breaking news
Amaravati
-
హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి
సాక్షి, అమరావతి: హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో అదనపు న్యాయమూర్తిగా బాలాజీ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అదనపు న్యాయమూర్తిగా బాలాజీ రెండు మూడు రోజుల్లో ప్రమాణం చేసే అవకాశం ఉంది. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు బాలాజీ పేరును సిఫారసు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్మానం కేంద్ర న్యాయశాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరింది. దీంతో బాలాజీ నియామకానికి రాష్ట్రపతి తాజాగా ఆమోద ముద్ర వేశారు. ఈ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరింది. ప్రస్తుతం హైకోర్టులో 32 మంది న్యాయమూర్తులుండగా, ఇందులో ఆరుగురు అదనపు న్యాయమూర్తులున్నారు. ఇదీ నేపథ్యం... బాలాజీ మెడమల్లి వైఎస్సార్ కడప జిల్లా, శేషన్నగారిపల్లికి చెందిన వ్యక్తి. లక్ష్మీనరసమ్మ, సుబ్బయ్యనాయుడు దంపతులకు 1972 మే 29న జన్మింంచారు. వీరిది వ్యవసాయ కుటుంబం. కుటుంబంలో బాలాజీనే మొదటితరం న్యాయవాది. రాజంపేటలో ప్రాథమిక విద్యను, తిరుపతి శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాద్ పడాల రామిరెడ్డి లా కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు. 1998లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. గతంలో ఆయన ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా వ్యవహరించారు. 2018–19 మధ్య కాలంలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. పలు సంస్థలకు, బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరిస్తున్నారు. బాలాజీకి భార్య కళ్యాణి, కుమారుడు సుచంద్రహాస్, కుమార్తె లక్ష్మీశ్వేత ఉన్నారు. -
‘విజనరీ’ పాలనలో కల్పిత గణాంకాలు
‘‘11.09 శాతం భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న మన రాష్ట్రం... పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97 శాతం వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరికీ ఆశ్చర్యంగా అనిపించకమానదు. ‘విజనరీ’ నాయకత్వంలో తయారు చేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి’’ - ‘ఎక్స్’లో వైఎస్ జగన్ ట్వీట్సాక్షి, అమరావతి: ‘పన్నుల ఆదాయం వృద్ధిలో మన రాష్ట్రం.. దేశంలో చిట్టచివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇదీ చంద్రబాబు 22వ ర్యాంక్ విజన్..!’ అంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలకు సంబంధించి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ.. సీఎం చంద్రబాబు కల్పిత గణాంకాలతో చెబుతున్న అవాస్తవాలను ఎండగడుతూ.. కూటమి సర్కారు ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. చంద్రబాబు నాయకత్వంలో అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, దుష్ప్రచారం చేయడం లాంటి అంశాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానం సాధించగలిగిందంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..ప్రచారం ఎక్కువ.. పని తక్కువ..అబద్ధాలు, మోసాలు.. ఇదీ బాబు 22వ ర్యాంక్ విజన్» రాష్ట్రం తీవ్ర ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందనేందుకు ప్రభుత్వ ఆదాయాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం కల్పిత జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) గణాంకాలతో ప్రజలను మభ్యపెట్టి, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందనే తప్పుడు భావన కలిగిస్తోంది.» 2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75 శాతం (నామినల్ జీఎస్డీపీ)గా ఉందని, జాతీయ వృద్ధిరేటు 9.8 శాతం మాత్రమేనని.. అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75 శాతంగా ఉంటుందని, జాతీయ వృద్ధిరేటు 8.0 శాతం మాత్రమేనని చంద్రబాబు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 11.09 శాతంగా చూపిస్తోంది. అంతేకాదు.. వాస్తవ (రియల్) జీఎస్డీపీ వృద్ధి పరంగా ఈ ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేవీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు. ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారు చేసిన అంకెలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు. » ఆ గణాంకాలే నిజమైతే ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలలకు కాగ్ గణాంకాలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. ఆశ్చర్యకరంగా రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి (సీఏజీఆర్) కేవలం 1.97 శాతం మాత్రమే ఉంది. 11.09 శాతం భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97 శాతం వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరికీ ఆశ్చర్యంగా అనిపించక మానదు. ‘విజనరీ’ నాయకత్వంలో తయారుచేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి. » ఇంకా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి 9 నెలల పాటు 23 రాష్ట్రాల పన్నుల ఆదాయాలను కాగ్ విడుదల చేసింది. పన్ను ఆదాయాల వృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది. అంటే చివర నుంచి రెండో స్థానంలో ఉంది. » అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64 శాతం పెరిగితే, ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాలు మాత్రం 1.97 శాతం మాత్రమే పెరిగాయి. అయినా కూడా చంద్రబాబు ప్రకారం ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైనదట! చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏదైనా విషయంలో మొదటి స్థానం సాధించగలదంటే... అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, విషప్రచారం లాంటి విషయాల్లో మాత్రమే!! -
అప్పుల్లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: అంతులేని అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం చంద్రబాబు నెల నెలా దిగజార్చేస్తున్నారు! రుణభారం, రెవెన్యూ లోటుతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. 18 నెలల్లో రూ.3.27 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారు. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అప్పులు దేశంలోనే అత్యధికంగా రూ.85,269 కోట్లుగా ఉన్నట్లు కాగ్ వెల్లడించింది. బిహార్ను మించిపోయి టీడీపీ కూటమి సర్కారు అప్పులు చేయడం గమనార్హం. ఈమేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు బడ్జెట్ కీలక సూచికలను కాగ్ విడుదల చేసింది. రెవెన్యూ లోటు రెట్టింపు.. ఆంధ్రప్రదేశ్ అప్పులు, రెవెన్యూ లోటు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్లో పేర్కొన్న అప్పులను ఇంకా మూడు నెలలు మిగిలి ఉండగానే దాటేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది మొత్తానికి బడ్జెట్ అంచనాల అప్పు రూ.79,952 కోట్లు కాగా ఇప్పటికే గీత దాటి రూ.85,269 కోట్లు అప్పులు చేసింది. ఇక రాష్ట్ర సొంత పన్నుల రాబడిని మించి అదనంగా రూ.10 వేల కోట్లకు పైగా అప్పులు చేయడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర సొంత పన్నుల రాబడి డిసెంబర్ నాటికి రూ.74,163 కోట్లు కాగా అప్పు ఏకంగా రూ.85,269 కోట్లకు ఎగబాకింది. మరోపక్క బడ్జెట్లో మొత్తం రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా పేర్కొనగా డిసెంబర్ నాటికే రెట్టింపు స్థాయిలో రూ.60,480 కోట్ల రెవెన్యూ లోటులోకి రాష్ట్రం వెళ్లిపోయిందని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంకోవైపు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి నిధులు తగ్గిపోయాయి. 2023–24 డిసెంబర్తో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు కేంద్ర గ్రాంట్ల రూపంలో నిధులు ఏకంగా రూ.15,247 కోట్లు తగ్గిపోవడం గమనార్హం.సంక్షేమానికి తూట్లు..చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి నెలా అమ్మకం పన్ను రాబడి తగ్గడమే గానీ పెరగడం లేదని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇతర పన్నులు, డ్యూటీ రూపంలో రావాల్సిన రాబడి కూడా తగ్గడమే గానీ వృద్ధి అనేదే లేదు. 2023–24 డిసెంబర్తో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి ఇతర పన్నులు, డ్యూటీల రూపంలో రావాల్సిన రాబడి రూ.1,583 కోట్లు తగ్గిపోయింది. 2023–24 ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు పోల్చితే.. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి అమ్మకం పన్ను రాబడి ఏకంగా రూ.6,22 కోట్లు తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో నిలిచింది. చిట్ట చివరి నుంచి ఏపీ రెండో స్థానంలో ఉంది. అమ్మకం పన్ను రాబడి క్షీణించడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని స్పష్టం అవుతోంది. ఇక 2023–24 డిసెంబర్ వరకు పోల్చి చూస్తే సామాజిక రంగ వ్యయం 2025–26 డిసెంబర్ నాటికి రూ.5,874 కోట్లు తగ్గిపోయింది. -
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభను వాయిదా వేసి బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం నిర్వహించి సభ ఎన్ని రోజులు జరపాలి, ఏ అంశాలపై చర్చించాలనే విషయాలు ఖరారు చేయనున్నారు. 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మార్చి 12 వరకూ సమావేశాలు జరుగుతాయని ఇప్పటికే స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మొత్తం 19 పని దినాల్లో సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో చర్చించి దీనికి ఆమోదం తెలపనున్నారు. కార్యదర్శులతో స్పీకర్ సమావేశం బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు పంపాలని ఆదేశించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నెల రోజులైనా సమాధానాలు రాకపోవడం చూస్తున్నామని ఇకపై అలా జరగకుండా సకాలంలో సమాధానాలు పంపేలా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాల సమావేశాలను నేషనల్ ఈ–విధాన్ కింద డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. మార్చి 5 నుంచి 7 వరకు క్రీడా పోటీలు అసెంబ్లీ సమావేశాల్లో ఆటవిడుపుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్లు, విప్లు, మంత్రులు, వివిధ శాఖల అధికారులతో ఈ పోటీల నిర్వహణ సన్నద్ధతపై చర్చించారు. ఇందుకోసం శాసనసభ, శాసన మండలి చీఫ్ విప్లు, విప్లతో ఒక కమిటీ వేయాలన్నారు. క్రీడా పోటీలను మధ్యాహ్నం నుంచి జరపాలని, సాంస్కృతిక కార్యక్రమాలను చివరి రోజు సాయంత్రం జరపాలని సూచించారు. -
శివ భక్తులపై లాఠీచార్జి దుర్మార్గం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ పాలనలో శ్రీశైలంలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం, బాధాకరమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన రూపంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోర వైఫల్యం బయటపడిందన్నారు. దురదృష్టవశాత్తూ చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయాల ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయని ఎత్తిచూపారు. తిరుమల లడ్డూనూ పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిందని.. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోందని వివరించారు.శ్రీశైలంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ‘ఎక్స్’లో తన ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..‘‘ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాలనలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుగారి పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధ కలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది.కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది. జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇస్తున్న సమయాన్ని ఏడు రోజులకు కుదించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. 🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance.Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu.… pic.twitter.com/kBILeAwLOY— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు. దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2025లో ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..: ⇒ తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి.⇒ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు.⇒ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.⇒ జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు ఎత్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. ⇒ దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు గారి నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోంది.⇒ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’ -
జంతువుల కొవ్వు కలిసిందని చెప్పు.. నాగేశ్వర్కు బెదిరింపులు
సాక్షి, అమరావతి: ‘‘ఒరేయ్.. నా కొడకా.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు, ఆవుకొవ్వు, బాత్రూం రసాయనాలు కలిశాయని ఎందుకు చెప్పవురా నువ్వు.. ఇదే కాదు ఇంత కన్నా దారుణమైంది కలిసిందని కూడా చెప్పాలి.’’ అంటూ కొంతమంది ఆగంతకులు ఫోన్లు చేసి తనను బెదిరిస్తున్నట్లు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా లడ్డూలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు, పవన్, లోకేశ్ చేస్తున్న ప్రచారాన్ని నాగేశ్వర్ తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ–సిట్ చార్జ్షీట్లో స్పష్టం చేసిన తరువాత కూడా కలిసిందని నిరూపించాలని యత్నం చేయడం హిందూ దేవుళ్లు, హిందూ సమాజంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కూటమి అనుకూల వర్గీయులు బెదిరింపు ఫోన్లు చేస్తున్నారు. జంతువుల కొవ్వు, బాత్రూం రసాయనాలే కాకుండా మరికొన్ని దారుణమైనవి లడ్డూలో కలిశాయని చెప్పాలంటూ దాదాపు 20 నుంచి 30 ఫోన్లు వచ్చాయని నాగేశ్వర్ తెలిపారు. అలా చెప్పడం అన్యాయమవుతుందని, కావున తానలా చెప్పలేనన్నానని ఆయన వివరించారు. ‘రెడ్బుక్ రాజ్యాంగం’ వారిపై అమలు కాదా? మూడు రోజుల క్రితమే ఈ వేధింపులపై ఫిర్యాదు చేసినా మంత్రి లోకేశ్ కనీసం పట్టించుకోలేదని నాగేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ రికార్డులను లోకేశ్ టీమ్ జైకు పంపించానని, దీనికి స్పందనగా ఆయన పోలీసులు ఆగంతకులను హెచ్చరించారని, మళ్లీ ఆ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్లు రావని చెప్పారని నాగేశ్వర్ వివరించారు. అయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు రోజుకు 20 నుంచి 30 మంది ఫోన్లు చేస్తున్నారని, బెదిరిస్తున్న వారి నంబర్లు రాష్ట్ర మంత్రికి స్వయంగా పంపితే వారిపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయాలి కదా అని లోకేశ్ను నిలదీశారు. ‘‘మీరు నన్ను కొట్టినా, తిట్టినా, చంపుతామని బెదిరించినా, నేను మాత్రం నిరూపణ కాకుండా, ఆధారాలు లేకుండా దేవుని లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందనే మాటను చచ్చినా అనను. పంది కొవ్వు కలిసిందని, బాత్రూం రసాయనాలు కలిశాయని మీరు వాడుతున్న భాషను నేను వాడను. ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను దేనికైనా సిద్ధం.’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. కల్తీ జరిగితే నిరూపించండి: మరో వైపు లడ్డూ విషయంలో జరుగుతున్న ప్రచారం, వస్తున్న వార్తలపై నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్గానీ, విచారణగానీ జరగకుండా సీఎం చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ప్రకటన చేయడం, దానిని పట్టుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ కూడా అదే మాట్లాడటం దారుణమని మరోసారి నాగేశ్వర్ తప్పుబట్టారు. -
DSCలో అక్రమ నియామకాలు.. ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,విజయవాడ: డీఎస్సీలో అక్రమ నియామకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనుల చేత పూరించవలసిన 3వేల అధ్యాపక పోస్టులను జనరల్లో పూరించడంపై సీరియస్ అయ్యింది.గిరిజన యువతీ యువకులకు అన్యాయం చేయడమే రాష్ట్రప్రభుత్వ ఉద్దేశమా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గిరిజన నిరుద్యోగులకు చెందాల్సిన పోస్టులను ఏ అధికారంతో డీఎస్పీలో కలిపారంటూ నిలదీసింది.ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల వల్ల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఖాళీలున్నాయి. ఎంతమంది అభ్యర్థుల చేత ఖాళీలు పూరించబడ్డాయి. ఇంకా ఎన్నిపోస్టులు పూరించాలో ప్రమాణపత్రం దాఖలు చేయాలని.. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల గిరిజన నిరుద్యోగులు తమ హక్కులు కోల్పోతున్నారన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
తెలుగువారి పరువు తీస్తున్న బాబూ అండ్ కో!
తమిళనటుడు కమల్హాసన్ తెలుగువారి కీర్తి దశదిశలా మారుమోగేలా చేశారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో చేసిన తొలి ప్రసంగంలో తెలుగువారు గర్వించదగ్గ కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కవిత ‘వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్’’ను చదివి వినిపించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ కవితకు ఆర్థం తెలుగువారికి బాగా తెలుసంటూ ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు అది వేరే సంగతి.ఒక పక్క ఓ తమిళ నటుడు తెలుగువారి సాహితీ వైభవాన్ని చాటిచెబితే ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అందరి ఆరాధ్యదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మాట్లాడటం మాత్రం తెలుగువారికి ఏమంత గర్వకారణం కాదు. అంతేకాదు.. ఈ రాజకీయ బురదలోకి బాబు అండ్ కో బీజేపీ నేత మాధవ్ను కూడా దింపేశారు. కల్తీ మకిలిని మాజీ సీఎం జగన్పైకి నెట్టేందుకు టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలం కావడం.. జగన్ జనాల్లో తిరుగుతూ ప్రభంజనాన్ని సృష్టిస్తుండడంతో చంద్రబాబుకు ఎటూ పాలుపోవడంలేదుఅందుకేనేమో.. పవన్కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మరికొందరు మంత్రులతో మూకుమ్మడిగా ప్రెస్మీట్ పెట్టి జగన్, వైసీపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు. మత కోణాన్ని తెచ్చి జగన్ను దెబ్బతీయాలని ప్రయత్నించి బోర్లాపడ్డారు. ఈ క్రమంలోనే పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ చంద్రబాబు హిందూ ధర్మంలో విడాకులు ఉండవని, పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని వింత వ్యాఖ్యలు చేస్తూ విడాకులు తీసుకోవడాన్ని తప్పుపట్టారు. సహజంగానే ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తీవ్ర అసహనం కలిగింది.అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అప్పుడే చంద్రబాబు తప్పు మాట్లాడుతున్నారని ధైర్యంగా చెప్పగలిగి ఆయన గౌరవం పెరిగేది జనసైనికులలో ఆయనపై నమ్మకం కలిగేది. కాని ఆయన మౌనంగా కూర్చోవడం వారి గుండె మంటకు కారణమైంది. ఎందుకంటే హిందూ ధర్మం అయినా, మరే మత ధర్మమైనా అవి విశ్వాసాలే. కాని దేశానికి ఒక రాజ్యాంగం, చట్టం ఉంటాయి.రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి విడాకుల గురించి అలాంటి మాటలు మాట్లాడితే మరి చట్టం మాటేమిటి? ఏ కారణం వల్లనైనా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినా, మహిళలు హింసను కూడా భరించాలని చంద్రబాబు చెప్పదలిచారా? సంసారాలు విడాకుల వరకు వెళ్లగూడదని చెప్పడం వేరు. అసలు విడాకులు తీసుకోవమే నేరం అన్నట్లు మాట్లాడడం వేరు.ఇది ఒక కోణమైతే వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేందుకు వైసీపీ ప్రభుత్వంలో కుట్ర జరిగిందని చంద్రబాబు ఇంకో దిక్కుమాలిన వాదన తీసుకువచ్చారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న తన ఆరోపణలో నిజం లేదని వెల్లడయ్యాక, ప్రజలలో వచ్చిన అప్రతిష్టను డైవర్ట్ చేయడానికి మరో కుట్ర చేసినట్లు కనిపిస్తుంది. నిజానికి రాజకీయ ప్రత్యర్థి జగన్పై బురద రాయాలన్న తాపత్రయంలో, ఓట్ల రాజకీయంలో భాగంగా చంద్రబాబు ఈ ఆరోపణ చేశారన్న విషయం అందరికి తెలుసు.విశేషం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏమో తిరుమలకు అపవిత్రత రాకూడదన్న లక్ష్యంతో పాకులాడుతుంటే, తాను స్వామివారి భక్తుడిని అంటూ ఆయనకే అపచారం చేసే విధంగా మాట్లాడడానికి చంద్రబాబు వెనుకాడడం లేదు. తన హయాంలో జరిగిన తప్పులను సైతం వైసీపీపై తోసివేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం వికటిస్తున్నా, గోబెల్స్ మాదిరి అదే తప్పుడు ప్రచారం పదే, పదే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనికి ఎల్లో మీడియా డైరెక్షన్ ఎటూ ఉంది.పవన్ కళ్యాణ్ తాను గతంలో చేసిన కొన్ని ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపించింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడానికి సీఎంకు ఏమి సంబంధం ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబుతో భేటీ తర్వాత పాతపాటే పాడారు. చంద్రబాబు బతిమలాడారా? బెదిరించారా? ఈ వివాదంలో బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అంటీ అంటనట్లే ఉంటున్నారు. కాని చంద్రబాబు ఆయన్నూ పనికట్టుకుని ప్రెస్మీట్లో పాల్గొనేలా చేశారు. తద్వారా ఆ బురదను ఈయనకు కూడా అంటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు లడ్డూ వివాదాన్ని సృష్టించడానికి ఏ రకంగా పనిచేసింది వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఒక క్రమ పద్ధతిలో వివరించారు. అదంతా వింటే జగన్పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశారని స్పష్టమవుతుంది. లడ్డూ ప్రసాదం కల్తీపై దర్యాప్తునకు సిట్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దాంతో ఈ విచారణ చాలావరకు చంద్రబాబు చేతి నుంచి జారి పోయింది. రాష్ట్ర పోలీసు అధికారులు ఇద్దరు సిట్లో ఉన్నా ప్రధాన పాత్ర సీబీఐది కావడం వల్లనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టమైన నివేదిక ఇవ్వగలిగారు.ఈ పరిణామంతో తాము జనంలో బాగా పలుచనయ్యామన్న సంగతిని అర్థం చేసుకున్న చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని ఏకంగా ఫ్లెక్సీలు కట్టి జగన్, సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిలపై దుష్ప్రచారం చేయించారు. జంతు కొవ్వు ఆరోపణ చేయడం, అరాచకపు ఫ్లెక్సీలు కట్టించడం, లడ్డూకు ఏదో అయిందన్నట్లు అదే పనిగా ప్రచారం చేయించడం.. వీటిని కదా వెంకన్నకు మకిలి అంటించే కుట్ర అనేది? జగన్ గుంటూరు పర్యటనకు జనం విశేషంగా రావడం, అక్కడ లడ్డూ అంశాన్ని ప్రస్తావించి చంద్రబాబును తీవ్రంగా తప్పుపట్టడంతో చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టి మరింత గందరగోళంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని ప్రశ్నలు సంధించారు. నెయ్యి కల్తీ జరిగినట్లు చెబుతున్న నెయ్యి శాంపిల్స్ తీసింది కూటమి ప్రభుత్వంలోనా? కాదా? వెనక్కి పంపించిన నాలుగు ట్యాంకర్లు కొన్నాళ్లు శ్రీకాళహస్తిలో ఉంచడం, తదుపరి ఆ నెయ్యిని కూడా స్వీకరించారని సిట్ తెలిపిందా? లేదా? బోలేబాబా కంపెనీ వచ్చింది 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనా? కాదా? చంద్రబాబు హయాంలోనే కిలో నెయ్యి రూ.291లకే టీటీడీ ఎలా కొనుగోలు చేసింది?ఈ ప్రశ్నలకు చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్లు ఎక్కడా జవాబు ఇవ్వలేదు. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సిట్ తేల్చింది కదా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించినప్పుడు చంద్రబాబులో కనిపించిన అసహనం అన్నిటికి జవాబు చెబుతోంది. ప్రెస్మీట్ లో పాల్గొన్నవారిలో ఒక్కరి ముఖంలో నెత్తురు చుక్క కనిపించడం లేదని, తప్పు చేశామన్న గిల్టితో ఉండి దబాయింపు చేసి బయటపడాలన్న వారి తాపత్రయం కనబడుతోందని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అనిపిస్తుంది.ఇక పవన్ కళ్యాణ్ మరోసారి మాట మార్చి భగవంతుడిపైనే పగబట్టారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.దానికి పేర్నినాని జవాబు ఇస్తూ పవన్ కళ్యాణ్ ఒకసారి క్రిస్టియన్ అని, బాప్టిజం తీసుకున్నానని చెబుతారు. మరోసారి ముస్లిం అని అంటారు. ఇంకోసారి తన తండ్రి దీపారాధన వత్తుల మంటలో సిగరెట్ వెలిగించుకుంటారని అంటారు..ఇక ఆయన సోదరుడు తాను నాస్తికుడనని చెబుతారు.. మళ్లీ హిందూ సనాతని అన్నట్లు మాట్లాడుతున్నారు..అని మండిపడ్డారు.వీరంతా రాజకీయ అవసరాల కోసం రకరకాల అవతారాలు ఎత్తుతున్నారని వైసీపీ ధ్వజమెత్తుతోంది.నిజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర కూటమి నేతలు హిందూ ధర్మం పట్ల నిబద్దత ఉంటే నిత్యం అబద్దాలు చెబుతారా? మోసపూరిత హామీలు ఇచ్చి జనాన్ని మభ్య పెడతారా? అన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేరు. తనపై తనకు నమ్మకం లేనప్పుడు, తమ అసమర్ధతను ప్రజలు బాగా గుర్తిస్తున్నారని భయపడినప్పుడే పాలకులు మతాన్ని తెరపైకి తెస్తారని ఒక రచయిత అంటారు. నిజమే కావచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కౌన్సిల్ తీర్మానంతో గోల్మాల్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే తమ బంధువు సంస్థ గీతం ఆక్రమిత భూములను క్రమబబ్ధికరించుకునేందుకు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో ఎన్నడూ లేనివిధంగా గూండారాజ్ను అమలు చేసి తీర్మానాన్ని ఆమోదించుకున్న అధికార పార్టీ.. ఇప్పుడు తోకపత్రిక విషయంలో మరో అడుగు ముందుకు వేసి ఏకంగా రికార్డులు మార్చి మరీ భూమిని కట్టబెట్టేందుకు సిద్ధపడినట్టు స్పష్టమవుతోంది. అత్యవసరమైన అంశాలను చేర్చాల్సిన టేబుల్ అజెండాలో చివరి అంశంగా (67వ అంశం) తన తోకపత్రిక ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్.. ఆమోద పబ్లికేషన్స్కు భూ కేటాయింపు అంశాన్ని గత ఏడాది ఆగస్టు 22 నాటి సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం తెరమీదకు తీసుకొచి్చంది. అయితే ఈ విషయాన్ని కౌన్సిల్ తిరస్కరించింది.కౌన్సిల్ సమావేశం ఈ తీర్మానాన్ని తిరస్కరించిన నేపథ్యంలో రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ సమావేశపు వివరాలను ప్రకటన రూపంలో జీవీఎంసీ విడుదల చేసింది. ఇందులో స్పష్టంగా టేబుల్ అజెండాలో ఉన్న 67వ అంశాన్ని కౌన్సిల్ ఆమోదించలేదని ప్రకటించారు. అయినప్పటికీ.. రికార్డుల్లో మాత్రం కౌన్సిల్ తీర్మానాన్ని ఆమోదించినట్టుగా పేర్కొంటూ తహసీల్దారుకు జీవీఎంసీ జోనల్ కమిషనర్ (జోన్–2) లేఖ రాశారు. ఇందులో స్పష్టంగా 2025 ఆగస్టు 22 నాటి జీవీఎంసీ కౌన్సిల్లో ఆమోదించినట్టుగా పేర్కొన్నారు. ఈ రికార్డుల తారుమారులో ఎవరిపాత్ర ఎంత ఉందనే వ్యవహారం ఇప్పుడు తేలాల్సి ఉంది. లాంఛనమే అయితే..! వాస్తవానికి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం లాంఛనమే అంటూ స్థానిక సంస్థల అధికారాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేసింది తోకపత్రిక. నిజంగా జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం కేవలం లాంఛనమే అయితే.. గీతంకు భూ కేటాయింపుపై ఎందుకంతగా రాద్ధాంతం చేసి.. ప్రతిపక్ష కార్పొరేటర్లపై దాడికి దిగి మరీ చర్చలేకుండానే ఆమోదించినట్టుగా ప్రకటించారు. స్థానిక సంస్థలు అంగీకరించకుండా భూమిని కేటాయించడం నేరుగా ముఖ్యమంత్రికి కూడా సాధ్యమయ్యే పనికాదు. ఆ విషయం తోకపత్రికకు కూడా స్పష్టంగా తెలుసు. అందుకే అత్యవసరంగా టేబుల్ అజెండా మీదకు తెచ్చి.. ఆమోదించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే సభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో ఆమోదం పొందలేదు.ఆ తర్వాత మరో కౌన్సిల్ సమావేశంలో ఆమోదింపజేసుకునేందుకు తీర్మానం రూపంలో ముందుకు రావాల్సిందే. అంతేతప్ప.. ఏదో ఒక సభ్యుడు అనుమానం వ్యక్తం చేస్తే.. వ్యక్తిగతంగా అనుమానం తీర్చాం కాబట్టి ఆమోదించినట్టుగా రికార్డులు సృష్టిస్తామంటే కుదరని పని. ఈ విషయం కూడా తోకపత్రికకు స్పష్టంగా తెలుసు. ఆమోదించని తీర్మానాన్ని.. కౌన్సిల్ తిరస్కరించిన తీర్మానాన్ని మళ్లీ కౌన్సిల్ ముందు పెడితే ఆమోదించే అవకాశం లేదని అవగాహన ఉంది. అందుకే రికార్డులు తారుమారు చేసి కౌన్సిల్ తీర్మానాన్ని ఆమోదించినట్టుగా రికార్డులు మార్చివేశారు.ఈ రికార్డుల మారి్పడి వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంతమేర ఉందనేది లోతుగా విచారిస్తే కచి్చతంగా అసలు దొంగల గుట్టు బయటకు వచ్చే అవకాశం ఉంది. నిజంగా జీవీఎంసీ తీర్మానం లాంఛనమే అయితే రికార్డులు మార్చాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? వాస్తవానికి జీవీఎంసీ తీర్మానం తప్పనిసరి కాబట్టే ఏకంగా రికార్డులు మార్చి మరీ.. ఆమోదించని తీర్మానాన్ని ఆమోదించినట్టుగా పేర్కొన్నారు. ఎలాగూ ఉంది తమ ప్రభుత్వమే కదా అనే ధీమాతోనే ఈ తతంగం నడిపించినట్టు తెలుస్తోంది.రికార్డులు మార్చిందెవరు? జీవీఎంసీ కౌన్సిల్ సమావేశపు అజెండాను సెక్రటరీ సెల్ తయారుచేస్తుంది. సమావేశపు వివరాలను కూడా సదరు సెక్రటరీ సెల్ నమోదు చేయడంతోపాటు మినిట్స్ను కూడా నమోదు చేస్తుంది. ఈ విధంగా తయారైన మినిట్స్ను మేయర్ ఆమోదానికి ఉంచి.. ఆ కాపీని సభ్యులందరికీ అందజేయాల్సి ఉంటుంది. అయితే కౌన్సిల్లో ఆమోదించని విషయాన్ని కాస్తా ఆమోదించినట్టు రికార్డుల్లోకి ఎక్కించడంలో సెక్రటరీతోపాటు సెక్రటరీ సెల్ పాత్ర ఏమిటనేది తేలాల్సి ఉంది. అంతేకాకుండా సదరు సెక్రటరీ సెల్పై ఒత్తిడి తెచి్చన వ్యక్తులు ఎవరనేది కూడా లోతుగా విచారిస్తే తేలనుంది.ఇప్పటివరకు సదరు సమావేశపు వివరాలను సభ్యులకు కూడా అందించలేదని తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ఈ సమావేశపు వివరాలను సభ్యులకు ఇవ్వకుండా దాగుడు మూతలు ఆడారా? అనే విషయం కూడా తేలాల్సి ఉంది. ఎలాగూ ఉంది తమ ప్రభుత్వమే కదా అని స్థానిక సంస్థల నిర్ణయాన్ని ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోవడం ఏమిటనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. మొత్తంగా ఆమోదం లభించని తీర్మానం కాస్తా తమ తోకపత్రిక కోసం ‘ఆమోద’ముద్ర వేయించడంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
తెల్ల ఖనిజం తవ్వేస్తూ.. తమ్ముళ్ల జేబులు నింపేస్తూ..
అనుమతులుండవు.. అడిగేందుకు ఏ శాఖ అధికారీ ముందుకు రాడు. ఫిర్యాదులు వస్తే నామ్కే వాస్తేగా దాడులతో మమ అనిపిస్తారు. అధికారం మాది.. అధికారులు మావాళ్లు.. ఏవరి వాటా వారికిస్తున్నాం.. మా ఇష్టం అన్నట్లు తెల్ల ఖనిజాన్ని తెలుగు తమ్ముళ్లు కొల్లగొడుతూ రూ.కోట్లు దండుకుంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కనిగిరి ప్రాంతంలోని తెల్లరాయికి మంచి గిరాకీ ఉండటంతో అధికార పార్టీ అండగా.. తెలుగు తమ్ముళ్ల భాగస్వామ్యంతో అక్రమార్కులు భారీగా తెల్లరాయి తవ్వకాలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.కనిగిరిరూరల్/పీసీపల్లి: మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు రూ.లక్షలవిలువైన సహజ వనరులను, ఖనిజ సంపదలను ఇష్టాను సారంగా దోచుకుంటున్నారు. ఆరు మండలాల్లో రెవె న్యూ, ఫారెస్ట్, కొండ పరివాహక శివారు ప్రాంత భూములను అడ్డాగా మార్చుకుని యంత్రాలతో రాత్రుల్లో తెల్లరాయిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కొన్నిచోట్ల కొంత భూమిని లీజు అనుమతి పొంది.. వారికి ఇష్టమొచ్చినంత తవ్వుతుండగా, మరికొన్ని చోట్ల అసలు అనుమతి అనే మాట లేకుండానే అధికార పార్టీ అండే తమకు లైసెన్స్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనేక మండలాల్లో తెల్లరాయి ఉన్నా.. కనిగిరి ప్రాంతంలో ఉన్న తెల్లరాయి కి మంచి గిరాకీ ఉంది. ఇక్కడ గ్రేడ్ 1 రకం రాయి లభ్యమవుతుంది. దీంతో కనిగిరి నియోజకవర్గంలో తెల్లరాయి తవ్వకాలకే మైనింగ్ మాఫియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రెవెన్యూ, అటవీ ప్రాంతం అధికంగా ఉండటం.. శివారు ప్రాంతం కావడంతో చెన్నై లాంటి ప్రాంతాలకు వైట్క్వార్జ్ (తెల్ల రాయిని)ని ఎక్కువగా తరలించే అవకాశం ఉండటంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వారు స్థానిక టీడీపీ నేతల అండతో ఇక్కడ మకాం వేసి అక్రమ దందా సాగిస్తున్నారు. మామూళ్ల మత్తులో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులుతెల్లరాయి అక్రమ తవ్వకాల వ్యవహారం అధికారులకు తెలియదంటే పొరపాటే. అధికార పార్టీ నేతల ఒత్తిడి కొంత ఉన్నా.. అక్రమార్జనలో తిలా పాపం తలా పిడికెడు అన్న చందాన కొల్లగొట్టిన తెల్ల ఖనిజ ఆదాయంలో అధికారులకు నెలవారీ నజరానాలు అందుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో అధికారుల సలహాలు, సూచనలతో స్టాక్ పాయింట్లకు, తవ్వకాలకు కొంత భూములను అనుమతి తీసుకుని వాటిని అధికారులకు చూపి స్తూ ఇతర రెవెన్యూ, ఫారెస్ట్ భూములుగా నిర్ధారణ కాని, హద్దులు తేల్చని ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తున్నారు. రాత్రుళ్లు పొక్లైన్లతో, జేసీబీలతో తవ్వకాలు చేసి అనుమతి పొందిన స్టాక్ పాయింట్ ప్రదేశంలో వేసుకుని తెల్లవారిన తర్వాత తరలిస్తున్నారు. ఇది ఒకరకం దోపిడీ కాగా మరోరకం దోపిడీ అయితే పీసీపల్లి కేంద్రంగా సాగుతోంది. ఇక్కడ అనుమతులుండవు.. అధికారులు రారు.. తమ్ముళ్లదే ఇష్టారాజ్యం. అటవీ, రెవెన్యూ ఇలా ఏ భూముల్లో అయినా రాత్రింబవళ్లు తవ్వకాలు జోరుగా చేస్తుంటారు. ఒక్కో లారీకి 30 నుంచి 40 టన్ను ల ఎగుమతి జరగ్గా.. టన్నుకు రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తోందని తెలిసింది. వారానికి నాలుగు లారీల చొప్పున తెల్లరాయి తరలిస్తున్నాయి. పీసీపల్లి అడ్డాగా.. పచ్చనేతల చీకటి దందా పీసీపల్లి మండలంలో మైనింగ్ మాఫియా రోజురోజుకూ రెచ్చిపోతోంది. మండలంలోని అధికార పార్టీ మాజీ ఎంపీటీసీ కుమారుడు నేరేడుపల్లి, లక్ష్మక్కపల్లిలో గుంటూరు లింగన్నపాలెం, అడవిలోపల్లి, మెట్లవారిపాలెం, గుంటుపల్లి, తురకపల్లి, మురిగమ్మి గ్రామాల్లో అక్రమ మైనింగ్కి పాల్పడుతున్నారు. మురగమ్మిలో 20 ఎకరాల్లో అటవీ, రెవెన్యూ, కొండపోరంబోకు భూములు, నేరేడుపల్లిలో 25 ఎకరాల్లో, గుంటుపల్లిలో 10 ఎకరాల్లో, తురకపల్లిలో 15 ఎకరాల్లో, లక్ష్మక్కపల్లిలో (మాలకొండకు పోయే దారిలో) 20 ఎకరాల్లో, లింగన్నపాలెంలో 5 ఎకరాల్లో అటవీ, రెవెన్యూ, కొండపోరంబోకు భూముల్లో నెల్లూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన వారు స్థానిక అధికార పార్టీ నేతల అండతో జోరుగా తవ్వకాలు చేస్తున్నారు.గడిచిన కాలంలో ఒక్క మురగమ్మి ప్రాంతంలోనే మైనింగ్ శాఖ అధికారులు ఐదు సార్లు దాడులు చేసి లారీలను, జేసీబీలను, తెల్లరాయిని పట్టుకున్నారు. అయినా తెల్లరాయి దందాను తమ్ముళ్లు యథేచ్ఛగా సాగిస్తున్నారు. పీసీపల్లి నుంచి నెల రోజుల వ్యవధిలో సుమారు ఒక వెయ్యి టన్నుల మేర అక్రమార్కులు గ్రేజింగ్, అటవీ పోరంబోకు భూముల్లో తెల్లరాయి తవ్వకాలు జరిపినట్లు అంచనా. అనుమతి (లీజు) పొందిన ప్రదేశంలో తవ్వకాలు జరిపినట్లు రికార్డులు చూపిస్తూ.. పది శాతం చలానా చెల్లించి.. 100 శాతం అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు.ఫిర్యాదులు చేస్తేనే కదలికమైనింగ్ అక్రమ తవ్వకాలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. మైనింగ్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు తెల్లరాయి ఖనిజాల తవ్వకాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ ఆ వైపు అడుగులు వేసిన దాఖలాలు లేవు. మైనింగ్ శాఖ రాష్ట్ర అధికారులకు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే.. నామ్కే వాస్తే రెండు నెలలకొకసారి మేమున్నాం అంటూ ఒకటి రెండు కేసులు పెట్టి మమ అనిపిస్తారు. కొంతకాలం క్రితం కనిగిరి, వెలిగండ్ల శివారు ప్రాంతాల్లో చీర్లదిన్నె, నాగిరెడ్డి కొండల మధ్య ఫారెస్ట్ బీట్ భూముల్లో టీడీపీ నాయకుడు అక్రమంగా మైనింగ్ తవ్వుతుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.భారీ స్థాయిలో తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు. అయితే సుమారు 10 టన్నుల రాయి స్టాక్ మాత్రమే దొరకడంతో రూ.1.30 లక్షల పెనాల్టీ వేసినట్లు తెలిసింది. గత గురువారం రాత్రి మురిగమ్మి కొండ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న తెల్లరాయిని మైనింగ్, విజిలెన్స్ ఉన్నతాధికారులు దాడులు చేసి ఓ లారీ, జేసీబీ సీజ్ చేశారు. బల్లిపల్లి ప్రాంతంలో తెల్లరాయి తవ్వకం విషయంలో కూటమి నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం.తెల్లరాయి తవ్వకం ప్రాంతాలు ఇవే..కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి మండలం బల్లిపల్లి, అడ్డరోడ్డు, చీర్లదిన్నె, బాల వెంకటాపురం, వెలిగండ్ల శివారు ప్రాంతాలు, నాగిరెడ్డిపల్లి, పీïÜç³ల్లి మండలంలో గుంటుపల్లి, లక్ష్మక్కపల్లి, మురిగమ్మి, పామూరు మండలం మార్కొండాపురం,నాసికాత్రయంబకం తది తర ప్రాంతాల్లో రెవెన్యూ, ఫారెస్ట్ భూముల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. -
ఒకే ఘటనపై ఎన్ని కేసులు పెడతారు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వులు లేవని సీబీఐ–సిట్ చార్జిషిట్ దాఖలు చేసినా.. అధికార పార్టీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో చేసిన వ్యాఖ్యలకు గాను తనపై రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన 33 కేసులను కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు సోమవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు.ఒకే అంశంపై ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ప్రశి్నంచారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదన్నారు. దీనిపై పోలీసులకు తగిన సూచనలు చేస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ నాటికి స్పష్టత తీసుకోవాలని పీపీకి న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 33 కేసుల్లో చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసి ఆయన వివరణ తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేశారు. అంబటి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 35 కేసులు ఒకే అంశానికి సంబంధించినవని, దీనిపై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. చట్ట ప్రకారం నడుచుకోండి గత ఏడాది జూన్లో వెన్నుపోటు దినం పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించినందుకు అంబటి రాంబాబుపై నమోదైన కేసుల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని గుంటూరు, పట్టాభిపురం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆయనకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలంది. అంబటిపై నమోదైన కేసులు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని, ఫిర్యాదుదారులకు నోటీసులివ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆప్కాస్ ఉద్యోగాలకు మంగళం!?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీకి మళ్లీ రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ (ఆప్కాస్) కింద సకాలంలో జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు పొందుతున్న ఉద్యోగులు టీడీపీ కూటమి ప్రభుత్వ తాజా నిర్ణయంతో 2014 నాటి ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ విధానంలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధమైంది. దీంతో.. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఒప్పంద ప్రాతిపదికన నియమించే ఉద్యోగాలను ఇకపై టీడీపీ అనుయాయులకు కట్టబెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల్లోని 1,095 ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 26న నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులను జనవరి 31 నాటికి భర్తీ ప్రక్రియ పూర్తిచేసి ఆప్కాస్ ద్వారా వేతనాలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు కూడా జారీచేశారు. దీంతో వేలల్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా ఈ పోస్టుల భర్తీని నిలిపివేసింది. వీటిలో ఏఎన్ఎం, హెడ్కుక్, అసిస్టెంట్ కుక్, డే అండ్ నైట్ వాచ్ ఉమెన్, అటెండర్, స్వీపర్, స్కావెంజర్ వంటి దాదాపు 500 పోస్టులను ఏజెన్సీ ద్వారా భర్తీచేయాలని నిర్ణయించి అవుట్ సోర్సింగ్ సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధంచేశారు. దీంతోపాటు సంక్షేమ శాఖలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు తదితర 10 విభాగాల్లో మరో 2,600 పోస్టులను కూడా ఇదే విధానంలో అప్పగించనున్నారు.ఆప్కాస్తో ఎలాంటి సంబంధంలేకుండా కాంట్రాక్టు సంస్థలే వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టారు. అయితే, ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా ఒక్కరోజు మినహాయించి 12 నెలల వేతనాలు చెల్లిస్తుండగా, ఇకపై వారికి 10.5 నెలలు మాత్రమే వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పాఠశాల విద్యాశాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లను నియమించగా, వీరికి సదరు సంస్థ ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకుండా వేధిస్తోంది. ఈ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, అకౌంటెంట్, ఏఎన్ఎం, టీచింగ్, హాస్టల్ వార్డెన్స్, పార్ట్టైమ్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకు ప్రతిభ, పని అనుభవాన్ని పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం తమకు కావాల్సిన వారిని ఎంపిక చేశారు. వీటిలో ఒక్కో పోస్టుకు ఓ రేటు కట్టి వసూలు చేసినట్లు తెలిసింది. నాటి టీడీపీ ప్రభుత్వంలో శ్రమ దోపిడీ.. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను గత టీడీపీ ప్రభుత్వం నిలిపివేసింది. కొత్తగా కాంట్రాక్టు విధానం తీసుకొచ్చింది. తన వర్గంలోని అనుయాయులకు లబి్ధచేకూర్చేందుకు మధ్యవర్తులుగా ‘అవుట్ సోర్సింగ్’ కంపెనీలను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీ పోస్టులను మొత్తం గంపగుత్తగా తన వర్గం వారికి (మేన్పవర్ ఏజెన్సీలు) అప్పగించి వారితోనే నియామకాలు చేపట్టింది. వేతనాలు సైతం సదరు కంపెనీయే చెల్లించేది. ఈ కాంట్రాక్టు ఏజెన్సీల ద్వారా ఉద్యోగంలో చేరాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సి వచ్చేది. అప్పట్లో ఈ ఉద్యోగులకు ఒప్పందం ప్రకారం వేతనాలు ఇవ్వకపోగా, జీతంలో కోతలు సర్వసాధారణమయ్యాయి. పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు సైతం ఎగవేశాయి. నియామకాల్లో ఒక విధానం అంటూ లేకుండా దారుణంగా ప్రవర్తించాయి. ఎవరైనా ప్రశి్నస్తే నిర్దాక్షిణ్యంగా ఊస్టింగే. దీంతో చిరుద్యోగులకు రక్షణ లేకుండాపోయింది. మళ్లీ మధ్యవర్తులతో దోపిడీకి స్కెచ్!.. మరోవైపు.. ఆప్కాస్ను రద్దుచేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో.. కొత్తగా చేపట్టే నియామకాలను మధ్యవర్తులు, మేన్పవర్ కంపెనీలకు అప్పగించేందుకు ఈనెల 9న ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓ–12) జారీచేసింది. తొలివిడతలో 10 రకాల ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉద్యోగాలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తోంది. ఇందులో, సమగ్ర శిక్షలోని కేజీబీవీలు.. ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ సొసైటీ.. గిరిజన సంక్షేమ శాఖ.. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ సొసైటీ (గురుకులాలు).. బీసీ సంక్షేమ శాఖ.. మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ.. మైనారిటీ సంక్షేమ శాఖ.. వికలాంగు లు, ట్రాన్స్జెండర్, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ ..జువెనైల్ వెల్ఫేర్, కరెక్షనల్ సర్వీసెస్, వీధి పిల్లల సంక్షేమ శాఖ.. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టి ట్యూషన్స్ సొసైటీలున్నాయి. వీటిల్లో ఖాళీగా ఉన్న 3 వేలకు పైగా పోస్టులను ప్రైవేటు అవుట్ సో ర్సింగ్ ఏ జెన్సీలకు అప్పగించడంతో పాటు ఏడాదిలో 10.5 నెలలకే జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ప్రభు త్వం 2016 ఆగస్టులో జారీచేసిన జీఓ ఎంఎస్ నెం.151 ప్రకారం ఈ నియామకాలు ఉండాలని పేర్కొనడంతో చిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆప్కాస్ కింద 1.07 లక్షల మందికి రక్షణ..రాష్ట్రంలో చిరుద్యోగులను దోచుకుంటున్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు, మేన్పవర్ కంపెనీల నుంచి చిరుద్యోగులకు రక్షణ కల్పించేందుకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్విసెస్ (ఆప్కాస్) సంస్థను 2019 డిసెంబరులో చట్టబద్ధంగా ప్రారంభించింది. అప్పటిదాకా తీవ్ర శ్రమదోపిడీకి గురవుతున్న ఈ ఉద్యోగులను ఆప్కాస్ కిందకు తెచ్చి వారికి గరిష్ట ప్రయోజనాలు కల్పించారు. అలాగే, ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు, మధ్యవర్తులను పూర్తిగా తొలగించారు. ఎస్సీ/ఎస్టీ/ బీసీ, మైనారిటీలు, మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. ఎవరికీ లంచాలిచ్చే ఆస్కారం లేకుండా, ఎలాంటి కోతలు విధించకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించారు. పీఎఫ్, ఈఎస్ఐ రక్షణ కల్పించారు. ఇలా ప్రస్తుతం ఆప్కాస్ కింద 1.07 లక్షల మంది పనిచేస్తున్నారు. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వని ఏజెన్సీలు..సమగ్ర శిక్ష పరిధిలో అమలవుతున్న ఎన్ఎస్క్యూఎఫ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూల్స్, సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ ట్రేడ్స్లో వొకేషనల్ శిక్షణ ప్రారంభించారు. శిక్షణ కోసం తొమ్మిది వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్ ఏజెన్సీల (ప్రైవేట్ ఏజెన్సీలు) ద్వారా 3,350 మంది ఇన్స్ట్రక్టర్లను నియమించారు. అయితే, వీరికి ఐదు నెలలుగా జీతాలివ్వకుండా ఏజెన్సీలు వేధిస్తున్నాయి. దీంతో.. ఓ ట్రైనర్ ‘తాము చేస్తున్నది వెట్టిచాకిరీనా మరేంటో అర్థం కావడంలేదు. వేతనాల్లేకుండా ఎలా బతకాలి’ అని సోషల్ మీడియాలో చేసిన పోస్టు కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘బ్రహ్మచారిగా ఉన్న తనకే ఇలా ఉంటే కుటుంబాలు ఉన్నవారి పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిద’ని ఆయన వాపోయాడు. -
‘వక్ఫ్’ రణభేరి
సాక్షి, నెట్వర్క్ : వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. ఆ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అమరావతి నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి సాకుతో వక్ఫ్ ఆస్తుల కాజేతకు కూటమి సర్కారు పన్నుతున్న కుట్రలపై కన్నెర్రజేసింది. మహోద్యమానికి సిద్ధమని హెచ్చరించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఖాసీం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ముస్లింలు నిరసన తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా తదితరులు పాల్గొన్నారు. ⇒ ఎనీ్టఆర్ జిల్లా వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం నేతలు వక్ఫ్ బోర్డు ఆస్తులను, అంజుమన్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దంటూ సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా పాల్గొని జాయింట్ కలెక్టర్ ఇలక్కియకు వినతి పత్రం అందజేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను, అంజుమన్ భూములను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేలా కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే జేసీ తమ మాటలను సరిగా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ⇒ వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ముస్లింలు ధర్నా చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, వైఎస్సార్సీసీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాదర్ బాషా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్, డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు), మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు. తొలుత ముస్లింలు భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని కలెక్టరేట్లోని డీఆర్వో షేఖ్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. ⇒ నెల్లూరులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలు ఆందోళన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయ్కుమార్ రెడ్డి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. వీరు కలెక్టరేట్లో జేసీ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాకాణి గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో వక్ఫ్ బోర్డుకు చెందిన 72 ఎకరాల స్థలాన్ని కాజేయడానికి కూటమి సర్కారు యతి్నంచడంపై కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నాడూ నేడూ బాబు మౌనమే 'ఏపీ ఆయకట్టు ఎడారే'!
సాక్షి, అమరావతి: ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 నుంచి ఏకంగా 524.256 మీటర్లకు పెంచడంపై కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. డ్యామ్ ఎత్తు పెంపు పనులపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి 2014 అక్టోబర్ 25నే టెండర్ పిలవగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అభ్యంతరం చెప్పలేదు. అప్పట్లో రూపొందించిన డీపీఆర్ ప్రకారం.. తాజాగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తును కర్ణాటక సర్కార్ పెంచుతుండగా, ఇప్పుడైనా చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెరుగుతుంది. ప్రస్తుతం ఎగువ నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం జూలై ఆఖరుకు వస్తోంది. అదే ఆల్మట్టి ఎత్తు పెంచితే ఆగస్టు రెండో వారానికిగానీ.. శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం చేరదని.. దాంతో నీటి లభ్యత భారీగా తగ్గి రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మారుతుందని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుతో బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాలు ముంపునకు గురవుతాయని మహారాష్ట్ర సర్కార్.. తమ ప్రాజెక్టుల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కానీ.. చంద్రబాబు సర్కార్ మాత్రం కనీసం నోరు మెదపకపోవడంపై సాగునీటిరంగ నిపుణులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వడివడిగా భూ సేకరణ, పునరావాసంఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచితే 20 గ్రామాలతోపాటు భాగల్కోట్ మున్సిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పించాలి. ముంపునకు గురయ్యే భూమితోపాటు.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మొత్తం 1,33,967 ఎకరాలను సేకరించేందుకు కర్ణాటక సర్కార్ సిద్ధమైంది. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పనకు రూ.87,818 కోట్లను మంజూరు చేసింది. మాగాణి భూమికి ఎకరానికి రూ.40 లక్షలు.. మెట్ట భూమికి ఎకరానికి రూ.30 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని పేర్కొంటూ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక భాగల్కోట్ మున్సిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పన పనులను వేగవంతం చేస్తూనే 20 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓవైపు డ్యామ్ ఎత్తు పెంచే పనులను వేగంగా చేపడుతూ మరోవైపు అప్పర్ కృష్ణా ప్రాజెక్టు మూడో దశ(యూకేపీ–3) కింద 5.94 లక్షల హెక్టార్లకుగానూ.. ఇప్పటికే 1,13,500 హెక్టార్లను అభివృద్ధి చేసి గతేడాది ఆ ఆయకట్టుకు సాగునీటిని కూడా అందించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తూ.. ఏపీ హక్కులను హరిస్తున్నా సరే చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.కేడబ్ల్యూడీటీ – 2 తుది నివేదిక అమలుకు ఒత్తిడి..కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లకు పంపిణీ చేస్తూ కేడబ్ల్యూడీటీ–2 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్) కేంద్రానికి 2010 డిసెంబర్ 30న ఇచ్చిన తొలి నివేదిక.. 2013 నవంబర్ 29న ఇచ్చిన తుది నివేదికను సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ(స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేసింది. దాంతో ఇప్పటిదాకా కేడబ్లూ్ల్యడీటీ–2 తుది నివేదికను అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయితే తక్షణమే కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదికను అమలు చేయాలని కేంద్రంపై ఓవైపు ఒత్తిడి చేస్తూనే.. మరోవైపు ఆ తుది నివేదికలో కేటాయించిన నీటిని వినియోగించుకోవడానికి కర్ణాటక సర్కార్ చర్యలు చేపట్టింది. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 2,130 టీఎంసీలను కొనసాగిస్తూనే.. 65 శాతం, సరాసరి ప్రవాహాల ఆధారంగా 448 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 అదనంగా మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో కర్ణాటకకు 173 టీఎంసీలను కేటాయించింది. అందులో యూకేపీ–3 కింద 130 టీఎంసీలను వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చిన కేడబ్ల్యూడీటీ–2.. ఆ మేరకు ఆల్మట్టి ఎత్తును 524.256 మీటర్లకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. సాగునీటి మాట దేవుడెరుగు.. తాగునీటికీ ఇబ్బందులేఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. ఇందులో 369 టీఎంసీల లభ్యత ఉమ్మడి రాష్ట్రంలోని కృష్ణా బేసిన్లో ఉంటుందని.. ఎగువ నుంచి 442 టీఎంసీల ప్రవాహం వస్తుందని పేర్కొంది. ఇక కృష్ణా నదిలో 65 శాతం, సరాసరి లభ్యత కింద కేడబ్ల్యూడీటీ–2 కర్ణాటకకు 173 టీఎంసీలు, మహారాష్ట్రకు 81 టీఎంసీలను కేటాయించింది. కేడబ్ల్యూడీటీ–1 కేటాయింపులు, కేడబ్ల్యూడీటీ–2 కేటాయింపులు కలిపితే మహారాష్ట్ర వాటా 585 నుంచి 666, కర్ణాటక వాటా 734 నుంచి 907 టీఎంసీలకు పెరుగుతుంది. అంటే.. మహారాష్ట్ర, కర్ణాటక 1,573 టీఎంసీలను వాడుకున్న తర్వాతే దిగువకు నీటిని విడుదల చేస్తాయి. ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఆ మేరకు నీటిని అదనంగా కర్ణాటక నిల్వ చేసుకుని, వినియోగించుకోనుంది. దాంతో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం రావడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకోనుంది. ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన అదనపు జలాలు 194 టీఎంసీల మాట దేవుడెరుగు.. కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీల లభ్యత కూడా ఉండదని సాగునీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగువ నుంచి రావాల్సిన 442 టీఎంసీల ప్రవాహంలో భారీ ఎత్తున కోత పడుతుందని.. ఇది రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టును ఎడారిగా మార్చుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు కాదు కదా.. కనీసం గుక్కెడు తాగునీటికీ ఇబ్బందులు తప్పవని సాగునీటి నిపుణులు స్పష్టం చేస్తున్నారు.నాడు ఆనకట్టను రిజర్వాయర్గా.. నేడు రిజర్వాయర్ను మెగా రిజర్వాయర్గా!ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు 1995 వరకూ 506.87 మీటర్లు.. నీటి నిల్వ సామర్థ్యం 17.82 టీఎంసీలు మాత్రమే. ఆ ఆనకట్ట ద్వారా యూకేపీ తొలి దశ కింద 4.25 లక్షల హెక్టార్లకు కర్ణాటక సర్కార్ 1996 వరకూ నీళ్లందించింది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996లో యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటుచేసి.. నాటి కర్ణాటక సీఎం దేవెగౌడను ప్రధానిగా చేశానని గొప్పగా చెబుతుంటారు. ఆ సమయంలో ప్రధాని హోదాలో ఉన్న దేవెగౌడ ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని మంజూరు చేయించి.. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 506.87 మీటర్ల నుంచి 519.6 మీటర్లకు పెంచుతూ, నీటి నిల్వ సామర్థ్యాన్ని 17.82 నుంచి 129.72 మీటర్లకు పెంచే పనులను చేపట్టారు. కృష్ణా జలాలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కులను కర్ణాటక సర్కార్ కాలరాస్తూ ఆల్మట్టి ఆనకట్టను రిజర్వాయర్గా మార్చేసినా చంద్రబాబు అప్పుడు నోరుమెదపలేదు. దాంతో యూకేపీ–2 కింద అదనంగా 54 టీఎంసీలను వినియోగించుకుంటూ 1.97 లక్షల హెక్టార్లకు 2002 నాటికే కర్ణాటక నీళ్లందించింది. దీని వల్ల ఎగువ నుంచి జూన్ నాటికి శ్రీశైలానికి చేరాల్సిన కృష్ణా వరద.. ఇప్పుడు జూలై ఆఖరుకుగానీ చేరడం లేదు. ఇక ఇప్పుడు ఆల్మట్టి రిజర్వాయర్ను మెగా రిజర్వాయర్గా మార్చేస్తూ.. ఏపీ హక్కులను కాలరాస్తున్నా సరే చంద్రబాబు ప్రభుత్వం మౌనవ్రతాన్ని వీడకపోవడం గమనార్హం. -
ఆగని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ
ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ వైపు నెట్టేస్తున్న చర్యలు ఆగడంలేదు. ఇప్పటికే సింటర్ ప్లాంట్, ఎస్ఎంఎస్–1 వంటి కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిన యాజమాన్యం.. తాజాగా థర్మల్ పవర్ ప్లాంట్ (టీపీపీ–1) నిర్వహణను కూడా ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు అడుగులు వేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. టీపీపీ నిర్వహణ, మెయింటెనెన్స్తో పాటు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్వహణకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ స్టీల్ప్లాంట్ యాజమాన్యం సోమవారం టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది.రెండేళ్ల కాలపరిమితితో కూడిన ఈ టెండర్ విలువను రూ.83.52 కోట్లుగా నిర్ణయించారు. ఈనెల 26వ తేదీ సా.3 గంటల వరకు టెండర్లు స్వీకరించి, 27వ తేదీ సా. 3 గంటలకు వాటిని తెరవనున్నట్లు ప్రకటించారు. ఉక్కు ఉత్పత్తికి ప్రాణంలాంటి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను ప్రైవేటుకు అప్పగించడం ద్వారా స్టీల్ప్లాంట్ భవితవ్యానికే ముప్పు తెచి్చనట్లవుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా చేసే ఈ విభాగం ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని, తద్వారా ప్లాంట్ను ఆర్థికంగా మరింత బలహీనపరచాలనే ఉద్దేశమే కనిపిస్తోందని ఆరోపిస్తున్నాయి. పోరాటం మరింత తీవ్రతరం.. ఒకవైపు కార్మికుల తొలగింపులు కొనసాగుతుండగా, మరోవైపు కీలక విభాగాలను దశలవారీగా ప్రైవేటీకరించడం ద్వారా విశాఖ ఉక్కును నిరీ్వర్యం చేసి చివరికి అమ్మకానికి సిద్ధంచేసే వ్యూహం అమలుచేస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రూ.11,440 కోట్ల ప్యాకేజీ తెచ్చి స్టీల్ప్లాంట్ను ఉద్ధరిస్తున్నామని గొప్పలు చెప్పిన టీడీపీ కూటమి నేతలు.. ఇప్పుడు క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను ప్రైవేటుకు అప్పగించడంపై ఏం సమాధానం చెబుతారని కార్మిక నేతలు ప్రశి్నస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని, ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. -
మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన
సాక్షి, అమరావతి: అమిత జనాదరణ గల నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం విమర్శించారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వైఎస్ జగన్ ఇటీవల పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సోమవారం ఆయన లేఖ రాశారు. ఆ లేఖను ఆయన ఇక్కడ మీడియాకు విడుదల చేశారు. ఫిబ్రవరి 6న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లిన సందర్భంలో తీవ్ర స్థాయిలో భద్రతా లోపాలు కనిపించాయని లేఖలో పేర్కొన్నారు.సాధారణంగా కేవలం 22 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పక్కనపెట్టి, విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాదాపు 47 కిలో మీటర్ల పొడవైన ప్రత్యామ్నాయ మార్గానికి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా రూట్ మ్యాప్ మార్చారని పేర్కొన్నారు. అధికారులు సూచించిన మార్గాన్నే అనుసరించినా, తిరుగు ప్రయాణంలో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో వివరించారు. భద్రతా బృందానికి గానీ, పార్టీ ప్రతినిధులకు గానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా తిరుగు మార్గాన్ని అకస్మాత్తుగా మార్చారన్నారు.ఆ మార్గం అత్యంత రద్దీగా ఉందని, ఈ మార్గం జెడ్ ప్లస్ కేటగిరీ వీవీఐపీకి ఏమాత్రం అనుకూలం కాదని తలశిల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధమైన అనూహ్య రూట్ మార్పులు భద్రతా ప్రొటోకాల్స్ను బలహీనపరుస్తాయని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు వీవీఐపీ ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు భద్రతా అంచనా లేకుండా, రాతపూర్వక సమాచారం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాలు తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదని, గతంలో కూడా వైఎస్ జగన్ భద్రతలో పలు లోపాలు చోటు చేసుకున్నాయని లేఖలో గుర్తు చేశారు. ⇒ 2025 ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డ్ను సందర్శించినప్పుడు పూర్తి స్థాయిలో జెడ్ప్లస్ భద్రత కల్పించలేదని, బాధ్యత వíßæంచాల్సిన అధికారులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ⇒ 2025 ఏప్రిల్లో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పర్యటన సందర్భంగా కూడా తీవ్ర భద్రతా లోపాలు జరిగాయని పేర్కొన్నారు. హెలిప్యాడ్ వద్ద జరిగిన దాడిలో హెలికాప్టర్ విండ్ïÙల్డ్ దెబ్బతిని వీవీఐపీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందన్నారు. అయినప్పటికీ అధికారుల వైఫల్యాన్ని అంగీకరించకుండా పార్టీ నేతలపై కేసులు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. తరచూ నిబంధనలు నీరుగారుస్తున్న పోలీసులు తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనల ద్వారా జెడ్ ప్లస్ భద్రతా నిబంధనలను పదేపదే పోలీసులు నీరుగారుస్తున్నారని తలశిల మండిపడ్డారు. ఇది కేవలం ఒక వ్యక్తి భద్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా వీఐపీ భద్రతా వ్యవస్థల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రూట్ మార్పులపై తక్షణం విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇక నుంచైనా రాజకీయాలకతీతంగా జెడ్ ప్లస్ భద్రతా ఎస్ఓపీలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోం శాఖను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైఎస్ జగన్ భద్రతపై స్వతంత్ర సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. -
హిందూ మఠాలపై చంద్రబాబు రెడ్బుక్
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ వ్యవహారంలో తనకు అనుకూలంగా ప్రకటనలు చేయించుకునే పనిలో సీఎం చంద్రబాబు నిమగ్నమయ్యారని టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిశాయంటూ బాధ్యతారహితమైన ప్రకటనలు చేసిన చంద్రబాబు.. అవి అసత్యాలని సీబీఐ–సిట్ దర్యాప్తులో తేలడంతో ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, తన అబద్ధాలను నిజం చేయించుకోవాలని, అవమానకర పరిస్థితుల నుంచి బయటపడాలని రోజుకో కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘హిందూ ఆధ్యాత్మిక మఠాలపైనే తన రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తూ దేశవ్యాప్తంగా తిరుమల క్షేత్రం పరువు, ప్రతిష్టను దెబ్బతీసే అపవిత్ర కార్యక్రమాలకు ఒడిగడుతున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎంవోలో ఓ అధికారికి ఈ ప్రత్యేక బాధ్యతలు అప్పగించగా, టీటీడీలో కొందరు అధికారులు వీరికి సహాయపడుతున్నారు. దక్షిణాది సహా దేశంలోని హిందూ ఆధ్యాత్మిక మఠాలకు వెళ్లి వారిని ఒత్తిళ్లకు గురిచేసి, అసత్యాలు చెప్పి తనకు అనుకూలంగా మఠాధిపతుల చేత లేఖలు విడుదల చేయించడం, వాటిని తమ ఎల్లో మీడియాలో ప్రధాన శీర్షికల్లో ప్రచురించి, దుర్బుద్ధితో కూడిన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పెద్ద జీయంగార్పై కొద్దిరోజులుగా ఒత్తిడి తిరుపతిలోని పెద్ద జీయంగార్ మఠంపై ఇలాగే ఒత్తిడి తెచ్చి లేఖ విడుదల చేయించారు. కొన్నిరోజులుగా ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నా నిరాకరించిన నేపథ్యంలో నేరుగా సీఎంవో కార్యాలయమే రంగంలోకి దిగింది. చంద్రబాబు తన ప్రత్యేక కార్యదర్శి, టీటీడీ కొత్త ఈవో ముద్దాడ రవిచంద్రను పెద్ద జీయర్ వద్దకు పంపి తనకు అనుకూలంగా లేఖ రాయించుకున్నారు. వేయి సంవత్సరాల రామానుజాచార్యుల పరంపరనే భ్రష్టుపట్టించడానికి కూడా చంద్రబాబు వెనుకాడలేదు. ఈ కార్యక్రమాల కోసమే ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈవోగా నియమించారు.హిందూ ధర్మానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారు. వేల సంవత్సరాల ప్రతిష్ట ఉన్న తిరుమల ఆలయాన్ని రాజకీయాలకోసం దెబ్బతీయడం అత్యంత శోచనీయం. శ్రీవారి భక్తులు, మఠాలపై చంద్రబాబు తన రాజకీయ స్వార్థంతో చేస్తున్న దాడిగానే దీన్ని చూడాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు కుట్రలను గమనించి ప్రతి ఒక్కరు వాటిని తిప్పికొట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఐఏఎస్లం.. అన్నీ తెలుసనుకోవద్దు
సాక్షి, అమరావతి: ఐఏఎస్లు అయిపోయాం.. అన్నీ తెలుసనే ధోరణి వీడి నేర్చుకోవడం, తెలుసుకోవడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, కార్యదర్శులు, శాఖాధిపతులకు సూచించారు. 2025–26 జీఎస్డీపీ వృద్ధి 12.16 శాతం లక్ష్యం అనుకుంటే ఇప్పుడు 9.88 శాతమే వృద్ధి నమోదైందని, అందరూ సరిగా పనిచేస్తే 13 శాతం వృద్ధి రావాలని సీఎం పేర్కొన్నారు. ఎవరు సరిగా పనిచేయడం లేదో తమ వద్ద వివరాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అంచనాలను ఇచ్చామని, ఆ మేరకు వృద్ధి వస్తోందా..? లేదా..? అనేది కలెక్టర్లు దృష్టి సారించడంతోపాటు తెలియకపోతే తెలుసుకోవడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లతో సీఎం సమావేశం నిర్వహించారు.జీఎస్డీపీ వృద్ధి, విద్య, వైద్య, ఆదాయ ఆర్జన తదితర రంగాలపై సమీక్షించారు. జీఎస్డీపీ వృద్ధి, తలసరి ఆదాయం లక్ష్యాల సాధన బాధ్యత కలెక్టర్లతోపాటు మంత్రులదేనని సీఎం స్పష్టం చేశారు. లక్ష్యాలు సాధించకపోవడానికి నిర్లక్ష్యం లేదా తెలియకపోవడమే కారణమన్నారు. ఈ ఏడాది లక్ష్యాల్లో వెనుకబడితే వచ్చే ఏడాది కవర్ చేయాలని, లేదంటే ఆ శాఖలు డిఫాల్టర్లు అవుతాయని వివరించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాలం చెల్లిన, అవసరం లేని చట్టాలు రద్దు చేస్తామన్నారు. కేంద్రం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు.రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలపై ఆడిట్ చేయాలని చెప్పారు. రాత్రింబవళ్లూ పనిచేయడం కాదని, మనసు పెట్టి పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. ‘నాకు సలహాలు ఇవ్వద్దు.. ఏమి చేస్తే ఫలితాలు వస్తాయో అది చేసి చూపించండి’ అని సీఎం సూచించారు. తనతోపాటు కింది స్థాయి వరకు ఉద్యోగులంతా సమష్టిగా పనిచేస్తేనే ఫలితాలు వస్తాయన్నారు. యూరప్ దేశాల్లో వృద్ధులు పెరిగిపోతున్నారని, రాష్ట్రంలో జనాభా తగ్గిపోతోందని, ఈ నేపథ్యంలో సంతానం పెంచేందుకు ప్రోత్సహకాలతో జనాభా నిర్వహణ విధానాన్ని మార్చిలో అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విధానం అమల్లోకి వస్తుందన్నారు. కుప్పంలోనే 14.9 శాతం మందికి బాల్య దశలోనే గర్భధారణ రాష్ట్రంలో సిజేరియన్ డెలివరీలను తగ్గించి సాధారణ డెలివరీలు పెరిగేలా అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు. బాల్య వివాహాలపైనా సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా కుప్పంలోనే 14.9 శాతం మంది బాల్య దశలోనే గర్భం దాల్చుతున్నారని, ఇవి కూడా జనాభాపై ప్రభావం చూపుతున్నాయని ఓ అధికారి వివరించారు. 71 లక్షల మంది పిల్లల ఆరోగ్య డేటాను ఆన్లైన్లోకి తీసుకురావాల్సిందిగా సీఎం సూచించారు. హాస్టల్ విద్యార్థులకు తరుచూ అనారోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు, మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదని వెల్లడించారు. పన్నులను పూర్తి స్థాయిలో వసూలు చేయాలని సీఎం పేర్కొన్నారు. అటవీ శాఖ దగ్గర ఉన్న ఎర్ర చందనం అమ్మకం ద్వారా అధిక ఆదాయం వస్తుందని అంచనా వేశామని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు మురిగిపోతే అధికారులే బాధ్యత వహించాలన్నారు. అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల విషయంలో జిల్లా కలెక్టర్లు తక్షణం కేవైసీ చేపట్టాలన్నారు. 1,04,727 పీడీ ఖాతాల్లో ఉన్న అన్ క్లైమ్డ్ డిపాజిట్ల విలువ రూ.148 కోట్లుగా ఉన్నాయని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి రూ.26,021 కోట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమావేశంలో వర్చువల్గా పాల్గొన్నారు -
ఎక్సైజ్ ఆదాయం 7శాతం ఢమాల్
సాక్షి, అమరావతి: ఎక్సైజ్ రాబడి గత ఏడాది కన్నా ఈ ఏడాది 7 శాతం తగ్గిపోయింది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయచంద్తో కలసి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. గతేడాది జనవరి నాటికి ఎక్సైజ్ రాబడి రూ.16,032 కోట్లుగా ఉండగా ఈ ఏడాది జనవరి నాటికి రూ.14,963 కోట్లు రాబడి మాత్రమే నమోదైంది.ఎక్సైజ్ మొత్తం రాబడి లక్ష్యం రూ.26,870 కోట్లు కాగా ఇప్పటి వరకు 56 శాతమే సాధించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు గండిపడడమే ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోవడానికి కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టిన టీడీపీ నేతలు.. నకిలీ మద్యంతో దోపిడీ, విచ్చలవిడిగా బెల్టు షాపులు, చివరకు ప్రకృతి వనరులను కూడా వదలకుండా సిలికా, క్వార్జ్, మైనింగ్ దోపిడీతో తమ జేబులు నింపుకోవడమే దీనికి కారణమని అంటున్నారు. మరోవైపు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ద్రవ్యలోటు ఉన్నట్లు పీయూష్ కుమార్ వెల్లడించారు. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి ఏపీ అత్యధికంగా రూ.85,269 కోట్లు ద్రవ్య లోటుతో ఉన్నట్లు తెలిపారు. మూలధన వ్యయం 10 శాతమే.. డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.60,481 కోట్లకు చేరిందని పీయూష్ కుమార్ తెలిపారు. మొత్తం వ్యయం రూ.1,97,950 కోట్లు కాగా ఇందులో రెవెన్యూ వ్యయం 90 శాతం, మూలధన వ్యయం కేవలం 10 శాతం మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అప్పులు జీఎస్డీపీలో 35 శాతానికి చేరినట్లు చెప్పారు. జీఎస్డీపీలో రాష్ట్ర సొంత ఆదాయం కేవలం 7.6 శాతమే ఉందన్నారు. ఒడిశా (13.3 శాతం), ఛత్తీస్గఢ్ (12 శాతం) కంటే తక్కువగా ఉండటంతో కేంద్ర నిధులపై ఏపీ ఎక్కువగా ఆధారపడుతున్నట్లు సూచిస్తోందన్నారు. రాష్ట్ర స్థిర ధరల ఆధారంగా జీఎస్డీపీ వృద్ధి 9.88 శాతంగా ఉండగా జీఎస్డీపీ రూ.9,52,261 కోట్లుగా నమోదైందని చెప్పారు. 2028–29 నాటికి రూ.29 లక్షల కోట్లు జీఎస్డీపీ లక్ష్యం కాగా రూ.27 లక్షల కోట్లు సాధ్యం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. సొంత ఆదాయ లక్ష్యానికీ దూరమే రాష్ట్ర సొంత ఆదాయం లక్ష్యం రూ.1,34,208 కోట్లుగా నిర్థారించగా జనవరి నాటికి రూ.83,500 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయ్చంద్ తెలిపారు. వాణిజ్య పన్నుల ద్వారా ఈ ఏడాది జనవరి నాటికి రూ.42,861 కోట్లు ఆర్జించగా, గత ఏడాది ఇదే సమయానికి రూ.41,385 కోట్లు వసూలయ్యాయి. కేంద్ర సహాయ పథకాల నిధులు గతేడాదితో పోల్చితే స్వల్పంగా తగ్గి రూ.6,579 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. పన్ను వసూళ్లలో సమర్థత, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలు, విభాగాల మధ్య సమన్వయం ద్వారా ఆదాయ వృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
లోకేశ్దే పెత్తనం.. టీడీపీలో సీనియర్లు ఔట్!
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీలో లాబీయిస్టులకు ప్రాధాన్యం అంతకంతకూ పెరిగిపోతుండడంతో సీనియర్లు అసహనంతో రగిలిపోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారు, పార్టీ కోసం పని చేసిన వారిని పూర్తిగా పక్కనపెట్టి కేవలం తమకు అనుకూలంగా పని చేసే లాబీయిస్టులకే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పెద్దపీట వేస్తున్నారని వారు మండిపడుతున్నారు. తాజాగా రాజ్యసభ అభ్యర్థుల విషయంలోనూ తండ్రీ కొడుకులు అదే పంథా అనుసరిస్తున్నారనే ఆవేదన పార్టీలో వ్యక్తమవుతోంది. త్వరలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాల్లో ఒకటి లేక రెండు టీడీపీకి దక్కే అవకాశం ఉంది. అందులో ఒక స్థానాన్ని లోకేశ్ తన ప్రధాన అనుచరుడు కిలారు రాజేశ్కి ఇస్తున్నట్లు టీడీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని చినబాబు పలువురు పార్టీ ముఖ్యుల వద్ద చెప్పినట్లు సమాచారం. రాజేశ్ కూడా ఈ విషయాన్ని తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారికి చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో చినబాబు తరఫున అన్ని వ్యవహారాలూ రాజేశే నడిపిస్తున్న విషయం బహిరంగ రహస్యమే. పదవులు, కాంట్రాక్టులు, బిల్లులు, పోస్టింగ్లు, బదిలీలు సహా ఏ పని జరగాలన్నా టీడీపీ నేతలు ఆయన్నే కలుస్తున్నారు. లోకేశ్తో మాట్లాడిన తర్వాత ఆ పని జరిగేలా చూసేది రాజేశే. 2014–19 మధ్య కూడా ఆయన హవా ఇలాగే నడిచింది. తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తి కావడంతో లోకేశ్ ఆయన్ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా తన పట్టును మరింత బిగించేందుకు చినబాబు యత్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్డీఏ ముఖ్య నేతలకు ఈ విషయాన్ని ఆయన చెప్పినట్లు సమాచారం. కోటరీ వ్యక్తులకిస్తే మా గతి ఏమిటీ? అయితే తెలుగుదేశం సీనియర్ నేతలు, పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీతో సంబంధం లేకుండా కేవలం లోకేశ్ వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తిని రాజ్యసభకు పంపితే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని అంతర్గతంగా రగిలిపోతున్నారు. అలాగే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యూవల్ చేయడం దాదాపు ఖాయమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కూడా లాబీయిస్టే. లోకేశ్కు సన్నిహితుడే. గత ఏడాది రెండు రాజ్యసభ స్థానాలు తమకు దక్కగా అందులో బీజేపీ, టీడీపీ చెరొకటి పంచుకున్నాయి. టీడీపీ కోటాలో సానాకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. లోకేశ్ కోటరీలో సానా కీలకంగా మారారు. దీంతో ఎంతోమంది సీనియర్లు ఉన్నా పక్కనపెట్టి సానా సతీ‹Ùను రాజ్యసభ ఎంపీగా చేశారు. ఆయన పదవీకాలం మే నెలలో ముగుస్తుండడంతో మళ్లీ రెన్యూవల్ చేసి రాజ్యసభ ఎంపీగా కొనసాగించడం లాంఛనమేనని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.సీనియర్లకు అవమానమే ! నిజానికి రాజ్యసభ ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ సూపర్ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు చాలాకాలం నుంచి కోరుతున్నా పట్టించుకోవడం లేదు. రాజకీయ జీవితంలో గౌరవప్రదమైన ముగింపును కోరుకుంటున్న ఆయన రాజ్యసభ ఎంపీ అందుకు తగినదని భావించి ఆ దిశగా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆయన కూడా పట్టించుకోవడం లేదు. లోకేశ్ అయితే యనమలను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని టీడీపీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉన్న మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు తనకు చివరి అవకాశంగా ఎంపీ పదవి ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.గత ఎన్నికలకు ముందు రాజకీయ సన్యాసం చేసిన గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రాజ్యసభ స్థానం కోసం గట్టిగా యతి్నస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా యతి్నస్తున్నారు. పదవులు దక్కని నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, చింతకాయల విజయ్, వర్ల రామయ్య వంటి నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా చంద్రబాబు, లోకేశ్ నుంచి కనీస స్పందన కూడా లేదని సమాచారం. కేవలం లోకేశ్ కోటరీలోని లాబీయిస్టులు, లేకపోతే భారీగా నిధులు సమకూర్చే వారికే అవకాశం ఉంటుందని తేల్చి చెబుతుండడంతో సీనియర్లు అవమాన భారంతో రగిలిపోతున్నారు. -
నేడు మెడికల్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్
సాక్షి, అమరావతి: ఏపీ మెడికల్ కౌన్సిల్ కార్యవర్గంలో 13 మంది సభ్యుల ఎన్నికకు సోమవారం ఆన్లైన్ ఓటింగ్ చేపట్టనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధి కారి చక్రధర్బాబు ఆదివారం తెలిపారు. 56,374 మంది వైద్యులు ఈ ఓటింగ్లో పాల్గొంటుండగా ఎన్నికల బరిలో 84 మంది అభ్యర్థులు ఉన్నట్లు చెప్పారు.సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రిజిస్టర్డ్ వైద్యులు https:// apmc.ap.gov.in/ index. html వెబ్సైట్లో ఓట్ వేయాలని తెలిపారు. ఇతర వివరాల కోసం 9000780707, 9154032856 నంబర్లను సంప్రదించాలని కోరారు. మంగళవారం ఓట్ల లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. -
గ్రంథాలయ ఉద్యోగులకు 2 నెలల నుంచి జీతాల్లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రంథాలయ సిబ్బందికి, రిటైరైన వారికి రెండు నెలలుగా వేతనాలు, పెన్షన్లు ఇవ్వడంలేదు. కలెక్టర్లతో మొరపెట్టుకున్న తమ వేదన సంబంధిత మంత్రి లోకేశ్కు వినిపిస్తుందేమోనని వారు ఆశగా చూస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గ్రంథాలయ ఉద్యోగుల వేతనాల గ్రాంటును విడుదల చేయకపోవడంతో డిసెంబర్ నెల నుంచి వేతనాలు, పెన్షన్లకు ఇబ్బంది ఎదురైంది. గ్రంథాలయ ఉద్యోగుల వేతనాల వార్షిక గ్రాంటుగా బడ్జెట్లో రూ.134 కోట్లు కేటాయించారు. దీన్లో రూ.37 కోట్లను మాత్రమే ఆర్థికశాఖ విడుదల చేసింది.మిగతా మొత్తాన్ని విడుదల చేయబోమని, లైబ్రరీల సెస్ నుంచి వేతనాలు, పెన్షన్ తీసుకోవాలని ఆర్థికశాఖ చెప్పేసింది. దీంతో 1,600 మందికి డిసెంబర్, జనవరి నెలల వేతనాలు, పెన్షన్లు ఇవ్వలేదు. పెద్ద జిల్లాల్లో వసూలైన సెస్ నుంచి కొంతమందికి పెన్షన్లు మాత్రం చెల్లించారు. సెస్ నుంచి వేతనాలు, పెన్షన్లు తీసుకోవాలన్న ఆర్థికశాఖ సూచన నిబంధనలకు విరుద్ధం. లైబ్రరీల సెస్ను ఆయా గ్రంథాలయాల నిర్వహణతో పాటు దినపత్రికలు, నెలవారీ సమాచార పుస్తకాల కొనుగోలుకు వినియోగించాలి. వేతనాలు, పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయకుండా నిలిపేశారు.గ్రంథాలయాలు పత్రికల బిల్లులు, విద్యుత్ బిల్లులను చెల్లించేందుకు కూడా నిధుల్లేకుండా చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. పలు జిల్లాల్లో వేతనాలు, పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ ఉద్యోగులు, పెన్షనర్లు కలెక్టర్లకు వినతిపత్రాలిచ్చారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించలేదు. మంత్రి లోకేశ్ ఇప్పటికైనా స్పందించి వేతనాలు, పెన్షన్లు ఇచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు. సెస్ నుంచి జీతాలు తీసుకోమనడం దారుణం ప్రజలు చెల్లించే సెస్ నుంచి గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు, పింఛన్లు ఇవ్వాలని ఆర్థికశాఖ చెప్పడం దారుణమని జిల్లా గ్రంథాలయసంస్థల పెన్షనర్ల సంఘం రాష్ట్ర కనీ్వనర్ కె.దేవదాస్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం వేతనాల గ్రాంటుగా బడ్జెట్లో కేటాయించిన రూ.134 కోట్లను మూడువిడతల్లో విడుదల చేసేదని, దీంతో వేతనాలు, పెన్షన్కు ఇబ్బందులు ఎదురవలేదని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వార్షిక గ్రాంటులో రూ.37 కోట్లు మాత్రమే విడుదల చేయటంతో సమస్య వచ్చిందని తెలిపారు. సెస్ను గంథ్రాలయాల నిర్వహణకు, దినపత్రికల బిల్లులు, కరెంట్ బిల్లులు చెల్లించడానికే వినియోగించాలని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీతాల గ్రాంటును విడుదల చేయాలని ఆయన కోరారు. పదోన్నతి వచి్చనా రెండు నెలల నుంచి వేతనాల్లేవు గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శి నుంచి, సీనియర్ అసిస్టెంట్ నుంచి మండల స్వర్ణ గ్రామ ఆఫీసర్లుగా పదోన్నతి పొందినవారికి రెండునెలల నుంచి వేతనాల్లేవు. ఒకపక్క పదోన్నతి వచ్చిందన్న ఆనందం నెల తిరగ్గానే ఆవిరైపోయింది. పదోన్నతి పొందిన ఉద్యోగులకు సీఎఫ్ఎంఎస్లో కోడ్ను నిర్ధారించకపోవడంతో వారికి డిసెంబర్, జనవరి నెలల వేతనాలు రాలేదు. రెండునెలలుగా జీతాల్లేకపోవడంతో కుటుంబాల పోషణ కష్టంగా ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. -
పెండింగ్లో ‘పోలీస్’ ఫైల్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలలో వర్గపోరుతో ప్రతిష్టంభన నెలకొంది. సీనియర్ ఐపీఎస్ల బదిలీలు, పోస్టింగ్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నెలల తరబడి నిర్ణయం తీసుకోలేకపోతుండటం గమనార్హం. దాదాపు ఏడాదిగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఓ కొలిక్కి తేలేకపోతోంది. డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు సరైన పోస్టింగులు దక్కక అప్రాధాన్య పోస్టులతో కాలం వెళ్లబుచ్చుతుండగా... డీఐజీ స్థాయి అధికారులు మాత్రం ఒకటి కంటే ఎక్కువ పోస్టుల్లో కొనసాగుతున్నారు. సీనియర్ ఐపీఎస్ల పోస్టింగ్లపై డీజీపీ హరీశ్కుమార్ గుప్తా రూపొందించిన జాబితాకు సమాంతరంగా రిటైర్డ్ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు ఆర్పీ ఠాకూర్ మరో జాబితాను సీఎంవోకు ప్రతిపాదించడంతో పీటముడి బిగుసుకుంది.గుప్తా ‘సై’... ఠాకూర్ ‘నై’..! హరీశ్ కుమార్ గుప్తా 2025 ఫిబ్రవరిలో డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పూర్తిస్థాయిలో ఐపీఎస్ల బదిలీ ప్రక్రియను చేపట్టలేదు. 2025 జూన్లో రెగ్యులర్ అయిన తరువాత కొన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేసినా... రాజధాని కేంద్రంగా విధులు నిర్వర్తించే సీనియర్ ఐపీఎస్ల బదిలీలను మాత్రం ఓ కొలిక్కితేలేకపోతున్నారు. కీలకమైన విభాగాలను డీజీ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించగా అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారుల బదిలీలపై తుది నిర్ణయం తీసుకోవడం లేదు. సీనియర్ ఐపీఎస్లకు పోస్టింగ్లపై డీజీపీ గుప్తా ప్రతిపాదనలకు రిటైర్డ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెక్ పెట్టినట్టు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆర్పీ ఠాకూర్ హోంశాఖ వ్యవహారాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. డీజీపీ గుప్తా సీఎంవోకు ప్రతిపాదనలు పంపగా.. ఠాకూర్ మంత్రి లోకేశ్ పేషీ ద్వారా మరో జాబితాను చేరవేసినట్లు సమాచారం. కీలక పోస్టింగ్లపై డీజీపీ గుప్తా, ఆర్పీ ఠాకూర్ పరస్పర విరుద్ధ ప్రతిపాదనలు చేయడంతో సీఎంవో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పక్కనపెట్టేసింది. రిటైర్డ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ ఎండీగా తన ఏడాది పదవీ కాలం పూర్తి కావడంతో వైదొలిగారు. ప్రస్తుతం రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబును అదనపు బాధ్యతలతో ఎండీగా నియమించినా, సీనియర్ ఐపీఎస్ను రెగ్యులర్ ఎండీగా నియమించాల్సి ఉంది. డీజీ (ఆర్గనైజేషన్) ఎన్.బాలసుబ్రహ్మణ్యంను ఆర్టీసీ ఎండీగా నియమించాలని సీఎంవో భావిస్తోంది. అందుకు డీజీపీ గుప్తా సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇక విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత్ర బాగ్చీ డీజీగా పదోన్నతి పొందడంతో ఆయన్ను బదిలీ చేయాల్సి ఉంది. ఆయన గ్రేహౌండ్స్ డీజీగా వెళ్లాలని భావిస్తున్నారు. లేదంటే విజిలెన్స్ విభాగం డీజీగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. అందుకు డీజీపీ గుప్తా సానుకూలంగా స్పందించడం లేదు. ఆర్టీసీ ఎండీ పోస్టుతోపాటు విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాలకు తాను సూచించిన అధికారులనే ఇన్చార్జ్లుగా నియమించాలని డీజీపీ గుప్తా పట్టుదలతో ఉన్నారు. విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాలను డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారులకు అప్పగించకూడదన్నది ఆయన ఉద్దేశం. ఐజీ స్థాయి అధికారులను నియమించి తన ప్రత్యక్ష పర్యవేక్షణలోనే కొనసాగాలని భావిస్తున్నారు. ఇప్పటికే విజిలెన్స్ విభాగాన్ని పూర్తి అదనపు బాధ్యతలతో ఆయనే నిర్వహిస్తున్నారు. అదే పరిస్థితిని కొనసాగించాలని యోచిస్తున్నారు. అయితే అందుకు విరుద్ధంగా విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాలలో డీజీ స్థాయి ఐపీఎస్ అధికారులను రెగ్యులర్ డీజీలుగా నియమించాలని ఆర్పీ ఠాకూర్ సూచిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుతో సీనియర్ ఐపీఎస్ల పోస్టింగ్లపై సీఎంవో తుది నిర్ణయం తీసుకుండా పక్కనపెట్టేసింది.డీఐజీలకు ఒకటికి మించి బాధ్యతలుసీనియర్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్లపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేకపోవడం పోలీసు శాఖపై ప్రభావం చూపిస్తోంది. ఇదే అదనుగా డీఐజీ స్థాయి అధికారులకు ఒకటి కంటే ఎక్కువ పోస్టులు కట్టెబెట్టి డీజీపీ గుప్తా తన పంతం నెగ్గించుకుంటున్నారు. డీఐజీ సత్య ఏసుబాబు పోలీసు ట్రైనింగ్, అపా, పీటీసీ, రైల్వేస్, పీ అండ్ ఎల్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. మరో డీఐజీ ఫకీరప్ప శాంతి–భద్రతలు, ఏపీఎస్పీ, సైబర్ సెక్యూరిటీ, సిట్ (డీజీ అటాచ్మెంట్) బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పోలీస్ సంక్షేమం, స్పోర్ట్స్, ప్లానింగ్, కో ఆర్డినేషన్ విభాగాలను డీఐజీ అన్బురాజన్ పర్యవేక్షిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ విభాగాలను పర్యవేక్షిస్తున్నవారికి కేవలం అదనపు బాధ్యతలుగా మాత్రమే అప్పగించారు. పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించకపోవడం గమనార్హం. తద్వారా అంతా పూర్తిగా తన గుప్పిట్లోనే ఉండేలా డీజీపీ గుప్తా పావులు కదుపుతున్నారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
‘ప్రైవేట్’ రాజధాని!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యం పీపీపీ, ప్రైవేట్ జపం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా అమరావతి రాజధానిని సైతం పీపీపీ, ప్రైవేట్కు అప్పగించేలా అడుగులు ముందుకు వేసింది. గంపగుత్తగా ప్రైవేట్కు అప్పగించి అందినకాడికి చార్జీల రూపంలో దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడున్న చట్టాలను మార్చడంతో పాటు మరిన్ని కొత్త చట్టాలను రూపొందించడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఇదంతా చేసి పెట్టడానికి ప్రైవేట్ సంస్థలను (కన్సల్టెంట్) ఆహ్వానించింది. ఇలా ఎంపికైన కన్సల్టెంట్ ద్వారా పీపీపీ, ప్రైవేట్ ఫైనాన్సింగ్ కోసం చట్టపరమైన నిబంధనలను రూపొందించనుంది. 74వ రాజ్యాంగ సవరణకు లోబడి మున్సిపల్ చట్టాల్లో సవరణలు చేయడం ద్వారా అమరావతికి మెట్రో పాలిటిన్ నగరంగా స్వయం ప్రతిపత్తి కల్పించనుంది. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) రుణం మంజూరు చేసిన నేపథ్యంలో ఇక అమరావతి పరిపాలన అంతా ఆ బ్యాంకుల కనుసన్నల్లోనే సాగనుంది. గత ఏడాది జూలైలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకు మద్దతుతో ఏపీసీఆర్డీఏ ఇన్నోవేటివ్ అర్బన్ గవర్నెన్స్ పేరుతో మేధోమథన వర్క్షాప్ నిర్వహించింది. ఈ వర్క్షాప్లో అమరావతి పాలనకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రస్తుత చట్టాల్లో సవరణలు చేయడంతో పాటు కొత్త చట్టాలను తీసుకురావాలని నిర్ణయించారు. పీపీపీ, ప్రైవేట్ రంగంలో ప్రాజెక్టులు చేపట్టేందుకు చట్టపరమైన నిబంధనలను రూపొందించాలని సంకల్పించారు. అలాగే ప్రజలకు అందించే అన్ని రకాల సేవలకు వినియోగ చార్జీలతోపాటు ఆస్తి పన్ను, ఇతర లెవీలతో అంటే ప్రజలను మరింతగా బాదడం ద్వారా బహుళ ఆదాయ వనరులను అమరావతి మెట్రో పాలిటిన్ నగరానికి సమకూర్చాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన చట్టాల సవరణలు, కొత్త చట్టాల రూపకల్పన, పాలనా పరమైన నిబంధనల తయారీ కోసం సీఆర్డీఏ కన్సల్టింగ్ సంస్థను ఆహ్వానించింది.కన్సల్టింగ్ సంస్థ ఎంపిక కోసం కసరత్తు⇒ అమరావతి రాజధాని నగరం కోసం పాలన అభివృద్ధి సంస్థాగత చట్రం రూపకల్పన కోసం కన్సల్టింగ్ సంస్థ ఎంపిక కోసం సీఆర్డీఏ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని (టెండర్ నోటీసు) జారీ చేసింది. ప్రజా సేవల ప్రాజెక్టులైన నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధి, నీటి పంపిణీ, సేకరణ, మునిసిపల్.. ఇతర వర్గాల ఘన వ్యర్థాలు, జిల్లా శీతలీకరణ, విద్యుత్ సరఫరా మొదలైనవి పీపీపీలో చేపట్టనున్నారు. ⇒ ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లోనే ఈ చట్టాల సవరణలు, కొత్త చట్టాల రూపకల్పన జరగనుంది. రాజధాని ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భూములు అమ్ముకోవడానికి (మానిటైజ్) హక్కులు కల్పించే విధంగా మున్సిపల్ చట్టాల్లో మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా రాజధాని ఆర్థిక వనరులను అంచనా వేసి.. స్థిరమైన రాబడి, పీపీపీ, ప్రైవేటు పెట్టుబడికి అవసరమైన విధంగా చట్ట పరమైన ఫ్రేమ్ వర్క్ను రూపొందించనున్నారు.⇒ అమరావతికి స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం, సామర్థ్యం కోసం చట్టపరమైన నిబంధనలు ఉండాలని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ప్రభుత్వం నుండి ఆర్థిక మద్దతు, రాజధానికి ఆదాయం, స్వయం ప్రతిపత్తి, సంస్థలకు అప్పగించిన భూమి విక్రయించుకునేందుకు అనుమతులు.. వీటన్నింటినీ మానిటైజేషన్ చేయడానికి కొత్త ఫ్రేమ్ వర్క్ను తయారు చేయనున్నారు.⇒ సీఆర్డీఏ చట్టాలను పరిశీలించి 74వ రాజ్యాంగ సవరణకు లోబడి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు అవసరమైన అన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. దక్షిణ కొరియా, యుఎస్ఏ, దక్షిణాఫ్రికాతో పాటు పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రాల్లో నిబంధనలను పరిశీలించడంతో పాటు అందుకు అనుగుణంగా ఇక్కడ కూడా అలాంటి రవాణా నెట్వర్క్లు, పర్యావరణ ప్రణాళిక, హైబ్రిడ్ గవర్నెన్స్ ఏర్పాట్లను రూపొందించనున్నారు. ⇒ మున్సిపల్ పాలన, సంప్రదాయ నమూనాలు అమరావతి స్థాయికి సరిపోవని, ఈ నేపథ్యంలో ప్రత్యేక పాలన ఫ్రేమ్ వర్క్కు చట్టపరమైన నిబంధనలు అవసరమని నిర్ణయించారు. ప్రత్యేక పాలన ఫ్రేమ్ వర్క్ ఇలా..⇒ ఢిల్లీ, చండీగఢ్, నవీ ముంబై, గాంధీనగర్, న్యూ టౌన్ కోల్కతాతో సహా ప్రపంచ రాజధాని నగరాలైన బ్రెజిలియా, పుత్రజయ, సెజోంగ్, అస్తానా, నుసంతారా, సింగపూర్, జోహన్నెస్బర్గ్ మెట్రో పాలిటన్ ప్రాంతాల పాలన ఏర్పాట్లను పరిశీలించడం ద్వారా చట్టపరమైన స్వయం ప్రతిపత్తి పాలన, ఆర్థిక అధికారాలు, ఆదాయ ఏర్పాట్లు, § ప్రణాళిక అభివృద్ధి కోసం ఉత్తమ విధానాలు రూపకల్పన. ⇒ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపల్, కార్పొరేషన్ చట్టాలకు మించి ప్రత్యేక చట్టాలు రూపొందించడం. పరిపాలన కోసం అత్యున్నత మండలిని ఏర్పాటు చేయడం, రవాణా, విపత్తు నిర్వహణ వంటి అంశాల కోసం ప్రత్యేక ఏజెన్సీలనూ నియమించేందుకు వీలుగా చట్టాల రూపకల్పన. ⇒ అన్ని అంశాలలో మార్గ నిర్దేశం చేయడానికి రాజధాని నగరంలో వివరణాత్మక పాలనా వ్యవస్థలను అభివృద్ధి చేయడం.⇒ అమరావతి సంస్థాగత రూపకల్పనలో రెవెన్యూ మోడల్లో భాగంగా పన్ను, వినియోగదారు చార్జీలు, భూమి విక్రయం విలువ, అంతర్గత ప్రభుత్వ ఆర్థిక బదిలీ, ఆర్థిక వనరులను పంచుకోవడానికి రాజధాని నగరంలో ఏర్పాట్లు. సేవల పంపిణీ విధానం, ప్రైవేట్ రంగ ప్రమేయం పరిధి నిర్ణయించడం.⇒ రాజధాని ఆర్థిక వనరులను అంచనా వేసి.. పీపీపీ, ప్రైవేటు పెట్టుబడికి అవసరమైన విధంగా చట్టపరమైన ఫ్రేమ్ వర్కును రూపొందించడం.⇒ బలమైన ఆర్థిక సాధనాల సమితిని సిఫార్సు చేయాలి. ఆస్తి పన్ను, వినియోగదారు చార్జీలు, భూమి విలువ, ఇతర లెవీలతో సహా బహుళ ఆదాయ వనరులను సృష్టించే మార్గాలు వెల్లడించాలి. ⇒ ఆర్థిక వికేంద్రీకరణ, పీపీపీ సౌకర్యాల రక్షణ చర్యల కోసం చట్టపరమైన చర్యలను సూచించాలి.⇒ పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల సేవలు, భూమి నిధుల కోసం నియంత్రణ చట్రాలను ప్రతిపాదించాలి.⇒ భూములను ఆర్థిక వనరులుగా మార్చడంతో (క్రయవిక్రయాలు) పాటు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం–రాజధాని అమరావతి మధ్య ఆర్థిక పంపిణీ జరిగేలా చట్టాన్ని రూపొందించాలి.⇒ ఆదాయ మార్గాల యంత్రాంగాలపై మాన్యువల్ రూపకల్పన.⇒ అమరావతి జిల్లాగా ప్రకటించిన సందర్భంలో భూ ఆదాయానికి సంబంధించి జిల్లా పరిపాలన పాత్రను నిర్వచించాలి.⇒ మౌలిక సదుపాయాలు, సేవా స్థాయిలను కొనసాగించడానికి అవసరమైన వనరులను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక వేయడంతోపాటు నిధుల సమీకరణ సూచించాలి.⇒ నిర్దిష్ట పట్టణ విధులు, సేవలు, మూల ధన పెట్టుబడులు, నిర్వహణ వ్యయం, పట్టణ ప్రణాళిక అభివృద్ధి వంటి స్పష్టమైన బాధ్యతలతో అమరావతి పట్టణాన్ని పరిపాలించే.. నిర్వహించే అధికారాలను సూచించాలి.⇒ సుంకాలు, పన్నులు, వినియోగదారు చార్జీలను నిర్ణయించడం, వసూలు చేయడం, రుణ ఫైనాన్సింగ్ కోసం మూల ధన మార్కెట్లను యాక్సెస్ చేసే అధికారాలు, ప్రస్తుత అభివృద్ధి దశ నుండి క్రియాత్మక కార్యాచరణ నగరం వరకు ఇన్స్టాలేషన్ ట్రాన్స్మిషన్ కోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ను అందించాలి. -
కూటమిలో తలో మాట!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో తెలుగుదేశం–జనసేన–బీజేపీ పొత్తు రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి. పైకి మూడు పార్టీలు కలిసే ఉన్నప్పటికీ, లోలోన మాత్రం టీడీపీ తమను పెద్దగా పట్టించుకోవడం లేదని రుసరుసలాడుతున్నాయి. కూటమి కట్టకపోతే అధికారంలోకి వచ్చే వారమే కాదని, ఈ పరిస్థితిలో అందరం కలిసి అధికారం చేపట్టినప్పుడు ప్రాధాన్యత కూడా అలానే ఉండాలని జనసేన, బీజేపీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గతంలో ఇతర చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకున్నప్పుడు పూర్తి పెద్దన్న హోదాలో ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించినా, మిత్రపక్ష చిన్న పార్టీలను అణగదొక్కేలా వ్యవహరించినా, పెద్దగా పట్టించుకోని పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు కేవలం 19 నెలల పాలనలోనే తెలుగుదేశం పార్టీ ఒంటెత్తు పోకడలను మిత్రపక్ష జనసేన, బీజేపీ నేతలు తప్పుపట్టే పరిస్థితివచ్చింది. సీఎం చంద్రబాబు కేవలం ఒక్క కులానికే పెద్ద పీట వేయడాన్ని ఆదివారం తిరుపతిలో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తప్పుపట్టారు.రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే కమ్మగా ఉందని చెప్పారు. పైగా ‘కమ్మ’గా అంటే తాను ప్రత్యేకించి చెప్పక్కర లేదని, మీకందరికీ (సమావేశంలో ఉన్నవారికి) అర్థమై ఉంటుందన్నారు. ఆ కమ్మతోపాటే మనందరం ఉన్నామని చెప్పారు. ఒక్క కులం, మతం అని కాదు.. ఎవరు గట్టిగా పని చేస్తారో వారికి అవకాశం ఇవ్వాలన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.పెత్తనమంతా టీడీపీ నేతలదేబీజేపీ–జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలే పెత్తనం చెలాయించడం.. ఆయా నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ గ్రామ స్థాయి నేతలను టీడీపీ నేతలు పట్టించుకునే పరిస్థితే లేకపోవడంతో కూటమిలో లుకలుకలు మొదలయ్యాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవల జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ రాజీనామా చేసిన బొలిశెట్టి సత్యనారాయణ కూడా కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పదవులిచ్చే వారి పేరు పక్కన జనసేన నేత అని పెట్టారు తప్ప.. వాళ్లు జనసేన పార్టీ కోసం ఎప్పుడూ పని చేసిన వారు కాదంటూ బొలిశెట్టి వాపోయిన విషయం తెలిసిందే. జనసేన నేతలు కానప్పటికీ, టీడీపీ నేతలకు జనసేన ముద్ర వేసి పదవుల పందేరం చేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిట్లోనే ఉమ్మడి కార్యాచరణ మిత్రపక్షాల పట్ల టీడీపీ తమకు అవసరం ఉన్నప్పుడు ఒకలా.. మిగతా సమయాల్లో మరోలా వ్యవహరిస్తున్న తీరును పలువురు బీజేపీ నేతలు ఈ సందర్భంగా ఎత్తిచూపుతున్నారు. సాధారణంగా తెలుగుదేశం పార్టీ గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్న సందర్భంలో పొత్తులో ఉన్న మిత్రపక్షాలకు కొద్దిపాటి రాజకీయ ప్రయోజనం కూడా దక్కకూడదన్నట్టు వ్యవహరిస్తారని పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. అలాంటిది తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ చార్జిషీటు దాఖలు చేయడంతో ఈ వ్యవహారంలో బీజేపీని బలవంతంగా భాగస్వామిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీలో చర్చ జరుగుతోంది. 2024 సెప్టెంబర్లో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చేసిన తీవ్ర ఆరోపణలకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ చార్జిషీటు తర్వాత వ్యక్తిగతంగా తాను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాగానే, బీజేపీని ఈ అంశంలోకి లాగేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ను ప్రత్యేకంగా మంత్రుల సమావేశానికి పిలిపించారని రాజకీయ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఉమ్మడి కార్యాచరణ అంటూ తన పాపాన్ని అందరి మీదకు తోసే ప్రయత్నం చేస్తున్నారని తప్పు పడుతున్నారు. నామినేటెడ్ పదవులు, అధికారానికి సంబంధించిన విషయాల్లో మాత్రం దూరం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పాలన కమ్మగా ఉందిజమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బీజేపీ లేకుంటే టీడీపీ, జనసేన రాష్ట్రంలో నిలబడలేవురాష్ట్రాభివృద్ధిలో బీజేపీ కీలకం.. తక్కువగా అంచనా వేయొద్దుతిరుపతి గాంధీ రోడ్డు : రాష్ట్రంలో పాలన కమ్మగా సాగుతోందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కూటమి భవితవ్యాన్ని నిర్ణయించే శక్తి బీజేపీకే ఉందని గుర్తుంచుకోవాలన్నారు. ఆదివారం తిరుపతిలో జరిగిన బీజేపీ కమల వికాసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఇప్పుడే కాళహస్తి ఆనంద్ అడిగాడు.. రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందన్నా అని. ఎన్టీఆర్ హయాంలో పాలన ఎలా సాగుతోందని ఒకరు గజ్జల మల్లారెడ్డిని అడిగితే కమ్మగా సాగుతోందని చెప్పారు. ఇప్పుడు నేనూ అదే చెబుతున్నా. రాష్ట్రంలో పాలన ఇంకా కమ్మగా సాగుతోంది. ఆ పరిస్థితి పోవాలి. కమ్మగా అంటే మీకు అర్థమై ఉంటుంది. అయితే ఈ కమ్మతో పాటే మనందరం ఉన్నాం. అందువల్ల కుల, మతాలకు అతీతంగా నిజాయితీగా కష్టపడే వారందరికీ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. బీజేపీ లేకుండా తెలుగుదేశం గానీ, జనసేన గానీ రాష్ట్రంలో రాజకీయంగా నిలబడలేవన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని, అధిక శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ విషయంలో గట్టిగా మాట్లాడాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలకం అని తెలిపారు. గూగుల్, కాగ్నిజెంట్ వంటి బహుళజాతి సంస్థలు రాష్ట్రానికి రావడానికి కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీజేపీ పాత్రను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు. -
పీఆర్సీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
సాక్షి, అమరావతి/గాంధీనగర్(విజయవాడసెంట్రల్) : పీఆర్సీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఆ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్ చెప్పారు. పీఆర్సీ కమిషన్కు చైర్మన్ను నియమించే వరకూ వెనుకడుగు వేసేదిలేదన్నారు. ఏపీ ఎన్జీవో సంఘం నూతన కార్యవర్గానికి ఆదివారం విజయవాడలో జరిగిన ఎన్నికలు ఏకగ్రీవం అవగా రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి ఆలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శిగా డీవీ రమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారితోపాటు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గాం«దీనగర్లోని జింఖానా గ్రౌండ్స్లో జరిగింది. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చట్టబద్ధంగా లభించాల్సిన ప్రతి హక్కును పరిరక్షించేందుకు తమ సంఘం కట్టుబడి ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు అలాగే ఉన్నాయని, సీపీఎస్ ఉద్యోగుల సమస్యలు సైతం పరిష్కారం కాలేదన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఉద్యోగుల బకాయిలు కొండ లాగా పేరుకుపోయాయని వాటిని తగ్గించుకునేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఉద్యోగ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం ఏర్పాటు చేశామని, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో జేఏసీని పునవ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏ ఉద్యమం చేసినా బారికేడ్లను తన్నుకుని ముందుకు సాగుతామని తెలిపారు. తొలుత విద్యాసాగర్, డీవీ రమణలు నగరంలోని పాత బస్టాండ్ ప్రాంగణం నుంచి గాం«దీనగర్లోని రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. -
కర్ణాటక రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కర్ణాటకలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద ఈ ప్రమాదం జరగ్గా.. ఏపీకి చెందిన నలుగురు కూలీలు మరణించడం విషాదకరమని వైయస్ జగన్ అన్నారు. మృతులంతా అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందినవారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు కూడా. మృతుల కుటుంబాలకు జగన్.. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
టెన్త్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో మార్పు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో ప్రభుత్వం స్వల్ప మార్పు చేసింది. మార్చిలో నిర్వహించనున్న పబ్లిక్ పరీక్షల్లోని ఇంగ్లిష్ పరీక్ష తేదీని మార్చింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్లో ప్రకారం మార్చి 20న (శుక్రవారం) ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఆ రోజు రంజాన్ పండుగ సెలవు కావడంతో ఇంగ్లిష్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ మరుసటి రోజు 21వ తేదీన ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించనుంది.ఈ మేరకు పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులరెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మిగిలిన అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయని తెలిపారు. అయితే, గత డిసెంబర్ 4న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మార్చి 20న (ఈద్–ఉల్–ఫితర్) రంజాన్ పండుగ సెలవు ప్రకటించారు. అయినా పాఠశాల విద్యాశాఖ ఆలస్యంగా తేరుకుని ఇప్పుడు పరీక్ష తేదీని మార్చడం గమనార్హం. -
ఆక్రమణదారులు పరిహారానికి అనర్హులు
సాక్షి, అమరావతి: చట్టబద్ధ యాజమాన్య పత్రాలు లేకుండా ప్రభుత్వ భూమిలో ఎన్ని దశాబ్దాలు ఉన్నా.. వారు ఆక్రమణదారులుగానే పరిగణించబడతారని హైకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలిక నివాసం ఆధారంగా భూ యజమాని హోదా రాదని తేల్చి చెప్పింది. ఆక్రమణదారులు 2013 భూసేకరణ చట్టం కింద ‘భూ యజమానులు‘ నిర్వచన పరిధిలోకి రారని, పరిహారానికి అర్హులు కాలేరని కుండబద్దలు కొట్టింది. భూమిపై లేదా ఆస్తిపై చెల్లుబాటయ్యే యాజమాన్య హక్కులు కలిగి ఉన్న వారు మాత్రమే 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారానికి అర్హులని వివరించింది.పిటిషనర్లు కోరినట్టు భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ గృహ వసతి కల్పించిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం తమ అధీనంలో ఉన్న భూములు తీసుకున్నందున తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. అలాగే అధికారులపై వారు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లనూ కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇటీవల తీర్పు వెలువరించారు.పూర్వీకుల కాలం నుంచి ఆ భూముల్లోనే ఉంటున్నాంతాము ఉంటున్న భూమిని ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం తీసుకుంటున్నందున తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతూ విజయవాడలోని గుణదల ప్రాంతానికి చెందిన పలువురు 2020,21,22 సంవత్సరాల్లో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ భూమిలో తాము తమ పూర్వీకుల కాలం నుంచి నివసిస్తున్నామని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను చెల్లిస్తున్నామని, విద్యుత్, మునిసిపల్ నీటి కనెక్షన్లు కూడా ఉన్నాయని వివరించారు. తాము భూమిలేని పేదలమని, అక్కడే షాపులు నడుపుకుంటూ జీవిస్తున్నామని, తమకు న్యాయం చేయాలని కోరారు.అయితే పిటిషనర్లు ఆక్రమించిన భూమి ప్రభుత్వ కాలువ, శ్మశాన వాటిక భూమిగా రికార్డుల్లో ఉందని అధికారులు హైకోర్టుకు నివేదించారు. పిటిషనర్ల వద్ద ఎటువంటి యాజమాన్య పత్రాలు లేవని, కేవలం పన్నులు కట్టినంత మాత్రాన యాజమాన్య హక్కులు రావని వివరించారు. అయినప్పటికీ, పిటిషనర్లతో పాటు ఇతర బాధితులకు మానవతా దృక్పథంతో ప్రత్యామ్నాయంగా 114 ఇళ్లు కేటాయించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది. వీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం పొందలేరని స్పష్టంచేసింది. -
కాపులు తమ చెప్పు కింద ఉండాలన్న భావనతో టీడీపీ వ్యవహరిస్తోంది
పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): టీడీపీ తొలినుంచీ కాపులు తమ చెప్పు కింద ఉండాలన్న భావనతోనే వ్యవహరిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. 1988లో వంగవీటి రంగా హత్య మొదలుకుని.. ఇటీవల ముద్రగడ పద్మనాభంపై దాడి వరకు కాపులపై టీడీపీ దాష్టికాలు చేస్తూనే ఉందని చెప్పారు. తాజాగా కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి కూడా టీడీపీ కాపు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. శనివారం గుంటూరు నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైఎస్సార్సీపీ నేతలు, ఉత్తరాంధ్ర కాపు నేతలు వచ్చారు. ఇటీవల టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ నేతలే ఘటనలన్నిటికీ కారణం ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అంబటి నివాసం, ఆయన కార్యాలయం, కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు దాడి చేయటం సిగ్గుచేటన్నారు. ఘర్షణకు ప్రేరేపించింది, తిట్టింది, కార్యాలయం తగలబెట్టింది, అంబటిపై హత్యాయత్నం చేసింది టీడీపీ నేతలేనని స్పష్టం చేశారు. చివరకు అంబటిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై కుట్రపన్ని రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశారని, కొవ్వు లేదని నివేదికలు రావటంతో తమ ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందని ఫ్లెక్సీలు వేయించారని ఆరోపించారు.ఆ ఫ్లెక్సీలు తొలగించాలని అంబటి పిలుపునిచ్చారని, దీంతో ఉద్దేశపూర్వకంగా ఆయనపై దాడికి తెగబడ్డారన్నారు. కుటుంబ సభ్యులను తిడుతుంటే అంబటి మాట తూలారని, దానికి పొరపాటు జరిగిందని కూడా చెప్పారని గుర్తు చేశారు. అంబటిపై 17 కేసులు పెట్టి అక్రమ అరెస్ట్కు తెరదీశారని, తాజాగా ఆయనపై మరో 16 కేసులు పెట్టినట్టు తెలుస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. అంబటి టైగర్ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని.. కచ్చితంగా పులి బయటకు వస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించదన్నారు. పరామర్శించేందుకు వచ్చే వారినీ అడ్డుకుంటున్నారు అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మాట్లాడుతూ.. తన తండ్రిపై టీడీపీ గూండాలు చేసిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ తమకు మద్దతివ్వటానికి వస్తుంటే అడ్డుకుంటున్నారన్నారు. పరామర్శకు వస్తున్న వారి ఆస్తులు అయిపోవాల్సిందేనని ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే మాధవి తిరిగి దాడి చేస్తానంటున్నారని, ఆమెను అధికార అహంకారం ఆవరించిందన్నారు. ‘మీరు మొదటిసారి గెలిచారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం ఎవరి వల్లా కాదు. క్షమాపణ అడగడానికి కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో ఇళ్లకు వస్తారా? ఎమ్మెల్యే గల్లా మాధవి సమాధానం చెప్పాలి.కేంద్ర మంత్రి పెమ్మసాని రాజకీయాలు ప్రక్షాళన చేస్తామన్నారు. చివరకు అయనే మరింత కలుషితం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్కళ్యాణ్ను ఇటువంటి ఘటనపై స్పందించాలని అడగటం తప్పా? కేవలం దాడి విషయంలో ప్రశ్నించి, భద్రత కల్పించాలని అడిగాను’ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, పార్టీ నేతలు చింతలపూడి వెంకట్రామయ్య, కంది రాజీవ్గాం«దీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నింస్తే గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. అంబటిపై దాడిని చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ చేతకాని విధానాలను ప్రశ్నింస్తే ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్ దుర్మార్గంగా వ్యవహరించారని, అందుకు నిలువెత్తు నిదర్శనం అంబటిపై దాడేనని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా కాపులపై దాడి చేయటం పరిపాటిగా మారిందన్నారు. కాపులపై దాడి చేయడం టీడీపీ డీఎన్ఏలోనే ఉందని దుయ్యబట్టారు. ప్రణాళిక ప్రకారమే ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ధూళిపాళ్ల నరేంద్ర కనుసన్నల్లోనే టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు లోకేశ్ ఆదేశాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు నేతలంతా అంబటి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. -
వియ్యంకులకు పోల‘వరం’
సాక్షి, అమరావతి: పోలవరం ఎడమ కాలువ పనుల్లో 2014–19 మధ్య నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సంస్థ దోచేస్తే.. ఇప్పుడు ‘ఈనాడు’ రామోజీ కుమారుని వియ్యంకుడికి చెందిన ‘ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్’ సంస్థ అడ్డగోలుగా దోపిడీ చేస్తోందని సాగు నీటి రంగ నిపుణులు చెబుతున్నారు. కాలువకు అత్యంత నాసిరకంగా కాంక్రీట్ లైనింగ్ చేయడం వల్ల పనులు చేసిన కొద్ది రోజులకే పగుళ్లు రావడంతో వాటికి సిమెంటు పూతతో సరిపెట్టడమే ఇందుకు నిదర్శనం. కాంట్రాక్టర్కు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటం వల్ల పనుల నాణ్యతపై అధికారులు నోరు మెదపలేక పోతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ 5, 5ఏ ప్యాకేజీల్లో 2019 అక్టోబర్ 3 నాటికి మిగిలిన రూ.81.63 కోట్ల విలువైన పని అంచనా వ్యయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రూ.293.66 కోట్లకు పెంచేసింది. వాటిని 4.68 శాతం అధిక ధరకు.. అంటే రూ.307.41 కోట్లకు కోట్ చేసిన ‘ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్’కు గతేడాది అక్టోబర్ 17న కట్టబెట్టింది. అంటే.. మిగిలిన పని అంచనా వ్యయం కంటే రూ.225.78 కోట్లు (277 శాతం) ఎక్కువకు అంచనాలను పెంచేసినట్లు స్పష్టమవుతోంది. అయినా, పనులు అత్యంత నాసిరకంగా చేస్తూ పెంచేసిన అంచనా వ్యయాన్ని ‘నీకింత.. నాకింత’ అంటూ పచ్చ ముఠా పంచుకు తింటోందని సాగు నీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం బహిరంగ సభ వేదికగా కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ‘ఏటీఎం’గా మార్చుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను గుర్తు చేస్తున్నారు.అప్పట్లో అడ్డగోలు దోపిడీకి ఇప్పుడు నజరానా⇒ పోలవరం ఎడమ కాలువలో ఐదో ప్యాకేజీ (93.7 నుంచి 111.487 కిలోమీటర్ల వరకు) పనులను రూ.181.60 కోట్లకు సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ 2005 మార్చి 23న దక్కించుకుంది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఈ పనులను అనుంగులకు అప్పగించడంపై దృష్టి సారించారు. ⇒ 5.754 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 11.001 కిలోమీటర్ల లైనింగ్, 33 కాంక్రీట్ నిర్మాణ పనులను 60–సీ కింద సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ నుంచి తప్పించి.. వాటిని రూ.142.88 కోట్లకు యనమల వియ్యంకుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు చెందిన పీఎస్కే–హెచ్ఈఎస్ (జేవీ)కు 2016 నవంబర్ 30న నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు కట్టబెట్టారు. ⇒ వాటితోపాటు 100.3 కిలోమీటర్ నుంచి 102.5 కిలోమీటర్, 110.5 కిలోమీటర్ల నుంచి 111.487 కిలోమీటర్ వరకు కఠిన శిల (హార్డ్ రాక్)తో కూడిన భూమిని బ్లాస్టింగ్ చేసి తవ్వాలని, అందుకు 3,77,938 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి వస్తుందని.. క్యూబిక్ మీటర్కు రూ.29.21 చొప్పున రూ.1.11 కోట్లు అదనంగా చెల్లించాలని 2018 మే 22న బాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ఎడమ కాలువ తవ్వకం కోసం కుమ్మరిలోవ వద్ద కొండను కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో కాకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్న దృశ్యం ⇒ కాంక్రీట్ నిర్మాణాల్లో మార్పుల వల్ల అదనంగా రూ.38.986 కోట్లు చెల్లించాలని 2018 జూలై 10న మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు పీఎస్కే–హెచ్ఈఎస్ సంస్థతో పోలవరం అధికారులు సప్లిమెంటరీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. దాంతో.. ఆ సంస్థకు రూ.181.866 కోట్ల విలువైన పని అప్పగించినట్లయింది. ⇒ 2019 అక్టోబర్ 3 నాటికి ఆ సంస్థ రూ.117.05 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. మరో రూ.64.816 కోట్ల విలువైన పనులు మిగిలాయి. పుట్టా సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసి, వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిపుణుల కమిటీ చేసిన సూచన మేరకు ఆ సంస్థ నుంచి ఆ పనులను తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ⇒ ఎడమ కాలువలో 5–ఏ ప్యాకేజీలో 100.3 కిలోమీటర్ల నుంచి 102.50 కిలోమీటర్ల వరకు 2016–19 మధ్య కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో 16,69,476 క్యూబిక్ మీటర్ల మట్టి పని చేశారని చూపి.. క్యూబిక్ మీటర్కు అదనంగా రూ.78 చొప్పున రూ.13,25,59,128 అదనంగా చెల్లించేందుకు 2024లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అక్టోబర్ 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డీఎల్ఎస్సీ (డిస్ట్రిక్ట్ లెవల్ శాంక్షన్ కమిటీ) ప్రతిపాదన మేరకు చెల్లించిన రూ.9,94,19,274 పోనూ మిగిలిన రూ.3,31,39,854 చెల్లించాలని పేర్కొంది. ⇒ 2017 ఆగస్టు 6న డీఎల్ఎస్సీ చేసిన ప్రతిపాదనపై గత ఏడాది జూన్ 25న అంటే.. ఎనిమిదేళ్ల తర్వాత నిర్వహించిన సమావేశంలో ఎస్ఎల్టీసీ (స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) ఆమోద ముద్ర వేసిందంటూ ఆ మేరకు అదనపు బిల్లులు చెల్లించేసింది. ⇒ ఇక కాలువ అడుగు (బెడ్) భాగం వెడల్పు పెరగడం వల్ల 2016–19 మధ్య అదనంగా మట్టి తవ్వకం, కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారని చూపి.. వాటికి అదనంగా రూ.4.40 కోట్ల బిల్లు చెల్లించడానికి బాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే పుట్టా సంస్థకు అదనపు బిల్లుల రూపంలో రూ.53.34 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చినట్లు స్పష్టమవుతోంది.పనులు ఇలా చేయాలి⇒ టెండర్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం పోలవరం ఎడమ కాలువను అడుగు (బెడ్) భాగంలో 68.5 మీటర్ల వెడల్పు, 4.9 మీటర్ల లోతుతో.. 17,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో తవ్వాలి. ⇒ కఠిన శిలలతో కూడిన ప్రాంతంలో కాలువను తవ్వేటప్పుడు కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేయాలి. ⇒ ఆ తర్వాత కాలువ గట్లపై ఇరు వైపులా 5 మీటర్ల వెడల్పుతో.. 225 మిల్లీమీటర్ల మందంతో సర్వీసు రోడ్డు కోసం వరుస వేయాలి. ⇒ దాన్ని 8 నుంచి 10 టన్నుల సామర్థ్యంతో కూడిన షీప్ ఫుట్ రోలర్ లేదా వైబ్రేటరీ రోలర్తో మందం 150 ఎంఎం వరకు తగ్గేలా రోలింగ్ చేయాలి. ⇒ కాలువకు ఇరు వైపులా వాలు (స్లోప్స్)ను వైబ్రేటరీ ఇన్క్లెయిన్డ్ రోలర్తో పటిష్టం చేయాలి. కాలువ అడుగు భాగాన్ని వైబ్రేటరీ రోలర్తో గట్టి పరచాలి. ⇒ ఆ తర్వాత 40 ఎంఎం కంకర, ఇసుక, సిమెంటుతో కూడిన ఎం–10 కాంక్రీట్ మిశ్రమాన్ని 100 ఎంఎం మందంతో కాలువకు ఇరువైపులా వాలుకు పేవర్ యంత్రంతో లైనింగ్ వేయాలి. ⇒ కాలువ అడుగు భాగంలోనూ అదే రీతిలో లైనింగ్ వేయాలి.పనులు నాసిరకంగా చేయడం వల్ల లైనింగ్కు పగుళ్లు రావడంతో ఇటీవల సిమెంట్ పూత పూసి మాయ చేశారనడానికి నిదర్శనం పనులు ఇలా చేస్తున్నారు⇒ కఠిన శిలలతో కూడిన ప్రాంతంలో కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేయడం లేదు. కుమ్మరిలోవ వద్ద కాలువ కోసం కొండను ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్ చేస్తూ తవ్వేస్తుండటంతో తుని మున్సిపాల్టీలో ఒకటో వార్డులో ఇళ్లు కంపిస్తున్నాయని ఆ ప్రాంత వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ⇒ కాలువకు ఇరు వైపులా సర్వీసు రోడ్డును ఇష్టారాజ్యంగా కానిచ్చేస్తున్నారు. ⇒ కాంక్రీట్ లైనింగ్ చేయడం కోసం కాలువకు ఇరు వైపులా వాలు భాగాన్ని గట్టి పరచకుండానే అత్యంత నాసిరకం కంకర, ఇసుక, సిమెంటుతో కూడిన కాంక్రీట్తో చేస్తున్నారు.⇒ కాలువ అడుగు భాగంలోనూ ఇష్టారాజ్యంగా నాసిరకం కాంక్రీట్తో లైనింగ్ చేస్తున్నారు.⇒ దీని వల్ల కాంక్రీట్ వేసిన కొద్ది రోజులకే ఎక్కడికక్కడ పగుళ్లు వస్తున్నాయి. పగుళ్లు వచ్చిన చోట సిమెంటు పూత పూస్తూ మాయ చేస్తున్నారు.⇒ పనులు అత్యంత నాసిరకంగా చేస్తుండటం వల్ల కాలువలోకి పూర్తి స్థాయి మేరకు నీటిని వదిలినప్పుడు ఎక్కడికక్కడ గండ్లు పడతాయని సాగు నీటి రంగ నిపుణులు, ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ⇒ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ఈనాడు రామోజీరావు కుమారుని వియ్యంకుడు రాయల రఘుది కావడం, ఆయనకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతోనే పనుల నాణ్యతపై అధికారులు నోరు మెదపలేకపోతున్నారని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. -
చంద్రబాబు సొంత సంస్థ... హెరిటేజ్ పెరుగు ‘నాసిరకం’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ బండారం మరోసారి బయటపడింది. ఆ కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో నాణ్యత డొల్లేనని అధికారికంగా ఇంకోసారి స్పష్టమయింది. ‘టోటల్ కర్డ్’అంటూ హెరిటేజ్ సంస్థ విక్రయిస్తున్న పెరుగు నాసిరకమని, అందులో ఉండాల్సిన ఫ్యాట్ కనీస స్థాయిలో కూడా లేదని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టం చేసింది. కనీస ఫ్యాట్ కూడా లేని హెరిటేజ్ పెరుగు నాసిరకమైనదని నిర్ధారిస్తూ ‘సబ్–స్టాండర్డ్’అనే ముద్ర వేసింది. ఇలాంటి ఉత్పత్తులు విక్రయిస్తున్నందుకు రూ.లక్ష జరిమానా చెల్లించాలని హర్యానాలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ డిప్యూటీ కమిషనర్ (అడ్జుడికేటింగ్ అథారిటీ) ఆదేశించటంతో విధిలేక హెరిటేజ్ సంస్థ ఆ జరిమానాను చెల్లించింది. ఈ విషయాన్ని సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ మార్కెట్కు తెలియజేయాలి కనక... గత నెలలో హెరిటేజ్ సంస్థ స్వయంగా తెలియజేసింది. ‘‘ఎఫ్ఎస్ఎస్ఏఐ మా పెరుగు శాంపిళ్లను పరిశీలించింది. కాకపోతే నిబంధనల ప్రకారం వాటిలో ఉండాల్సిన కనీస పాల–ఫ్యాట్ కూడా లేదని ఆ సంస్థ తేల్చింది. ఈ మేరకు మా కంపెనీకి జజ్జర్లోని ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి నోటీసు వచ్చింది. మాకు రూ.లక్ష జరిమానా విధించగా మేం దాన్ని చెల్లించాం’’అని హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. ఈ జరిమానా చెల్లించటం వల్ల తమ కంపెనీపై ఆర్థికంగా పెద్దగా ప్రభావం పడదని కూడా కంపెనీ తెలియజేసింది. ఇదంతా ఒకెత్తయితే పెరుగులో పాలకు సంబంధించిన ఫ్యాట్ కనీస స్థాయిలో కూడా లేకపోవటంతో ఇది దేంతో తయారవుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘‘పాల–ప్యాట్లో ఏ చిన్న తేడాలున్నా అది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే.అలాంటిది పెరుగులో కనీస స్థాయిలో కూడా మిల్క్ ఫ్యాట్ లేదంటే ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే పాలతోనే కదా పెరుగు తయారవుతుంది? అందుకే మేం తరచూ శాంపిళ్లు తీసుకుంటుంటాం. హెరిటేజ్ పెరుగు నాసిరకమని తేలటంతో జరిమానా కూడా విధించాం’’అని ఫుడ్ సేఫ్టీ వర్గాలు తెలియజేశాయి. వాస్తవానికి జరిమానా మొత్తం చిన్నదే. దానివల్ల కంపెనీపై ఆర్థికంగా ప్రభావమేమీ ఉండకపోవచ్చు.కానీ పాలు, పెరుగు వంటివి భారీ సంఖ్యలో జనం నిత్యం వాడే ఉత్పత్తులు. ‘‘వీటిలో నాణ్యత లేదంటే ... అది కంపెనీ ఉత్పత్తులపై నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుంది. దీర్ఘకాలంలో కంపెనీ మనుగడకు ఇలాంటి అంశాలు సవాళ్లు విసురుతాయి’’అని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కంపెనీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిదని, ఉత్పత్తుల్లో నాణ్యత లేకపోవటం ఏమాత్రం సమ్మతం కాదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
పుడమి విషమెక్కుతోంది
సాక్షి, అమరావతి: నేలతల్లి నిస్సారమైపోతోంది.. సూక్ష్మపోషకాల లోపంతో.. క్షీణిస్తున్న సేంద్రియ కర్బనంతో భూసారం పూర్తిగా దెబ్బతింటోంది. దేశమంతటా కనిపిస్తోన్న ఈ ప్రభావం వ్యవసాయ పంటల సాగుపైనే కాదు.. ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారబోతుందని ఇండియన్ కౌన్సిల్ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్(ఐసీఆర్ఐఈఆర్) ఆందోళన వ్యక్తం చేసింది. జనవరి 27వ తేదీన విడుదల చేసిన హీలింగ్ సాయిల్స్ ఇన్ ఇండియా నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. ఆహారంలో కొరవడుతున్న పోషకాలు దేశవ్యాప్తంగా 34.59 కోట్ల ఎకరాల భూములు సాగులో ఉన్నాయి. ఇది దేశ¿ౌగోళిక విస్తీర్ణంలో 42 శాతంగా ఉంది. ఇందులో 50 శాతం వర్షాధారం కాగా, మిగిలిన 50 శాతం భూములు కాలువలు, బోర్లు, వివిధ పద్ధతుల ద్వారా సాగునీటి వనరులపై ఆధారపడి సాగవుతున్నాయి. మరో 3.20 కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూములు అందుబాటులో ఉన్నాయి. సాగు భూముల్లో ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తుండడంతో నేలల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోందని ఐసీఆర్ఐఈఆర్ నివేదిక తేల్చింది. అందులో సల్ఫర్, జింక్, ఇనుము, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషక లోపాలు ఏటా పెరగడంతో పాటు సేంద్రియ కర్బనాలు క్షీణించిపోతున్నాయని.. ఈ కారణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డుస్థాయిలో ఉన్నప్పటికీ, ఆహారంలో ఉండాల్సిన పోషకాలు దారుణంగా పడిపోతున్నాయని నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. దీన్నే ‘అదృశ్య ఆకలి’(హిడెన్ హంగర్) అని పిలుస్తారని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 0.5 శాతం కంటే తక్కువగా.. 2009–10లో 4.3:2:1గా ఉన్న ఎన్పీకే నిష్పత్తి, 2024–25 నాటికి 10.9:4.4:1కి పడిపోయింది. సేంద్రియ కర్బనమైతే(ఓసీ) సగానికి పడిపోయింది. ఆరోగ్యకరమైన నేలల్లో కనీసం 1.5 శాతంగా ఉండాల్సిన సేంద్రియ కర్బనం దేశంలోని 75 శాతం రాష్ట్రాల్లో 0.75 శాతం కంటే తక్కువగా ఉంది. కొన్ని చోట్ల 0.5 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఈ కారణంగా ఏటా సుమారు 5.3 బిలియన్ టన్నుల పైపొర మట్టిని భూమి కోల్పోతుంది. 2024–25లో దేశవ్యాప్తంగా నిర్వహించిన భూసార పరీక్షల్లో నాలుగింట మూడొంతుల నేలల్లో సేంద్రియ కర్బనం క్షీణించిందని, దక్షిణాది రాష్ట్రాల్లో సల్ఫర్, జింక్ లోపాలు అధికంగా ఉన్నట్టుగా గుర్తించారు. సూక్ష్మ పోషకాల్లో కీలకమైన జింక్ లోపం అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 67 శాతం ఉంటే.. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో 55 శాతం, రాజస్థాన్లో 50 శాతంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో 32 శాతం జింక్ లోపం ఉన్నట్టుగా గుర్తించారు. సేంద్రియకర్బనం 0.5 శాతం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హర్యాన, పంజాబ్, రాజస్థాన్ ఉన్నాయి. ఈ జాబితాలో నాలుగో స్థానంలో తెలంగాణ, 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పొటాíÙయం వంటి ఇతర పోషకాల వాడకం 80 శాతం కంటే తక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు. నైట్రోజన్ (యూరియా)కు ఇస్తున్న సబ్సిడీ సూక్ష్మపోషకాలు, మిశ్రమ ఎరువులకు ఇవ్వడం లేదు. యూరియాపై 85–90 శాతం సబ్సిడీ ఇస్తుండగా, ఫాస్పరస్, పొటాషియం ఎరువులపై నామమాత్రంగానే సబ్సిడీలు ఇస్తున్నారు. దీనివల్ల మెజార్టీ రైతులు తక్కువ ధరకు లభించే యూరియాపై ఆధారపడే పంటలు సాగు చేస్తున్నారు. వాడిన నైట్రోజన్లో కేవలం 35–40 శాతం మాత్రమే మొక్కలకు అందుతోంది. మిగిలింది భూగర్భ జలాల్లో కలిసి ‘నైట్రేట్’ కాలుష్యానికి దారితీస్తోంది. ఫలితంగా నేలల్లో ఉండాల్సిన ఎన్పీకే (నైట్రోజన్, ఫాస్పరస్, పొటాíÙయం) నిష్పత్తి దెబ్బతింటోంది. పరిష్కార మార్గాలివే.. » ఏటా వ్యవసాయ సీజన్కు ముందుగానే మట్టి నమూనాలు సేకరించి, భూసార పరీక్షల ద్వారా కేవలం రసాయన పరీక్షలే కాకుండా, నేల భౌతిక, జీవసంబంధమైన లక్షణాలను కూడా పరీక్షించాలి. » ప్రతి రైతుకు సాయిల్ హెల్త్కార్డులు ఇవ్వడంతో పాటు ఏ భూమిలో ఏ పోషక లోపాలు ఉన్నాయో గుర్తించి సూక్ష్మ పోషకాలను సబ్సిడీపై అందించాలి. » సబ్సిడీ విధానంలో మార్పులు తీసుకురావాలి. సమతుల్య ఎరువుల వాడకం ద్వారా అన్ని రకాల పోషకాలు నేలకు అందేలా చూడాలి. » బయో–ఫరి్టలైజర్స్ (జీవ ఎరువులు), రీజనరేటివ్ ఫారి్మంగ్ (పునరుత్పాదక వ్యవసాయం), పోషకాలు అధికంగా ఉండే పంట రకాలను ప్రోత్సహించాలి. » జీలుగ, జనుము, వంటి పంటలను సాగు చేసి పూత దశలో భూమిలో కలియదున్నడం ద్వారా సేంద్రియ కర్బనాన్ని పెంచాలి. » రసాయన ఎరువులతో పాటు పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, బయో ఫర్టిలైజర్స్ వాడకం ద్వారా సమీకృత పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలి. »రైతులకు నేల ఆరోగ్యంపై శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. -
నిందితుల హక్కుల పరిరక్షణపై ‘సుప్రీం’ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: నిందితుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ నిమిత్తం క్రిమినల్ కేసులను విచారించే దిగువ కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సొంతగా న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేని నిందితులకు లీగల్ ఎయిడ్ కింద ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని నిందితులకు తప్పనిసరిగా తెలియజేయాలని దిగువ కోర్టులను ఆదేశించింది. సాక్షుల విచారణ ప్రారంభం కావడానికి ముందే నిందితులకు న్యాయ సహాయం గురించి చెప్పాలంది. ఇందుకు నిందితులు ఏం చెప్పారు? న్యాయ సహాయానికి అంగీకరించారా?, న్యాయ సహాయం పొందేందుకు అంగీకరిస్తే అందుకు తీసుకున్న చర్యలు ఏమిటనే విషయాలను రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది. అలా రికార్డ్ చేసిన వివరాలను సాక్షుల విచారణ మొదలు కావడానికి ముందే కోర్టు ఉత్తర్వుల్లో పొందుపరచాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అన్ని కింది కోర్టులు కచ్చితంగా పాటించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల నేపథ్యం ఇదీ.. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులో నిందితురాలిగా ఉన్న రెజీనామేరీ చెల్లమణికి మద్రాస్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. తన తరఫున వాదించేందుకు న్యాయవాది లేకపోవడంతో విచారణ ప్రారంభ దశలో సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేకపోయిన విషయాన్ని నిందితురాలు గుర్తించింది. దీంతో ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాక్షులను తిరిగి విచారించాలని పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు అనుమతించిన తర్వాతే.. ఆమెకు సాక్షులను ప్రశ్నించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సొంతగా న్యాయవాదులను నియమించుకునే స్థోమత లేని నిందితులకు, తమ తరఫున వాదించుకోవడానికి న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఉందన్న విషయాన్ని వారికి కింది కోర్టులు తప్పనిసరిగా తెలియజేయాలని ఆదేశించింది. -
స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) శరవేగంగా కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు వీలుగా గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా.. మున్సిపాలిటీలు, నగరాల్లోనూ వార్డులు, డివిజన్ల వారీగా కొత్త ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శుక్రవారం మూడు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. 2026 జనవరి 1వ తేదీకి 18ఏళ్లు నిండిన వారికీ ఓటు హక్కు కల్పించేలా కొత్త ఫొటో ఓటర్ల జాబితాలను మార్చి 9 నాటికి ప్రచురించాలని కలెక్టర్లకు, డీపీఓలు, మున్సిపల్, నగర కార్పొరేషన్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో 17 నగర కార్పొరేషన్లు ఉండగా, అందులో 13 కార్పొరేషన్లలో పాలకవర్గాలు కొనసాగుతుండగా, వాటిలో 11 చోట్ల పదవీ కాలం మార్చి 17తో ముగుస్తుంది. 106 మున్సిపాలిటీలు ఉండగా, అందులో ప్రస్తుతం 87 మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొనసాగుతుండగా.. 75 మున్సిపాలిటీల్లో వాటి పదవీ కాలం మార్చి 17తోనే ముగియనుంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, నగర కార్పొరేషన్ అన్నీ కలిపి 123 ఉండగా.. అందులో ప్రస్తుతం 100 మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొనసాగుతుండగా, మిగిలినచోట్ల వివిధ రకాల కోర్టు కేసులు తదితర కారణాలతో ఎన్నికలు జరగని విషయం తెలిసిందే. ప్రస్తుతం పాలకవర్గాలు ఉన్న మరో 13 మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లలో ఈ ఏడాది నవంబర్ నాటికి పదవీకాలం ముగియనుంది. వీటికి తోడు 2021లో ఎన్నికలు జరిగిన పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ముందస్తు ప్రణాళికతో ముందుకు.. స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగియనున్నందున గడువులోపే ఎన్నికలు జరిపేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని గత ఏడాది సెపె్టంబరు 3నే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి వివిధ సందర్భాల్లో ఆమె మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతోనూ భేటీ అయ్యారు. తాజాగా శుక్రవారం మరో విడత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్సిపాలిటీలో వార్డుల పునర్ వర్గీకరణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త పంచాయతీల ఏర్పాటు వంటి ప్రక్రియ అమలుపై వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఈ సమావేశం తర్వాత మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాల రూపకల్పనపై ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. చలనం లేని సర్కారు ఇదిలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఈ ఏడాది దాదాపు అసాధ్యమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నిర్ణీత గడువులోగా మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేపడుతున్న చర్యలకు ప్రభుత్వ పరంగా తగిన సహకారం లేకపోవడం గమనార్హం. రిజర్వేషన్ల ఖరారులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక రూపకల్పననూ పూర్తి చేయకపోవడంతో స్థానిక ఎన్నికలు ఈ ఏడాది అనుమానమేనని సమాచారం. అయితే, నిర్ణీత గడువులోగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన వంతుగా కసరత్తు చేపడుతోంది. దీనిలోభాగంగానే ఓటర్ల జాబితా తయారీకి ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. -
‘కేసుల మాఫి’యా! బాబు ఫై‘బర్తెగింపు’
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కేసుల అడ్డగోలు మూసివేతలో భాగంగా మరో కుట్ర అంకానికి సీఐడీ తెర తీసింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన ఫైబర్ నెట్ కుంభకోణాల పరంపరలో ఇంకో కేసు మాఫీకి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న ఫైబర్ నెట్ ప్రాజక్టు టెండర్ల కేసును సీఐడీ ఇటీవల మూసి వేసింది. కాగా ప్రస్తుతం చంద్రబాబు సన్నిహితుడు టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఆయన ముఠా దోపిడీ కేసును అడ్డగోలుగా మూసి వేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సీఐడీ బాస్ తమ అధికారులను రంగంలోకి దించారు. ఎల్ 1ను బెదిరించి.. అడ్డగోలుగా కాంట్రాక్టు కొల్లగొట్టి..గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ టెండర్లను టెరాసాఫ్ట్ సంస్థ ఏకపక్షంగా దక్కించుకుని యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా ఫైబర్ కేబుళ్ల పనులను దక్కించుకున్న టెరాసాఫ్ట్ కంపెనీ అనంతరం సెటాప్ బాక్సుల టెండర్లకు గురి పెట్టింది. ఇతర సంస్థలు బిడ్లు వేయకుండా అడ్డుకోవాలని భావించింది. కాగా దాసన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అనూహ్యంగా పోటీలో నిలిచింది. రూ.500 కోట్ల విలువైన సెటాప్ బాక్సుల టెండర్లలో ఆ సంస్థ ఎల్ 1గా నిలిచింది. నిబంధన ప్రకారం దాసన్ ఇండియా లిమిటెడ్కు టెండరు కేటాయించాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడైన టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ అందుకు ఏమాత్రం సమ్మతించలేదు. ఆ టెండరూ తమకే దక్కాలని పట్టుబట్టారు. దీంతో ఆయన వర్గీయులు దాసన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులను బెదిరించారు. స్వచ్ఛందంగా కాంట్రాక్టు వదలుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆ కంపెనీ ప్రతినిధి రవిని బెదిరింపులతో బెంబేలెత్తించారు. దీనిపై దాసన్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెబతూ చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీ లేక దాసన్ లిమిటెడ్ మౌనంగా ఉండిపోవాల్సి వచి్చంది. చివరకు ఆ కాంట్రాక్టును టెరాసాఫ్ట్ కంపెనీ దక్కించుకుంది. అనంతరం దాసన్ ఇండియా లిమిటెడ్ ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఆ కంపెనీ లాజిస్టిక్ మేనేజర్ పోతుల సునీల్ కుమార్ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దాంతో టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఆ కంపెనీ ఈడీ తుమ్మల గోపీచంద్లతోపాటు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఈడీ(పైనాన్స్) వెంకటేశ్వరరావు, జీఎం (మార్కెటింగ్) కెంబూరు సతీశ్, ఏజీఎం గిరి ప్రసాద్, పూర్వ ఈడీ రామారావు తదితరులను నిందితులుగా పేర్కొన్నారు.కేసు క్లోజ్ చేయండి కాగా 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసు విచారణను సీఐడీ అటకెక్కించింది. తాజాగా ఆ కేసును క్లోజ్ చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశాలను అమలు చేసేందుకు రంగంలోకి దిగారు. ఈమేరకు సీఐడీ బాస్ ఈ కేసు దర్యాప్తు అధికారికి కర్తవ్య బోధ చేశారు. దీంతో ఆ కేసును మూసివేసే దిశగా దర్యాప్తు అధికారి చర్యలు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఆ కంపెనీ లాజిస్టిక్ మేనేజర్ పోతుల సునీల్ కుమార్ ఆ సంస్థ నుంచి వైదొలిగినట్టు తెలిసింది. కేసు మూసివేతకు ప్రతిబంధకాలు ఉండకూడదనే ఆయనను పంపించివేసినట్టు తెలుస్తోంది. ఇక గతంలో టెరాసాఫ్ట్ వేధింపుల బాధితులు ప్రస్తుతం సాక్ష్యం చెప్పడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాల్సిందేనని వారిని సీఐడీ అధికారులు బెదిరిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన రికార్డులు సమర్పించాలని ఫైబర్నెట్ కార్పొరేషన్ అధికారులకు లేఖ రాశారు. ఆ రికార్డులు వచ్చిన తరువాత కేసును అడ్డగోలుగా మూసివేయాలని సీఐడీ భావిస్తోంది. ఈమేరకు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా ముద్ర వేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలన్నది సీఐడీ ఉద్దేశం. అందుకు ప్రస్తుత ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతారు. అనంతరం కేసు మూసివేతే తరువాయని ఫైబర్ నెట్ కార్పొరేషన్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
చంద్రబాబు కుటుంబ సంస్థ ‘హెరిటేజ్’ బండారం బట్టబయలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ బండారం బట్టబయలైంది. హెరిటేజ్ ‘టోటల్ కర్డ్’ అత్యంత నాణ్యతలేనిదిగా నిర్థారణ అయ్యింది. సబ్-స్టాండర్డ్ ఉత్పతి అని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ధారించింది. నిబంధనలు ఉల్లంఘించి నాణ్యత లేని పెరుగు విక్రయిస్తోంది. నాణ్యత లేని పెరుగు విక్రయిస్తున్న హెరిటేజ్కు జరిమానా విధించిన అధికారులు.. పెరుగులో కనీస పాలకొవ్వు లేదని తేల్చారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ యాక్ట్ కింద రూ.లక్ష పెనాల్టీ వేశారు. తప్పు ఒప్పుకున్న హెరిటేజ్ యాజమాన్యం.. పెనాల్టీ కడతామంటూ సెబీకి నివేదిక ఇచ్చింది. ప్రజల ఆరోగ్యంతో బాబు సంస్థ చెలగాటమాడుతోంది. నాణ్యతలేని పెరుగును మార్కెట్లోకి వదిలిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రాండ్ పేరుతో హెరిటేజ్ మోసానికి పాల్పడుతోంది. హెరిటేజ్ ఉత్పత్తుల్లో నాణ్యత లోపంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
వాళ్లూ.. పూర్తి స్థాయి ఉపాధ్యాయులే
‘‘యువత ఈ దేశ భవిష్యత్తు. వారికి సరైన దిశానిర్దేశం చేసి నిర్మాణాత్మక శక్తిగా మార్చేది ఉపాధ్యాయులే. ఒక బలమైన దేశానికి పునాది ఆ దేశ పౌరుల వ్యక్తిత్వం, విలువలలో ఉంటుంది. పునాదే బలహీనంగా ఉంటే దేశం కూలిపోక తప్పదు. మన భారత భాగ్య విధాతలను గొప్పవారిగా మలచడంలో ఉపాధ్యాయులది అత్యంత కీలక పాత్ర. భారతీయ సంస్కృతిలో ‘గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః’ అని అంటారు. ఉపాధ్యాయుడిని దైవంతో సమానంగా చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయుడు దైవం కంటే కూడా గొప్పవాడు. దేశ పునాదిని నిర్మించే ప్రాథమిక ఉపాధ్యాయులకు ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ఇవ్వాలి. వారి సేవలకు తగిన విధంగా గౌరవ వేతనం, ప్రతిఫలాన్ని అందించాలి. నిజానికి వారు చేసే సేవలకు ఏ గౌరవ వేతనమూ సరితూగదు’’ – సుప్రీంకోర్టు ధర్మాసనంసాక్షి, అమరావతి: ‘సర్వ శిక్షా అభియాన్’ పథకం కింద నియమితులైన పార్ట్టైం టీచర్లు / కాంట్రాక్ట్ ఇన్స్ట్రక్టర్లు / కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల విషయంలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. నియామక కాలం పూర్తయిన తరువాత కూడా కొనసాగుతున్న ఉపాధ్యాయులను ఇకపై ’కాంట్రాక్ట్’ ఉద్యోగులుగా పరిగణించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. వారు ఇతర పనులు చేయకుండా ప్రభుత్వం నిషేధించినందున పూర్తిస్థాయి ఉపాధ్యాయులే అవుతారని స్పష్టం చేసింది. ఈ పథకం కింద ఉపాధ్యాయులకు వేతనం చెల్లించాల్సిన బాధ్యత ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపింది. కేంద్రం తన వాటా నిధులు ఇవ్వకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉపాధ్యాయులకు ముందుగా చెల్లించి, ఆ తర్వాత కేంద్రం నుండి ఆ మొత్తాలను వసూలు చేసుకోవాలని పేర్కొంది. పార్ట్టైం టీచర్లు / కాంట్రాక్ట్ ఇన్స్ట్రక్టర్లు / కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు చెల్లించే గౌరవ వేతనం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదని, కనీసం ప్రతి మూడేళ్లకు ఒకసారి సవరించాలని పేర్కొంది. 2013లో ఖరారు చేసిన రూ.7 వేలనే ఇప్పటికీ గౌరవ వేతనంగా చెల్లిస్తుండటం ‘వెట్టిచాకిరి’ కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదంది. 10 ఏళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తున్న నేపథ్యంలో వీరి పోస్టులు శాశ్వతమైనవిగా పరిగణించాలంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించింది. సర్వ శిక్షా అభియాన్ పథకం కింద ఉత్తరప్రదేశ్లో నియమితులైన ఉపాధ్యాయులకు గౌరవ వేతనాన్ని రూ.7 వేలుగా మాత్రమే చెల్లిస్తుండటంపై దాఖలైన వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈమేరకు కీలక తీర్పు వెలువరించింది. 2017–18 సంవత్సరానికి మాత్రమే రూ.17 వేలను కనీస వేతనంగా చెల్లించాలన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పార్ట్టైం ఉపాధ్యాయులు, ఇన్స్ట్రక్టర్ల సంఘం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసింది. మరోవైపు రూ.17 వేలను కనీస వేతనంగా నిర్ణయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. టీచర్ల సంఘం దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతిస్తూ, ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది.వారి ఆర్థిక భద్రత బాధ్యత రాష్ట్రాలదే...‘ఈ ఉపాధ్యాయుల సేవలు విద్యా వ్యవస్థకు నిరంతరం అవసరం కాబట్టి సర్వ శిక్షా అభియాన్ పథకం కొనసాగినంత కాలం వారికి తగిన ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. వేతనం విషయంలో జాప్యం, కోతలు, అస్పష్టత ఉపాధ్యాయులను ఆర్థికంగా బలహీనులను చేస్తుంది. ఇది విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉపాధ్యాయులకు గౌరవ వేతనాన్ని సమయానికి, నిరంతరాయంగా చెల్లించాలి. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు (వేతనం తగ్గించడం, ఆలస్యం చేయడం) అన్యాయమైనవే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఉపాధ్యాయుల సేవలను దృష్టిలో ఉంచుకొని వారికి గౌరవప్రదమైన జీవనానికి సరిపడే వేతనం ఇవ్వాల్సిందే. ప్రస్తుత కేసులో.. సర్వశిక్షా అభియాన్ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.7 వేలు మాత్రమే ఇస్తోంది. ఇది మామూలు కార్మికులకు ఇచ్చే కనీస వేతనం కంటే తక్కువ. ఈ ఉపాధ్యాయులకు నెలకు రూ.17 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలి. కనీసం ప్రతి మూడేళ్లకొకసారి వేతనాన్ని సవరించాలి’ అని ధర్మాసనం తన తీర్పులో తేల్చి చెప్పింది.పార్ట్టైం టీచర్లని పిలవడం మోసపూరితం..‘ప్రాథమిక పాఠశాలల్లో నియమితులైన పార్ట్టైం, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) నిర్దేశించిన ప్రాథమిక విద్యార్హతలు కలిగి ఉంటారు. అందువల్ల వీరు రెగ్యులర్ ఉపాధ్యాయుల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదు. వీరిని ’పార్ట్ టైం టీచర్లు’ అని పిలవడం మోసపూరితం. వారు రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానమైన అర్హతలు కలిగి ఉండి, సమాన విధులను నిర్వర్తిస్తున్నారు. వారి విషయంలో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం వేరే ఏ ఇతర ఉద్యోగం చేయకూడదు. ప్రభుత్వం వారిని ఇతర పనులు చేయకుండా నిరోధించినప్పుడు, వారిని వాస్తవానికి పూర్తి స్థాయి ఉపాధ్యాయులుగానే పరిగణించాలి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.తాత్కాలికం మానేసి.. రెగ్యులర్ నియామకాలు చేపట్టాలి‘పార్ట్టైం టీచర్లు, ఇన్స్ట్రక్టర్లు 10 ఏళ్లకు పైగా నిరంతరాయంగా పనిచేస్తున్నారు. దీంతో వీరికి ఒక రకమైన శాశ్వతత్వం ఏర్పడింది. వారు రోజుకు ఎనిమిది పీరియడ్ల వరకు బోధిస్తూ రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగానే పని భారాన్ని మోస్తున్నారు. వారి పని శాశ్వత స్వభావం కలిగినది. అనుభవం ఉన్న ఈ ఉపాధ్యాయులను తీసేసి కొత్త వారిని నియమించడం కుదరదు. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని.. మరో కాంట్రాక్ట్ ఉద్యోగితో భర్తీ చేయకూడదు. ప్రభుత్వం ఇలాంటి తాత్కాలిక నియామక పద్ధతులను మానేసి సరైన పద్ధతిలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేపట్టాలి. వీరంతా సరైన ప్రక్రియ, ప్రకటన ద్వారా ఎంపికయ్యారు కాబట్టి వీరి నియామకాలను పూర్తిస్థాయి నియామకాలుగానే పరిగణించాలి. వీరిని అడ్హాక్ సిబ్బందిగా పిలవడం అసంబద్ధం. ప్రభుత్వ సంస్థలలో తాత్కాలిక ఉద్యోగులు ఎదుర్కొంటున్న దోపిడీని ఈ కోర్టు గుర్తించింది. సమానమైన పనులు చేస్తున్నప్పటికీ వారిని ’తాత్కాలికం’ అని ముద్ర వేసి పెన్షన్, పీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ప్రాథమిక హక్కులను నిరాకరించడం వారి గౌరవానికి భంగం కలిగించడమే’ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.తక్కువ వేతనానికి పని చేయించుకోవడం వెట్టి చాకిరియే..‘ఉపాధ్యాయుల గౌరవ వేతనాన్ని నిర్ణయించడం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అయినప్పటికీ అది ఏకపక్షంగా ఉండకూడదు. ధరల పెరుగుదల, జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని కాలానుగుణంగా వేతనాన్ని సవరిస్తూ ఉండాలి. అతి తక్కువ వేతనానికి పని చేయించుకోవడం రాజ్యాంగంలోని 23వ అధికరణం ప్రకారం ‘వెట్టిచాకిరి’ కిందకు వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తక్కువ వేతనానికి అంగీకరించడం స్వచ్ఛందమైన పని కాదు. అది బలవంతపు శ్రమ అవుతుంది. వేరే పని చేయనివ్వకుండా కట్టడి చేసి ఇచ్చే వేతనాన్ని కూడా తగ్గించడం ఆర్థికంగా వారిని అణచివేయడమే. ఇది రాజ్యాంగ విరుద్ధం’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ‘బడ్జెట్ ఆమోదించడం, గౌరవ వేతనాన్ని నిర్ణయించే అధికారం కేవలం పీఏబీ (ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్)కు మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇతర కమిటీలు వేతనాలను తగ్గించడం లేదా మార్చడం చేయలేవు. గౌరవ వేతనం ఖరారుతో సహా బడ్జెట్ కేటాయింపుల అధికారాలన్నీ పీఏబీకే ఉన్నాయి. ఒకసారి పీఏబీ ఆమోదించిన గౌరవ వేతనం అమలులో ఉన్నపుడు దాన్ని రాష్ట్రం ఏకపక్షంగా తగ్గించడం చట్టవిరుద్ధం. విద్యా హక్కు చట్టంలోని రూల్ 20 ప్రకారం ఈ ఉపాధ్యాయుల జీతభత్యాలు, పెన్షన్, ఇతర సౌకర్యాలు రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా ఉండాలి’ అని తేల్చి చెప్పింది.రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా అన్ని ప్రయోజనాలు..‘నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం, ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించకూడదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జనగణన, విపత్తు నివారణ విధులు, స్థానిక సంస్థలు లేదా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల విధులకు మాత్రమే వారిని కేటాయించవచ్చు. సర్వ శిక్షా అభియాన్ పథకం కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఇటువంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద నియమితులైన ఉపాధ్యాయుల జీతభత్యాలు, వైద్య సదుపాయాలు, పెన్షన్, గ్రాట్యుటీ, పీఎఫ్ వంటివన్నీ కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా ఉండాలి. దీని అర్థం.. వీరు కూడా అన్ని రకాల ప్రయోజనాలకు అర్హులు. ఈ ఉపాధ్యాయులు అకడమిక్ పనులతో పాటు ఇతర విధులను కూడా నిర్వహిస్తున్నందున వారికి ఇతర ఉపాధ్యాయులతో సమానంగా గౌరవ వేతనం అందాలి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. -
జోగి రమేశ్కు హైకోర్టులో ఊరట
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన కేసుల్లో కఠిన చర్యలేవీతీసుకోవద్దని ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీసులతోపాటు, తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై అధికార టీడీపీ కూటమి నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యల గురించి న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. జోగి వ్యాఖ్యలు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 19(1)(ఏ) ప్రకారం ‘వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ’ పరిధిలోకి వస్తాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అంతేకాక ఆయనపై ఆరోపించిన నేరాలు ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడేవేనని తెలిపారు. అందువల్ల ప్రస్తుత దశలో జోగి రమేశ్ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన తక్షణ అవసరం ఏదీ లేదని ఆమె ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
ఒక్కరితో ఆగని ‘అరవ’ అరాచకాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగి అయిన ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయిన జనసేన కూటమి పార్టీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. బాధిత మహిళ శుక్రవారం ఎమ్మెల్యేకు సంబంధించిన మరికొన్ని ప్రైవేట్ వీడియోలు, చాట్లు బయటపెట్టారు. వీటినిబట్టి ఆయన మరికొంత మంది మహిళలకు వల వేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు.. రాయలేని విధంగా మెసేజ్లు బెంగళూరులో చదువుకుంటున్న ఓ అమ్మాయి శ్రీధర్ ఎమ్మెల్యే కాగానే శుభాకాంక్షలు చెబుతూ ఓ మెసేజ్ చేసింది. అంతే.. ఆమెకు అరవ శ్రీధర్ వరుసగా మెసేజ్లు చేస్తూనే ఉన్నారు. కొన్నింటికి సమాధానం ఇచి్చన ఆ అమ్మాయి.. ‘మీరు ఎమ్మెల్యే కదా.. ఇలా ఇంతసేపు అమ్మాయిలతో చాటింగ్ చేసేంత తీరిక, ఖాళీ దొరుకుతుందా’ అని సందేహం వ్యక్తంచేసింది. ఉంది కాబట్టే మెసేజ్లు చేస్తున్నానని శ్రీధర్ బదులిచ్చారు. మరో అమ్మాయితో చాటింగ్ చేసిన ఎమ్మెల్యే ఆమె శరీరాన్ని రాయలేని విధంగా వర్ణిస్తూ మెసేజ్లు చేశారు. వద్దన్నా వినలేదు.. ఓ వివాహితతోనూ వ్యవహారం నడపాలని కూడా ఎమ్మెల్యే చూశారు. ఆమెతో గతంలో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని చిన్ననాటి స్నేహితుడినంటూ ఆమెను లోబరుచుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అంతేకాక.. ఆమెను ఏకాంతంగా గడిపేందుకు రావాల్సిందిగా మెసేజ్ల రూపంలో అడిగారు. దానికి ఆమె నిరాకరించారు. తాను వివాహితనని, భర్త, పిల్లలు ఉన్నారని, తనతో ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడటం సరికాదని వారించారు. కాదూ కూడదంటే మంచి స్నేహితులుగా ఉందామని హితవు చెప్పారు. అయినాసరే ఎమ్మెల్యే శ్రీధర్ వినిపించుకోకుండా ఆమె వెంటపడుతూనే ఉన్నారు. ఇలా ఇవి కొన్ని ఆధారాలు మాత్రమేనని, ఇంకా చాలా అధారాలు, ఎంతమంది మహిళలతో ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించారనే వీడియోలు తన వద్ద ఉన్నాయని ప్రభుత్వోద్యోగి అయిన బాధిత మహిళ చెబుతున్నారు. అదే విధంగా.. ఎమ్మెల్యే ఇతర మహిళల గురించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి వాట్సప్ చాటింగ్ను కూడా ఆమె బయటపెట్టారు. వాట్సప్, స్నాప్చాట్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వారిని బుట్టలో వేసుకోవాలని ఎమ్మెల్యే చూశారని ఆరోపించారు. -
YS Jagan: రూటు మారినా తగ్గని జన సునామీ
సాక్షి, విజయవాడ : సర్కారు ఎన్ని కుయుక్తులు పన్నినా, రూటు మార్చినా జననేత పర్యటనకు జనం సునామీలా తరలివచ్చారు. 17 కిలోమీటర్ల దూరం 47 కిలోమీటర్లకు పెరిగినా ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు పోటెత్తారు. ఎన్టీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జననేతను దగ్గర్నుంచి చూడాలని, పలకరించాలని, కుదిరితే కరచాలనం చేయాలనే ఆసక్తితో అడుగడుగునా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. దారి పొడవునా పూలు చల్లుతూ ఆత్మీయంగా స్వాగతం పలికారు. సీఎం.. సీఎం.. జై జగన్.. జైజై జగన్ నినాదాలతో పర్యటన ఆద్యంతం మార్మోగింది. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై ఇటీవల తెలుగుదేశం పార్టీ గూండాలు దాడి చేసి.. పెట్రోల్ బాంబులు విసిరి దగ్ధం చేయటానికి కుట్రలు చేసిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం ఉదయం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా, ఉదయమే తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్దకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. వైఎస్ జగన్.. నివాసం నుంచి బయటకు రాగానే అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు జై జగన్ అంటూ నినదించారు. కాన్వాయ్ భరతమాత సెంటర్ వద్దకు వచ్చేసరికి రోడ్డుపై మహిళలు, అభిమానులు భారీగా ఉండడంతో.. వైఎస్ జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అక్కడి నుంచి పాతూరు క్రాస్రోడ్ వరకు కారులో నుంచి పలుమార్లు బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. భారీగా అభిమానులు రావడంతో అనుకున్న సమయానికి అనుకున్న ప్రదేశానికి చేరుకునే సరికి ఆలస్యమైంది. అయినా ప్రజలు రోడ్డుపై ఉండి ఆయన కోసం ఎదురు చూశారు. కాజ వద్ద గ్రామస్తులు భారీగా స్వాగతం పలికారు. 2029లో జగనే ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేశారు. కాజ టోల్గేటు వద్ద కూడా అదే పరిస్థితి. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించి, ప్రజల్ని అడ్డుకున్నా వైఎస్ జగన్ను కలిసేందుకు జనం పోటీ పడ్డారు. దారిపొడవునా బస్సుల్లో నుంచి ప్రజలు అభివాదం చేశారు. చినకాకాని వెస్ట్ బైపాస్ ప్రారంభంలో ఒక దివ్యాంగుడు వేచి ఉండటం గమనించి వైఎస్ జగన్ కారు దిగి, అతనితో కరచాలనం చేశారు. వెస్ట్ బైపాస్లో ఎక్కడా రోడ్డుపైకి వచ్చేందుకు అవకాశం లేకపోయినా బైపాస్ వెంబడి పలుచోట్ల ప్రజలు జగన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. వెంకటపాలెం టోల్ గేటు వద్ద 10 నిమిషాల పాటు జగన్ కాన్వాయ్ ఆపి.. అక్కడికొచ్చిన మాజీ ఎంపీ నందిగం సురేష్తో పాటు అందరినీ ఆప్యాయంగా పలకరించారు. పర్యటనను నీరుగార్చే కుట్ర భగ్నంవైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో పోలీసు శాఖకు తన పర్యటన వివరాలను ముందుగానే పంపించారు. అయితే ఆయన పర్యటనను నీరుగార్చేందుకు, ప్రజలు ఆయన్ను కలవకుండా చేసేందుకు ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేసింది. ముందు ప్రకటించిన రూట్లో కాకుండా మంగళగిరి మీదుగా కాజ టోల్గేటు వద్దకు వెళ్లి.. అక్కడి నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని గురువారం రాత్రి నోటీసులు జారీ చేసింది. దాంతో పార్టీ క్యాడర్లో కొంత గందరగోళం నెలకొంది. అయినా శుక్రవారం ఉదయం వైఎస్ జగన్ వస్తున్న రూట్ వివరాలను తెలుసుకొని తదనుగుణంగా పార్టీ శ్రేణులు, ప్రజలు జగన్ పర్యటించే మార్గంలో ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. పోలీసుల కుట్రలను భగ్నం చేసి, పర్యటనను విజయవంతం చేశారు.వాహనాలను అడ్డుకున్న పోలీసులు వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవటానికి పోలీసు శాఖ తీవ్ర స్థాయిలో ప్రయత్నించింది. ఇందులో భాగంగా అడుగడుగునా ఆంక్షలు విధించింది. పార్టీ నేతలను పోలీసు అధికారులు భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా, పలు చోట్ల వాహనాలను అడ్డుకున్నారు. తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాలను ఎక్కడికక్కడ ఆపేశారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్తోపాటు, జిల్లా వ్యాప్తంగా పలువురు నాయకులు ర్యాలీగా వెళ్లకూడదంటూ నోటీసులు జారీ చేశారు. నేతల వెంట జనం ఉండకూడదని హెచ్చరించారు. నోటీసులను ధిక్కరిస్తే కేసులు పెడతామని భయపెట్టేందుకు ప్రయత్నించారు. అయినా పార్టీ శ్రేణులు వేలాదిగా ఎవరికి వారుగా స్వచ్ఛందంగా కార్యక్రమానికి తరలివచ్చారు. వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగారు. ఇలా అడుగడుగునా అభిమానం పోటెత్తడంతో తాడేపల్లి నుంచి ఉదయం 11 గంటలకు బయలు దేరిన జగన్.. ఇబ్రహీంపట్నం చేరుకునే సరికి సాయంత్రం 5 గంటలైంది.ఇలా ఏకంగా ఆరు గంటల సమయం పట్టింది. గొల్లపూడి నుంచి జోగి రమేష్ ఇల్లు చేరుకునేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టిందంటే జనాభిమానం ఏమేరకు ఉందో ఇట్టే తెలుస్తోంది. దారిపొడవునా తన కోసం వేచి ఉన్న ప్రజలకు వైఎస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వేలాదిగా బైక్లపై తరలివచ్చిన యువతపార్టీ శ్రేణులు, అభిమానులు, యువత వేలాదిగా తరలివచ్చారు. ఉదయమే తాడేపల్లి కార్యాలయానికి చేరుకొని వైఎస్ జగన్ను అనుసరించారు. ఎక్కడికక్కడ పోలీసులు వాహనాలను అడ్డుకొని వేరు మార్గాల వైపు తరలించినా, అభిమానులు అంతకంతకూ పెరిగారు. వేలాది మంది ద్విచక్ర వాహనాలపై తరలి వచ్చి, తమ అభిమాన నేత జగన్మోహన్రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. పలువురు న్యాయవాదులు వైఎస్ జగన్కు సంఘీభావం తెలిపారు. బైపాస్ నల్లకుంట నుంచి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వరకు రోడ్డుపై జనం ఇసుక వేస్తే రాలనంతగా నిండిపోయారు. జోగి రమేష్ కుటుంబానికి భరోసాఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. దాడి జరిగిన తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఎంతసేపు దాడి జరిగింది.. మారణాయుధాలతో ఎలా భయపెట్టారు.. పెట్రోల్ బాంబులు ఎలా విసిరారు.. తదితర విషయాలను జోగి రమేష్ కుటుంబ సభ్యులు వివరించారు. దాడి జరిగిన సమయంలో వారు ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను జననేతకు చెప్పుకున్నారు. ఇలాంటి దాడులకు భయపడొద్దని, తాను అండగా ఉంటానని వారికి జగన్ భరోసా కల్పించారు. పార్టీ అండగా ఉంటుందన్నారు. రానున్న కాలంలో దాడి చేసిన వారిని చట్టపరంగా న్యాయస్థానంలో నిలబెడతామని చెప్పారు. కాగా, వైఎస్ జగన్తో పాటు పలువురు నేతలు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, కైలే అనిల్కుమార్, అన్నాబత్తుల శివకుమార్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, ఎండి రుహుల్లా, వరుదు కళ్యాణి, జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, తిరువూరు ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాసు, పెనమలూరు ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, డిప్యూటీ మేయర్ అవుతు శైలజ రెడ్డి, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్, నాయకులు ఏ రవిచంద్ర, పుణ్యశీల, వేముల తిరుపతిరావు, వంగవీటి నరేంద్ర తదితరులు జోగి రమేష్ను కలిశారు. గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:జగన్ రాకతో జన జాతరను చూశారా? -
పవిత్ర లడ్డూపై దుష్ప్రచారం ఆపి.. క్షమాపణ చెప్పాలి
సీబీఐ సిట్ చార్జ్షీట్ వేసిన తర్వాత అయినా చంద్రబాబు చేయాల్సిన పని ఏంటంటే.. శ్రీ వేంకటేశ్వరస్వామి ముందు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కనీసం మానవత్వం ఉన్న మనిషైతే చంద్రబాబు అలాంటి పని ఎందుకు చేయడం లేదు?సీబీఐ సిట్ చార్జ్షీట్లో పొందుపరిచిన వాస్తవాలను చూపించి ఎవరైనా చంద్రబాబుని ప్రశ్నిస్తే.. ఆయన అసహనంతో మా నాయకుల మీద దాడులు చేయించే నీచ స్థాయికి దిగజారిపోయాడు. అందులో భాగంగానే వరుసపెట్టి మా నాయకులు విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకరరెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి మీద దాడి చేయడమే కాకుండా అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడి చేశారు.అసలు చంద్రబాబుకు చిప్ సరిగ్గా ఉంటే ఇలాంటి పనులు చేయిస్తారా? తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా.. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు ఎలాంటి జంతు కొవ్వు లేదని ధ్రువీకరించినా.. చంద్రబాబు, పవన్కల్యాణ్,లోకేశ్ తమ తీరు అస్సలు మార్చుకోవడం లేదు.తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న కూటమి నేతల ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు వక్రబుద్ధి, అబద్ధాలపై వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్ను ఏర్పాటు చేసింది. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ను ఎవరూ తప్పుపట్టలేరు. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు పదవి పెద్దది కాదు. ఇవాళ చంద్రబాబు తన స్వార్థం కోసం వన్మ్యాన్ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నారు. వాటికి ఎలాంటి ప్రామాణికత ఉండదు. తనకు అనుకూలంగా రిపోర్టు రాకపోవడంతో మళ్లీ కొత్త కమిషన్ ఏర్పాటు చేసుకుని, తనకు అనుకూలమైన రిపోర్టు కోసం కుట్ర చేస్తున్నాడు. - వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సీబీఐ చార్జ్షీట్లో తేల్చి చెప్పింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలవలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ చంద్రబాబు అన్యాయంగా ఇంకా దుష్ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు సీఎం కాక ముందు వరకు ఎవరైనా తిరుమల ప్రసాదం ఇస్తే కళ్లకు అద్దుకుని తినేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రసాదం పవిత్రతను చంద్రబాబు దిగజార్చాడు. ఒక అబద్ధాన్ని సృష్టించి రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబే. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్ల నివేదికలు స్పష్టం చేసినా చంద్రబాబు ఇంకా ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం దారుణం..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అబద్ధాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారని, కానీ చంద్రబాబువి అబద్ధాలని సీబీఐ చార్జ్షీట్ తేల్చేసిందని వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ మూకల దాడిలో దెబ్బతిన్న జోగి రమేష్ ఇంటిని శుక్రవారం వైఎస్ జగన్ పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. కక్షగట్టి దాడులుచంద్రబాబు అబద్ధాలను ప్రశ్నిస్తున్నందుకు చిప్ పని చేయక పోవడం వల్లే కక్షగట్టి దాడులకు దిగుతున్నారు. చేసిన తప్పు ఒప్పుకుని, లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు వన్మ్యాన్ కమిషన్ అంటూ అనుకూల నివేదిక కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఆ కమిషన్కు ఏ మాత్రం విలువ ఉండదు. టీడీపీ గూండాలు గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో ఐదు కార్లు «ధ్వంసం చేయడంతోపాటు ఇల్లు, ఆఫీసులో విధ్వంసం సృష్టించి ఆఫీస్కు నిప్పుపెట్టారు. ఆ మర్నాడు ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జోగి రమేష్ ఇంటిపై ఏకంగా యాసిడ్ బాటిళ్లతో, పెట్రోల్ బాంబులతో వి«ధ్వంసం సాగించారు. అక్కడ అంబటి రాంబాబు.. ఇక్కడ జోగి రమేష్ తండ్రిపై హత్యాయత్నం జరిగింది. పోలీసుల సమక్షంలోనే రెండు చోట్లా దాడులు జరిగాయి. టీడీపీ గూండాలకు వారు అండగా ఉంటున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు రాష్ట్రంలో జంగిల్రాజ్ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు సర్కారు చర్యలు ఉన్నాయి. తప్పులు చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టబోం. సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం. మరో మూడేళ్లలో వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఇప్పుడు తప్పులు చేస్తున్న అందరినీ బోనులో నిలబెడతాం. వారికి శిక్ష తప్పదు. నాగరిక సమాజం తలదించుకునేలా.. రాష్ట్రంలో జంగిల్రాజ్ పరిపాలన సాగుతోంది. నాగరిక ప్రపంచం తలవంచుకునేలా చంద్రబాబునాయుడు చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో 5 కార్లను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. అద్దాలను పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లను దుర్భాషలాడారు. ఇంటి పక్కనే ఉన్న ఆఫీసులోకి చొరబడి విధ్వంసానికి దిగి ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరగటాన్ని అంతా చూశాం. అక్కడ సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దహనకాండ జరిగింది. ఆ మర్నాడే ఇక్కడ కూడా సాయంత్రం అదే పరంపర కొనసాగింది. జోగి రమేష్ ఇంటిపైనా దారుణంగా దాడి చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని సీబీఐ తేల్చింది చంద్రబాబునాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నాడని, ప్రజలను తప్పుదోవ పట్టించాడని సాక్షాత్తూ సీబీఐయే తేటతెల్లం చేస్తూ చార్జ్షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లుగా తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పందికొవ్వు కానీ, చేప నూనె కానీ కలపలేదని సీబీఐ స్పష్టం చేసింది. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు దు్రష్పచారం చేశాడు. ప్రతిష్టాత్మక ల్యాబ్లూ అదే నిర్ధారించాయి తిరుమలలో వాడిన నెయ్యిపై చంద్రబాబు చెబుతున్నవి అబద్ధాలని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ల్యాబ్లు నిర్ధారించాయి. ఆ మేరకు నివేదికలు ఇచ్చాయి. అవి రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వారు పరీక్షించిన నెయ్యి శాంపిల్స్ అన్నీ కూడా చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయన మనిషి టీటీడీ ఈవోగా ఉండగా సేకరించినవే. సీబీఐ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీకి ఆ శాంపిల్స్ పంపారు. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, గొడ్డు కొవ్వు లేదని, పందికొవ్వూ లేదని, ఎలాంటి చేపనూనె కూడా కలవలేదని ఆ ల్యాబ్లు ధ్రువీకరించాయి. ఆ రిపోర్టులను సీబీఐ కూడా సరి్టఫై చేసింది. సీబీఐ సిట్ ఆ మేరకు చార్జ్షీట్ దాఖలు చేసింది. భూమన, వైవీకి సీబీఐ క్లీన్చిట్.. ఆ చార్జ్షీట్లో సీబీఐ మరో విషయం కూడా చెప్పింది... గతంలో టీటీడీ చైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఉన్నప్పుడు వాళ్లు ఎలాంటి తప్పూ చేయలేదని, అన్యాయమైన పనులు చేయలేదని స్పష్టం చేసింది. అందుకే వారి పేర్లు చార్జ్షీట్లో పెట్టలేదు. వారిలో ఎవరినీ అరెస్టు చేయలేదు. అంటే సీబీఐ వారికి క్లీన్చిట్ కూడా ఇచ్చింది. ఇదొక్కటే కాదు.. ఆ చార్జ్షీట్లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. (పేజీ నెం 62 ప్రస్తావించారు) చంద్రబాబు సీఎం అయిన తర్వాత 2024 జూలై 25న నెయ్యిలో నాణ్యత లేదని టీటీడీ 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది (ఆ రిపోర్టు చదివి వినిపించారు. చార్జ్షీట్లోని పేజీ నెం 64, 44 అంశాలను చదివి వినిపించారు). కానీ ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే దొడ్డిదారిన వేరేవాళ్ల పేరుతో తిరిగి వస్తే వాటిని టీటీడీ ఆమోదించింది. అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ వెల్లడించింది. అలా చంద్రబాబు ప్రభుత్వం మీద, వాళ్లు చేసిన తప్పుల మీద, వాళ్లు చేసిన అన్యాయంపై చార్జ్షీట్లో రాశారు. పాపం చేసింది ఎవరు బాబూ..? ఏకంగా సీబీఐనే చంద్రబాబు ప్రభుత్వం మీద ఈ మాదిరిగా చార్జిషీట్లో రాసిన తర్వాత అసలు పాపం చేసిన వాళ్లు ఎవరు? అని చంద్రబాబును, ఆయన కుమారుడిని, కూటమిలో ఉన్న పవన్కల్యాణ్ను ప్రశ్నిస్తున్నా. టీటీడీ నెయ్యిలో చేప నూనె, గొడ్డు కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ఎవరు చెప్పారు..? సీబీఐ చెప్పిందా..? ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులు చెప్పాయా..? చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్తో పాటు రోజూ వారి పల్లకి మోస్తున్న ఎల్లో మీడియా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) ప్రచారం చేయడం మినహా ఎవరైనా చెప్పారా? ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం కన్నా హేయమైన చర్య ఇంకోటి ఉంటుందా? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలి.. అనిల్ సింఘాల్ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా నియమించారు. మా ప్రభుత్వం ఆయన్ను కొనసాగించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన్నే తెచ్చారు. శ్యామలరావును టీటీడీ ప్రక్షాళన కోసం తెచ్చానని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక చెప్పారు. ప్రక్షాళనకు ముందే ఆయన్ను ఎందుకు టీటీడీ ఈవోగా తొలగించారు? శ్యామలరావు ఈవోగా ఉన్నప్పుడు కొన్ని నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. అవే ట్యాంకర్లు.. మళ్లీ టీటీడీకి మరో డెయిరీ పేరుతో తిరిగి వచ్చినట్లు సీబీఐ సిట్ ధ్రువీకరించింది. మరి పాపం చేసింది ఎవరు చంద్రబాబూ? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. పూజలు చేయడం తప్పా..? మానవత్వం లేని చంద్రబాబుని ప్రశ్నిస్తూ.. ఆయనకు దేవుడు జ్ఞానోదయం కలిగించాలని ప్రార్థిస్తూ మా నాయకులు ఆలయాల్లో పూజలు చేశారు. ఆయనతోపాటు లోకేశ్, పవన్కల్యాణ్తో సహా ఇతర నాయకులకు బుద్ధి, జ్ఞానం కలగాలని, వారి చిప్ రిపేర్ చేయాలని మా నాయకులంతా గుళ్లల్లో పూజలు చేశారు. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేస్తూ శ్రీవారి ప్రతిష్టను మంట కలిపేస్తుంటే మావాళ్లు గుళ్లలో పూజలు చేయడం తప్పా? ఇది హత్యాయత్నం కాదా..? లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఆరోపణలు పచ్చి అబద్ధమని అంత స్పష్టంగా, అన్ని విధాలుగా తేలిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి ఫ్లెక్సీలు కట్టి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా దు్రష్పచారం చేయడం ధర్మమేనా? ఆ ఫ్లెక్సీల్లో అన్యాయమైన మాటలు రాసి దు్రష్పచారం చేయడం న్యాయమేనా? చంద్రబాబు, లోకేశ్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రశ్నిస్తూ మా నాయకుడు జోగి రమేష్.. మీ చిప్ రిపేర్ చేసుకోమని సలహా ఇచ్చాడు. దానికి ఇంత అన్యాయమైన పని చేయడం ధర్మమేనా? సలహా ఇవ్వడం మినహా జోగి రమేష్ ఏమీ చేయలేదు. దానికే చంద్రబాబుకి అసహనం ఏస్థాయిలో వచ్చింది అంటే.. ఏకంగా యాసిడ్ బాటిల్స్, పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేయించాడు. ఆ యాసిడ్ పడిన ప్రాంతంలో బండలు తీవ్రంగా కాలిపోయాయి. గోడల నిండా యాసిడ్ మరకలు కనిపిస్తున్నాయి. యాసిడ్ పడి డోర్లు కాలిపోయాయి. ఆ పక్కనే ఉన్న స్విచ్ బోర్డుల మీద పడి షార్ట్ సర్క్యూట్ అయితే పెద్ద ఘోరం జరిగి ఉండేది. ఇంట్లో ఉన్న కర్టెన్లు, ఉడెన్ ఫర్నీచర్లు కాలిపోతే పరిస్థితి తీవ్రరూపం దాల్చేది. ఇంట్లో 80 ఏళ్ల వయసున్న జోగి రమేష్ నాన్న నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా? బీసీ నాయకుడిగా జోగి రమేష్ ఎదుగుతుంటే, ప్రభుత్వ తప్పులపై ఆయన వాయిస్ బలంగా వినిపిస్తుంటే.. ఆ గొంతు నొక్కే కుట్రలో భాగంగానే చంద్రబాబు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో దాడులు చేయిస్తున్నాడు. పోలీసులతో కలిసి టీడీపీ కుట్ర..జోగి రమేష్ ఇంటి మీద సాయంత్రం ఐదు గంటలకు దాడి జరిగితే.. ఆ దాడికి సంబంధించి పోలీసులు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఏ రకంగా కుట్రలు చేశారనే దానికి ఈ ఫొటోనే సాక్ష్యం (పోలీసులతో టీడీపీ నాయకులు మంతనాలు జరుపుతున్న ఫొటోను చూపారు). ఇదే సర్కిల్లో డీసీపీ రామకృష్ణ, ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్తో టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు దాడులకు సంబంధించి వ్యూహరచన చేశాడు. జోగి రమేష్ను హత్య చేసి, ఇంటి మీద దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేసే కుట్రలకు ఇక్కడే పోలీసులతో టీడీపీ నాయకుడు మంతనాలు జరిపాడని క్లియర్గా తెలిసిపోతోంది. హత్యా యత్నం ఎలా చేయాలి? ఆ దాడికి పోలీసులు ఎలా సహకరించాలో పథక రచన చేశారు. ఏకంగా పోలీసులే టీడీపీ నాయకులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంతనాలు జరిపారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు ఏకంగా పోలీసులనే వెంటబెట్టుకుని కలసికట్టుగా జోగి రమేష్ ఇంటిపై దాడికి దిగారు.ఈ పాపాలు ఎవరివి బాబూ?» నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి.. మళ్లీ అదే నెయ్యి ట్యాంకర్లు మరో పేరుతో వస్తే ఆమోదించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కదా.» అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ చెప్పింది. » చంద్రబాబు ప్రభుత్వం తప్పులు, వాళ్లు చేసిన అన్యాయాన్ని చార్జ్షీట్లో సీబీఐ రాసింది » టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్ను తీసుకొచ్చింది ఎవరు? » ప్రక్షాళన కోసం తెచ్చామన్న శ్యామలరావును తప్పించింది ఎవరు?ఇవిగో పచ్చి నిజాలు... సాక్ష్యాలుటీడీపీ నాయకుడు ఫతావుల్లా ఏకంగా యాసిడ్ బాటిల్, పెట్రోల్ బాంబులతో దాడి చేశాడు. దాడికి ముందు వాటితో ఉన్న ఫొటోల్లో క్లియర్గా చూడవచ్చు. పోలీసుల సమక్షంలోనే జోగి ఇంటిపైకి పెట్రోల్ బాంబులు విసిరి నిప్పంటించాడు. ఫతావుల్లాతోపాటు ఆశా అనే టీడీపీ కార్యకర్త కూడా జోగి రమేష్ ఇంటి మీద పోలీసుల సమక్షంలోనే రాళ్ల దాడి చేసింది. ఆశా కుమార్తె పెళ్లికి చంద్రబాబు కూడా హాజరయ్యాడు. (చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రితో వారు దిగిన ఫొటోలు, ఆశా కుమార్తె పెళ్లికి హాజరైన చంద్రబాబు ఫొటోలు చూపించారు. పోలీసులతోనే కలసి వచ్చి వారి సమక్షంలోనే టీడీపీ నాయకులు దాడికి దిగిన వీడియోలు కూడా చూపారు). టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు, డీసీపీ, సీఐ మంతనాలు జరుపుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులతో కలిసి టీడీపీ శ్రేణులు వస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. (టీడీపీ నాయకుడు బాటిల్ ఎగరేస్తూ పోలీసులతో కలిసి జోగి రమేష్ ఇంటి వద్దకు వచ్చిన వీడియో క్లిప్పింగ్స్ను మీడియాకు చూపారు). మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? లేక జంగిల్ రాజ్లో ఉన్నామో చెప్పేందుకు ఈ వీడియోలే సాక్ష్యం. కల్తీ లిక్కర్ కేసుకు సంబంధించి తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యేందుకు జోగి రమేష్ వెళ్తుండగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలోని తన ఇంటిపై దాడి జరిగినట్లు ఆయనకు సమాచారం వచ్చింది. ఈ విషయంపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసేందుకు జోగి రమేష్ ఫోన్ చేసినా స్పందించలేదు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి సమయంలోనూ ఇలాగే జరిగింది. అన్ని ఆధారాలున్నాయ్.. ఎవరినీ వదిలిపెట్టం.. దాడులు, విధ్వంసాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి గడప తొక్కుతాం. న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రంలో సాగుతున్న జంగిల్రాజ్ పాలనను దేశానికి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది మూడేళ్లే. ఆ తరువాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇవాళ మా పార్టీ నాయకుల ఇళ్లపై గూండాగిరీ చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం. ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదు.బీసీలంటే చంద్రబాబుకు చులకన.. తంబళ్లపల్లిలో టీడీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. కమీషన్ల పంపకాల్లో తేడా రావడంతో ఆ వ్యవహారం బయటపడింది. ఆ కేసులో జయచంద్రారెడ్డిని అరెస్టు చేయాల్సింది పోయి సంబంధం లేని జోగి రమేష్ను కేసులో చేర్చారు. చంద్రబాబు రాజ్యంలో జోగి రమేష్ లాంటి వ్యక్తి నకిలీ లిక్కర్ తయారు చేయగలడా? ఆ లిక్కర్ను బెల్ట్ షాపుల్లోకి సరఫరా చేయగలరా? జోగి రమేష్ పై చంద్రబాబు ప్రభుత్వం 12 కేసులు పెట్టింది. చేయని నేరానికి 83 రోజులు జైలులో పెట్టారు. ఆయన కుమారుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నాడని చిన్న పిల్లాడిపై ఏడు కేసులు పెట్టారు. జోగి రమేష్ భార్యపై పోలీసులే దౌర్జన్యం చేసి తిరిగి ఆమెపైనే కేసులు పెట్టారు. బీసీలపై చంద్రబాబుకు ఉన్న చులకన భావానికి జోగి రమేష్పై నమోదైన కేసులే నిదర్శనం. -
అబద్ధాన్ని సృష్టించి.. దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేశారు: వైఎస్ జగన్
విజయవాడ: వరుసగా వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు చేస్తున్న దాడులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు.అక్కడ(గుంటూరులో) అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి విధ్వంసం.. ఇక్కడ జోగి రమేష్( విజయవాడ, ఇబ్రహీంపట్నం) ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 06) జోగి రమేష్ ఇంట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్ జగన్.. ఆపై కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం,వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అంబటి రాంబాబు ఇంట్లో కొనసాగించిన జంగిల్ రాజ్ పరంపరను జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారని ధ్వజమెత్తారు. ‘గుంటూరులో అంబటి రాంబాబు అన్న ఇంటిని.. ఇక్కడ జోగి రమేష్ అన్న ఇంటిని ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డారు.. విధ్వంసం సృష్టించారు. అంబటి కుటుంబ సభ్యులపై దుర్భాషలాడారు. పక్కనున్న అంబటి ఆఫీస్ను కూడా తగలబెట్టారు. అంబటి ఇంట్లో, ఆఫీస్లో జరిగిన జంగిల్ రాజ్ను.. జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారు. అసత్య ప్రచారం చేస్తున్న మీ చిప్ సరి చేసుకోమన్నందుకే జోగిరమేష్పై దాడి చేశారు. చిప్ సరిగ్గా లేకనే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. చిప్ సరిగ్గా లేకనే సీబీఐ రిపోర్టుపై అసత్య ప్రచారం చేశారు’ అంటూ వైఎస్ జగన్ విమర్శించారు.రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం...చంద్రబాబు అబద్ధాలను సీబీఐయే తేటతెల్లం చేసింది. తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని సీబీఐ స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ ఎటువంటి పంది కొవ్వు కలపలేదని సీబీఐ రిపోర్ట్లో పేర్కొంది. శ్రీ వెంకటేశ్వరస్వామిని అగౌరపరిచిన, అవమానపరిచిన వ్యక్తి చంద్రబాబు. ఒక అబద్ధాన్ని సృష్టించి.. దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ విష ప్రచారం చేశారు. చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు హయాంలో సేకరించిన నమూలను కేంద్ర సంస్థలైన ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపింది. ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పాయి. సీబీఐ ఇంకొకటి కూడా చెప్పింది. టీటీడీ చైర్మన్లుగా పని చేసిన తమ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలు సమయంలో ఎటువంటి తప్పు జరగలేదని సీబీఐ క్లీన్చిట్ కూడా ఇచ్చింది. సీబీఐ ఇచ్చిన చార్జ్షీట్లో.. పేజ్ నం 62లో వాళ్లు మెన్షన్ చేసింది ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జూలైలో టీటీడీ వాళ్లు నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. అవే ట్యాంకర్లను దొడ్డిదారిని మళ్లీ టీటీడీకి రప్పించి, వాటినే వాడారని సీబీఐ చెప్పింది. మరి ఇప్పుడు పాపం చేసింది ఎవరు అనేది ప్రశ్నిస్తున్న చంద్రబాబుని. కూటమి నేతల్ని కూడా ప్రశ్నిస్తున్న తప్పు ఎవరు చేశారు? పాపం ఎవరు చేశారు? అని, జంతువుల కొవ్వు ఉందని గొడ్డుమాంసం ఉందని ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పాయి. ఎవరూ చెప్పలేదు. అది చంద్రబాబు సృష్టి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబే సృష్టించారు’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అరాచకాన్ని నిలదీస్తే.. దాడులు చేస్తారా? ఒక అబద్ధాన్ని స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు సృష్టిస్తే.. దానికి ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్లు వంత పాడారు. వీరికి ఎల్లో మీడియానే ఈ విషయాన్ని పదే పదే విష ప్రచారం చేశాయి. దుష్ప్రచారం చేసి దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. ఆ దుష్ప్రచారం తప్పు అని చెప్పినప్పుడు.. చంద్రబాబు ఏం చేయాలి. క్షమించమని లెంపలు వేసుకోవాలి. తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి వారి చిప్లు బాగు చేయమని గుడుల్లోకి పూజలు చేయడం తప్పా?, సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినప్పడు.. తప్పుడు ఫ్లెక్సీలు కట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని నిలదీస్తే.. ఈ అరాచకం మొదలుపెట్టారు. ఈ జంగిల్ రాజ్ పరిపాలన ఆరంభించారు’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.పోలీసులతో కలిసి టీడీపీ గూండాలు స్కెచ్దీన్ని ప్రశ్నించే వారిపై ఎటాక్ చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై ఆపై జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారు. రమేష్ ఇంటిపై పెట్రోల్, యాసిడ్లతో దాడులు చేశారు. ఓ పెద్దాయన(జోగి రమేష్ తండ్రి) ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేయడం హత్యాయత్నం కాదా? అని అడుగుతున్నా. జోగి రమేష్ ఇంటిపై దాడిక జరగకమునుపు.. కుట్ర చేశారు. నాలుగు గంటల ప్రాంతంలో దాడి జరిగితే.. రెండు గంటలకు ఓ స్కెచ్ వేశారు. పోలీసులే.. టీడీపీ నాయకులతో కలిసి స్కెచ్ వేశారు( జోగి రమేష్ ఇంటిపై దాడికి ముందస్తు పన్నాగం ఎలా చేశారో పలు దృశ్యాలను చూపిస్తూ) వైఎస్ జగన్ తూర్పూరాబట్టారు.. ఆశ. ఫతుల్లా, సుబ్బారావులు కలిసి పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీరంతా టీడీపీ నేతలే అనడానికి ఇవే రుజువులు అంటూ కొన్ని క్లిప్పింగ్స్ చూపించారు వైఎస్ జగన్. ఆశ కూతురు పెళ్లికి చంద్రబాబు వెళ్లడం, ఫతుల్లాకి లోకేష్కి సన్నిహిత సంబంధాలను వైఎస్ జగన్ మీడియా సాక్షిగా చూపించారు. దాడులకు సంబంధించి అన్నిఆధారాలున్నాయని, దీనిపై ఎన్హెచ్ఆర్సీ, సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తామన్నారు వైఎస్ జగన్. మీకు చిత్తశుద్ధి లేదనడానికి ఇది నిదర్శనం కాదా?తాము తప్పు చేసి ఉంటే, తమ హయాంలో పని చేసిన అనిల్ సింఘాల్ను మళ్లీ టీటీడీ ఈవోగా ఎందుకు తెచ్చావ్ చంద్రబాబూ అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ‘ గత చంద్రబాబు హయాంలో అనిల్ సింఘాల్ టీటీడీ ఈవోగా పని చేశారు. మేము ఆయన్ను మా హయాంలో కూడా కొనసాగించాము. ఇప్పుడు అదే అనిల్ సింఘాల్ను మళ్లీ టీటీడీ ఈవోగా చంద్రబాబు తెచ్చుకున్నారు. మరి ఇందులో అర్థమేమిటి చంద్రబాబు. అంటే చంద్రబాబు చేసే ఆరోపణలకు చిత్తశుద్ధి లేదు అనడానికి ఇది నిదర్శనం కాదా? అని అడుగుతున్నా. అదే సమయంలో టీటీడీ ఈవోగా చేసిన శ్యామలరావును తొలగించడానికి కారణాలను కూడా వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘ మీరు అధికారంలోకి రాగానే టీటీడీ ప్రక్షాళన అంటూ శ్యామలరావును తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఆయన్ను తీసేశారు. టీటీడీ ప్రక్షాళన జరిగిందా చంద్రబాబు?అని వైఎస్ జగన్ నిలదీశారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, అదే శ్యామలరావు టీటీడీ ఈవో ఉండగానే నాలుగు నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయని, వాటిని రిజెక్ట్ చేసి పంపితే మళ్లీ దొడ్డిదారిన అవి మళ్లీ అక్కడకే వచ్చాయనేది సీబీఐ చెబుతున్న నేపథ్యంలో ఇది చంద్రబాబు ప్రభుత్వానికి మచ్చ కాదా? అని ప్రశ్నించారు జగన్. -
జనాదరణకు బెంబేలెత్తి.. జగన్ పర్యటనపై ఆంక్షల కత్తి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి చంద్రబాబు కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. జగన్ పర్యటనలప్పుడు ఎక్కడికక్కడ పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాభిమానాన్ని నియంత్రించాలని చూస్తున్నా, సర్కారు కుయుక్తులు పారడం లేదు. బారికేడ్లు, చెక్ పోస్టులు, ఇతరత్రా అడ్డంకులను అధిగమించి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తుండటంతో చంద్రబాబు సర్కారుకు దిక్కుతోచడం లేదు. ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అత్యంత తీవ్రంగా ఉందనే సంకేతాలు వెళతాయని ఆందోళన చెందుతోంది. బుధవారం గుంటూరు పర్యటనలో వైఎస్ జగన్ ప్రజా ప్రభంజనాన్ని చూసి, శుక్రవారం పర్యటనకు మరింత అడ్డంకులు కలిగించేలా కుట్రకు తెరలేపింది. శుక్రవారం కనదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండు, భవానిపురం, గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లి, టీడీపీ మూకల దాడిలో దెబ్బతిన్న మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. జోగి రమేశ్ను పరామర్శించునున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రెండు రోజుల క్రితమే రూట్ మ్యాప్ను విడుదల చేసింది. అయినప్పటికీ గురువారం రాత్రి రూట్ మ్యాప్ మార్చుకోవాలంటూ విజయవాడ సీపీ రాజశేఖరబాబు ద్వారా నోటీసులు ఇప్పించడం ప్రభుత్వ కుట్రకు అద్దం పడుతోంది. బెజవాడలో బ్రహ్మరథం పడతారని.. జననేత పర్యటన విజయవాడ మీదుగా సాగనున్న నేపథ్యంలో ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటోంది. బెజవాడలోనూ జననేత వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని పసి గట్టిన ప్రభుత్వం, రూట్ మ్యాప్ మార్చడం ద్వారా జనాభిమానాన్ని అడ్డుకోవచ్చుననే ఎత్తుగడకు తెరలేపిందని పరిశీలకులు చెబుతున్నారు. పరామర్శకు వెళ్తున్న వారిని మీరు ఆ రూట్లో వెళ్లకండి, ఈ రూట్లో వెళ్లండి అని పోలీసులు సూచించడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే భావన వ్యక్తమవుతోంది. పోలీసులూ పెద్ద బాస్ చెప్పిందే తడవుగా, ఆయన వద్ద మార్కులు కొట్టేందుకు నోటీసులు జారీ చేశారనే చర్చ సాగుతోంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నప్పుడూ పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. దాడిలో పాల్గొన్న వారిపై నామమాత్రం కేసులు పెట్టి, తిరిగి బాధితులపైనే తీవ్ర కేసులు నమోదు చేసి స్వామి భక్తి ప్రదర్శించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసులు అభాసుపాలయ్యారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ సాకుతో.. ఇదిలా ఉంటే ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కనకదుర్గ వారధి మీదుగా కాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేశ్ ఇంటికి వెళ్లాలని వైఎస్ జగన్కు నోటీసు అందించినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు ప్రకటన ద్వారా తెలిపారు. -
నేడు జోగి రమేష్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. టీడీపీ గూండాలు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించి, జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం వైఎస్ జగన్ తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
చంద్రబాబు సర్కారుకు ‘వక్ఫ్’ దెబ్బ
సాక్షి, అమరావతి: రూ.వందల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం జరగాల్సిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశానికి సభ్యులంతా గైర్హాజరవడంతో సమావేశం వాయిదా వేయాల్సి వచ్చింది. చినకాకాని, మల్లాయపాలెంలోని వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని నిరసిస్తూ సభ్యులు తీసుకున్న నిర్ణయం మేరకు సమావేశానికి గైర్హాజరు కావడం వక్ఫ్ బోర్డు చరిత్రలోనే సంచలనంగా మారింది. వక్ఫ్ ఆస్తులను ఏపీఐఐసీకి బదలాయించి.. ఆపై ఇండ్రస్టియల్ ఎస్టేట్ పేరుతో అయిన వారికి ఫలహారంగా పంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. గురువారం ఉదయం వక్ఫ్ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నట్టు బుధవారం అర్ధరాత్రి వాట్సాప్ ద్వారా సమాచారం (అజెండా) ఇవ్వడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మెప్పు కోసం వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలపై మండిపడ్డారు. వారంతా మూకుమ్మడిగా గైర్హాజరవడంతో చేసేది లేక సమావేశాన్ని వాయిదా వేసినట్టు చైర్మన్ అజీజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు 13వ సమావేశానికి కొంతమంది సభ్యులు అత్యవసర పరిస్థితుల కారణంగా హాజరు కాలేకపోయారని, అందరూ ఉన్నప్పుడే సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పీపీపీ అంటూ కొత్త పల్లవి వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేసేందుకు వేసిన భూ సేకరణ పాచిక పారకపోవడంతో ఇప్పుడు పీపీపీ పద్ధతి, దీర్ఘకాలిక లీజు అంటూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త పల్లవి అందుకుంది. వాస్తవానికి వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన టైటిల్ను వేరొక సంస్థకు, ప్రభుత్వ శాఖకు బదలాయించకూడదు. అయినా మల్లాయపాలెం, చినకాకాని వక్ఫ్ భూములపై ప్రభుత్వం దొంగాట ఆడుతోందని ముస్లిం నేతలు మండిపడుతున్నారు. గతేడాది గుంటూరు జిల్లా పెద్ద మసీదుకు చెందిన ప్రత్తిపాడు మండలం మల్లాయపాలెంలోని 226 ఎకరాల వక్ఫ్ భూమిని ఏపీఐఐసీకి భూ సేకరణ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి సేకరించేందుకు చేసిన ప్రయత్నాలపై ముస్లిం నేతలు, వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలతో వక్ఫ్ బోర్డు వెనకడుగు వేసింది. దీంతో భూ సేకరణ ద్వారా ఆ భూముల్ని ఇవ్వడం లేదని.. పీపీపీ లేదా లీజు పద్దతిలో ఇస్తామంటూ వక్ఫ్ బోర్డు సమావేశ అజెండాలో పేర్కొన్నారు. గతంలో సభ్యుల గైర్హాజరుతో రెండు పర్యాయాలు సమావేశాలు వాయిదా పడ్డాయి. చివరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ సొంత ప్రాంతమైన నెల్లూరులో నిర్వహించిన మూడవ సమావేశంలో గుంటూరు మసీదుకు చెందిన వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతానికి తాము వ్యతిరేకమని, పీపీపీ పద్ధతి, దీర్ఘకాలిక లీజుకు సైతం సభ్యులు అంగీకరించకపోడంతో బోర్డు నిర్ణయం తీసుకోలేకపోయింది. తాజాగా గుంటూరు అంజుమన్–ఇ–ఇస్లామియా సంస్థకు చెందిన చినకాకానిలోని 71.57 ఎకరాల భూమిని భూ సేకరణ ద్వారా ఏపీఐఐసీకి ఇచ్చేందుకు నిర్ణయించారు.ముస్లిం పెద్దల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం మళ్లీ పీపీపీ, దీర్ఘకాలిక లీజు పల్లవిని అందుకుంది. చివరకు మల్లాయపాలెం, చినకాకాని భూములను పీపీపీ, దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేలా తీర్మానం చేసేందుకు వక్ఫ్ బోర్డు సమావేశ అజెండా చేర్చారు. దీనికి కూడా సభ్యులు దీటైన బదులివ్వడం చర్చనీయాంశంగా మారింది. వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్ బోర్డు సమావేశానికి గైర్హాజరైనట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, వక్ఫ్బోర్డు సభ్యుడు ఎండీ రుహుల్లా ప్రకటించారు. మల్లాయపాలెం, చినకాకానిలోని వక్ఫ్ భూములను ఏపీఐఐసీకి అప్పగించేలా సమావేశ అజెండాలో పేర్కొనడాన్ని నిరసిస్తూ సమావేశానికి సభ్యులు హాజరు కాలేదన్నారు. -
పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఓ యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. విధి నిర్వహణలో ఉన్న ఆమె ఆపరేషన్ థియేటర్లోనే కుప్పకూలి మరణించారు. అనంతపురానికి చెందిన డాక్టర్ బత్తుల దీపిక(26) అక్కడి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎనస్థీషియా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఆమె బుధవారం ప్రభుత్వాస్పత్రి ‘సీ’ బ్లాక్లోని జనరల్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లో మరో పీజీ వైద్య విద్యార్థినితో కలిసి నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆమె రాత్రి పది గంటలకు సహచర విద్యార్థితో క్యాంటీన్ నుంచి ఆహారం తెప్పించుకుని తిన్నారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో డాక్టర్ దీపిక నలతగా ఉందని, వాంతులు అయ్యేట్లు ఉన్నాయని చెప్పడంతో సహచర పీజీ విద్యార్థి ఆమె చేతికి కాన్సులా పెట్టి జోఫర్ ఇంజక్షన్ చేసినట్లు చెబుతున్నారు. అనంతరం డాక్టర్ దీపిక ఆపరేషన్ థియేటర్ చాంబర్లోని రూమ్లో ఉండగా, మరో విద్యార్థి 1.10 గంటల సమయంలో సర్జరీకి కేసును తీసుకొచ్చేందుకు వెళ్లారు. ఆమె తిరిగి 1.40 గంటలకు ఆపరేషన్ థియేటర్ చాంబర్కు వచ్చి చూడగా, డాక్టర్ దీపిక కనిపించలేదు. సర్జరీ చేసే థియేటర్కు వెళ్లగా, డాక్టర్ దీపిక ఒక మూలన కుప్పకూలి ఉంది. దీంతో ఇతర సిబ్బందిని పిలిచి పరిశీలించగా, అప్పటికే శ్వాస తీసుకోవడం లేదని గ్రహించి వెంటనే ఆర్ఐసీయూకు తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించింది. కాగా, డాక్టర్ దీపిక తండ్రి బత్తుల కోదండరామిరెడ్డితోపాటు తల్లి భారతి కూడా వైద్యశాఖలో పని చేస్తున్నారు. సోదరి డాక్టర్ మౌనిక హైదరాబాద్లో గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మృతికి తెలియని కారణం తొలుత హార్ట్ అరెస్ట్ కారణంగా డాక్టర్ దీపిక మృతిచెంది ఉండవచ్చని సహచరులు, వైద్యులు భావించారు. ఆ తర్వాత ఇంజక్షన్ విషయం బయటకు వచ్చింది. దీంతో ఇంజక్షన్ వికటించి మరణించిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఐవీ ఇచ్చినప్పుడు హార్ట్ అరెస్ట్ కావడం చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు. కాగా, డాక్టర్ దీపిక నోటి వెంట నురగ రావడం, చేతికి కాన్సులా పెట్టి ఉండటం, మరోచోట బ్యాండెడ్ వేసి ఉండటంతో ఆమె ఇంకా వేరే ఇంజక్షన్ ఏమైనా చేసుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆమెకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు లేవని కుటుంబ సభ్యులతోపాటు సహచర విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి 1.10 గంటల వరకు బాగానే ఉన్న తమ కుమార్తె 30 నిమిషాల్లోనే మరణించడంపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. డాక్టర్ మౌనిక ఫిర్యాదు మేరకు విజయవాడ మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. గురువారం పోలీసులు మృతురాలి తల్లిదండ్రులు వచ్చి ఆపరేషన్ థియేటర్కు సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బుధవారం రాత్రి వైద్యులు మినహా బయటి వ్యక్తులు ఎవరూ ఆపరేషన్ థియేటర్కు వెళ్లలేదని నిర్ధారణకు వచ్చారు. డాక్టర్ దీపిక తన రూమ్ నుంచి థియేటర్కు వెళ్తున్న దృశ్యాలు కూడా రికార్డు అయ్యాయి. డాక్టర్ దీపిక మృతికి కచ్చితమైన కారణం తెలియడం లేదని, పోస్టుమార్టం నివేదికలో తేలుతుందని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు తెలిపారు. -
సీబీఐ క్లీన్చిట్పై ‘ఏకసభ్య’ డ్రామా!
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారానికి సీబీఐ సిట్ రిపోర్టుతో చెక్ పడటం.. కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు ఏకసభ్య విచారణ కమిషన్ అంటున్నారని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తదుపరి చర్యలు తీసుకోమని సీబీఐ సిట్ చెప్పలేదని.. దోషులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పిందని గుర్తు చేశారు. మరి సిట్ రిపోర్టులో వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఎక్కడైనా ఉన్నాయా? అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు, సీబీఐ సిట్ చార్జిషీట్లో స్పష్టంగా తేల్చినా నిస్సిగ్గుగా ఇంకా కుట్రలు పన్నుతారా? అని ధ్వజమెత్తారు. ఏమీ లేకపోయినా రాజకీయ కుట్రలతో వైఎస్సార్ సీపీపై మూకుమ్మడిగా విష ప్రచారానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సుప్రీం’ జోక్యంతో సాగని బాబు ఆటలు.. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయని దారుణమైన అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. తన ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ను నియమించి వాటినే రిపోర్టులో ఇచ్చేద్దామని భావించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ సిట్ ఏర్పాటు కావడంతో ఆయన ఆటలు సాగలేదు. సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ దర్యాప్తులో అన్నీ తేలిపోవడంతో.. చంద్రబాబు తనను తదుపరి చర్యలు తీసుకోమని చెప్పిందంటున్నారు. కానీ సీబీఐ సిట్ చెప్పింది.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోమనే. ఆ దోషుల్లో మీరు ఇంతగా విషం చిమ్ముతున్న జగన్ పేరు ఉందా? సిట్ రిపోర్టులో జగన్ కానీ, అప్పటి దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేరు కానీ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీటీడీ ఈవో, జేఈవో.. ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పండి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సిఫార్సు చేసిన అధికారులే ఇందులో ఉన్నారు. ఈ పాపం వైఎస్ జగన్కు ఆపాదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నెయ్యి కిలో రూ.291కే మీరు కొనలేదా? శ్రీవారి ప్రసాదంలో కెమికల్స్ కలిశాయని, మార్కెట్ కన్నా తక్కువ రేటు రూ.319కే ఎలా ఆవు నెయ్యి కొన్నారని అడుగుతున్నారు. తక్కువ రేటుకు నెయ్యి కొన్నారు కాబట్టి కల్తీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీలో ఇద్దరు అధికారులు హర్‡్ష ఫ్రెష్ అనే డెయిరీని 2019 ఫిబ్రవరిలో ఆమోదిస్తే... ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. నాడు ఫిబ్రవరి తర్వాత ఉన్న ప్రభుత్వం మాదే అయితే మే నెలలో ఈసీతో పోట్లాడి మీరు క్యాబినెట్ మీటింగ్ ఎలా పెట్టారు? ఎలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు? పోలింగ్ తర్వాత కూడా మీ ప్రభుత్వం యాక్టివ్గానే పని చేసింది. 2019లో జగన్ సీఎం కాకముందే మీ ఆపద్ధర్మ ప్రభుత్వంలోనే ఈ హర్‡్ష ఫ్రెష్ డెయిరీని తీసుకొచ్చారు. ఆ తర్వాత అదే భోలే బాబా డెయిరీగా పేరు మార్చుకుంది. అప్పట్లో వీళ్లు 82 వేల కేజీలు ట్యాంకర్లలో, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మీరు కిలో నెయ్యి రూ.291కి ఎలా కొన్నారు? మా హయాంలో రూ.319, రూ.329కి కొనుగోలు చేస్తే తప్పు అంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా.. టెండర్లు వివరాలు తేదీలతో సహా బయటపెట్టండి. ఎవరు దొంగో ఎవరు దొరో తేలుతుంది. రోజుకో మతం పేరుతో పవన్ డ్రామా.. పవన్ కళ్యాణ్ ఉచ్ఛం నీచాలు మరిచి విషం చిమ్మే వ్యక్తి! క్రిస్టియన్ అంటారు.. బాప్టిజం తీసుకున్నా అంటారు. నన్ను, చంద్రబాబును తిడుతుంటే మీరు కాచుకోరా? అని పవన్ కళ్యాణ్ ఆయన అన్నయ్యను తిట్టారని జనసేన నేతలే చెబుతున్నారు. దేవుడంటే భయం లేని వారు ఇవాళ మాట్లాడుతున్నారు. అదే అన్నయ్య.. గతంలో దేవుడే లేడని అంటాడు! దేవుడిని విమర్శించను.. లేని వారి గురించి ఎలా మాట్లాడతా? అంటాడు. తమ్ముడు కోటింగ్ ఇచ్చాక బయటికి వచ్చి.. నేను సనాతన హిందువును! వైఎస్ జగన్ క్రిస్టియన్ అంటూ దిగజారి మాట్లాడుతున్నాడు. రామతీర్ధంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వాళ్లెవరో పవన్కు తెలియదా? ఆ ఘటన తర్వాత నెల రోజుల్లో కొత్తగా విగ్రహం చేయించి హైందవ సంప్రదాయాల ప్రకారం గత ప్రభుత్వం పునఃప్రతిష్టించిన విషయం తెలియదా? అంతర్వేది రథాన్ని కాల్చారంటూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్.. మీ ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం పక్కన పెంటపాడులో రథాన్ని తగలబెడితే చర్యలు తీసుకున్నారా? అంతర్వేదిలో దగ్ధమైన రథాన్ని మేం మళ్లీ ఉత్సవాల కల్లా కొత్తది చేయించి పెట్టాం. మరి మీరు పెంటపాడులో రథం తిరిగి చేయించారా? గుళ్లు ధ్వంసం చేసిన చరిత్ర బాబుదే 2015–16లో విజయవాడలో కృష్ణా పుష్కరాల పేరుతో పలు ఆలయాలను ధ్వంసం చేసిన చంద్రబాబు... 250 గుళ్లు జగన్ ధ్వంసం చేశారని అనటానికి సిగ్గుందా? మతం పేరుతో విషం చిమ్ముతున్న మీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలే కదా అవి. ఉత్సవమూర్తులే కాదు.. గర్భగుడిలో ఉన్న మూర్తులను కూడా మీ ప్రభుత్వంలో ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గుళ్లలో కనీసం సంప్రోక్షణ చేశారా? అపచారం చేశామని చెంపలు వాయించుకున్నారా? ఎక్కడైనా మెట్లు కడిగారా? మీరు కూలదోసిన ప్రతీ ఆలయాన్ని జగన్ తిరిగి నిర్మించారు. దేవుడి మీద పగ పెట్టుకున్నారని అంటున్న పవన్.. ఆ దేవుడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నందుకు ఏమైపోతారో ఆలోచించుకోవాలి. అయోధ్యకు జంతుకొవ్వు, పందికొవ్వుతో లక్ష లడ్డూలు పంపించారని పవన్ ఈ రోజుకూ మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఉంటుందా? నాటి టీటీడీ బోర్డు సభ్యులు సౌరభ్ బోరా, మైహోం రామేశ్వరరావు అయోధ్యకు శ్రీవారి ప్రసాదం లక్ష లడ్డూలు పంపిద్దామని, అందుకు కావాల్సిన శ్రేష్టమైన 2 వేల కిలోల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. ఈ నిర్ణయానికీ, మా ప్రభుత్వానికీ సంబంధం లేదు. అది టీటీడీ బోర్డు నిర్ణయమే. కానీ పవన్ కళ్యాణ్ కొవ్వుతో చేసిన లడ్డూలు పంపించారని ఇవాళ్టికీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. జగన్ హిందూ ధర్మాన్ని గౌరవించలేదంటున్న పవన్.. తోలు బూట్లు వేసుకుని దేవుడికి పూజలు చేస్తూ హారతిస్తున్న మీ మిత్రుడు చంద్రబాబును ఏమంటారు? తండ్రి చనిపోయినా తలనీలాలు ఇవ్వని పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నట్లా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాజకీయాల్లో పతనానికి పరాకాష్ట. తిరుమలను దివ్యక్షేత్రంగా ప్రకటించింది వైఎస్సారే ఏడు కొండలను నాడు వైఎస్సార్ రెండు కొండలు అన్నారంటూ చంద్రబాబు, పవన్ దు్రష్పచారం చేస్తున్నారు. తిరుమల ఏడు కొండలను దివ్యక్షేత్రం అని పిలవాలని, ఆ కొండల మీద అన్యమత ప్రచారం నిషిద్ధమని 2007 జూన్ 2న వైఎస్సార్ జీవో ఇచ్చింది నిజం కాదా? ఇప్పుడు సర్వనాశనం అయిపోయేది, మట్టికొట్టుకుపోయేది ఎవరో పవన్ కళ్యాణ్ చెప్పాలి. తమ ఇంట్లో నుంచి చూస్తుంటే ఏడు కొండలు కనిపిస్తాయని, భక్తి పారవశ్యం చెందుతున్నట్లు చంద్రబాబు చెబుతున్న మాటలు.. వందకోళ్లను తినేసే తోడేలు సాయంత్రం ప్రవచనాలు చెబుతున్నట్లుంది! మీ మాటలు నమ్మటం లేదని పవన్ కళ్యాణ్తో చెప్పిస్తున్నట్లున్నారు. జనం ఆయన మాటలు కూడా నమ్మడం ఎప్పుడో మానేశారు.జంతు కొవ్వు ప్రచారం మీ నలుగురిదే వైఎస్ జగన్ క్రిస్టియన్ అని... శ్రీవేంకటేశ్వరస్వామికి హిందూ భక్తులను తగ్గించేయడానికే ఇదంతా చేశారని నిర్లజ్జగా పిచి్చమాటలు చెబుతున్న మీకు.. కల్తీ నెయ్యి నాలుగు ట్యాంకర్లు వాడి లడ్డూలు తయారు చేసినా నీచం అనిపించదు! జంతువుల కొవ్వు లేదని ఎవరు చెప్పారని గద్దిస్తున్న చంద్రబాబు... అది ఉందని ఎవరు చెప్పారో బయటపెట్టాలి. చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి మినహా నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఎవరూ చెప్పలేదు. 80 ఏళ్ల వయసులో ఏం మూటగట్టుకుపోదామని ఈ డ్రామాలు చంద్రబాబూ? పవన్ కళ్యాణ్ ఒక్కో దశలో ఒకలా.. క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, హిందువు అని మాట్లాడుతుంటారు. పీఏ అప్పన్నకు రూ.4.65 కోట్లు వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. మరి మీ పీఏ శ్రీనివాస్కు రూ.2 వేల కోట్లు వచ్చాయని ‘ఈడీ’ చెప్పిన విషయాన్ని మర్చిపోతున్నారు. అది బహిర్గతం కాగానే ఆయన విదేశాలకు పారిపోయాడు. మీరు తిరిగి ముఖ్యమంత్రి కాగానే అమెరికా నుంచి తిరిగి ఇక్కడ వాలిపోయాడు. వైఎస్ జగన్ను రాజకీయంగా దెబ్బతీసి తానూ, తన కుమారుడు కలకాలం అధికారంలో ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. సీబీఐ సిట్ చార్జ్షీట్లో ఎక్కడా వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ వితండవాదం చేస్తున్నారు. రేపు కొత్త కమిషన్ (వన్మెన్ కమిషన్) వేసి జగన్ను, వైవీ సుబ్బారెడ్డిని చేర్చే దుర్బుద్ధితో ఉన్నారని దీన్నిబట్టి అర్ధం అవుతోంది. దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా వీళ్ల మాటలున్నాయి. మతం పేరుతో జగన్ను నాశనం చేయాలని ఇలాంటి విషపూరిత మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అపచారాలను ప్రశ్నించాలని, కట్టడి చేయాలని స్వామీజీలను ప్రవచనకారులను, హైందవ ధర్మ పరిరక్షకులను కోరుతున్నాం.ఇప్పుడు చెప్పండి.. ఎవరు పాపాత్ములు? శ్రీవేంకటేశ్వరస్వామివారికి తలపెట్టిన అపచారం తన మనసులో దహించేయడం వల్లే ప్రెస్మీట్లో అస్మదీయులు అడుగుతున్న ప్రశ్నలను కూడా చంద్రబాబు భరించలేకపోతున్నారు. టీటీడీని ప్రక్షాళన చేయమని మీరు బాధ్యతలు అప్పగించిన ఈవో శ్యామలరావు ఇప్పుడు అక్కడ ఎందుకు లేరు? చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నియమించిన ఈవో శ్యామలరావు... నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ జరిగిందని వెనక్కి పంపేశామని, వాటి శాంపిల్స్ ఎన్డీడీబీ ల్యాబ్కు పంపితే వనస్పతి ట్రేసెస్ ఉన్నాయని తేలిందని చెప్పారు. ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని ఆయన ఎక్కడా చెప్పలేదు. కేవలం వనస్పతి కలిసిందని మాత్రమే చెప్పారు. జంతుకొవ్వు కలిసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని లోకేశ్, చంద్రబాబు చెప్పారు. ఆవునెయ్యి కాకుండా జంతువుల కొవ్వు, నాసిరకం సరుకులతో జగన్ లడ్డూలు చేయించారని, తాము మాత్రం నాలుగు లారీలను వెనక్కి పంపామని చెప్పుకున్నారు. ఏఆర్ డెయిరీ నుంచి తెప్పించి వెనక్కి పంపిన నాలుగు లారీలు వైష్ణవీ డెయిరీకు వెళ్లాయని సిట్ రిపోర్టులో పేర్కొంది.ఈ విషయం భోలేబాబా వాళ్లే విచారణలో చెప్పారు. నెల రోజుల పాటు ఈ నాలుగు ట్యాంకర్లు కాళహస్తిలోని ఓ పెట్రోల్ బంకులో నిల్వ ఉంచి చివరికి సీలు కూడా తీయకుండా, సరుకు మార్చకుండా తిరిగి వైష్ణవీ డెయిరీ పేరుతో కొండపైకి పంపారు. లడ్డూల్లో కలిపేశారు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు పాపాత్ములు? ఎవరు మట్టికొట్టుకుపోవాలి? ఎవరు సర్వనాశనం అవుతారు? -
సమాధానం చెప్పలేక బాబు అసహనం
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ వ్యవహారం గురించి మాట్లాడేందుకు జనసేన, బీజేపీతో కలసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తీవ్ర అసహనం ప్రదర్శించారు. సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేయడంపై తన అనుకూల మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులతో సీఎం గురువారం సమావేశం నిర్వహించి లడ్డూ వ్యవహారంపై చర్చించారు. అనంతరం వారందరితో పాటు ఐదుగురు మంత్రులతో కలసి మీడియాతో మాట్లాడారు. సిట్ చార్జిషీట్లో జంతువుల కొవ్వు లేదని ఉంది కదా? అన్న విలేకరుల ప్రశ్నకు ఒక్కసారిగా ఆయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘లేదని ఎక్కడుంది..? నీకేమైనా కల వచ్చింందా..? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా..? వాట్ ఆర్ యూ టాకింగ్..? మర్యాదగా చెబితే వినాలి..’ అంటూ చిందులు తొక్కారు. ఆ ప్రశ్న అడిగింది ఎల్లో మీడియా రిపోర్టరే కావడంతో కొంత తమాయించుకున్నా, ఆగ్రహాన్ని మాత్రం దాచుకోలేకపోయారు. సిట్ వేసిన చార్జిషీట్ ఇంకా నంబర్ అవలేదని, ఒక నివేదికను తమకు పంపి చర్యలు తీసుకోవాలని కోరిందని తెలిపారు. దానిపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైతే కోర్టుకు అదనపు వివరాలు ఇస్తామని చెప్పారు. సిట్ నివేదికలో రసాయనాలు, పామాయిల్తో నెయ్యి తయారైనట్లు ఉందన్నారు. సీబీఐ నివేదికలో ఎక్కడా కల్తీ లేదని చెప్పలేదన్నారు. ఎన్డీడీబీ నివేదికలోని అంశాన్నే తాను ప్రస్తావించానని చెప్పారు. హిందూ మతంలో విడాకులు ఇవ్వడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీడీబీ నివేదికను చంద్రబాబు తమకు చదివి వినిపించారని పవన్ కళ్యాణ్ చెప్పారు. టీటీడీ సహా అనేక పెద్ద ప్రాజెక్టుల్లో అక్రమాలకు గత ప్రభుత్వం తెర తీసిందని పీవీఎన్ మాధవ్ ఆరోపణలు చేశారు. -
‘లిఫ్ట్’ తాకట్టుపై ‘సీమ’ కన్నెర్ర
సాక్షి, ప్రతినిధి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆయన ఏలుబడిలో అప్పుడు, ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు సహా రాయలసీమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబుతో మాట్లాడి ఆపించానని స్వయంగా తెలంగాణ సీఎం చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగిపోయిన లిఫ్ట్ పనులను రెండు నెలల్లో తిరిగి ప్రారంభించాలని, లేదంటే ఉద్యమం మహోగ్ర రూపం దాలుస్తుందని స్పష్టం చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. రాయలసీమలో పుట్టి.. పుట్టిన గడ్డకే ద్రోహం చేయడం చంద్రబాబుకే చెల్లిందని ధ్వజమెత్తారు. లిఫ్ట్ను వెనువెంటనే పూర్తి చేయాల్సిందిపోయి.. ప్రాజెక్టు దండగంటూ తన టీడీపీ నేతలతో దుష్ప్రచారం చేయించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకపోతే ప్రజలు తరిమికొడతారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని తీర్మానం చేశారు. చంద్రబాబు, రేవంత్రెడ్డి చీకటి ఒప్పందంలో భాగంగా నిలిచిపోయిన ‘రాయలసీమ లిఫ్ట్’ పనులు పూర్తి చేయాలనే డిమాండ్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాడులో గురువారం ‘చలో పోతిరెడ్డిపాడు’ పేరుతో పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అధ్యక్షత బహిరంగ సభ నిర్వహించింది. ఆగిపోయిన లిఫ్ట్ పనులను పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నేతలు పరిశీలించిన అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సభ ప్రారంభమైంది. సీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆవశ్యకత, చంద్రబాబు ప్రభుత్వం చేసిన ద్రోహం.. ‘సీమ’లోని కూటమి నేతల నిర్లిప్తత, ప్రభుత్వంపై భవిష్యత్తులో ఉద్యమించే తీరుపై పార్టీ నేతలు ప్రసంగించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలు, భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించి రెండు నెలల్లో పనులకు పూనుకోకపోతే రైతులతో కలిసి కడపలో భారీ ఎత్తున మహా సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాధాన్యతపై ఆరు జిల్లాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తామని హెచ్చరించారు. చలో పోతిరెడ్డిపాడు సభకు భారీగా తరలి వచ్చిన రైతులు ‘సీమ’లో పారే ప్రతి నీటి బొట్టుపై వైఎస్సార్ పేరు 40 ఏళ్ల కిందట వైఎస్సార్ చేసిన పాదయాత్ర, నిరాహార దీక్షతోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు బీజం పడింది. ఆ రోజు వైఎస్సార్తో పాటు నడిచిన కాటసాని, చవ్వా రాజశేఖర్రెడ్డి ఈ రోజు ఈ వేదికపై కూడా ఉన్నారు. రాయలసీమ, నెల్లూరుకు వెళ్లే ప్రతీ నీటి చుక్కపై వైఎస్సార్ పేరు ఉంది. ఇది చరిత్ర, ఎవ్వరూ మార్చలేరు. రాయలసీమ లిఫ్ట్ పనులు 80 శాతం పూర్తి చేశాం. తక్కిన 20 శాతం పూర్తి చేస్తే కనీసం మంచి పని చేసిన పేరైనా చంద్రబాబుకు ఉండేది. అది కూడా లేకుండా ప్రాజెక్టును ఆపి ద్రోహం చేశారు. రేవంత్రెడ్డి మాటలతో వాస్తవాలు వెలుగు చూశాయి. రేవంత్రెడ్డి తన మాటలపై కావాలంటే నిజ నిర్ధారణ కమిటీకి సిద్ధమని ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పలేదు. ప్రాజెక్టు దండగని టీడీపీ నేతలతో ప్రచారం చేయిస్తున్నాడు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలు యథేచ్ఛగా అక్రమ ప్రాజెక్టులు నిర్మించి మనకు దక్కాల్సిన నీటిని తోడేస్తున్నాయి. నీళ్లు, రైతు, వ్యవసాయం బాగుంటే రాష్ట్రమంతా బాగుంటుంది. ఈ ఆలోచన వైఎస్కు ఉంది కాబట్టే పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేపట్టారు. 2014–19లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆ పనులు పూర్తి చేయలేదు. 2019లోజగన్ అధికారంలోకి వచ్చాక ఆర్అండ్ఆర్ పూర్తి చేసి ప్రాజెక్టును వాడకంలోకి తెచ్చారు. రాయలసీమ లిఫ్ట్తో జగన్ చేసిన మేలు ప్రతీ ఇంటికీ తెలియాలి. పూర్తయ్యే దశలోని ప్రాజెక్టును చంద్రబాబు ఆపి మహాపాపం చేశారు. మూల్యం చెల్లించుకోక తప్పదు – సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప బాబుకు ఏమీ పట్టదు కరోనా సంక్షోభాన్ని లెక్క చేయకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చివరి దశకు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్దే. రెండేళ్లలోనే 80 శాతం పనులు పూర్తి చేశారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు. రాయలసీమ లిఫ్ట్ నిలిచిపోతే కేసీ కెనాల్, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, ఎస్సార్బీసీకి నీళ్లుండవు. అనంతపురం రైతులకు మేలు చేయాలని హంద్రీ–నీవా కాలువను 3,800 నుంచి 6,500 క్యూసెక్కులకు జగన్ పెంచారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పనులు నిలిపేశారు. అంతేకాదు రూ.2 వేల కోట్లతో కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహించే కుప్పానికి నీరిచ్చిన ఘనత కూడా జగన్దే. గాలేరు–నగరి ద్వారా చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు నీళ్లిచ్చే పనులను 50 శాతం పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని కూడా పక్కన పెట్టేసింది. ‘సీమ’లోని ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కానీయకుండా చంద్రబాబు అమరావతి జపం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాట్లు పడుతున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నాడు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ ఏకతాటిపై పోరాడుదాం 1986లో లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు వైఎస్సార్తో కలిసి నేను పాదయాత్ర చేశాను. వైఎస్ కృషితోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఎనీ్టఆర్ 4 వేల నుంచి 11 వేల క్యూసెక్కులకు పెంచారు. దీన్ని 44 వేల క్యూసెక్కులకు వైఎస్సార్ పెంచారు. అలాగే హంద్రీ–నీవా, గాలేరు–నగరి లాంటి ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసి భగీరథుడిగా నిలిచారు. జగన్ 80 శాతం పూర్తి చేసిన రాయలసీమ లిఫ్ట్ను చంద్రబాబు నిలిపేశారు. రాయలసీమ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబు సర్కారుపై పోరాడాలి. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు మోసాలను ప్రతి ఒక్కరికీ వివరించాలి తిరుమల లడ్డూ విషయంలోనే భక్తుల మనోభావాలతో ఆడుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ప్రజలను మాయ చేయడం చిన్న విషయం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు.. జగన్కు మంచి పేరొస్తుందని రాయలసీమ ప్రాజెక్టును ఆపేశాడు. ఆంధ్రాకు సీఎంగా ఉండి, చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశాడని రుజువైనా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. చంద్రబాబుకు రాయలసీమ మీద ఏమాత్రం ప్రేమ లేదని 40 ఏళ్లుగా ఆయన్ను చూసిన వారికి ఎవరికైనా తెలిసిపోతుంది. ఇలాంటి చంద్రబాబు మెడలు వంచి ఆపేసిన ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా ఒత్తిడి తీసుకొద్దాం. చంద్రబాబు మోసాలను గ్రేటర్ రాయలసీమ పరిధిలో ప్రతి పౌరుడికీ తెలిసేలా వివరిద్దాం. – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రబాబుకు వ్యవసాయం అంటే చిన్నచూపు రాయలసీమకు చంద్రబాబు చేసిన మోసం బహిర్గతం అయ్యాక ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన టీడీపీ నాయకులు ఈ ప్రాజెక్టు దండగ అన్నట్లు తప్పుడు ప్రచారం ప్రారంభించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న చంద్రబాబు.. ఇతర సీఎంలు ప్రారంభించిన ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేయడం, పూర్తయిన వాటికి రిబ్బన్ కటింగ్లు చేసుకోవడం తప్పించి, ఆయన ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. అంటే చంద్రబాబుకు సాగు నీటి రంగమన్నా, రైతులన్నా, వ్యవసాయమన్నా చిన్నచూపు. అన్ని ప్రాజెక్టులకు నీరివ్వాలన్నా నందికొట్కూరు నుంచే పోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత రైతులు త్యాగాలు చేసి భూములు కోల్పోయారు. సర్వస్వం కోల్పోయి వలసలు పోతున్న రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఉద్యోగాలిస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు. – బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రాజకీయాలకు అతీతంగా ఉద్యమిద్దాం వైఎస్సార్ సీఎం అయిన వెంటనే దుర్భిక్ష పరిస్థితుల మధ్య వ్యవసాయం చేసే రాయలసీమ ప్రాంత రైతుల కష్టాలను తీర్చేసి దేవుడయ్యాడు. గాలేరు–నగరి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులతో రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలను తీర్చారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేసినా వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాయలసీమ రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అనుమతులు లేకుండా పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ మనకు దక్కాల్సిన నీటిని వాడుకుంటే చంద్రబాబుకు ఇంకా జ్ఞానోదయం కలగడడం లేదు. చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలందరికీ వివరించాలి. రాయలసీమ ప్రాంత ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమించాలి. – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఎన్జీటీకి ఫిర్యాదు చేసి ప్రాజెక్టును చంద్రబాబు ఆపించాడు: నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పుట్టి, ఇక్కడ నుంచే గెలిచి ముఖ్యమంత్రి అవుతున్నా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే వృథాగా పోతున్న నీటిని రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించాలని ఆలోచన చేస్తే ఎన్జీటీకి ఫిర్యాదు చేసి చంద్రబాబు ఆపించాడు. అయినా నిర్మాణం ఆపకుండా 80 శాతం పూర్తి చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్. ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లో తిరగలేరు. – దారా సుదీర్, నందికొట్కూరు పార్టీ ఇన్చార్జి రాయలసీమకు చంద్రబాబు ద్రోహం రాయలసీమ నుంచి కరువులు ఆగిపోయాయంటే ఆ ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్ 44 వేల క్యూసెక్కులకు పెంచితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక మరింతగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించి రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేసి 80 శాతం పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో తట్టమట్టి కూడా తీయలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం ఆయనతో కుమ్మక్కై రాయలసీమ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశాడని అర్థమైపోయింది. – అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే తల తెగ నరికినా మా మొండెం ఉద్యమిస్తుంది ‘సీమ’ అంటే చంద్రబాబుకు ఎప్పుడూ ఇష్టం లేదు. అందుకే రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపి ద్రోహం చేశాడు. కర్నూలుకు రావల్సిన హైకోర్టును, నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తీసుకెళ్లారు. ‘అనంత’కు మంజూరైన ఎయిమ్స్ను మంగళగిరికి తరలించారు. ఆఖరుకు కడపలో ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకును కూడా తరలించుకుపోయాడు. ఆనాడు వైఎస్సార్ సీఎంగా ఉండగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే ప్రకాశం బ్యారేజీ మీద దేవినేని ఉమాతో ధర్నాలు చేయించి అడ్డుకునే ప్రయత్నం చేసిన రాయలసీమ ద్రోహి చంద్రబాబు. ఇక్కడి రైతులు, ప్రజల భవిష్యత్తును చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కాలరాస్తున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఉద్యమానికి ఇప్పుడు మళ్లీ బీజం పడింది. ఉద్యమం మొదలయ్యాక తల తెగ నరికినా మా మొండెం ఉద్యమిస్తుందే కానీ ఉద్యమం మాత్రం ఆగదు. – సాకె శైలజానాథ్, మాజీ మంత్రి ఓటుకు కోట్లు కేసుకు భయపడే.. రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు రాయలసీమ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, మనకు హక్కుగా దక్కాల్సిన నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా సీఎంగా ఉన్న చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాడు కేసీఆర్కు, నేడు రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తలూపుతున్నాడు. రాయలసీమ ప్రాజెక్టును తిరిగి ప్రారంభింపజేసేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రాయలసీమ ప్రాజెక్టు కోసం రాయలసీమ పౌరుషం చూపించాలి. – ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు గోదావరి–బనకచర్ల పేరుతో కాలయాపన శ్రీశైలం డ్యాంకు ఎక్కువ శాతం భూములు కోల్పోయింది రాయలసీమ ప్రాంతమే. కృష్ణా జలాలపై అత్యధిక క్యాచ్మెంట్ ఏరియా రాయలసీమలోనే ఉంది. చంద్రబాబు ఏనాడూ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచించ లేదు. దివంగత వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు ఎవరూ ఈ ప్రాంతం గురించి ఆలోచించలేదు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నాడు. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు నీటిని తరలిస్తుంటే ఎగువ రాష్ట్రాలు అంగీకరించవు అని తెలిసే సాధ్యం కాని ప్రాజెక్టుతో చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడు. కృష్ణా, తుంగభద్ర నదులపై నిరి్మంచాల్సిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించడం మూర్ఖత్వం. వైఎస్ జగన్ గెలిచి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయేది కాదు. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు లిఫ్ట్తోనే రాయలసీమ రైతుల భవిష్యత్తు ఈ ప్రాంతానికి సంజీవని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రాజకీయాలకు అతీతంగా రాయలసీమ వాసులంతా ఒక్కటై ఉద్యమించాలి. రాయలసీమను ఎడారిగా మార్చే చంద్రబాబు కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. మళ్లీ కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలు వలసలు వెళ్లకుండా నిరోధించాలంటే రాయలసీమ ప్రాజెక్టు పూర్తి కావాలి. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావాలనే డిమాండ్తో త్వరలో కడపలో రెండో మహాసభ నిర్వహిస్తాం. – రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం రాష్ట్రంలో సాగు నీటి రంగానికి మేలు చేసిన ఘనత నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిదైతే, ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ లిఫ్ట్ పూర్తవుతుంది. ఈ లిప్్టతో ఉమ్మడి ప్రకాశం, నెలూర్లు, రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ఉద్యమంలో ఎంత వరకైనా ముందుకు నడుస్తాం. ప్రాజెక్టు పూర్తి చేస్తాం. – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బాబు కుట్రలను అంతం చేద్దాం రాయలసీమ దేశంలోనే అత్యంత కరువు ప్రాంతం. నీళ్లు లేక వ్యవసాయం చేయలేక ఏడాదిలో రెండు నెలలు మినహా 10 నెలలు వలసోయి బతికే పరిస్థితి. పిల్లలు, వృద్ధులు మాత్రమే ఇళ్ల వద్ద ఉంటారు. అలాంటి ప్రాంతానికి నీళ్లిచ్చేందుకు మా నాయకుడు సిద్ధమైతే దాన్ని అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు. రాయలసీమకు చంద్రబాబు కంటే ద్రోహం చేసేవారు బహుశా ఎవ్వరూ ఉండరు. చంద్రబాబు కుట్రలను అంతం చేసి రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేస్తాం. – గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేసింది. ఎంత నిర్బంధిస్తే అంతగా తిరగబడతాం. ఎంత అణచివేస్తే అంత పైకి లేస్తాం. రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి తీసుకొచ్చిన లిఫ్టును రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు ఆపేశాడు. రాయలసీమ ప్రజలకు ద్రోహం చేశాడు. కూటమి నాయకుల వికృత రాజకీయ క్రీడను గ్రామ గ్రామానికి తీసుకెళ్తాం. నందికొట్కూరులో మొదలు పెట్టింది ప్రారంభ సభ మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం. – భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం రాష్ట్ర సాగు నీటి రంగం గురించి చర్చించాల్సి వస్తే వైఎస్సార్కు ముందు.. వైఎస్సార్ తర్వాత అని చెప్పుకోవాలి. నెల్లూరు జిల్లాలో కండలేరు, సోమశిల ప్రాజెక్టులను పూర్తి సామర్థ్యం మేరకు నీరు నిలిపిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే నెల్లూరు జిల్లాకు మరింత మేలు చేకూరుతుంది. తాను కోరిన మీదటే చంద్రబాబు రాయలసీమ లిఫ్టును ఆపేశాడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే జగన్ సీఎం కావడం ఖాయం. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు -
అడ్డంగా దొరికి.. అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా?
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ మహాప్రసాద వ్యవహారంపై సీబీఐ నివేదికతో కూటమి పెద్దల వెన్నులో వణుకు మొదలైంది. కల్తీ జరిగిందని పదే పదే చెప్పాలంటూ తమ పార్టీల నేతలకు నేతలకు పవన్, చంద్రబాబు హుకూం జారీ చేశారు. అయితే అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో భారీ ప్రెస్మీట్తో ఇప్పుడు మరో నాటకానికి తెర తీశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై దర్యాప్తు వ్యవహారంలో కూటమి పెద్దలు గురువారం ప్రెస్మీట్ నిర్వహించారు. ఇప్పటికే అబద్ధాలు ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అండ్ కో.. తాము చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ.. దొంగే దొంగా దొంగా అన్నచందాన మరోసారి అబద్ధపు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మీడియాపై చంద్రబాబు అసహనంతిరుమల లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతుకొవ్వు కలవలేదని.. కూటమి సర్కార్ ఆధ్వర్యంలో ఉన్న సీబీఐ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ లాంటి సంస్థలే తేల్చి చెప్పాయి. కానీ, ఎల్లో మీడియా మాత్రం సీబీఐ విచారణ, ఆ నివేదికలపైనా బురద జల్లుతూ తప్పుడు రాతలు రాస్తోంది. ఇదే విషయాన్ని పరోక్షంగా కొందరు మీడియా ప్రతినిధులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. అది విని ఆయన ఒక్కసారిగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదికలనే ఆయన తప్పుబట్టారు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చిందని.. ఇప్పటిదాకా వచ్చిన నివేదీకలన్నీ ఏకసభ్య కమిటీ ముందు ఉంచుతామని.. సీబీఐ నివేదికపై ఆ కమిటీ విచారణ చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఊగిపోయిన పవన్జంతు కొవ్వు లేదని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసినా.. ఉందంటూ మళ్లీ ప్రచారంతో అపచారం చేస్తున్నారు. లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని అన్ని నివేదికల్లో తేటతెల్లమైందంటూ ఇటు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇష్టానుసారం మాట్లాడారు. ఏ నివేదికలోనూ వైఎస్సార్సీపీ నేతలకు క్లీన్ చిట్(అసలు ఎవరి పేరు లేదు కూడా) ఇవ్వలేదు. తాను, చంద్రబాబు ఒక్కటేనని.. మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటామని.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీతో మహా పాపం జరిగిందంటూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీ కీలక నేతలు వైవీసుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిని బద్నాం చేయాలనే కూటమి కుట్రలు సీబీఐ నివేదికతో పటాపంచలు అయ్యాయి. దీంతో కక్కలేక మింగలేని స్థితిలో ఉన్న కూటమి బ్యాచ్.. ఈ విషయంలో తప్పుడు ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని భావించింది. అందుకే సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ నిర్వహించి.. ఆపై మీడియా ఎదుట ప్రకటనలు చేసింది. ఇది చూసి అడ్డంగా దొరికిపోయి.. అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా? అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ముందే చెప్పిన వైఎస్ జగన్చంద్రబాబు ఏకసభ్య కమిషన్ డ్రామా గురించి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముందే చెప్పారు. బుధవారం అంబటి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడం, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారానికి తెర తీశారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు..! ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఉండరు’’ అంటూ మాట్లాడారు. జగన్ చెప్పినట్లే.. ఇవాళ చంద్రబాబు ఏకసభ్య కమిషన్ సీబీఐ సహా నివేదికలన్నింటిపైనా విచారణ జరుపుతుందంటూ ప్రకటించారు. -
రేపు జోగి రమేష్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీమంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 6న పరామర్శించనున్నారు. ఆ రోజు ఉ.10.30 కు తాడేపల్లి నివాసం నుంచి జగన్ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు.కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వైఎస్ జగన్ మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
సాక్షి,పశ్చిమగోదావరి: శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోసేన్రాజు కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. పెదఅమిరం శ్రీరాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు తేజ రిషిత, చిట్టిరాజు (ఐపీఎస్)లకు వైఎస్ జగన్.. వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. -
ఆంధ్రజ్యోతికి హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి దినపత్రికకు విశాఖలో రూ.కోట్ల విలువైన భూమిని కట్టబెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఆమోద పబ్లికేషన్స్ (ఆంధ్రజ్యోతి)కి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన నక్కా నిమ్మిగ్రేస్ హైకోర్టులో ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
గ్రూప్స్ ‘నవ తరం’గాలు
సాధారణ పేద కుటుంబాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ గ్రూప్స్లో జయకేతనం ఎగురవేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వీరు ప్రణాళికబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించారు. క్రమశిక్షణతో కూడిన తర్ఫీదు, ప్రిపరేషన్, కఠోర సాధనే తమను గెలుపు వాకిళ్లలో నిలబెట్టిందని సగర్వంగా ప్రకటించారు. – సాక్షి ఎడ్యుకేషన్ నా తండ్రి కూరగాయల వ్యాపారి ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ మాక్ ఇంటర్వ్యూ సమయంలో అడిగిన కొన్ని ప్రశ్నలు సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూలో ఎదురవడం కలిసొచ్చింది. కోచింగ్ చాలాబాగా ఉపయోగపడింది. నా తండ్రి తెనాలిలో కూరగాయల వ్యాపారి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను గ్రూప్–1లో డీఎస్పీ ఉద్యోగం సాధించా. ఆనందంగా ఉంది. – అడపాల ఓంకార వెంకట నాగేశ్వరరావు, గ్రూప్–1 విజేత, తెనాలి సి‘విల్ పవర్తో’.. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి గ్రూప్–1 కోసం ప్రిపేర య్యాను. రెండేళ్ళపాటు మరో ప్రపంచం తెలీకుండా పూర్తిగా గ్రూప్–1 కోసమే శ్రమించా. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో సివిల్స్ కోసం తీసుకున్న కోచింగ్ గ్రూప్–1 విజయానికి చాలా సహాయపడింది. – భారతాల ఉదయ్ శంకర్, ఏపీపీఎస్సీ గ్రూప్–1 విజేత స్టడీ సర్కిల్ ‘మిత్ర’లాభం గ్రూప్–1 మెయిన్స్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఆర్సీరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో తీసుకున్న క్లాసులు బాగా హెల్ప్ అయ్యాయి. ఇంటర్వ్యూ సమయంలో సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ సంఘ మిత్ర సలహాలు పనికొచ్చాయి. – బి.నిఖిలశ్రీ, ఏపీపీఎస్సీ గ్రూప్–1, విజేత దృఢ ‘సంకల్పసిద్ధి’ ఏపీపీఎస్సీ గ్రూప్–1లో సత్తాచాటి డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యా. ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ ఇచ్చిన బలమైన మద్దతుతో దృఢ సంకల్పంతో ముందడుగు వేసి విజయం సాధించా. – విఖిలశ్రీ, గ్రూప్1 విజేత, ఎన్టీఆర్జిల్లా శిక్షణ.. మంచి ‘స్కోర్’ ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో తీసుకున్న ప్రత్యేక శిక్షణ కలిసొచ్చి ంది. ప్రిలిమ్స్, మెయిన్స్లోనూ మంచి స్కోర్కు ఉపయోగపడింది. గ్రూప్–1లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ పోస్టుకు ఎంపికయ్యాను. –నరహరిశెట్టి భానుప్రకాష్, గ్రూప్–1 విజేత, అవనిగడ్డ, కృష్ణాజిల్లా 50మందికిపైగా ఆర్సీ స్టడీ సర్కిల్ అభ్యర్థుల విజయం హైదరాబాద్ ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు అత్యధికులు ఏపీపీఎస్సీ గ్రూప్1లో ఉద్యోగాలు సాధించారు. మేం సిలబస్తోపాటు ఎగ్జామ్ ఓరియెంటేషన్పైనా దృష్టిసారిస్తాం. సీనియర్ ఫ్యాకల్టీలు అందుబాటులో ఉన్నారు. 43 ఏళ్లుగా స్టడీసర్కిల్ నడుపుతున్నాం. మా సంస్థ అభ్యర్థులు వేయిమందికిపైగా ఇప్పటి వరకు సివిల్స్ టాపర్లుగా రాణించారు. గత వారంలో ప్రకటించిన ఏపీపీఎస్సీ గ్రూప్–2 ఫలితాల్లోనూ అత్యధిక శాతం మంది విజేతలు మా సంస్థ వారే. మా నాన్న ఆర్సీ రెడ్డి జీవితకాల కృషి ఫలితం ఈ ఇన్స్టిట్యూట్. ఆయన స్ఫూర్తిని మా చెల్లి దీప్తితో కలిసి ముందుకు తీసుకెళ్తున్నా. –బి.సంఘమిత్ర, ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ -
నిందితులను రోడ్లపై ఎలా పెరేడ్ చేయిస్తారు?
సాక్షి, అమరావతి: పోలీసులు సామాన్య ప్రజలతో అమానవీయంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. చట్ట నిబంధనలను పాటించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తేల్చి చెప్పింది. చట్టానికి లోబడే పోలీసులు శాంతి భద్రతలను కాపాడాల్సి ఉంటుందని చెప్పింది. వివిధ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులను రోడ్లపై పెరేడ్ చేయిస్తూ.. ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియా ముందు ఎందుకు ప్రవేశపెడుతున్నారని పోలీసులను నిలదీసింది. నేరం నిరూపణ అయ్యేంత వరకు నిందితులు నిరపరాధులేనని స్పష్టం చేసింది. నిందితులను పెరేడ్ చేయిస్తున్న వ్యవహారంలో రాష్ట్ర‡ ప్రభుత్వానికి, డీజీపీ, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.వివిధ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులను రోడ్లపై పెరేడ్ చేయిస్తూ, ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియా ముందు ప్రవేశపెట్టడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.పోలీసులే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, నిందితులను రోడ్లపై పెరేడ్ చేయించడం ఇటీవలి కాలంలో పెరిగిపోయిందని, ఇలా పెరేడ్ చేయించి మీడియా ముందు ప్రవేశపెట్టడం సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్దమని తెలిపారు. ఇలా చేయడం ఓ రకంగా నేరం చేశారని తీర్పునిచ్చేయడమేనన్నారు. వాస్తవానికి నేరం చేశారా లేదా అన్నది తేల్చాల్సింది న్యాయవ్యవస్థ మాత్రమేనని, అయితే రాష్ట్రంలో పోలీసులే న్యాయ నిర్ణేతల్లా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.నేరారోపణ ఉన్న ప్రతి వ్యక్తీ దోషి కాదని, అలాంటప్పుడు వారిని రోడ్లపై పెరేడ్ చేయించడం వారి హక్కులను హరించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఉత్తర భారతదేశంలో ఓ ద్విచక్ర వాహనదారుడిని పోలీసులు దూషిస్తూ కొడుతున్నారని, ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ తమకు వచి్చందని తెలిపింది. సామాన్య ప్రజల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారంది. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. ఓ కేసులో నిందితుడిని తీసుకెళ్లే వాహనం మరమ్మతులకు గురి కావడంతో పోలీసులు అతన్ని నడిపించుకు తీసుకెళ్లారని, దీన్ని ఫోటోలు తీసి ప్రచారం చేశారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. -
చంద్రబాబు, పవన్ ఏకాంత చర్చలు
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని అడ్డగోలుగా విష ప్రచారం చేసి దొరికిపోయిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇద్దరూ రెండున్నర గంటలపాటు ఏకాంతంగా చర్చలు జరిపినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధాలని సీబీఐ సిట్ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ ద్వారా బయటకొచ్చిన నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు శ్రీ వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగి పాపం మూటగట్టుకున్నారని ప్రజలు నమ్ముతుండడం.. వారు చెప్పిన అబద్ధాలను ఎంత సమర్థించుకుంటున్నా ప్రజలు నమ్మకపోవడంతో దీనిపై ఏం చేయాలని కూటమి నేతలు రెండ్రోజులుగా తర్జనభర్జన పడుతున్నారు. అందులోభాగంగానే చంద్రబాబుతో పవన్కళ్యాణ్ బుధవారం సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది.ఇక లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయాలపై టీడీపీ శ్రేణులతో దాడి చేయించడంవల్ల ప్రభుత్వం తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోవడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఈ అంశంపైనే ఎక్కువగా వీరు మాట్లాడుకున్నట్లు టీడీపీ నేతల ద్వారా తెలిసింది. అలాగే, త్వరలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల పంపకం పైనా ప్రాథమికంగా చర్చలు జరిపారు. బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలు తమకే కావాలని పట్టుబడుతుండడంతో దానిపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీ, జనసేన చెరొకటి పంచుకోవాలా లేక బీజేపీని ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాలని ఒప్పించాలా అనే అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలిసింది. అయితే, ఈసారి జనసేనకు ఒక స్థానం కచ్చితంగా ఇవ్వాలని చంద్రబాబును పవన్ కోరినట్లు తెలిసింది. అలాగే, తన సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం వంటి అంశాలను కూడా పవన్ ప్రస్తావించినట్లు సమాచారం. దీంతోపాటు ఇంకా భర్తీ కావాల్సిన నామినేటెడ్ పదవులతోపాటు రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేకపోవడంవల్ల ఎదురవుతున్న సమస్యలపైనా చర్చించినట్లు తెలిసింది. -
రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే చంద్రబాబు కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. గుంటూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపైన, ఆయన ఇంటిపైన జరిగిన దాడి ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగిందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రెస్మీట్ పెట్టి, చేసిన హెచ్చరికలు ప్రభుత్వం పట్ల ఆగ్రహానికి కారణం అయ్యాయని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే.. » తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ ఛార్జిషీట్ స్పష్టం చేసినప్పటికీ, అదేపనిగా ఇంకా ప్రభుత్వం దు్రష్పచారం చేస్తుండటాన్ని అత్యధికులు తప్పు పడుతున్నారు. » ప్రతిపక్షంగా ఈ విషయంపై వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతుండటం సహజమని, ఎందుకంటే ఆ రోజు జంతువుల కొవ్వు కలిపారని చెప్పింది ప్రభుత్వ పెద్దలే కనుక.. ఈ మాత్రం ప్రభుత్వ పెద్దలను నిలదీయడంలో తప్పు లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. » ఇప్పటికైనా ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా, మళ్లీ విచారణ అంటూ నిర్ణయం తీసుకోవడం కక్ష సాధింపుగా కనిపిస్తోందని ప్రజలు చెబుతున్నారు. »ఇదే విషయంపై అంబటి రాంబాబు మాట్లాడినందుకు శనివారం ఉదయం నుంచి టీడీపీ శ్రేణులు ఆయనపై దాడికి యత్నించాయని, వెంటపడి వేధించాయని.. ఓ దశలో ఆయన్ను తీవ్రంగా రెచ్చగొట్టారని.. అందువల్లే ఆయన పరుషంగా మాట్లాడారని చెబుతున్నారు. ఆ పరిస్థితిలో ఆయన స్థానంలో ఎవరున్నా అంతే స్థాయిలో ఆగ్రహానికి గురవుతారని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. » మళ్లీ పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అంబటి ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగడం, కార్లు, కార్యాలయంలో ఫరి్నచర్ను ధ్వంసం చేయడం ఏమాత్రం సరికాదని తప్పుపడుతున్నారు. » ఈ నేపథ్యంలో అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరుకు వచ్చినప్పుడు చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా ఆయన్ను చూడటానికి వచ్చారు. చాలా చోట్ల బారికేడ్లు పెట్టినా మహిళలు సైతం రోడ్డుపైకి రావడం కనిపించింది. -
అసెంబ్లీ నుంచి అనేకమార్లు కాల్ చేశాడు
బంజారాహిల్స్: రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనకు అసెంబ్లీ నుంచి ప్రతిసారీ కాల్ చేసేవాడని, అక్కడ జరిగే అన్ని విషయాలూ చూపించేవాడని అతని బాధితురాలు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్–2లోని కమలాపురికాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మద్దతుతోనే కేసు నమోదైందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేను రూ.25 కోట్లు తాను అడగలేదని స్పష్టం చేశారు. సంజీవని ఆస్పత్రిలో డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ వేసుకున్నాకే అబార్షన్ అయిందని పేర్కొన్నారు. అరవ శ్రీధర్ తనతోనే కాకుండా మరో ఐదుగురితోనూ రాసలీలలు నడిపేవాడని చెప్పారు. తనకు ఆ విషయాలు తెలిశాక ఇదంతా ఆపేద్దామని అన్నానని, అందుకే సేఫ్ సైడ్గా అన్ని ఆధారాలూ ఉంచుకున్నానని పేర్కొన్నారు. తనను అతను పెళ్లి చేసుకుంటానని చెప్పిన విషయం వాళ్ల ఇంట్లో వారందరికీ తెలుసునని వివరించారు. టీడీపీ నేత ముక్కా రూపానందరెడ్డే వెనుక ఉండి శ్రీధర్ను నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ నుంచి కాల్స్ చేయడం నిబంధనలకు విరుద్ధం కదా..! దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. శ్రీధర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శ్రీధర్కు శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. విచారణ కమిటీ వేయాలి: న్యాయవాది ఆజాద్ బాధితురాలి తరఫు న్యాయవాది ఆజాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యేపై మహిళా విచారణ కమిటీ వేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ను కోరుతున్నట్లు చెప్పారు. బాధితురాలు రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు ఫుల్ ఆడియో లేదని పేర్కొన్నారు. ఆ ఆడియో ఉంటే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆస్తులు రూ.3 లక్షలు మాత్ర మే అని అఫిడవిట్లో ఉందని, అలాంటిది రూ.25 కోట్లు ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదిస్తే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీలో పోర్న్ వీడియో చూసిన ఎమ్మెల్యేపై స్పీకర్ చర్యలు తీసుకున్నారని, మరి ఏపీ అసెంబ్లీలో కూర్చొని ఇలాంటి పనులు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్పై స్పీకర్ చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. సాక్ష్యాలు కోర్టులోనే సమర్పిస్తా మరో వీడియో విడుదల చేసిన అరవ శ్రీధర్ బాధితురాలు పుల్లంపేట: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో సాక్ష్యాధారాలను కోర్టులోనే సమర్పిస్తానని బాధితురాలు తెలిపారు. బుధవారం ఆమె మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ ముందు అరవ శ్రీధర్ తన వాదనలు వినిపించారని, తనకూ త్రిసభ్య కమిటీ నుంచి పిలుపు వచ్చిందని వెల్లడించారు. త్రిసభ్య కమిటీ ముందు హాజరై అన్ని విషయాలూ వివరిస్తానని చెప్పారు. సాక్ష్యాధారాలను మాత్రం కమిటీకి ఇచ్చే ప్రసక్తే లేదని, కోర్టులోనే సమర్పిస్తానని ఆమె స్పష్టంచేశారు. ఎమ్మెల్యేపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కేసు నమోదుచేయలేదని, జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడంతో కమిషన్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ వల్ల తాను ఐదుసార్లు గర్భం దాల్చానని సంజీవని హాస్పిటల్లో స్కానింగ్ చేసుకున్నానని చెప్పారు. సంజీవని హాస్పిటల్కు ఎమ్మెల్యే శ్రీధర్ ఫోన్ చేసి అబార్షన్ చేయాలని చెప్పడంతోనే తనకు ఆస్పత్రి వర్గాలు మాత్రలు ఇచ్చారని వెల్లడించారు. అబార్షన్ చేయించడం చట్టరీత్యా నేరమని, ఈ విషయంలో ఆధారాలు, రిపోర్టులు తన దగ్గరే ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో మహిళా కమిషన్ను కలిసి వివరాలు సమర్పించి న్యాయం కోసం డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు. -
దీర్ఘకాలిక లీజుకా.. పీపీపీకా?
సాక్షి, అమరావతి: గుంటూరు అంజుమన్ ఇ ఇస్లామియా సంస్థకు చెందిన రూ.కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వాటిని మరో మార్గంలో మళ్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ముస్లిం సమాజం నుంచి ఆగ్రహం పెల్లుబుకడంతో ఆ భూములను ఏపీఐఐసీకి బదలాయించేందుకు చేపట్టిన భూసేకరణ విషయంలో పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో.. గుంటూరు జిల్లా చినకాకానిలోని 71.57 ఎకరాల అంజుమన్ ఇ ఇస్లామియా సంస్థకు చెందిన భూములను ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకునే అంశాన్ని వక్ఫ్బోర్డు పరిధిలోకి ప్రభుత్వం నెట్టింది. దీంతో.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టేందుకు ఏపీ వక్ఫ్బోర్డు రంగంలోకి దిగింది.దీర్ఘకాలిక లీజుకు ఇద్దామా? ప్రభుత్వ శాఖలకు, ప్రైవేట్ వ్యక్తులకు పీపీపీ పద్ధతిలో అప్పగిద్దామా? అనే దానిపై తీర్మానం చేసేందుకు వక్ఫ్బోర్డు రంగం సిద్ధంచేసింది. ఇందుకోసం గురువారం విజయవాడలో ఏపీ వక్ఫ్బోర్డు కీలక సమావేశం నిర్వహిస్తోంది. అయితే, ఈ సమావేశం ఎజెండాను బుధవారం సాయంత్రం వరకు పలువురు సభ్యులకు అందించలేదు. మల్లాయపాలెంతో మొదలైన ప్రయత్నాలు.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రాగానే రూ.వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములను ఏపీఐఐసీకి బదలాయించి తద్వారా పచ్చనేతలకు పప్పుబెల్లాల్లా పంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ, ప్రభుత్వ ప్రయత్నాలు వక్ఫ్ చట్టానికి విరుద్ధమని న్యాయ నిపుణులు, ముస్లిం నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తుల టైటిల్ను వేరొక సంస్థ, వ్యక్తి పేరున మార్చడానికి వీల్లేదు. అయినా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం–2018లోని సెక్షన్–22 అనుసరించి అతితక్కువ ధరకు ఏపీఐఐసీకి అప్పగించాలనే ప్రతిపాదన తెచ్చింది. ఇందులో భాగంగా.. తొలుత గుంటూరు షాహీ జామియా మసీదుకు చెందిన మల్లాయపాలెంలోని 233.18 ఎకరాలను ఇండ్రస్టియల్ పార్కు పేరుతో ఏపీఐఐసీకి భూసేకరణ ద్వారా బదలాయించేందుకు గతేడాది యత్నించింది. ఈ ప్రయత్నాలపై ముస్లిం సమాజం మండిపడడంతో వెనక్కి తగ్గింది. భూసేకరణను వాయిదా వేసి దీర్ఘకాలిక లీజు లేదా పీపీపీ పద్ధతిలో అప్పగించేందుకు వక్ఫ్బోర్డు ప్రతిపాదన చేసేలా స్కెచ్ వేసింది. కానీ, వక్ఫ్బోర్డు సభ్యుల నుంచి ముస్లిం నేతల వరకు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో మల్లాయపాలెం భూముల బదలాయింపునకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఇప్పుడు అంజుమన్ ఇ ఇస్లామియా భూముల వంతు.. ఈ నేపథ్యంలో.. చినకాకానిలోని అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు చెందిన 71.57 ఎకరాలను ఇండ్రస్టియల్ పార్కు పేరుతో ఏపీఐఐసీకి భూసేకరణ ద్వారా బదలాయించేందుకు నోటిఫికేషన్ జారీచేశారు. దీనిపై కూడా తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఇప్పుడు దీర్ఘకాలిక లీజుకు ఇద్దామా? పీపీపీ పద్ధతిలో ఇద్దామా? అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. వాస్తవానికి.. వక్ఫ్ భూములు లీజు, విక్రయం, బహుమతి (గిఫ్ట్)గా ఇవ్వడం కుదరదని వక్ఫ్ చట్టం–1995లోని సెక్షన్–51 స్పష్టంచేస్తోందని ముస్లిం ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. వక్ఫ్బోర్డు సమావేశం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. -
ప్రజా సేవకులమని మర్చిపోయి.. పాలకుల్లా వ్యవహరిస్తున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. అధికారులు ప్రజా సేవకులన్న విషయాన్ని మర్చిపోయి, వారే పాలకులన్నట్లు వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. అధికారులందరూ ఒక కుటుంబంగానే ఉంటారని, కానీ ప్రజలను ఎల్లవేళలా ఓ ప్రతిపక్షంలా చూస్తుంటారని తెలిపింది. కోర్టులు ఏం చేస్తాయిలే అనుకునే అధికారులను ఎవ్వరూ కాపాడలేరని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ కోర్టు ఆదేశాలను అమలుచేసి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టులో మా ఆదేశాలను అమలుచేస్తామని చెప్పి, ఆఫీసులకు వెళ్లిన తరువాత మూలన పడేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. సింగిల్జడ్జి ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టర్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావును న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం బుధవారం ఆదేశించింది. ప్రజాధనంతో పథకాలు తెస్తూ ప్రచారం కోసం వాడుకుంటున్నారు సర్వశిక్ష అభియాన్ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన మెమోను పరిశీలించిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వ తీరును కూడా తప్పుపట్టింది. పథకాలను ప్రచారం కోసమే వాడుకుంటున్నారు తప్ప, అమలు బాధ్యతను తీసుకోవడంలేదని వ్యాఖ్యానించింది. దీనివల్ల పథకం ఉద్దేశం నెరవేరడంలేదని తెలిపింది. ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పుకున్నా న్యాయస్థానాలు మాత్రం బాధ్యత నుంచి తప్పుకోవని హైకోర్టు స్పష్టం చేసింది. పథకం అమలుపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటారా? తమను అర్ధంతరంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ కేజీబీవీ పార్ట్టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ) దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. వారి సేవలను కొనసాగించాలని ఆదేశించారు. ఈ తీర్పుపై అధికారులు దాఖలు చేసిన అప్పీల్పైన, సింగిల్ జడ్జి తీర్పును అమలు చేస్తామంటూ కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించినందుకు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై తమ ఆదేశాల మేరకు నమోదైన సుమోటో కోర్టు ధిక్కార వ్యాజ్యం పైనా జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ధర్మాసనం ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన శ్రీనివాసరావును సింగిల్ జడ్జి ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించగా.. కింది స్థాయి అధికారుల తీరు వల్ల తన ఆదేశాలు అమలు కాలేదని, ఆ అధికారులకు నోటీసులు ఇచ్చానని ఆయన చెప్పగా, నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్నారా అంటూ నిలదీసింది. మరో ప్రశ్నకు శ్రీనివాసరావు సూటిగా సమాధానం చెప్పకపోవడంతో.. ‘ఇది మీ అధికారుల రివ్యూ మీటింగ్ కాదు. మీకు తోచింది చెప్పడానికి. కోర్టు అన్న విషయం గుర్తు పెట్టుకోండి’ అని ధర్మాసనం మండిపడింది. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తరఫున హాజరైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) విష్ణుతేజ అధికారుల చర్యలను సమర్థించబోగా.. ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సుమోటో కేసులో కోర్టు సహాయకారిగా వ్యవహరించాల్సిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సైతం అధికారులను సమర్థించేలా వాదించకూడదని స్పష్టం చేసింది. ఏజీ ఓ ప్రాసిక్యూటర్గా వ్యవహరించాలంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
నిధులు లేకుండానే రోడ్లు మంజూరు
సాక్షి, అమరావతి: ప్రత్యేకించి తగినన్ని నిధులు లేని పద్దు కింద గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా రూ.2,123 కోట్ల రోడ్ల పనులు మంజూరు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఆ రోడ్ల పనులకు భారీగా మార్పులు చేస్తూ బుధవారం కొత్తగా మరో ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో రాష్ట్ర గ్రామీణ రహదారుల బలోపేతం ప్రాజెక్టు కింద 4007 కిలోమీటర్ల పొడవున 1299 గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ.2,123 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 9న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయా రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ఆ ఉత్తర్వులో పేర్కొన్నఆర్థిక శాఖ పద్దులో తగిన నిధులు కేటాయించకుండా.. ఆయా నిధులను ప్రస్తుత ఏడాది, వచ్చే ఏడాది కాలంలో నాబార్డు రుణం లేదంటే కేంద్రం ఇచ్చే సాస్కీ (ఎస్ఏఎస్సీఐ – స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) నిధులకు మారి్పడి జరుగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఆయా రోడ్ల పనులను మంజూరుకు పరిపాలనపరమైన అనుమతులు తెలిపి దాదాపు రెండు నెలలు పూర్తవలేదు. అందుకు అవసరమైన నిధుల పైనా ఇంకా స్పష్టత లేదు. కానీ బుధవారం రెండు నెలల క్రితం మంజూరు చేసిన పనులను భారీగా మార్పులు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు మంజూరు చేసిన 4007 కిలోమీటర్లకు సంబంధించిన 1299 పనుల స్థానంలో అదే రూ.2123 కోట్ల ఖర్చుతో కొత్తగా 4,122 కిలోమీటర్లకు సంబంధించిన 1392 రోడ్డు పనులకు పరిపాలనా అనుమతులిస్తున్నట్లు బుధవారం జారీ చేసిన ఉత్వర్వుల్లో పేర్కొంది. ఆయా పనుల వివరాలను కూడా ఉత్తర్వులకు జత పరిచింది. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో కూడా ఈ పనులకు అవసరమయ్యే నిధులకు పాత జీవోలో పేర్కొన్న ఆర్థిక శాఖ పద్దునే పేర్కొంది. ఆ పద్దుకు ఇప్పటికీ తగిన నిధుల కేటాయించకుండా.. ఆయా నిధులను ప్రస్తుత ఏడాది, ఈ ఆర్థిక ఏడాది లేదా వచ్చే ఆర్థిక ఏడాది కాలంలో నాబార్డు రుణం లేదంటే కేంద్రమిచ్చే సాస్కీ (ఎస్ఏఎస్సీఐ– స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) నిధులకు మారి్పడి జరుగుతుందని పేర్కొనడం గమనార్హం. -
బాబు జంగిల్ రాజ్ – భయానక పాలనతో 'ప్రజాస్వామ్యం ఖూనీ'!
కచ్చితంగా ప్రతిఘటన.. ఇలాంటివి మళ్లీ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. దానికి కచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. అవసరమైతే రాష్ట్రవ్యాప్త బంద్కి కూడా పిలుపునిస్తాం. ఇప్పటికైనా ఆపకపోతే అడుగులు ఇంకా వేగంగా పడతాయి. ఇష్యూస్ పెద్దవి అవుతాయని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈ ఘటనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తున్నాం. సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం. అన్నిరకాల పోరాటాలు చేస్తాం.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితనకు కావాల్సిన వారిని నియమించుకుని..చంద్రబాబు తనకు కావాల్సిన కొంతమందిని మాత్రమే సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలు, డీఐజీలుగా నియమించుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు. బిహార్లో ఏం జరుగుతోందో తెలియదు కానీ రాష్ట్రంలో వీరందరితో చంద్రబాబు జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారు. దాదాపు 200 మంది సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. అలా రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన సాగుతోంది.అలా అనుకుంటే బాబు మూర్ఖుడే!వైఎస్సార్ సీపీపై ఈ రకంగా దాడులు చేస్తే కార్యకర్తలు భయపడతారని చంద్రబాబు అనుకుంటే ఆయన కన్నా మూర్ఖుడు ఇంకొకరు లేనట్టే. బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతకన్నా నాలుగింతలు బలంగా పైకి లేస్తుందన్నట్లుగా.. మా కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తారు.- మీడియాతో వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు జంగిల్ రాజ్ను నడుపుతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని దేశంలోనే ప్రఖ్యాత ల్యాబ్లు ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ నిర్థారిస్తూ రిపోర్టులు ఇచ్చినా.. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచినా.. పాపభీతి లేకుండా, తప్పు ఒప్పుకోకుండా చంద్రబాబు ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పులకు లెంపలు వేసుకోవాల్సింది పోయి దీనిపై ప్రశ్నిస్తుంటే భౌతిక దాడులు, విధ్వంసం, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో టీడీపీ గూండాల చేతిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని బుధవారం వైఎస్ జగన్ పరిశీలించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..గుంటూరులోని చుట్టుగుంట సెంటర్లో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం అబద్ధాలతో ఫ్లెక్సీలు..తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తమ తప్పులకు లెంపలు వేసుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారిని, ప్రజలను క్షమాపణ కోరాల్సిందిపోయి.. అంతా కూడబలుక్కుని మళ్లీ అవే అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తప్పుడు సమాచారాలతో, కులమతాలను రెచ్చగొట్టే విధంగా, అబద్ధాలతో ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇదే చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చి అబద్ధాలతో మోసగించారని మేం కూడా ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా? ఇది హత్యాయత్నం కాదా..? కుట్రలో భాగం కాదా?ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే సాయంత్రం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకు జరిగాయి. పోలీసుల సమక్షంలోనే ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఇంట్లో అద్దాలు, సామగ్రిని, ఆఫీసులో ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా లోపలికి వచ్చి ధ్వంసం చేశారు. ఇది హత్యాయత్నం కాదా..? పోలీసులు దగ్గరుండి మరీ ఈ కుట్రలో భాగం కాలేదా? పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ మాదిరిగా జరిగేదా? ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. ఎంత మంది డీఎస్పీలు, సీఐలు లేరు..? మంగళగిరిలో పోలీసు బెటాలియన్ కూడా ఉంది. కనీసం ఫోన్ చేస్తే కూడా పోలీసులు స్పందించలేదు. మా పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ తదితరులు ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీ, ఐజీ, ఇతర అధికారులు, చీఫ్ సెక్రటరీ ఆఫీసులకు ఫోన్లు చేస్తే స్పందించలేదు. మరి ఇది కుట్రలో భాగంగా కాదా? సాయంత్రం ఐదు గంటల నుంచి ఒంటి గంట దాకా విధ్వంసం చేశారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? ఇంతటితో ఆగకుండా ఆ రాత్రి రాంబాబు అన్నను అరెస్టు చేశారు. చంద్రబాబును తిట్టాడని కేసు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబుని తిట్టినందుకు రాంబాబును అరెస్టు చేసినప్పుడు.. మరి రాంబాబు ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించి, ఐదు కార్లను ధ్వంసం చేసి, అద్దాలన్నీ పగలగొట్టి, ఆఫీసుకు నిప్పంటించడం అంతా ఎమ్మెల్యే, ఆమె భర్త సమక్షంలో జరిగితే వారివీుద ఏం యాక్షన్ తీసుకున్నారు? సింపుల్గా స్టేషన్ బెయిలిచ్చి పంపేశారు. అంబటి మీడియా సమక్షంలో వివరణ ఇచ్చారు. జరిగిన దానికి క్షమాపణ కూడా కోరారు. అయినా ఆయన ఇంటిపై దాడి చేశారు. అసలు మీరు మనుషులేనా? ఇది జంగిల్రాజ్ కాదా? రాంబాబును అక్రమంగా అరెస్టు చేయడమే కాదు.. అర్థరాత్రి దాటిన తరువాత ఆయన్ను నల్లపాడు స్టేషన్లో ముగ్గురు సీఐలు దారుణంగా హింసించి వేధించారు. ఓ మాజీ మంత్రి పట్ల ఆ విధంగా వ్యవహరించడం, టార్చర్ చేయడం ఏం న్యాయం? మరి ఇది జంగిల్రాజ్ కాకపోతే మరేమిటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్... విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టారు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని అనుమానం కలుగుతోంది. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు...!మరుసటి రోజు జోగి రమేష్ ఇంటిపై దాడి! అక్కడా మళ్లీ పోలీసుల సమక్షంలోనే. అక్కడ ఏకంగా పెట్రోల్ బాంబులు. బాటిళ్లలో పెట్రోల్ పోసి వాటిని ఇంట్లోకి విసిరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు విధ్వసం సృష్టించారు. దాదాపు 300–400 మంది పోగయ్యారు. వారంతా అక్కడికి వచ్చేటప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసుల సమక్షంలో అదంతా జరుగుతున్నా చూస్తుండిపోయారు. పోలీసుల సమక్షంలోనే జోగి రమేష్ ఇంటికి నిప్పంటించారు.పోలీసుల సమక్షంలోనే..అంతకు ముందు రోజు విడదల రజిని గుడిలో పూజ చేసుకుని వస్తుంటే ఆమెను అడ్డగించి తిట్టారు. దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడికి యత్నించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. తిరిగి ఆమె మీదే కేసు పెట్టారు. అది కూడా ఏమని? ఆమె గుడికి వెళ్లి వారందరిపై అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారని! మాట్లాడటానికి హద్దూ పొద్దూ ఉండాలి! ఇది జంగిల్ రాజ్ కాదా? బొల్లా బ్రహ్మనాయుడు అన్న చేసిన పాపం ఏమిటి..? చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్కు జ్ఞానోదయం కలగాలని కోరుతూ పూజ చేయటానికి ఆయన గుడికి బయలుదేరారు. దారిలో ఆయన మీద అటాక్ చేశారు. అది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. కాకాణి గోవర్ధన్రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. అసలు తప్పు చేసింది బాబేఅసలు తప్పు చేసింది చంద్రబాబు. తప్పుడు ఆరోపణలు చేసిందీ చంద్రబాబే. అవి తప్పుడు ఆరోపణలనీ దేవుడు మొట్టికాయలు వేసినా.. ఏకంగా సీబీఐ చార్జిషీట్లోనే చెప్పినా.. కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు నెయ్యిపై క్లీన్ చిట్ ఇస్తే... దేవుడు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి చంద్రబాబు చేస్తున్నదేమిటి? ప్రతి విషయంలోనూ దుర్మార్గమైన రాజకీయాలే! సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని ఎన్నికలప్పుడు మాట ఇచ్చారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుందో చెబుతూ సంతకాలతో సహా హామీ ఇచ్చారు. మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.36 వేలు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఇదిగో మీకు రూ.15 వేలు. మీ ఇంట్లో రైతులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.26 వేలు. మీ ఇంట్లో చిన్నమ్మలు, పెద్దమ్మలు 55 ఏళ్ల వయసులో ఉన్నారా? వాళ్లకు రూ.48 వేలు అంటూ ప్రజలను మోసం చేశారు. సూపర్ సిక్స్, సెవెన్ అమలు చేశామంటూ సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు చేస్తున్నది తప్పని, మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే.. కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాడు. చివరకు పిల్లలని కూడా చూడకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులపై గంజాయి కేసులు పెట్టి జైలుకు పంపి వారి కెరీర్ నాశనం చేస్తున్నాడు.బాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే!చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే! టీడీపీ సైన్యానికి లాటరీలో ప్రైవేటు మద్యం షాపులన్నీ కట్టబెడతాడు. ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గరుండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. లిక్కర్ షాపుల పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ పెగ్గులతో అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అవి పక్కదోవలో చంద్రబాబుకింత... ఎమ్మెల్యేల కింత... వారి మాఫియా సైన్యానికింత.. అని లూటీ పద్ధతిలో పంచుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఒకటి, రెండు కాదు. పది వరకు బెల్టు షాపులున్నాయి. లిక్కర్ ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. అది సరిపోదన్నట్లు ఏకంగా ప్రతి ఐదు బాటిళ్లకు ఒకటి నకిలీ. వీళ్లే కుటీర పరిశ్రమను పెట్టి చీప్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారు. ఆ కల్తీ లిక్కర్ తాగి ఇంజనీరింగ్ విద్యార్థులు నలుగురు చనిపోయారు. నకిలీ లిక్కర్ను టీడీపీ నాయకులే తయారు చేస్తూ సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. తంబళ్లపల్లెలో టీడీపీ తరఫున పోటీచేసిన జయచంద్రారెడ్డి కల్తీ లిక్కర్ తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరికాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఇదే. ఎక్సైజ్ అధికారులకు, జయచంద్రారెడ్డికి వాటాలు పంచుకోవడంలో తేడాలొచ్చి దొరికిపోతే మా నాయకుడు జోగి రమేష్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఒకపక్క రాక్షస పాలన సాగిస్తున్న టీడీపీ నాయకులతో కలిసి మా పార్టీకి చెందిన జోగి రమేష్ కల్తీ లిక్కర్ తయారు చేయడం సాధ్యమేనా? వీళ్లు నకిలీ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు తీసుకొచ్చిన బెల్ట్ షాపుల్లో జోగి రమేష్ అమ్ముతున్నాడని అక్రమ కేసు పెట్టారు. నకిలీ, కల్తీ లిక్కర్ తయారు చేసేది వారే! బెల్ట్ షాపులు తీసుకొచ్చిందీ వారే! వాటిలో కల్తీ లిక్కర్ అమ్మకాలు చేసేదీ వారి మనుషులే! కానీ కేసు మాత్రం జోగి రమేష్ మీద పెట్టి జైలుకు పంపారు. విచారణ చేయిస్తాం... వడ్డీతో చెల్లిస్తాంఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. కళ్లు మూసి తెరిచేలోపు మరో మూడేళ్లు గడిచిపోతాయి. అప్పుడు వచ్చేది మా ప్రభుత్వమేనని ఖచ్చితంగా చెబుతున్నా. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆయనకు కొమ్ము కాస్తున్న ఇతర పార్టీ నాయకులకు, కొంతమంది పోలీసు అధికారులకు కూడా చెబుతున్నా.. ఎల్లకాలం ఇలాగే అన్యాయం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా వీరికి మొట్టికాయలు పడతాయి. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాల్నంటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీతో సహా చెల్లిస్తాం. అందర్నీ బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నా.మా కార్యకర్తలూ ఇలాగే స్పందిస్తే..రాష్ట్రంలో విషపు విత్తనాలు నాటుతున్నారు. ఈ సంస్కృతిని ఇప్పటికైనా ఆపండి. ఈ విషపు విత్తనాలు, కూటమి నాయకులు చేస్తున్న అన్యాయాల కారణంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త, నాయకుడు దెబ్బతిని ఉన్నారు. ఈ విషపు విత్తనాలు పెరిగి పెద్దవై చెట్టుగా మారినప్పుడు, రేప్పొద్దున్న మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా నాయకులు, కార్యకర్తలు ఇలాగే స్పందిస్తే మీకు ఏం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలని చంద్రబాబుని గట్టిగా హెచ్చరిస్తున్నా.అంబటి నివాసంలో టీడీపీ మూకల దాడిలో ధ్వంసమైన కారును పరిశీలిస్తున్న వైఎస్ జగన్ చేతనైతే ఇవన్నీ చెయ్ బాబూ..!ఇప్పటికైనా దేవుడంటే భయం, భక్తితో వ్యవహరించి బుద్ధి జ్ఞానం తెచ్చుకుని మంచి పరిపాలనతో ప్రజలకు మేలు చేసి వారి వద్ద మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు చేయాలి. చేతనైతే సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ విషయంలో అబద్ధాలు చెప్పకుండా, మోసాలు చేయకుండా నెరవేర్చే కార్యక్రమం చేయాలి. కూటమి వచ్చాక నిర్వీర్యం అయిన స్కూళ్లను బాగుచేయాలి. 8 క్వార్టర్లకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలి. పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే ఆలోచన చేయాలి. చేతనైతే ఆపేసిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి పేద, మధ్యతరగతి వారికి నాణ్యమైన వైద్యం అందించే కార్యక్రమం చేసి చూపించాలి. చేతనైతే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలిచ్చి వదిలేశారు. బకాయి పడ్డ రూ.30 వేలు కూడా తక్షణం చెల్లించాలి. వ్యవసాయాన్ని చక్కబెట్టే కార్యక్రమం చేయాలి. కానీ మీకు వీటన్నింటి మీద ధ్యాస లేదు. అన్నీ అబద్ధాలు, మోసాలు, ప్రశ్నించే గొంతులు నొక్కడమే. తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకే కమిషన్!చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడం, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారానికి తెర తీశారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు..! ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఉండరు.వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, విడదల రజిని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, నంబూరు శంకరరావు, అన్నాబత్తుని శివకుమార్, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవినేని అవినాష్, వనమా బాలవజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, షేక్ నూరీ ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు, పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పలువురు రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు జగన్ పర్యటనలో పాల్గొన్నారు.దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా..రాష్ట్రంలో ఈరోజు జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందంటే.. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం జరుగుతోంది. అంబటి రాంబాబు ఇంటిపైన దాడి.. జోగి రమేష్ ఇంటి మీద దాడి.. విడదల రజినిపై అటాక్.. బొల్లా బ్రహ్మనాయుడు మీద అటాక్.. ఇవన్నీ జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు కొన్ని ఉదంతాలు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినమ్మ, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్రెడ్డి, కాకాణి గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి? చంద్రబాబు దాదాపు ఏడాదిన్నరగా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసిందంటూ రకరకాలుగా చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు. దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారు.ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చిన ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీనెయ్యిపై చంద్రబాబు ఆరోపణలన్నీ అవాస్తవం అని ఎన్డీఆర్ఐ (నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్), ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) రిపోర్టు ఇచ్చాయి. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబ్లు. వీళ్ల హయాంలో.. వీళ్లే ఇచ్చిన టెస్ట్ శాంపిళ్లు అవి. వాటిని విశ్లేషించి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వుగానీ, గొడ్డు మాంసం కొవ్వులు గానీ, పందికొవ్వు గానీ, చేప నూనెగానీ.. ఇటువంటివి ఇంకొకటిగానీ ఇంకొకటి గానీ లేవని నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇచ్చాయి. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచి ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ సర్టిఫికెట్లను జత చేసి క్లోజర్ కూడా ఇచ్చింది. సీబీఐ క్లీన్చిట్ ఇస్తోంది. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు కూడా క్లీన్ చిట్లు ఇస్తున్నాయి.ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్చిట్..ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి తప్పు చేసి ఉంటే వారి పేర్లు ఎందుకు చేర్చలేదు? వారు ఒకవేళ తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే, తప్పు నిజమే అయితే ఎందుకు అరెస్టు చేయలేదు? వారు ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి తప్పూ జరగలేదు కాబట్టే వారి పేర్లు చార్జిషీట్లో పెట్టలేదు. తప్పు చేయలేదు కాబట్టే అరెస్టు చేయలేదు. అసలు ఈ వ్యవహారంలోకి సీబీఐ ఎలా వచ్చిందో తెలుసా..?రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని, దీనిపై విచారణకు ఆదేశించాలని వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లి పిటిషన్ వేశారు కాబట్టే దీనిపై స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది.ప్రశ్నిస్తుంటే దాడులు...దుర్బుద్ధితో ఫ్లెక్సీలు పెట్టి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న చంద్రబాబును.. ఎందుకయ్యా అబద్ధాలు చెప్పావు? అన్యాయం చేశావు? ఎందుకయ్యా శ్రీవారి ప్రసాదం ప్రతిష్టను దెబ్బ తీశావు? అని ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఆయన ఏం చేశారో తెలుసా..? అంబటి రాంబాబు అన్న మీద దాడి! ఆ రోజు (శనివారం) ఉదయం ఆయన గుడికి వెళ్లి చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని పూజ చేసి బయటకు వస్తుంటే.. గుడి నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఏకంగా కట్టెలు పట్టుకుని, పోలీసులను పెట్టుకుని అడ్డుకున్నారు. (కర్రలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తల ఫోటోలను చూపారు). కారులో ఉన్న రాంబాబును అడ్డగించి, కారును కర్రలతో బాదుతూ, పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలు అంటూ బూతులు తిట్టారు. ఒకేసారి అంతమంది దుండగులు చేతిలో కర్రలతో కారుపైకి దూసుకు రావడం.. బూతులు తిడుతూ మీదకు రావడంతో ఆయన కాస్త ఘాటుగా స్పందించాడు. ఆయన నోటి నుంచి ఒక తిట్టు పదం వచ్చింది. ఒక రియాక్షన్గా జరిగింది. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ మీద ఎటువంటి అటాక్ లేకపోయినా రొటీన్గా తిడుతున్నారు. అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకు వచ్చినప్పుడు రియాక్షన్గా ఆయన తిడితే మాత్రం ఇంకో రకంగా చిత్రీకరిస్తున్నారు. అయినప్పటికీ రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ప్రెస్మీట్ పెట్టి జరిగిన విషయమంతా వివరించారు. ఆయన పెద్ద మనిషి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి తాను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని చేతనైతే పొగడాలి. కానీ వాళ్లు దాన్ని కూడా వక్రీకరిస్తూ ఏకంగా రాంబాబు అన్నను హత్య చేయడానికి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు సాక్షాత్తూ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మనుషులను వేసుకుని వచ్చి అంబటి ఇంటిపై దాడి చేశారు. ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో కిటికీల అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. పక్కనున్న ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఆ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. వారి ప్రాణాలకు నష్టం జరిగే విధంగా.. వారిని తిడుతూ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం. -
జగనన్న 2.0 లోడింగ్
సాక్షి, అమరావతి: ‘జగనన్న 2.0 లోడింగ్’.. అంటూ సామాజిక మాధ్యమాల్లో వైఎస్ జగన్ పేరు హోరెత్తిపోతోంది. మాజీ మంత్రి అంబటిపైనా, ఆయన ఇంటిపైనా కూటమి రౌడీ మూకల దాడి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్ బుధవారం గుంటూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఉవ్వెత్తున జన అభిమాన తరంగం ఎగిసిపడింది. కార్యకర్తలకు జగన్ అండగా ఉంటాడని, ఎవరికీ భయపడేది లేదనే మీమ్స్ను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. జగన్ కాన్వాయ్ వీడియోలను వైరల్ చేస్తున్నారు. జగన్ పర్యటనకు జనం భారీ స్థాయిలో రావడం అనేది సహజం. కానీ అంతే స్థాయిలో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆయనకు మద్దతు లభిస్తుండటం, వాట్సప్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో, వాటి గ్రూపుల్లో లెక్కకు మించి జగన్ పర్యటనపై పోస్టులను నెటిజన్లు షేర్ చేస్తుండటం విశేషం. -
జనం కేక.. జంగిల్రాజ్ను తరిమికొడదాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రోడ్డుపై కిలోమీటర్ల కొద్దీ కనుచూపు మేర జనం.. జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా ఏకమయ్యారు.. చంద్రబాబు సర్కారు దుర్మార్గాన్ని ధైర్యంగా దుయ్యబట్టారు.. సర్కారు ఆంక్షలను లెక్క చేయకుండా రోడ్డుపైకి వచ్చారు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అడుగులో అడుగేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా జై జగన్ అంటూ నినాదాలు చేశారు.. జంగిల్ రాజ్కు రోజులు దగ్గర పడ్డాయని గర్జించారు.. ఇందుకు బుధవారం గుంటూరు వేదికైంది.. గుంటూరు నగరం జన సంద్రమైంది.. నినాదాలతో దద్దరిల్లింది. తెలుగుదేశం పార్టీ గూండాల దాడికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన సందోహం అపూర్వ స్వాగతం పలికింది. జగన్ పర్యటన ఖరారైందని తెలిసిన వెంటనే జిల్లాలో 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించి, నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటి వరకు మార్గ మధ్యంలో అనేక చోట్ల బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. జగన్ కాన్వాయ్ను మాత్రం అనుమతించి.. ఆయన వెనుక వస్తున్న వాహనాలను, జన సందోహాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇన్ని అడ్డంకుల మధ్య కూడా వైఎస్ జగన్ పర్యటన విజయవంతమైంది. 35 కిలోమీటర్లు.. ఆరు గంటలు » తాడేపల్లి నుంచి గుంటూరు నగరంలోని అంబటి రాంబాబు నివాసం వద్దకు 35 కిలోమీటర్ల దూరం చేరుకోవడానికి వైఎస్ జగన్కు ఏకంగా ఆరు గంటల సమయం పట్టిందంటే జనం ఎంతగా పోటెత్తారో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ను చూడటానికి స్వచ్ఛందంగా వెళ్తున్న వేలాది మంది ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు అడుగడుగునా ఆంక్షలతో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. » జగన్ కాన్వాయ్ తాడేపల్లిలో బయలుదేరిన తర్వాత కాజా టోల్గేట్ వద్ద వాహనాలను ఆపారు. ఆయనతోపాటు కొద్ది వాహనాలు మాత్రమే పంపి మిగతా వాటిని నిలువరించారు. అనంతరం కాన్వాయ్ గుంటూరు ఆటోనగర్ వై జంక్షన్కు చేరుకోగానే అక్కడ బారికేడ్లు అడ్డుగా పెట్టి పూర్తి స్థాయిలో వాహనాలు ఆపేశారు. » ఏటుకూరు బైపాస్ వద్ద కూడా కార్యకర్తలు పత్తిపాడు నుంచి గుంటూరు నగరంలోకి రాకుండా బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ నిలువరించారు. బైక్లపై వస్తుంటే బైక్ల తాళాలు లాక్కున్నారు. గుంటూరు జిల్లాను దిగ్బంధనం చేశారు. పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు వెళ్లే సరిహద్దు మండలాలైన నరసరావుపేట, యడ్లపాడు, సత్తెనపల్లి, అమరావతి మండలాల పరిధిలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు.» ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారు.. అంటూ ఆరా తీశారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని అడ్డుకొని వెనక్కి పంపారు. కొందరిని పోలీసు స్టేషన్లకు తరలించి సాయంత్రం ఐదు గంటల తర్వాత వదిలిపెట్టారు.జననేతకు జనం జేజేలు» గుంటూరు నగరానికి వచ్చిన జననేత వైఎస్ జగన్కు ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు జేజేలు పలికారు. విద్యార్థి విభాగం నేతలు, యువజన విభాగం నేతలు, అనుబంధ విభాగాల నేతలు, యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జన నేతకు ఎదురేగి స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ లీగల్ విభాగం నేతలు, న్యాయవాదులు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ వైఎస్ జగన్ పర్యటనకు మద్దతు తెలిపారు.» కంకరగుంట ఓవర్ బ్రిడ్జి, పట్టాభిపురం స్వామి థియేటర్ వద్ద సైతం ప్రజలు భారీగా చేరుకుని పూల వర్షం కురిపించారు. చేబ్రోలు హనుమయ్య కంపెనీ, గుజ్జనగుండ్ల సెంటర్లో తీన్మార్ డప్పు వాయిద్యాలతో స్థానిక నేతలు స్వాగతం పలికారు. యువత భారీగా బైక్ ర్యాలీలతో సందడి చేశారు. జగన్ గుంటూరు చేరుకున్న తర్వాత ఏటుకూరు వద్ద సర్వీస్ రోడ్డు మీదుగా వీఐపి రోడ్లోకి రావడానికి ముందుగా పోలీసులు ఆ దారిన వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం దాటిన తర్వాత కంకర్ గుంట ఓవర్ బ్రిడ్జి వద్ద సైతం వాహనాలను నిలువరించారు. అయినా జన సందోహం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. » గుంటూరు రోడ్లన్నింటిపై ప్రజలు, అభిమానుల కోలాహలం కనిపించింది. ఉదయం 10 గంటల నుంచే రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నేత కోసం ఎదురు చూశారు. పెద్ద సంఖ్యలో వస్తున్న నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అంబటి ఇంటికి వెళ్లనీయకుండా ఆపివేసినప్పటికీ.. సాయంత్రం 5 గంటలయ్యే సరికి ఆ ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. » గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చుట్టుగుంట సెంటర్ నుంచి అంబటి రాంబాబు నివాసానికి వచ్చేందుకు ఏకంగా 3 గంటలకుపైగా సమయం పట్టింది. అంబటి రాంబాబు నివాసంతో పాటు చుట్టుపక్కల ఇళ్లపైన, గోడలపైకి ఎక్కి ప్రజలు తమ అభిమాన నేతను చూశారు. పర్యటన ఈ స్థాయిలో విజయవంతం కావడంతో అధికార పార్టీ నేతల్లో గుబులుపుట్టింది.అడుగడుగునా అడ్డంకులే..సాక్షి, నరసరావుపేట: జంగిల్ రాజ్ అరాచకాలను ఎండగట్టేందుకు గుంటూరు నగరానికి వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా వెళ్తున్న వేలాది మంది ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అడుగడుగునా ఆంక్షలతో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు వెళ్లే సరిహద్దు మండలాలైన నరసరావుపేట, యడ్లపాడు, సత్తెనపల్లి, అమరావతి మండలాల పరిధిలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. జగన్ను చూడటానికి వెళ్తున్న వారిని గుర్తించి వెనక్కు పంపారు. ఉదయం 7 గంటల నుంచే వాహనాల తనిఖీలు ప్రారంభించారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ, యడ్లపాడు మండలం బోయపాలెం హైవే వద్ద, సత్తెనపల్లి మండలం నందిగం అడ్డరోడ్డు వద్ద పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. సత్తెనపల్లి, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ల, రాజుపాలెం, దాచేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ తదితర మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు వెళ్తున్న వాహనాలను సత్తెనపల్లి నందిగం అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆపేశారు. వారిని సత్తెనపల్లి పోలీస్స్టేషన్కు తరలించి సాయంత్రం 6 గంటల వరకు స్టేషన్లోనే నిర్బంధించారు. సత్తెనపల్లి కార్యకర్తలను సైతం ఇదే స్టేషన్లో సాయంత్రం వరకు ఉంచారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు అనుమతి లేదంటూ పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు గుంటూరులోని నివాసంలో పోలీసులు నోటీసులు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఎంత కట్టడి చేసినా పల్నాడు జిల్లా మీదుగా గుంటూరు నగరానికి వేలాది మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పడుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
వచ్చేది మా ప్రభుత్వమే.. వడ్డీతో సహా చెల్లిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు.. మూడేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మాజీ మంత్రి అంబటి కాపు కులానికి టైగర్.. అలాంటి వ్యక్తిని స్టేషన్లో నల్లపాడు, పట్టాభిపురం సీఐలు దారుణంగా కొట్టారన్న వైఎస్ జగన్.. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. అన్నింటిపై ఎంక్వైరీలు వేస్తాం.. వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.‘‘మా ప్రభుత్వం వచ్చాక అన్ని లెక్కలు తేలుస్తాం. విషపూరిత విత్తనాలు నాటడం ఆపండి. రేపు మా కార్యకర్తలు స్పందిస్తే ఏమవుతుందో ఆలోచించండి. చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. రాష్ట్రవాప్తంగా బంద్కు కూడా పిలుపునిస్తాం. మేం భయపడతామనుకుంటే చంద్రబాబు ముర్ఖుడే. వైఎస్సార్సీపీ శ్రేణులు నాలుగింతలు రెచ్చిపోయి కూటమి ప్రభుత్వాన్ని పెకిలిస్తారు’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.‘‘200మంది సీఐ, ఎస్సైలు వీఆర్లో ఉన్నారు. మీకు కావాల్సిన వారినే పోలీసులు నియమించుకున్నారు. బిహార్ సంగతేమో కానీ.. ఏపీలో మాత్రం జంగల్ రాజ్ నడుస్తోంది. తప్పు చేసిన అధికారుల్ని ఆధారాలతో సహా కోర్టులో నిలబెడతాం’’ అని వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. -
అంబటిని హత్య చేసేందుకు ప్రయత్నించారు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ( ఫిబ్రవరి 4, బుధవారం) గుంటూరులో పర్యటించారు. టీడీపీ గుండాలు మొత్తం విధ్వంసం చేసిన, గుంటూరులోని అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్ను సందర్శించి, ఆ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూశారు. అంబటి కారును ఏ విధంగా ధ్వంసం చేసింది చూసిన ఆయన, దాడి ఏ స్థాయిలో చేశారనేది గమనించారు. మొత్తం దాడి ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అంబటి రాంబాబు భార్య, కుమార్తెలు, కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించిన వైఎస్ జగన్.. అంబటి రాంబాబు కుటుంబానికి ఓదార్చారు. ఏ మాత్రం అధైర్యపడొద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జంగిల్రాజ్ నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని మండిపడ్డారు. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. ఈరోజు అంబటి విషయంలో జరిగింది అయితే ఏమి, అలాగే జోగి రమేష్ ఇంటిమీద దాడి అయితేనేమి, విడదల రజిని, బొల్ల బ్రహ్మనాయుడి మీద దాడి.. ఇవన్నీ ఇటీవలి కొన్ని ఘటనలు. ఇవన్నీ రాష్ట్రంలో జంగిల్రాజ్ను సూచిస్తున్నాయన్నారు. అసలు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్, భూమన కరుణాకర్రెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు.. వారంతా చేసిన తప్పేమిటి? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..తిరుమల శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా..:దాదాపు ఏడాదిన్నర నుంచి చంద్రబాబు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ, ప్రజలను మభ్య పెట్టే పని చేస్తున్నారు. పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, కుట్రపూరితంగా, ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అంటూ.. రకరకాలుగా దుష్ప్రచారం చేశారు. చంద్రబాబునాయడు, ఆయన కొడుకు లోకేష్, పవన్కళ్యాణ్.. ఉద్దేశపూర్వకంగా, శ్రీవెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భయం, భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుణ్ని వాడుకున్నారు.వారు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ.. రెండు ల్యాబ్లు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి. ఆ రెండు ల్యాబ్లు వీరు పంపించిన నెయ్యిని పరీక్షించారు. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేపనూనె వంటి ఏ అవశేషాలు లేవని సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ నివేదికా ఆధారంగా సీబీఐ, సిట్ ఛార్జ్షీట్ వేసింది.వారు నిజంగా తప్పు చేసి ఉంటే..!:ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే, ఆ ఛార్జ్షీట్లో వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి పేర్లు ఎందుకు లేవు? వారిని ఎందుకు అరెస్టు చేయలేదు?. ఎందుకంటే వారు తప్పు చేయలేదు కాబట్టి, సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ల్యాబ్లు కూడా వాస్తవం చెప్పాయి. అసలు సీబీఐ ఎందుకు వచ్చింది? వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. కేసులో నిజాలు నిగ్గు తేల్చాలని.. సీబీఐ దర్యాప్తు చేసి, వాస్తవాలు వెల్లడించింది.క్షమాపణ కోరాల్సింది పోయి..:కాబట్టి, చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్, పవన్కళ్యాణ్ చేసిన తప్పుకు చెంపలేసుకుని, క్షమాపణ కోరాల్సింది పోయి.. మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు ప్రచారం చేస్తూ.. వాస్తవాలు వక్రీకరిస్తూ, ఫ్లెక్సీలు పెట్టారు. తప్పుడు సమాచారంతో, రెచ్చగొట్టే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుందా?. మేము కూడా ఇలా ఫ్లెక్సీలు పెడితే ఎలా ఉంటుంది చంద్రబాబు?. సూపర్సిక్స్, సూపర్సెవెన్ అని చెప్పి మోసం చేశారని ఫ్లెక్సీలు పెడితే ఊర్కుంటారా?. అబద్దాలు చెబుతూ, దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టడం తప్పు. వాస్తవాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్లు స్పష్టంగా చెప్పినా, చంద్రబాబు వెనక్కు తగ్గడం లేదు.ప్రశ్నిస్తే సహించడం లేదు!:ఎవరైనా చంద్రబాబును గట్టిగా నిలదీస్తే, ప్రశ్నిస్తే..ఏం చేస్తున్నారు?. అంబటి రాంబాబు మీద దాడి చేశారు. ఆరోజు ఉదయం గుడికి వెళ్లి పూజ చేసి వస్తుంటే.. ఆ మార్గంలో కట్టెలు పట్టుకుని, పోలీసుల సమక్షంలో రాంబాబును అడ్డగించాలని చూశారు. (అంటూ ఆ ఫోటోలు చూపారు). పోలీసులను పక్కన పెట్టుకుని, కర్రలతో రాంబాబు కారును అడ్డగించి, కారును బాదారు. ఇంకా తనను బూతుల తిట్టి, ఆయన కారుపై దాడి చేస్తే.. రాంబాబుగారు స్పందించారు. తన ఒక్కడి మీద అంత మంది దాడి చేస్తే, తన కారును అడ్డగిస్తే, బూతులు తిడితే.. ఆయన స్పందించారు. ఆ సందర్భంగా ఆయన నోటి నుంచి.. కాస్త కటువైన పదం దొర్లింది. ఒకవైపు ఆయన కారుపై దాడి. మరోవైపు బూతులు తిట్టడంతో ఆయన కాస్త గట్టిగా స్పందించారు.మరి ఇదే చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్.. మీరు అంత కంటే దారుణంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు మాట్లాడితే ఒకటి. రాంబాబు గారు మాట్లాడితే ఒకటినా? అయినా రాంబాబుగారు, ఇంటికి వచ్చిన తర్వాత, మీడియాతో మాట్లాడి, తాను తిట్టినందుకు క్షమాపణ చెప్పారు. తాను ఏ పరిస్థితిలో తిట్టాడన్నది కూడా చెప్పారు. చాలా సంస్కారంగా వివరణ కూడా ఇచ్చారు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని చేతనైతే పొగడాలి. వారు తన కారుపై దాడి చేశారు. తిట్టారు. దాంతో అలా స్పందించాడు. ఆయన క్షమాపణ చెప్పినా.. ఆయన మాటలు వక్రీకరిస్తూ.. ఏకంగా అంబటి రాంబాబును హత్య చేయడానికి సాయంత్రం 5 గం. నుంచి అర్ధరాత్రి వరకు విధ్వంసం సృష్టించారు.స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి. మనుషులతో వచ్చి విధ్వంసం సృష్టించారు. 5 కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో, ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఆయన గల్లా మాధవి భర్త. ఆయన సాక్షాత్తూ అంబటి రాంబాబు ఆఫీసు పగలగొట్టారు. చివరకు నిప్పు పెట్టారు. (అంటూ ఆ ఫోటోలన్నీ చూపారు) ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయి. 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నా, వెనక్కి తగ్గలేదు.వారు కుట్రలో భాగస్వాములే కదా?:ఇది హత్యాయత్నం కాక మరేమిటి? పోలీసులు కూడా ఈ కుట్రలో భాగస్వాములు కాదా?. పోలీసులు బాధ్యతగా వ్యవహరించి ఉంటే, ఇంత విధ్వంసం జరిగేదా?. ఇక్కడికి ఎంత దూరంలో ఎస్పీ ఆఫీస్ ఉంది. కూతవేటు దూరంలో డీజీపీ ఆఫీస్ ఉంది. అక్కడ బెటాలియన్ ఉంటుంది. మా పార్టీ నాయకులు ఏ అధికారికి ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు. మరి ఇది కుట్ర కాదా? ఇది ధర్మమా? న్యాయమా?. మరోవైపు రాంబాబుగారిని అరెస్టు చేశారు. దానికి కారణం ఏం చెప్పారు? చంద్రబాబును తిట్టినందుకు అని చెప్పారు. మరి రాంబాబు ఇల్లు, ఆఫీసుపై దాడి చేసి, 5 కార్లు ధ్వంసం చేసి, మొత్తం పగలగొడితే.. ఏం చేశారు?. ఎమ్మెల్యే, ఆమె భర్తను ఏం చేయలేదు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు.అక్కడ జోగి రమేష్ ఇంటిపై దాడి:అక్కడ కూడా పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. ఇంటిమీద దాడి చేసి, నిప్పంటించారు. అంతకు ముందు విడదల రజిని. ఆమె గుడిలో పూజ చేసి వస్తుంటే, గుడి బయట అడ్డుకుని, తిడుతూ.. పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడికి ప్రయత్నించారు. ఇంత జరిగినా, ఆమెపైనే తిరిగి కేసు పెట్టారు.బొల్లా బ్రహ్మనాయుడు చేసిన తప్పేమిటి?చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, పవన్కళ్యాణ్కు జ్ఞానోదయం కలగాలని గుడిలో పూజ చేసి వస్తుంటే, ఆయనపైనా దాడి చేశారు. కాకాణి గోవర్థన్రెడ్డి పైనా అదే స్థితి. ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది.స్వార్థ రాజకీయాల కోసం..:తప్పులన్నీ చంద్రబాబు చేస్తున్నారు. కేసులు మా పార్టీ వారిపై పెడుతున్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినా.. చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పకుండా చేస్తోంది ఏమిటి?. స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నాడు. ఎన్నికల ముందు ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలిచ్చి..ఏవీ చేయకుండా,అన్నీ చేశామని సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నాడు. అక్రమ కేసులు, తప్పుడు సాక్ష్యాలు. చివరకు సోషల్ మీడియా కార్యకర్తలను కూడా వదలడం లేదు. ఇంకా దారుణంగా గంజాయి కేసులు కూడా పెడుతున్నారు.అంతా అరాచకం. ఎక్కడికక్కడ దోపిడీ:నకిలీ మద్యం దందా. తన పార్టీ వారికి మద్యం షాప్లు. వేలం పాట పాడి బెల్టుషాపులు అప్పగిస్తున్నారు. మద్యం షాప్ల పక్కనే, పర్మిట్రూంలు నడుతున్నారు. అలా యథేచ్ఛగా దోచుకుంటున్నారు. వైన్షాప్ల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. పర్మిట్రూమ్ల్లో పెగ్గుల వారీగా అమ్ముతున్నారు. ఆ ఆదాయం కూడా ప్రభుత్వానికి రావడం లేదు. అంతా వాళ్ల జేబుల్లోకి పోతోంది. ప్రతి 5 బాటిళ్లకు ఒకటి నకిలీ మద్యం. దాన్ని తయారు చేసింది తంబళ్లపల్లె నుంచి టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి. అయినా మా పార్టీ నాయకుడు జోగి రమేష్పై అక్రమ కేసు పెట్టి, జైలుకు పంపారు. నకిలీ మద్యం తయారీ. సరఫరా, అమ్మకం అంతా టీడీపీ నాయకులదే. అంత దారుణంగా దోచుకుంటున్నారు.జంగిల్రాజ్కు పరాకాష్ట:అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడిపై దాడి. అంబటి రాంబాబు కాపు కులంలో మంచి నాయకుడు. ఆయన ఆ కులంలో ఒక టైగర్. అలాంటి ఆయన్ను దారుణంగా హత్య చేయాలని చూశారు. ఇంకా ఆయనను అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా, నల్లపాడు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ముగ్గురు సీఐలు టార్చర్ చేశారు. ఒక మాజీ మంత్రిని అలా వేధిస్తారా?. దాదాపు 200 మంది పోలీసు అధికారులకు పోస్టింగ్ లేదు. మీకు కావాల్సిన వారిని ఎంచుకుని, జంగిల్రాజ్ చేస్తున్నారు.ఎవ్వరినీ వదిలిపెట్టబోము:ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. మిగిలింది మూడేళ్లు. చూస్తుండగానే గడిచిపోతాయి. మా ప్రభుత్వం వస్తుంది. అప్సుడు ఎవ్వరినీ వదిలిపెట్టబోము. ఇప్పుడు తప్పుడు పని చేస్తున్న పోలీసులను యూనిఫామ్తో బోనులో నిలబెడతాం. వడ్డీతో సహా బదులిస్తాం. విచారణ జరిపిస్తాం. ఇప్పుడు తప్పుడు పనులు చేస్తున్న పోలీసులు పద్ధతి మార్చుకోవాలి. విషబీజాలు నాటుతున్నారు:ఈ రోజు విషపూరిత విత్తనాలు నాటుతున్నారు. అవి రేపు వృక్షాలవుతాయి. అప్పుడు పరిస్థితి ఏమిటన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇకనైనా వైఖరి మార్చుకొండి. ఇలాంటి పనులు ఆపండి. హమీలు నిలబెట్టుకొండి. పిల్లలకు ఫీజులు చెల్లించండి. ఆరోగ్యశ్రీ పక్కాగా అమలు చేయండి. 10 మెడికల్ కాలేజీల అమ్మకం ఆపండి. వ్యవసాయ రంగాన్ని నిలబెట్టండి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి. పెట్టుబడి సాయం చేయండి.ఎదుర్కొంటాం.. పోరాడుతాం.. ఎండగడతాం:అడిగితే గొంతు పట్టుకోవడం సరికాదు. మీరు ఇలాగే కొనసాగిస్తే.. రాష్ట్ర బంద్కు పిలుపునిస్తాం. గట్టిగా పోరాడుతాం. ఢిల్లీలో కూడా మీ వ్యవహారాన్ని ఎండగడతాం. ఎన్హెచ్చార్సీకి కూడా ఫిర్యాదు చేస్తాం. ఇలా చేస్తే, వైయస్సార్సీసీ కార్యకర్తలు భయపడతారనుకుంటే, చంద్రబాబు ఒక మూర్ఖుడు. బంతి నేలకు కొడితే, అంతే బలంతో లేస్తుంది. మా కార్యకర్తలు కూడా అంతే.అంత దిగజారిన నాయకుడు ప్రపంచంలోనే ఉండడు:చంద్రబాబు ఎంత తప్పుడు మనిషి అంటే, ఆయన ఆరోపణలన్నీ అవాస్తవమని తేలింది. ఆయన చేసిన తప్పు ప్రజలందరికీ తెలిసింది. దీంతో తన అబద్దాలు నిజం అని చెప్పడానికి, ఆయన తనకు కావాల్సిన వారితో కమిషన్ వేసుకుంటాడట! అలా తనకు అనుకూలమైన నివేదిక తెప్పించుకునే ప్రయత్నం. అందుకే చంద్రబాబు వంటి దిగజారిపోయిన నాయకుడు.. ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండడుఅడుగడుగునా అంతులేని అభిమానం..తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్కు అడుగుడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. రెడ్బుక్ రాజ్యాంగం, విధ్వంస పాలనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు, జగన్ను చూసేందుకు పోటెత్తారు. దీంతో తాడేపల్లి నుంచి గుంటూరు, సిద్ధార్థనగర్లో ఉన్న రాంబాబు ఇంటికి చేరుకోవడానికి దాదాపు 6 గంటలు పట్టింది. కుంచనపల్లి క్రాస్రోడ్స్, ఖాజా టోల్గేట్, మంగళగిరి బైపాస్, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, గుంటూరులోని కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్ ఆఫీస్, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మీదుగా సిద్దార్ధనగర్లోని అంబటి రాంబాబు నివాసానికి శ్రీ వైయస్ జగన్ చేరుకున్నారు.మరోవైపు వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రతి చోటా ప్రయత్నించింది. ఎక్కడకక్కడ జగన్గారి వెంట వస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. పలు చోట్ల బారికేడ్లు అడ్డం పెట్టారు. ఒకటి, రెండు చోట్ల లారీలను కూడా రోడ్డు మీద అడ్డుగా పెట్టుకుని అడ్డుకున్నారు. అయినా జగన్గారి అభిమానులు, కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. ఆయన వెంట తరలి వచ్చారు. గుంటూరు నగరం జనసముద్రంగా మారింది. -
దురుద్దేశంతోనే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం
సాక్షి నెట్వర్క్: తిరుమల వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ... దురుద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిట్ నివేదికను వక్రీకరించి బ్యానర్లతో దుష్ప్రచారం చేస్తూ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అలాగే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినిపై దాడులకు పాల్పడిన గూండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. » మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు విజయవాడ, కొత్తపేట సీఐ కొండలరావుకు ఫిర్యాదు అందచేశారు. వైఎస్సార్ సీపీ ఎన్టీ ఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ విజయవాడలోని మాచవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. » అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్, ఉరవకొండ సర్కిల్ కార్యాలయంలో, కదిరి పట్టణ పీఎస్లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మడకశిర వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈర లక్కప్ప ఆధ్వర్యంలో ఎస్ఐ లావణ్యకు ఫిర్యాదు చేశారు. » వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఫోర్తుటౌన్ పోలీస్ స్టేషన్లో, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ పెందుర్తి పీఎస్లో, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి న్యూపోర్టు పీఎస్లో, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి ఎంవీపీ పీఎస్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. » మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు నర్సీపట్నం టౌన్ సీఐకి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు బోదెపు గోవింద్ యలమంచిలి రూరల్ ఎస్ఐకి, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు నక్కపల్లి పీఎస్లో, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్కుమార్ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. » డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు ఫిర్యాదు చేశారు. » పి.గన్నవరం పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్కు పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్, కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరాంజీ, తదితరులు సీఐ వైఆర్కే శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ప్రత్తిపాడులో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తదితరులు సీఐ బి.సూర్య అప్పారావుకు ఫిర్యాదు చేశారు. » శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, జేఆర్పురం, పాతపట్నం, టెక్కలి, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం రూరల్, నరసన్నపేట పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. » మార్కాపురం జిల్లా గిద్దలూరులో నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి ఫిర్యాదు చేశారు. » పశ్చిమగోదావరి జిల్లా ఆచంట పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురుప్రసాద్ తదితరులు ఫిర్యాదు చేశారు. -
నేడు అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఆయన గుంటూరు వెళతారు.ఇటీవల టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
టీడీపీ చేతిలో ఖా‘కీలు బొమ్మలు’
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేయడంతోపాటు ఆయనపై హత్యాయత్నం జరిగిన ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మలై ఆ పార్టీ అధిష్టానం చెప్పినట్టు నడుచుకున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం గోరంట్ల గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు గోరంట్ల చిల్లీస్ సెంటర్లో కర్రలు, మారణాయుధాలతో కాపుగాశారు. అంబటి రాంబాబు వాహనాన్ని అడ్డుకుని కారు మీద చేతులతో కొడుతూ అసభ్య పదజాలంతో దూషించారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వందనాదేవి అయితే ‘‘నువ్వు మొగోడివి అయితే రారా’’అంటూ అంబటిని రెచ్చగొట్టారు. మారణాయుధాలతో తెలుగుదేశం నేతలు పెద్ద సంఖ్యలో గుమిగూడినా వారిని నియంత్రించడంలో నల్లపాడు సీఐ వంశీధర్ విఫలమయ్యారు.పైగా టీడీపీ నేతలకు కొమ్ముగాశారు. వైఎస్సార్సీపీ నేతల నుంచి ప్రతిస్పందన రాకుండా తెలుగుదేశం మూకలకు రక్షణగా నిలబడ్డారు. పైగా అంబటి వాహనంలో మారణాయుధాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేశారు. వ్యూహాత్మకంగా దాడి.. అంబటిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అతిగా స్పందించారు. రాంబాబుకు 24 గంటల్లో తామేంటో సినిమా చూపిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు నల్లపాడు సీఐ వంశీధర్ సిద్ధార్ధనగర్లోని అంబటి ఇంటికి వెళ్లి నోటీసు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. అయితే నోటీసు ఇవ్వకుండానే ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు అంబటి ఇంటి వద్ద ఎంతమంది ఉన్నారో గమనించి వెళ్లి టీడీపీ నేతలకు ఉప్పందించారని సమాచారం.ఈ నేపథ్యంలో అంబటిని అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారంతో మీడియా అక్కడికి చేరుకుంది. అదే సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులూ తరలివచ్చాయి. సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త లంకా మాధవి అంబటి ఇంటి వద్దకు వచ్చి అంబటిని ‘‘నా కొడకా రా..రా.. చెప్పుతో కొడతా’’అంటూ దుర్భాషలాడింది. దీనికి వైఎస్సార్సీపీ మహిళా నాయకులు ప్రతిస్పందించారు. టీడీపీ కార్యకర్తను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లంకా మాధవిని అక్కడి నుంచి తప్పించారు. అప్పటికే వ్యూహాత్మకంగా పశ్చిమఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు, అబ్బూరి మల్లి, ఇతర కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంబటి ఇంటికి చేరుకుని ఒక్కసారిగా మారణాయుధాలు, కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అప్పటికే పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు నేతృత్వంలో వందమందికిపైగా పోలీసులు అక్కడ మోహరించినా.. వారిని అడ్డుకునే యత్నం చేయకుండా చోద్యం చూశారు. గోనుగుంట్ల కోటేశ్వరరావు అనే టీడీపీ దివ్యాంగుల విభాగం నేత మైక్ సెట్తో వచ్చి ‘‘బయటకు రారా నా కొడకా’’అంటూ అంబటిపై బూతుపురాణం లంకించుకున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ గూండాలకు అండగా నిలబడ్డారు. ఈ ఇద్దరూ అధికారపార్టీ తొత్తులే! సీఐలు గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ ఇద్దరూ అధికారపార్టీ తొత్తులేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు గతంలో పలుమార్లు వైఎస్సార్సీపీ ర్యాలీలు, సభలను అడ్డుకున్నారు. కొన్ని సందర్భాల్లో అంబటి రాంబాబుతో వాగ్వాదానికీ దిగారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు సీఐలు అధికార పార్టీ నేతల ఆదేశాల ప్రకారం అంబటిని ఇబ్బంది పెట్టాలనే వ్యూహరచన చేశారని వైఎస్సార్సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కోర్టును ఆశ్రయించడానికి సన్నద్ధమవుతున్నాయి. పక్క సబ్ డివిజన్ స్టేషన్లో ఆ సీఐకి ఏం పని?ఉదయం టీడీపీ నేతలు అంబటిపై దాడికి యత్నించిన ప్రదేశం గోరంట్ల చిల్లీస్ సెంటర్ నల్లపాడు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అన్యాయంగా అక్రమంగా అంబటిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను శనివారం రాత్రి 10.30 గంటలకు నల్లపాడు స్టేషన్కు తరలించి లాకప్లో పెట్టారు. నల్లపాడు గుంటూరు సౌత్ సబ్డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఆ స్టేషన్లో వైఎస్సార్సీపీ శ్రేణులు అంబటిని కలవకుండా ఉండేలా ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అర్ధరాత్రి లాకప్లో నిద్రపోతున్న అంబటిని నల్లపాడు పోలీస్ స్టేషన్ పైఅంతస్తుకు పోలీసులు తీసుకువెళ్లారు. అక్కడ నల్లపాడు సీఐ వంశీధర్తోపాటు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లూ ఉన్నారని స్వయాన అంబటి రాంబాబు న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ ఇద్దరూ తనను గోడకు ఆనించి కూర్చోబెట్టి రెండు కాళ్లు చీల్చి ఇబ్బందికి గురి చేశారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పట్టాభిపురం స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లుకు సౌత్ సబ్డివిజన్లోని నల్లపాడు స్టేషన్లో ఏం పని అనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
కరకట్ట ప్యాలెస్ కిరాతకమే
సాక్షి, టాస్క్ ఫోర్స్: కరకట్ట ప్యాలెస్ కేంద్రంగానే వైఎస్సార్ సీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై దాడికి వ్యూహ రచన జరిగినట్లు స్పష్టమైంది. పెదబాబు, చినబాబు ఆదేశాల మేరకే ఓ పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేత ఈ ధ్వంస రచన చేశారని విశ్వసనీయ సమాచారం. శనివారం గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరగ్గానే.. అదే రోజు రాత్రి పొద్దుపోయాక టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతకు చినబాబు కాల్ చేసినట్లు సమాచారం. ఆ మరుసటి రోజే.. అంటే ఆదివారం జోగి రమేశ్ ఇంటిపై దాడి చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. దీంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యనేత.. విజయవాడ పశి్చమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఫతావుల్లాతోపాటు, మైనార్టీ మహిళా నేత ఆషా, గొల్లపూడికి చెందిన టీడీపీ నేతలు, విజయవాడ, మైలవరం నియోజకవర్గానికి చెందిన నేతలకు ఈ దాడి బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. దాడిలో కీలకంగా పాల్లొన్న షేక్ ఆషా, ఫతావుల్లాలిద్దరూ చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రి అనితకు బాగా తెలుసని.. దాడులు చేయడానికి రౌడీ మూకలను కూడగట్టడంలో వారిది అందెవేసిన చేయి అని సమాచారం. ముఖ్య నేతల ఆదేశాలు కావడంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెట్రో బాంబులు విసిరే వారిని ఆగమేఘాలపై రప్పించి.. దాడికి పురిగొలిపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు టీడీపీ కార్యకర్తలే బహిరంగంగా వెల్లడిస్తుండడం గమనార్హం. ‘అధికారంలో ఉన్నది మేమే.. మళ్లీ ఎన్నికలొచి్చనా గెలిచేది మేమే.. ఎలా గెలవాలో పెదబాబు, చినబాబుకు తెలుసు. అందువల్ల మాకేం భయం లేదు. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోక పోతే ఆయనకు పట్టిన గతే పడుతుంది’ అని ఆషా, ఫతావుల్లాలతోపాటు, గొల్లపూడి, మైలవరానికి చెందిన నేతలు రౌడీలను సిద్ధం చేసి దాడికి పురమాయించారు. ఈ ఇద్దరు నేతలకు ఇదివరకే ‘మీకు మంచి భవిష్యత్ ఉంటుంది. పార్టీ సూచనల మేరకు నడుచుకోండి’ అని చినబాబు దిశానిర్దేశం చేశారని.. అందువల్లే వారు, పార్టీనేతలతో కలిసి, రెచి్చపోయి ధ్వంసరచన చేసినట్లు తెలిసింది. పోలీసులకు ముందే తెలిసినా.. మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడి జరుగుతుందని ముందస్తు సమాచారం ఉన్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినట్లు స్పష్టం అవుతోంది. దాడికి వెళ్తున్న పచ్చ మూకలకు రక్షణగా పోలీసులు వెళ్లినట్లు ఘటనా స్థలంలో పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది. ఈ దాడుల స్కెచ్లో ఓ పోలీసు అధికారి కీలక భూమిక పోషించినట్లు తెలుస్తోంది. దాడులు జరుగుతున్న సమయంలో సమీప సెంటర్లో టీడీపీ నేతలతో కలిసి ఉండి , ప్రోత్సహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన విమర్శల్లో నిజం లేదని సీబీఐ సిట్ చార్జిషీట్ తేల్చడంతో డైవర్షన్ పాలిటిక్స్ల్లో భాగంగానే మాజీ మంత్రుల ఇళ్లపై దాడులకు టీడీపీ ముఖ్యనేతలు కుట్ర పన్నినట్టు స్పష్టమవుతోంది. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరుగుతున్న సమయంలో స్పందించని పోలీసులు, ప్రభుత్వం దాడుల తంతంగమం ముగిశాక తాపీగా సీఎం చంద్రబాబు నాయుడు తాను ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులను సహించబోనని, శాంతి భద్రతల విషయంలో రాజీపడబోనని నీతి వచనాలు వల్లెవేస్తూ సన్నాయి నొక్కులు నొక్కడంపై సర్వతా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరామర్శకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై కేసులు దాడులకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులుదాడులు జరిగిన తర్వాత మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి పరామర్శకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహనరావును అడ్డుకొని, అన్యాయంగా అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసి విజయవాడలోని పోలీసు స్టేషన్కు తరలించారు. అలానే బాధితుడైన మాజీ మంత్రి జోగి రమేష్ పైనా అన్యాయంగా అక్రమ కేసులు నమోదు చేయడం గమనార్హం. టీడీపీ మూకల దాడులపై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నామమాత్రం కేసులతో చేతులు దులుపుకున్నారు. -
గల్లా మాధవి దంపతులకు క్లీన్ చిట్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై చేసిన దాడిపై పోలీసులు మొక్కుబడిగా కేసు నమోదు చేశారు. అంబటిరాంబాబు ఫిర్యాదు మేరకు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.అయితే, దాడికి పాల్పడిన, పురిగొల్పిన టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుతోపాటు ముఖ్యమైన టీడీపీ నాయకుల పేర్లను తప్పించారు. అంబటిఫిర్యాదులో దాడికి పాల్పడిన ముఖ్యమైన వారి పేర్లు స్పష్టంగా పేర్కొన్నారు. అయినా టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ప్రసాద్ అలియాస్ ఇసుక బుజ్జి, మరికొందరు... అంటూ మొక్కుబడిగా కేసు నమోదు చేసి వదిలేశారు. కేసు నమోదుకు తర్జనభర్జనలు... వైఎస్సార్సీపీ లీగల్ టీం ద్వారా అంబటి రాంబాబు సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తే తర్జనభర్జనల అనంతరం రాత్రి 11.45 గంటలకు గుంటూరు పట్టాభిపురం పోలీసులు క్రైమ్ నంబర్ 43 /2026గా కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు టీడీపీ గూండాలతో వచ్చి తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేస్తే... పోలీసులు మాత్రం టీడీపీ నాయకుల వద్ద మరిన్ని మార్కులు కొట్టేసేందుకు కేసును నీరు గార్చే విధంగా సెక్షన్లు నమోదు చేశారు. ఎమ్మెల్యే మాధవి, భర్త రామచంద్రరావు పేర్లకు బదులు కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ప్రసాద్ అలియాస్ బుజ్జి మరి కొంతమంది.. అంటూ కేసు నమోదు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావులను ఏ1, ఏ–2గా కేసు నమోదు చేసే వరకూ పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు.కాగా, అంబటి ఫిర్యాదుపై నమోదు చేసిన సెక్షన్లతో తక్కువ శిక్షలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే మాధవి టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రెస్మీట్ పెట్టి అంబటి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదని, క్షమాపణ మాత్రమే కోరామని చెప్పడం గమనార్హం. అంబటి ఇంటి వద్ద పోలీసుల హైడ్రామా.. అంబటి రాంబాబు ఇంటి వద్ద మంగళవారం పోలీసులు హైడ్రామా నడిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న నేపథ్యంలో... మంగళవారం సాయంత్రం అంబటి ఇంటి వద్ద క్లూస్ టీమ్తో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యక్షమయ్యారు. టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించిన మూడు రోజుల తర్వాత వచ్చి అంబటి ఇంటి వద్ద పగిలిన కుండీలు, విరిగిపోయిన ఫర్నిచర్, ధ్వంసమైన కార్లను స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారు. దీనికి అంబటి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో తూతూ మంత్రంగా క్లూస్ టీమ్తో పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేరస్థల పరిశీలనలో కార్లు, ఫర్నిచర్, అద్దంతో కూడిన కిటికీలు ధ్వంసమైనట్లు గుర్తించామని చెప్పారు. అంబటి కార్యాలయాన్ని తగలబెట్టిన ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఇదిలా ఉండగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు, దుత్తలూరులో టీడీపీ నేతల ఫిర్యాదుల మేరకు పోలీసులు మంగళవారం మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు నమోదు చేశారు. -
ఆరోగ్యశ్రీ ఉద్యోగులూ ప్రైవేటుపరం!
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ పథకం అమలులో కీలకంగా వ్యవహరిస్తూ పేద ప్రజలకు సేవలు అందించిన వేలాది ఉద్యోగుల గుండెల్లో చంద్రబాబు ప్రభుత్వం రైళ్లు పరిగెట్టిస్తోంది. ఒకటిన్నర దశాబ్దంగా ప్రభుత్వంలో పనిచేస్తూ ఏదో ఒక రోజు ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని వారు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా విధానంలో అమలు చేయడానికి ప్రభుత్వం టెండర్ పిలిచింది. పథకం కింద సేవలు అందిస్తున్న ఆరోగ్య మిత్ర, టీం లీడర్లు, ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉద్యోగులందరినీ బీమా కంపెనీకి అప్పజెప్పేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల మంది ఆరోగ్య మిత్రలు, వంద మంది టీం లీడర్లు క్షేత్ర స్థాయిలో సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లోని ఉద్యోగులందరు కలిపి 2,500 మందికి పైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరిలో మెజారిటీ శాతం 18 ఏళ్లుగా పనిచేస్తున్న వారే ఉన్నారు. అందరిలో కలవరపాటు2019–24 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసిన వైఎస్ జగన్ సర్కారు.. ఈ పథకం అమలులో కీలకమైన ఉద్యోగులకు ఆరి్థకంగా భరోసా ఇచి్చంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో మిత్రలకు రూ.6 వేలు, టీం లీడర్లకు రూ.10,600 చొప్పున వేతనాలు ఉండేవి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2019 నవంబర్లో ఆరోగ్య మిత్రలకు రూ.12 వేలు, టీం లీడర్కు రూ.15 వేల వరకూ వేతనాలను పెంచారు. ప్రభుత్వ రంగంలో నిశ్చింతగా పని చేసుకుంటూ, ఏదో ఒక రోజు ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని కోరుకుంటున్న ఉద్యోగుల గుండెల్లో 2024లో చంద్రబాబు బీమా బాంబు పేల్చారు. ప్రీమియంలో వీలైనంత మిగుల్చుకోవాలనే లాభాపేక్షతో పనిచేసే బీమా కంపెనీల చేతుల్లో ప్రజారోగ్యాన్ని పెట్టడమే కాకుండా, 2500 మంది ఉద్యోగుల కుటుంబాలకు పొగ పెట్టడానికి సిద్ధం అయ్యారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, ఖర్చులను తగ్గించుకోవడం కోసం ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో లాభాపేక్షే పరమావధిగా పనిచేసే ప్రైవేటు బీమా కంపెనీల్లో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని చిరుద్యోగులు కలవరపాటుకు గురవుతున్నారు. -
చంద్రబాబు అస్తవ్యస్త పాలనతో ఆర్థిక విస్ఫోటనం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ఆర్థిక నిర్వహణ వైఫల్యంతోపాటు అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం దిశగా పయనిస్తోంది. రెండేళ్లు కూడా కాకుండానే రాష్ట్రాన్ని చంద్రబాబు రుణ విస్ఫోటనంలోకి నెట్టేశారు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పు తేవడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. అప్పు తెచ్చిన డబ్బులను సూపర్ సిక్స్తోపాటు ప్రజలకిచ్చిన హామీల అమలుకు ఖర్చు చేయడం లేదు. అలాగే ప్రభుత్వ ఆస్తుల కల్పనకు వ్యయం చేయడం లేదు. అప్పు తెచ్చిన సొమ్ము మొత్తం తమ జేబుల్లోకి వచ్చేలా ప్రభుత్వంలోని కీలక నేతలు మళ్లించేస్తున్నారు. చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేవలం 20 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.3,27,725 కోట్ల అప్పుల భారాన్ని మోపారు. అంటే... సగటున నెలకు రూ.16,386 కోట్లు, రోజుకు రూ.546.20 కోట్లు చొప్పున అప్పు చేస్తున్నారు. బడ్జెట్ బయట అప్పులు చేసేందుకు కొత్తగా కార్పొరేషన్లను, స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్పీవీలు) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఖజానా ఆదాయాన్ని వాటికి మళ్లించి మరీ రాజ్యాంగ సూత్రాలు, నియమావళికి విరుద్ధంగా చంద్రబాబు సర్కారు గ్యారెంటీలు ఇస్తూ అప్పుల మీద అప్పులు చేస్తోంది. సహజ సంపద అయిన గనులను తాకట్టుపెట్టడంతోపాటు మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి మరీ అప్పు చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ భూములను, వివిధ సంస్థల ఆస్తులను సైతం తాకట్టు పెట్టి దొరికిన చోటల్లా అప్పులు తీసుకుంటోంది. మళ్లీ రూ.3,300 కోట్ల అప్పుమంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ 7.71 శాతం వడ్డీతో రూ.3,300 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది. దీంతో బడ్జెట్ అప్పులే రూ.1,79,168 కోట్లకు చేరాయి. ఇవికాక బడ్జెట్ బయట అప్పులు మరో రూ.1,48,557 కోట్లకు చేరాయి. ఇందులో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో తెచ్చిన అప్పులు రూ.1,01,170 కోట్లు. రాజధాని పేరుతో చేస్తున్న అప్పులు రూ.47,387 కోట్లకు చేరాయి. దీంతో రెండేళ్లు కాకుండానే రాష్ట్రాన్ని రూ.3,27,725 కోట్ల అప్పుల ఊబిలో చంద్రబాబు సర్కారు ముంచేసింది. -
రెడ్బుక్కే రాజ్యాంగం.. నేనే ‘సుప్రీం’!
సాక్షి, అమరావతి: స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రీ, ఏ ముఖ్యమంత్రీగానీ తలపెట్టని దుస్సాహసానికి సీఎం చంద్రబాబు బరి తెగించారు! దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ రాజకీయ కుట్రకు తెగబడ్డారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ను పట్టించుకోకుండా.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని నిర్ధారిస్తూ ప్రముఖ సైంటిఫిక్ ల్యాబ్లు ఎన్డీఆర్ఐ, ఎన్డీబీ ఇచ్చిన నివేదికలను పక్కనపెట్టేసి సొంత విచారణకు సిద్ధమయ్యారు! సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ధిక్కరిస్తూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిపై మళ్లీ విచారణకు సొంత విచారణ కమిషన్ను నియమించాలని నిర్ణయించారు. తద్వారా తనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకునే కుట్రలకు తెర తీశారు. దీనిపై తాజాగా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరపగా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ స్వతంత్ర సిట్ దర్యాప్తు నివేదికను తాము పరిగణలోకి తీసుకోబోమని ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి వేదికగా ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ఈ కుతంత్రానికి తెగించారు. లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారాన్ని కొనసాగించేందుకు... రాజకీయ కక్ష సాధింపుతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులను నమోదు చేసేందుకు తమ వీర విధేయులతో విచారణకు ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కుతంత్రానికి రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం గమనార్హం. అంటే సుప్రీం కోర్టుతో తమకేమాత్రం సంబంధం లేదని... టీడీపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఓ సమాంతర న్యాయ వ్యవస్థగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు. దేశ చరిత్రలో ఓ దుస్సాంప్రదాయానికి తెరతీశారు. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేనేలేదని ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని చార్జిషీట్లో సీబీఐ సిట్ పేర్కొన్న అంశం సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ... బాబు బరితెగింపురాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం పవిత్రకు కూడా భంగం కలిస్తానని... ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తానని తాజాగా నిరూపించుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగించే కుట్రకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే తెరతీసిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ఆయన నిరాధారణ ఆరోపణలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు విభ్రాంతి చెందారు. అంతే కాదు ఈ రాజకీయ కుట్రకు అధికారిక ముద్ర వేసేందుకు టీడీపీ అనుకూల ఐపీఎస్ అధికారులతో సిట్ను నియమించారు. దీనిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసి వాస్తవాలను ప్రజలకు తెలిసేలా చేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుళ్లను అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి హితవు చెప్పింది. ఈ క్రమంలో లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యి నాణ్యతపై విచారించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసింది. ఆ స్థానంలో స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఆ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని పేర్కొంది. దాంతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరిపి తన నివేదికను ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. ఈ పరిణామాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరించడానికి తెగబడ్డారు. 2024లోనే చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ను సుప్రీంకోర్టు రద్దు చేయడం గమనార్హం. అనంతరం సీబీఐ ఆధ్వర్యంలోని స్వతంత్ర సిట్ ద్వారా దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ సిట్ ఆ కేసులో దాఖలు చేసిన చార్జ్షీట్ ఇప్పుడు నెల్లూరు న్యాయస్థానంలో ఉంది. ఇంకా కొనసాగుతున్న ఆ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. కేబినెట్ వేదికగా న్యాయధిక్కార కుట్ర...సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ను ఇతర మార్గాల ద్వారా సేకరించి న్యాయస్థానం పరిధిలోని అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించడం విస్మయపరుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై సమాంతరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. చార్జ్షీట్లోని అంశాలపై న్యాయస్థానం పరిశీలించి విచారించాలి. దానిపై ఇరువర్గాల న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలను వినిపించాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనే ‘సుప్రీం’ అన్నట్లుగా బరి తెగించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా సాగుతున్న కేసు దర్యాప్తుపై తాము ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కేబినెట్ సమావేశానికి ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్లతో సమావేశమై చార్జ్షీట్లోని అంశాలపై చర్చించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఈ సమావేశానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్చంద్ర లడ్హ ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావడం గమనార్హం. సిట్ సభ్యుడిగా ఉన్న ఓ అధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం విస్మయపరుస్తోంది. అంటే సుప్రీం కోర్టు ఆదేశాలతో నియమించిన సిట్లో సభ్యుడిగా ఉన్న ఆ అధికారి... సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించే సమావేశంలో భాగస్వామి అయ్యారు. ఆది నుంచి అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఆ అధికారి మరోసారి రాజ్యాంగబద్ధ ధర్మం కంటే తన రాజకీయ విధేయతకే పెద్ద పీట వేశారు. ఇక ఎంపిక చేసిన మంత్రులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో కూడా సీబీఐ చార్జ్షీట్లో పేర్కొన్న అంశాలపై చర్చించారు. అంతే కాదు... సీబీఐ చార్జ్షీట్లో పొందుపరిచిన అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు విభేదించారు. ఆ చార్జ్షీట్ సమగ్రంగా లేదని వారే తీర్పునిచ్చేశారు. ఈ విధంగా తాము సమాంతర న్యాయ వ్యవస్థ అన్నట్టుగా వ్యవహరించారు. సీబీఐ దర్యాప్తు, నివేదికను తాము గుర్తించబోమని పరోక్షంగా ప్రకటించారు.జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిజం చెప్పినందునే..చంద్రబాబు ప్రభుత్వం ఇంతగా బరితెగించి సుప్రీం కోర్టును ఎందుకు ధిక్కరించింది? అంటే కారణం ఒకటే... తిరుమల లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతోనే ఇంతటి దుస్సంప్రదాయానికి తెగబడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్... లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిగ్గు తేల్చింది. టీటీడీకి చెందిన నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి నెయి నమూనాలను సేకరించి దేశంలోని ప్రతిష్టాత్మకమైన హర్యానాలోని ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ), గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్డీడీబీ) ల్యాబొరేటలరీలకు పంపింది. ఆ ల్యాబరేటరీలలో పరీక్షించిన అనంతరం... ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదనే వాస్తవం నిగ్గు తేలింది. శాస్త్రీయంగా పరీక్షించిన రెండు ల్యాబొరేటరీలు సాధికారికంగా వేర్వేరు నివేదికలు ఇచ్చాయి. ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఆ రెండు నివేదికలూ స్పష్టం చేశాయి. ఆ రెండు నివేదికలను ప్రస్తావిస్తూ సీబీఐ న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు చేసింది. దాంతో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయ్యింది. జాతీయ పత్రికలు సైతం అదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. జాతీయ మీడియా చానళ్లు, డిజిటల్ మీడియా కూడా ఆ విషయాన్ని అత్యంత ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఇక రాజకీయ పార్టీలతో నిమిత్తం లేని తటస్థులు, విశ్లేషకులు కూడా లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేననిఅభిప్రాయపడ్డారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు కొత్త కుతంత్రానికి తెరతీశారు. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ కమిషన్ను నియమించాలని నిర్ణయించారు.నాడు పచ్చ సిట్.. నేడు పచ్చ కమిషన్!రాజకీయ కుట్ర కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు పంతం పట్టారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద సహాయక చర్యల్లో తన దారుణ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ దుష్ప్రచారానికి తెరతీశారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే దుష్ప్రచార కుట్రకు సీఎం హోదాలో ఆయనే నేతృత్వం వహించి ఘోర అపచారానికి పాల్పడ్డారు. శ్రీవారి ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చే కుట్రకు రాజముద్ర వేసేందుకు చంద్రబాబు యత్నించారు. అందుకే ఈ అంశంపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయులైన రాష్ట్ర పోలీసు అధికారులతో సిట్ను నియమించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన వివాదాస్పద అధికారి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్కు చీఫ్గా నియమించడం గమనార్హం. మరో వీర విధేయ అధికారి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, అప్పటి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు (ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ)లను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి ఎవరో కాదు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా నియమితుడైన రిటైర్ట్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యకు ఆయన అల్లుడు. పచ్చ సిట్ ద్వారా చంద్రబాబు కుట్రలను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దాంతో ఆ సిట్ను సుప్రీంకోర్టు రద్దుచేసి స్వతంత్ర సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. దాంతో చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని తాజాగా సీబీఐ దర్యాప్తులో వెల్లడి కావడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. ఈసారి ఈ అంశంపై దర్యాప్తునకు కమిషన్ను నియమిస్తామని ప్రకటించింది. తమ వీర విధేయులైనవారిని అందులో చైర్మన్, సభ్యులుగా నియమించి తమ దుష్ప్రచార కుట్రకు అధికారిక ముద్ర వేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని స్పష్టమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.నివేదిక ఇలా ఉండాలి.. నిందితులుగా వీళ్లే!సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ మరీ సొంత కమిషన్ ఏర్పాటుకు బరితెగించడం వెనుక చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం సుస్పష్టం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని తాము చేసిన దుష్ప్రచారాన్ని బలపరుస్తూ ఓ నివేదిక ఇప్పించుకోవాలి. అంతే కాదు తాము రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలను ఆ కేసులో నిందితులుగా చేర్చాలి. వాస్తవాలు, ల్యాబరేటరీలలో పరీక్షలు, విధి విధానాలతో నిమిత్తం లేకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా చేసేందుకే కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ విషయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో పరోక్షంగా వెల్లడించారు. ఫలానా వారిని నిందితులుగా చేర్చడానికే కమిషన్ను ఏర్పాటు చేస్తున్నామన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. ఆ కమిషన్కు అతి తక్కువ సమయమే ఇస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పడం గమనార్హం. అంటే దర్యాప్తుతో నిమిత్తం లేకుండా, వాస్తవాలను పట్టించుకోకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా నివేదిక ఇచ్చేవారినే కమిషన్ చైర్మన్, సభ్యులుగా నియమిస్తామని ప్రభుత్వం నిర్భీతిగా ప్రకటించుకున్నట్టే! అధికారంలో ఉన్నవాళ్లు తమకు నచ్చినట్టుగా నివేదికలు ఇప్పించుకుంటాం...! తమకు నచ్చనివారిపై అక్రమ కేసులు పెడతామంటే ఇక దేశంలో పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఎందుకు ఉన్నట్లని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు, వ్యవస్థలను తాము పట్టించుకోమంటూ చంద్రబాబు ప్రభుత్వం నియంతృత్వానికి తెగబడుతోందని విమర్శిస్తున్నారు. -
రేపు వైఎస్ జగన్ గుంటూరు పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(ఫిబ్రవరి 4, బుధవారం) గుంటూరులో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇల్లు, ఆఫీసుని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు.టీడీపీ గూండాలు అంబటి నివాసంపై దాడి చేసి.. ఆయన్ని, కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించి ఓదార్చనున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. -
ఎట్టకేలకు.. కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు
సాక్షి,విజయవాడ: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశాలతో అరవ శ్రీధర్పై కేసు నమోదైంది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి వచ్చింది. రైల్వే కోడూరు పోలీసులు పలు సెక్షన్ల కింద అరవ శ్రీధర్పై కేసులు నమోదు చేసింది. అరవ శ్రీధర్ తనపై ఏడాదిన్నరగా దారుణానికి ఒడిగట్టారంటూ బాధితురాలు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ తిరుపతి ఎస్పీకి ఫోన్ చేశారు. వెంటనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. NHRC ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు BNS 318(2), 318(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ‘చర్యలుండవ్’ అంటూలైంగికంగా వేధించాడని ఆధారాలతో సహా బాధితురాలు బయటకు వస్తే.. ఆ వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది జనసేన పార్టీ. ఏకంగా అసెంబ్లీ నుంచే మహిళకు వీడియో కాల్స్ చేసినట్లు విషయాన్ని ఆమె బయటపెట్టింది. అయినా కూడా ‘చర్యలుండవ్’ అంటూ బహిరంగంగా చెబుతూ కమిటీ పేరిట కాలయాపన చేస్తోంది.కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలకు జనసేన ఏమాత్రం సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. వేధింపులను బాధితురాలు నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దళిత మహిళ రోడ్డెక్కినా.. హోం మంత్రి అనిత స్పందించడం లేదు. ప్రభుత్వ ఒత్తిళ్లతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం లేదు. అందుకే ఆమె నేరుగా హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. -
‘దాడి జరిగిన వెంటనే క్లూస్ టీమ్ను ఎందుకు పంపలేదు?’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు, లోకేష్ ఆలోచనల మేరకే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారని.. ఉద్ధేశపూర్వకంగానే ఆటవిక చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు, విజయవాడ ఎంపీల నేతృత్వంలో గూండాలు, కిరాయి మనుషులు, గంజాయి బ్యాచ్ దాడి చేశారు. పెట్రోల్ బాంబ్ విసరడంలో నైపుణ్యం సాధించిన వారితో జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వందల మంది దాడికి పాల్పడ్డారు’’ పేర్ని నాని మండిపడ్డారు.‘‘అసాంఘిక శక్తులను కంట్రోల్ చేయాల్సిన పోలీసులే ఈ దాడులకు అండగా నిలిచారు. జోగి రమేష్ ఇంటిపై దాడికి నాయకత్వం వహించిన వారితో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ చర్చలు జరిపారు. టీడీపీ గూండాలు పోలీసును కిందపడేసి దాడి చేసినా వారికి పట్టడం లేదు. ట్రైన్డ్ కిరాయి మూకలే పెట్రోల్ బాంబులను విసరగలుగుతారు. మాజీ మంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటి?. ఆటవిక చర్యలకు కొందరు అధికారులు అండగా ఉండటం చూసి కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..రేపోమాపో రిటైర్ అయ్యే గుణ్ణం రామకృష్ణ ఇలా దిగజారడం బాధాకరం. జనం గుమిగూడినప్పుడు లాఠీఛార్జ్ చేయకుండా ఏం చేస్తున్నారు?. జోగి రమేష్ ఇంటి పై దాడి చేస్తామని టీడీపీ సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పోస్టులే మీకు కనిపిస్తాయా?. టీడీపీ సోషల్ మీడియా పోస్టులు మీకు కనిపించవా?. దుర్గారావు అనే ఏసీపీ నిందితులతో ముచ్చటించడమేంటి?. పోలీస్ ఉద్యోగం చేయడం మర్చిపోయారా ఏసీపీ దుర్గారావు. పెట్రోల్ బాంబులు విసిరిన వారి పై 326 సెక్షన్ ఎందుకు పెట్టలేదు?. 109 సెక్షన్ ఎందుకు పెట్టలేదు. వందల మంది దొమ్మీకి పాల్పడినందుకు 191,192 ఎందుకు పెట్టలేదు?. మారణాయుధాల సెక్షన్ ఎందుకు పెట్టలేదు?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘కేశినేని చిన్ని నాయకత్వంలోనే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశామని టీడీపీ నేతలు పోస్టులు పెట్టారు. వారిపై ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇదేనా మీ పోలీసింగ్. కేసులో లోకేష్ పేరును చేర్చాలి కదా ఎందుకు చేర్చలేదు?. దాడి జరిగిన వెంటనే క్లూస్ టీమ్ను ఎందుకు పంపించలేదు. ఒక్క పోలీస్ అధికారైనా ఘటనా స్థలాన్ని పరిశీలించాలి కదా. మీ కమిషనరేట్ పరిధిలో ఇంత పెద్ద విధ్వంసం జరిగితే మీరు రారా?. మేం చిన్న ధర్నా పెట్టుకున్నా సెక్షన్ 30 పెడతారు. ఇప్పుడెందుకు సెక్షన్ 30 అమలు కాలేదు..ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ కళ్లెదుటే అంతమంది గుమిగూడితే ఏం చేశారు?. లా అండ్ ఆర్డర్ దిగజారిపోతే మీరు కష్టపడి పాసై ఐపీఎస్ అయ్యి ఉపయోగం ఏంటి రాజశేఖర్ బాబు. మాజీ మంత్రుల ఇళ్లపై పట్టపగలు పెట్రోల్ బాంబ్లు విసిరిన పరిస్థితులు ఏపీలో ఇప్పుడే చూస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఇలా దాడులు చేయాలనుకోవడం సరికాదు. పోలీసులను నమ్ముకుని ఏ ప్రభుత్వం నడవలేదని చంద్రబాబు, లోకేష్ గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డగోలుగా వాడుకున్న మీ పరిస్థితి భవిష్యత్ లో ఎలా ఉంటుందో ఊహించారా?. చంద్రబాబు తస్మాత్ జాగ్రత్త...ఎన్నికల కోడ్ రాగానే ఇదే పోలీసులు మీతాట తీయరా. దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటే ఏడాది పాటు ఆగండి. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో అద్భుతంగా మాట్లాడతాడు. కానీ ఇప్పుడు పవన్ ఏం చేస్తున్నాడో తెలుసుగా. భయం లేనోడే మాట్లాడతాడు. వైఎస్సార్సీపీలో ఉన్నవాళ్లు పవన్ లాంటోళ్లు కాదు. బతికినా చచ్చినా షంషేర్గా ఉంటాం. ఎవడో ఏదో చేస్తాడని మేం భయపడం. వీరమరణం పొందుదామనే మేం పోరాటం చేస్తున్నాం. జగన్ ఏమవుతాడో తెలియనప్పుడే లక్షల మంది అతని వెంట నడిచారు. కష్టాన్నైనా ఆనందంగా తీసుకునేవాళ్లే జగన్ వెంట వైఎస్సార్సీపీలోకి వచ్చారు. నన్ను వేసేస్తా.. వేసేస్తా అంటున్నారు.. ఎన్నాళ్లు దాక్కుంటాం వచ్చి వేసేయండి. పేర్నినానినో.. వేరొకరో.. మరొకరో పోతే ఏమవుతుంది.. మీ పతనం మొదలవుతుంది’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
తిరుమల లడ్డూ వివాదం.. బాబు సర్కార్ మరో డ్రామా
సాక్షి, విజయవాడ: తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ మరో డ్రామాకు తెరతీసింది. సుప్రీంకోర్టు, సిట్ ఉండగా కమిటీ మరో కమిటీ వేయాలని నిర్ణయించింది. చంద్రబాబుకి వ్యతిరేకంగా సీబీఐ రిపోర్ట్ రావడంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టింది. సీబీఐ చెప్పిన నిజాలను జీర్ణించుకోలేక కొత్త కమిటీ వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు విచారణలో ఉన్న అంశంపై మరో విచారణ కమిటీ అంటూ హడావుడి చేస్తోంది.జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించగా.. సీబీఐ ఇచ్చిన నివేదిక తమకు అనుకూలంగా లేదని టీడీపీ ఫ్రస్టేషన్లో ఉంది. దీంతో సీబీఐని తప్పు పడుతూ కొద్దిరోజులుగా కుట్రపూరిత ప్రచారం చేసింది. సీబీఐ సరిగ్గా విచారించలేదంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేసింది. సీబీఐ రిపోర్ట్లో లోపాలంటూ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి తెరలేపింది. ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి తిరుమల ప్రసాదంపై టీడీపీ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టింది.దుష్ప్రచారానికి కొనసాగింపుగా మరో విచారణ కమిటీ వేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. తమ చెప్పుచేతుల్లో ఉండే అధికారులతో కమిటీ వేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. తమకు నచ్చినట్టు నివేదిక రాయించుకోవడానికి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తిరుమలపై దుష్ప్రచారం చేయాలని వ్యూహం రచిస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని చూసి న్యాయ నిపుణులు విస్తుపోతున్నారు. -
టీడీపీ గూండాలపై కేసులు పెట్టరా?
సాక్షి, రాజమహేంద్రవరం: ‘మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఆఫీస్, ఇంటిపై టీడీపీ గూండాలు దాడులు చేశారు. కార్లు, ఇల్లు ధ్వంసం చేశారు. ఆఫీస్ తగులబెట్టేశారు. అయినా వారిపై ఇప్పటికీ ఎందుకు కేసులు నమోదు చేయలేదు’ అని అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్ ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబుతో ఉపేష్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ నాయకుడు అనిల్రెడ్డి సోమవారం ములాఖత్ అయ్యారు. అనంతరం సెంట్రల్ జైలు బయట ఉపేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అంబటిపై రెండు రోజులుగా హైడ్రామా నడుస్తోంది.వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లినప్పుడు టీడీపీ గూండాలు వచ్చి రెచ్చగొట్టి ఆయనతో మాట్లాడించారు. అంబటి రాంబాబుకు 24 గంటల్లో సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త మా ఇంటిపైకి వచ్చి భయంకరంగా దాడులు చేశారు. దారుణమైన బూతులు తిట్టారు. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు కేసు పెడతారా?’ అని సీఎం చంద్రబాబును నిలదీశారు.పోలీసులు, సీఐలు వెంకటేశ్వర్లు, వంశీ అంబటిని టార్చర్ చేశారని, పెమ్మసాని చెప్పిన సినిమా చూపించడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తిరుమల ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని చంద్రబాబు, లోకేశ్ స్టేట్మెంట్లు ఇచ్చారని, డైవర్షన్ కోసమే హైడ్రామా సృష్టించారని దుయ్యబట్టారు. ‘గల్లా మాధవికి ఇల్లు లేదా? ఎల్లప్పుడూ మీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందా?’ అని హెచ్చరించారు. చంద్రబాబు కళ్లు తెరవాలి జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ధోరణితో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేసి.. తిరిగి వారి పైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలని హితవు పలికారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మాజీ సీఎం జగన్, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో తేలినా.. రాజకీయ ప్రయోజనాల కోసం ఫ్లెక్సీలు పెట్టడమేమిటని ప్రశ్నించారు. దీనిని తప్పుపట్టిన అంబటి రాంబాబు ఇంటిపై దాడులు చేయించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ‘మీరు ప్రారంభించిన సంప్రదాయాన్ని రేపు చక్రవడ్డీతో తిరిగి మీకు చెల్లిస్తాం’ అని జక్కంపూడి రాజా హెచ్చరించారు.సెంట్రల్ జైల్కు అంబటి గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబును సోమవారం వేకువజామున 3.45 గంటల సమయంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటికి స్నేహా బ్లాక్లో ఓ గది కేటాయించారు. -
సైబర్ నేరాల కట్టడికి కిల్ స్విచ్
సాక్షి, అమరావతి: సైబర్ నేర ముఠాలు బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టకుండా చెక్ పెట్టేందుకు కేంద్ర హోంశాఖ సరికొత్త కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. ఆన్లైన్, డిజిటల్, యూపీఐ చెల్లింపుల ప్రక్రియలో ‘కిల్ స్విచ్’ను ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాల బాధితుల బ్యాంకు ఖాతాల లావాదేవీలను తక్షణం నిలుపుదల చేసేందుకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. సైబర్ నేరాల కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర హోంశాఖ గత ఏడాది డిసెంబరులో ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో కేంద్ర న్యాయ, ఐటీ–టెలీ కమ్యూనికేషన్లు, వినియోగదారుల వ్యవహారాల శాఖలు, ఆర్బీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన సిఫార్సులను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమరి్పంచింది. ‘కిల్ స్విచ్’ సాధనాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు సైబర్ క్రైం నేరాలకు బీమా సౌకర్యం కలి్పంచాలని కూడా ప్రతిపాదించారు. నివేదికలోని ప్రధాన అంశాలివీ..బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపుల విధానంలో ఈ ‘కిల్ స్విచ్’ అనే బటన్ను ప్రవేశపెట్టాలని కేంద్ర హోంశాఖ కమిటీ ప్రతిపాదించింది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి సంతృప్తి వ్యక్తంచేసింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలోని బ్యాంకింగ్ యాప్లు, యూపీఐ యాప్లలో ఈ ‘కిల్ స్విచ్’ బటన్ను ఏర్పాటుచేస్తారు. డిజిటల్ అరెస్టు, ఇతర సైబర్ నేరాల బారిన పడ్డామని గుర్తించగానే ఆ ‘కిల్ స్విచ్’ బటన్ను నొక్కితే చాలు.. వారి అన్ని బ్యాంకు ఖాతాలు వెంటనే స్తంభించిపోతాయి.ఆ ఖాతాల నుంచి ఇతర ఖాతాలకు నగదు బదిలీగానీ ఇతర లావాదేవీలుగానీ సాధ్యంకాదు. దీంతో.. సైబర్ నేర ముఠాలు బెదిరింపులకు పాల్పడి సామాన్యుల బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ చేయించుకోవడానికి అడ్డుకట్ట వెయ్యొచ్చని కేంద్ర హోంశాఖ కమిటీ భావిస్తోంది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంతోపాటు సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇదే అంశంపై ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రతినిధులతో కూడా సమావేశం నిర్వహించింది. సైబర్ నేరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. బ్యాంకు ఖాతాలు ఉన్నవారు బీమా చేసుకుంటే.. సైబర్ నేరాలకు గురైతే బీమా పరిహారం పొందవచ్చు. ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ దేశంలోని జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలతో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.సుప్రీంకోర్టు ఆగ్రహంతో కేంద్ర హోంశాఖ కార్యాచరణదేశంలో సైబర్ నేర ముఠాలు 2024–25లో దేశంలో రూ.34,771 కోట్లు కొల్లగొట్టాయి. డిజిటల్ అరెస్టులని బెదిరించి వీడియో కాల్స్లో గంటల తరబడి బంధించి రూ.3 వేల కోట్లు దోచుకున్నాయి. దీంతో.. తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల కట్టడికి ఎలాంటి చర్యలు చేపడతారో చెప్పాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఫలితంగా.. కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ‘కిల్ స్విచ్’ బటన్ ఏర్పాటు, సైబర్ నేరాలకు బీమా భద్రతతోపాటు మరికొన్ని అంశాలను ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు పరిశీలన అనంతరం కేంద్ర హోంశాఖ తదుపరి కార్యాచరణ చేపడుతుంది. -
కొత్త లైనూ లేదు.. రైలూ లేదు
సాక్షి, అమరావతి: కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చక్రం తిరగలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రైల్వే బడ్జెట్లోనూ రాష్ట్రానికి ఈసారీ మొండిచెయ్యే మిగిలింది. ఆంధ్రప్రదేశ్కు రెడ్ సిగ్నల్ చూపిస్తూ కేంద్ర రైల్వే బడ్జెట్ బైపాస్లో వెళ్లిపోయింది. కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టుల సాధనలో మాత్రం చేతులెత్తేశారు. ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి సాధించలేకపోయారు. రాష్ట్రం నుంచి ఎన్డీఏకు చెందిన 21 మంది లోక్సభ సభ్యులు ఉన్నప్పటికీ రైల్వే ప్రాజెక్టుల సాధనలో పూర్తిగా విఫలమయ్యారు.2026–27 వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రూ10,134 కోట్లు కేటాయించినట్టు రైల్వే శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గత బడ్జెట్ కంటే ఇది కేవలం రూ.717 కోట్లు మాత్రమే అధికం. పెరిగిన వ్యయంతో పోలిస్తే.. ఆ నిధులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను నత్తనడకన సాగించేందుకే సరిపోతాయి. అంతేగానీ ప్రాజెక్టులను పూర్తి చేయడంగానీ.. కొత్త ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టడంకానీ సాధ్యం కాదనే విషయం స్పష్టమైంది. బడ్జెట్ కేటాయింపుల్లో కనికట్టు చేసేందుకు రైల్వే శాఖ యత్నించింది.2009–10 వార్షిక బడ్జెట్ కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించినట్టు రైల్వే శాఖ చెప్పుకోవడం విశేషం. పదేళ్ల క్రితం నాటి బడ్జెట్ కేటాయింపులతో పోలుస్తూ ప్రస్తుత బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపలేదనే విషయాన్ని మరుగుపరిచేందుకు యతి్నంచింది. బడ్జెట్ కేటాయింపులను వివరిస్తూ రైల్వే శాఖ పింక్ బుక్ విడుదల చేస్తేనే కొంత స్పష్టత వస్తుంది. పాత పాటే.. కొత్తగా పాడి.. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో రైల్వే శాఖ ఎలాంటి ప్రకటనా చేయలేదు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి అమృత్ భారత్ పథకం కింద ఆ 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు మూడేళ్ల క్రితమే రూ.3,418 కోట్ల వ్యయంతో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి.సూళ్లూరుపేట, రాయనపాడు (విజయవాడ శివారు), కాకినాడ టౌన్, మంగళగిరి, తుని రైల్వేస్టేషన్ల పనులు పూర్తయ్యాయి. ఆ విషయాన్నే రైల్వే శాఖ కనికట్టు చేసేందుకు యత్నించింది. 2014 నుంచి రాష్ట్రంలో 1,700 కి.మీ. మేర రైల్వే ట్రాక్లను నిర్మించినట్టు తెలిపింది. కవచ్ ప్రాజె క్టు కింద గతంలోనే ఆమోదించిన 3,137 కి.మీ. పను ల్లో 130 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మరో 2,507 కి.మీ. పనులు కొనసాగుతున్నాయని వెల్లడించింది.కొత్త రైళ్లు లేవు ⇒ రాష్ట్రానికి కొత్త రైళ్ల కేటాయింపులోనూ రెడ్ సిగ్నలే చూపించింది. ఒక్క కొత్త రైలు కూడా వేయలేదు. రాష్ట్రం మీదుగా ఇప్పటికే నాలుగు వందే భారత్ రైళ్లు, 4 అమృత్ భారత్ రైళ్లు నిర్వహిస్తున్న విషయాన్నే రైల్వే శాఖ ప్రస్తావించింది. అంటే కొత్త రైళ్లు కేటాయించడం లేదని తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టులు ప్రశ్నార్థకమే ⇒ రాష్ట్రంలో ఇతర కీలక రైల్వే లైన్ల నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో నత్తనడకను తలపిస్తున్న ఆ లైన్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందన్నది అగమ్యగోచరంగా మారింది. ⇒ కాకినాడ–పిఠాపురం, మాచర్ల–నల్గొండ, కంభం–ప్రొద్దుటూరు, గూడూరు–దుగరాజపట్నం, కొండపల్లి–కొత్తగూడెం, భద్రాచలం–కొవ్వూరు, జగ్గయ్యపేట–మేళ్లచెరువు రైల్వే లైన్లకు నిధుల కేటాయింపుపై కేంద్రం చిత్తశుద్ధి చూపించలేదు. ⇒అమరావతి రైల్వే లైన్ గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నది సుస్పష్టం. రూ.2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదించినట్టు 2024 అక్టోబర్లో ప్రకటించినా నిధుల కేటాయింపుపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ⇒ అత్యంత కీలకమైన కడప–బెంగళూరు (255 కి.మీ.) రైల్వే లైన్పై కూడా కేంద్ర ప్రభుత్వం మొహం చాటేసింది. ⇒ కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, డోన్–అంకోలా రైల్వే లైన్ల గురించి కూడా పట్టించుకోలేదు.కొత్త డిమాండ్లు బేఖాతరు కొత్త ప్రాజెక్టును కూడా కేంద్రం పరిశీలించలేదు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనప్పటికీ ప్రతిపాదనల దశలోనే మగ్గిపోవాల్సిన అనివార్యత ఏర్పడిన ప్రాజెక్టులు ఇవీ.. ⇒ విజయవాడ–ఖరగ్పూర్, విజయవాడ–నాగ్పూర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు ⇒ తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు ⇒ విజయవాడ–గూడూరు మధ్య నాలుగో లైన్ నిర్మాణం ⇒ కడప–బెంగళూరు రైల్వేలైన్ అలైన్మెంట్ మార్పు -
ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయండి
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారుల నుంచి స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత అదనంగా వసూలు చేసిన చార్జీలను వెనక్కి ఇచ్చేయాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) ఆదేశించింది. ఇకపై కెపాసిటర్లు ఎన్ని ఉన్నా లోడ్కి ఎన్ని అవసరమో వాటినే విద్యుత్ బిల్లు వేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. విద్యుత్ పంపిణీ రంగంలో సామర్థ్యం, పారదర్శకత, విశ్వసనీయతను మెరుగుపరచడానికి ఆధునిక మీటరింగ్ సాంకేతిక పరిజ్ఞానాలకు మద్దతు ఇస్తూనే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని కమిషన్ స్పష్టం చేసింది. మేం కట్టలేం ‘‘స్మార్ట్ మీటర్లు పెడతామని ఎవరైనా వస్తే వాటిని పగలగొట్టండి అని ఎన్నికల ముందు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం, అవవసరమైతే తగ్గిస్తాం అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వినియోగదారుల సమ్మతితోనే విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటూ మాట మాచ్చారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టుకోకపోతే ఉన్న సర్వీసులు తొలగిస్తామంటూ నోటీసులు ఇస్తున్నారు. వీటికి తోడు ప్రజలపై దాదాపు రూ.20 వేల కోట్లకుపైగా విద్యుత్ చార్జీల భారం మోపారు.స్మార్ట్ మీటర్లు పెట్టడంతో విద్యుత్ బిల్లులు రెండు, మూడింతలు పెరిగిపోయాయి. ఇలా అయితే మేమెలా బిల్లులు కట్టాలి ? వినియోగించని విద్యుత్కు చార్జీలు ఎందుకు చెల్లించాలి.’’ అంటూ విద్యుత్ వినియోగదారులు ఏపీఈఆర్సీకి ఇటీవల మొర పెట్టుకున్నారు. బహిరంగ విచారణలో, ఈమెయిళ్ల ద్వారా, నేరుగానూ తమ సమస్యలను మండలికి చెప్పుకున్నారు. అందుకే ఎక్కువ బిల్లు వినియోగదారుల ఆందోళనను సీరియస్గా తీసుకున్న మండలి ఈ సమస్యకు తమ వంతు పరిష్కారాన్ని అన్వేషించింది. పాత ఎలక్ట్రోమెకానికల్, స్టాటిక్ మీటర్లతో పోలిస్తే కొంతమంది వినియోగదారులకు అధిక విద్యుత్ బిల్లులు వచ్చాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో మూడు సూచనలతో సోమవారం ఆదేశాలు జారీ చేసింది. లో టెన్షన్ (ఎల్టీ) విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లు అమర్చిన తర్వాత విద్యుత్ బిల్లులు భారీగా పెరిగాయి. దీనికి కెపాసిటర్లు కారణమంటూ ఏపీఈఆర్సీకి డిస్కంలు వెల్లడించాయి. వినియోగదారులు అవసరమైన దానికంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న కెపాసిటర్లను పెట్టుకోవడం వల్ల స్మార్ట్ మీటర్లు అదనపు లోడ్కి తగ్గట్టుగా యూనిట్లు లెక్కిస్తున్నాయని వివరించాయి. ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత వినియోగదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ మీటరింగ్ ప్రోగ్రామ్కు అనుకూలమైన వాతావరణం కల్పించాల్సి ఉందని భావించినట్లు ఏపీ ఈఆర్సీ వెల్లడించింది.ఏపీఈఆర్సీ ఆదేశాలు ఇవీ ⇒ స్మార్ట్ మీటర్లలో కెపాసిటర్ల ఆధారంగా బిల్లు లెక్కింపు విధానం ఉండాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు నిలిపివేస్తున్నట్లు మండలి తెలిపింది.⇒ స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత లీడింగ్ రియాక్టివ్ ఎనర్జీ (కెపాసిటర్) కారణంగా వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన అదనపు బిల్లులను ఉపసంహరించుకోవాలని డిస్కంలను ఆదేశించింది.⇒ అలా వసూలు చేసిన అదనపు మొత్తాలను సంబంధిత వినియోగదారులకు తర్వాతి నెలల విద్యుత్ వినియోగ బిల్లులలో సర్దుబాటు చేయాలని సూచించింది. -
ఏపీలో అరాచక పాలన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను ఎండగట్టారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసి తగులబెట్టారని ఆరోపించారు. వందల మంది తమ పార్టీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని, ఇళ్లను దహనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు మద్దతుగా ఉందన్న ధీమాతోనే చంద్రబాబు ప్రభుత్వం ఇంతటి అరాచకానికి తెగబడుతోందని విమర్శించారు. ఏపీలో కనీసం ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రిని కోరారు. రైతులకు తీరని అన్యాయం.. పీఎం కిసాన్ను పెంచండి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిందని మండిపడ్డారు. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, 2019 నుంచి రైతులకు ఇస్తున్న రూ.6 వేలు ’పీఎం కిసాన్’ సాయం ఏమాత్రం సరిపోవడం లేదని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కనీసం రూ.9 వేలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బాబు మోసం.. పథకాలన్నీ బంద్! గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందించి ఆదుకుందని, కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల్లో రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు మొండి చేయి చూపించారని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రీమియం చెల్లించి అమలు చేసిన ’ఉచిత పంటల బీమా’ పథకాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని, దీనివల్ల 74 శాతం మంది రైతులు బీమా అర్హత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్న, సన్నకారు రైతులకు వరంలా ఉన్న ఉచిత బోరు బావుల పథకాన్ని కూడా నిలిపివేశారని, పాడి రైతులకు ఇచ్చే లీటరుకు రూ.4 బోనస్ను, కోల్డ్ స్టోరేజీల సబ్సిడీలను ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు (పీపీపీ మోడల్) చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దీనిపై కోటి సంతకాలతో గవర్నర్కు వినతిపత్రం ఇచ్చామని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని ప్రైవేటీకరణను ఆపాలను పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. -
ఖజానాకు గండికొట్టి.. పచ్చజేబులు నింపుకొంటూ..
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కల్తీ, అక్రమ మద్యం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లను, బెల్టుషాపులను టీడీపీ సిండికేట్, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నడుపుతున్నారు. ఈ కల్తీ, నకిలీ మద్యం పచ్చ నేతల జేబులు నింపుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. దీనికితోడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా మందుబాబుల ఆరోగ్యం క్షీణించడంతోపాటు రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతోంది.అదే సమయంలో పచ్చ చొక్కాల జేబులు మాత్రం కాసులతో ఫుల్గా నిండుతున్నాయి. గతంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ప్రభుత్వ ఖజానాకు ఎక్సైజ్ రాబడి ఏకంగా 13 శాతం క్షీణించడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతుల సమావేశంలో స్వయంగా ఆర్థిక శాఖ ప్రజెంటేషన్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.అంతే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఎక్సైజ్ రాబడి పెరుగుతుండగా అందుకు పూర్తి విరుద్ధంగా రాష్ట్రంలో మద్యం ఆదాయం తగ్గిపోతోందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎక్సైజ్ రాబడులు ఝార్ఖండ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో భారీ వృద్ధి సాధించగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్సైజ్ ఆదాయం తిరోగమనంలో ఉంది. ‘పెద్దల’ మనసెరిగి.. ఎక్సైజ్శాఖ మౌనం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరగకపోగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం పచ్చబాబులు కల్తీ, అక్రమ మద్యం యథేచ్ఛగా విక్రయించి సొమ్ము చేసుకోవడమేనని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పడం గమనార్హం. అయితే అక్రమ మద్యం తయారీ విషయం ఎక్సైజ్ శాఖలోని కీలక అధికారులకు తెలిసినప్పటికీ ప్రభుత్వ పెద్దల మనసెరిగి మౌనం వహిస్తున్నారనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఎక్సైజ్ ద్వారా రాబడి రూ.14,380 కోట్లుండగా ఈ ఆర్థిక ఏడాది (2025–26) ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎక్సైజ్ రాబడి రూ.13,114 కోట్లే వచ్చింది. అంటే రూ.1266 కోట్ల మేర ఖజానాకు గండిపడింది. ఈ మొత్తం పచ్చ బాబుల జేబుల్లోకి వెళ్లినట్లేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.అలాగే జీఎస్టీ రాబడులు కూడా పొరుగు రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో తక్కువగా ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రజెంటేషన్లో స్పష్టం చేసింది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జీఎస్టీ రాబడులు బీహార్, కర్ణాటక, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వృద్ధి నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం 0.04 శాతం క్షీణత నెలకొందని ఆర్థిక శాఖ పేర్కొంది. -
జంగిల్రాజ్పై జనాగ్రహం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో జంగిల్రాజ్ అరాచకాలను... అధికార మదంతో టీడీపీ గూండాలు, అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంస కాండను... తమ పార్టీ నేతలపై టీడీపీ గూండాలు, పచ్చ మూకలు చేస్తున్న దాడులను, చంద్రబాబు ప్రభుత్వ అక్రమ అరెస్టులను వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ గూండాల చేతిలో హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని బుధవారం పరామర్శించనున్నారు. అలాగే టీడీపీ పచ్చ మూకలు శుక్రవారం నిప్పు పెట్టిన జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై టీడీపీ మూక దాడులపై మండిపడ్డారు. జంగిల్ రాజ్యాధిపతి చంద్రబాబు అరాచకాలు, ఆ పార్టీ నేతల గూండాగిరిని జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడంతోపాటు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇంకోవైపు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అరాచకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్లపై జరిగిన దాడులను ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కాపు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు బీసీ, ప్రజా సంఘాలు, కాపు నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. వెంటనే చంద్రబాబు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ.. టీడీపీ జంగిల్రాజ్కు వ్యతిరేకంగా, తిరుమల లడ్డూపై పచ్చ మూక చేస్తున్న దు్రష్పచారానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, బీసీ నేతలు నిరసనకు దిగారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో సాగిస్తున్న అసత్య ప్రచారం... బాబు అబద్ధాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణకు సోమవారం వినతిపత్రమిచ్చారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ సిట్ నివేదిక ఇచ్చినా ఇంకా టీడీపీ నేతలు అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ దు్రష్పచారం సాగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నెల్లూరు నగరంలోని వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. కర్నూలు, నంద్యాలలో టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ వీరా నాయక్కు పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వారం రోజులుగా ఆటవిక, రాక్షస పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వ పాలన ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ విమర్శించారు. దాడులు అరికట్టాలని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఒంగోలులో ఇన్చార్జి చుండూరి రవిబాబు, కనిగిరిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు నిరసనగా సోమవారం అనంతపురం జిల్లా పరిషత్ ప్రాంగణంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులతో అరాచకం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, తదితరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతకుముందు నేతలు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రెడ్బుక్ పాలనే... ప్రజా పాలన లేదుతిరుపతిలో జ్యోతిరావ్పూలే విగ్రహం వద్ద బీసీ సంఘ నాయకులు ఆందోళన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షతో రెడ్బుక్ పాలనే తప్ప, ప్రజా పాలన సాగించడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు తొండమల్ల పుల్లయ్య, జిల్లా అధ్యక్షులు చిన్నియాదవ్, వాసుయాదవ్ ఆరోపించారు. మాజీ మంత్రులు జోగి రమేశ్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలు చేసిన దాడులను ఖండిస్తూ సోమవారం తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్పూలే విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా రాజకీయ కక్షలు మానడంలేదని, రెడ్బుక్ పాలన సాగిస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు సీబీఐ నివేదికతో పటాపంచలయ్యాయన్నారు. అందువల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. -
రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’ చేశారు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ చేశారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దుర్మార్గాలను జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలు సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్టీ స్టేట్ కో– ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు భేటీ అయ్యారు. రెండున్నర గంటలు జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు, అంబటిపై హత్యాయత్నం ఘటనలపై చర్చ జరిగింది.చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయని నేతలు అన్నారు. చంద్రబాబు దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాష్ట్రంలో పరిణామాలను జాతీయ స్థాయికీ తీసుకెళ్లాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారి భక్తుల మనసులను చంద్రబాబు గాయపర్చారని, ఆయనకు ఏ మాత్రమైనా పాపభీతి ఉంటే వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తప్పులను ప్రశి్నస్తున్నందుకే వైఎస్సార్సీపీ నేతలపైన కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు. మూడు రోజుల్లో ముగ్గురు మాజీ మంత్రులు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేశారని, అంబటి రాంబాబుపై ఏకంగా హత్యాయత్నం చేశారని, ఇవి చాలా దారుణ ఘటనలని అన్నారు.ఇలా దాడులతో భయపెడితే ఎవ్వరూ ప్రశ్నించరని చంద్రబాబు అనుకుంటున్నారని, కానీ, అది ఆయన అవివేకమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు పూర్తిగా దెబ్బతీశారన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని తెలిపారు. రక్షణ కోసం పార్టీ నాయకులు గంటల తరబడి ఫోన్లు చేసినా పోలీసు అధికారులు స్పందించకపోవడం ఆ వ్యవస్థ దిగజారిపోయిందనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇక సామాన్యులకు ఏం రక్షణ కల్పిస్తారని, పైగా బాధితులపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు.అంబటి రాంబాబు ఇంటిపై ఆ స్థాయిలో దాడి జరిగినా, ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని నేతలు మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, మేరుగు నాగార్జున, కారుమూరు నాగేశ్వరరావు, మాజీ ఎంపీ మార్గాని భరత్, నేతలు కరణం ధర్మశ్రీ, దేవినేని అవినా‹Ù, పూనూరు గౌతమ్ రెడ్డి, వరికూటి అశోక్ బాబు, దూలం నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, నూరి ఫాతిమ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్షి్మ, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్ పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యనేతలు ఏమన్నారంటే.. ఇంతటి దుర్మార్గాలు ఎప్పుడూ చూడలేదు : బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలు నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాజకీయంగా ప్రశ్నించే వారిపై చంద్రబాబు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఎవరో ఏదో చేస్తారని భయపడే రోజులు లేవు. అలా భయపడే వారెవరూ ఇక్కడ లేరు. ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు చేపడతాం. పెట్రోలు బాంబులు వేయడం అనే విష సంస్కృతిని చంద్రబాబు మళ్లీ తెచ్చారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలను దేశమంతా తప్పుపడుతోంది. క్షమాపణ చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు బాబు అరాచకాలు ఢిల్లీలో ఎండగడతాం : సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు విడతలవారీగా ఐదున్నర గంటల పాటు దాడులకు తెగబడ్డారంటే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారో అర్థం అవుతోంది. మరుసటి రోజే జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే గంటల తరబడి దాడులు జరగడం శృతి మించిన అరాచకాలకు నిదర్శనం. తిరుమల లడ్డూ విషయంలో అబద్ధాలు రుద్దడంలో ఫెయిల్ కావడంతో, డైవర్షన్ కోసం ఇలా అడ్డదారిలో బరి తెగించారు. ఇవన్నీ ఢిల్లీలో ఎండగడతాం. కేంద్ర హోం శాఖ దృష్టికి కూడా తీసుకెళ్తాం.ప్రభుత్వ దుర్మార్గాలపై పార్టీ నాయకులంతా ఒక్కటై పోరాడతారు. విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడుపై దాడుల ఘటనల్లోనూ పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీటన్నింటిపై కోర్టుల్లో దావా వేస్తాం. జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్చార్సీ) దృష్టికి కూడా తీసుకెళ్తాం. లడ్డూ విషయంలో చంద్రబాబు క్షమాపణ చెప్పేవరకు వదిలి పెట్టేది లేదు. ఫ్లెక్సీలపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు మంగళవారమూ కొనసాగుతాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన బాబు: కారుమూరు నాగేశ్వరరావు చంద్రబాబు మానవ హక్కులు హరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి పోస్టర్లు వేస్తూ, జంతు కొవ్వు కలిసిందని వారు చేసిన ఆరోపణలు నిజమని నమ్మించే కుట్రలు చేస్తున్నారు. తిట్టకపోయినా తిట్టారనే రకం చంద్రబాబు: గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి, రోడ్డుపై వెళ్తుంటే టీడీపీ క్యాడర్ రెచ్చగొట్టిందని, ఆ ఇన్సిడెంట్లో అలా మాట్లాడకుండా ఉండాల్సిందని రాంబాబు ఒప్పుకున్నా టీడీపీ దౌర్జన్యం చేసింది. ఏమీ తిట్టకపోయినా తనను తిట్టారంటూ రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడులు: మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వ తప్పిదాలు, అరాచకాలు, అవినీతిపై గట్టిగా ప్రశ్నించే వారు ఎప్పుడు దొరుకుతారా అని చంద్రబాబు, లోకేశ్ ఎదురు చూస్తున్నారు. మా పార్టీ క్యాడర్ను భయపెట్టాలనే లోకేశ్ పన్నాగం పన్నారు. అయినా మేమంతా చాలా ధైర్యంగా నిలబడ్డాం. ఇంకా నిలబడతాం. -
బాబు కుతంత్రం.. సీబీఐ తేల్చినా.. తప్పుడు ప్రచారమే!
సాక్షి, అమరావతి: బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు బరి తెగించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ దారుణమైన ఆరోపణలు చేశారు. ఇందులో ఏమాత్రం నిజం లేదని ప్రఖ్యాత ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు నిర్వహించిన పరీక్షల్లో నిర్థారణ కావడం.. సాక్షాత్తూ సీబీఐ కూడా దర్యాప్తులో అదే విషయాన్ని తేల్చి న్యాయస్థానానికి నివేదించడంతో దిక్కు తోచని చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్డీడీబీ) పరీక్షల్లో నిర్ధారణ అయినట్టు చంద్రబాబు చెబుతుండటం విస్తుగొలుపుతోంది. తన రాజకీయ స్వార్థం కోసం ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి తెగబడుతున్నారు.టీటీడీ నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేదని నిర్థారిస్తూ 2025 మార్చి 27న ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక ఇవ్వగా.. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీ 2025 మే 16న రిపోర్టు ఇచ్చింది. అదే విషయాన్ని తన దర్యాప్తులో నిర్థారిస్తూ, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని పేర్కొంటూ సీబీఐ ఈ ఏడాది జనవరి 23న న్యాయస్థానంలో చార్జిషీట్ను సమర్పించింది. అయినా సరే.. ఏమాత్రం పాపభీతి లేకుండా.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ సాహసించని రీతిలో చంద్రబాబు మళ్లీ అవే అబద్ధాలాడుతున్నారు. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ నియమించిన సిట్ తేల్చిచెప్పినా... లెక్క చేయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.చేసిన పాపానికి క్షమాపణలు చెప్పి చెంపలు వేసుకోవాల్సిందిపోయి రాజకీయ కుట్రలతో చంద్రబాబు మరింత దిగజారి వ్యవహరిస్తుండటం పట్ల శ్రీవారి భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హైందవ ధర్మం, కలియుగ దైవం తిరుమల శ్రీవారి పట్ల ఏమాత్రం భయభక్తులు లేకుండా చంద్రబాబు అసత్యాలు వల్లిస్తుండటం.. లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేందుకు కుతంత్రాలకు పాల్పడటం పట్ల కన్నెర్ర చేస్తున్నారు. ఈ దారుణమైన అబద్ధాలు, నిందలను ప్రశ్నిస్తున్న వారిపై పోలీసుల సమక్షంలోనే దాడులకు పురిగొల్పుతూ ప్రభుత్వ పెద్దలు జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారు. ఈ అరాచకాలను స్వయంగా పర్యవేక్షిస్తూ కుట్రలకు పదును పెడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. సీబీఐ తేల్చిచెప్పినా అదే కుట్రా బాబూ! ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యా»ొరేటరీల్లో తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, గొడ్డు, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ తన చార్జిషిట్లో స్పష్టం చేసింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలె్రస్టాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ లేదని అంటే.. జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్టేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయాలను జాతీయ మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించింది.రాజకీయ స్వార్థంతోనే చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేశారన్నది జాతీయ స్థాయిలో స్పష్టమైంది. అయితే ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే నిరూపిస్తున్నారు. అందుకు తిరుమల లడ్డూ ప్రసాదంపై చేస్తున్న దుష్ప్రచారమే తాజా తార్కాణం. 2024 అక్టోబర్లో మొదలు పెట్టిన ఈ కుతంత్రాన్ని ఏడాదిన్నరగా కొనసాగిస్తుండటం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం. అందుకే వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఈ కేసు విచారణను చేపట్టింది. వేర్వేరు ట్యాంకర్ల నుంచి సేకరించిన నెయ్యి శాంపిళ్లను హర్యానాలోని ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ)లో ల్యాబరేటరీకి పంపించి పరీక్షించింది. ఆ నెయ్యిలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదని ఆ పరీక్షల్లో వెల్లడైంది. ఈమేరకు శాస్త్రీయంగా విశ్లేíÙంచి ఎన్డీఆర్ఐ 2025 మే 16న సాధికారికంగా వెల్లడించిన ఆ నివేదికనే సీబీఐ నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్షిట్లో స్పష్టంగా పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్’ను పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ చంద్రబాబు కుట్రలడ్డూ ప్రసాదంపై తమ దు్రష్పచారం బెడిసికొట్టడంతో చంద్రబాబు కంగు తిన్నారు. దాంతో రెండు రోజుల పాటు మౌనంగా ఉన్న ఆయన మళ్లీ అదే కుట్రను పదును పెట్టడం గమనార్హం. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ నివేదిక వెల్లడించడంతోనే తాను అలా మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు. తద్వారా ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ దు్రష్పచార కుట్రకు తెగబడుతున్నారు. వాస్తవానికి నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలసి ఉండొచ్చని ఎన్డీడీబీ నివేదిక అభిప్రాయపడింది. అంటే మొక్కల నుంచి వచ్చే వెజిటబుల్ ఫ్యాట్నే ఫారిన్ ఫ్యాట్ అని కూడా చెబుతూ నివేదికలో అభిప్రాయపడింది. అది సర్వసాధారణ అంశమే. పశువులు తినే మొక్కలు, దాణాను బట్టి అది ఆధారపడి ఉంటుందని ఆహార శాస్త్ర నిపుణులే చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.కానీ చంద్రబాబు మాత్రం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే టీటీడీ నెయ్యిపై దు్రష్పచారం కొనసాగిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతు, చేప కొవ్వు కలిపే అవకాశం లేనే లేదని గుజరాత్లోని ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైంది. అదే విషయాన్ని 2025 మార్చి 27న సీబీఐకి నివేదించింది. సీబీఐ ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషిట్లోనూ అదే విషయాన్ని స్పష్టంగా పొందుపరిచింది. టీటీడీ నెయ్యిలో జంతు, చేప కొవ్వు కలిసే అవకాశమే లేదని చార్జీషిట్లోని 208వ పేజీలో పేర్కొంది. అయినాసరే చంద్రబాబు ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్పచ్రార కుట్రలను కొనసాగిస్తున్నారు. ఎన్డీడీబీ చెప్పని విషయాలను చెప్పినట్లుగా పదేపదే విష ప్రచారం చేస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. అదే నిజమైతే సీబీఐ ప్రస్తావించేది కదా! లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ నివేదిక వెల్లడించి ఉంటే... సీబీఐ తన చార్జ్షిట్లో ఆ విషయాన్ని ప్రస్తావించేది కదా అని నిపుణులు చెబుతున్నారు. కానీ 219 పేజీల చార్జ్షిట్లో సీబీఐ ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. ఎన్డీడీబీ నివేదిక గురించి కూడా చార్జ్షిట్లో ప్రస్తావించింది.. కానీ టీటీడీ నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైనట్టు ఎక్కడా పేర్కొననే లేదు. అదే సమయంలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ ఇచ్చిన నివేదికనే సీబీఐ తన చార్జ్షిట్లో ప్రముఖంగా పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ జంతు కొవ్వు కలవలేదన్న వాస్తవాన్ని అంగీకరించేందుకు చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా ఏమాత్రం ఇష్టపడటం లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. -
అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను కలవనున్నారు. బుధవారం అంబటి రాంబాబు కుటుంబాన్ని, శుక్రవారం జోగి రమేష్ కుటుంబాన్ని కలిసి పరామర్శించనున్నారు. ఇటీవల అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాలు దాడి చేసి నిప్పు పెట్టిన ఘటన పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలతో చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ ఈ పరామర్శలు చేయనున్నారు. -
అప్పుడు శ్యామలరావు.. ఇప్పుడు సింఘాల్
సాక్షి, అమరావతి/తిరుపతి, అన్నమయ్య సర్కిల్: తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎలాంటి జంతు కొవ్వులేదని, తిరుమల ప్రసాదానికి మహాపచారం జరగలేదని సీబీఐ సిట్ తేల్చిచెప్పడంతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటూ అభాసుపాలవుతున్న సీఎం చంద్రబాబు తాము ఇప్పటివరకు చేసిన దుష్ప్రచారాన్ని నిజమని యావత్ భక్తకోటిని నమ్మించేందుకు ఆయన ఐఏఎస్ అధికారులను బలితీసుకుంటున్నారు. మొన్న టీటీడీ ఈఓ శ్యామలరావు అయితే.. తాజాగా ఆదివారం అనిల్కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు.ఇలా ఐదు నెలల వ్యవధిలోనే ఆయన ఇద్దరు టీటీడీ ఈఓలపై వేటు వేశారు. దీంతో.. తన రాజకీయ కుతంత్రాలకు చంద్రబాబు టీటీడీని వాడుకుంటూ ఐఏఎస్ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, సింఘాల్ బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం ఆదివారం హడావుడిగా జారీచేసింది. ఆయన వెంటనే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో ప్రస్తుతం సీఎం స్పెషల్ సీఎస్గా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈఓగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో ప్రభుత్వం నియమించింది. తమ ఆరోపణలు నిజమని నమ్మబలికేందుకే..19 నెలల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే టీటీడీ ఈఓగా శ్యామలరావును నియమించారు. అప్పట్లో.. అధికారికంగా ఏ విచారణ జరగకుండానే చంద్రబాబు ‘తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపార’ని వ్యాఖ్యానించి రాజకీయ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే ఆ ప్రసాదంలో కల్తీ జరిగిందని విషప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ, సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ విచారణానంతరం తిరుమల లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని నిర్థారించింది.దీంతో.. అప్పట్లో చంద్రబాబు, పవన్కళ్యాణ్ తదితరులు లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు కలిపారంటూ అడ్డగోలుగా చేసిన ఆరోపణలను నిజమని ఎలాగైనా నిరూపించేందుకే అప్పుడు శ్యామలరావును.. ఇప్పుడు అనిల్కుమార్ సింఘాల్ను బదిలీ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇక సాధారణంగా ఒకరి స్థానంలో మరొకరిని నియమించినప్పుడు కొత్తగా వచ్చే అధికారి వచ్చాక ఆయనకు బాధ్యతలు అప్పగించడం పరిపాటి. కానీ, సింఘాల్ను ఉన్నపళంగా తప్పుకుని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించి ఆయన్ను ఘోరంగా అవమానించింది. రాజకీయ లబ్ధికోసమే అనిల్కుమార్ సింఘాల్ను వాడుకుని, ఇప్పుడు పక్కకు తోసేశారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.బాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే తిరుమల లక్ష్యంగా..2024 జూన్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రత అనే సాకుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై గురిపెట్టింది. తిరుమల పవిత్రతను పట్టించుకోనందున అక్కడి పరిస్థితులను చక్కబెట్టేందుకు టీటీడీ ఈఓగా శ్యామలరావును నియమిస్తున్నట్లు అప్పట్లో ప్రభుత్వ పెద్దలు పలుమార్లు ప్రకటించారు.అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 జూలై 6న, జూలై 12న తిరుమలకు సరఫరా అయిన నెయ్యి టీటీడీ ప్రమాణాలకు తగ్గట్లుగా లేకపోవడంతో అధికారుల స్థాయిలోనే వాటిని వెనక్కు పంపడానికి సిద్ధంచేశారు. ఆ శాంపిళ్లను పరీక్షించేందుకు టీటీడీ చరిత్రలో తొలిసారి గుజరాత్లోని ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు)కి పంపారు. జూలై 23న ఎన్డీడీబీ తన నివేదికలో నెయ్యిలో కల్తీ ఉందని వెల్లడించింది. దాంతో.. ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు.అలా నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీకి షోకాజ్ నోటీసు కూడా ఇచ్చారు. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా, రెండు నెలల తర్వాత 2024 సెప్టెంబరు 18న ఎమ్మెల్యేల సమావేశంలో ‘శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదానికి నాసిరకం పదార్థాలు వాడారు.. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది’ అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం పెను దుమారం రేపుతూనే ఉంది. బాబు వ్యాఖ్యలకు భిన్నంగా శ్యామలరావు ప్రకటనతో..అయితే, 2024 జూలై 23నే నాటి టీటీడీ ఈఓ శ్యామలరావు చంద్రబాబు వ్యాఖ్యలకు భిన్నంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నెయ్యి శాంపిళ్లలో కల్తీ ఉందని తేలింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్.. అంటే వనస్పతి కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్ను బ్లాక్లిస్ట్లో పెట్టేందుకు నోటీసులిచ్చి రెండు ట్యాంకర్లను రిజెక్ట్ చేశాం’.. అని వెల్లడించారు. ఆ తర్వాత.. 2024 సెప్టెంబరు 18 నాటి చంద్రబాబు ప్రకటన తర్వాత సెప్టెంబరు 20న శ్యామలరావు మరోసారి జంతు కొవ్వు కలిపారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు భిన్నంగా ‘అడల్ట్రేటెడ్ నెయ్యి అని తేలిన నాలుగు ట్యాంకర్లను పక్కన పెట్టాం.రిపోర్టు వచ్చిన తర్వాత వాడాలని నిర్ణయించాం. రిపోర్టు క్లియర్ కాకపోవడంతో వాటిని రిజెక్టు చేశాం. వాటిని తిప్పి పంపించేశాం, సరఫరా నిలిపివేశాం’ అని ప్రకటించి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. దీంతో.. అప్పటికప్పుడు ఆయనను బదిలీచేస్తే విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించిన చంద్రబాబు సర్కారు దాదాపు ఏడాది తర్వాత 2025 సెప్టెంబరులో ఆయనపై బదిలీ వేటువేసింది. ఇప్పుడు సీబీఐ సిట్ నివేదికతో ఉక్కిరిబిక్కిరి అవుతూ తమ ఆరోపణలను నిజమని ఎలాగైనా నమ్మించాలని అనిల్కుమార్ సింఘాల్ను బలిచేసింది. -
కొనసాగుతున్న జంగిల్రాజ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో జంగిల్ రాజ్ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పలేక ఆటవిక పాలనను ఎంచుకున్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబుదే తప్పు అన్న విషయం సీబీఐ సిట్ సాక్షిగా బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిలో చులకనై, వారి దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తన రౌడీలను పురమాయిస్తున్నారు. శనివారం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గూండాల దాడిని మరచిపోక ముందే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై విధ్వంసానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెట్రోల్ బాంబులతో బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, టీడీపీ మూకలు రమేష్ ఇంటిపై విరుచుపడి విధ్వంసం సృష్టించారు. వందలాది మంది రౌడీలు విధ్వంసం సృష్టిస్తుంటే నిలువరించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం విస్తుగొలుపుతోంది. వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. అంటూ వారిని బతిమిలాడటం పోలీసు వ్యవస్థ దీన స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్యమా.. లేక ఆటవిక రాజ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా ఈ విధ్వంసకాండను చంద్రబాబు తనయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, సదరు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటుండటం దారుణమని, ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమి రాక్షసానందం పొందుతూ ప్రశ్నించే తత్వాన్ని చంపేయడమే టీడీపీ పెద్దల లక్ష్యమనే భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది.పక్కా ప్లాన్తోనే దాడిఆదివారం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడి చినబాబు డైరెక్షన్లో పక్కా ప్లాన్తో జరిగింది. బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై దాడికి ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలు.. ప్రధానంగా విజయవాడలోని కృష్ణలంక, అజిత్సింగ్ నగర్, భవానీపురం ప్రాంతాలకు చెందిన బ్లేడ్, గంజాయి బ్యాచ్లు, కిరాయి రౌడీలు, రౌడీ షీటర్లను భారీగా టీడీపీ నేతల డైరెక్షన్లో ఇబ్రహీంపట్నం తరలించారు. వీరు పెట్రోలు బాంబులు, బాటిళ్లతో దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో సామగ్రి కాలి బూడిదైంది. ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో తగలబడుతున్న జోగి రమేష్ ఇల్లు ఇదే సమయంలో భారీగా గుమికూడిన టీడీపీ మూకలు.. కత్తులు, కర్రలు, బండరాళ్లతో సైర్వ విహారం చేసి ఇంటిపైన రాళ్ల వర్షం కురిపించాయి. గేటును పగలగొట్టే యత్నం చేశారు. రాళ్ల దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి జగన్మోహన్రావు, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. జోగి కుటుంబ సభ్యులను అంత మొందించాలనే కుట్రతో, పక్కా ప్రణాళికతో ఈ దాడి చేసినట్లు స్పష్టం అవుతోంది. కాగా, జోగి రమేష్ రాత్రి 11 గంటలకు ఆయన ఇంటికి వచ్చి టీడీపీ మూకలు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.రోడ్డుపై బైఠాయింపుజోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావును జూపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పరామర్శకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని దేవినేని అవినాష్ పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి, విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలియడంతో అక్కడికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకుంటుండంతో, ఆయన్ను అక్కడి నుంచి సత్యనారాయణపురం పోలీసు స్టేషన్కు తరలించారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఖండించారు. ఇలాంటి దాడులకు వైఎస్సార్సీపీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ వద్దకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, పార్టీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.పోలీసుల ప్రేక్షక పాత్రటీడీపీ గూండాలు జోగి రమేష్ ఇంటిపై దాడికి వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామ మాత్రంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల కనుసన్నల్లోనే టీడీపీ, బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడులు చేస్తున్నా చేష్టలుడిగి చూస్తు్తండిపోయారు. కనీసం వారిని నిలువరించ లేక, ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. మధ్యాహ్నం నుంచే జోగి రమేష్ ఇంటి వైపు వెళ్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులను నిలువరించిన పోలీసులు, టీడీపీ గూండాలకు మాత్రం పచ్చ జెండా ఊపారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పోలవరానికి రూ.3,320.39 కోట్లే..
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2026–27 బడ్జెట్లో రూ.3,320.39 కోట్లు కేటాయించింది. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కు రూ.20 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల (కనీస నీటిమట్టం) ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయడానికి మాత్రమే నిధులు ఇస్తామని పునరుద్ఘాటించింది. అంటే.. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని 194.6 టీఎంసీల నుంచి 119.4 టీఎంసీలకు తగ్గించడాన్ని బడ్జెట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణానికి కేటాయించిన నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యానికి ఇదే పక్కా నిదర్శనం. గత 2025–26 బడ్జెట్లో పోలవరానికి కేంద్రం రూ.5,936 కోట్లు కేటాయించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రీయింబర్స్మెంట్ రూపంలో రూ.459.69 కోట్లను విడుదల చేసింది. అడ్వాన్సుగా రెండు విడతల్లో రూ.5,052.71 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. వాటిని ఎస్ఎన్ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమ చేసి.. పోలవరం ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మాత్రమే వ్యయం చేసి.. 75 శాతం ఖర్చు చేశాక యూసీలు(వినియోగ ధ్రువీకరణపత్రాలు) పంపితే మళ్లీ అడ్వాన్సుగా నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను ఎస్ఎన్ఏ ఖాతాలో జమ చేయకుండా, ఇతర అవసరాలకు మళ్లించింది. ఇదే అంశంపై పీపీఏ, కేంద్ర జల్ శక్తి శాఖ అనేకమార్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో విడతల వారీగా రూ.4,352 కోట్లను ఎస్ఎన్ఏ ఖాతాలో జమ చేసి.. ప్రాజెక్టు పనులకు, నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు ఖర్చు చేసింది. అంటే 2024–25లో అడ్వాన్సుగా ఇచ్చిన నిధుల్లో ఇప్పటికీ రూ.700 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదు. దాంతో కేంద్రం 2025–26 బడ్జెట్లో కేటాయించిన రూ.5,936 కోట్లలో ఒక్క పైసా కూడా ఇప్పటి దాకా విడుదల చేయలేదు. 2026–27 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. 2025–26 బడ్జెట్ అంచనాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం పోలవరానికి కేటాయింపులను రూ.3,017.20 కోట్లకు పరిమితం చేసింది. అంటే.. గతంలో కేటాయించిన నిధుల్లో రూ.2,918.80 కోట్లు కోత వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 58 రోజుల్లో ముగుస్తుంది. దీన్ని బట్టి చూస్తే... సవరించిన బడ్జెట్లో కేటాయించిన రూ.3,017.20 కోట్లను కూడా వినియోగించుకోవడం సాధ్యం కాదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాజా బడ్జెట్లో పునరుద్ఘాటనపోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేస్తూ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇవ్వాలని కేంద్ర కేబినెట్ తీర్మానించింది. తద్వారా పోలవరం రిజర్వాయర్ను బ్యారేజీగా మార్చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం ఆమోదించినా, ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రి కె.రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పలేదు. దాన్ని చంద్రబాబు సర్కార్ కూడా వ్యతిరేకించలేదు.41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ 2024–25, 2025–26 బడ్జెట్లోనూ కేంద్రం స్పష్టం చేసింది. తాజా బడ్జెట్లోనూ అదే అంశాన్ని పునరుద్ఘాటించింది. వాస్తవానికి 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను పూర్తి చేసింది. ఆ మేరకు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి, భూ సేకరణకు అదనంగా రూ.22 వేల కోట్లకుపైగా అవసరమని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నాడు.. నేడు.. అదేతీరు...పోలవరంలో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. వరద ప్రవాహం ఉన్నప్పుడు మాత్రమే కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. ఇక కృష్ణా డెల్టా స్థిరీకరణ, గోదావరి డెల్టాలో రబీ పంటకు నీళ్లందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు నీళ్లందించడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేస్తేనే ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో, నాటి కర్ణాటక సీఎం దేవేగౌడను ప్రధానిని చేయడంలో ప్రధాన భూమిక పోషించి, కేంద్రంలో చక్రం తిప్పానంటూ అనేక మార్లు చెప్పుకున్నారు. అప్పట్లో కర్ణాటక సర్కార్ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 506 మీటర్ల నుంచి 519.6 మీటర్లకు పెంచేసి రిజర్వాయర్గా మార్చేసి, ఏపీ నోట్లో మట్టి కొట్టినా అప్పట్లో చంద్రబాబు నోర మెదపలేదు. ఇప్పుడు పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చేసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ఘనత కూడా చంద్రబాబే దక్కించుకున్నారంటూ సాగు నీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. సందిగ్ధత... అస్పష్టతసాక్షి, అమరావతి: కేంద్ర రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులపై స్పష్టత కొరవడింది. కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులను ప్రత్యేకంగా ప్రస్తావించ లేదు. ప్రధానంగా 7 కొత్త హై స్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. వాటిలో హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లు ఏపీ మీదుగా వెళతాయి. చెన్నై–బెంగళూరు హైస్పీడ్ కారిడార్ పరిధిలోకి రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని పలమనేరు ప్రాంతంలో కొంత ప్రాంతం వస్తుంది. రాష్ట్రంలోని అమరావతి రైల్వే లైన్, కడప – బెంగళూరు రైల్వే లైన్, కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, డోన్–అంకోలా తదితర రైల్వే లైన్లకు కేటాయింపులపై స్పష్టత లేదు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు నిధుల కేటాయింపుపై సందిగ్ధత నెలకొంది. -
నన్ను అంతం చేయడమే వారి లక్ష్యం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్)/గుంటూరు లీగల్: తనను అంతం చేయడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్సార్సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీస్స్టేషన్లో తనను హింసించారని తెలిపారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తమ విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. దీంతో శనివారం ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం రాత్రి 8.30 గంటలకు గుంటూరు మొబైల్ కోర్టులో హాజరు పరిచారు.రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అంబటి పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై అంబటి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంబటిపై నమోదైన కేసు ఎఫ్ఐఆర్ చెల్లదన్నారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే ఉన్నతాధికారుల అనుమతితో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉందని, దీన్ని పోలీసులు పట్టించుకోలేదన్నారు. అంబటిపై పెట్టిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే కాబట్టి 41ఏ నోటీసు కూడా ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం తగదన్నారు. రెండు కాళ్లు పంగ చీల్చి వేధించారుఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తనను హింసించిన తీరును న్యాయమూర్తి ఎదుట వివరించారు. ‘గుంటూరు సిద్ధార్థనగర్లోని మా ఇంటి వద్ద నుంచి శనివారం రాత్రి 10.30 గంటలకు పోలీసులు నన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. లాకప్లో పడుకుని ఉండగా, రాత్రి రెండు గంటలప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి.. స్టేట్మెంట్ రికార్డు చేయాలంటూ మొదటి అంతస్తులోకి తీసుకువెళ్లాడు. అక్కడ నల్లపాడు సీఐ వంశీధర్, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు వచ్చి పక్కన కూర్చున్నారు. తమకు పై నుంచి ఒత్తిడి ఉందని, తప్పుగా అనుకోవద్దని చెబుతూనే కానిస్టేబుళ్లకు సైగ చేశారు. కానిస్టేబుళ్లు నన్ను గోడకు అనించి కూర్చోబెట్టి, రెండు కాళ్లు ఎడం చేసి గట్టిగా లాగి పంగ చీల్చారు. నొప్పితో అరవడంతో కాసేపు ఆపి.. రెండోసారి కూడా అలాగే చేశారు. నొప్పితో తర్వాత లేచి నిల్చుని నడవలేక పోయాను. కొంచెం సేపు నెమ్మదిగా నడిపించి కిందికి పంపారు. చాలా నొప్పిగా ఉంది. నన్ను అంతం చేసేందుకే టీడీపీ నాయకులు ఈ వ్యవహారం అంతా చేస్తున్నారు’ అని న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో న్యాయమూర్తి అంబటి రాంబాబు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. తమ విధులకు అడ్డు పడ్డారంటూ నల్లపాడు ఎస్ఐ చేత పెట్టించిన కేసులో రిమాండ్ను తిరస్కరించారు. దీంతో అంబటిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. కాగా, అంతకు ముందు రాత్రి 7.30 గంటలకు అంబటికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయవాదుల ఆగ్రహంకోర్టు ఆవరణలో కూడా బ్యారికేడ్లు పెట్టడం, పోలీసులు తమను పదే పదే బయటకు పంపే ప్రయత్నం చేయడంపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసుల వల్ల తమకు కోర్టులో కూడా రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అంబటిని ఏ జైలుకు తరలిస్తున్నారనే విషయం కూడా అంబటి రాంబాబు తరఫు న్యాయవాదులకు చెప్పక పోవడం దారుణం అని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి నల్లపాడు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అంబటిని పోలీసులు ‘బాగా చూసుకున్నారు’ అని ఆమె తెలిపారు.రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపుతెల్లవారుజామున నాలుగు గంటలకునేత అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్ తో సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. జైలు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు.. జైలు బయట భద్రత పెంచారు. అంబటి రాంబాబుకు తీసుకొచ్చిన దుస్తులను సంచుల్లో పంపించేందుకు సైతం అనుమతించలేదు పోలీసులు. ఈరోజు అంబటితో వైఎస్సార్సీపీ నేతలు ములాకత్ కానున్నారు.తిరుగుబాటు తప్పదుప్రభుత్వ పెద్దలు పరిపాలనను పక్కనపెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అహంకార ధోరణితో కక్షగట్టి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారు. తిరిగి ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గంతో కూడిన రాక్షస చర్య. రెడ్బుక్ పేరుతో తండ్రీకొడుకులిద్దరూ కలిసి వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులపై దాడులు చేయడం, తప్పుడు కేసులతో అరెస్ట్ చేయడం మినహా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్నారా? తప్పుడు కేసులకు, బెదిరింపులకు భయపడేది లేదు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రిఆటవిక రాజ్యంలో ఉన్నామా?అంబటి రాంబాబుపై దాడికి పాల్పడటం దుర్మార్గం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా? సీబీఐ–సిట్ దర్యాప్తులో లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని తేల్చింది. దీనిని డైవర్ట్ చేసేందుకు టీడీపీ గూండాలు అంబటి రాంబాబు ఇంటిని, పార్టీ కార్యాలయాన్ని, ఆయన వాహనాన్ని ధ్వంసం చేసి ఇంటికి నిప్పు పెట్టారు. – రామసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీడైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే..లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ నిగ్గు తేల్చడంతో డైవర్షన్ పాలిటిక్స్ను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం తమదేనన్న మదంతో అంబటి రాంబాబు ఇంటిపై పైశాచికంగా దాడులు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని దేవాలయం మెట్లు కడిగిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఈ రోజు ఏ దేవాలయం మెట్లు కడుగుతారో చెప్పాలి. చంద్రబాబు, లోకేశ్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యేరాష్ట్రంలో రాబందుల పాలనరాష్ట్రంలో రాబందుల పాలన నడుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలో ఉన్నంతకాలం పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేస్తున్నారు. చంద్రబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటనతో ఏపీని ఆటవిక ప్రదేశ్గా మార్చేశారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడుచంద్రబాబు నేతృత్వంలో వికృత పాలనవైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసే వికృత రాజకీయ క్రీడ రాష్ట్రంలో కొనసాగుతోంది. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం వర్సిటీకి రూ.5 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టడంతో రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రజల ఆలోచనలను మళ్లించేందుకు పథకం ప్రకారం అంబటి రాంబాబుపై దాడి చేశారు. – సాకే శైలజానాథ్, మాజీ మంత్రిబిహార్ తరహా ఆటవిక పాలనరాష్ట్రంలో బిహార్ తరహా పాలనకు టీడీపీ కూటమి ప్రభుత్వం తెరతీసింది. వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల ఇంటిపై అధికార పార్టీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయం. అంబటి ఇంటిపైన, మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్, కిరోసిన్ బాంబులతో దాడికి దిగారు. కూటమి పాలనలో రౌడీ రాజ్యానికి ఇది నిదర్శనం. – వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రిదాడులకు భయపడం రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై కూటమి మూకలు దాడులు చేస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడి చేయడం అమానుషం. డీజీపీ పచ్చచొక్కాను వీడి ఖాకీ చొక్కా ధరించాలి. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగటం సిగ్గుచేటు. వైఎస్సార్సీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వ విధానాలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు చేసూ్తనే ఉంటాం. – తలశిల రఘురాం, ఎమ్మెల్సీఅమిత్షా దృష్టికి తీసుకెళ్తాం..అంబటి రాంబాబుపై జరిగిన దాడి గురించి కేంద్ర హోంశాఖకు, ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాం. కేంద్ర హోంమంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళతాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై పార్లమెంట్ వేదికగా తెలియజేస్తాం. బాధితుల్ని కాపాడాల్సిన పోలీసులు దాడిచేసేవారికి రక్షణ కల్పించడం దుర్మార్గం. – వైవీ సుబ్బారెడ్డి, ఎంపీవ్యూహం ప్రకారమే దాడి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను బట్టి వ్యూహం ప్రకారమే అంబటిపై దాడి జరిగిందనిపిస్తోంది. ఈ కేసులో పోలీసుల్ని నిందితుల్ని చేయాలి. – పిల్లి సుభాష్చంద్రబోస్, ఎంపీపోలీసులు చోద్యం చూశారుఅంబటి రాంబాబు కారులో వస్తుండగా ఆయన్ని అడ్డగించి టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూశారు. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భర్త సమక్షంలో దాడి జరిగింది. – వైఎస్ అవినాశ్రెడ్డి, ఎంపీఅంబటిని రెచ్చగొట్టారు లడ్డూ వ్యవహారంలో అంబటి రాంబాబుపై 24 గంటల ముందునుంచే వ్యూహం పన్ని ఆయన్ని రెచ్చగొట్టారు. టీటీడీ ఈవోపై ప్రభుత్వం అభాండాలు వేస్తోంది. వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి తప్పుచేయలేదని సీబీఐ చార్్జషీట్ ద్వారా నిజం బహిర్గతమైంది. – మేడ రఘునాథరెడ్డి, ఎంపీ హత్య చేయాలని చూశారుఅంబటి రాంబాబును హత్యచేసేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నం చేశారు. వందలాదిమంది ఆయన ఇంటిపై దాడిచేసి నిప్పంటించడం అత్యంత దుర్మార్గం. దీని ఉద్దేశం ఏమిటంటే హత్యచేయాలనే కదా? అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారు? వారు పోలీసులా? గూండాలా? దాడిచేసిన వారిపై కేసులు పెట్టకుండా అంబటి రాంబాబుపై కేసు పెట్టడం దారుణం. – గొల్ల బాబూరావు, ఎంపీ -
అదే నిప్పు మీ ప్రభుత్వాన్ని దహించేస్తుంది
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి శనివారం రాత్రి.. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి ఆదివారం టీడీపీ గూండాలు, అసాంఘిక శక్తులు నిప్పు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఇళ్లకు పెట్టిన నిప్పు జంగిల్రాజ్కు ప్రతీక అన్నారు. ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి.. మీ సర్కార్ను దహించి వేయక మానదని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘ప్రజాస్వామ్యంలో, మీరు చేసిన ఆరోపణలు తప్పు అని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబులు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నిర్ధారణ చేసిన తర్వాత, మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశి్నస్తే, జీరి్ణంచుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం, చంద్రబాబు గారూ అది మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు, జంగిల్రాజ్కు ప్రతీక. ఈ నిప్పు మీ సర్కార్ను దహించి వేయక మానదని గుర్తుంచుకోండి. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసే ప్రజాగ్రహ జ్వాలలు, మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనం చేసి, బూడిద చేయక మానదనీ గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలను రేపే చేయీ కాలక తప్పదు. అరాచక, ఆటవిక పాలన అంతం కాక తప్పదు. మీరు సృష్టించిన జంగిల్ రాజ్ భూ స్థాపితం కాక తప్పదు. ఇది చరిత్ర చెప్పే సత్యం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అదే పిచ్.. కాస్త రిలీఫ్
సాక్షి, అమరావతి : ట్యాక్స్ శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయనప్పటికీ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే పలు కీలక నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ముఖ్యంగా టీడీఎస్, టీసీఎస్ల భారం తగ్గించడంతోపాటు వ్యక్తిగత ట్యాక్స్ రిటర్నులు ఏడాదంతా మార్చుకునే వెసులుబాటు కల్పించారు. విదేశాల్లో ఉన్న ప్రకటించని ఆస్తులను వన్టైమ్ సెటిల్మెంట్ కింద ప్రకటించుకునే అవకాశాన్ని కల్పించారు. ఆదివారం నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన కొన్ని కీలక నిర్ణయాలు... » ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇన్కమ్ట్యాక్స్– 2025 చట్టం అమల్లోకి రానుంది. దీని ప్రకారం రూ.12 లక్షల వరకు ఆదాయంపై ఇచ్చే ట్యాక్స్ రిబేట్, రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ను పరిగణనలోకి తీసు కుంటే రూ.12.75 లక్షల ఆదాయం వరకు ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు. » వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులు ఐటీఆర్–1, ఐటీఆర్–2కింద రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేదీ జూలై 31, అదే ఆడిట్ అవసరం లేని సంస్థలకు గడువు తేదీ ఆగస్టు 31. » దాఖలు చేసిన రిటర్నుల్లో మార్పులు చేసుకోవడానికి ప్రస్తుతం డిసెంబర్ 31గా ఉన్న గడువును మార్చి 31 వరకు పొడిగించారు. » విదేశీ టూర్ ప్యాకేజీలపై ప్రస్తుతం విధిస్తున్న 5 శాతం , 20 శాతం టీసీఎస్ను రెండు శాతానికి తగ్గించారు. » మానవ వనరులు అందించే సంస్థలపై విధించే టీడీఎస్ను ఒకటి లేదా రెండు శాతానికి పరిమితం చేశారు.» విదేశీ ఆస్తులను ప్రకటించడానికి వన్టైమ్ డిస్క్లోజర్ స్కీంను ప్రవేశపెట్టారు» గత రిటర్నుల్లో విదేశీ ఆస్తులను ప్రకటించడంలో విఫలమైతే ఈ స్కీం కింద తక్కువ పెనాల్టీతో ప్రకటించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. » ఆస్తి విలువ రూ.20 లక్షల లోపు ఉంటే ఎటువంటి పెనాల్టీ ఉండదు. అదే కోటి రూపాయల లోపు ఉంటే మార్కెట్ విలువలో 30 శాతం చెల్లిస్తే సరిపోతుంది. » ప్రవాస భారతీయులు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీం(పీఐఎస్) కింద పెయిడప్ క్యాపిటల్లో 10 శాతం వరకూ వాటా తీసుకోవచ్చు.ఇప్పటిదాకా ఇది 5 శాతంగానే ఉండేది. స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల్లో వీరు ఇక నుంచి 24 శాతం వరకూ వాటా తీసుకోవచ్చు. ఇప్పటివరకూ ఇది 10 శాతంగా ఉండేది.» కార్పొరేట్స్పై విధిస్తున్న మినిమమ్ఆల్టర్నేటివ్ ట్యాక్స్ను (మ్యాట్) 15 నుంచి 14 శాతానికి తగ్గించారు. » ఆర్బీఐ నుంచి నేరుగా సావరిన్గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసిన వారు... కాలపరిమితి ముగిసేంత వరకూ తమ వద్దఉంచుకుంటే, వాళ్లకు మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇవే బాండ్లను సెంకడరీ మార్కెట్ నుంచికొనుగోలు చేసిన వారు మాత్రం క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.మ్యాచ్ సమ్మరీపిచ్ మారలేదు. ఫీల్డ్ సెట్టింగ్ కూడా మునుపట్లానే. ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబులు యథాతథం. కాకపోతే అంపైర్ నుంచి అనుకోకుండా నోబాల్ వచ్చింది. అంటే... ఓ సింగిల్ రన్తో పాటు మరో బాల్ అదనమన్న మాట. టీడీఎస్, టీసీఎస్లను తగ్గించటం సింగిల్ రన్ అదనంగా లభించటమే. అదనపు బాల్, సింగిల్ రన్ కాంబినేషన్తో కొంతయినా రన్రేట్పై ఒత్తిడి తగ్గింది. ఎన్నారైలకైతే లూజ్ డెలివరీలు పడ్డాయి. విదేశీ ఆస్తులపై వన్టైమ్ సెటిల్మెంట్ ఫ్రీ హిట్లాగామారింది. బౌండరీలు లేవు, హిట్టింగ్ లేదు. కానీ వికెట్లు కాపాడుకుంటూ స్కోర్బోర్డు ముందుకు నడిపిన ఒక క్లాసిక్ కన్సాలిడేషన్ ఓవర్ ఇది. -
ఖనిజ సంపదకు కారిడార్ వెలుగులు
సాక్షి, అమరావతి: దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించే భవిష్యత్తు ఇంధనాలుగా పిలిచే అరుదైన ఖనిజాలు ఆంధ్ర ప్రదేశ్కు వరంగా మారే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత లభించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ ఈ కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. ఇది కేవలం ఖనిజ తవ్వకాలకే పరిమితం కాకుండా రాష్ట్రాన్ని ఒక పారిశ్రామిక హబ్గా మార్చేందుకు దోహదపడుతుందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. అరుదైన ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తామని నిర్మల ప్రకటించారు.దీనికోసం బడ్జెట్లో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎంఎం) కింద రూ.16,300 కోట్లను కేటాయించారు. ఈ ఖనిజాల ద్వారా తయారయ్యే పర్మనెంట్ మాగ్నెట్స్ ఉత్పత్తి కోసం గత ఏడాది ప్రకటించిన రూ.7,280 కోట్ల ఇన్సెంటివ్ స్కీమ్ను ఈ కారిడార్కు అనుసంధానం చేయనున్నారు.ఏపీలో విస్తారంగా రేర్ ఎర్త్ మినరల్స్..ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో మోనజైట్ అనే ఖనిజం ద్వారా పలు అరుదైన మూలకాలు లభిస్తాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నంవంటి ప్రాంతాలు ఈ బీచ్ సాండ్ నిక్షేపాలకు ప్రధాన కేంద్రాలు. అనంతపురం జిల్లాలోని దంచెర్ల, పెద్దవడుగూరు ప్రాంతాల్లోనూ రేర్ ఎర్త్ మూలకాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైఎస్ఆర్ కడప, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో గ్రాఫైట్, కోబాల్ట్, కాడ్మియం వంటి ఖనిజాలు ఉన్నాయి. బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ కారిడార్ ద్వారా కేవలం తీర ప్రాంతమే కాకుండా ఖనిజ నిక్షేపాలున్న లోతట్టు ప్రాంతాలను రవాణా పరంగా అనుసంధానించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మన ఖనిజ సంపదను ముడి రూపంలో తక్కువ ధరకు విదేశాలకు పంపించి తిరిగి వాటితో తయారైన ఖరీదైన బ్యాటరీలను, అయస్కాంతాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ సంస్కృతికి విడనాడాలని భావిస్తున్నారు. ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే రిఫైనరీలు, ఖనిజాలను వేరు చేసే అత్యాధునిక ల్యాబ్లు, ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లు, చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీలను ఒకే తాటిమీదకు తెస్తారు. దీంతో ఖర్చు తగ్గి, స్థానికంగా ఉపాధి పెరుగుతుంది. బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఈ కారిడార్ విజయవంతం కావాలంటే పర్యావరణ ప్రభావం, స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా చూడటం ప్రధానమని నిపుణులు చెబుతున్నారు. ఈసీఎంఎస్కు రూ.40 వేల కోట్లున్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీలో ఆత్మనిర్భరతే లక్ష్యంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ను విస్తరించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల ఆదివారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. చిప్ల తయారీరంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ పరిశ్రమల్లో ఉపకరణాల సేకరణ, ముడి సరకులు, దేశీయ డిజైన్లు, ఇతర ముడి సామగ్రి విషయంలో సముపార్జనే ధ్యేయంగా ముందుకెళ్లాలని నిర్ణయించామని నిర్మల చెప్పారు. పారిశ్రామికంగా పరిశోధన శిక్షణా కేంద్రాల ఏర్పాటుపైనా దృష్టిపెట్టామని, ఇందుకోసం ఇండియా సెమీకండక్టర్ మిషన్(ఐఎస్ఎం) 2.0ను తీసుకొస్తామని నిర్మల వెల్లడించారు.‘‘ త్వరలో ఐఎస్ఎస్ 2.0ను తీసుకొచ్చి చిప్ల సంబంధ ఉపకరణాలు, మెటీరియల్స్, భారతీయ మేథోపర హక్కులున్న చిప్ డిజైన్, సరకు రవాణా గొలుసులను అభివృద్ధి చేస్తాం’’ అని నిర్మల వెల్లడించారు. ‘‘ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్)ను 2025 ఏప్రిల్లో రూ.22,919 కోట్లతో ఆరంభించాం. ఈ పథకానికి నిధుల కేటాయింపులను రూ.40,000 కోట్లకు పెంచుతున్నాం’’ అని నిర్మల చెప్పారు. ‘‘మొత్తంగా రూ.54,567 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వద్దకు జనవరి నాటికి 46 దరఖాస్తులు చేరాయి. ఈ ప్రాజెక్టులు సాకారమైతే మరో 51,000 మందికి ఉపాధి లభిస్తుంది’’ అని నిర్మల చెప్పారు. -
‘చంద్రబాబూ గుర్తుంచుకోండి.. చరిత్ర చెప్పే సత్యం ఇది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సర్కార్ అరాచకాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యంలో మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని.. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్లు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నిర్ధారణ చేశాయి. తర్వాత మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే.. జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం.. చంద్రబాబూ అది మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి చంద్రబాబూ’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ హెచ్చరించారు.‘‘అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు ‘జంగిల్రాజ్’కు ప్రతీక. కానీ ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి.. చంద్రబాబూ మీ సర్కార్ను దహించివేయక మానదు. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసే ప్రజాగ్రహ జ్వాలలు.. మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనం చేసి, బూడిద చేయకమానదు...చంద్రబాబూ గుర్తుంచుకోండి.. ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలలను రేపే చేయి కాలక తప్పదు. అరాచక, ఆటవిక పాలన అంతం కాక తప్పదు! మీరు సృష్టించిన ‘జంగిల్ రాజ్’’ భూస్థాపితం కాక తప్పదు. చరిత్ర చెప్పే సత్యం ఇది.’’ అంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు.ప్రజాస్వామ్యంలో, మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబులు NDDB, NDRI నిర్ధారణ చేసిన తర్వాత, మీరుచేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే, జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని… pic.twitter.com/pA288I5ZIL— YS Jagan Mohan Reddy (@ysjagan) February 1, 2026 -
మాజీ మంత్రి జోగి రమేష్కు వైఎస్ జగన్ ఫోన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి జోగి రమేష్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు. జోగి రమేష్ను పరామర్శించిన వైఎస్ జగన్.. జోగి రమేష్ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న ఆయన.. ప్రశ్నించేవారిని భయపెట్టడానికే చంద్రబాబు హింసాజ్వాలను రాజేస్తున్నారని మండిపడ్డారు. అవే మంటలు చంద్రబాబు సర్కార్ను దహించి వేయక తప్పదన్నారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందంటూ జోగి రమేష్కు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు.ఏపీలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడికి పాల్పడారు. ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ గూండాల యత్నించారు. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు. జోగి రమేష్ నివాసంపై దాడి వెనుక కుట్ర బట్టబయలైంది. మాజీ మంత్రి నివాసంపై టీడీపీ పథకం ప్రకారం దాడికి పురిగొల్పింది. జోగి నివాసంపై దాడికి పిలుపునిచ్చిన టీడీపీ.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిరసన పేరుతో ప్లాన్ అమలు చేసింది.అధికారికంగా పత్రికా ప్రకటన ఇచ్చిన ఇబ్రహీంపట్నం టీడీపీ అధ్యక్షుడు.. ఆందోళనకు పిలుపునిచ్చారు. అదే సమయంలో జోగి రమేష్ ఇంటివద్దకు చేరిన టీడీపీ నేతలు, గూండాలు.. ఆయన నివాసంపై కర్రలు, రాడ్లు, కత్తులు, పెట్రోల్ బాంబ్లతో దాడి చేశారు. -
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో చంద్రబాబు సర్కార్కు షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. శాంతిభద్రతలు అదుపులోకి వచ్చేంతవరకూ అంబటి ఫ్యామిలీకి 24 గంటల భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి నిన్న (శనివారం) హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.తనతోపాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, శాంతిభద్రతల సమస్య ఉందని పిటిషన్లో వివరించారు. తనకు 24 గంటలు భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి కోరారు. ఇవాళ (ఫిబ్రవరి 1, ఆదివారం) హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.కాగా, టీడీపీ గూండాలు బహిరంగంగా ఆయుధాలు చేతబట్టి అంబటి రాంబాబుపై శనివారం హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తుదకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుట్ర బెడిసి కొట్టడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు పాలకులు బరి తెగించారు.ఈ క్రమంలో వందలాది మంది పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడికి దిగినా వారు చోద్యం చూస్తూ మిన్నకుండి పోవడం విస్తుగొలుపుతోంది. వందల మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైనా దాడి చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఒక పథకం ప్రకారం అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలన్న తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా గూండాలను పంపించి ఆయనపై ఉదయం నుంచి దాడి చేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేసింది. -
చంద్రబాబు సర్కార్కు మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టి కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగానే ఉందని, రాష్ట్రానికి దీని వల్ల ఒరిగిందేమీ లేదని మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలవరానికి కేవలం రూ.3,300 కోట్లు మాత్రమే విదిల్చారని, అంతకు మించి రాష్టానికి ఒరిగిందేమీ లేదన్నారు. అప్పులు మాత్రం జీడీపీలో 4.3 శాతానికి తగ్గించుకున్నారని, కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రం గత బడ్జెట్లో చెప్పిన దాని కన్నా ఇప్పటికే రూ.16 వేల కోట్లు ఎక్కువగా అప్పులు చేసిందని ఆక్షేపించారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో అప్పులు చేస్తే శ్రీలంక అయిపోతుందన విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడేమంటారని బుగ్గన ప్రశ్నించారు. ఆయన ఇంకేమన్నారంటే..:కేంద్ర బడ్డెట్ నిరాశాజనకం:కేంద్ర బడ్జెట్ చరిత్రలోనే అతి పెద్దది. ఇందులో ఆదాయ, వ్యయ అంచనాలు రూ.53,47,315 కోట్లు కాగా, రూ.16,95,768 కోట్లు అప్పుగా చూపారు. మూలధన వ్యయం రూ.12,21,821 కోట్లుగానూ, ద్రవ్యలోటు రూ.16,95,765 కోట్లుగానూ చూపారు. జీడీపీలో గత సంవత్సరాలతో పోలిస్తే అప్పు 4.3 శాతానికి తగ్గడం ఒక్కటే ఊరట. సమగ్ర శిక్ష, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలకు భారీ కేటాయింపులు చేసినా ఖర్చు మాత్రం చేయడం లేదు. గతేడాది జల్ జీవన్ మిషన్కు రూ.67 వేల కోట్లకు పైగా కేటాయించినా, కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అందులో ఏపీలోనే ప్రభుత్వం రూ.12 వేల కోట్లు అప్పులు చేసి ఖర్చు పెట్టడం విశేషం. రోడ్లు, రైలు మార్గాలకు రూ.5,98,520 కోట్లు ఖర్చుపెడతామని ప్రకటించారు. పోలవరానికి కేవలం రూ.3,300 కోట్లు మాత్రమేఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా ప్రాజెక్టుల ఊసే లేదు.అప్పుల్లో కేంద్రానికి రివర్స్లో ఏపీ సర్కార్:కేంద్రం అప్పు తగ్గించుకుంటూ వస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అప్పులు పెంచుకుంటూ పోతోంది. ఫిబ్రవరి 3వ తేదీ నాటికి రాష్ట్ర అప్పు, కార్పోరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు అన్నీ కలిపి చూస్తే ఏకంగా అది రూ.3,14,644 కోట్లు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం, ఆ 5 ఏళ్లలో రెండేళ్లు కోవిడ్ వంటి సంక్షోభం ఉన్నా కూడా రూ.3 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసింది. అదే టీడీపీ కూటమి ప్రభుత్వం మీరు రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఆ సంఖ్యను దాటేశారు. కాగ్ లెక్కల ప్రకారం కేవలం ఆర్బీఐ ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.81,597 కోట్లు అప్పు చేశారు. ఇది బడ్జెట్తో పోలిస్తే రూ.10 వేల కోట్లు ఎక్కువ. మరో రూ.3,300 కోట్లు ఫిబ్రవరి 3న తీసుకుంటున్నారు. ఇలా బడ్జెట్లో చెప్పిన దాని కన్నా రూ.15 వేల కోట్లకు పైగా అదనంగా అప్పులు చేస్తున్నారు. అప్పట్లో మేం అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు. ఇప్పుడు మీ అప్పులకు రాష్ట్రం వెనెజులా అవుతుందా?.చంద్రబాబు మ్యాటర్ వీక్. పబ్లిసిటీ పీక్:ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వారా రాష్ట్ర అభివృద్ధి రుణాలు రూ.77,040 కోట్లుగా ఉన్నాయి. దానికి ఈ నెలలో తీసుకునే రూ.3,300 కోట్లు కలిపితే మొత్తం రుణం రూ.80,340 కోట్లు అవుతుంది. కాగ్ లెక్కల ప్రకారం రుణాలు రూ.77,040 కోట్లు కాగా.. డిసెంబర్ 2న రూ.3 వేల కోట్లు, డిసెంబర్ 30న రూ.4 వేల కోట్లు, జనవరి 6న రూ.6,500 కోట్లు, జనవరి 27న రూ.2,500 కోట్ల అప్పు చేయగా, ఫిబ్రవరి 3న మరో రూ.3,300 కోట్ల రుణం తీసుకుంటున్నారు. అన్నీ కలిపితే రూ.96,340 కోట్లకు చేరతాయి. అవే కాకుండా, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు అన్నీ కలిపి రూ.89,320 కోట్లు ఉన్నాయి.ఒక్క రాజధాని పేరు మీదే ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ, ఇతర సంస్థల నుంచి రూ.47,387 కోట్లు ఇప్పటివరకూ అప్పు చేశారు. మేం ఎవరితో పోల్చుకున్నా తక్కువ అప్పులు చేశాం. అయినా పచ్చమీడియా సాయంతో మాపై దుష్ప్రచారం చేశారు. 2019 నాటికి రాష్ట్ర అప్పు రూ.2.5 లక్షల కోట్లు ఉంటే.. మేం దిగిపోయే నాటికి ఆ అప్పు రూ.3.32 లక్షల కోట్లకు పెరిగింది. మీ హయాంలో ప్రతీ సంవత్సరం 22.6 శాతం అప్పుల్ని పెంచితే, కరోనా వంటి సంక్షోభాలు ఉన్నా 13.5 శాతం మాత్రమే అప్పులు పెంచాం. అయినా వైయస్సార్సీపీ ప్రభుత్వంపై నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ‘మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్’ అని చెప్పడానికి ఇదే నిదర్శనమని బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు. -
చంద్రబాబు లక్షణం హింసను క్రియేట్ చేయడమే: సజ్జల
సాక్షి, గుంటూరు: ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది దేనికి?.. ప్రశ్నించే గొంతులను వేధించడానికా? అంటూ చంద్రబాబు సర్కార్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలేం జరుగుతోందంటూ ప్రశ్నించారు. ‘‘లడ్డూలో కొవ్వు కలిసిందని సీఎం హోదాలో బాబు చెప్పారు. బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారు?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.‘‘కల్తీ నిజమంటూ ప్లెక్సీలు వేసి దుష్ప్రచారానికి దిగారు. తప్పుడు ఫ్లైక్సీలను మా పార్టీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు. చట్టం.. గూండాలను, అరాచకశక్తులను రక్షించింది. మా పార్టీ నేతలకు ప్రాణాపాయం జరిగితే ఎవరిది బాధ్యత?. పోలీస్ ఉన్నతాధికారులకు బొత్స ఫోన్ చేసినా స్పందన లేదు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలి. మా పోరాటం అహింసాయుతంగా ఉంటుంది. కోర్టులను ఆశ్రయిస్తాం, గవర్నర్ను కూడా కలుస్తాం’’ అని సజ్జల పేర్కొన్నారు.ఊరుపేరులేని ఫ్లైక్సీలను పోలీసులే తొలగించాలి. డీజీపీ, హోంమంత్రి సమాధానం చెప్పాలి. విడుదల రజిని, భూమన, బ్రహ్మనాయుడిపైనా దాడికి యత్నించారు. గతంలో టీడీపీ నేత పట్టాభి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారు. చంద్రబాబు లక్షణం హింసను క్రియేట్ చేయడమే. ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి దాడులు చేయించారు. టీడీపీ అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. డిజిటల్ బుక్లో అరాచకవాదుల పేర్లు ఎక్కిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక అరాచక వాదులకు శిక్ష తప్పదు. మాజీ హోంమంత్రిని ఎస్పీ ఆఫీస్ గేట్ ఎదుట వెయిట్ చేయించారు. లోకేష్ నోటి వెంట వచ్చే ప్రతి మాట బూతే’’ అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రేషన్ డీలర్ల ఎంపిక ఆపండి
సాక్షి, అమరావతి: రేషన్ దుకాణాల డీలర్ల ఎంపిక విషయంలో హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచి్చంది. డీలర్ల ఎంపిక నిమిత్తం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూకు రాత పరీక్షతో సమానంగా 50 మార్కులను నిర్ణయించడాన్ని తప్పుపట్టింది. కొత్త మార్గదర్శకాలు జారీ చేసేంత వరకు డీలర్ల ఎంపికను ఖరారు చేయవద్దంటూ గతంలోనే ఆదేశాలిచ్చినా ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇంటర్వ్యూలో 50 మార్కులను నిర్ధేశిస్తూ 2011లో జారీ చేసిన జీవో–4ను హైకోర్టు కొట్టేసినప్పటికీ ప్రభుత్వం 50 మార్కులతోనే ఎంపిక ప్రక్రియను కొనసాగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జరిగిన డీలర్ల ఎంపిక ప్రక్రియ మొత్తం చట్టరీత్యా చెల్లదని తేల్చిచెప్పింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మార్కులను నిర్ణయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కేసులో పిటిషన్ను కొట్టేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కొత్తగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పునిచి్చంది. 50 శాతం మార్కులపై పిటిషన్ విజయనగరం జిల్లా సాలూరులోని షాపు నంబర్–15కు రేషన్ డీలర్ నియామకం కోసం 2012 ఫిబ్రవరి 9న పార్వతీపురం ఆర్డీవో నోటిఫికేషన్ జారీ చేశారు. 50 మార్కుల రాత పరీక్ష, 50 మార్కుల ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కోట నాగమణి అనే మహిళ 2012 ఫిబ్రవరి 26న జరిగిన రాతపరీక్షకు హాజరై 50కి 50 మార్కులు సాధించారు. అయితే.. ఇంటర్వ్యూలో అర్హత సాధించలేదు. దీంతో నాగమణి రేషన్ డీలర్ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూకు 50 మార్కులను నిర్ధేశిస్తూ 2011లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 4ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఈ పిటిషన్ను కొట్టేశారు. దీనిని సవాల్ చేస్తూ నాగమణి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిని విచారించిన ధర్మాసనం తీర్పునిస్తూ.. సాధారణ పరిస్థితుల్లో అయితే పిటిషనర్ నాగమణి ఓసారి అవకాశం తీసుకున్న తర్వాత ఎంపిక ప్రక్రియను సవాల్ చేయలేరంది. అయితే, ఇంటర్వ్యూకు 50 మార్కుల విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశించినా.. జీవో–4ను కొట్టేసినా అధికారులు డీలర్ల ఎంపిక ప్రక్రియ విషయంలో ముందుకెళ్లారని ఆక్షేపించింది. ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందని తెలిపింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జరిగిన ఈ మొత్తం ఎంపిక ప్రక్రియ చట్టరీత్యా చెల్లదని తేల్చి చెప్పింది. కాబట్టి నాగమణి పిటిషన్ను కొట్టేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్టు తెలిపింది. కొత్తగా ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
పింఛన్లలో ‘కోత’లా..?
రాజానగరం: బోడి గుండుకు... మోకాలికి ముడి వేయడమంటే ఇదేనేమో..!! చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరు అదే రీతిలో ఉంది. సర్కారు సాయం కోసం ఎదురు చూసే అభాగ్యులను కూడా చంద్రబాబు ప్రభుత్వం వదలడం లేదు. ఆస్తి పన్ను బకాయిల పేరిట ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల నగదులో కోత పెడుతున్నారు. లబ్ది దారులకు పింఛను సొమ్ము పూర్తిగా అందజేయకుండా పన్ను బకాయి మినహాయించుకుని మిగిలిన మొత్తం వారి చేతుల్లో పెడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో శనివారం పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఈ క్రమంలో ఇంటి పన్ను బకాయిలున్న వారికి సిబ్బంది పూర్తి పింఛను చెల్లించలేదు. దీనిపై లబ్ది దారులు, స్థానికులు ప్రశ్నించడంతో పై అధికారులు చెప్పిన విధంగా తాము చేస్తున్నామని సిబ్బంది చెప్పారు. మరోవైపు గ్రామంలో ఒకచోట కూర్చుని లబ్ది దారులను తమ వద్దకు రప్పించుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్ను కడితేనే పింఛను ఇస్తామన్నారు ఇంటి పన్ను, కుళాయి పన్ను కడితేనే పింఛను ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయని సిబ్బంది చెప్పారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని పింఛన్లు ఇచ్చిన వారు చెబుతున్నారు. నా దగ్గర ఇంటి పన్ను బకాయి పేరుతో రూ.270 మినహాయించి మిగిలిన పింఛను అందించారు. – పి.దుర్గారావు, కలవచర్ల -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి నుంచి ఈనెల 10 వరకు ఉదయం 9 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్స్లో నిర్వహించనున్నారు. గత విద్యా సంవత్సరం నుంచి ఏ కాలేజీకి ఆ కాలేజీలోనే సెంటర్లు (సెల్ఫ్ సెంటర్స్) ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,274 సెంటర్లు, ఒకేషనల్ సబ్జెక్టులకు 624 సెంటర్లను ఏర్పాటు చేశారు. కాగా, మొదటి విడత (స్పెల్–1)లో 1,570 సెంటర్లలో ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జంబ్లింగ్ విధానం ఎత్తివేత పబ్లిక్ పరీక్షలతో పాటు ప్రాక్టికల్ పరీక్షల్లోనూ మాల్ ప్రాక్టీస్ను నిర్మూలించేందుకు గతంలో జంబ్లింగ్ విధానం అమలు చేశారు. ఒక కాలేజీ విద్యార్థులు అదే కాలేజీలో ప్రాక్టికల్స్ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉండేది కాదు. దీంతో అన్ని కాలేజీల విద్యార్థులకు సమన్యాయం జరిగేది. కానీ, గత ఏడాది నుంచి జంబ్లింగ్ విధానం ఎత్తేసి, ఏ కాలేజీ విద్యార్థులకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు.దీంతో విద్యార్థుల ప్రతిభతో సంబంధం లేకుండా మార్కుల నమోదు ప్రహసనంగా మారింది. ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలు దీనిని వరంగా మార్చుకున్నాయి. అలాగే, గతంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చరర్లను మాత్రమే ప్రాక్టికల్ విధులకు నియమించేవారు. మ్యాథమెటిక్స్ లెక్చరర్లు మాత్రం పూర్తిగా కాలేజీ విధుల్లో ఉండేలా ఇంటర్ బోర్డు స్పష్టమైన ఆదేశాలిచి్చంది. ఇప్పుడు ఈ విధానం కూడా పూర్తిగా మార్చేశారు. -
22ఏలోని భూముల్ని గీతంకు ఎలా బదలాయిస్తారు?
సాక్షి, అమరావతి : విశాఖ రూరల్ మండలం ఎండాడ, రుషికొండ పరిధిలోని నిషేధిత జాబితా 22ఏలో ఉన్న భూములను గీతం యూనివర్సిటీకి ఎలా బదలాయిస్తారని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీకి గతంలోనూ, ప్రస్తుతం ఇస్తున్న భూముల్లో 22ఏ భూములున్నాయనే విషయం రెవెన్యూ, జీవీఎంసీ అధికారులకు తెలియకపోవడం బాధాకరమన్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. జయలక్ష్మికి శనివారం మరోసారి లేఖ రాశారు. సీసీఎల్ఏ జయలక్ష్మికి రాసిన లేఖలో.. ఎండాడలో సర్వే నెంబర్లు 15/1–15/5, 16/4, 17/29, 17/30, 18/2, 20/5, 19/1, 19/2, 19/9, రుషికొండలో 37/2, 55/5 సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలిపారు. ఎండాడలో సర్వే నెంబర్ 17లో ఉన్న 67.37 ఎకరాల అదనపు ప్రభుత్వ భూమి నిషేధిత జాబితాలో ఉన్నా 2025 జనవరి 30న గుట్టుచప్పుడు కాకుండా గీతంకు బదలాయించినట్లు శర్మ పేర్కొన్నారు. ఆ భూముల మార్కెట్ ధర రూ.1,500 కోట్లకు పైనే ఉందని, ఈ బదలాయింపు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని లేఖలో స్పష్టంచేశారు. ఎండాడ, రుషికొండ అడంగల్ రికార్డులను బట్టి ఈ సర్వే నెంబర్లే కాకుండా ఇతర సర్వే నెంబర్లలోని భూములను కూడా గీతం వర్సిటీ ఆక్రమించిందన్నారు. టూరిజం శాఖకు కేటాయించిన భూములు, అసైన్డ్ భూములు కూడా గీతం ఆక్రమణలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాలను పరిశీలించకుండా వాటిని గీతంకు క్రమబద్ధీకరించేందుకు అనుమతించడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. సాయిప్రసాద్కు రాసిన లేఖలోని అంశాలు.. జీవీఎంసీ సమావేశంలో గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూములు బదలాయించడానికి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదించడం బాధాకరం. జీవీఎంసీ ఆమోదించిన భూముల్లో 22ఏ జాబితాలో ఉన్న భూములు కూడా ఉన్నాయి. జిల్లా రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ క్షుణ్ణంగా పరిశీలించకుండా ఈ ప్రతిపాదనను ఆమోదించడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే. 2025 జులై 16న కె. సుందరరామరాజు వర్సెస్ ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన కేసులో (రిట్ పిటిషన్ నెం:8940/2017) హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ భూముల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే.. » కోర్టు తీర్పు ప్రకారం ఎండాడలో సర్వే నెంబర్ 19లోని 85 ఎకరాలు కొండ పోరంబోకు భూమిగా తేలింది. అలాంటి భూమిలో నిర్మాణాలను జీవీఎంసీ తన మాస్టర్ ప్లాన్లో నిషేధించింది. ఈ నేపథ్యంలో గీతంకు ఆ భూమిని ఇవ్వడానికి ఎలా అనుమతించారు? » ఇక ఆ సర్వే నెంబరులోని 2.5 ఎకరాల విషయంలో 2025 జులై 16న హైకోర్టు ఇచి్చన తీర్పు విషయాన్ని జీవీఎంసీకి పంపిన లేఖలో తహశీల్దార్ ఎందుకు ప్రస్తావించలేదు? » నేను గతంలో రాసిన లేఖల్లో గీతం ఆక్రమించిన భూముల్లో డీపట్టా భూములు కూడా ఉండవచ్చని.. అలాంటి భూములను ఆక్రమించడం నిషేధించారని.. దానిపైనా దర్యాప్తు చేయాలని కోరాను. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను పెద్దలకు ఎలా క్రమబద్దీకరిస్తారు? -
బాబు, పవన్, లోకేశ్కు మంచి బుద్ధి ఇవ్వాలి
సాక్షి నెట్వర్క్: తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, లోకేశ్కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు ఎక్కడికక్కడ భారీ ర్యాలీలు నిర్వహించి ఆలయాల్లో పెద్దఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల కల్తీ ఆరోపణలపై ప్రాయశి్చత్త పూజలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి నియోజకవర్గాల ఇన్చార్జిలు, సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పూజల్లో పాల్గొన్నారు. లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని, కల్తీ జరగలేదని సిట్ దర్యాప్తులో స్పష్టంగా తేలినా టీడీపీ కూటమి నేతలు బాధ్యతారహిత్యమైన ప్రకటనలు, వదంతులు వ్యాప్తి చేస్తుండడాన్ని నిరసిస్తూ అభిషేకాలు, పాప ప్రక్షాళన పూజలు చేశారు. తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అరచేతిలో కర్పూరం వెలిగించుకుని హారతి ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ 101 టెంకాయలు కొట్టారు. శ్రీవారి భక్తుల మనోభావాలను రక్షించాలని కోరుతూ అద్దంకిలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ (అనంతబాబు) శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మెట్లను కడిగి పూజలు చేశారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో నాయకులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశాఖ పశ్చిమంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిలో మెట్లు కడిగారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ఆలయాలను నాయకులు శుద్ధిచేశారు. కొన్నిచోట్ల కొబ్బరికాయలు కొట్టారు. -
ఈసారైనా కరుణించేనా..?
2024 – 25 కేంద్ర బడ్జెట్లో అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల అప్పు తప్ప రాష్ట్రానికి ఒనగూరిందేమీ లేదు. నిర్మలమ్మ వరాలన్నీ బీహార్కు ఇచ్చేస్తే సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు మౌనం వహించారు. కీలకమైన కేకే రైల్వే లైన్ లేకుండానే విశాఖ జోన్ ఏర్పాటు చేసేస్తున్నా నోరు మెదపలేకపోతున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులూ మౌనం వహిస్తున్నారు. కీలకమైన కేకే లైన్తో కూడిన జోన్ ఏర్పాటుకు కేంద్రాన్ని డిమాండ్ చేయలేకపోతున్నారు. వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నేటికీ కేంద్ర పెద్దల నుంచి స్పష్టత సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. తరచూ ఢిల్లీ వెళ్తున్నా కేసుల ఎత్తివేతపైనే శ్రద్ధ పెడుతున్నారు తప్పా రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వైపు ఏపీ ప్రజానీకం ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొండిచేయి చూపిన నిర్మలమ్మ... ఈ సారైనా రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు అవసరమైన నిధులు కేటాయించి, కొత్త వరాలేమైనా ఇస్తారేమోనని ఉత్కంఠతో ఉన్నారు. తన వల్లే కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తోందని గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు కాపాడడంలో, నిధులు సాధించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. గతేడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగింది. అమరావతి కోసం అప్పు తప్ప సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు ఏమీ సాధించలేకపోయారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు నిత్యం ఢిల్లీ వచ్చి వెళ్తున్నా ఏపీకి ఒరిగింది శూన్యం. ఇప్పటి వరకు ప్రత్యేక విమానాల్లో 27 సార్లు ఢిల్లీకి వచ్చి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అయినా నిధులు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ తన అనుకూల ఎల్లో మీడియాను పిలిపించుకోవడం... తనకు తోచింది చెప్పి డప్పు కొట్టించుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. రాష్ట్రానికి అది వచ్చేస్తోంది... ఇది వచ్చేస్తోంది అంటూ బాబు లీకులివ్వడం... వాటిని పట్టుకుని ఎల్లో మీడియా డప్పు కొట్టడం... ఇంతకు మించి రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనాలేం లేవని మేధావులు, విద్యావంతులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. -
రెడ్బుక్ రాక్షసం.. జంగిల్ రాజ్ బీభత్సం
సాక్షి, అమరావతి: చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తాము చేసిన దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టడంతో చంద్రబాబు ముఠా అసహనంతో రగిలిపోతోంది. దాంతో తిరుమల పవిత్రతను దెబ్బ తీసేందుకు తాము పన్నిన పన్నాగం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు బరి తెగించారు. అదే ముసుగులో తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నాలకు తెగబడటంతోపాటు.. వారిపైనే అక్రమ కేసులు నమోదు చేసి వేధించేందుకు కుతంత్రం పన్నారు. ఈ పచ్చ మూకల దారుణ బీభత్స కాండను పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చోద్యం చూస్తోంది. వరుస దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలతో రాష్ట్రంలో చంద్రబాబు ముఠా రావణకాష్టం రగిలిస్తోంది. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టడంతో.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కళంకం తీసుకువచ్చేందుకు చంద్రబాబు చేసిన దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టింది. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్లు ఇచి్చన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో స్పష్టం కావడంతో శ్రీవారి భక్తులు ఊరట చెందారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు రాజకీయ కుట్ర కోసం ఇంతగా దిగజారడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఆ అంశంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టీడీపీ కూటమి అత్యవసరంగా మరో కుతంత్రానికి తెరతీసింది. లడ్డూ ప్రసాదంపై టీడీపీ దుష్ప్రచారంతో లడ్డూ ప్రసాదానికి కలిగిన కళంకానికి పరిహారంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాయశి్చత్త పూజలు, యజ్ఞాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే అదనుగా డైవర్షన్ రాజకీయాల కోసం చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుతంత్రం పన్నింది. ప్రాయశ్చిత్త దీక్షలు, పూజలను అడ్డుకోవడం పేరుతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడాలని తమ పార్టీ కార్యకర్తలు, గూండాలను రంగంలోకి దించింది. కర్రలు, రాడ్లు, రాళ్లు, ఇతర మారణాయుధాలు పట్టుకుని మరీ కనిపించిన వారిపై విచక్షణా రహితంగా దాడులతో విరుచుకు పడాలని ఆదేశించింది. పోలీసు యంత్రాంగం ఉదాసీనంగా ఉండి పరోక్షంగా సహకరిస్తారని.. టీడీపీ గూండాలు ఎవరూ వెనక్కు తగ్గవద్దని స్పష్టం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు స్వయంగా అధికార పార్టీనే పన్నాగం పన్నడం విభ్రాంతి కలిగిస్తోంది. తద్వారా లడ్డూ ప్రసాదంపై తాము చేసిన దుష్ప్రచారం నుంచి ప్రజల దృష్టిని శాంతిభద్రతల సమస్యపైకి మళ్లించాలన్నది టీడీపీ లక్ష్యం. అదే అవకాశంగా చేసుకుని తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ కీలక నేతలపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడాలన్నది లోగుట్టు. అనంతరం వారిపైనే అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయాలన్నది పన్నాగం. వెరసి తిరుమలపై చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు మరచిపోయేట్టు చేయడమే టీడీపీ కుట్ర అంతిమ లక్ష్యం. పక్కా పన్నాగంతోనే అంబటిపై హత్యాయత్నం ప్రభుత్వ ముఖ్యనేత ఆదేశాలతో టీడీపీ గూండాలు బరితెగించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పక్కా పన్నాగంతో హత్యాయత్నానికి తెగబడ్డారు. లడ్డూ ప్రసాదానికి చంద్రబాబు కలిగించిన కళంకానికి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆయన గుంటూరులోని గోరంట్లకు శనివారం ఉదయం బయలుదేరారు. అప్పటికే కర్రలు, రాడ్లు, రాళ్లు పట్టుకుని మాటువేసిన టీడీపీ గూండాలు అంబటి రాంబాబు వాహనంపై ఒక్కసారిగా ముప్పేట దాడి చేశారు. ఆయన వాహనంపైకి రాళ్లు విసిరి బీభత్సం సృష్టించారు. వాహనాన్ని కదలనివ్వకుండా అడ్డుకుని ఆయన్ని కిందకు దించి హత్య చేయాలన్నది వారి లక్ష్యం. ఆయన వాహనంపైకి టీడీపీ గూండాలు దండెత్తినా సరే పోలీసులు వారిని వారించేందుకు యత్నించనే లేదు. ఆ హత్యాయత్నం నుంచి అంబటి రాంబాబు అతి కష్టం మీద తప్పించుకుని బయటపడ్డారు. కానీ టీడీపీ గూండాలు మాత్రం శాంతించ లేదు.గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలోనే టీడీపీ రౌడీలు అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. విచక్షణారహితంగా రాళ్లు విసిరారు. ఆయన నివాసంలోకి చొరబడి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేసి భయోత్పాతం సృష్టించారు. ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇంట్లో వారిపై దాడికి పాల్పడ్డారు. రాత్రికి ఆయన కారుకు, కార్యాలయానికి నిప్పు పెట్టారు.బాధితుడైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు టీడీపీ గూండాల దాడిలో బాధితుడైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు నమోదు చేసి పోలీసులు తమ ప్రభు భక్తిని చాటుకున్నారు. తనపై హత్యాయత్నానికి పాల్పడుతున్న వారిని వారించేందుకు అంబటి రాంబాబు యత్నించారు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్న వారితో ఆయన వాగ్వాదానికి దిగారు. ఆ వాగ్వాదాన్ని వక్రీకరిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆయనపైనే ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆ వెంటనే నకిరేకల్ పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు గుంటూరులోని ఆయన నివాసానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఆయనపై వేర్వేరు పోలీసు స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అంటే ఆయనపై అక్రమ కేసు ఒక్క నకిరేకల్ పోలీసు స్టేషన్కే పరిమితం కాదని స్పష్టమవుతోంది. తద్వారా ఆయన్ను వేధించాలన్నదే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. కాగా, తమకు భద్రత కల్పించాలని అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి రాష్ట్ర హైకోర్టులో శనివారం రాత్రి అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దాడులు, దౌర్జన్యాలతో భయోత్పాతం లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్రకు ప్రాయశ్చిత్త పూజలు చేసే వైఎస్సార్సీపీ నేతలపై దాడులతో విరుచుకుపడాలని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది. ఈ క్రమంలో తిరుపతిలో పరిహార హోమం నిర్వహిస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై దాడికి యత్నించారు. పల్నాడు జిల్లా యడ్లపాడులోని వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగి వస్తున్న మాజీ మంత్రి విడుదల రజినీపై టీడీపీ రౌడీ మూకలు దూషిస్తూ దాడికి యత్నించారు. వినుకొండలో పరిహార పూజలు నిర్వహించి ర్యాలీగా వస్తున్న మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును అడ్డుకున్నారు. ఆయుధాలు పట్టుకుని రోడ్లపై తిరుగుతున్న టీడీపీ గూండాలను విడిచిపెట్టి, తమను అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీంతో లాఠీలతో పోలీసులు విరుచకుపడ్డారు. ఈ ఘటనలో బ్రహ్మనాయుడు గాయపడ్డారు. కానీ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ టీడీపీ నేతలు పెట్టిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఇదే రీతిలో టీడీపీ దాడులు, దౌర్జన్యాలకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ పెద్దల కుట్ర, పోలీసుల అండతో టీడీపీ రౌడీ మూకలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలతో అరాచకానికి తెగబడుతున్నాయి. పోలీసు విధులేంటి? వారు చేసిందేంటి? అంబటి లక్ష్యంగా టీడీపీ గూండాల దాడి.. టీడీపీ గూండాగిరికి ప్రభుత్వ యంత్రాంగం దాసోహంరాష్ట్రంలో చంద్రబాబు రౌడీ మూకలు సృష్టిస్తున్న జంగిల్ రాజ్ అరాచకానికి పోలీసు యంత్రాంగం కొమ్ము కాస్తోంది. అంబటి రాంబాబును అంతం చేయడమే లక్ష్యంగా టీడీపీ గూండాలు శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆయన వాహనం, పార్టీ కార్యాలయం, నివాసాలపై వరుస దాడులకు తెగబడ్డారు. అయినా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విస్మయ పరిచింది. అంబటి ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించిన వైఎస్సార్సీపీ అధిష్టానం.. ముఖ్య నేతలు ఆయనకు తక్షణం భద్రత కల్పించాలని కోరేందుకు చేసిన ప్రయత్నాలను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. శాసన మండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రతినిధులు ఈ అంశంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడేందుకు యత్నించినా ఆయన స్పందించలేదు. ఓ మాజీ మంత్రి ప్రాణాలకు ముప్పు ఉందనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ఐదారు గంటలపాటు ప్రయత్నించినా కనీసం అందుబాటులోకి రాలేదు. శాంతి భద్రతల అదనపు డీజీ మధుసూదన్రెడ్డిని సంప్రదించేందుకు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. ఆయన కూడా వారికి అందుబాటులోకి రాలేదు. దాంతో అంబటి రాంబాబుకు భద్రత కల్పించే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ దృష్టికి తీసుకువెళ్లేందుకు బొత్స సత్యనారాయణ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కనీసం గుంటూరు జిల్లా ఎస్పీతో మాట్లాడి అంబటికి పటిష్ట భద్రత కల్పించాలని కోరాలని బొత్స, వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. వారిద్దరి ఫోన్ కాల్స్కు గుంటూరు ఎస్పీ స్పందించ లేదు. ఉద్దేశపూర్వకంగా పోలీసు పెద్దల ప్రేక్షక పాత్ర వందలాది మంది టీడీపీ గూండాలు దాడితో అంబటి రాంబాబు దంపతులు ఓ గదిలో తలుపు వేసుకుని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచి్చంది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితతోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల బృందం గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ను కలిసేందుకు శనివారం రాత్రి ఆయన కార్యాలయానికి వెళ్లింది. దాదాపు గంటపాటు ఎస్పీ కార్యాలయంలో వేచి ఉన్నా ఎస్పీ వకుల్ జిందాల్ వారిని కలవనేలేదు. గంట తర్వాత అదనపు ఎస్పీ రమణమూర్తిని కలవమని సమాచారం ఇచ్చారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం అదనపు ఎస్పీ రమణమూర్తిని కలిసి పరిస్థితిని వివరించారు. రాత్రి 10.30 గంటల సమయంలో అంబటి రాంబాబును పోలీసులు ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. మరోవైపు టీడీపీ గూండాలు శనివారం అర్థరాత్రి దాటినా అంబటి రాంబాబు కార్యాలయం, నివాసాలపై దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఆయ ఇంటి ముందున్న కారుకు నిప్పంటించారు. తెల్లవారేసరికి ఆయన నివాసాన్ని నేలమట్టం చేస్తామని టీడీపీ గూండాలు బహిరంగంగా ప్రకటిస్తున్నా పోలీసులు మాత్రం వారిని అడ్డుకునేందుకు కనీసం ప్రయత్నించక పోవడం విస్మయ పరుస్తోంది. ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతోనే పోలీసు పెద్దలు ఉద్దేశ పూర్వకంగా ప్రేక్షక పాత్ర పోషించినట్లు స్పష్టమవుతోంది. కాగా, ఇటీవల వైఎస్సార్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ రౌడీ మూకలు ఇదే తీరులో విధ్వంసం సృష్టించినా పోలీసులు స్పందించలేదు. పైగా ఆయనపైనే కేసు పెట్టారు. -
మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు చేస్తారా?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మా వారిపై దాడులు చేస్తారా? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? అంటూ మండిపడ్డారు. మీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ‘‘జంగిల్ రాజ్’’గా మారిపోయిందంటూ సీఎం చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు.వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులపై వరుసగా జరుగుతున్న దాడులు రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తున్నాయని, గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, రాష్ట్ర గవర్నర్, కేంద్ర హోం శాఖను ట్యాగ్ చేస్తూ శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే..ఆటవిక రాజ్యాన్ని సృష్టించారు‘‘చంద్రబాబు గారూ.. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా? ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు, ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? మీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ‘‘జంగిల్రాజ్’’గా మారిపోయింది కదా.. చట్టం, న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా, ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు. పోలీసులు దాడులకు కాపలా కాశారుమా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ, ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు గారూ.. మీ ఆదేశాలతోనే మీ టీడీపీ రౌడీలు ఆయన ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు, దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం.తప్పులు కప్పిపుచ్చుకునేందుకే మళ్లీ కొత్త కుట్రలుతిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్లు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయ పరచినందుకు దేశ వ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా, మీ తప్పులను దాచి పెట్టేందుకు మళ్లీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. దాంట్లో భాగమే ఈ హేయమైన దాడులు. ప్రతిష్ఠాత్మక ల్యాబుల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా, మా పార్టీ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా, మీ దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని ఏకంగా హత్యాయత్నం చేయించడమే మీ నియంత స్వభావానికి, దుర్మార్గానికి నిదర్శనం. మీ వైఖరి అత్యంత ప్రమాదకరంచంద్రబాబు గారూ.. మీరు ఒక కరుడుగట్టిన గూండాగా, ఓ నియంతగా తయారయ్యారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు మీ వైఖరి అత్యంత ప్రమాదకరం. వరుసగా మా పార్టీ సీనియర్ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని నేను కోరుతున్నాను. దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. వైఎస్సార్సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని చేపడతారు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అంబటికి వైఎస్ జగన్ పరామర్శధైర్యంగా ఉండాలని.. పార్టీ మొత్తం అండగా ఉంటుందంటూ భరోసావైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో ఆయనను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఫోన్లో పరామర్శించారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని ఆయనకు భరోసా ఇచ్చారు. రాష్ట్రం జంగిల్రాజ్గా మారిపోయిందని, చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారంటూ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు దుర్మార్గాలు రోజురోజుకీ పెరిగిపోయాయని అన్నారు. టీడీపీ మూకలు ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నం, దాడులకు తెగబడ్డాయని, కూటమి అరాచక పాలనను ప్రజలు సహించబోరన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జంగిల్ రాజ్.. పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన
సాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో జంగిల్ రాజ్ సృష్టిస్తోంది. టీడీపీ గూండాలు బహిరంగంగా ఆయుధాలు చేతబట్టి వైఎస్సార్సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై శనివారం హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తుదకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుట్ర బెడిసి కొట్టడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు పాలకులు బరి తెగించారు. ఈ క్రమంలో వందలాది మంది పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడికి దిగినా వారు చోద్యం చూస్తూ మిన్నకుండి పోవడం విస్తుగొలుపుతోంది. వందల మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైనా దాడి చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఒక పథకం ప్రకారం అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలన్న తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా గూండాలను పంపించి ఆయనపై ఉదయం నుంచి దాడి చేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేసింది. పక్కా స్కెచ్తో దాడులుశనివారం ఉదయం గుంటూరు రూరల్ మండలం గోరంట్లలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసేందుకు బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నగరాల మీదుగా కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు కారును అడ్డగించి దాడికి ప్రయత్నం చేశారు. దారి పొడవునా కర్రలు పట్టుకొని కేకలు వేస్తూ రెచ్చగొట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వందన.. అంబటి రాంబాబును ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి సిద్ధార్థనగర్లోని తన కార్యాలయానికి అంబటి చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ఉద్దేశించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యిపై గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని చెప్పినందుకే తనపై దాడికి తెగబడ్డారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు తిట్టాలనే ఉద్దేశం లేనేలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్, రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే ప్రసక్తి లేదని, తన ఇంట్లోని కుక్కలు కూడా భయపడవని చెప్పారు. ఒకవేళ అరెస్ట్ చేసినా, జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈలోగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు నల్లపాడు సీఐ వంశీధర్ అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి నోటీసు ఇవ్వడానికి వచ్చానని చెప్పి కొద్దిసేపు అక్కడి పరిస్థితులు గమనించి వెళ్లిపోయారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు లంక మాధవి అంబటి ఇంటి ముందుకు వచ్చి చెప్పు చూపించి దుర్భాషలాడారు. రండి తేల్చుకుందాం అంటూ బూతులు తిడుతూ రెచ్చగొట్టారు. కర్రలు, రాడ్లతో దాడి చేస్తూ బీభత్సంఅప్పటికే పథకం ప్రకారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, అమె భర్త గల్లా రామచంద్రరావు నేతృత్వంలో వందలాది మంది కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకుని అంబటి రాంబాబు ఇంటి చుట్టూ చేరుకున్నారు. అప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించినా, టీడీపీ గూండాలు నేరుగా అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. కార్యాలయంలో ఉన్న అంబటి రాంబాబుపై తెలుగుదేశం నేతలు అబ్బూరి మల్లి, కనపర్తి శ్రీనివాసరావు, రాయపాటి అమృతరావు, నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు, మహిళా నాయకులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఫర్నీచర్ పగలగొట్టారు. ఇంటిపై దాడి చేసి తలుపులు, కిటికీలు పగులగొట్టారు. అంబటి రాంబాబు భార్య, కూతురు ప్రాణభయంతో ఇంట్లోని ఓ గదిలో దాక్కున్నారు. టీడీపీ గూండాలు ఇంటి ఆవరణ, పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న వాహనాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు. కోడిగుడ్లు విసిరారు. ఈ విధ్వంసకాండ అంతా పూర్తవుతుండగా అప్పుడు పోలీసులు టీడీపీ గూండాలను బతిమాలి బయటకు పంపారు. అప్పటి వరకూ అక్కడే ఉండి ఎవరిని అడ్డుకోకుండా చోద్యం చూశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. అంబటి రాంబాబు బయటకు రావాలని సవాలు విసిరారు. మీ ఇంటి కుక్క భయపడదేమో, మీరు భయపడేలా చేస్తామంటూ దాడులను ప్రోత్సహించారు. అంబటి దిష్టి బొమ్మను దహనం చేశారు. బూతులు తిడుతూ.. రెచ్చగొడుతూటీడీపీ నాయకుడు, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కొంత మంది వికలాంగులను సైతం తీసుకొచ్చి మైక్లో బూతులు తిట్టారు. ‘నా కొడకా.. అంబటీ బయటికి రారా..’ అంటూ రెచ్చిపోయారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా, వయసుకు గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు బూతు పురాణం లంకించుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ బీభత్సం రాత్రి 10 గంటలు అయినప్పటికీ కొనసాగింది. ఫోన్లు చేసి గుంపులు గుంపులుగా తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను అక్కడికి రప్పించారు. హిజ్రాలను, దివ్యాంగులను కూడా తీసుకువచ్చి గొడవ చేయించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కూడా జనాన్ని అక్కడికి తరలించారు. అంబటి రాంబాబు కార్యాలయంలో అప్పటికే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఆళ్ల కిరణ్, పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సైదా ఖాన్ తదితరులు అంబటి కార్యాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. గొడవ విషయం తెలియగానే పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబటి రాంబాబుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.పోలీసులే దగ్గరుండి దాడి చేయించారని సర్వత్రా చర్చఅంబటి రాంబాబు ఇంటిపై దాడి చేస్తున్న గూండాలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, వచ్చిన వారికి బందోబస్తు కల్పించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇద్దరు డీఎస్పీలు, నగరంలో ఉన్న సీఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఒక్కరు కూడా దాడులకు దిగుతున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయలేదు. ఈ దాడిని పోలీసులే దగ్గరుండి చేయిస్తున్నట్లుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కళ్లెదుటే ఫర్నీచర్ను ధ్వంసం చేస్తుంటే.. కార్లపై దాడులు చేస్తుంటే చోద్యం చూడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ మాత్రం దానికి అక్కడికి పోలీసులు ఎందుకొచ్చారని నిలదీస్తున్నారు. పోలీసు వ్యవస్థ పని తీరు చాలా అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు మాజీ హోం మంత్రి సుచరిత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ సమన్వయకర్తలు బలసాని కిరణ్కుమార్, వనమా బాలవజ్రకుమార్, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన అందుబాటులోకి రాలేదు. గంటకు పైగా నాయకులు ఎస్పీ ఇంటి ముందు నిలబడే ఉన్నారు. చివరికి ఎస్పీ లైన్లోకి వచ్చి తాను గుంటూరులో లేనని, అడిషనల్ ఎస్పీని కలవాలని చెప్పారు. ఐజీ కూడా ఫోన్కు అందుబాటులోకి రాలేదు. అంబటి రాంబాబు కార్యాలయానికి నిప్పు పెట్టిన తెలుగుదేశం పార్టీ గూండాలు వైఎస్సార్సీపీ బీసీ విభాగం నేతపై టీడీపీ గూండాల దాడిఅంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి తెగబడుతుండగా ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు దారం అశోక్యాదవ్పై విరుచుకు పడ్డారు. కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతని కారును సైతం ధ్వంసం చేశారు. తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయిన అశోక్ను వైఎస్సార్సీపీ కార్యకర్తలు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తమకు అడ్డువచ్చిన ఎవరినైనా చంపేస్తాం రండిరా అంటూ టీడీపీ గూండాలు తనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని అశోక్ వాపోయాడు.అర్ధరాత్రి దాటినా..టీడీపీ కార్యకర్తల దిగ్బంధనంలో ఉన్న అంబటి రాంబాబు కార్యాలయంపై శనివారం రాత్రి 10 గంటల తర్వాత రెండోసారి దాడికి తెగబడ్డారు. సుత్తులతో గోడలు బద్ధలు కొట్టే ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద దుంగలను తీసుకు వచ్చి కిటికీలను పగులగొట్టారు. నాపరాయి ముక్కలతోపాటు, పెద్ద పెద్ద రాళ్లను అంబటి రాంబాబు ఉన్న పార్టీ కార్యాలయంపై విసురుతున్నారు. కవరేజ్ చేస్తున్న మీడియాపై కూడా దాడులకు తెగబడ్డారు. ఆర్ టీవీ కెమెరామెన్తో పాటు పలువురు విలేకరులపై దాడికి ప్రయత్నించారు. కాగా, అంబటి రాంబాబుపై టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు మేరకు ఒక కేసు.. సుమోటోగా మరో కేసు నమోదు చేసి, రాత్రి 10.35 గంటలకు అరెస్టు చేశారు. ఆయనపై 126(2), 132, 196(1), 352, 351(2), 292 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన్ను పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లిన తర్వాత తెలుగుదేశం గూండాలు పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. కార్యాలయానికి నిప్పు పెట్టారు. పార్టీ కార్యాలయంలో చిక్కుకుపోయిన ఇతర నేతలు, మీడియా ప్రతినిధులు అతి కష్టంగా బయటకు వచ్చారు. అంబటి ఇంటి వద్ద సాగిన దారుణకాండ యావత్తు ప్రతి నిమిషాన్ని మంత్రి లోకేశ్ పర్యవేక్షించారని టీడీపీ శ్రేణులు బహిరంగంగా చెప్పుకోవడం గమనార్హం. చంద్రబాబును ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేయలేదునగరంపాలెం (గుంటూరు వెస్ట్): సీఎం చంద్రబాబును ఉద్దేశించి తాను ఏ వ్యాఖ్యలు చేయలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని ఆయన నివాసం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో టీడీపీ శ్రేణులు వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని, అక్కడికి వెళ్లి ఇటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని, 24 గంటల్లో ఆ ఫ్లెక్సీని తొలగించాలని చెప్పి తాను వచ్చేశానని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్లింది ఫ్లెక్సీలు చించేందుకు కాదని, వాటిని తొలగించాలని చెప్పేందుకు మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు. అక్కడి నుంచి కారులో వెళుతుండగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లు చేతపట్టుకుని ఒక్కసారిగా తన కారుపైకి తెగబడ్డారని చెప్పారు. టీడీపీకి చెందిన ఓ మహిళ అసభ్యకరంగా మాట్లాడటంతో తాను ప్రతిస్పందనగా వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఈలోగా చంద్రబాబూ దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు తిట్టాలనే ఉద్దేశం తనకు లేనేలేదని స్పష్టం చేశారు. తనపై కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేయడానికి టీడీపీ గూండాలు కారు డోరు తీశారని, తాను ప్రాణ రక్షణ నిమిత్తం అక్కడున్న వారిపై మాట్లాడానని చెప్పారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం వేళ టీడీపీ నాయకురాలు (లంకా మాధవి) సిద్ధార్థనగర్లోని తన ఇంటి వద్దకు వచ్చి చెప్పు పట్టుకుని నానాయాగీ చేసినా పోలీసులు ఆమెను ఆపలేదని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ల రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే ప్రసక్తేలేదని, తన ఇంట్లోని కుక్కలు కూడా భయపడవని చెప్పారు. తాను అరెస్ట్కు భయపడేదే లేదని, ఒకవేళ అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, బెయిల్కు కూడా దరఖాస్తు చేయనని స్పష్టం చేశారు. తన ఇంటి వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్పై, తనపై అభిమానంతో వచ్చారని.. అంతేతప్ప తన అరెస్ట్ను అడ్డుకునేందుకు కాదని స్పష్టం చేశారు.రారా చూసుకుందాం.. ఇక్కడే పాతేస్తాంగోరంట్లలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ‘రారా చూసుకుందాం.. నిన్ను ఇక్కడే పాతేస్తాం’ అంటూ రాయలేని పదాలతో టీడీపీ గూండాలు బూతు పురాణంతో విరుచుకుపడటంతో భక్తులు హడలిపోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలియుగదైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలు అసత్యమని సీబీఐ సిట్ నివేదికలో వెల్లడి కావడంతో శనివారం అంబటి రాంబాబు గోరంట్లలోని శ్రీవేంకటేశ్వరాలయంలో పాపపరిహార పూజల్లో పాల్గొన్నారు. ఇది తెలిసిన టీడీపీ గూండాలు కర్రలు, ఇనుపరాడ్లు తీసుకుని అంబటిపైకి దూసుకొచ్చారు. వేలాది మంది భక్తులు చూస్తుండగా.. పోలీసుల సమక్షంలో అంబటిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. టీడీపీ మహిళా గూండాలు సైతం అసభ్య పదజాలంతో రోడ్లపై కర్రలు, రాడ్లతో హల్చల్ చేశారు. టీడీపీ గూండాలను అడ్డుకోవాల్సిన పోలీసులు.. అక్కడ నుంచి వెళ్లాలని అంబటి పట్ల దురుసుగా ప్రవర్తించారు. అక్కడి నుంచి ముందుకు కదులుతున్న అంబటి కారుపై టీడీపీ గూండాలు రాడ్లు, కర్రలతో దాడికి దిగి కారు అద్దాలను పగలగొట్టి హత్య చేయడానికి యత్నించారు. టీడీపీ గూండాల హడావుడికి అమరావతి రోడ్డులో ప్రయాణికులు సైతం భయాందోళనకు గురయ్యారు. -
మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు చేస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా?’’ అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు.. ఇప్పుడు ప్రశ్నిస్తున్నవారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? మీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం “జంగిల్రాజ్’’గా మారిపోయింది కదా. చట్టం, న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా, ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు.’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ, ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబూ.. మీ ఆదేశాలతోనే మీ టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు, దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం...తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక NDDB, NDRI ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను గాయపరచినందుకు దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా, మీ తప్పులను దాచిపెట్టేందుకు మళ్లీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. దాంట్లో భాగమే ఈ హేయమైన దాడులు.ప్రతిష్ఠాత్మక ల్యాబుల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా, మా పార్టీ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా, మీ దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని ఏకంగా హత్యాయత్నం చేయించడమే మీ నియంత స్వభావానికి, దుర్మార్గానికి నిదర్శనం. ఒక కరుడుగట్టిన గూండాగా, ఓ నియంతగా మీరు తయారయ్యారు చంద్రబాబుగారూ. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు మీ వైఖరి అత్యంత ప్రమాదకరం.వరుసగా మా పార్టీ సీనియర్ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే వైఎస్సార్సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని చేపడతారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు..@ncbn గారూ.. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా? ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నవారిని మీ గూండాలతో చంపాలని… pic.twitter.com/ZfmwOvD3GX— YS Jagan Mohan Reddy (@ysjagan) January 31, 2026 -
అంబటి రాంబాబుకు వైఎస్ జగన్ ఫోన్
సాక్షి, గుంటూరు: అంబటి రాంబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు. టీడీపీ గూండాల హత్యాయత్నానికి గురైన అంబటిని పరామర్శించి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. రాష్ట్రం జంగిల్రాజ్గా మారిపోయిందన్నారు. చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు దుర్మార్గాలు రోజురోజుకూ పెరిగిపోయాయన్న వైఎస్ జగన్.. ఉద్దేశపూక్వకంగానే హత్యాయత్నం, దాడులకు దిగారన్నారు. ప్రజలన్నీ చూస్తున్నారు. ఈ అరాచకపాలనను ప్రజలు సహించబోరు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారు. అంబటికి పార్టీ మొత్తం అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.అంబటిపై టీడీపీ గూండాల హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ సీరియస్గా తీసుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేసింది. లడ్డూ విషయంలో సిట్ ల్యాబ్ రిపోర్టుల ఫలితాలతో అడ్డంగా దొరికిపోవడంతో బాబు హింసను రాజేస్తున్నారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. దాంట్లో భాగంగానే వరుస దాడులు జరుగుతున్నాయన్న వైఎస్సార్సీపీ.. పథకం ప్రకారమే అంబటిపై హత్యాయత్నం చేశారని పేర్కొంది. అంబటిపై హత్యాయత్నాన్ని కేంద్ర హొంశాఖ దృష్టికి వైఎస్సార్సీపీ తీసుకెళ్లనుంది. కేంద్ర హోంశాఖకు వైవీ సుబ్బారెడ్డి లేఖ రాయనున్నారు. -
అంబటి రాంబాబు భద్రతపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆందోళన
అమరావతి: మాజీ మంత్రి అంబటి రాంబాబు భద్రతపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేసిన నేపథ్యంలో డీజీపీకి లేఖ రాసింది వైఎస్సార్సీపీ. అంంబటి ప్రాణానికి ముప్పు ఉందంటూ వైఎస్సార్సీపీ ఆందోళన చెందుతోంది. దీనిలో భాగంగా చీఫ్ సెక్రటరీ, డీజీపీకి లేఖలు రాసింది. అయితే చీఫ్ సెక్రటరీ, డీజీపీలు ఫోన్లు ఎత్తలేదు. దాంతో అంబటికి కట్టుదిట్టమైన భద్రత ఇవ్వాలని డీజీపీకి లేఖ రాయడంతో పాటు మెయిల్ చేసింది వైఎస్సార్సీపీ . అంబటి ఇంటివద్ద పరిస్థితి చాలా దారుణంగా ఉందని, డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాలని లేఖలో పేర్కొంది. అంబటి ప్రాణానికి ముప్పు ఉందని,, మూడు గంటలకుపైగా అక్కడే ఉండి టీడీపీ శ్రేణులు రెచ్చగొడుతున్నాయని లేఖ ద్వారా స్పష్టం చేసింది. ఇవీ చదవండి:మాజీ మంత్రి అంబటిపై హత్యాయత్నం‘ఏపీలో చట్టం లేదు.. రెడ్బుక్ పాలన నడుస్తోంది’ -
అంబటిపై హత్యాయత్నాన్ని ఖండించిన ముద్రగడ
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, పార్టీ అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు. టీడీపీ గూండాల దాడులు అత్యంత హేయనీయం అన్నారు. అధికారం ఉందని చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని.. రాష్ట్రం మీ ఎస్టేట్ కాదు.. ప్రజలు మీ బానిసలు కాదు.. ప్రజలు తిరగబడితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి అంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు.అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గుండాలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అంబటి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించారని.. రాష్ట్రంలో జంగిల్ రాజు ప్రభుత్వం నడుస్తోందంటూ మండిపడ్డారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నప్పుడల్లా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. 1000 మందికి పైగా వెళ్లి హత్య చేయాలని ప్లాన్ చేశారు.రోజులన్నీ ఒకేలా ఉండవు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. వడ్డీతో సహా మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాము. కర్రలు రాడ్లు పట్టుకొని అంబటి రాంబాబును చంపాలని చూస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న రాంబాబుని చంపాలని చూశారు. కాపులను చంపడం తెలుగుదేశం పార్టీకి కొత్తమీ కాదు. గతంలో వంగవీటి రంగాను చంపించారు. నేడు అంబటి రాంబాబును చంపాలని చూస్తున్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం ను చంపాలని చూశారు. మీ దాడులను చూస్తూ వైఎస్సార్సీపీ ఊరుకోదు’’ అని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. -
స్కిల్ స్కామ్ కేసులో కీలక పరిణామం
విజయవాడ: విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు చంద్రబాబును వదలడం లేదు. చంద్రబాబు స్కిల్ కేసును క్లోజ్ చేసిన కొద్దిరోజుల్లోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పిఎంఎల్ఏ కోర్ట్ లో ప్రాసిక్యూషన్ ఫిర్యాదు నమోదు చేసింది ఈడీ. స్కిల్ స్కామ్లో పాత్రధారులైన డిజైన్ టెక్ పై ఫిర్యాదు నమోదు చేసింది. వికాశ్ కన్వేల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్తో పాటు పలువురిపై అభియోగాలు మోపింది. ఈ కేసులో భారీగా నిధులు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ముకుల్ చంద్ర అగర్వాల్,సురేష్ గోయల్ సహకారంతో దారిమళ్లించినట్టు పేర్కొన్న ఈడీ..స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ నిధులు మళ్లించినట్టు గుర్తించింది. 2023లోనే రూ. 31.20 కోట్లు ఆస్తులు కూడా అటాచ్ చేసిన ఈడీ.. తాజాగా మరింత లోతుగా దర్యాప్తు చేసినట్టు వెల్లడించింది. అదనపు విచారణలో ఢిల్లీ, ముంబయి, పూణెలో ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. నిందితులకు చెందిన మరో రూ. 23.54 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. మొత్తం రెండు దఫాలుగా 54.74 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది. తాజా దర్యాప్తు అంశాలతో కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్ని విచారణకు స్వీకరించింది కోర్టు.‘ఏపీలో చట్టం లేదు.. రెడ్బుక్ పాలన నడుస్తోంది’ -
అంబటి ఆఫీసుకు టీడీపీ గుండాల నిప్పు
31-01-2026 11.12 PMఅంబటి రాంబాబు కారుకు కూడా నిప్పు పెట్టిన టీడీపీ గుండాలుఅంబటి రాంబాబు కారు దగ్దం11.04 PMఅంబటి ఆఫీసుకు కరెంట్ కట్ చేసిన టీడీపీ గుండాలు.10:56PMకొనసాగుతున్న టీడీపీ గుండాల అరాచకం అంబటి ఆఫీసుకు టీడీపీ గుండాల నిప్పు మాజీ మంత్రి అంబటి రాంబాబు వద్ద మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ గూండాలు మళ్లీ రెచ్చిపోయి అంబటి ఇంటి వద్ద దాడికి యత్నించారు. కర్రలతో దాడికి యత్నించారు టీడీపీ గూండాలు. అంబటి ఇంట్లో ఉండగానే రాళ్లు విసురుతూ కర్రలతో నానా హంగామా చేస్తున్నారు. కర్రలు, రాడ్లతో మళ్లీ దాడులకు పాల్పడుతున్నారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో దాడులకు పాల్పడుతున్నారు. అంబటి ఆఫీస్ కిటికీలను ధ్వంసం చేశాయి టీడీపీ మూకలు. సుత్తులతో గోడలు బద్దలు గొట్టేందుకు యత్నిస్తున్నారు.అంతకుముందు అంబటిపై హత్యాయత్నం జరిగింది. ఆయన్ని హత్య చేసేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. ఇంట్లో ఫర్నీచర్, కారును టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వరంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ గూండాలు.. విధ్వంసం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు రౌడీయిజం ప్రదర్శించారు.టీడీపీ గూండాల దాడిని అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు. మైక్సెట్ ఏర్పాటు చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పచ్చ గూండాలు అరాచకం సృష్టించారు. దాడులను అడ్డుకున్న పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతకుముందు కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. ఎందుకు ఇంట్లోకి వచ్చారంటూ పోలీసులను అంబటి ప్రశ్నించగా.. నోటీసులు ఇవ్వడానికి వచ్చామంటూ తెలిపారు.ఏ నోటీసులు ఇస్తారో ఇవ్వండంటూ అంబటి రాంబాబు అన్నారు. దీంతో పోలీసులు మళ్లీ వస్తామంటూ చెప్పి వెళ్లిపోయారు. అంబటి నివాసానికి వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. మరోవైపు, అంబటి ఇంటి వద్ద టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బూతులు తిడుతూ టీడీపీ గూండాలు వీరంగం చేశారు. దాడి చేసేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. టీడీపీ గూండాలను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వ విష ప్రచారం తప్పని సీబీఐ నివేదికతో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోరంట్లలో పాప ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బయల్దేరారు. అయితే.. గుంటూరు సెంటర్లో ఆయన్ని అడ్డుకున్న టీడీపీ గూండాలు.. దాడికి యత్నించారు. అయితే తృటిలో ఆయన ఆ దాడి నుంచి బయటపడ్డారు. అయితే దాడి సమయంలో కర్రలు, రాడ్లతో టీడీపీ కేడర్ హల్చల్ చేసింది.మరోవైపు ప్లాన్ ప్రకారమే తనపై దాడికి యత్నించారన్న అంబటి రాంబాబు.. ఇటు పోలీసుల తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారు. కూటమి వేసిన ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాయడం చూస్తుంటే.. అసలు పోలీస్ వ్యవస్థ బతికే ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. -
అంబటి రాంబాబుపై దాడిని ఖండించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: గుంటూరు శివారులోని గోరంట్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జంగిల్రాజ్ కొనసాగుతోందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన చేస్తూ.. ఏమన్నారంటే..వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా, నాటి సీఎం వైఎస్ జగన్పైనా అసత్య ఆరోపణలు చేస్తూ, చివరకు దేవదేవుడి ప్రసాదం పేరుతో అనైతిక రాజకీయం చేశారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ, చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ తేల్చి చెప్పాయి. దీంతో దిక్కు తోచని స్థితిలో, కనీసం పశ్చాతాపం కూడా ప్రకటించకుండా, మళ్లీ అవే అసత్యాలతో ఎదురుదాడి చేస్తున్నారు.ఇంకా మరింత దిగజారి రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్తో పాటు, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి ఫోటోలతో, అవే పచ్చి అబద్ధాలతో నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఫ్లెక్సీలు వేస్తున్నారు. వాటిని మా పార్టీ నాయకులు తొలగిస్తే.. ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కాకుండా, మా పార్టీ వారిపై పోలీసులు చర్య తీసుకోవడం అత్యంత హేయం.కాగా, గుంటూరు శివార్లలోని గోరంట్లలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో పూజలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆ తర్వాత పక్కనే ఉన్న వివాదాస్పద ఫ్లెక్సీ వద్దకు చేరుకోగా, అప్పటికే కర్రలు, రాడ్లతో సిద్ధంగా ఉన్న టీడీపీ గుండాలు ఆయనపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది.మా పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడి ఒక ఉన్మాద చర్యశాంతియుతంగా మా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే ఇంత బరి తెగించి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఏనాడూ ఇంత దారుణమైన పాలన చూడలేదు. ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక ఆటవిక రాజ్యమా? ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాం. -
చంద్రబాబు, పవన్ హిందూ ద్రోహులు: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకనే నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు. మంత్రి లోకేష్ 208-211 పేజీలు చదువుకుంటే విషయాలు తెలుస్తాయన్నారు.‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అల్లర్లు సృష్టిస్తోంది. బిహార్లో ఉన్న పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. కూటమి నేతలకు నిద్రలో కూడా వైఎస్ జగనే గుర్తుకువస్తున్నారు. చంద్రబాబు పవన్, లోకేష్ను చూసి హిందువులు మండిపడుతున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ కాలినడకన తిరుమలకు వెళ్లి గుండు కొట్టించుకోవాలి. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయ్యాక తిరుమలలో అరాచకాలు పెరిగాయి’’ అని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబు, పవన్ హిందూ ద్రోహులు. వారికి దేవుడిపై భక్తి లేదు. వెంకటేశ్వరస్వామిపై కూటమి నేతలు అపచారాలు ఆపాలని వేడుకుంటున్నా. బీసీ మహిళ విడదల రజినిపై దాడి చేయడం దారుణం. టీడీపీ నేతలు కట్టిన ఫ్లెక్సీలకు పోలీసులు బందోబస్తు ఏంటీ?. కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి’’ అని వెల్లంపల్లి దుయ్యబట్టారు. -
అప్పుల బాబు బరితెగింపు
సాక్షి, అమరావతి: అప్పుల బాబు బరితెగించేసి వర్సిటీల నిధులపై కన్నేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొరికినచోటల్లా రుణాలు తీసుకున్న చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి దివాళా అంచున నెలబెట్టేశారు. ఇరవై నెలల్లో రూ.3.11 లక్షల కోట్లు మేర అప్పులు చేసినా ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు యూనివర్సిటీ నిధులపై కన్నేశారు. తొలివిడతలో ఉన్నత విద్యా మండలితోపాటు వర్సిటీల నిధులు సుమారు రూ.1200 కోట్లు లాక్కునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీటిని వర్సిటీల నుంచి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కు బదిలీ చేయించి ఇష్టారీతిన ఖర్చు చేసుకునేందుకు స్కెచ్ వేశారు. డిపాజిట్లు దారి మళ్లించేందుకు కుట్ర దశాబ్దాలుగా విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులతో వర్సిటీలు ఆర్థికంగా బలోపేతమయ్యాయి. ప్రభుత్వాల సాయం కోసం ఎదురు చూడకుండా ఆ నగదును జాతీయ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ల రూపంలో భద్రపరుచుకున్నాయి. ఇప్పుడు ఆ డిపాజిట్లనే బయటకు తీయించి దారి మళ్లించేందుకు చంద్రబాబు సర్కార్ ఒత్తిడి చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ వర్సిటీలకు నష్టమే జరుగుతోందని, ఈ సారి ఏకంగా ప్రభుత్వ వర్సిటీలను ఆర్థికంగా కుదేలు చేసి శాశ్వతంగా మూసేసే కుట్రకు పాల్పడుతున్నారని విద్యావేత్తలు మండిపడుతున్నారు. డిపాజిట్లను బయటకు తీసి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్లో జమ చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌఖిక ఆదేశాలతోనే వర్సిటీలపై ఒత్తిడి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ నిబంధనలు తుంగలో తొక్కేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం వర్సిటీల నిధుల మళ్లింపు విషయంలోనూ అదే పంథా కొనసాగిస్తోంది. నిధుల బదిలీకి సంబంధించి ప్రభుత్వం తరఫున ఎక్కడా దరఖాస్తు చేయకుండా మౌఖిక ఆదేశాలతోనే బెదిరిస్తూ పాశవికంగా వ్యవహరిస్తోంది. కొద్ది రోజులుగా ముఖ్యనేత కార్యాలయంలోని ఓ కీలక అధికారితోపాటు, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి ఓఎస్డీ కలిసి ఉన్నత విద్యా మండలి, వర్సిటీల వర్గాలకు పదేపదే ఫోన్లు చేసి అమానవీయ రీతిలో తిడుతూ ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చేసేది లేక కొన్ని వర్సిటీల్లో డిపాజిట్ల బదిలీ ప్రక్రియ ప్రారంభించేశారు.బాబు జమానాలో వర్సిటీలకు గడ్డుకాలమే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏనాడూ విద్యారంగాన్ని, వర్సిటీలను పట్టించుకోలేదు. అటువంటి బాబు ప్రస్తుతం కూటమిగా అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యా మండలి ఖజానాలోని రూ.10 కోట్లను వాడేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా చినబాబు లోకేశ్ ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుకు మళ్లించేశారు. మరోవైపు శతాబ్ది ఉత్సవాలతో కళకళాడాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం సైతం కళావిహీనంగా మారిపోయింది. వర్సిటీ కనీసం ప్రశ్నాపత్రాల ముద్రణకు కూడా నోచుకోవట్లేదు. ఇటీవల ఏయూ దూరవిద్య పరీక్షల నిర్వహణలో బయటపడిన డొల్లతనమే ఇందుకు నిదర్శనం. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగాల్సిన దూర విద్య పరీక్షలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఫలితంగా మాస్ కాపీయింగ్, ప్రశ్నాపత్రాలను ఈ మెయిల్లో పంపించడం, చేతిరాతతో ఉన్న ప్రశ్నాపత్రాన్ని జిరాక్స్ తీసి అప్పటికప్పుడు విద్యార్థులకు అందించే దుస్థితికి దిగజారింది.ఇదంతా విశాఖ తీరంలోని ఓ కార్పొరేట్ వర్సిటీకి లబ్ధి చేకూర్చేందుకు చేస్తున్నట్టు వినికిడి. అందుకే ప్రభుత్వ వర్సిటీకి రావాల్సిన ఎన్నో విలువైన ప్రాజెక్టులు సైతం ఆ కార్పొరేట్ వర్సిటీకి తరలిపోయాయి. ఇది ఒక్క ఏయూనే కాదు.. అమరావతికి కూతవేటు దూరంలోని ఆచార్య నాగార్జున వర్సిటీ, సాక్షాత్తూ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, జేఎన్టీయూలనూ పట్టిపీడిస్తున్న సమస్య.చంద్రబాబును నమ్మితే అసలుకే ఎసరు..! అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు సర్కారు అప్పుల కోసం ఏ వ్యవస్థనూ వదలడం లేదు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ సంస్థల నుంచి నిధులను లాగేస్తోంది. వాస్తవానికి జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లకు గ్యారెంటీ ఉంటుంది. నిత్యం చెల్లింపులు, ఉపసంహరణలకు అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు ట్రాక్ రికార్డు చూస్తే వర్సిటీలు, ఉన్నత విద్యా మండలి నిధులను తిరిగిచ్చే అవకాశమే ఉండదని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం ఒక శాతం అధిక వడ్డీకి ఆశపడి జాతీయ బ్యాంకుల్లోని డిపాజిట్లను తీసుకొచ్చి నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థల్లో పెట్టడం మంచిదికాదని మండిపడుతున్నారు. పైగా ప్రభుత్వమే ఎడా పెడా అప్పులు చేస్తుంటే.. వర్సిటీలకు తిరిగి చంద్రబాబు నిధులు చెల్లిస్తారనుకోవడం భ్రమేనని తెగేసి చెబుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి జపం చేస్తున్న చంద్రబాబు అభివృద్ధిని, పేదల సంక్షేమాన్ని పూర్తిగా అటకెక్కించేశారని, ఉద్యోగులకు 10వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించడం లేదని గుర్తు చేస్తున్నారు.కొండలా పేరుకుపోయిన బకాయిలుచంద్రబాబు ఏలుబడిలో ఉన్నత విద్య అంతకంతకూ దిగజారిపోతోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతోపాటు, ప్రైవేటు సంస్థలు సైతం తాము విద్యాలయాలను నడపలేమనే స్థాయికి వచ్చేశాయి. వీటన్నింటికీ ముఖ్య కారణం ‘ఫీజు రీయింబర్స్మెంట్’ చెల్లింపుల్లో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అత్యంత దుర్మార్గపు, నిర్లక్ష్యపు వైఖరేనని స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు రూ.5,600 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్, రూ.2,200 కోట్ల వసతి దీవెన బకాయిలు కొండలా పేరుకుపోవడం ప్రభుత్వ ఆర్థిక అనిశ్చితిని బట్టబయలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నిధులను బలవంతంగా లాక్కోవడం వర్సిటీల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. -
గ్రూప్-1 ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాలను విడుదల చేసింది. 89 పోస్టులకు పరీక్షలు జరగ్గా శుక్రవారం తుది ఫలితాలను సర్వీస్ కమిషన్ వెల్లడించింది. స్పోర్ట్సు కోటాపై హైకోర్టులో ఇంకా కేసు పెండింగ్లో ఉండడంతో రెండు పోస్టులు (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డీఎస్పీ సివిల్) పక్కనపెట్టి, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈనెల 6న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు మిగిలిన 87 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో ఉంచింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో గ్రూప్–1నోటిఫికేషన్ ఇచ్చింది. 2024 మార్చిలో ప్రిలిమ్స్ నిర్వహించారు. అదే ఏడాది మే/జూన్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా ప్రకటించారు. అయితే, ఎన్నికల ముందు ఈ పరీక్షలపై హైకోర్టులో పలు రకాల పిటిషన్లు వేయడంతో మెయిన్స్ పలుమార్లు వాయిదాపడి చివరికి 2025 మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించారు. అనంతరం మెయిన్స్లో 182 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేసి జూన్ నెలలో ఓరల్ టెస్ట్ పూర్తి చేశారు. శుక్రవారం ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను పోస్టుల వారీగా విడుదల చేశారు. మొత్తం 15 రకాల పోస్టులకు కేటగిరీల వారీగా ఫలితాలను వెల్లడించారు. వివిధ కేడర్ల పోస్టులకు ఎంపిక ఇలా.. ఫలితాలు ప్రకటించిన 87 పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్లు 9 మంది, స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్–17, డీఎస్పీ సివిల్–25, జైల్స్ డిప్యూటీ సూపరింటిండెంట్–1, జిల్లా ఫైర్ ఆఫీసర్–2, ఆర్టీవో (మల్టీజోన్–1)–6, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్(మల్టీ జోన్–1)–1, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్(మల్టీ జోన్–1)–3, డిప్యూటీ రిజి్రస్టార్స్ జోన్–2లో–4, జోన్ 4లో–2, గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్స్(మల్టిజోన్)–3, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటిండెంట్ (మల్టిజోన్–1)–1, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్–3, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్–4, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్(జోన్–4)–2, ఎంపీడీవో–4 పోస్టులు ఉన్నాయి.ప్రతిభకు ‘సలామ్’ ఆర్టీఓగా కార్పెంటర్ కుమారుడు నరసరావుపేట ఈస్ట్: సాధారణ కుటుంబం నుంచి గ్రూప్–1 స్థాయి అధికారిగా షేక్ యూసబ్ సలామ్ ఎంపికయ్యారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని వరవకట్టకు చెందిన సలామ్ తండ్రి సుభాని కార్పెంటర్. తల్లి నాసర్బీ గృహిణి. ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో సలామ్ రీజినల్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్యను పట్టణంలోనే పూర్తిచేసుకున్న సలామ్ బీటెక్, ఎంటెక్ చదివి తన దృష్టి సివిల్స్ వైపు మళ్లించారు. కఠోర శ్రమ చేశారు. సలామ్ తన రెండో ప్రయత్నంలో గ్రూప్–1కు ఎంపికయ్యారు. యూపీఎస్సీ పరీక్ష లక్ష్యంగా తన కృషి కొనసాగిస్తానని తెలిపారు. ‘విజయ’ పుత్రుడు తొలియత్నంలో ఏఈఎస్ కొలువు మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాల్లో మార్కాపురం పట్టణానికి చెందిన ఒద్దుల వెంకట సుజిత్ రెడ్డి సత్తాచాటారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. 2023లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన మొదటిసారిగా గ్రూప్ వన్ పరీక్ష రాసి ఏఈఎస్గా ఎంపికయ్యారు. ఆయన తండ్రి వీరారెడ్డి, తల్లి విజయ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా సుజిత్ను హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డితోపాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.సూపర్ సురేష్.. ప్రతిభలో ‘సిద్ధ’హస్తం డిప్యూటీ కలెక్టర్గా కొలువు పెద్దతిప్పసముద్రం: మొన్న విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటిన సురేష్ శుక్రవారం రాత్రి విడుదలైన గ్రూప్–వన్ ఫలితాల్లోనూ విజయకేతనం ఎగురవేశారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం రాపూరివాండ్లపల్లి పంచాయతీ కొత్తపల్లికి చెందిన యదశంద్రం సిద్ధప్ప, సిద్ధమ్మ దంపతుల కుమారుడు సురేష్. ఈయన గత ప్రభుత్వంలో సచివాలయ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆ ఉద్యోగం చేస్తూనే గ్రూప్ పరీక్షలకు సిద్ధమయ్యారు. తొలుత గ్రూప్–2 పరీక్షలు రాసి డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. అలాగే గ్రూప్–1 పరీక్షలూ రాసిన సురేష్ విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ఆర్టీఓగా ‘సంతోషి'oచే రావికమతం: అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన గట్రెడ్డి సంతోషి గ్రూప్–1 ఫలితాల్లో సత్తా చాటి ఆరీ్టవోగా ఉద్యోగం సాధించారు. సంతోషి ఎంటెక్ చదివారు. ఆమె ప్రస్తుతం మాకవరపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తూనే గ్రూప్–1,2 పరీక్షలకు సిద్ధమయ్యారు. మంగళవారం విడుదలైన పలితాల్లో గ్రూప్–2లో విజయం సాధించి, అమరావతిలో అసిస్టెంట్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. శుక్రవారం విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో సత్తాచాటి రీజినల్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్(ఆర్టీఓ)గా ఉద్యోగం సాధించారు. సంతోషి మాకవరపాలెం మండలం సుబ్బారాయుడు గ్రామానికి చె«ందిన లగుడు సూర్యనారాయణ (లేటు), సత్యవతి కుమార్తె. తండ్రి సూర్యనారాయణ చిన్నతనంలో మరణించడంతో తల్లి ఆమెను కష్టపడి చదివించారు. ఇదిలా ఉంటే సంతోషి భర్త గోపి సాఫ్ట్వేర్ ఇంజినీర్. ‘గౌరి’వప్రద విజయం డీఎస్పీగా శివనాగగౌరి ఎచ్చెర్ల: గ్రూప్–1 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎం పురం గ్రామానికి చెందిన సంపతిరావు శివనాగగౌరి సత్తాచాటారు. డీఎస్పీగా ఎంపికయ్యారు. మొత్తం 25 మంది డీఎస్పీలుగా ఎంపిక కాగా శ్రీకాకుళం జిల్లా నుంచి శివనాగగౌరి ఎంపిక కావడం విశేషం. ప్రాథమిక విద్య, పదో తరగతి వరకూ శ్రీకాకుళం నగరంలోని మునసబుపేట వద్ద గల గాయత్రి స్కూల్లోనూ, ఇంటర్ విశాఖపట్నంలోని శ్రీచైతన్య విద్యాసంస్థలో చదువుకున్నారు. అనంతరం తమిళనాడులోని వీఐటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఈమె 2017లో పోలవరం ప్రాజెక్ట్లో ఏఈఈగా ఎంపికయ్యారు. డిప్యుటేషన్పై ప్రస్తుతం వంశధార ప్రాజెక్టులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)గా విధులు నిర్వహిస్తున్నారు. 2017లోనే ఈమె గెయిల్లో (గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ఇంజినీర్గా ఎంపికయ్యారు. ఈమె అత్తమ్మ చౌదరి ధనలక్ష్మీ గతంలో జెడ్పీ చైర్పర్సన్ పనిచేశారు. ఈమె భర్త చౌదరి అవినాష్ ప్రస్తుతం డీసీఎంఎస్ చైర్మన్. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈమె గతంలో గ్రూపు–1 పరీక్షల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లి విఫలమయ్యారు. అయితే పట్టు వదలకుండా రెండో సారి ప్రయత్నించి విజయం సాధించారు. ‘ఓంకార’నాదం డీఎస్పీగా ఓంకార వెంకట నాగేశ్వరరావు తెనాలి: తెనాలి నాజరుపేటకు చెందిన అడపాల ఓంకార వెంకట నాగేశ్వరరావు గ్రూప్–1లో సత్తాచాటారు. డీఎస్పీగా ఎంపికయ్యారు. నాగేశ్వరరావు తండ్రి కూరగాయల వ్యాపారి. తల్లి గృహిణి. 2010–14లో నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ చేసిన నాగేశ్వరరావు సివిల్స్ లక్ష్యంతో ఢిల్లీ వెళ్లాడు. పోటీపరీక్షలకు తయారయ్యాడు. 2019లో సచివాలయ పరీక్షలు రాసి పంచాయతీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో పనిచేస్తున్నారు. అయినా రాజీపడక గ్రూప్–1 పరీక్షలు రాశారు. డీఎస్పీగా ఎంపికయ్యారు. -
చంద్రబాబుదే మహాపాపం.. రాజకీయ పాతకం!
‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు. పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయి. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయి..’ – నెల్లూరు న్యాయస్థానంలో తాజాగా చార్జ్షీట్ దాఖలు చేసిన సీబీఐ సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమై స్థానంలో ఉంటూ రాజకీయ కుట్రలతో ఎంతకైనా దిగజారుతానని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు! తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప కొవ్వు కలిసిందన్న తన నిరాధార ఆరోపణలు బెడిసికొట్టడం.. ముఖ్యమంత్రి హోదాలో మహాపచారానికి పాల్పడటంపై జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతుండటం, దారుణమైన అబద్ధాలాడిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తుండటంతో సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీలు శాస్త్రీయంగా నిర్ధారించగా.. అదే విషయాన్ని సీబీఐ సైతం తాజాగా చార్జ్షీట్లో స్పష్టం చేయడం తెలిసిందే. దీంతో తన పాచిక పారకపోవడంతో ఇతర అంశాలను వక్రీకరిస్తూ చంద్రబాబు బృందం మరో పన్నాగం పన్నింది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి కాంట్రాక్టులు కేటాయించారని.. చిన్నప్పన్నను వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ వక్రీకరణలకు పాల్పడుతోంది. కట్టబెట్టింది టీడీపీ హయాంలోనే.. చార్జ్షీట్లో వెల్లడించిన సీబీఐ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీ వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఆపాదించేందుకు చంద్రబాబు బృందం పడరాని పాట్లు పడుతోంది. అసలు వాస్తవం ఏమిటంటే.. భోలే బాబా డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే. భోలే బాబా కంపెనీకి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారని సీబీఐ చార్జ్షీట్లో వెల్లడించడం గమనార్హం. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్లో పేర్కొంది. ‘లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలవనే లేదు. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయి. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయి..’ అని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది. .ఆ శాంపిల్స్.. బాబు సీఎం అయ్యాక తీసినవే ఇక ప్రస్తుతం కల్తీ అంటూ చేస్తున్న రాద్ధాంతానికి కేంద్ర బిందువుగా ఉన్న నెయ్యి శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నవో తెలుసా..? చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాక తీసిన శాంపిల్స్ అవి! ఆ నెయ్యి శాంపిల్స్ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో తీసినవే. మూడు టెస్టుల నివేదికల్లో నెయ్యి తగిన నాణ్యతతో లేదని తేలడంతో ఆ శాంపిల్స్ను జూలై 17న ఎన్డీడీబీ బోర్డుకు పంపారు. ఎన్డీడీబీ బోర్డు 2024 జూలై 23న నివేదిక ఇచ్చింది. అంటే మొత్తం వ్యవహారం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే సాగింది. మరి ఆ నెయ్యిలో కల్తీ ఉంటే అందుకు బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వానిదేనన్నది సుస్పష్టం. కొనుగోలు కమిటీలో కొలుసు, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చంద్రబాబు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న మరో విషయం ఏమిటంటే... వైఎస్సార్సీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆమోదించిన ఆనాటి టీటీడీ బోర్డులో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి సభ్యులుగా ఉన్నారు. నాడు టీటీడీ పర్చేజ్ కమిటీలో సభ్యులుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుపై నిర్ణయాన్ని బోర్డుకు సిఫార్సు చేసింది కూడా వారే కావడం గమనార్హం. అదంతా కల్తీయేనా బాబూ?2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి నెయ్యి కిలో రూ.276 – రూ.314 మధ్య కొనుగోలు చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో కొనుగోలు చేసిన ధరతో పోలిస్తే అది తక్కువే. మరి దాన్ని బట్టి బాబు సర్కారు కొన్న నెయ్యి అంతా కల్తీయేనని భావించాలా? శ్రీవారి సొమ్ములు దుర్వినియోగం చరిత్ర బాబుదే..! తిరుమల శ్రీవారి నిధుల వినియోగంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదే. అందుకు టీటీడీ తిరుపతిలో నిర్మించిన ఫ్లై ఓవరే నిదర్శనం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఫ్లై ఓవర్ నిర్మాణ వ్యయం రూ.684 కోట్లలో టీటీడీ 67 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం వెచ్చించాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ కనీసం టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే ఏకపక్షంగా వ్యవహరించారు. ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధమని వారించినా లెక్క చేయలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లై ఓవర్ నిర్మాణానికి టీటీడీ పాలకమండలిలో తీర్మానం చేసింది. అంతేకాదు.. నిర్మాణ వ్యయాన్ని రూ.40 కోట్లు తగ్గించి శ్రీవారి నిధులను ఆదా చేసింది. ఇక టీడీపీ హయాంలో టీటీడీ నిధులు రూ.1,300 కోట్లు ప్రైవేట్ రంగంలోని ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేయడంపై తీవ్ర విమర్శలు రేగినా చంద్రబాబు పట్టించుకోలేదు. అనంతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ బ్యాంకులో ఉన్న టీటీడీ డిపాజిట్లను ఉపసంహరించి... ప్రభుత్వ రంగంలోని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయించింది. తప్పుడు నివేదిక బాబు హయాంలోనే.. గతంలో భోలే బాబా డెయిరీ పేరు హర్ష్ ఫ్రెష్ డెయిరీ’. ఆ పేరుతోనే 2018 మేలో తొలిసారి టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. లీటరు నెయ్యి కేవలం రూ.290కే సరఫరా చేస్తామని టెండరు వేస్తే టీటీడీ సమ్మతించి కాంట్రాక్టు కట్టబెట్టింది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. హర్ష్ డెయిరీని తనిఖీ చేసేందుకు 2018 ఏప్రిల్ 17న అప్పటి టీటీడీ ఈవో నిపుణుల కమిటీని పంపారు. కానీ ఆ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చి మోసగించింది. హర్ష్ డెయిరీ రోజుకు 1,33,500 లీటర్ల ఆవు పాలు సేకరిస్తోందని... రోజుకు 4 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తోందని తప్పుడు నివేదిక ఇచ్చింది. ఆ విధంగా తప్పుడు నివేదిక ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కావడం గమనార్హం. 2019 ఫిబ్రవరి 18న 82 వేల కిలోల ఆవునెయ్యి కొనుగోలుకు టీటీడీ పిలిచిన టెండర్లలో హర్ష్ డెయిరీ మళ్లీ పాల్గొని టెండరు దక్కించుకుంది. వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదు...ఏపీ భవన్ ఉద్యోగి తిరుమల లడ్డూ ప్రసాదం ముసుగులో రాజకీయ కుట్ర కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ దుష్ప్ర చారం చేస్తోంది. ఈ కేసులో అరెస్టు అయిన ఆయన్ను వైవీ సుబ్బారెడ్డి పీఏగా దుష్ప్ర చారం చేయడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర. ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పీఏగా పని చేశారు. ఆ వాస్తవాన్ని మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు యత్నిస్తుండటం గమనార్హం. తిరుమల లడ్డూపై దుష్ప్ర చారం ఆపాలని, నిజాలు బయటకు తీయాలని సుప్రీంకోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డే. అంతేగానీ టీడీపీ నేతలు కాదు. ఇక సీబీఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్లో వైఎస్సార్ సీపీ నేతలు సహా గత ప్రభుత్వంలో ఉన్నవారి పేర్లు ఏ ఒక్కరివీ లేవు. రాజకీయ కుట్రతో ఇంతటి బరితెగింపా బాబూ...! కేవలం రాజకీయ స్వార్థం కోసమే తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యం దెబ్బతీసే కుట్రకు చంద్రబాబు తెగబడ్డారు. సీఎం హోదాలో దుష్ప్ర చార కుట్రకు బాబు నేతృత్వం వహించగా టీటీడీ ప్రధాన కార్యాలయం కేంద్రంగానే కుట్ర రచన సాగించి అమలు చేశారు. విజయవాడ వరదల్లో సహాయ, పునరావాస చర్యల్లో తన ఘోర వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కోసమే ఈ మహా పాపానికి ఒడిగట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో పంది, చేప కొవ్వులు కలిపారంటూ చంద్రబాబు దారుణమైన ఆరోపణలు చేశారు. ఏమాత్రం పాపభీతి లేకుండా శ్రీవారి ఆలయ పవిత్రతకు కళంకం తీసుకువచ్చేందుకు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీసేందుకు కుతంత్రం పన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం..’ అనే పేరుతో 2024 సెప్టెంబర్ 20న ఒంగోలులో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాన్ని దీనికి వేదికగా చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారు. ఇక నారా లోకేశ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిపి అపవిత్రం చేశారని దారుణమైన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిపినట్లు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని పేర్కొనడం గమనార్హం. అసలు విషయం ఏమిటంటే... తిరుమల లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడి కాలేదు. కేవలం రాజకీయ కుట్ర కోసమే చంద్రబాబు, ఆయన ముఠా ఎల్లో మీడియా సహకారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పక్కా పన్నాగం పన్నింది. ఇదిగో.. పంది కొవ్వు ఇంత శాతం..! ఆవు కొవ్వు ఇంత శాతం..! చేప కొవ్వు ఇంత శాతం..! అంటూ ఈనాడు, ఇతర ఎల్లో మీడియా పేజీలకు పేజీలు అవాస్తవ కథనాలతో దుష్ప్రచారం చేశాయి. లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తెచ్చే కుట్రలో పాత్రధారిగా మారిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశి్చత్తం డ్రామాకు తెరతీశారు. మీడియా కెమెరాల ముందు విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లు కడిగి హైడ్రామాను రక్తి కట్టించారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతారం ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు.. సీబీఐ దర్యాప్తులో వెల్లడి.. చార్జ్షీట్లో స్పష్టీకరణ తిరుమల లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర బెడిసికొట్టింది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. ఈమేరకు నెల్లూరులోని న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్షీట్లో సీబీఐ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. దాంతో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్ర చార కుట్రలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు వెంటనే ఖండించారు. ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయన్ను ప్రభుత్వ పెద్దలు అమరావతికి పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాతే ఆయన్ను బదిలీ చేయడం గమనార్హం. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని తాజాగా సీబీఐ నివేదిక వెల్లడించింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. శాస్త్రీయంగా విశ్లేషణ... సాధికారికంగా నిర్ధారణ... టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో నిర్ధారించింది. ఆ విషయాన్ని సీబీఐ తన చార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్ను హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్(ఎన్డీడీబీ)లకు పంపించి పరీక్షలు నిర్వహించినట్టు సీబీఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యా»ొరేటరీలు 2025 మార్చి 27, 2025 మే 16న రెండు వేర్వేరు నివేదికల్లో నిర్ధారించాయని సీబీఐ తన చార్జ్షీట్లో పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలె్రస్టాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలె్రస్టాల్ ఉంటుంది. కొలె్రస్టాల్ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక స్పష్టం చేసింది. నెయ్యి కొనుగోలుకు టీటీడీలో పటిష్ట వ్యవస్థరాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలనే కుట్రతో చంద్రబాబు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నెయ్యి, ఇతర సరుకులు కొనుగోలుకు టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ ఉందనే వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. టీటీడీ అనుసరించే పటిష్ట విధానం ఇదీ... లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం టీటీడీ ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తుంది. టెండర్లు కోట్ చేసిన వాటిలో ఎల్ 1గా వచ్చిన డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదిస్తుంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నియమ నిబంధనలను ఎవరూ మార్చేందుకు ఏమాత్రం అవకాశమే లేదు. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ లడ్డూ తయారీకి నెయ్యి ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్తో పాటు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తించిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్ను కూడా సమర్పించాలి. ఓ ట్యాంకర్ నెయ్యి శాంపిల్లో 99.618 శాతం మిల్క్ ఫ్యాట్ ఉందని తేల్చుతూ ఎన్డీడీబీ కాల్ఫ్ 2024 జూలై 23న ఇచ్చిన టెస్ట్ రిపోర్టు ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని.. ఫారిన్ ఫ్యాట్ కలిసి ఉండొచ్చునని ఏఆర్ డెయిరీ ఫుడ్స్కు 2024 జూలై 27న ఇచ్చిన షోకాజ్ నోటీసులో పేర్కొన్న టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా కేజీ నెయ్యిలో 208.851 మిల్లీ గ్రాముల వెజిటబల్ ఆయిల్ కలిసిందని.. ఫారిన్ ఫ్యాట్ కూడా కలిసి ఉండే అవకాశం ఉందని 2024 జూలై 28న ఏఆర్ డెయిరీ ఫుడ్స్కు ఇచ్చిన రిజాయిండర్ షోకాజ్ నోటీసులో స్పష్టం చేసిన టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా ఏఆర్ డెయిరీ ఫుడ్స్ 2024 జూలై 6, జూలై 15న సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అదే నెల 22న సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న టీటీడీ అప్పటి ఈవో శ్యామలరావు (ఈయనే నెయ్యిలో జూలై 23న వనస్పతి డాల్డా వంటి వెజిటబుల్ ఆయిల్ కలిసిందని తిరుమలలో ఏడుకొండలస్వామి సాక్షిగా మీడియాకు చెప్పారు) » అలా ట్యాంకర్ నుంచి తిరుపతిలోనే మూడు శాంపిల్స్ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే ఆ నెయ్యిని టీటీడీ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తారు. శాంపిల్స్ పరీక్షల్లో నాణ్యత లేదని తేలితే వెంటనే ఆ ట్యాంకర్లను తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కి పంపుతారు. తిరుమల కొండ కూడా ఎక్కనివ్వరు. » తగిన నాణ్యతతో లేని నెయ్యిని చాలాసార్లు వెనక్కి పంపారు. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 15 సార్లు, 2019–24లో వైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని టీటీడీ రికార్డులే వెల్లడిస్తున్న వాస్తవాలు. బాబు దుష్ప్రచారంపై జాతీయ మీడియాలో విమర్శల వెల్లువ తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కుట్ర పన్నడంపై జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చార్జిషీట్లో పేర్కొనడాన్ని జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. జాతీయ టీవీ చానళ్లు, డిజిటల్ మీడియా కూడా దీనికి అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. జంతువుల కొవ్వు కలిసింది అంటూ నిరాధార ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ శ్రీవారి భక్తులు, వివిధ రంగాల ప్రముఖులు డిమాండ్ చేయడాన్ని జాతీయ మీడియా ప్రస్తావించింది. -
దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి వివాదంపై దర్యాప్తు చేసిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జ్ షీట్ నేపథ్యంలో తమ పార్టీ, నాయకులను నిందిస్తూ రాష్ట్రంలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు డీజీపీకి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శుక్రవారం లేఖ రాశారు. సీబీఐ సిట్ ఛార్జ్ షీట్ లోని అంశాలను తప్పుదోవ పట్టిస్తూ, తమ పార్టీని నిందిస్తూ గుంటూరు, పిడుగురాళ్ల, వినుకొండ, దర్శితోపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని అప్పిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతోపాటు నాయకుల పరువుకు భంగం కలిగించే విధంగా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. నిజానికి సిట్ ఛార్జ్ షీట్ లో వైఎస్సార్సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిపై ఎలాంటి నేరారోపణలు చేయలేదని, అయినా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ, వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, వారి ఫొటోలతో సహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వివరించారు. అందుకే వాటిని ఏర్పాటు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు, భవిష్యత్లో మళ్లీ అలాంటి పనులు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తూ, పరువుకు నష్టం కలిగించేలా ఆ ఫ్లెక్సీలు డిజైన్ చేసిన, ప్రింట్ చేసిన, వాటికి నిధులు సమకూర్చిన, రవాణా చేసిన వారితోపాటు, అవి ఏర్పాటు చేసిన వారిపైనా వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా అలాంటి ఫ్లెక్సీల ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం ఉందని, కాబట్టి శాంతికి విఘాతం కలిగించే ఆ చర్యలను నిరోధించేలా వెంటనే నిషేధాజ్ఞలు జారీ చేయాలని లేళ్ల అప్పిరెడ్డి ఆ లేఖలో డీజీపీని కోరారు. -
వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో
అమరావతి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు చెందిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ సమావేశం జరుగుతుంటే మహిళతో వీడియో చాటింగ్ చేస్తున్న వ్యవహారం తాజాగా బయటపడింది. అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చి మరీ మహిళకు వీడియో కాల్ చేశారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచే మహిళకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో బాధితురాలు మీడియాకు విడుదల చేసింది. అసెంబ్లీ చరిత్రలో ఎవరూ చేయని గలీజు పని చేశారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అసెంబ్లీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా శ్రీధర్ వీడియో కాల్ చేయడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాగా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్లు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి వేళ కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న శ్రీధర్ మహిళా ఉద్యోగినికి వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాను అర్ధనగ్నంగా మారి వీడియో కాల్ చేయడమే కాకుండా.. మహిళను సైతం నగ్నంగా కనిపించాలంటూ బెదిరించారు. పత్రికల్లో రాయలేని అసభ్యకర సందేశాలను బాధితురాలికి అర్ధరాత్రి సమయంలో శ్రీధర్ పంపించినట్లు ఆ వీడియోలో ఉంది. కాగా, శ్రీధర్ తననే కాకుండా కనిపించిన ప్రతి మహిళనూ వక్ర బుద్ధితోనే చూస్తాడని బాధిత మహిళ తెలిపారు. వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను, స్నేహితులు, బంధువుల భార్యలను కూడా కామంతోనే చూసేవాడని.. వారి శరీరాకృతుల గురించి తన వద్ద అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు వివరించారు. వావి వరుసలు కూడా చూసేవాడు కాదని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీధర్ అరాచకాలను వివరిస్తూ నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు. తాజాగా ఓ మహిళతో అసెంబ్లీ వేదికగా చాటింగ్ చేస్తున్న వీడియో బయట పడటంతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మానసిక దారిద్ర్యంపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇవీ చదవండిఅరవ ఆగడాలు మరిన్ని..నువ్ మోసపోయావ్.. వదిలేయ్..‘అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు’ -
తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం: ప్రొఫెసర్ నాగేశ్వర్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు.. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు భయంకరమైన ఆరోపణలు చేశారంటూ దుయ్యబట్టారు. కోట్లాది హిందువుల మత విశ్వాసాలపై దాడి కాదా? అంటూ నిలదీశారు.‘‘వాస్తవాలు గమనించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఎఫ్ఐఆర్ దాఖలు కాకుండా.. కేసు పెట్టకుండా.. విచారణ జరగకుండా సీఎం ఎలా తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు సీఎం స్థాయిలో ఉండి ఆరోపణలు చేస్తారు. సిట్ విచారణలో జంతు కొవ్వులేదని తేలింది. జంతు కొవ్వు కలిసినట్టు ఆధారాలు లేవు. తిరుమల లడ్డూను అపవిత్రం చేస్తున్నారు’’ అని నాగేశ్వర్ మండిపడ్డారు.కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ స్పష్టం చేయడంతో చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించిన విషయం తెలిసిందే. -
గాంధీజీ చెప్పినట్టు సత్యమే గెలిచింది: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: సత్యమేవ జయతే అని మహాత్మా గాంధీజీ చెప్పినట్టు తిరుమల లడ్డూ విషయంలోనూ నిజమైందని.. సీబీఐ సిట్ ఛార్జిషీట్ ద్వారా కూటమి నాయకులు చేసిన కుట్రలు, చెప్పిన అబద్ధాలు ప్రజలకు తెలిసిపోయాయని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహాత్మా గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్ని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాల నుంచి స్ఫూర్తి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలని, ఆయన చూపించిన అహింసా మార్గంలోనే సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పేద రైతు కూలీలు, కార్మికుల కోసం ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై వారు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో గాంధీజీ స్ఫూర్తితో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారని, శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం ద్వారా వందేళ్ల తర్వాత భూ సర్వేనిర్వహించి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారని కొనియాడారు. వారు ఇంకా ఏమన్నారంటే..కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్, పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు వెన్నపూస రవీంద్రరెడ్డి, మలసాని మనోహర్రెడ్డి, నలమారు చంద్రశేఖర్ రెడ్డి, అంకంరెడ్డి నారాయణ మూర్తితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.చివరికి సత్యమే గెలిచింది: లేళ్ల అప్పిరెడ్డిశాంతి, సత్యం అహింస ఆయుధాలుగా దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు మహాత్మా గాంధీజీ. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరికీ స్వాతంత్ర్య కాంక్షను రగిలించడంలో ఆయన చేసిన కృషికి కొలమానం లేదు. భారత జాతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించి ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన చూపిన తెగువ, మహాత్ముడు చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శం. గాంధీజీ మనదేశంలో పుట్టడం మన అదృష్టం. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.రాజకీయ కక్షలు, దోపిడీ, అరాచకాలతో పాలన సాగిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడుకుంటూ నిర్వీర్యం చేశారు. పౌరుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వాన్ని విమర్శించిన వారి మీద గంజాయి, దేశద్రోహం కేసులు పెడుతున్నారు. ఆఖరుకి రాజకీయ లబ్ధి కోసం దిగజారిపోయి తిరుమల లడ్డూ గురించి విష ప్రచారం చేశారు. అయినా సరే సత్యమేవ జయతే అన్నట్టు సీబీఐ దర్యాప్తు తర్వాత లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని తేలిపోయింది.గాంధీజీ మార్గం అనుసరణీయం: దొంతిరెడ్డి వేమారెడ్డిఆంగ్లేయుల నిరంకుశ పాలన నుంచి దేశానికి స్వేచ్ఛా ఊపిరి ఊదిన మహాత్మా గాంధీ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. దేశం కోసం నిస్వార్థంగా ఆయన చేసిన పోరాటం, త్యాగం దేశప్రజలంతా నిత్యం స్మరించుకుంటారు. ఆయన చూపించిన అహింసా మార్గంలో సమస్యలపై ప్రతిఒక్కరూ పోరాడాలి.గుంటూరు, కృష్ణా జిల్లాలతో అనుబంధం: మల్లాది విష్ణుమహాత్మా గాంధీజీకి గుంటూరు, కృష్ణా జిల్లాలతో మంచి అనుబంధం ఉంది. ఉప్పు సత్యాగ్రహం, చీరాల-పేరాల ఉద్యమం ప్రారంభించారు. ఆయన ఇక్కడి నాయకులను స్వాతంత్ర్య పోరాటంలో కార్యోన్ముఖుల్ని చేసి ముందుకు నడిపించారు. శాంతి, అహింసా మార్గంలో ఓర్పు సహనంతో బ్రిటీష్ నిరంకుశంత్వంపై పోరాడి విజయం సాధించడంలో గాంధీజీ పాత్ర గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. ఆయన మార్గంలోనే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా అవిశ్రాంతంగా పోరాటం చేశారు. రాష్ట్రంలో వలసల నివారణకు ఆయన పేరుతోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురంలో ప్రారంభించారు. రైతు కూలీలు, కార్మికులకు అండగా నిలబడ్డారు. వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేసి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి చూపించారు. అవినీతి, పక్షపాతానికి తావులేకుండా గడప వద్దకే పాలన అందించారు.అంటరానితనంపైనా పోరాటం: గోరంట్ల మాధవ్స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వారిపై యుద్ధం చేయడమే కాకుండా దేశంలో వేళ్లూనుకుని ఉన్న అస్ప్రశ్యత నివారణ కోసం దీనజనోద్ధరణ కోసం గాంధీజీ పోరాటం చేసి విజయం సాధించారు. అంటరానితనంతో వెనుకబడిన వర్గాలకు జరుగుతున్నఅన్యాయంపై గళమెత్తి వారికి అండగా నిలబడ్డారు. ఆయన చూపించిన మార్గంలోనే వైయస్ జగన్ గారు ఐదేళ్ల పాలన అందించడంతో పాటు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.అణుబాంబుల కన్నా అహింసే పవర్ఫుల్: జూపూడి ప్రభాకర్అంటరానితనాన్ని దేశం పారద్రోలాలంటే న్యాయవాద వృత్తిని వదిలేయడమే కాకుండా తన వేషధారణలో మార్పులు చేసి అతి సామాన్యుడిగా మారిపోయాడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంపను చూపించాలని అహింసా మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప సామాజిక మేధావి గాంధీజీ. అణుబాంబుల కన్నా గొప్పదైన అహింసా శాంతి సందేశాన్ని పంపాడు. ఐదేళ్ల వైయస్సార్సీపీ పాలనలో గాంధీజీ వైయస్ జగన్ గారు గాంధీజీ అడుగుజాడల్లోనే నడిచారు.గాంధీజీ పేరును తీసేయడం దుర్మార్గం - వెలంపల్లి శ్రీనివాస్మహాత్మా గాంధీ చూపించిన అహింసా మార్గం అందరికీ అనుసరణీయం. ఆయన అడుగుజాడల్లో నడిచి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. రైతు కూలీలకు పనులు కల్పించి వారికి చేదోడుగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో దివంగత వైయస్సార్ తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం ఎన్నో లక్షల కుటుంబాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చింది. ఇలాంటి పథకం నుంచి గాంధీ పేరును తీసేయడం ఆయన్ను అవమానించడమే -
సత్యం ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ..
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మా గాంధీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. “సత్యం తాత్కాలికంగా ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ ఎప్పటికీ ఓడదు” అని చెప్పడమే కాక.. తన చివరి శ్వాస వరకు సత్యానికే అంకితమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు మహాత్మా గాంధీ. నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. “సత్యం తాత్కాలికంగా ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ ఎప్పటికీ ఓడదు” అని చెప్పడమే కాక, తన చివరి శ్వాస వరకు సత్యానికే అంకితమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు. నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 30, 2026 -
పొగాకు రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం
సాక్షి, అమరావతి/జంగారెడ్డిగూడెం: పొగాకు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను గురువారం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన పొగాకు రైతులు కలిశారు. కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు, సిగరెట్లపై విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ పెంపు వల్ల పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ జగన్ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. దీనివల్ల పొగాకుకు డిమాండ్ తగ్గి, ధరలు పడిపోతాయని, కొనుగోళ్లు తగ్గి, తమ జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారని వివరించారు.ఇప్పటికే పలు జిల్లాల్లో పొగాకు రైతులు నిరసనలు చేపడుతూ, పన్నులు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు వైఎస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. పొగాకు రైతులు ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభాన్ని, వారిలో నెలకొన్న ఆందోళనలను వైఎస్సార్సీపీ... కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మేలు జరిగేలా చూస్తుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వైఎస్సార్సీపీ ఎంపీలు ఈ అంశాన్ని చర్చిస్తారని తెలిపారు.వైఎస్ జగన్ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు, ఎన్ఎల్ఎస్ వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు సత్రం వెంకటరావు, ఉపాధ్యక్షుడు అట్లూరి సతీష్, సెక్రటరీ సత్యనారాయణ, రైతు నాయకులు సత్తెనపల్లి వీర్రాజు, వైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు జెట్టి గుర్నాథరావు తదితరులు ఉన్నారు. -
‘క్యాన్సర్’పై బాబు బిల్డప్!
సాక్షి, అమరావతి: పాలనలో అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఎవరో చేసిన పనులను తన ఘనతగా చిత్రీకరించుకుంటూ సీఎం చంద్రబాబు తన రికార్డును తనే బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ పరంపరలో భాగంగా క్యాన్సర్ను నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందంటూ గురువారం ఆయన ప్రకటించారు. నిజానికి.. క్యాన్సర్ వ్యాధి నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా వైఎస్ జగన్ 2022 మే 16న క్యాన్సర్ను నోటిఫైడ్ జబ్బుల జాబితాలో చేర్చారు. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చారు.అంతేకాక.. ప్రభుత్వ రంగంలోనూ క్యాన్సర్ వైద్యసేవలను బలోపేతం చేయడంతో పాటు, 50 కి.మీ దూరంలోనే ప్రజలకు క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తేవడం, ప్రారంభ దశలోనే వ్యాధి గుర్తించడం సహా ఇతర చర్యల్లో భాగంగా కాంప్రహెని్సవ్ క్యాన్సర్ కేర్కు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా.. గుంటూరు జీజీహెచ్లో అత్యాధునిక క్యాన్సర్ ఆస్పత్రిని అందుబాటులోకి తేవడంతో పాటు, కర్నూల్ స్టేట్ క్యాన్సర్ యూనిట్ను అందుబాటులోకి తెచ్చారు. సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. సమగ్రంగా అధ్యయనం చేయడానికి క్యాన్సర్ అట్లాస్కు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వంలో నమోదయ్యే ప్రతి కేసు నమోదుకు వీలుగా జబ్బును నోటిఫైడ్ జబ్బుల జాబితాలోకి అప్పట్లోనే చేర్చారు. రాష్ట్రవ్యాప్త సర్వేకు జగన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేయగా ఇప్పుడా సర్వేను తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం నానాపాట్లు పడుతోంది. సర్వేలో గుర్తించిన వివరాలతో అట్లాస్ను ప్రారంభించి, క్యాన్సర్ను నోటిఫైడ్ జబ్బుల జాబితాలో తమ ప్రభుత్వమే చేర్చినట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. -
హైకోర్టు ఇమ్మంది.. ప్రభుత్వం పొమ్మంటోంది!
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో మెరిట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని హైకోర్టు సీరియస్గా తీసుకుంది. ప్రతిభావంతులకు అన్యాయం జరిగితే సహించబోమని ఇటీవల హెచ్చరించడంతోపాటు, వారికి రెండు నెలల్లోగా అర్హత సాధించిన పోస్టుల్లో ఉన్నతమైన పోస్టు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఇందుకు చంద్రబాబు సర్కారు ససేమిరా అంటోంది. ఇప్పటికే నియామకాలు పూర్తి చేశామని, ఇవ్వడం కుదరదని చెప్పింది. పైపెచ్చు హైకోర్టు తీర్పుపై అప్పీల్కు విద్యా శాఖ సిద్ధమవుతోంది. చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం పాట్లు పడుతోందేగానీ, హైకోర్టు ఆదేశాల ప్రకారం మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేసేందుకు మాత్రం అంగీకరించడం లేదు. డీఎస్సీ–2025 అభ్యర్థుల జీవితాలతో ఆది నుంచి ఆడుకున్న ప్రభుత్వం.. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తు సమయంలోనే తొలి ప్రాధాన్య పోస్టు ఏదో అభ్యర్థులను ఎంచుకోమంది. అభ్యర్థులు తొలి ప్రాధాన్యంగా ఏ పోస్టు ఎంచుకుంటే అదే పోస్టు వస్తుందని ప్రకటించింది. ఈ విధానం గతంలో ఎప్పుడూ లేదు. కౌన్సెలింగ్ సమయంలో మాత్రమే పోస్టుల ప్రాధాన్యం అడిగేవారు. దాని ద్వారా అభ్యర్థులు తాము మెరిట్ సాధించిన వాటిలో ఉన్నత పోస్టును పొందే అవకాశం ఉండేది. ఈసారి దరఖాస్తు సమయంలోనే అడగడంతో వందలాది అభ్యర్థులు ఉన్నత పోస్టులను కోల్పోయారు. డీఎస్సీ –2025 ఫలితాలు ప్రకటించాక దాదాపు 2 వేల మంది అభ్యర్థులు ఎస్జీటీ తొలి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్నా స్కూల్ అసిస్టెంట్, పోస్టు గ్రాడ్యుయేట్ పోస్టులు కూడా సాధించారు. అయితే వారికి తొలి ప్రాధాన్యమైన ఎస్జీటీ పోస్టు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. అంతకంటే మంచి పోస్టులైన స్కూల్ అసిస్టెంట్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు అర్హత సాధించినప్పటికీ, ప్రభుత్వం వారికి ఆ పోస్టులు ఇవ్వలేదు. దీంతో 54 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.తాము ఎంతో కష్టపడి సాధించుకున్న ఉన్నతమైన పోస్టును కోల్పోతున్నామని, గతంలో కౌన్సెలింగ్ దశలో అభ్యర్థులకే పోస్టు ప్రాధాన్యం ఎంచుకునే వెసులుబాటు ఉండేదని, తమకు న్యాయం చేయాలని హైకోర్టును కోరారు. దీంతో ఉన్నత ఉద్యోగం అభ్యర్థి హక్కుగా హైకోర్టు పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారికి ప్రాధాన్యత ఎంపిక విధానంలో కాకుండా ఉన్నత అర్హత గల ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు బేఖాతర్ హైకోర్టు తీర్పును ప్రభుత్వం పట్టించుకోకుండా ఆగస్టు 11న ఫలితాలను, 21న మెరిట్ లిస్టును ప్రకటించడంతోపాటు ఈ తీర్పుపై డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసింది. అక్కడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయినప్పటికీ ప్రభుత్వం హడావుడిగా గతేడాది సెపె్టంబర్లో పోస్టింగులు సైతం పూర్తి చేసింది. దీనిపై హైకోర్టు సెపె్టంబర్ 12న మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ మెరిట్ విద్యార్థులకు పోస్టులు ఇవ్వాల్సిందేనని మరోసారి ఆదేశించింది. కానీ దీన్ని కూడా ప్రభుత్వం లెక్కలోకి తీసుకోకుండా సెపె్టంబర్ 15న సెలక్షన్ లిస్టును విడుదల చేసి, ప్రభుత్వం మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు బెంచ్ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసి, మెరిట్కే ప్రాధాన్యమివ్వాలని ఆదేశించింది. డిసెంబర్ 29న తుది తీర్పునిస్తూ మెరిట్కే ప్రాధాన్యమివ్వాలని ఆదేశించింది. ఇప్పటికే పోస్టింగ్స్ పూర్తయ్యాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో హైకోర్టు మండిపడింది. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను పట్టించుకోకుండా ఎలా పోస్టులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోర్టును ఆశ్రయించిన 54 మంది మెరిట్ అభ్యర్థులతోపాటు ఆర్థి కారణలతో హైకోర్టుకు వెళ్లలేని వారికీ న్యాయం దొరుకుతుందని అంతా భావించారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును పాటించకుండా మరోసారి అప్పీల్కు వెళ్లే యోచన చేస్తుండడం గమనార్హం. న్యాయస్థానాన్ని సైతం లెక్క చేయని ప్రభుత్వ తీరుపై అభ్యర్థులు, యువజన సంఘాలు మండిపడుతున్నాయి. -
పంతం నెగ్గించుకున్న టీడీపీ మద్యం సిండికేట్
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం సిండికేట్ పంతం నెగ్గించుకుంది. బార్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను (ఏఆర్ఈటీ) రద్దు చేసిన తర్వాతే కొత్త బార్లకు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని శాసించింది. సిండికేట్ చెప్పినట్లే చంద్రబాబు ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏఆర్ఈటీ రద్దు చేసిన విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రంలో మిగిలి ఉన్న 301 బార్లకు లైసెన్సులు ఇచ్చేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6 వరకు ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రీడ్ విధానాల్లో ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది. జిల్లా కలెక్టర్లు ఫిబ్రవరి 8న లాటరీ విధానంలో బార్లకు లైసెన్సులు కేటాయిస్తారు. ఏఆర్ఈటీ రద్దు కోసం ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో టీడీపీ సిండికేట్ పక్కాగా కథ నడిపింది. రాష్ట్రంలో 840 బార్లకు లైసెన్సుల కేటాయింపు కోసం గత ఏడాది ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ టీడీపీ సిండికేట్ అన్ని బార్ల లైసెన్సుల కోసం ఉద్దేశ పూర్వకంగానే దరఖాస్తులు దాఖలు చేయలేదు. ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంది. రెండు మూడు సార్లు నోటిఫికేషన్లు జారీ చేసినా సరే.. 840 బార్లలో కేవలం 499 బార్లకే దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటిని సిండికేట్ ఏకపక్షంగా దక్కించుకుంది. మరో 301 బార్లను పెండింగులో ఉండేట్టు చేసింది. ఏఆర్ఈటీ రద్దు చేస్తే తప్ప.. ఆ బార్ల లైసెన్సులకు దరఖాస్తు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయాన్ని కృత్రిమంగా సృష్టించేందుకే ఈ డ్రామాను రక్తి కట్టించింది. అంతా స్క్రిప్ట్ ప్రకారం సాగిన ఈ డ్రామాలో అసలు ఘట్టానికి ఈ నెల మొదటి వారంలో తెర తీశారు. బార్లపై 15 శాతం ఏఆర్ఈటీని రద్దు చేస్తూ మంత్రి మండలి నిర్ణయించింది. ఆ వెంటనే ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో తమ పంతం నెగ్గడంతో పెండింగులో ఉన్న 301 బార్ల లైసెన్సుల ప్రక్రియకు పచ్చ జెండా ఊపింది. ఆ బార్ల లైసెన్సులను ఏకపక్షంగా దక్కించుకునేందుకు సన్నద్ధమవుతోంది. రూ.2 వేల కోట్ల దోపిడీకి పచ్చజెండా మద్యం సిండికేట్కు ప్రభుత్వం తలొగ్గడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడనుంది. ఎల్లో సిండికేట్ అడ్డగోలు లాభాలు సాధించేందుకు చంద్రబాబు సర్కారు మార్గం సుగమం చేసింది. బార్లకు సరఫరా చేసే మద్యంపై ప్రస్తుతమున్న 15 శాతం ఏఆర్ఈటీని ఈ నెల మొదటి వారంలో రద్దు చేసింది. దాంతో ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.340 కోట్లు గండి పడుతుందని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కానీ వాస్తవానికి రూ.500 కోట్ల వరకు గండి పడుతుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ ప్రకారం రానున్న నాలుగేళ్లలో రూ.2 వేల కోట్ల మేర ప్రభుత్వం నష్టపోనుంది. అంటే.. టీడీపీ సిండికేట్ గల్లా పెట్టె మరో రూ.2 వేల కోట్లతో కళకళలాడనుంది. అప్పట్లోనూ ప్రివిలేజ్ ఫీజు రద్దు దందా2014–19లో కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇదే రీతిలో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దుచేసి టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొమ్ము కాసింది. ఆర్థిక శాఖ అనుమతిగానీ, కేబినెట్ ఆమోదంగానీ లేకుండానే 2015లో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 216, 217 పేరుతో రెండు చీకటి జీఓలు జారీ చేసింది. తద్వారా 2015 నుంచి 2019 వరకు ఏడాదికి రూ.1,300 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది. దీనిపై బాబు మీద కూడా కేసు నమోదైంది. -
బట్టలిప్పి ఫోన్ చెయ్యి..
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే మరికొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్లు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి వేళ కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న శ్రీధర్ మహిళా ఉద్యోగినికి వీడియో కాల్ చేశారు. ‘నువ్వు వద్దంటే చచ్చిపోతాను.. నువ్వు లేకుండా ఉండలేను’ అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. మరో వీడియోలో శ్రీధర్ అర్ధరాత్రి వరకు చేసిన వాట్సాప్ మెసేజ్లు బయటపడ్డాయి. ఆమె వద్దని ఎంతగా వారించినా ఆయన ఏ మాత్రమూ వినిపించుకోలేదు. వీడియో కాల్ చేసి ఆమెను ‘నైటీ తీసెయ్’ అంటూ బలవంతం చేశారు. బాధిత మహిళ ప్రతిఘటించినా.. ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదు. తాను అర్ధనగ్నంగా మారి వీడియో కాల్ చేయడమే కాకుండా.. మహిళను సైతం నగ్నంగా కనిపించాలంటూ బెదిరించారు. పత్రికల్లో రాయలేని అసభ్యకర సందేశాలను బాధితురాలికి అర్ధరాత్రి సమయంలో శ్రీధర్ పంపించినట్లు ఆ వీడియోలో ఉంది. కాగా, శ్రీధర్ తననే కాకుండా కనిపించిన ప్రతి మహిళనూ వక్ర బుద్ధితోనే చూస్తాడని బాధిత మహిళ తెలిపారు. వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను, స్నేహితులు, బంధువుల భార్యలను కూడా కామంతోనే చూసేవాడని.. వారి శరీరాకృతుల గురించి తన వద్ద అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు వివరించారు. వావి వరుసలు కూడా చూసేవాడు కాదని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీధర్ అరాచకాలను వివరిస్తూ నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు. -
కేంద్ర ఆర్థిక ‘సర్వే’ సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ చౌర్యం.. 'రీ సర్వే' సూపర్
సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా.. పార్లమెంట్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోసారి రుజువైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన భూ సంస్కరణలపై బురద చల్లుతూ చంద్రబాబు ఆడిన కపట నాటకం బట్టబయలైంది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ.. ఆంగ్లేయుల తరువాత వందేళ్ల అనంతరం దేశంలో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే యజ్ఞం ఫలితాలను తాజాగా కేంద్ర ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రశంసించింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన కీలక మార్పులు, ప్రతి అడుగులో రైతన్నలకు తోడుగా నిలిచిన ఆర్బీకేలు, విప్లవాత్మక రీతిలో అమలు చేసిన భూ సంస్కరణలను అభినందించింది. వైఎస్ జగన్ హయాంలో నిర్వహించిన భూ రీ సర్వే ఫలితాలను వివరిస్తూ కేంద్ర ఆర్థిక సర్వే(2025–26)లో పేర్కొన్న భాగం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అమలు చేసిన సమగ్ర భూ సర్వే ఫలాలను సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాల్లో ఎలా వేసుకున్నారో దేశానికి చాటి చెప్పింది. మాజీ సీఎం వైఎస్ జగన్ తెచ్చిన భూ సంస్కరణలు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేసి పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా తెచ్చిన ‘ఈ–ఫార్మర్ మార్కెట్’ విధానాలకు కేంద్రం కితాబిచ్చింది. ఇక వ్యాపార వాతావరణ అనుకూల విధానాల్లో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పారిశ్రామిక అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేసిందని, 2023–24లో మహిళల నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపింది. ఈమేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ఆర్థిక సర్వే నివేదిక 2025–26 ప్రవేశపెట్టారు. ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిళ్లుభూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021లో భూముల రీ సర్వే ప్రాజెక్టును ప్రారంభించిందని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. రీ సర్వేకు డ్రోన్ టెక్నాలజీని వినియోగించడంతో పాటు కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్లు (సీవోఆర్ఎస్), జీఐఎస్ సాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిళ్లను జారీ చేసినట్లు ఆర్థిక సర్వే ప్రధానంగా ప్రస్తావించింది. సమగ్ర భూ సర్వేలో భాగంగా 6,901 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశారని, 81 లక్షల భూ కమతాలను రీ సర్వే చేశారని వెల్లడించింది. తద్వారా సుమారు 86,000 సరిహద్దు వివాదాలను పరిష్కారమయ్యాయని స్పష్టం చేసింది. దాదాపు 15 వేల మంది సర్వేయర్లను నియమించి రైతులకు పైసా ఖర్చు లేకుండా భూముల సమగ్ర సర్వేను మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టడం తెలిసిందే. సచివాలయాల సిబ్బంది పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రీ సర్వే ద్వారా తొలిసారిగా డ్రోన్లు, రోవర్లు, విమానాలను వినియోగించి సర్వే చేశారు. భూములకు జియో హద్దులు నిర్ణయించి పట్టాదార్ పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్లు ముద్రించారు. ట్యాంపరింగ్కు వీలులేని విధానాల ద్వారా భూ రికార్డుల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. సర్వే రాళ్లు విలక్షణంగా ఉంటేనే అందరికీ తెలుస్తుందనే ఉద్ధేశంతో 1.25 కోట్ల సర్వే రాళ్లను పాతించారు. అంతేకాదు.. సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటి అన్ని సేవలను సచివాలయాల్లోనే పొందే సౌలభ్యం కల్పించారు. నిర్విరామంగా ఒక మహాయజ్ఞంలా జరిగిన రీ సర్వే కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా కూడా పాలుపంచుకుంది. కేరళ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలు రీ సర్వే మోడల్పై అధ్యయనం చేసి టెక్నాలజీ సాయం కోరాయి. ఆర్బీకేలతో పంటలకు మెరుగైన ధరలురైతులు పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో మెరుగైన ధరలు కల్పించే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన రైతు భరోసా కేంద్రాలు, ‘ఈ–ఫార్మర్ మార్కెట్’ను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను కళ్లాల నుంచే నేరుగా తమకు నచ్చిన ధరకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తూ వైఎస్సార్ సీపీ హయాంలో ‘ఈ–ఫార్మర్ మార్కెట్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేస్తూ, మన పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా దీన్ని తెచ్చింది. మండీలకు ప్రత్యామ్నాయంగా రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు, ప్రాసెసర్లను అనుసంధానిస్తూ దేశంలో తొలిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు వ్యాపారులు పోటీపడి ముందుకొచ్చారు. వీరిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కూడా ఉండటం గమనార్హం.ఈ– ఫార్మర్ మార్కెట్తో ప్రయోజనాలెన్నో..⇒ దళారీల ప్రమేయం ఉండదు. ఎలాంటి ఫీజులు, రుసుములు లేకుండా కళ్లాల నుంచే అమ్ముకోవచ్చు.⇒ ఉత్పత్తి లభ్యత, పంట వివరాలు, నాణ్యత వివరాలను ఎలక్ట్రానిక్ పోర్టల్లో నమోదు చేస్తే ఇదే పోర్టల్లో వ్యాపారులు నేరుగా రైతులతో సంప్రదించి కొనుగోలు చేస్తారు. నగదు రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తారు.పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులుబిజినెస్ రీఫార్మ్ యాక్షన్ ప్లాన్ (బీఆర్ఎపీ) 2024 ద్వారా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు, ఆన్లైన్లో భూమి రిజిస్ట్రేషన్, పర్యావరణ అనుమతులు జారీ చేసి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించినట్లు కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది.తయారీ రంగంలో మహిళా యాజమాన్య సంస్థల సత్తాదేశంలో మహిళా యాజమాన్యంలోని సంస్థల వాటా పెరుగుతోందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. 2021 – 2022లో 24.2 శాతం ఉండగా 2023 – 24లో 26.2 శాతానికి పెరిగినట్లు తెలిపింది. 2023–24లో మహిళా యాజమాన్యంలోని సంస్థలకు సంబంధించి తయారీ రంగంలో వాటా అత్యధికంగా 58.4 శాతం ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్ అత్యధిక వాటా కలిగిన రాష్ట్రాల్లో నిలిచింది.⇒ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కృషి చేసినట్లు కేంద్ర ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ⇒ కోవిడ్ మహమ్మారి తరువాత విదేశీ విద్యార్ధులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, 2023 గణాంకాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయని కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొంది. -
వైఎస్ జగన్ సంస్కరణలను కొనియాడిన కేంద్ర ఆర్థిక సర్వే
సాక్షి,న్యూఢిల్లీ: తన హయాంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంస్కరణలను కేంద్ర ఆర్థిక శాఖ కొనియాడింది. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు)పై కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసల వర్షం కురిపించింది.రైతులను, వర్తకులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆర్బీకేల ద్వారా ఈ-ఫార్మ్ మార్కెట్ ప్లాట్ఫామ్ను రూపొందించారని సర్వే పేర్కొంది. రైతులకు అండగా నిలిచిన ఆర్బీకేలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని స్పష్టంగా తేల్చింది.అంతేకాకుండా, మహిళా సాధికారత కోసం జగన్ చేపట్టిన సంస్కరణలకూ సర్వే ప్రత్యేకంగా ప్రశంసలు తెలిపింది. 2023-24లో ఉత్పాదక రంగంలో మహిళల యాజమాన్యంలో ఉన్న సంస్థల వాటా గణనీయంగా పెరిగిందని, మహిళా కార్మిక భాగస్వామ్య రేటు కూడా అధికంగా నమోదైందని ఆర్థిక సర్వే వెల్లడించింది.ఇదీ చదవండి: ఏపీలో భూ రీసర్వే జగన్ విజనే.. భేష్ -
వైఎస్ జగన్ను కలిసిన ఖమ్మం వైఎస్సార్సీపీ అభిమానులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఖమ్మం వైఎస్సార్సీపీ అభిమానులు కలిశారు. ఇటీవల వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారన్న కారణంతో ఏకంగా 11 మంది వైఎస్సార్సీపీ అభిమానులపై క్రిమినల్ కేసులు పెట్టి, అందులో 8 మందిని 13 రోజుల పాటు రిమాండ్కు పంపిన వైనాన్ని అభిమానులు.. వైఎస్ జగన్ను కలిసి వివరించారు.తమపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టి నాన్బెయిలబుల్ సెక్షన్లతో జైలుకు పంపారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, క్యాడర్ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పార్టీ క్యాడర్కు అవసరమైన న్యాయ సహాయాన్ని అందించేందుకు పార్టీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.వైఎస్సార్సీపీ సీనియర్ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ను ఖమ్మం జిల్లా అభిమానులు ఆలస్యం సుధాకర్, మర్రి శ్రీనివాస్, యర్రా నాగరాజు రెడ్డి, గంగారపు మురళీ, సరికొండ రామరాజు, గంగరబోయిన రవి, పగిళ్ళ నాగేష్, ముదిరెడ్డి శివారెడ్డి కలిశారు. -
‘నాకు, ఎమ్మెల్యే శ్రీధర్కు మధ్యే వివాదం’
అమరావతి: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్పై మరో వీడియో విడుదల చేసింది బాధితురాలు. తనను ఎవరో రెచ్చగొట్టి పంపారనే వార్తలపై బాధితురాలు స్పందించింది. తనన ఏ పార్టీ రెచ్చగొట్ట పంపలేదన్నారు. తనకు జరిగిన అన్యాయంపైనే మీడియా ముందుకు వచ్చానని ఆమె స్పష్టం చేశారు. కూటమి నేత తాతంశెట్టి నాగేంద్ర కొంతమంది పేర్లు చెప్పి తనను బద్నాం చేస్తున్నారన్నారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం కొనసాగిస్తానన్నారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే మోసం చేశారని, అందుకే అన్ని విషయాలు బయటపెట్టానన్నారు. తప్పు ఎవరిదైతే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు బాధిత మహిళ. తనకు ఎమ్మెల్యే నుంచి ఒక్క రూపాయి కూడా వద్దని స్పష్టం చేసింది. కాగా, బాధిత మహిళతో కూటమి పార్టీ నేత తాతంశెట్టి నాగేంద్ర చెప్పిన మాటలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ‘ఇంక నిన్ను వాళ్లు కలుపుకోరు.. నువ్ మోసపోయావ్.. అయ్యిందేదో అయ్యింది.. నువ్ సర్దుకుపోవడం మంచిది’ అంటూ సదరు బాధిత మహిళతో నాగేంద్ర తెర వెనుక రాజీ చేసే యత్నం చేశారు. ఎమ్మెల్యే అరాచకాలు బయటకు రాకుండా ఆపేందుకు తెర వెనుక కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారనే దానికి ఇదొక ఉదాహరణ. కూటమి స్థానిక నేత తాతంశెట్టి నాగేంద్ర స్వయంగా బాధితురాలికి నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడారు. శ్రీధర్ ఇంటిలో ఒప్పుకోవడం లేదని, జరిగింది మరచిపోయి సర్దుకుపోవాలని సలహా ఇచ్చారు. ఇంకా అతనే కావాలని వెళితే మళ్లీ మళ్లీ మోసపోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నీ కొడుకు కోసం అన్నీ వదిలేసి ముందుకు వెళ్లిపోవాలంటూ సలహా ఇచ్చారు. నిన్ను దూరం చేసుకుంటున్నందుకు ఎమ్మెల్యే బాధ పడతారని తాను అనుకోవడం లేదని నాగేంద్ర అన్నారు. బెంగళూరులో తన కుమారుడు చదివే కాలేజీ అమ్మాయిలతోనూ ఎమ్మెల్యే శ్రీధర్ ఫ్లర్ట్ (లోబరుచుకునే ప్రయత్నం) చేశారని, ఆ విషయం తన కుమారుడి ద్వారా తెలిస్తే తాను ఆ విషయం బయటకు రాకుండా సర్ధి చెప్పానని ఆయన కొత్త విషయాన్ని బయటపెట్టారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు -
వివాదాస్పద ఫ్లెక్సీలపై YSRCP ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: వివాదాస్పద ఫ్లెక్సీలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ అంటూ పలుచోట్ల టీడీపీ.. ఫ్లెక్సీలు పెట్టించింది. సుప్రీంకోర్టు హెచ్చరికలను కూడా కూటమి నేతలు బేఖాతరు చేశారు. చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. రాష్ట్రవాప్తంగా పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శిలో తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి నిజం.. మహా పాపం నిజం.. అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలను వైఎస్సార్సీపీ శ్రేణులు తొలగించగా.. ఆ పార్టీ కార్యకర్తలపై ఎస్ఐ మురళి దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ శ్రేణులను అరెస్ట్ చేశారు.తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యిందంటూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలపై మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను వేశారు. వైఎస్సార్సీపీ హయాంలో (2019-24) మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజనిజర్ధాణలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని న్యాయస్థానాలు కూడా తప్పుబట్టాయి. ఈ క్రమంలో.. దర్యాప్తు జరిపిన సీబీఐ నెయ్యి శాంపిల్స్లో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చింది. ఈ నేపథ్యంలో రివర్స్లో ఇలాంటి చేష్టలకు దిగడం గమనార్హం. -
తిరుమల లడ్డూపై కూటమి కుట్ర బట్టబయలు: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి వెల్లడించారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టంగా తేల్చడంతో, ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు కొత్త కుట్రలకు తెర తీశారని ఆయన మండిపడ్డారు.‘మహా పాపం నిజం’ అంటూ పలుచోట్ల వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, మళ్లీ విష ప్రచారానికి దిగారని ఆక్షేపించారు. దేవుణ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, అలా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎం.మనోహర్రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..:సీబీఐ ‘సిట్’ ఛార్జ్షీట్లో ఏముంది?:తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు’ అని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టం చేసింది. ఆ మేరకు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ‘తిరుమలలో వాడిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలవనే లేదు’ అందులో తేల్చి చెప్పింది. హరియాణలోని ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని సిట్ తన ఛార్జ్షీట్లో పేర్కొంది.ప్రజలను మభ్యపెట్టేలా మళ్లీ కొత్త కథనాలు:తిరుమలలో వాడిన నెయ్యిపై సీబీఐ సిట్ ఛార్జ్షీట్తో తమ కుట్ర బెడిసి కొట్టడంతో, ఎదురుదాడి మొదలుపెట్టిన టీడీపీ కూటమి, మాట మార్చి కల్తీ నెయ్యి, కెమికల్ నెయ్యి అంటూ కథనాలు రాస్తోంది. ఇంకా మరో అడుగు ముందుకేసి.. ‘మహా పాపం నిజం’ అంటూ పలుచోట్ల వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, విష ప్రచారానికి దిగింది. ప్రజాక్షేత్రంలో జగన్గారిని ఎదుర్కోలేక, ఆయన వ్యక్తిత్వ హననంతో పాటు, వైఎస్సార్సీపీని అప్రతిష్ట పాల్జేసే కుట్ర, దురుద్దేశంతో అలా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేస్తున్నారు.అది హిందూ ధర్మంపై దాడి:దేవుడ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ చంద్రబాబులో ఏమాత్రం మార్పు రాలేదు. లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ సిట్లో ఆధారాలు లేకపోవడంతో ఎలాగైనా కల్తీ మకిలీని వైయస్ఆర్సీపీకి అంటించాలనే దుర్మార్గపు ఆలోచనతో కోర్టు సూచనలను, సీబీఐ నివేదికలను కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది, ఇది ప్రజల విశ్వాసంతో పాటు, హిందూ ధర్మంపై దాడి చేయడమే.ఫిర్యాదు చేస్తాం.. కోర్టునూ ఆశ్రయిస్తాం:సీబీఐ, సిట్ ఛార్జిషీట్లో లేని అంశాలను పోస్టర్ల రూపంలో ప్రచారం చేయడం చట్టవిరుద్ధం, దీనిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తాం. అంతే కాకుండా ఈ అంశంపై హైకోర్టులో న్యాయపోరాటం చేయడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఉంది. వాటన్నింటినీ కోర్టులో ప్రవేశపెట్టి నిజాలు బయటపెడతాం. ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా, దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం అత్యంత దుర్మార్గం. అందుకే పోలీసులకు ఫిర్యాదుతో పాటు, న్యాయ పోరాటం కూడా చేస్తామని ఎం.మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. -
‘పవన్ ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారో..’
సాక్షి,నగరి: రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీసిందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ అంశంలో సీబీఐ రిపోర్టుపై గురువారం ఆమె చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడారు.తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చింది. రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీశారు. కూటమి నేతల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శిక్షించాలి. చంద్రబాబు ప్యాకేజీ అందగానే పవన్ ఊగిపోయాడు.సనాతన ధర్మం ముసుగులో ప్యాకేజీల కోసం ఆడించే డ్రామా ఆర్టిస్టులు. పవన్ ఏ గుడిమెట్లు కడుగుతారో చెప్పాలి. సనాతన ధర్మాన్ని కాపాడుతారా?.వైఎస్ జగన్ కాళ్లు కడిగి చంద్రబాబు, పవన్ నెత్తిన చల్లుకోవాలి. ఆడవాళ్లకు అబార్షన్లు చేయించి.. రోడ్డున పడేసిన వాళ్లు.. సనాతన ధర్మాన్ని కాపాడుతారా?. తప్పుడు ప్రచారం చేసిన నోర్లను పినాయిల్తో కడగాలి. శ్రీవారి భక్తులకు చంద్రబాబు, పవన్ ఏం సమాధానం చెప్తారు.విజయవాడ మునిగినప్పుడు చంద్రబాబు, ఇతర మంత్రులు హైదరాబాద్లో ఉన్నారు. కూటమి నేతలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు’అని మండిపడ్డారు. -
ఏపీలో భూ రీసర్వే జగన్ విజనే.. భేష్
సాక్షి, ఢిల్లీ: తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదీస్తున్న కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడు పడని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆర్థిక సర్వేలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి విజన్ను కేంద్రం కొనియాడింది. వ్యవసాయ రంగంలో.. 2021లో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. ‘‘2021లో అప్పటి ఏపీ ప్రభుత్వం భూ రీసర్వే ప్రాజెక్టును చేపట్టింది. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి జీఐఎస్ సహాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ఇచ్చారు. మొత్తం 6,901 గ్రామాల్లో ఈ రీసర్వే జరిపారు. మొత్తంగా 81 లక్షల భూముల పునః సర్వే జరిగింది. దాదాపు 86 వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యాయి’’ అని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో.. చంద్రబాబు అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా మరోసారి పటాపంచలు అయ్యాయి. భూ సర్వే జగన్ విజనేనంటూ కేంద్రం కూడా బాబుకి షాకిచ్చినట్లైంది. -
చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి బెయిల్ మంజూరు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. అక్రమ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం చెవిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్రెడ్డి, వెంకటేష్ నాయుడులకు సైతం బెయిల్ ఇచ్చింది.వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని.. ఇందులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాత్ర కూడా ఉందంటూ జూన్17వ తేదీన సిట్ బెంగుళూరులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి కుంభకోణానికే ఆస్కారమే లేదని.. ఇదంతా కూటమి ప్రభుత్వ కుట్రేనని వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యంతో భాధపడుతున్నప్పటికీ కూడా చెవిరెడ్డి సుబ్బారెడ్డిని ఇబ్బంది పెట్టింది కూటమి ప్రభుత్వం. చివరకు 226 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ ద్వారా ఉపశమనం లభించింది. సిట్ అభియోగాలుడిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అందుకున్నారని.. ఆ సొమ్మును గత అసెంబ్లీ ఎన్నికల టైంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ తన అభియోగాల్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యవహరించారంటూ అభియోగం నమోదు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ-38గా, భాస్కరరెడ్డి తనయుడు మోహిత్రెడ్డిని ఏ-39 నిందితులుగా పేర్కొనడం గమనార్హం. -
లూథ్రాకు డబ్బే డబ్బు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదంటూ రూ.50 వేల బిల్లు కూడా చెల్లించకుండా గుత్తేదారులను ముప్పుతిప్పలు పెడుతూ వారిని హైకోర్టుకొచ్చేలా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాకు మాత్రం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఫీజుల రూపంలో దోచిపెడుతోంది. ఆన్లైన్ లేదా భౌతికంగా కోర్టుకు అలా వచ్చి ఇలా వెళ్తే చాలు లూథ్రాకు కోట్లకు కోట్లు ఫీజుగా చెల్లిస్తోంది. వాదనలతో సంబంధంలేకుండా కోర్టుకు హాజరైతే చాలు కోట్లకొద్ది ప్రజాధనం ఆయన ఖాతాలో ఫీజుల రూపంలో జమ అవుతోంది. ఇలా ఇప్పటికే లూథ్రాకు రూ.8.62 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా ఆయనకు మరో రూ.1.92 కోట్లు చెల్లించింది. తద్వారా ఆయనకు ఇప్పటివరకు రూ.10.54 కోట్లు చెల్లించినట్లయింది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా పెట్టిన కేసులకు చంద్రబాబు ప్రభుత్వం ఇలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా చంద్రబాబు తన ఆస్థాన న్యాయవాది లూథ్రాకు ఫీజుల చెల్లింపుల్లో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు.ఒక్కరోజు వాదనలకు రూ.10 లక్షలు..ఇక మద్యం అక్రమ కేసుల్లో సీఐడీ సిట్ తరఫున సిద్దార్థ లూథ్రా హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. మద్యం కేసులో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 11425/2025)లో గత ఏడాది నవంబరు 25న ఒక్కరోజు వాదనలు వినిపించినందుకు లూథ్రాకు రూ.10 లక్షలను చంద్రబాబు ప్రభుత్వం ఫీజుగా చెల్లించింది. అలాగే, రిట్ పిటిషన్ నెంబర్ 32915/2025లో నవంబర్ 26, 27 తేదీల్లో వాదనలు వినిపించినందుకు రోజుకు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలు చెల్లించింది. సంబంధంలేని కేసులో రూ.20 లక్షలు చెల్లింపు..రిట్ పిటిషన్ నెంబర్ 12190/2025లో నవంబరు 28న వాదనలు వినిపించినందుకు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలు చెల్లించింది. వాస్తవానికి.. ఈ పిటిషన్ మద్యం కేసుకు సంబంధించింది కాదు. ఇది ఓ ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన కేసు. ఈ కేసుతో సీఐడీకి ఎలాంటి సంబంధంలేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్దార్థ లూథ్రాకు రూ.20 లక్షలు చెల్లించడం విశేషం. మద్యం కేసులో నిందితుడు ముప్పిడి అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 10012/2025)లో సీఐడీ తరఫున వాదనలు డిసెంబరు 2న హాజరైనందుకు రూ.20 లక్షలు చెల్లించింది. ఇలా మొత్తం ఆయనకు రూ.70 లక్షలు చెల్లించింది. ఈ రూ.70 లక్షలకు 10 శాతం క్లర్కేజీ అంటే రూ.7 లక్షలు కలిపి మొత్తంగా రూ.77 లక్షలను లూథ్రాకు ధారబోసింది. ఆ మేరకు ప్రభుత్వం జీఓ ఆర్టీ–102 జారీచేసింది.ఐదు కేసులకు రూ.1.10 కోట్లు చెల్లింపు..మద్యం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 6892/2025)లో సెప్టెంబరు 19న సీఐడీ తరఫున హాజరైనందుకు బాబు సర్కారు లూథ్రాకు రూ.10 లక్షలు చెల్లించింది. ఇదే కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ (సీఆర్ఎల్పీ 9365/2025)లో సెప్టెంబరు 23న హాజరైనందుకు రూ.10 లక్షలు.. ముప్పిడి అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 10012/2025)లో సెప్టెంబరు 24న హాజరైనందుకు రూ.50 లక్షలు.. చాణక్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 9369/2025)లో సెప్టెంబరు 26న హాజరైనందుకు రూ.20 లక్షలు.. బాపనపాడు మైనింగ్ కేసులో పోలీసుల తరఫున సెప్టెంబరు 22న వాదనలు వినిపించినందుకు రూ.10 లక్షలు చెల్లించింది. ఇలా లూథ్రాకు రూ.కోటి చెల్లించింది. దీనికి 10 శాతం క్లర్కేజీ కలిపి రూ.1.10 కోట్లు చెల్లించింది. ఆ మేర జీఓ–104 జారీచేసింది. అదే రీతిలో కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డి బెయిల్ పిటిషన్లో సీఐడీ తరఫున నవంబరు 18న వాదనలు వినిపించినందుకు రూ.5 లక్షలు చెల్లించింది. ఆ మొత్తానికి 10 శాతం క్లర్కేజీ రూ.50 వేలు కలిపి మొత్తంగా రూ.5.50 లక్షలు చెల్లిస్తూ జీఓ–103 జారీచేసింది. -
న్యాయాధికారులూ.. ఏఐతో జాగ్రత్త
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధస్సు (ఏఐ) అనేది కేవలం సమాచారాన్ని సమకూర్చుకోవడానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని, అది మానవ మేధస్సుకు లేదా సాక్ష్యాలను విశ్లేషించే సామర్థ్యానికి ప్రత్యామ్నాయం కానే కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు కంటే న్యాయమూర్తి తన మానవ మేధస్సుకే అధిక ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది. ఓ సివిల్ వివాదంలో అడ్వొకేట్ కమిషనర్ ఇచ్చిన నివేదికతో విభేదిస్తూ.. ఆ నివేదికను రద్దు చేయాలని గుమ్మడి ఉషారాణి, మరొకరు విజయవాడ కోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కొట్టేస్తూ విజయవాడ కోర్టు న్యాయాధికారి గత ఏడాది ఆగస్టు 19న ఉత్తర్వులిచ్చారు. అడ్వొకేట్ కమిషనర్ నివేదిక కేవలం సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరం ఉంటే ట్రయల్ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్లో తేల్చుకోవాలని ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో నాలుగు తీర్పులను ఉదహరించారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గుమ్మడి ఉషారాణి, మరొకరు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి విచారణ జరిపారు. ముఖ్యంగా కింది కోర్టులు తమ తీర్పుల విషయంలో ఏఐ సాధనాలను ఉపయోగించే సందర్భాల్లో అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు న్యాయమూర్తి చెప్పారు. ఏఐ ఇచ్చే సమాచారాన్ని యథాతథంగా తీసుకోకుండా న్యాయాధికారులు తమ విచక్షణను, న్యాయపరమైన ఆలోచనను ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తీర్పులు లేదా ఉత్తర్వులు ఎప్పుడూ చట్టపరమైన సూత్రాల ఆధారంగా ఉండాలే తప్ప, ఏఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉండకూడదని తేలి్చచెప్పారు. న్యాయ పరిశోధన కోసం ఏఐను ఉపయోగించే వారు, అది అందించే సమాచారాన్ని, తీర్పులను అత్యంత జాగ్రత్తగా, కఠినంగా పరిశీలించాలని సూచించారు. ‘ఏఐ సాధనాలు పైకి నమ్మకంగా, ప్రభావవంతంగా కనిపించే సమాధానాలు ఇవ్వగలిగినా అవి వాస్తవంగా, చట్టపరంగా తప్పయ్యే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏఐ అసలు ఉనికిలో లేని తీర్పులను సృష్టించడంతోపాటు సమస్యకు సంబంధం లేని తీర్పులను తప్పుగా అన్వయించవచ్చు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. కృత్రిమ మేధస్సు వల్ల గోప్యతకు భంగం కలగడంతో పాటు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం, విశ్వాసం దెబ్బతింటుంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.అందుకే.. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం ‘ప్రస్తుత కేసులో కింది కోర్టు న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో ఏఐ సాధనాన్ని ఉపయోగించి ప్రస్తావించిన తీర్పులు అసలు ఉనికిలోనే లేవు. కానీ.. ఆ న్యాయాధికారి ఆ కేసుకు చట్టబద్ధమైన న్యాయసూత్రాన్ని మాత్రం సక్రమంగానే అన్వయించారు. సీపీసీ ప్రకారం అడ్వొకేట్ కమిషనర్ నివేదిక కేవలం ఒక సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరాలుంటే ట్రయల్ సమయంలో క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా తేల్చుకోవచ్చని ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో కమిషనర్ నివేదికను కొట్టివేయాల్సిన అవసరం లేదని కూడా ఆ న్యాయాధికారి చెప్పారు. ఇదే చట్టబద్ధమైన న్యాయసూత్రం. దీనిని ఆ న్యాయాధికారి ఈ కేసుకు సరైన రీతిలో అన్వయింప చేశారు. ప్రస్తుత కేసులో కింది కోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపం గానీ, న్యాయపరిధి ఉల్లంఘన గానీ లేనే లేదు. అందువల్ల ఆ ఉత్తర్వుల్లో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం’ అని తేల్చి చెప్పారు. ఉషారాణి, మరొకరు దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్ (సీఆర్పీ)ను కొట్టేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఇటీవల తీర్పు వెలువరించారు. -
పేరుకుపోతున్న బకాయిలు
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన వైద్యశాఖను ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తోంది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్, వైద్య పరికరాలు సరఫరా చేసిన కంపెనీలకు ప్రభుత్వం నిధులు విదల్చడం లేదు. రూ.వందల కోట్ల బిల్లులను కనీసం ప్రాసెస్ చేయకుండా ఏపీఎంఎస్ఐడీసీ స్థాయిలోనే తొక్కి పెట్టేస్తున్నారు. దీంతో మందులు, సర్జికల్స్ సరఫరా చేయలేమంటూ కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. ప్రభుత్వం కంపెనీలకు ఏకంగా రూ.500 కోట్ల మేర బకాయి పడినట్టు తెలుస్తోంది. ఆ బిల్లులను రాబట్టుకోవడం కోసం సరఫరాదారులు వైద్య, ఆర్థిక, శాఖలతో పాటు ‘ముఖ్య’నేత కార్యాలయంలోని ఉన్నతాధికారులను ప్రాధేయç³డుతున్నప్పటికీ నిధులు మాత్రం రావడం లేదు. మొత్తం పెండింగ్ బిల్లుల్లో రూ.200 కోట్ల మేర ఇప్పటికే ఎంఎస్ఐడీసీ నుంచి ప్రాసెస్ చేసి సీఎఫ్ఎంఎస్కు ఎక్కించారు. రూ.150 కోట్ల మేర నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) బిల్లులు ఆగిపోయాయి. మరో రూ.150 కోట్ల మేర బిల్లులు పూర్తిస్థాయిలో ప్రాసెస్కు నోచుకోవడం లేదు. ఇంత పెద్దమొత్తంలో బిల్లులు నిలిచిపోవడంతో నాలుగో క్వార్టర్ సరఫరా చేయలేమని ఇప్పటికే పలు కంపెనీలు అధికారులకు తెగేసి చెప్పినట్టు సమాచారం. గత కొద్ది నెలలుగా బాబు గద్దెనెక్కిన నాటి నుంచి ప్రభుత్వాస్పత్రులను మందులు, సర్జికల్స్ కొరత వేధిస్తోంది. నిబంధనల మేరకు ఉండాల్సిన అన్ని మందులు, సర్జికల్స్ అందుబాటులో ఉండడం లేదు. మందులు బయట నుంచి తెచ్చుకోవాలట..ఈ నేపథ్యంలో మందులు, సర్జికల్స్ బయట కొనుక్కోవాలని రోగులకు సిబ్బంది చీటీలు రాసిస్తున్నారు. గత నెలలో ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలోనూ డీఎంఈ ఆస్పత్రుల్లో వైద్యులు రాసిచ్చిన మందులు ఉచితంగా ఇవ్వలేదని దాదాపు 40 శాతం మేర రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇంత దుర్భర పరిస్థితులు ఉంటే సరఫరా అయిన అరకొర మందులకు కూడా ప్రభుత్వం కంపెనీలకు సకాలంలో నిధులు మంజూరు చేయడం లేదు. అంతేకాకుండా ప్రభుత్వాస్పత్రులకు కూడా ఆరోగ్యశ్రీ నిధులను చెల్లించకపోవడంతో జీజీహెచ్లలో పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం సరఫరా చేయని మందులను జీజీహెచ్లకు వచ్చే ఆరోగ్యశ్రీ నిధులతో కొనుగోలు చేస్తుంటారు. ఆ నిధులను చెల్లించకపోవడంతో ఆస్పత్రులకు సైతం మందులు, సర్జికల్స్ ఇవ్వలేమని కంపెనీలు తేల్చి చెప్పేస్తున్నాయి. -
తిరుమల లడ్డూ కల్తీ అయిందనే చెప్పండి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తాము చేసిన ప్రచారం తప్పని తేలిన నేపథ్యంలో బుధవారం కేబినెట్ భేటీలో చంద్రబాబు దానిపై మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. సిట్ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందనే విషయాన్ని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం ముగిశాక చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై రాజకీయ అంశాలపై మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై గతంలో తాము చేసిన ఆరోపణలను ఎలా సమర్థించుకోవాలనే దానిపైనే ఎక్కువసేపు చర్చించినట్లు సమాచారం. సిట్ ఇచ్చిన నివేదికలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొన్నారని, ఇది వైఎస్సార్సీపీకి ఆయుధంగా మారిందని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. దీనిపై బాబు స్పందిస్తూ.. సిట్ నివేదికపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని ప్రచారం చేయాలని, అసలు ఇంకా నివేదిక బయటకు రాలేదని చెప్పాలని సూచించినట్లు సమాచారం. గతంలో తాను చెప్పినట్లు జంతువుల కొవ్వు కలిసిందనే అంశాన్ని వదిలేసి కల్తీ జరిగిందనే విషయాన్ని మాత్రమే బయటకు చెప్పాలని.. అలాగే, పాలులేకుండా నెయ్యి తయారైందని ప్రచారం చేయాలని ఆయన సూచించారు. మరోవైపు.. సిట్ నివేదికను అధికారికంగా తెప్పించాలని, దానిపై ఇంకా ఎలా మాట్లాడాలో చూద్దామని అన్నట్లు సమాచారం. అయితే, ఇద్దరు మంత్రులు మాట్లాడుతూ.. ఇప్పటికే వైఎస్సార్సీపీ స్పీడుగా ఉందని చంద్రబాబు, టీడీపీ చెప్పినవన్నీ అబద్ధాలేననే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లారని అన్నట్లు తెలిసింది. అయినా పర్వాలేదని, సిట్ నివేదిక ఎలా ఉన్నా వెనక్కి తగ్గకుండా కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రచారం చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. సిట్ నివేదిక వైఎస్సార్సీపీకే వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుదామని, టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పీఏ అకౌంట్లో డబ్బులు జమ అయిన విషయాన్ని ఎక్కువగా మీడియాలో చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.మంత్రుల పనితీరుపై అసంతృప్తి..చంద్రబాబు యథావిధిగా ఈ సమావేశంలోనూ మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరికి తమ శాఖలపై ఏమాత్రం పట్టులేదని, తమకు సంబంధించిన సబ్జెక్టులపై కూడా మాట్లాడలేకపోతున్నారని, రాజకీయ విమర్శలను వెంటనే తిప్పికొట్టలేకపోతున్నారని చెప్పినట్లు సమాచారం. లడ్డూ విషయంలో సిట్ నివేదికపై వైఎస్సార్సీపీ దూకుడుగా వెళ్తున్నా తమ వాళ్లు ధీటుగా జవాబు ఇవ్వలేకపోయారని అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. -
కేంద్ర కేబినెట్లో జనసేనకు చోటివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కళ్యాణ్ తన వర్గానికి పదవుల కోసం హస్తిన వేదికగా లాబీయింగ్కు తెరలేపారు. ఇటీవల సీఎం చంద్రబాబు ఇక్కడికొచ్చి తన బంధువు, రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించాలని కోరినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పవన్ కూడా ఇప్పుడు అదే బాటపట్టారు. తనకు, సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన లింగమనేని రమేష్కు రాజ్యసభ సీటు ఇవ్వాలని పైరవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, తన పార్టీ లో కీలకంగా ఉన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలÔౌరికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించాలని బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. లింగమనేని కోసం పవన్ ఆరాటం.. త్వరలో ఏపీకి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండడంతో వీటికోసం అటు టీడీపీ ఇటు జనసేన, బీజేపీ పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆశావహులు ఢిల్లీ వేదికగా పైరవీలు చేస్తుండగా.. సీఎం చంద్రబాబు ఇటీవల తన అస్మదీయుల కోసం అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్కు అత్యంత ఆప్తుడుగా ఉన్న కిలారు రాజేశ్కు రాజ్యసభ సీటు కేటాయించాలని చంద్రబాబు అడగ్గా.. కూటమిలో భాగస్వామిగా ఉన్న తమకు కూడా రాజ్యసభలో చోటు కల్పించాలని పవన్ తాజాగా పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన కూడా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏడాది క్రితం ఖాళీ అయిన రెండు స్థానాలను టీడీపీ ఒకరికి, బీజేపీ మరొకరికి పంచుకున్నాయి. అప్పట్లో పవన్ లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు. అయితే, ఇప్పుడు ఖాళీ అయ్యే సీట్లలో జనసేన నుంచి లింగమనేని రమేష్కు అవకాశం కల్పించాలంటూ పవన్ అమిత్ షాను అడిగినట్లు తెలుస్తోంది. తమ పార్టీ కి మంత్రి పదవిస్తే వచ్చే ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం ఎదుట పవన్ విన్నవించినట్లు సమాచారం. కాగా ఉప్పాడ సముద్ర రక్షణ కోసం గోడ నిర్మాణం, రాష్ట్రంలో పరిపాలన, ఇతర ముఖ్యమైన విషయాలపై కేంద్ర హోంమంత్రితో చర్చించినట్లు పవన్కళ్యాణ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
మరీ ఇంత మోసమా బాబూ!
సాక్షి, అమరావతి: అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని.. అవసరమైతే ఉన్న చార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజలపై దాదాపు రూ.20 వేల కోట్ల చార్జీల భారాన్ని వేయడం అన్యాయమని, నమ్మినందుకు ఇంతగా మోసం చేస్తారా? అంటూ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు.2026–27 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ సీపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సంస్థలు సమర్పించిన ఆదాయ, అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్–ఏఆర్ఆర్), రిటైల్ టారిఫ్ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) నాలుగు రోజులపాటు బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ నెల 20న తిరుపతిలో మొదలుపెట్టి.. 22, 23 తేదీల్లో విజయవాడ, 27న కర్నూలులో బహిరంగ విచారణల ద్వారా 71 మంది నుంచి అభిప్రాయాలను, అభ్యంతరాలను ఏపీఈఆర్సీ స్వీకరించింది. నేరుగా 32 మంది, వర్చువల్ (ఆన్లైన్) ద్వారా 39 మంది అభ్యంతరాలను వెల్లడించారు. బహిరంగ విచారణలో వచ్చిన సూచనలను పరిశీలించిన అనంతరం ఏపీఈఆర్సీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. దాని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ అమలులోకి వస్తుంది. చేస్తాం.. చూస్తాం బహిరంగ విచారణలో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులపై విద్యుత్ సంస్థల సీఎండీలు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. ఏపీ ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్చంద్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి వచి్చన అభ్యంతరాలకు వివరణ ఇచ్చారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని అందిన ఫిర్యాదులపై సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి స్పందిస్తూ.. కెపాసిటర్లు సరిగ్గా పెట్టుకోకపోవడం వల్లనే బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ప్రభుత్వ విభాగాల విద్యుత్ బకాయిలను, ప్రైవేటు సంస్థల బకాయిలను, కుప్పం రెస్కో బకాయిలను ఎందుకు వసూలు చేయలేదని వచ్చిన ప్రశ్నలపై ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తోలేటి స్పందిస్తూ.. వాటిలో అధిక శాతం కోర్టు కేసుల్లో ఉన్నాయని తెలిపారు. కుప్పం రెస్కోకు టారిఫ్ను నిర్ణయించాల్సిందిగా ఏపీ ఈఆర్సీని సీఎండీ కోరారు. టైమ్ ఆఫ్ డే బిల్లింగ్లో పీక్, ఆఫ్ పీక్ అవర్స్కు వేస్తున్న విద్యుత్ చార్జీలు, ఆక్వా రంగంలో విద్యుత్ సమస్యలపై వచి్చన ఫిర్యాదులకు ఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృధ్వీతేజ్ వివరణ ఇచ్చారు. వివిధ వర్గాలకు ఇస్తున్న ఉచిత, రాయితీ విద్యుత్ను గతం నుంచీ ఇస్తున్నట్టుగానే ఇకపైనా కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంధన శాఖ అదనపు కార్యదర్శి కిశోర్కుమార్ తెలిపారు. ఈ మొత్తం బహిరంగ విచారణలో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, వైర్లు వంటి మెటీరియల్ కొనుగోళ్లపై ఆరోపణలు వస్తున్నాయని, భవిష్యత్లో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు వచ్చే రెండు నెలల్లోగా ఏపీఈఆర్సీ నిబంధనలు (రెగ్యులేషన్) రూపొందిస్తుందని చైర్మన్ పీవీఆర్ రెడ్డి ప్రకటించారు. తొలి ఏడాదే రూ.15 వేల కోట్ల భారం వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి ఏపీఈఆర్సీ సభ్యుడైన పీవీఆర్ రెడ్డి ఇన్చార్జ్ చైర్మన్ హోదాలో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. తొలి ఏడాదిలోనే రూ.15 వేల కోట్లకు పైగా భారం వేశారని, తర్వాత వేసిన వాటితో కలిపి ఇప్పటి వరకూ 4 విడతల్లో రూ.20 వేల కోట్లకుపైగా భారం మోపడంతో విద్యుత్ బిల్లులు రెట్టింపు అయ్యాయని, దీనిపై ఏపీఈఆర్సీ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరారు. డిస్కంలు ట్రూ అప్ పేరుతో వాస్తవ లెక్కలు కాకుండా అత్యధికంగా ప్రతిపాదనలు ఇస్తున్నారని, అది సమంజసం కాదని మండిపడ్డారు. జాతీయ రహదారులపై ఉండే వీధి దీపాలకు గ్రామాల పరిధిపి కేటగిరీ–4లో చేర్చాలని జాతీయ రహదారుల సంస్థ ప్రతినిధులు కోరారు. వాటర్ ప్లాంట్ వ్యాపారులకు విద్యుత్ బిల్లులు కేటగిరీ–2లోకి మార్చడం వల్ల బిల్లులు అధికంగా వస్తున్నాయని, వీటిని కేటగిరీ–3లోకి మార్చాలని వాటర్ ప్లాంట్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడ, కర్నూలులో విజ్ఞప్తి చేశారు. -
ఇది నారా వారి నామినేషన్.. కమీషన్లదే డామినేషన్
సాక్షి, అమరావతి : రూ.లక్షలోపు విలువైన పనులను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ).. రూ.2 లక్షలలోపు విలుౖవెన పనులను సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్ఈ).. రూ.3 లక్షలలోపు విలువైన పనులను ఛీఫ్ ఇంజినీర్ (సీఈ) నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించవచ్చన్నది ప్రభుత్వ నిబంధన. అదికూడా వరదలు, కరువు వంటి పరిస్థితులు సంభవించినప్పుడు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సంబంధించిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో అప్పగించాలన్నది నిబంధన. ఆ పనులకు టెండర్లు పిలిస్తే తక్షణమే సహాయక చర్యలు చేపట్టడానికి వీలుండదు కాబట్టి నామినేషన్ పద్ధతిలో అప్పగించే వెసులుబాటు కల్పించారు. ఇటీవల కాలువల మరమ్మతులు, పూడికతీత వంటి సాగునీటి సంఘా కు చెందిన రూ.10 లక్షల వరకూ విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించేలా నిబంధనలను సవరించారు. ఈ నిబంధనల్ని కచ్చితంగా అమలు చేయాల్సిన ప్రభుత్వమే.. వాటికి నిలువునా పాతరేసింది.ఏకంగా రూ.247.12 కోట్ల పనులకూ ‘నామినేషన్’రూ.లక్ష కాదు.. రూ.2 లక్షలు కాదు. పోలవరం ప్రాజెక్టులో ఏకంగా రూ.247.12 కోట్ల విలువైన పనులను అస్మదీయ కాంట్రాక్టు సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేయడానికి బుధవారం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2లో బట్రెస్ డ్యామ్, ప్రధాన డ్యామ్ నిర్మాణానికి ఇప్పటికే తవ్విన రాయి, మట్టితోపాటు అదనంగా అవసరమయ్యే మట్టి, రాళ్లను 902 హిల్ నుంచి తవ్వి తీసుకునే పనులను ఆ ప్రాజెక్టు పనులు చేస్తున్న మేఘా సంస్థకే నామినేషన్పై కట్టబెట్టేయడం గమనార్హం. అస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో భారీ ఎత్తున పనులు కట్టబెట్టి, ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడం 2014–19 మధ్య అప్పటి ప్రభుత్వ ముఖ్యనేతలు రివాజుగా మార్చుకున్నారు. పోలవరం హెడ్వర్క్స్ పనుల్లో రూ.2,917 కోట్ల పనులను నవయుగ సంస్థకు నామినేషన్పై కట్టబెట్టడమే అందుకు పరాకాష్ట. దేశ చరిత్రలో ఇంత పెద్దఎత్తున నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. కృష్ణా పుష్కర ఏర్పాట్లలో భాగంగా ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి నీరు–చెట్టు పనుల వరకూ రూ.15 వేల కోట్లకు పైగా విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టింది.వైఎస్సార్సీపీ హయాంలో మంగళం పాడేసినా..వైఎస్సార్సీపీ ప్రభుత్వం నామినేషన్ పద్ధతికి మంగళం పాడింది. 2019–24 మధ్య ఐదేళ్లలో నామినేషన్పై పనులు అప్పగించకుండా టెండర్ల ద్వారా పారదర్శకంగా పనులు అప్పగించింది. పోలవరం హెడ్ వర్క్స్లో చంద్రబాబు సర్కార్ నవయుగకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసి.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. తక్కువ ధరకు కోట్ చేసిన మేఘా సంస్థకు అప్పగించింది. తద్వారా ఖజానాకు రూ.680 కోట్లను ఆదా చేసింది. కేంద్ర జలసంఘం సూచనల మేరకు పోలవరం ప్రాజెక్టులో స్పిల్ ఛానల్కు ఆర్సీసీ డయాఫ్రం వాల్ ఎండ్ కటాఫ్, ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో వైబ్రో స్టోన్ కాలమ్స్–డీప్ సాయిల్ మిక్సింగ్, గ్యాప్–1లో డయాఫ్రం వాల్ కటాఫ్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్, స్పిల్ వే, స్పిల్ ఛానల్కు ఇరువైపులా ఏటవాలుగా రక్షణ పనులకు 2021 మే 7న రూ.683 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.669.47 కోట్లకు మేఘాకు అప్పగించింది. తద్వారా ఖజానాకు రూ.13.53 కోట్లను ఆదా చేసింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం వరద ఉద్ధృతి వల్ల కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తేవడం, సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు మరమ్మతులు చేసే పనులకు 2023 ఏప్రిల్ 28న 1615.75 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. రివర్స్ టెండరింగ్ ద్వారా 1,599.21 కోట్లకు మేఘాకు అప్పగించింది. దీనివల్ల ఖజానాకు రూ.16.54 కోట్ల ఆదా అయ్యాయి. ఇప్పుడు ప్రధాన డ్యామ్ నిర్మాణానికి అదనంగా అవసరమైన మట్టి, రాయిని 902 హిల్ నుంచి సమకూర్చుకునే పనులకు టెండర్లు నిర్వహించకుండా నామినేషన్ పద్ధతిపై బాబు సర్కార్ అప్పగించడం వెనుక కారణాలు ఏమిటన్నది బహిరంగ రహస్యమేనని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు. హంద్రీ–నీవాతో షురూచంద్రబాబు సర్కార్ 2024లో అధికారంలోకి వచ్చీ రాగానే హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనుల ద్వారా నామినేషన్ దందాకు తెరతీసింది. ఈ కెనాల్ను 79.6 కి.మీ. నుంచి 220.35 కి.మీ. వరకూ వెడల్పుచేసి, ప్రవాహ సామర్థ్యం పెంచే పనులకు రూ.1,929 కోట్ల వ్యయంతో 2021 సెప్టెంబర్ 4న వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాంకేతిక అనుమతి ఇచ్చింది. ఈ పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.1,217.49 కోట్లకు ఎన్సీసీ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుని.. వాటిని పూర్తిచేయానికి 2023 ఫిబ్రవరి 1న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ పనులను ఎన్సీసీ సంస్థ ఇప్పటివరకూ పూర్తిచేయలేదు. 25 శాతంలోపు మాత్రమే పనులు పూర్తయ్యాయని అధికార వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. వాస్తవానికి.. ఏదైనా పని పూర్తయ్యాకే ఆ పనికి కేటాయించిన నిధుల్లో ఎంత మిగిలాయన్నది తేల్చవచ్చు. కానీ.. ఇక్కడ పనులు పూర్తికాకముందే వాటికి ప్రభుత్వం ఇచ్చిన సాంకేతిక అనుమతిలో రూ.711.51 కోట్ల మేర మిగులు ఉందని తేల్చడంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో రూ.480.22 కోట్ల వ్యయంతో పుంగనూరు బ్రాంచ్ కెనాల్కు 75.075 కి.మీ. నుంచి 207.80 కి.మీ. వరకూ లైనింగ్ చేసే పనులను నామినేషన్ పద్ధతిలో ఎన్సీసీ సంస్థకు అప్పగిస్తూ 2024 డిసెంబర్ 24న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
అంతా బాబు దుష్ప్రచారమే.. రాజకీయ రాద్ధాంతమే
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది. అనంతరం చార్జ్షీట్ను నెల్లూరులోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల సమర్పించింది. మరోవైపు సీబీఐ నివేదిక పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు తమ అనుకూల ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చి దుష్ప్రచారానికి యత్నిస్తున్నారు. కాగా అసలు సీబీఐ దర్యాప్తులో ఏం వెల్లడైందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలు తాజాగా బహిర్గతమయ్యాయి. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని దర్యాప్తులో నిగ్గు తేలింది. సీబీఐ శాస్త్రీయంగా విశ్లేషించి సాధికారికంగా వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి..టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదువైఎస్సార్ సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తు నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్ను హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’కు పంపించి పరీక్షలు నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యాబరేటరీలు ఈ ఏడాది మార్చి 27న నివేదించాయని సీబీఐ నివేదిక పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్’’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక స్పష్టం చేసింది. రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై బాబు దుష్ప్రచారంరాజకీయ కుట్రల కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు. 1994–1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆయన భార్య లక్ష్మీ పార్వతిల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ దుష్ప్రచారం చేశారు. వైస్రాయ్ హోటల్ కుట్రతో ఆయనకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం అయ్యారు. కాగా ఈసారి ఏకంగా తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేలా చంద్రబాబు దుష్ప్రచార కుట్రలకు తెగబడటం విస్మయపరుస్తోంది. 2024 సెప్టెంబరు 18న చంద్రబాబు ఈ కుట్రకు తెరతీశారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ కుట్రకు తెగబడ్డారు. అంతేకాదు ఆ మర్నాడు అంటే సెప్టెంబరు 19న ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) నివేదికను వక్రీకరిస్తూ టీడీపీ ప్రధాన కార్యాలయంలో దాన్ని విడుదల చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఇటువంటి దుష్ప్రచారం చేయడం విభ్రాంతి కలిగించింది. ఎందుకంటే.. అధికార యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంది. నిజంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారో లేదోఅని తెలుసుకునే అవకాశం ఆయనకు ఉంది. అయినా సరే కేవలం వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయడం... ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చేందుకు కూడా వెనుకాడలేదు. కాగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అప్పుడే తిప్పికొట్టారు. గత ఏడాది సెప్టెంబరు 20న ఆయన తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలను పరోక్షంగా ఖండించారు. ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. నెయ్యి ట్యాంకర్లను తిరుపతిలోనే పరీక్షించి... నాణ్యత ఉన్నవాటినే తిరుమలకు పంపిస్తామని... తగిన నాణ్యతతో లేనివాటిని వెనక్కి పంపుతామన్నారు. అది దశాబ్దాలుగా టీటీడీ కచ్చితంగా పాటిస్తున్న విధానమేనని చెప్పారు. అదే విధంగా తగిన నాణ్యతతో లేని నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కి పంపామన్నారు. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించనే లేదని... అసలు కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిరుమల ఘాట్ రోడ్డులోకి కూడా ప్రవేశించనివ్వలేదన్నారు. దాంతో శ్యామలరావుపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను హుటాహుటిన అమరావతికి పిలిపించడం గమనార్హం. రాజకీయ కుట్రతో తాము చేసిన నిరాధార ఆరోపణలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని ఆయన్ను మందలించినట్లు తెలుస్తోంది. అనంతరం కొంత కాలానికే టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. బాబు కుట్రకు పవన్ వత్తాసుశ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం కలిగించేందుకు చంద్రబాబు పన్నిన కుట్రకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వత్తాసు పలికారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆయన హైడ్రామాకు తెరతీశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లను కడిగి చంద్రబాబు కుట్ర డ్రామాను మరింత రక్తి కట్టించేందుకు యత్నించారు. ఇక టీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగాలు లడ్డూ ప్రసాదంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారానికి తెగబడ్డాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు యత్నించాయి. దేవుణ్ని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండి: సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం దేవుణ్ణి అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయటాన్ని మందలించినట్లేనని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వరద సహాయక చర్యల్లో వైఫల్యం...డైవర్షన్ కుట్రతోనే లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారంవిజయవాడ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ డైవర్షన్ కుట్రకు పాల్పడ్డారు. 2024 సెప్టెంబరులో విజయవాడను బుడమేరు వరద ముంచెత్తింది. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా టీడీపీ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ లేదు. కనీసం లోతట్టు ప్రాంతాలవారిని అప్రమత్తం చేయలేదు. సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. దాంతో జల ప్రళయం విజయవాడను ముంచెత్తింది. కేవలం చంద్రబాబు సర్కారు వైఫల్యంతో 50మందికి పైగా దుర్మరణం చెందారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ కుట్రకు తెరతీశారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారానికి తెగబడ్డారు. తద్వారా ప్రజల దృష్టి విజయవాడ వరదల నుంచి మళ్లించేందుకు యత్నించారు.కుట్రతోనే ‘పచ్చ’ సిట్... అడ్డుకున్న సుప్రీంకోర్టుతమ రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం సిట్ను నియమించింది. టీడీపీ వీరవిధేయుడిగా ముద్రపడిన వివాదాస్పద అధికారి గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ను నియమించింది. మరో టీడీపీ వీరవిధేయ అధికారి, విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టిని అందులో సభ్యుడిగా నియమించింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య అల్లుడే గోపీనాథ్ జెట్టి. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న తమ దుష్ప్రచారానికి రాజముద్ర వేయాలనే ఆ ఎత్తుగడ వేసింది. కాగా ఈ యత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంది. ఆ సిట్ ఏర్పాటు చెల్లదని చెప్పింది. ఆ స్థానంలో సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు చార్జ్షీట్ను సమర్పించింది. -
కూటమి పాలనలో ఆటవిక రాజ్యం
చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వెళ్లారంటే.. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు అతడు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే.. ఆ అమ్మాయి అన్ని సాక్ష్యాధారాలతో సహా స్వయంగా బయట పెడితే, ఏ చర్యా లేదు. రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది. విచ్చలవిడితనం కనిపిస్తోంది. ఆ స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే జైల్లో పెట్టాల్సింది పోయి సాక్షాత్తూ చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, ఆయన ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది. ఇలాంటి పాలనలో మనం ఉన్నాం. జంగిల్ రాజ్యం అంటే ఇదే. – వైఎస్ జగన్ మండిపాటుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి నేతల అవినీతి, విచ్చలవిడితనం, బరి తెగింపు చూస్తుంటే అసలు మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందని.. ఇలాంటి ఆటవిక రాజ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండమంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే ఎలాంటి చర్యలూ లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చూస్తుంటే విస్మయం కలుగుతోందన్నారు. ‘మొబైల్ రికార్డింగ్ డ్యాన్స్లు.. కొత్తపేటలో వ్యాన్లపై రికార్డింగ్ డ్యాన్స్లు నిర్వహించారు. మొబైల్ వ్యాన్లలో మద్యం అమ్మారు. వాటి కోసం ప్రతి నియోజకవర్గంలో వేలం పాటలు పాడారు. మా పులివెందులలో కూడా గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి వేలం పాట నిర్వహించారు. రూ.3 కోట్లకు అమ్ముకున్నారు. ఎక్కడి నుంచో వచ్చి 8, 9 సెంటర్లు పెట్టి నిర్వహించుకున్నారు. ప్రభుత్వమే దగ్గరుండి ఇదంతా చేయిస్తోంది..’ అని మండిపడ్డారు. ‘భీమవరం డీఎస్పీ మాటలు వింటే ఆశ్చర్యం వేసింది. ఆయన యూనిఫామ్లో ఉండి.. ‘ఊపేయ్.. కుదిపేయ్!’ అంటున్నాడు. అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదు. ఏం జరుగుతోంది? ఇది ఆటవిక రాజ్యం కాక మరేమిటి?’ అంటూ ధ్వజమెత్తారు. ‘ఇది జంగిల్ రాజ్యం. దోచుకున్న సొత్తు.. పైనుంచి కింది వరకు, చంద్రబాబు, లోకే‹Ô మొదలు కిందిస్థాయి నాయకుడి వరకు.. చివరకు పోలీసులు కూడా మీకింత, నాకింత అని పంచుకున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ పార్టీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తొలుత ఏలూరు నియోజకవర్గంతో ఈ సమావేశాలు మొదలు కాగా రెండో సమావేశం భీమవరం కార్యకర్తలతో నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. భీమవరం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడుతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..కూటమి ప్రజా ప్రతినిధుల బరితెగింపు..కూటమి నేతలు, ప్రజా ప్రతినిధుల బరి తెగింపునకు అడ్డు లేకుండా పోయింది. అవినీతి, విచ్చలవిడితనం ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వెళ్లారంటే.. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు అతడు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే.. ఆ అమ్మాయి అన్నీ సాక్ష్యాధారాలతో సహా స్వయంగా బయటపెడితే, ఏ చర్యా లేదు. ఆమదాలవల ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు భరించలేక ఒక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్యాయత్నం చేసింది. అయినా కూడా ఏ చర్యా లేదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఓ మహిళను బలాత్కారం చేసి, చివరకు అధికార దుర్వినియోగంతో కేసును క్లోజ్ చేయించుకున్నాడు. ఎంత దారుణం? మంత్రి సంధ్యారాణి పీఏ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే.. అతడిని అరెస్టు చేయాల్సింది పోయి, ఫిర్యాదు చేసిన బాధిత మహిళను జైలుకు పంపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఫోన్లో ఒక మహిళతో మాట్లాడుతూ, అశ్లీలంగా ప్రవర్తించాడు. ఒక మంత్రి వాసంశెట్టి సుభాష్ అశ్లీల రికారి్డంగ్ డ్యాన్సులు వేశాడు. స్టేజీపై డ్యాన్సర్లతో కలిసి చిందులు వేశాడు. రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది. విచ్చలవిడితనం కనిపిస్తోంది. ఆ స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే జైల్లో పెట్టాల్సింది పోయి సాక్షాత్తూ చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, ఆయన ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది. ఇలాంటి పాలనలో మనం ఉన్నాం. జంగిల్ రాజ్యం అంటే ఇదే. ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర నుంచి అంతా విచ్చలవిడితనం, దోపిడీ కనిపిస్తోంది. పథకాలు రద్దు.. హామీలిచ్చి మోసాలుచంద్రబాబు వచ్చిన తరువాత జరిగింది ఏమిటంటే.. మన పథకాలన్నీ ఒకవైపు రద్దయ్యాయి. మరోవైపు ప్రజలను మభ్యపెడుతూ, మోసగిస్తూ ఆయన చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అబద్ధాలుగా తేలిపోయాయి. ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. విపరీతంగా ప్రచారం చేశారు. ప్రకటనలు ఇచ్చారు. చివరకు ఇంటింటికీ బాండ్లు కూడా పంపారు. దానిపై చంద్రబాబు, పవన్కళ్యాణ్ సంతకాలు కూడా చేశారు. పథకాల ద్వారా ఆ ఇంట్లో ఉన్న వారందరికీ ఎంతెంత వస్తుందనేది చెప్పారు. కానీ ఏదీ నిలబెట్టుకోలేదు. ఒక మనిషి ఈ స్థాయిలో అబద్ధాలు చెబుతారా? మోసాలు చేస్తారా? అనేది ఊహకు కూడా అందదు. ఎవరైనా ఇలాంటి అబద్ధాలు చెప్పి మోసం చేస్తే 420 అని కేసు పెట్టి జైల్లో వేస్తారు. కానీ ఒక్క చంద్రబాబు, ఆయన కూటమిలో మాత్రమే కేసులు లేకుండా బయట ఉన్నారు. అన్ని వర్గాలకు బాబు మోసాలు..ఆరోజు ఇంటింటికీ వెళ్లి ఏం చెప్పారు? ఏమన్నారు..? ఆ ఇంట్లో ఎవరైనా పిల్లాడు కనబడితే నీకు రూ.15 వేలు అని, ఆ పిల్లల తల్లులు కనబడితే నీకు రూ.18 వేలు అని, ఎవరైనా ఒక యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, కండువా కప్పుకుని రైతు కనిపిస్తే నీకు రూ.26 వేలు అని, ఇంకా పెద్దవాళ్లు కనిపిస్తే నీకు రూ.48 వేలు ఇస్తాం అని చెప్పారు. ఆ తర్వాత పచ్చి మోసం చేశారు. చివరకు గ్యాస్ సిలిండర్లలో కూడా మోసం చేశారు. ఏటా మూడు సిలిండర్ల చొప్పున రెండేళ్లకు కలిపి మొత్తం ఆరు సిలిండర్లు ఇవ్వాలి. కానీ, ఇచ్చింది ఒకటి రెండు మాత్రమే. అది కూడా అందరికీ ఇవ్వలేదు. చివరకు అక్కడా, అలా పచ్చి మోసం చేశారు.ఆ డబ్బంతా ఏమైంది?.. అంతా డీపీటీ!మన హయాంలో ఐదేళ్లలో.. రెండేళ్లు కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా మనం చేసిన అప్పు రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే. ఆ అప్పులో వివిధ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ఆ డబ్బు ఎవరికి పోయింది అనే వివరాలు, వారి బ్యాంక్ అక్కౌంట్ల నెంబర్లు, వారి ఆధార్తో సహా ఇవ్వగలిగే విధంగా మన పాలన సాగింది. చంద్రబాబు ఇప్పటికే 20 నెలల్లోనే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే మన హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పులో 95 శాతం ఇప్పటికే దాటాడు. మరి ఆ డబ్బంతా ఏమైంది? ఎవరికి పోయింది? అన్న దానికి సమాధానం లేదు. అంతా దోచుకో.. తినుకో.. పంచుకో! అదే డీపీటీ! అది మన కళ్ల ఎదుట కనిపిస్తున్న వాస్తవం. రెడ్బుక్ రాజ్యాంగం..మరోవైపు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తప్పు చేయకపోయినా.. తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. అసలు తప్పు చేసిన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పైగా ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు అదే పని చేస్తున్నారు. అంతా విచ్చలవిడి దోపిడీ, రెడ్బుక్ రాజ్యాంగం. పోలీసులు ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారు. వ్యవస్థలన్నీ పతనమయ్యాయి. మరోవైపు సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయి. హామీలు ఏవీ అమలు కాలేదు. అన్నీ మోసాలే. పథకాలు పోయాయ్..పథకాల అమలు లేదు. విద్యాదీవెన 8 త్రైమాసికాలు బాకీ. మన ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్కు పిల్లల తల్లుల ఖాతాలో జమ చేశాం. 2024 జనవరి–మార్చి త్రైమాసికం మొదలు.. గత డిసెంబరు వరకు 8 త్రైమాసికాలకు సంబంధించి రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. రూ.4,900 కోట్లు బాకీ. ఇక వసతి దీవెన ఏటా రూ.1100 కోట్లు. మొత్తం రూ.2200 కోట్లు బాకీ పెట్టారు. నాడు–నేడు పనులు లేవు. గోరుముద్ద నాణ్యత పడిపోయింది. పిల్లలు చనిపోతున్నారు. టోఫెల్ శిక్షణ, ఇంగ్లిష్ మీడియం, ట్యాబ్లు ఆగిపోయాయి. మన హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో 43 లక్షల మంది పిల్లలు చదివితే, ఈరోజు ఆ సంఖ్య 33 లక్షలే. అంటే 10 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఇవ్వాలి. రూ.6 వేల కోట్లకుగానూ రూ.2 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.4 వేల కోట్లు బాకీ పెట్టారు. దీంతో ఆస్పత్రులు వైద్యం అందించడం లేదు. వైద్యం పడకేసింది. మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అమ్మకం దారుణం. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. చివరకు యూరియా కూడా బ్లాక్లో కొనాల్సి వస్తోంది. రైతు భరోసా కింద రూ.40 వేలకు బదులు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. మా హయాంలో ఆక్వా విద్యుత్ సబ్సిడీ రూ.3,620 కోట్లు ఇచ్చాం. ఈరోజు పైసా ఇవ్వడం లేదు. మేం యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇచ్చాం. ఇవాళ విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు నిర్వీర్యం అయ్యాయి. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ..ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోంది. పార్టీ కార్యకర్తలు గొప్ప యజ్ఞం చేస్తున్నారు. ప్రతి కష్టంలోనూ ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మనపై ఉంది. మనం ప్రజలకు ఎన్నో చేశాం. మరి ఏమీ చేయని చంద్రబాబుకు ఈసారి ప్రజలు కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారు. మనం ప్రజల పక్షాన ఇలాగే నిలబడాలి. చూస్తుండగానే రెండేళ్లు అయిపోయాయి. ఇంకా మూడేళ్లు మాత్రమే మిగిలి ఉంది. అందులో మరో ఏడాదిన్నర గడిస్తే.. నా పాదయాత్ర మొదలవుతుంది. దాదాపు 150 నియోజకవర్గాల్లో నేను పర్యటిస్తా. అలా ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటా.« ఆ యాత్రలో ప్రతి మూడో రోజు బహిరంగ సభ నిర్వహిస్తాం. ప్రజా ఉప్పెనను చూపుతూ, ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ, చంద్రబాబు తప్పుడు పాలనను ప్రజలకు వివరిస్తాం. వాటిని ఎండగడతాం.ప్రతి ఇంటా చర్చ జరగాలి... మీరు చొరవ చూపాలిఇప్పుడు మీరంతా కలిసికట్టుగా నిలిచి పోరాడాలి. చంద్రబాబు దారుణ పాలనపై ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా చొరవ చూపాలి. మన పాలన, ఈ పాలన మధ్య తేడాను స్పష్టంగా ప్రజలకు వివరించాలి. వాటిపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఆ దిశగా మీరంతా కలసికట్టుగా కృషి చేయాలి. పార్టీ అనుబంధ విభాగాలన్నీ స్ట్రీమ్లైన్ చేయాలి. అన్నీ వ్యవస్థీకృతం కావాలి. చంద్రబాబు అన్యాయ పాలనను ప్రజల్లో బలంగా ఎండగట్టాలి. ఆ దిశగా మీరు చొరవ చూపాలి. అందరూ కలిసి పని చేయాలి.ఏ ఒక్క వర్గానికైనా ఒక్కటైనా మంచి జరిగిందా?చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్లు. ఫిబ్రవరి 11న మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్లు మాత్రమే మిగిలింది. మరి ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికైనా కనీసం ఒక్కటైనా మంచి జరిగిందా? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటంటే.. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దయ్యాయి. మనం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాళ్లం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ మాదిరిగా భావించేవాళ్లం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తపన పడేవాళ్లం. కోవిడ్ సంక్షోభం లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజూ, ఏ హామీని ఎగ్గొట్టాలని అనుకోలేదు. ప్రభుత్వానికి ఎన్ని సమస్యలు ఉన్నా, వాటి కంటే ప్రజల సమస్యలే ఎక్కువని భావించి చిరునవ్వుతో స్వీకరించాం. అన్ని హామీలూ అమలు చేశాం. ప్రజలకు ఏ ఇబ్బందీ లేకుండా చూశాం. అంతా కలసి పంచుకుంటున్నారు..ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా దోపిడీ, అవినీతి. అది ఏ స్థాయిలో ఉందంటే.. అసలు పాలకులు ఉన్నారా? అనిపించే పరిస్థితి. ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రావడం లేదు. అదంతా తగ్గుతోంది. మరి, అదంతా ఎక్కడికి పోతోంది అంటే.. చంద్రబాబు మొదలు కింది స్థాయి వరకు ఇంత అని పంచుకుంటున్నారు. మద్యం మాఫియా. ప్రైవేటు షాపులన్నీ లాటరీలో వాళ్ల మనుషులకే ఇచ్చుకున్నారు. గ్రామస్థాయిలో బెల్టు షాప్లు వేలం పాట పాడి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు కొట్టుకోకూడదు కాబట్టి! అక్కడ పోలీసుల సహకారంతో మద్యం అమ్ముతున్నారు. మద్యం షాప్ పక్కనే పర్మిట్ రూమ్లు, అక్కడ పెగ్గుల్లో అమ్మకం. అక్కడా దోపిడీ. వైన్ షాప్ల్లో కూడా ఎక్కువ ధరకు అమ్మకాలు. ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం అమ్మడం లేదు. ఎమ్మార్పీపై రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక ప్రతి నాలుగైదు బాటిళ్లకు ఒకటి నకిలీ.అలా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదోవ పడుతోంది. ఈరోజు ఇసుక ఫ్రీ అంటున్నా ఎక్కడా ఫ్రీగా లేదు. ఎక్కడ చూసినా లారీలు, మిషన్లతో దోచేసుకుంటున్నారు. ధర చూస్తే గతంలో కంటే డబుల్ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఐదేళ్లకు కలిపి దాదాపు రూ.3,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు ఆ ఆదాయం రావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. ఇసుక తరలిస్తున్నారు. ఏ ఒక్క గని వదలడం లేదు. సిలికా, మైకా, లేటరైట్, క్వార్ట్జ్.. ఏదీ వదలకుండా అన్నీ దోచుకుంటున్నారు.జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం..జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. అదీ నా హామీ. క్రితంసారి కోవిడ్ వల్ల పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది. జగన్ 2.0 లో కార్యకర్తలకు టాప్ ప్రయారిటీ. వారి ద్వారానే మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీ ద్వారానే చంద్రబాబు అన్యాయ, దారుణ పాలన ప్రజల్లో ఎండగడతాం. చిత్తశుద్ధితో కూడిన మంచి పాలన అంటే ఎలా ఉంటుంది? అనేది మనం చూపిస్తే.. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం ఎలా అన్నదానికి చంద్రబాబు పాలనే ఉదాహరణ.


