రతి విద్యార్థికి రూ.17వేలు ఎగనామం పెట్టింది.రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతున్నా ఇప్పటి వరకు ఈ ఏడాది తల్లికి వందనంపై చంద్రబాబు సర్కార్ స్పష్టత ఇవ్వలేదు. డబ్బులు ఎప్పుడు జమచేస్తారో ప్రకటించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చిన కూటమి ప్రభుత్వం.. గతేడాది ఏడాది తల్లికి వందనంలో 20లక్షలమంది విద్యార్థులకు కోత విధించింది. రూ.260 కోట్ల బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. ఈ ఏడాది లబ్ధిదారుల ఎంతమందో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ ఏడాదికి తల్లికి వందనం ఎప్పుడిస్తారో బాబు సర్కార్ చెప్పలేదు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు. -
టీడీపీ గేమ్ ప్లాన్.. పవన్ కళ్యాణ్ కొత్త వేషం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త దళాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా ఉంది. జెన్-జీ ఆశయాలకు అనుగుణంగా గొంతు వినిపింంచేదుకు సేనా గళంను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం ఒక కమిటీని కూడా వేస్తున్నట్లు తెలిపారు. ఆయన చిత్తశుద్ధితో ఈ ప్రకటన చేసి ఉంటే స్వాగతించవలసిందే. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్లు కూడా జెన్-జీ అంటూ మాట్లాడి వారి ఆశయాలకంటే ఎక్కువే పనిచేస్తున్నామని తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు.ఒక వైపు ఏపీలో ప్రశ్నించే గొంతుకలే లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ, మరో వైపు జెన్-జీలో కలిసిపోయే వ్యూహంలోకి టీడీపీ, జనసేన నేతలు వెళుతున్నట్లు అనిపిస్తుంది. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దేశంలో సంచలనం సృష్టించిన క్రాకోచ్ జనతా పార్టీ పరిణామాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆయనకు తెలిసి అన్నారో, తెలియక అన్నారో కాని, తదుపరి చంద్రబాబు దాని జోలికి వెళ్లలేదు. కాని వ్యూహాత్మకంగా జెన్-జీ భాషను వినియోగించుకోవడం ఆరంభించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళుతున్నారా? లేక చిత్తశుద్దితో చేస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.నేపాల్లో కొంతకాలం క్రితం జెన్-జీ పేరుతో పెద్ద విప్లవమే వచ్చింది. యువత వీధులలోకి వచ్చి పెద్ద ఎత్తున గళం విప్పారు. దానిని అణచివేయడానికి ఆనాటి ప్రభుత్వం కాల్పులవరకు వెళ్లింది. దాని ఫలితంగా పలువురు యువకులు మరణించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో పాలక పార్టీ పూర్తిగా తుడుచుకుపోయి కొత్త తరం నేతలు, కొత్త పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చేశారు. అనంతరం కాల్పులకు కారణమైన ఆనాటి నేపాల్ ప్రధాన మంత్రి, మంత్రులను జైళ్లకు పంపారు. ప్రభుత్వ అవినీతిపై పోరాడడానికి సోషల్ మీడియాను నేపాల్ యువత ఒక ఆయుధంగా మార్చుకుంది. దానిని తట్టుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫారంలను ప్రభుత్వం నిషేధించడంతో అది తీవ్ర నిరసనగా మారి ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది.అప్పటి నుంచే జెన్-జీ అన్నది బాగా పాపులర్ అయింది. గతంలో ఆయా వయసులను బట్టి తరాలు అనేవారు. కాని ఇప్పుడుమారిన సాంకేతిక యుగంలో, డిజిటల్ కాలంలో జన్ జడ్, జెన్ ఆల్ఫా, బీటా ఇలా పేర్లు పెడుతున్నారు. వాటన్నిటి లక్ష్యం ఒకటే. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సమాజంలోనూ, పాలన వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావడమే. ప్రధానంగా యువత సోషల్ మీడియాను వాడుతున్న తీరు, సెల్ఫోన్, టాబ్ వంటి సాంకేతిక పరికరాలపై గడుపుతున్న టైమ్ మొదలైనవాటిని పరిశీలించి ఈ పేర్లు పెడుతున్నారు.స్థూలంగా చెప్పాలంటే కొత్త తరం ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలన్న సంకల్పం అన్నమాట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెన్-జీ ఆశయాల కోసం సేవాగళం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం వినడానికి అయితే బాగుంది. కాని ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నదేమిటి? ప్రశ్నించే గళాలను అణచివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్లు అమలు చేస్తున్న రెడ్ బుక్ పర్వంపై పవన్ కళ్యాణ్ కాని, ఆయన పార్టీ వారు కాని ప్రశ్నించి ఉంటే కచ్చితంగా ఇలాంటి సేనా గళం ఏర్పాటుకు అర్హులు అవుతారు.ప్రతిపక్ష వైఎస్సార్సీపీపైన దాడులే కాదు. తన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపై సాగుతున్న దాడులను పవన్ ప్రశ్నించలేకపోతున్నారు. అధికారానికి అలవాటు పడి, జనసేన వారు సైతం అలాంటి దాడులను భరించాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులో ఒక తెలివి ఉంది. అది దేశంలో లేదా, ఏదైనా విదేశంలో కొత్త మార్పు వస్తుంటే అది తనకు ప్రచారానికి ఉపయోగపడుతుందనుకుంటే వెంటనే అందులోకి వెళ్లి పోతుంటారు.ఉదాహరణకు 2012 ప్రాంతంలో దేశంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఆధ్వర్యంలో ఒక ఉద్యమం వచ్చింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా దానికి మద్దతు వచ్చింది. అంతే! చంద్రబాబు తెలివిగా తానూ అన్నాహజారేకి మద్దతు ఇస్తున్నానని చెప్పి హైదరాబాద్లోని తన పార్టీ ఆఫీస్ నుంచి ట్యాంక్బండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా ఆయన ధైర్యంగా ఆ ర్యాలీ తీశారు.దానిపై చంద్రబాబును ఎద్దేవా చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా పాపులర్ అయ్యాయి. ఏదైనా వ్యతిరేకత వచ్చే విషయం జరిగితే వెంటనే దానిని తన రాజకీయ ప్రత్యర్ధికి అంటగట్టేయడం కూడా చేస్తుంటారు. ఉదాహరణకు 2022 ప్రాంతంలో శ్రీలంకలో ప్రజలు తిరగబడి అధ్యక్ష భవనంలోకి కూడా దూసుకువెళ్లారు. ఆ దేశం అప్పుల కారణంగా దివాళా తీసినంత పనైంది. అంతే! చంద్రబాబు ఆ పరిస్థితిని అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వానికి రుద్దేశారు. ఏపీ శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేశారు. ఏపీ 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని అబద్దాన్ని సృష్టించారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా తబాలా వాయించేవి.పవన్ కళ్యాణ్తో పాటు, బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కూడా అదే దుష్ప్రచారం చేశారు. చిత్రమేమిటంటే ఉమ్మడి ఏపీకి తానే అత్యధిక కాలం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత విభజిత ఏపీకి కూడా తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన టైమ్లో చేసిన అప్పుల్ని కూడా జగన్ ప్రభుత్వానికి అంటగట్టి పచ్చి అబద్దాన్ని జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేశారు. ఇలా ఉంటుంది ఆయన ధోరణి. తన కుమారుడు లోకేష్కు కూడా అలాంటి ట్రైనింగే ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఏపీలో జెన్-జీ ఉద్యమం వస్తే అది ఎవరికి వస్తుంది? కూటమి ప్రభుత్వంపైనే కదా! ఈ రెండేళ్లలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు మరే రాష్ట్రంలో జరగలేదు కదా! సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీసులను ప్రయోగిస్తున్నది కూటమి సర్కారే కదా! నేపాల్లో కూడా అలా చేయబట్టే ప్రజలలో తిరుగుబాటు వచ్చింది. బహుశా ఆ భయంతోనే తెలివిగా తాము కూడా జెన్-జీ అంటూ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కు చిత్తశుద్ది ఉంటే, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించాలి.ఉదాహరణకు డీఎస్సీకి సంబంధించి వచ్చిన అనేక వార్తలపై స్పందించి ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా! రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ హత్యల గురించి, టీడీపీ గూండాల దాడి గురించి మాట్లాడాలి కదా! జనసేన నేత ఇంటినే మచిలీపట్నంలో కూల్చితేనే కనీసం స్పందించలేదే! ఒక మహిళా నేత ప్రైవేటు వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రిని నిలదీయలేదే! అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తెచ్చి, దానిని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణపై పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసే సేనాగళం మాట్లాడుతుందా?కేవలం పవన్ కళ్యాణ్ పై వచ్చే రాజకీయ విమర్శలకు మాత్రమే బదులు ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నారా? ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక రాజకీయ విశ్లేషణపైనే కేసు పెట్టిన జనసేన జెన్-జీ గురించి, సేనా గళం గురించి చెబుతుంటే విడ్డూరంగానే కనిపిస్తుంది. తెలంగాణలో పవన్ కొనుగోలు చేసినట్లు చెబుతున్న చెరువు భూమిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా! చంద్రబాబు, లోకేష్లు ఏదైనా మంచి పని చేస్తే పవన్ కీర్తించవచ్చు. కాని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని మానేశారని కదా ఆ పార్టీవారు వాపోతున్నది.కనుక ముందుగా పవన్ కళ్యాణ్ తన గురించి తానే ప్రశ్నించుకుని ఆ తర్వాత సేనాగళానికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగిస్తే సముచితంగా ఉంటుందేమో! లేకుంటే ఇది కూడా టీడీపీ గేమ్ ప్లాన్లో భాగమేనేమో అన్న అనుమానం వస్తుంది. ఏపీలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించేవారిని అణచివేయడానికి కొత్త వేషంలో వస్తున్నారేమో అన్న అభిప్రాయం కలగకుండా పవన్ సేనాగళం పనిచేస్తుందా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ ప్రెస్ మీట్ .. దుర్గయ్య ఏం అన్నారో విన్నారా
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అభ్యర్థి, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAAP) అధికారులకు సవాల్ విసిరారు. ‘నేను గోల్డ్ మెడల్ సాధించాను. ఎవరైనా వచ్చి నిరూపించమంటే నిరూపిస్తాను. నేను డీఎస్సీకి గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లతో అప్లై చేశాను. కానీ ఎస్ఏఏపీ ఎండీ అబద్ధం చెబుతూ నేను సిల్వర్ మెడల్ పెట్టానని అన్నారు’ అని దుర్గయ్య మండిపడ్డారు.డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన కుంభకోణంపై గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్గయ్య కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్మెన్కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్ను స్కామ్ చేశారు..చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగింది’ అన్నారు. -
ఆక్వాకు షాక్!
సాక్షి, అమరావతి: ఆక్వాకు సబ్సిడీ విద్యుత్ను ఎగ్గొట్టడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఎలాంటి షరతలు లేకుండా.. జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వాసాగు చేసే రైతులందరికీ యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీని రెండేళ్లుగా అటకెక్కించిన చంద్రబాబు సర్కార్.. తాజాగా నాణ్యతా శాతం (పవర్ ఫ్యాక్టర్) అంటూ లేని కొత్త నిబంధనను ముందుకు తీసుకువచ్చింది. నాణ్యతా శాతం తక్కువగా ఉంటే విద్యుత్ వృధా జరిగినట్లు భావించి వారికి సబ్సిడీని ఎగ్గొట్టే అడ్డగోలు వ్యవహారానికి నాంది పలికింది. ఈ మేరకు తాజాగా 169వ జీవోను ప్రభుత్వం జారీ చేసింది.ఎగనామానికి కుతంత్రం ఇలా...» ఈ జీవో ప్రకారం.. అప్సడా చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న 1,09,202.46 ఎకరాలను కొత్తగా జోన్ పరిధిలో నోటిఫై చేస్తారు. » వీటి పరిధిలో ఉన్న 6 వేల కనెక్షన్లతో పాటు జోన్ పరిధిలో ఇప్పటికే ఉన్న మరో 6,500 కనెక్షన్లకు యూనిట్ రూ.1.50 చొప్పున త్వరలో విద్యుత్ సబ్సిడీ వర్తింప జేస్తారు. ఇందుకు రైతాంగం రిజిస్ట్రేషన్ తప్పనిసరి. » అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సబ్సిడీ వర్తింపు విషయంలో కొత్త నిబంధన తీసుకురావడం జరిగింది. » ఈ నిబంధన ప్రకారం విద్యుత్ వినియోగ నాణ్యత శాతం 0.90 నుంచి 0.95 శాతం మధ్య విధిగా ఉండాలి. » పవర్ ఫ్యాక్టర్ అనేది విద్యుత్ సమర్థ వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఒక శాతం ఉంటే సమర్థవంతంగా వినియోగిస్తున్నట్టు. 0.95 శాతం అంటే మంచి స్థాయిలో ఉన్నట్టు. 90 శాతం అంటే ఆమోద యోగ్యమైన స్థాయిలో ఉన్నట్టుగా గుర్తిస్తారు. » 0.90 శాతం కంటే తక్కువగా ఉంటే విద్యుత్ వృథా ఎక్కువగా జరుగుతున్నట్టుగా భావిస్తారు. వాస్తవానికి ఆక్వా చెరువులన్నీ బహిరంగ ప్రదేశాల్లో ఉండడంతో, విద్యుత్ లైన్లన్నీ కిలో మీటర్ల మేర విస్తరించి ఉంటాయి. దీనివల్ల వృధా శాతం ఎక్కువగా ఉంటుందని విద్యుత్, ఆక్వా రంగ నిపుణుల విశ్లేషణ. ఈ నేపథ్యంలో వాస్తవానికి 0.70 నుంచి 0.80 మధ్య మాత్రమే నాణ్యతా శాతం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. » ఈ తాజా నిబంధన తాజా విద్యుత్ సబ్సిడీకి అర్హత పొందిన 12,500 కనెక్షన్లకే కాదు.. ఇప్పటికే విద్యుత్ సబ్సిడీ పరిధిలో ఉన్న మరో 49,601 కనెక్షన్లకు.. అంటే మొత్తం 62,101 కనెక్షన్లకు ఇబ్బందికరంగా మారింది. జగన్ ప్రభుత్వం ఇచ్చిన భరోసా.. ఇప్పుడు ఏది? 2024–25 ఆర్థిక సంవత్సరంలో 5.60 లక్షల ఎకరాల్లో ఆక్వాసాగవుతుండగా, 3.33 లక్షల ఎకరాలకు విద్యుత్ సబ్సిడీ వర్తింప చేస్తున్నారు. తాజాగా ఈ ఏడాది కొత్తగా మరో లక్ష ఎకరాల్లో సాగు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఆక్వాకు సంబంధించి 68,134 కనెక్షన్లు ఉన్నాయి. వైఎస్సార్సీపీ హయాంలోనే జోన్ పరిధిలోని 10 ఎకరాల లోపు విస్తీర్ణం కలిగిన ఆక్వా చెరువులకు సంబంధించి 54,072 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ వర్తింప చేశారు. కానీ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25లో తొలి ఏడాది 50,092 కనెక్షన్లకు వర్తింప చేయగా, 2025–26లో కేవలం 49,601 కనెక్షన్లకు మాత్రమే విద్యుత్ సబ్సిడీ అమలు చేశారు. తాజాగా మరో 12,500 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ వర్తింప చేస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. ఎప్పుడు ఈ పెంపు వర్తింప చేస్తారో జీవోలో స్పష్టత లేకపోవడంపై ఒకవైపు చర్చ జరుగుతుండగా, మరోవైపు నాణ్యతా శాతం అంశం తాజాగా రైతాంగానికి ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా సబ్సిడీ విద్యుత్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆక్వా రైతులకు బాబు సర్కార్ శాపంగా మారింది.రైతులను వంచించడమే..చంద్రబాబు సర్కార్ ఆక్వారైతుల జీవితాలతో చలగాటమాడుతోంది. జీవో 169 ఆక్వా రైతులను వంచించేందుకే తప్ప వారికి ఏమాత్రం మేలు చేయదు. వృధా శాతాన్ని అరికట్టి, నాణ్యతా శాతం పెంచుకోవాలంటే ప్రస్తుతం ఉన్న కెపాసిటర్ల స్థాయిని రైతులు పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఒక్కో రైతుకు కనీసం రూ.2 లక్షల భారం పడనుంది. ఓ వైపు కంపెనీలతో కుమ్మక్కై ఫీడ్ ధరలు పెంచేందుకు కుట్రలు చేస్తూ మరోక వైపు సబ్సిడీ విద్యుత్కు మంగళం పాడేందుకు ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. –వడ్డి రఘురాం, మాజీ వైస్ చైర్మన్, అప్సడా -
ఆస్తి నాది.. కాపురం బాబుది
సాక్షి, అమరావతి: గడచిన 8–9 ఏళ్లుగా కృష్ణా నది కరకట్టపై సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు తనదేనని రాజ్యసభ జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించారు. అఫిడవిట్లో నేరుగా ఆ విషయాన్ని చెప్పకపోయినా.. ప్రకటించిన తన ఆస్తుల వివరాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 272, 272–1ఏ, 274లో డోర్ నంబర్ 17–3–781–1లో 1.32 ఎకరాల (52,630 చదరపు అడుగుల) భూమి, అందులో 5,994.62 చదరపు అడుగుల భవనం తనదేనని పేర్కొన్నారు. 2004, 2008 సంవత్సరాల్లో ఆ ఆస్తులను తాను కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్లానింగ్ కార్యక్రమాలకు ఉపయోగించే సర్వే నంబర్లతో సహా గ్రామాల మ్యాప్లు ‘భువన్ పంచాయతీ’ వెబ్పోర్టల్ ఆయా సర్వే నంబర్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం (రెసిడెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ఉన్నట్టు స్పష్టంగా పేర్కొంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉండే ఇంటితోపాటు ఆ చుట్టపక్కల 1.32 ఎకరాల భూమి జనసేన రాజ్యసభ్య అభ్యర్థి లింగమనేని సొంత ఆస్తులుగా తేలిపోయింది.ఉండవల్లిలోని కృష్ణానది కరకట్ట బంగ్లా ఆస్తి వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న లింగమనేని మరోవైపు లింగమనేని తన అఫిడవిట్లో ఆ భూమి ప్రస్తుత పరిస్థితి వివరాలు వంటివి పేర్కొనకపోయినప్పటికీ.. తన అఫిడవిట్లోనే వేరొక చోట 9(బీ) కాలమ్లో ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ(10–02–2026)న రాష్ట్ర ప్రభుత్వంతో రెంటల్/లీజ్ అగ్రిమెంట్ ఒప్పందం ఒకటి చేసుకున్నట్టు పేర్కొనడం గమనార్హం. క్విడ్ప్రో కో.. కరకట్ట బంగ్లా కథ రాజధాని అమరావతి నిర్మాణం పేరిట 2014–19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జరిపిన భూసమీకరణ, అమరావతి ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు ద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు లింగమనేని రమేష్ కు భారీ ప్రయోజనం చేకూర్చడంతో క్విడ్ప్రో కోలో భాగంగా లింగమనేని రమేష్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పు వెనుక రూ.వందల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణతోపాటు అప్పటి ప్రభుత్వంలో మంత్రి లోకేశ్ను కూడా నిందితుడిగా చేర్చి అప్పట్లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2024 ఫిబ్రవరిలోనే న్యాయస్థానంలో చార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. క్విడ్ప్రో కోలో భాగంగా లింగమనేని రమేష్ కృష్ణా నది కరకట్టపై ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపైనా కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి మసిపూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేష్ మొదట్లో చెప్పారు. కానీ.. ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ, చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు. తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారని ప్రశ్నించేసరికి జవాబే లేదు. దాంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ప్రో కో కింద ఇచ్చారన్న దానిపై సీఐడీ అప్పట్లో ప్రధానంగా విచారణ జరిపింది. మళ్లీ ఇప్పుడు.. లింగమనేని రమేష్ ను టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి రాజ్యసభ జనసేన అభ్యర్థిగా ఎంపిక చేయడం, చంద్రబాబు కరకట్టపై నివాసం ఉంటున్న బంగ్లాను లింగమనేని తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనడంతో ఈ అంశానికి ప్రాధాన్యత చేకూరింది. ప్రభుత్వంతో లీజు(రెంటల్) అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు పేర్కొన్న లింగమనేని లింగమనేని, భార్య పేరిట రూ.213 కోట్ల ఆస్తులు» లింగమనేని రమేష్ తో పాటు ఆయన భార్య పేరిట రూ. 213.39 కోట్ల స్థిర, చరాస్తులున్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. లింగమనేని రమేష్ పేరిట బ్యాంకు ఖాతాలో రూ.86,138 నగదు, రూ.18,52,69,885 డిపాజిట్లు, షేర్లు, బాండ్లు రూపంలో రూ.28,41,73,849, మరో రూ.15,06,16,960లను తెలిసిన వారికి, బంధువులకు, సంస్థలకు వ్యక్తిగత రుణాలు లేదా అడ్వాన్సులుగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. రూ.6 లక్షల విలువ చేసే 13.18 గ్రాములు బంగారు ఆభరణాలతో కలిపి తన పేరిట మొత్తం రూ.62.07 కోట్లు చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. » భార్య లింగమనేని సుమన పేరిట బ్యాంకు ఖాతాలో రూ.2,38,958, డిపాజిట్లుగా రూ.8,27,59,056, షేర్లు, బాండ్ల రూపంలో రూ.11,75,22,500, బంధువులు, సంస్థలకు అడ్వాన్సు రూపంలో ఇచ్చినవి రూ.26,51,01,285లతో పాటు రూ.2.68 కోట్ల విలువ చేసే ఒక కిలో ఎనభై గ్రాముల బంగారు ఆభరణాలు, 11.433 కేజీల వెండి కలిపి.. సుమన పేరిట మొత్తం రూ.49.24కోట్ల చరాస్తులున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు.» ఇళ్లు, వ్యవసాయ భూములు వంటి స్థిరాస్తులుగా తన పేరిట రూ.8.46 కోట్లు ఆస్తులు ఉండగా.. భార్య సుమన పేరిట రూ.93.60 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. » తన పేరిట రూ.68.19 కోట్లు, భార్య సుమన పేరిట రూ.17.41 కోట్ల రుణాలు ఉన్నట్టు వెల్లడించారు. » తనపై వివిధ రకాల కేసులు 11 ఉన్నట్టు పేర్కొన్నారు. -
కేంద్రం లెక్క.. అవినీతి పక్కా!
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ అవినీతి మరోసారి బట్టబయలైంది. సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ వ్యయం సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాల బాగోతం బయటపడింది. సచివాలయం ‘శాశ్వత’ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చదరపు అడుగుకు రూ.20,439.58 వ్యయం చేస్తుంటే... గ్రిహ 4–స్టార్, ఎనర్జీ కన్సర్వేషన్ అండ్ సస్టెయినబుల్ బిల్డింగ్ కోడ్(ఈసీఎస్బీసీ)– 2024 ప్రమాణాలతో కట్టే కేంద్రప్రభుత్వ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్కు చదరపు అడుగుకు రూ.5,587.44 మాత్రమే కేంద్రం మంజూరు చేయడమే ఇందుకు నిదర్శనం.ఐఏఎస్, గ్రూప్–1 నుంచి గ్రూప్–డి, ఎన్జీవో క్వార్టర్స్కు చదరపు అడుగుకు రాష్ట్ర ప్రభుత్వం సగటున రూ.10 వేల నుంచి రూ.12 వేలు వ్యయం చేస్తుంటే.. గ్రిహ–4, ఈసీఎస్బీసీ–2024, ఎకో–నివాస్ సంహిత–2024 ప్రమాణాల ప్రకారం నిర్మించే రెసిడెన్షియల్ కాంప్లెక్స్కు చదరపు అడుగుకు రూ.3,945.39 మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ అంచనా వ్యయాన్ని ఇష్టారాజ్యంగా పెంచేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు 5.53 ఎకరాల్లో జీ+13 అంతస్తులతో 23.25 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 8 వేల మంది సిబ్బంది పని చేసేందుకు వీలుగా సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.1,299.08 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే సిబ్బందికి నివాస సదుపాయం కల్పించడం కోసం 17 ఎకరాల్లో 11 టవర్లలో 31.30 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు రూ.1,234.91 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏకీకృత సముదాయం (సీజీజీపీఓఏ), ఉద్యోగుల నివాస గహాల (జీపీఆర్ఏ) నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు. ఈ రెండు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ ద్వారా మొత్తం రూ.2,533.99 కోట్లు ఖర్చు చేయనుంది. రూ.4,350.42 నుంచి రూ.20,439.58 వరకు.. » రాజధాని అమరావతిలో సచివాలయం శాశ్వత భవనాలను డయాగ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో ఒక టవర్ మొత్తం ఐదు టవర్లను చంద్రబాబు సర్కార్ నిర్మిస్తోంది. ఇదే టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలకు అప్పగిస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. » 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ టెండర్లను చంద్రబాబు సర్కార్ రద్దు చేసి.. 2025లో మళ్లీ టెండర్లు నిర్వహించింది. మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది. » ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. ఈ భవనాలకు హై సైడ్ ఎలక్ట్రికల్ (విద్యుత్ సరఫరా), హెచ్వీఏసీ (హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ – వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది. » దాంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.6,671.31 కోట్లకు చేరుకుంది. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరింది. టవర్ల డిజైన్ల పనులను రూ.401.54 కోట్లకు పోస్టర్ పార్టనర్స్–హాఫీజ్ కాంట్రాక్టర్, జెనిసిస్ ప్లానర్స్కు అప్పగించారు. తాజాగా అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. » అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేఅవుట్లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే పనులను రూ.1057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే.. సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు ఇప్పటికే రూ.20,439.57కు చేరుకుంది.హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్తో భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ అమరావతిలో అధిక ధరలకు కాంట్రాక్టు పనులను సిండికేటు కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టి.. నీకింత నాకింత అంటూ ప్రభుత్వ పెద్దలు దోచుకుతింటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరింత పెరగనున్న అంచనా వ్యయం! » రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. » ఈ లెక్కన సచివాలయం శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో వేచి చూడాలని ఇంజినీరింగ్ నిపుణులు లెక్కలు వేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చి చేపట్టిన భవనాల నిర్మాణ వ్యయాన్ని దేశంలో ఎక్కడా లేని రీతిలో పెంచేసి దోచుకుతింటుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భిన్న వాతావరణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురవగా.. అనేక చోట్ల ఎండ, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 44.2, తణుకులో 43.9, ఇంకొల్లు, కూనవరంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మి.మీ, లావేరులో 64.5 మి.మీ. వర్షం కురిసింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాలతో పాటు పలు కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
బీచ్లు ఇక బార్లు.. తీరాల్లోనూ ‘సీ’సా చిందులు
సాక్షి, అమరావతి: బీచ్లలో ప్రశాంత వాతావరణన్ని చిదిమేసి, మందుబాబుల చిందులుగా మార్చేలా చంద్రబాబు ప్రభుత్వం బీచ్బార్ల ఏర్పాటుకు సన్నాహాలను వేగవంతం చేసింది. ప్రజాసంఘాల నుంచి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ బీచ్లలో మద్యాన్ని ఏరులై పారించేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను తొందరపెడుతోంది. ఇందుకోసం ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీచ్ బార్ల విధి విధానాలను ఎక్సైజ్ శాఖ సూత్రప్రాయంగా ఖరారు చేసింది. ఇందుకోసం ముసాయిదాను సైతం రూపొందించించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అన్ని రకాల మద్యంబీచ్ బార్లలో ఏయే కేటగిరీల మద్యం విక్రయిస్తారనే దానిపై ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. సాధారణ బార్లలో విక్రయిస్తున్న అన్ని రకాల మద్యం బీచ్ బార్లలో కూడా విక్రయిస్తారని తేల్చిచెప్పింది. బీచ్ బార్లలో కేవలం బీరు మాత్రమే విక్రయిస్తారని కొందరు చెబుతున్నది అవాస్తవమని ఎక్సైజ్ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ అంశంపై అధికారిక ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వనున్నట్టు పేర్కొన్నాయి. వైజాగ్, చీరాలలో తొలి దశలో 12 బార్లు వైజాగ్, చీరాలలో పైలట్ ప్రాజెక్టు కింద బీచ్ బార్లను ఏర్పాటు చేస్తారు. విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న బీచ్లలో ఏడు ప్రాంతాలను ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. దాంతోపాటు యారాడ బీచ్ వద్ద కూడా ఓ బీచ్ బార్ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నారు. చీరాలలోనూ నాలుగు ప్రాంతాల్ని గుర్తించారు. మొత్తం విశాఖపట్నం, చీరాలలో 12 చోట్ల బీచ్ బార్ల ఏర్పాటుకు అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. వాటిలో ఎన్ని చోట్ల బార్లు ఏర్పాటు చేయాలన్నది ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిర్ణయిస్తారని ముసాయిదాలో పేర్కొంది. విశాఖపట్నం, బాపట్ల జిల్లా ఎక్సైజ్ అధికారులతో చర్చించి ఎక్సైజ్ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది.జనవరి నాటికే ఇతర జిల్లాల్లోనూ..పైలట్ ప్రాజెక్టు మొదలు పెట్టిన రెండు మూడు నెలల్లోనే రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాల్లోనూ బీచ్ బార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పశి్చమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో అనువైన ప్రదేశాలపై నివేదిక రూపొందించాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి నాటికే రాష్ట్రంలో బీచ్ బార్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా రాష్ట్రంలో 974 కి.మీ. తీరప్రాంతాన్ని టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి వేదికగా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉందని స్పష్టమవుతోంది. -
రూ.కోటి పరిహారం ఇవ్వాల్సిందే : వైఎస్ జగన్
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి రూ.11,440 కోట్ల ప్యాకేజీని సాధించామని చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. ఈ ప్యాకేజీని ఉద్యోగుల వీఆర్ఎస్ అమలు కోసం ఉపయోగించారు. జీఎస్టీ బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు తీర్చడం కోసం వాడారు. అంతే తప్ప స్టీల్ ప్లాంటు నిర్వహణ కోసం గానీ.. ఉద్యోగుల బాగోగుల కోసం గానీ... ప్లాంట్లో భద్రతా ప్రమాణాల పెంపు కోసం గానీ ఉపయోగించలేదు.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కూడా ఇచ్చి మానవత్వం చూపాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. ఒకవేళ చంద్రబాబు నష్టపరిహారాన్ని ఇవ్వకుంటే... దేవుడి దయతో మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంలో కార్మికుల వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని.. ఇటువంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని హితవు పలికారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులతో పాటు బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. తాడేపల్లి నుంచి నేరుగా విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ తొలుత సెవెన్ హిల్స్ ఆస్పత్రి వద్దకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్లో దుర్ఘటన జరిగిన వెంటనే నాడు సీఎంగా ఉన్న తాను స్వయంగా వచ్చి దేశ చరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా బాధిత కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందజేయడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు వారి హక్కుగా వచ్చే మొత్తాన్ని.. ఈ ప్రభుత్వం ఏదో అదనంగా ఇస్తున్నట్లు ప్రకటించడం ధర్మమేనా? అని నిలదీశారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తామంటూ వచ్చిన లోకేశ్ మాట్లాడిన మాటలు వింటుంటే ఇటువంటి మనుషులు కూడా ఉంటారా? అని అనిపించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని కేంద్రాన్ని గట్టిగా కోరుతూ వైఎస్సార్ సీపీ హయాంలో రెండుసార్లు లేఖలు రాయడంతో పాటు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. తమ పోరాటం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయిందన్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత మీడియాతో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం ఉంటే మంచి చేయండి...విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ మెల్టింగ్ వర్క్షాప్లో జరిగిన ప్రమాదంలో ఇప్పటికే 9 మంది చనిపోయారు. వేర్వేరు ఆస్పత్రుల్లో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. దాదాపు 95 శాతం కాలిన గాయాలతో ఇంకా ఒక అన్న చికిత్స పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో మాట్లాడాల్సి వస్తోంది. ఇవాళ కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతున్నా. మానవత్వం ఏ మాత్రం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మంచి చేయండి. స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఎలా బతుకుతున్నారు? వారి పరిస్థితి ఎలా ఉంది? అనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2024 వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కార్మికులు ఎలా ఉన్నారు? ఇప్పుడు వారి పరిస్థితి టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది? అన్నది బేరీజు వేసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరం. ఈ ఘటనలో ఉద్యోగులు, కార్మికుల తప్పిదం ఏమాత్రం లేదు. లిక్విడ్ మెటల్ పొంగి బ్లాస్ట్ అయింది. అలా ఎందుకు జరిగిందంటే.. మిక్స్ సరిగ్గా చేయకపోవడం, రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడం, రా మెటీరియల్లో నాణ్యత లోపించడం కారణం. ఈ ప్రమాదంలో ఎక్కడా ఉద్యోగుల తప్పిదం లేదు. ఇలాంటి ఘటనల్లో మానవత్వం చూపించాల్సిన చోట... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరు మానవీయంగా లేదు. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. కిమ్స్ హాస్పిటల్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ రెండేళ్లల్లో 10 వేల మందికి పైగా తొలగింపు..మా ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిపి 28 వేల మంది పని చేయగా... ఈ రెండేళ్లలో ఏకంగా 10,500 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. వీఆర్ఎస్ ప్రకటించి బలవంతంగా 1,800 మందిపై ఒత్తిడి తెచ్చి తప్పించారు. మరో 2,500 మంది పదవీ విరమణ చేశారు. దీంతో ఈ రోజు సంస్థలో కేవలం 16 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ 16 వేల మంది ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. దేశంలోనే మొదటిసారి...విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. వారికి నాలుగున్నర నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. దేశంలో ఎక్కడా జరగని విధంగా తొలిసారిగా ఉద్యోగస్తుల జీతాలను ప్రొడక్షన్తో లింక్ పెట్టారు. అంటే ఉత్పత్తి ఆ స్థాయిలో ఉంటేనే జీతాలు... లేకపోతే లేదు అన్న నిబంధన ఈ రెండేళ్లల్లోనే వి«ధించారు. దేశంలో ఎక్కడా, ఏ సంస్థలో ఇలాంటి విధానం లేదు. ఉద్యోగుల క్వార్టర్లకు (నివాస గృహాలు) వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్తుకు కేవలం 50 పైసలు మాత్రమే వసూలు చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండేళ్లల్లో కరెంటు బిల్లు యూనిట్కు ఏకంగా రూ.8.50కి పెంచారు. ఆ విధంగా వారిపై ఒత్తిడి తెచ్చి క్వార్టర్లు ఖాళీ చేయించే కుట్ర చేశారు. ఉద్యోగులకు ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు.. నో బోనస్... నో మెడికల్ ఫెసిలిటీస్... నో హెచ్ఆర్ఏ... నో ఎల్టీసీ... నో లీవ్ ఎన్క్యాష్మెంట్... నో ఇన్సెంటివ్స్...! ఈ మాదిరిగా ఉద్యోగులు దారుణ పరిస్థితుల్లో పని చేస్తున్నారు.ఆ ప్యాకేజీ.. వీఆర్ఎస్, జీఎస్టీ బకాయిల కోసమే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి రూ.11,440 కోట్ల ప్యాకేజీని సాధించామని చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. ఈ ప్యాకేజీని కేవలం ఉద్యోగులకు వీఆర్ఎస్ అమలు కోసం ఉపయోగించారు. అదేవిధంగా జీఎస్టీ బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు తీర్చడం కోసం వాడారు. అంతే తప్ప స్టీల్ ప్లాంటు నిర్వహణ కోసం గానీ.. ఉద్యోగుల బాగోగుల కోసం గానీ... ప్లాంట్లో భద్రతా ప్రమాణాల పెంపు కోసం గానీ ఉపయోగించలేదు. ఏడాదైనా ఉద్యోగం ఇవ్వలేదు..బాధితుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం మానవీయంగా లేదు. నా పక్కనే.. భాగ్యశ్రీ అనే బాధితురాలు ఉంది. ఆమె తండ్రి పేరు పెంటయ్య. 14 నెలల క్రితం ఇక్కడే, ఇదే సంస్థలో ఈ మాదిరిగానే ప్రమాదం జరిగి పెంటయ్యన్న చనిపోయాడు. పెంటయ్యన్న ఎంప్లాయి నెంబరు 124185. ఆయన పర్మినెంట్ ఉద్యోగి. ఎస్ఎంఎస్–2లో మాస్టర్ టెక్నీషియన్గా (ఐడీ కార్డు చూపించారు) పని చేసేవారు. 2025 ఏప్రిల్ 1న ప్రమాదంలో ఆయన చనిపోయాడు. ఆయనకు కుమార్తె భాగ్యశ్రీతోపాటు ఇద్దరు కుమారులు నవీన్, ప్రసాద్ ఉన్నారు. వారి తండ్రి చనిపోయినప్పుడు పిల్లలు ఇద్దరికి నెలలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా చివరకు పరిహారం కూడా చెల్లించలేదు. ఇంకా దారుణంగా.. ఆ ఫైల్ పోయిందని అంటున్నారు. ఇంత నిర్దయగా ప్రభుత్వాలు వ్యవహరించడం ధర్మమేనా? అని అడుగుతున్నా. విశాఖపట్నంలోని కిమ్స్ హాస్పిటల్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ మీరిచ్చేదేమిటి... ‘బోడి’!ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో చంద్రబాబు సుపుత్రుడు లోకేశ్ మాటలు చూస్తుంటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.1.72 కోట్లు ఇస్తామని ఆయన చెబుతున్నాడు. ఇది ఉద్యోగులకు హక్కుగా రావాల్సిందే కదా...! అదనంగా నీవు ఏమిస్తున్నావని అడుగుతున్నా! ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్న్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్... అన్నీ కలిపి రూ.1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా రూ.25 లక్షలు ఇస్తుంది. ఇంకా ప్రధాని సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున వస్తుంది. ఇవన్నీ కలిపి రూ.1.72 కోట్లు అవుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సున్నా. మరి నువ్విచ్చేది ఏంది ‘బోడి’ అని అడుగుతున్నా. ఇది ధర్మమేనా? న్యాయమేనా?మా ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే..ఇకనైనా ఈ ప్రభుత్వం మానవత్వం చూపి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం కనుక ఇప్పుడు ఆ సహాయం చేయకపోతే.. బాధ పడకండి. కొంచెం ఓపిక పట్టండి. మా ప్రభుత్వం ఏర్పడగానే నెలలోపు ఆ సహాయం చేస్తాం. కోటి రూపాయలు చొప్పున పరిహారం ప్రతీ బాధిత కుటుంబానికి అందజేస్తాం. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఎంపీలు గొల్ల బాబూరావు, తనూజారాణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, మాజీ మంత్రులు అమర్నాథ్, పేర్ని నాని, బాలరాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, తలశిల రఘురాం, కుంభా రవిబాబు, పాలవలస విక్రాంత్, విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు కేకే రాజు, చిన్న శ్రీను, బొడ్డేటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, తిప్పల నాగిరెడ్డి, గణేష్, కంబాల జోగులు, అదీప్రాజ్, కరణం ధర్మశ్రీ, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, సమన్వయకర్తలు దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, మలసాల భరత్కుమార్, చింతాడ రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపింది మేమే...అప్పట్లో ఇదే ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తావన వస్తే మా ప్రభుత్వం గట్టిగా ఆపింది. ఆ మేరకు 2021 ఫిబ్రవరి 6న ప్రధానికి ఒక లేఖ రాశాం. ఏ రకంగా చేసి ఈ ప్లాంట్ను నిలబెట్టాలో అందులో చాలా వివరంగా ప్రస్తావించాం. అనంతరం నెల రోజుల తర్వాత 2021 మార్చి 9న మరో లేఖ (లేఖ ప్రతులను మీడియాకు చూపించారు) రాశాం. అలా మొత్తం రెండు లేఖలు రాశాం. ఆ తర్వాత 2021 మే నెలలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం (అసెంబ్లీ తీర్మానం మినిట్స్ కాపీని ప్రదర్శించారు) కూడా చేశాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం అన్యాయమని చెప్పాం. ఏ విధంగా మార్పుచేర్పులు చేస్తే స్టీలు ప్లాంట్ను గొప్పగా నిలబెట్టవచ్చో వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఈ మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి అన్ని వివరాలతో కేంద్రానికి పంపాం. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని, ప్రైవేటు చేతుల్లో మేనేజ్మెంట్ను పెట్టాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గట్టిగా కోరాం. ఏ చర్యలు తీసుకుంటే స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందనే విషయాన్ని కూడా పేర్కొంటూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశాం. అలా సంస్థను, ఉద్యోగులను కాపాడగలిగాం. అంతేకాకుండా 2022 నవంబరు 12న ప్రధాని విశాఖ వచ్చినప్పుడు జరిగిన సభలో.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ఆ సభలోనే ప్రధానిని కోరాం. మా పార్టీ అంత గట్టిగా నిలబడింది కాబట్టి, ఉద్యోగులకు తోడుగా నిలబడింది కాబట్టే సంస్థ ప్రైవేటీకరణ జరగలేదు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదుకున్నాం..గతంలో ఇదే విశాఖలో ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ వల్ల 14 మంది చనిపోతే మా ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించడమే కాకుండా, నేనే స్వయంగా ఇక్కడకు వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు కోటి చొప్పున ఇచ్చాం. గతంలో దేశంలో ఎక్కడా అలా జరగలేదు. ఆ కుటుంబాలకు తోడుగా నిలబడ్డాం. ఆ కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చూశాం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీరు చాలా దారుణంగా ఉంది. కార్మికులకు హక్కుగా రావాల్సినవే వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేయాలి. నాడు మా ప్రభుత్వంలో కార్మికులకు కోటి రూపాయలు ఇచ్చి ఎలా అండగా నిలబడ్డామో... అదే మాదిరిగా ప్రతీ ఉద్యోగికి మేం చేసి చూపించిన తరహాలోనే మీరూ చేయాలని అడుగుతున్నాం. వారికి హక్కుగా వచ్చే రూ.1.72 కోట్లతో పాటు అదనంగా మరో కోటి రూపాయలు ఇవ్వాలి. వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. నా పక్కనే ఉన్న పెంటయ్యన్న కుటుంబాన్ని కూడా అదే మాదిరిగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమికి చెబుతున్నాం. సంస్థ ప్రైవేటీకరణ వద్దంటూ మా మాదిరిగానే అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపి మీ చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేస్తున్నాం. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడుతారు. -
పొన్నూరులో టీడీపీకి భారీ షాక్
సాక్షి, తాడేపల్లి: పొన్నూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీలోకి వంద టీడీపీ కుటుంబాలు చేరాయి. పొన్నూరు ఇంఛార్జి అంబటి మురళీ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందన్నారు.రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని.. దేశంలో ఎక్కడాలేని అరాచకం, హింసాకాండ ఏపీలో జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘‘సమర్ధత కలిగిన పోలీసు అధికారులను పక్కన పెట్టారు. తమకు అనుకూలమైన పోలీసులతో ప్రత్యర్ధులను వేధిస్తున్నారు. అక్రమ కేసులు నిత్యకృత్యంగా మారాయి. అత్యంత దారుణమైన పాలనను ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపాలి. ప్రజల కోసం ప్రతి కార్యకర్త పని చేయాలి....పొన్నూరులో చట్టమే రౌడీయిజానికి పాల్పడుతోంది. పొన్నూరు ఎమ్మెల్యే అరాచకాలను జనం చూస్తున్నారు. మామిళ్లపల్లి ఘటనలో పోలీసుల తీరు జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయింది. అంబటి మురళి ఆధ్వర్యంలో గట్టిగా నిలబడిన పార్టీ కేడర్కి అభినందనలు. రానున్న రోజుల్లో మరింత గట్టిగా పోరాటం చేయాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
అమరావతిలో మరోసారి బయటపడ్డ ఏపీ ప్రభుత్వ దోపిడీ
న్యూఢిల్లీ: అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వ దోపిడీ మరోసారి బట్టబయలైంది. అమరావతిలో కేంద్ర ప్రాజెక్టులతో చంద్రబాబు బండారం బయటపడింది. అమరావతిలో కేంద్ర సర్కారు సెంట్రల్ కాంప్లెక్స్ను నిర్మించనుంది. అమరావతిలో కేంద్ర కార్యాలయాల నిర్మాణానికి చదరపు అడుగుకు 5,587 రూపాయలు మంజూరు చేసింది కేంద్రం. ఉద్యోగ నివాసాలకు చదరపు అడుగుకు రూ.3,945 నిర్ధారించింది. మొత్తం 23.25 లక్షల చదరపు అడుగులలో నిర్మాణం కోసం 1,299 కోట్ల రూపాయలు కేటాయించింది. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కోసం మొత్తం 31.3 లక్షల చదరపు అడుగులకు 1,235 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. చదరపు అడుగుకు 5 వేల రూపాయలలోపే ఖర్చు చేయనుంది.చంద్రబాబు సర్కార్ మాత్రం.. కేంద్ర సర్కారు అమరావతిలో ఇంత చవకగా బిల్డింగులు కడుతుంటే చంద్రబాబు సర్కార్ మాత్రం ఎందుకు చదరపు అడుగుకు 20 వేల ఖర్చు చేస్తుందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు చదరపు అడుగుకు 20 వేల రూపాయలపైనే ఖర్చు చేస్తోంది. కేంద్రం కట్టే బిల్డింగుల ఖర్చు కంటే చంద్రబాబు సర్కార్ ఆరు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోంది. -
ఎన్టీటీపీఎస్లో క్వార్టర్ల రగడ
సాక్షి, అమరావతి: డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో ఉద్యోగుల క్వార్టర్ల వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. ఉద్యోగులకు కేటాయించిన క్వార్టర్లను ఇతరులకు అద్దెకు ఇచ్చి, అద్దెకున్న వారిని ఇంకా ఖాళీ చేయించని ఉద్యోగులపై యాజమాన్యం కఠిన చర్యలు చేపట్టింది. సూచనలు చేసినప్పటికీ క్వార్టర్లు ఖాళీ చేయకపోవడంతో సంబంధిత ఉద్యోగులు క్వార్టర్ పూర్తిగా ఖాళీ చేసేవరకు అధిక అద్దె (పీనల్ రెంట్) చెల్లించాలని ఏపీ జెన్కో ఆదేశించడం ఉద్యోగుల్ని ఆగ్రహానికి గురిచేసింది. నిబంధనల ప్రకారం హెచ్ఆర్ఏకు రెండింతలుగా పీనల్ రెంట్ వసూలు చేయనున్నారు. ఈ మొత్తాన్ని సంబంధిత ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేయాలని యాజమాన్యం నిర్ణయించడం కలకలం రేపుతోంది. ఎందుకంత పంతం జెన్కో తీరును ప్రశ్నించే యూనియన్ నాయకుల పేర్లను సబ్ రెంట్ లిస్ట్లో పెట్టిన అధికారులు, వారికి అనుకూలంగా ఉన్న నాయకుల పేర్లు మాత్రం ఆ జాబితాలో చూపించడం లేదు. ట్రేడ్ యూనియన్లలో పని చేసి రిటైరైన వారు సైతం ఇంకా అక్కడే ఉంటున్నారు. ఆ క్వార్టర్లు కనీసం సబ్ రెంట్ లిస్టులో కూడా చూపించడం లేదని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొంతమంది ట్రేడ్ యూనియన్లలో పనిచేస్తున్న కారణంగా వారికి కేటాయించిన క్వార్టర్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని, ఖాళీ చేయించాలనే లిస్టులో అవి లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఎన్టీపీఎస్ కోసం నిత్యం కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అదే క్వార్టర్స్లో ఉంటూ వాటి బాగోగులు చూసుకుంటుంటే వారిని ఖాళీ చేయించాలంటూ ఏపీ జెన్కో ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడం వెనుకున్న కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు. కనీసం న్యాయ సలహా కూడా తీసుకోకుండా తాము చెప్పిందే న్యాయం, చేసేదే చట్టం అనేవిధంగా పరిపాలన విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారనే చెబుతున్నారు. సాధారణంగా ఇంటి యజమానులు పాటించే అద్దె చట్టాలను కూడా వారు పాటించడం లేదని, కేవలం తమ పంతం నెగ్గించుకోవడం కోసమే కాంట్రాక్ట్ కార్మికులను ఖాళీ చేయించాలని చూస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకే ఎందుకిలా ఏపీ జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్న కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్(ఆర్టీపీపీ), నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(ఎస్డీఎస్టీపీఎస్)లో ఈ సమస్య లేదు. అక్కడ జెన్కో ఇంజినీర్లు, అధికారుల క్వార్టర్లలో ఉద్యోగులు, సహ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, జెన్కో విశ్రాంత ఉద్యోగులు కూడా నివాసం ఉంటున్నారు. ఆ రెండుచోట్లా సబ్ రెంట్ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. ఎన్టీపీఎస్లో మాత్రం సబ్ రెంట్ పేరుతో వేధిస్తూ, ఇంటికి విద్యుత్, నీళ్లు కూడా కట్ చేస్తామంటూ రాతపూర్వకంగా హుకుం జారీ చేయడం అన్యాయం అని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కాలనీ క్వార్టర్స్ మరమ్మతుల పేరుతో రూ.2 కోట్లను పంచేసుకునేందుకు పరిపాలన అధికారులు, వెల్ఫేర్ అధికారులు, సివిల్ సిబ్బంది అంతా కలిసి బినామీ పేరుతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. -
రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల ఆమోదం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి టీడీపీ తరఫున చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, జనసేన తరఫున లింగమనేని రమేష్ దాఖలు చేసిన నామినేషన్లను ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి వెల్లడించారు. -
నేడు విశాఖకు వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించి, ధైర్యం చెప్పనున్నారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న వైఎస్ జగన్.. బుధవారం విశాఖకు చేరుకొని బాధితులను పరామర్శిస్తారని వైఎస్సార్సీపీ తెలిపింది. -
ఖజానాపై బాబు ప్రత్యేక విమానాల భారం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు తిరుగుతున్న విలాసవంతమైన ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోంది. ఇటీవల పొదుపు మాటలు చెప్పిన చంద్రబాబు.. ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు. జిల్లాల పర్యటనలకు, పక్క రాష్ట్రంలోని తన నివాసానికి, ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాలకు, చివరకు ఉండవల్లి నుంచి గన్నవరానికి కూడా ప్రత్యేక హెలికాప్టర్, విమానాలనే వినియోగిస్తున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దె చెల్లింపుల కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.54.63 కోట్లు కేటాయించింది. ఇందులో నుంచి తొలి త్రైమాసికానికి రూ.19.12 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.109.04 కోట్లు ఖర్చు చేసింది. 2024–25లో రూ.54.41 కోట్లు.. 2025–26లో రూ.54.63 కోట్ల వ్యయం చేసింది. -
ఐదు వర్కింగ్ గ్రూపులుగా స్పెషల్ పోలీస్!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగాన్ని పునర్వ్యవస్థీకరించే దిశగా పోలీసు శాఖ అడుగులు వేస్తోంది. బెటాలియన్లను ప్రత్యేక కేటగిరీలగా విభజించి వేర్వేరు విధులు, బాధ్యతలకు వినియోగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీఎస్పీ విభాగాన్ని ఐదు వర్కింగ్ గ్రూపులుగా విభజించేలా ముసాయిదా పత్రాన్ని రూపొందించింది. ఆ ప్రతిపాదనను పోలీసు శాఖ ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదించింది.ఆ ఐదు వర్కింగ్ గ్రూపులకు కేటాయించిన ప్రత్యేక అంశాలపై అధ్యయనం చేయించి ప్రతి వర్కింగ్ గ్రూపునకు ప్రత్యేక డిజైన్ రూపొందించాలని నిర్ణయించింది. అయితే.. కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టేది లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ఏపీఎస్పీ సిబ్బందితోనే కొత్త వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేసి సమర్థంగా విధులు నిర్వర్తించేలా అధ్యయనం చేయాలని పేర్కొంది. ఈ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తోంది. వర్కింగ్ గ్రూప్లు ఇలా ఏపీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్): రెండు ఏపీఎస్పీ బెటాలియన్లను ప్రత్యేకంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్గా ఏర్పాటు చేస్తారు. ఈ విభాగం ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో అల్లర్లను నిరోధించడం, భారీ జనసమీకరణతో జరిగే కార్యక్రమాల నిర్వహణ ప్రధాన బాధ్యతల్ని చూస్తుంది. కేంద్రంలోని సీఆర్పీఎఫ్ బలగాలు పనిచేసే రీతిలో ఈ విభాగానికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ యూనిట్: ప్రధాన ప్రభుత్వరంగ సంస్థలు, పోర్టులు, ఎస్ఈజెడ్లు, రిఫైనరీలు వంటి అత్యంత ప్రధానమైన ప్రభుత్వ ఆస్తులు, మౌలిక వ్యవస్థల భద్రతా విభాగం. అమరావతి పైలట్ ప్రాజెక్టుగా క్రిటికల్ ఇన్ఫ్రాస్టక్చర్ సెక్యూరిటీ యూనిట్ ఏర్పాటు చేస్తారు. స్పెషల్ ఆపరేషన్స్ ప్లాటూన్లు (ఎస్ఓపీ): శాంతిభద్రతల కోణంలో అత్యంత సున్నితమైన సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే స్పందించి నియంత్రించే విభాగం. ముందస్తు అరెస్టులు, నగరాలు, జాతీయ రహదారులపై తనిఖీలు, డ్రగ్స్ నియంత్రణ తదితర అంశాలు ఈ ప్లాటూన్ల పరిధిలోకి వస్తాయి. డిజాస్టర్ రెస్పాన్స్ కంపెనీలు: తుపాన్లు, వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు, ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయ, పునరావాస చర్యలు చేపట్టే బలగాలుగా ఈ విభాగాన్ని సిద్ధం చేస్తారు. కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ యూనిట్లు: ఆధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని భద్రతా విధులు నిర్వహించే విభాగంగా తీర్చిదిద్దుతారు. డ్రోన్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్రౌడ్ ఎనలిటిక్స్, మొబైల్ కమాండ్, సైబర్ కో–ఆర్డినేషన్ మొదలైన అంశాలు ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. -
కాపురాలు కూలిపోతున్నాయి
తాడేపల్లి రూరల్: ‘మాకున్న కొద్దిపాటి భూముల్లో ఆడపిల్లలకు కట్నం కింద కొంత రాసిచ్చాం. ఆ భూముల్ని రాజధాని కోసం బలవంతంగా తీసేసుకుంటున్నారు. దీనివల్ల మా బిడ్డల కాపురాలు కూలిపోతున్నాయి’ అని కొందరు రైతులు అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ‘మీకేంటండీ నెలనెలా జీతాలొస్తాయి. మాకు ఈ భూములే ఆధారం. ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే మా భూమి అమ్మడానికి రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మా పిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేసుకోవాలి’ అని మహిళా రైతులు నిలదీశారు. అమరావతి ముఖద్వారమైన ఉండవల్లిలో సీఆర్డీఏ అధికారులు భూసేకరణ కోసం మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఉండవల్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన గ్రామసభకు రైతులు ర్యాలీగా వెళ్లారు. తమ వ్యవసాయ భూములను ల్యాండ్ పూలింగ్, భూసేకరణ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ‘మా భూమి.. మా హక్కు’ అని నినదిస్తూ సభా ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత 29 గ్రామాల నుంచి ఉండవల్లి గ్రామాన్ని మినహాయించాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. 1990 ముందు నుంచే ఉండవల్లిలో పండే పంటలను, ఎగుమతులను, భూముల విలువను సీఆర్డీఏ అధికారులకు వివరించారు. కట్నం కింద రాసిచ్చాం పలువురు రైతులు మాట్లాడుతూ తమకున్న భూముల్లో కొంత ఆడపిల్లలకు కట్నం కింద రాసిచ్చామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల్లో కౌలు రూ.20 వేలకు మించి ఎక్కడా లేదని, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో మాత్రం రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు కౌలు వస్తుందని వివరించారు. ‘నాలుగు పంటలు పండే ఈ భూములను ఎలా తీసుకుంటారు? ఒకవేళ తీసుకుంటే అదే తరహాలో పంటలు పండే భూములను రైతులకు ఇవ్వాలని చట్టాలు చెబుతున్నాయి’ అని అధికారులకు వివరించారు. మహిళా రైతులు మాట్లాడుతూ ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే మా భూమి అమ్మడానికి రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మా పిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేయాలని నిలదీశారు. ‘రాజధాని ప్రకటించినప్పుడే ఉండవల్లి పంచాయతీ పాలకమండలి, తాడేపల్లి మండల పరిషత్ పాలకమండలి రాజధానికి భూములు ఇచ్చేదిలేదని నిర్ధారించాయి. రాజధాని 29 గ్రామాల్లో ఇక్కడున్న రైతులకు చాలామందికి పొలాలు ఉన్నాయి. ఆ పొలాలను మొదటి విడతలో పూలింగ్కు ఇచ్చాం. ఈ భూమి ఇవ్వలేదంటే అధికారులు అర్థం చేసుకోవాలి’ అని రైతులు కోరారు. పన్నెండేళ్లుగా ఏం అభివృద్ధి చేశారు ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చిన రైతులు మాట్లాడుతూ.. ‘మా భూములు ల్యాండ్ పూలింగ్కు ఇచ్చాం. మా గ్రామం అభివృద్ధి చెందలేదు. 12 సంవత్సరాలుగా గ్రామ పరిస్థితి దారుణంగా ఉంది. వెంటనే అభివృద్ధి చేయాలి. ఉండవల్లిలో ఎత్తిపోతల పథకంతో పాటు ఎందుకూ ఉపయోగపడని ప్రాజెక్టులు పెడుతున్నారు. మా గ్రామంలో టూరిజం ప్రాజెక్ట్ లేదా ఐటీ సంస్థలను ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్ చేశారు. రాజధాని అభివృద్ధి పేరుతో 12 ఏళ్ల క్రితం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కింద ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదంటూ స్థానిక ప్రజలు అధికారులను నిలదీశారు. ‘కొంతమందికి ఉండవల్లిలో గజాల కింద పొలాలు ఉన్నాయి. ఆ పొలంలో గజాల కింద 10–15 మంది ఉన్నాం. మాకు గజాల కిందే ప్లాట్లు ఇస్తామని చెప్పి అధికారులు మోసం చేశారు’ అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. సహకరించినా.. పంట నాశనం చేశారు గ్రామ సభ జరుగుతుండగా ఉండవల్లి గ్రామానికి చెందిన శిగిరిశెట్టి అనంతశివరావు కన్నీరు పెట్టుకుంటూ వచ్చి ‘సీడ్ యాక్సెస్ రోడ్డుకు సహకరిస్తానని చెప్పి 9.3 పత్రాన్ని అందజేశాను. దాన్ని ఆసరాగా తీసుకుని పొలంలో పంట ఉండగా దౌర్జన్యంగా కాంట్రాక్టర్లు కరెంటు స్తంభాలు తీసివేసి పైపులైన్లు పీకివేశారు’ అంటూ కాంట్రాక్టర్ల దౌర్జన్యాన్ని వీడియోలో చూపించారు. తన పొలంలో పైపుల్ని దౌర్జన్యంగా తొలగించి.. తనను పూర్తిగా నాశనమయ్యేలా చేశారని శిగిరిశెట్టి అనంత శివరావు కన్నీటిపర్యంతమయ్యారు. ఉండవల్లిలోని సీఆర్డీఏ కార్యాలయానికి రైతులు ఏ సమస్య మీద వెళ్లినా అక్కడ ఉన్న డిప్యూటీ కలెక్టర్ చులకన భావనతో మాట్లాడుతున్నారని, తమ భూములు తీసుకుంటూ మమ్మల్ని ఏసీలు వేసి కూర్చోబెట్టాలా అంటూ వెటకారంగా మాట్లాడి బయటకు వెళ్లాలంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెల్లి కాపురం చెడిపోయేలా ఉంది మా తల్లిదండ్రులకు మేం ముగ్గురం. ఇద్దరు అన్నదమ్ములం, ఒక చెల్లి. మా తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో ఒక ఎకరం మా చెల్లికి కట్నంగా ఇచ్చాం. అది రిజిస్ట్రేషన్ కావడం లేదు. వారి కాపురం చెడిపోయేలా ఉంది. రాజధానికి భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్లు ఆపి, బెదిరించి పొలాలు తీసుకుంటారా? మాకు వెంటనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చేసి మా ఆడపిల్లల కాపురాలు నిలబెట్టండి. – జొన్న సాంబశివరావు, రైతుఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలో అర్థం కావడం లేదు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత మా ఆడపిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేయాలో అర్ధం కావడం లేదు. మీతో మాట్లాడుతుంటే ఏడుపు వస్తోంది. ఆ భూమిని నమ్ముకుని ఇప్పటిదాకా జీవించాం. మా ఆడపిల్లలకు మీరు ఇచ్చే అరకొర భూమితో ఎలా పెళ్లిళ్లు చేయాలి. మీరు దయవుంచి మా భూములు వదిలివేయాలి. మీరు ఇచ్చే భూముల్లో వ్యవసాయం ఎలా చేయగలం? – శింగంశెట్టి అనుపమ, రైతుదేవదాయ రైతుల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి మా తాతలు, తండ్రుల కాలం నుంచి దేవదాయ భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాం. ఉన్నట్టుండి ఆ భూములను సీఆర్డీఏ అధికారులు దున్నేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని భూముల్ని ఇప్పటికే దున్నేశారు. దానివల్ల కౌలు రైతులం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. మాకూ రాజధానిలో బతికేందుకు అవకాశం కల్పించాలి. ఆ భూములను లాక్కుంటే ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలి? – దాసరి నాగరాజు, కౌలు రైతు ఉండవల్లిని విలన్గా చూపిస్తున్నారు ఉండవల్లిలో భార్యాభర్తలిద్దరూ ఒక ఎకరంలో వ్యవసాయం చేస్తే నెలకు రూ.60 వేలు సంపాదిస్తారు. కౌలు రైతు కూరగాయలు, పూలు, ఇతర పంటలు పండించి నెలకు రూ.45 వేలు సంపాదిస్తున్నాడు. ఏదో విజయవాడకు దగ్గరగా ఉందని పూలింగ్కు ఇవ్వనని అనడం లేదు. ఇక్కడ ఉన్న అర ఎకరం, ఎకరం భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాం. సమాజంలో ఉండవల్లిని రాజధానికి విలన్గా చిత్రీకరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు. రాజధాని నుంచి ఉండవల్లిని మినహాయించాలి. – జంగాల సాంబశివరావు, రైతుముందొక మాట.. తరువాత ఒక మాట రాజధాని వల్ల మా ఇంటిని కోల్పోయాం. మాకు సీడ్ యాక్సెస్ రోడ్లో 26 సెంట్లు ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్కు అవసరం అంటే మాకు గజాల్లో స్థలం ఇస్తామంటే మా భూమి ఇస్తామని చెప్పాం. ముందు ఇస్తామని చెప్పి ఇప్పుడు నాలుగు సెంట్లు ఇస్తామంటున్నారు. ఇప్పటికే వయసు పైబడి చేతులు వణుకుతున్నాయి. మా అన్నదమ్ములం, అక్కా చెల్లెళ్లం దానిపైనే ఆధారపడుతున్నాం. మాకు గజాల్లో స్థలం ఇప్పించండి. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం. – శ్రీనివాసరావు, రైతు -
ఆస్తి యాజమాన్య హక్కులను గ్రామ పంచాయతీలు తేల్చలేవు
సాక్షి, అమరావతి: భవన నిర్మాణ అనుమతుల మంజూరు విషయంలో గ్రామ పంచాయతీల అధికారంపై హైకోర్టు ముఖ్యమైన తీర్పును వెలువరించింది. అనుమతుల విషయంలో గ్రామ పంచాయతీలు సివిల్ కోర్టులాగా వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. లీగల్ నోటీసులను సాకుగా చూపి భవన నిర్మాణ దరఖాస్తులను తిరస్కరించడం చట్టవిరుద్ధమని, ఆ అధికారం గ్రామపంచాయతీలకు లేదని తేల్చిచెప్పింది. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసేటప్పుడు స్థానికసంస్థలు కేవలం దరఖాస్తుదారుడి ప్రాథమిక హక్కులను, ఆ ఆస్తి దరఖాస్తుదారుడి స్వాధీనంలో ఉందా? లేదా? అన్న అంశాలను మాత్రమే పరిశీలించాలంది. అంతేగానీ సివిల్ కోర్టుల్లా యాజమాన్య హక్కులను తేల్చే అధికారం వాటికి లేదని తేల్చిచెప్పింది. ఒక వ్యక్తి పంపిన లీగల్ నోటీసు ఆధారంగా ఓ భవననిర్మాణ అనుమతిని రద్దుచేస్తూ పంచాయతీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. తీర్మానం ఏకపక్షంగా ఉందంటూ దాన్ని రద్దుచేసింది. పిటిషనర్ జమాల్రెడ్డి వద్ద రిజిస్టర్డ్ సేల్డీడ్, ఇంటిపన్ను చెల్లించిన రశీదులున్నాయని, ఇవి ఆయనకు ఆ ఆస్తిపై ఉన్న ప్రాథమిక హక్కును నిరూపిస్తున్నాయని తెలిపింది. పిటిషనర్ ప్రస్తుతం భవనం నిర్మిస్తున్న చోటే నివాసం ఉన్నారని గుర్తుచేసింది. పిటిషనర్ నివాసం, పన్నులు చెల్లించిన విషయంతో పంచాయతీ అధికారులు విభేదించడంలేదని, ఇది అతడి ప్రాథమిక హక్కులను రూఢీ చేస్తోందని పేర్కొంది. భవననిర్మాణం కోసం జమాల్రెడ్డి పెట్టుకున్న దరఖాస్తును ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్ట నిబంధనల ప్రకారం పునఃపరిశీలించి 15 రోజుల్లో తగిన ఉత్తర్వులు జారీచేయాలని పంచాయతీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ‘భవన నిర్మాణానికి అనుమతిని నిరాకరించిన పంచాయతీ తీర్మానంపై పిటిషనర్కు ప్రభుత్వం వద్ద అప్పీల్ చేసుకునే ప్రత్యామ్నాయ అవకాశం ఉంది. అయితే పంచాయతీ నిర్ణయం ఏకపక్షంగా ఉన్నందున ఈ కోర్టే నేరుగా జోక్యం చేసుకుంటోంది.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.అనుమతి నిరాకరణపై హైకోర్టులో పిటిషన్ కర్నూలు జిల్లా సీతారామపురం గ్రామానికి చెందిన కాంటారెడ్డి జమాల్రెడ్డి 2009లో కొన్న స్థలంలో మట్టి ఇల్లు నిర్మించుకుని, పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. ఆయన మట్టి ఇంటిని కూల్చేసి భవనం నిర్మించుకోవాలనుకున్నారు. ఆ ఆస్తిపై యాజమాన్య వివాదం ఉందంటూ.. జమాల్రెడ్డికి ఆ స్థలం విక్రయించిన వ్యక్తి వారసులు పంచాయతీ కార్యదర్శికి లీగల్ నోటీసు పంపారు. ఈ లీగల్ నోటీసు ఆధారంగా గ్రామ పంచాయతీ 2025 డిసెంబర్ 24న జమాల్రెడ్డి ఇంటి నిర్మాణానికి అనుమతిని నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ జమాల్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. అనుమతుల వల్ల కొత్త హక్కులు రావు.. ఉన్నవి పోవు.. ‘భవననిర్మాణ అనుమతి ఇవ్వడం అనేది ఒక వ్యక్తికి కొత్తగా యాజమాన్య హక్కులను కల్పించదు. అలాగే మరొకరికున్న హక్కులను లాగేసుకోదు. ఒకవేళ ఆస్తిపై ఎవరికైనా నిజమైన అభ్యంతరాలుంటే వారు సివిల్ కోర్టును ఆశ్రయించి తేల్చుకోవాలి. అంతేతప్ప పంచాయతీలు సివిల్ కోర్టుల పరిధిని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. ఈ కేసులో జమాల్రెడ్డి స్థలం యాజమాన్యపు హక్కులపై అభ్యంతరం వ్యక్తం చేసినవారు కేవలం లీగల్ నోటీసు ఇచ్చారే తప్ప, ఇప్పటివరకు సివిల్ కోర్టులో కేసు దాఖలు చేయలేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
మాల్ కాజేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి కుట్ర
సాక్షి, అమరావతి: అవసరాల కోసం ఒక ప్రవాసాంధ్రుడు (ఎన్నారై) చేసిన అప్పులను ఆసరాగా చేసుకుని తన అనుచరుల ద్వారా చిలకలూరిపేటలో ఉన్న మాల్ని కాజేయాలనే కుట్రకు టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెరతీశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రవాసాంధ్రుడు మురళీమోహన్ భార్య కృష్ణప్రియతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ ఎన్నారై టీడీపీ కార్యకర్త అని, ప్రత్తిపాటు పుల్లారావు గెలుపు కోసం పనిచేశారని, అయినా ఎమ్మెల్యే ఈ దౌర్జన్యానికి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రవాసాంధ్రుల ఆస్తులను కాజేస్తుంటే ఏ ధైర్యంతో వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సమయంలో అప్పు చేస్తే, నాలుగేళ్లపాటు పట్టించుకోకుండా చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రవాసాంధ్రుడికి చెందిన చిలకలూరిపేటలోని మాల్ని చేజిక్కించుకోవాలనే కుట్రతో ఆ కుటుంబంపై వేధింపులు మొదలుపెట్టారని చెప్పారు. దీంతో ఎన్నారై మురళీమోహన్ భార్య కృష్ణప్రియ అమెరికా నుంచి వచ్చి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించినట్టు వెల్లడించారు. ఆమె బాధలను విన్న వైఎస్ జగన్ పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని చెప్పారు. కోర్టు తీర్పును అమలు చేయడం లేదు బాధిత ఎన్నారై మురళీమోహన్ భార్య కృష్ణప్రియ మాట్లాడుతూ.. ‘20 ఏళ్లుగా అమెరికాలో ఉద్యోగం చేసి కూడబెట్టిన సొమ్ముతో చిలకలూరిపేటలో ఒక మాల్ నిర్మించుకున్నాం. అందులో అత్యాధునిక టెక్నాలజీతో రెండు థియేటర్లు, బాంకెట్ హాల్, ఎల్రక్టానిక్ స్టోర్ని ఏర్పాటు చేశాం. కోవిడ్ సమయంలో వ్యాపారం లేని కారణంగా రూ.90 లక్షలు అప్పు చేశాం. దాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా మాల్ని పూర్తిగా మూతపడేలా చేశారు. రూ.90 లక్షల అప్పులు చేస్తే నాలుగేళ్లలో రూ.7.50 కోట్లు అయ్యిందన్నారు. ఆమొత్తం చెల్లించేందుకు ముందుకొచ్చినా మాల్ని అప్పగించేందుకు అంగీకరించడం లేదు. పైగా రూ.7.50 కోట్లు తీసుకుని పారిపోయారంటూ మా మామ ఫొటోలతో పాంప్లెట్లు ప్రింట్ చేసి ఊరంతా పంచి పెట్టి మా పరువును రోడ్డున పడేలా చేశారు. రైతుల సొమ్ము రూ.30 కోట్లు కాజేశామంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. మమ్మల్ని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోనివ్వాలని కోర్టు ఉత్తర్వులిచ్చినా పట్టించుకోవడం లేదు. ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడకొచ్చి కూర్చుంటారు. కళ్లముందు దౌర్జన్యాలు కనిపిస్తున్నా వారికేం సంబంధమే లేనట్టు వ్యవహరిస్తున్నారు. జనం థియేటర్లకు, మాల్కి రాకుండా రోడ్డుపై టెంట్ వేసి గుంపులుగా రౌడీలను మోహరించి అడ్డుకున్నా, సీసీ కెమెరాలను పగులగొట్టినా పోలీసులు పట్టించుకోలేదు. దీనిపై మాట్లాడటానికి నా భర్త మురళీమోహన్ చిలకలూరిపేట వస్తే డ్రగ్స్ కేసులు పెడతామని వేధించి వెనక్కి పంపించారు. వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామని బెదిరిస్తున్నారు. మాకు జరుగుతున్న అన్యాయంపై మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసి న్యాయం చేయాలని కోరాం. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, పార్టీ తరఫున న్యాయ సహాయం అందజేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు’ అని చెప్పారు. -
అటు మండే ఎండలు.. ఇటు పిడుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బుధవారం పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, పన్టీమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటొచ్చు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం 41–42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జైన్ తెలిపారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40–41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కాగా.. మంగళవారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 42.7 డిగ్రీలు, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 42.4, మన్యం జిల్లా భామినిలో 42.2, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 42, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, కాకినాడ జిల్లా పిఠాపురంలో 41.6, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెం 41.5 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మొక్కుబడి దరఖాస్తుతో భారీ మూల్యం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగంలో వైద్య విద్యపై చంద్రబాబు కుట్రపూరిత వైఖరి మరోమారు బట్టబయలైంది. ఏడాదిన్నరకుపైగా పిడుగురాళ్ల వైద్య కళాశాల నిర్మాణాన్ని ఆపేసిన చంద్రబాబు సర్కార్.. 2026–27లో 100 ఎంబీబీఎస్ సీట్లతో ఆ కళాశాలను ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. ఈ క్రమంలో కళాశాల అనుమతుల కోసం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు మొక్కుబడిగా దరఖాస్తు చేసి చేతులు దులిపేసుకుంది. ఫలితంగా పరిశీలన దశలోనే ఎన్ఎంసీ ఆ దరఖాస్తును తిరస్కరించింది.బోధనాస్పత్రి అందుబాటులో లేకపోవడం, కళాశాలలో వసతులు అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో అనుమతులు ఇవ్వలేమని ఎన్ఎంసీ మెడికల్ అసెస్మెంట్, రేటింగ్బోర్డ్ మంగళవారం పిడుగురాళ్ల కళాశాల ప్రిన్సిపాల్తో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపినట్టు తెలిసింది. కనీస మౌలిక వసతులు కల్పించడంలో సర్కారు అంతులేని నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు 100 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయే దుస్థితి నెలకొంది.నిర్మాణం గాలికొదిలేసిన బాబు సర్కారు» రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి చేరువలో ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, మన విద్యార్థుల వైద్య విద్య కల సాకారం కావాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.8,500 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వెనుకబడిన పల్నాడు ప్రాంతం కోసం పిడుగురాళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టారు.» పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో రూ.500 కోట్లతో అధునాతన వసతులతో కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణాన్ని అప్పట్లోనే ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల నాటికి దాదాపు రూ.300 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. పిడుగురాళ్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 330 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడానికి అనుమతులు ఇచ్చారు.» కళాశాలకు అనుమతులు రాబట్టాలంటే తొలుత బోధనాస్పత్రి అందుబాటులో ఉండాలి. ఈ నేపథ్యంలో 2024లోనే బోధనాస్పత్రి నిర్మాణం కూడా పూర్తి చేశారు. మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులకు తరగతుల నిర్వహణకు వీలుగా కళాశాల, హాస్టల్స్, ఇతర నిర్మాణాలను మెజార్టీ శాతం నిర్మించేశారు. » 2024 ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు.. ప్రభుత్వ కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వైద్య కళాశాలల నిర్మాణం నిలిపేశారు. ఏకంగా 19 నెలలు ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేసి.. 2026–27 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల కోసం దరఖాస్తు గడువు ముగుస్తున్న సమయంలో మొక్కుబడిగా దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిని బోధనాస్పత్రిగా చూపించారు. » దీంతో ‘కళాశాల – బోధనాస్పత్రి మధ్య 34 కిలోమీటర్ల దూరం ఉంది. కళాశాల ఇంకా నిర్మాణంలోనే ఉంది. కీలకమైన సదుపాయాలు లేకుండా కళాశాలకు అనుమతులు ఇవ్వలేం’ అంటూ ఎన్ఎంసీ దరఖాస్తును తిరస్కరించింది. చంద్రబాబు ప్రభుత్వం కళాశాల నిర్మాణం కొనసాగించి, ఆ ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభించి ఉంటే ఏకంగా 150 ఎంబీబీఎస్ సీట్లు రాబట్టకునే ఆస్కారం ఉండేది. ఇది ఇష్టం లేకే ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యం వహించిందని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది. » గతేడాది పాడేరు కళాశాలకు అదనంగా 50 ఎంబీబీఎస్ సీట్లను రాబట్టడంలోనూ ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఎన్ఎంసీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను తేలికగా తీసుకుని వదిలేయడంతో సీట్ల పెంపు దరఖాస్తును ఎన్ఎంసీ తిరస్కరించింది. పీపీపీలో ప్రభుత్వ కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం చేస్తున్న కుట్రలతో రెండేళ్ల బాబు పాలనలో ఏకంగా 2,450 సీట్లను విద్యార్థులు కోల్పోయారు. -
తోతాపురికి 'ఉరి'!
రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు వ్యవసాయాన్ని దండగమారి పనిగా మార్చేసింది. రైతులను సాగుకు దూరం చేస్తోంది. వ్యాపారులు, దళారులకు మాత్రమే లాభాలొచ్చేలా వారికి అనుకూల చర్యలు తీసుకుంటోంది. చెప్పే మాటలకు, ఇచ్చే హామీలకు ఆచరణలో ఎక్కడా పొంతన లేకుండా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకుండా చేసింది. తోతాపురి రైతులకు గత ఏడాది చుక్కలు చూపించి, పంటను రోడ్డుపాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఈ ఏడాదీ అదే వైఖరిని అవలంబిస్తోంది. ఫలితంగా తమది దళారీ మద్దతు ప్రభుత్వం అని చాటుకుంటోంది. సాక్షి, అమరావతి: తోతాపురి మామిడి రైతులు మరోసారి చంద్రబాబు ప్రభుత్వం చేతిలో మోసపోయారు. గతేడాది కూడా సర్కారు నిర్లక్ష్యం వల్ల రవాణా చార్జీలు కూడా గిట్టుబాటు కాక రైతులు మామిడి కాయలను రోడ్లపై పారబోసి వెళ్లడం తెలిసిందే. ఈ ఏడాది కూడా తోతాపురి రకం మామిడి రైతులకు ప్రభుత్వం మొద్దు నిద్ర శాపంగా మారింది. నిజంగా మేలు చేసే ఆలోచన ఉంటే.. గతేడాది ఎదురైన అనుభవాలు పునరావృతం కాకుండా సీజన్ రాక ముందు నుంచే తగిన కార్యాచరణతో ముందుకెళ్లేది. పంట కోతకొచ్చే వేళ రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేది. కానీ రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని పైకి చెబుతూ ఆచరణలో మాత్రం దళారీలు, వ్యాపారులకు కొమ్ముకాస్తూ సంక్షోభంలో ఉన్న రైతులను గాలికొదిలేయడం పరిపాటిగా మారింది. ప్రస్తుత రబీ సీజన్లో ఇప్పటికే శనగ, మొక్కజొన్న, అరటి, పొగాకు రైతులు మద్దతు ధర లేక, కొనే వారు లేక తీవ్ర నష్టాల పాలై అప్పుల ఊబిలో కూరుకుపోయారు. విలవిల్లాడుతున్న వీరిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. ఇదే క్రమంలో తోతాపురి మామిడి రైతుల జీవితాలతో కూడా చలగాటమాడుతోంది. ఈ ఏడాది కూడా ధర లేక, కొనేవారు ముందుకు రాక.. తీవ్రంగా నష్టపోతున్న తోతాపురి రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సిండికేట్గా మారిన గుజ్జు ఫ్యాక్టరీల దోపిడీకి అడ్డుకట్ట వేయకుండా వారికి వంతపాడడంతో తోతాపురి రైతులు మరోసారి నష్టాలపాలవుతున్నారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆశించిన దిగుబడులు రాక ఓ వైపు సతమతమవుతూనే, మరో వైపు అరకొరగా చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మార్కెట్లో టన్ను రూ.7 వేలు ధర పలుకుతుందని ప్రభుత్వం చెబుతుండగా, క్షేత్ర స్థాయిలో ర్యాంపుల వద్ద టన్ను రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్య మాత్రమే ధర పలుకుతోంది. పంట కొనుగోలుకు మెజార్టీ ఫ్యాక్టరీలు ముఖం చాటేస్తుంటే.. మరికొన్ని ఫ్యాక్టరీలు రైతుల నుంచి సేకరించే మామిడికి ఎంత ధర చెల్లిస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. గతేడాది పోరుబాట రాష్ట్రంలో దాదాపు 9 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతుండగా, ఈ ఏడాది 45 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అకాల వర్షాలు, ఈదురు గాలుల ప్రభావంతో కనీసం 30 లక్షల టన్నుల దిగుబడులు కూడా రాలేదని చెబుతున్నారు. హెక్టార్కు 10–15 టన్నులకు మించి రాలేదని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది తీవ్రమైన మంచుతో మంగు తెగులు వ్యాపించి, సీజన్లో బంగినపల్లితో సహా అన్ని రకాల టేబుల్ కాయలకు (కవర్ తొడిగిన కాయలు తప్ప) ధర లేకుండా పోయింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 2.20 లక్షల ఎకరాల్లో తోతాపురి మామిడి సాగవుతోంది. ఈ ఏడాది తోతాపురి దిగుబడులు 7.80 లక్షల టన్నులకుపైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లో గతేడాది మామిడి కాయలు కొనేందుకు గుజ్జు పరిశ్రమలు పూర్తిగా ముఖం చాటేయడంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారు. 2023–24 సీజన్లో టన్ను రూ.25–30 వేల మధ్య పలికిన టేబుల్ రకం తోతాపురికి గతేడాది టన్ను రూ.4–5 వేలకు మించి దక్కలేదు. దీంతో రైతులు రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. వేలాది టన్నుల మామిడిని రోడ్లపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీల ఎదుట ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. మరోవైపు మామిడి రైతులకు అండగా వైఎస్సార్ సీపీ, రైతు సంఘాలు పోరుబాట పట్టాయి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారు పాళ్యం మామిడి మార్కెట్కు వెళ్లి బాసటగా నిలవడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. చివరికి టన్ను రూ.12 వేల చొప్పున కొనిపిస్తామని నమ్మబలికింది. కానీ ఈ ధరకు కొనేందుకు ఫ్యాక్టరీలు ముందుకు రాకపోవడంతో చేసేది లేక కనీసం టన్నుకు రూ.8 వేలు ఇవ్వాలని, మిగిలిన రూ.4 వేలు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందజేస్తుందని చెప్పింది. ప్రభుత్వాదేశాలను పట్టించుకోని ఫ్యాక్టరీలు టన్నుకు రూ.4–6 వేల ధరతోనే కొనుగోలు చేశాయి. టన్నుకు రూ.4 వేల చొప్పున ఇచ్చేందుకు రూ.260 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టిన ప్రభుత్వం చివరికి నాలుగు నెలల తర్వాత రూ.173 కోట్లతో సరిపెట్టింది. కానీ కంపెనీల నుంచి రైతులకు దాదాపు రూ.300 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిల కోసం ఎన్నిసార్లు వినతులిచ్చినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. గతేడాది ప్రభుత్వ నిర్వాకం కారణంగా వేలాది ఎకరాల్లో మామిడి తోటలను రైతులు స్వచ్ఛందంగా తొలగించేశారు.ఈ ఏడాదీ అదే తీరుకనీసం ఈ ఏడాదైనా తమ తలరాత మారుతుందని దాదాపు 60 వేల మంది తోతాపురి మామిడి రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. సిండికేట్గా మారిన ఫ్యాక్టరీలతో చంద్రబాబు సర్కార్ కుమ్మక్కైంది. మంత్రులతో పాటు ఆయా జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు వారు అడిగినంత ముట్టజెప్పడంతో ఏ ఒక్కరూ నోరు మెదపని పరిస్థితి నెలకొంది. సమీక్షలు కూడా మొక్కుబడి తంతుగా మారాయి తప్ప రైతులకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఫలితంగా ఈ ఏడాది కూడా తోతాపురికి మార్కెట్లో ధర లేకుండా పోయింది. దీంతో పక్వానికి వచ్చిన పండ్లను ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలో 44 గుజ్జు ఫ్యాక్టరీలుండగా, ప్రస్తుతం కేవలం ఏడు ఫ్యాక్టరీల్లో మాత్రమే ప్రాసెసింగ్ ప్రారంభమైంది. కనీసం టన్నుకు రూ.20 వేలు చెల్లిస్తే కానీ గిట్టుబాటు కాదని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది కేంద్రం టన్నుకు రూ.14.80 వేలు ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించింది. పెరిగిన ఖర్చులను దృష్టిలో పెట్టుకొని గతేడాది మద్దతు ధర రూ.12 వేలకు మరో రూ.4 వేలు కలిపి ఈసారి రూ.16 వేలకైనా ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తాయని రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ క్షేత్ర స్థాయిలో ర్యాంపుల వద్ద టన్నుకు రూ.3–5 వేల మధ్య చెల్లిస్తుండగా, ఫ్యాక్టరీలు మాత్రం రూ.5–6 వేలకు మించి కొనే పరిస్థితి కన్పించడం లేదు. ఫ్యాక్టరీ వద్ద వందలాది మామిడిలోడులతో కూడిన వాహనాలు బారులు తీరాయి. ఈసారి టోకెన్ విధానం తీసుకురావడంతో పాటు కూటమి నేతల సిఫార్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టోకెన్తో తీసుకెళ్లినా మూడు నాలుగు రోజులకు కానీ అన్ లోడింగ్ చేయడం లేదు. పైగా అర టన్ను నుంచి టన్ను కాయలను నాణ్యత లేమి సాకుతో పక్కకు తోసేస్తున్నారు. సామాన్య రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. టోకెన్ల కోసం వారు పడే పాట్లు వర్ణానాతీతం. వాస్తవానికి గతేడాది గుజ్జు నిల్వలున్నాయనే సాకుతో కొనుగోలు చేయలేదు. కానీ ఈ ఏడాది ఏ ఒక్క ఫ్యాక్టరీ వద్ద గుజ్జు నిల్వలు 10–15 శాతానికి మించి లేవు. పశ్చిమాసియా దేశాల యుద్ధాన్ని సాకుగా చూపి రైతులను దెబ్బ తీయాలని చూస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో మామిడి గుజ్జు పరిశ్రమ గేటు బయట పడిగాపులు కాస్తున్న రైతులు తమిళనాడులోని క్రిష్ణగిరిలో టన్నుకు రూ.6 వేలు ధర పలుకుతుండగా, ఏపీలో మాత్రం ఫ్యాక్టరీలకు ఆర్డర్లు రావడం లేదని సాకులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలను పూర్తి స్థాయిలో తెరవకుండా ధరలను మరింత తగ్గించేలా కుట్ర పన్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 35 ఫ్యాక్టరీలుంటే 5 ఫ్యాక్టరీలే ప్రస్తుతం మామిడిని కొనుగోలు చేస్తున్నాయి. ఎగుమతి రకాలకూ ధర లేని పరిస్థితిఎగుమతి రకాలకు సైతం ఈ ఏడాది ధర లేదు. రాయలసీమ జిల్లాల్లో తోతాపురి తర్వాత ఎక్కువగా సాగయ్యే బేనీషా రకానికి టన్నుకు రూ.15–25 వేలు లభిస్తుండగా, కవర్లు కట్టిన కాయలకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు దక్కుతోంది. అల్ఫోన్సో, కాదర్, మల్లిక రకాలు టన్ను రూ.25–35వేలు పలుకుతుండగా, కాలేపాడు రకానికి రూ.30–40 వేల మధ్య ధర పలుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగులో ఉన్న బంగినపల్లి రకాలకు సైతం ఈసారి ధర లేని పరిస్థితి నెలకొంది. 2023–24లో టన్ను గరిష్టంగా రూ.50–60 వేల మధ్య పలికిన బంగినపల్లి రకాలకు గతేడాది రూ.30–35 వేలు పలుకగా, ఈ ఏడాది కేవలం రూ.15–20 వేలకు మించి పలకడం లేదు.సంక్షోభంలో శనగ, మొక్కజొన్న, అరటి, పొగాకు రైతులుమంచి దిగుబడినిచ్చే రబీ పంటలలో శనగ రైతులు 7 లక్షల టన్నులు ఉత్పత్తి చేశారు. 2023–24 మార్కెటింగ్ సీజన్లో క్వింటా రూ.8 వేలకు పైగా అమ్ముకుంటే ఈ ఏడాది రూ.5 వేలు కూడా దక్కలేదు. మొక్కజొన్న రైతులు 42 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తే కనీస మద్దతు ధర రూ.2,400 చొప్పున దక్కాల్సి ఉండగా, మార్కెట్లో రూ.1,400–1,600 మధ్య తెగనమ్ముకున్నారు. ఫలితంగా క్వింటాకు రూ.800 నుంచి రూ.1,000 మేర నష్టపోయారు. అరటి రైతులు 88 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తే టన్ను రూ.5 వేలకు మించి పలకలేదు. పొగాకు రైతులు 266 మిలియన్ కేజీలు ఉత్పత్తి చేస్తే 2023–24 మార్కెటింగ్ సీజన్లో సగటున కిలో రూ.288 ధర లభిస్తే, ప్రస్తుతం రూ.235కు మించి లభించలేదు. సీఎం సొంత జిల్లా.. అయినా ఏం లాభం?మామిడికి ఎందుకు మద్ధతు ధర ఇవ్వడం లేదు? కనీసం కేజీకి రూ.10 అయినా ఇచ్చి ఉంటే కొంచెం ఊరటగా ఉండేది. పురుగు మందులు, ఎరువుల ధరలు బాగా పెరిగాయి. ఫ్యాక్టరీకి వస్తే.. కాయలు దింపడానికి మూడు రోజులు పడుతోంది. నిద్రలేక ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. సీఎం పది రోజులకు క్రితం జిల్లాకు వచ్చారు. పరిస్థితి తెలుసుకున్నా చర్యలు తీసుకోలేదు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. సీఎం సొంత జిల్లాగా ఉండి ఏం ప్రయోజనం? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కేజీ రూ.15కు తగ్గలేదు. – యుగంధర్రెడ్డి, పెద్దమిట్టపల్లి, చిత్తూరు జిల్లాసిఫార్సులుంటే టోకెన్లునాలుగు సార్లు మందులు కొట్టాలి. ఎరువులు వేయాలి. పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. కోతకొచ్చే సరికి కోత కూలి, ట్రాక్టర్ బాడుగ రూ.10 వేలు అవుతోంది. ఇదిపోను అన్ లోడింగ్కు రూ.500 ఇవ్వాలి. చివరకు రైతుకు ఒరిగింది ఏమీలేదు. దీంతోపాటు ఫ్యాక్టరీల వద్ద రాజకీయం జరుగుతోంది. సిఫార్సులుంటేనే టోకెన్లు ఇచ్చి, ట్రాక్టర్ను లోపలికి పంపిస్తున్నారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నమెంటే మేలు. అప్పుడు తోతాపురి మామిడి కేజీకి రూ.15పైనే వచ్చింది. – సురేంద్ర, గంగిరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లారైతులు బాగుపడే పరిస్థితి లేదు ఏ రోజు బండి ఆరోజు అన్లోడ్ కావడం లేదు. టోకన్లు తీసుకున్న బండ్లు అన్ లోడింగ్కు మూడు రోజులు పడుతోంది. దొంగచాటుగా వచ్చే బండ్లను నేరుగా ఫ్యాక్టరీ లోపలికి పంపిచేస్తున్నారు. ఇక్కడ వాళ్ల ఇష్టారాజ్యంగా మారింది. ధరలు చూస్తే కడుపు మండుతోంది. గతేడాది రూ.4 ఇచ్చారు. ఈసారి అది కూడా లేదు. ఇక రైతు అనే వాడు బాగుపడడు. – ఉదయ్, జీడీ నెల్లూరు, చిత్తూరు జిల్లాప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలిఇప్పటికే రబీ సీజన్లో శనగ, మొక్కజొన్న, అరటి, పొగాకు రైతులు మద్దతు ధర దక్కక తీవ్రంగా నష్టపోయారు. తాజాగా తోతాపురి మామిడి రైతులు కూడా మరోసారి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని మామిడి రైతులకు న్యాయం చేయాలి. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలి. దిగుబడి లేక నష్టపోయిన రైతులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలి. రైతుల సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలి. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్మామిడి బోర్డు ఏర్పాటు చేయాలితోతాపురి మామిడిని ర్యాంపుల వద్ద టన్ను రూ.5 వేలు, ఫ్యాక్టరీల వద్ద రూ.6 వేలకు మించి కొనడం లేదు. టన్నుకు రూ.18 వేలు, బంగినపల్లి రకానికి టన్నుకు రూ.25 వేలు చొప్పున మద్దతు ధర ప్రకటించి, చట్టబద్ధత కల్పించాలి. మద్దతు ధర కంటే తక్కువగా కొనుగోలు చేసే ఫ్యాక్టరీలు, వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలి. మామిడి రైతులకు శాశ్వత రక్షణ కల్పించేందుకు, మార్కెటింగ్, ఎగుమతులను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా ‘మామిడి బోర్డ్‘ ఏర్పాటు చేయాలి. దానికి తగిన నిధులు కేటాయించాలి. వైపరీత్యాలతో నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధ్దరించాలి. – గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి -
చంద్రబాబు వెన్నుపోటుపై నిరసనాగ్రహం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాలను మోసం చేసిన వైనంపై వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’లో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో టౌన్హాల్ సదస్సులు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సదస్సులను విజయవంతం చేశారు. చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సదస్సుల్లో యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు విశేషంగా పాల్గొని చంద్రబాబు వెన్నుపోటుపై విరుచుకుపడ్డారు. సదస్సులు, రౌండ్టేబుల్ సమావేశాల ప్రాంగణాల్లో ఫొటో ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేశారు. సదస్సుల అనంతరం నల్లబెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. » ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శిలో ఒంగోలుపార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. నల్లబెలూన్లు ఎగరేసి నిరసన తెలిపారు. గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, అద్దంకిలో నియోజకవర్గ ఇన్చార్జి చింతలపూడి అశోక్కుమార్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. » పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, పాలకొల్లులో నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ ఇన్చార్జి వడ్డి రఘురామ్నాయుడు, ఉండి పెదఅమిరంలో జిల్లా ఉపాధ్యక్షుడు పెన్మత్స ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించారు. » తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడిలో కో–ఆర్డినేటర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. » డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వైఎసాŠస్ర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పాల్గొన్నారు.మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో అమలాపురంలో సదస్సు నిర్వహించారు. పార్టీ నేతలు పినిపే శ్రీకాంత్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు, మాజీ ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో సమావేశం నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గం పల్లిపాలెంలో వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. » కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో కూటమి మోసాలపై ర్యాలీ, సదస్సు నిర్వహించారు. పెద్దాపురంలో నియోజకవర్గ కో– ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి సదస్సులో పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో, కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. » శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, శ్రీకాకుళం, పాతపట్నంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’సదస్సులు నిర్వహించారు. » విజయనగరం జిల్లా బొబ్బిలిలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పాల్గొన్నారు. పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. » విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విశాఖ తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు, యలమంచిలిలో మాజీ ఎమ్మెల్యే, కరణం ధర్మశ్రీ నిర్వహించిన సదస్సులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. » అనంతపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, కళ్యాణదుర్గం రోడ్డులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి, కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య, హిందూపురంలో సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించారు. » కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్, బనగానపల్లె, ఆళ్లగడ్డ, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికెర, పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.» తిరుపతిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, మాజీ మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు నల్లదుస్తులు ధరించి రోడ్డుపై బైఠాయించారు. » శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలులో ర్యాలీని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. » కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నేతలు నల్ల బెలూన్లు వదిలి వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. » పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మాచర్లలో నల్ల బెలూన్లు ఎగుర వేసి నిరసన తెలిపారు. నరసరావుపేటలో వైఎస్సార్సీపీ ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఈయం.స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. టీడీపీ గూండాలు నిర్వహించిన దాడులపై గుంటూరులో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా ఇందులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు తదితరులు పాల్గొని నల్ల రిబ్బన్లు ఎగురవేశారు. గుంటూరు నగర శివారు గోరంట్లలో వైఎస్సార్సీపీ విజయవాడ, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బి.కిరణ్కుమార్ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను ఎగురవేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పక్కన ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తదితరులు -
ఉండవల్లి సీఆర్డీఏ గ్రామసభలో గందరగోళం
గుంటూరు: రాజధానికి భూములు ఇచ్చే లేదంటూ ఉండవల్లి రైతులు తెగేసి చెప్పారు. తమ భూములు లాక్కోవద్దని, తాము భూములు ఇవ్వమంటూ స్పష్టం చేశారు. భూసేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించాలని రైతులు కోరారు. ఈ మేరకు ఉండవల్లిలో నిర్వహించిన సీఆర్డీఏ గ్రామసభలో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని రాజధాని పరిసర ప్రాంతాల్లో వినిపిస్తున్నమాట ఇదే. అంతకుముందు కూడా ఇదే జరిగింది. గత నెలలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లులో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించగా అక్కడ కూడా అధికారులకు చుక్కెదురైంది. ఈ గ్రామ సభకు హాజరైన రైతులు.. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ను నిలదీశారు. మాకే ఎందుకిలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదన్నారు. తమకు డెవలప్ చేయని ప్లాట్లు ఇస్తున్నారని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. లోన్ కోసం బ్యాంకులకు వెళ్తే అవి పనికిరావని చెబుతున్నారని, తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. -
‘అది మా 28 ఏళ్ల కష్టం.. కబ్జా చేయడానికి చూస్తున్నారు’
తాడేపల్లి: కూటమి నేతల దౌర్జన్య కాండపై ఓ ఎన్ఆర్ఐ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ 28 ఏళ్ల కష్టాన్ని దోచుకోవడానికి అధికార పార్టీ నేతలు చూస్తున్నారని ఎన్ఆర్ఐ మురళి కుటుంబం.. వైఎస్సార్సీపీని ఆశ్రయించింది. దీనిలో భాగంగా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎన్ఆర్ఐ మురళీ భార్య కృష్ణకుమారి మీడియాతో మాట్లాడారు. ‘ 28 ఏళ్లుగా సంపాదించిన డబ్బుతో కాంప్లెక్స్ కట్టాం. సినిమా థియేటర్లు, మాల్స్ మేము నిర్మించాం. మా మాల్ ని ఆపేశారు. 90 లక్షలు మేము దాని కోసం అప్పులు చేశాం. మేము మోసం చేసామంటూ తప్పుడు ప్రచారం చేశారు. మా మాల్ చుట్టూ టెంట్లు వేసి, జనాన్ని పెట్టి బెదిరిస్తున్నారు. మేము పోలీసులు కి ఫిర్యాదు చేస్తే తిరిగి మాపై కేసు పెట్టారు. కోర్టు భద్రత కల్పించమని ఆదేశించినా పట్టించుకోవడం లేదు. మాకు పోలీసులు, ఎమ్మెల్యే, ప్రభుత్వం ఎవ్వరు రక్షణ ఇవ్వడం లేదు. ఎన్ఆర్ఐలకి ప్రభుత్వం ఇచ్చే సందేశం ఇదేనా?, దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన మద్దతు లేకపోతే ఇది జరుగుతుందా?, మా ప్రభుత్వం లో ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2024, ఆగస్టు 4వ తేదీన ఎమ్మెల్యేకి చెప్పాము. వాళ్లంతా కుమ్మక్కై ఇదంతా చేస్తున్నారు. ఆ మాల్ని లాక్కోవాలని చూస్తున్నారు. నా భర్త దీనికోసం పోరాడుతున్నందుకు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన మీద డ్రగ్స్ కేసులు పెడతామని బెదిరించారు. చిలకలూరిపేటలో అడుగు పెడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ‘ కూటమిలో నేతలు నీచ, నికృష్టంగా ఉన్నారు. విపరీతంగా దోపిడీ, అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములు కబ్జా చేస్తున్నారు. చిలకలూరిపేటలో ఎన్ఆర్ఐ ఆస్తులను అక్రమిస్తున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు బుద్ధి లేకుండా కబ్జాలు చేస్తున్నారు. టెంట్లు వేసి మనుషులను పెట్టి కబ్జా చేశారు. కోట్ల అస్థిని కాజేయాలని పుల్లారావు చూస్తున్నారు. కోర్టు చెప్పినా కూడా ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. -
ప్రైవేటూ రాజ్యమేలుకో!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటుపరం(పీపీపీ)పై చంద్రబాబు సర్కారు మొండి వైఖరి వీడడం లేదు. కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ముందుకెళుతోంది. దీనికోసం అనేక ప్రయోజనాలను ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం... పీపీపీకి ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపకపోవడంతో మరో కుట్రకు తెరతీసింది. అదనపు మేలు చేకూర్చేందుకూ సిద్ధమైంది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో ఖజానాపై అదనపు భారం వేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఎన్నో ప్రయోజనాలు ‘ఎకరం భూమికి ఏడాదికి రూ.100 లీజు చెల్లిస్తే చాలు. బోధనాస్పత్రుల్లో 70 శాతం ఇన్పేషెంట్ పడకలకు ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు సమకూరుస్తాం. మిగిలిన 30 శాతం పడకల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాదిరిగా ఫీజులు గుంజుకునే వీలు. సగం ఎంబీబీఎస్ సీట్లకు యాజమాన్య కోటా కింద ఫీజులు వసూలు చేసుకోవచ్చు. వైద్య కళాశాల, బోధనాస్పత్రిపై 66 ఏళ్ల పాటు యాజమాన్య హక్కుల కల్పన. రెండేళ్లపాటు బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వమే జీతాల చెల్లింపు’ అంటూ ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీకి ఇవ్వడం కోసం చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ సంస్థలకు బంపర్ ఆఫర్లు ఇచ్చింది.అయినప్పటికీ కళాశాలలు తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదనే సాకుతో మరో భారీ నజరానా ఇవ్వడానికి చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు. కళాశాలలు పూర్తి చేయడానికి అవసరమయ్యే వ్యయంలో 30 శాతం మేర వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి సమకూర్చడానికి కసరత్తు చేస్తున్నారు. వీజీఎఫ్ రూపంలో ప్రైవేట్ సంస్థలకు మరింత మేలు తలపెట్టబోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బాపట్ల, పాలకొల్లు, నర్సీపట్నం, అమలాపురం, పెనుకొండ వైద్య కళాశాలలకు వీజీఎఫ్ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది. గతేడాది టెండర్లు పిలిచి రద్దు చేసిన ఆదోని, పులివెందుల, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలలకు వీజీఎఫ్ కోరుతూ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని సమాచారం. ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపే కుట్రే!గత ప్రభుత్వం భూములు సేకరించి, రూ.వేల కోట్ల ప్రజాధనంతో నిర్మాణాలు ప్రారంభించి, తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను బాబు సర్కారు పీపీపీ ముసుగులో ప్రైవేట్కు కట్టబెట్టేందుకు తెగతాపత్రయపడుతోంది. బాబు సర్కారు తొలి దశలోనే పీపీపీకి ఇవ్వాలనుకున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలలు ప్లగ్ అండ్ ప్లే తరహాలో 2024 ఎన్నికల నాటికే ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పులివెందుల కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) సైతం పచ్చ జెండా ఊపింది.అయితే కుట్రపూరితంగా చంద్రబాబు ప్రభుత్వం లేఖలు రాసి ఆ కళాశాల అనుమతులు, సీట్లను రద్దు చేయించింది. ఈ తరహా కళాశాలలను కారుచౌకగా కట్టబెట్టేయడం కోసం ప్రైవేట్కు భారీ ప్రయోజనాలు కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంది. అంతటితో ఆగకుండా వీజీఎఫ్ కింద ప్రైవేట్ వ్యక్తులు భరించాల్సిన వ్యయంలో 30శాతం మేర నిధులు ఖజానా నుంచి సమకూర్చడానికి సిద్ధమవుతుండటం గమనార్హం.వాస్తవానికి ప్రైవేట్ సంస్థలు భారీగా సొంత పెట్టుబడి పెట్టి రోడ్లు, బ్రిడ్జిలు వంటి మౌలిక వసతులు నిర్మిస్తున్నప్పుడు, వారికి ఆశించిన లాభాలు రాకపోతే ప్రభుత్వం ఇచ్చే ఓ ఆర్థిక మద్దతు వీజీఎఫ్. ఇదిలా ఉంటే పీపీపీ వైద్య కళాశాలలకు ఇప్పటికే భారీ ఎత్తున అయాచిత ప్రయోజనాలను చంద్రబాబు ప్రభుత్వం సమకూర్చింది. ఇక ప్రైవేట్ సంస్థకు వచ్చే నష్టం ఎక్కడ ఉంది? వారు భరించే రిస్క్ ఏమిటి? వీజీఎఫ్ రూపంలో చేస్తున్న అదనపు లాభం వెనుక లోపాయికారీ ఒప్పందాలు ఏమిటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపే కుట్రలో భాగంగానే పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులకు తీరని ద్రోహం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు మన రాష్ట్ర విద్యార్థులకు రెండేళ్లలో తీరని ద్రోహం తలపెట్టారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. వాటిలో 10 ప్రైవేట్కు కట్టబెట్టాలని గద్దెనెక్కిన వెంటనే బాబు నిర్ణయించారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉండగా కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ఫైనాన్స్ మెడిసిన్ సీట్ల విధానాన్నే రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ హామీనిచ్చింది.అధికారం చేపట్టిన వంద రోజుల్లో సెల్ఫ్ఫైనాన్స్ సీట్ల జీవోలను రద్దు చేస్తామని ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అప్పట్లో ప్రకటించారు. గద్దెనెక్కాక విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తూ సెల్ఫ్ఫైనాన్స్ కోటా ఎత్తేయకపోగా, ఏకంగా ప్రభుత్వ కళాశాలను ప్రైవేట్కు కట్టబెడుతున్నారు. ఈ నిర్ణయంతో 2024–25లో 700 ఎంబీబీఎస్ సీట్లు, 2025–26లో 1750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు. రేయింబవళ్లు శ్రమించి నీట్లో ఉత్తమ ర్యాంక్లు సాధించిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల వైద్య విద్య కలను బాబు కాలరాశారు. -
సచివాలయ ఉద్యోగులపై ‘యోగా’ పిడుగు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న రకరకాల ఇంటింటి సర్వేలు, సంబంధం లేని పనుల కారణంగా పని ఒత్తిడి పెరిగిందని ఆవేదన చెందుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై తాజాగా యోగాభారం పడింది. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసే భారాన్ని వారి నెత్తినపెట్టింది. దీనిపై ఇప్పటికే పలు జిల్లాల్లో సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ప్రతి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి యోగా ట్రైనర్గా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.ట్రైనర్గా నమోదు చేసుకున్న ఒక్కొక్కరు కనీసం 40 మంది ప్రజలను యోగాంధ్రలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేయాలని నిర్దేశించింది. ఒక్కో సచివాలయంలో 17 మంది యోగా ట్రైనర్లుగా నమోదవ్వాలని, అంతమంది సచివాలయ సిబ్బంది లేకపోతే ఆ గ్రామంలో యువకులను ట్రైనర్లుగా నమోదు చేయాలని సూచించింది. పొదుపుసంఘాల మహిళలతో పాటు ఉపాధి హామీ పథకం కూలీలు యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని పేర్కొంది.రిజిస్ట్రేషన్ చేసిన 40 మందికి 20 వరకు రోజూ ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు యోగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని రోజూ ఫొటోలు తీసి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యోగాంధ్ర మొబైల్యాప్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో మండల స్థాయిలో జరిగే పోటీల్లో స్థానికులు పాల్గొనేలా చూడాలని పేర్కొంది. 21వ తేదీన సచివాలయ, మండల స్థాయిలోనూ స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. -
ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమపథం
సాక్షి, అమరావతి/బస్టాండ్ (విజయవాడ పశ్చిమ): ఈ–బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ఆర్టీసీ పరిరక్షణ కోసం ఎంతటి తీవ్రమైన ఉద్యమానికైనా సిద్ధమని తేల్చి చెప్పాయి. విజయవాడలో సోమవారం నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఉద్యమపంథాను నిర్ణయించేందుకు ఆర్టీసీ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేశారు. జేఏసీ కన్వీనర్లుగా వై.శ్రీనివాసరావు (ఎన్ఎంయూ), పి.దామోదరరావు(ఈయూ)లను ఎన్నుకున్నారు. పి.వి.రమణారెడ్డి (ఎన్ఎంయూ), జి.వి.నరసయ్య (ఈయూ), సీహెచ్. సుందరరామయ్య, కట్టా సుబ్రహ్మణ్యం (ఎస్డబ్లూఎఫ్), ఎస్.వి.శేషగిరిరావు, వై.శ్రీనివాసరావు (కార్మికపరిషత్), కె.సూర్యప్రకాశరావు(యునైటెడ్ వర్కర్స్ యూనియన్), డి.మాల్యాద్రి (కారి్మకసంఘ్) కో కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రను తిప్పికొడతాం ఆరీ్టసీని ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నుతోందని జేఏసీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పి.దామోదరరావు విమర్శించారు. ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోకుండా ఈ–బస్సులు, ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానం రాష్ట్ర ప్రజలకు, ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్రనష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నాలను ఉద్యోగులంతా అడ్డుకుంటారని తేల్చి చెప్పారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీయే స్వయంగా నిర్వహించాల¯న్నారు. విద్యుత్ బస్సుల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వడం కాకుండా ఆర్టీసీయే సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ అవసరాలకు తగినట్లు నాలుగువేల కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నాలను వ్యతిరేకిస్తూ తొలిదశ ఉద్యమ కార్యాచరణను జేఏసీ ప్రకటించింది. అప్పటికీ ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది.ఉద్యమ కార్యాచరణ⇒ ఈనెల 11న ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆర్టీసీ ఎండీకి వినతిపత్రాల సమర్పణ⇒ 16 నుంచి 20 వరకు రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలో ఐదు సన్నాహక సదస్సుల నిర్వహణ. 16న విజయనగరం, 17న విజయవాడ, 18న నెల్లూరు, 19న తిరుపతి, 20న అనంతపురంలలో సదస్సులు. ⇒ 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని డిపోలు, యూనిట్లలో ధర్నాలు -
నిందలు కాదు.. నిజాలు తెలుసుకో
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: వంగవీటి రంగాను కాపాడుకోలేదని ఏపీలోని కాపులను.. గద్దర్కు వెన్నులో తూటాలు దించితే కాపాడలేదని తెలంగాణ సమాజాన్ని నిందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రెండు ఘటనలూ టీడీపీ హయాంలోనే జరిగాయనే నిజాలను ఎందుకు విస్మరిస్తున్నారని కాపు నేతలు సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా రంగా పేరును ప్రస్తావించకుండా, కాపులను నిందించకుండా.. నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్, రామ్ తాళ్లూరి డైరెక్షన్లో మీ పార్టీని మీరు నడుపుకోవాలని పవన్కు సూచించారు. పవన్ అండ చూసుకుని సీఎం చంద్రబాబు కాపుల పట్ల తీవ్ర కులవివక్ష చూపిస్తున్నారని, సరైన సమయంలో ఓటు ద్వారా గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.ఈమేరకు రాజమహేంద్రవరంలో నిర్వహించిన కాపు ఆత్మగౌరవ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్పీఎస్) రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు, వర్కింగ్ చైర్మన్ మాసాబత్తుల శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, రాష్ట్ర కో–ఆర్డినేటర్లు జానపాముల నాగేంద్రకుమార్, జేటీ రామారావు, రాష్ట్ర కో–కన్వీనర్ బోడపాటి పెదబాబు, కాకిలేటి హరనాథ్, వంగా ఆంజనేయులు సోమవారం మీడియాకు వెల్లడించారు. కాపు రాజ్యాధికార పోరాట సమితి, కాపు రక్షణ చట్టం పోరాట సమితి ముఖ్య ప్రతినిధులు ఆత్మగౌరవ సమావేశానికి హాజరయ్యారు.ఇటీవల మంగళగిరి, రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశాల్లో కాపు నాయకులు, కాపు సంఘాలు, కాపు సమాజాన్ని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. తామంతా కాపు సంఘాల్లో మూడు దశాబ్దాలకుపైగా పనిచేస్తూ కాపుల సంక్షేమం, రిజర్వేషన్లు, రాజ్యాధికారం కోసం నిరంతర పోరాటం కొనసాగిçస్తున్నట్లు గుర్తు చేశారు. గత రెండేళ్లలో కాపు నాయకులెవరూ పవన్ను కలిసిందీ లేదు.. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిందీ లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ను ఉద్దేశించి కాపు నేతలు పలు ప్రశ్నలు సంధించారు. ⇒ కాపు నాయకులు కన్వీనియంట్ రాజకీయాలు చేస్తున్నారని రాజమహేంద్రవరం వేదికగా పవన్ వ్యాఖ్యలు చేశారు. నిజానికి మీఅంత కన్వీనియంట్ పొలిటీషియన్ మరొకరున్నారా పవన్? మీ అంత స్థిరత్వం లేని పొలిటీషియన్ మరొకరున్నారా? పాచిపోయిన లడ్డూలు అన్నదెవరు? ఉత్తరాది, దక్షిణాది అనే ఫీలింగ్ చూపిస్తున్నారని అన్నదెవరు? ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కవాతు చేస్తానని ప్రకటించి ఆ తరువాత కనపడనిది ఎవరు? మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం తీసుకోవడమేమిటని అమరావతి పర్యటనలో ప్రశ్నించి తర్వాత ఆ విషయాన్ని వదిలేసిందెవరు? మా నాన్న హేతువాది.. సోషలిస్టు.. రామకోటి రాశారని రకరకాలుగా మాట్లాడిందెవరు? తనది వామపక్ష భావజాలమని, భగత్సింగ్, చేగువేరా తనకు ఆదర్శమని చెప్పిందెవరు? నాకు కులం లేదు.. మతంలేదు అంటూనే నిరంతరం కులాలు, మతాల గురించి మాట్లాడుతున్నది మీరు కాదా? ⇒ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఇదే రాజమహేంద్రవరంలో ఎన్నికల ముందు పవన్ చెప్పలేదా? కశ్మీర్ సమస్యకైనా పరిష్కారం దొరికింది కానీ కాపుల సమస్యకు పరిష్కారం లేదా? అని అనలేదా? కాపులు తనకు ఓట్లు వేయకపోయినా పర్వాలేదని ఇప్పుడు ఎలా అనగలుగుతున్నారు? కాపుల ఓట్లు తమకు అవసరం లేదని చంద్రబాబు, లోకేశ్తో చెప్పించగలరా? ⇒ రాజకీయ ప్రత్యర్థి గా అంబటి రాంబాబును పవన్ విమర్శించారని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రజారాజ్యం, జనసేన కోసం పనిచేసిన దాసరి రామును ఉద్దేశించి పవన్ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదు. కాపులు తనకు అండగా నిలబడలేదని.. తోట చంద్రశేఖర్, జేడీ లక్ష్మీనారాయణ తనను వదిలేసి వెళ్లిపోయారని అంటున్న పవన్ అధికారంలోకి వచ్చాక బొలిశెట్టి సత్యనారాయణ ఎందుకు వెళ్లిపోయారో చెప్పగలరా? కాపు నాయకుల మూలాల మీదకు వెళతాం, వారి చిట్టాలు విప్పుతామని బెదిరిస్తున్న పవన్.. మెగా కుటుంబానికి మూల స్తంభంగా కాపు కాసింది కాపులేనని విస్మరిస్తున్నారు. కాపులను నిందించి, బెదిరించి పవన్ తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారనే విషయం అర్థమవుతోందా? ⇒ మీరంతా నా వెనుక ఉంటే ముఖ్యమంత్రినవుతానని గతంలో మీరు అన్న మాట ఎక్కడికి పోయింది పవన్? చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం కులాన్ని ఫుట్బాల్ ఆడుకుంటారా పవన్? వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని బొండా ఉమాతో ఉద్యమం చేయించిన చంద్రబాబును రెండేళ్లుగా ప్రశ్నించకపోవడం కన్వీనియంట్ రాజకీయం కాదా? ⇒ కాపు సమాజంలో ఎందరో మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖులున్నా కూటమి ప్రభుత్వం ఒక్కరినైనా గుర్తించిందా? కనీసం ఒక్క జిల్లాకైనా కాపు నేతల పేరు పెట్టిందా? ⇒ హైకోర్టు సమర్థించిన కాపు రిజర్వేషన్ల జీవోను తుంగలోకి తొక్కేసిన చంద్రబాబు కాపులకు తీరని అన్యాయం చేశారు. అదే చంద్రబాబు మైనారీ్టల రిజర్వేషన్ల విషయంలో రెండుసార్లు హైకోర్టు కొట్టివేసినా సమర్థి స్తున్నారు. ఇదేనా సమ ధర్మం? సమ న్యాయం? సామాజిక న్యాయం? -
నేడు భారీ వర్షాలు..ఎండలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అల్లూరి, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని... మరోవైపు ఎండలూ ఉంటాయని తెలిపింది.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల మధ్య, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వివరించింది. సోమవారం నెల్లూరు జిల్లా గూడూరులో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.మరోవైపు, నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రెండుమూడు రోజుల్లో రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. -
‘వెన్నుపోటు’పై సమరశంఖం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ఈ రెండేళ్లలో ప్రజలను వెన్నుపోటు పొడిచిన వైనంపై వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యాచరణలో రెండో ఘట్టం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు సైతం స్వచ్ఛందంగా తరలివచ్చి నిరసనల్ని విజయవంతం చేశారు. పలుచోట్ల అరాచక పాలనపై ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడంతోపాటు వీడియోలు కూడా ప్రదర్శించారు. ఉత్తరాంధ్రలో ఉప్పెనలా చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై విజయనగరంలోని వైఎస్సార్ జంక్షన్ వద్ద నల్ల బెలూన్లతో వైఎస్సార్సీపీ మహిళా నేతలు నిరసన తెలిపారు. టౌన్హాల్ మీటింగ్లో టీడీపీ కూటమి తీరును ఎండగట్టారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అవినీతి, అక్రమాలే చేస్తోందని మండిపడ్డారు. పార్వతీపురం, గరివిడి, నెల్లిమర్లలో పెద్దఎత్తున నిరసన తెలిపారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా రాజాంలో ర్యాలీ, నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ రౌండ్ టేబుల్ సమావేశాలు విజయవంతమయ్యాయి.కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన నమ్మశక్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి, రెండేళ్ల పాలనలో ప్రజలను దారుణంగా మోసం చేశారని నేతలు మండిపడ్డారు. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, సంక్షేమ పథకాల నిలిపివేతతో పేదలు పడుతున్న ఇబ్బందులపై ఈ సదస్సుల్లో సుదీర్ఘంగా చర్చించారు.అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, అనకాపల్లి, మాడుగుల, పాయకరావుపేట నియోజకవర్గాల్లో సదస్సులు విజయవంతమయ్యాయి. పెద్దఎత్తున మహిళలు, యువత, సాధారణ ప్రజలు పాల్గొని నిరసన తెలిపారు. చోడవరంలో వెన్నుపోటుకు రెండేళ్లుపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించారు. పలాస, రణస్థలం, ఇచ్ఛాపురం, ఆమదాలవలసలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నల్లబెలూన్లతో నిరసనలు.. టౌన్హాల్ సదస్సులు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, గోపాలపురం, మండపేట, కొవ్వూరు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. బొమ్మూరు, ద్వారకాతిరుమల, చాగల్లులోనూ చేపట్టిన ఈ కార్యక్రమాల్లో చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన హత్యలు, అరాచకాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు.పశి్చమ గోదావరి జిల్లా తణుకులో వ్యాపార, వర్తక సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ అన్యాయాలను స్క్రీన్పై ప్రదర్శించారు. ఆచంట నియోజకవర్గంలో టౌన్హాల్ సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లా నూజివీడు, పోలవరం, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరులో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి నల్లబెలూన్లు వదిలి నిరసన తెలిపారు. ఎనీ్టఆర్ జిల్లా తిరువూరులో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి నల్లబెలూన్లు వదిలి నిరసన తెలిపారు.మైలవరం నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. జగ్గయ్యపేటలో ఆర్టీసీ డిపో వద్ద ఉన్న ఎలక్ట్రికల్ అసోసియేషన్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫొటో ప్రదర్శన ఆకట్టుకుంది. రెండేళ్ల పాలన వైఫల్యాలను, వెన్నుపోటును నిరసిస్తూ నాయకులంతా నల్ల బెలూన్లను గాలిలో వదిలారు. నందిగామ పార్టీ కార్యాలయంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. బాపట్లలోని చీరాల–కారంచేడు రోడ్ గేట్ సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని నేతలు మండిపడ్డారు.పల్నాడు జిల్లా అచ్చంపేటలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా టౌన్హాల్ సదస్సు నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై సెమినార్ నిర్వహించారు. ఒంగోలు, కొండపి, కందుకూరు, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లిగూడూరు మండలం నరుకూరులో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. నరుకూరు సెంటరు నుంచి కల్యాణ మండపం వరకు నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు రూరల్ చింతారెడ్డిపాళెంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి, మహిళలు నల్ల బెలూన్లు వదిలి నిరసన తెలిపారు. గూడూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో కూటమి పాలనపై వెన్నుపోటుకు రెండేళ్ళ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. రాయలసీమలో నిరసనల వెల్లువ ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాల్లో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాజంపేటలో వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నల్లబెలూన్లు ఎగురవేశారు. పలుచోట్ల నల్ల కండువాలతో హాజరై సదస్సులు నిర్వహించారు. ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వ హామీల విఫలంపై ఫొటో ఎగ్జిబిషన్ ప్రదర్శించారు. పులివెందులలో నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరులో నల్లబెలూన్లు ఎగురవేశారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలపై ఫొటో ఎగ్జిబిషన్ను ప్రజలంతా తిలకించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో నల్లబెలూన్లు ఎగురవేశారు.చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గస్థాయి సమావేశం జరిపారు. గుంతకల్లులో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరిగింది. నల్లబెలూన్లు ఎగురవేసి ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు హామీలు, మోసాలపై చర్చించారు. కర్నూలు జిల్లా ఆలూరులో చంద్రబాబు మోసాలపై ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో చంద్రబాబు అబద్ధపు హామీలను నిరసిస్తూ నల్ల బెలూన్లు వదిలి నిరసన తెలిపారు. -
మృత్యువలయంగా విశాఖ స్టీల్ ప్లాంట్..!
విశాఖ స్టీల్ ప్లాంట్లో తాజాగా జరిగిన ప్రమాదం మరోసారి భద్రతా ప్రమాణాలపై చర్చకు దారితీసింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ విభాగాల్లో జరిగిన ప్రమాదాల్లో పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రధానంగా గ్యాస్ లీకేజ్, పేలుళ్లు, ద్రవ లోహం లీకేజ్ వంటి ఘటనలు జరుగుతూనే ఉండటంతో విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకరంగా మారింది.తాజాగా విశాఖ స్టీల్ప్టాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడగా, పలువురు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దారుణం వెనుక భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇంతటి దారుణం చోటు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. 2012లో ఘోర ప్రమాదం.. అయితే ఈ ఘటన 2012లో విశాఖ స్టీల్ ప్టాంట్లో జరిగిన ఘోర దుర్ఘటనకు గుర్తుకుతెచ్చింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే జూన్ నెలలో 13వ తారీఖున చోటు చేసుకున్న స్టీల్ప్లాంట్ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ ప్లాంట్ వద్ద పేలుడు సంభవించి 19 మంది దుర్మరణం చెందారు. ఆ సమయంలో పలువురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆక్సిజన్ పైప్లైన్లో ఒత్తిడి ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల పైప్లైన్ పేలిపోయి, భారీగా మంటలు వ్యాపించాయి. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య ఉండటంతో, అధికారులు మరియు కార్మికులు దానిని పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.దాంతో అక్కడే ఉన్న పలువురు ఈ ఘోరం బారిన పడ్డారు. మరణించిన 19 మందిలో ముగ్గురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, కన్సల్టెంట్లు మరియు పలువురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు.తీవ్ర గాయాలు: ఎందరో ఉద్యోగులు తీవ్రమైన శాతంలో కాలిపోయి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అదే సంవత్సరం మే 1వ తేదీన కూడా స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నెస్-3 లో జరిగిన మరో పేలుడులో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనమయ్యారు. .గతేడాది స్టీల్ మెల్టింగ్ మిషన్లో షార్ట్ సర్క్యూట్తో హైడ్రాలిక్ ఆయిల్ లీకై మంటలు చెలరేగాయి.ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ఈసారి ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన మరికొన్ని ప్రమాదాలు..మే 22, 2012: సింటర్ ప్లాంట్లో మంటలు చెలరేగడంతో, కొత్త బ్లాస్ట్ ఫర్నేస్కు ముడి పదార్థాన్ని తీసుకువెళ్తున్న కన్వేయర్ బెల్ట్ పూర్తిగా కరిగిపోయింది. రూ. 1 కోటి ఉత్పత్తి నష్టం.మే 1, 2012: కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్ IIIలో జరిగిన పేలుడులో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఫిబ్రవరి 6, 2012: స్టీల్ మెల్టింగ్ షాప్ లో భారీ పరిమాణంలో వేడి లోహం ఒలికిపోవడం, రూ. 1 కోటి నష్టంఏప్రిల్ 10, 2011: సుమారు 140 టన్నుల ద్రవ ఉక్కును తీసుకువెళ్తున్న లాడిల్ నుండి అది కిందపడటంతో ఎస్ఎంఎస్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది, రూ. 60 కోట్ల నష్టం వాటిల్లింది.ఏప్రిల్ 14, 2011: ఎస్ఎంఎస్లోని కంటిన్యూయస్ కాస్టింగ్ విభాగంలో భారీ పరిమాణంలో వేడి లోహం కింద పడిపోయింది, 140 టన్నుల ద్రవ ఉక్కు నేలపై పడింది. ఏప్రిల్ 17, 2011: ముడి పదార్థాల నిర్వహణ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం, మూడు కన్వేయర్ బెల్టులకు నష్టం, రూ. 20 కోట్ల నష్టంమే 1, 2011: బ్లాస్ట్ ఫర్నేస్కు ముడి పదార్థాలను రవాణా చేసే కన్వేయర్ బెల్ట్ మెలితిరగడంతో 48 గంటల పాటు ఉత్పత్తికి అంతరాయంజూన్ 18, 2011: కోక్ డ్రైయింగ్ కూలింగ్ ప్లాంట్లోని రెండు కన్వేయర్ బెల్టులలో ఒకదానిపై వేడి కోక్ పడటంతో అగ్నిప్రమాదం సంభవించింది, రూ. 15 లక్షల నష్టం -
వైఎస్ జగన్ను కలిసిన రైతులపై ఎల్లో మీడియా ట్రోలింగ్
అమరావతి గురించి ఎల్లో మీడియా ఇచ్చిన ఒక కథనం చూస్తే వారికి ఎంతగా కుల జాడ్యం పట్టుకుంది అర్దం అవుతుంది. రాజధాని నిర్మాణం పేరుతో కొన్ని గ్రామాలలో అవసరం ఉన్నా,లేకపోయినా భూములు తీసుకుంటున్న వైనం , రైతులపై దౌర్జన్యం చేస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. ఉండవల్లి ,పెనుమాక ,నిడమర్రు మొదలైన గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను కొంతమేర ఇచ్చారు. ఆ పైన ఇవ్వడానికి సిద్దపడడం లేదు. కొందరు భూమలు వదలుకోవడానికి ఇష్టపడడం లేదు. దాంతో రైతులపై చంద్రబాబు సర్కార్ వేదింపులు మొదలుపెట్టింది.బాధితులైన రైతులు కొందరు కొద్ది రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతులపై జరుగుతున్న దాష్టికాన్ని ఎదుర్కోవడానికి న్యాయ పోరాటానికి మద్దతు ఇస్తామని జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఇది టిడిపి మీడియాకు నచ్చలేదు. వెంటనే ఒక స్టోరీ అల్లేశారు. దానిలో జగన్ పైన, బాధితులపైన తప్పుడు రాతలు రాశారు. జగన్ ను కలిసినవారిలో కొందరు ఆయన సామాజికవర్గం వారని అంటూ ఎల్లో మీడియా కులం ప్రస్తావన చేసింది. అంటే ఏమి అనుకోవాలి?అమరావతికి మద్దతు ఇస్తే తప్ప, లేకుంటే ఎవరిపైన అయినా కుల ముద్ర, లేదా మరో ముద్ర వేసి ప్రచారం చేస్తారా?. ఈ కధనం చదివినవారికి ఏమనిపిస్తుంది.ఒక సామాజికవర్గ ఆధిపత్యం కోసమే ఎక్కడో మారుమూల ఉన్న గ్రామాలను రాజధాని కోసం ఎంపిక చేసి, లక్షల కోట్లు ఒకే చోట ఖర్చు చేయడానికి టిడిపి ప్రభుత్వం సన్నద్దమైందన్న ఆరోపణలు ,విమర్శలు వాస్తవమే అన్న భావన కలగదా!అప్పట్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసి రాజధాని గ్రామాలలో అత్యధికంగా భూములు కొనుగోలు చేసినవారిలో ఎక్కువ మంది ఒకే కులం వారు ఉన్నారని అభియోగాలు వచ్చాయి. వారి లబ్ది కోసం ఎల్లో మీడియా ఇలా దిగజారి వార్తలు రాస్తున్నదన్న అభిప్రాయం కలగదా?నిజానికి ప్రస్తుతం రాజధాని రైతులంతా కులాలతో సంబందం లేకుండా అంతా అవస్థలు పడుతున్నారు.2015లో ఉత్సాహంగా భూములు ఇచ్చినవారు సైతం నిస్పృహకు గురి అవుతున్నారు.మంత్రి నారాయణ పాల్గొన్న ఒక గ్రామ సభలో రామారావు అనే రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై మరణించారు. అప్పుడు ఇదే ఎల్లో మీడియా కూల్ గా పడిపోయి మరణించారని దిక్కుమాలిన రాతలను రాసింది.ఆయన కూడా జగన్ సామాజికవర్గానికి చెందినవారేనా! అంతెదుకు రాయపూడి ప్రాంతంలో ఒక ప్రముఖ రైతు నేత తన భూములు ఇవ్వడానికి నిరాకరించి కోర్టుకు వెళ్లలేదా!ఆయన ఏ కులం వారు?రాజకీయంగా పలుకుబడి,పరపతి, అధికారం ఉన్నవారికి మాత్రమే ఇబ్బంది లేని చోట్ల ప్లాట్లు కేటాయిస్తున్నారని, మిగిలినవారికి వరద ప్రాంతాలు,స్మశానాలలో సైతం ప్లాట్లు ఇస్తున్నారన్న విమర్శలు ఓపెన్ గానే వస్తున్నాయి.బాధ పడుతున్నవారిలో చాలా మంది కమ్మవారు కూడా ఉన్నారు కదా!వారికి మాత్రం ఏమి న్యాయం జరిగింది?రెండో టరమ్ లో అధికారం వచ్చి రెండేళ్లు అయినా ఇంతవరకు ఎంతమందికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇచ్చారో చెప్పగలరా?రెండో దశ పూలింగ్లో వేల ఎకరాల సమీకరణకు ప్రభుత్వం సిద్దం అయితే వ్యతిరేకిస్తున్నవారిలో అత్యధికంగా ఉన్నది కమ్మ సామాజికవర్గం కాదా?అంతెందుకు! రెండో దశ కింద వేల ఎకరాలు సేకరించడం పెద్ద స్కామ్ అని వ్యాఖ్యానించిన రిటైర్డ్ డిజిపి ఎబి వెంకటేశ్వరరావు ఏ సామాజికవర్గంవారు? అమరావతి నిర్మాణం పేరుతో రైతులను దోచుకుంటున్నారని, అదనంగా భూములు ఇవ్వవద్దని పిలుపు ఇచ్చిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కమ్మ వర్గం వారు కాదా?వాస్తవ పరిస్తితి ఇలా ఉంటే అదేదో రెడ్డి సామాజికవర్గం వారు కొంతమంది రాజధానికి అడ్డుపడుతున్నట్లు దుర్మార్గంగా వార్తలు ఇస్తారా?ఇవన్ని ఎందుకు!ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అమరావతి రాజధానిని ఒక సామాజికవర్గ గేటెడ్ కమ్యూనిటీగా మార్చుతున్నారని గతంలో ఆరోపించారా?లేదా?ఆయన స్వయంగా పెనుమాక ప్రాంత రైతులను కలిసి వారి గోడు అప్పట్లో విన్నారా?లేదా?ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు.అది వేరే సంగతి. ఇది అసలు కుల సమస్యకాదు. కులాలకు అతీతంగా వేలాది మంది రైతుల ఆక్రోశం.ఆవేదన.ఒప్పందం ప్రకారం ప్లాట్లు ఇవ్వని ప్రభుత్వం కొత్తగా భూములు తీసుకోవడానికి దౌర్జన్యంగా వ్యవహరించడంపై వ్యక్తం అవుతున్న నిరసన అని గమనించాలి.భూములు ఇచ్చినవారిపై అక్కసుతో ఉండవలసిన అవసరం జగన్ కు ఏమి ఉంటుంది.వారికి ప్లాట్లు ఇవ్వవద్దని, డ్రైన్లు, కరెంటు,తదితర సదుపాయాలు కల్పించవద్దని జగన్ ఏమైనా అన్నారా?వారికి కూడా న్యాయం చేయమనే కదా కోరింది.ఇన్నివేల ఎకరాలు తీసుకోవడం,లక్షల కోట్లు రాజధాని పేరుతో వ్యయం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.అందులో ఆక్షేపణ ఏమి ఉంది?అందుకే మచిలీపట్నం ,విజయవాడ,గుంటూరు కారిడార్ ను (మావిగన్) ప్రతిపాదించి రాజధాని ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వానికి లక్షల కోట్ల వ్యయం అవ్వదని ఆయన సలహా ఇచ్చారు.ఆ ప్రతిపాదన చేయడం వల్లే కదా ప్రభుత్వం భయపడుతోంది. టిడిపి మహానాడులో అమరావతికి సంబందించి చర్చను ఎందుకు విస్తృతంగా చేయలేదు?రెండు లక్షల ఎకరాలు తీసుకోవలసిన అవసరం, లక్షల కోట్ల నిధులు ఒకే చోట వ్యయం చేయడం ఎందుకు అన్నదానిపై వివరణ ఇవ్వలేకపోయారే!ఈ నేపధ్యంలో కొందరు రైతులు జగన్ ను కలిసి తమను ప్రభుత్వం ఏ రకంగా హింసిస్తుందో వివరించారు. రైతుల భూములలో వారి అనుమతి లేకుండా తవ్వకాలు చేపట్టవచ్చా?ప్రభుత్వమే ఇలా రౌడీయిజంగా వ్యవహరించవచ్చా?పూలింగ్ కింద ఇవ్వని రైతుల భూములలో ప్లాట్లు వేయవచ్చా?వేరేవారికి ఆ ప్లాట్లు కేటాయించవచ్చా?అది చట్ట సమ్మతమా?ఒక సాధారణ రైతు ప్రభుత్వమే తన భూమిని ఎలా కబ్జా చేస్తుందని, ఐఎఎస్ అధికారులు అందులో వేరేవారికి ప్లాట్లు ఎలా రిజిస్టర్ చేస్తారని,ఇదేనా వారు చదువుకుంది అని ప్రశ్నించారు.తన పొలంలోకి కొండవీటి కాల్వకు గండి పెట్టి నీరువదలిలారని ఒక రైతు వాపోయారు.తాను కొంత భూమిని ప్రభుత్వానికి ఇచ్చినా, ఇంకా భూమి కావాలంటూ వెంటబడుతున్నారని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు.విశేషం ఏమిటంటే పెనుమాకలో జరిగిన గ్రామ సభలో కొందరు తెలుగుదేశం మద్దతుదారులు కూడా భూములు ఇచ్చిన తమకు జరుగుతున్నఅన్యాయాలను ఏకరువు పెట్టి అధికారులు స్పందించడం లేదని ఫిర్యాదు చశారు.వారిలో రెడ్డి వర్గం వారు కూడా ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సి.ఎమ్ గా ఉన్నప్పుడు పోలవరం ఎడమ కాల్వ తవ్వకానికి భూములు సేకరిస్తే,టిడిపికి చెందినవారు కొన్ని చోట్ల అడ్డుపడ్డారు.వారు కోర్టుకు వెళ్లారు.వీరిలో ఎక్కువ మంది ఏ కులం వారో అప్పుడు రాశారా? కాంగ్రెస్ ప్రభుత్వం వారిని వేధించిందా?అదే రైతులు టిడిపి అధికారంలోకి వచ్చాక ఒక రేటుకు ఒప్పందం అయి భూములు ఎలా ఇచ్చారు?ఎవరికైనా కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుంది.అదేదో నేరం అయినట్లు విష ప్రచారం చేయడం దారుణం. సరైన ప్రత్యామ్నాయ పరిష్కారం చూపకుండా, ప్రభుత్వం రౌడీయిజం చేయడమే మంచి విధానం అన్నట్లు ఎల్లో మీడియా రాయడం అంటే అంతకన్నా నీచం ఉంటుందా?కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాదు ఉప్మా మంత్రి’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. బాబు పాలనలో అరాచకం రాజ్యమేలుతుందన్న ఆయన.. పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా చాకిరి చేయించుకుంటుందని అన్నారు. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ విభాగంలో అన్నీ శాఖల్లో మోసం చేసినట్లుగా కానిస్టేబుళ్లను మోసం చేస్తున్నారు. కానిస్టేబుళ్లకు ఇచ్చే సరండర్ లీవల్ను వన్ బై టూ చేశారు.కానిస్టేబుళ్లకు ఇవ్వాల్సిన ఆరు సరండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి. పోలీసులకు టీఏలు కూడా ఇవ్వడం లేదు. లా అండ్ ఆర్డర్ పని చేసే ఒక్కో పోలీస్కు రూ.70వేలకు పైగా బాకీ ఉన్నారు.మందు తాగమని చంద్రబాబే చెబుతారు. తర్వాత డ్రండ్ అండ్ డ్రైవ్లు పెడతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు చెబితే పోలీసులకు నిద్ర పట్టడం లేదు.ప్రతి పీఎస్ పరిధిలో రోజుకు ఐదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టాలని టార్గెట్ పెట్టారు. చంద్రబాబు మాటలను నమ్మి పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను కొట్టారు. పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోం దేవుడెరుగు, వడగాల్పుల్లో అల్లాడి పోతున్నారు. జీవో 329 ఎందుకు అమలు కావడంలేదో చంద్రబాబు చెప్పాలి. ఏపీఎస్పీలో పదేళ్లు సర్వీస్ నిండినవారిని ఏఆర్కు ఎందుకు పంపడం లేదు?.ఏపీఎస్పీలో వెట్టి చాకిరి చేస్తూ రిటైర్ అవుతున్నారు. పోలీసుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది.పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాదు ఉప్మా మంత్రి. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారు. ఓట్లు అడుకునేటప్పుడు కానిస్టేబుల్ కుమారుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు?. హోం మంత్రి అనిత హోం శాఖ గురించి తప్పితే అన్నీ మాట్లాడుతారు. వైఎస్ జగన్ను తిట్టడానికి మాత్రమే మంత్రి అనితను వాడుకుంటున్నారు’అని ధ్వజమెత్తారు. -
యాత్రికుల బస్సు ప్రమాదం బాధాకరం : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు భక్తులు మృతిచెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నెల్లూరు జిల్లా నుంచి ఉత్తర భారతదేశ యాత్రకు బయల్దేరిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరగడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన 15 మంది యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
అప్పటి ‘బుల్లిరాజా’ భజన.. ఇప్పుడు వైరల్
సీతానగరం: తూర్పు గోదావరి జిల్లా మునికూడలిలోని శ్రీ అఖండ గౌతమి గోదావరి స్నాన ఘాట్కు అప్పటి, ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మనమడు దేవాన్ష్ పేరును పెట్టిన వ్యవహారం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ను ప్రసన్నం చేసుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చూపిన అత్యుత్సాహంతో తాజాగా వెలుగుచూసిన ఈ వ్యవహారంపై హిందూ ధార్మీక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.పవిత్ర ఘాట్లకు రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడం సరికాదని భక్తులు విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఆధ్యాతి్మక, చారిత్రక వారసత్వానికి నిలయమైన గోదావరి తీరంలోని మునికూడలిలో దశాబ్దాలుగా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ‘శ్రీ అఖండ గౌతమి గోదావరి స్నాన ఘట్టం’ 1979 పుష్కరాల సమయంలో ఏర్పాటయ్యింది. 2015లో జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఈ ఘాట్కు సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పేరుతో నామకరణం చేసి ‘దేవాన్ష్’ పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు.అయితే రానున్న పుష్కరాల నేపథ్యంలో ఎమ్మెల్యే బత్తుల ఘాట్ను సందర్శించారు. దేవాన్ష్ ఘాట్ను ఆదర్శంగా, ఒక మోడల్గా అభివృద్ధి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారని, కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై సర్వత్రా తీవ్ర చర్చ, విమర్శలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విషయం వైరల్ అయి.. వివాదాస్పదం కావడంతో లోకేశ్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరించారు. ఘాట్కు దేవాన్ష్ పేరు ఉంటే తక్షణం తొలగించాలని ఎక్స్లో పోస్ట్ చేశారు. -
మైనార్టీ తీరకుండానే మనువు
సాక్షి, అమరావతి: చట్టబద్ధమైన వయసు తీరకుండానే అబ్బాయిలు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 15.9 శాతం మంది అబ్బాయిలు 21 ఏళ్లు నిండకుండానే ఓ ఇంటివారవుతున్నారు. ప్రతి వంద మంది అబ్బాయిల్లో 16 మంది మైనర్లుగానే పెళ్లి చేసుకుంటున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–6 నివేదిక వెల్లడించింది. 2023–24 సమయానికి చేసిన సర్వేలో దేశంలోని 15.9 శాతం మంది బాలురు మైనార్టీ తీరకుండానే వివాహం చేసుకున్నట్టు గుర్తించింది. గ్రామీణ ప్రాంతాల్లో 19 శాతం, పట్టణ, నగరాల్లో 9.7 శాతం అబ్బాయిల మైనర్ వివాహాలు జరుగుతున్నట్టు తేల్చింది. ఈ తరహా వివాహాలు 2019–21లో 17.7 శాతం ఉండగా, 2023–24 నాటికి కొంత తగ్గుముఖం పట్టాయి. అబ్బాయిల మైనర్ వివాహాల్లో బిహార్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలోని 25–29 ఏళ్ల పురుషుల్లో 29.6 శాతం మంది 21 ఏళ్లలోపు వివాహాలు చేసుకున్నారు. బిహార్లో అబ్బాయిల మైనర్ వివాహాలు ఏకంగా జాతీయ సగటుకు దాదాపు రెట్టింపు ఉన్నాయి. రాజస్థాన్లో 28.5 శాతం, మధ్యప్రదేశ్లో 25 శాతం, గుజరాత్లో 24.3 శాతం చొప్పున అబ్బాయిల్లో మైనర్ వివాహాలున్నట్టు వెల్లడైంది. రాజస్థాన్లో అమ్మాయిల్లో 24.6 శాతం మైనర్ వివాహాలు ఉన్నాయి. ఈ లెక్కన పరిశీలిస్తే ఆ రాష్ట్రంలో కంటే అబ్బాయిల్లో మైనర్ వివాహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 9.7 శాతం, తెలంగాణలో 5.7 శాతం చొప్పున 2023–24లో 21 ఏళ్లలోపే వివాహాలు నమోదయ్యాయి. పల్లెలను మించి పట్టణాల్లో.. బాల్య వివాహాలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంటాయనే భావన ఉంది. అబ్బాయిల విషయానికి వచ్చేసరికి కొన్ని రాష్ట్రాల్లో రివర్స్ ట్రెండ్ నడుస్తోంది. పట్టణ ప్రాంతాల్లోనూ అబ్బాయిలకు 21 ఏళ్ల లోపు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా బాలుర మైనర్ వివాహాలు 12.5 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఆ సంఖ్య ఏకంగా 15.1 శాతం, గ్రామీణంలో 12.1 శాతం మాత్రమే కావడం గమనార్హం. నాగాలాండ్లో సైతం పట్టణాల్లో 13.8 శాతం, గ్రామాల్లో 8.2 శాతం మేర మైనర్ బాలుర వివాహాలు నమోదయ్యాయి.


