breaking news
Amaravati
-
భారీగా ఐఏఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పెద్దఎత్తున అఖిల భారత సర్వీసు అధికారులను (ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్) ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న వారికి పోస్టింగ్లు ఇచ్చిoది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ చేసిన వారిలో కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వలేదు. వారికి వేరుగా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న కేవీఎన్ చక్రధర్బాబును సెకండరీ హెల్త్ డైరెక్టర్గా నియమించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావును పౌర సరఫరాల సంస్థ ఎండీగా బదిలీ చేశారు. -
మరోసారి ఎస్సీలే లక్ష్యంగా బాబు కుతంత్రం
సాక్షి, అమరావతి: ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అంటూ గతంలో ఎస్సీలను ఘోరంగా అవమానించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మరోసారి ఎస్సీలను లక్ష్యంగా చేసుకున్నారు. మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి భాస్కరరావు ఇటీవల వరుసగా బెయిళ్లు మంజూరు చేస్తూ వస్తుండటంతో చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్సీ అయిన ఆయన్ను లక్ష్యంగా చేసుకుని న్యాయ చరిత్రలో ఎన్నడూ, ఎవ్వరూ చేయని విధంగా తన ఆస్థాన న్యాయవాది సిద్దార్థ లూథ్రా చేత హైకోర్టులో అనుచిత వ్యాఖ్యలు చేయించారు. భాస్కరరావు నిబంధనల మేరకు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేస్తుండటాన్ని సహించలేని చంద్రబాబు.. ఆ న్యాయాధికారిపై తన అసహనాన్ని, ఆక్రోశాన్ని లూథ్రా ద్వారా వెళ్లగక్కించారు. వైఎస్సార్సీపీ ఎంపీ పీవీ మిధున్రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో లూథ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. భాస్కరరావును ఏసీబీ కోర్టు నుంచి బదిలీ చేయించాలని తాను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు లూథ్రా బహిరంగంగానే తెలిపారు. భాస్కరరావు తాము చేస్తున్న ప్రతీ వాదనను తోసిపుచ్చుతున్నారని, తమ వాదనలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేసేస్తున్నారని లూథ్రా కోర్టుకు నివేదించారు. ఇటీవల మిధున్రెడ్డికి బెయిల్ మంజూరు సందర్భంగా తాము చేసిన ఏ వాదనను కూడా ఆయన పట్టించుకోకుండా తీర్పు ఇచ్చారని తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద, సెక్షన్ 164 కింద సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలను సైతం ఆయన పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అంతేకాక గూగుల్ టేకౌట్ను కూడా పట్టించుకోలేదన్నారు. ఎన్ని ఆధారాలు సమర్పించినా వాటిని ఆరోపణలనే పేర్కొంటూ ఆధారాల్లేవని చెబుతున్నారని తెలిపారు. మిధున్రెడ్డి ఏ నేరం చేయలేదంటూ క్లీన్ చీట్ ఇచ్చేశారన్నారు. బెయిలు మంజూరు సమయంలో భాస్కరరావు ఏ ఒక్క నిబంధనను కూడా పాటించలేదని తెలిపారు. మిధున్రెడ్డికి బెయిల్ తీర్పును కొట్టేయాలని పిటిషన్మద్యం కేసులో మిధున్రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పులోని పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఆ తీర్పులోని అంశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా మిధున్రెడ్డికి బెయిల్ ఇస్తూ ఇచ్చిన తీర్పులోని పలు అంశాలను స్టే చేయాలని, లేని పక్షంలో మిగిలిన నిందితులు ఆ అంశాలను ఆధారంగా చేసుకుని బెయిల్ పొందే అవకాశం ఉందని సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదించారు. దర్యాప్తు మొత్తం ప్రభావితం అయ్యేలా మిధున్రెడ్డికి ఏసీబీ కోర్టు న్యాయాధికారి బెయిల్ ఇచ్చారని తెలిపారు. దీని వల్ల మొత్తం దర్యాప్తే నిర్వీర్యమై పోతుందన్నారు. మిధున్రెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో అతని పాస్పోర్ట్ను స్వాధీనం చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించిందని లూథ్రా తెలిపారు. ఇదిలా ఉండగానే న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు వీలుగా పార్లమెంటరీ కార్యదర్శి నుంచి సెప్టెంబర్ 26న మిధున్రెడ్డికి మెయిల్ వచ్చిందన్నారు. అప్పుడు మిధున్రెడ్డి జైల్లో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం న్యూయార్క్ వెళ్లేందుకు వీలుగా మిధున్రెడ్డికి ఏసీబీ కోర్టు పాస్పోర్టును వెనక్కి ఇచ్చేసిందన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి షరతులు విధించలేదన్నారు. ఈ సందర్భంగా సిట్ తరఫున లూథ్రా ఏసీబీ కోర్టు న్యాయాధికారిపై పలు ఆరోపణలు చేశారు. ఏకపక్షంగా స్టే ఇవ్వలేంమిధున్రెడ్డికి బెయిలిస్తూ ఇచ్చిన తీర్పులోని అంశాలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. మిధున్రెడ్డి వాదనలు వినకుండా ఏకపక్షంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సోమవారం చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్రెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్లపై విచారణ ఉందని, మిధున్రెడ్డికి ఇచ్చిన తీర్పులోని అంశాలను స్టే చేయాలంటూ తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను తేల్చేంత వరకు తన ముందున్న వ్యాజ్యాలపై విచారణ జరపకుండా ఏసీబీ కోర్టును నియంత్రించాలని లూథ్రా హైకోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై తాము నిర్ణయం వెలువరించేంత వరకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తదితరుల పిటిషన్లపై విచారణ జరపొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. కాగా, సిట్ తరఫున ఇంకా హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.వ్యక్తిగత పర్యటన కాదు.. అది ప్రతిష్టాత్మక సమావేశం ఈ సమయంలో మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి స్పందిస్తూ, అనుబంధ పిటిషన్కు సంబంధించిన కాపీలను సిట్ తరఫు న్యాయవాదులు ఇప్పుడే తమకు అందచేశారన్నారు. వాటన్నింటినీ పరిశీలించి తగిన విధంగా స్పందించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. మి«థున్రెడ్డి పాల్గొనే సమావేశం చాలా ప్రతిష్టాత్మకమైనదని చెప్పారు. ఈ సమావేశానికి వెళుతున్న అతి తక్కువ మందిలో మిథున్ రెడ్డి ఒకరని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్ కార్యదర్శి నుంచి మెయిల్ వచ్చాక పాస్పోర్ట్ను వెనక్కి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశామన్నారు. సమావేశంలో పాల్గొనే హక్కు ఎంపీగా మిథున్రెడ్డికి ఉందని, దానిని పరిగణనలోకి తీసుకునే ఏసీబీ కోర్టు పాస్పోర్ట్ను వెనక్కి ఇచ్చిందన్నారు. మిథున్ దేశం తరఫున ఆ సమావేశానికి వెళుతున్నారే తప్ప అది వ్యక్తిగత పర్యటన కాదన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. బెయిల్ మంజూరు చేసిన న్యాయాధికారికి ఉద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు. ఎంపీ తన వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లడం లేదని, అధికారిక కార్యక్రమంలో భాగంగానే వెళ్తున్నారని.. ఈ ప్రోగ్రాం మొత్తాన్ని పీఎంవో పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు. చెవిరెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ జరుపుతుంది కాబట్టి, మిధున్రెడ్డి బెయిల్ పిటిషన్లోని అంశాలపై స్టే ఇవ్వాలని ఎలా కోరతారని ఆయన ప్రశ్నించారు. స్టే కావాలనుకుంటే అందుకు ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. లూథ్రా సిఫారసు చేస్తే సరిపోతుందా?ఏసీబీ కోర్టు జడ్జి భాస్కరరావును అక్కడి నుంచి బదిలీ చేయించాలని తాను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు లూథ్రా చెప్పిన నేపథ్యంలో ఓ న్యాయాధికారి బదిలీ అంత సులభమా అని సందేహం కలుగుతోంది. ప్రభుత్వం అనుకున్నంతనే న్యాయాధికారి బదిలీ జరిగిపోదు. న్యాయవాదులు ప్రభుత్వ పరిధిలో హైకోర్టు నియంత్రణలో పని చేస్తుంటారు. వారిని బదిలీ చేసే అధికారం హైకోర్టుకే ఉంటుంది. ప్రభుత్వానికి కేవలం న్యాయాధికారుల బదిలీని నోటిఫై చేసే అధికారం మాత్రమే ఉంటుంది. న్యాయాధికారుల బదిలీల విషయంలో హైకోర్టుదే తుది నిర్ణయం. న్యాయాధికారుల బదిలీల విషయంలో పరిపాలన హెడ్గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన సహచర సీనియర్ న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఉంటారు. ఆ కమిటీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లూథ్రా సిఫారసు చేశారనో, ప్రభుత్వం అడిగిందనో బదిలీ చేయడం ఉండదు. అందునా సీఐడీకి నచ్చని విధంగా న్యాయాధికారి వ్యవహరిస్తున్నారనే కారణంతో బదిలీ చేయడం అన్నది జరిగే పని కాదు. -
ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి, అమరావతి: నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు పాలన పెను శాపంగా మారింది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారినపడితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు లభించని దుస్థితి రాష్ట్రంలో దాపురించింది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో మరోమారు ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె బాట పట్టాయి. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ప్రకటించింది. బాబు గద్దెనెక్కాక ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు అధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా నిలిపేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం.సెప్టెంబర్ 15 నుంచే కీలక వైద్య సేవల నిలిపివేతనిజానికి సెప్టెంబర్ 15వ తేదీ నుంచే అన్ని ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ, డయగ్నోస్టిక్స్, ఇన్వెస్టిగేషన్ సేవలను నిలిపేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే అక్టోబర్ 10వ తేదీ నుంచి పూర్తి స్థాయి వైద్య సేవలను నిలిపేస్తామని గత నెల 24వ తేదీనే ఆశ ప్రతినిధులు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. సీఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్న రూ.670 కోట్లను పూర్తిగా చెల్లించి, మిగిలిన నిధుల విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వారితో చర్చలు జరిపి సేవలు నిలవకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. వెరసి పేద, మధ్యతరగతి ఉచిత వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయి. నిర్వీర్యమే లక్ష్యంఆరోగ్యశ్రీని బీమా విధానంలో అమలు చేస్తామని గద్దెనెక్కిన వెంటనే చంద్రబాబు ప్రకటించారు. అప్పటి నుంచే పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసే చర్యలకు దిగారు. ఇందులో భాగంగా నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లు చెల్లింపులు నిలిపేశారు. ఆరోగ్యశ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్కు సంబంధించి రూ. మూడు వేల కోట్లకు పైగా ప్రభుత్వం బకాయి పెట్టింది. పెద్ద ఎత్తున బిల్లులు ఆగిపోవడంతో ఆస్పత్రులను నిర్వహించలేని దయనీయ పరిస్థితుల్లోకి యాజమానులు వెళ్లిపోయారు. బకాయిలు నెలనెలా పెరగడమే తప్ప తరగడం లేదు. ఆరు నెలల్లో రెండవసారిమందులు, సర్జికల్స్ కొనుగోలు, వైద్యులు, సిబ్బందికి జీతాల చెల్లింపులతో పాటు, ఆస్పత్రుల విద్యుత్ బిల్లులు చెల్లించడానికి తీవ్ర అగచాట్లు పడుతున్నామని, పలు మార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో విసిగిపోయి మరోమారు యాజమాన్యాలు సమ్మెబాట పట్టాల్సిన పరిస్థితి తలెత్తిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బకాయిల చెల్లింపు డిమాండ్తో ఏప్రిల్లో సమ్మెలోకి వెళ్లాయి. అప్పట్లో సీఎం స్థాయిలో చర్చలు జరిపి బిల్లులు చెల్లిస్తామని హామీలు ఇచ్చారు. అనంతరం కూడా ఎటువంటి మార్పు రాకపోవడంతో మళ్లీ ఇప్పుడు ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్తున్నాయి.చేతల్లో కనబడని ప్రభుత్వ ప్రకటనలు ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడంతో ఏడాదిగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇన్ని రోజులు పంటి బిగువునా కష్టాలను భరిస్తూ సేవలను కొనసాగిస్తూ వస్తున్నాం. ఇక భరించడం సాధ్యం కావడం లేదు. అందుకే సేవలను నిలిపేస్తున్నాం. ఆస్పత్రులకు బకాయిలపై అసెంబ్లీ సాక్షిగా ప్రకటనలు చేసిన ప్రభుత్వం చెల్లింపుల్లో మాత్రం చొరవ చూపడం లేదు. మా ఆందోళన కారణంగా సామన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – ఆశ ప్రతినిధులు -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
సాక్షి, అమరావతి: పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని, వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుడితే, ప్రైవేటీకరణ ద్వారా వాటిని సీఎం చంద్రబాబు పేదలకు దూరం చేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ‘‘ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి 175 నియోజకవర్గాల్లో శుక్రవారం నుంచి వైఎస్సార్సీపీ 45 రోజుల పాటు గ్రామ స్థాయి వరకూ ప్రజా ఉద్యమం చేపడుతుంది. సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి రచ్చబండ కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్ల ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండలో నాయకులు పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిస్తారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమరి్పస్తారు. నవంబర్ 23న జిల్లా కేంద్రాల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. నవంబర్ 24న ఈ పత్రాలు కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి. అనంతరం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్ కు కోటి సంతకాలను సమర్పిస్తాం. పార్టీ మాత్రమే కాకుండా, పౌరసమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న మేధావి వర్గాలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని కోరుతున్నాం’’అని పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేయడాన్ని చూస్తే, చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు తారస్థాయికి చేరాయని అర్థం అవుతోందని సజ్జల అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి , ఎనీ్టఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, పలువురువైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. 13న నకిలీ మద్యంపై నిరసన కార్యక్రమాలు నకిలీ మద్యంపై సోమవారం (13వ తేదీ) అన్ని నియోజకవర్గాల్లో ఎక్సైజ్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు సజ్జల పిలుపునిచ్చారు. నకిలీ మద్యంపై ఇప్పటికే మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, ఇతర ముఖ్య నాయకులతో గురువారం సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల విజయవంతంతోపాటు, పార్టీ కమిటీల నియామకంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు. -
ముందస్తు పరీక్షలే బెస్ట్!
ఆధునిక జీవన శైలి వల్ల 50 ఏళ్లు దాటిన తరువాత వచ్చే రొమ్ము క్యాన్సర్లు నేడు 25 ఏళ్లకే కనిపించడం ఆందోళనకు దారి తీస్తోంది. విద్యావంతులు, చదువులేనివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది అక్టోబరు నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు మెడికల్: పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించే వైద్య పరికరం మెమోగ్రఫీ వైద్య పరికరం అందుబాటులో ఉంది. నాట్కో ట్రస్ట్ వారు రూ. కోటి విలువైన త్రీడీ డిజిటల్ మెమోగ్రఫీ వైద్య పరికరాన్ని నాట్కో క్యాన్సర్ సెంటర్లో అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. మెమోగ్రామ్ పరీక్ష చేసినందుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ. 2వేలు వరకు ఫీజు తీసుకుంటున్నారు.జీజీహెచ్లో వ్యాధి నిర్ధారణతోపాటు, రొమ్ము క్యాన్సర్ బాధితులకు అవసరమైన ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. ఆపరేషన్ల అనంతరం అవసరమయ్యే రేడియేషన్ థెరఫీ, కిమోథెరఫీ వైద్య సేవలు సైతం జీజీహెచ్ నాట్కో క్యాన్సర్సెంటర్లో పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ‘మెమోగ్రామ్’ పరీక్షలు చేయించుకున్నవారి వివరాలు.. జీజీహెచ్లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష మెమోగ్రామ్ 2023లో 368 మంది, 2024లో 381మంది, 2025 సెపె్టంబరు వరకు 381 మంది పరీక్షలు చేయించుకున్నారు. రొమ్ము క్యాన్సర్తో బాధపడుతూ 2022లో 34 మంది, 2023లో 73 మంది, 2024లో 69 మంది, 2025 సెప్టెంబరు వరకు 55 మంది రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్నారు. స్క్రీనింగ్ పరీక్షలతో చెక్ మహిళలంతా మెమోగ్రామ్, బయాప్సీ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ను ప్రథమ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చు. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఇతర కుటుంబ సభ్యు లకు వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా ముందస్తుగా జనటిక్ పరీక్ష చేయించాలి. సంతానం లేనివారికి, ఆలస్యంగా పిల్లలు పుట్టిన వారికి సైతం రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. –డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణులు, గుంటూరు ఉచితంగా రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్లు... నాట్కో క్యాన్సర్ సెంటర్లో కార్పొరేట్ ఆస్పత్రుల కంటే దీటుగా రొమ్ము క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేలా ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశాం. గత ఏడాది 69 మందికి, ఈఏడాది ఇప్పటివరకు 55 మందికి ఉచితంగా క్యాన్సర్ ఆపరేషన్లు చేశారు. నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో సెంటర్లో 24 గంటలు కార్పోరేట్ ఆస్పత్రుల కంటే ధీటుగా ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలను అందిస్తున్నారు. – నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్తొలిదశలోనే గుర్తించవచ్చు తొలి దశలోనే రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు మెమోగ్రామ్ పరీక్ష చేస్తారు. మెమోగ్రామ్తో రెండు మి.మీ కన్నా తక్కువ సైజులో రొమ్ములో గడ్డలు ఉన్నా గుర్తించి వెంటనే వైద్యం చేయవచ్చు తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే వ్యాధి నుంచి త్వరితగతిన కోలుకోవటంతోపాటుగా మరణాన్ని తప్పించవచ్చు. మహిళలే స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకుని రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నట్లు అనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ చక్కా సుజాత, సీనియర్ రేడియాలజిస్ట్, గుంటూరు -
కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరపాలి: ఎంపీ మిథున్రెడ్డి
ఢిల్లీ: ఏపీలో కల్తీ మద్యం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ లోక్సభ ప్రతిపక్ష నేత మిథున్రెడ్డి లేఖ రాశారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులో భారీ ఎత్తున కల్తీ మద్యం తయారీ నెట్వర్క్ బయటపడింది. ఈ కల్తీ మద్యం తో ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడింది. ఏపీలో ఆరు నెలల్లో అనేక కల్తీ మద్యం బాటిల్స్ డంప్ సీజ్ చేశారు. నకిలీ ఐఎంఎఫ్ఎల్ లేబుల్స్, క్యాప్స్ తో ప్యాకింగ్ చేసి ప్రముఖ బ్రాండ్ల పేరుతో పంపిణీ చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తుల ద్వారా వ్యవస్థీకృత కల్తీ మద్యం నెట్వర్క్ నిర్వహిస్తున్నారని తేలింది. మిథనాల్, విషపూరిత రసాయనాలు ఉపయోగించి కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఫేక్ బ్రాండెడ్ లేబుల్స్ తో మార్కెట్లో అమ్ముతున్నారు. పేదలు వీటిని తాగి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. ఇదొక వ్యవస్థీకృత నేరంగా అనేక రాష్ట్రాలకు విస్తరించింది. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ను భారీ స్థాయిలో దారి మళ్లించి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ఈ అంశంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ ,సిబిఐసి , ఎఫ్ఎస్ ఎస్ఎఐ దర్యాప్తు అవసరం. ఈ కేసును కేంద్ర హోంశాఖ ఎన్సీబీకి అప్పగించాలి. కల్తీ మద్యం రాకెట్ను ఛేదించాలి. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ దారి తప్పకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పట్టుబడిన భారీ లిక్కర్ డంపు అక్రమ మద్యం రాకెట్ లో చిన్న భాగం మాత్రమే. నకిలీ మద్యం పక్క రాష్ట్రాల్లో కూడా సప్లై చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ కల్తీ మద్యాన్ని నిరోధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటనే రంగంలోకి దిగాలి. ఈ నేపథ్యంలో ఈ కల్తీ మద్యం వ్యాపారం కేసుపై సిబిఐ దర్యాప్తు చేయించాలి. ప్రజల ప్రాణాలను కాపాడాలి’ అని లేఖలో కోరారు ఎంపీ మిథున్రెడ్డి. -
డీఎస్సీ టీచర్లకు ‘వెబ్ ఆప్షన్స్’ ప్రారంభం
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ద్వారా ఎంపికైన అభ్యర్థులు జిల్లాల్లో పాఠశాలలు ఎంపిక చేసుకునేందుకు బుధవారం వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం వీరికి జరుగుతున్న శిక్షణ కేంద్రాల్లోనే విద్యాశాఖాధికారులు ఇందుకు ఏర్పాట్లుచేశారు. ఈనెల 10 వరకు ఇది జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఖాళీల వివరాలను ప్రకటించారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 3, 4 కేటగిరీ పాఠశాలలకు సంబంధించిన ఖాళీలను మాత్రమే చూపినట్లు తెలిసింది. ఉపాధ్యాయుల్లేని ప్రాంతాలు, సింగిల్ టీచర్ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న స్కూళ్లను కొత్త టీచర్లకు కేటాయిస్తున్నట్లు సమాచారం. అలాగే, జూన్లో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో రిలీవర్ లేక అదే స్కూళ్లలో ఉండిపోయిన వారి స్థానాలను ఇక్కడ చూపడంలేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పునకు భిన్నంగా పోస్టుల భర్తీ.. ఇక డీఎస్సీ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని, మెరిట్ లిస్టు ఇవ్వకుండానే నేరుగా అభ్యర్థులను ఎంపిక చేశారని కొందరు.. రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా చేపట్టలేదని మరికొందరు, స్పోర్ట్స్ కోటా ఎంపికలోనూ అవకతవకలు జరిగాయని ఇంకొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే.. రెండు, మూడు పోస్టులు పొందిన వారికి తక్కువ కేటగిరీ పోస్టులు ఇవ్వడంపైనా హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలవరించింది. ఉన్నతమైన పోస్టు పొందడం అభ్యర్థి హక్కు అని, వారికి ఆయా పోస్టులు ఇవ్వాలని తేల్చిచెప్పింది. ఫిర్యాదులకు సంబంధించిన పోస్టులను మినహాయించాలని కోర్టు తీర్పునిచ్చినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. అయితే, అందిన ఫిర్యాదులను గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలో 60 రోజుల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది. కానీ, ఈ సమస్యలు పరిష్కరించకుండానే మొత్తం అన్ని పోస్టులను భర్తీచేసేందుకు ఏర్పాట్లుచేసింది. మొత్తం 15,941 పోస్టులను నింపి ఈ నెల 13 నాటికి కొత్త టీచర్లు స్కూళ్లలో చేరాలని ఆదేశించిడం గమనార్హం. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి.. ఇదిలా ఉంటే.. కొత్త ఉపాధ్యాయులకు ఆన్లైన్ విధానంపై పూర్తి అవగాహన ఉండదని, వారికి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ విద్యాశాఖను డిమాండ్ చేశారు. బదిలీల్లో ఎస్జీటీలకు అనుసరించిన విధానాన్నే వీరికి కూడా అమలుచేయాలన్నారు. అలాగే, బదిలీ అయ్యి రిలీవ్ కాని ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించేలా ఖాళీలు చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఒక్క కర్నూలు జిల్లాలో ఒక్కో అభ్యర్థి 1,650 ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందని, దీనివల్ల అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొంది. -
15 నుంచి నిరవధిక సమ్మె
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)తో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు బుధవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె అనివార్యమని జేఏసీ ప్రకటించింది. రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో జేఏసీ నేతలను మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు), ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో యాజమాన్యాలు చర్చలకు ఆహ్వానించాయి. విద్యుత్ ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ చైర్మన్ (జెన్కో ఎండీ, ట్రాన్స్కో జేఏండీ) ఎస్.నాగలక్ష్మి, సభ్యులు ఐ.పృధ్వీతేజ్ (ఏపీఈపీడీసీఎల్ సీఎండీ), కె.సంతోష్ రావు (ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ), విద్యుత్ సంస్థల డైరెక్టర్లు బుధవారం విజయవాడలోని విద్యుత్ సౌధలో జేఏసీతో చర్చలు జరిపారు. జేఏసీ తరఫున హాజరైన నాయకులు తమ ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కమిటీకి స్పష్టంగా వివరించారు. అయితే దాదాపు 29 ప్రధాన డిమాండ్లపై చర్చ జరిగినప్పటికీ, యాజమాన్యం వైఖరి పూర్తి వ్యతిరేకంగా ఉండటంతో చర్చలు ఫలించలేదు. ఒక్క డిమాండ్పైన కూడా పరిష్కారదిశగా ముందడుగు వేయలేదని జేఏసీ నాయకులు తెలిపారు. యాజమాన్యం ప్రస్తావించిన అంశాలను విన్న అనంతరం జేఏసీ నాయకులు చర్చలు ఫలించలేదని ప్రకటిస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చారు. తరువాత 1104 సంఘం కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమైన జేఏసీ నాయకులు పరిస్థితిని సమీక్షించి, ‘ఇప్పుడిక సమ్మె తప్ప మరోమార్గం లేదు’ అని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ ఎస్.కృష్ణయ్య, కన్వినర్ రాఘవరెడ్డి, కో–చైర్మన్ కె.వి.శేషారెడ్డి, 1104 సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలరావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.శివయ్య, ఓసీ అసోసియేషన్ నాయకుడు కె.శ్రీనివాసు, 1535 సంఘం నాయకుడు అన్నే శ్రీనివాసకుమార్, జేఏసీ నేతలు బుక్కే నాగేశ్వరనాయక్, అంజయ్య, జి.కె. వీరభద్రయ్య పాల్గొన్నారు. ఎందుకు పిలిచినట్లు? విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వం ముందునుంచి ఉదాసీనవైఖరినే అవలంభిస్తోంది. ఉద్యోగులతో నేరుగా సంప్రదింపులు, చర్చలు జరపకుండా విద్యుత్ సంస్థల సీఎండీలతోనే స్టీరింగ్ కమిటీని వేయడం ద్వారా ఉద్యోగుల ఆందోళనలను నిర్వీర్యం చేయాలనే వ్యూహం రచించింది. కమిటీ చైర్మన్ ఇటీవలే ఏపీ జెన్కో ఎండీగా బాధ్యతలు చేపట్టారు. చర్చల సందర్భంగా కూడా తాము ఇటీవలే కొత్తగా వచ్చినందున ఉద్యోగుల సమస్యలపై అధ్యయనం చేయడానికి కొంత సమయం కావాలని కమిటీ చెప్పడం విడ్డూరంగా ఉందని జేఏసీ పేర్కొంటోంది. ఉదయం 11 గంటలకు జేఏసీని చర్చలకు పిలిచిన యాజమాన్యాలు ఉదయం 10 గంటలకే, అంటే గంట ముందు టీడీపీ అనుబంధసంఘం టీఎన్టీయూసీ నేతలను చర్చలకు పిలిచాయి. ఆ యూనియన్ ఇప్పటివరకు ఉద్యోగుల తరఫున ఎలాంటి ఆందోళన చేపట్టలేదు. సమ్మె నోటీసు కూడా ఇవ్వలేదు. అయినా ఆ యూనియన్కు తొలి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. టీఎన్టీయూసీతో చర్చల అనంతరం వెళ్లిన జేఏసీ నేతలు ప్రస్తావించిన ప్రతి సమస్యపైనా కమిటీ సభ్యలు ‘డిఫర్’ అనే పదం తప్ప మరో పదం వాడకపోవడం మరో విశేషం. రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యల పరిష్కారం పట్ల కనీస చిత్తశుద్ధి లేదనేది ఈ చర్యలతో, చర్చలతో తేలిపోయిందని, ఇక నిరవధిక సమ్మె తప్పదని జేఏసీ నేతలు పేర్కొన్నారు. కదం తొక్కిన విద్యుత్ ఉద్యోగులు..!తిరుపతిలో విద్యుత్ శాఖ ఉద్యోగులు కదం తొక్కారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చేసిన మోసం.. విద్యుత్ సంస్థలు చూపించే నిర్లక్ష్యంపై విద్యుత్ ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్టు కార్మిక సంఘాలు ఏకమై ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమయ్యాయి. తిరుపతి వేదికగా బుధవారం జరిగిన ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద వేలాది మంది ఉద్యోగులు ఇలా రోడ్డుపై బారులు తీరారు. – తిరుపతి రూరల్ -
ఐదోరోజూ కొనసాగిన పీహెచ్సీ వైద్యుల దీక్షలు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పీహెచ్సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం ఐదోరోజూ కొనసాగాయి. తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తుండడంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్లో నిర్వహిస్తున్న ఈ దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇచ్చేవరకూ ఆందోళన విరమించే ప్రసక్తేలేదంటున్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి తమ డిమాండ్ల పరిష్కారంలో స్పష్టమైన హామీ ఇవ్వడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నిరసనలో అసోసియేషన్ నేతలతో పాటు, వందలాది మంది వైద్యులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ వైద్యుల శిబిరం వద్దకు వెళ్లి తన సంఘీభావం తెలిపారు. -
నకిలీ మద్యం తయారీ, సరఫరా నిజమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున నకిలీ లిక్కర్ తయారీ, సరఫరా, అమ్మకాలు నిజమేనని ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ నకిలీ రాకెట్ ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో తయారైన నకిలీ మద్యం పెద్ద సంఖ్యలో బెల్ట్ షాపులకు సరఫరా జరిగిందని వివరించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో బుధవారం సీఎం నిర్వహించిన సమావేశంలో నకిలీ మద్యంకు సంబంధించిన అంశాలను వారు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో కల్తీ లిక్కర్ వ్యవహారంలో తీసుకున్న చర్యలను, దర్యాప్తు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ములకలచెరువు ఘటనలో 21 మందిని నిందితులుగా గుర్తించామని, ఇందులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశామని చెప్పారు. మిగతా నిందితులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఎ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్రావు లావాదేవీలు, వ్యాపారాలపై విచారణ జరపుతున్నామని తెలిపారు. ములకలచెరువు కేసు ఆధారంగా ఎనీ్టఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్దన్రావుకు చెందిన బార్, వ్యాపారాలపై తనిఖీలు జరిపామని, కల్తీ మద్యం నిల్వలను గుర్తించామని చెప్పారు. ఆయన సోదరుడు జగన్మోహన్రావుతో కలిసి నకిలీ మద్యం తయారు చేసి సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి 12 మందిని నిందితులుగా గుర్తించామని వివరించారు. ఫేక్ ప్రచారంపై చర్యలు తీసుకోండి అన్నమయ్య జిల్లాలో నకిలీ లిక్కర్ వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అంతటా కల్తీ లిక్కర్ అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని, ప్రతి నాలుగు బాటిల్స్లో ఒకటి నకిలీ ఉందని ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. నకిలీ లిక్కర్తో ప్రాణాలు పోతున్నాయని ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టిన విషయాన్ని మంత్రులు అర్థం చేసుకోవాలని.. వైఎస్సార్సీపీ నేతల రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని సూచించారు. ఈ మరణాలపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. మీడియా అయినా, సోషల్ మీడియా అయినా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు కొల్లు రవీంద్ర, లోకేశ్ నేరుగా హాజరవ్వగా.. హోం మంత్రి సహా పలువురు మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. -
నకిలీ మద్యం రాకెట్పై బాబు డైవర్షన్ గేమ్
సాక్షి, అమరావతి: కళ్లు చెదిరే రీతిలో టీడీపీ నేతల నేతృత్వంలో నకిలీ మద్యం రాకెట్ బట్టబయలవ్వడంతో దాన్ని తప్పుదోవ పట్టించేందుకు సీఎం చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే డైవర్షన్ గేమ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా వర్థిల్లుతున్న నకిలీ మద్యం బాగోతంపై సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నకిలీ మద్యం యూనిట్ నడుస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులే బట్టబయలు చేసినా, దాంతో తమకు సంబంధం లేదని కొందరు టీడీపీ నేతలతో మాట్లాడిస్తుండటం నివ్వెరపోయేలా చేస్తోంది. అంతటితో ఆగకుండా జయచంద్రారెడ్డి.. వైఎస్సార్సీపీ కోవర్ట్ అని, అందుకే టీడీపీలో చేరి నకిలీ మద్యం పరిశ్రమ నడిపి దాన్ని బయట పెట్టారనే అబద్ధపు వాదనను మొదలుపెట్టారు. రెండు రోజులుగా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఎల్లో మీడియా ఇదే వాదనను జనంలోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన టీడీపీ నేత కాదా? జయచంద్రారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. తంబళ్లపల్లెలో అధికార పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే నడిపిస్తున్నారు. బదిలీలు, కాంట్రాక్టులు, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. లోకేశ్కు జయచంద్రారెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో శంకర్ యాదవ్ వంటి సీనియర్ను పక్కనపెట్టి మరీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి లోకేశ్తో ఉన్న వ్యాపార ఒప్పందాలు, సాన్నిహిత్యమే కారణం. ఆ సంబంధాల నేపథ్యంలోనే ములకలచెరువు సమీపంలో భారీగా నకిలీ మద్యం తయారు చేసి.. వైన్ షాపులు, బెల్టు షాపులకు సరఫరా చేసే పరిశ్రమను ప్రారంభించినట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. కట్టా సురేంద్రనాయుడు, ఆద్దేపల్లి జనార్దనరావు వంటి వారి ద్వారా నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారాలను నడిపిస్తున్న విషయం బయటపడింది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహా నకిలీ మద్యం తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నట్లు ఆయా ప్రాంతాల్లో దొరుకుతున్న నకిలీ మద్యం డంపులే నిదర్శనం. టీడీపీ పెద్దల ప్రమేయం లేకుండా ఇంత వ్యవస్థీకృత దందా నిర్వహించడం అసాధ్యమని ఎన్నో ఏళ్లుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్న వారు చెబుతున్నారు. వారి అండదండలు ఉండబట్టే ఏకంగా నకిలీ మద్యం కోసం పరిశ్రమను స్థాపించి, నకిలీ సరుకును అన్ని ప్రాంతాలకు.. కోరిన బ్రాండ్ల పేరుతో సరఫరా చేస్తున్నారు. బాబు మార్కు డైవర్షన్ ఇదంతా టీడీపీయే చేస్తుందనే విషయం బయట పడడంతో చంద్రబాబు తన మార్కు యాక్షన్ ప్రారంభించారు. నకిలీ మద్యంపై తాను సీరియస్గా ఉన్నట్లు, ఎంతటి వారిపై అయినా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మీడియాకు లీకులిస్తున్నారు. అయినా నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్రాన్ని షేక్ చేస్తుండడంతో తంబళ్లపల్లె పార్టీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, స్థానిక నేత సురేంద్ర నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సోషల్ మీడియాలో జయచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ కోవర్టు అనే ప్రచారాన్ని పెద్దఎత్తున చేయిస్తున్నారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు సతీష్ రెడ్డి.. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న నకిలీ మద్యం వ్యవహారంపై మాట్లాడుతూ ములకలచెరువు యూనిట్ ద్వారా ఐదేళ్లలో రూ.500 కోట్లను అక్రమంగా దండుకునేందుకు స్కెచ్ వేశారని చెబితే దాన్ని వక్రీకరించారు. ఈ దుష్ప్రచారాన్ని ఏకంగా టీడీప్టీ అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా చేయడాన్ని బట్టి వారు ఏ స్థాయికి దిగజారారో అర్థం చేసుకోవచ్చు.గుట్టు రట్టవడంతో గప్చుప్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా రెప్పపాటు వ్యవధిలో స్పందించే చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్.. నకిలీ మద్యం వ్యవహారంపై మాత్రం ఇంత వరకు నోరు విప్పక పోవడం గమనార్హం. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం నకిలీ మద్యంతో తమకు సంబంధం లేదని ప్రకటించారు. అలాంటప్పుడు తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డిని ఎందుకు సస్పెండ్ చేసినట్లు? పట్టుబడుతున్న నకిలీ మద్యం బాటిళ్లు అన్నింటిలోనూ టీడీపీ ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. అనేక చోట్ల నకిలీ మద్యం బయట పడుతుండటంతో ఏం మాట్లాడాలో తెలియక టీడీపీ నేతలు మొత్తం సైలెంట్ అయిపోయారు. రెడ్హ్యాండెడ్గా టీడీపీయే ఈ దందా చేస్తున్నట్లు అందరికీ తెలిసి పోవడంతో దీనిపై మాట్లాడేందుకు ఆ పార్టీ నాయకులు ముందుకు రావడంలేదు. ఇప్పుడు అన్నిచోట్లా తాము తాగుతున్న మద్యం కూడా నకిలీయేనా అనే అనుమానం టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది. -
నకిలీ మద్యంపై మహిళల కన్నెర్ర
సాక్షి, అమరావతి: నకిలీ మద్యాన్ని ఏరుల్లా పారిస్తున్న కూటమి ప్రభుత్వ తీరుపై మహిళలు కన్నెర్రజేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలు 7 జిల్లాల్లో ఎక్సైజ్ కార్యాలయాల్ని ముట్టడించారు. కార్యాలయాల ఎదుట మద్యం బాటిళ్లు సైతం పగులగొట్టారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మద్యం మాఫియా తయారైందని ధ్వజమెత్తారు. మద్యం షాపులు, పర్మిట్ రూమ్లు, బెల్టు షాపుల పేరిట ఎక్కడబడితే అక్కడ ఆ మాఫియా గ్యాంగ్ ఎమ్మార్పికి మించి ఇష్టానుసారం మద్యం అమ్ముతోందని ఆరోపించారు. ఇదంతా టీడీపీ కనుసన్నల్లోనే జరుగుతోందన్నారు. మద్యం విక్రయాల్లో దోపిడీతో ఆగని టీడీపీ నాయకులు ఏకంగా నకిలీ మద్యం తయారీకి తెగబడ్డారని, రాష్ట్రంలో ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసి మరీ అన్ని ప్రాంతాలకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇందుకోసం గోదాములు కూడా ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఆ నకిలీ మద్యానికి ఆ దుకాణాల వద్దే 8 మంది మరణించారని, ఇళ్లవద్ద ఎన్ని మరణాలు సంభవించాయో లెక్కేలేదని చెప్పారు. అయినా అధికార పక్షం నిస్సిగ్గుగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై బురద జల్లుతోందని ఆక్షేపించారు. కల్తీ మద్యాన్ని అరికట్టాల్సిందే విశాఖపట్నంలో ఎక్సైజ్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు, ప్రతినిధులు నిరసన చేపట్టారు. విజయవాడలో జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మహిళా నేతలు మద్యం బాటిళ్లు పగులగొట్టి నిరసన తెలిపారు. గుంటూరులోనూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. మద్యం బాటిళ్లు పగులగొట్టి ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. నెల్లూరులో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎౖక్సైజ్ డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. తిరుపతిలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం కొనసాగింది. వైఎస్సార్సీపీ నాయకులు, ఆ పార్టీ మహిళా విభాగం ప్రతిని«ధులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహిళా, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కర్నూలులో మహిళలు, పార్టీ కార్యకర్తలు మద్యం బాటిళ్లు పగులగొట్టారు. -
ద్రోణి ప్రభావం.. పలుచోట్ల వర్షాలు
సాక్షి, అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో ఈ ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వచ్చే రెండు రోజులపాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం తిరుపతి జిల్లా డక్కిలిలో 8.4 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. -
అంతా వారే చేశారట!
నకిలీ మద్యం తయారీ రాకెట్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం పక్కా పథకం రచించింది. వేల కోట్ల రూపాయల దందాకు తెరలేపడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఏమాత్రం లేదనేలా వ్యవహారాన్ని రక్తి కట్టిస్తోంది. నకిలీ మద్యం తయారీ యంత్రాలు, స్పిరిట్, రసాయనాలు, వివిధ బ్రాండ్లను పోలిన లేబుల్స్, వేలాది లీటర్ల నకిలీ మద్యం.. వేల సంఖ్యలో సీసాలు, మూతలు పట్టుబడితే ఇదేదో చిన్న వ్యవహారం అనేలా చిన్న చిన్న వారిపై కేసులు పెట్టి చేతులు దులుపుకోజూస్తోంది. లేబుళ్లు సరఫరా చేశారని, సీసాల మూతలు సరఫరా చేశారని.. ఈ కేసులో ఇదే పెద్ద నేరం అన్నట్లు కలరింగ్ ఇస్తోంది. తూతూ మంత్రంగా కేసు నమోదు చేయడం ద్వారా సూత్రధారులు, పాత్రధారులను తప్పించేలా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఇలా చేస్తోందని చెప్పడానికి నిందితుల రిమాండ్ రిపోర్టే నిదర్శనం.సాక్షి ప్రతినిధి, విజయవాడ: నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల కేసులో కీలక సూత్రధారులు, పాత్రధారులను తప్పించి కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టిన టీడీపీ నేతలు భారీగా లాభాలు వస్తుండటంతో ప్రభుత్వ పెద్దల అండతో విజయవాడలోని ఇబ్రహీంపట్నాన్ని మరో అడ్డాగా మార్చారు. నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల ద్వారా సులభంగా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుండటంతో దానిపై కన్నేసిన కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు.. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ మద్యం దందా సాగించారు. ఈ దందా ద్వారా కమీషన్ల రూపంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇందులో అత్యధిక భాగం డబ్బు కరకట్ట బంగ్లాకే చేరిందన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని తక్కువ చేసి చూపేందుకు ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్ అధికారులకు దశా, దిశా నిర్దేశం చేశారు. పెద్ద తలకాయల ప్రస్తావన ఏదీ లేకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని కిందిస్థాయి నేతలపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. తాజాగా విజయవాడ కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. నకిలీ మద్యం తయారీ వెనుక అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలకు సన్నిహితులైన అద్దేపల్లి జనార్దనరావు, ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహనరావులను ప్రధాన నిందితులుగా చేర్చిన ఎక్సైజ్ అధికారులు.. మొత్తం కథను వీరి చుట్టూనే తిప్పారు. ఇందులో ఎక్కడా ఈ మొత్తం నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్న సూత్రధారులు, ప్రధాన పాత్రధారుల గురించి కనీస స్థాయిలో కూడా ప్రస్తావించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎక్సైజ్ అధికారులు తమ రిమాండ్ రిపోర్ట్లో మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చారు. ఈ 12 మందిలో అద్దేపల్లి జగన్మోహనరావు (ఏ2), బాదల్ దాస్ (ఏ7) ప్రదీప్ దాస్ (ఏ8)లను మంగళవారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరు పరచగా రిమాండ్కు పంపారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో పలు విషయాలను పొందు పరిచారు. నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల వ్యవహారంలో అద్దేపల్లి జనార్దనరావు (ఏ1), ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహనరావు (ఏ2)లు ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిపారు. టీడీపీ పెద్దలకు సన్నిహితుడైన తన సోదరుడు జనార్దనరావుతో కలిసి నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నట్లు జగన్మోహనరావు అంగీకరించినట్లు పేర్కొన్నారు. నకిలీ మద్యం అమ్మకాల ద్వారా భారీగా లాభాలు వస్తుండటంతో ఆ దందాను విస్తరించినట్లు జగన్మోహనరావు చెప్పినట్లు రిపోర్ట్లో వివరించారు.అక్కడి నుంచి ఇక్కడికి..తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజల ప్రాణాలను పట్టించుకోకుండా మద్యం విక్రయాలకు తెర లేపింది. దీన్నే అదునుగా భావించిన అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహనరావు ప్రభుత్వ పెద్దల అండ, సలహాలు, సూచనలతో నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టారు. మొదట మొలకలచెరువు ప్రాంతంలో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టి అమ్ముతూ వచ్చారు. దీని ద్వారా వారు భారీగా డబ్బు ఆర్జించారు. ఇందులో పెద్ద మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలకు కమీషన్ల రూపంలో ఇచ్చారు. వారి ప్రోత్సాహంతో ఈ నకిలీ మద్యం తయారీని భారీగా విస్తరించారు. మొలకలచెరువు తరహాలో ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే విజయవాడతో పాటు వివిధ వైన్ షాపులు, బార్లు, బెల్ట్షాపులకు సరఫరా చేసి, అమ్మకాలు జరిపారు. బెంగళూరుకు చెందిన బాలాజీ (ఏ3) ఫేక్ సీల్లు, స్పిరిట్, కారమిల్, ఇతర పదార్థాలు కలిపి మద్యం తయారీ చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. హైదరాబాద్కు చెందిన రవి (ఏ4) ఫేక్ లేబుల్స్ సరఫరా చేశారు. ఆరుగురు కూలీలు సయ్యద్ మాజి, కట్టారాజు, బాదల్ దాస్, ప్రదీప్ దాస్లు, మిధిన్ దాస్, అనంత దాస్ ఈ నకిలీ మద్యం తయారీలో ఉన్నారు. వీరికి అధిక జీతాలు ఇస్తామని ఆశ చూపి, నకిలీ మద్యం తయారీలో వారిని వాడుకున్నారు. ఖాళీ పెట్ బాటిల్స్ను గన్నవరం మండలం సూరంపల్లెలో తయారు చేయించారు. దాని యజమాని శ్రీనివాసులరెడ్డిని ఏ11 నిందితునిగా, విజయవాడలోని శ్రీనివాస వైన్స్లో పనిచేసే అంగలూరి కళ్యాణ్ను ఏ12 నిందితునిగా చేర్చారు. కళ్యాణ్ ద్వారా నకిలీ మద్యాన్ని పెద్ద మొత్తంలో అమ్మినట్లు అధికారులు గుర్తించారు. అచ్చం ఒరిజనల్ బాటిల్స్ మాదిరి తయారు చేసి, అలాగే స్టిక్కర్లు అతికించి ఎలాంటి అనుమానం రాకుండా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మారు. ప్రధానంగా ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ, క్లాసిక్ బ్లూ విస్కీ, కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా విస్కీ.. బ్రాండ్లకు నకిలీ తయారు చేశారు. ఏకంగా విజయవాడలోనే పెద్ద డెన్ను ఏర్పాటు చేసి ధైర్యంగా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మారంటే ఇందుకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.ఎన్నికల తర్వాత నుంచి నకిలీ మద్యం జోరు2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత గోవా మద్యం పేరుతో పలువురు అధికార పార్టీ నేతలు ఈ నకిలీ మద్యం దందాకు తెర లేపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అద్దేపల్లి జనార్దనరావు పలు చోట్ల మద్యం సిండికేట్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని బ్రాందీ షాపులు, బార్లు, బెల్ట్ షాపులకు నకిలీ మద్యం సరఫరా జరిగినట్లు తేలడంతో మద్యం ప్రియుల్లో ఆందోళన మొదలైంది. అయితే నకిలీ మద్యం తయారీ విషయం ప్రజల్లోకి వెళ్లటంతో, ప్రభుత్వం దాని తీవ్రతను తక్కువ చేసి చూపించేందుకు నానా తంటాలు పడుతోంది. నామ మాత్రపు కేసులు పెట్టి ఈ నకిలీ మద్యం కేసు నుంచి టీడీపీ నాయకులను రక్షించేందుకు పడరాని పాట్లు పడుతోంది. ఇప్పటికే నకిలీ మద్యం తాగి పలుచోట్ల అనారోగ్యం పాలైన మందుబాబులు అందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ఊదరగొట్టి, నకిలీ మద్యంతో ఆరోగ్యాలతో చెలగాటం అడుకోవటం సరికాదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వైఎస్ జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అనకాపల్లి,విశాఖ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ జగన్ పర్యటన వివరాలను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఆ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్ జగన్ రేపు (09.10.2025) ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, అక్కడినుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం (వయా-ఎన్ఏడీ జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్) వెళ్ళి మధ్యలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ (వయా - తాళ్ళపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్ఏడీ జంక్షన్)కు చేరుకుంటారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్ధులను పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం అక్కడి నుంచి తిరుగుపయనమవుతారు. -
వైఎస్ జగన్ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. డీఎస్సీ-2025 ను రద్దు చేసేలే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రీ నోటిఫికేషన్ ఇచ్చి ఒకే పేపర్తో పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. నచ్చినట్లుగా మార్కులు కలిపే నార్మలైజేషన్ విధానం మోసపూరితంగా ఉందని డీఎస్సీ అభ్యర్థులు అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 రద్దుచేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తి పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ నెల 9న తాను సందర్శిస్తానని.. అదే రోజు నుంచే ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈనెల 10వ తేదీన గ్రామ, వార్డు స్థాయిల్లో మొదలయ్యే రచ్చబండ కార్యక్రమం నవంబరు 22 వరకు కొనసాగుతుందని తెలిపారు.ఈనెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సేకరించే కోటి సంతకాల పత్రాలను నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబరు 24న అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తామన్నారు. అనంతరం గవర్నర్ను కలిసి అన్ని విషయాలు నివేదిస్తామన్నారు. సేకరించిన కోటి సంతకాల పత్రాలు గవర్నర్కు అందజేస్తామన్నారు.మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. యథేచ్ఛగా సాగుతున్న నకిలీ మద్యం విక్రయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా చొరవ చూపాలని ఆదేశించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ప్రభుత్వమే ఎందుకు నిర్వహించాలంటే..? మనం మన హయాంలో శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 10 కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతూ పేదలకు చంద్రబాబు తీవ్ర ద్రోహం చేస్తున్నారు. రాష్ట్రంలో 1923 నుంచి 2019 వరకు కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే మనం ఒక విజన్తో ఏకంగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తెచ్చాం. దీనిపై అందరూ ఆలోచన చేయాలని కోరుతున్నా. మీరు ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని మాట్లాడమని కోరుతున్నా.అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్లను నడుపుతుంది? ఎందుకు ఆస్పత్రులను నడుపుతుంది? ఎందుకు ఆర్టీసీ బస్సులను నడుపుతుంది? వాటిని ప్రభుత్వాలే ఎందుకు నడుపుతున్నాయి? ఎందుకంటే.. ప్రభుత్వాలు అవి చేయకపోతే ప్రైవేటు ఎక్స్ప్లాయిటేషన్ (దోపిడీ) జరుగుతుంది. ప్రభుత్వం కనుక ఆస్పత్రులను నడపకపోతే ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీతో ఏ పేదవాడికీ వైద్యం అందని దుస్థితి తలెత్తుతుంది. ప్రభుత్వం కనుక స్కూళ్లను నడపకపోతే.. నారాయణ, చైతన్య యాజమాన్యానికి ఫీజులు కట్టలేక పేదలు తమ పిల్లలను చదివించలేని పరిస్థితిలోకి వెళ్లిపోతారు. గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులను నడపకపోతే.. ప్రైవేటు ఆపరేటర్ల దెబ్బకు ఎవరూ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్లే పరిస్థితి ఉండదు. అందుకే గవర్నమెంట్ వీటన్నింటిలో ఎంటరవుతుంది. అందుకనే ప్రభుత్వం స్కూళ్లను, బస్సులను, హాస్పటళ్లను నిర్వహించాలి. లేదంటే ప్రైవేటు దోపిడీకి అడ్డూ అదుపూ ఉండదు. జిల్లా మొత్తానికి హబ్గా.. మన హయాంలో ప్రతి జిల్లాలో ఒక టీచింగ్ హాస్పటల్ను తెచ్చే ప్రయత్నం చేశాం. ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం. ఒక మెడికల్ కాలేజీ రాకతో 8 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రైవేటు దోపిడీ ఆగిపోతుంది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెడికల్ స్టూడెంట్లు, నర్సింగ్ స్టూడెంట్లు టీచింగ్ హాస్పటల్లో పని చేస్తారు. రకరకాల విభాగాలతో సూపర్ స్పెషాలిటీ సేవలు అక్కడ అందుబాటులోకి వస్తాయి. తద్వారా పేద, మధ్యతరగతి వారికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇదే కాకుండా జిల్లా మొత్తానికి టీచింగ్ హాస్పటల్ ఒక హబ్గా పని చేస్తుంది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందుతుంది. అందుకే ప్రివెంటివ్ కేర్ మన పాలనలో సువర్ణాధ్యాయంగా నిలిచింది. మెడికల్ సీట్లు పెరిగేవి.. నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లు 2,360 మాత్రమే. మనం ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీల ద్వారా మరో 2,550 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చేవి. మొత్తంగా 4,900 మందికిపైగా డాక్టర్లు ప్రతి సంవత్సరం బయటికి వచ్చేవారు. అంతమంది డాక్టర్లు మన రాష్ట్రంలో అందుబాటులో ఉండే పరిస్థితి ఉత్పన్నమయ్యేది. అది కూడా మెడికల్ సీట్లలో 50 శాతం కోటా ఉచితం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కాబట్టి మిగిలిన 50 శాతం సీట్లు కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పోలిస్తే తక్కువ ఫీజుకే విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. చంద్రబాబు ఇప్పుడు ప్రైవేటీకరణ ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఉచిత వైద్యం పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఏడు కాలేజీలు పూర్తి చేశాం.. మన హయాంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి ఐదింటిని పూర్తి చేశాం. వాటితోపాటు పాడేరు మెడికల్ కాలేజీని కూడా కలిపితే 800 ఎంబీబీఎస్ సీట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల.. ఇలా ఐదు మెడికల్ కాలేజీలు మనం అధికారంలో ఉండగానే 2023–24లోనే ప్రారంభమయ్యాయి. మరో రెండు కాలేజీలు.. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించేందుకు చంద్రబాబు రాకముందే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 మెడికల్ సీట్లు శాంక్షన్ అయితే.. మాకొద్దంటూ చంద్రబాబు అడ్డుకుని ఎన్ఎంసీకి లేఖ రాయించారు. 9 నుంచి కార్యాచరణకూటమి సర్కారు ప్రజా కంటక పాలనను నిలదీస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈనెల 9న నేను స్వయంగా సందర్శిస్తా. ఆ రోజుతో ఈ కార్యాచరణ ప్రారంభమవుతుంది. మర్నాడు 10వ తేదీన గ్రామ, వార్డు స్థాయిల్లో రచ్చబండ కార్యక్రమం మొదలై నవంబరు 22 వరకు కొనసాగుతుంది. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లోనూ, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు తరలిస్తారు. అనంతరం గవర్నర్ను కలిసి అన్ని విషయాలు నివేదించి కోటి సంతకాల పత్రాలు అందజేస్తాం. ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా? మనం దాదాపు రూ.3 వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేశాం. ఇక మిగిలింది రూ.5 వేల కోట్లు. ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో సంవత్సరానికి రూ.1000 కోట్లు చొప్పున మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి ఖర్చు పెట్టలేరా? వాటిని పూర్తి చేయడానికి మన హయాంలోనే నాబార్డ్ ఫండింగ్ తీసుకువచ్చాం. సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫాస్ట్రక్చర్ అనే పథకంలో మెడికల్ కాలేజీలను కూడా పెట్టించాం. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణం స్పెషల్ అసిస్టెన్స్ కింద ఇస్తారు. నేను చంద్రబాబును సూటిగా అడుగుతున్నా.మెడికల్ కాలేజీల కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇవ్వలేరా? సంవత్సరానికి రూ.1000 కోట్లు ఇవ్వలేరా? అమరావతిలో రూ.70 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని చెబుతున్నారు. ఇప్పుడున్న 50 వేల ఎకరాలు సరిపోవు. ఇంకో 50 వేల ఎకరాలు కావాలని అడుగుతున్నారు. మొదట 50 వేల ఎకరాలను డెవలప్ చేయడానికి చంద్రబాబు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే కావాల్సింది రూ.లక్ష కోట్లు. కానీ ఇంతకు ముందు ఆయన ఖర్చు చేసింది చూస్తే రూ.4500 కోట్లు. అది అలా ఉండగానే మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నారు.అంటే అక్కడ మరో రూ.లక్ష కోట్ల ఖర్చుకు సిద్ధమయ్యారు. అంటే మొత్తం రూ.రెండు లక్షల కోట్లు అమరావతిలో పెట్టడానికి సిద్ధమయ్యారు. అలాంటిది రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి కొత్త మెడికల్ కాలేజీలు ఉపయోగపడతాయి. అవి చిరస్థాయిగా నిలి్చపోయే విలువైన సంపద. ప్రైవేటు వారు పేదలను దోచుకోకుండా శ్రీరామరక్ష లాంటిది. అలాంటి వాటికి ఐదేళ్లలో కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? ఆశ్చర్యంగా ఉంది. కార్యక్రమాల నిర్వహణ ఇలా.. ఈ కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల జరిగే నష్టాన్ని, సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను వివరిస్తాం. అదే సమయంలో ఆ గ్రామంలో పార్టీ గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలి. మెడికల్ కాలేజీలకు సంబంధించి క్యూఆర్ కోడ్తో ముద్రించిన పాంప్లెట్లు, కోటి సంతకాల సేకరణ కోసం క్యూఆర్ కోడ్తో రూపొందించిన లెటర్ కాపీలను గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు అందచేయాలి. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 100 పంచాయతీలు ఉంటాయనుకుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కనీసం 500 మందితో సంతకాలు సేకరిస్తాం.ఆ బాధ్యతను కొత్తగా నియమించే గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాలకు అప్పగిస్తాం. ఈనెల 10 నుంచి నవంబరు 22 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు నియోజకవర్గాల్లో అన్ని వర్గాల వారితో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రతి నియోజకవర్గం ఇన్చార్జీ రోజూ రెండు గ్రామాలను సందర్శించి సంతకాల సేకరణను పర్యవేక్షించి అక్కడే మీడియాతో మాట్లాడతారు. అక్టోబర్ 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించి, నియోజకవర్గ స్థాయి అధికారికి డిమాండ్ పత్రాన్ని అందచేస్తాం. అప్పుడు ఏదో ఒక నియోజకవర్గంలో నేను స్వయంగా ర్యాలీలో పాల్గొంటా.నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడ తరలిస్తారు. తదుపరి గవర్నర్ను కలిసి అన్ని విషయాలు నివేదిస్తాం. కోటి సంతకాల పత్రాలూ ఆయనకు అందజేస్తాం. -
జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుయుక్తులు
8 ఏప్రిల్ 2025న సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లెలో టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించినా ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. జనాభిమానాన్ని పోలీసులు నిలువరించలేకపోయారు. 18 జూన్ 2025న పోలీసుల వేధింపులు తట్టుకోలేక పోయిన పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు పల్నాడు జిల్లాకు వైఎస్ జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా కేవలం 100 మంది మాత్రమే రావాలంటూ అర్థంపర్థం లేని నిబంధనలను పోలీసులు విధించారు. ఎక్కడికక్కడ అరెస్టులకు తెగబడ్డారు. ఆంక్షలు పెట్టారు. అయినా ప్రజలు పొలాల మధ్యలోనుంచి గట్ల వెంబడి పరుగులు తీసుకుంటూ తమ అభిమాన నేతను చూసేందుకు వచ్చారు. 31 జూలై 2025న అక్రమ కేసులతో జైలుకు వెళ్లి తిరిగివచ్చిన మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లారు. పోలీసులు జగన్ పర్యటనను విఫలం చేయాలని శాయశక్తులా యత్నించారు. ఎవ్వరూ రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు ఏకంగా రోడ్లపైన అప్పటికప్పుడు తవ్వేశారు. అయినా ప్రజాభిమానాన్ని ఆపలేకపోయారు. ఈ ఘటనలను సాకుగా చూపి ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరోక్షంగా తన అసమర్థతను అంగీకరిస్తున్నట్టుగా ఉంది. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనకు 66వేల మంది వస్తారని, వారిని నిలువరించలేమని పోలీసులే పేర్కొనడం, జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలన్న సర్కారు కుట్రలో వారు పావులుగా మారడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా యత్నిస్తోంది. కొత్త ఎత్తులు వేస్తోంది. వైఎస్ జగన్ వెళ్లిన ఎక్కడికి వెళ్లినా జనాదరణ వెల్లువెత్తుతుండడంతో సర్కారులో వణుకుపుడుతోంది. ప్రజావ్యతిరేకత పెరిగిపోవడంతో జంకుతోంది. ఫలితంగా ఎలాగైనా వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకోవాలని ఆంక్షలు విధిస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగాట ఆడుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటనకు ఏకంగా 65 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మెడికల్ కాలేజీ నిర్మాణమవుతున్న మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెం వరకు రోడ్డు మార్గాన వెళితే భద్రత కల్పించలేమంటూ అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, విశాఖ సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చితో ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు పెట్టి మరీ అప్పటికప్పుడు ప్రకటించడం గమనార్హం. 63 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో అవసరమైన పోలీసు బలగాలను ఇప్పటికిప్పుడు కేటాయించలేమంటూ సెలవివ్వడం చర్చనీయాంశమైంది. విశాఖలో ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటూ సాకుగా చూపడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతిమంగా ఈ పర్యటన జరగకుండా చూసేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవైపు స్వయంగా పోలీసులే... 65 వేల మంది తరలివచ్చేందుకు అవకాశం ఉందని, అంత మందికి అక్కడి ప్రాంతం సరిపోదంటూ మాజీ మంత్రి అమర్నాథ్కు పంపిన సమాధానంలో పేర్కొనడం ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పరోక్షంగా అంగీకరించినట్టు స్పష్టమవుతోంది. సవాల్ విసిరి.... చల్లారిపోయి....! వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. ఉమ్మడి విశాఖలోని పాడేరు మెడికల్ కాలేజీని పూర్తిచేసి ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు 50 సీట్లు కేటాయించారు. మరో ఐదు కళాశాలలను అంతకుముందే ప్రారంభించారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవారిపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద రూ. 500 కోట్లతో 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వమే చేపట్టింది. ఇప్పటికే 60 శాతం మేర నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత ఈ పనులను పూర్తిగా నిలిపివేసింది. పైగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్దతిలో ప్రైవేటు పరంచేసేందుకు సర్కారు కుట్రపన్నింది. దీనిపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ కాలేజీకి అనుమతులు లేవంటూ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కొత్తరాగం అందుకున్నారు. శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అయితే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అసలు అనుమతి లేదని, జీఓ ఉందా? దమ్ముంటే రమ్మనండి.. ఎవరినైనా రమ్మను అంటూ బీరాలు పోయారు. అర్థంపర్థం లేని సవాల్ విసిరారు. అయితే, స్పీకర్ మాటలు అబద్ధాలేనని భీమబోయినపాలెంలో కనిపిస్తున్న మెడికల్ కాలేజీ భవనాలే సమాధానమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీంతో నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాలను పరిశీలించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న రానున్నారు. ఇప్పటివరకు దమ్ముంటే రమ్మనండి అంటూ సవాళ్లు విసిరిన కూటమి నేతలు ఇప్పుడు వైఎస్ జగన్ వస్తుంటే నిజాలన్నీ బయటకు వస్తాయని వణికిపోతున్నారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు.హెలికాప్టర్పై అయితే అనుమతిస్తారట..! వాస్తవానికి వివిధ సమస్యలపై ప్రజల వద్దకు వెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యత్నించిన ప్రతీసారి ఏదో ఒక రూపంలో అడ్డంకులు కల్పించడం పోలీసులకు పరిపాటిగా మారింది. అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటన సందర్బంగా జరిగిన ఘటనను పేర్కొంటూ హెలికాప్టర్ ల్యాండింగ్కు పలు సందర్భాల్లో అనుమతి నిరాకరించిన పోలీసులు... ఇప్పుడు అందుకు విరుద్ధంగా హెలికాప్టర్లో వస్తే అనుమతిస్తామంటూ కొత్త పల్లవి అందుకోవడం గమనార్హం. అయితే, గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హెలికాప్టర్లో ప్రయాణం సాధ్యం కాదని తెలిసినా.. అందుకు అంగీకరిస్తామని చెప్పడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదో విధంగా జగన్ను అడ్డుకోవాలన్న కుట్రలో భాగంగానే ఈ పల్లవి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. ఎట్టకేలకు ఆంక్షలతో అనుమతివిశాఖ సిటీ: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులు లేవంటూ మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ అటు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, ఇటు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మీడియాకు స్పష్టం చేశారు. ఈ విషయమై తీవ్ర విమర్శలు రావడంతో నాటకీయ పరిణామాల మధ్య పలు షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నామని మంగళవారం అర్ధరాత్రి విశాఖ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. పర్యటన ఇలా సాగాలి » విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్డు, బాజీ జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్, వేపగుంట జంక్షన్ రావాలి.» అక్కడి నుంచి సుజాతనగర్, పెందుర్తి పోలీస్ స్టేషన్ జంక్షన్, పెందుర్తి జంక్షన్, సరిపల్లి జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో వెళ్లాలి. » ట్రాఫిక్ ఏసీపీ అనుమతి లేకుండా ఈ మార్గం నుంచి ఎటువంటి మార్పులు, పొడిగింపు లేదా అనుమతి లేని హాల్ట్ చేయకూడదు. » ఈ మార్గంలో ఏదైనా జంక్షన్, రోడ్డు పక్కన ఉన్న పాయింట్ లేదా వేదిక వద్ద నిర్వాహకులు ప్రజలను సమీకరించకూడదు. గుమిగూడటానికి కూడా అనుమతి లేదు. » మార్గంమధ్యలో సమావేశాలు, రిసెప్షన్లు, ప్రజల్ని సమీకరించడం చేయకూడదు. » ఊరేగింపులు, రోడ్ మార్చ్లపై నిషేధం ఉంటుంది. -
ప్రభుత్వ తీరుపై గురువుల ‘ధర్నా’గ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోందని, ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా బోధనేతర పనులతో వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) గళమెత్తింది. ఇకపై బోధనేతర కార్యక్రమాలు నిర్వహించబోమని, విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు సమాఖ్య నాయకులు ప్రకటించారు. తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ తీరుపై నిరసనగా మంగళవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో విజయవాడలో ‘పోరుబాట’ పేరుతో మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయులతో ధర్నా చౌక్ నిండిపోయింది. హామీలు అమలు చేయకుంటే సత్తా చూపిస్తాంమహాధర్నాను ఉద్దేశించి ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో బోధనేతర కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోయి ఉపాధ్యాయులు పనిచేయలేని విధంగా మారిందన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విమర్శించారు. గత నెలలో జిల్లాల్లో నిరసన తెలిపినా పట్టించుకోలేదని, ఇకనైనా పట్టించుకోకపోతే సహించేది లేదన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.28 వేలకు పైగా చెల్లించాలని.. వీటిని ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. 12వ పీఆర్సీ ప్రకటించాలన్నారు. 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అంశాలను విమర్శించిన కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఏకీకృత సర్వీసు రూల్స్ వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో–57 అమలు చేసి 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఫ్యాప్టో ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి మాట్లాడుతూ.. పాఠశాలల్లో ప్రవేశపెట్టిన విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. 1998 డీఎస్సీలో మిగిలిపోయిన వారికి పోస్టింగులు ఇవ్వాలని, 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. దొడ్డిదారి బదిలీలు అసమంజసమని, న్యాయబద్ధమైన కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడవడమేనని దుయ్యబట్టారు. ఈ తరహా బదిలీలను వెంటనే రద్దు చేయాలని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, గత ప్రభుత్వం గ్రామీణ పేద బాలికల ఉన్నత విద్య కోసం ప్రారంభించిన హైసూ్కల్ ప్లస్లను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఫ్యాప్టో ఇచ్చిన నోటీసులోని 20 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తమ సత్తా ఏంటో చూపిస్తామని ఉపాధ్యాయ నాయకులు హెచ్చరించారు. పోరుబాట ధర్నాలో రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి టీచర్స్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, ఏపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఏపీ సీపీఎస్సీఏ బాధ్యులు సీఎం దాస్, సతీష్, బాజీ పఠాన్ తదితరులు మద్దతు ప్రకటించారు. పాఠాలు చెప్పనీయడం లేదు గత ప్రభుత్వం గ్రామీణ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు హైసూ్కల్ ప్లస్లను ప్రవేశపెడితే.. ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసేందుకు ప్రయత్నించింది. దీనిపై పెద్దఎత్తున నిరసన రావడంతో వెనక్కి తగ్గి, ఆ స్కూళ్లల్లో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులను సర్ప్లస్ పేరిట బదిలీ చేసింది. ఈ విధానం పేద బాలికలు చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కాలరాయడమే అవుతుంది. బడుల్లో ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలతో పాఠాలు చెప్పనివ్వడం లేదు. ఉపాధ్యాయులను తరగతి గదులకే పరిమితం చేయాలి. యాప్ల భారం తగ్గించి బోధనేతర విధులకు విముక్తి కల్పించాలి. ఇకపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలు మాత్రమే యాప్లలో నమోదు చేస్తాం. మిగిలినవి బహిష్కరిస్తాం. – సాయి శ్రీనివాస్ (ఎస్టీయూ), ఫ్యాప్టో చైర్మన్ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది ఎన్నికల ముందు చంద్రబాబు డైరెక్ట్ పీఆర్సీ ఇస్తామన్నారు. 16 నెలలుగా కాలయాపన చేస్తున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడం లేదు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. కనీసం ఒక్కసారి కూడా ఉపాధ్యాయులతో చర్చించలేదు. మైకుల ముందు, శాసనసభలో ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రిగా ఉంటే ప్రభుత్వ పాఠశాలలు గొప్పగా ఉంటాయనుకున్నాం. కానీ.. పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. బడుల్లో ఉపాధ్యాయులు ఎవరూ పాఠాలు చెప్పే పరిస్థితి లేదు. ఏడాదిన్నర అవుతున్నా విద్యారంగ సమస్యలపై మంత్రి స్పందించలేదంటే ప్రభుత్వ విద్య అంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు. – పి.అశోక్ కుమార్రెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్గిన్నిస్ రికార్డుల కోసమే తపన కూటమి నాయకులు ఎన్నికల ముందు యాప్లు రద్దు చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక మరిన్ని యాప్లతో వేధిస్తున్నారు. గిన్నిస్ రికార్డుల పేరుతో ప్రభుత్వం ఉపాధ్యాయులతో ఆడుకుంటోంది. యాప్ల ద్వారా పిల్లలకు అక్షరాలొస్తాయా. దీనికి మంత్రి నారా లోకేశ్ సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇస్తున్నాం, ఈలోగా మా డిమాండ్లపై స్పందించాలి. ప్రభుత్వం దిగిరావాలి. – ఎన్.వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, యూటీఎఫ్ఉపాధ్యాయులు దొంగలా?ఉపాధ్యాయులు దొంగలా? మేం దొంగలమైతే పదో తరగతిలో ఎందుకు అంత స్థాయిలో ఫలితాలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేశ్ చిలక పలుకులు ఉపాధ్యాయుల వద్ద ఇక సాగవు. కూటమి ప్రభుత్వ విద్యారంగ సంస్కరణలు ప్రభుత్వ బడులను దిగజారుస్తున్నాయి. సమస్యలను పరిష్కరించకుంటే ఉపాధ్యాయులు పెద్ద ఉద్యమబాట పడతార – ఎన్.వెంకటేశ్వర్లు, డెప్యూటీ సెక్రటరీ జనరల్, ఫ్యాప్టో విద్యాశాఖవిద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎక్కడఉపాధ్యాయ సమస్యలపై చర్చించేందుకు మంత్రి లోకేశ్ ఎక్కడఉపాధ్యాయ సమస్యలపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కోసం ప్రయత్నిస్తే ఆయన సమయం కేటాయించటం లేదు. విద్యారంగం చాలా విస్తృతమైన విషయమని గుర్తించటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 మాసాలైంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి? ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి. విద్యారంగాన్ని నాశనం చేయటానికి ప్రపంచ బ్యాంక్ సూచించిన సాల్ట్ పథకాన్ని అమలు చేస్తున్నారు. దానిని వెంటనే రద్దు చేయాలి. 12 పీఆర్సీ కమిషన్ను తక్షణం నియమించాలి. ఎన్నికల్లో పదేపదే ప్రకటించిన తెలుగు మీడియంను ప్రవేశ పెట్టాలి.– కె.ఎస్.లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ -
విద్యుత్ ఉద్యోగుల మెడపై కత్తి
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించకపోగా వారి మెడపై కత్తులు వేలాడదీస్తోంది కూటమి ప్రభుత్వం. తమ డిమాండ్ల సాధన కోసం గత నెల నుంచి ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూస్తోంది. విద్యుత్ ఉద్యోగులను చర్చలకు పిలుస్తూనే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా ఉద్యోగులకు సెలవులను రద్దుచేసింది. ఇప్పటికే సెలవులో ఉన్నవారంతా తక్షణమే విధుల్లో చేరాలని హుకుం జారీచేసింది. అత్యవసరమైతే.. ఉన్నతాధికారుల అనుమతిపత్రం తీసుకోవాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.బెదిరిస్తే నిరవధిక సమ్మె.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇవ్వాల్సిన నాలుగు డీఏ బకాయిలను విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని, ఐఆర్ ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని, ఎనర్జీ అసిస్టెంట్లను జూనియర్ లైన్మెన్లుగా గుర్తించాలని, పింఛన్ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కొంతకాలం కిందట ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పలు దఫాలుగా ప్రభుత్వానికి, యాజమాన్యానికి వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో ఈ నెల 15 వరకు గడువు ఇచ్చి, అప్పటికీ స్పందించకపోతే నిరవధిక సమ్మె చేపడతామని నోటీసు ఇచ్చింది. దీంతో బుధవారం (నేడు) విజయవాడలోని విద్యుత్ భవన్లో చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే అంతకుముందే ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు చేపట్టింది. జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. ఉద్యోగులంతా సెలవులను రద్దుచేసుకుని విధులకు హాజరుకావాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఆదేశాలు జారీచేశారు. మెడికల్ ఎమర్జెన్సీ వస్తే తప్ప ఎవరికీ సెలవులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఎవరైనా హెడ్క్వార్టర్ దాటి వెళ్లాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. కార్పొరేట్ కార్యాలయాల్లో, జిల్లా కేంద్రాల్లో పనిచేసే శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సిందేనని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక నమూనా హాజరుపట్టీలో వారి హాజరు నమోదుచేసి రోజూ సీఎండీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. దీనిపై ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి. తమను బెదిరించి ఆందోళనలను విరమింపజేయాలని ప్రయత్నిస్తే వెంటనే నిరవధిక సమ్మెలోకి వెళతామని జేఏసీ హెచ్చరించింది. -
రాజధానిలో మరో దోపిడీకి స్కెచ్!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం ముసుగులో మరో దోపిడీకి ముఖ్యనేత స్కెచ్ వేశారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జి, స్పోర్ట్స్ సిటీ, రివర్ఫ్రంట్ డెవలప్మెంట్, రోప్వే, ఇన్నర్ రింగ్ రోడ్(ఐఆర్ఆర్)తోపాటు ఎప్పటికప్పుడు గుర్తించే ప్రత్యేక ప్రాజెక్టులను చేపట్టడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ని ఏర్పాటుచేస్తూ మంగళవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ), ఎస్పీవీ సిఫార్సుల ఆధారంగా ప్రత్యేక ప్రాజెక్టులను చేపడతారు. ఆ ప్రాజెక్టులకు పీపీపీ, హైబ్రీడ్ యాన్యుటీ, ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ) పద్ధతుల్లో టెండర్లు పిలిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. ఆ కాంట్రాక్టర్లతో సీఆర్డీఏ, ప్రభుత్వం, ఎస్పీవీ త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటాయి. భూములు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని పనులు రాజధానిలో ప్రత్యేక ప్రాజెక్టుల పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లకు నేరుగా భూములు కేటాయిస్తారు. ఆ భూములు తనఖా పెట్టి అప్పులు తీసుకోవడానికి కాంట్రాక్టర్కు హక్కులు కల్పిస్తారు. ఆ ప్రాజెక్టుల ద్వారా పన్నులు, యూజర్ చార్జీల రూపంలో వచ్చే ఆదాయంలో వాటా (రెవెన్యూ షేరింగ్) వంటి అంశాలను సీఆర్డీఏ ఖరారు చేస్తుంది. అప్పటికీ ఆ ప్రాజెక్టుల్లో నష్టం వస్తే వయబులిటీ గ్యాప్ ఫండ్(వీజీఎఫ్) కింద కాంట్రాక్టర్లకు ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. వీటిని పరిశీలిస్తే.. ప్రత్యేక ప్రాజెక్టులను సన్నిహితులకు కట్టబెట్టి భారీ ఎత్తున భూములు కేటాయించి.. వాటిని తనఖా పెట్టి.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చే అప్పులతో వాటిని చేపట్టి ‘నీకింత... నాకింత’ అంటూ దోచుకోవడానికి ముఖ్యనేత స్కెచ్ వేశారన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ ప్రాజెక్టుల కోసమే ప్రభుత్వం రాజధానిలో మలి విడత భూసమీకరణకు సిద్ధమైందన్నది స్పష్టమవుతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ వంటి వాటి కోసం భూములు అవసరమని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ పదేపదే చెబుతుండటం విదితమే.రాజధాని భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ సర్కార్ ఉత్తర్వులుసాక్షి, అమరావతి: రాజధానిలో భూసమీకరణ పథకం(ల్యాండ్ పూలింగ్ స్కీం) కింద భూములు ఇవ్వని రైతుల నుంచి భూములను సేకరించే ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 343.36 ఎకరాల భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్లో చట్టపరమైన లోపాలు ఉండటంతో దాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్లు(53,749.49) ప్రాంతాన్ని రాజధానిగా 2015లో ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిలో 15,807.91 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 37,941.58 ఎకరాలు రైతులది. భూసమీకరణ పథకం కింద 34,396.87 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. మరో 3,544.71 ఎకరాలను సమీకరణ కింద ఇచ్చేందుకు రైతులు అంగీకరించలేదు. ఇప్పుడు ఆ భూములను సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. -
బాబు ష్యూరిటీ పోయింది.. మోసం గ్యారెంటీగా మారింది
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరు, కళ్లార్పకుండా ఆడుతున్న అబద్ధాలు, ఏమాత్రం జంకూ బొంకూ లేకుండా పొడుస్తున్న వెన్నుపోట్లు చూసి ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై వైఎస్ జగన్ మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నారు?ఈ రోజు వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలా పని చేస్తోందని ఒకసారి సామాన్యుడిగా ఆలోచిస్తే.. అసలు పాలన మీద ధ్యాస లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నారు? ఈ రోజు ఎంత ఆదాయం వచ్చింది? రేపటికి ఇంకా ఎంత పెంచుకోవాలి? సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి? అన్న వాటిపైనే వారికి ధ్యాస. ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి, అరాచకమే. రాష్ట్ర ఆదాయాలు తగ్గుతున్నాయి. అది పక్కదారి పట్టి.. చంద్రబాబు, ఆయన కుమారుడు, బినామీలు, ఆయన మనుషుల జేబుల్లోకి పోతోంది. దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏది చూసినా దోపిడీయే. ఇసుక చూస్తే మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. కానీ రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావడం లేదు. మట్టి, క్వార్ట్జ్, సిలికా, లేటరైట్.. ఏదైనా అంతే. మద్యం అన్నది ఏ స్థాయిలోకి వెళ్లిపోయిందో మనం చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. తమకు సంబంధించిన వారికి పావలా, అర్ధ రూపాయి, రూపాయికి భూములు పంచి పెడుతున్నారు. మన హయాంలో.. ప్రజలకు, రైతులకు మంచి జరగాలి.. మరో 30 ఏళ్లు ప్రభుత్వంపై భారం పడకూడదని యూనిట్ని రూ.2.49 చొప్పున విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే నానా యాగీ చేసిన వారు ఈరోజు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకుంటున్నారు. డబ్బుల కోసం వీళ్లు ఏ స్థాయికి దిగజారారనేది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మోసాలుగా మారిన హామీలు..మరోవైపు చూస్తే చంద్రబాబు ష్యూరిటీ పోయి మోసం గ్యారెంటీ అయ్యింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ల పేరుతో ఎన్నికలకు ముందు ఈనాడులో ఆయనిచ్చిన యాడ్స్ ఇప్పటికే చాలాసార్లు చూపించా. మొన్న అనంతపురంలో విజయోత్సవ సభ నిర్వహించి అన్నీ చేసేశామని చెబుతూ ఇచ్చిన యాడ్స్ కూడా చూపించా. ఆ హామీలు ఎలా మోసాలుగా మారిపోయాయో వివరించా. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామని ఎన్నికలకు ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇస్తామన్నారు. విజయోత్సవ సభ అడ్వర్టైజ్మెంట్లో నిరుద్యోగ భృతి హామీ తీసేశారు. ఎన్నికలకు ముందు కనిపించిన 50 ఏళ్లకే పింఛన్ – ఏడాదికి రూ.48 వేలు హామీ ప్రకటన విజయోత్సవ సభకు వచ్చేసరికి మాయమైంది. ఆ పార్ట్ అంతా కటింగే. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పోయి.. బాబు ష్యూరిటీ అనేది మోసం గ్యారెంటీగా మిగిలిన పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విద్యా వ్యవస్థ నిర్వీర్యం.. పేదింటి చదువులపై కుట్రలురాష్ట్రంలో విద్యారంగాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారో చూస్తుంటే బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ అనే వ్యక్తి ఇంకో ఐదేళ్లు పరిపాలన చేసుంటే.. ప్రతి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడు, ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు మన హయాంలో చదివిన వారు ఇంగ్లిష్ మీడియం, ఐబీ సర్టిఫికెట్తో పాసయ్యేవారు. మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు అటెండ్ అవుతూ పదో తరగతి పూర్తయ్యే నాటికి వెస్ట్రన్ యాక్సెంట్ (అమెరికన్ యాక్సెంట్)తో అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడేవాడని నేను కచ్చితంగా చెప్పగలను. ఇక ఎనిమిదో తరగతి పిల్లాడు మనమిచ్చే ట్యాబ్లతో ఐబీ చదువులు, టోఫెల్లో ఉత్తీర్ణత సాధించేవాడు. ట్యాబ్లతో ఇంటర్నెట్తో అనుసంధానమై సాఫ్ట్వేర్పై అవగాహన వచ్చేది. మనం సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఇవన్నీ కలిసి ఆ పిల్లాడు ఏ స్టేజ్కి వచ్చే వాడంటే.. ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా నిలిచేది. అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ను రాష్ట్రంలో ప్రతి పేద, మధ్యతరగతి పిల్లలకు మనం అందుబాటులోకి తెచ్చాం. చంద్రబాబు, రామోజీ, ఆంధ్రజ్యోతి ఎండీ మనవళ్లు ఈ ఐబీ చదువులు చదివారు. వాళ్లలో ఎవరూ తెలుగు మీడియం చదవడం లేదు. మన దగ్గరకి వచ్చేసరికి వీళ్లంతా కుట్ర పన్ని పేదవాడి మీద, మిడిల్ క్లాస్ వారి మీద రాక్షసుల మాదిరిగా యుద్ధం చేసి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇంగ్లిష్ మీడియంలో ఐబీ నుంచి సీబీఎస్ఈ వరకు పేద పిల్లల ప్రయాణాన్ని అడ్డుకున్నారు. టోఫెల్ క్లాసులు పూర్తిగా రద్దయి పోయిన పరిస్థితి. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వకపోగా ఆ పేరెత్తే ధైర్యం కూడా వీరికి లేదు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు ఊసే లేదు. దారుణంగా గవర్నమెంట్ స్కూళ్లు.. 5 లక్షల మంది విద్యార్థుల తగ్గుదలప్రభుత్వ విద్యా సంస్థల్లో నాడు–నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి. చివరకు నిర్వహణ కూడా చేయలేని అధ్వాన్న స్థితిలోకి విద్యా వ్యవస్థను నెట్టేశారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగా చేయకపోవడంతో కురుపాంలో ఇద్దరు పిల్లలు చనిపోయారు. 143 మంది పిల్లలకు పచ్చకామెర్లు సోకాయి. 30 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉన్నారు. నెలరోజుల క్రితం జాండిస్ కేసులు బయటపడితే కనీసం పట్టించుకున్న నాథుడే లేడు. మన మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి వెళితే గానీ ప్రభుత్వంలో కదలిక రాలేదు. రోజుకొక మెనూతో గొప్పగా అందించిన గోరుముద్ద కనుమరుగైంది. మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు చూశాం. గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం ఏకంగా ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్స్ కోసం వచ్చిన పరిస్థితులు చూశాం. అదే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్లలో 5 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. అమ్మ ఒడి పేరుతో మనం తీసుకొచ్చిన పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి గత ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు. రెండో ఏడాది తూతూమంత్రంగా అమలు చేసి 30 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేశారు. రూ.15 వేలు కాస్తా రూ.13 వేలు చేశారు. అది కూడా ఇవ్వకుండా కొందరికి రూ.9 వేలు, కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.10 వేలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు.. ఆగుతున్న పిల్లల చదువులు..ఫీజురీయింబర్స్మెంట్కు సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇస్తుంటాం. కానీ 2024 మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇవ్వలేకపోయాం. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్.. ఇప్పుడు 2025 సెప్టెంబర్ నాటికి 7 త్రైమాసికాలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు రూ.4,500 కోట్లకుగానూ ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమే. మిగతాదంతా గాలికొదిలేశారు. వసతి దీవెన కింద మన హయాంలో ఏటా ఏప్రిల్లో రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. 2024లో ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయింది. రెండేళ్లకు కలిపి రూ.2,200 కోట్లు ఇవ్వాల్సినా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా నిలిపేశారు. దీంతో పిల్లలు చదువులు మానుకుంటున్న దుస్థితి. వ్యవసాయం.. నిస్సహాయ పరిస్థితుల్లోపంటల పరిస్థితి ఇక చెప్పాల్సిన పని లేదు. రైతులకి మనమిచ్చిన ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. ఇన్పుట్ సబ్సిడీ గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఈ–క్రాప్ అనేది కనపడకుండా పోయింది. మన హయాంలో సీఎం–యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో ధరలను పర్యవేక్షించాం. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా వెంటనే ఆర్బీకేలో అలెర్ట్ వచ్చేది. ఇప్పుడు అన్నీ పోయాయి. రైతు భరోసాగా మనం పెట్టుబడి సహాయం కింద ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చి రైతుకు అండగా నిలిస్తే కళ్లబొల్లి మాటలతో భ్రమలు కల్పించారు. పేరు మార్చి అన్నదాతా సుఖీభవ అన్నారు. పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలు కాకుండా తామే సొంతంగా రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపితే ఒక్కో రైతుకు రూ.40 వేలకుగాను విదిల్చింది కేవలం రూ.5 వేలు. ఇవాళ ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర లేదు. ధాన్యం కొనుగోలు దగ్గర్నుంచి మొదలుపెడితే మిర్చి, పొగాకు, అరటి, మామిడి, టమాటా, సజ్జలు, పెసలు, మినుములు, చీని, ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులే. ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయాల్సింది పోయి ప్రైవేటుకి ఎక్కువగా కేటాయించి దళారీలతో డీల్ కుదుర్చుకుంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏ రోజైనా రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కడం చూశామా?ప్రజారోగ్యం నేడు గాలికి..వైద్య రంగం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన హయాంలో గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ కనిపించేవి. 14 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసేవారు. 105 రకాల మందులు అందుబాటులో ఉండేవి. అక్కడే ఏఎన్ఎంలు రిపోర్టింగ్ చేసేవారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉండేవారు. తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు సేవలందించేవారు. అన్ని ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ అమలు చేసి నియామకాలు చేపట్టాం. దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% ఉంటే.. మన హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 4% మాత్రమే. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచాం. 1,000 ప్రొసీజర్లను 3,300 వరకు తీసుకెళ్లాం. ఆరోగ్య ఆసరా తెచ్చి కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు అవన్నీ తెరమరుగైపోయాయి. ఆరోగ్యశ్రీ కోసం నెలకు రూ.300 కోట్లు కావాలి. ఈ 16 నెలలకు గాను రూ.4,800 కోట్లు అవసరం. కానీ ఈ పెద్ద మనిషి రూ.1,000 కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.3,800 కోట్లు పెండింగ్ పెట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపేశాయి. 108, 104 సర్వీసుల నిర్వహణ స్కాములమయం. కనీసం రూ.5 కోట్ల టర్నోవర్ కూడా లేని, టీడీపీ ఆఫీస్ బేరర్గా ఉన్నవారికి 108, 104 సర్వీసుల నిర్వహణ కాంట్రాక్ట్ అప్పగించారు. ఇక అది కుయ్.. కుయ్ అని ఏమంటుంది? బుయ్.. బుయ్ అంటుంది.ఉద్యోగులకు తోడుగా వైఎస్ జగన్ఐఆర్, పీఆర్సీ, నాలుగు డీఏలు పెండింగ్ తదితర సమస్యలపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. నాడు మనం సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకువచ్చి ఉద్యోగులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తే వారు దానిపై దుష్ప్రచారం చేశారు. ఓపీఎస్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. వీటన్నింటిపైనా.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా మన వంతు కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఉద్యోగులకు మనం తోడుగా ఉన్నామన్న భరోసాను కల్పించడంతో పాటు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చాటేలా కార్యక్రమాలు నిర్వహించాలి. -
మద్యం ఆదాయం బాబు మాఫియాకే: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ దుకాణాలన్నీ మూసివేసిన సీఎం చంద్రబాబునాయుడు ఆయన మాఫియాకు సంబంధించిన ప్రైవేటు దుకాణాలను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. ఊరూరా 70 వేలకుపైగా బెల్టు షాపులను నెలకొల్పి పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మరీ మద్యం దుకాణాలకు వేలం పాటలు నిర్వహించారని దుయ్యబట్టారు. వేలం పాటలు పాడి డబ్బులు వసూలు చేసి.. మంత్రులకు ఇంత, ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైన పెద్దబాబుకు, చిన్నబాబుకు ఇంత.. అంటూ మొత్తం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను వారి నియంత్రణలోకి తీసుకున్నారన్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రాణాలను హరిస్తున్నారన్నారు. కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారీతో ఒకవైపు భారీగా దోపిడీ చేస్తూ మరోవైపు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారులు ర్యాండమ్గా జరిపిన దాడుల్లో నకిలీ మద్యం తయారీ డంపులు భారీగా బహిర్గతమయ్యాయన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి సర్కారు ప్రజా కంటక పాలనపై చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. యథేచ్ఛగా, అంతు లేకుండా సాగుతున్న కల్తీ మద్యం విషయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ నిర్దేశించారు. కల్తీ మద్యానికి వ్యతిరేకంగా పార్టీ పరంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేస్తామన్నారు. సమావేశంలో జగన్ ఏమన్నారంటే.మద్యం మాఫియా నెట్వర్క్ఇవాళ మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతోంది. మొత్తం వ్యవస్థను తమ కంట్రోల్లోకి తీసుకున్న తరువాత ఎమ్మార్పీకి మించి మద్యం అమ్ముతున్నారు. వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూముల్లో పెగ్గుల రూపంలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నారు. వేలంపాటలో గ్రామాల్లో బెల్ట్ షాపులు పొందిన నిర్వాహకులు ఒక్కో బాటిల్పై రూ.20 నుంచి రూ.30 వరకు ఎక్కువ రేటుకు మద్యం అమ్ముతున్నారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందో కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాఫియా జేబుల్లోకి వెళ్తోంది. మరోవైపు డిస్టిలరీల నుంచి మద్యం సేకరణలో అక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్ డిస్టిలరీల నుంచి కాకుండా బాగా డబ్బులిచ్చే (కమీషన్లు) డిస్టిలరీల నుంచి మద్యం సేకరిస్తున్నారు. వీళ్లకు కావాల్సిన డిస్టిలరీలకు ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్లకు సంబంధించిన సరుకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. ఇవన్నీ వీళ్ల సొంత ఆదాయం పెంచుకునే ఎత్తుగడలు.నకిలీ లిక్కర్ తయారీదారులు, విక్రేతలు అందరూ టీడీపీ వాళ్లేనని వివరిస్తూ నిందితుడు కట్టా సురేంద్రనాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్తో ఉన్న ఫొటోలను చూపిస్తున్న వైఎస్ జగన్ నకిలీ మద్యంతో బరి తెగింపు.. బాబు పరిపాలనలో రాక్షసయుగంబాధ కలిగించే విషయం ఏమిటంటే.. వీళ్ల డబ్బు ఆశ ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే.. ప్రజలు ఏం తాగినా పర్వాలేదు... చనిపోయినా పర్వాలేదు.. తమ జేబుల్లోకి డబ్బులు ఇంకా ఎక్కువగా రావాలనే తలంపుతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షసయుగం నడుస్తోంది. భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసుల ద్వారా పరిపాలన సాగిస్తున్నారు. నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఆ మాఫియాను కంట్రోల్ చేసే కొందరు కేబినెట్ మంత్రులు, ప్రముఖ రాజకీయ పదవుల్లో ఉన్నవారు, పెద్దబాబు, చినబాబు ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. ఏకంగా ఫ్యాక్టరీలు నెలకొల్పి క్వాలిటీ లేని లిక్కర్ తయారు చేసి వారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా షాపుల్లోకి, బెల్ట్ షాపుల్లోకి నేరుగా పంపిస్తున్నారు.ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ.. పరిశ్రమను స్థాపించి యంత్ర పూజ...మరో విషయం ఏమిటంటే.. ఇవాళ ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం బాటిల్. అది తాగి మనుషులు చనిపోతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జనార్దన్రావు, సురేంద్రనాయుడు ఈ నకిలీ మద్యం దందా నడుపుతున్నారు. వీళ్లపై పర్యవేక్షణ బాధ్యతలు మంత్రి రాంప్రసాద్రెడ్డికి అప్పగించారు. ములకలచెరువులో ఏకంగా పరిశ్రమను స్థాపించి పెద్ద సంఖ్యలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన ట్యాంక్, క్యాన్లు, బాటిళ్లు, మూతలు, బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ లేబుళ్లు అన్నీ అక్కడ ఉన్నాయి. చివరకు దసరాకు అక్కడ యంత్ర పూజ కూడా చేశారు. అంటే అంత పకడ్బందీగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో బయటపడిన నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలోని యంత్రాలు, మద్యం బాటిళ్ల ఫొటోలు చూపిస్తున్న వైఎస్ జగన్ ఒక్కో ఏరియా పంచుకున్నారు.. ఇబ్రహీంపట్నంలో రెండు భారీ డంప్లుఅధికార పార్టీ అండతో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు నెలకొల్పి ఒక్కొక్కరు ఒక్కో ఏరియా పంచుకున్నారు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న జనార్దన్రావు, సురేంద్రనాయుడు.. నారా లోకేశ్, చంద్రబాబుతో కలసి ఫొటోలు కూడా దిగారు. ఇక్కడ తయారైన నకిలీ సరుకు రాయలసీమలో మద్యం షాపులు, బెల్ట్షాపులకు పంపిణీ చేసే బాధ్యతను మంత్రి రాంప్రసాద్రెడ్డి సూçపర్వైజ్ చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేందుకు ఇబ్రహీంపట్నంలో ఏకంగా రెండు చోట్ల భారీగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. రాయలసీమ నుంచి రవాణా చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఇబ్రహీంపట్నంలోనే యూనిట్ ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్లే బాటిళ్లు, లేబుల్స్, మూతలు తయారు చేసుకుంటూ బ్రాండ్లు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కార్టన్ బాక్సుల్లో స్పిరిట్ నింపిన డ్రమ్స్, ఖాళీ సీసాలు, బాటిళ్లను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయారట. నర్సీపట్నంకు చెందిన నేత ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసుకుంటారు. ఈయన స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడు. ఏలూరుకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే బాగా దౌర్జన్యం చేస్తాడని ఆయనకు ఉమ్మడి గోదావరి జిల్లా బాధ్యతలు అప్పగించారు. పాలకొల్లులో మరో పరిశ్రమ.. అక్కడ కూడా మిషన్, క్యాన్లు, బాటిళ్లు, లేబుల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. అమలాపురంలో కూడా మిషన్లు, కల్తీ మద్యం, బాటిల్స్, లేబుల్స్, మూతలు, స్పిరిట్ అన్నీ అమర్చుకున్నారు. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఛానల్, అనకాపల్లి జిల్లా పరవాడలో పరిశ్రమ ఏర్పాటు చేశారు. నకిలీ మద్యానికి అమాయకులు బలి..ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులోని ఓ మద్యం షాపులో లిక్కర్ తాగిన కొద్దిసేపటికే షేక్ చిన్న మస్తాన్ మరణించాడు. జూపూడి వైన్ షాప్లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ కిలేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు చనిపోయాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని వైన్ షాపులో మద్యం సేవిస్తూ బెల్దారీ పెద్దన్న అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. నకిలీ మద్యానికి అమాయకులు బలి అవుతున్నారు (ఆ ఫొటోలను పీపీటీలో చూపారు).అనకాపల్లి జిల్లా పరవాడలో నకిలీ మద్యం తయారీ నిందితుడు రుత్తల రాము శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడని తెలిపే ఫొటో చూపిస్తున్న వైఎస్ జగన్ దాడుల్లో వేలాదిగా నకిలీ బాటిళ్లు స్వాధీనం..రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారి పోతున్నారంటే.. సొంత ఆదాయాలు పెంచుకునేందుకు రాష్ట్ర ఖజానాను లూటీ చేయడంతో సరిపెట్టుకోకుండా అమాయకుల జీవితాలతో చెల గాటమాడుతున్నారు. ఆయన రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేస్తున్నారో ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఇబ్రహీంపట్నంలోని గోడౌన్లలో దాడులు చేసి నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, సిద్ధం చేసిన వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం, మిషన్లు, పెద్ద సంఖ్యలో ఖాళీ బాటిల్స్, లేబుల్స్ లేని బాటిల్స్, స్పిరిట్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన 95 క్యాన్లలో 3,325 లీటర్ల స్పిరిట్ను సీజ్ చేశారు. అందులో ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 725 బాటిల్స్, క్లాసిక్ బ్లూ 44 బాటిల్స్, కేరళ మాల్ట్ 384 బాటిల్స్, మంజీరా బ్లూ 24 బాటిల్స్.. ఇలా మొత్తం 1,300 బాటిళ్లను ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. లేబుల్స్ లేని 136 కేసులు, 6,578 బాటిల్స్, ఓఏబీ లేబుల్స్ 6,500, ఖాళీ బాటిల్స్ 22 వేలు, ఖాళీ కార్టూన్లు 6, ఒక మిషన్, రెండు పైపులను సీజ్ చేశారు. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.నకిలీ మద్యంపై ఆందోళన ఇలా..ప్రజల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యంపై పార్టీ పరంగా నిరసనలు తెలియచేయాలి. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. కల్తీ మద్యం వద్దు, మా ప్రాణాలను కాపాడాలని, అయ్యా చంద్రబాబు... మా ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని నియోజకవర్గ కేంద్రంలోని మద్యం దుకాణాల వద్ద ప్లకార్డులతో ఆందోళనలు చేయాలి. ఇందులో మహిళా విభాగాన్ని కూడా భాగస్వామిగా చేయాలి. మద్యం సేవించే వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, పేదల ప్రాణాలతో ఆటలాడతారా అంటూ కల్తీ మద్యంపై నిరసనలు తెలియచేయాలి. నియోజకవర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాలి.నాడు.. పరిమిత వేళల్లో క్వాలిటీతో విక్రయాలు..మన ప్రభుత్వ హయాంలో క్వాలిటీ లిక్కర్ ప్రఖ్యాతి గాంచిన డిస్టిలరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్ జరిగేది. అది కూడా అంతకు ముందు ప్రభుత్వం ఎంపిక చేసిన 20 డిస్టిలరీల నుంచే సేకరించాం. పూర్తి క్వాలిటీ చెక్ తర్వాత, దారి తప్పకుండా నేరుగా ప్రభుత్వ దుకాణాలకు వచ్చేవి. అప్పుడు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది కాబట్టి ఇష్టారీతిన కాకుండా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పరిమితంగా విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. మద్యం షాపులను 2,934కి తగ్గించాం. అక్రమ పర్మిట్ రూములతోపాటు 43 వేల బెల్టుషాప్లను పూర్తిగా రద్దు చేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే షాపులు నడిపించడం వల్ల ఎక్కడా అక్రమాలు చోటు చేసుకోలేదు. నాడు సరఫరా చేసిన లిక్కర్ బాటిళ్ల మీద క్యూఆర్ కోడ్ ఉండేది. వాటిని స్కాన్ చేసి అమ్మేవారు. అందువల్ల క్వాలిటీ నూటికి నూరు శాతం ఉండేది. -
చంద్రబాబు ధ్యాసంతా అదే..: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ(మంగళవారం, అక్టోబర్ 7) తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండేళ్లు కావొస్తోందని.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు.‘‘ఈ ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తోంది. జంకు లేకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదు. పూర్తిగా పాలన గాడితప్పింది. కేవలం సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే వీళ్ల ధ్యాస. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన బినామీలు.. వారి జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయి. దోచుకో.. పంచుకో.. తినుకో.. కనిపిస్తోంది’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘అక్రమాలకు అవకాశం లేకుండా మన హయాంలో లిక్కర్ పాలసీ ఉండేది. క్వాలిటీ విషయంలో ఏరోజు కూడా రాజీ పడలేదు. లిక్కర్ కొనుగోలు ఎంపానెల్ డిస్టలరీస్ నుంచే కొనుగోలు. ప్రతికోటా క్రమం తప్పకుండా క్వాలిటీ చెక్ చేసేవాళ్లు. క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లోకి లిక్కర్. నిర్దిష్టమైన సమయాల్లోనే మాత్రమే లిక్కర్ అమ్మేవాళ్లం. షాపులు తగ్గించి, బెల్టుషాపులు ఎత్తివేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే నిర్వహించింది. ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్ రద్దు చేశాం. మూడింట ఒక వంతు షాపులు తగ్గించాం. మన హయాంలో ప్రతి బాటిల్పైన క్యూ ఆర్కోడ్ ఉండేది. ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూ ఆర్కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్లు. నూటికి నూరుశాతం క్వాలిటీతోనే మద్యం అమ్ముడుపోయేది...కాని, రాష్ట్రంలో ఇప్పుడు కల్తీ లిక్కర్ మాఫియా నడుస్తోంది. దీనికోసం ప్రభుత్వ దుకాణాలను మూసేశారు.. చంద్రబాబు, ఆయనకు సంబంధించిన మాఫియాకు ప్రైవేటు దుకాణాలు అప్పగించారు. వేలం పాట నిర్వహించి.. బెల్టుషాపులు వారి మనుషులకే అప్పగించారు. వీళ్లందరికీ మళ్లీ పోలీసుల నుంచి ప్రొటెక్షన్. ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైనున్న పెదబాబుకు ఇంత, చినబాబుకు ఇంత అని పంచుకుంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మొత్తం చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లీగల్గా ఆదాయాలు పెంచుకోవడానికి తెరలేపారు. వీరికి సంబంధించిన షాపుల నుంచి తమకు కావాల్సిన వారికి మాత్రమే ఆర్డర్లు ఇస్తున్నారు, ఇదోరకం మాఫియా...ఇదికాక మరో రకం మాఫియా నడుపుతున్నారు. ప్రజలు చనిపోయినా పర్వాలేదు, తమ జేబుల్లోకి డబ్బు వస్తే చాలనుకుంటున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షస పరిపాలన నడుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యాన్ని పరిశ్రమ మాదిరిగా నడుపుతున్నారు. క్వాలిటీ లేని లిక్కర్ను తయారుచేసి, తన ప్రైవేటు మాఫియా నెట్వర్క్ద్వారా నేరుగా పంపిస్తున్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్. ఆ కల్తీ మద్యాన్ని తాగి మనుషులు చనిపోతున్న పరిస్థితి. ప్రాంతాల వారీగా కల్తీ దందా నడుపుతున్నారు. కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇబ్రహీపట్నంలో భారీగా దొరికిన మద్యం, దాని తయారీకి సంబంధించిన వస్తువులు మాఫియా తీవ్రతను తెలియజేస్తున్నాయి. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ లూటీ చేస్తున్నారు..ప్రభుత్వ స్కూళ్లలో ఐదు లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయారు. మన హయాంలో నో వేకెన్సీ బోర్డులు చూశాం. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కడం చూస్తున్నాం. మన హయాంలో ఐదేళ్లలో ఎప్పుడూ అలాంటివి లేవు. ఎరువుల పంపిణీలో కూడా స్కాం చేశారు. దళారీలతో చేతులు కలిపారు. ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. పేదలను ఇంకా అన్యాయం చేస్తున్నారు. వారిని మరింత పేదరికంలోని నెడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందనీయకుండా చేస్తున్నారు. మనం కొత్తగా పెట్టిన కాలేజీలను ఇప్పుడు తన బినామీలకు, తన మనుషులకు తెగనమ్ముతున్నాడు...మనం వచ్చేంతవరకూ రాష్ట్రంలో ఉన్నవి 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే. మనం ఒక విజన్ను ఆవిష్కరించాం. ప్రతి జిల్లాల్లో గవర్నమెంటు కాలేజీ ఉండాలన్న సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు పెట్టాం. ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు ఎందుకు నడుపుతుంది?. అలా చేయకపోతే ప్రైవేటు వాళ్లు ప్రజలను దోచుకుంటారు. ఇవి నడపకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయాన్ని ప్రజలకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి. మనం ఉన్నప్పుడే 2023-24లోనే కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు కాలేజీలు క్లాసులకు అందుబాటులోకి తెచ్చాం. తద్వారా 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పులివెందులోల 50 సీట్లు NMC ఇస్తే.. వద్దని చంద్రబాబు లెటర్ రాశాడు. మన హయాంలోనే అవసరమైన నిధులకు ఫైనాన్సియల్ టై అప్ చేశాం. అమరావతికి 50వేల ఎకరాలు సరిపోవని, మరో 50వేల ఎకరాలు సేకరిస్తున్నాడు...మొదటి 50 వేల ఎకరాలకే మౌలిక సదుపాయాలకోసం రూ.1లక్ష కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు అవుతుందని చెప్తున్నారు. అలాంటి లక్షలమందికి, కోట్ల మందికి వైద్యం అందించి, చిరస్థాయిగా నిలబడే ఆస్తులైన మెడికల్ కాలేజీలను అప్పనంగా అమ్మేస్తున్నారు?. ఐదేళ్లలో రూ.5వేల కోట్లు పెట్టలేరా?. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది...అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తాను. అక్టోబరు 10 నుంచి నవంబర్ 22వరకూ రచ్చబండ కార్యక్రమం. మెడికల్ కాలేజీల ప్రైవటీకరణపై కరపత్రాలు పంపిణీ. కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాల సేకరణ చేస్తాం. ప్రతి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రతిరోజూ రెండు గ్రామాల సందర్శన. అలాగే నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్స్ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి డిమాండ్ పత్రాల సమర్పణ. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ర్యాలీలు. ఒక జిల్లాలో నేనుకూడా పాల్గొంటాను. నవంబర్ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన సంతకాలు జిల్లా కేంద్రానికి. నవంబర్ 24న సేకరించిన సంతకాలతో కూడిన వాహనాలను జిల్లా కేంద్రంలో జెండా ఊపి విజయవాడకు. సేకరించిన ఈ సంతకాలు గవర్నర్కు అప్పగించే కార్యక్రమం తదుపరి జరుగుతుంది’ అని వైఎస్ జగన్ వివరించారు. -
కొత్త కథ బాగా అల్లారు.. యువతి మృతి కేసులో పోలీసులపై హైకోర్టు ఫైర్
సాక్షి, అమరావతి: దళిత యువతి అనుమానాస్పద మృతి కేసులో గుంటూరు జిల్లా, నల్లపాడు పోలీసులపై హైకోర్టు మండిపడింది. తనే భవనం పైనుంచి దూకానంటూ మృతురాలే వాంగ్మూలం ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొనడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే ఆ యువతి మరణించిన నేపథ్యంలో, మరి ఆమె వాంగ్మూలం ఎలా నమోదు చేశారంటూ పోలీసులను ప్రశ్నించింది. పోలీసులు కొత్త కథ బాగా అల్లారంటూ వ్యాఖ్యానించింది. దీనిని బట్టి పోలీసుల దర్యాప్తు ఏ తీరులో సాగిందో అర్థమవుతోందని తెలిపింది.రాష్ట్రంలో పోలీసులకు కోర్టులన్నా.. కోర్టు ఉత్తర్వులన్నా.. కోర్టు సిబ్బంది అన్నా ఏ మాత్రం గౌరవం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. దళిత యువతి మృతి ఘటనను ఆత్మహత్యగా పేర్కొంటూ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ను పరిశీలించి, దానిపై వాదనలు వినిపించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.గుంటూరు జిల్లా బుడంపాడులోని సెయింట్ మేరీస్ ఇంనీరింగ్ కాలేజీలో అమృతలూరు మండలం, గోపాయపాళెంకు చెందిన గర్నెపూడి శ్రావణ సంధ్య పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతూ 2017 ఫిబ్రవరి 28న అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తన కుమార్తెది హత్య అని, దీనికి కాలేజీ యాజమాన్యంతో పాటు రూంమేట్స్ కారణమంటూ మృతురాలి తల్లి జయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేసి చేతులుదులుపుకున్నారు. దీంతో జయలక్ష్మి 2017 జూలై 6న హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని తన పిటిషన్లో కోరారు. హైకోర్టు అసహనం.. ఈ ఘటన విచారణ సందర్భంగా సెప్టెంబర్లో జస్టిస్ బట్టు దేవానంద్ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది దర్యాప్తు పూర్తయిందని చెప్పడంతో అయితే చార్జిషీట్ ఎందుకు దాఖలు చేయలేదు, చేయవద్దని మేము చెప్పలేదుకదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. -
ఎయి‘డెడ్’ స్కూళ్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూళ్ల విలీనం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నందున ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేయబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 763 ఎయిడ్ స్కూళ్లు ఉండగా.. 40 కంటే తక్కువ విద్యార్థుల నమోదు ఉన్న 251 స్కూళ్ల కరస్పాండెంట్లకు నోటీసులు జారీ చేయాలని డీఈవోలను పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. ఇటీవల ఇదే తరహాలో విజయనగరం జిల్లాలోని ఏడు స్కూళ్లను విద్యా శాఖలో విలీనం చేసింది. ఇప్పుడు మరో 251 స్కూళ్లకు నోటీసులు ఇవ్వబోతోంది. ఇప్పటికే ఈ స్కూళ్ల యాజమాన్యాలకు రెండుసార్లు నోటీసులు ఇచి్చనట్లు విద్యా శాఖ వర్గాలు తెలిపాయి.తుది నోటీసులు ఇచ్చి.. ఈ స్కూళ్లను సిబ్బందితో సహా విద్యా శాఖలో విలీనం చేయనున్నట్లు వెల్లడించాయి. నోటీసులో పేర్కొన్నా జాబితాలో అనకాపల్లి జిల్లాలో 2, అనంతపురంలో 8, అన్నమయ్యలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12, బాపట్లలో 26, చిత్తూరులో 4, తూర్పు గోదావరిలో 10, ఏలూరులో 8, గుంటూరులో 29, వైఎస్సార్ కడపలో 18, కాకినాడలో 5, అంబేడ్కర్ కోనసీమలో 2, కృష్ణాలో 13, కర్నూలులో 2, మన్యంలో 5, నంద్యాలలో 8, నెల్లూరులో 6, ఎన్టీఆర్ జిల్లాలో 12, పల్నాడులో 17, ప్రకాశంలో 35, తిరుపతిలో 6, విశాఖపట్నంలో 3, విజయనగరంలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విలీన ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారులను డైరెక్టరేట్ ఆదేశించింది. ఈ స్కూళ్ల విలీనం పూర్తయితే దాదాపు 900 నుంచి 1,000 మంది ఉపాధ్యాయులు.. అంతే సంఖ్యలో బోధనేతర సిబ్బంది కూడా విద్యా శాఖలో విలీనమయ్యే అవకాశం ఉంది. వారిని అదే మండలంలో నియమించాలి స్కూళ్ల విలీనం అనంతరం మిగులుగా తేలిన ఎయిడెడ్ ఉపాధ్యాయులను అదే మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో నియమించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. కాగా, రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూళ్లలో పనిచేస్తున్న 3 వేల మంది ఉపాధ్యాయులకు సెపె్టంబర్ నెల వేతనం ఇంకా జమ చేయలేదని.. వెంటనే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు, ఎల్కే చిన్నప్ప, ప్రతినిధి ప్రభాకర్రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
దొడ్డిదారి బదిలీలు!
మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పీ హైసూ్కల్లో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్న హెచ్ఎం వెంకటేశ్వరరావును బదిలీ చేసి తాడికొండ మండలం పొన్నెకల్లు జెడ్పీ హైసూ్కల్కి పంపించారు. ఆ స్థానంలో కృష్ణాజిల్లా పెనమలూరు జెడ్పీ హైసూ్కల్ గ్రేడ్–2 హెచ్ఎం దుర్గాభవానికి పోస్టింగ్ ఇచ్చారు. ఆదివారం సెలవు అయినప్పటికీ ఆమె నిడమర్రు స్కూల్కు వచ్చి బాధ్యతలు తీసుకున్నారు.ఇదేమీ అంతర్ జిల్లా బదిలీ అనుకునేరు! కేవలం సిఫారసు లేఖతో జరిగిందే. ఇలా ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 150 మందికి సిఫారసు బదిలీలు చేసినట్టు సమాచారం. గతంలో సిఫారసు బదిలీలు జరిగినా ఖాళీస్థానాల్లో మాత్రమే అవకాశం ఇవ్వగా.. ఇప్పుడు ఏకంగా రెండున్నరేళ్ల సర్వీసు ఉన్నవారిని బలవంతంగా పంపించేసి తమకు కావాల్సిన వారికి పోస్టింగ్ ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు తెరతీశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలు ఉన్నవారిని వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేస్తున్నారు. ఈ క్రమంలో మే/జూన్ నెలలో జరిగిన బదిలీల్లో వచ్చినవారిని సైతం బలవంతంగా మరోచోటుకు పంపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తాజాగా అన్ని జిల్లాల్లోను 150 మందికిపైగా ఉపాధ్యాయులను మార్చినట్టు తెలుస్తోంది. మరో 2 వేలమంది ఉపాధ్యాయులు తమ నియోజకవర్గ ముఖ్యనేతల లేఖలతో బదిలీకి సిద్ధంగా ఉన్నట్టు అంచనా.తాజా బదిలీలు ఉపాధ్యాయ బదిలీ చట్టం మేరకే చేసినట్టు చెబుతున్నా.. పూర్తిగా సిఫారసు లేఖలు, నగదు కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏటా జూన్లో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలుంటాయని, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పూర్తి పారదర్శకతతో బదిలీలు చేపపట్టేందుకు ఆన్లైన్ విధానం అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిప్రకారం ఈ ఏడాది ఉపాధ్యాయ బదిలీ చట్టం కూడా తీసుకొచ్చారు.అయితే.. అవసరం అనుకుంటే ప్రభుత్వం ఎవరినైనా ఎప్పుడైనా బదిలీ చేయవచ్చన్న నిబంధన కూడా ఇందులో పొందుపరిచారు. దీని ఆధారంగానే కూటమి ప్రభుత్వం ‘సిఫారసు బదిలీ’లు చేపట్టినట్టు తెలుస్తోంది. నిడమర్రులో వెంకటేశ్వరరావు ఇంకా రెండున్నరేళ్లు పనిచేసే అవకాశం ఉన్నా బలవతంగా బదిలీచేసి, కృష్ణాజిల్లా టీచర్ను అక్కడ నియమించడంపై ఉపాధ్యాయసంఘాలు మండిపడుతున్నాయి. బదిలీకి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు!రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఉపాధ్యాయుల సిఫారసు బదిలీలకు రంగం సిద్ధం చేశారు. జిల్లాల నుంచి కూటమిలోని ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు కావాల్సిన టీచర్లకు, డబ్బులిచి్చన వారికి కోరుకున్న చోటుకు బదిలీ కోసం లేఖలిచ్చి సిఫారసు చేశారు. ఇలా దాదాపు రెండువేలకు పైగా దరఖాస్తులు విద్యాశాఖకు చేరినట్టు అంచనా. ఒక్కో బదిలీకి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్టు ఉపాధ్యాయులే చెబుతున్నారు. అయితే.. వెంటనే బదిలీలు చేస్తే ఉపాధ్యాయవర్గాల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతుందని భావించిన ప్రభుత్వం.. సిఫారసు బదిలీలకు చట్టం ముసుగు వేసింది.ఈ ఏడాది ఏప్రిల్లో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం–2025’ చేసింది. ఇందులో సంవత్సరానికి ఒకసారి మాత్రమే బదిలీలుంటాయని చెబుతూ, అభ్యర్థన/పరస్పర/అంతర్ జిల్లా/అంతర్రాష్ట్ర బదిలీలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. అంటే సిఫారసు లేఖల కోసమే ఈ నిబంధన పెట్టినట్టు అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు ఆ నిబంధనను తొలగించాలని పట్టుబట్టారు. కానీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ నిబంధనే తమ నెత్తిన కుంపటిలా మారిందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది జూన్లో బదిలీపై కొత్త స్కూళ్లకు వెళ్లిన వారు సైతం ఎప్పుడు ఎవరి స్థానం మారుతుందోనని ఆందోళనగా ఉన్నట్లు తెలిసింది. -
దివ్యాంగులపై ‘రీవెరిఫికేషన్’ అస్త్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దివ్యాంగ పింఛన్ దారులకు రీ వెరిఫికేషన్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఏళ్ల తరబడి పెన్షన్ తీసుకుంటున్నా టీడీపీ కూటమి ప్రభుత్వం వాటి సంఖ్యను ఎలాగైనా కుదించాలన్న కుట్రతో వెరిఫికేషన్ ప్రక్రియకు తెరతీసింది. వైకల్యం నిరూపించుకోవాలంటూ ఇప్పటికే లబ్ధిదారులకు ఒకసారి నోటీసులిచ్చి రీవెరిఫికేషన్ పూర్తిచేయగా.. ఇప్పుడు తాజాగా ఈనెల 8 నుంచి మరోమారు వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. విడతల వారీగా నోటీసులివ్వడం ప్రారంభించింది. నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అనర్హుల ఏరివేత పేరిట పింఛను అర్హతను నిరూపించుకోవాలంటూ నోటీసులు జారీచేసింది. మంచానికి పరిమితమైన వ్యాధిగ్రస్తులు 24,091 మందితో పాటు దివ్యాంగుల కోటా పింఛన్లు పొందుతున్న 7,86,091 మందితో కలిపి రాష్ట్రంలో మొత్తం 8.18 లక్షల మందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, వీరిలో కొందరికే నోటీసులిచ్చి 5.50 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. దాదాపు లక్ష మంది లబ్ధిదారులు అనర్హులంటూ వీరి పింఛన్లు పూర్తిగా రద్దుకు రెండునెలల క్రితమే ప్రభుత్వం నోటీసులు జారీచేసింది.అలాగే, 30వేల మందికి వారు ప్రస్తుతం పొందుతున్న రూ.15 వేల పింఛన్ను రూ. 6వేలు లేదా రూ. 4 వేలకు మార్చేందుకు కూడా నోటీసులిచ్చింది. అయితే, వీటిని అందుకున్న దివ్యాంగ, వైద్య పింఛను లబ్ధిదారులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టడం.. పింఛన్ల భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వ కుట్రలను ‘సాక్షి’ ఎండగట్టడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సెప్టెంబరు ఒకటిన జరిగే పింఛన్ల పంపిణీని నిలిపివేస్తామని చెప్పి వాయిదా వేసింది. అయితే, తన పంతం ఎలాగైనా నెగ్గించుకోవాలన్న లక్ష్యంతో ఇప్పుడు మళ్లీ రీవెరిఫికేషన్ అంటోంది. రెండు నెలల క్రితం పింఛను రద్దు లేదంటే పింఛన్ కేటగిరి మార్పునకు నోటీసులిచ్చిన వారిలో దాదాపు 1.10 లక్షల మందికి ఈనెల 8న మళ్లీ వైద్య పరీక్షలు మొదలుపెట్టనుంది. ఈసారి పరీక్షల్లో అనర్హులుగా తేలితే పింఛను పూర్తిగా రద్దుచేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆసుపత్రుల వద్దే పరీక్షలు.. ఇక పెరాలసిస్, తీవ్ర కండరాల బలహీనత వంటి వ్యాధులతో మంచం నుంచి కదలలేని స్థితిలో ఉంటూ ఫించన్లు పొందుతున్న 24 వేల మంది లబ్ధిదారులకు తొలివిడత వైద్య పరీక్షలను ఇంటివద్దే నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు రెండో విడతలో మాత్రం ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాల్సిందేనని తాజా మార్గదర్శకాల్లో తేలి్చచెప్పింది. వీరిలో ఎంపికైన అతికొద్ది మందికి మాత్రమే రోజుకు ఐదుగురు చొప్పున 108 లేదా 104లో ఆస్పత్రులకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.టీడీపీ సానుభూతిపరులకైతే నో వెరిఫికేషన్..ఇదిలా ఉంటే.. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ రాజకీయ వేధింపుల మాదిరిగా ఉందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే.. మొత్తం 8.18 లక్షల మంది దివ్యాంగ, వైద్య పింఛను లబ్ధిదారులందరినీ అప్పట్లో రీవెరిఫికేషన్ జరుపుతున్నట్లు ప్రకటించి.. వీరిలో కేవలం ఐదున్నర లక్షల మందికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించి, వారిలో లక్ష మందికి పూర్తిగా పింఛను రద్దుకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఇప్పుడు వీరికి మళ్లీ రెండో విడత రీ వెరిఫికేషన్ వైద్య పరీక్షలు మొదలుపెడుతున్నారు. అయితే, దాదాపు రెండున్నర లక్షల మంది టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న దివ్యాంగ పింఛనుదారులకు ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం.మిగిలిన వారి మీద మాత్రం ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులంటూ టీడీపీ నేతల ప్రోద్బలంతో ముద్రవేసి వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, దాదాపు పదిహేను ఏళ్ల క్రితం కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించిన జనగణనలో రాష్ట్రవ్యాప్తంగా 12,19,785 మంది దివ్యాంగులు ఉన్నారని తేలింది. కానీ, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఈ కేటగిరీ పెన్షనర్ల సంఖ్య అంతకన్నా చాలా తక్కువే. అయినా.. ఇందులోనూ కోత విధించేందుకు గత ప్రభుత్వం అనర్హులకు ఇచ్చిందంటూ రీవెరిఫికేషన్ జపం చేస్తోంది. -
అడ్వాన్సు నిధులు మళ్లిస్తే.. పోలవరం పూర్తయ్యేదెన్నడు?
సాక్షి, అమరావతి: ‘‘పోలవరం ప్రాజెక్టు పనులను 2027 మార్చి నాటికి పూర్తిచేసేలా నిధుల కొరత తలెత్తకుండా ఉండేందుకు 2024–25లో రెండు విడతల్లో రూ.5,052.71 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చాం. వాటిని సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) ఖాతాలో జమ చేసి పోలవరం పనులకు మాత్రమే ఖర్చు పెట్టాలని నిర్దేశించాం. అయినాసరే ఆ నిధుల్లో ఇప్పటికీ రూ.1,830 కోట్లను ఎస్ఎన్ఏ ఖాతాలో వేయలేదు. అంటే, ఇతర అవసరాలకు మళ్లించారు. ఇలాగైతే పోలవరం గడువులోగా ఎలా పూర్తవుతుంది?’’ అంటూ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులను కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నిలదీశారు. ‘నిర్వాసితులకు నగదు పరిహారం చెల్లింపు, పునరావాస కాలనీల పనులు, సేకరించిన భూమికి నిర్వాసితులకు పరిహారం ఇవ్వడానికి సంబంధించిన బిల్లులే రూ.1,107.62 కోట్లు పెండింగ్లో పెట్టారు. కేంద్రం ఇచ్చిన అడ్వాన్సులో రూ.1,830 కోట్లు దారి మళ్లించేశారు. ఇలాగైతే సకాలంలో నిర్వాసితులకు ఎప్పుడు పునరావాసం కల్పిస్తారు?’’ అని సూటిగా ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్సుగా ఇచ్చిన రూ.5,052.71 కోట్ల నిధుల వినియోగానికి సంబంధించిన వినియోగ పత్రాలు (యుటిలిటీ సరి్టఫికెట్–యూసీ) పంపితేనే, ఈ ఆర్థిక సంవత్సరంలో పోలవరానికి కేటాయించిన రూ.5,936 కోట్లను విడుదల చేస్తామని తేల్చిచెప్పారు.పోలవరం పనుల పురోగతిపై సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) చైర్మన్ అతుల్జైన్, వ్యాప్కోస్, సీఎస్ఎంఆర్ఎస్ అధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్సీ కె.నరసింహమూర్తి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ⇒ పోలవరం పనుల పురోగతిపై పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్కు వివరించారు. ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయా ఫ్రం వాల్ పనులు 56 శాతం జరిగాయని, గ్యాప్–1లో వరద ఉధృతితో కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే, కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే, ఎడమ కాలువ పనులు సాగుతున్న తీరును సమగ్రంగా వెల్లడించారు. ఏడాదిగా ఒక్క కుటుంబానికీ పునరావాసం లేదు 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయాలంటే 1,00,099 ఎకరాలకు గాను 91,156 ఎకరాలు సేకరించారని ఇంకా 8,943 ఎకరాలు సేకరించాల్సి ఉందని రఘురాం తెలిపారు. 38,060 నిర్వాసిత కుటుంబాలకు గాను ఇంకా 23,689 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని, ఏడాదిగా ఒక్క కుటుంబానికి కూడా పునరావాసం కల్పించలేదని తెలిపారు. దీనిపై వీఎల్ కాంతారావు స్పందిస్తూ, అడ్వాన్సు నిధులను సద్వినియోగం చేస్తేనే ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయగలరని, కానీ... రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎన్ఏ ఖాతాలో వేయకుండా, ఇతర అవసరాలకు మళ్లిస్తోందని, ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాశామని ప్రస్తావించారు.ఇదిలా ఉంటే.. పోలవరం పనుల ప్రగతిపై కేంద్రం సంతృప్తి వ్యక్తంచేసిందని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సోమవారం కేంద్ర జల శక్తి మంత్రి పాటిల్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2027 డిసెంబరుకల్లా.. వీలైతే పుష్కరాలకు ముందే పోలవరం పూర్తిచేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామన్నారు.డిసెంబరులో వస్తా.. పనులను గాడిలో పెట్టాలి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్పందిస్తూ... పోలవరాన్ని 2026 మార్చి నాటికి విపత్తులు ఎదురైతే మరో ఏడాది (2027 మార్చి)లోగా పూర్తి చేయాలని గడువుగా నిర్దేశించి రూ.12,157 కోట్లను కేంద్ర కేబినెట్ మంజూరు చేసిందని కేంద్రమంత్రి పాటిల్ గుర్తు చేశారు. ఈ క్రమంలో నిధుల కొరత లేకుండా 2 విడతలుగా అడ్వాన్సు ఇచ్చామని చెప్పారు.వాటిని సది్వనియోగం చేసుకోకపోతే ప్రాజెక్టును సకాలంలో ఎలా పూర్తి చేయగలరని రాష్ట్ర మంత్రి రామానాయుడుని, జల వనరుల శాఖ అధికారులను నిలదీశారు. ‘‘నేను డిసెంబరులో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తా. ఆలోగా పనులను గాడిలో పెట్టాలి’’ అని స్పష్టం చేశారు. పీపీఏ, సీడబ్ల్యూసీ, అంతర్జాతీయ నిపుణుల కమిటీతో సమన్వయం చేసుకుంటూ 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. -
రానున్న మూడు నెలల్లో కూటమి రూ.11,900 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు బడ్జెట్లో రూ.11,900 కోట్ల అప్పు చేయనుంది. ఈ మేరకు సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల రుణాల సమీకరణ క్యాలెండర్ను ఆర్బీఐ నోటిఫై చేసింది.ఇందులో భాగంగా మంగళవారం ఏపీ రూ.1,900 కోట్లు అప్పు చేయనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. నవంబర్ 4న రూ.5,000 కోట్లు, డిసెంబర్ 2న మరో రూ.5,000 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. -
ఉద్యోగులకు ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమిటి..? చేస్తున్నది ఏమిటి..?
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ఉద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. తీపి తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపి... తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? రోడ్డు మీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పీఆర్సీ, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్క్యాష్మెంట్ లీవ్ల కింద ఉద్యోగులకు దాదాపు రూ.31 వేల కోట్ల బకాయిలు పెట్టారని ఎత్తిచూపారు. తమకు రావాల్సిన వాటి కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నా ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో వారందరూ నరకయాతన అనుభవిస్తున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మీరు పెట్టే బాధలు భరించలేకే ఇప్పుడు ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తున్నాంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఉద్యోగులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన మేళ్లను.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను జత చేస్తూ, చంద్రబాబు చేసిన మోసాలను ప్రశ్నిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో సోమవారం వైఎస్ జగన్ పోస్టు చేశారు.అందులో ఆయన ఏమన్నారంటే...‘‘చంద్రబాబు గారూ... మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వారు ఆశగా ఎదురుచూడడం, చివరకు ఉసూరు మనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప, ప్రజలు, ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలు, ఉద్యోగుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవడం మీకు అలవాటే.మీరు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డు మీదకు వస్తున్నారు. చంద్రబాబు గారూ.. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారు. మరి దాని సంగతి ఏమైంది? మేం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే పీఆర్సీ వేసి, దానికి చైర్మన్ను కూడా నియమించాం.మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగా పీఆర్సీ చైర్మన్ను వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు. న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు.ఇచ్చే ఆలోచన మీకు లేదనిపిస్తోంది..ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిగురించి ప్రస్తావించడమే లేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4 డీఏలు మొత్తం పెండింగ్. దసరా పండుగకు డీఏలు క్లియర్ అవుతాయని ఉద్యోగులంతా ఎంతో ఎదురుచూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తోంది. కానీ, ఇచ్చే ఆలోచన మీకున్నట్టు అనిపించడం లేదు.⇒ సీపీఎస్/జీపీఎస్లను పునఃసమీక్షించి ఆమోదయోగ్య పరిష్కారం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కానీ, మీరు అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా దీనిమీద రివ్యూ చేశారా? మా ప్రభుత్వ పాలనలో సీపీఎస్కు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల కోసం జీపీఎస్ తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు ఇప్పుడు ఇదే విధానంలో వెళ్తున్నాయి. మీరు... ఓపీఎస్ను తీసుకొస్తామన్నారు. మాకంటే గొప్పగా చేస్తామన్నారు. కానీ, ఏమీ చేయకపోగా, ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా, మీలో ఏ మాత్రం చలనం లేదు.ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితిప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి... ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియని పరిస్థితి తెచ్చారు. ప్రతి నెల ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ మేం ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. కానీ, ఆ రోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. ఇవాళ కరోనా లాంటి దారుణమైన పరిస్థితులు లేకపోయినా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ అమలు చేయడం లేదు.వాలంటీర్లకు ఎగ్గొట్టారు.. వైద్యాన్ని రోడ్డున పడేశారుమీరు అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతాలను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, కుట్ర పన్ని వారి పొట్టకొట్టి ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకూ మేలు చేస్తామని చెప్పి వారినీ ఇప్పుడు రోడ్డు ఎక్కేలా చేశారు. విలేజ్ క్లినిక్లు, పీహెచ్సీలు మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారు. జీరో వేకెన్సీతో ప్రజలకు తోడుగా ఉండే వైద్య శాఖను రోడ్డున పడేశారు.⇒ మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పని చేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేశాం. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను కూడా మొదలుపెట్టాం. అర్హులైన 10,117 మందిని గుర్తించాం. వీరిలో 3,400 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చాం. మిగిలినవారికి అన్ని ప్రక్రియలు ముగిసినా ఇప్పటివరకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మళ్లీ దళారీ వ్యవస్థ... ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తిపలుకుతూ, వారికోసం ఆప్కాస్ను తీసుకొచ్చి దళారీ వ్యవస్థను అంతం చేశాం. దాదాపు లక్షమందికి సకాలానికే ఎలాంటి కత్తిరింపులు లేకుండా జీతాలను క్రమంతప్పకుండా ప్రతి నెల 1వ తారీఖునే ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆప్కాస్ను రద్దుచేసి మళ్లీ దళారీ వ్యవస్థను తెస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారందరికీ మేం అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచాం. మేం రాకమునుపు వరకు వీరి జీతాల చెల్లింపుల బిల్లు నెలకు రూ.1,100 కోట్లు అయితే, మేం వచ్చాక రూ.3 వేల కోట్లకు పెంచాం. పేరుకే హెల్త్ కార్డులు... వాటితో ప్రయోజనం లేదుఉద్యోగులకు ఈహెచ్ఎస్ కింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్ కార్డులున్నా వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. ఈహెచ్ఎస్ కోసం ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్నికూడా విడుదల చేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? చంద్రబాబు గారూ.. దాదాపు రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు. వారికి ఇచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారు’’. -
ష్.. గుట్టు విప్పొద్దు!
సాక్షి, అమరావతి: బహుళ జాతి కూల్ డ్రింక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల కోసం ప్రాంచైజీలు ఇస్తాయి! ఆ కంపెనీలు కూల్ డ్రింక్ తయారీకి అవసరమైన మిశ్రమాన్ని సరఫరా చేస్తే... ఫ్రాంచైజీలు ఆ మిశ్రమంతో కూల్డ్రింకులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తాయి. ఇలా తయారయ్యే ప్రతి బాటిల్పై ఫ్రాంచైజీలు కూల్ డ్రింక్ కంపెనీకి కమీషన్ చెల్లించాలి. ఇదీ వ్యాపారం..!సరిగ్గా అదే వ్యాపార సూత్రంతో ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలో నకిలీ మద్యం దందా సాగిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. కరకట్ట బంగ్లాకు 30 శాతం కమీషన్.. అంటే ఏడాదికి రూ.3వేల కోట్లు చెల్లించాలనే ఒప్పందం కుదరడంతో నకిలీ మద్యం ఫ్రాంచైజీ రాకెట్ రాష్ట్రవ్యాప్తంగా వేళ్లూనుకుంది. చినబాబు అండదండలతో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు అద్దేపల్లె జనార్ధన్రావు నకిలీ మద్యం తయారీ ఫార్ములాను ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేయగా... టీడీపీ నేతల కుటుంబాలు ప్రాంతాలవారీగా ఆ ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. ఏడాదిగా సాగుతున్న ఈ దందా ములకలచెరువులో వెలుగు చూసిన రాకెట్తో అనూహ్యంగా బయటపడింది. తమను ఈ కేసు నుంచి తప్పించకుంటే మొత్తం బండారం బయటపెడతామని జయచంద్రారెడ్డి, జనార్ధన్రావు బెదిరిస్తుండటంతో పెదబాబు, చినబాబు బెంబేలెత్తుతున్నారు. ఆ కేసు తప్పిస్తాం..! కంగారు పడొద్దు...! తమ గుట్టు విప్పొద్దని రాయబేరాలు సాగిస్తున్నారు. మమ్మల్ని కెలికితే... బండారం బయటపెడతాఅన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడిన నకిలీ మద్యం రాకెట్ టీడీపీ కూటమి సర్కారు పెద్దలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ నకిలీ మద్యం రాకెట్లో అడ్డంగా దొరికిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన వ్యాపార భాగస్వామి అద్దేపల్లి జనార్ధన్రావు ఎదురు తిరగడంతో ప్రభుత్వ పెద్దలు హడలిపోతున్నారు. ఈ కేసును కప్పిపుచ్చేందుకు అమరావతి నుంచి ప్రభుత్వ ముఖ్యనేత వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. టీడీపీ నేతలే నకిలీ మద్యం దందా సూత్రధారులని ఆధారాలతో బట్టబయలు కావడంతో విధిలేని పరిస్థితుల్లో జయచంద్రారెడ్డిని టీడీపీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు. జనార్ధన్రావుతోపాటు కొందరు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. దాంతో ఈ వ్యవహారం సద్దుమణుగుతుందని భావించారు. కానీ అనూహ్యంగా జయచంద్రారెడ్డి, జనార్ధన్రావు ఎదురుతిరిగి ప్రభుత్వ ముఖ్యనేతకు షాక్ ఇచ్చారు. ఈ కేసు నుంచి తమను బయటపడేయాలని, లేకపోతే రాష్ట్ర స్థాయిలో సాగుతున్న నకిలీ మద్యం దందా గుట్టును బహిర్గతం చేస్తామని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ నేత పెట్టిన నకిలీ మద్యం ప్లాంటులోని యంత్రాలు, క్యాన్లు, (ఇన్సెట్లో) నకిలీ మద్యం బాటిళ్లు తామేమీ ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా నకిలీ మద్యం తయారు చేయడం లేదు కదా? అని వారిద్దరూ నిలదీయడంతో పెదబాబు, చినబాబులకు నోట మాట రాలేదు! ‘ ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రస్థాయిలో నకిలీ మద్యం దందాను వ్యవస్థీకృతం చేశాం. అందుకు ఎంతో ఖర్చు పెట్టాం. ఈ రాకెట్ను మేం పర్యవేక్షిస్తున్నాం... కానీ అందులో చాలా మంది టీడీపీ పెద్దలు ఉన్నారు కదా..! అంతకంటే పెద్దలకు కమీషన్లు వెళ్తున్నాయి కదా..?’ అని జయచంద్రారెడ్డి, జనార్ధన్రావు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ సీనియర్ ప్రజాప్రతినిధి ద్వారా కబురు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విషయాన్ని ఈ కేసును అమరావతి నుంచి పర్యవేక్షిస్తున్న ఐపీఎస్ అధికారికి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా ఓ టీడీపీ సీనియర్ ప్రజాప్రతినిధి, ఐపీఎస్ అధికారి ద్వారా తమ మనసులో మాటను ముఖ్యనేతకు తేల్చి చెప్పారు. అదే సమయంలో తమ డిమాండ్లను బలంగా వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కేసు నుంచి తమను బయటపడేసే బాధ్యత ప్రభుత్వ పెద్దలదేనని... లేదంటే మొత్తం నకిలీ మద్యం గుట్టు విప్పుతామని తేల్చి చెప్పారు. మిమ్మల్ని మేం చూసుకుంటాం... నోరెత్తొద్దునకిలీ మద్యం దందా బండారం మొత్తం బయట పెడతామని జయచంద్రారెడ్డి, జనార్ధన్రావు బెదిరించడంతో పెదబాబు, చినబాబు షాక్ తిన్నారు. దాంతో తమకు సమాచారం ఇచ్చిన మధ్యవర్తుల ద్వారానే జయచంద్రారెడ్డి, జనార్దన్రావులతో రాయబేరాలు సాగించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేయాల్సి వచ్చిందని.. పార్టీ పరువు బజారున పడటంతో సస్పెండ్ చేయాల్సి వచ్చిందని వారిద్దరినీ బుజ్జగించేందుకు యత్నించారు. ‘మీరు ఇప్పుడు మొత్తం గుట్టు విప్పితే మీకూ నష్టం... మాకూ నష్టం... పార్టీకి పూర్తిగా నష్టం.. ఎవరికి ప్రయోజనం ఉండదు..’ అని సర్ది చెబుతున్నట్లు తెలుస్తోంది. ‘అయినా అధికారంలో ఉన్నది మన ప్రభుత్వమే. ఇటీవల అన్నమయ్య జిల్లా ములకలచెరువులో పట్టుబడిన నకిలీ మద్యం బాటిళ్లు కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా చూస్తాం. మీవరకు రానివ్వకుండా పక్కదారి పట్టిస్తాం.. మీరేమీ ఆందోళన చెందవద్దు..’ అని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులు తెరవెనుక ఉండండి... తరువాత మళ్లీ పార్టీలో క్రియాశీలం కావచ్చని సూచించినట్లు సమాచారం. దాంతో జయచంద్రారెడ్డి, జనార్దన్రావు మెత్తబడినట్లు తెలుస్తోంది. అంతే కాదు.. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం లేదని వీడియో ద్వారా ప్రకటించాలని జనార్దన్రావును చినబాబు ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేసు నుంచి బయటపడేస్తామని ప్రభుత్వ పెద్దల నుంచి హామీ లభించడంతో జనార్ధన్రావు సోమవారం సాయంత్రం వీడియో విడుదల చేసినట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.పెదబాబులో గుబులు.. చినబాబు బెంబేలు!టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, జనార్ధన్రావు హెచ్చరికలతో పెదబాబు, చినబాబు బెంబేలెత్తుతున్నారు. ఏడాదిగా రాష్ట్రవ్యాప్తంగా తాము వ్యవస్థీకృతం చేసిన నకిలీ మద్యం రాకెట్ వెనుక గూడుపుఠాణి బట్టబయలవుతుందని ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ మొత్తం దందా చినబాబు అండదండలతోనే సాగుతోంది. ఆయనకు సన్నిహితుడైన అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేత ఈ నకిలీ మద్యం రాకెట్కు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో సీనియర్ ప్రజాప్రతినిధులను కాదని మరీ ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ కీలక నేతకు సన్నిహితులైన జయచంద్రారెడ్డి, జనార్ధన్రావు, కట్టా సురేంద్రబాబు ఆఫ్రికా దేశాల్లో అనుసరించే నకిలీ మద్యం తయారీ విధానాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. చినబాబు ఆదేశాలతో ఆయనకు సన్నిహితులైన టీడీపీ నేతలను వ్యాపార భాగస్వాములుగా చేసుకున్నారు. రాష్ట్రాన్ని ప్రాంతాలవారీగా పంచుకుని నకిలీ మద్యం దందా సాగిస్తున్నారు. జయచంద్రారెడ్డి, జనార్దన్రావు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ యూనిట్లను నెలకొల్పారు. అన్నమయ్య జిల్లాకు చెందిన కీలక నేత రాయలసీమలో... నర్సీపట్నానికి చెందిన సీనియర్ నేత కుటుంబం ఉత్తరాంధ్రలో... రెవెన్యూ, పోలీసు అధికారులపై దాడులకు దిగిన చరిత్ర కలిగిన ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో... బాపట్ల జిల్లా కీలక నేత ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో.. జయచంద్రారెడ్డి స్వయంగా రాయలసీమలో నకిలీ మద్యం రాకెట్ను నిర్వహిస్తున్నారు. టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాలు, బార్లలో యథేచ్ఛగా నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారు.కరకట్ట బంగ్లా వాటా 30 శాతం...ఏడాదిగా రాష్ట్రంలో జరుగుతున్న మద్యం విక్రయాల్లో మూడో వంతు నకిలీనేనని ఎక్సైజ్ శాఖ అనధికారికంగా వెల్లడిస్తుండటం గమనార్హం. ఆ విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.5,280 కోట్ల మేర నకిలీ మద్యం అమ్మకాలు సాగాయి. మొత్తం అమ్మకాల్లో నకిలీ మద్యం వాటాను 50 శాతం దాటించాలన్నది ఈ సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రానున్న నాలుగేళ్లలో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టేందుకు పన్నాగం వేసింది. అందులో 30 శాతం అంటే రూ.12 వేల కోట్లు కరకట్ట నివాసానికి కమీషన్గా చెల్లించాలన్నది ఒప్పందం. ప్రాంతాలవారీగా పర్యవేక్షిస్తున్న టీడీపీ సీనియర్ నేతలకు 50 శాతం, మద్యం దుకాణాలు, బార్లు నిర్వహిస్తున్న టీడీపీ సిండికేట్కు 20 శాతం వాటా దక్కనుంది. -
సీజేఐ గవాయ్పై దాడిని ఖండించిన వైఎస్ జగన్
తాడేపల్లి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. సీజేఐ గవాయ్పై సుప్రీం కోర్టులో జరిగిన దాడి కలవరపరచే విషయం అంటూ ట్వీట్ చేశారు. ‘‘ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదు,. దేశంలోని అత్యున్నత న్యాయ సంస్థ గౌరవానికే ఇది అవమానకరమైనది. మనం అందరం కలిసి రాజ్యాంగ బద్ద సంస్థల సమగ్రతను కాపాడుదాం’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పేర్కొన్నారు.The disgraceful attack on Hon’ble Chief Justice of India, Shri B.R. Gavai Ji, in the Supreme Court is deeply disturbing and must be unequivocally condemned. This is not only an assault on an individual but an affront to the dignity of our highest judicial institution. We must…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2025 -
విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే: తాటిపర్తి చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో రక్షిత తాగునీటిని అందించలేని ప్రభుత్వ నిర్లక్ష్యమే.. విద్యార్ధుల మరణానికి కారణమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ ఓ బాధ్యత లేని విద్యాశాఖ మంత్రి కాగా.. చంద్రబాబు ఓ అసమర్థ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు విద్యార్ధులు చనిపోయారని.. ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని తేల్చి చెప్పారు.చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో విద్యావ్యవస్ధలో ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడుతో స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పించి విద్యాలయాలను దేవాలయాలుగా మార్పు చేస్తే... కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూపాయి కాగితం ఖర్చుపెట్టిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఇది ప్రభుత్వ చేతగానితనానికి, అసమర్థతకు నిదర్శనమని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..మొద్దు నిద్రలో విద్యా వ్యవస్థ..రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొద్దునిద్రలో ఉంది. ప్రభుత్వరంగ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు అధ్వాన్న స్ధితిలోకి నెట్టబడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మరణ మృదంగాన్ని తలదన్నే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జూలై నెల నుంచి ఇప్పటివరకు దాదాపు 11 మంది గిరిజన బిడ్డలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయారు. గిరిజన తల్లిదండ్రులు కొండా కోనలను దాటించి గురుకుల పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించారు.విద్యావంతులుగా వస్తారనుకుని గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు విగత జీవులుగా వస్తున్న పిల్లలను చూసి గుండె పగులేలా రోదిస్తున్నారు. ఇది ప్రభుత్వ చేతగాని తనానికి, అసమర్థతకు నిదర్శనం. ఈ పిల్లల మరణాలు కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. చంద్రబాబు నాయుడు అసమర్థ పాలన చేస్తున్నాడని చెప్పడానికి, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనికిరాడు అని చెప్పడానికి జరుగుతున్న ఉదంతాలే నిదర్శనం.వైఎస్ జగన్ హయాంలో దేవాలయాలుగా విద్యాలయాలుఒక కుటుంబంలో రేపటి తరాన్ని నడిపించాల్సిన బిడ్డలను అర్ధాంతరంగా పోగొట్టుకోవడం అత్యంత బాధాకరం. జూలై నెలలో పదో తరగతి చదువుతున్న పిల్లవాడు చనిపోతే.. ఇవాళ వారం రోజుల్లోనే ఇద్దరు బాలికలు కేవలం సరైన తాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో మృత్యువాత పడడం దురదృష్టకరం. వైఎస్ జగన్ హయాంలో విద్యాలయాలను దేవాలయాలుగా మార్చారు.ప్రతి విద్యార్థి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలని ప్రతి స్కూల్లో ఫర్నీచర్, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి మంచినీళ్ల సరఫరా, డిజిటల్ క్లాస్ రూములు, ఇంగ్లిషు, తెలుగు మీడియంలో ముద్రించిన పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిషు మీడియం, టోఫెల్ విద్య అందించడంతో పాటు నూతనంగా తరగతి గదులు నిర్మించి వసతులు ఏర్పాటు చేశారు. నాడు-నేడు ద్వారా దాదాపు 50 వేల స్కూళ్లను అభివృద్ధి చేసి ప్రజలకందించారు. అదే విధంగా అమ్మఒడి పథకంలో రూ.2 వేలు మినహాయించి.. స్కూళ్లు అభివృద్ధి, మౌలిక వసతులను మెరుగుపర్చడానికి వాడితే ఆ రోజు అర్ధజ్ఞానం కలిగిన లోకేష్ అమ్మఒడి అర్ధవడి అయిందని మాట్లాడారు.హోం మంత్రి భోజనంలోనే బొద్దింకఇవాళ లోకేష్ కూడా అమ్మఒడిలో రూ.2వేలు కట్ చేసి... స్కూళ్ల అభివృద్ధికి, వసతుల కల్పనకు ఎక్కడైనా రూపాయి కాగితం వెచ్చించారా లోకేష్ ? ఏ స్కూల్ లోనైనా నాణ్యమైన భోజనం అందించారా? రాష్ట్ర ప్రజలు ఆలోచన్ చేయాలి. సాక్షాత్తూ ఈ రాష్ట్ర హోంమంత్రి భోజనం చేస్తున్న కంచంలోనే బొద్దింక ఆహారంలో వచ్చింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ 14 నెలల కూటమి పాలనలో అనేక సందర్భాల్లో కలుషిత ఆహారం తిని పెద్ద సంఖ్యలో పిల్లలు ఆసుపత్రిలో చేరిన సందర్బాలు ఉన్నాయి. ఇది చేతకాని పాలనకు పరాకాష్ట కాదా? ఇది అసమర్థ ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు కావాలా? 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రికి పరిపాలన మీద ఏమాత్రం శ్రద్ధ ఉందో ఈ ఘటనలు చూస్తేనే అర్ధం అవుతుంది.కేవలం చంద్రబాబు కుమారుడు అనే ఒకే ఒక్క అర్హత తప్ప.. ఏ అర్హతా లేని లోకేష్ని విద్యాశాఖ మంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టడంతోనే విద్యావ్యవస్థకు చెదలు పట్టడం మొదలైంది. వ్యవస్థను కొద్ది, కొద్దిగా చెదలు తిన్నట్టుగా కూటమి నేతలు తింటున్నారు. దీనంతటికీ కారణం మంత్రి నారాయణ. నారాయణ కాలేజీల సంస్థల చైర్మన్గా తన సంస్థలను పెంచి పోషించాలన్న దురుద్దేశమే కారణం.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు స్కూళ్లకు తరలిపోయారు. కారణం ప్రభుత్వమే ప్రైవేటు విద్యను ప్రోత్సహించడమే. ప్రభుత్వ విద్యాలయాలను నాశనం చేయడమే. వసతులు లేని ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్ధులు ఎందుకు ఉంటారు? అదే కారణంతో 5 లక్షల మంది ప్రైవేటుకు మారిపోయారు.చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారమివ్వాలిచనిపోయిన విద్యార్ధుల కుటుంబాలకు కనీసం రూ.25 లక్షలకు తగ్గకుండా ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే మొద్దు నిద్రను వీడాలి. లోకేష్ ఫ్యాక్టరీలు, కంపెనీల తీసుకుని రావడానికి ఢిల్లీ వెళ్లాడని పెద్ద, పెద్ద అక్షరాలతో అచ్చు వేస్తున్న పచ్చ మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలను రాష్ట్రానికి, దేశానికి తెలియజేయాలి. ఇది ఒక వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే? ఇంత చేతకాని వారికి పరిపాలించే అర్హత ఉందా? లోకేష్ ఏ రోజైనా ఈ ఏడాది కాలంలో ఈ సంస్కరణలను తీసుకురాగలిగాను, ఈ అభివృద్ధి చేశాను అని చెప్పగలిగాడా?ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్, వసతి దీవెన పెండింగ్, అమ్మఒడి పావు ఒడి చేశాడు. ఒక ఏడాది స్కీమ్ ఎగరగొట్టాడు. పేర్లు మార్చినంత మాత్రాన పనిమంతుడు కాలేవన్నవిషయాన్ని లోకేష్ గుర్తుంచుకోవాలి. పనితనం చూపించాలి. అడవిబిడ్డల ఘోషను, పాపాన్ని మూటగట్టుగుంటున్నావన్న విషయం గుర్తించుకో లోకేష్. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ కు సున్నామార్కులు వస్తాయి. తన శాఖలో సక్రమంగా పనిచేయలేని లోకేష్ అన్ని శాఖలను సంస్కరించాలని కుతూహలపడతాడు.మంచినీళ్లవ్వకుండా విలాసాలకు మంచినీళ్లలా ఖర్చుగిరిజన బిడ్డల మరణాలు కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. ఒకే ఒక వసతి గృహం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో దాదాపు 135 మంది ఆసుపత్రికి వెళ్లారు. వారిలో నుంచి దాదాపు 25 మందికి పచ్చకామెర్లు ఉన్నట్లు తేలింది. దీనికి కారణం ఆ హాస్టల్ లో ఆర్వో ప్లాంట్ నిర్వహించకుండా, సురక్షిత మంచినీటిని అందించలేకపోవడమే కారణం. చివరికి చిన్నపిల్లలకు మంచినీళ్లు కూడా అందించలేని ఈ చేతకాని ప్రభుత్వం... గొప్పలు చెప్పడానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని సభలు పెట్టడానికి, వందలసార్లు హైదరాబాద్ కు స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి మాత్రం విచ్చలవిడిగా ఖర్చుచేస్తోంది.ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కొలుకుల స్కూల్, పుల్లలచెరువు స్కూల్లో ఉపాధ్యాయులు లేరు. 170 మంది ఉపాధ్యాయులు వెళ్లిపోతే.. 26 మంది మాత్రమే వచ్చారని విద్యాశాఖ అధికారులకు చెప్పాను. అయినా స్పందన లేదు. లోకేష్ శాఖలో నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన వసతీ లేదు. చివరకు నాణ్యమైన భోజనం కూడా అందివ్వలేని అసమర్థ మంత్రిగా లోకేష్ నిలబడ్డం ఖాయం. 611 మంది చదువుతున్న స్కూళ్లో మంచినీళ్ల ఆర్వో ప్లాంట్ నిర్వహణకు ప్రభుత్వం వద్ద డబ్బులేదా? ఈ డబ్బంతా ఎటు పోతుంది. కూటమి ప్రభుత్వం తెచ్చిన రూ.2.11 లక్షల కోట్ల డబ్బుంతా ఎవడి జేబులోకి పోయింది. దోచుకున్న మద్యం డబ్బు ఎటు పోతుంది.వీధుల్లో వరదలా మద్యం- ఆదాయం మాత్రం టీడీపీ నేతల జేబుల్లో..ఇవాళ ఇబ్రహీంపట్నంలో కూడా నకిలీ మద్యం రాకెట్ పట్టుబడింది. అతను కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడే. రోడ్ల మీద, వీధుల్లో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుంది.. రాష్ట్ర ఖజనాకు మాత్రం ఆదాయం రావడం లేదని ఆరా తీస్తే... చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో బయటపడ్డ నకిలీ మద్యమే అసలు కారణం. ఇవాళ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న ప్రతీ మూడు సీసాల్లో ఒకటి నకిలీ మద్యం సీసాయే. నకిలీ మద్యం తాగి వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. కల్తీ భోజనం తిని వందలాది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కచ్చితంగా మారాలని డిమాండ్ చేస్తున్నాం.ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కోసం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నారా లోకేష్ కు హితవు పలుకున్నాం. చాతగాని, చేవలేని ఎంత మంది నాయకులున్నా.. సమర్ధత గలిగిన వైయస్.జగన్ నాయకత్వం కాలిగోటికి సరిపోరు అన్న విధంగా కూటమి పాలన సాగుతోంది. వైయస్.జగన్ ఒంటరిగా 151 సీట్లు గెలిచి, ఎక్కడా ఏ రకమైన రాజకీయ ఒత్తిడి లేకుండా ప్రతి గ్రామంలో నూతన భవనాలను నిర్మించి, నూతన వ్యవస్థలను నెలకొల్పారు. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే. .వాటిని కూడా కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెడుతోంది. వ్యవస్థల్లోకి ప్రైవేటు వ్యక్తులు వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇవాళ విద్యాశాఖను చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది. విద్యాశాఖలో ప్రైవేటు వ్యవస్థ ఉండడం వల్ల ఏ విధంగా ప్రభుత్వవిద్యావ్యవస్ధ నాశనం అవుతుందో.. అదే విధంగా వైద్య వ్యవస్థ కూడా అలాగే మారబోతుందని వైయస్సార్సీపీ పదే పదే గళం వినిపిస్తుంది.చంద్రబాబు పాలనలో నీరుగారుతున్న వ్యవస్థలుచివరగా 40 ఏళ్ల అనుభవం కలిగిన నాయకుడు అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతిలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా నీరుగారిపోతున్నాయి. 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి.. ఈ రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థలు ఏదైనా ఉన్నాయంటే.. నకిలీ మద్యాన్ని భారీ ఎత్తున తయారు చేసే ఫ్యాక్టరీలే తప్ప.. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేనే లేదు అని తాటిపర్తి చంద్రశేఖర్ తేల్చి చెప్పారు.విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ..ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాలలో గ్రానైట్ క్వారీలున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీనరేజీ వసూళ్లుకు మంచి విధానం తెస్తే మాపై విషం కక్కారు. ఇవాళ కూటమి ప్రభుత్వం సీనరీ వసూళ్లు చేసే బాధ్యతను ఏ ఏం ఆర్ అనే ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. ఈ సంస్థ ప్రతీ రోడ్డులోనూ చెక్ పోస్టులు పెట్టి, ఏ మట్టి ట్రాక్టర్, ఇసుక లారీ, మట్టి బండి వెళ్లినా వాళ్లకు కప్పం కట్టాల్సిందే.వీళ్ల పేమెంట్ చేసేది రెండేళ్లలో రూ.1135 కోట్లు అని వాళ్ల కరపత్రిక ఈనాడులో రాశారు. అందులోనే గత ఏడాది సీనరేజ్ రూ.450 కోట్లు అని రాశారు. అలాంటప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి ? ఒక కంకర లారీ లోడ్ కు రూ.5010 చెల్లించాలి. ఈ విధంగా దాదాపు రూ.6 కోట్లు ఒక రోజుకు వసూలు చేస్తున్నారు. వారికి ఏడాదికి వస్తున్న ఆదాయం ఎంత? వారు కడుతున్న అమౌంట్ ఎంత ? గతంలో ఎవరైనా ఇంటికి మట్టి తోలుకుంటే డబ్బులు కట్టాల్సిన పనిలేదు. ఇవాళ ఏ ఏం ఆర్ సంస్థకు మాత్రం కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. -
కల్తీ మద్యం రాకెట్తో ప్రభుత్వ పెద్దలకు లింకులు: జూపూడి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బయటపడ్డ కల్తీ మద్యం రాకెట్ లింకులు కూటమి ప్రభుత్వంలోని పెద్దల వరకు ఉన్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో కల్తీ మద్యం దందాను సాగించేందుకు తెలుగుదేశం నేతలు ప్లాన్ చేసుకున్నారని, దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మద్యం పాలసీలో మార్పులు చేశారని అన్నారు.కల్తీ మద్యాన్ని కూటమి నేతల చేతుల్లో ఉండే ప్రైవేటు మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా ఏర్పాటు చేసే బెల్ట్షాప్ల ద్వారా పెద్ద ఎత్తున చెలామణి చేయాలనే కుట్ర దీని వెనుక దాగి ఉందని అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మద్యం విక్రయాల్లో ప్రతి మూడు బాటిళ్ళలో ఒకటి కల్తీ మద్యంగా తేలిందంటే, ప్రభుత్వ పెద్దల అండ లేకుండానే ఇంత పెద్ద ఎత్తున ఈ దందా జరుగుతోందా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీలనే అధికార తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుయాయులతో కల్తీ మద్యం తమారు చేయిస్తున్నారనే ఆరోపణలకు ఆయన ప్రజలకు వివరణ ఇవ్వాలి. అన్నమయ్య జిల్లా మొలకలచెరువు సమీపంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ పరిశ్రమే వెలుగుచూసింది. ఈ నకిలీ మద్యం మాఫియాను నడిపించేది సాక్షాత్తు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులేనని బయటపడింది.ఆఫ్రికా నుంచి ఆంధ్రాకు మద్యం మాఫియావిదేశాల నుంచి సంస్థలను ఆహ్వానిస్తున్నాం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తాం, ఉపాధి కల్పిస్తామని ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్లు చెబుతుంటారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకున్న టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందే ఏపీలో కల్తీ మద్యం రాకెట్ను ఆఫ్రికా నుంచి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆఫ్రికాలో మద్యం తయారీ, చెలామణిలో సంపాధించిన అనుభవాన్ని ఏపీలో వినియోగించి, కోట్లు సంపాదించేందుకు వ్యూహం పన్నారు. టీడీపీ పెద్దల ఆశీస్సులతో ఆ పార్టీ నాయకుడు జనార్ధన్ నాయుడు ఇందుకు అంతా రంగం సిద్ధం చేశాడు. ఈ దందాకు అనుగుణంగానే ఏపీలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం పాలసీ నిబంధలను మార్పు చేసింది.గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం విక్రయాలను ప్రైవేటు వారికి ఇచ్చేందుకు నిర్ణయించారు. లిక్కర్ షాప్లు అన్నీ లాటరీ అంటూ హంగామా చేసి, మొత్తం దుకాణాలను అధికార తెలుగుదేశం వారి చేతుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి నేతలే మద్యం సిండికేట్లను ఏర్పాటు చేశారు. అనధికారికంగా పర్మిట్ రూంలను నిర్వహించారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఊరూరా బెల్ట్ షాప్లను ఏర్పాటు చేశారు. ఆ తరువాత తమ కల్తీ లిక్కర్ దందాను ప్రారంభించారు. ఎక్కడికక్కడ కల్తీ మద్యం డెన్లను, జిల్లాల్లో మద్యం గోడౌన్లను ఏర్పాటు చేసుకుని నిత్యం వేల సంఖ్యలో కల్తీ లిక్కర్ బాటిళ్ళను చెలామణి చేయడం ప్రారంభించారు. అక్రమంగా జరుగుతున్న ఈ వ్యాపారం ద్వారా దండుకుంటున్న సొమ్మును వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు.ప్రజల ప్రాణాలతో చెలగాటంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి పెద్ద ఎత్తున మరణాలు జరిగాయంటూ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు విష ప్రచారం చేశాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో, నేరుగా డిస్టిలరీల నుంచి వచ్చే మద్యాన్ని విక్రయిస్తూ, జవాబుదారీతనంతో విక్రయాలు చేసినా కూడా ఈ తప్పుడు ప్రచారం కొనసాగించారు. వారు చెప్పిన మరణాలు నిజమా అని చూస్తే, ఎక్కడా ఇది వాస్తవం అనేందుకు ఆధారాలు లేవు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు తాను తక్కువ రేటుకే క్వాలిటీ మద్యం అందిస్తాను అంటూ హామీలు ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా ఫ్యాక్టరీలను పెట్టి తయారు చేస్తున్న కల్తీ మద్యంపై ఆయన ఏం సమాధానం చెబుతారు?ఇతర రాష్ట్రాల నుంచి స్పిరిట్ తీసుకువచ్చి, రంగు కలిపి, నకిలీ మద్యం లేబుళ్ళతో ఏకంగా మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్షాప్లకు పంపిణీ చేస్తున్నారు. రకరకాల కల్తీ మద్యం బ్రాండ్లను తయారు చేసి, అందమైన పేర్లతో చెలామణి చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా ఈ కల్తీ మద్యం బ్రాండ్లే కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా మీడియా ముఖంగా ప్రదర్శిస్తున్నాం. 'సుమో, షాట్, బెంగుళూరు బ్రాందీ, ఛాంపియన్, కేరళా మాల్ట్...' ఇలా అనేక రకాల పేర్లతో మార్కెట్లో ఈ కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.ఈ కల్తీ మద్యం రాకెట్ ఎంత వేగంగా విస్తరించిందీ అంటే అన్నమయ్య జిల్లాలో తయారవుతున్న ఈ మద్యంను కోస్తా ప్రాంతంలో కూడా అమ్మేందుకు ఏకంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం గోడవున్లో నిల్వ చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులే ఈ రాకెట్ను పట్టుకున్నారు. పట్టుబడని కల్తీ మద్యం గోడవున్లు ఇంకా ఎన్ని ఉన్నాయో అనే అనుమానం కలుగుతోంది. ప్రమాదకరమైన ఈ కల్తీ మద్యాన్ని తాగేవారు అతి త్వరగా అనారోగ్యంతో మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ప్రజలు ఏమైపోయినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. కేవలం తన ధనదాహంకు ప్రజల ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. -
ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడతారా బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఉద్యోగులను చంద్రబాబు మోసం చేయటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో అమలు చేసిన కార్యక్రమాలు, చంద్రబాబు మేనిఫెస్టోని చూపుతూ ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబూ.. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపి తీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా?. నడిరోడ్డుమీద నిలబెడతారా?.. ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వాళ్లు ఆశగా ఎదురుచూడడం, చివరకు ఉసూరు మనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప, ప్రజల మీద, ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలమీద, ఉద్యోగస్తుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవటం, మీకు అలవాటే. మీరుపెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డుమీదకు వస్తున్నారు. చంద్రబాబూ.. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు...అధికారంలోకి వచ్చిన వెంటనే IR అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన PRC అంటూ ఊదరగొట్టారు. మరి PRC సంగతి ఏమైంది?. మేం అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే ఉద్యోగులకు IR ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే మేం PRC వేసి, దానికి ఛైర్మన్నుకూడా నియమిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, IR ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశ పూర్వకంగా PRC ఛైర్మన్ని వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు...న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు. ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిగురించి ప్రస్తావించడంలేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4డీఏలు మొత్తం పెండింగ్. దసరా పండుగకు డీఏలు క్లియర్ అవుతాయని ఉద్యోగస్తులందరూ ఎంతో ఎదురు చూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తోంది. కాని, ఇచ్చే ఆలోచన మీకున్నట్టు అనిపించడం లేదు. CPS/GPSలను పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కాని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా దీనిమీద రివ్యూచేశారా?..మా ప్రభుత్వ హయాంలో CPSకు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగులకోసం GPS తీసుకు వచ్చాం. ఇప్పుడు అదే విధానంలోకి కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు వెళ్తున్నాయి. మీరు.. OPSను తీసుకువస్తామన్నారు. మాకంటే గొప్పగా చేస్తామన్నారు. కాని ఏమీ చేయకపోగా, ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా, మీలో ఏ మాత్రం చలనం లేదు...ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన PRC బకాయిలు, పెండింగ్ డీఏలు, GPF, APGLI, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్క్యాష్ మెంట్ లీవులు… వీటి కింద దాదాపు రూ.31వేల కోట్ల బకాయిలు పెట్టారు. తమకు రావాల్సినవాటికోసం ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నా ఒక్కపైసా కూడా ఇవ్వకపోవడంతో, వారంతా నరకయాతన అనుభవిస్తున్నారు...ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ప్రతినెలా జీతాలకోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ మేం ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. ఆరోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. ఇవాళ అలాంటి దారుణమైన పరిస్థితులు లేకపోయినా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీదాన్ని అమలు చేయడంలేదు...మీరు అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతాలు రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామంటూ హామీ ఇచ్చి, కుట్రపన్ని, వారి పొట్టకొట్టి, ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకూ మేలు చేస్తాం అని, వారినీ ఇప్పుడు రోడ్డు ఎక్కేలా చేశారు. విలేజ్ క్లినిక్కులూ, పీహెచ్సీలు మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారు. జీరో వేకెన్సీతో ప్రజలకు తోడుగా ఉండే వైద్య శాఖను రోడ్డున పడేశారు...మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేశాం. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను కూడా మొదలుపెట్టాం. అర్హులైన 10,117 మందిని గుర్తించాం. వీరిలో 3,400 మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా మా హయాంలోనే ఇచ్చాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు ముగిసినా కూడా ఇప్పటి వరకు అపాయింట్ మెంట్లు ఇవ్వకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు..@ncbn గారూ.. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపితీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? నడిరోడ్డుమీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి,… pic.twitter.com/CFIDuN9w7W— YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2025..అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తిపలుకుతూ, వారికోసం ఆప్కాస్ను తీసుకు వచ్చి దళారీ వ్యవస్థను అంతం చేశాం. దాదాపు లక్ష మందికి సకాలానికే ఎలాంటి కత్తిరింపులు లేకుండా వారి జీతాలను, క్రమం తప్పకుండా ప్రతినెలా ఒకటోతారీఖునే ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆప్కాస్ను రద్దుచేసి మళ్లీ దళారీ వ్యవస్థను తీసుకువస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారందరికీ జీతాలు పెంచాం. మేం రాకమునుపు వరకూ, వీరి జీతాల చెల్లింపుల బిల్లు నెలకు రూ.1,100 కోట్లు అయితే, మేం వచ్చిన తర్వాత దాన్ని రూ.3వేల కోట్లకు పెంచాం. ..ఉద్యోగులకు EHS కింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్ కార్డులున్నా దానివల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. EHS కోసం ప్రభుత్వం తనవాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్నికూడా విడుదలచేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా?. చంద్రబాబుగారూ.. దాదాపు రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు. వారికిచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. -
మీ పరిపాలన సిగ్గుచేటు
సాక్షి, అమరావతి: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంటు పాడవ్వడంతో కలుషిత నీరు తాగి పచ్చ కామెర్లు సోకి నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలవ్వడం తనను కలచి వేస్తోందన్నారు.611 మంది చదువుతున్న పాఠశాలలో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా.. మీరు, ఇంత మంది మంత్రులు ఉండి గాడిదలు కాస్తున్నారా? అంటూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి పిల్లల ఆరోగ్యం పట్ల, బడుల్లో వసతుల పట్ల శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ చంద్రబాబు గారూ.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంటు పాడవ్వడంతో కలుషిత నీరు తాగడం మూలాన, పచ్చ కామెర్లు సోకి నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు.మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పరిపాలనకు ఇది సిగ్గుచేటు వ్యవహారం కాదా? 611 మంది చదువుతున్న స్కూల్లో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా? ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? ముఖ్యమంత్రిగా మీరు, ఇంత మంది మంత్రులు ఉండి గాడిదలు కాస్తున్నారా? గిరిజన బాలికలు, పేద పిల్లలు అంటే అంత చులకనా? ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించినా మీరు కళ్లు మూసుకున్న మాట వాస్తవం కాదా? ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే చంద్రబాబు గారూ.⇒ పేదల తల రాతను మార్చేది చదువేనని మేం నమ్మి, అమ్మ ఒడి సహా ఎన్నో సంస్కరణలు తెస్తూ నాడు–నేడు పనుల ద్వారా ఆ స్కూళ్లను దేవాలయాలుగా మార్చాం. కరెంటు, లైట్లు, ఫ్యాన్లు, ఫరి్నచర్, డిజిటల్ ప్యానెళ్లు, తాగు నీరు, మరుగు దొడ్లు సహా 11 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాం. పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా రక్షిత తాగు నీటి కోసం ఆర్వో ప్లాంట్లు పెట్టాం. మా ప్రభుత్వ హయాంలో నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం.మీరు అధికారంలోకి వచ్చాక, మీ సుపుత్రుడు విద్యా శాఖను చేపట్టిన తర్వాత, ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం వారితో చేతులు కలిపి.. క్రమంగా ప్రభుత్వ విద్యా సంస్థలను నాశనం చేసుకుంటూ వచ్చారు. మా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు వచి్చన మంచి పేరు ప్రతిష్టలను దెబ్బ తీశారు. ఇంగ్లిష్ మీడియంను, సీబీఎస్ఈ నుంచి ఐబీదాకా ప్రయాణాన్ని, టోఫెల్ క్లాసులు, స్కూలు పిల్లలకు ట్యాబులు, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ను, రోజుకో మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం గోరుముద్ద.. వీటన్నింటినీ నాశనం చేశారు. మీ దుర్మార్గాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు తగ్గిపోయారు. ⇒ ఆర్వో ప్లాంట్లు రిపేరు వస్తే వాటిని పట్టించుకునే నాథుడే లేడు. హాస్టళ్లలో విషాహారం కారణంగా మరణాలు సంభవించడమో, ఆస్పత్రుల పాలవ్వడమో పరిపాటిగా మారింది. ఇలాంటి మీ నిర్లక్ష్యమే ఇవాళ కురుపాం గురుకుల పాఠశాలలో గిరిజన బాలికల ఉసురు తీసింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా కళ్లు తెరిచి.. వెంటనే పిల్లల ఆరోగ్యం పట్ల, బడుల్లో వసతుల పట్ల శ్రద్ధ పెట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కాబట్టి. -
స్టాక్స్పై అవగాహన ఉంది.. కానీ ఇన్వెస్ట్ చేయం
సాక్షి, అమరావతి: దేశీయ స్టాక్ సూచీలు నూతన గరిష్టస్థాయిల దిశగా దూసుకుపోతున్నా.. భారతీయులు అత్యధికమంది ఈ అంశాలను గమనిస్తున్నారేగానీ, పెట్టుబడి పెట్టడం ద్వారా వాటి ప్రతిఫలాలను పొందడం లేదు. స్టాక్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజాగా నిర్వహించిన ఇన్వెస్టర్ సర్వే–2025 ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అత్యధికమందికి స్టాక్మార్కెట్పై అవగాహన ఉన్నా వాస్తవంగా పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని ఈ సర్వే వెల్లడించింది. స్టాక్మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పథకాల్లో కనీసం ఒకదానిపైనైనా 63 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ 9.5 శాతం మంది మాత్రమే ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది.దేశవ్యాప్తంగా 400 పట్టణాలు, వెయ్యికిపైగా గ్రామాల్లో 90 వేల కుటుంబాలపై సెబీ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. 21.3 కోట్లమందికి స్టాక్మార్కెట్పై అవగాహన ఉన్నా ఇన్వెస్ట్ చేసింది మాత్రం 3.2 కోట్ల మందే. పట్టణ ప్రాంతాల్లో 15 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఆరుశాతం మంది మాత్రమే ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా ఢిల్లీలో 20.7 శాతం మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత గుజరాత్లో 15.4 శాతం మంది పెట్టుబడి పెడుతున్నారు.పెట్టుబడి రక్షణకే అధిక ప్రాధాన్యతభారతీయులు తక్కువ నష్టభయం ఉండే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గుచూపుతున్నారు. 80 శాతం మంది ఎటువంటి నష్టభయం లేని సురక్షితమైన పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకే ముందుకొస్తున్నారు. పెట్టుబడిదారుల్లో 79.7 శాతం మంది తక్కువ నష్టభయం ఉన్నవాటిని, 14.7 శాతం మంది కొద్దిగా రిస్క్ ఉన్నవాటిని ఎంపిక చేసుకుంటుండగా.. 5.6 శాతం మంది ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈక్విటీల్లో కూడా అత్యధికంగా సగటున 6.7 శాతం మంది ఇన్వెస్ట్ చేస్తుంటే షేర్లలో 5.3 శాతం మంది పెట్టుబడి పెడుతున్నారు.ఈక్విటీ పెట్టుబడుల్లో ఉండే సంక్లిష్ట పరిస్థితులపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో వెనుకాడుతున్నట్లు 74 శాతం మంది తెలిపారు. వీటిపై కొద్దిగా అవగాహన కలి్పస్తే పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన పెంచుకుని పెట్టుబడులు పెట్టడానికి యువతీయువకులు ముందుకొస్తున్నారు. ఏటా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోందని, వచ్చే ఏడాది నుంచి పెట్టుబడులు పెడతామని 22 శాతం మంది చెప్పడం ఒక శుభసంకేతమని సెబీ ఆ నివేదికలో పేర్కొంది. -
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
సాక్షి, అమరావతి, విజయపురిసౌత్: నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. ఇది దక్షిణ తమిళనాడు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. అలాగే ఏపీ తీరప్రాంతం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వచ్చే వారం రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని, కొద్దిచోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొన్నారు. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సోమవారం ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.మిగిలిన జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడిరంలో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పల్నాడు జిల్లా గుట్లపల్లిలో 6, నెల్లూరు జిల్లా జలదంకిలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.సాగర్లో మూతపడ్డ క్రస్ట్గేట్లు..నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద తగ్గటంతో అధికారులు ఆదివారం క్రస్ట్గేట్లు మూసివేశారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 63,398 క్యూసెక్కులు వచ్చి చేరటంతో ఇక్కడ నుంచి 55,537 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు 10,040, ఎడమ కాలువకు 8,896, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,901, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాలువకు 300 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 305.8030 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
రేపు చలో విజయవాడ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోగా.. బోధనేతర పనులతో వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సమస్యలపై ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడింది. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆగస్ట్లో జిల్లా స్థాయిలో ఆందోళనలు చేపట్టినా స్పందించలేదని.. అందుకే ఈనెల 7న ‘చలో విజయవాడ’ పేరుతో మహా ధర్నా చేస్తున్నట్లు ప్రకటించింది. సమాఖ్య చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర్లు ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతున్నా ఇప్పటివరకు విద్యా సంస్కరణలపై నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్విస్ నిబంధనలు తెస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ ఎన్క్యా‹Ùమెంట్ వంటి అనేక డిమాండ్లు పరిష్కరించలేదని.. ఐఆర్ ఇవ్వలేదని, పీఆర్సీ నియమించలేదని వాపోయారు.గత ప్రభుత్వం తెచి్చన హైసూ్కల్ ప్లస్లను పూర్తిగా నిర్విర్యం చేశారని.. అక్కడి పోస్టులను సర్ప్లస్ చేసి గ్రామీణ బాలికలకు ఉన్నత విద్యను దూరం చేశారని ధ్వజమెత్తారు. తాము ఆరోగ్య బీమా చెల్లిస్తున్నా వైద్యం చేయించుకోలేకపోతున్నామని మండిపడ్డారు. ఉపాధ్యాయులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని.. సర్విసులో ఉంటూ చనిపోయిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టలేదని విమర్శించారు. అందుకే ఈనెల 7న ఉద్యమించబోతున్నట్లు తెలిపారు. పలు ఉపాధ్యాయ సంఘాల మద్దతుఈనెల 7న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్ టీచర్స్ అసోయేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ కుమార్రెడ్డి, గెడ్డం సుధీర్, స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు తమ్మినాన చందనరావు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సైతం ధర్నాకు మద్దతు పలికింది. -
డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు
సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె తప్పదని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. విజయవాడలో కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులతో ఉద్యమ కార్యాచరణ గురించి రౌండ్టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. అక్టోబర్ 14న వర్క్ టు రూల్ పాటిస్తామని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ చైర్మన్ పి.సుదర్శన్రెడ్డి వెల్లడించారు.విద్యుత్ సంస్థల్లో 27 వేల మంది కాంట్రాక్టు కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. 1999 ముందు నియామకమైన ఉద్యోగులకు మాత్రమే పెన్షన్ సౌకర్యం ఉందని, తర్వాత వారికి పెన్షన్ సౌకర్యం లేదన్నారు. ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు నగదు రహిత మెడికల్ కార్డు ఇవ్వాలన్నారు. జేఎల్ఎం గ్రేడ్–2 ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ సరీ్వస్ రూల్స్ వర్తింప చేయాలని సమావేశంలో తీర్మానించింది. -
ఆఫ్రికా టు ఆంధ్రా!
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో అంతా తానై చక్రం తిప్పుతున్న ఓ కీలక నేత అండతోనే నకిలీ మద్యం మాఫియా రాష్ట్రంలో రెక్కలు విప్పుకుందని తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలో నకిలీ మద్యం తయారీ రాకెట్ సూత్రధారిగా భావిస్తున్న తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డికి ఆ ‘కీలక’ నేతతో ఉన్న సంబంధం వల్లే ఇంత భారీ స్థాయిలో యథేచ్ఛగా ప్లాంట్ స్థాపించినట్లు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును ప్రకటించే వరకు ఆయనకు రాజకీయంగా పెద్ద గుర్తింపు లేదు. అయితే అంతకు కొద్ది రోజుల ముందు ‘మద్యం’ వ్యాపారానికి సంబంధించిన పలు విషయాలను ఈయన ‘కీలక’ నేతతో చర్చించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీ అధికారంలోకి వస్తే స్థానికంగా మద్యం తయారీతోపాటు గోవాలో ఖాయిలా పడిన మద్యం పరిశ్రమను లీజుకు తీసుకుని వ్యాపారం చేయొచ్చని.. భారీ స్థాయిలో డబ్బు ఆర్జించవచ్చని లెక్కలతో సహా చెప్పడంతోనే టికెట్ ఇచ్చారన్న ప్రచారం ఉంది. అందువల్లే టీడీపీని ఎంతో కాలం నమ్ముకుని ఉన్న, ఆ పార్టీలో గట్టి పట్టున్న నేతగా పేరున్న శంకర్ యాదవ్ను కాదని చివరి క్షణంలో జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయక ముందు నుంచి సౌత్ ఆఫ్రికాలో జయచంద్రారెడ్డి మద్యం వ్యాపారంలో ఉన్నారని ఆయన వర్గీయులే చెబుతున్నారు. ఆ అనుభవంతో రాష్ట్రంలో ‘మద్యం’ వ్యాపారం చేసే ‘స్కెచ్’ను ‘కీలక’ నేతకు ఇచ్చినట్లు సమాచారం. మొన్న ములకలచెరువులో బట్టబయలైన నకిలీ ప్లాంట్ తీరుతెన్నులు, ఇన్నాళ్లూ సాగించిన అక్రమ వ్యాపారం తీరు చూస్తుంటే ‘కీలక’ నేత అండదండలు లేకుండా ఇంత భారీగా దందా నడిపించడం అసాధ్యమని ఎక్సైజ్, పోలీసు వర్గాల్లో సైతం చర్చ జరుగుతోంది. ఈ నకిలీ మద్యం దందా సవ్యంగా సాగేందుకు ‘కీలక’ నేత ఆదేశాలతో అన్నమయ్య జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతతో జయచంద్రారెడ్డి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ములకలచెరువు తరహాలో విజయవాడ ప్రాంతంలో ఒకటి, కర్ణాటకలో కూడా మరో నకిలీ మద్యం ప్లాంట్ నడుస్తున్నట్లు సమాచారం. అయితే శనివారం నుంచి వీటిని తాత్కాలికంగా బంద్ చేసినట్లు తెలిసింది.జనార్దనరావును ముందు పెట్టి దందాకళ్లకు కనిపిస్తున్న ఆధారాలు, ఈమధ్య కాలంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే ఈ కేసులో ఏ–1గా కేసు నమోదైన అద్దేపల్లె జనార్దనరావును ముందు పెట్టి.. జయచంద్రారెడ్డి కథ నడిపించారని స్పష్టమవుతోంది. జయచంద్రారెడ్డిది ములకలచెరువు సొంత మండలం. విజయవాడకు చెందిన జనార్దనరావుతో జయచంద్రారెడ్డికి కాలేజీ రోజుల నుంచే స్నేహం ఉంది. తిరుపతిలో చదువుకుంటున్న రోజుల్లో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం జయచంద్రారెడ్డి సొంత మండలంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ప్రారంభించే స్థాయికి వచ్చింది. జయచంద్రారెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. చంద్రబాబు చేతుల మీదుగా బి–ఫాంను స్వీకరించే సమయంలోనూ జనార్దనరావు పక్కనే ఉన్నాడు. పైగా ఆ సమయంలో జనార్దనరావు చంద్రబాబుతో చాలా సేపు మాట్లాడినట్లు టీడీపీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం రాకెట్పై ఆ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. టీడీపీలో చేరిన రోజు జయచంద్రారెడ్డితో జనార్దనరావు (ఫైల్) అధికారమే అండగా..ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ నడిపేందుకు ఎక్కడో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంకు చెందిన వ్యక్తికి సాధ్యం అవుతుందా? ఒకవేళ సాధ్యమైనా ఇంతటి ప్రమాదకరౖమెన నకిలీ మద్యం తయారీకి బలమైన స్థానికుల సహకారం లేకుండా సాహసం చేయగలడా? ఇలాంటి పనికి స్థానికులు భవనాలను లీజుకు ఇస్తారా? జయచంద్రారెడ్డి అధికార టీడీపీ ఇన్చార్జి కావడం, ‘కీలక’ నేత అండతో, అధికార బలంతో, వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చని ఇక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఒకవేళ జయచంద్రారెడ్డికి సంబంధం లేకుంటే నకిలీ మద్యం వ్యాపారం ఏ ఇబ్బంది లేకుండా సాగడానికి సహకరించినదెవరో అధికారులు ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదు? నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించడం కూలీలకో, అధికారం లేని వ్యక్తులకో సాధ్యమా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే జయచంద్రారెడ్డి పీఏ రాజేష్ నకిలీ మద్యం కేసులో ఐదో నిందితుడు కావడం ఆయన పాత్ర ఉందని నిర్ధారిస్తోంది. సాధారణ వ్యక్తి అయిన రాజేష్కు మద్యం దుకాణం నిర్వహించే స్థాయి లేదు. పాల వ్యాను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమతా లేదు. ఈ లెక్కన కీలక సూత్రధారుల్లో జయచంద్రారెడ్డి కూడా ఒకరని స్పష్టమవుతోంది. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని జయచంద్రారెడ్డి మాత్రం ఓ వీడియో విడుదల చేయడం తెలిసిందే.ఆ మంత్రికి భయం పట్టుకుందినకిలీ మద్యం తయారీ రాకెట్లో టీడీపీ నేతల ప్రమేయం లేదని ఇంత వరకు ప్రభుత్వం కానీ, టీడీపీ వర్గాలు కాని ఖండించలేదు. శుక్రవారం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాయలసీమకు చెందిన ఓ మంత్రి ముందుండి పరిస్థితిని చక్కబెడుతున్నారని సమాచారం. టీడీపీ నేతల ప్రమేయం బయటకు వస్తే దాని ప్రభావం తనపై పడుతుందన్న భయంతో ఆ మంత్రి మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ మంత్రి 2సార్లు ములకలచెరువులో జయచంద్రారెడ్డి ఇంటికి అనధికారికంగా వచ్చారని స్థానిక టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. -
పట్టు వీడని వైద్యులు.. రెండో రోజు కొనసాగిన రిలే దీక్షలు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) వైద్యులు, ప్రభుత్వం మధ్య చర్చలు కొలిక్కి రావడం లేదు. పీజీ మెడికల్ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా క్లినికల్ విభాగంలో 20 శాతం కొనసాగించాలని వైద్యులు భీష్మించారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఆదివారం కూడా చర్చలు విఫలమయ్యాయి. ఏటా ఇన్ సర్విస్ కోటాపై పునఃసమీక్షించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2030 వరకూ అన్ని క్లినికల్ కోర్సులకు 20 శాతం కోటా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు.తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పీహెచ్సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. ఎనీ్టఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న ఈ దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన వైద్యులు పాల్గొంటున్నారు. తమ డిమాండ్లపై స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. పీహెచ్సీ వైద్యులు 20 ఏళ్లు పదోన్నతులు లేకుండా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.టైమ్ బౌండ్ ప్రమోషన్లు, ఇన్–సర్విస్ పీజీ కోటాను పునరుద్ధరించడం, నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూలవేతనాన్ని గిరిజన భత్యంగా చెల్లించడం, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేల భత్యం మంజూరు చేయడం, స్థానికత్వం–పట్టణ వైద్యాధికారుల సర్విస్ అర్హత సమస్యలను పరిష్కరించడం తమ ప్రధాన డిమాండ్లని పేర్కొన్నారు. నిరసనలో అసోసియేషన్ నేతలతో పాటు, వందలాది మంది వైద్యులు పాల్గొన్నారు. కాగా, టైమ్ బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, అయినప్పటికీ వైద్యులు అంగీకరించలేదని సంక్షేమ కమిషనర్ వీరపాండియన్ ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
నకిలీ మద్యంపై సీఎం సరికొత్త డ్రామా
సాక్షి, అమరావతి : అన్నమయ్య జిల్లాలో బయట పడిన నకిలీ మద్యం రాకెట్లో టీడీపీ కీలక నేతల ప్రమేయం బట్టబయలు కావడంతో సీఎం చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెర లేపారు. ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించి, పార్టీకి సంబంధం లేని వారిని బాధ్యులను చేయాలని చూసినా.. అది బెడిసి కొట్టింది. దీంతో టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తద్వారా ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, కింది స్థాయిలో ఏదో జరిగిందని ప్రజల దృష్టి మళ్లించేలా కొత్త కుతంత్రం రచించారు.‘కల్తీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. భారీ యంత్రాలతో వివిధ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యాన్ని ఈ యూనిట్లో తయారు చేస్తూ ‘కీలక’ నేత అండతో వారు ఉమ్మడి చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ రాకెట్ బయట పడటంతో అమరావతి పెద్దలు తమకేమీ సంబంధం లేనట్లు.. స్థానిక నాయకులే కారణమంటూ డ్రామాలకు పూనుకోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
నకిలీ మద్యం సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా ములకలచెరువు వద్ద భారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్నది ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దలేనని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత దందానేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ నేత సురేంద్రనాయుడు పాత్రధారి మాత్రమేనని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటపెట్టాలని.. సీఎం చంద్రబాబు ఈ దందాకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!?..ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా హైవే పక్కనే ఓ పరిశ్రమను తలపించేలా నకలి మద్యాన్ని ఎలా తయారు చేయగలరు? ఈ ప్రభుత్వ పెద్దలు గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేంటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్న దుర్మార్గాలేంటి? నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!? ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్తో రోజుకు 30 వేల క్వార్టర్ బాటిళ్లు తయారుచేసి, మద్యం షాపులకు, బెల్టు షాపులకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.పైగా.. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తే.. పెద్దఎత్తున లిక్కర్ స్కాం జరుగుతోందని కూటమి పార్టీలు, ఎల్లో మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయి. మరి ఇవాళ ములకలచెరువులో భారీగా బయటపడ్డ నకిలీ మద్యం గురించి టీడీపీ కూటమి ప్రభుత్వం, ఈ ఎల్లో మీడియా ఏం సమాధానం చెబుతాయి? అప్పుడు మద్యం తాగినవాళ్లందరికీ లివర్లు, కిడ్నీలు పాడైపోయాయని అన్నారుగా.. ఇప్పుడు పాడవవా? ఇక నిన్న అరెస్టైన సురేంద్రనాయుడు ఏ నాయకుడికి ముడుపులిస్తే ఈ దందా జరుగుతుందో సమాధానం చెప్పాలి.ములకలచెరువులోనే ఐదేళ్లలో రూ.500 కోట్ల దందా..ఇదిలా ఉంటే.. ఈ నకిలీ మద్యంతో కూడిన క్వార్టర్ బాటిల్ తయారీకి రూ.8 లేదా రూ.9 ఖర్చవుతుంది. అదే బాటిల్ను బెల్టుషాపుల వారికి రూ.110కి అమ్మితే వాళ్లు రూ.130కి అమ్ముతున్నారు. అంటే ఒక్కో బాటిల్ మీద రూ.100 ఆదాయం వస్తోంది. ఒక్క ములకలచెరువులో ఒక రోజులో 30 వేల బాటిళ్ల నకిలీ మద్యం తయారవుతుండగా రూ.30 లక్షల అక్రమార్జన జరుగుతోంది. ఇలా ఏడాదికి రూ.100 కోట్లు, ఐదేళ్లలో రూ.500 కోట్లు దండుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలో ఇంకెన్ని చోట్ల నకిలీ మద్యం తయారుచేస్తున్నారో ప్రజలకు తెలియాలి. -
ఏం స్కెచ్ వేశావ్ చంద్రబాబూ?: వైఎస్ జగన్
2024–25 ఆర్థిక ఏడాది మొదటి ఐదు నెలల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం రూ.6,782.21 కోట్లు. ప్రైవేట్ మద్యం షాపులు, ఊరూరా బెల్ట్ షాపులు, ఇతరత్రా విచ్చలవిడి అమ్మకాల నేపథ్యంలో 2025–26 ఆర్థిక ఏడాది మొదటి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే. అంటే కేవలం 3.10 శాతం వృద్ధి మాత్రమే. ఏటా సహజంగా వచ్చే 10 శాతం పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, నకిలీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా చంద్రబాబూ? –మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం మాఫియా వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. నకిలీ మద్యం తయారీ కేసులో అసలు సూత్రధారులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు స్కెచ్ వేసి, రాత్రికి రాత్రే కేసు మార్చేశారని ఆరోపించారు. టీడీపీ నేతల సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం న్యాయమేనా? అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ చంద్రబాబు గారూ.. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకానీ, లిక్కర్ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకూ వీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంది.⇒ మీ లిక్కర్ సిండికేట్లకు, గ్రామ స్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, నకిలీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు. ఉద్దేశ పూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే. బెల్టుషాపులు టీడీపీ వాళ్లవే. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు టీడీపీ వాళ్లవే. అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే. వాళ్లు తయారు చేస్తారు.. ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే, మీ షాపుల ద్వారా, మీ బెల్టుషాపుల ద్వారా అమ్ముతారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.⇒ లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి, విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారు. మార్ట్లు పెట్టారు. తిరిగి మళ్లీ ఇల్లీగల్ బెల్టుషాపులు తెరిచి ప్రతి వీధిలోనూ పెట్టారు.రాత్రి పగలు అనే తేడా లేకుండా లిక్కర్ అమ్మడం మొదలు పెట్టారు. ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే, కాగ్ నివేదికల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం రూ.6,782.21 కోట్లు కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో, విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం 3.10% వృద్ధి మాత్రమే. ఎక్కడైనా ప్రతి ఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, నకిలీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా అర్థం?⇒ నకిలీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి. కానీ విచారణ, దర్యాప్తు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. కారణం.. ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలు అయిన మీ టీడీపీ వాళ్లే. దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఇవాళ ములకలచెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ, బెల్టుషాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి, నకిలీ బాటిళ్లను పట్టుకునే వారు. కానీ అలా జరగలేదు.⇒ పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్య నేత, టీడీపీ ఇన్ఛార్జి కనుసన్నల్లో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తే, వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు, టీడీపీ ఇన్ఛార్జి అనుచరుడి మద్యం దుకాణం వైపు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడలేదు. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తి పైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి, మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారు. దీనికి కారణం ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే. మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం న్యాయమేనా? -
ఇదేం తీరు.. గాడిదలు కాస్తున్నారా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మన్యం జిల్లాలో పచ్చకామెర్లతో విద్యార్థినుల మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబూ.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం కూడా లేదు’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు.‘‘పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వోప్లాంటు పాడవడంతో కలుషిత నీరు తాగడం మూలాన, పచ్చకామెర్లు సోకి 4 రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పరిపాలనకు ఇది సిగ్గుచేటు వ్యవహారం కాదా?. 611 మంది చదువుతున్న స్కూల్లో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా?. ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా?’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు...ముఖ్యమంత్రిగా మీరు, ఇంతమంది మంత్రులు ఉండి గాడిదలు కాస్తున్నారా?. గిరిజన బాలికలు, పేద పిల్లలు అంటే అంత చులకనా?. ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించినా మీరు కళ్లుమూసుకున్నమాట వాస్తవం కాదా?. ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే చంద్రబాబూ. పేదల తలరాతను మార్చేది చదువేనని మేం నమ్మి, అమ్మ ఒడి సహా ఎన్నో సంస్కరణలు తెస్తూ నాడు-నేడు పనుల ద్వారా ఆ స్కూళ్లను దేవాలయాలుగా మార్చాం. కరెంటు, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, డిజిటల్ ప్యానెళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు సహా 11 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాం...పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా రక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు పెట్టాం. మా ప్రభుత్వ హయాంలో నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక, మీ సుపుత్రుడు విద్యాశాఖను చేపట్టిన తర్వాత, ప్రైవేటు వ్యక్తుల లాభాలకోసం వారితో చేతులు కలిపి, క్రమంగా ప్రభుత్వ విద్యాసంస్థలను నాశనం చేసుకుంటూ వచ్చారు. మా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన మంచి పేరు ప్రతిష్టలను దెబ్బతీశారు...ఇంగ్లిషు మీడియంను, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని, టోఫెల్ క్లాసులు, 8వ తరగతి వారికి ట్యాబులు, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ను, రోజుకో మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద వీటన్నింటినీ నాశనం చేశారు. మీ దుర్మార్గాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు తగ్గిపోయారు. ఆర్వో ప్లాంట్లు రిపేరు వస్తే వాటిని పట్టించుకునే నాథుడే లేడు. హాస్టళ్లలో విషాహారం కారణంగా మరణాలు సంభవించడమో, ఆస్పత్రుల పాలవడమో పరిపాటిగా మారింది. ఇలాంటి మీ నిర్లక్ష్యమే ఇవాళ కురుపాం ఆశ్రమ పాఠశాలలో గిరిజన బాలికల ఉసురు తీసింది...దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా కళ్లు తెరిచి, వెంటనే పిల్లల ఆరోగ్యం పట్ల, వారి బడుల్లో వసతులపట్ల శ్రద్ధపెట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కాబట్టి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు..@ncbn గారూ.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం కూడా లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వోప్లాంటు పాడవడంతో కలుషిత నీరుతాగడం మూలాన, పచ్చకామెర్లు సోకి 4రోజుల వ్యవధిలోనే… pic.twitter.com/Dq0pocjxe6— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2025 -
ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది.కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. చెట్ల కింద ఉండకూడదని.. అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కోనసీమ(జి) ముమ్మడివరంలో 79.7మిమీ, పల్నాడు(జి) గుట్లపల్లిలో 60మిమీ, నెల్లూరు(జి) జలదంకిలో 33.5మిమీ వర్షపాతం నమోదైంది. -
‘భారీ కల్తీ మద్యం డంప్ దొరికితే ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలు అక్రమార్జన కోసం చేసే ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయని.. కల్తీ మద్యం పరిశ్రమే బయటపడిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారంలోకి రావడానికి కూటమి నేతలు చెప్పిందేమిటీ? చేస్తున్నదేమిటీ? అంటూ నిలదీశారు.అక్టోబర్ 3న ములకల చెరువులో భారీ కల్తీ మద్యం డంప్ స్వాధీనం చేసుకున్నారు. భారీ కల్తీ మద్యం డంప్ దొరికితే ఎల్లో మీడియాకు కనిపించడం లేదా.?. గత ప్రభుత్వ హయాంలో రూ.3,500 కోట్ల కుంభకోణం జరిగిదంటూ అనేక మందిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు వ్యాఖ్యలు గుర్తు చేసుకోండి. అధికార దుర్వినియోగపరుస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. కూటమి ఆరోపణల్లో నిజముంటే కోర్టులో ఆధారాలు ఎందుకు చూపించలేదు?. మూలకల చెరువులో కల్తీ మద్యం డంప్ దొరికితే కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. రోజుకి 30 వేల క్వార్టర్ బాటిళ్లు తయారు చేసే డంప్ దొరికితే ఏం చేస్తున్నారు?’’ అంటూ సతీష్రెడ్డి మండిపడ్డారు. -
క్షీణిస్తున్న పక్షుల జనాభా
దేశంలో పక్షుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. ప్రధానంగా గడ్డి భూములు, చిత్తడి నేలల్లో కనిపించే పక్షులు 50 శాతం వరకూ తగ్గినట్లు సిటిజన్ సైంటిస్ట్ పోర్టల్ ఈ–బర్డ్ అధ్యయనంలో వెల్లడైంది. ఈ–బర్డ్ ప్లాట్ ఫాం ద్వారా 30 వేల మంది పక్షి ప్రేమికులు దేశంలో పక్షుల కదలికలను గమనిస్తూ వాటి ఫొటోలు తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ సమాచారాన్నంతా క్రోడీకరించి విశ్లేíÙంచగా దేశంలోని పక్షుల జనాభా, వాటి వైవిధ్యం ప్రమాదకర రీతిలో పడిపోతున్నట్లు తేలింది.స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ –2023 నివేదిక ప్రకారం దేశంలో 942 పక్షి జాతులున్నట్లు గుర్తించారు. తాజా అధ్యయనంలో వీటిలో 204 చాలా సంవత్సరాలుగా, మరో 142 జాతులు ప్రస్తుతం తగ్గుతున్నట్లు తేలింది. మొత్తంగా 346 పక్షి జాతులు కనుమరుగయ్యే దశలో ఉన్నట్లు తేలింది. 29 శాతం జాతులు స్థిరంగా ఉండగా, 11 శాతం కొంచెం పెరిగాయి. తగ్గుతున్న వాటిలో 178 జాతులను కాపాడేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని సిటిజన్ సైంటిస్టులు సూచిస్తున్నారు. –సాక్షి, అమరావతితగ్గుతున్న జాతుల్లో వలస వచ్చేవే ఎక్కువగా ఉన్నాయి. సైబీరియా తదితర ప్రాంతాల నుంచి శీతాకాలంలో భారత్లోని పలు ప్రాంతాలకు వచ్చే పక్షుల రాక తగ్గిపోయింది. చిత్తడి నేలలు, గడ్డి భూములు, చెరువులు, పొదలు కుంచించుకుపోవడంతో వలస పక్షుల ఆవాసాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాల్లోనే 50 శాతం పక్షులు తగ్గిపోయినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రంలో 557 పక్షి జాతులు ఉన్నట్లు గుర్తించగా వాటిలో 50 శాతం తగ్గాయి. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో తరచూ కనిపించేవి ఇప్పుడు మాయమయ్యాయి.గడ్డి భూములు, చిత్తడి నేలలు పక్షుల ఆవాసాలు. అవి అధిక శాతం నాశనం కావడంతో ఆహారం దొరకడం లేదు. పర్యావరణంలో వస్తున్న పెను మార్పులు, పెరిగిన కాలుష్యం, ఆక్రమణల కారణంగా చిత్తడి నేలలు, గడ్డి భూములు తగ్గిపోయాయి. పక్షుల ఆవాసాలు చెదిరి వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ భూముల్లో ఉండే కీటకాలు, చిన్న జంతువులను తినే పక్షులు 25 శాతం కన్నా ఎక్కువ తగ్గాయి. పండ్లు, తేనె, తామరలు తినేవి మాత్రం స్థిరంగా ఉన్నాయి.తగ్గిపోతున్న కొన్ని పక్షులు1. బట్టమేక పక్షి (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) 2. పిచ్చుకలు (హౌస్ స్పారో) 3. పాలపిట్ట (ఇండియన్ రోలర్) 4. నల్ల మెడ కొంగ (బ్లాక్–నెక్డ్ స్టార్క్) 5. గద్దలు (ఈగల్)6. అమూర్ ఫాల్కన్ (వలస పక్షి) 7. సైబీరియన్ కొంగ (సైబీరియన్ క్రేన్) 8. నల్లతోక పక్షి, బ్లాక్–టైల్డ్ గాడ్విట్ 9. నార్తర్న్ పింటెయిల్ 10. ఫ్లెమింగోస్అతక్షణ చర్యలు అవసరంపక్షి జాతుల సంరక్షణకు తక్షణం చర్యలు తీసుకోకపోతే మనుగడకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణానికీ పెనుముప్పు అని చెబుతున్నారు. గడ్డి భూములు, చిత్తడి నేలలను కాపాడడం, స్థానికులతో కలిసి ఈ కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో పక్షుల వైవిధ్యం వేగంగా తగ్గిపోతోందని బెంగుళూరు నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్కి చెందిన జీవ వైవిధ్య నిపుణుడు వివేక్ రామచంద్రన్ స్పష్టం చేశారు. -
డ్రైవర్ అన్నలకు బాబు బురిడీ
సాక్షి, అమరావతి: ‘అంతన్నాడింతన్నాడే గంగరాజు...’ అని ఉత్తరాంధ్రలో ఓ జానపద గీతం బాగా పాపులర్. ప్రస్తుతం చంద్రబాబు పనితీరూ అలానే ఉంది. మేనిఫెస్టోలో అంత చేస్తాం.. ఇంత చేస్తాం.. అని హామీలు ఇచ్చిన ఆయన తీరా అధికారంలోకి రాగానే మరోసారి తన ట్రేడ్ మార్కు శైలిలో బురిడీ కొట్టిస్తున్నారు. ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ అని చెప్పి తీరా అమలులోకి వచ్చేసరికి కొందరికే అంటూ టోకరా వేశారు. మేనిఫెస్టోను యథాతథంగా ఏనాడూ అమలు చేయని చంద్రబాబు మరోసారి తన ట్రాక్ రికార్డును కొనసాగించారు. ఈసారి ఆయన్ను నమ్మి మోసపోయిన బాధితుల జాబితాలో పేద డ్రైవర్లు కూడా చేరారు. మొదటి ఏడాది పథకాన్ని అమలు చేయకుండా పూర్తిగా ఎగవేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. రెండో ఏడాది సరికొత్త మోసానికి తెరతీసింది. దరఖాస్తు చేసేందుకే అవకాశం లేకుండా నిబంధనల చట్రం బిగించి, ఏకంగా 80 శాతం మందికి పథకం అందకుండా చేసింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం డ్రైవర్లకు ఎంతో చేసిందని చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా ద్వారా సొంత డబ్బా కొట్టుకోవడం విస్మయ పరుస్తోంది. ఇవ్వని హామీ నెరవేరుస్తున్నామని గొప్పలు చెబుతుండటం నివ్వెరపోయేలా చేస్తోంది.ఇద్దరూ బురిడీ బాబులేప్రతి ఎన్నికల ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించే చంద్రబాబు.. 2024 ఎన్నికల ముందు అదే పన్నాగాన్ని అమలు చేశారు. బ్యాడ్జి ఉన్న ప్రతి డ్రైవర్కు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామని టీడీపీ–జనసేన–బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మాటలతో బూరెలు వండటంలో తన తండ్రిని మించిపోయేలా లోకేశ్ హామీలు గుప్పించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్థిక సహాయం పథకం లబ్ధిదారులయ్యేందుకు బ్యాడ్జి ఉన్న డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారని ఆయన 2023లోనే ప్రకటించారు. అంటే కనీసం 13 లక్షల మందికి ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన చెప్పారు. ఈ రెండేళ్లలో మరో రెండు లక్షల మంది బ్యాడ్జి పొంది ఉంటారని రవాణా శాఖ వర్గాలే చెబుతున్నాయి. అంటే ప్రస్తుతం 15 లక్షల మంది అర్హులు ఉన్నారని లెక్క తేలుతోంది. ఆ ప్రకారం 15 లక్షల మందికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.2,250 కోట్లు ఆర్థిక సహాయం చేయాలి.ఇదీ టీడీపీ మేనిఫెస్టో బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్కు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న భాగం ఏకంగా 80 శాతం ఎగవేతమేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేస్తామన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా... ‘డ్రైవర్ అన్నల సేవలో..’ అంటూ కేవలం రూ.436 కోట్లే ఇచ్చింది. అందుకోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కింది. బ్యాడ్జి ఉంటే చాలు పథకం వర్తింపజేస్తామన్న చంద్రబాబు.. తీరా ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చే సరికి ఏకంగా 18 నిబంధనలు పెట్టారు. తద్వారా బ్యాడ్జి ఉన్న డ్రైవర్లు కనీసం దరఖాస్తు చేసేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు, రేషన్ సరుకులు డెలివరీ వాహనాలు.. ఇలా లక్షలాది మందికి పథకం అందకుండా ఆంక్షలు విధించారు. లోకేశ్ చెప్పినట్టు 2023లోనే 13 లక్షల మంది బ్యాడ్జి ఉన్న వారు ఉంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన ‘డ్రైవర్ అన్నల సేవలో’ పథకాన్ని 2.9 లక్షల మందికే పరిమితం చేసి, ఏకంగా 12 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఈ 2.9 లక్షల మందిలో కూడా తుదకు ఎంత మందికి ఎగ్గొడతారో అని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో.. పథకానికి సంబంధించి అర్హత నిబంధనల పేరుతోనే ఏకంగా 10 లక్షల మందికి కోత విధించారు. ఇక దరఖాస్తు చేసిన 3,21,531 మందికి కూడా పథకాన్ని వర్తింప చేయలేదు. వారిలో కూడా 2,90,669 మందినే అర్హులుగా ప్రకటించారు. దాంతో ఈ పథకం కింద ఆర్థిక సహాయం రూ.436 కోట్లకే సరిపెట్టారు. ఇస్తామని ఎన్నికల్లో చెప్పింది రూ.2,250 కోట్లు కాగా, ఇచ్చింది కేవలం రూ.436 కోట్లే. అంటే ఇచ్చిన హామీలో 80 శాతం కోత విధించారన్నది స్పష్టమవుతోంది. అదీ చంద్రబాబు మార్కు బురిడీ అంటే అని మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేశారు. తొలి ఏడాది పూర్తిగా ఎగవేత మేనిఫెస్టోను అమలు చేయకుండా అడ్డదారులు వెతకడంలో తనది మాస్టర్ మైండ్ అని చంద్రబాబు మరోసారి నిరూపించారు. బ్యాడ్జి ఉన్న డ్రైవర్లు అందరికీ ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్న ఆయన.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అంటే 2024లో ఆ పథకం ఊసే ఎత్త లేదు. తొలి ఏడాది డ్రైవర్లకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదు. ఆ విధంగా ఒక ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది పథకం అమలు చేస్తామంటూనే ఏకంగా 18 నిబంధనలు విధించి అర్హుల జాబితాలో భారీగా కోత విధించారు. మేనిఫెస్టోను సక్రమంగా అమలు చేయకుండా మోసం చేయడంలో చంద్రబాబు ట్రేడ్ మార్క్ అంటే ఇదే మరి. ఇప్పటికే భారీగా ఆదాయం కోల్పోతున్న ఆటో డ్రైవర్లుచంద్రబాబు ప్రభుత్వ విధానాలతో ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇక్కట్లలో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఆదాయం భారీగా పడిపోయింది. ఆటోల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకం ద్వారా అయినా కాస్త ఊరట లభిస్తుందని ఆశించిన డ్రైవర్లకు నిరాశే మిగిలింది. ఏకంగా 10 లక్షల మందిని ఈ పథకానికి అనర్హులుగా చేసి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పథకాన్ని సక్రమంగా అమలు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంమేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేయడం అంటే ఏమిటో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు చేతల్లో చూపించింది. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సి కేబ్, రేషన్ వాహనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ‘వైఎస్సార్సీపీ వాహన మిత్ర’ పథకాన్ని అందించింది. మొదటి ఏడాది అని ఎగవేయలేదు. చివరి ఏడాది ఎన్నికల నియమావళి అని సాకుతో తప్పించుకోలేదు. అధికారంలోకి రాగానే పథకం అమలు చేసింది. కోవిడ్ సమయంలోనూ క్రమం తప్పకుండా అందించింది. చివరి ఏడాది ఎన్నికల నియమావళి అమలులోకి రావడానికి ముందే వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ఆర్థిక సహాయం అందించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంటే ఏమిటో వైఎస్ జగన్ చేతల్లో చూపించారని డ్రైవర్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టే కుట్ర
సాక్షి, విశాఖపట్నం: విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టేసి.. ప్రజలకు ప్రధాన అవసరాల్ని దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో కుట్ర పన్నుతోందని ‘పీపుల్స్ ఫర్ ఇండియా’ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పేరుతో కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రజారోగ్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ ప్రజారోగ్య వేదిక, పీపుల్ ఫర్ ఇండియా విశాఖపట్నం చాప్టర్ ఆధ్వర్యంలో స్థానిక అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శనివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. విలువైన ప్రజాధనాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసే చంద్రబాబు వైఖరిపై ప్రజా ఉద్యమాలు చేపట్టాలని తీర్మానించారు.ఐదేళ్ల తర్వాత పదవిలో ఉంటామన్న గ్యారెంటీ లేదు ఐదేళ్ల తర్వాత గెలుస్తామో లేదో అన్న గ్యారెంటీ అధికారంలో ఉన్న వాళ్లకి లేదు. ఐదేళ్లలోనే 50 ఏళ్ల రాజకీయ జీవితంలో సంపాదించాల్సిందంతా సంపాదించేయాలన్న తొందరతోనే రాజకీయ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు బలవుతున్నారు. కాబట్టి.. ప్రజలే ముందుకు రావాలి. నిరసనల్ని ఉద్యమంగా మార్చి.. ప్రజావ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. – ఎంవీఎస్ శర్మ, మాజీ ఎమ్మెల్సీప్రజాధనాన్ని ప్రైవేట్కివ్వడమే సంపద సృష్టా? సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీప్రజాధనాన్ని ప్రైవేట్కివ్వడమే సంపద సృష్టా? సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది కేజీహెచ్కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐకార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..! వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్వో ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది కేజీహెచ్కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐకార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..! వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్వో -
9న వైఎస్ జగన్ అనకాపల్లి పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 7, 8, 9 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు వివరాలను శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.8వ తేదీన భీమవరం(పెద అమిరం)లో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటుకు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోవడంలో భాగంగా భీమబోయినపాలెంలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను మాజీ సీఎం వైఎస్ జగన్ సందర్శిస్తారు. -
టీడీపీ నాయకులే కల్తీ లిక్కర్ డాన్లు: గడికోట శ్రీకాంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ నాయకులు కల్తీ మద్యం డాన్లుగా మారి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులే పారుతోందని, టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారీని పరిశ్రమ స్థాయికి తీసుకువెళ్ళారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కొత్త మద్యం పాలసీ ముసుగులో విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు కేటాయించి, గ్రామగ్రామాన బెల్ట్ షాప్లను ఏర్పాటు చేయించి, ఈ కల్తీ మద్యాన్ని వాటి ద్వారా విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. నాణ్యమైన మద్యం పేరుతో సీఎం చంద్రబాబు చెబుతున్నది ఈ కల్తీ మద్యం గురించేనని, ప్రజల ప్రాణాలను బలిపెట్టి, టీడీపీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే..డిస్టిలరీల స్థాయిలో కల్తీ మద్యం తయారీ యూనిట్లునాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి తెలుగుదేశం నాయకుల జేబులు నింపడమే ధ్యేయంగా కల్తీ మద్యం తయారీకి సహకారం అందిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అండదండలతో టీడీపీ నాయకులే కల్తీ లిక్కర్ తయారు చేసి మందు బాబుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే లిక్కర్ అమ్మకాలు జరిపితే దానిపై విషప్రచారం చేసిన చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంతో వారు రెచ్చిపోయి కల్తీ లిక్కర్ తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.తాజాగా మదనపల్లె సమీపంలోని తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో శుక్రవారం కల్తీ మద్యం రాకెట్ వ్యవహారం బయటపడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకంగా ఒక డిస్టిలరీ యూనిట్ స్థాయిలో రోజుకు 15వేల కేసుల కల్తీ లిక్కర్ తయారు చేసి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఈ కేసులో మండల స్థాయి టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడుతోపాటు ఎనిమిది మంది కూలీలను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు.కానీ ఈ కల్తీ మద్యం రాకెట్ వెనుక రింగ్ మాస్టర్, సూత్రధారుల పేర్లపై ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించడం లేదు. అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతను చంద్రబాబు, నారా లోకేష్లే కాపాడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా ప్రతి రెండు జిల్లాలకు ఒక యూనిట్ నెలకొల్పి లిక్కర్ దందా సాగిస్తున్నారు. తాగడానికి మంచినీళ్లు లేని గ్రామాలున్నాయి కానీ, మద్యం సరఫరా జరగని గ్రామాలు ఏపీలో లేవు. వేళలతో సంబంధం లేకుండా 24 గంటలూ ఇంటికే మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర అంగళ్లలో సైతం మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో చెప్పాల్సిన పనిలేదు.లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్సీపీపై బురదచల్లారువైయస్సార హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగిందని ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు చేయని కుటిల ప్రయత్నం లేదు. ఆధారాలు లేకపోయినా వైయస్సార్సీపీ నాయకులను, వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులను కక్షపూరితంగా అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టులు చేసి వేధించడమే ధ్యేయంగా లిక్కర్ కుంభకోణం సృష్టించారు. మాజీ ఐఏఎస్లు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితోపాటు ఎంపీ మిధున్రెడ్డిలను అక్రమంగా అరెస్ట్ చేశారు. తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి అరెస్టులు చేసినా ఆ కేసులు కోర్టుల్లో నిలబడలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వరుసగా చీవాట్లు తింటోంది. కూటమి ప్రభుత్వ మోసాలతో ప్రజలు విసిగిపోయారు. 16 నెలల పాలనలోనే తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుంది.స్పిరిట్ తో కల్తీ మద్యం తయారీరాష్ట్రంలో కల్తీ మద్యం రాకెట్ దందాను టీడీపీ మద్యం సిండికేట్ వ్యవస్థీకృతం చేసింది. ప్రభుత్వ పెద్దల అండదండలతో జిల్లాలు, రీజియన్ల వారీగా పంచుకుని మరీ కల్తీ మద్యం దందాను సాగిస్తోంది. నాడు కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్పిరిట్ను కొనుగోలు చేయడానికి కేంద్రం ఇచ్చిన ఆదేశాలను టీడీపీ మద్యం సిండికేట్ తమ దందాకు అవకాశంగా మలుచుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని స్పిరిట్ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను అక్రమంగా కొనుగోలు చేస్తోంది. ఆ విధంగా భారీగా కొనుగోలు చేసిన స్పిరిట్తో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు.అందుకోసం కల్తీ మద్యం యూనిట్లలో యంత్ర సామగ్రిని తెప్పించి పక్కాగా భారీ ప్లాంట్లనే నెలకొల్పారు. అక్రమంగా సేకరించిన స్పిరిట్ను డైల్యూట్ (పలుచన) చేసి అందులో కారమెల్, కలర్డ్ ఫ్లేవర్లు (రంగు నీళ్లు) కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పిస్తున్నారు. ఆ కల్తీ మద్యాన్ని బాట్లింగ్ చేసి బ్రాండెడ్ మద్యంగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.ఆ కల్తీ మద్యాన్ని తాగించడానికి గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగి బెల్ట్ షాపులు తెరుస్తున్నారు. లిక్కర్ షాపులకు అదనంగా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలుంటే, వాటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. ఆ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు. మద్యం నెట్వర్క్ అంతా టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ఉండటంతో ఈ దందా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది.ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీటీడీపీ సిండికేట్ సాగిస్తున్న కల్తీ మద్యం విక్రయాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో 4.26 కోట్ల ఐఎంఎల్ మద్యం కేసులు, 3.25 కోట్ల బీరు కేసులు విక్రయించారు. 4.26 కోట్ల ఐంఎఎల్ మద్యం కేసుల్లో 70 శాతం క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిళ్లే విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి.ఈ లెక్కన 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించారు. దీన్నిబట్టి మొత్తం క్వార్టర్ బాటిళ్లలో మూడో వంతు కల్తీ మద్యం విక్రయించినట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమే. ఆ ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యాన్ని విక్రయించారు. ఒక్కో క్వార్టర్ బాటిల్ను రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు.పవన్ కళ్యాణ్ స్పందించాలిప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కూటమి పాలనలో యథేచ్ఛగా సాగుతున్న కల్తీ మద్యం విక్రయాలపై స్పందించాలి. టీడీపీ హయాంలో సుగాలి ప్రీతి హత్య జరిగితే వైయస్సార్సీపీ హయాంలో జరిగినట్టు విష ప్రచారం చేసి రాజకీయంగా వాడుకున్నాడు. 34 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ ఆయన చేసిన ప్రచారం కూడా పచ్చి అబద్ధమని అసెంబ్లీలో కూటమి ప్రభుత్వమే స్పష్టం చేసింది. లేనివాటిని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. కళ్ల ముందు కల్తీ మద్యం దందా సాగిస్తూ లక్షల మంది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?వైఎస్సార్సీపీ హయాంలో కల్తీ మద్యం విక్రయాలంటూ కూటమి నాయకులు విషం చిమ్మారు. కానీ కల్తీ లిక్కర్ తాగి ఒక్క మరణం కూడా సంభవించలేదని ఎన్సీఆర్బీ రిపోర్టులో స్పష్టం చేసింది. దీనిగురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా సోషల్ మీడియాకి అడ్డుకట్ట వేయాలన్న దుర్భుద్ధితో మంత్రుల కమిటీ వేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బురదజల్లిన కూటమి నాయకులు, ఇప్పుడు వారు అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నాయకులు నిజాలు మాట్లాడుతుంటే ఓర్వలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి కల్తీ మద్యం సరఫరా రాకెట్కి అడ్డుకట్ట వేయాలి. ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేయడం మాని ప్రజల ప్రాణాలను కాపాడాలి. విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను తక్షణం మూసేయాలి. -
ఆ లీజు వెనుక అసలు రహస్యం ఏంటి బాబూ?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణలకు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ నెల 8న శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్టోబర్ 28న విజయవాడలో సభతో ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక పాదయాత్ర ముగియనుంది. ఏపీలో రోజురోజుకీ రైతాంగం భూమి ప్రశ్నార్థకంగా మారుతోందని చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.తమ భూమి ఉంటుందో ఊడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారని.. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కొత్త జమీందారులను సృష్టిస్తోందంటూ శోభనాద్రీశ్వరరావు దుయ్యబట్టారు. లక్షలాది ఎకరాలు నయా జమీందారులకు కట్టబెడుతున్నారు. విజయవాడలో ఆర్టీసీ స్థలం లూలుకి అప్పగించారు. రూ. 600 కోట్ల విలువైన భూమిని 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం వెనుక చిదంబర రహస్యం ఏంటి?. లూలు మీద నీకు ఎందుకంత ప్రేమ చంద్రబాబు? వందల కోట్ల ఖరీదైన భూములు ఎలా కట్టబెడతారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.‘‘ఏపీలో జరుగుతున్న భూదోపిడీపై ప్రజల్లో చైతన్యం చేస్తాం. ఆంధ్రా ఉద్యమాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామని మహాదేవ్ అన్నారు. అక్టోబర్ 8న ఉద్ధానంలోని వెన్నెలవలస, మందస నుంచి ప్రారంభం ప్రారంభం కానుందని.. ప్రతీ చోటా హ్యూమన్ రైట్స్కు ప్రజల ద్వారా పిటిషన్లు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. చివరిగా విజయవాడలో 28న బహిరంగ సభ నిర్వహిస్తామని.. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇస్తామని మహాదేవ్ వెల్లడించారు. -
ఉక్కిరిబిక్కిరి...సచివాలయాలకు ఊపిరందేనా!
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో తొలిసారిగా పౌర సేవలు, సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేరవేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాలను వ్యవస్థను ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2019 అక్టోబరు 2కు ముందు రాష్టంలో 3 వేల గ్రామ పంచాయతీలకు కనీసం కార్యాలయ భవనాలు లేవు. పెద్ద గ్రామాల్లో సైతం శిథిలావస్థకు చేరిన పంచాయతీ కార్యాలయాలు తప్ప మరో ప్రభుత్వ కార్యాలయం ఉండని పరిస్థితి. 4–5 పంచాయతీలకు ఒక్కరే కార్యదర్శి. కానీ, ఆ పంచాయతీ కార్యాలయాన్ని ఎప్పుడు తెరుస్తారో ఆ గ్రామ ప్రజలకే తెలియదు. అలాంటి సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు తర్వాత ప్రతి గ్రామంలో 8 నుంచి 10 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి గ్రామంలో, ప్రత వార్డులో అందుబాటులోకి వచ్చారు. » ప్రజల గడప వద్దనే సేవలు అందించేందుకు ప్రతి 50 మందికి ఓ వలంటీరును వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రోజూ ఉదయం 10 గంటలకే వీరంతా ప్రభుత్వ సేవలకు ప్రజలకు సిద్ధంగా ఉండేవారు. సాయంత్రం 3–5 గంటల మధ్య సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకంగా వినతుల స్వీకరణకే కేటాయించారు. కుగ్రామాల్లో ఉండే సచివాలయాల్లో 545 వరకు రాష్ట్ర ప్రభుత్వ సేవలతో పాటు పాస్పోర్టు బుకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల సర్వీసులనూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఈ వ్యవస్థకు అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థను నాడే ప్రవేశపెట్టారు. ప్రభుత్వం మారగానే కుదేలు 16 నెలల కిత్రం వచ్చిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీరు–సచివాలయ వ్యవస్థను బలహీనపరిచే చర్యలు మొదలుపెట్టింది. గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో పనిచేసిన వలంటీర్ల వ్యవస్థను లేకుండా చేశారు. వలంటీర్లు చేసిన పనులకు గ్రామ, వార్డు సచివాలయాల్లోని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటున్నారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాల్సిన ప్రభుత్వ సేవలు కుంటుపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తిఅయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఫోటోతో కూడిన స్టిక్కర్లను ఇళ్లకు అంటించే బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకే అప్పగించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసే కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి పంచుతున్నారు అవినీతి, పైరవీ లేకుండా సేవలు గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, అంతకుముందు ఏ ప్రభుత్వ పథకం అమలు చేసినా ఊళ్లో ఏ ఐదు, పదిమందికో లబ్ధి దక్కేది. అది కూడా ఊళ్లో పెద్దలతో పైరవీలు చేసుకునేవారికో, లంచం ఇచ్చేవారికో అవకాశం ఉండేది. అయితే, వైఎస్ జగన్ పాలనలో సచివాలయాల ద్వారా ప్రతి ప్రభుత్వ పథకాన్ని సంతృప్త స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధానం ప్రవేశపెట్టారు. ఎలాంటి పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావివ్వలేదు. ఇరుకు భవనాల్లోని పంచాయతీ కార్యాలయాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం మోక్షం కల్పించింది. సచివాలయాల సేవలను ప్రజలకు అందించేలా ప్రతి చోటా రూ.43.60 లక్షలు ఖర్చుపెట్టి 2,623 చదరపు అడుగుల విశాలమైన రెండంతస్తుల గ్రామ సచివాలయం భవనాలను నిర్మించారు. రూ.4,750 కోట్ల ఖర్చుతో 10,893 గ్రామ సచివాలయాలను మంజూరు చేయగా చాలాచోట నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటి పక్కనే రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ల నిర్మాణాన్ని కూడా గత ప్రభుత్వం చేపట్టింది.వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు, భవనాల నిర్మాణానికి పరిమితం కాకుండా కార్యాలయాల్లో ఆధునిక మౌలిక వసతులు కల్పించింది. 4 నెలలకే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఉమ్మడి ఏపీలో 40 ఏళ్ల కిందట మండల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఎలాంటి ప్రత్యేక ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. దీంతో ప్రజలకు సమర్థంగా పథకాలు అందలేదు. సుస్థిర అభివృద్ధి (ఎస్డీజీ) లక్ష్యాల సాధనలో ఉమ్మడి ఏపీ మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే చాలా అంశాలలో వెనుకబడింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు సమర్థంగా సంక్షేమ కార్యక్రమాలు అందాలని భావించింది. దీనికోసం కొత్తగా ఏర్పాటు చేసిన 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 1.34 లక్షల కొత్త శ్వాశత ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసింది. 4 నెలల్లోనే భర్తీ ప్రక్రియను ముగించింది. సచివాలయాలకు అనుబంధంగా పనిచేసేందుకు గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున 2.66 లక్షల మంది వాలంటీర్లను వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించింది. అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు, రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచడం ద్వారా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్ నిర్మాణం చేపట్టింది. యునిసెఫ్ సైతం భాగస్వామ్యం ఐక్యరాజ్యసమితి అనుబంధ యునిసెఫ్ కూడా ఏపీలో సుస్థిర అభివృద్ధి, లక్ష్యాల సాధనకు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయాల రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు. కోవిడ్ విపత్తు సమయంలో రాష్ట్రంలో ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉండడానికి గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఒక కారణం అని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది. విపత్తు వేళ వాలంటీర్లు–సచివాలయాల సిబ్బంది మూడు రోజుల వ్యవధిలోనే రాష్ట్రమంతా ఇంటింటి సర్వేలు దాదాపు 30 విడతల పాటు నిర్వహించడం గమనార్హం. యునిసెఫ్తో పాటు కేంద్రం ప్రశంసలతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు.. గ్రామ, వార్డు సచివాలయాలను తమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టేందుకు ఏపీలో పరిశీలన చేశాయి.నాడు... ఆరేళ్ల క్రితం అక్టోబరు 2న దేశ చరిత్రలో ఒక విప్లవాత్మక కార్యక్రమం. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో గాం«దీజీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు అంకురార్పణ. ప్రభుత్వ సేవలు, కార్యక్రమాలను ప్రజలకు గడప వద్దనే అందించడమే లక్ష్యంగా పనిచేశాయి...! కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూశాయి. అంకితభావంతో విధి నిర్వహణతో గాం«దీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యానికి నిలువుటద్దంలా నిలిచాయి.నేడు... గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజల సేవల కన్నా ప్రభుత్వ పెద్దలు చెప్పే ఇంటింటి సర్వేలకు పరిమితం అయ్యాయి. ఎన్నో ఆశలతో ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆత్మగౌరవం దక్కితే చాలని భావించే దుస్థితి. తమ డిమాండ్ల సాధనకు వారం, పది రోజులుగా నిరసనలు చేపడుతున్నా పట్టించుకునేవారు లేరు. రోడ్లపైకి వచ్చి, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తున్న వీరు... గురువారం దసరా పండుగ నాడు ‘మహాత్మా మా గోడు వినయ్యా’అంటూ వాట్సాప్లో స్టేటస్ పెట్టి ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.1.34 లక్షల ఉద్యోగాల భర్తీ దేశంలో ఇప్పటికీ రికార్డే 2019 జూలై–అక్టోబరు మధ్య 1.34 లక్షల శాశ్వత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 21.69 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. 19,50,630 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయలేదు. యువత కూడా అంత పెద్ద సంఖ్యలో ఒకేసారి పరీక్షలు రాయడం దేశ చరిత్రలోనే లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. రేషనలైజేషన్ పేరిట ఉద్యోగుల కుదింపువైఎస్ జగన్ ప్రభుత్వంలో 10–11 మంది చొప్పున పనిచేసేలా సచివాలయాలు ఏర్పాటు కాగా, కూటమి ప్రభుత్వం... వాటి పరిధిలో నివాసం ఉండే జనాభా ఆధారంగా ఉద్యోగుల సంఖ్యను 6–8కి మధ్యకు పరిమితం చేయాలని నిర్ణయించింది. గ్రామాల్లో నిత్యం ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలను అందించే వీఆర్వోలు, అగ్రికల్చర్, వెటర్నరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గతంలో ఒక్కో సచివాలయంలో ఒక్కొక్కరు చొప్పన పనిచేశారు. కానీ, ఆయా కేటగిరీ ఉద్యోగులను 2, 3 సచివాలయాలకు ఒకరు చొప్పున తగ్గించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. ఈ ప్రక్రియ తిరిగి చాలా గ్రామాల్లో కొన్ని రకాల ప్రభుత్వ సేవలకు విఘాతం కలిగిస్తుందన్న విమర్శలున్నాయి. దీనికితోడు ఆరేళ్ల క్రితం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు సమయంలో సరఫరా చేసిన కంప్యూటర్లు, ప్రింటర్లు పనిచేయడం లేదు. ప్రభుత్వం కొత్తవి సరఫరా చేయడం లేదని ఉద్యోగ సంఘాల పేర్కొంటున్నాయి. -
Andhra Pradesh: అదొక చరిత్ర
సాక్షి, అమరావతి : గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2019 అక్టోబర్ 2వ తేదీన దేశమంతటా రాష్ట్రం వైపు చూసిన పరిస్థితి.. ఎందుకంటే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వపరిపాలనను సాకారం చేసిన రోజది. ప్రజలకు ఉన్న ఊళ్లోనే ప్రభుత్వ సేవలు అందించేలా చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా, కనీ వినీ ఎరుగని రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసిన రోజది. ఏకంగా 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి అందులో 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను ఏర్పాటు చేశారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇంత మంది ఉద్యోగులను నియమించడం దేశ చరత్రలోనే జరగలేదు. చిన్న ఆరోపణ కూడా లేకుండా, అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలు చేపట్టారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక్కరి చొప్పున వలంటీర్లను నియమించారు. తద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజల ఇళ్ల ముంగిటకే తీసుకెళ్లారు. ఈ విధానం ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇంత తక్కువ వ్యవధిలో రాష్ట్ర రూపు రేఖలు మార్చే పాలనతో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఐదేళ్ల పాలనలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా వివిధ ప్రభుత్వ శాఖలలో ఏకంగా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడం మరో రికార్డు. కాగా, చంద్రబాబు కూటమి ప్రభుత్వం కనీసం పదో తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేక పోయిందని, డీఎస్సీ అంతా అవకతవకలేనని సోషల్ మీడియాలో ప్రజలు చర్చించుకుంటున్నారు. నేడు అంతా రివర్స్ » రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికల వేళ నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఏ ఒక్కటీ ఇవ్వకపోగా.. గత ప్రభుత్వ కృషిని సైతం తన ఘనతగా చెప్పుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై గత 15 నెలలుగా ఊకదంపుడు ప్రసంగాలు, కాకి లెక్కలతో మభ్యపుచ్చిన చంద్రబాబు సాక్షాత్తూ శాసనసభ సాక్షిగా నిస్సిగ్గుగా అవే అబద్ధాలు వల్లె వేశారు. » తాను ఏకంగా 4.71 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్లు కళ్లార్పకుండా బడాయిలు చెప్పుకోవడంపై అందరూ విస్తుపోతున్నారు. ఇంతవరకూ కనీసం ఉత్పత్తి కూడా ప్రారంభించని కంపెనీల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో 3,48,891 ఉద్యోగాలు ఇచ్చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించుకున్నారు. » గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న విశాఖ ఎనీ్టపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీబీజీ ప్లాంట్లు, రెన్యూ, మిట్టల్, జేఎస్డబ్ల్యూస్టీల్, అదానీ, షిర్డీసాయి, గ్రీన్కో అమ్మోనియా తదితర ప్రాజెక్టులన్నీ తన ఖాతాలో వేసుకున్నారు. వాటిని రాష్ట్రానికి తామే తెచ్చినట్లుగా చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకోవడంపై పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. » వైఎస్సార్సీపీ హయాంలో 2023లో విశాఖ కేంద్రంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ముఖేష్ అంబానీ, ఆదిత్య మిట్టల్ లాంటి పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఏపీలో రూ.13.11 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే అవి ఇంకా ఉత్పత్తి ప్రారంభించక ముందే వాటి ద్వారా 3.48 లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని చంద్రబాబు సర్కారు చెప్పుకోవడంపై ప్రజలు, పారిర్రామికవేత్తలు విస్తుపోతున్నారు. ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గత ప్రభుత్వంలోనే.. » కూటమి సర్కారు వచ్చాక ఇంత వరకు ఏ ఒక్కరూ కొత్తగా అధికారికంగా పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా విధుల్లో చేరకపోయినా 15 నెలల్లో 31,134 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసినట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. నిజానికి ఇందులో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్, ప్రిలిమనరీ, మెయిన్ ఎగ్జామ్స్ గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. దీనిపై కొంత మంది కోర్టుకు వెళ్లడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు కోర్టు కేసులు పరిష్కారం కావడంతో కూటమి ప్రభుత్వం కేవలం నియామక పత్రాలు మాత్రమే జారీ చేసింది. » గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలను సైతం చంద్రబాబు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. ఇదే రీతిలో గత ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసిన కూటమి సర్కారు పరీక్షల నిర్వహణలో న్యాయ వివాదాలు రేకెత్తిస్తూ సుదీర్ఘ కాలయాపన చేసింది. ప్రస్తుతం ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. ఇక గత ప్రభుత్వం వివిధ విభాగాల్లో నియమించిన ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన చంద్రబాబు సర్కారు.. కొత్త వారిని నియమించుకుని వాటిని కొత్త ఉద్యోగాలుగా చిత్రీకరిస్తోంది. స్విగ్గీ, జొమాటో, డోర్ డెలివరీ జాబ్స్..» జాబ్మేళాల ద్వారా 92,149 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సీఎం చంద్రబాబు ఘనంగా చెప్పుకున్నారు. జాబ్మేళాల జాబితా పరిశీలిస్తే అత్యధికంగా బ్యాంకులు, రుణ రికవరీ ఏజెంట్లు, బీమా ఏజెంట్లు, జొమాటో, స్విగ్గీ, అమెజాన్, బ్లింకిట్ లాంటి డోర్ డెలివరీ జాబ్స్, ఫార్మసీ షాపుల్లో ఉద్యోగాలే అత్యధికంగా ఉన్నాయి. తాత్కాలికంగా ఉపాధి కల్పించే వాటిని కూడా ప్రభుత్వం తాము కొత్తగా ఉద్యోగాలు ఇచి్చనట్లు ప్రచారం చేసుకోవడం చూసి విస్తుపోతున్నారు.» చివరికి చంద్రబాబు సర్కారు ప్రచార పిచ్చి ఏ స్థాయిలో ఉందంటే.. ఇతర రాష్ట్రాల్లోని ఐటీ కంపెనీల ఉద్యోగులు కొందరు ఏపీ నుంచి వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పని చేస్తుంటే వారిని కూడా తమ ఖాతాలో వేసుకుని 5,500 మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉపాధి కల్పించినట్లు ఘనంగా చెప్పుకోవడం. -
ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్–2026 పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా షెడూŠయ్ల్ విడుదల చేశారు. మొదటి ఏడాది పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి, సెకండియర్వి 24 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు మార్చి 24వ తేదీ వరకు ఉ.9 నుంచి మ.12 వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు వొకేషనల్ విద్యార్థులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు, జనరల్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు జరుగుతాయి. అలాగే, సమగ్ర శిక్ష ప్రాజెక్టులో భాగంగా నిర్వహిస్తున్న వొకేషనల్ ట్రేడ్స్కు ఫిబ్రవరి 13న ప్రాక్టికల్స్ ఉంటాయి. విద్యార్థులకు నైతిక విలువలు, మానవ విలువలు (ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్)పై జనవరి 21న, పర్యావరణ విద్యపై 23న పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్, సీబీఎస్ఈ విధానం అమలుచేస్తుండడంతో కొందరు విద్యార్థులు రెండో భాష స్థానంలో ఆర్ట్స్ సబ్జెక్టులు ఎంచుకోవడం, ఎంబైపీసీ కోర్సు ప్రవేశం తదితర కారణాలతో ఒకరోజు ఒక పేపర్ విధానంలో పరీక్షలు జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే, గతేడాది ఫెయిలైన విద్యార్థులకు అనుగుణంగా బ్యాక్లాగ్ పేపర్లు పూర్తిచేసేలా షెడ్యూల్ రూపొందించారు. ఇదిలా ఉంటే.. ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈనెల 10 వరకు అధికారులు గడువునిచ్చారు. అపరాధ రుసుంతో ఈనెల 20 వరకు చెల్లించవచ్చు.మొదటి ఏడాది పరీక్షల షెడ్యూల్ ఇదీ..ఫిబ్రవరి 23 తెలుగు/సంస్కృతం/ఉర్దూ/హిందీ/తవిుళం/ ఒరియా/కన్నడ/అరబిక్/ఫ్రెంచ్/పర్షియన్బ్యాక్లాగ్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్–125–2–2026: ఇంగ్లిష్బ్యాక్లాగ్ : ఇంగ్లిష్27–2–2026 : చరిత్రబ్యాక్లాగ్ : బోటనీ, చరిత్రమార్చి 2 : మేథమెటిక్స్బ్యాక్లాగ్ : మేథమెటిక్స్ 1ఏ5–3–2026 : బయాలజీబ్యాక్లాగ్ : మేథమెటిక్స్ 1బి, జువాలజీ7–3–2026 : ఎకనావిుక్స్బ్యాక్లాగ్ : ఎకనావిుక్స్10–3–2026 : ఫిజిక్స్బ్యాక్లాగ్ : ఫిజిక్స్12–3–2026 : కామర్స్బ్యాక్లాగ్ : కామర్స్/సోషియాలజీ/ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ 14–3–2026 : సివిక్స్బ్యాక్లాగ్ : సివిక్స్/మ్యాథమెటిక్స్ (బ్రిడ్జి కోర్సు)17–03–2026 : కెమిస్ట్రీబ్యాక్లాగ్ : కెమిస్ట్రీ20–3–2026 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్ (రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్)24–3–2026 : మోడ్రన్ లాంగ్వేజ్/జియోగ్రఫీ (రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్)సెకండియర్ షెడ్యూల్ ఇలా..24–2–2026 : సెకండ్ లాంగ్వేజ్26–2–2026 : ఇంగ్లిష్28–2–2026 : బోటనీ/హిస్టరీ3–3–2026 : మేథమెటిక్స్ 2ఎ/సివిక్స్6–3–2026 : జువాలజీ/ ఎకనావిుక్స్9–3–2026 : మేథమెటిక్స్ 2బి11–3–2026 : కామర్స్/సోషియాలజీ/ ఫైన్ ఆర్ట్స్/మ్యూజిక్13–3–2026 : ఫిజిక్స్16–3–2026 : మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ/మ్యాథమెటిక్స్–2(బ్రిడ్జి కోర్సు)18–3–2026 : కెమిస్ట్రీ23–3–2026 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్ -
ఉత్తరాంధ్ర అతలాకుతలం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర వణికింది...! ఎడతెరిపి లేని భారీ వర్షంతో తడిసి ముద్దయింది...! మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది...! విజయనగరం విలవిల్లాడింది...! విశాఖపట్నంలోనూ తీవ్రత కనిపించింది..! ఏకధాటిగా కురిసిన వానకు నదులు, వాగులు పొంగి ప్రవహించాయి...! గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో అనేకచోట్ల చెట్లు రోడ్లపై కూలిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునగడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. కాగా, వేర్వేరు ఘటనల్లో గోడకూలి వృద్ధ దంపతులు సహా ముగ్గరు మృతిచెందారు. నది ప్రవాహంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. రికార్డు స్థాయిలో 18.03 సెంటీమీటర్ల వర్షం కురవడంతో శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ పట్టణాలు చెరువుల్లా మారాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ పలుచోట్ల అతి భారీ వర్షాలు కురవడంతో ఆయా ప్రాంతాలు జలమయమయ్యాయి. – సాక్షి, అమరావతిశ్రీకాకుళం జిల్లా అంతటా కుండపోత వర్షాలతో అనేక ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. మెలియపుట్టి మండలం చుట్టూ నీరు చేరింది. మందసలో 13.9, హరిపురం (13.7), నందిగం (13.4), కంచిలి మండలం ఎంఎస్ పల్లె (13.1), టెక్కలి మండలం రావివలస (10.1), సోంపేట మండలం కొర్లాం (9.6), మెలియపుట్టి (9.3), కోట»ొమ్మాళి (9), సంత»ొమ్మాళి (8.9), పార్వతీపురం మన్యం సీతంపేటలో (8), సిరిగం (7.9), రాస్తకుంటబాయి (7.4), నిమ్మాడ (6.8), గార (6.7) వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా పాఠశాలలకు స్థానికంగా ఎక్కడికక్కడ సెలవు ప్రకటించారు. అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో 5 సెం.మీ పైగా వర్షం శ్రీకాకుళం జిల్లా రణస్థలం, కవిటి, పొలాకి, బుర్జ, ఆమదాలవలస, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, లావేరు, నరసన్నపేట, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ, విజయనగరం జిల్లా మెరకముడిదం, గరివిడి, పైడి భీమవరం, రాజాపురం, పార్వతీపురం మన్యం జిల్లా పచి్చపెంట ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. విజయనగరం విలవిల విజయనగరం జిల్లాలో నదులు, వాగులు ఉప్పొంగాయి. పొలాలను వరద ముంచెత్తింది. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో గంటల తరబడి సరఫరాకు అంతరాయం కలిగింది. ఒడిశాలో భారీ వర్షాలతో నాగావళికి వరద పోటెత్తింది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుని, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అరటి, చెరకు, వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం ఏసూరిగెడ్డ ఉధృతికి రావుపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన వంద ఎకరాల వరి ముంపునకు గురైంది.గొట్టా, భగీరథపురం, నీలాదేవిపురం, అంబావల్లి, పిండ్రువాడ, రెల్లివలస, అక్కరాపల్లి, కిట్టాలపాడు, పాతహిరమండలం, జిల్లోడిపేట, కల్లట, గులుమూరు గ్రామాల్లో వందల ఎకరాలు ముంపులో చిక్కుకున్నాయి. పొట్ట, వెన్ను దశలో ఉన్న సమయంలో వరదతో పంటంతా పోయింది. వీరఘట్టం మండలంలో 850 ఎకరాల్లో అరటి, 100 ఎకరాల్లో మొక్కజొన్న, 250 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది.వట్టిగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో కురుపాం–రావాడ గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పుముఠాలో ఉన్న సుమారు 30 గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.తీరం దాటిన వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం ఒడిశాలోని గోపాల్పూర్–పారదీప్ మధ్య తీరం దాటింది. శుక్రవారానికి అతి బలహీనపడడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.ఈపీడీసీఎల్కు రూ.1.78 కోట్ల నష్టంవాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో ఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలలో రూ.1.78 కోట్ల నష్టం వాటిల్లిందని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి వెల్లడించారు. గాలుల కారణంగా ఆరు సర్కిళ్లలోని విద్యుత్ లైన్లపై భారీ వృక్షాలు, ఫ్లెక్సీ బ్యానర్లు, చెట్లకొమ్మలు విరిగిపడ్డాయని తెలిపారు. 33 మండలాలకు గాను 25 మండలాల్లో విద్యుత్ పునరుద్ధరించామని చెప్పారు.వంశధార ఉధృతిభీతిల్లిన పరివాహక గ్రామాల ప్రజలు గొట్టాకు మూడో ప్రమాద హెచ్చరిక జారీవర్షాల దెబ్బకు నాగావళి, వంశధార నదులు ప్రమాద స్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వంశధార ఐదారేళ్లుగా చూడని స్థాయిలో ఉగ్రరూపం దాల్చింది. 1.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో నదీ తీర గ్రామాల ప్రజలు భీతిల్లారు. శుక్రవారం సాయంత్రం నుంచి వంశధార శాంతించింది. తోటపల్లి, మడ్డువలస, జంఝావతి, పెదంకలాం, వట్టిగెడ్డ, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది.ఒడిశాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గొట్టా బ్యారేజీలోకి నీటి మట్టం పెరగడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ధాటికి నదీ తీర ప్రాంత ప్రజలు రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. బాహుదా నది కూడా పొంగి ప్రవహించడంతో తీర గ్రామాలు, పొలాలు నీట మునిగాయి. మహేంద్రతనయకూ వరద ఉధృతి కొనసాగుతోంది.నేలకొరిగిన చెట్లు ఈదురుగాలులు విశాఖను వణికించాయి. దసరా రోజున భారీ గాలులతో కూడిన వర్షంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. 80 ప్రాంతాల్లో 170 పైగా చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయాయి. అల్లూరి జిల్లాలో కూలిన బడులు భారీ వర్షాలకు అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం పాలమామిడి పంచాయతీ వనభరంగిపాడులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం గురువారం తెల్లవారుజామున కుప్పకూలింది. ముంచంగిపుట్టు మండలం జర్జుల పంచాయతీ సింధుపుట్టులో పాఠశాల నిర్వహించే రేకుల షెడ్డు గురువారం సాయంత్రం పడిపోయింది.మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరద ప్రవాహాలపై ఉన్నతాధికారులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా ముూడు జిల్లాల్లో నలుగురు మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.వృద్ధ దంపతులను బలిగొన్న గోడమరో రెండు ఘటనల్లో ఇద్దరు దుర్మరణం క్యాబేజీ పంటంతా పోవడంతో రైతు ఆత్యహత్యాయత్నంశ్రీకాకుళం జిల్లా మందస మండలం హంసరాలి పంచాయతీ చిన్నటూరులో గురువారం రాత్రి మట్టి గోడ కూలి పెళ్లలు మీద పడడంతో వృద్ధ దంపతులు సవర బుద్దయ్య (65), రూపమ్మ(60) ప్రాణాలు కోల్పోయారు. హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరి ఇద్దరు పిల్లలు ఉద్యోగ రీత్యా బయట ఉంటున్నారు. సీఎం ఆదేశాల మేరకు వీరి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురంలో వర్షాలకు నానిన గోడ కూలడంతో అరవింద్ మృతి చెందాడు. ఇతడి సోదరుడు వినయ్ను స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు.శ్రీకాకుళం జిల్లా పలాస మొగిలిపాడు గ్రామానికి చెందిన సైని గోపాలరావు (47) వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. గురువారం జాతీయ రహదారి వెంట పెద్దఎత్తున వరద ప్రవహిస్తుండగా... అవతల ఉన్న పొలాన్ని చూసేందుకు వెళ్లిన గోపాలరావు తిరిగి రాలేదు. పొలం దగ్గర ఉన్న ఖానాలో పడిపోయి చనిపోయాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జె.రంగరాయపురంలో వేగావతి నదిలో యోగేశ్వరరావు (22) గల్లంతయ్యాడు.పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కళ్లికోటకు చెందిన కౌలు రైతు బి.రాంబాబు క్యాబేజీ పంట మొత్తం నీట మునగడంతో పురుగుమందు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. -
రాంరెడ్డి దామోదర్రెడ్డి మృతి బాధాకరం
సాక్షి, అమరావతి:మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మృతి పట్ల మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ‘మా కుటుంబానికి సన్నిహితులైన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మృతి బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’అంటూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
AP: ష్.. గప్చుప్!
సాక్షి, అమరావతి: దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న రీతిలో టీడీపీ పెద్దల కల్తీ మద్యం సిండికేట్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. జిల్లాలు, రీజియన్ల వారీగా రాష్ట్రాన్ని పంచుకుని మరీ బరితెగించి కల్తీ మద్యం దందా సాగిస్తోంది. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్ దుకాణాలు.. ఇలా మొత్తం మద్యం వ్యవస్థ అంతా టీడీపీ సిండికేట్ గుప్పిట్లోనే ఉండటంతో తొలి ఏడాదిలోనే రూ.5,280 కోట్లు కొల్లగొట్టడం విభ్రాంతి కలిగిస్తోంది. ఇంతటి వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతున్న టీడీపీ కీలక నేతలకు ప్రభుత్వం కొమ్ము కాస్తుండటం విస్మయ పరుస్తోంది. అనకాపల్లి, ఏలూరు, పాలకొల్లు, గూడూరు, తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం రాకెట్ బాగోతం బయట పడుతోంది. ఆ అయిదు సందర్భాల్లోనూ పాత్రధారులైన టీడీపీ చోటా నేతలను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ కల్తీ మద్యం రాకెట్ సూత్రధారులైన టీడీపీ పెద్దలపై మాత్రం ఈగ వాలనివ్వ లేదు. తాజాగా మదనపల్లె సమీపంలోని తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో శుక్రవారం బయట పడిన రాకెట్ వెనుక సూత్రధారుల పేర్లు బయట పడకుండా అమరావతి నుంచి ప్రభుత్వ పెద్దలు అడ్డుకట్ట వేయడం గమనార్హం. ఎందుకంటే ఈ దందా రింగ్ మాస్టర్ అన్నమయ్య జిల్లా టీడీపీ కీలక నేత.. తంబళ్లపల్లి నియోజకవర్గ స్థాయి మరో టీడీపీ నేత సూత్రధారి కావటమే దీనికి కారణం. కీలక టీడీపీ నేతే రింగ్ మాస్టర్.. నియోజకవర్గ నేతే సూత్రధారి అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మండల కేంద్రం ములకలచెరువు సమీపంలో బయట పడిన భారీ కల్తీ మద్యం రాకెట్పై వాస్తవాలు కప్పిపుచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఏకంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు కల్తీ మద్యం సరఫరా చేస్తున్న భారీ దందా విభ్రాంతి కలిగిస్తోంది.ఈ కేసులో మండల స్థాయి టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడుతోపాటు ఎనిమిది మంది కూలీలను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన జనార్దనరావు గురించి ఓ మాట చెప్పి సరిపెట్టారు. కానీ రాయలసీమ స్థాయి కల్తీ మద్యం రాకెట్ వెనుక రింగ్ మాస్టర్, సూత్రధారుల పేర్లపై ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించక పోవడం గమనార్హం. ఎందుకంటే ఈ భారీ రాకెట్ రింగ్ మాస్టర్ ఎవరో కాదు.. అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతే కాబట్టి. ఇక ములకలచెరువులో కల్తీ మద్యం యూనిట్ నిర్వహణను పర్యవేక్షిస్తోంది తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ కీలక నేతే. ఆ విషయం ఆ యూనిట్పై దాడి చేసిన తర్వాతే ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసింది. కల్తీ మద్యం తయారీ యూనిట్పై ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య దాడి చేశారు. కానీ సాయంత్రం 6 గంటల వరకు ఆ వివరాలను మీడియాకు వెల్లడించలేదు. ఎందుకంటే ఈ కల్తీ మద్యం రాకెట్ వెనుక అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతే రింగ్మాస్టర్ అని, తంబళ్లపల్లె నియోజకవర్గ స్థాయి నేత సూత్రధారి అని ఎక్సైజ్ శాఖ అధికారులు అమరావతిలోని ఉన్నతాధికారులకు తెలిపారు. దాంతో తాము చెప్పే వరకు తొందర పడవద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు. రింగ్ మాస్టర్, సూత్రధారి గురించి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ ముఖ్యనేతకు సమాచారం ఇచి్చనట్టు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో మంత్రివర్గ సమావేశం కోసం ప్రభుత్వ పెద్దలు వెలగపూడిలోని సచివాలయానికి వస్తున్నారు. విషయం తెలియడంతో సచివాలయంలో ప్రభుత్వ పెద్దలు తర్జనభర్జనలు పడ్డారు. ఇప్పటికే టీడీపీ మద్యం సిండికేట్ వ్యవహారాలపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కీలక నేతే కల్తీ మద్యం రాకెట్ రింగ్ మాస్టర్, నియోజకవర్గ స్థాయి నేత సూత్రధారి అని బయట పడితే ప్రభుత్వం పరువు బజారున పడుతుందని సందేహించారు. అందుకే ఈ వ్యవహారంలో కీలక నేతల పేర్లు బయటకు రాకుండా చూడాలని ప్రభుత్వ ముఖ్యనేత ఎక్సైజ్ శాఖను ఆదేశించారు. దాంతో ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం 6 గంటల తరువాత మీడియా సమావేశం నిర్వహించి కేవలం మండల స్థాయి టీడీపీ నేత, పని చేస్తున్న కూలీల అరెస్టుతో విషయాన్ని కప్పి పుచ్చేందుకు యత్నించారు. అంతటా అదే గూడు పుఠాణి రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం దందా వెనుక టీడీపీ కీలక నేతలే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. కానీ ఎక్కడా కీలక నేతల పేర్లు బయటకు రాకుండా ప్రభుత్వం కప్పి పుచ్చుతోంది. స్థానికులు ఇచి్చన సమాచారంతో తప్పనిసరిగా నిర్వహిస్తున్న దాడులతో అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప తదితర జిల్లాల్లో కల్తీ మద్యం దందా బయట పడింది. తాజాగా అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అన్ని సందర్భాల్లోనూ పాత్రధారుల అరెస్టుతో సరిపెట్టారు తప్ప.. సూత్రధారుల జోలికి మాత్రం వెళ్లకపోవడం గమనార్హం. రేపల్లె నేతే.. దక్షిణాంధ్ర సిండికేట్ లీడర్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరు మండలం గుడ్లూరు కేంద్రంగా సాగిన టీడీపీ కల్తీ మద్యం రాకెట్ ఇటీవల బట్టబయలైంది. నెల్లూరులో రొట్టెల పండుగను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యాన్ని భారీగా తరలించినట్టు కూడా వెల్లడైంది. ఈ కేసులో టీడీపీ సిండికేట్ సభ్యుడైన వీరాంజనేయులు అరెస్టుతో సరిపెట్టారు. కానీ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కల్తీ మద్యం సిండికేట్కు రింగ్ మాస్టర్ రేపల్లెలో ఉన్నారు. ఆయన ప్రధాన అనుచరులే సూత్రధారులు. ప్రభుత్వ కీలక నేత కావడంతో ఆయనకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. టీడీపీ సీనియర్ నేత కుటుంబమే రింగ్ లీడర్.. అనకాపల్లి జిల్లా కేంద్రంగా టీడీపీ సిండికేట్ కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ఉత్తరాంధ్ర స్థాయిలో అంటే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో కల్తీ మద్యం దందా సాగిస్తోంది. అనకాపల్లి జిల్లాలో ఈ రాకెట్ బయట పడితే టీడీపీ నేతలైన రుత్తల రాము, యలమంచిలి వెంకటేశ్వరరావులను అరెస్టు చేశారు. కానీ అసలు ఉత్తరాంధ్ర స్థాయిలో కల్తీ మద్యం దందా నర్సీపటా్ననికి చెందిన టీడీపీ కీలక నేత కుటుంబ అండదండలతోనే సాగుతోందన్నది బహిరంగ రహస్యం. ఎక్సైజ్ శాఖ అధికారులు కనీసం ఆ కుటుంబ సభ్యులను ప్రశి్నంచే సాహసం కూడా చేయలేకపోయారు. వివాదాస్పద టీడీపీ నేతే గోదావరి జిల్లాల కల్తీ మద్యం డాన్ అత్యంత వివాదాస్పద టీడీపీ ప్రజాప్రతినిధి ఉభయ గోదావరి జిల్లాల్లో కల్తీ మద్యం డాన్గా చెలరేగిపోతున్నారు. అందుకే పాలకొల్లులో కల్తీ మద్యం రాకెట్పై ఎకైŠస్జ్ శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేయకుండా మిన్నుకుండిపోయారు. పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ యూనిట్ను నెలకొల్పి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. కాగా.. పోలీసులు, ప్రభుత్వ అధికారులపైనే దాడి చేసే చరిత్ర ఉన్న టీడీపీ వివాదాస్పద ప్రజాప్రతినిధి ఈ రాకెట్ను నిర్వహిస్తున్నారని తెలియడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు చోద్యం చూడాల్సి వస్తోంది. పాలకొల్లు కల్తీ మద్యం కేసులో టీడీపీ నేత పులి శీతల్ అరెస్టుతో సరిపెట్టారు తప్ప.. టీడీపీ ప్రజాప్రతినిధి వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. టీడీపీ సిండికేట్ ద్వారానే స్పిరిట్ అక్రమ రవాణా రాష్ట్రంలో కల్తీ మద్యం రాకెట్ దందాను టీడీపీ మద్యం సిండికేట్ వ్యవస్థీకృతం చేసింది. ప్రభుత్వ పెద్దల అండదండలతో జిల్లాలు, రీజియన్ల వారీగా పంచుకుని మరీ కల్తీ మద్యం దందాను సాగిస్తోంది. అందుకోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను అక్రమంగా కొనుగోలు చేస్తోంది. సాధారణంగా ఈ స్పిరిట్ కొనుగోలుపై మద్యం డిస్టిలరీలకు పరిమితి ఉంటుంది. కానీ కోవిడ్ సమయంలో దేశంలో శానిటైజర్లను అత్యధికంగా ఉత్పత్తి చేయాల్సి రావడంతో స్పిరిట్ కొనుగోళ్లపై పరిమితిని తొలగించారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు ఏవీ లేనప్పటికీ స్పిరిట్ను భారీగా కొనుగోలు చేయడానికి అనుమతిస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. సరిగ్గా దీన్ని టీడీపీ మద్యం సిండికేట్ తమ దందాకు అవకాశంగా మలుచుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఆసరాగా చేసుకుని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని స్పిరిట్ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 20 మద్యం డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల ఆ«దీనంలోనే ఉండటం సిండికేట్ దందాకు కలసి వస్తోంది. అలా సేకరించిన స్పిరిట్ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నాయి. ఆ విధంగా భారీగా కొనుగోలు చేసిన స్పిరిట్తో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. అందుకోసం కల్తీ మద్యం యూనిట్లలో యంత్ర సామగ్రిని తెప్పించి పక్కాగా భారీ ప్లాంట్లనే నెలకొల్పారు. అక్రమంగా సేకరించిన స్పిరిట్ను డైల్యూట్ (పలుచన) చేసి అందులో కారమెల్, కలర్డ్ ఫ్లేవర్లు (రంగు నీళ్లు) కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పిస్తున్నారు. ఆ కల్తీ మద్యాన్ని బాట్లింగ్ చేసి బ్రాండెడ్ మద్యంగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇలా కల్తీ దందా సాగిపోతోంది. సిండికేట్ దుకాణాలు, బెల్టు షాపులకు సరఫరా టీడీపీ సిండికేట్ తయారు చేస్తున్న కల్తీ మద్యాన్ని యథేచ్ఛగా విక్రయిస్తోంది. రాష్ట్రంలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలన్నీ సిండికేట్ గుప్పిట్లోనే ఉన్నాయి. వాటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలనూ సిండికేట్ నిర్వహిస్తోంది. ఆ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యా న్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యంగా నమ్మబలుకుతూ కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం నెట్వర్క్ అంతా టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ఉండటంతో ఈ దందా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది.ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ టీడీపీ సిండికేట్ సాగిస్తున్న కల్తీ మద్యం దందా విభ్రాంతి కలిగిస్తోంది. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనని ఎక్సైజ్ శాఖ వర్గాలే అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25లో మద్యం అమ్మకాల ద్వారా రూ.28,500 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–26లో రూ.35 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. 2024–25లో 4.26 కోట్ల ఐఎంఎల్ మద్యం కేసులు, 3.25 కోట్ల బీరు కేసులు విక్రయించారు. 4.26 కోట్ల ఐంఎఎల్ మద్యం కేసుల్లో 70 శాతం క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిళ్లే విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి. దీన్నిబట్టి 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించినట్లు వెల్లడవుతోంది. తద్వారా మొత్తం క్వార్టర్ బాటిళ్లలో మూడో వంతు కల్తీ మద్యం విక్రయించినట్లు అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు స్పష్టమవుతోంది. ఒక్కో క్వార్టర్ బాటిల్ను రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు. -
AP: రాజధాని కోసం బలవంతంగా భూములు లాక్కోవాలని నిర్ణయం
విజయవాడ: ఇప్పటికే ఎన్నో వేల ఎకరాలను అమరావతి రాజధాని కోసం సేకరించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు బలవంతపు భూ సేకరణ కోసం సిద్ధమైంది. ఎవరైనా భూములు ఇవ్వను అంటే మాత్రం బలవంతంగా లాక్కోవాలని నిర్ణయిచింది. ఈ మేరకు దీనికి ఏపీ కేబీనెట్ ఆమోదం తెలిపింది ల్యాండ్ పూలింగ్లో భాగంగా భూములు ఇవ్వనివారి నుంచి బలవంతంగా లాక్కోవాలని నిర్ణయించారు గతంలో స్వచ్ఛందంగా భూములు తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు భూమలు ఇవ్వనివారిపై జులుం ప్రదర్శించేందుకు రంగం సిద్ధం చేశారు. దాంతో రెండో విడతలో భూముల కోసం రైతులకు ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరించినట్లయ్యింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటివరకు అమరావతి రాజధాని కోసం సుమారు 79,365 ఎకరాలు భూమిని సేకరించింది. ఇందులో 34,689 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా, మరో 44,676 ఎకరాలు తాజా భూసేకరణ ద్వారా పొందనున్నారు రాజధాని కోసం చంద్రబాబు ప్రభుత్వం భూ సేకరణ వివరాలు ఇలా..ల్యాండ్ పూలింగ్ ద్వారా (2014–2019)34,689 ఎకరాలు 29 గ్రామాల నుంచి రైతుల సహకారంతో సేకరించారు.రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, విద్య, ఆరోగ్య సదుపాయాలు హామీ ఇచ్చారు.తాజా భూసేకరణ (2025)44,676 ఎకరాలు అదనంగా సేకరించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక సిద్ధంగ్రామాలుతూళ్లూరు మండలం: హరిచంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి – 9,919 ఎకరాలుఅమరావతి మండలం: వైకుంఠపురం, ఎండ్రాయి, కార్లపూడి, మొత్తడాక, నిడముక్కల – 12,838 ఎకరాలుతాడికొండ మండలం: తాడికొండ, కంతేరు – 16,463 ఎకరాలు- మంగళగిరి మండలం: కాజా – 4,492 ఎకరాలుగతంలో రైతుల కోసం హామీలు ఇలా..బలవంతం లేకుండా భూసేకరణప్రోత్సాహక ప్యాకేజీలుభవిష్యత్తు మౌలిక వసతులపై హామీఇప్పుడు ఇలా..భూములు ఇవ్వకపోతే బలవంతంగా సేకరించేందుకు నిర్ణయంఇదీ చదవండి: ‘చంద్రబాబుకు ఎస్సీలంటే మొదట్నుంచీ చిన్నచూపు’ -
‘చంద్రబాబుకు ఎస్సీలంటే మొదట్నుంచీ చిన్నచూపు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎస్సీలంటే మొదట్నుంచీ చిన్నచూపని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 3వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన కనకారావు. దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన టీడీపీ నేత సతీష్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును మొదట్నుంచీ టీడీపీ నేతలు అడ్డుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు టీడీపీ నేత సతీష్ నాయుడు స్వయంగా విగ్రహానికి నిప్పు పెట్టారు. సతీష్ నాయుడుని వెంటనే అరెస్టు చేయాలి. దేశంలో దసరా ఉత్సవాలు జరుగుతుంటే ఏపీలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబుకు ఎస్సీలంటే మొదట్నుంచీ చిన్నచూపు. జగన్ అధికారంలోకి వచ్చాక విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ విగ్రహం దగ్గర లైట్లు కూడా తొలగించారుస్మృతివనంలో పనిచేసే కార్మికులకు 9 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు. పర్చూరు నియోజకవర్గంలో కూడా ఇటీవలే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు. దళితులను పోలీసులతో అరికాళ్ల మీద దాడి చేయించారు. చంద్రబాబు నిరంకుశత్వం ఎంతోకాలం నిలవదు. దళితులే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చుతారు. దళితుల భూములను కూడా కబ్జా చేసిన నీచ చరిత్ర టీడీపీ నేతలది. పిఠాపురం నియోజకవర్గంలో దళితులను బహిష్కరణ చేశారు. అసలు చంద్రబాబు ప్రభుత్వంలో దళితులు బతికే పరిస్థితి లేదు’ అని ధ్వజమెత్తారు. -
ముగిసిన ఓజీ ప్రమోషన్స్! మళ్లీ పొలిటికల్ మోడ్లోకి..
హైదరాబాద్/అమరావతి, సాక్షి: జ్వరంతో రాజకీయాలకు, తన విధులకు స్వల్ప విరామం తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తిరిగి బిజీ అయ్యారు. ఏపీ కేబినెట్ సమావేశం నేపథ్యంలో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు చేరుకున్నారు.వైరల్ ఫీవర్ కారణంగా మెరుగైన వైద్యం కోసం ఆయన హైదరాబాద్ వచ్చారని ఆయన సిబ్బంది అధికారికంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇక్కడికి వచ్చాక ఆయన జ్వరం ఎగిరిపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఎలాగూ వచ్చా కదా అని.. హైదరాబాద్లో అన్నయ్య చిరు అండ్ మెగా ఫ్యామిలీతో కలిసి ఓజీ స్పెషల్ ప్రివ్యూ వేసుకుని చూశారు. అంతేకాదు.. ఓజీ సక్సెస్ మీట్లలో హుషారుగా పాల్గొని సందడి చేశారు. అఫ్కోర్స్.. ఈ మధ్యలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చి పవన్ను పరామర్శించారు అది వేరే విషయంలేండి. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని.. ‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్న టైంలో సినిమా వాళ్లను పిలిపించుకుని మరీ అవమానించారంటూ’’ చేసిన వ్యాఖ్యలు.. వాటిపై స్పందించే క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారంటూ చిరు ఒక బహిరంగ ప్రకటనతో తేల్చేయడంతో బాలయ్యపై అటు మెగా అభిమానులు, ఇటు వైఎస్సార్సీపీ నేతలు భగ్గుమన్నారు. ఆ వ్యాఖ్యలపై పవన్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. పవన్ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవడాన్ని ఇటు చిరు ఫ్యాన్స్తో పాటు అటు జనసేన కార్యకర్తలే ఒకానొక దశలో భరించలేకపోయారు. మరి జ్వరం తగ్గింది కదా.. పొలిటికల్ అవతార్లోకి మారిపోయారు కదా.. ఇకనైనా స్పందిస్తారేమో చూడాలి అంటున్నారు పలువురు నెటిజన్లు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో దసరా వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. అమ్మవారికి వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నేతలు హాజరయ్యారు.తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి గెలుస్తుందన్నదే విజయదశమి పండుగ సారాంశం. అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయ దశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
మాజీ మంత్రి దామోదర్రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మా కుటుంబానికి సన్నిహితులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘టైగర్ దామన్న’గా సుపరిచితులైన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలాదేవి దంపతులకు రాంరెడ్డి దామోదర్రెడ్డి 1952 సెప్టెంబర్ 14న జన్మించారు.మా కుటుంబానికి సన్నిహితులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిగారి మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. pic.twitter.com/5fqvyDE7Oa— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ జిల్లా రాజకీయాల్లో దామోదర్రెడ్డిది ప్రత్యేక స్థానం. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో దామోదర్రెడ్డి రాజకీయ ప్రవేశంతో తుంగతుర్తిలో రాజకీయం మారిపోయింది. కమ్యూనిస్టులు, టీడీపీ ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో దామన్న, ఆయన సతీమణి ‘వరూధినీదేవిని వెంటబెట్టుకుని జిల్లాలో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కమ్యూనిస్టు యోధులు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గెలుపొందిన తుంగతుర్తి నుంచి ఆయన నాలుగుసార్లు గెలుపొందడం విశేషం. వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనే సూర్యాపేటలో బహిరంగ సభలు, ఖమ్మం జిల్లాలో సదస్సులు పెట్టి పార్టీలో ’టైగర్ దామన్న’గా గుర్తింపు పొందారు. -
మహాత్ముడికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. "స్వేచ్ఛ అనేది మనకోసమే కాదు, ఇతరులకూ సమానంగా ఉండాలి.” అని చెప్పిన నాయకుడు మహాత్మా గాంధీ. నేడు జాతిపిత జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.“స్వేచ్ఛ అనేది మనకోసమే కాదు, ఇతరులకూ సమానంగా ఉండాలి.” అని చెప్పిన నాయకుడు మహాత్మా గాంధీగారు. నేడు జాతిపిత జయంతి సందర్భంగా నివాళులు.#GandhiJayanti— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025లాల్ బహదూర్ శాస్త్రికి వైఎస్ జగన్ నివాళిమాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన `జై జవాన్..జై కిసాన్` నినాదం నేటికీ స్ఫూర్తి దాయకం అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు’’ అని ఎక్స్లో పేర్కొన్నారు.మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిగారు ఇచ్చిన ``జై జవాన్..జై కిసాన్`` నినాదం నేటికీ స్ఫూర్తి దాయకం. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025 -
వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్గా మిథున్రెడ్డి పునర్నియామకం
సాక్షి, అమరావతి: ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లాల వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్గా ఎంపీ పీవీ మిథున్రెడ్డిని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి నియమించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అక్రమ కేసులో మిథున్రెడ్డిని అరెస్టు చేయడంతో ఆయన బాధ్యతలను సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావులకు అప్పగించారు. ఇప్పుడు మిథున్రెడ్డి బెయిల్పై విడుదల కావడంతో ఆయా జిల్లాల బాధ్యతలు తిరిగి అప్పగించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.వైఎస్సార్సీపీలో నియామకాలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 49 మంది సభ్యులతో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ)ను, మరో 114 మంది సభ్యులతో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. -
వడివడిగా పసిడి పరుగు
రాయవరం: ‘ఏవండీ దసరా పండుగకు నెక్లెస్ కొంటారా..’ అంటూ గారాలు పోతున్న భార్యల వైపు భర్తలు బేల చూపులు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బంగారం ధర చూస్తే బేర్మనే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షల మార్కుకు చేరుకుంది. బంగారం ధరలు కళ్లెం లేని గుర్రంలా దౌడు తీస్తున్నాయి. కదం తొక్కుతున్న కాంచనానికి ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. పుత్తడితో పాటుగా తానూ ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా వెండి ధరలు కూడా విర్రవీగుతున్నాయి. స్వర్ణం వైపు చూడాలంటేనే సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం వివాహాల సీజన్ తిరిగి ప్రారంభం కావడంతో వివాహాలు నిర్వహించే సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే భయం భయంగా షాపుల వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.ఇంతింతై వటుడింతై అన్నట్లుగా... పసిడి, వెండి ధరలు ఇంతింతై వటుడింతై అన్న చందంగా పెరుగుతున్నాయి. ఒకదానికొకటి పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. జనవరి నెలలో 10 గ్రాముల బంగారం రూ.80 వేల వరకు పలకగా, జూలై నాటికి రూ.లక్షకు చేరుకుంది. ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లో రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరుగుతూ ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.1.20 వేలకు చేరుకుంది. ఆగస్టు, సెపె్టంబరు నెలలో సుమారు 10 గ్రాములకు రూ.20 వేల వరకు పెరిగింది. ఇదిలా ఉంటే వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి ధర రూ.92 వేలు పలుకగా, జూన్లో రూ.1.10 లక్షలు, జూలైలో రూ.1.11 లక్షలు, ఆగస్టులో రూ.1.11 లక్షలు ఉన్న కేజీ వెండి ధర నేడు రూ.1.50 లక్షలకు చేరింది. వెండిపై పెట్టుబడి పెట్టిన వారికి అదే తరహాలో లాభాలు వచ్చాయి. బంగారంతో పాటుగా వెండి ధర కూడా పరుగులు తీస్తూనే ఉంది. త్వరలోనే కేజీ రూ.2 లక్షలకు చేరుతుందన్న ఊహాగానాలున్నాయి. మదుపరుల ముందుచూపే కారణమా? పసిడి, వెండి ధరలు పెరుగుదలకు బులియన్ మార్కెట్ విశ్లేషకులు పలు రకాల కారణాలు పేర్కొంటున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్, గాజా మధ్య జరుగుతున్న యుద్ధంతో పాటుగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావంతో పసిడి ధర రోజు రోజుకు పరుగులు తీస్తోంది. దీనికితోడు బంగారంపై పెట్టుబడి సురక్షితంగా భావిస్తున్న మదుపరులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడం బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణంగా వర్తకులు భావిస్తున్నారు. ‘తూర్పు’లో పరిస్థితి ఇదీ.. కరోనా తర్వాత బంగారం వ్యాపారం బాగా తగ్గిపోయినట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. అంతకుముందు వారానికి ఆరు రోజులు వ్యాపారం సాగగా, ఇప్పుడు వారానికి నాలుగు రోజులు మాత్రమే వ్యాపారం సాగుతున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. పెద్ద షాపుల్లో రోజుకు 500 గ్రాముల వరకు అమ్మకాలు జరుగుతుండగా, చిన్న షాపుల్లో 20 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చిన్నా, పెద్దా కలిపి 2,500 వరకు బంగారం విక్రయాల షాపులున్నాయి. ఉమ్మడి జిల్లాలో కరోనాకు ముందు రోజుకు 20 కేజీల చొప్పున బంగారం అమ్మకాలు జరగ్గా, ప్రస్తుతం 15 నుంచి 18 కేజీల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. సీజన్ బట్టి ఈ అమ్మకాలు అటూఇటూగా ఉంటాయి. బంగారంతో పాటుగా వెండి అమ్మకాలు కూడా తగ్గాయి. ఆరు నెలల క్రితం వెండి కిలో రూ.50వేలు ఉండగా, ఆరు నెలల కాలంలో రూ.1.50 లక్షలకు చేరింది. చైనా, జపాన్ వంటి దేశాల్లో వెండిని ఎల్రక్టానిక్స్, సాంకేతిక అవసరాలకు ఉపయోగించడం, ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడంతో బంగారం, వెండి ధరలు ఊహించని పెరుగుదల కని్పంచి ఆల్టైమ్ రికార్డుకు వాటి ధరలు చేరుకున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. లాభాలు కళ్ల చూస్తున్న బడాబాబులుబంగారం ధర పెరగడంతో బడా బాబులు లాభాలు కళ్ల జూస్తున్నారు. ధర పెరుగుతుందన్న ముందుచూపుతో పలువురు మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెట్టారు. వడ్డీ వ్యాపారం చేసే వారు కూడా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకే మొగ్గు చూపారు. దీంతో 100 గ్రాముల వంతున బిస్కెట్లు కొన్నారు. మరికొందరు 50 నుంచి 70 కాసుల మధ్య వడ్డాణం వంటి వస్తువుల్ని తయారు చేయించుకున్నారు. ప్రస్తుతం ధర రూ.లక్ష దాటడంతో వీరందరిలో జోష్ నెలకొంది. పెట్టిన పెట్టుబడుల్లో 30 నుంచి 40 శాతం వరకు లాభాలను చూశారు. -
కొనసాగుతున్న పీహెచ్సీ వైద్యుల సమ్మె
సాక్షి, అమరావతి: పీహెచ్సీ వైద్యుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామీణ, గిరిజనప్రాంత ప్రజలకు ప్రత్యామ్నాయ వైద్యసేవల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. దీంతో గ్రామీణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పీజీ వైద్యవిద్యలో ఇన్సర్వీస్ కోటా 20 శాతానికి పునరుద్ధరణ, పదోన్నతులు, అలవెన్స్ల మంజూరు వంటి డిమాండ్లతో సోమవారం నుంచి పీహెచ్సీ వైద్యులు చేపట్టిన సమ్మె బుధవారం మూడోరోజు కూడా కొనసాగింది. శ్రీసత్యసాయి జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో వైద్యులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టరేట్లు, డీఎంహెచ్వో కార్యాలయాల ముందు ఆందోళనలు, ర్యాలీలు చేశారు. ఉన్నతాధికారులకు వినతిపత్రాలిచ్చారు. జిల్లాల్లో మహిళా వైద్యులు వినూత్న పద్ధతుల్లో నిరసన తెలుపుతూ వీడియోలు చిత్రీకరించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దగాచేసిన ప్రభుత్వం గతేడాది ఇదే మాదిరిగా సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపినట్టు వైద్యులు గుర్తుచేశారు. అప్పట్లో 20 శాతం ఇన్సరీ్వస్ కోటాను వైద్యవిద్య పీజీలో అన్ని బ్రాంచ్లకు వర్తింపజేసినట్టు తెలిపారు. ఇదే విధానాన్ని మరో రెండు, మూడేళ్లు కొనసాగించాలని కోరగా సరే అని ప్రభుత్వం హామీ ఇచి్చందని గుర్తుచేశారు. అయితే 10 నెలలు కూడా తిరగకుండానే మళ్లీ 20 శాతం కోటాను 15 శాతానికి కుదించి కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు. ఇది కూడా కేవలం ఏడు బ్రాంచ్లకు పరిమితం చేశారని మండిపడ్డారు. చర్చలు విఫలం అధికారుల నుంచి స్పష్టమైన హామీలు రాకపోవడంతో తమ సమ్మెను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించినట్టు వైద్యుల సంఘం ప్రతినిధి డాక్టర్ వినోద్ తెలిపారు. గురువారం ఛలో విజయవాడ చేపడతామని తెలిపారు. శుక్రవారం నుంచి ఆమరణ దీక్షలకు పూనుకుంటామని స్పష్టం చేశారు. తమ సమస్యలు పరష్కరించేవరకూ వెనకడుగు వేసేది లేదన్నారు. వైద్యులు చేస్తున్న సమ్మెకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సందీప్ ప్రకటన విడుదల చేశారు.సీఏఎస్(జనరల్) వైద్యుల సమ్మె నోటీస్ పీహెచ్సీ వైద్యులు తరహాలోనే డైరెక్టర్ సెకండరీ హెల్త్ పరిధిలో పని చేస్తున్న సీఏఎస్(జనరల్) వైద్యులు బుధవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఇన్ సర్వీస్ కోటా ఇతర సమస్యలు పరిష్కరించకపోతే శుక్రవారం నుంచి డెప్యుటేషన్పై పీహెచ్సీల్లో ఓపీ సేవలు, సీహెచ్సీల్లో సాధారణ సేవలు అందించేది లేదన్నారు. 6 నుంచి ఎమర్జెన్సీ సేవలు నిలిపేస్తామని ప్రకటించారు. -
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు పదవి?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం చకచకా అడుగులేస్తుంటే సీఎం చంద్రబాబుకు కనీసం చీమ కుట్టినట్టైనా లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎత్తు పెంచడం వల్ల ఆల్మట్టి సామర్థ్యం 129.72 నుంచి 279.82 టీఎంసీలకు పెరుగుతుందని.. దీనివల్ల రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి? అంటూ చంద్రబాబును నిలదీశారు. ఇప్పటికైనా మేల్కొని ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబుకు హితవు పలికారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతోపాటు, కేడబ్యూడీటీ–2 విచారణపై దృష్టి పెట్టి సమర్థంగా వాదనలు వినిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయమని చంద్రబాబును హెచ్చరించారు. ఈమేరకు వైఎస్ జగన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» చంద్రబాబు గారూ.. మీరు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్ర హక్కులను కాపాడే ఉద్దేశం మీలో ఏ కోశానా కనిపించడంలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదు. అనేక ప్రాంతాలు సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నాసరే మీరెందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే, రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి?» గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 నుంచి 524.256 మీటర్లకు పెంచి నీటిని నిల్వ చేయడానికి అవసరమైన పనులు, స్పిల్వే సహా, గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే.. అప్పట్లోనూ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా, మీ ఎంపీల బలంమీదే నాటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా, 1995–2004 వరకూ కేంద్రంలో చక్రం తిప్పినట్లు మీకు మీరే గొప్పలు చెప్పుకున్న కాలంలో మీకున్న రాజకీయ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడలేదన్నది నిజమే కదా? సుప్రీంకోర్టు ఆదేశాలతో 519 మీటర్లకు పరిమితం అయినా, చివరకు మీ హయాంలోనే తాను కోరుకున్న స్థాయిలో ఆల్మట్టి స్పిల్వే సహా గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు కర్ణాటక ప్రభుత్వం పూర్తి చేసిందనేది వాస్తవం కాదా? » గత రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బ తింటున్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మీ వైఫల్యాల పుణ్యమే కదా చంద్రబాబూ? ఇప్పుడు మళ్లీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, మళ్లీ ఆల్మట్టిలో 519 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు ఎత్తు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు.. దీనికోసం రానున్న మూడేళ్లలో రూ.70 వేల కోట్లు ఖర్చు చేయాలని నిశ్చయించింది. ఇంత జరుగుతున్నా మీలో కదలిక కనిపించడం లేదు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మీరు చక్రం తిప్పుతున్నారని మీరు, మీ ఎల్లోమీడియా రోజూ ప్రచారం చేసుకుంటున్నారు.మీ ఎంపీల బలం మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న మాట కూడా వాస్తవమే. మరి అలాంటప్పుడు మీకున్న రాజకీయ బలాన్ని ఉపయోగించి, ఒత్తిడి తెచ్చి తద్వారా పనుల నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? ఎత్తు పెంపును ఆమోదిస్తూ కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబరు 16న నిర్ణయం తీసుకుంటే ఇప్పటివరకూ మీరెందుకు స్పందించడం లేదు? అసలు రాష్ట్రం అంటే మీకు పట్టింపు ఉందా? లేదా? » మరోవైపు జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన కృష్ణా జలవివాద ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2 ) ముందు రాష్ట్రం తరఫున వినిపిస్తున్న వాదనలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. కృష్ణా నదిలో బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ –1) 75 శాతం లభ్యత ఆధారంగా (నికర జలాలు) కేటాయించిన జలాలను కొనసాగిస్తూనే 65 శాతం లభ్యత ఆధారంగా (మిగులు జలాలను) పంపిణీ చేస్తూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తీర్పు అమల్లోకి వస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది. ఆ స్థాయిలో నీటి లభ్యత పరిగణనలోకి తీసుకున్న పరిస్థితుల్లో, దాన్ని ప్రామాణికంగా తీసుకుని కేటాయింపులు చేయడం వల్ల రాష్ట్రానికి ఊహించని విధంగా నష్టం జరుగుతుంది. కరువు వస్తే రాష్ట్రమే భరించాలి. ఎలాగూ దిగువ రాష్ట్రం మనదే కాబట్టి వరద వచ్చినా రాష్ట్రమే ఆ నష్టాన్ని భరించే విధంగా ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. దీన్ని గుర్తించి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 అక్టోబరులోనే పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటాన్ని ప్రారంభించింది. కానీ మీరు ఇప్పుడు సమర్థంగా వాదనలు వినిపించి రాష్ట్ర హక్కులను కాపాడటంలో చిత్తశుద్ధి చూపడం లేదు.» చంద్రబాబూ.. మీరు ఇప్పటికైనా మేలుకోండి. కేంద్రంలో ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతోపాటు కేడబ్ల్యూడీటీ–2 విచారణపై దృష్టి పెట్టి సమర్థ వాదనలు వినిపించండి. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. -
సోషల్ మీడియా కట్టడికి మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే సహించలేని స్థితిలో ఉన్న సీఎం చంద్రబాబు దానిని కట్టడి చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని సిద్ధం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మానవ వనరులు, ఐటీ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫరాలు, సమాచార శాఖ, హోం శాఖ మంత్రులతో కూడిన బృందాన్ని కమిటీగా ఏర్పాటు చేశారు. కమిటీ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి సమాచార శాఖ డైరెక్టర్ ఈ బృందానికి కన్వీనర్గా వ్యవహరిస్తారు. కమిటీ ఎవరైనా నిపుణుల సహాయం తీసుకోవచ్చు.మంత్రుల బృందం బాధ్యతలివీ» దేశంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు వర్తించే ప్రస్తుత చట్టాలు, నియమాలు, మార్గదర్శకాలను సమీక్షించాలి.» జవాబుదారీతనం, సమ్మతి అమలులో అంతరాలను గుర్తించాలి.» అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలి. పారదర్శకత ప్రమాణాలు, ప్లాట్ఫామ్ బాధ్యతలు, వినియోగదారుల రక్షణ చర్యలతో సహా సోషల్ మీడియా జవాబుదారీతనానికి ప్రపంచ విధానాలను విశ్లేషించాలి.» హానికరమైన కంటెంట్, తప్పుడు సమాచారం, ఆన్లైన్ దుర్వినియోగం, జాతీయ భద్రతకు ముప్పు తదితర అంశాలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సులు చేయాలి.» ఫిర్యాదుల పరిష్కారం, నివేదించే విధానాలపై స్పష్టమైన బాధ్యతలను సూచించాలి. పౌర హక్కులను కాపాడటంపై సలహా ఇవ్వాలి.» నిరంతర పర్యవేక్షణ కోసం నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలను సృష్టించడం లేదా బలోపేతం కోసం సిఫార్సు చేయాలి. » నిర్ణయం తీసుకోవడానికి వీలుగా మంత్రుల బృందం తమ సిఫార్సులను ప్రభుత్వానికి త్వరగా సమర్పించాలి. -
బాబు బ్యాచ్ది దుష్ప్రచారమే.. జగన్ పాలనలో ‘సుర’క్షితం
సాక్షి, అమరావతి: మద్యంపై ఎన్నికల ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బ్యాచ్ చేసిన ప్రచారం అంతా పచ్చి బోగస్ అని తేలింది. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమ, కల్తీ మద్యం జాడే లేదని సాక్షాత్తూ కేంద్రహోంశాఖ వెలువరించిన నివేదిక స్పష్టం చేస్తున్నాయి. 2022–23లో రాష్ట్రంలో కల్తీ మద్యం కేసు ఒక్కటీ నమోదు కాలేదు. ఏ ఒక్కరూ అస్వస్థతకు గురికాలేదు. ఏ ఒక్కరూ మరణించలేదు. ఈ విషయాలన్నింటినీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన 2023 ఎన్సీఆర్బీ(నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో) నివేదిక స్పష్టంగా తేల్చిచెప్పింది. నాణ్యత లేని కల్తీ మద్యం తాగి వేల మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది అనారోగ్యానికి గురయ్యారంటూ ఎన్నికల ముందు చంద్రబాబుతోపాటు ఆయన భజన బృందం, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశాయి. ఆ ప్రచారాలన్నీ పచ్చి అబద్ధాలేనని తాజా ఎన్సీఆర్బీ నివేదికలు కుండబద్దలు కొట్టాయి. అంటే ఎన్నికల ముందు ఆఖరికి మద్యం విషయంలో కూడా చంద్రబాబు దిగజారిపోయి విషప్రచారం చేశారనేది సుస్పష్టమైంది. ఇవిగో గణాంకాలు ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం... దేశంలో 2022లో అక్రమ, కల్తీ మద్యం కేసులు 507 కేసులు నమోదయ్యాయి. అక్రమ, కల్తీ మద్యం సేవించిన ఘటనల్లో 617 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2022లో అక్రమ, కల్తీ మద్యం సేవించిన కేసు ఒక్కటీ నమోదు కాలేదు. ఎవరూ అస్వస్థతకు గురికాలేదు. ఒక్క మరణమూ నమోదు కాలేదు. 2022లో అక్రమ, కల్తీ మద్యం సేవించి బిహార్లో 134 మంది, కర్ణాటకలో 96 మంది, పంజాబ్లో 90 మంది, ఛత్తీస్గఢ్లో 60 మంది, జార్ఖండ్లో 55 మంది, ఉత్తరప్రదేశ్లో 50 మంది మరణించారు. అలాగే 2023లో దేశంలో అక్రమ, కల్తీ మద్యం సేవించిన కేసులు 456 నమోదు కాగా ఈ ఘటనల్లో 522 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్రమ, కల్తీ మద్యం సేవించిన ఒక్క కేసూ నమోదు కాలేదు. ఎవరూ అస్వస్థతకు గురికాలేదు. మరణాలు సంభవించలేదు. 2023లో అక్రమ, కల్తీ మద్యం సేవించిన ఘటనల్లో అత్యధికంగా జార్ఖండ్లో 194 మంది మరణించగా, కర్ణాటకలో 79 మంది, బిహార్లో 57 మంది, ఛత్తీస్గఢ్లో 37 మంది, పంజాబ్లో33 మరణాలు, హిమాచల్ ప్రదేశ్లో 25 మంది మృతి చెందినట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. -
పండగపూట.. పండుటాకులకు షాక్!
పింఛన్ డబ్బులో కోత వేశారు పింఛనుపైనే ఆధారపడి జీవిస్తున్నా. ఇంటి పన్ను వసూలు కోసం ఈ నెల పింఛన్ల డబ్బుల్లో కోత విధించారు. మార్చి నెల వరకు గడువున్నా ఇప్పుడే ఇంటి పన్ను వసూలు చేశారు. నెలంతా ఆ డబ్బులే నాకు ఆధారం. ఏ పని చేయలేని పరిస్థితి. పింఛను సొమ్ముతోనే కుటుంబ పోషణ, మందులు కొనుక్కోవాలి. – రామన్నదొర, దివ్యాంగుడు, గోపవరం జగన్ హయాంలో ఇంటికే పెన్షన్లు, పథకాలు.. ఒకటో తారీఖు వచ్చిందంటే పండుగ! బాబు పాలనలో ఇంటింటికీ అగచాట్లు, కోతలు, పన్ను పోటు.. ఒకటే తేదీ అంటే వణుకే! సాక్షి, అమరావతి, నెట్వర్క్: గత ప్రభుత్వంలో ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఇంటివద్దే ఆత్మగౌరవంతో పింఛన్లు అందుకున్న అవ్వాతాతలు, దివ్యాంగులను ఇప్పటికే రోడ్డుకీడ్చి దురవస్థ పాలు చేసిన చంద్రబాబు సర్కారు.. పండుగ పూట వారికి మరో షాక్ ఇచ్చింది. పండుటాకులకు ఒకచేతితో పింఛన్లు ఇస్తూ మరోచేతితో వాటిని ఇంటి పన్నుల కింద జమ చేసుకుంటోంది. బుధవారం పింఛన్ల పంపిణీలో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఈ ఏడాది ఇంటి పన్నులు 100 శాతం వసూలు చేయాలని కూటమి సర్కారు ఆదేశించడంతో పింఛన్ల డబ్బుల నుంచి దాన్ని మినహాయించుకుంటున్నారు. పింఛన్ డబ్బులే తమకు జీవనాధారమని, నెలంతా వాటితోటే గడపాలని, మందులకూ అవే దిక్కని వృద్ధులు ఆక్రోశిస్తున్నారు. గత ప్రభుత్వంలో అవ్వాతాతలకు గుడ్ మార్నింగ్ చెప్పి మరీ ఇంటి వద్దే పెన్షన్లు ఇచ్చిన వలంటీర్ల వ్యవస్థను కక్షపూరితంగా రద్దు చేసిన చంద్రబాబు సర్కారు సచివాలయాల వ్యవస్థను కూడా పూర్తిగా నీరుగార్చింది. సామాజిక పెన్షన్లకు ఎడాపెడా కోతలు పెట్టింది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో గరిష్టంగా ఇచ్చిన పింఛన్ల సంఖ్య ఏకంగా 66.34 లక్షలు కాగా కూటమి సర్కారు ఈ ఏడాది సెపె్టంబర్ 1న డబ్బులు పంపిణీ చేసిన పింఛన్లు కేవలం 61,93,363 మాత్రమే కావడం గమనార్హం. అంటే ఏడాదిన్నరలో దాదాపు నాలుగున్నర లక్షల మంది పింఛన్లకు కోత వేసినట్టు స్పష్టమవుతోంది. ఇక దివ్యాంగుల పరిస్థితి మరీ దారుణం. వైకల్య శాతం పేరుతో దాదాపు లక్ష దివ్యాంగ పింఛన్లను చంద్రబాబు ప్రభుత్వం ఎగరగొట్టింది. దేశంలో ఏ పాలకుడూ ఇంత నిర్దయగా వ్యవహరించిన దాఖలాలు లేవని దివ్యాంగులు ఆర్తనాదాలు చేసినా కూటమి సర్కారు పట్టించుకోలేదు. వంద శాతం వసూళ్లకు పింఛన్లే టార్గెట్..! గ్రామాల్లో ఈ ఆర్థిక ఏడాది ఇంటి పన్ను వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. దీంతో సాధారణంగా గ్రామాల్లో పంటలు వచ్చాక డిసెంబరు నుంచి మార్చి వరకు జరిగే ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమాన్ని అధికార యంత్రాగం ఆగస్టు నుంచే ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను డిమాండ్ రూ.702 కోట్లతో పాటు పాత బకాయిలు మరో రూ.233 కోట్లు కలిపి మొత్తం రూ.935 కోట్లుగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నుంచే కొత్తగా యజమానికి జారీ చేసే ఇంటి పన్ను నోటీసు, పన్ను చెల్లింపు ప్రక్రియ ఆన్లైన్లో కొనసాగేలా పంచాయతీరాజ్ శాఖ వెబ్పోర్టల్ తెచ్చింది. నోటీసు అందుకున్న 15 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ, జిల్లాల వారీగా ఏ రోజు ఎంత మేర ఇంటి పన్ను వసూలు జరిగిందో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పాత బకాయిలు రూ.233 కోట్లు నెల రోజుల్లో వసూలు చేయాలని ఆదేశించారు. దీంతో ఇంటి పన్ను వసూలుకు పెన్షన్ల పంపిణీ సరైన సమయంగా భావించారు. అవ్వాతాతలు, ఇతర లబ్ధిదారులకు 1వ తేదీన పింఛను ఇవ్వగానే ఆ డబ్బును ఇంటిపన్ను కింద లాగేసుకుని రశీదు చేతిలో పెడుతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం చిత్తూరు జిల్లావ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అవస్థల నడుమ ఆలస్యంగా సాగింది. వేకువజామున లబ్ధిదారుల ఇంటివద్దకు వెళ్లి ఇవ్వాల్సి ఉండగా ఉదయం 11 వరకు సచివాలయాల్లో పంపిణీ ప్రారంభించలేదు. ఇంటింటికి వెళ్లి తాము పంపిణీ చేసేందుకు వలంటీర్లం కాదంటూ నిరసన వ్యక్తం చేశారు.అల్లూరి జిల్లా తామరపల్లి పంచాయతీ గోపవరంలో బంధం కుమారికి పింఛన్ నుంచి ఇంటిపన్ను మినహాయించుకుని చేతిలో పెట్టిన రశీదు పెన్షన్ డబ్బులిచ్చి.. పన్ను రశీదు చేతిలో పెట్టారు సచివాలయ ఉద్యోగి పింఛను డబ్బులు ఇచ్చిన వెంటనే ఇంటి పన్ను రశీదు ఇచ్చి బలవంతంగా వసూలు చేశారు. పింఛన్లు డబ్బుల నుంచి ఇంటి పన్ను వసూలు చేయడం దారుణం. నెలంతా ఎదురు చూసే డబ్బులకు కోత పెట్టడం అన్యాయం. ఇంటి పన్నులు గతం కంటే ఎక్కువగా వస్తున్నాయి. – బోరగ చిన్నలమ్మ, వృద్దురాలు, గోపవరంఇచ్చినట్టే ఇచ్చి... ఇటు పింఛను డబ్బులిచ్చి అటు ఇంటి పన్ను అంటూ రూ.710 వసూలు చేశారు. పింఛను డబ్బులపైనే ఆధారపడి జీవించే మాలాంటి వారి నుంచి బలవంతంగా వసూలు చేయడం అన్యాయం. నెమ్మదిగా ఇంటి పన్ను చెల్లిద్దామనుకుంటే పింఛను డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాక్కున్నారు. గతంలో ఇంటి పన్ను రూ.400 మాత్రమే రాగా ఇప్పుడు బాగా పెరిగింది. – బంధం సముద్రలమ్మ, వితంతువు ,గోపవరంఅల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం తామరపల్లి పంచాయతీ పరిధిలోని గోపవరంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పంపిణీ చేసిన సామాజిక పెన్షన్లలో బుధవారం కోత విధించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే పన్ను రశీదులు చేతిలో పెట్టారని పింఛనుదారులు వాపోయారు. పింఛను డబ్బులనే నమ్ముకుని నెలంతా గడిపే వారికి కోత విధించడంతో దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. తామరపల్లి పంచాయతీ పరిధిలో వివిధ రకాల పింఛనుదారులు 261 మంది ఉండగా పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారుల వద్ద డబ్బులు ఉంటాయి కాబట్టి వాటిని రాబట్టాలని జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించినట్లు చెబుతున్నారు. ఏజెన్సీ అంతటా పన్నులు వసూలు చేయాలని నిర్దేశించినట్లు పేర్కొంటున్నారు. – రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)పింఛన్ కోసం పడిగాపులు రాజుపాలెం: వెల్ఫేర్ అసిస్టెంట్ అత్యుత్సాహం పింఛనుదారులను ముప్పతిప్పలు పెట్టింది. కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసేవరకు వెళ్లింది. ఉదయం 6 నుంచి 10 వరకు అటుఇటు తిరిగిన పింఛన్దారులు గందరగోళానికి గురయ్యారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీకృష్ణ గ్రీన్ అంబాసిడర్ ద్వారా 10 గంటలకు పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్లు ఇస్తామని దండోరా వేయించారు. దీంతో పింఛన్దారులు పెద్దఎత్తున చేరుకున్నారు. ఇన్చార్జి ఎంపీడీవో పగడాల ముక్కంటి హుటాహుటిన అనుపాలెం చేరుకుని సిబ్బందిని పురాయించి పింఛన్ల పంపిణీ చేపట్టారు. -
లూథ్రాకు కోట్లు... ఖజానాకు తూట్లు
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన సమయంలో రాష్ట్ర ఆర్థి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని తరచూ చెప్పే సీఎం చంద్రబాబు నాయుడు తన ఆస్థాన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు మాత్రం భారీ మొత్తంలో ప్రజాధనాన్ని ఫీజుల రూపంలో కట్టబెడుతున్నారు. ఈ ఏడాది మార్చిలో లూథ్రాకు రూ.2.86 కోట్లను ఫీజులుగా చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా మరో రూ.1.87 కోట్లను సంతర్పణ చేసింది. తద్వారా ఏడు నెలల్లో లూథ్రాకు ఫీజుల కింద మొత్తం రూ.4.73 కోట్లు చెల్లించింది. ఈ ఫీజుల్లో అత్యధిక భాగం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసుల వాదనలకు సంబంధించినదే కావడం గమనార్హం. లూథ్రాకు ఒక కేసులో వాయిదా కోరినందుకే ఏకంగా రూ.30 లక్షలు ఫీజుగా, దీనికి 10 శాతం క్లర్కేజీ అదనంగా కలిపి రూ.33 లక్షలు చెల్లించారు. గతంలోనూ ఇదే కేసులో ఆయనకు రూ.11 లక్షలు చెల్లించారు. లూథ్రా ఫీజులకే వైఎస్సార్సీపీ నేతలపై కేసులన్నట్లుగా ఉంది పరిస్థితి వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వాదించిన కేసుల్లో లూథ్రాకు ప్రభుత్వం రూ.90 లక్షలను ఫీజులుగా చెల్లించింది. లూథ్రాకు ఫీజుల సంతర్పణ చేసేందుకే పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారా అన్నట్లు పరిస్థితి ఉంది. వైఎస్సార్ సీపీ నేతలపై ఏ సెక్షన్ల ప్రకారం నమోదు చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఆ కేసుల్లో బెయిల్ రాకుండా ఏం చేయాలి.. వంటి వ్యూహాలన్నీ లూథ్రానే రచిస్తున్నారని సమాచారం. కుంభకోణం ఏదైనా బాబు అండ్ కోకి లూథ్రానే లూథ్రా దశాబ్దానికిపైగా చంద్రబాబుకు న్యాయ సేవలు అందిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టు వరకూ బాబుకు ఎక్కడ అవసరమైతే అక్కడ లూథ్రా వాలిపోతారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కావొచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ తదితర కుంభకోణాల్లో కూడా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ అండ్ కో తరఫున కోర్టుల్లో లూథ్రానే వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్లో కనబడని ‘లూథ్రా’ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయినప్పుడు చంద్రబాబు తన ఆస్థాన సీనియర్ న్యాయవాది లూథ్రానే నమ్ముకున్నారు. బాబు కోసం ఆయన ఏసీబీ కోర్టులో రోజుల తరబడి వాదనలు వినిపించారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు పక్కగా ఉండటంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. హైకోర్టులోనూ లూథ్రా తేలిపోయారు. తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా చంద్రబాబు తరఫున లూథ్రానే కీలకపాత్ర పోషించారు. అయితే చంద్రబాబుకు ఊరట మాత్రం దక్కలేదు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేశ్కు భరోసా ఇస్తూ లూథ్రానే మొత్తం కథ నడిపారు. ఇందుకుగాను లూథ్రాకు కోట్ల రూపాయలు చెల్లించారు. మద్యం అక్రమ కేసులో లూథ్రా కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు.. మద్యం అక్రమ కేసులో అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులో లూథ్రానే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఫీజులుగా చెల్లిస్తుందో వేచి చూడాలి. కనీసం రూ.5 కోట్ల పైచిలుకే ఆయనకు ఫీజుల రూపంలో చెల్లించే అవకాశం ఉందని అంచనా. మద్యం కేసులో సాయం, సలహా, సమన్వయం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం లూథ్రాకే అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచి్చంది. గతంలో ఏ కేసులో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఓ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదికి ఇలాంటి బాధ్యతలు అప్పగించిన ఉదంతం లేదు. -
వాయుగుండం ప్రభావం.. వచ్చే రెండురోజులు వర్షాలు
సాక్షి,అమరావతి/విజయపురిసౌత్/ధవళేశ్వరం/పోలవరం రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర–వాయువ్య దిశగా కదిలి బుధవారం వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖపటా్ననికి 400 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్పూర్కు 420, పూరికి 450, పారాదీప్కి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.శుక్రవారం తెల్లవారుజామున గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని, శుక్రవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా మాడుగులలో 7.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గాదిరాయిలో 5.1, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 3.8, శ్రీకాకుళం జిల్లా పలాసలో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే రెండురోజుల్లో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
ఏపీని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రయోజనాల్ని గాలి కొదిలేశారంటూ చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదా అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు. చంద్రబాబూ.. మీరు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించడంలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదు. అనేక ప్రాంతాలు సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నాసరే మీరెందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే, రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి? .@ncbn గారూ… మీరు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించడంలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 1, 2025 గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణాజలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన పనులు, స్పిల్వే సహా, గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే అప్పట్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా, మీ ఎంపీల బలంమీదే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా, 1995-2004వరకూ కేంద్రంలో చక్రం తిప్పినట్టుగా మీకుమీరే గొప్పలు చెప్పుకున్న కాలంలో, మీకున్న రాజకీయబలాన్ని రాష్ట్ర ప్రయోజనాలకోసం వాడలేదన్నది నిజమే కదా? సుప్రీంకోర్టు ఆదేశాలతో 519 మీటర్లకు పరిమితం అయినా, చివరకు మీ హయాంలోనే తాను కోరుకున్న స్థాయిలో ఆల్మట్టి స్పిల్వే సహా గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు కర్ణాటక ప్రభుత్వం పూర్తిచేసిందనేది వాస్తవం కాదా?గడచిన రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో కృష్ణాజలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బతింటున్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మీ వైఫల్యాల పుణ్యమే కదా చంద్రబాబుగారూ? ఇప్పుడు మళ్లీ, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, మళ్లీ ఆల్మట్టి లో 519 మీటర్ల నుంచి 524.256 మీటర్ల కు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధమయ్యింది. నీటినిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు, దీనికోసం రానున్న 3 ఏళ్లలో రూ.70వేల కోట్లు ఖర్చు చేయాలని నిశ్చయించింది. ఇంత జరుగుతున్నా మీలో కదలిక కనిపించడంలేదు చంద్రబాబుగారూ?..ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మీరు చక్రం తిప్పుతున్నారని మీరు, మీ ఎల్లోమీడియా రోజూ ప్రచారం చేసుకుంటున్నారు. పైగా మీ ఎంపీల బలంమీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న మాటకూడా వాస్తవమే. మరి అలాంటప్పుడు మీకున్న రాజకీయ బలాన్ని ఉపయోగించి, ఒత్తిడి తెచ్చి తద్వారా పనుల నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబరు 16న నిర్ణయం తీసుకుంటే ఇప్పటివరకూ మీరెందుకు స్పందించడంలేదు? అసలు రాష్ట్రం అంటే మీకు పట్టింపు ఉందా? లేదా? ..మరోవైపు జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన కృష్ణా జలవివాద ట్రైబ్యునల్ (KWDT-2) ముందు రాష్ట్రం తరఫున వినిపిస్తున్న వాదనలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. కృష్ణా నదిలో 75% నీటిలభ్యత ఆధారంగా చేసిన KWDT-2 తీర్పు అమల్లోకి వస్తే, రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది. ఆ స్థాయిలో నీటి లభ్యత పరిగణలోకి తీసుకున్న పరిస్థితుల్లో, దాన్ని ప్రామాణికంగా తీసుకుని కేటాయింపులు చేయడం వల్ల రాష్ట్రానికి ఊహించని విధంగా నష్టం జరుగుతుంది. కరువు వస్తే రాష్ట్రమే భరించాలి, ఎలాగూ దిగువ రాష్ట్రం మనదే కాబట్టి వరద వచ్చినా రాష్ట్రమే ఆ నష్టాన్ని భరించేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. దీన్ని గుర్తించి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వైయస్సార్సీపీ ప్రభుత్వం 2023 అక్టోబరులోనే పిటిషన్ దాఖలు చేసి, న్యాయపోరాటాన్ని ప్రారంభించింది. కాని మీరు ఇప్పుడు సమర్థవంతంగా వాదనలు వినిపించి, రాష్ట్ర హక్కులను కాపాడ్డంలో చిత్తశుద్ధి చూపడంలేదు. ..చంద్రబాబు మీరు ఇప్పటికైనా మేలుకోండి. కేంద్రంలో ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతోపాటు, KWDT-2 విచారణపై దృష్టిపెట్టి, సమర్థవంతమైన వాదనలు వినిపించండి. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి అని ఆయన అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం.. నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారని వైఎస్ జగన్ అన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.‘‘చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి గెలుస్తుందన్నదే విజయదశమి పండుగ సారాంశం. అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి గెలుస్తుందన్నదే విజయదశమి పండుగ సారాంశం. అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు.#Dussehra— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025 -
మహిళలకు బాబు మోసం!
సాక్షి, అమరావతి: హామీలతో మభ్యపుచ్చిన చంద్రబాబు సర్కారు మరోసారి మహిళలను దారుణంగా దగా చేస్తోంది. ఇప్పటికే మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలను పూర్తిగా రద్దు చేసిన కూటమి ప్రభుత్వం 1.80 కోట్ల మంది మహిళలకు ఆడబిడ్డ నిధి.. కోటి మందికిపైగా పొదుపు మహిళలకు సున్నా వడ్డీని ఎగరగొట్టింది. తాను అధికారంలోకి వస్తే సున్నా వడ్డీని రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తామన్న ఎన్నికల హామీపై సీఎం చంద్రబాబు ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ మోసాలు ఇంతటితో ఆగడం లేదు. ఒకపక్క ఎన్నికల హామీలను నెరవేర్చకుండా.. మరోపక్క ఆర్బీఐ, చట్ట నిబంధలనకు విరుద్ధంగా ‘స్త్రీనిధి’కి ఎసరు పెడుతున్నారు. స్త్రీనిధి నుంచి మహిళలకు హక్కుగా రావాల్సిన డబ్బులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించి తిరిగి వసూలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికీ.. ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఓ ఇంట్లో 18 ఏళ్లు దాటిన మహిళలు ఇద్దరు ఉంటే ఏటా రూ.36 వేల చొప్పున ఇవ్వాలి.. అదే నలుగురు ఉంటే రూ.72 వేలు ఇవ్వాల్సి ఉండగా ఈ పథకాన్ని ఎగరగొట్టింది. ఆడబిడ్డ నిధి పథకాన్ని 16 నెలలు దాటినా అమలు చేయలేదు. మరోవైపు.. వైఎస్సార్ సీపీ హయాంలో ఐదేళ్లపాటు పొదుపు సంఘాల మహిళలకు అమలు చేసిన సున్నా వడ్డీ పథకం సైతం కూటమి సర్కారు వచ్చాక నిలిచిపోయింది. గత ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలు తీసుకునే రుణాలపై రూ.3 లక్షల వరకే సున్నా వడ్డీ అమలు చేసిందని, తాము అధికారంలోకి వస్తే సున్నా వడ్డీ రూ.10 లక్షల దాకా వర్తింపజేస్తామంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కూటమి నేతల హామీ మేరకు ఈ పథకం అమలుకు ఏటా సుమారు రూ.ఆరు వేల కోట్ల దాకా అవసరమని అంచనా. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా ఏప్రిల్లో ఈ పథకాన్ని అమలు చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా 2024 ఏప్రిల్లో నిధుల విడుదల నిలిచిపోగా అనంతరం కూటమి సర్కారు ఆ ఏడాది డబ్బులను మహిళలకు బకాయి పెట్టింది. రెండేళ్లకు సంబంధించి ఒక్క సున్నా వడ్డీ పథకం ద్వారానే బకాయిలతో కలిపి సుమారు రూ.7,000 కోట్ల మేర రాష్ట్రంలోని కోటి మందికి పైగా పొదుపు సంఘాల మహిళలకు చెల్లించాల్సి ఉన్నా చంద్రబాబు సర్కారు పైసా ఇవ్వలేదు. ఇక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 1.80 కోట్ల మంది మహిళలు ఏటా రూ.18 వేలు చొప్పున సాయం పొందేందుకు అర్హులని అంచనా. ఈ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడంతో మహిళలు ఏటా రూ.32,400 కోట్లు దాకా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. వైఎస్ జగన్ హయాంలో అన్ని సంక్షేమ పథకాలను మహిళలు కేంద్రంగా సంతృప్త స్థాయిలో అమలు చేసి మహిళా సాధికారతకు బాటలు వేశారు. మహిళలకు నేరుగా పథకాలు అందచేయడంతో రూ.1.89 లక్షల కోట్ల మేర డీబీటీ విధానంలో ప్రయోజనం పొందారు. వైఎస్ జగన్ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేసిన రూ.1.70 లక్షల కోట్ల రుణాలు కాకుండా స్త్రీనిధి ద్వారా దాదాపు మరో రూ.13,172 కోట్లు రుణాలు పొదుపు సంఘాల మహిళలకిచ్చింది. ఇక సున్నా వడ్డీ ద్వారా గత ప్రభుత్వ హయాంలో 3.86 కోట్ల మంది మహిళలు దాదాపు రూ.ఐదు వేల కోట్ల మేర ప్రయోజనం పొందారు. ‘స్త్రీనిధి’కి ఎసరు..ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మహిళలను మోçసం చేస్తున్న చంద్రబాబు సర్కారు మరో మోసపూరిత ఎత్తుగడకు తెర తీసింది. పొదుపు సంఘాల మహిళలు తమ హక్కుగా రుణాలను పొందే ‘స్త్రీనిధి’ డబ్బులను.. ఆర్బీఐ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా ‘ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మీ’ ‘ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ’ పథకాలకు మళ్లించేందుకు సిద్ధమైంది. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు– షాదీ తోఫా పథకాల ద్వారా అర్హులకు పూర్తి ఉచితంగా ఆర్థిక సహాయం అందజేస్తే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పేర్లు మార్చిన ఆ పథకాలకు పొదుపు సంఘాల మహిళలకు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం మాత్రమే ఇవ్వనుంది. దానిపై నాలుగు శాతం వడ్డీతో కలిపి అసలు వసూలు చేసేందుకు సమాయత్తమైంది. గత ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా రూ.427.27 కోట్ల మొత్తాన్ని ఆయా లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధానంలో అర్హులకు అందచేయడం గమనార్హం. వడ్డీకి తెచ్చిన డబ్బులు.. అంతకంటే తక్కువకు ఇవ్వాలట!ఈ ఆర్థిక ఏడాది దాదాపు రూ.ఐదు వేల కోట్లను స్త్రీనిధి సంస్థ ద్వారా పొదుపు సంఘాల మహిళలకు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత నిధులు తక్కువగా ఉండే స్త్రీనిధి సంస్థ.. ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులనే 11 శాతం వడ్డీకి పొదుపు మహిళలకు రుణంగా ఇస్తూ ఉంటుంది. మండల సమాఖ్య పేరిట ఉండే దాదాపు రూ.1,000 కోట్ల సీఐఎఫ్ (కామన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్) నిధులను ఇటీవల బలవంతంగా స్త్రీనిధి బ్యాంకులో జమ చేయించారు. బ్యాంకుల నుంచి స్త్రీనిధి సంస్థ ఏడు శాతం వడ్డీకి తెచ్చుకునే నిధులతో పాటు మండల సమాఖ్య నుంచి జమ అయిన నిధుల నుంచి ఒక్కో పథకానికి రూ.500 కోట్లు చొప్పున ఏటా రూ.వెయ్యి కోట్లు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మీ, ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ పథకాల లబ్ధిదారులకు రుణంగా ఇప్పించేలా ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతేగానీ.. ఆయా పథకాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎటువంటి ఆర్థిక సాయం అందించే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వడ్డీకి తెచ్చే డబ్బులను అంత కంటే తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడమంటే ఎలాంటి సంస్థ అయినా నష్టాల పాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ రెండు పథకాలకు తక్కువ వడ్డీకి ఇవ్వడం వల్ల స్త్రీనిధి సంస్థ నష్టాల ఊబిలోకి వెళ్లి మూతపడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 12 ఏళ్లుగా పేద మహిళల సంక్షేమం కృషి చేస్తున్న సంస్థను బలి పెట్టే యత్నాలను తప్పుబడుతున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో త్వరలో ఓ కార్యక్రమం నిర్వహించి పథకాల అమలుపై సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటన చేయనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ గతంలోనే ఈ అంశాలను వెలుగులోకి తెచ్చింది. స్త్రీనిధి సంస్థను నీరుగార్చే యత్నాలను బహిర్గతం చేసింది. దీంతో ఈ ఏడాది మార్చిలో ఆ పథకాల అమలును ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది.బాబు మోసంతో అప్పుల ఊబిలోకి..జగన్ హయాంలో సంఘాలు పునరుజ్జీవం..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుంచి సున్నా వడ్డీ పథకం అమలు జరుగుతుండగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014–19 మధ్య అర్ధారంతంగా ఆగిపోయింది. దీంతో పొదుపు సంఘాల వ్యవస్థ కుదేలైంది. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని 2014 ఎన్నికల ముందు ప్రకటించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా.. సున్నా వడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారు. ఫలితంగా పొదుపు సంఘాలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎన్పీఏలు (నిరర్థక ఆస్తులు)గా మారాయి. చంద్రబాబు హయాంలో ఒక దశలో 18.36 శాతం సంఘాలు ఎన్పీఏలుగా ముద్రపడ్డాయి. అనంతరం వైఎస్ జగన్ హయాంలో పొదుపు సంఘాలు పునరుజ్జీవమయ్యాయి. నాడు ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు.. 2019 పోలింగ్ నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకు ఉన్న అప్పు మొత్తం రూ.25,571 కోట్లను ‘ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో తిరిగి మహిళలకు నేరుగా చెల్లించడంతో పాటు సున్నా వడ్డీ పథకాన్ని క్రమం తప్పకుండా అమలు చేశారు. తద్వారా పొదుపు మహిళలు ఎప్పటికప్పుడు రుణాలను తిరిగి సకాలంలో చెల్లించే పరిస్థితులు ఏర్పడడంతో నాడు ఎన్పీఏల సంఖ్య కేవలం 0.17 శాతానికి తగ్గిపోయింది.(నోట్: 2018–19 మధ్య టీడీపీ సర్కారు కేవలం రూ. 895 కోట్లు మాత్రమే స్త్రీనిధి ద్వారా పొదుపు సంఘాల మహిళలకు రుణం ఇవ్వగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని రెట్టింపు కంటే ఎక్కువకు పెంచింది. అంతేకాకుండా.. అంతకు ముందు పొదుపు సంఘాల మహిళలకు 13 శాతం చొప్పున వడ్డీకి రుణాలు ఇస్తుండగా అప్పటి సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకొని ఆ రుణాలపై వడ్డీని రెండు శాతం తగ్గించి 11 శాతానికే అందించే ఏర్పాటు చేశారు) -
Andhra Pradesh: రాష్ట్రాన్ని కమ్మేసిన మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో మంగళవారం రాత్రి అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య బంగాళాఖాతంలో గురువారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారానికి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ దృష్ట్యా శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు ఉత్తరాంధ్ర, ఉమ్మడి కృష్ణాలో వర్షాలు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లా పెడనలో 3.9, అనకాపల్లి జిల్లా కొప్పాకలో 3.4, నర్సీపట్నం, కాకినాడలో 3.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా.. బుధవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, ఎనీ్టఆర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. 3 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏలూరు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో ఉంచినట్టు పేర్కొన్నారు. శాంతించని నదులు కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిపై రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు గోదావరిపై ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 6,22,504 క్యూసెక్కుల కృష్ణా జలాలను నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. 7 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇంత అధికంగా నీరు విడుదలవుతోంది.కాగా.. నాగార్జున సాగర్ నుంచి 6,17,678 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు 6,41,247 క్యూసెక్కులు ఉన్న ఇన్ఫ్లో.. సాయంత్రం 6 గంటలకు 6,69,188 క్యూసెక్కులకు చేరింది. ఇందులో 6,53,828 క్యూసెక్కుల వదర సముద్రంలోకి వదిలేశారు. మిగిలిన 15,360 క్యూసెక్కుల వరద నీటిని పంట కాల్వలకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 16.1 అడుగులకు చేరింది. వరద ప్రభావంతో బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.మళ్లీ పెరుగుతున్న గోదావరి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం సమీపాన కాటన్ బ్యారేజీ వద్ద గోదావరిలో వరద ప్రవాహ ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వచ్చి చేరుతున్న మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 12.60 అడుగులకు చేరింది. 10,96,937 క్యూసెక్కులను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా.. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద గోదావరి నీటిమట్టం 33 మీటర్లకు చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి 10.73 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. భద్రాచలం వద్ద 50.30 అడుగులకు నీటిమట్టం చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బుధవారం ప్రవాహ ఉధృతి మరింత పెరిగే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
కృష్ణమ్మ కట్టడి బాబు పాపమే.. మనకు ‘మట్టే’!
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చేసిన పాపాలు తెలుగు రాష్ట్రాలకు ప్రధానంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు పెను శాపాలుగా పరిణమించాయి. ఆల్మట్టి డ్యాంపై 1995 నాటి ఘోర తప్పిదాలు నేటికీ వెంటాడుతున్నాయి. కృష్ణమ్మను కట్టడి చేస్తూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం తాజాగా సన్నద్ధం కావటానికి నాడు చంద్రబాబు నిర్వాకాలే కారణమని సాగునీటి నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.కర్ణాటక క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్...ఆల్మట్టి డ్యాం నీటి నిల్వ ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచడానికి కర్ణాటక కేబినెట్ ఈ ఏడాది సెప్టెంబరు 17న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల ముంపునకు గురయ్యే 20 గ్రామాలు, బాగల్కోట మున్సిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పన, 75,663 ఎకరాల భూ సేకరణ కోసం రూ.70 వేల కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. మాగాణి భూములకు ఎకరానికి రూ.40 లక్షలు, మెట్ట భూమికి ఎకరానికి రూ.30 లక్షలు చొప్పున పరిహారం చెల్లించేందుకు అనుమతించింది.తద్వారా ఆల్మట్టి డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 129.72 నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెరగనుంది. అదనంగా 5,30,475 హెక్టార్లకు నీటిని అందించడానికి వీలుగా కాలువల వ్యవస్థను కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. తద్వారా ఆల్మట్టి డ్యాంలోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఆయకట్టుకు తరలించేందుకు కర్ణాటక సర్కార్ ప్రణాళిక రచించింది. దీనివల్ల వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమయ్యే సంవత్సరాల్లో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలను దాటి కృష్ణా నది నుంచి ఒక్క నీటి చుక్క కూడా శ్రీశైలానికి వచ్చే అవకాశం ఉండదని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆయకట్టు ఎడారే.. తాగునీటికీ తిప్పలే!2015–16లో శ్రీశైలానికి కనిష్టంగా 58.69 టీఎంసీల ప్రవాహం రాగా.. అందులో కృష్ణా నుంచి వచ్చింది కేవలం 24.97 టీఎంసీలేనని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వల్ల శ్రీశైలంపైనే ఆధారపడ్డ హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, వెలిగొండ.. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలు, కృష్ణా డెల్టా ఆయకట్టు ఎడారిగా మారుతుందని.. తాగునీటికీ ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు వల్ల బ్యాక్ వాటర్ ప్రభావంతో తమ రాష్ట్రంలో సంగ్లి, కొల్హాపూర్ జిల్లాలు ముంపునకు గురవుతాయని.. దీనిపై సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల మహారాష్ట్ర కంటే ఏపీకే తీవ్ర అన్యాయం జరుగుతుందని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నాడు చంద్రబాబు నిర్వాకాలే...అప్పర్ కృష్ణా ప్రాజెక్టు కింద 173 టీఎంసీలను కర్ణాటకకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. దాంతో అప్పర్ కృష్ణా ప్రాజెక్టు (ఆల్మట్టి డ్యాం, నారాయణపూర్ డ్యాం, హిప్పర్గి వియర్) పనులను 1964 మే 22న కర్ణాటక చేపట్టింది. అప్పట్లో ఆల్మట్టి డ్యాంను 509.016 మీటర్ల ఎత్తుతో చేపట్టింది. అనంతరం కర్ణాటకలో 1994 డిసెంబర్ 11న హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలో జనతాదళ్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995 సెప్టెంబరు 1న చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆల్మట్టి డ్యాం ఎత్తును 509.016 నుంచి 524.256 మీటర్లకు పెంచుతూ 1995 అక్టోబరు 27న నాడు కర్ణాటకలోని దేవెగౌడ సర్కార్ పనులు చేపట్టినా అప్పటి సీఎం చంద్రబాబు నోరు మెదపలేదని సాగునీటి రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు.1996 లోక్సభ ఎన్నికల్లో యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్గా వ్యవహరించిన చంద్రబాబు నాటి కర్ణాటక సీఎం దేవెగౌడను ప్రధానిగా చేయడంలో కీలకంగా వ్యవహరించినట్లు స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. 1996 సెప్టెంబరు 1న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన దేవెగౌడ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు కోసం నిధులను రుణంగా మంజూరు చేసేలా చక్రం తిప్పారు. దాంతో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు పనులు వేగవంతమయ్యాయి. ఇంత జరుగుతున్నా నాడు చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు.ఇక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల సంగ్లి, కొల్లాపూర్ జిల్లాలు ముంపునకు గురవుతాయంటూ అప్పట్లోనే మహారాష్ట్ర సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆయకట్టుకు నీళ్లందవని రైతులు రోడ్డెక్కడం.. మహారాష్ట్ర సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తప్పనసరి పరిస్థితుల్లో నాటి చంద్రబాబు ప్రభుత్వం మొక్కుబడిగా సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసింది. కానీ.. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును వ్యతిరేకిస్తూ సమర్థంగా వాదనలు వినిపించడంలో విఫలమైంది. పర్యవసానంగా ఆల్మట్టి డ్యాంలో నీటి నిల్వ ఎత్తును 519.06 మీటర్లకు పరిమితం చేయాలని 2000 ఏప్రిల్ 25న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు గడువు మే 31, 2000తో ముగియనున్న నేపథ్యంలో.. కృష్ణా జలాల పంపిణీకి కేంద్రం ఏర్పాటుచేసే కొత్త ట్రిబ్యునల్ వద్ద ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచడంపై వాదనలు వినిపించాలని నాడు కర్ణాటక సర్కార్కు సూచించింది.బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్లోనూ వెంటాడిన బాబు పాపం.కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పంపిణీ చేయడానికి 2004 ఏప్రిల్ 2న జస్టిస్ బ్రిజేష్కుమార్ అధ్యక్షతన కేంద్రం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. ఆల్మట్టి డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా 2002 నాటికే కర్ణాటక సర్కార్ పనులను పూర్తి చేసింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2002–03లో 519.06 మీటర్ల ఎత్తుతో 129.72 టీఎంసీలను నిల్వ చేసింది. తాము ఆల్మట్టి డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా ఇప్పటికే పనులు పూర్తి చేశామని.. నీటి కేటాయింపులు చేయకపోతే ఆ పనులకు చేసిన వ్యయం వృథా అవుతుందని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట కర్ణాటక వాదించింది.నిధులు వృథా అవుతాయన్న వాదనతో ఏకీభవించిన బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్.. అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యతగా కేటాయించిన 173 టీఎంసీల జోలికి వెళ్లకుండా 65 శాతం లభ్యత ఆధారంగా అదనంగా 130 టీఎంసీలను కేటాయించింది. ఈ క్రమంలో ఆల్మట్టి డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇస్తూ 2013 నవంబర్ 29న కేంద్రానికి తుది నివేదిక ఇచ్చింది.బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రపద్రేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో ఎస్పెల్పీలు దాఖలు చేశాయి. దాంతో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదిక అమలును నిలుపుదల చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టును ఆదేశించింది. ప్రస్తుతం ఆ ఎస్సెల్పీలపై సుప్రీం కోర్టు విచారణ చేస్తుండటంతో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్రాన్ని కోరుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాయడం గమనార్హం. -
సీఎం హైదరాబాద్ టూర్ @ 71
సాక్షి, అమరావతి: తీరిక దొరికితే చాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు హైదరాబాద్లో వాలిపోతున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఎక్కే విమానం.. దిగే విమానం.. అన్నట్లు వారాంతాల్లో, సెలవు రోజుల్లో విశ్రాంతి కోసం ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ వెళ్లి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం చంద్రబాబు 70 సార్లు హైదరాబాద్ వెళ్లి వచ్చినట్లు టీడీపీ కూటమి వర్గాలు.. అధికార వర్గాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది.ఆ తర్వాత ఆదివారం 71వ సారి కూడా హైదరాబాద్ వెళ్లి రావడంతో మరోమారు ఈ విషయం వైరల్ అయ్యింది. మంత్రి లోకేశ్ ఈ 16 నెలల్లో 77 సార్లు హైదరాబాద్కు వెళ్లొచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర, ఎన్నికల ప్రచార సమయంలో మినహా ఏపీ వైపే చూడలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ వేదికగానే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నట్లు సమాచారం.సినిమా షూటింగ్లు, వ్యక్తిగత పనులకే అక్కడ పరిమితం కావడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని అధికార వర్గాలు, పార్టీ వర్గాలు వాపోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ హైదరాబాద్, ఇతర ప్రాంతాలకే పరిమితమయ్యారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్, ఇతర ప్రాంతాలలోనే ఎక్కువగా గడుపుతున్నారని, విజయవాడలో ఉన్న రోజులను వేళ్లపై లెక్క పెట్టవచ్చని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
చినబాబు చెబితే అర్హత ఉండక్కర్లేదు!
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల బదిలీలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, సబ్ స్టేషన్ల నిర్మాణం, లైన్ల ఏర్పాటు, బూడిద, బొగ్గు టెండర్లలో అందిన కాడికి దోచుకుంటున్న టీడీపీ నేతలు చివరకు స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టులనూ వదలడం లేదు. ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ పాత కాంట్రాక్టర్ల కాలపరిమితి కొన్ని నెలల క్రితం పూర్తయ్యింది. కొంతకాలం పాటు డిస్కంలు తమ సిబ్బందిలోని లైన్మెన్లు, అసిస్టెంట్ ఇంజినీర్ల ద్వారా విద్యుత్ బిల్లుల రీడింగ్ చేయించాయి. తర్వాత ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్లో టెండర్లు ఖరారు చేసి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రస్తుతం ఈపీడీసీఎల్లో టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. ఈ టెండర్ల ప్రక్రియ మొత్తం చినబాబు కనుసన్నల్లోనే నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు కాంట్రాక్టర్లను ఎగరగొట్టి.. చినబాబు దెబ్బకి స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు ఎగిరిపోతున్నారు. డిస్కంలలో జిల్లాలు (సర్కిళ్లు), డివిజన్లు (సెక్షన్లు) వారీగా స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు ఉంటారు. ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్లో సుమారు వంద మంది బిల్లింగ్ కాంట్రాక్టర్లు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 10కి పడిపోయింది. ఈపీడీసీఎల్ లో ఉన్న దాదాపు 70 మంది కాంట్రాక్టర్లకు మంగళం పాడే ప్రక్రియ మొదలైంది.సాంకేతిక అర్హతలు లేనివారు చినబాబు పేషీ నుంచి ఫోన్లు చేయిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పాత వారిని కాదని టెండర్లు వారికే ఇవ్వాల్సి వస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్లాస్–1 కాంట్రాక్టర్ సరి్టఫికెట్ లేనివారిని అనర్హులుగా ప్రకటించాలంటూ రాజమండ్రి, భీమవరం సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజినీర్లకు పాత కాంట్రాక్టర్లు వినతిపత్రాలు అందజేశారు. టెండర్ ముగిశాక పెంచేసుకున్నారు రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 1.95 కోట్ల విద్యుత్ సర్విసులున్నాయి. వాటిలో 20 శాతం నుంచి 30 శాతం వరకూ పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ సర్విసులుంటాయి. మిగతా సర్వీసులకు ప్రతినెలా విద్యుత్ బిల్లులను స్పాట్ బిల్లింగ్ రీడర్ల ద్వారా ఇస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు కాంట్రాక్టు పద్ధతిలో స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టులు ఇస్తుంటాయి. కాంట్రాక్టర్కు గ్రామీణ, ఏజెన్సీ, పట్టణ కేటగిరీల వారీగా తీసిన బిల్లులకు కమీషన్ నిర్ణయించి ఇస్తున్నారు. అలా 2023–25లో నిర్ణయించిన రేట్లతోనే తాజాగా టెండర్లు పిలిచారు.ఆ ధరలు గిట్టుబాటు కావడం లేదని సీపీడీసీఎల్ కాంట్రాక్టర్ చెప్పడంతో టెండర్ ఇచ్చిన 8 నెలల తరువాత ధర పెంచారు. తొలుత ఒక్కో సర్విసుకు పట్టణ ప్రాంతంలో రూ.6.16, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6.36 చొప్పున చెల్లించేందుకు నిర్ణయించారు. కాంట్రాక్టర్ కోరడంతో పట్టణాల్లో రూ.0.26 పైసలు, గ్రామాల్లో రూ.0.75 పైసలు చొప్పున పెంచారు. రెండేళ్లపాటు ఇవే ధరలతో కాంట్రాక్టు కొనసాగనుంది.ఇప్పుడు ఇవే ధరలను ఈపీడీసీఎల్లోనూ అమలు చేయాలంటూ కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా స్పాట్ బిల్లింగ్ పనులు చేస్తున్న తమను కాదని, యువనేత సిఫారసులకు పెద్దపీట వేయడం అన్యాయమని పాత కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్లాస్–1 కాంట్రాక్టర్ కాకపోయినా టెండర్ దక్కేలా పిలిచిన టెండర్లను రద్దుచేసి, అందరికీ అవకాశం కల్పిస్తూ మరలా టెండర్లు పిలవాలని కోరుతున్నారు. కాంట్రాక్టరుకు లాభం.. రీడర్లకు కష్టం రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా కలిపి దాదాపు 10 వేల మంది మీటర్ రీడర్లు పనిచేస్తున్నారు. వీరు నెలలో రెండుసార్లు స్పాట్ బిల్లింగ్ మెషిన్ ద్వారా రీడింగ్ తీసి బిల్లును వినియోగదారులకు ఇస్తుంటారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు అవుట్సోర్సింగ్ పద్ధతిలో మీటర్ రీడర్లను తీసుకుంటారు. వీరు 8 రోజుల బిల్లింగ్ పూర్తిచేసిన తర్వాత మిగతా 22 రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుంది.కనీసం విద్యుత్ బిల్లులు వసూలు చేయడం, మీటర్లు మార్చడం, మొండి బకాయిలున్న సర్వీసులను తొలగించడం వంటి పనులకైనా తమకు అవకాశం ఇవ్వాలని రీడర్లు అడుగుతున్నారు. కానీ.. వారి విజ్ఞప్తిని ఎవరూ పట్టించుకోవడం లేదు. డిస్కంలు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కాగా.. కాంట్రాక్టర్ల వద్ద పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. పైగా వారికి ఇస్తున్న వేతనం నుంచి కూడా కొంత మొత్తాన్ని ప్రతినెలా కాంట్రాక్టర్లు కమీషన్గా తీసేసుకుంటున్నారు. -
జగన్ హయాంలో.. శాంతిభద్రతలు భేష్
సాక్షి, అమరావతి: శాంతి భద్రతల పరిరక్షణలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిందన్న వాస్తవం మరోసారి నిగ్గు తేలింది. గత ప్రభుత్వంపై నాడు టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేసిన దుష్ప్రచారం అంతా రాజకీయ కుట్రేనన్నది స్పష్టమైంది. 2023లో వైఎస్సార్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది.కేంద్ర హోంశాఖకు చెందిన జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) 2023 నివేదికను మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నేరాల తీవ్రతను అందులో వెల్లడించింది. 2022తో పోలుస్తూ 2023లో దేశంలో నేరాల తీరు ఎలా ఉందన్నది విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల నేరాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసినట్లు ఆ నివేదిక వెల్లడించడం విశేషం.దాడులు, హత్యలు, కిడ్నాప్లు, ఎస్సీ–ఎస్టీలపై నేరాలు, మహిళలు–బాలలపై నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు.. ఇలా అన్ని రకాల నేరాలు 2022తో పోలిస్తే 2023లో గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది. ⇒ 2022లో ఏపీలో మొత్తంగా 1,95,284 కేసులు నమోదు కాగా.. 2023లో 1,84,293కు తగ్గింది. నేరపూరిత కేసులు నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు 2022లో 1,58,547 నమోదు కాగా 2023లో ఆ కేసుల సంఖ్య 1,53,867కు తగ్గాయి. స్థానికచట్టాల ఎస్ఎల్ఎల్ కేసులు 2022లో 36,737 నమోదు కాగా.. 2023లో ఆ కేసుల సంఖ్య 30,436కు పరిమితమయ్యాయి. ⇒ దేశంలో 2022లో మొత్తం 58,24,946 నేరాలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఐపీసీ సెక్షన్ల కింద నేరాలు 35,61,379 ఉండగా ఎస్ఎల్ఎల్ నేరాలు 22,63,567 ఉన్నాయి. 2023లో దేశంలో మొత్తం నేరాలు 62,41,569కు పెరిగాయి. వాటిలో ఐపీసీ సెక్షన్ల కింద నేరాలు 37,63,102 ఉండగా, ఎస్ఎల్ఎల్ నేరాలు 24,78,467 ఉన్నాయి. 2023లో దేశవ్యాప్తంగా నేరాలు పెరిగినా ఏపీæలో మాత్రం అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేరాలను కట్టడి చేసిందని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. ⇒ 2024 ఎన్నికల్లో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలన్నీ అసత్య ప్రచారమేని ఆ నివేదిక గణాంకాల సాక్షిగా వెల్లడైంది. ప్రధానంగా 34వేల మంది మహిళలు, బాలికలు కిడ్నాప్ అయ్యారని జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ గతంలో చేసిన విమర్శలన్నీ పూర్తిగా అవాస్తవమేనని కేంద్ర హోంశాఖ నివేదిక విస్పష్టంగా ప్రకటించింది. నేరాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుని సత్వరం శిక్షలు పడేలా చేయడంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించిందని నివేదిక వెల్లడించింది. ఎన్సీఆర్బీ నివేదిక–2023లో ఏపీకి సంబంధించి కీలక అంశాలివీతగ్గిన నేరాలు–ఘోరాలు వైఎస్సార్సీపీ హయాంలో 2022లో కంటే 2023లో రాష్ట్రంలో అన్నిరకాల నేరాలు, ఘోరాలు గణనీయంగా తగ్గాయి. ఐపీసీ నేరాలు, నిబంధనలు అతిక్రమించే పౌరులపై స్థానిక చట్టాల కింద నమోదు చేసే (ఎస్ఎల్ఎల్) నేరాలు తగ్గాయి. హింసాత్మక ఘటనలు, హత్యలు, కిడ్నాపులను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టడి చేసింది. ఇక మహిళలు, బాలికలపై నేరాలు తగ్గేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించింది. ఎస్సీ, ఎస్టీల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది.. అందుకే ఆ వర్గాలపై నేరాలు తగ్గాయి. 2022లో దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు పెరిగినా ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన సమర్థ పనితీరుతో నేరాలను నియంత్రించడం గమనార్హం. దేశంలో 54 శాతం.. నాడు ఏపీలో 85.7 శాతం 2022లో రాష్ట్రంలో ఆచూకీ దొరకనివారు 621 మంది ఉన్నారు. వారిలో బాలురు 250 మంది కాగా బాలికలు 371 మంది ఉన్నారు. 2023లో మొత్తం 4,433 మంది కనిపించకుండా పోయారని / ఇంటినుంచి అలిగి వెళ్లిపోయారని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిలో బాలురు 1,196 మంది బాలురు కాగా 3,237మంది బాలికలు ఉన్నారు. మొత్తం మీద 1,446మంది బాలురు, 3,608మంది బాలికలు కనిపించకుండా / ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయినట్టు కేసులు నమోదయ్యాయి. కాగా వారిలో 4,331 మందిని పోలీసులు కనిపెట్టి సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.వారిలో బాలురు 1,141 మంది, బాలికలు 3,190 మంది ఉన్నారు. అంటే 85.7 శాతం మందిని 2023లోనే పోలీసులు సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. (మిగిలిన వారిని 2024లో పోలీసులు వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు). కనిపించకుండాపోయిన బాల, బాలికలను సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత సమర్థంగా వ్యవహరించింది.అందుకే ఏకంగా 85.7 శాతం మందిని సురక్షితంగా వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చింది. దేశం మొత్తం మీద 54 శాతం మందినే సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. వైఎస్సార్సీపీ హయాంలో ఏకంగా 85.7 శాతం మంది బాల, బాలికలను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే పవన్కళ్యాణ్ 2024 ఎన్నికల ముందు అవాస్తవ ఆరోపణలు చేశారన్నది మరోసారి స్పష్టమైంది.నేర పరిశోధనలో భేష్ నేరాలను కట్టడి చేయడమే కాదు.. నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలోనూ మెరుగైన భూమిక పోషించింది. ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే కేసు నమోదు చేసి నిర్ణిత కాలంలో చార్జ్షిట్ దాఖలు చేసేలా చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన 60 రోజుల గడువులో ఏకంగా 91.6 శాతం కేసుల్లో చార్జ్షీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్ణిత సమయంలోగా చార్జ్షిట్లు దాఖలు చేయడంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది.పవన్ ఆరోపణలు పూర్తి అవాస్తవం.. వైఎస్సార్సీపీ హయాంలో ఆంధ్ర ప్రదేశ్లో 34వేల మందిమహిళలు, బాలికల అపహరణకు గురయ్యారని పవన్కళ్యాణ్ గతంలో చేసిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవమేని కేంద్ర హోంశాఖ నివేదిక స్పష్టం చేసింది. 2024 ఎన్నికల ముందు తనకు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయంటూ పవన్కళ్యాణ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. కాగా ఆయన చేసిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవమని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. -
మంత్రి సవిత ధాటికి ‘కియా’మొర్రో
పెనుకొండ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఆదాయమే పరమావధిగా దందాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. చివరకు కియా కార్ల పరిశ్రమనూ వదలడం లేదు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరులు బరి తెగించారు. కియా, అనుబంధ పరిశ్రమల్లో కాంట్రాక్టులన్నీ తమకే కావాలని ఇదివరకే దాడులకు దిగిన మంత్రి అనుచరులు.. తాజాగా సమీపంలోని రెస్టారెంట్లపై గురిపెట్టారు.రెస్టారెంట్లకు అనుబంధంగా నడుస్తున్న ట్రావెల్ ఏజెన్సీలను తమకు అప్పగించాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం టీడీపీ నాయకులు పలువురు పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డి పల్లి సమీపంలో కియా వద్ద 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న కొరియన్ హోటల్తోపాటు చంద్రగిరి సమీపంలోని తమిళనాడుకు చెందిన పళని అనే వ్యాపారికి చెందిన ముజుగి కొరియన్ హోటల్ వద్ద దౌర్జన్యానికి దిగారు.ట్రావెల్ ఏజెన్సీలు తమకే ఇవ్వాలంటూ.. ఒక దశలో హోటల్ సిబ్బందిపై దాడికి యతి్నంచారు. తమ యజమానులు అందుబాటులో లేరని, వారు వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలని సిబ్బంది తెలపడంతో వారిని బెదిరించి వచ్చారు. మంత్రి సవితకు సన్నిహితంగా ఉన్న వారే ఈ దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. బెంబేలెత్తుతున్న నిర్వాహకులు మంత్రి సవిత అనుచరుల తీరుతో కియా అనుబంధ పరిశ్రమలు, రెస్టారెంట్లు, ఇతరత్రా వ్యాపారాల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. ఎప్పుడు ఎవరిపైకి వస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే కియా అనుబంధ పరిశ్రమల వద్ద వరుస బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతున్న మంత్రి అనుచరులు.. వాహనాల యజమానులనూ తమతో ‘మాట్లాడి’ నడుపుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. కొన్ని లారీల అద్దాలూ పగులగొట్టారు.వారి తీరుతో ఇప్పటికే లారీల యజమానులు, డ్రైవర్లు ఆందోళన చెందుతుండగా.. తాజాగా ఆ జాబితాలో రెస్టారెంట్ల యజమానులు కూడా చేరారు. కియా వద్ద ఎలాంటి బెదిరింపులకు దిగినా క్షమించేది లేదని మంత్రి లోకేశ్ చేసిన హెచ్చరికలు ఉత్త మాటలే అని తాజా ఉదంతంతో తేలిపోయింది. దందాలు, దౌర్జన్యాల్లో తగ్గేది లేదని అంటున్నారు. తాజా ఘటనపై పెనుకొండ ఎస్ఐ వెంకటేశ్వర్లు, కియా ఎస్ఐ రాజేశ్ను ఫోన్లో ‘సాక్షి’ వివరణ కోరడానికి యతి్నంచగా.. వారు స్పందించలేదు. -
స్తంభించిన గ్రామీణ వైద్యసేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీలు) వైద్యసేవలు స్తంభించాయి. వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో పీహెచ్సీల్లో నాడి పట్టే నాథుడు కరువయ్యారు. ఇన్–సర్విస్ కోటా కుదింపును నిరసిస్తూ, ఇతర సమస్యల పరిష్కారం కోసం పీహెచ్సీ వైద్యులు సమ్మె బాటపట్టిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయిలో పీహెచ్సీ సేవలను బహిష్కరించిన వైద్యులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్వో కార్యాలయాల ముందు టెంట్లు వేసుకుని నిరసన తెలపడంతోపాటు ర్యాలీలు, ఇతర మార్గాల్లో ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తామని వైద్యశాఖ హెచ్చరించినా, వైద్యులు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో పీహెచ్సీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు సోమవారం వైద్యశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్(ఏపీవీవీపీ), డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)ల్లోని సివిల్ అసిస్టెంట్ సర్జన్స్(సీఏఎస్), వైద్య విద్యార్థులతో పీహెచ్సీల్లో సేవలు అందేలా చూస్తామని తెలిపింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో వైద్యశాఖ విఫలమైంది. ఎక్కడా పీహెచ్సీల్లో ప్రత్యామ్నాయ వైద్యులు కనిపించలేదు. రోగులకు నరకం వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో విషజ్వరాలు, డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధుల బారినపడ్డ గ్రామీణ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆపసోపాలు పడి వైద్యం కోసం పీహెచ్సీల వరకూ వెళితే... అక్కడ వైద్యులు లేకపోవడంతో బాధితుల పరిస్థితి అయోమయంగా మారుతోంది. స్థానికంగా ఉండే ఆర్ఎంపీలు, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్సలు చేయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల జ్వరం, దగ్గు, జలుబు వంటి చిన్నచిన్న అనారోగ్య సమస్యలతో పీహెచ్సీలకు వచి్చనవారికి స్టాఫ్ నర్సులే మందులు ఇచ్చి పంపేస్తున్నారు. ఏపీవీవీపీ వైద్యుల మద్దతు పీహెచ్సీ వైద్యుల సమ్మెకు ఏపీవీవీపీ వైద్యుల సంఘం మద్దతు తెలియజేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. పీహెచ్సీ వైద్యులు చేస్తున్న పోరాటంలో ఏపీవీవీపీ వైద్యులకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని ఏపీవీవీపీ వైద్యుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.రోహిత్ తెలిపారు. వీరి సమ్మెకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని నిర్ణయించామన్నారు. తదుపరి కార్యాచరణపై జేఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావంసీజనల్ వ్యాధుల కట్టడిలో పీహెచ్సీ వైద్యులదే కీలక పాత్ర. తమ పరిధిలో జ్వరాలు, ఇతర కేసుల నమోదును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాధితులకు వైద్య పరీక్షలు చేయడంతోపాటు వ్యాధులు వ్యాప్తిచెందకుండా నియంత్రణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజులుగా రాష్ట్రం మొత్తం ముసురుపట్టింది. వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి.ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వైద్యుల సమస్య పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. పీజీ ఇన్–సర్విస్ కోటా కుదింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫలితం లేకపోవడంతో సమ్మెలోకి వెళ్లడానికి వెనుకాడబోమని పది రోజుల క్రితమే నోటీస్ ఇచ్చారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పూర్తిస్థాయిలో సమ్మెబాట పట్టారు. -
మద్యం సిండికేట్కు డబ్బుల్ ధమాకా!
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2014–19లో ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి, అడ్డగోలు దోపిడీకి సహకరించిన నాటి టీడీపీ ప్రభుత్వం.. ప్రస్తుతం అదే తరహాలో వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నును (ఏఆర్ఈటీ) దొడ్డి దారిలో తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ.. మరోవైపు సిండికేట్ దోపిడీకి వత్తాసు పలికే ఈ పన్నాగానికి మంత్రివర్గ ఉప సంఘం ద్వారా రాజ ముద్ర వేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో టీడీపీ మద్యం సిండికేట్ ఆడిందే ఆటగా సాగుతోంది.అందుకోసం బార్ల టెండర్ల ప్రక్రియను హైజాక్ చేసింది. ప్రభుత్వ పెద్దల పన్నాగంతోనే రాష్ట్రంలో 840 బార్లకు ఉద్దేశ పూర్వకంగా టెండర్లు దాఖలు చేయకుండా డ్రామా నడిపింది. రెండు దశల నోటిఫికేషన్ తర్వాత కూడా 540 బార్లకే లైసెన్సులు ఖరారు చేసి, మరో 300 బార్ల లైసెన్స్ ప్రక్రియ పెండింగ్లో ఉండేట్టు చేసింది. తద్వారా బార్లకు లైసెన్సులు దాఖలు చేసేందుకు ఎవరూ సుముఖంగా లేరనే అభిప్రాయాన్ని కృత్రిమంగా సృష్టించింది. అదే తడవుగా టీడీపీ సిండికేట్ తమ అడ్డగోలు దోపిడీకి డిమాండ్లను తెరపైకి తెచి్చంది. బార్లకు సరఫరా చేసే మద్యం ధరలపై ఏఆర్ఈటీ తొలగించాన్నది వాటిలో ప్రధాన డిమాండ్.మంత్రి మండలి సమావేశంలోనే తుది నిర్ణయం⇒ రాష్ట్రంలో బార్లకు దరఖాస్తులు దాఖలు చేసేందుకు పెద్దగా ఆసక్తి వ్యక్తం కావడం లేదని నమ్మించేందుకు సిండికేట్తో కలిసి చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా కథ నడిపించింది. ఎవరూ ముందుకు రావట్లేదన్న సాకుతో బార్ల యజమానులకు మరిన్ని వెసులుబాటులు కలి్పంచాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనను తెరపైకి తెచి్చంది. ⇒ బార్లకు సరఫరా చేసే మద్యంపై ప్రస్తుతం 15 శాతం ఏఆర్ఈటీ విధిస్తున్నారు. ఎందుకంటే బార్లలో ఎంఆర్పీకే మద్యం విక్రయించాలన్న నిబంధన లేదు. బార్లు ఇష్టానుసారం రేట్లకు విక్రయిస్తాయి. అందుకే 15 శాతం ఏఆర్ఈటీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధించింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి దాదాపు రూ.500 కోట్ల ఆదాయం వస్తోంది. కాగా ప్రస్తుతం టీడీపీ సిండికేట్కు అడ్డగోలు ప్రయోజనం కలిగించేందుకు ఆ 15 శాతం ఏఆర్ఈటీని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ⇒ అదే ప్రధాన అంశంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ విధానంపై మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. సోమవారం సమావేశమైన ఈ మంత్రివర్గ ఉప సంఘం మద్యం దుకాణాలపై సర్దుబాటు ముసుగుతో బార్లపై ఏఆర్ఈటీని తొలగించే విధంగా సిఫార్సు చేయాలని భావిస్తోంది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఏఆర్ఈటీ తొలగింపుపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ⇒ కాగా, ఏఆర్ఈటీ తొలగిస్తే ఖజానాకు ఏటా రూ.500 కోట్లు గండి పడుతుంది. రానున్న నాలుగేళ్లలో టీడీపీ మద్యం సిండికేట్కు రూ.2 వేల కోట్లు అడ్డగోలుగా ప్రయోజనం కలగనుందన్నది స్పష్టం అవుతోంది. ⇒ అంతేకాకుండా బార్లలోనూ చీప్ లిక్కర్ అమ్మకాలకు పచ్చ జెండా ఊపే విషయాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో చీప్ లిక్కర్ వాటా 30 శాతంగా ఉంది. నెలకు సగటున రూ.3 వేల కోట్ల మద్యం విక్రయాలు సాగుతుంటే అందులో రూ.900 కోట్లు మేర చీప్ లిక్కర్ ద్వారానే వస్తోంది. చీప్ లిక్కర్ అమ్మకాలు మరింత పెంచడం ద్వారా సిండికేట్ అడ్డగోలు దోపిడీకి మరింత సహకరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నది స్పష్టమవుతోంది.మద్యం ధరలపై నియంత్రణ మాత్రం లేదు బార్లపై 15 శాతం ఏఆర్ఈటీ తొలగింపు దిశగా సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం.. ఆ బార్లలో మద్యం ధరలపై మాత్రం ఎటువంటి నియంత్రణ విధించాలని భావించడం లేదు. ఉదాహరణకు రూ.100 ఎంఆర్పీ ఉన్న మద్యం బాటిల్పై 15 శాతం ఏఆర్ఈటీ విధించి బార్లకు ప్రస్తుతం రూ.115తో విక్రయిస్తున్నారు. బార్లు కనీసం రూ.130కి పైగానే విక్రయిస్తున్నాయి. ఏఆర్ఈటీ 15 శాతం తొలగించాక ఆ బాటిల్ను ఎంతకు విక్రయించాలనేది ప్రభుత్వం నిర్దేశించడం లేదు.అంటే బార్లు ఇప్పటి వరకు విక్రయిస్తున్న రీతిలోనే రూ.130 కంటే ఎక్కువగానే విక్రయించవచ్చు. ఈ లెక్కన ఒక్కో బాటిల్పై ఖజానాకు రూ.15 నష్టం.. టీడీపీ సిండికేట్కు రూ.30 లాభం. ప్రస్తుత అమ్మకాల పరిణామం ప్రకారం.. టీడీపీ సిండికేట్ ఏటా రూ.500 కోట్ల చొప్పున రానున్న నాలుగేళ్లలో రూ.2 వేల కోట్లు కొల్లగొట్టనుంది. ఆ ప్రకారం ఏఆర్ఈటీ తొలగింపుతో రూ.2 వేల కోట్లు, ఎంఆర్పీ కంటే అధిక ధరలతో రూ.2 వేల కోట్లు వెరసి.. రానున్న నాలుగేళ్లలో రూ.4 వేల కోట్లు దోపిడీకి పాల్పడుతుందన్నది స్పష్టమవుతోంది. -
చంద్రబాబు ‘ఈ మంగళవారం’ అప్పు రూ. 2 వేల కోట్లు!
సాక్షి,విజయవాడ: సంపద సృష్టిస్తానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అప్పుల సృష్టిలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూటమి ప్రజా ప్రతినిధుల్ని ప్రజలు నిలదీస్తుంటే చంద్రబాబు సంపద సృష్టించిన తర్వాతే అని వారు అంటున్నారు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం.. అప్పుల్నే సంపద సృష్టిగా భావిస్తున్నట్లున్నారు. మంగళవారం వస్తే చాలు అప్పు సృష్టిస్తున్నారు. ఈ మంగళవారం (సెప్టెంబర్ 30) రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా మరో రూ.2 వేల కోట్లు అప్పు చేశారు చంద్రబాబు. తద్వారా 16 నెలల్లోనే 2 లక్షల 11 వేల కోట్లతో దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన జాబితాలో చంద్రబాబు చేరారు. దీంతో చంద్రబాబు సర్కార్పై రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చేస్తున్నారని విమర్శిస్తున్నారు.ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం సుమారు రూ.2 లక్షల 11 వేల కోట్ల అప్పులు చేయగా.. వాటిలో లక్షా 35,700 కోట్లకు పైగా బడ్జెటరీ అప్పులు(అంటే ప్రభుత్వ బడ్జెట్లో చూపబడే అప్పులు) ఉన్నాయి. ఇలా చంద్రబాబు ప్రతి మంగళవారం చేసే వేల కోట్ల అప్పుల్లో టీడీపీ నాయకుల పాత బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. 2014 నుండి పెండింగ్లో ఉన్న మొత్తం రూ.400 కోట్లని తెలుస్తోంది. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అజిత్సింగ్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ రాహుల్లా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఐదేళ్లలో సామాన్యుల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మెడికల్ విద్య చదవాలని కాలేజీలు తీసుకువచ్చారు. ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన ప్యాకేజి తీసుకోవాలని చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రైవేట్పరం చేయాలని చూస్తున్నారు. డబ్బు మీద ప్రేమతో సామాన్యుల కలను చిదిమేస్తున్నాడు మెడికల్ కాలేజీల పరిశీలనకు వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారు.. కేసులు పెట్టారు. నిర్బంధంతో పోరాటం ఆపలేరు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణ ఆపకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం’ అని హెచ్చరించారు.విశాఖ: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కుటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కూటమి సర్కార్ అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు పెడుతున్నారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్. దళితుల జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం’’ అంటూ గొల్ల బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్ జిల్లా: కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.అనంతపురం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ.. నల్లబ్యాడ్జీలు, బెలూన్లతో నిరసన తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజేంద్ర మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. పునరాలోచన చేయాలంటూ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.గుంటూరు: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గెడ్డేటి సురేంద్ర ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వనమా బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. -
డిజిటల్ బుక్ ముకుతాడు వేస్తుందా?
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్.. పార్టీ కార్యకర్తల రక్షణకు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ, సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా, వేధింపులు ఎదురైనా పార్టీ లీగల్ టీమ్ వెంటనే రంగంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాక అవసరమైతే ఆయనే స్పందించి బాధితులతో మాట్లాడి ఓదార్చుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఆయన ప్రకటించిన విధంగా కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ను ప్రవేశపెట్టారు. దీని వల్ల కార్యకర్తలకు ఒక భరోసా వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.తమకు జరిగిన అన్యాయాన్ని డిజిటల్ బుక్లో ఎలా నమోదు చేయవచ్చో కూడా పార్టీ సమావేశంలో ఆయన వివరించారు. దాని ప్రకారం ఏ కార్యకర్త అయినా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఏ పోలీసు అధికారి నుంచి అయినా వేధింపులు ఎదురైనా, అక్రమ అరెస్టు జరుగుతున్నా, వెంటనే వాటిని చిత్రీకరించి డిజిటల్ బుక్లో నమోదు చేస్తే లీగల్ సెల్ తక్షణమే చొరవ తీసుకుని పని చేసే అవకాశం ఉంటుంది. డిజిటల్ బుక్లో తమ పేరు ఎంటర్ అవుతుందన్న భయంతోనైనా కొంతమంది పోలీసులు వైసీపీ, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టకుండా ఉండే చాన్స్ ఉంటుంది. అయినా కొంతమంది బరితెగించి వ్యవహరిస్తే పార్టీపరంగా గట్టిగా పోరాడవచ్చు. ఈ మధ్యకాలంలో వైసీపీ లీగల్ టీం బాగా యాక్టివ్ అయింది.పోలీసులు మఫ్టీలో వచ్చి సవీంద్రరెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్టును అదుపులోకి తీసుకున్న వెంటనే లీగల్ టీమ్ అతని తరపున హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి రక్షించారు. హైకోర్టు కూడా పౌర రక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. పోలీసులు చెప్పినవి కట్టుకథలన్న సంగతిని అర్థం చేసుకున్న కోర్టు సవీంద్రరెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఒకరకంగా ఇదో రికార్డు. కేసును సీబీఐకి అప్పగించడం మరో విశేషం. ఏపీలో పోలీసులు కొన్నిసార్లు కిడ్నాపర్ల అవతారం ఎత్తుతున్నారని ఈ ఉదంతం తెలియచేస్తుంది.అంతేకాదు.. సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టడం ఇబ్బంది అవుతోంది కనుక వారిపై లేని గంజాయి కేసులు పెడుతున్నారట. అంటే పోలీసు స్టేషన్లలోనే గంజాయిని అందుబాటులో ఉంచుకుని ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారన్న భావన కూడా కలుగుతుంది. అందుకే హైకోర్టు సవీంద్ర విడుదలకు ఆదేశాలు ఇచ్చారనుకోవాలి. ఇంత జరిగినా కొందరు పోలీసులు మరో ఇద్దరు సోషల్ యాక్టివిస్టులను అదే రోజు అక్రమంగా పట్టుకుపోయారని వార్తలు వచ్చాయి. ఇలాంటి చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పోలీసులు కూడా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు ఈ డిజిటల్ బుక్ ఉపయోగపడుతుంది.ఈ బుక్లో సాక్ష్యాధారాలు కూడా నమోదు అవుతాయి కనుక అవి ఎప్పటికి అందుబాటులో ఉంటాయి. అదే టైమ్లో సోషల్ మీడియా యాక్టివిస్టులు అభ్యంతర పోస్టులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రభుత్వం కక్షకట్టి కేసులు పెడుతుంది. అదే టీడీపీ వారు ఎంత అరాచకంగా పోస్టులు పెడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.పరకామణి వ్యవహారంలో జగన్పై నీచమైన ఆరోపణలు చేస్తూ టీడీసీ సోషల్ మీడియా ప్రచారం చేసిందట. అది తప్పా? కాదా? అన్నది పోలీసులు ఆలోచించుకోవాలి. అలాగే మహిళలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టరాదు. కాని టీడీపీ వారు ఏమీ చేసినా పోలీసులు కేసులు పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎవరు తప్పు చేసినా ధర్మబద్దంగా చర్య తీసుకోవల్సిన పోలీసులు పక్షపాతంగా ఉండకూడదు. అలాంటివి జరుగుతున్నప్పుడు వెంటనే డిజిటల్ బుక్ ద్వారా పార్టీకి తెలియచేయవచ్చు. బహుశా ఇది ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందేమో తెలియదు. అప్పుడు వారు కూడా తమకు జరిగే అన్యాయాలపై ఫిర్యాదు చేయవచ్చు. కాని డిజిటల్ బుక్ పరిధి పెరుగుతుంది. ఎంతవరకూ ఆచరణ సాధ్యం అవుతుందో లేదో తెలియదు. అలాగే డిజిటల్ బుక్ జరగకుండా జాగ్రత్తపడాలి.అంతే కాకుండా కొంతమంది టీడీపీ వారు కూడా ఈ డిజిటల్ బుక్ లో ఎంటరై తప్పుడు ఆరోపణలు చేయకుండానూ జాగ్రత్తలు తీసుకోవాలి.డిజిటల్ బుక్తో పాటు నేతలు, కార్యకర్తలకు జగన్ దిశా నిర్దేశం కూడా చేశారు. కమిటీల ఏర్పాటు మొదలు, కూటమి ప్రభుత్వం అక్రమాలు, హామీల ఉల్లంఘనపై ప్రజలను జాగృతం చేయవలసిన తీరుపై కూడా జగన్ వివరించారు. పార్టీ విస్తృత సమావేశంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్న తీరు, వారికి ధైర్యం ఇచ్చిన వైనం కచ్చితంగా పార్టీ కేడర్కు మంచి సంకేతమే అవుతుంది. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు అమలు చేసే బాధ్యతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో కార్యకర్తలకు అంత ప్రాధాన్యత లభించలేదన్న భావన ఉంది.కార్యకర్తలు చాలామందికి పదవులు వచ్చినా వివిధ కారణాల వల్ల కేడర్లో అలాంటి అభిప్రాయం నెలకొంది.. అది వేరే విషయం. ఈ సమావేశంలోనే జగన్ కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లడానికి కూడా ఆయన డైరెక్షన్ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించి స్కూళ్లు, బస్సులు ఆస్పత్రులు వంటివాటిని ఎందుకు ప్రభుత్వాలు నడుపుతాయో తెలియదా అని ప్రశ్నించారు.అట్టర్ ఫ్లాఫ్ అయిన సూపర్ సిక్స్కు విజయోత్సవ సభ జరిపారని ఎద్దేవా చేశారు. ఓవరాల్ గా చూస్తే ఒకవైపు ప్రభుత్వ ఫెయిల్యూర్ పై దాడి, మరో వైపు కార్యకర్తలలో స్పూర్తి నింపడానికి ఈ సమావేశంలో జగన్ ప్రయత్నించారు. అందులో భాగంగానే డిజిటల్ బుక్ తెచ్చారు. దీని ప్రభావంతోనైనా ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టే విషయంలో కాస్త అయినా వెనక్కి తగ్గుతారా! ఏమో చెప్పలేం!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మసిపూసి.. అక్రమ అరెస్టు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసిందన్నది స్పష్టమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు కూటమి ప్రభుత్వ కుతంత్రంలో భాగంగానే ఆయన్ను సిట్ అరెస్టు చేసిన విషయం విదితమే. అందుకు ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ పీఎల్ఆర్ కంపెనీ సాధారణ లావాదేవీలకు కుట్ర పూరితంగా సిట్ వక్ర భాష్యం చెప్పింది. పీఎల్ఆర్ కంపెనీ నిర్మాణ కాంట్రాక్టులను సబ్ కాంట్రాక్టు చేసేందుకు డికార్ట్ కంపెనీ 2019లో ఒప్పందం చేసుకుంది.కాంట్రాక్టు పనుల బ్యాంకు గ్యారంటీ, ఈఎండీ కోసం రూ.5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తి అనంతర పరిణామాల్లో డికార్ట్ కంపెనీ సబ్ కాంట్రాక్టు ఒప్పందం నుంచి వైదొలగింది. దాంతో ఆ కంపెనీ తమకు చెల్లించిన రూ.5 కోట్లను పీఎల్ఆర్ కంపెనీ వాపసు చేసింది. ఇదంతా బ్యాంకు బదిలీ ద్వారానే పూర్తి పారదర్శకంగా జరిగిన సాధారణ లావాదేవీ. ఆ అధికారిక రికార్డులను కూడా పీఎల్ఆర్ కంపెనీ సమరి్పంచింది. (2014–24 వరకు) కంపెనీకి చెందిన రికార్డులను కూడా సిట్ అధికారులు పరిశీలించారు.అయినా సరే కూటమి ప్రభుత్వ కుట్రలో భాగంగానే మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. తద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు సిట్ యతి్నంచింది. కాగా మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో సిట్ అభియోగాల్లో పస లేదన్నది స్పష్టమైంది. మిథున్ కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ కంపెనీకి డికార్ట్ లాజిస్టిక్స్ అనే కంపెనీ రూ.5 కోట్లు బదిలీ చేయడం మద్యం కుంభకోణం కోసమేనని సిట్ నిరాధార అభియోగాలు మోపింది. ఈ ఆరోపణలను మిథున్ రెడ్డి, పీఎల్ఆర్ కంపెనీ ఆధారాలతో సహా తిప్పికొట్టినా సిట్ పదే పదే అదే అభియోగం ఆధారంగానే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసింది. ఇదీ అసలు వాస్తవం అసలు వాస్తవాలను మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు పూర్తి ఆధారాలతో న్యాయస్థానానికి నివేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఎందుకు కేసు పెట్టరు?⇒ ఈ అక్రమ కేసు కుట్రలో చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి బట్టబయలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొన్న రాజ్ కేసిరెడ్డితో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామి అనే వాస్తవాన్ని ఉద్దేశ పూర్వకంగానే విస్మరిస్తోంది. మంత్రి లోకేశ్కు బినామీగా పేరుపడిన ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార వ్యవహారాలపై అందుకే సిట్ దృష్టి సారించడం లేదు. ⇒ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు చేశారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ఫ్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ.. హైదరాబాద్లోని ఒకే చిరునామా (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. ⇒ ఈ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ( ్చఛిఛిౌun్టటఃఠీటజ్చిnఠిజీజీnజట్చpట్జౌ్ఛఛ్టిట. ఛిౌఝ)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన కేశినేని చిన్ని.. మంత్రి నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ అన్నది బహిరంగ రహస్యం. అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని చేశారు. ⇒ కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్కు విశాఖపట్నంలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్ బండారం బట్టబయలవుతుంది. రాజ్ కేసిరెడ్డితోపాటు ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులపై సిట్ నమోదు చేసింది అక్రమ కేసేనన్నది బయట పడుతుంది. ఇదంతా చంద్రబాబు రెడ్బుక్ కుతంత్రమేనన్నది తేటతెల్లమవుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు మొత్తం కుట్ర బహిర్గతమవుతుంది. -
బెడిసి కొడుతున్న బాబు బేతాళ కుట్రలు
సాక్షి, అమరావతి : చంద్రబాబు బేతాళ కుట్రలు ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు కుట్ర విచ్చిన్నమవుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పన్నిన కుతంత్రం క్రమంగా వీగిపోతోంది. ఈ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు ఈ నెల 6న బెయిల్ మంజూరు కాగా... తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకే పాల్పడుతోందన్నది తద్వారా స్పష్టమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పారదర్శకంగా అమలైందని ఎక్సైజ్ శాఖ నివేదికలే వెల్లడిస్తున్నాయి. అందుకే చంద్రబాబు ప్రభుత్వం సిట్ ద్వారా కుట్రకు తెరతీసింది. ఈ అక్రమ కేసులో లేని ఆధారాలు సృష్టించేందుకు వేధింపులనే అస్త్రంగా చేసుకుంది. సిట్ న్యాయస్థానానికి సమ ర్పించిన చార్జ్షిట్లో పేర్కొన్న వాంగ్మూలాన్ని కూడా వారు బెదిరించి, వేధించి నమోదు చేసినవే కావడం గమనార్హం.బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలాన్నే సిట్ ఈ అక్రమ కేసుకు ప్రధాన ఆధారంగా చేసుకుంది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరించిన ఆయన సిట్ బెదిరింపులకు వ్యతిరేకంగా మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డెప్యుటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. తుదకు సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్విసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచి్చంది. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. అబద్ధపు వాంగ్మూలాల కోసం బెదిరింపులు ⇒ ఈ కేసులో వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్, అనూషలను అప్రూవర్లుగా మార్చాలని సిట్ యత్నించడం గమనార్హం. ముందుగా అరెస్టు అయితేనే అప్రూవర్లుగా మారేందుకు పిటిషన్ను పరిశీలిస్తామని న్యాయస్థానం చెప్పడంతో ఆ ముగ్గురూ వెనక్కి తగ్గాల్సి వచి్చంది. ⇒ అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని సిట్ డిస్టిలరీల ప్రతినిధులను వేధించింది. వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచి్చంది. ⇒ ఈ కేసులో అరెస్టు అయిన రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్రెడ్డి విచారణలో చెప్పని విషయాలు చెప్పినట్టుగా రిమాండ్ నివేదికలో పేర్కొనడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా పని చేసిన గిరి, మదన్ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్ర స్థాయిలో వేధించారు. బెంబేలెత్తిన గిరి.. సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్ రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ⇒ రాజ్ కేసిరెడ్డి భార్య భాగస్వామిగా ఉన్న∙ఇంజినీరింగ్ కాలేజీలో రూ.11 కోట్లు స్వా«దీనం చేసుకుని, ఆ డబ్బు కేసిరెడ్డిదేనని సిట్ మరో కట్టు కథ అల్లింది. కాగా, ఆ నగదు తనది కాదని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయిండంతో సిట్ కుట్ర కథ అడ్డం తిరిగింది. ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్ల ఆధారంగా ఎప్పుడు ఏ బ్యాంకుల నుంచి విత్డ్రా చేశారో ఆర్బీఐ ద్వారా విచారించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరడంతో సిట్ తోక ముడిచింది. అన్నీ అక్రమ అరెస్టులే.. ⇒ ఈ అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ బరితెగించి వ్యవహరించింది. అక్రమ అరెస్టులతో వేధింపులకు పాల్పడింది. అప్రూవర్గా మారి తాము చెప్పినట్టు వాంగ్మూలం ఇవ్వాలని రాజ్ కేసిరెడ్డిని వేధించారు. అందుకు ఆయన తిరస్కరించడంతోనే అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిలను సిట్ అక్రమంగా అరెస్టు చేసింది. ⇒ అసలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో సంబంధం లేని ప్రపంచ దిగ్గజ సిమెంట్ కంపెనీ వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేయడం సిట్ కుట్రకు పరాకాష్ట. సిట్ ఆయనతో బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించింది. ఆయన ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో సిట్ కుతంత్రం బెడిసి కొట్టింది. ⇒ మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్నేహితుడు వెంకటేశ్నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతో ఈ కేసులో వెంకటేశ్నాయుడును కూడా అరెస్టు చేశారు. దు్రష్పచార కుతంత్రం ⇒ అక్రమ కేసులో దర్యాప్తు పేరిట సిట్ కుతంత్రాలు అడ్డూ అదుపు లేకుండా సాగాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయాల్లో సిట్ సోదాల పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. దీంతో ఆయన కంపెనీల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి డైరెక్టర్గా వ్యవహరించారని ఎల్లో మీడియా దు్రష్పచారం చేసింది. వాస్తవానికి వైఎస్ అనిల్ రెడ్డి మాతృమూర్తి వైఎస్ భారతి గతంలో ఆ కంపెనీల్లో డైరెక్టర్గా వ్యవహరించారు. ⇒ హైదరాబాద్కు చెందిన న్యాయవాది, వ్యాపారి నర్రెడ్డి సునీల్ రెడ్డి నివాసాల్లో తనిఖీల పేరిట సిట్ రాద్ధాంతం చేసింది. ఆ సమయంలో ఓ ప్రైవేటు వాహనంలో కొన్ని సందేహాస్పద పత్రాలను ఆయన నివాసంలో చేర్చేందుకు సిట్ యత్నించడం గమనార్హం. ఆ వాహనంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఉండటం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. అంటే తనిఖీల పేరుతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు సిట్ యత్నించిందన్నది బహిర్గతమైంది. ⇒ సిట్ దాఖలు చేసిన మొదటి చార్జ్షిట్, అనుబంధ చార్జ్షిట్లను పరిశీలించిన న్యాయస్థానమే వాటి చట్టబద్ధతను ప్రశి్నంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయస్థానం లేవనెత్తిన అభ్యంతరాలపై సిట్ సమాధానం చెప్పలేకపోయింది. అందుకే సీఆర్సీపీ సెక్షన్ 167(2) ప్రకారం ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, రిటైర్డ్ అధికారి కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ ఎండీ బాలాజీ గోవిందప్పలకు ఈ నెల 6న, ఎంపీ మిథున్ రెడ్డికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. తద్వారా సిట్ అల్లిన కట్టుకథల కుట్రలు ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నాడు మద్యం విధానం పారదర్శకం⇒ అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశల వారీగా మద్య నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసింది. ⇒ అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ 4,380 ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశ పెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశల వారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. ⇒ చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పరి్మట్ రూమ్లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకు ముందు ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. మొత్తం 20 డిస్టిలరీలను బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ⇒ ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. తద్వారా డిస్టిలరీలకు లాభాలు తగ్గిపోయాయి. అలాంటప్పుడు డిస్టిలరీలు ప్రభుత్వ పెద్దలకు ఎందుకు కమీషన్లు ఇస్తాయి? ఇవ్వనే ఇవ్వవు. కాబట్టే అవినీతి లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలనే ఆధారంగా చేసుకుంది. ఇప్పుడవన్నీ ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. -
మిథున్రెడ్డికి బెయిల్.. నిరూపించే ఆధారాల్లేవ్
కేవలం కేసు తీవ్రత, పరిమాణం మాత్రమే కాక నిందితుని పాత్ర, దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలను బట్టే బెయిల్ మంజూరుపై నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ పాత్రను నిర్ధారించేందుకు సరైన, బలమైన ఆధారాలేవీ లేవు. ఈ కేసులో మిథున్రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారని, ఇందుకు ప్రాసిక్యూషన్.. సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధార పడుతోంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. సహ నిందితుల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 164, 161 స్టేట్మెంట్లు తప్ప ఇతర ఆధారాలను సమర్పించలేదు. ఇవి బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు.నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారు. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలేవీ చూపలేదు. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. అందువల్ల బెయిల్ను తిరస్కరించలేము. – ఏసీబీ కోర్టుసాక్షి, అమరావతి/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్) : మద్యం అక్రమ కేసులో నిందితునిగా ఉన్న రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారని కోర్టు స్పష్టం చేసింది. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు సైతం ఆధారాలేవీ చూపలేదని పేర్కొంది. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావని, అందువల్ల బెయిల్ను తిరస్కరించలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో మిథున్రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారనడానికి కూడా ఎలాంటి ఆధారం చూపలేదని తప్పు పట్టింది. ప్రాసిక్యూషన్.. ఆధారపడుతున్న సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదని చెప్పింది. 164, 161 స్టేట్మెంట్లు బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవని చెబుతూ న్యాయాధికారి పి.భాస్కరరావు బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో నాల్గవ నిందితునిగా ఉన్న మిథున్రెడ్డిని సిట్ అధికారులు ఈ ఏడాది జూలై 19న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన 72 రోజులుగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. ఆరోపణల ఆధారంగా బెయిల్ హక్కును నిరాకరించలేం ‘కేవలం కేసు తీవ్రత, పరిమాణం మాత్రమే కాక నిందితుని పాత్ర, దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలను బట్టే బెయిల్ మంజూరుపై నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ పాత్రను నిర్ధారించేందుకు సరైన, బలమైన ఆధారాలేవీ లేవు. కేవలం ఆరోపణల ఆధారంగా ఆయన అమూల్యమైన బెయిల్ హక్కును తిరస్కరించలేం. నిందితుడిపై ఆరోపణలు తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించినవన్న కారణంతో మాత్రమే బెయిల్ నిరాకరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇందుకు సంబంధించి చట్టాలలో, బెయిల్ సంబంధిత న్యాయ సూత్రాలలో అలాంటి నిషేధం లేదు. మిథున్రెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ ఏమిటంటే, ఈ కేసులో ఆయన మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారని. ఇందుకు ప్రాసిక్యూషన్ సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధార పడుతోంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. సహ నిందితుల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 161 స్టేట్మెంట్లు తప్ప ఇతర ఆధారాలను సమర్పించలేదు. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. వాటికి ఎంత విలువ ఉందనే విషయం క్రా‹స్ ఎగ్జామినేషన్ తర్వాతే తెలుస్తుంది’ అని ఏసీబీ కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఆరోపణలు నిరాధారం ‘మిథున్రెడ్డి ఈ కేసులో మాస్టర్ మైండ్గా ఉంటూ, ఒక సిండికేట్ ద్వారా ముడుపులు వసూలు చేశారని సిట్ ఆరోపించింది. అలాగే, డీకార్ట్ లాజిస్టిక్స్ నుంచి రూ.5 కోట్లు అందుకున్నారని, అది మద్యం విక్రయాలకు సంబంధించిన మొత్తమని కూడా ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలు నిరాధారమైనవి. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. మాస్టర్ మైండ్ అనడంతో పాటు 2019–24 మద్యం విధానం రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారన్నది కూడా మిథున్రెడ్డిపై ఉన్న ఆరోపణ. అయితే, ఆయన మద్యం విధానం రూపకల్పన కమిటీలో సభ్యుడు కాదని, ఆయన పార్లమెంట్ సభ్యుడు మాత్రమేనని, రాష్ట్ర వ్యవహారాలు లేదా ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలేవీ మిథున్రెడ్డిపై ప్రాథమికంగా కేసు రుజువు చేసేందుకు సరిపోవు. ఏదేమైనప్పటికీ, నేరం తీవ్రతను మాత్రమే బెయిల్ తిరస్కరణకు ఏకైక కారణంగా పరిగణించబడకూడదు’ అని ఏసీబీ కోర్టు తేల్చి చెప్పింది. రాజకీయ కేసులు ఉండటం ఆశ్చర్యకరం కాదు ‘మిథున్రెడ్డికి నేర చరిత్ర ఉందంటూ సిట్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏడు కేసులను ప్రస్తావించారు. అయితే, వాటిలో ఐదు కేసులు ఇప్పటికే క్లోజ్ అయ్యాయి. మిగిలిన రెండు కేసులు కూడా రాజకీయ స్వభావం ఉన్నవి. మిథున్రెడ్డికి దీర్ఘకాల రాజకీయ ప్రస్థానం ఉంది. అలాంటప్పుడు రెండు రాజకీయ కేసులు పెండింగ్లో ఉండటం ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎల్లప్పుడూ ప్రత్యర్థులు ఉంటారు. అయితే, మిథున్రెడ్డి ఇప్పటి వరకు ఎటువంటి ఆర్థిక లేదా క్రూరమైన నేరాలకు పాల్పడలేదన్నది వాస్తవం. కాబట్టి, ఆయనను బెయిల్పై విడుదల చేయడం వల్ల సమాజానికి ఎలాంటి ముప్పు కలిగించదు’ అంటూ కోర్టు తీర్పు చెప్పింది. నేరపూరిత కుట్ర, డబ్బు మళ్లింపునకు ఆధారాలేవీ? ‘ఇది బెయిల్ దశ మాత్రమే. కాబట్టి కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి లోతైన పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. కేసు పూర్వాపరాల ఆధారంగా ఈ దశలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా కూడా అది విచారణ ఫలితాన్ని ముందే నిర్ణయించినట్లు అవుతుంది. నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారు. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలేవీ చూపలేదు. సిట్ అధికారులు మిథున్రెడ్డి గూగుల్ టేకౌట్స్, సెల్ టవర్ లోకేషన్ డేటాను ఈ కోర్టు ముందుంచారు. అయితే, నెట్వర్క్ రద్దీ, భౌగోళిక అడ్డంకుల కారణంగా వాటిలో తేడాలున్నాయి. అందువల్ల అవి కచ్చితమైనవి గానీ, నిర్ణయాత్మకమైనవి గానీ కావు’ అని కోర్టు స్పష్టం చేసింది. ప్రాసిక్యూషన్ విఫలం ‘డీకార్ట్ నుంచి పీఎల్ఆర్ కంపెనీకి వచ్చిన రూ.5 కోట్ల నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మిథున్రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఆయనకు ప్రమేయం ఉందని నమ్మేందుకు నగదు, బంగారం, విలాసవంతమైన కార్లు, ఆస్తులు వేటిని కూడా ఆయన నుంచి స్వాదీనం చేసుకోలేదు. ఈ విషయాలన్నింటినీ విచారణ సమయంలో పరిశీలించాల్సి ఉంటుంది. అందువల్ల కొంత మంది సాక్షులు ఇచ్చిన 161 స్టేట్మెంట్లు, సహ నిందితులు ఇచ్చిన 164 స్టేట్మెంట్లు బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు. ఆరోపణలు తీవ్రమైనవి అయినా కూడా, కేసును బట్టి బెయిల్పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రధానంగా నిందితుడికి ఆపాదించిన పాత్ర, ప్రాసిక్యూషన్ సేకరించిన ఆధారాలపై బెయిల్ మంజూరు ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుత కేసుతో పిటిషనర్కు సంబంధం ఉందని నిరూపించే ప్రాథమిక ఆధారాలను చూపడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. ఈ కేసు ఆదాయపు పన్ను శాఖ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)æ ఫిర్యాదు ఆధారంగా నమోదు కాలేదు. చిన్నారులపై వేధింపులు, పన్ను ఎగవేత, బ్యాంకు మోసం, కస్టమ్స్ ఉల్లంఘనలు వంటి ఆరోపణలేవీ పిటిషనర్పై లేవు. పిటిషనర్ మనీ లాండరింగ్, ఉపా, జాతీయ భద్రత కేసుల్లో అరెస్ట్ కాలేదు. కాబట్టి బలమైన ఆధారాలు లేకుండా ఆయన్ను నిరవధికంగా కస్టడీలో ఉంచడానికి వీల్లేదు’ అని ఏసీబీ కోర్టు తన తీర్పులో వివరించింది. ఎంపీ మిథున్రెడ్డి విడుదల సాక్షి, రాజమహేంద్రవరం: మద్యం అక్రమ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వండంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ పి.వి.మిథున్రెడ్డి సోమవారం సాయంత్రం విడుదలయ్యారు. విజయవాడ ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పత్రాలు సెంట్రల్ జైలు అధికారులకు అందడంతో సాయంత్రం 5.55 గంటలకు ఆయన్ను విడుదల చేశారు. కాగా, బెయిల్పై విడుదలైన మిథున్రెడ్డికి వైఎస్సార్ సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బెయిల్ పత్రాలు సెంట్రల్ జైల్ అధికారులకు మధ్యాహ్నమే చేరినా, ఆలస్యంగా విడుదల చేయడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బెయిల్పై విడుదలైన అనంతరం నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్న మిథున్రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేసినట్లు ఆరోపణా లేదు ‘మిథున్రెడ్డి బెయిల్పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేస్తారని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. వాస్తవానికి పిటిషనర్ మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన తండ్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా ఉన్నారు. తద్వారా సమాజంలో వీరికి గట్టి సంబంధాలున్నాయి. ఈ కేసులో ముందు బెయిల్ నిరాకరించిన తర్వాత మిథున్రెడ్డి స్వచ్ఛందంగా దర్యాప్తు అధికారి ముందు లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ మంజూరైనప్పుడు తన పాస్పోర్టును కోర్టుకు అప్పగించారు. 72 రోజుల రిమాండ్ సమయంలో గానీ, మధ్యంతర బెయిల్ కాలంలో గానీ ఆయన సాక్ష్యాలను తారుమారు చేసినట్టు ఎలాంటి ఆరోపణా లేదు. ఈ కేసు ప్రధానంగా డాక్యుమెంటరీ ఆధారాలపైనే ఆధారపడి ఉంది. అవన్నీ ప్రాసిక్యూషన్ సురక్షిత కస్టడీలో ఉన్నాయి. అలాంటప్పుడు సాక్ష్యాలను తారుమారు చేస్తారని, విచారణలో ఆటంకం కలిగించే అవకాశం ఉందనే అనుమానాలతో బెయిల్ నిరాకరించడానికి వీల్లేదు. సాక్ష్యాలను తారుమారు చేసి ఉంటే అందుకు స్పష్టమైన ఆధారాలుంటాయి. సాక్ష్యాల తారుమారుపై అనుమానాలుంటే ఉంటే వాటిని కఠిన షరతుల ద్వారా నిరోధించవచ్చు. పిటిషనర్ సాక్షులను ప్రభావితం చేయడానికి, సాక్ష్యాలను తారుమారు చేయడానికి, విచారణకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తే.. ప్రాసిక్యూషన్ ఎప్పుడైనా కోర్టును ఆశ్రయించి బెయిల్ రద్దు కోరవచ్చు. ప్రజా ప్రయోజనం, నిందితుని వ్యక్తిగత స్వేచ్ఛ రెండింటినీ సమన్వయం చేయాలి. అందువల్ల పిటిషనర్కు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నాం’ అని ఏసీబీ కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. రూ.2 లక్షలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని.. సోమ, శుక్రవారాల్లో దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని.. తదితర షరతులు విధించింది. కాగా, బెయిల్ పిటిషన్పై మిథున్రెడ్డి తరఫున తప్పెట నాగార్జునరెడ్డి, సిట్ తరఫున స్పెషల్ పీపీ వాదనలు వినిపించారు. -
పోటెత్తిన ‘కృష్ణవేణి’
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/కంకిపాడు/ధవళేశ్వరం/విజయపురిసౌత్/మలికిపురం: ప్రకాశం బ్యారేజ్కు ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణమ్మ పోటెత్తింది. రెండ్రోజులుగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. అయితే, సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతానికి 6,74,971 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో రాత్రి ఏడు గంటల సమయానికి 6,54,876 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 15.9 అడుగుల నీటి మట్టం ఉంది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఒక అడుగు మేర వరద పెరిగింది.ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దాములూరు, మూలపాడు, కొటికలపూడి, జూపూడి, త్రిలోచనాపురం, లంక గ్రామాల్లో మినుము పంట ముంపునకు గురైంది. 700 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ముక్త్యాల–జగ్గయ్యపేట రహదారిలో చంద్రమ్మ కయ్య పొంగి ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రావిరాల బీసీ కాలనీ వాసులు రెండో రోజు కూడా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందారు. ముక్త్యాల, రావిరాల, కె.అగ్రహారం గ్రామాల్లోని పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పోటెత్తడంతో భవానీపురం బెరంపార్క్లోకి నీరు వచ్చి చేరింది. ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసినప్పటికీ ప్రవాహం ఆగలేదు. దీంతో హరిత బెరంపార్క్లోకి పర్యాటకులు, సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించారు.ఏటిపాయ ప్రాంతాల్లో వరద ముంపుకృష్ణాజిల్లాలోని పెనమలూరు, పామర్రు మండలాలు, దివిసీమ ప్రాంతాల్లో ఏటిపాయ వెంబడి ఉన్న ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వరదనీరు కరకట్ట అంచులు తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. తోట్లవల్లూరు, పెనమలూరు, కంకిపాడు మండలాల్లో కరకట్ట వెంబడి ఉన్న పంట పొలాలు ముంపుబారిన పడ్డాయి. ప్రధానంగా అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు నీట మునిగాయి. పెనమలూరు మండలంలో కరకట్ట వెంబడి గ్రామాల్లో వేలాది నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే, దివిసీమ పరిధిలోని ఎడ్లంక గ్రామంలోకి కూడా వరద చొచ్చుకొచ్చింది. రహదారి మార్గం మూసుకుపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు నివాసాల్లోకి నీరు చేరింది. నివాసితులు సామాన్లను తరలిస్తున్నారు. అలాగే, ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో లంక గ్రామాలు, కరకట్ట వెంబడి ప్రాంతాలు ముంపుబారిన పడే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం నుంచి 5,91,456 క్యూసెక్కులు విడుదల శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 5,91,456 క్యూసెక్కులు వచ్చి చేరటంతో వచ్చిన నీరు వచి్చనట్టు దిగువకు వదులుతున్నారు. సోమవారం 24 క్రస్ట్గేట్లు 15 అడుగులు, రెండు గేట్లు 20 అడుగుల మేర ఎత్తి 5,41,516 క్యూసెక్కులను దిగువకు వదిలారు. కుడికాలువకు 9,533, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,333, ఎస్ఎల్బీసీకి 1,200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.నిలకడగా గోదావరి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం నిలకడగా ఉంది. సోమవారం ఉదయం 6.15 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.70 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అదే స్థాయిలో నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 9,59,784 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. డెల్టా కాలువలకు 12,500 క్యూసెక్కులు వదిలారు. ఎగువన నీటి ఉధృతి పెరుగుతుండటంతో కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరంలో అలజడి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని తీర ప్రాంతంలో సముద్రం ముందుకు వస్తుండటంతో ప్రజల్లో అలజడి మొదలైంది. అంతర్వేది నుంచి కరవాక వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర సోమవారం సముద్రం 300 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొచ్చింది. వరద కారణంగా గోదావరి పాయల నుంచి భారీగా నీరు చేరుతుండటంతో సముద్రం ముందుకొస్తోంది. సముద్రపు అలలు వేగంగా దూసుకురావడం వల్ల తీర ప్రాంతం కోతకు గురవుతోంది. ముఖ్యంగా అంతర్వేది లైట్ హౌస్ వద్ద తీరం అధికంగా కోతకు గురవుతున్నట్లు కనిపిస్తోంది. -
చర్చలు విఫలం.. సమ్మె ఉధృతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులతో సోమవారం వైద్యశాఖ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతోసమ్మెను ఉధృతం చేస్తామని పీహెచ్సీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిషోర్ ప్రకటించారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి ఎమర్జెన్సీ వైద్య సేవలను బహిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఔట్పేషెంట్ సేవలను బహిష్కరించామన్నారు. అయితే సమ్మె చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంహెచ్ఓలను ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఎస్మా ప్రయోగిస్తామని ఇప్పటికే పలు జిల్లాల డీఎంహెచ్ఓలు హెచ్చరించారు. ప్రభుత్వం దిగి రాకపోవడంతో.. మెడికల్ పీజీ కోర్సుల్లో ఇన్సర్వీస్ కోటా కుదింపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం పీహెచ్సీ వైద్యులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. గత వారంలోనే ప్రభుత్వానికి వైద్యుల సంఘం సమ్మె నోటీసు ఇవ్వడంతో పాటు, సమ్మె కార్యాచరణను ప్రకటించింది. ఈ క్రమంలో గత శుక్రవారం నుంచే ఆన్లైన్ రిపోర్టింగ్, పీహెచ్సీ వెలుపల మెడికల్ క్యాంపులలో వైద్యసేవలను బహిష్కరించారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో సోమవారం ఓపీ సేవలను పూర్తిగా బహిష్కరించారు. దీంతో.. ఆస్పత్రులకు వస్తున్న రోగులు వైద్యం అందక నానా అవస్థలు పడుతున్నారు. 20 శాతం పీజీ ఇన్సర్వీసు కోటా కోసం.. మరోవైపు.. పీహెచ్సీ వైద్యుల సంఘం ప్రతినిధులతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ సోమవారం మంగళగిరిలోని కార్యాలయంలో చర్చించారు. పీజీ ఇన్సర్వీసు కోటా 20 శాతాన్ని అన్ని క్లినికల్ స్పెషాలిటీలకు వర్తింపజేయాలని వైద్యులు ప్రధానంగా డిమాండ్ చేశారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నందుకుగాను అలవెన్స్, పదోన్నతులు కల్పిస్తూ ఇతర సమస్యలనూ పరిష్కరించాలని కోరారు. అయితే, ఇన్సర్వీస్ కోటా విషయంలో ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఇన్సర్వీస్ కోటాపై వైద్యులకు సర్దిచెప్పేందుకు అధికారులెంత ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన హామీలేకపోవడంతో మంగళ, బుధవారాల్లో జిల్లా స్థాయిలో ఎమర్జెన్సీ సేవలను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వైద్యులు ప్రకటించారు. అలాగే, గురువారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చామని.. శుక్రవారం నుంచి విజయవాడలో ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. వైద్యుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తి, కార్యదర్శి కిషోర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మెను జటిలం చేయకుండా ప్రభుత్వం వైద్యుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. వైద్యుల సంఘం పిలుపు ఇస్తే రోగనిర్ధారణ సేవలను నిలిపేస్తామని ఆయనన్నారు. 30 నుంచి 15 శాతానికి కుదింపు నిజానికి.. క్లినికల్ విభాగంలో 30 శాతం, నాన్ క్లినికల్లో 50 శాతం చొప్పున గత ప్రభుత్వంలో ఇన్సర్వీస్ కోటా ఉండేది. ఈ కోటాను గతేడాది చంద్రబాబు ప్రభుత్వం రాగానే క్లినికల్ కోర్సుల్లో 15, నాన్ క్లినికల్లో 30 శాతానికి కుదించింది. దీంతో.. గతేడాదే పీహెచ్సీ వైద్యులు సమ్మెలోకి వెళ్లారు. అన్ని జిల్లాల నుంచి వైద్యులు విజయవాడకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ప్రభుత్వం దిగొచ్చింది. అనంతరం క్లినికల్లో ఎంపిక చేసిన స్పెషాలిటీల్లో కోటాను 20 శాతానికి పెంచారు. అదే విధంగా భవిష్యత్తులో ఇన్సర్వీస్ కోటాపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వైద్యులతో చర్చిస్తామని కూడా హామీ ఇచి్చంది. అయితే, వైద్యుల సమ్మతి లేకుండానే ఈ విద్యా సంవత్సరానికి ఇన్సర్వీస్ కోటాను 20 నుంచి 15 శాతానికి కుదించడంతో వైద్యులు రగిలిపోతున్నారు. -
సచివాలయ ఉద్యోగుల ఆందోళన ఉధృతం
సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారం కోసం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆందోళన ఉధృతమవుతోంది. ఉద్యోగ సంఘాల పిలుపుమేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రతిరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. అయితే, ఉద్యోగ సంఘాలు నిరసన నోటీసులిచ్చిన అనంతరం గత బుధవారం ఉద్యోగులను చర్చలకని పిలిచి, తర్వాత ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఉద్యోగులు మాత్రం తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొననున్నట్టు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రకటించగా, మరో ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తాము పింఛన్ల పంపిణీని బహిష్కరిస్తామని ప్రకటన జారీ చేసింది. వలంటీర్ల విధులు మేం చేయం చిత్తూరు కలెక్టరేట్: ‘వలంటీర్లు చేయాల్సిన పనులను కూటమి ప్రభుత్వం మాకు అప్పగించడం సరికాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేం వలంటీర్ల విధులను నిర్వహించం. ఈ ప్రభుత్వం సర్వేల పేరుతో ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఇంటింటి సర్వే నుంచి మాకు విముక్తి కల్పించాలి’ అని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఉద్యోగులు సోమవారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ సుమిత్కుమార్ గాందీకి వినతిపత్రం అందజేశారు. జేఏసీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వినోద్కుమార్ మాట్లాడుతూ కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వలంటీర్ పనులు అప్పగించడం అన్యాయమన్నారు. వలంటీర్లు చేసిన పనులన్నీ తాము చేయాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేష్ మాట్లాడుతూ సర్వేల పేరుతో సచివాలయ ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూడటం తగదన్నారు. ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగానే సచివాలయాల ఉద్యోగులకు కూడా పదోన్నతుల కల్పించాలని డిమాండ్ చేశారు. -
‘డ్రైవర్ సేవలో..’నూ కూటమి కోత
సాక్షి, అమరావతి: ‘డ్రైవర్ సేవలో..’ పేరిట ఆటో, ట్యాక్సీ, మాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే పథకం అమలులో చంద్రబాబు ప్రభుత్వం ‘చలానా’ మెలికతో కోత పెడుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకం కింద లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందించారు. గత ఐదేళ్లలో లేని నిబంధనలను కూటమి ప్రభుత్వం ‘డ్రైవర్ల సేవలో..’ పథకంలో చేర్చి ,సాధ్యమైనంత మందిని పథకానికి అనర్హులను చేస్తోంది. ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్లపై ట్రాఫిక్ చలానాల బకాయి ఉంటే రూ.15 వేల ఆర్థిక సహాయం పథకానికి అనర్హులని ప్రకటించింది. చలానా బకాయిల కారణం చూపి దాదాపు 8వేల మంది డ్రైవర్లు అనర్హులని చెబుతోంది. ఈ నెల 4లోగా చలానా బకాయిలు చెల్లించకపోతే వారికి ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించేది లేదని రవాణా శాఖ స్పష్టం చేస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను కెమెరాలు/సెల్ఫోన్ల ద్వారా ట్రాఫిక్ పోలీసులు రికార్డు చేసి జరిమానాలు విధిస్తుంటారు. అయితే, జరిమానా విధింపుపై డ్రైవ్రర్లకు తక్షణం సమాచారం ఉండదు. తమ వాహనాన్ని విక్రయించే సమయంలోనో ఏదైనా ఇతర నిబంధనల ఉల్లంఘన సమయంలోనో పోలీసులు చెబితేనే తెలుస్తుంది. అప్పుడు వారు చలానా బకాయిలు చెల్లిస్తారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే. కాగా.. ప్రస్తుతం ఆటో, ట్యాక్సీ, మాక్సి క్యాబ్ డ్రైవర్లకు తమ వాహనంపై చలానా బకాయిలు ఉన్నాయో లేదో తెలియడం లేదు. వారికి గ్రామ, వార్డు సచివాలయం నుంచి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఈ నెల 4న ఈ పథకం కింద డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అప్పటికీ డ్రైవర్లకు సమాచారం లేకపోతే వారు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి అనర్హులు అవుతారు. ఈ విషయంపై రవాణా శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చలానా బకాయిల నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆటో, ట్యాక్సీ, మాక్సీ కేబ్ డ్రైవర్ల యూనియన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఉద్యోగులను నిరాశపరిచారుదసరా కానుకగా నాలుగు కరువు భత్యాల్లో రెండైనా ఇస్తారనుకున్నాం 12వ పీఆర్సీ నియమించి ఐఆర్ ప్రకటిస్తారని ఎదురుచూశాంస్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం దక్కుతుందని ఎదురుచూసిన ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగిందని ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. దసరా కానుకగా పెండింగ్లో ఉన్న నాలుగు కరువు భత్యాలలో కనీసం రెండైనా ఇస్తారని, 12వ పీఆర్సీ నియమించి ఉద్యోగులందరికీ ఇంటీరియం రిలీఫ్ ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూశారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వీటి ఊసెత్తకపోవడం విచారకరమన్నారు. ఉద్యోగుల కరువు భత్యం, 11వ పీఆర్సీ బకాయిలు రూ.12,119.77 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పకపోవడం సరైంది కాదన్నారు. అలాగే, గ్రాట్యుటీ, సరెండర్ లీవులు, పీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ బిల్లులు పెండింగ్లో ఉండడంవల్ల ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. అందరికీ ఆమోద యోగ్యమైన పెన్షన్ పథకం అమలు చేస్తామని ఇప్పటివరకు నిర్ణయం ప్రకటించకపోవడం వల్ల రిటైరవుతున్న ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఉద్యోగులకు హెల్త్కార్డులు ఉన్నా వైద్యం అందడం లేదని.. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఒకటిన్నర నెల జీతం పెండింగ్లో ఉండడంవల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలుకాక ఇబ్బందిపడుతున్నారని వీళ్లందరికీ సంక్షేమ పథకాలు అమలుచేసేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
ఎంపీ మిథున్రెడ్డి విడుదల
సాక్షి, రాజమండ్రి: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం అక్రమ కేసులో మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టు సోమవారం (సెప్టెంబర్29న) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన మిథున్రెడ్డికి వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికాయి అంతకుముందు మిథున్రెడ్డి జైలు నుంచి విడుదలపై ఉత్కంఠ నెలకొంది. మద్యం అక్రమ కేసులో మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలు సెంట్రల్ జైలు అధికారిక ఈమెయిల్కు పంపించింది. అయితే ఎంపీ మిథున్రెడ్డి జైలు నుంచి విడుదలకు సంబంధించిన పత్రాలు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారిక మెయిల్కు వెళ్లినా.. మెయిల్కు పత్రాలు రాలేదని జైలు అధికారులు తెలిపారు. దీంతో ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్ వచ్చినా ఎందుకు విడుదల చేయడం లేదంటూ జైలు అధికారులతో న్యాయవాదులు మాట్లాడారు. మిథున్రెడ్డి విడుదలలో జాప్యంపై వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జైలు అధికారులు ఎంపీ మిథున్రెడ్డిని జైలు నుంచి విడుదల చేశారు. విడుదల అనంతరం మిథున్రెడ్డికి పార్టీ నేతలు,శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ లోక్సభా పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు మద్యం అక్రమ కేసులో మిథున్రెడ్డికి సోమవారం(సెప్టెంబర్ 29) బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. మద్యం అక్రమ కేసులో జులై 19వ తేదీన మిథున్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 71 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్రెడ్డికి ఇవాళ ఏసీబీ కోర్టు రెండు ష్యూరిటీలు, రూ.2లక్షల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు బెయిల్ మంజూరుతో మంగళవారం జైలు నుంచి విడుదల కానున్నారు. 👉ఇదీ చదవండి: పరాకాష్టకు బాబు భేతాళ కుట్రజూలై 19వ తేదీ(శనివారం) ఎంపీ మిథున్రెడ్డి స్వచ్ఛందంగా సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఆరోజు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు సిట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం మిథున్ను అరెస్ట్ చేసి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. -
రెచ్చిపోయిన టీడీపీ మూకలు.. మైనర్ బాలికపై దాడి
సాక్షి,అనంతపురం: ఏపీలో దుశ్శాసన పాలన కొనసాగుతోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భూమి ఆక్రమణకు వ్యతిరేకంగా నిలిచిన మైనర్ బాలికపై టీడీపీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. జేసీబీకి అడ్డుగా వెళ్లిన బాలికను బలవంతంగా లాగిపడేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. -
అన్నను మరచిన తమ్ముళ్లు!
అవాకులు చెవాకులు పేలడం.. అభిమానంతో దగ్గరకొచ్చిన వారికి చెంపదెబ్బలు తగిలించడం ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కొత్తేమీ కాదు కానీ.. అసెంబ్లీ వేదికగా ఆయన సహనటుడు చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్పై చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయన వ్యక్తిత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది. కొందరి బలహీనతలు, కొందరి అహంకారం, ఇంకొందరి విచక్షణ, విజ్ఞతలను ప్రజల ముందుంచింది. అంతేకాదు.. తరచూ రాజకీయ విన్యసాలు సాగిస్తూ, ఏది వాస్తవమో, ఏది అబద్దమో తెలియని స్థాయిలో మాట్లాడే నేతలు కొందరి నిజరూపం కూడా వెల్లడించింది.తనను కలిసేందుకు వచ్చిన సినీ పరిశ్రమ వారిని సీఎం హోదాలో జగన్ ఎంత గౌరవంగా చూసింది ప్రపంచానికి తెలిసినట్లయింది. జగన్ విజ్ఞత అందరికి తెలిస్తే, చిరంజీవి కాస్త లేటుగా అయినా స్పందించి తన వ్యక్తిత్వాన్ని కొంతవరకైనా నిలబెట్టుకున్నారనిపిస్తుంది. మొత్తం ఎపిసోడ్లో సోదికి వెళితే ఏదో బయటపడిందన్నట్లుగా సోషల్ మీడియా పుణ్యమా అని అనేక పాత విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయినా బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోవడం, సారీ చెప్పాలని కూటమి నేతలు కోరలేకపోవడం గమనించాల్సిన అంశాలే.శాసనసభలో జగన్ను, చిరంజీవిని అవమానిస్తుంటే ప్రేక్షకపాత్ర పోషించిన గౌరవ సభ్యులు, గౌరవ ఉప సభాపతి గురించి ఏమనగలం? బాలకృష్ణ సంస్కార రహితంగా వ్యాఖ్యలు చేసినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు నోరు విప్పలేకపోవడంతో వారు బాగా ఎక్స్పోజ్ అయ్యారు. జగన్ను సైకో అనడం ద్వారా బాలకృష్ణ తన పాత చరిత్ర అంతా తవ్వించుకున్నారు. బాలకృష్ణ ఏ రకంగా సైకోనో వివరించే అనేక దృష్టాంతాలు వెల్లడయ్యాయి. అసెంబ్లీ సమావేశాలలో కొందరు టీడీపీ సభ్యులు ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే ప్రభుత్వ పరువు తీస్తారా అంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు తన బావమరిది బాలకృష్ణను మాత్రం ఒక్క మాట అనలేకపోయారు.మెగాస్టార్ చిరంజీవిని అలా అనడం తప్పు అని చంద్రబాబు చెప్పలేకపోయారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ దారుణం. ఆయన మరో సోదరుడు నాగబాబు నోరు పెగలలేదు. జనసేన కేడర్, సామాజిక వర్గం, సాధారణ ప్రజలు బాలకృష్ణ వైఖరిని తీవ్రంగా నిరసించినా పవన్, నాగబాబులు మాత్రం కనీసం కిమ్మనలేకపోయారు. పదవిలో ఉన్న మజా అలాంటిదేమో!బాలకృష్ణ జనసేన కార్యకర్తలను అలగా జనం అన్నారని ఒకసారి వాపోయిన పవన్ ఆ తరువాత ఆయనతోనే చెట్టాపట్టాలేసుకుని తిరగడం అందరూ గమనించే ఉంటారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంలో బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అంటూ కామెంట్ చేసినా వీరు ఎవరూ పెద్దగా ఫీల్ అయినట్లు లేదు. నాగబాబు కొంతవరకూ దీటుగా సమాధానం చెప్పినప్పటికీ ఆ తరువాత టీడీపీ పదవుల ఆశతో అన్నీ మరచిపోయారు.చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్టైతే రోడ్డుమీద పడి నానా యాగీ చేసిన పవన్ కళ్యాణ్ సొంత అన్నకు అవమానం జరిగితే జ్వరం పేరుతో హైదరాబాద్ వెళ్లి బెడ్పై ఉండిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. బాలకృష్ణ మాటలను ఖండిస్తే ఎక్కడ తన ఉప ముఖ్యమంత్రి పదవి పోతుందో అని పవన్ బెంగపట్టినట్టుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఏమీ చేసినా భరించాల్సిందే అని పవన్ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.సమస్యంతా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు అసందర్భ ప్రేలాపనతో మొదలైంది. ఆయన ఏ పార్టీనో ఆయనకే గుర్తుండదు. చంద్రబాబు మెప్పుదల కోసం జగన్పై లేని పోని అభాండాలు మోపి, చిరంజీవి వద్ద మార్కులు కొట్టేయాలనుకుని బోల్తాపడ్డారు. చిరంజీవి తదితర నటులు జగన్ను కలిసినప్పుడు ఏదో అవమానం జరిగిందని అచ్చం టీడీపీ నేత మాదిరి ఒక కల్పిత కథ సృష్టించే యత్నం చేసి దెబ్బతిన్నారు. చివరికి శాసనసభ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తను మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయనే స్వయంగా కోరుకున్నారు. అయినా అప్పటికే జరగవలసిన డామేజీ జరిగిపోయింది.ఆ కల్పిత కథలో చిరంజీవిని పొగడడం విని తట్టుకోలేకపోయిన బాలకృష్ణ మైకు అందుకుని సభా మర్యాదలతో సంబంధం లేకుండా నెత్తిపై గాగుల్స్, ఫ్యాంట్ జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని మాట్లాడిన తీరు ఆయన అహంకారం బయటపెట్టిందన్న విమర్శ వచ్చింది. ఎందుకంటే బావ ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, తానేమో ఎన్టీఆర్ కుమారుడిని అన్న గర్వం ఆయనలో ఉందన్న భావన ఏర్పడింది. చిరంజీవిని ఎవడు అనడం, జగన్ ఇంటిలో గట్టిగా మాట్లాడే ధైర్యం చిరంజీవికి లేదన్నట్లుగా మాట్లాడడం అందరిని విస్మయపరిచింది. జగన్ను దూషిస్తున్నప్పుడే స్పీకర్ ఛైర్లోఉన్నవారు వారించగలిగితే ఇది ఆగి ఉండేది. సీఎం బావమరిది కావడంతో అలా చేయలేకపోయారు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు వైఎస్సార్ కాంగ్రెస్, ఇటు చిరంజీవి అభిమానులు బాలకృష్ణపై మండిపడ్డారు. పేర్నినాని వంటివారు అసలు సైకో బాలకృష్ణే అంటూ ఆయనకు ఉన్న మెంటల్ సర్టిఫికెట్ తో సహా పలు అంశాలను గుర్తు చేసి పరువు తీశారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి.అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బాలకృష్ణ జరిపిన కాల్పుల వల్ల నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడు సత్యనారాయణలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ కేసులో బాలకృష్ణ జైలుకు వెళ్లకుండా మెంటల్ సర్టిఫికెట్ను తీసుకుని కాపాడినట్లు ప్రముఖ వైద్యులు, దివంగత కాకర్ల సుభ్బారావు చెప్పిన విషయం వీడియోలలో నిక్షిప్తమై ఉంది.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. రక్తపు మరకల సాక్ష్యాధారాలు చెరిపి వేశారని అప్పట్లో బాలకృష్ణ భార్య వసుంధరపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆమె కోర్టులో సరెండరై బెయిల్ కూడా పొందారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్పై అనవసరంగా నోరు పారేసుకునే చంద్రబాబు తన సమీప బంధువు నిజంగా అలా సాక్ష్యాలు చెరిపేసిన విషయాన్ని మాత్రం కప్పిపుచ్చుతూంటారని ఇప్పుడు ప్రజల దృష్టికి వచ్చింది.చట్టపరంగా కాల్పుల కేసులో బాలకృష్ణను జైలులో పెట్టాలి. అలా చేయలేదు. బాలివుడ్ నటుడు సంజయ్ దత్ వద్ద తుపాకులు దొరికితేనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అదే బాలకృష్ణ కాల్పులు జరిపితే కూడా జైలుకు వెళ్లలేదని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. ఎన్టీఆర్ కుమారుడు అన్న సానుభూతి, ఆ రోజుల్లో కాంగ్రెస్లో ఉన్న దగ్గుబాటి దంపతులు, తదితరుల విజ్ఞప్తిని గమనంలోకి తీసుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ కేసును తేలికగా వదలి వేసిందని అంటారు. చట్టప్రకారం అలా చేయకూడదు.అయినా చేశారు.ఆ కృతజ్ఞత కూడా బాలకృష్ణకు ఆ తర్వాత కాలంలో లేకపోయింది. సినిమాల పరంగా, ఇతరత్రా సాయం, గౌరవం పొందినప్పటికీ జగన్ను పట్టుకుని బాలకృష్ణ పిచ్చి వ్యాఖ్య చేయడం ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. వైఎస్సార్ కాబట్టి రాజకీయంగా ఆలోచించకుండా బాలకృష్ణకు, ఆయన భార్యకు సాయం చేశారని, అదే పరిస్థితి వైఎస్సార్ సన్నిహితులు ఎవరికైనా వచ్చి అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండిఉంటే, రాజకీయంగా ఎంతగా వాడుకునే వారో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.మెంటల్ సర్టిఫికెట్ ఉన్నా, బాలకృష్ణకు టీడీపీ ఇక్కెట్ ఇవ్వడం, హిందుపూరం ప్రజలు ఎన్నుకోవడం విశేషమే. ఆ తర్వాత కాలంలో ఆయన తన అభిమానులపై దురుసుగా వ్యవహరించిన ఘట్టాలు కూడా ఉన్నాయి. అయినా ఆయనను ఎవరూ మందలించలేదు. ఆయన కూడా తాను తప్పు చేశానని అనుకోవడం లేదు. అమ్మాయిలపై బాలకృష్ణ చేసిన ఒక వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది. ఆ కామెంట్ చేసినప్పుడు అక్కడ ఉన్న సినీ ప్రముఖులు కాని, సభలో పాల్గొన్నవారు ఎవరూ బాలకృష్ణను ఏమీ అనలేదు. పైగా అంతా నవ్వుతూ కూర్చున్నారు. తదనంతర కాలంలో ఆయనకు పద్మభూషణ్ బిరుదు రావడం కూడా మరో విశేషం. ప్రధానమంత్రి మోడీని పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేసినా బాలకృష్ణకు ఏమీ ఇబ్బంది రాలేదు. పైగా బిరుదు కూడా వచ్చింది. బీజేపీ నేతలు ఇందుకు సిగ్గుపడినట్లు కనిపించలేదు.చంద్రబాబుకేమో తన బావమరిది జోలికి వెళితే ఇంకేమవుతుందో అన్న భయం ఉండవచ్చని, అందుకే ఆయన కూడా దీనిపై స్పందించలేదేమో అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక చిరంజీవి మూడేళ్లపాటు ఈ అంశంపై మౌనంగా ఉండి తన తమ్ముడికి రాజకీయంగా సాయపడ్డారని, ఇప్పుడు బాలకృష్ణ చేసిన అవమానాన్ని తట్టుకోలేక బయటకు వచ్చారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు, పవన్లు అబద్దపు ప్రచారం చేస్తున్నప్పుడే జగన్ తమను గౌరవంగా చూసుకున్నారని చిరంజీవి చెప్పి ఉంటే ఎంతో మర్యాదగా ఉండేదన్న భావన ఉంది. ఇప్పటికైనా చిరంజీవి స్పందించడం బాగానే ఉంది కాకపోతే సొంత తమ్ముళ్ల నుంచే ఆయనకు మద్దతు కొరవడడం కాస్త అప్రతిష్టే. కొద్ది మంది చిరంజీవి అభిమానులు తమ నిరసన చెప్పారు. మరో ప్రముఖ నటుడు ఆర్.నారాయణ మూర్తి అసెంబ్లీలో జరిగిన ఘట్టాన్ని ఖండిస్తూ సినిమా ప్రముఖులందరిని జగన్ గౌరవంగా చూశారని, చిరంజీవి రాసిన లేఖలో ఉన్న అంశాలు వాస్తవమైనవని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో మాత్రం బాలకృష్ణను ఉతికి ఆరేశారు. పవన్ నుంచి సానుభూతి దక్కకపోయినా, వైసీపీ వారు మాత్రం చిరంజీవికి ఎంతొకొంత మద్దతు ఇచ్చారు. ఈ రకంగా బాలకృష్ణ ఉదంతంలో ఆయనతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,నాగబాబుల అసలు రంగు బయటపడినట్లయిందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
10న సచివాలయ ఉద్యోగుల ‘విజయవాడ మార్చ్’
సింహాచలం (విశాఖ): రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే అక్టోబర్ 10వ తేదీన లక్ష మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో విజయవాడ మార్చ్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక (జేఏసీ) ప్రకటించింది. విశాఖపట్నంలోని సింహాచలంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ వలంటీర్ల విధులను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వర్తించబోరని స్పష్టం చేశారు.తక్షణమే ఇంటింటి సర్వే విధుల నుంచి సచివాలయ ఉద్యోగులను తప్పించాలని డిమాండ్ చేశారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, 9 నెలల అరియర్స్ను వెంటనే మంజూరు చేయాలన్నారు. ఆరేళ్లు సర్వీçÜు పూర్తయిన ప్రతి సెక్రటరీకి ఏఏఎస్ ఇంక్రిమెంట్ వర్తింపజేయాలని, ఉద్యోగులందరికీ జూనియర్ అసిస్టెంట్ స్కేల్కు అప్గ్రేడ్ చేసి ప్రమోషన్ చానల్ కల్పించాలని, జాబ్ చార్ట్ను తక్షణమే అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ విప్పర్తి విఖిల్ కృష్ణ, కన్వీనర్ అబ్జుల్ రజాక్, అర్గనైజింగ్ సెక్రటరీ వెస్లీ, కో–చైర్మన్లు భార్గవ్ సుతేజ్, అంకమ్మరావు, రాజేష్, వైస్ చైర్మన్లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, గ్రేటర్ విశాఖ జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. -
ఇండియా పోస్ట్.. డిజిటల్ ఫీస్ట్
సాక్షి, అమరావతి: వేగంగా.. సురక్షితంగా తపాలా సేవలు అందించేందుకు భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనుంది. వినియోగదారులకు మెరుగైన సేవలదించే నిమిత్తం డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న రిజిస్టర్ పోస్టును ఇక నుంచి స్పీడ్ పోస్టులోకి విలీనం చేసింది. పోస్టు పంపించిన వ్యక్తి సురక్షితంగా చేరిందని తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. అదనంగా రూ.5 రుసుమును వసూలు చేస్తుంది. అదేవిధంగా వన్టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత డెలివరీ విధానాన్ని కూడా స్పీడ్ పోస్టు అందుబాటులోకి తీసుకొచ్చింది.డెలివరీ బాయ్కు ఓటీపీ చెప్పిన తర్వాతనే బట్వాడా చేయనుంది. ఓటీపీ ఆధారిత డెలివరీకి కూడా రూ.5 అదనపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్పీడ్ పోస్టు చార్జీలను కూడా సవరించింది. సవరించిన ధరలు, కొత్త ఫీచర్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ఇండియా పోస్ట్ ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్లాండ్ స్పీడ్ పోస్ట్ ధరలను చివరిసారిగా 2012లో సవరించడం జరిగిందని, నూతన టెక్నాలజీ , కొత్త ఆవిష్కరణల్లో పెట్టుబడుల కోసం ధరలను సవరించినట్టు పేర్కొన్నారు.చార్జీలు ఇలా..స్థానికంగా 50 గ్రాములలోపు డెలివరీ చేయడానికి తపాలా శాఖ రూ.19 చార్జీ వసూలు చేయనుంది. అదే 2,000 కి.మీ. వరకు రూ.47 వసూలు చేయనుంది. 51 నుంచి 250 గ్రాముల వరకు స్థానికంగా అయితే రూ.24 చొప్పున.. 2,000 కి.మీ. వరకు అయితే రూ.77గా చార్జీ నిర్ణయించారు. ఆపైన బరువుకు దూరాన్ని బట్టి ధరలను రూ.28 నుంచి రూ.93 వరకు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, ఓటీపీ సేవల ధరలపై అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆన్లైన్ పేమెంట్, ఎస్ఎంఎస్ ఆధారిత డెలివరీ, రియల్టైమ్ డెలివరీ అప్డేట్స్, ఆన్లైన్ బుకింగ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులకు స్పీడ్పోస్టులో 10 శాతం, బల్క్ బుకింగ్స్కు 5 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు శ్రీదేవి వెల్లడించారు. -
పచ్చ కుట్రలు పటాపంచలు!
సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ దుష్ప్రచారం చేశారు. ఆ అబద్ధాలకు ఈనాడు సహా ఎల్లో మీడియా శక్తి వంచన లేకుండా ప్రచారం కల్పించి ప్రజలు నమ్మేలా వారికి బాకాలూదింది. ఈ దుష్టచతుష్టయ దుష్ప్రచారం ఎన్నికల ప్రచారం నాటికి తార స్థాయికి చేరింది. గోబెల్సే సిగ్గుతో తలదించుకునే రీతిలో నిత్యం తప్పుడు ప్రచారాలు, కథనాలతో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో విషాన్ని నింపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసింది. మోసపు హామీలే పెట్టుబడిగా టీడీపీృజనసేన కూటమి ఎన్నికల్లో విజయం సాధించింది.సీన్ కట్ చేస్తే.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే.. 2019ృ24 మధ్య తాము చేసిందంతా దుష్ప్రచారమేనని తనకు తానుగానే చాటుకుంటోంది. దుష్టచతుష్టయం దుష్ప్రచారం బట్టబయలవుతుండటంతో ప్రజలు నిర్ఘాంతపోతున్నారు. అసలు నిజాలు తెలుసుకుని కూటమి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించడానికి వెళ్లిన తన అన్నను వైఎస్ జగన్ అవమానించారంటూ ఇన్నాళ్లూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని గురువారం విడుదల చేసిన లేఖ ద్వారా మెగాస్టార్ చిరంజీవే స్వయంగా చాటి చెప్పారు. సాక్షి, అమరావతి: దుష్ప్రచారమే ఆయుధంగా.. మోసపు హామీలే పెట్టుబడిగా పెట్టి, అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కార్ 16 నెలలుగా ప్రజలను దగా చేస్తోంది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ 143 హామీలను ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటిని బుట్టదాఖలు చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు పూచీ నాదంటూ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు నమ్మబలికిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు మెదపడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నాటి సీఎం వైఎస్ జగన్పై దుష్టచతుష్టయంలా తాము చేసిన దుష్ప్రచారం గుట్టంతా రట్టవుతుండటం, తమ బాగోతం బట్టబయలవుతుండటంతో.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగించడంతోపాటు మరింత అధికంగా ప్రయోజనం చేకూర్చుతానని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేశారు. రూ.14 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకు పప్పులూ బెల్లాల్లా డబ్బులు పంచిపెడుతూ వైఎస్ జగన్ రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ ఎన్నికలకు ముందు విషం కక్కిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 2.09 లక్షల కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించారు. అంత అప్పు చేసినా ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయక పోవడం గమనార్హం. వీటన్నింటినీ కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్తో డప్పు కొడుతున్న చంద్రబాబుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాళం వేస్తున్నారు. ఆ డైవర్షన్ పాలిటిక్స్ను రక్తి కట్టించేందుకు సనాతన ధర్మం అంటూ ఒకసారి.. సీజ్ ద షిప్ అంటూ మరోసారి.. ‘షో’ చేస్తూ డ్రామాలాడుతున్నారు. మరోవైపు ఇసుక నుంచి సిలికా వరకూ టీడీపీ–జనసేన మాఫియా సహజ వనరులను దోచుకుంటూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతూ.. హామీల అమలు, పరిపాలన వైఫల్యాలపై ప్రశి్నంచే గొంతులను రెడ్ బుక్ రాజ్యాంగంతో నొక్కేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో వారి కుట్రల లోగుట్టు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్న తీరు ఇలా ఉంది.వైఎస్ జగన్ గౌరవించారు.. చిరంజీవి తాజా లేఖే నిదర్శనం దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. సినిమా పరిశ్రమ సమస్యలను చర్చించేందుకు వెళ్లిన తన అన్న చిరంజీవిని సీఎం వైఎస్ జగన్ అవమానించారంటూ ఎన్నికలకు ముందు సభల్లో పవన్ కళ్యాణ్ ఊగిపోయారు. ఇదే అంశంపై చంద్రబాబు, లోకేశ్, ఎల్లో మీడియా పవన్కు వంత పాడుతూ విష ప్రచారం చేశారు. బట్టబయలైన వాస్తవం: ఇదే అంశాన్ని గురువారం శాసనసభలో బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడారు. దీనిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ జోక్యం చేసుకుంటూ.. సినీ రంగంలో మెగాస్టార్గా వెలిగిపోతున్న చిరంజీవిని ఉద్దేశించి ‘వాడెవడు’ అంటూ తూలనాడారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ గురువారం సాయంత్రం లేఖ విడుదల చేశారు. తాను ఇండియాలో లేను కాబట్టే ఆ ప్రకటనను విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో సమస్యలపై చర్చించేందుకు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను సాదరంగా ఆహ్వానించినట్లు ఆ లేఖలో స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలిపారు. భోజనం చేస్తున్న సమయంలోనే తాను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని అప్పటి సీఎం జగన్కు వివరించినట్టు స్పష్టం చేశారు. ‘ఆ తర్వాత సినీ ప్రముఖులతో కలిసి సమస్యలపై చర్చించడానికి వైఎస్ జగన్ వద్దకు వెళ్లాం. వైఎస్ జగన్ మమ్మల్ని సాదారంగా ఆహ్వానించారు.. గౌరవించారు. సినీ ప్రముఖుల అందరి సమక్షంలోనే నాటి సీఎం వైఎస్ జగన్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించి సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యం. నేను ఆ చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది’ అని ఆ లేఖలో స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఇతరులతో కలిసి చేసిందంతా దుష్ప్రచారమేనని ఆ లేఖ ద్వారా అర్థమైంది. అప్పు రూ.14 లక్షల కోట్లు కాదు.. రూ.3.78 లక్షల కోట్లే దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఆర్థి క విధ్వంసం సృష్టించిందని.. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేసిందంటూ ఎన్నికలప్పుడు చంద్రబాబు తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేశారు. ఎల్లో మీడియా ఇందుకు వంత పాడుతూ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారంటూ తప్పుడు కథనాలను వండివార్చింది. బట్టబయలైన వాస్తవం: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో రాష్ట్ర అప్పు రూ.9,74,556 కోట్లు అంటూ ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.పది లక్షల కోట్లు అని వెల్లడించారు. 2024–25 బడ్జెట్ ప్రవేశపెడితే.. రాష్ట్ర అప్పుపై వాస్తవాలు బహిర్గతమవుతాయనే నెపంతో జాప్యం చేశారు. చివరకు గతేడాది నవంబర్ 11న ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లేనని అధికారికంగా అంగీకరించారు. కానీ.. ఆ తర్వాత కూడా అప్పులపై సీఎం చంద్రబాబు దు్రష్ఫచారం చేస్తూనే వచ్చారు. మొన్నటికి మొన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన మార్చి 28న రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లు అంటూ చంద్రబాబు బొంకారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పు మొత్తం కలిపి 2025 మార్చి నాటికి రూ.6,77,849.80 కోట్లేనని అసెంబ్లీలో ఈనెల 23న లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆర్థి క మంత్రి పయ్యావుల కేశవ్ అంగీకరించారు. ఇందులో 2014–19 మధ్య అంటే.. నాటి చంద్రబాబు సర్కార్ చేసిన అప్పు రూ.3,06,952.26 కోట్లు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,78,897.54 కోట్లేనని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అందులో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.73 లక్షల కోట్లను నాటి సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. 2024లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 16 నెలల్లో రూ.2,09,085 కోట్లు అప్పు చేసింది. చెప్పిన విధంగా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయలేదు.. అప్పుగా తెచ్చిన రూ.2,09,085 కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయో! అంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 16 నెలల్లోనే కూటమి సర్కార్ 56 శాతం అప్పు చేయడం గమనార్హం. దీన్నిబట్టి అప్పుల సామ్రాట్ చంద్రబాబేనని స్పష్టంగా తెలుస్తోంది. ఆర్థిక మంత్రి.. అసెంబ్లీ సాక్షిగా.. అప్పులపై చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా అసెంబ్లీ సాక్షిగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ నిజాలను చెప్పాల్సి వచ్చింది. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి బడ్జెట్తోపాటు గ్యారెంటీ కలిపి మొత్తం అప్పు రూ.3,06,952.26 కోట్లుగా ఉందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,70,897 కోట్లేనని అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన ఆర్థి క మంత్రి పయ్యావుల కేశవ్.మహిళల అక్రమ రవాణా ఉత్తుత్తేదుష్టచతుష్టయం దుష్ప్రచారం.. ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో 2019 ఆగస్టు 15న నాటి సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక రీతిలో ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్మారు. 2.60 లక్షల మంది వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకు పింఛన్లు మొదలు అన్ని రకాల ప్రభుత్వ సేవలను ప్రభుత్వం అందించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో వలంటీర్ల ద్వారా 35 వేల మంది మహిళలను మాయం చేసి.. అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ ఎన్నికల ముంగిట పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు సైతం ఇదే రీతిలో వలంటీర్లపై విషం కక్కారు. బట్టబయలైన వాస్తవం: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబర్ 16న అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు 2019–24 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు కేవలం 34 నమోదు అయ్యాయని.. 46 మంది బాధితులని లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం ద్వారా కూటమి కుట్ర బట్టబయలైంది. నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేసిందంతా దుష్ప్రచారమేనని కూటమి ప్రభుత్వమే కుండబద్ధలు కొట్టింది. నాడు ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై విషం.. ఇప్పుడు భూముల రీ సర్వేపై యూటర్న్ దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. గత 40 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెబుతున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తొలిసారిగా రాష్ట్రంలో తెస్తే చంద్రబాబు దానిపై రాజకీయ కుట్రతో దుష్ప్రచారం చేశారు. ప్రజల భూములు లాక్కునేందుకే ఈ చట్టాన్ని తెచ్చారని అబద్ధాలతో ప్రజలను భయాందోళనలకు గురి చేశారు. బట్టబయలైన వాస్తవం: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వైఎస్ జగన్ భూముల రీ సర్వే చేపట్టారు. 13 వేల గ్రామాలకుగానూ 8 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి డిజిటల్ రికార్డులు అందబాటులోకి తెచ్చారు. ప్రతి రైతుకు ఒక యూనిక్ ఐడీ నంబర్ ఇవ్వడంతోపాటు భూములను జియో ట్యాగింగ్ చేసి సరిహద్దు రాళ్లు పాతారు. రీ సర్వే చేసి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే ఎవరూ ఆ భూమి తనదని కోర్టుల్లో కేసులు వేసే అవకాశం ఉండదు. అయితే చంద్రబాబు ఎన్నికల్లో దాన్ని ఒక అస్త్రంగా వాడుకుని ఎడతెగని దుష్ప్రచారంతో లబ్ధి పొందారు. తాను చెప్పిన అబద్ధాలను నిజమని చెప్పుకునేందుకు అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఈ చట్టంతో ముడిపడి ఉన్న భూముల రీ సర్వేను కూడా రద్దు చేయాలని ప్రయతి్నంచారు. కానీ అది విజయవంతమవడం, కేంద్ర ప్రభుత్వం జగన్ హయాంలో చేపట్టిన సర్వేకు ఇప్పుడు రూ.500 కోట్ల వరకు నిధులు విడుదల చేయడంతో యూటర్న్ తీసుకుని కొనసాగిస్తున్నారు.సంపద సృష్టి కాదు.. ఉన్నది ఆవిరి దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. వైఎస్ జగన్ భారీ ఎత్తున అప్పులు తెచ్చి.. పప్పులూ బెల్లాల్లా పేదలకు పంచిపెడుతున్నారని, సంపద సృష్టించకుండా రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, ఎల్లో మీడియా తీవ్ర స్థాయిలో విషప్రచారం చేసింది. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టించి.. పథకాలు అమలు చేస్తానంటూ నమ్మబలికారు. బట్టబయలైన వాస్తవం: నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు. లోక్సభ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో.. కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. 2023–24లో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 2024–25లో మరో ఐదు కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధం చేశారు. కానీ.. కూటమి సర్కార్ ఒక కాలేజీ మాత్రమే ప్రారంభించి.. 50 సీట్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. మిగతా మెడికల్ కాలేజీల పనులను ఆపేసింది. ప్రైవేటుపరం ముసుగులో సన్నిహితులు, బినామీలకు వాటిని కట్టబెట్టే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. జగన్ చేపట్టిన పోర్టులను సైతం ౖప్రైవేటుపరం చేస్తూ దోపిడీ చేస్తున్న చంద్రబాబు కూటమి సర్కారు తీరుతో ఉన్న సంపద ఆవిరవుతోంది. నాడు తప్పు పట్టారు.. నేడు పారదర్శకతకు పాతరేశారుదుష్టచతుష్టయం దుష్ప్రచారం.. ప్రజలకు సుపరిపాలన అందించడానికి 2014–19 మధ్య తాము తెచ్చిన సంస్కరణలను వైఎస్ జగన్ రద్దు చేశారంటూ 2019లో అధికారం నుంచి దిగిపోయినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం వరకూ చంద్రబాబు విషప్రచారం చేస్తూ వచ్చారు. బట్టబయలైన వాస్తవం: వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి.. 2.60 లక్షల మంది వలంటీర్లను రోడ్డున పడేసింది. ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వ్యవస్థను రద్దు చేసింది. దాంతో 9,280 మంది ఎండీయూ ఆపరేటర్లు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం చేపట్టే సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు సహా అభివృద్ధి పనుల అంచనా వ్యయం, టెండర్లను పారదర్శకంగా నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన జ్యుడిíÙయల్ ప్రివ్యూ వ్యవస్థ, రివర్స్ టెండరింగ్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 2014–19 తరహాలోనే టెండర్ల వ్యవస్థను నీరుగార్చి సన్నిహితులు, బినామీలకు పనులు అప్పగిస్తోంది. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సు ముట్టజెప్పే విధానాన్ని వైఎస్సార్సీపీ రద్దు చేస్తే, కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి మళ్లీ ఆ విధానాన్ని ప్రవేశపెట్టింది. నీకింత నాకింత అంటూ కమీషన్లు దండుకుంటోంది. నాడు సర్కారుకు ఆదాయం.. నేడు కూటమి నేతలకు ఆదాయం దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. ఇసుక నుంచి మట్టి వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సహజ వనరులను దోపిడీ చేస్తోందని విషం చిమ్మిన చంద్రబాబు, ఎల్లో మీడియా. బట్టబయలైన వాస్తవం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తక్కువ ధరలకు ఇసుకను సరఫరా చేసింది. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. 2024 అవసరాల కోసం 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ పెట్టింది. కూటమి నేతలు ఆ ఇసుక నిల్వలన్నింటినీ దోచేసి జేబులు నింపుకున్నారు. ఉచిత ఇసుక ముసుగులో నదులు, వాగులు, వంకలను చెరబట్టి చట్టాలను ఉల్లంఘించారు. లిక్కర్ నుంచి సిలికా, క్వార్ట్జ్ వరకూ వ్యవస్థీకృతమైన పచ్చ మాఫియా ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతోంది. ఊరూ పేరూ లేని ఉర్సా అనే సంస్థకు రూపాయికి ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. లులూ సంస్థకు మాల్ కట్టడానికి విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించేస్తుండటం భూ దోపిడీకి పరాకాష్ట.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నేడు పెగలని నోరుదుష్టచతుష్టయం దుష్ప్రచారం.. విశాఖ స్టీల్ పరిశ్రమను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తుంటే సీఎం వైఎస్ జగన్ నోరు మెదపడం లేదంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్, లోకేశ్ దుష్ప్రచారం చేశారు.బట్టబయలైన వాస్తవం: 2025 జనవరి 17న కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని స్పష్టం చేశారు. నాటి సీఎం వైఎస్ జగన్ వ్యతిరేకించకపోతే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఎప్పుడో పూర్తయ్యేదని కుండబద్ధలు కొట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 32 విభాగాలను ప్రైవేటుపరం చేస్తూ ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినా చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప ఖనిజ గని కేటాయించాలని కోరడానికి మనస్కరించని సీఎం చంద్రబాబు ప్రైవేటు స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప ఖనిజ గని కేటాయింపునకు పాటుపడ్డారు.నాటి సర్కారు ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్న కూటమి దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. వైఎస్సార్సీపీ సర్కారు తీరు వల్ల పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. బట్టబయలైన వాస్తవం: నెల్లూరు జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు మూత పడుతున్నా కూటమి సర్కారు మొద్దు నిద్ర నటిస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ఓ భారీ పీఎస్యూ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం ని్రష్కియాపరత్వంతో చాప చుట్టేసే పనిలో ఉంది. 2019–24 మధ్య రూ.3.02 లక్షల కోట్ల పెట్టుబడులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాస్తవ రూపంలోకి తెచ్చిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రూ.85,543 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 163 భారీ పరిశ్రమలు అప్పట్లోనే ఉత్పత్తి ప్రారంభించాయి. ఒప్పందం జరిగిన పెట్టుబడుల్లో అప్పటికే రూ.2.46 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వురు దశల్లో ఉన్నాయి. ఇప్పుడు కూటమి వాటిని తన ఘనతగా చెప్పుకుంటోంది. నాడు రూ.2.49 అధికం అన్నారు.. నేడు రూ.3.20తో కొంటున్నారు దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. సెకీతో విద్యుత్ను అత్యధిక ధరకు (యూనిట్ రూ.2.49) వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల భారం అదనంగా పడుతుందని ఎన్నికలకు ముందు చంద్రబాబుతో కూడిన దుష్టచతుష్టయం విష ప్రచారం చేసింది. బట్టబయలైన వాస్తవం: ఈ కుట్రలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పటాపంచలు చేసింది. సెకీ ఒప్పందం సక్రమమేనని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఇదే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అదే సౌర విద్యుత్ను యూనిట్కు రూ.3.20 చొప్పున చెల్లించి కొంటున్నారంటే దాని వెనుక ఎంతటి అవినీతి దాగుందో వేరేగా చెప్పనవసరం లేదు. పోలవరాన్ని బ్యారేజ్గా మార్చేశారు దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. పోలవరం ప్రాజెక్టును వైఎస్ జగన్ బ్యారేజ్గా మార్చేశారంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు విష ప్రచారం చేశారు. బట్టబయలైన వాస్తవం: కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే కట్టాల్సిన పోలవరాన్ని 2016 సెపె్టంబర్ 8న 2013–14 ధరలతో 2010–11 నాటి పరిమాణాలతో పూర్తి చేస్తానని కేంద్రంతో నాటి సీఎం చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. దీని వల్ల పోలవరానికి రూ.20,398 కోట్లకు మించి పైసా కూడా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. వాస్తవానికి అప్పటికి పోలవరం అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కేంద్రానికి వాస్తవ పరిస్థితులను వివరించి.. తాజా ధరల మేరకు నిధులు ఇస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుందని కేంద్రాన్ని ఒప్పించారు. కానీ.. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. అయినా చంద్రబాబు ఈ అంశంపై నోరు మెదపలేదు. -
న్యాయవాదులకు ఏపీ బార్ కౌన్సిల్ అండ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర బార్ కౌన్సిల్ (న్యాయవాద మండలి), తాజాగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కీలక నిర్ణయాలు ఇలా.. ⇒ మరణించిన న్యాయవాదుల నామినీలకు ప్రస్తుతం ఇస్తున్న మరణ ప్రయోజనం రూ. 3 లక్షలు పెరిగింది. దీనితో ఈ మొత్తం రూ.ఆరు లక్షల నుంచి రూ. తొమ్మిది లక్షలకు చేరింది. ⇒ అనారోగ్యంతో బాధపడే న్యాయవాదులు, వారి భార్యలకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.2.50 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.1.50 లక్షలు. ⇒ కాగా, ద్వారకనాథరెడ్డి నేతృత్వంలో జరిగిన న్యాయవాదుల క్లర్కుల సంక్షేమ నిధి కమిటీ సమావేశం మరణించిన న్యాయవాదుల క్లర్కు నామినీకి ప్రస్తుతం అందచేస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.4.50 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఈ మొత్తం రూ. 4 లక్షలు. ⇒ అనారోగ్యం బారిన పడిన క్లర్కులకు ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సాయం రూ. 80 వేల నుంచి రూ.లక్షకు పెరిగింది. సంక్షేమానికి కౌన్సిల్ పెద్దపీట న్యాయవాదుల సంక్షేమానికి కౌన్సిల్ పెద్దపీట వేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న (85 మందికి రూ.74.20 లక్షలు), వృత్తి నుంచి వైదొలగిన న్యాయవాదులకు (ముగ్గురికి రూ.9 లక్షలు) మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు (52 మందికి రూ.2.86కోట్లు) బార్ కౌన్సిల్ మొత్తంగా రూ.3.69 కోట్ల ఆర్థికసాయం చేసింది. దీనికి అదనంగా న్యాయవాదులందరి సంక్షేమం కోసం కౌన్సిల్ రూ.20.50 లక్షల మేర ఆర్థిక సాయం అందజేసింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ న్యాయవాది కుటుంబానికి రూ.5 లక్షలను న్యాయవాద మండలి నిధుల నుంచి చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్గా అందుతోంది. ఐలూ హర్షం రాష్ట్ర బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలపై ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు బార్ కౌన్సిల్కు ఐలూ రాష్ట్ర అధ్యక్షుడు కె.కుమార్, ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ మొత్తాన్నీ రూ.9 లక్షలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమం దేశంలో ఏ బార్ కౌన్సిల్ కూడా ఇంత పెద్ద మొత్తంలో న్యాయవాదులకు, వారి క్లర్కులకు ఆర్థిక సాయం అందించడం లేదు. న్యాయవాదుల సంక్షేమమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. – ఎన్.ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ -
‘గట్టు’లో గుట్టు..!
సాక్షి, అమరావతి: కృష్ణా నది కుడి గట్టుకు ప్రకాశం బ్యారేజీ దిగువన తాడేపల్లికి సమీపంలో 0.900 కి.మీ. నుంచి 2.610 కి.మీ. వరకూ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రూ.245.18 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించింది. ఇక జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ లాంటి పన్నుల రూపంలో మరో రూ.46.30 కోట్లను అదనంగా రీయింబర్స్ చేస్తామని వెల్లడించింది. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.291.48 కోట్లు. బిడ్ల దాఖలుకు తుది గడువు అక్టోబర్ 6తో ముగియనుంది. అదే రోజు సాంకేతిక బిడ్ను తెరవనున్నారు. అక్టోబర్ 10న ఆర్థిక బిడ్ తెరిచి తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్ను ఎల్–1గా తేల్చి పనులు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని ఎస్ఎల్టీసీకి కృష్ణా డెల్టా అధికారులు ప్రతిపాదన పంపనున్నారు. 1.71 కి.మీ. పొడవు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు రూ.291.48 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించడం.. కి.మీ.కు ఏకంగా రూ.170.45 కోట్లు చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించడంపై ఇంజనీరింగ్ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అస్మదీయ కాంట్రాక్టర్కు కట్టబెట్టి.. పెంచేసిన అంచనా వ్యయాన్ని కమీషన్ల రూపంలో రాబట్టుకోవాలన్న ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ ఇందులో దాగి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. శాశ్వతంగా ముప్పు తప్పించిన గత ప్రభుత్వం.. ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం 3 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తే విజయవాడలో కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్, కోటినగర్, పోలీస్ కాలనీ, గౌతమి నగర్, నెహ్రూ నగర్, చలసాని నగర్, గీతా నగర్, బాలాజీ నగర్, ద్వారకా నగర్, భూపేష్ గుప్తా నగర్, భ్రమరాంబపురం, తారకరామ నగర్ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యేవారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బంది లేకుండా విజయవాడకు శాశ్వతంగా ముంపు ముప్పును తప్పించేందుకు కృష్ణా నదికి ఎడమ గట్టున పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు మూడు దశల్లో 5.66 కి.మీ. పొడవున రూ.474.51 కోట్ల వ్యయంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మించింది. ఆ రిటైనింగ్ వాల్ ద్వారా విజయవాడకు కృష్ణా వరద ముప్పును శాశ్వతంగా తప్పించింది. అంటే.. కి.మీ. రిటైనింగ్ వాల్కు కేవలం రూ.83.83 కోట్లు మాత్రమే వ్యయం చేసినట్లు స్పష్టమవుతోంది. 2020–24 ధరలతో పోల్చితే స్టీలు, సిమెంటు, పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన ఇప్పుడు రిటైనింగ్ వాల్ నిర్మాణ వ్యయం పెరగడానికి ఆస్కారమే లేదని ఇంజనీరింగ్ నిపుణులు తేల్చి చెబుతున్నారు. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం కృష్ణా కుడి గట్టుకు 1.71 కి.మీ. పొడవున రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం కి.మీ.కి ఏకంగా రూ.170.45 కోట్లు వెచ్చిస్తుండటంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కి.మీ.కు అంచనా వ్యయాన్ని రూ.86.62 కోట్లు పెంచేయడంపై నివ్వెరపోతున్నారు. -
ఆధునిక తెలుగు కవుల్లో అగ్రగణ్యుడు జాషువా
సాక్షి,అమరావతి: కుల, మత అసమానతల్లేని సమసమాజ నిర్మాణం కోసం కలంతో పోరాటం చేసిన మహాకవి గుర్రం జాషువా అని పలువురు వైఎస్సార్సీపీ నేతలు కొనియాడారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాషువా జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఆధునిక తెలుగు కవుల్లో అగ్రగణ్యుడు గుర్రం జాషువా అని అన్నారు. జాషువా భౌతికంగా మనమధ్య లేకపోయినా తన రచనలతో సమాజాన్ని నిత్యం తట్టిలేపుతూనే ఉంటారన్నారు. స్వేచ్ఛ, సమాన త్వం ఉన్నప్పుడు సమాజం పురోభివృద్ధి సాధిస్తుందని జాషువా నమ్మారని, ఆ స్ఫూర్తిని మాజీ సీఎం వైఎస్ జగన్ మరింతగా ముందుకు తీసుకువెళ్లారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్రెడ్డి పాల్గొన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన.. షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా విద్య, వైద్య రంగా ల్లో కూటమి అనుసరిస్తోన్న విధానాలను నిరసిస్తూ ఈ నెల 30న వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలపనున్నట్లు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు మాట్లాడుతూ బలహీ న కులాలను ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. -
మెగాస్టార్కు ఇంత అవమానమా?
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శాసనసభ సాక్షిగా ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్ తమ రాజకీయ డ్రామాలో భాగంగానే ఆదివారం హైదరాబాద్లో ఇరువురూ కలుసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో దానిని కవర్ చేసుకునేందుకు, రాజీ కుదుర్చుకునేందుకే చంద్రబాబు పరామర్శ పేరుతో హైదరాబాద్లోని పవన్కళ్యాణ్ ఇంటికి వెళ్లినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు సభలోనే ఉన్న చంద్రబాబుగానీ, జనసేన ఎమ్మెల్యేలుగానీ కనీసం స్పందించలేదు. పవన్కళ్యాణ్ అయితే.. చిరంజీవికి జరిగిన తీవ్ర అవమానంపై ఇప్పటివరకూ నోరువిప్పకపోగా ఆదివారం తన ఇంటికొచ్చిన చంద్రబాబుకు పుష్పగుచ్ఛంతో ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు. ఇదంతా చూస్తుంటే చిరంజీవిని ఉద్దేశపూర్వకంగా అవమానించినట్లుగా ఉందని చిరు అభిమానులు, కాపు సంఘాల నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. నిజానికి.. ఈ ఏడాది రెండు, మూడుసార్లు పవన్ అనారోగ్యానికి గురైనప్పటికీ అప్పుడెప్పుడూ ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించని చంద్రబాబు ఈసారి హైదరాబాద్కు ప్రత్యేకంగా వెళ్లి మరీ పలకరించడాన్ని చూస్తుంటే ఇదంతా రాజకీయ డ్రామానేనని వారు ఆరోపిస్తున్నారు. పైగా.. పవన్కళ్యాణ్ గతంలో అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న సమయంలో.. చంద్రబాబు ఓ అధికారిక సమావేశంలో జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్తో పవన్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ.. తాను పలకరిద్దామని ఫోన్చేసినా ఆయన అందుబాటులోకి రాలేదని బాబు అప్పట్లో వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలను చిరు అభిమానులు, కాపు నేతలు గుర్తుచేస్తున్నారు. పవన్పై చిరు అభిమానులు, కాపు వర్గీయుల్లో అసంతృప్తి.. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ వ్యాఖ్యల ఎపిసోడ్లో పవన్కళ్యాణ్ వ్యవహారశైలిపై చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గీయుల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడల్లా పవన్కళ్యాణ్ ఆయనకు ఏదో విధంగా అండగా ఉంటున్నారన్న వ్యాఖ్యలు ఆ వర్గీయుల నుంచే వస్తున్నాయి. ఎందుకంటే.. బాలకృష్ణ కామెంట్లపై ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవి స్పందిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారుగానీ పవన్కళ్యాణ్ ఇప్పటివరకు ఈ అంశంపై కనీసం నోరువిప్పలేదని.. ఇది పరోక్షంగా బాబుకు మేలు చేయడమేనని వారు గుర్తుచేస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్నందున పవన్కళ్యాణ్ స్పందించలేదని అనుకున్నా.. డీఎస్సీ నియామకాల అంశంలో లోకేశ్ను అభినందిస్తూ పవన్ ప్రకటన జారీచేశారు. అంతేకాకుండా తమిళనాడులో విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపైనా విచారం వ్యక్తంచేశారు. కానీ చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యల అంశంలో మౌనం దాల్చడంపై ఆ వర్గీయుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఎమ్మెల్సీ కాకముందు వరకు చిరంజీవిపై ఎవరు విమర్శలు చేసినా విరుచుకుపడే నాగబాబు కూడా టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యాక ఆయన కూడా తన నోటికి తాళాలు వేసుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి. పవన్ త్వరగా కోలుకోవాలని.. ఇక పవన్ నివాసానికి చంద్రబాబు రాకపై జనసేన పార్టీ ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. పవన్కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు పరామర్శించారని పేర్కొంది. ఈ సందర్భంగా.. మెగా డీఎస్సీ నియామకాలపైనా, అక్టోబరు 16న ప్రధాని రాష్ట్ర పర్యటనపైన, 4న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయంపైనా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిపింది. టీడీపీపై కాపుల్లో వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే.. బాలకృష్ణ తాజా వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గాల్లో టీడీపీపై వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే చంద్రబాబు పవన్కళ్యాణ్ను పరామర్శించారన్న చర్చ కూడా జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్కళ్యాణ్ ఇందుకు తనవంతుగా బాబుకు తోడ్పాటు అందిస్తున్నారని చర్చించుకుంటున్నారు. అలాగే, చంద్రబాబే స్వయంగా వచ్చి తనను పరామర్శించారన్న సానుభూతి కాపు సామాజికవర్గంలో కలిగించాలన్నది వీరిరువురి వ్యూహమని వారంటున్నారు. -
‘ఈఆర్సీ’.. సీరియస్! సర్కారుకు 'షాక్'
సాక్షి, అమరావతి: ఎడాపెడా విద్యుత్తు చార్జీలతో వినియోగదారులను బాదేస్తున్న చంద్రబాబు సర్కారుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) గట్టి షాక్నిచ్చింది! విద్యుత్తు చార్జీల వాతలతో ప్రజల నుంచి ఇప్పటికే వసూలు చేసిన సొమ్ములో దాదాపు రూ.వెయ్యి కోట్లు తిరిగి వారికి వెనక్కి చెల్లించాలని ఆదేశించింది. చార్జీల మోత మోగించిన చంద్రబాబు సర్కారుకు ఏపీఈఆర్సీ ఇలా గట్టిగా మొట్టికాయలు వేస్తే అదేదో ప్రభుత్వం దయతలచి ఔదార్యంగా ఇస్తున్నట్లు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికి అంటే 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయగా అందులో రూ.923.55 కోట్లను వినియోగదారులకు వెనక్కి చెల్లించాలని ఏపీఈఆర్సీ తాజాగా ఆదేశించింది. అయితే ఇదంతా కూటమి సర్కారు గొప్పతనంగా, అసలు ట్రూ డౌన్ చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఊరట అంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారాన్ని నెత్తికెత్తుకుంది. ప్రజలపై ఇప్పటి వరకూ రూ.17,348.64 కోట్లు విద్యుత్ చార్జీల భారం వేసిన కూటమి ప్రభుత్వాన్ని భుజానకెత్తుకుని కీర్తించడంపై ఇంధన రంగ నిపుణులు, వినియోగదారులు విస్తుపోతున్నారు. తొలి ఏడాదికి అంటే 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయగా అందులో రూ.923.55 కోట్లను వినియోగదారులకు వెనక్కి చెల్లించాలని ఏపీఈఆర్సీ తాజాగా ఆదేశించింది. అయితే ఇదంతా కూటమి సర్కారు గొప్పతనంగా, అసలు ట్రూ డౌన్ చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఊరట అంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారాన్ని నెత్తికెత్తుకుంది. ప్రజలపై ఇప్పటి వరకూ రూ.17,348.64 కోట్లు విద్యుత్ చార్జీల భారం వేసిన కూటమి ప్రభుత్వాన్ని భుజానకెత్తుకుని కీర్తించడంపై ఇంధన రంగ నిపుణులు, వినియోగదారులు విస్తుపోతున్నారు.కూటమి చెంప చెళ్లుమనిపించేలా ఏపీఈఆర్సీ ఆదేశాలు..గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసిందంటూ తప్పుడు ప్రచారం చేసిన కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఏపీఈఆర్సీ అనుమతించిన దానికి మించి అధిక రేట్లకు కరెంట్ కొనుగోలు చేసింది. ఈ విషయం ఏపీఈఆర్సీ తాజా ఆదేశాల ద్వారా రుజువైంది. యూనిట్ రూ.5.27కు కొనమని ఏపీఈఆర్సీ చెబితే ఏపీఈపీడీసీఎల్లో యూనిట్ రూ.5.84 చొప్పున, ఏపీసీపీడీసీఎల్లో రూ.5.86 చొప్పున, ఏపీఎస్పీడీసీఎల్లో యూనిట్ రూ.5.89 వెచ్చించి కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసింది. అందువల్లనే 2024–25 సంవత్సరానికి రూ.2,758.76 కోట్లు ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు (ట్రూ అప్)ను డిస్కంలు ప్రతిపాదించాల్సి వచ్చింది. దీన్ని తీవ్రంగా ఆక్షేపించిన ఏపీఈఆర్సీ డిస్కంలు అడిగినదానికి ఆమోదం తెలపకుండా రూ.895.12 కోట్లను తగ్గించాల్సిందేనని తేల్చి చెప్పింది. రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతినిచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రజలను విద్యుత్ బిల్లులతో బాదుతూ ఇప్పటికే రూ.2,787.18 కోట్లను అదనంగా వసూలు చేసేసింది. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీఈఆర్సీ వినియోగదారుల నుంచి నేరుగా వసూలు చేసిన అదనపు చార్జీలను అక్టోబర్ నెల వినియోగం నుంచి అంటే నవంబర్లో ఇచ్చే బిల్లు నుంచి 12 వాయిదాల్లో వెనక్కి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఏపీఈఆర్సీ ఆదేశాలు కూటమి సర్కారు చెంప చెళ్లుమనిపించేలా ఉన్నాయని విద్యుత్ రంగ నిపుణులు, వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఏడాదికి బాబు సర్కారు వసూలు చేసిన మొత్తం రూ.2,787.18 కోట్లను తిరిగి ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవం ఇలా ఉంటే, ఇదంతా చంద్రబాబు కూటమి సర్కారు ఇచ్చిన ఊరట అంటూ టీడీపీ కరపత్రం ఈనాడు నిస్సిగ్గుగా తప్పుడు కథనాన్ని అచ్చేసింది.కూటమి ప్రభుత్వం వసూలు చేసిన రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి చెల్లించాలంటూ ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆదేశాలు బాబు బాదుడే బాదుడు..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం.. తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15,485.36 కోట్ల చార్జీల భారాన్ని వేసి బాదుడుకు శ్రీకారం చుట్టింది. అయితే అదనంగా వసూలు చేసిన రూ.2,787.18 కోట్లలో తాజాగా రూ.1,863.64 కోట్లకు మాత్రమే ఈఆర్సీ నుంచి అనుమతి లభించింది. అదే రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి చెల్లించాలని ఏపీఈఆర్సీ ఆదేశించకుంటే ప్రజలపై దాదాపు రూ.19 వేల కోట్ల భారం మోపినట్లయ్యేది! అంతేకాదు.. మరో పిడుగు కూడా సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపి వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతినివ్వాల్సిందిగా ఇటీవల కమిషన్ను కోరాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ఆ భారమంతా ప్రజలపైనే పడుతుంది.జగన్ ప్రభుత్వంలో..జనంపై భారం పడకుండాటీడీపీ కూటమి ప్రభుత్వం అదనంగా వసూలు చేసిన దానిలో కొంత మొత్తాన్ని తిరిగి ప్రజలకు ఇచ్చేయాల్సిందేనని ఏపీఈఆర్సీ ఆదేశిస్తే.. అదేదో తాము దయతలచి ఇస్తున్నట్లుగా ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు. వాస్తవానికి విద్యుత్తు రంగంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వినియోగదారులపై ఏమాత్రం భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, చౌకగా కొనుగోళ్లు, ఇంధన పొదుపు లాంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల 2019–24 మధ్య విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. దీంతో ఆ ఐదేళ్లలో మొత్తం రూ.4,434.5 కోట్లను మిగిల్చినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అధికారికంగానే వెల్లడించింది. డిస్కంలు ఖర్చులు తగ్గించుకుని మిగిల్చిన డబ్బులను ట్రూ డౌన్ చేశాయి.⇒ వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2019–20 నుంచి 2023–24 వరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) రూ.1,974.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) 2020–21 నుంచి 2023–24 వరకూ రూ.1,400 కోట్ల మేర ఖర్చులు మిగిల్చాయి. ఈ మొత్తం రూ.3,374.75 కోట్లను ట్రూ డౌన్ చేశాయి. ఈ డబ్బులను 2024–25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కంలు సర్దుబాటు చేశాయి. అంటే వాటి రెవెన్యూ గ్యాప్ భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయి. తద్వారా బకాయిలు తగ్గించుకున్నాయి. దీంతో ఆ మేరకు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం కూడా తగ్గింది.⇒ ఏపీ ట్రాన్స్కో విద్యుత్ లైన్లను వినియోగించుకోవడంలోనూ గత ప్రభుత్వంలో డిస్కంలు రూ.1,059.75 కోట్లు మిగిల్చాయి. విద్యుత్ ప్రసార వ్యవస్థ వినియోగానికి ఏపీఈఆర్సీ అనుమతించిన టారిఫ్ కంటే తక్కువగా డిస్కంలు వినియోగించాయి. ఇది ఏపీఈపీడీసీఎల్లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్లో 247.35 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్ఆర్లో సర్దుబాటు చేశారు. ఇలా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్ర ప్రజలపై రూ.4,434.51 కోట్ల మేర ట్రూ అప్ భారం తగ్గింది. -
‘ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు.. ఏపీ పోలీసుల పనితీరుకు నిదర్శనం’
తాడేపల్లి : సవీంద్ర కేసులో పోలీసుల వ్యవహార శైలిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం గొప్ప విషయమన్నారు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి. పోలీసుల వైఖరిపై హైకోర్టు సుమోటోగా స్వీకరించి సీబీఐకి అప్పగించడం అనేది మంచి పరిణామన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అయితే, పోలీసుల పని తీరుకు నిదర్శనమన్నారు. ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్ 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. వెంటనే హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం పౌరుల హక్కులను కాలరాస్తోంది. హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసుల్లో మార్పు రాలేదు. బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చామని డాక్టర్ కాకర్ల సుబ్బారావే స్వయంగా చెప్పారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. జగన్ పర్యటనలను నియంత్రిస్తున్నారు. జగన్ సభలకు వచ్చే వారిని డ్రోన్ కెమెరాలతో గుర్తించి కేసులు పెడుతున్నారు. సాక్షి విలేరకర్లు, యాజమాన్యం మీద తప్పుడు కేసులు పెట్టారు. తప్పుడు కేసుల విషయంలో డీజీపీని కోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించినా పోలీసుల్లో మార్పు రాలేదు. తప్పు చేస్తే కేసులు పెట్టాలిగానీ అరెస్టులు చేయటానికే కేసులు పెడుతున్నారు. పోసాని కృష్ణమురళి, తురకా కిషోర్ సహా అనేకమంది మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. ఆరేళ్ల క్రితం ఏదో జరిగిందని ఇప్పుడు కేసులు పెడుతున్నారు. సవీంద్ర కేసులో మఫ్టీలో వెళ్ళి అరెస్టు చేయటంపై హైకోర్టు సీరియస్ అయింది. హైకోర్టు ఉద్యోగి జడ్జీలకు ఫైళ్లను తీసుకెళ్తుంటే సీఐ శ్రీనివాస్ దాడి చేశాడు. జడ్జీల ఫైళ్లు ఉన్న వాహనాన్ని కూడా పీఎస్కి తరలించారు. ఏపీలో పోలీసుల పనితీరుకు ఇదే నిదర్శనం. టీడీపీ సోషల్ మీడియా వైఎస్సార్ సీపీ నేతల కుటుంబాలపై పెడుతున్న దారుణమైన పోస్టులు ప్రభుత్వానికి కనపడటం లేదా?, ఐ-టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలి. వ్యక్తిత్వ హననం చేస్తూ పెట్టిన పోస్టులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?, జగన్ ఫోటో వాట్సప్ డీపీ పెట్టుకుంటే కేసులు పెడుతున్నారు. బైకుల మీద జగన్ బొమ్మ కనపడితే సీజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎల్లోమీడియా పైత్యం బాగా పెరిగింది. జగన్ రాష్ట్రం కోసం అప్పులు చేస్తే సోమాలియా, శ్రీలంక అవుతోందని రాశారు. అదే చంద్రబాబు అప్పులు చేస్తే రుణ సమీకరణ అంటూ ముద్దుగా రాస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.ఇదీ చదవండి:సవీంద్ర అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగిస్తూ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు -
‘సమాధానం చెప్పకుండా ప్రభుత్వ పెద్దలు పారిపోయారు’
తాడేపల్లి : అసెంబ్లీ సమావేశాల నుండి ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. రైతులు గిట్టుబాటు ధరలు, మెడికల్ కాలేజీల గురించి అడిగితే అసలు ఆ సమస్యలే లేవని వ్యాఖ్యానించారని స్పష్టం చేశారు. ఈ రోజు(ఆదివారం, సెప్టెంబర్ 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. రైతులు యూరియా కోసం క్యూ కడుతున్న దృశ్యాలు ప్రభుత్వానికి కనపడలేదని విమర్శించారు. ‘ యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు, అచ్చెనాయుడు అంటున్నారు. యూరియా అందించలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ హయాంలో వ్యవసాయం పండుగైతే చంద్రబాబు హయాంలో దండగగా మారిపోయింది. రైతుల బాధలను కూడా అవహేళన చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేసి పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారు. ఆరువేల కోట్లు కూడా ఖర్చు చేయలేక ప్రయివేటు వ్యక్తుల చేతిలో పెడతారా?, నిధుల్లేకపోతే విడతల వారీగా నిర్మాణాలు పూర్తి చేయొచ్చుకదా?, అదేమీ లేకుండా తమ వారికి దోచి పెట్టటమే పనిగా పెట్టుకుంటారా?, చంద్రబాబు పాలన అంతా ప్రయివేటీకరణ కోసమే. విద్య, వైద్యం ప్రయివేటు వ్యక్తుల చేతిలో ఉంటే ఇక సామాన్యులు బతికేది ఎలా?, ప్రయివేటీకరణే కరక్టని రోడ్డు మీదకు వచ్చి జనం ముందు చెప్పే ధైర్యం ఉందా?, సూపర్ సిక్స్ మేనిఫెస్టోనే మారిపోయింది. ఎన్నికలకు ముందు ఉన్న మేనిఫెస్టోకి, ఇప్పటి మేనిఫెస్టోకి సంబంధం లేకుండా పోయింది. అప్పుల మీద అధికార పార్టీ నేతలు గాలి మాటలు మాట్లాడారు. బాలకృష్ణ తప్పతాగి అసెంబ్లీకి వచ్చారు. నోటికొచ్చినట్టు మాట్లాడి అసెంబ్లీ పరువు తీశారు. మండలి ఛైర్మన్కి సరైన గౌరవం కూడా ఇవ్వలేదు. దళితుడన్న కారణంతో అగౌరవంగా చూస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని దూషిస్తున్నారు. నారా లోకేష్ సకల శాఖా మంత్రిగా వ్యవహరిస్తూ మిగతా మంత్రుల నోళ్లు మూయించారు. ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే వారకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం’ హెచ్చరించారు. -
ప్రజల సొమ్ము వెనక్కి ఇచ్చేయండి.. బాబుకి ‘కరెంట్’ షాక్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) భారీ షాక్ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీల పేరిట ఈ ఏడాదిన్నర కాలంలో అడ్డగోలుగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రజలకు రూ.923.55 కోట్లు వెనక్కి ఇవ్వాలంటూ బాబు సర్కార్ను ఈఆర్సీ ఆదేశించింది. 20024-2025 కాలానికి గానూ ట్రూ అప్ ఛార్జీలను డిస్కమ్లు వసూలు చేశాయి. ఈ చార్జీలపై ఈఆర్సీ విచారణ జరిపింది. అయితే డిస్కమ్ల లెక్కలు, విద్యుత్ కొనుగోలు వ్యయంలో తేడాలు గుర్తించింది. 2024-25 సంవత్సరానికి ట్రూ అప్ చార్జీలుగా డిస్కంలు ప్రతిపాదించిన రూ.2,758.76 కోట్లలో.. రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అదనంగా వసూలు చేసిన రూ.923.55 కోట్లను విద్యుత్ వినియోగదారులకు వెనక్కి ఇవ్వాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. APERC స్థాపన (1999) తర్వాత వినియోగదారులకు రిఫండ్ ఆదేశించిన ఘటన ఇదే తొలిసారి. ఈఆర్సీ మొట్టికాయలతో ప్రజల సొమ్మును ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు.. ‘‘ప్రభుత్వం ప్రజల సొమ్ము గుంజింది.. అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేసింది’’ అనే రాజకీయ ఆరోపణలను ఈఆర్సీ నిర్ణయం వాస్తవమని తేల్చింది. -
‘అన్న క్యాంటీన్’ సీఈఓకు నెలకు రూ.4 లక్షల వేతనం
సాక్షి, అమరావతి: అన్న క్యాంటీన్ ఛారిటబుల్ ట్రస్టు సీఈఓగా పోతుల వంశీధర్ను ప్రభుత్వం నియమించింది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నెలకు రూ.4 లక్షల వేతనం (జీతం రూ.3 లక్షలు, కారు అలవెన్సు రూ.60 వేలు, ఇతర అలవెన్సులు రూ.40 వేలు) ఇవ్వాలని నిర్ణయించింది. దాతల నుంచి సేకరించే విరాళాలతో ఆయనకు ఈ వేతనాన్ని చెల్లంచాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో ఉన్న అన్న క్యాంటీన్లను ప్రారంభించిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇందుకోసం ఓ ఛారిటబుల్ను ట్రస్టును ఏర్పాటుచేసి.. విరాళాలు సేకరిస్తోంది. వాటితో అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు రూ.5కే టిఫిన్, రూ.5కే భోజనం అందిస్తున్నట్లు చెబుతోంది. కానీ, వీటి నిర్వహణకు నియమించే సీఈఓకు మాత్రం నెలకు రూ.4 లక్షలను వేతనంగా చెల్లించాలని నిర్ణయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇది అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్లుగా ఉందని రాజకీయ వర్గాల్లో సెటైర్లు పేలుతున్నాయి. -
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో.. విద్యార్థుల మరణాలు దారుణం
సాక్షి, అమరావతి: ‘గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై చనిపోతున్నారు. కొంతమంది ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఇది చాలా దారుణం. ఈ ఘటనలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలియజేయాలి. అంతేకాదు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలి’.. అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావన కింద సభ్యుడు అనంత ఉదయభాస్కర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన హాస్టళ్లలో గడిచిన ఏడు నెలల్లో నలుగురు విద్యార్థులు మృతిచెందారని సభ దృష్టికి తీసుకొచ్చారు.ఈ దుర్ఘటనలపై రంపచోడవరం ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, బాధ్యులైన వారిని సస్పెండ్చేసి సమగ్ర విచారణ చేపడతామని చెప్పారన్నారు. విచారణ చేపట్టారో లేదో.. బాధ్యులపై చర్యలు తీసుకున్నారో లేదో కూడా చెప్పడంలేదని అన్నారు. ఈ మరణాలకు కారణాలేమిటో తెలియజేయడంతో పాటు విచారణ జరిపితే ఆ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందిస్తూ.. తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్రస్తావన కింద ‘మండలి’లో చివరి రోజైన శనివారం ఇతర సభ్యులు ప్రస్తావించిన అంశాలు..‘నవయుగ’కు గిరిజన భూములెలా ఇస్తారు? గిరిజనుల హక్కులను కాలరాస్తూ వారి భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కేటాయిస్తారు? అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం టోకూరు, పెదవడ్డ, బూర్జా ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులను నవయుగ అనే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఇందుకోసం జీఓ–51ను జారీచేసింది. ఇది ముమ్మాటికి 1/70 చట్టాన్ని ఉల్లంఘించడమే. తక్షణమే ఆ జీఓ–51ను రద్దుచేయాలి. – కుంభా రవిబాబు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీతక్షణమే జీఓ–5ను రద్దుచేయాలి.. దొమ్మరి కులం పేరును దొమ్మిరి గిరిబలిజగా మారుస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జారీచేసిన జీఓ–5ను తక్షణమే రద్దుచేయాలి. దొమ్మరి కుల ప్రస్తావనతో తాము తీవ్ర వివక్షకు గురవుతున్నందున ఆ పేరు పూర్తిగా మాసిపోయేలా తమ సామాజికవర్గానికి కొత్తపేరు పెట్టాలని వారు కోరారు. కానీ, తిరిగి అదే పేరును కొనసాగిస్తూ బ్రాకెట్లో గిరిబలిజగా పేర్కొనడం సరికాదు. తక్షణమే ఈ జీఓను రద్దుచేయాలి. – వంకా రవీంద్రనాథ్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలక్ష మంది రోడ్డెక్కితే పట్టించుకోరా? రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్ష మందికి పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వలంటీర్ల వ్యవస్థను రద్దుచేసి ఆ పనిభారాన్ని వారిపై మోపారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు నిరసనలు, ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. తక్షణమే సచివాలయ ఉద్యోగులతో చర్చలు జరిపి, ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలి. – పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీపోలీసులకు పదోన్నతులు కలి్పంచాలి.. పోలీసు శాఖలో కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఏళ్ల తరబడి పదోన్నతులు లేకుండా ఇబ్బందిపడుతున్నారు. చాలామంది ఇన్స్పెక్టర్లు ఒక్క ప్రమోషన్ మాత్రమే తీసుకుని రిటైర్ అవుతున్నారు. తక్షణమే వారికి పదోన్నతులు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థల రక్షణకు ఏర్పాటుచేసే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నియామకాలు ఏపీలోనే చేపడితే కొత్త పోస్టులు, ప్రమోషన్ ఛానల్స్ పెరుగుతాయి. – ఏసురత్నం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీఎంపీటీసీలు, జెడ్పీటీసీల బకాయిలు చెల్లించాలి.. రాష్ట్రంలో 13 వేల మంది ఎంపీటీసీలకు రూ.100.30 కోట్లు, 660 జెడ్పీటీసీలకు రూ.9.50 కోట్ల మేర గౌరవ వేతన బకాయిలున్నాయి. వాటిని వెంటనే చెల్లించాలి. – బొమ్మి ఇజ్రాయెల్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ విశాఖలో వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలి.. విశాఖపట్నంలో మూడువేలకు పైగా వీధి వ్యాపారుల షాపులను జీవీఎంసీ అధికారులు తొలగించారు. వీరితోపాటు వారి వద్ద పనిచేసే వేలాది మంది రోడ్డునపడ్డారు. సుందరీకరణ, ట్రాఫిక్ పేరిట తొలగించడం సరికాదు. వారికి ప్రత్యామ్నాయం చూపాలి. – సూర్యనారాయణరాజు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ‘హైస్కూల్ ప్లస్’లలో ఖాళీలను భర్తీచేయాలి.. హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో 1,572 పీజీటీ శాంక్షన్ పోస్టులుండగా, 800 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 772 పోస్టులు కాంట్రాక్టు లెక్చరర్లతో కాకుండా స్కూల్ అసిస్టెంట్లతో భర్తీచేయాలి. – కల్పలతారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ‘ఒంటిమిట్ట’ పర్యాటక ప్రాజెక్టును పట్టాలెక్కించాలి.. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో కోదండ రామాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా పడలేదు. తక్షణమే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలి. – రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ -
అడ్డగోలు అబద్ధాలు.. డైవర్షన్ రాజకీయాలు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలకు తూట్లు పొడిచి సూపర్గా అమలు చేసేసినట్లు అబద్ధాలు ఆడారు.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం స్కీంలు ఇవ్వకుండానే ఇచ్చేశామని ప్రకటించుకున్నారు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డగోలుగా సమరి్థంచుకున్నారు.. రైతులకు యూరియా, ఇతర ఎరువుల సరఫరాలో చేతులెత్తేసి డ్రామాలాడారు.. ఏ పంటకు మద్దతు ధర లేక పోయినా రైతోద్ధారకుల్లా పోజులు కొట్టారు.. మొత్తంగా ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా డైవర్షన్ పాలిటిక్స్కు పెద్ద పీట వేయడం స్పష్టంగా కనిపించింది. తద్వారా చంద్రబాబు తాను చెప్పే అబద్ధాలకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. మొత్తంగా చూస్తే ఎనిమిది రోజుల శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాల తీరు ఆత్మస్తుతి... పరనింద.. తీరున సాగాయి. పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుతూ, ప్రభుత్వం కొలువుదీరిన 15 నెలల తర్వాత కూడా సీఎం చంద్రబాబు సహా కూటమి ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ జపం చేశారు. ప్రజలకు చేసిందేమీ లేకపోవడంతో ప్రతిపక్ష నేతపై లేనిపోని ఆరోపణలతో, నిందలు వేస్తూ అసెంబ్లీ వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నానాతిప్పలు పడ్డారు.కాగా, అసెంబ్లీలో కూటమి వక్రీకరణలు, అసత్యాలు మండలిలో చర్చకు వచ్చినప్పుడు వైఎస్సార్సీపీ దీటుగా నిలిచింది. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని ఎమ్మెల్సీలు తిప్పికొట్టారు. దీంతో సర్కారు వక్రీకరణ మార్గం ఎంచుకుంది. అబద్ధాల ప్రచారాన్ని రక్తి కట్టించేందుకు కూటమి నేతలు శతవిధాల ప్రయత్నించినా వారి ఆటలు సాగలేదు. మోదీని కీర్తించేందుకు ఆరాటం ప్రధాని మోదీని మరింత ప్రసన్నం చేసుకునేందుకు ఆయనను ఆకాశానికి ఎత్తేలా పొగడడానికి చంద్రబాబు అసెంబ్లీని ఉపయోగించుకున్నారు. సమావేశాల తొలి రోజే సూపర్ జీఎస్టీ అంటూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను అభినందిస్తూ తీర్మానం చేశారు. మోదీ ఈ దేశానికే సంపద అని కీర్తించారు. సంస్కరణల అమలుకు తానే కారణమంటూ సొంత పార్టీ నేతలతో అభినందన తీర్మానం పెట్టించుకుని తన ఘనతేనని ప్రచారం చేసుకున్నారు. జీఎస్టీ సంస్కరణలపై ఒకసారి తీర్మానం చేసినా మళ్లీ ఈ నెల 22న సూపర్ జీఎస్టీ, సూపర్ సిక్స్ అంటూ ప్రకటన చేసి మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. అప్పులపై నిస్సిగ్గుగా అబద్ధాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు.. కాదుకాదు రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపిస్తూ వస్తున్నదంతా అవాస్తవమని అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అంగీకరించారు. వైఎస్సార్సీపీ పాలనలో బడ్జెట్ లోపల, గ్యారెంటీల ద్వారా చేసిన అప్పు రూ.3.70 లక్షల కోట్లేనని స్వయంగా లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. » జల వనరులు, వ్యవసాయం, శాంతిభద్రతలు, లాజిస్టిక్స్, సూపర్ సిక్స్ పథకాల అమలుపై లఘు చర్చలో అవాస్తవాలు, అభూత కల్పనలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. ూ రెడ్బుక్ రాజ్యాంగంతో పోలీసు శాఖను ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల వేధింపులకే పరిమితం చేసి, శాంతిభద్రతలే లేకుండా పోయినా భేషుగ్గా ఉన్నాయంటూ తప్పుడు గణాంకాలను సభ ముందు ఉంచారు. » 20 లక్షల ఉద్యోగాలిస్తామంటూ యువతను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకోకుండా 4.71 లక్షల ఉద్యోగాలిచ్చామని ప్రకటించడం ఈ సమావేశాల్లోనే అతి పెద్ద అబద్ధంగా నిలిచింది. వైద్య కళాశాలలపై కట్టుకథలు తన పాలనలో ఒక్క వైద్య కళాశాల కట్టలేని చేతగానితనాన్ని చంద్రబాబు పరోక్షంగా అంగీకరిస్తూనే వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలపై కట్టుకథలు చెప్పారు. వాటిని ప్రైవేటుకు కట్టబెట్టడాన్ని రాష్ట్రమంతా ముక్తంకంఠంతో ఖండిస్తున్నా దాన్నో ఘనకార్యంగా ప్రకటించారు. వైద్య రంగంలో వైఎస్సార్సీపీ సర్కారు ప్రవేశపెట్టిన కేన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను ఏమాత్రం జంకు లేకుండా తానే తీసుకొచ్చినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పవన్ గాలి తీసేసిన టీడీపీ బొండా ఉమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చైర్మన్ కృష్ణయ్య స్వయంగా చెబుతున్నారని, అసలు రాష్ట్రంలో పీసీబీ ఉందా? అని విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ప్రశ్నించడం కూటమి రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో పవన్ అసహనంతో బొండాపై ఎదురుదాడి చేశారు.ఇది టీడీపీ, జనసేన మధ్య సోషల్ మీడియాలో చిచ్చు రాజేసింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. పీసీబీ పని చేయడంలేదని, పవన్ తీరు అధ్వానంగా ఉన్నట్లు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. బాలకృష్ణ బజారు భాష.. బజారునపడ్డ కూటమి సీఎం బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన బజారు భాష, హావభావాలతో వైఎస్ జగన్ను, సినీ హీరో చిరంజీవిని అవమానించేలా మాట్లాడి తీవ్ర విమర్శలకు గురయ్యారు. వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు నమ్మిన బంటుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ మండిపడడం, అది పెను వివాదంగా మారడంతో కూటమి ప్రభుత్వం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. » అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూటమి ప్రభుత్వ కక్షపూరిత ధోరణి బయటపడింది. లెజిస్లేచర్ అదనపు భవనం ప్రారంభానికి దళిత వర్గానికి చెందిన కౌన్సిల్ చైర్మన్ను పిలవకపోవడం, శిలాఫలకంపై ఆయన పేరు కూడా వేయకపోవడం ద్వారా చంద్రబాబు చెప్పే నీతులన్నీ కల్ల»ొల్లి మాటలని తేలిపోయింది. ఇవిగో వైఫల్యాలు.. బయటపెట్టిన కూటమి ఎమ్మెల్యేలు» రాష్ట్రంలో అసలు యూరియా కొరతే లేదని సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ఖండించగా... యూరియా దొరకడమే లేదంటూ ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఏకరువు పెట్టారు. తమది సుపరిపాలన అని చంద్రబాబు ప్రకటించుకోగా... వరికి మద్దతు ధర లేదని, ధాన్యాన్ని కొనడం లేదని, పెసర రైతులు అల్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి, కావ్యకృష్ణారెడ్డి, తంగిరాల సౌమ్య వాపోయారు. ఉల్లి, టమాట రైతులు ఆగమైతున్నారని మరికొందరు ఎమ్మెల్యేలు లేవనెత్తారు. » శాసనసభ సాక్షిగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను పదేపదే బయటపెట్టారు. విజనరీ అని పొగుడుతూనే.. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని చెప్పారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్లో మెజారిటీ ఎమ్మెల్యేలు దారుణ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించారు. » యూరియా అందక, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక, బీమా వర్తించక వ్యవసాయం అధోగతి పాలైనా... గత 15 నెలల్లో సాగును ప్రగతి పథంలోకి తెచ్చినట్లు చంద్రబాబు అబద్ధాలు వల్లె వేశారు. బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిలుచుంటున్నా కొరతే లేదని ప్రకటించుకున్నారు. రైతులను అవమానించేలా.. వారి ధాన్యం ఆల్కహాల్ తయారీకే పనికొస్తుందంటూ చంద్రబాబు ఎగతాళి చేశారు. » సాధారణ బియ్యంలో కలిపే పోర్టిఫైడ్ రైస్ కాంట్రాక్టులను స్థానిక ఎంఎస్ఎంఈలకు ఎందుకివ్వడం లేదని, ఇతర రాష్ట్రాల్లోని పెద్ద కంపెనీలకు ఇవ్వడంలో మర్మం ఏమిటని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్యచౌదరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను నిలదీయడం గమనార్హం. » అంతర్జాతీయ రాజధాని సంగతి ఏమోగానీ అమరావతి రైతుల ఆర్తనాదాలు చేస్తున్నారని, అష్టకష్టాలు పడుతున్నారని ఆ ప్రాంత ఎమ్మెల్యేతో పాటు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనాచౌదరి చెప్పారు. -
పీహెచ్సీ వైద్యుల సమ్మెబాట
సాక్షి, అమరావతి: మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రభుత్వ వైద్యులకు ఇన్సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ, వివిధ సమస్యల పరిష్కరించాలనే డిమాండ్తో పీహెచ్సీ వైద్యులు సమ్మెబాట పట్టారు. సోమవారం నుంచి విధులు బహిష్కరించి సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి పీహెచ్సీ వైద్యుల సంఘం అల్టిమేటం ఇచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం ఆన్లైన్ రిపోరి్టంగ్, అధికారిక కార్యక్రమాలను బహిష్కరించారు. శనివారం ఫ్యామిలీ డాక్టర్, స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ మెడికల్ క్యాంప్లకు హాజరుకాకుండా కేవలం పీహెచ్సీల్లో సేవలకు పరిమితం కావడం ద్వారా తమ నిరసన తెలిపారు. ఆదివారం అన్ని అధికారిక వాట్సాప్ గ్రూప్ల నుంచి వైదొలగనున్నారు. ఉద్యోగంలో చేరే సమయంలో ఉన్నత విద్య అభ్యసించడానికి తగినంత కోటా ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు అవకాశానికి గండికొట్టి అన్యాయం చేస్తున్నారని వైద్యుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సీహెచ్సీల్లో పనిచేసే వైద్యులకు మూడేళ్లకే పదోన్నతి ఇచ్చిన ప్రభుత్వం, 20 ఏళ్లుగా సేవలందిస్తున్న పీహెచ్సీ వైద్యులకు మాత్రం పదోన్నతి కల్పించడం లేదన్నారు. పదోన్నతుల విషయంలోనూ తమకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరాలు, పట్టణాలకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో క్లిష్టపరిస్థితుల్లో సేవలందిస్తున్న తమకు అలవెన్స్లు తగినంతగా ఇవ్వడం లేదన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్పై మొండిచేయి చూపించారని వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళుతున్న తమకు రూ.5 వేల ట్రావెల్ అలవెన్స్ ఇవ్వడం లేదన్నారు. ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే సోమవారం ఓపీ విధులను బహిష్కరించి, కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందిస్తామన్నారు. మంగళవారం జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అక్టోబర్ 1న జిల్లాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. 2న చలో విజయవాడకు పిలునిచ్చారు. 3వ తేదీ నుంచి విజయవాడలో ఆమరణ దీక్షకు దిగుతామని ప్రకటించారు. -
మౌనం వీడలేదు.. నోరు పెగల్లేదు సైలెన్స్.. గంభీరా!
సాక్షి, అమరావతి: చిరంజీవిని ‘ఎవడు’ అంటూ పూచికపుల్లలా తీసివేస్తూ అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అధికారంలో ఉండి కూడా డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందించకపోవడంపై మెగాస్టార్ అభిమానులు, కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. ఓ వైపు బాలకృష్ణపై మండిపడుతూనే.. పవన్కళ్యాణ్ సైతం తన సొంత సోదరుడిని దారుణంగా అవమానించి 48 గంటలు గడిచిపోయినా నోరు విప్పకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవే స్వయంగా స్పందించి బాలయ్య వ్యాఖ్యలను ఖండించినా పవన్ మాత్రం కిమ్మనకపోవడం ఏమిటని తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ జ్వరంతో బాధపడుతూ కూడా గురువారం నిర్వహించిన డీఎస్సీ సభకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ను అభినందిస్తూ ప్రకటన జారీ చేసిన పవన్కళ్యాణ్... బాలయ్య వ్యాఖ్యలపై పూర్తి మౌనం పాటించడాన్ని తప్పుబడుతున్నాయి. ఆ విష ప్రచారాన్ని ఖండించిన ‘చిరు’.. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు గత ప్రభుత్వ హయాంలో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు అప్పటి సీఎం వైఎస్ జగన్ను కలిసినప్పుడు సాదరంగా ఆహ్వానించి గౌరవిస్తే.. ఎన్నికల ముందు కూటమి నేతలు పవన్తో జతకట్టి దు్రష్పచారం చేయటాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. ఈ విష ప్రచారాన్ని తాజాగా స్వయంగా చిరంజీవే ఖండించటాన్ని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి విదేశాల్లో ఉండి కూడా తీవ్రంగా తప్పుబడుతూ ప్రకటన చేశారని పేర్కొంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు తనను సాదరంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారని, అనంతరం కొద్దిరోజులకు సినీ ప్రముఖులతో కలిసి మరోసారి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి తామంతా చర్చించామని చిరంజీవి అందులో స్పష్టం చేశారు. ఆ సమావేశం కారణంగానే నాడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టిక్కెట్ రేట్లు పెరిగాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టారే స్వయంగా విడుదల చేసిన ప్రకటన ద్వారా ఎన్నికల ముందు పవన్కళ్యాణ్, చంద్రబాబు, టీడీపీ నేతలు వైస్ జగన్పై చేసిన దుష్ప్రచారంలో నిజం లేదని తేటతెల్లమైందని చిరంజీవి అభిమానులు చర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాడు చంద్రబాబు అంత దు్రష్పచారం చేయగా.. ఇప్పుడు బాలకృష్ణ నేరుగానే చిరంజీవిని కించపరిచినా పవన్కళ్యాణ్ కనీసం ఖండించకపోవడాన్ని చిరంజీవి అభిమాన సంఘాలు, కాపు సామాజిక సంఘాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.రాజకీయాల కోసం కుటుంబ గౌరవం తాకట్టా?గతంలో తన తల్లిని అవమానించేలా నారా లోకేశ్ పోస్టులు పెట్టించారని స్వయంగా విమర్శలు చేసిన పవన్కళ్యాణ్.. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ‘ఎవడు’ అంటూ తన సోదరుడు చిరంజీవిపై బాలకృష్ణ అంత తీవ్ర వ్యాఖ్యలు చేసినా స్పందించడం లేదంటే చంద్రబాబు అంటే భయమా లేక నెల నెలా అందే ప్యాకేజీయే కారణమా.. అని సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ బాబు కుటుంబానికి దాసోహమవడం కారణంగా మెగాస్టార్ కుటుంబం ఇలాంటి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని చిరంజీవి అభిమానులు, కాపు సంఘాల నేతలు చర్చించుకుంటున్నారు. పవన్కళ్యాణ్ తీరు చూస్తుంటే కుటుంబం, జనసేన ప్రయోజనాల కన్నా చంద్రబాబు, లోకేశ్ రాజకీయ లబ్ధి కోసం ఆరాట పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ ఆ వ్యాఖ్యలు చేసే సమయంలో సభలో జనసేన ఎమ్మెల్యేలు ఉండి కూడా అభ్యంతరం చెప్పకపోవడాన్ని చిరంజీవి అభిమానులు, కాపు సంఘం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో చిరంజీవినుద్దేశించి బాలకృష్ణ ‘మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు’ అని వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించిన నాగబాబు.. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాక తాజాగా చిరంజీవినుద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఎమ్మెల్సీ పొందినంత మాత్రన ప్రస్తుతం నాగబాబు ఇంతలా దిగజారాలా అనే వ్యాఖ్యలు చిరంజీవి అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. చిరంజీవి ఏంది..? మా బ్లడ్ వేరు..! బాలకృష్ట గతంలోనూ పలు సందర్భాల్లో చిరంజీవిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిపై పలు పోస్టులు పెడుతున్నారు. గతంలో చిరంజీవి రాజకీయాల్లోకి రావడంపై బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘రాజకీయాల్లో విజయం సాధించడం ఒక్క రామారావు వల్లే అయింది. చిరంజీవి ఏంది...? మేం వేరు... మా బ్లడ్ వేరు... మా బ్రీడ్ వేరు... సస్టెయిన్బులిటీ ఉంది మాకు..!’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరో సందర్భంలో ‘సంకరజాతి..’ ‘అలగా జనం..’ అంటూ బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా చర్చ జరుగుతోంది. ఇవన్నీ చిరంజీవి కుటుంబాన్ని ఉద్దేశించినవేనని బాలకృష్ణపై మండిపడుతున్నారు. -
విద్యుత్ చార్జీలపై బాబు సర్కారుకు మొట్టికాయలు
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) మొట్టికాయలు వేసింది. అదనంగా వసూలు చేసిన చార్జీలను విద్యుత్ వినియోగదారులకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకోసం విద్యుత్ చార్జీలను ట్రూ డౌన్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తంలో రూ.923.55 కోట్లను ప్రజలకు వెనక్కి ఇవ్వాలని డిస్కంలను ఆదేశించింది. 2024–25 సంవత్సరానికి రూ.2,758.76 కోట్లు ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు (ట్రూ అప్) చార్జీలను డిస్కంలు ఈ ఏడాది జూలైలో ప్రతిపాదించాయి.ఇందుకు ఏపీఈఆర్సీ నుంచి అనుమతి కోరాయి. వీటిపై విచారణ జరిపిన ఏపీ ఈఆర్సీ డిస్కంలు చెప్పిన లెక్కలు, విద్యుత్ కొనుగోలు వ్యయంలో భారీ వ్యత్యాసాన్ని గుర్తించింది. డిస్కంలు అడిగిన దానికి యథాతథంగా ఆమోదం తెలపకుండా రూ.895.12 కోట్లు తగ్గించి.. రూ.1,863.64 కోట్లకు అనుమతినిచ్చింది. అలాగే గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో విద్యుత్ను అధిక ధరలకు కొనుగోలు చేసిందంటూ తప్పుడు ప్రచారం చేసిన కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఏపీ ఈఆర్సీ అనుమతించిన దానికి మించిన ధరకు విద్యుత్ కొనుగోలు చేసింది.ఏపీ ఈఆర్సీ యూనిట్కు రూ.5.27కు కొనమని చెబితే.. ఈపీడీసీఎల్ యూనిట్ రూ.5.84 చొప్పున, సీపీడీసీఎల్ రూ.5.86 చొప్పున, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.5.89 వెచ్చించి విద్యుత్ కొన్నట్టు ప్రతిపాదనలో తెలిపాయి. కాగా.. ఏపీ ఈఆర్సీ యూనిట్కు రూ.0.8 పైసల నుంచి రూ.0.15 పైసలు వరకూ తగ్గించి అనుమతించింది. విద్యుత్ కొనుగోలు ఖర్చు కూడా రూ.34,517 కోట్లకు అనుమతి ఉంటే.. రూ.45,476 కోట్లు వెచ్చించామని డిస్కంలు చెప్పాయి. ఇందులో రూ.44,624 కోట్లకు ఏపీ ఈఆర్సీ ఆమోదం తెలిపింది. కాగా.. ప్రసార, పంపిణీ (ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్) నష్టాలు 10.17 శాతమని డిస్కంలు ప్రతిపాదిస్తే ఈఆర్సీ మాత్రం 9.87 శాతానికే అంగీకరించింది.ఇప్పటికే వసూలు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతి నెలా యూనిట్కు రూ.0.40 పైసలు చొప్పున అదనంగా డిస్కంలు వసూలు చేశాయి. ఎస్పీడీసీఎల్ రూ.1,106.56 కోట్లు, సీపీడీసీఎల్ రూ.614.86 కోట్లు, ఈపీడీసీఎల్ రూ.1,065.76 కోట్ల చొప్పున ఇప్పటికే రూ.2,787.18 కోట్లు వసూలు చేసేశాయి. ఈ మొత్తం నుంచి అనుమతించిన రూ.1,863.64 కోట్లు పోగా.. మిగిలిన రూ.923.55 కోట్లను ఈ ఏడాది నవంబర్ నెల బిల్లు నుంచి ట్రూ డౌన్ చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. అంటే ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేయాల్సిన దానికంటే అదనంగా వసూలు చేశారని, దానిని 12 సమాన వాయిదాల్లో ప్రతి నెలా విద్యుత్ బిల్లుల్లో యూనిట్కు రూ.0.13 పైసల చొప్పున సర్దుబాటు చేయాలని అదేశించింది. ఈఆర్సీ నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారడంతో పాటు వినియోగదారులకు కాస్త ఊరట కలిగించనుంది.రాగానే బాదుడు మొదలు‘మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం.. తగ్గిస్తాం’ అని ఎన్నికల ముందు ప్రతి ప్రచార సభలోనూ చంద్రబాబు అండ్ కో చెప్పింది. అధికారంలోకి రాగానే ఆ హామీని గాలికొదిలేశారు. చార్జీలు పెంచం అని నేనెప్పుడు చెప్పానంటూ నిస్సిగ్గుగా మాట మార్చేశారు. ఓ వైపు ‘సూపర్సిక్స్’ అంటూ హామీలిచ్చి వాటిలో ఒక్కటీ అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు ఇలా విద్యుత్ చార్జీల పేరుతో వారిని దోచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ చార్జీల రూపంలో రూ.15,485 కోట్ల భారాన్ని మోపింది.2024 నవంబర్ బిల్లు నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా.. ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో యూనిట్కు రూ.0.40 చొప్పున అదనంగా వసూలు చేయడం ఏడాది ప్రారంభంలోనే మొదలు పెట్టారు. అలా ఈ ఏడాది మార్చి వరకూ జనం డబ్బును అదనపు చార్జీల పేరుతో దోచేశారు. అందులో రూ.1,863.64 కోట్ల విద్యుత్ చార్జీలకు ఆమోదం తెలపడంతో కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ వినియోగదారులపై వేసిన మొత్తం విద్యుత్ చార్జీల బాదుడు రూ.17,348.64 కోట్లకు చేరింది. -
జిల్లా జడ్జీల సీనియారిటీలో పారదర్శకతకు మార్గం
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో జిల్లా జడ్జీల అంతర్గత సీనియారిటీ విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2015 సంవత్సరానికిగాను 2022 జనవరి 5న జారీ చేసిన సీనియారిటీ జాబితాను రద్దు చేసింది. 10 శాతం బదిలీ ద్వారా వేగవంతమైన నియామక కోటా (యాక్సిలిరేటెడ్ రిక్రూట్మెంట్ కోటా) కింద నియమితులైన పిటిషనర్లు, 65 శాతం పదోన్నతి కోటా కింద నియమితులైన ఇతర న్యాయాధికారుల విషయంలో తాజాగా సీనియారిటీ జాబితాను తయారు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఇందుకు నాలుగు నెలల సమయమిచ్చింది. అప్పటి వరకు 2022 జనవరి 5 నాటి సీనియారిటీ జాబితా ఆధారంగా ఎలాంటి పదోన్నతులు ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సవరించిన సీనియారిటీ జాబితా ప్రచురితమైన తరువాత పదోన్నతులను చట్ట ప్రకారం చేపట్టాలంది. తాజా సీనియారిటీ జాబితాను తయారు చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్ 2007లోని రూల్ 13(ఏ)లోని రోస్టర్ పాయింట్లను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. 2017 ఫిబ్రవరి 4న ఉమ్మడి హైకోర్టు తయారు చేసిన సీనియారిటీ జాబితాను దృష్టిలో పెట్టుకుని తాజా సీనియారిటీ జాబితాను సిద్ధం చేయాలని తేల్చి చెపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. కొన్ని ముఖ్యాంశాలు..» 2015 సంవత్సరానికి జిల్లా జడ్జీల సీనియారిటీ జాబితా 2022 జనవరి 5న జారీ అయింది. ఈ జాబితాలో రెండు వేర్వేరు కోటాల ద్వారా నియమితులు ఉన్నారు. 10 శాతం కోటా వేగవంతమైన నియామకం (డైరెక్ట్ రిక్రూట్)కాగా, 65 శాతం పదోన్నతి కోటా (సబ్ ఆర్డినేట్ జడ్జీల నుండి) కింద నియమితులైనవారు. » రెండు కోటాల నియామక ఉత్తర్వులు వేర్వేరు తేదీలలో (65 శాతం కోటా 20–1–2016, 10 శాతం కోటా 8–2–2016) జారీ అయ్యాయి. » ఈ ఆలస్యం కారణంగా 10 శాతం కోటా ద్వారా నియమితులను 65 శాతం కోటా నియమితుల కంటే జూనియర్స్గా పరిగణించడం జరుగుతుంది. రోస్టర్ పాయింట్ల ద్వారా సీనియారిటీ నిర్ణయం చేపట్టాలని సూచిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్, 2007లోని రూల్ 13(ఏ)ను ‘రద్దయిన జాబితా’ ఉల్లంఘిస్తోందని, నిజమైన సీనియారిటీ క్రమానికి ఇది విరుద్ధమని పేర్కొంటూ న్యాయాధికారులు గుండూరి రజని, జి.అన్వర్ బాషా, పి.భాస్కర్ రావు తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలను విన్న హైకోర్టు తాజాగా సీనియారిటీ జాబితా సవరణకు ఆదేశాలు ఇచ్చింది. -
పోలీసుల దర్యాప్తు ఇంత దారుణమా..?
సాక్షి, అమరావతి: ఓ దళిత విద్యార్థిని మృతి ఘటనపై దర్యాప్తులో పోలీసుల అలక్ష్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించడం సముచితమని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసే ముందు, ఈ కేసులో దర్యాప్తు పురోగతిని తెలియజేస్తూ ఒక నివేదికను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం గుంటూరు జిల్లా బుడంపాడులోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజీలో అమృతలూరు మండలం, గోపాయపాలేనికి చెందిన గర్నెపూడి శ్రావణ సంధ్య పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతూ 2017 ఫిబ్రవరి 28న అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తన కుమార్తెది హత్య అని, దీనికి కాలేజీ యాజమాన్యంతోపాటు రూంమేట్స్ కారణమంటూ మృతురాలి తల్లి గర్నెపూడి జయలక్ష్మి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య అనే అనుమానంతో జయలక్ష్మి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత అసలు ఈ కేసును దర్యాప్తు చేయకుండా పక్కన పడేశారు. దీంతో చేసేదేమీ లేక జయలక్ష్మి 2017 జూలై 6వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె మృతిపై సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తాజా విచారణ సందర్భంగా శుక్రవారం నల్లపాడు పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది కొన్ని వివరాలను లిఖితపూర్వకంగా హైకోర్టు ముందుంచారు. వాటిని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, శ్రావణ సంధ్య 4వ ఫ్లోర్ నుంచి కింద పడే సమయంలో అక్కడ ఎవరూ లేరని పోలీసులు పేర్కొన్నారు. ఇదే పోలీసులు మృతురాలి హాస్టల్లో ఉంటున్న సహచరులను విచారించగా, వారు శ్రావణ సంధ్య 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి మరణించినట్లు పేర్కొన్నారు. ఈ పరస్పర విరుద్ధమైన పోలీసు స్టేట్మెంట్లను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్... పోలీసులు ఈ కేసులో సరిగ్గా దర్యాప్తు చేయలేదని తేల్చారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. పోలీసు శాఖ దారుణ దర్యాప్తునకు ఈ కేసు ఓ మంచి ఉదాహరణని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో శ్రావణ సంధ్య మృతి కేసులో పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయలేదన్న జయలక్ష్మి తరఫు న్యాయవాది జీవీ శివాజీ వాదనలతో ఏకీభవించడం మినహా కోర్టుకు మరో అవకాశం లేకుండాపోయిందన్నారు. -
ఉద్యోగులపై చిన్నచూపు ఎందుకు?
ఏలూరు (మెట్రో): ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలు, నాలుగు డీఏలు, మధ్యంతర భృతి ఎప్పుడు ఇస్తారని రాష్ట్ర రెవెన్యూ ఆసోసియేషన్ (జేఏసీ) అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం చంద్రబాబుఉద్యోగులపట్ల ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో అర్ధంకావడంలేదన్నారు. శనివారం ఏలూరులో రెవెన్యూ అసోసియేషన్ నాయకుడు తోట సుధాకర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్కళ్యాణ్ అనేక హామీలిచ్చారని, వాటిని అమలుచేయడానికి మాత్రం ముందుకు రావడంలేదని మండిపడ్డారు. పీఆర్సీ వేస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడంలేదన్నారు. అలాగే, దశలవారీగా బకాయిలు ఇస్తామన్నారని, అదీ లేదని చెప్పారు. ఉద్యోగులపట్ల కూటమి నాయకులకు ఎందుకు చిన్నచూపని వారు ప్రశ్నించారు. ఉద్యోగులు కోరుకున్న 12వ పీఆర్సీ, 2023 జూలైలో వేయాల్సిన పీఆర్సీని నేటికీ వేయలేదని నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం నాలుగు డీఏలు ఇవ్వాలని, జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ దసరాకి ఒక్క డీఏ అయినా ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. గ్రాట్యుటీ, మెడికల్ బిల్స్ రావు.. ఇక రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు రాని పరిస్థితి ఉందని వారు వివరించారు. రిటైరైన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండానే వారు చనిపోతున్నారని బొప్పరాజు, వలిశెట్టి ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులు ఆక్రోశం, ఆవేదనతో ఉద్యమబాట పట్టక ముందే ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి దసరాకి ఉద్యోగుల బకాయిలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పలువురు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు. -
పోలీస్ బలుపుపై హైకోర్టు ఫైర్
సాక్షి, అమరావతి: అయినదానికి, కానిదానికి రాష్ట్రంలో సాధారణ పౌరులపైన తమ ప్రతాపం చూపిస్తూ వస్తున్న పోలీసులు మరోసారి ‘బలుపు’ ప్రదర్శించారు. ఎదురు చెప్పినవారిని చితక్కొట్టడమే పనిగా పెట్టుకున్న రక్షకభటులు ఏకంగా డ్యూటీలో ఉన్న హైకోర్టు ఉద్యోగిపైనే దాడి చేశారు. జడ్జీలకు కేసుల ఫైళ్లను అందజేసేందుకు వెళ్తుండగా అడ్డుకుని అత్యంత దురుసుగా ప్రవర్తించారు. బాధితుడు తాను ఎవరో వివరాలు చెప్పినా పట్టించుకోకుండా దూషిస్తూ దారుణంగా ప్రవర్తించారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఎం.లక్ష్మీనారాయణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ కమ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. గుంటూరు పరిధిలో ఉన్న న్యాయమూర్తులకు ఆయన కేసుల ఫైళ్లు అందజేస్తుంటారు. మరుసటి రోజు విచారించాల్సిన కేసులకు సంబంధించిన ఫైళ్లను రాత్రి న్యాయమూర్తులు ఇంటి వద్దనే చదువుతారు. తద్వారా విచారణ సులభమవుతుంది. ఇలా వారికి కేసుల ఫైళ్లను అందజేయడాన్ని సర్క్యులేషన్ అంటారు. లక్ష్మీనారాయణ గురువారం హైకోర్టు వాహనంలో ఫైళ్లను తీసుకుని రెయిన్ ట్రీ విల్లాల్లో నివసిస్తున్న జడ్జీలకు ఇచ్చేందుకు మంగళగిరి మీదుగా బయల్దేరారు. ఎర్రబాలెం–మంగళగిరి రైల్వే ఫ్లై ఓవర్పై మిగిలిన వాహనాలతో వెళ్తుండగా లక్ష్మీనారాయణ వాహనాన్ని ఓ కానిస్టేబుల్ అకస్మాత్తుగా ఆపారు. ఈ దారిలో వద్దని, విజయవాడ మీదుగా వెళ్లాలని చెప్పారు. రోజూ ఇదే మార్గంలో వెళ్తుంటానని, హైకోర్టు జడ్జీలకు అత్యవసరంగా ఫైళ్లు ఇవ్వాల్సి ఉందని లక్ష్మీనారాయణ సమాధానమిచ్చారు. దారి మళ్లించిన విషయం తెలియదన్నారు. ఈ సంవాదం జరుగుతుండగానే... మంగళగిరి గ్రామీణ సీఐ వై.శ్రీనివాసరావు వచ్చారు. రావడం రావడమే లక్ష్మీనారాయణను గట్టిగా చెంపదెబ్బ కొట్టారు. హైకోర్టు ఉద్యోగినని చెప్పినా వినిపించుకోలేదు. ‘నువ్వేంటిరా.. డ్రైవర్ నా కొడుకువి.. నువ్వా నాకు చెప్పేది.. నేను సీఐను’ అని దూషిస్తూ లక్ష్మీనారాయణ పొట్టలో గట్టిగా గుద్దారు. పదేపదే ఆయన చెంపపై కందిపోయేలా కొట్టారు. అర్జంట్ అయితే జడ్జీలే ఫోన్ చేస్తారులేఇద్దరు కానిస్టేబుళ్లను పిలిచి లక్ష్మీనారాయణతోపాటు హైకోర్టు వాహనాన్ని కూడా మంగళగిరి స్టేషన్కు తీసుకెళ్లమని, ర్యాష్ డ్రైవింగ్ కింద లక్ష్మీనారాయణపై కేసు పెట్టాలని సీఐ శ్రీనివాసరావు ఆదేశించారు. కేసుల తాలూకు ఫైళ్లు ఉన్నాయని, జడ్జీలకు అందజేయడం అత్యవసరమని లక్ష్మీనారాయణ వివరించినా పట్టించుకోలేదు. మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నించగా, ఓ కానిస్టేబుల్ ఆయన ఫోన్ను బలవంతంగా లాగేసుకున్నారు. స్టేషన్కు వెళ్లాక ఫోన్ అడిగినా ఇవ్వలేదు. వ్యాన్లో అత్యవసర ఫైళ్ల గురించి చెప్పగా, అంత అత్యవసరమైతే జడ్జీలే ఫోన్ చేస్తారులే అంటూ కానిస్టేబుళ్లు దురుసుగా మాట్లాడారు. లక్ష్మీనారాయణ అరగంట బతిమిలాడాక ఆయనకు ఉన్నతాధికారి నంబరు రాసుకునేందుకు మాత్రం మొబైల్ ఇచ్చారు. నంబరు రాసుకుని... మరో వ్యక్తి ఫోన్ నుంచి జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లక్ష్మీనారాయణను పంపించేశారు. సంఘటితమైన జడ్జీల డ్రైవర్లు... కీలక వ్యక్తి దృష్టికి.. శుక్రవారం ఉదయం హైకోర్టులోని న్యాయమూర్తుల డ్రైవర్లు అందరూ కలిసి... తమ సహచరుడిపై పోలీసుల దాషీ్టకాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో హైకోర్టులో ‘కీలక’ స్థానంలో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి పోలీసుల దుందుడుకు చర్యలను వివరించారు. డ్యూటీలో ఉన్న ఉద్యోగి.. అందులోనూ హైకోర్టు ఉద్యోగిని కొట్టడమే కాక న్యాయమూర్తుల కేసుల ఫైళ్లున్న వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని హైకోర్టు వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. ఆ తర్వాత లక్ష్మీనారాయణ గుంటూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, నిందితుల జాబితాలో లక్ష్మీనారాయణపై దాడి చేసిన సీఐ శ్రీనివాసరావు పేరును చేర్చలేదు. నిందితుల కాలమ్లో ‘‘సీఐ’’ అని రాసి సరిపెట్టారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని ఆయన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు బీఎన్ఎస్ సెక్షన్ 132 కింద కేసు పెట్టారు. గాయమవుతుందని తెలిసినా గాయం చేయాలన్న ఉద్దేశంతో గాయపరిచారంటూ సెక్షన్ 115(2) కింద కూడా కేసు నమోదు చేశారు. ఆగమేఘాలపై వచ్చిన జిల్లా ఎస్పీసీఐ శ్రీనివాసరావు ఏకంగా హైకోర్టు ఉద్యోగిని కొట్టడం, హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో గుంటూరు ఎస్పీ శుక్రవారం ఉదయం ఆగమేఘాలపై హైకోర్టుకు వచ్చి ఉన్నతాధికారులను కలిశారు. మొత్తం ఘటనపై వివరణ ఇచ్చారు. ఈ సమయంలో లక్ష్మీనారాయణపై దాడి చేసిన నిందితుల జాబితాలో సీఐ అని మాత్రమే రాయడంతో హైకోర్టులోని ‘కీలక వ్యక్తి’... ఎస్పీని గట్టిగా నిలదీశారు. మరోవైపు తమ ఉద్యోగిపై చెయ్యి వేయడమంటే హైకోర్టుపై వేయడమేనని హైకోర్టు వర్గాలు ఎస్పీకి తేల్చిచెప్పాయి. డ్రైవర్ లక్ష్మీనారాయణ తప్పు చేసి ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని, దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరని ఎస్పీకి స్పష్టం చేశాయి. సీఐ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తీవ్ర విషయమని తెలిపాయి. పైగా న్యాయమూర్తులకు అందజేయాల్సిన కేసుల ఫైళ్లను కూడా స్టేషన్లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది కోర్టు పాలనలో జోక్యం చేసుకోవడమేనని ఎస్పీతో వ్యాఖ్యానించాయి. కాగా, పోలీసులు విధి లేని పరిస్థితుల్లో సీఐ శ్రీనివాసరావు పేరును లక్ష్మీనారాయణపై దాడి చేసిన నిందితుల జాబితాలో చేర్చారు. ⇒ హైకోర్టు ఆగ్రహంతో ఘటన తీవ్రత అర్థమైన ఎస్పీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. డ్రైవర్ లక్ష్మీనారాయణను కొట్టిన సీఐను నిందితుల జాబితాలో చేర్చిన ఆయన తదుపరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలని హైకోర్టు వర్గాలు భావిస్తున్నాయి. కాగా, సీఐ శ్రీనివాసరావు మంగళగిరి నియోజకవర్గంలోనే అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్రపడ్డారు. -
‘10 చెప్పి 3 అమలు చేస్తే సూపర్హిట్ అవుతుందా?’
విజయవాడ: శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు ఎదురుదాడి లేదా తప్పించుకుని తిరిగే తప్పా, ప్రభుత్వం నుంచి బాధ్యతాయుతమైన సమాధానం రాలేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు(శనివారం, సెప్టెంబర్ 27వ తేదీ) శాసనమండలి సమావేశాల అనంతరం బొత్స మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘ రైతులు ఇబ్బందులు పడుతున్నా యూరియా పై చర్చించడానికి ఒప్పుకోలేదు. మేము ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉన్నాం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు. 10 చెప్పి 3 అమలు చేస్తే సూపర్ హిట్ అవుతుందా?, కార్మికుల పని గంటలు పెంచే బిల్లు వ్యతిరేకించాం.. ఆ బిల్లులో భాగస్వామ్యం కామని చెప్పాం. క్రిడాల్లో దేశానికి, రాష్టానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తికి జాబ్ ఇవ్వడానికి బిల్లు పెడితే మేము సమర్ధించాం. కానీ రాజకీయ గొడవలతో చనిపోయిన కుటుంబంలో వ్యక్తికి జాబ్ ఇస్తామని బిల్లు పెడితే వ్యతిరేకించాం. ఈ బిల్లు పాస్ అయితే రాష్ట్రంలో కక్షలు-కార్పణ్యాలు పెరిగిపోతాయి. ప్రభుత్వానికి రాజకీయ ఆలోచన తప్ప ప్రజలు వారి అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి లేదు. ఒంటెద్దు పోకడలతో ప్రభుత్వం పోతుంది. చైర్మన్కి జరిగిన అవమానంపై కూడా సభలో చర్చించాం.. ఇక ముందు జరగదని చెప్పారు’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో టీడీపీ కార్యక ర్త రామాంజనేయులు ఉద్యోగం బిల్లు ఆమోదం పొందలేదు. దాంతో ఆ బిల్లు ఆమోదం పొందకుండానే శానస మండలి నిరవధిక వాయిదా పడింది. ‘బాలయ్య అంతేసి మాటలన్నా స్పీకర్ పట్టించుకోరా?’ -
సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై వైఎస్ జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: సవీంద్ర(Savindra) కేసును సీబీఐ(CBI)కి అప్పగించటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన సుమోటో ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే హ్యాష్ ట్యాగ్తో ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితికి నిదర్శనమన్న వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదన్నారు.‘‘ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. సెక్షన్ 111ని దుర్వినియోగం చేయటం నిత్యకృత్యంగా మారింది. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.I welcome the Hon’ble High Court’s suo moto direction to hand over the case of social media activist Kunchala Savindra Reddy to the CBI. This decision reveals the alarming state of affairs in Andhra Pradesh, where the police under the @ncbn–led government have been crushing…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 27, 2025ఇదీ చదవండి: చంద్రబాబు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి! -
చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం కోసం బిల్లు!
సాక్షి, అమరావతి: ‘‘జరిగింది రాజకీయ ప్రేరేపితమైన హత్య అని ప్రభుత్వమే అంటోంది.. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఏముంది?’’ అని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం బిల్లును ప్రవేశపెట్టగా.. వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘జరిగింది రాజకీయ ప్రేరేపితమైన హత్య అని బిల్లులో చెప్పారు. రాజకీయ ప్రేరేపిత హత్య జరిగిన వారికి ఉద్యోగాలు ఇచ్చి ఏం సందేశం ఇస్తున్నారు?. అదేదో.. దేశానికి పేరు తెచ్చే వారికి ఉద్యోగాలు ఇస్తే బావుంటుంది. కానీ ఇదేం సంప్రదాయం?. మీ పార్టీ పరంగా ఏదైనా సహాయం చేసుకోండి. అంతేగానీ రాజకీయ ప్రేరేపిత హత్య జరిగితే ఎలా ఉద్యోగం ఇస్తారు?. ఇప్పుడు గనుక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే ఫ్యాక్షన్ని ప్రోత్సహించినట్టు అవుద్ది. తప్పుడు ఆలోచనను రేకెత్తించినట్టు అవుతుంది. ఈ బిల్లు ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లు పై డివిజన్(ఒక బిల్లును ఆమోదించాలా వద్దా అనే విషయంలో సభ్యుల ఓట్లను స్పష్టంగా లెక్కించమని కోరడం) కోరుతున్నాం’’ అని బొత్స అన్నారు. అయితే.. దీనికి మంత్రి పయ్యావుల నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. రాజకీయ ప్రేరేపిత హత్యలు జరగకూడదనే ఉద్దేశంతోనే చంద్రయ్య కొడుకు వీరాంజనేయులికి ఉద్యోగం(Chandraiah Son Govt Job) ఇస్తున్నామని అన్నారు. ఇలా ఇస్తూ పోతే అరాచకాలు మరింత పెరుగుతాయని బొత్స అనడంతో.. మంత్రులు ఊగిపోయారు. నచ్చకపోతే వాకౌట్ చేసి వెళ్లిపోవాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలను ఉద్దేశించి దురుసుగా మాట్లాడారు. దీంతో బొత్స ‘‘మేం ప్రజా సమస్లపై మాట్లాడేందుకు సభకు వచ్చామంటూ’’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఇంత జరిగినా సభాపతి స్పందించరేం? -
‘నా వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించండి..’ కామినేని శ్రీనివాస్
సాక్షి, అమరావతి: సినిమా వాళ్లను పిలిచి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అవమానించారంటూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్(Kamineni Srinivas) అబద్ధపు ప్రకటన రాజకీయ దుమారం రేపింది. అయితే ఈ ప్రకటనపై ఆయన యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ స్పీకర్కు శనివారం విజ్ఞప్తి చేశారు. ‘‘మొన్న సభలో నేను చేసిన వ్యాఖ్యలు అపార్థానికి దారి తీశాయని భావిస్తున్నాను. అందుకే రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నా’’ అని స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో చిరంజీవి సహా.. హీరోలను జగన్ అవమానించినట్లు మాట్లాడిన మాటలను తొలగించాలని కోరారు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవిని, సినిమా వాళ్లను అవమానించినట్టు కామినేని అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. ‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ను కలవడానికి వెళ్లినప్పుడు, వారికి సరైన గౌరవం ఇవ్వలేదు. జగన్ వారిని కలవడానికి ఆసక్తి చూపలేదు. చివరికి చిరంజీవి గారు ఒత్తిడి చేయడంతోనే జగన్ కలవడానికి అంగీకరించారు’’ అని అన్నారు. కామినేని వ్యాఖ్యలను బాలకృష్ణ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలో చిరుపై బాలయ్య నోరు పారేసుకున్నారు. అయితే.. కాసేపటికే కామినేని అబద్ధాలు చెప్పారంటూ స్వయంగా చిరంజీవి ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ జగన్ తనను సాదరంగా ఆహ్వానించారంటూ అందులో పేర్కొన్నారు. దీంతో.. వివాదం మరింత రాజుకుంది. ఇంకోవైపు వైఎస్ జగన్పైనా అనుచిత వ్యాఖ్య చేయడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సైతం బాలయ్యపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అయితే కామినేని మాటలు టీడీపీ మెగా అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారితీయగా.. పవన్ జనసేన మాత్రం సైలెంట్గా చూస్తూ ఉండిపోయాయి. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు మౌనంగా ఉండిపోవడం గమనార్హం. -
‘బాలయ్య అంతేసి మాటలన్నా స్పీకర్ పట్టించుకోరా?’
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధమైన చట్ట సభలను ప్రభుత్వం గౌరవించి తీరాల్సిందేనని ఏపీ శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజుకు జరిగిన అవమానంపై నల్లకండువాలతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శనివారం సమావేశాలకు హాజరయ్యారు. ఈ అంశంపై చర్చకు బొత్స పట్టుబడడంతో శనివారం మండలి హీటెక్కింది. ‘‘రాజ్యాంగబద్ధమైన చట్ట సభలను గౌరవించాలనేది మా డిమాండ్. రాజ్యాంగం ప్రకారం సభను, ప్రభుత్వాన్ని నడపాలి. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో చట్టాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. ప్రభుత్వం సభ్యులకు ఇచ్చే గౌరవాన్ని ఇచ్చి తీరాలి. సభాపతికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. కానీ, ఇంతవరకు వాళ్ళ వైపు నుంచి స్పందన కూడా రాలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ జరగలేదు. ఇది రాజ్యాంగబద్ధమైన అంశం అన్నట్లు కాకుండా వ్యక్తిగత విషయంలా చూడటం ఆక్షేపనీయం.... బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం చైర్లో కూర్చున్న వారికే కాదు ఎవరికి కులాలు ఆపాదించకూడదు. శాసనసభలో నందమూరి బాలకృష్ణ ప్రవర్తన సభలో అందరూ చూశారు(Balayya Comments). ఒక మాజీ ముఖ్యమంత్రిని, మాజీ కేంద్ర మంత్రిని ఎలా మాట్లాడారో అందరూ చూశారు. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు, సభాపతి స్పందించి ఇప్పటికే మాట్లాడాలి. కానీ.. మొన్న ఘటన జరిగితే ఇప్పటిదాకా స్పీకర్(Assembly Speaker Silence On Balayya Comments) స్పందించలేదు. ఆయన తనకేం సంబంధం లేని విషయం అన్నట్లుగా ఉన్నారు. ఇటు సంబంధిత అధికారులను పిలిచి మండలి చైర్మన్ అవమానం విషయంలో ఏ జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేయాలి. సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్లాలనేదే మా ఉద్దేశ్యం. నిబంధనల ప్రకారం సభ్యులంతా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి’’ అని బొత్స అన్నారు.తప్పు ఒప్పుకున్న పయ్యావుల!శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు(Koyye Moshenu Raju)కు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాల్సిందేనని వైఎస్సార్సీపీ ఇవాళ కూడా ఆందోళన కొనసాగించింది. దీనికి సభా నాయకుడు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసింది. ‘‘మండలి చైర్మన్ అవమానం పై ముందు తేల్చండి. ప్రభుత్వం ఎందుకు జరిగిన తప్పు పై స్పందించడం లేదు’’ అని బొత్స ప్రశ్నించారు. దీనికి మంత్రి పయ్యావుల సమాధానమిస్తూ.. ప్రభుత్వానికి ఎక్కడ చైర్మన్ను చిన్నచూపు చూడాలనే ఉద్దేశం లేదన్నారు. ‘‘మొదటి నుంచి పార్టీలో క్రమశిక్షణ నేర్పుతారు. చైర్ గౌరవానికి తగ్గట్లుగా నడుచుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం. ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి.. మండలి నిర్వహణకు సహకరించాలని’’ అని వైఎస్సార్సీపీ సభ్యులను కోరారు. అయితే.. ప్రభుత్వ కార్యక్రమాలకు చైర్మన్కు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. రిపీట్డెడ్గా ఇలా జరుగుతోందని బొత్స అన్నారు. ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం కలిగించే బిల్లులకు మేం వ్యతిరేకం కాదు. మండలి చైర్మన్కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. మండలి సభ్యులంటేనే మరీ చిన్నతనంగా చూస్తున్నారు’’ అని బొత్స అన్నారు. ఈ ఆందోళల నడుమ మండలి కాసేపు వాయిదా పడింది. ఏం జరిగిందంటే.. అసెంబ్లీ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండలి చైర్మన్ మోషేన్ రాజుకు ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. ‘‘మండలి చైర్మన్గా దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తిని వరుసగా అవమానించడం దారుణం. గతంలో స్పోర్ట్స్ మీట్ సందర్భంలో కూడా చైర్మన్ను అవమానించారు. దీనిపై సీఎం, మంత్రి క్షమాపణ చెప్పాలి” అని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అయితే.. తిరుపతి సదస్సుకు చైర్మన్ రానని అధికారులు తెలిపారని మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇవ్వగా.. తాను అలా చెప్పలేదంటూ మండలి చైర్మన్ మోషేన్ రాజు చెప్పడంతో మండలి ఒక్కసారిగా వేడెక్కింది.ఇదీ చదవండి: చైర్మన్కు అవమానం..తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘనే! -
దళిత చైర్మన్కు అవమానం..తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘన
సాక్షి, అమరావతి: శాసన మండలి చైర్మన్ రాజ్యంగబద్ధ పదవి. సభాధ్యక్ష స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులతో అధ్యక్షస్థానాన్ని అగౌరవపరుస్తోంది. అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోంది. రాజ్యాంగస్థానాన్ని ఓ దళిత సభ్యుడు అధిరోహించారన్న అక్కసుతోనే ఇలా చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దళిత వర్గానికి చెందిన చైర్మన్ మోషేన్ రాజుకు జరుగుతున్న వరుస అవమానాలపై శుక్రవారం శాసన మండలి దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ సభ్యులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. శాసనసభా నాయకుడైన సీఎం చంద్రబాబునాయుడు మండలికి వచ్చి దీనికి సమాధానం చెప్పాలని, చైర్మన్ను బేషరతుగా క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. మండలిలో ఉన్న మంత్రులు సమాధానం చెప్పకుండా దాటవేయడంతో ప్రతిపక్ష సభ్యులు పెద్దపెట్టున నినాదాలుచేశారు. ఈ అంశంలో ప్రభుత్వ తీరుపై చైర్మన్ మోషేన్రాజు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చైర్మన్కు సంఘీభావంగా వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో మండలిని పలుమార్లు వాయిదా వేసినా సభను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో చేసేది లేక చైర్మన్ శనివారానికి వాయిదా వేయాల్సి వచ్చింది.దళితుడైనందున చైర్మన్ను అవమానిస్తారా?: బొత్స‘‘అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండలి చైర్మన్ను ఆహ్వానించకపోవడం అన్యాయం. అసెంబ్లీ ప్రాంగణంలో ఏ కార్యక్రమం జరిగినా అసెంబ్లీ స్పీకర్తో పాటు‡ మండలి చైర్మన్ను ఆహ్వానించాలి. గౌరవించాలి.. కానీ కావాలనే పిలవడం లేదు. ఇలా జరగడం తొలిసారి కాదు.. ఇది చాలా తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన. సభా గౌరవానికి సంబంధించిన అంశం. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అంటూ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకూ చైర్మన్ను ఆహ్వానించలేదు. లోక్సభ స్పీకర్ పాల్గొన్న ఆ కార్యక్రమంలో మా లాంటి వారిని పిలిచారా? లేదా? మా సభ్యులను పిలిచారో లేదా అనేది కాదు.. మండలి చైర్మన్గా మిమ్మల్ని పిలవాలి కదా? ఎందుకు పిలవలేదు? ఇటీవల జరిగిన ప్రజాప్రతిని«ధుల క్రీడా పోటీలకూ చైర్మన్కు పిలుపు లేదు. ప్రభుత్వం తరçఫున అధికారికంగా జరిగే కార్యక్రమాలకు చైర్మన్ను పిలవకుండా పదేపదే అవమానిస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వారు సభాధ్యక్ష స్థానంలో కూర్చున్నారనే కదా.. కావాలని అవమానిస్తున్నారు. అసెంబ్లీ, మండలి విప్ల భవనాల ప్రారంభోత్సవంలో అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను పిలిచి మండలి చైర్మన్ను పిలవకపోవడం అన్యాయం. కనీసం శిలాఫలకంపైనా మండలి చైర్మన్ పేరు కూడా వేయలేదు.’’ అంటూ శిలాఫలకం ఫొటో చూపిస్తూ బొత్స తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మండలి చైర్మన్ను భాగస్వామ్యం చేయకపోవడం చాలా తప్పు అని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందేనని, క్షమాపణ చెప్పాల్సిందేనని నిలదీశారు. ఈ ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని, రెండు సభలకు నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మండలికి రావాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘ఈ ఆలోచన ఏంటి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చూశామా? మనల్ని మనమే కించపరుచుకుంటే.. ఎలా? ఇదేనా సభాధ్యక్షుడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం’’ అంటూ బొత్స అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు చైర్మన్ విచారం వ్యక్తం చేయడంతో ఆయనకు సంఘీభావంగా వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. షేమ్..షేమ్.. సభానాయకుడు వచ్చి వివరణ ఇవ్వాలి.. బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ మండలిని హోరెత్తించారు. ఈ దశలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘చైర్మన్ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. మీరు లేవనెత్తిన అంశం చాలా సున్నితమైనది. ఈ అంశంలోకి కులాలను తీసుకురావడం సరికాదు. ఏం జరిగిందో తెలుసుకుని చక్కదిద్దే యత్నం చేద్దాం. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో స్పీకర్, కార్యదర్శితో మాట్లాడి తెలియజేస్తున్నాం. దీనికి కమిటీ ఉంది. ప్రివిలేజ్ కమిటీని అడగండి. మీరు సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడడం సరికాదు’’ అంటూ చెప్పుకొచ్చారు. తానిప్పుడే కార్యదర్శితో మాట్లాడానని, విప్ల భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించని విషయం తనకు తెలియదు కానీ.. తిరుపతి కార్యక్రమానికి మిమ్మల్ని (చైర్మన్ను) పిలిచారని చెప్పారని మంత్రి అచ్చెన్న వ్యాఖ్యానించడంతో చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మంత్రి చెబుతున్న ఈ విషయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నా.. నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఇది ముమ్మాటికీ సభను తప్పుదోవ పట్టించడమే. ఏం జరిగిందో సభలో పెట్టండి చర్చిద్దాం. వ్యవస్థ గురించి మాట్లాడేందుకు సిద్ధమైతే కావాలంటే వేరొకర్ని చైర్మన్ స్థానంలో కూర్చొబెడదాం’’ అంటూ చైర్మన్ పేర్కొన్నారు. ప్రివిలైజ్ కమిటీలో చర్చిద్దామన్న మంత్రులు..క్షమాపణ చెప్పాల్సిందేనన్న వైఎస్సార్సీపీ సభ్యులుమండలిలో ఏ వ్యవహారాలు జరిగినా ప్రభుత్వానికి, సీఎంకు సంబంధాలు ఉండవు. అసెంబ్లీ, మండలిలో ఏ కార్యక్రమం జరిగినా సీఎంకు సంబంధం ఉండదు. సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం సరికాదు. ఈ అంశాన్ని ప్రివిలైజ్ కమిటీలో పెట్టి మాట్లాడదాం. జరిగిన తప్పు మళ్లీ జరగకుండా చూసుకుందాం’’ అంటూ మంత్రులు అనగానే ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన అవమానాలకు బాధ్యత వహిస్తూ సభానాయకుడు మండలికి వచ్చి చైర్మన్కు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో చేసేది లేక మండలిని శనివారానికి వాయిదా వేశారు.‘చాలా అవమానకరంగా ఉంది’ : మండలి చైర్మన్ మోషేన్ రాజు‘ఈ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి..ఈ అంశంపై నేను చర్చించడం బాగుండదు. కావాలంటే ప్యానల్ స్పీకర్ను కూర్చోబెడతాను. ఇది నాకు చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది’ అంటూ చైర్మన్ మోషేన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు జరగడం బాధగా ఉంది’ అంటూ విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తిరుపతి కార్యక్రమానికి పిలిచామన్న మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలనూ మోషేన్రాజు తీవ్రంగా ఖండించారు. -
సూపర్ సిక్స్.. సూపర్ ఫట్
సాక్షి, అమరావతి: హామీలు అమలు చేయకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోవడం ఈ కూటమి ప్రభుత్వానికే చెల్లిందంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణతో పాటు ఇతర వైఎస్సార్సీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. సూపర్ సిక్స్ కార్యక్రమాలపై గురువారం వాయిదా పడిన చర్చ శుక్రవారం కొనసాగింది. బొత్స మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటోంది. మాకు తెలిసిన తెలుగు భాష ప్రకారం.. హామీ ఇచ్చిన ఆరు పథకాలు అమలుచేశాక అప్పుడు సక్సెస్ అయినట్లు లెక్క. మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారంటే.. ప్రజలందరూ చెవిలో పవ్వు పెట్టుకుని ఉన్నారనుకుంటున్నారేమో! సామాన్యుడికి ఆ విషయం కూడా అవగాహన ఉండదని అనుకుంటున్నారా?’.. అంటూ తూర్పారబట్టారు. చర్చలో తమ పార్టీ ఎమ్మెల్సీలు సూపర్ సిక్స్లో చెప్పిన ఆడబిడ్డ నిధి, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పథకాల అమలు గురించి అడుగుతుంటే మంత్రులు సహనం కోల్పోతున్నారంటూ ఆక్షేపించారు. ఉన్న విషయాలు చెబితే వారికెందుకు అసహనం వస్తోందో అర్ధంకావడంలేదన్నారు. ఇక సూపర్ సిక్స్ పథకాలు అమలుచేసిన ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలని మంత్రులు అంటున్నారని.. అయితే, ‘ఏ ప్రభుత్వానికి సిగ్గు ఉందో, ఏ నాయకుడికి సిగ్గు ఉందో, ఎవరు సిగ్గుమాలి ఉన్నారో.. ఎవరు మాట తప్పారో ప్రజలకు తెలుసు’ అంటూ బొత్స వ్యాఖ్యానించారు. బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు..అచ్చెన్నాయడు: సూపర్ సిక్స్ సూపర్హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్. మేం ఇచ్చిన పథకాలు, ఇచ్చిన హామీలు అమలుచేశాం కాబట్టే, మొన్న ఒక సంవత్సరం తర్వాత మీ నాయకుడి జిల్లాలో రెండు జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే, ప్రజలు వన్సైడ్గా మీకు డిపాజిట్లు రాకుండా చేశారంటే మేం ఇచ్చిన హామీలన్నీ అమలుచేశామనే. బొత్స: మంత్రి ఏం మాట్లాడుతున్నారో అర్ధంకావడం లేదు. రెండు జెడ్పీటీసీ గెలిచామంటున్నారు. మీ నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం మున్సిపాలిటీ కూడా మేం గెలిచాం. గుర్తు తెచ్చుకోండి. మర్చిపోకండి. అప్పుడు మీ నాయకుడు అక్కడ ఎమ్మెల్యే. అది కూడా గెలిచాం.బొత్స: ఎన్నికల్లో మీరు హామీలిచ్చిన 20 లక్షల ఉద్యోగాలు గురించి మేం మాట్లాడితే.. మంత్రులు నిన్న జరిగిన డీఎస్సీ ఉద్యోగాల సభ గురించి మాట్లాడుతున్నారు. డీఎస్సీలో 15 వేల ఉద్యోగాలిచ్చారు. అదే మొదటి 15 నెలల్లో మా ప్రభుత్వం 1.50 లక్షల ఉద్యోగాలిచ్చింది.అచ్చెన్నాయుడు: లక్షా యాభై వేల ఉద్యోగాలిచ్చారంటున్నారు. వాళ్ల కార్యకర్తలకు వలంటీర్లు ఉద్యోగాలిచ్చారు. బొత్స: ఏ ఉద్యోగమిచ్చామో.. ఏం అంశంపై మాట్లాడుతున్నారో తెలియకపోతే ఎలా? మేం ఇచ్చామన్న లక్షా 50 వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలే. సచివాలయ ఉద్యోగులందరూ మా కార్యకర్తలా?సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పే సూపర్ సిక్స్ సినిమా సూపర్ ఫ్లాప్ అయింది. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి తెచ్చిన అమ్మఒడి పథకం కాపీనే తల్లికి వందనమని మేం అంటే.. కాదు, లోకేశ్ మదిలోంచి వచ్చిన పథకం తల్లికి వందనం అని టీడీపీ అంటోంది. మరి తల్లికి వందనంలో కోతలు పెట్టారేంటి అంటే.. లేదు జగన్ ప్రభుత్వం నిబంధనలే అమలుచేశామంటున్నారు. దీంతోనే అది కాపీ పథకమని అర్ధంకావడంలేదా. రాష్ట్ర సంపద పెంచుతామని చంద్రబాబు అన్నారు.. తీరా అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ అమలుచేయమంటే, రాష్ట్ర ఖజానా చూస్తే భయమేస్తోందంటున్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెస్తే, వాటిని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి సంపద కాదా? జగన్ తెచ్చిన సంపదను ఎలా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతారు? – ఇజ్రాయెల్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీఅరోగ్యశ్రీ నీరుగార్చారు.. రైతులకు గిట్టుబాటు ధరలేదు..కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల ముందు సూపర్ సిక్స్తో సహా 143 హామీలిచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేయకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారు. ఉద్యోగులకు ఐఆర్ లేదు. నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం నీరుగార్చారు. రాష్ట్రంలో రైతులందరూ గిట్టుబాటు ధరల్లేక ఇబ్బందిపడుతున్నారు. విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై రూ.వేల కోట్ల భారం వేశారు. – రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీజోలి పట్టుకుని ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి..సూపర్ సిక్స్లో ఇంకా అమలుచేయని పథకాలకు ప్రభుత్వం పీ–4 చూపిస్తోంది. జోలి పట్టుకుని ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఏ ప్రభుత్వం చేయదు. చదివింపుల పుస్తకం పెట్టి, ఆ చదివింపులతో శుభ కార్యక్రమం చేయడం అన్యాయం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్త వృద్ధాప్య పింఛన్లు మంజూరుకాలేదు. రాష్ట్రంలో ఇప్పుడు ఎంతోమంది పింఛను కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు పాలనలో అర్హులకు ఎప్పుడూ సంపూర్ణ న్యాయం జరగలేదు. అదే 2019–24 మధ్య జగన్ ప్రభుత్వం సంతృప్తస్థాయిలో పథకాలను అమలుచేసింది. – విక్రాంత్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీహామీలు అమలుచేయకుండా సంబరాలా?ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలపై టీడీపీ కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి బాండ్లు ఇచ్చారు. హామీలు అమలుచేయకుండా అన్ని వర్గాల వారికీ ఎగనామం పెట్టి ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం ఏంటి? ప్రతీ నిరుద్యోగికీ ఇప్పటికే ప్రభుత్వం భృతి కింద రూ.45 వేలు చొప్పున ఎగనామం పెట్టింది. 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తామన్నారు. 15 నెలల పాలనలో ఒక్క ఆడబిడ్డకూ రూ.15 కూడా ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళలకు అమలైన పథకాలనూ ఆపేశారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఏపీని అమ్మాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇది మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఘోరమైన మోసం. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనంగా మార్చి మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది కోతలు పెట్టారు. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీపని మనుషులు దొరకడం లేదు..అప్పులు చేస్తున్నారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని నడపటం ఎలా సాధ్యపడుతుంది? ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ బ్రహ్మాండంగా అమలుచేసింది. ఇంకా ఇవ్వాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. మన దగ్గర రూ.నాలుగు వేలు ఇస్తుంటే, బిహార్లో రూ.400 మాత్రమే ఇస్తున్నారు. రూ. నాలుగు వేలు ఇస్తుంటేనే మన దగ్గర పనిమనుషులు దొరకడంలేదు. దీంతో బిహార్ నుంచి ఇక్కడికి పనిచేయడానికి వస్తున్నారు. ఇంకా ఇచ్చి రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారు? – సోము వీర్రాజు, ఎమ్మెల్సీ బీజేపీలబ్ధిదారులు 2 లక్షల మంది తగ్గారు..ఇటీవల రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అందించాం. మేం 47 లక్షల మందికే ఇచ్చాం. అయితే గత ప్రభుత్వంలో 52 లక్షల మందికి రైతుభరోసా ఇచ్చారు కదా అని విమర్శలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఇచ్చిన 52 లక్షల మంది వివరాలు పరిశీలించాం. ఈ క్రమంలో లబ్ధిదారులు రెండు లక్షల మంది తగ్గినట్లు తేలింది. – అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి ఉచిత సిలిండర్లు మూడు విడతలు ఇచ్చాంఇప్పటివరకు దీపం పథకం కింద మూడు విడతలుగా ఉచిత సిలిండర్లు అందించాం. ఇలా 2.55 లక్షల సిలిండర్లు డెలివరీ చేశాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పథకం అమలుచేస్తున్నాయి. డిజిటల్ కరెన్సీ ద్వారా పథకం అమలుకు ప్రయోగం చేస్తున్నాం. – నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ మంత్రిఆడబిడ్డ నిధిపై అధ్యయనం..ఆడబిడ్డ నిధి పథకం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఎలా అమలుచేయాలనే దానిపై అధ్యయనం చేస్తున్నాం. భవిష్యత్తులో పూర్తి విధివిధానాలు ప్రకటిస్తాం. – కొండపల్లి శ్రీనివాస్, ఎంఎస్ఎంఈ, సెర్ప్ మంత్రి15 నెలల్లో 5.5 లక్షల ఉద్యోగావకాశాలు15 నెలల పాలనలో ప్రభుత్వం నిరుద్యోగ యువతకు 5.5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించింది. ఇంకో మూడున్నరేళ్లు ఉంది. కేబినెట్లో ఆమోదం ప్రకారం మరో 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈ లెక్కన ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సులువుగా ఇచ్చేస్తాం. – భరత్, పరిశ్రమల శాఖ మంత్రి -
విద్యుత్ సంస్థల్లో సమ్మె సైరన్
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో సమ్మె సైరన్ మోగింది. అక్టోబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు యాజమాన్యాలకు శుక్రవారం సాయంత్రం ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నోటీసులు జారీ చేసింది. ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్కో, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలకు ఈ మెయిల్ ద్వారా నిరవధిక సమ్మెనోటీసులను పంపించింది. సమ్మెకు వెళ్లే ముందు అక్టోబర్ 6న విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్ 8న తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట కూడా ధర్నా చేయనున్నారు. అక్టోబర్ 13న చలో విజయవాడ పేరుతో భారీ ఆందోళన చేపట్టనున్నారు. అక్టోబర్ 14న అన్ని సంస్థల్లో వర్క్ టు రూల్ అమలు చేసి పనిగంటల వరకే కార్యాలయాల్లో ఉంటారు. అప్పటికి కూడా ప్రభుత్వం, యాజమాన్యాలు స్పందించి, చర్చలకు పిలిచి, సమస్యలను పరిష్కరించపోతే అక్టోబర్ 15 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభిస్తారు. అన్ని సంస్థల్లోనూ వివిధ విభాగాల్లో ఉన్న దాదాపు 33,582 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. కూటమి నిర్లక్ష్యంతో కమ్ముకుంటున్న చీకట్లు అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్యలన్నిటిని తీర్చడంతో పాటు, మరింత మేలు చేస్తామంటూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఓట్లేసిన ఉద్యోగులను వెన్నుపోటు పొడవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఏడాదిన్నరగా నాలుగు డీఏలు ఇవ్వకపోగా, పీఆర్సీ ప్రకటించలేదు. కనీసం ఐఆర్ అయినా ఇస్తుందనుకుంటే అదీ లేదు. ఇదేమిటని అడిగితే ప్రభుత్వం నుంచి బదులు లేదు. చివరికి నిరసన తెలిపితేనైనా తమ బాధ ప్రభుత్వానికి అర్ధం అవుతుందని భావించి ఈ నెల 15 నుంచి 22 వరకూ వారం రోజుల పాటు దశల వారీగా విధులకు ఆటంకం కలగకుండా ఆందోళనలు నిర్వహించినా కనికరించలేదు. వేలాది మంది ఉద్యోగులు ఇంతగా అడుగుతున్నా పిలిచి మాట్లాడాలనే కనీస స్పృహ ఈ ప్రభుత్వానికి లేదు. చివరికి విసిగిపోయిన విద్యుత్ ఉద్యోగులు చివరి అ్రస్తాన్నీ వాడాల్సి వస్తోంది. నిజానికి విద్యుత్ వంటి అత్యవసర సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ భయపడకుండా తప్పనిసరి పరిస్థితుల్లో తాము సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఉద్యోగుల సమ్మె అనివార్యమైతే రాష్ట్రంలో చీకట్లు అలుముకుంటాయి. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తమవుతుంది. ఆరి్ధక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది. వినియోగదారులకు రోజువారీ అవసరాలతో పాటు, వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ ఆగిపోతుంది. -
నేడు కోస్తాలో వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల మధ్య ఉన్న తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం విజయనగరంలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 5.4, శ్రీకాకుళంలో 4.8, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 4.2, డెంకాడ, ప్రకాశం పెద్దారవీడులో 4.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. శనివారం కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. శనివారం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందరరెడ్డి అక్రమ అరెస్టుపై సీబీఐ దర్యాప్తు
సోషల్ మీడియా యాక్టివిస్ట్ను నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా అరెస్ట్ చేసిందే కాక.. అదుపులోకే తీసుకోలేదని పోలీసులు మాకు చెప్పారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదన్నారు. ఆయన భార్య ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు. మళ్లీ అరెస్ట్ చేశామని, మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలంటున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన సమయం, పోలీసులు చెబుతున్న విషయాలు పూర్తిగా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. వాస్తవాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. పోలీసుల తీరు తీవ్ర ఆక్షేపణీయం. అందువల్ల వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలగకూడదని కేసు లోతుల్లోకి వెళ్తున్నాం. అధికరణ 226 కింద ఉన్న అసాధారణ అధికారాన్ని ఉపయోగిస్తున్నాం. –హైకోర్టుసాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందరరెడ్డి అలియాస్ సవీందర్రెడ్డి అక్రమ అరెస్ట్పై హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందులో భాగంగా సీబీఐ ఏపీ విభాగాధిపతిని సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి, ప్రాథమిక నివేదికను తమ ముందుంచాలని ఆయన్ను ఆదేశించింది. తదుపరి విచారణ వరకు సౌందరరెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే ప్రక్రియను ఆపేసింది. సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాల్సిన ప్రాథమిక ఆధారాలు ఈ కేసులో ఉన్నాయంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సౌందరరెడ్డి అరెస్ట్ అక్రమమనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘గంజాయి కేసులో సౌందరరెడ్డిని పోలీసులు ఇరికించారు. పోలీసులు వారి చట్టవిరుద్ధ చర్యలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేశారు. తగిన అరెస్ట్ వారెంట్ లేకుండా, సుప్రీంకోర్టు నిర్దేశించిన అరెస్ట్ విధానాన్ని అనుసరించకుండా సౌందరరెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే అధికారుల విశ్వసనీయతపై కూడా మాకు సందేహాలున్నాయి. అందుకే ఈ కేసులో జోక్యం చేసుకుంటున్నాం. అన్యాయంగా, ఏకపక్షంగా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు. ఈ కేసులో పోలీసుల చర్యలు చాలా దారుణంగా ఉన్నాయి’ అని ధర్మాసనం వివరించింది. 8.30కి అరెస్ట్ చేస్తే.. 7.30కే మధ్యవర్తుల నివేదిక ఎలా సాధ్యం? ‘సౌందరరెడ్డిని ఈ నెల 22వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో అరెస్ట్ చేశామని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అదే రిపోర్టులో 7.30 గంటలకు మధ్యవర్తుల నివేదిక సిద్ధం చేసినట్లు పోలీసులు చెప్పారు. మరి 8.30 గంటలకు అరెస్ట్ చేస్తే, 7.30 గంటలకే ఎలా మధ్యవర్తుల నివేదిక సిద్ధం అవుతుంది? అలాగే తనను 22వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు అరెస్ట్ చేశారని సౌందరరెడ్డి మాకు చెప్పారు. సౌందరరెడ్డి సాయంత్రం 4.20 గంటలకు విజయవాడలో ఉన్నారని, అనంతరం అక్కడి నుంచి కుంచనపల్లికి వెళ్లారని కూడా జియో కంపెనీ తన మెమోలో ఈ కోర్టుకు చెప్పింది. ఆ తర్వాత సాయంత్రం 6.21 గంటలకు అతని ఫోన్ స్విచాఫ్ అయినట్లు కూడా జియో చెప్పింది. అటు తరువాత 7 గంటలకు సౌందరరెడ్డి భార్య లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా జనరల్ డైరీలో నమోదు చేశారు. 7.30 గంటల కన్నా ముందే ఆమె తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని అర్థమవుతోంది. సౌందరరెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసులు చెబుతున్న దానికీ, వాస్తవంగా జరిగిన దానికీ పొంతన కుదరడం లేదు. పోలీసులు చెబుతున్న విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలగకూడదనే జోక్యం ‘ఓ వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు యూనిఫాంలో ఉండి తీరాలని డీకే బసు కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాక వారి గుర్తింపును సైతం తెలియచేయాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ కేసులో పోలీసులు సౌందరరెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో యూనిఫాంలో లేరు. ఇదే విషయాన్ని ప్రత్తిపాడు సీఐ ధ్రువీకరించారు. సాధారణంగా మేము ఇలాంటి కేసుల్లో లోతుల్లోకి వెళ్లం. అయితే పోలీసుల తీరు అత్యంత ఆక్షేపణీయంగా ఉండటంతో లోతుల్లోకి వెళ్లక తప్పలేదు. సౌందరరెడ్డి స్వేచ్ఛకు విఘాతం కలగకూడదనే మేం జోక్యం చేసుకుంటున్నాం. అధికరణ 226కింద ఉన్న అసాధారణ అధికారాన్ని సైతం ఉపయోగిస్తున్నాం. ఓ వ్యక్తి అరెస్ట్ సక్రమమైనప్పుడే అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం సాధ్యమవుతుంది’ అని జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం స్పష్టం చేసింది. ...అందుకే సీబీఐకి అప్పగిస్తున్నాం ‘సౌందరరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసుల విశ్వసనీయతపై మాకు ప్రాథమిక అనుమానాలున్నాయి. అందుకే అధికరణ 226 కింద జోక్యం చేసుకుంటున్నాం. అంతేకాక వ్యక్తి స్వేచ్ఛను హరించకుండా అడ్డుకునేందుకు ఈ అధికరణ కింద మాకున్న అధికారాన్ని ఉపయోగించకుండా ఎవరూ నిరోధించలేరు. ప్రస్తుత కేసులో లేవనెత్తిన విషయాలను, అలాగే విచారించాల్సిన వ్యక్తుల్లో రాష్ట్ర పోలీసు అధికారులు ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించడం సబబుగా ఉంటుందని భావిస్తున్నాం. అందుకే ఈ వ్యాజ్యంలో ఆంధ్రప్రదేశ్ సీబీఐ విభాగాధిపతిని ప్రతివాదిగా చేరుస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపి మాకు ప్రాథమిక నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశిస్తున్నాం. సీబీఐ ప్రాథమిక నివేదిక ఇచ్చేంత వరకు సౌందరరెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడాన్ని నిలిపేస్తున్నాం’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. సౌందరరెడ్డి టవర్ లొకేషన్ డేటా, తాడేపల్లి పోలీస్స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ, పోలీసుల రిమాండ్ రిపోర్టు, తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదుదారు లక్ష్మీ ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదులను సీల్డ్ కవర్లో ఉంచామని, వాటిని సీబీఐ దర్యాప్తు అధికారికి అందజేయాలని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ఆదేశిస్తున్నామని పేర్కొంది. తన భర్తను అక్రమంగా నిర్బంధించారంటూ పిటిషన్ తన భర్త సౌందరరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ కుంచాల లక్ష్మీప్రసన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది. సౌందరరెడ్డిని తాము అదుపులోకి తీసుకోలేదని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దీంతో ధర్మాసనం.. సౌందరరెడ్డి ఎక్కడున్నా కూడా వెతికి తమ ముందు హాజరుపరచాలని, అతన్ని ఏ కేసులో కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి వీల్లేదని పోలీసులను ఆదేశించింది. అంతేకాక సౌందరరెడ్డిని అపహరించారంటూ లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెబుతున్న నేపథ్యంలో ఈ నెల 22 సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. అలాగే 22న సాయంత్రం సౌందరరెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియజేసేందుకు వీలుగా అతని సెల్ టవర్ వివరాలను ఇవ్వాలని జియో ఫోన్ జనరల్ మేనేజర్ను సైతం ఆదేశించిన విషయం తెలిసిందే. మొదటి నుంచీ తప్పుదోవ పట్టించిన పోలీసులు తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్న తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచీ కోర్టును తప్పుదోవ పట్టిస్తూ వస్తున్నారని తెలిపారు. సౌందరరెడ్డి అక్రమ నిర్బంధంపై తాము 23న పిటిషన్ దాఖలు చేశామని, దీనిపై ఈ ధర్మాసనం సాయంత్రం 4 గంటలకు విచారణ జరిపిందన్నారు. ఈ సందర్భంగా పోలీసులు అసలు సౌందరరెడ్డిని తాము అరెస్ట్ చేయలేదని, ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదని ఈ కోర్టుకు చెప్పారన్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా పోలీసులు సౌందరరెడ్డిని అదే రోజు సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని ఆయన వివరించారు. దీన్నిబట్టి ఈ కేసులో పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్న విషయం స్పష్టమవుతోందన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని ఆయన కోర్టును కోరారు. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తాం.. అనుమతించండి ఈ సమయంలో పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) తిరుమాను విష్ణుతేజ స్పందిస్తూ, సౌందరరెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తీరాల్సి ఉందని, ఇది తమ బాధ్యత అని తెలిపారు. సౌందరరెడ్డిని స్వేచ్ఛగా వదిలేయాలన్న హైకోర్టు ఆదేశాల వల్ల అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఈ ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలన్నారు.అంతిమంగా రిమాండ్ విషయంలో మేజిస్ట్రేటే తగిన నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసు దాఖలైన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ రికార్డ్ చేసింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు దారి తీసిన పరిస్థితులను కూడా వివరించింది. అనంతరం దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఏమాత్రం మారని ఖాకీల తీరు! 18122024మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు..‘సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు చూపలేదు. అయినా కింది కోర్టు మేజిస్ట్రేట్ ఆధారాలున్నాయనడం తప్పు. మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా, యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులిచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో అరెస్ట్కు గల కారణాలను చెప్పలేదు..’ – సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకట రమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్ను రద్దు చేయాలని కోరుతూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.06012025కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా..?‘సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రరెడ్డి నిర్బంధానికి సంబంధించి మేం అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వాలి. రవీంద్రరెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు? ఎప్పుడు అరెస్ట్ చూపారు? ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు కావాలి. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి మా ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా? కడప ఎస్పీ తీరు చూస్తుంటే అలాగే ఉంది. ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి..!’ – వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధంపై ఆయన భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు18022025లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు?‘వ్యక్తులపై కేసులు పెట్టడం.. వారిని కొట్టడం.. లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు? కేసులు పెట్టి లోపల వేయడం మినహా ఏ కేసులోనూ దర్యాప్తు చేయడం లేదు. కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. బొసా రమణ అనే వ్యక్తి అరెస్ట్ విషయంలో దర్యాప్తు చేసి ఉంటే ఆ వివరాలను మా ముందు ఉంచేవారు. దర్యాప్తు చేయలేదు కాబట్టే ఏ వివరాలను సమర్పించలేదు. అతడిపై 27 కేసులున్నాయని చెబుతున్నారు. కానీ, ఆ కేసుల దర్యాప్తు వివరాలను మా ముందు ఉంచడంలేదు. మా ఆదేశాలపై డీజీపీ ఏ చర్యలు తీసుకున్నారు..?’ – విశాఖకు చెందిన బొసా రమణ అరెస్టుపై ఆయన భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు 25022025పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు..‘పోలీసులు వాస్తవాలను దాచిపెడుతూ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. బొసా రమణ అరెస్టు విషయంలో డీజీపీ నివేదిక ఇస్తారని ఆశించాం. కానీ, ఎలాంటి నివేదిక రాలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని డీజీపీని నివేదిక కోరాం. డీజీపీ పోస్టుపై ఉన్న గౌరవంతో వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వలేదు. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తామని డీజీపీ భావిస్తే అలాగే ఆదేశాలు ఇస్తాం. రమణ అరెస్టు విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం జిల్లా కలెక్టర్ నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి...’ – బొసా రమణ భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.11032025‘పౌరుల స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం..‘పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే చూస్తూ ఊరుకోం. ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు. రుజువు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా? తాము చట్టం కంటే ఎక్కువని పోలీసులు భావిస్తున్నారు. చిన్న తప్పులేనని వదిలేస్తే.. రేపు కోర్టులకు వచ్చి మరీ అరెస్టు చేస్తారు. ప్రతి దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారు..’ – సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్రెడ్డికి కింది కోర్టు విధించినరిమాండ్ చట్ట విరుద్ధమని కొట్టేసిన సందర్భంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు25032025హద్దు మీరొద్దు ‘తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరుగుతోంది. – మాదిగ మహాసేన అధ్యక్షుడు ప్రేమ్కుమార్ అరెస్ట్పై హైకోర్టు వ్యాఖ్యలు10042025ఇది ధిక్కారమే... హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండాపోయింది. సెక్షన్ 111ను ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడమంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లే. ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? అంటే ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నట్లు కాదా?’ – పోసాని కృష్ణమురళిపై కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి 1932025సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరమంటే ఎలా? సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయి? బీఎన్ఎస్ సెక్షన్–111 ప్రకారం ఆరి్థక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలు ఉండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి? పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలం? – సజ్జల భార్గవ్, సింగిరెడ్డి అర్జున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు 2142025పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు అందరం ఇబ్బందిపడతాం చట్టాన్ని బేఖాతర్ చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకు మించి ఏదీ ముఖ్యం కాదు. ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించినా పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్కచేయడం లేదు. పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికా? లేకా ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారని తల్లిదండ్రులను వేధిస్తారా? – తిరుపతికి చెందిన రిటైర్డ్ పోలీసు అధికారి సుబ్రహ్మణ్యరెడ్డి పిటిషన్పై విచారణ సందర్భంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం2972025సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే సహించం ‘‘తప్పుడు కేసులతో పోలీసులు ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి చేస్తారో... ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు. మాకు ఏమీ తెలియదని అనుకోవద్దు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే సహించం. కౌన్సెలింగ్ పేరుతో పౌరులను వేధింపులకు గురి చేస్తే.. మీకు కౌన్సెలింగ్ చేయించాల్సి ఉంటుంది. – పఠాన్ కురీంసా(పిడుగురాళ్ల) అనే వ్యక్తి అక్రమ నిర్బంధం కేసు విచారణ సందర్భంగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ సీఐపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం 682025ఆరేళ్ల కిందట ఘటన జరిగితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? ఆరేళ్ల కిందట ఘటన జరిగితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? వైఎస్సార్సీపీ నేత తురకా కిశోర్ అరెస్ట్, రిమాండ్ విషయంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ అయిన వ్యక్తి ఒక్క క్షణం కూడా జైలులో ఉండటానికి వీల్లేదు. అక్రమ నిర్బంధాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం. – మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ కిశోర్ అక్రమ అరెస్ట్పై ఆయన భార్య సురేఖ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు 2982025సివిల్ దుస్తుల్లో పోలీస్ విధులా? పోలీసులు సివిల్ దుస్తుల్లో వచ్చి ఎలా విధులు నిర్వర్తిస్తారు? పోలీసు యూనిఫాంలో కాకుండా సివిల్ దుస్తుల్లో వచ్చి అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అది డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధం. సివిల్ దుస్తుల్లో వస్తే వారు పోలీసులని ఎలా తెలుస్తుంది? సివిల్ దుస్తుల్లో వచ్చి తమ విధులను అడ్డుకున్నారంటే ఎలా కుదురుతుంది? సివిల్ దుస్తుల్లో పోలీసులు లా అండ్ ఆర్డర్ విధులు నిర్వర్తిస్తామంటే కదరదు. అసలు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించే ప్రివిలేజీలేవీ పోలీసులకు లేవు. – మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పిటిషన్పై విచారణ సందర్భంగా స్పష్టం చేసిన హైకోర్టు అరెస్ట్ .. రిమాండ్ ఇష్టారాజ్యం కాదు నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల అరెస్ట్ అవసరమా? కాదా? అనే విషయంలో పోలీసులు, మేజిస్ట్రేట్లు తగిన ఆలోచన, పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు అర్నేష్కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు 2014లోనే స్పష్టత ఇచ్చింది. తాజాగా అదే తీర్పును ఉటంకిస్తూ అరెస్టులు, రిమాండ్లు యాంత్రికంగా కాకుండా, న్యాయబద్ధమైన విచక్షణతో జరగాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ కింది కోర్టులకు ఏపీ హైకోర్టు సర్క్యులర్ జారీ చేసింది. పౌర స్వేచ్ఛపై ‘సుప్రీం’ ఏం చెప్పిందంటే...» ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు..» స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడటం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది.భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియజేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి.– ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో ‘సుప్రీం కోర్టు’ కీలక వ్యాఖ్యలు -
‘బాలకృష్ణకు ఎందుకంత అహంభావం?’
అమరావతి : మండలి చైర్మన్ సీటులో దళితుడు కూర్చున్నాడని అవమానించాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ ప్రతిపాదించిన హక్కులు అందించాలన్నారు బొత్స. శాసనమండలి వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద బొత్స మాట్లాడారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు వినడానికి సిగ్గుపడుతున్నామని, చట్ట సభల్లో ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ‘బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మొత్తం రికార్డుల్లో ఉంది. ఆయన మూమూలుగా ఉన్నాడా?, ఒక మాజీ సీఎంని, చిత్ర పరిశ్రమలో ముఖ్య హీరోని అవమానించడం సరికాదు. సభలో లోకేష్ మమ్మల్ని ఎవరేం పీకుతారు అన్నారు వాళ్ళ వ్యవహారశైలి అలాగే ఉంది. మాజీ ముఖ్యమంత్రి అన్నా గౌరవం లేదు. సినీ పరిశ్రమకు చెందిన మాజీ కేంద్ర మంత్రి అన్న గౌరవం లేదు. బాలకృష్ణ పెద్ద పుడింగి అనుకుంటున్నారు. ఏం చూసి మీ అహంభావం. వాళ్ళ పార్టీ నుంచి ఇంతవరకు వివరణ లేదు. స్పీకర్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతాడు.. ఎందుకు స్పందించలేదు. ఒక మాజీ సీఎం, చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని అవమానిస్తే పట్టించుకోరా?, మేం కేవలం సభా సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాం. చిరంజీవికి అవమానిస్తే జనసేన ఎందుకు స్పందించలేదనేది మాకు అనవసరం.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం’ అని బొత్స పేర్కొన్నారు. -
సవీంద్ర అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగిస్తూ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 13 లోపు నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. పోలీసులు.. కోర్టును తప్పుదోవ పట్టించారని సవీంద్ర తరపు లాయర్ తన వాదనలు వినిపించారు. ‘‘ రాత్రి 7:30 గంటలకు అరెస్ట్ చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు. 6:30కు అరెస్ట్ చేశారని నిందితుడు చెబుతున్నాడు...కన్ఫెషన్ రిపోర్టులో రాత్రి 7.30కు అరెస్ట్ చేసినట్లు రాశారు. రిమాండ్ రిపోర్టులో రాత్రి 8.30కు అరెస్ట్ చేసినట్లు రాశారు. ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. లాలాపేట ఎస్హెచ్వో శివప్రసాద్ అరెస్ట్ చేసినట్లు స్పష్టంగా ఉంది. రాత్రి 7 గంటలకు సవీంద్రరెడ్డి సతీమణి పీఎస్కు వచ్చినట్లు సీసీటీవీలో ఉంది. సవీంద్ర ఫోన్ సాయంత్రం 6:21కి స్విచాఫ్ చేసినట్లు స్పష్టంగా ఉంది. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే సీబీఐ సుమోటోగా తీసుకుని విచారించాలి’’ అని సవీంద్ర లాయర్ కోరారు.‘‘సవీంద్రారెడ్డిపై గంజాయి కేసు ఎలా పెట్టారు?. సుప్రీంకోర్టు తీర్పులున్న యూనిఫాం లేకుండా ఎలా పోలీసులు సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు? ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్టా లేదా తెలియాలంటే సీబిఐతో విచారించాలి’’ అని సవీంద్ర లాయర్ తన వాదనలు వినిపించారు. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. సీబీఐ అక్టోబర్ 13వ తేదీ కల్లా కేసుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.కాగా, బుధవారం( సెప్టెంబర్ 24) ఈ కేసును విచారిస్తూ.. పోలీసులు యూనిఫామ్లో కాకుండా.. సివిల్ దుస్తుల్లో వెళ్లి అరెస్టులు చేస్తుండటాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పునే పట్టించుకోరా? అని సూటిగా నిలదీసింది. ఇదెక్కడి సంస్కృతి అంటూ ప్రశ్నించింది. మఫ్టీలో వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్టు కుంచాల సౌందరరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అసలు పౌరులను అరెస్ట్ చేయడానికి మఫ్టీలో ఎందుకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనంది. సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు వర్తించవని అనుకుంటున్నారా..? అని నిలదీసింది.తన భర్త సవీంద్రరెడ్డిని పోలీసులు ఈనెల 22న సాయంత్రమే అరెస్ట్ చేశారంటూ రాత్రి 7 గంటల సమయంలో పిటిషనర్ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే... మీరు మాత్రం రాత్రి 7.30–8.45 గంటల మధ్య అరెస్ట్ చేశామని ఎలా చెబుతారని విస్మయం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తాము తాడేపల్లి పోలీస్స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని నిర్ణయించినట్లు హైకోర్టు ప్రకటించింది. రాత్రి 8.30 గంటలకు సవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తే, ఆమె 7 గంటలకే ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి పోలీస్స్టేషన్కు ఎందుకు వెళతారని ప్రశ్నించింది. -
గట్టిగా ‘ఎవడూ’ అడగలేదు
సాక్షి, అమరావతి: మెగాస్టార్ చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ శాసన సభలో గురువారం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని ఏకవచనంతో సంబోధిస్తూ ‘ఎవడు’ అంటూ మాట్లాడారు. శాసనసభలో గురువారం శాంతిభద్రతల అంశంపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడిన విషయాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవిని అవమానించారని, ఆయన్ను కలవడానికి వెళితే కలవకుండా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారని శ్రీనివాస్ చెప్పారు.దీనిపై జోక్యం చేసుకున్న బాలకృష్ణ.. కామినేని శ్రీనివాస్ చెప్పినదంతా అబద్ధమని కొట్టిపడేశారు. చిరంజీవి గట్టిగా అడిగితే సీఎం వచ్చాడనేది అబద్ధమని, అక్కడ గట్టిగా ఎవడూ అడగలేదని బాలకృష్ణ అన్నారు. గట్టిగా అడిగితేనే ఆయన కలవడానికి వచ్చాడని, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారనేది అసత్యమని, ఆయన గట్టిగా చెబితే దిగొచ్చాడంట.. అని వ్యంగ్యంగా అన్నారు. ‘గట్టిగా అడిగారా.. ఎవడు అడిగాడు గట్టిగా, అడిగితే వచ్చాడా వీడు కలవడానికి. నాన్సెన్స్’ అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. జగన్పైనా పరుష పదజాలం ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి బాలకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘ఇండస్ట్రీ వాళ్లు సైకో గాడిని కలవడానికి వెళ్లినప్పుడు..’ అంటూ పరుష పదజాలాన్ని వాడటమేకాక వాడు, వీడు అంటూ సభ్యత లేకుండా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తీరును బట్టి ఆయన మామూలుగా లేరనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కూటమి పాలనలోనూ అవామనం అంటూ ఆగ్రహంకూటమి ప్రభుత్వంలోనూ తనకు అవమానం జరిగినట్టు బాలకృష్ణ ఫైర్ అయ్యారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి లిస్ట్ తయారు చేయమని ఈ ప్రభుత్వంలోనూ తనకు ఆహా్వనపత్రం వచ్చిందని, అందులో తనది తొమ్మిదో పేరు వేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అది వేసింది ఎవడని సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ని అడిగానని చెప్పారు. -
సైకో కాబట్టే నీకు మెంటల్ సర్టిఫికెట్
సాక్షి అమరావతి: ‘నందమూరి బాలకృష్ణా... నువ్వే సైకోవు.. కాబట్టే ఇంటికి వచ్చిన స్నేహితుడిపై కాల్పులు జరిపావు. నువ్వు సైకోవు కాబట్టే నీకు మెంటల్ సర్టీఫికెట్ ఇచ్చారు. మెంటల్ సర్టీఫికెట్ తెచ్చుకుని బయట తిరుగుతున్నావు.’ అని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.అదీ జగన్కు.. బాలకృష్ణకు తేడాఅఖండ సినిమా విడుదల సందర్భంగా రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచుకోవడానికి అప్పటి నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఆ సినిమా నిర్మాత మిర్యాల రవీంద్రారెడ్డి ద్వారా బాలకృష్ణ నాకు ఫోన్ చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ను కలుస్తానని, సమయం ఇప్పించాలని కోరారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్కు చెబితే బాలకృష్ణ నన్ను కలిస్తే.. ఆయనకే రాజకీయంగా ఇబ్బంది అవుతుందని.. బాలకృష్ణ ఏది అడిగితే అది చేయాలని నన్ను ఆదేశించారు. అదీ వైఎస్ జగన్ సంస్కారం. ఈ రోజు బాలకృష్ణ వ్యాఖ్యలు ఆయన సంస్కారహీనానికి నిదర్శనం. అప్పట్లో సినిమా పరిశ్రమ సమస్యలపై నాటి సీఎం వైఎస్ జగన్తో హీరో చిరంజీవి నేతృత్వంలో సినిమా పెద్దలు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పాల్గొనని బాలకృష్ణ వంటివారు సినిమా పెద్దలను వైఎస్ జగన్ అవమానించినట్లు చిత్రీకరిస్తూ వస్తున్నారు. – పేర్ని నాని, మాజీ మంత్రి బాలకృష్ణా.. నోరు అదుపులో పెట్టుకో.. మాజీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలి. నోటికొచి్చనట్టు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సభలో బాలకృష్ణ వ్యవహారశైలి, బయట ఫ్యాన్స్తో ఆయన నడుచుకునే విధానం చూస్తే సైకో ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ మెంటల్ సర్టీఫికెట్తో బయట తిరుగుతున్నాడు. నువ్వు సైకోవు కాబట్టే నీకు మెంటల్ సర్టీఫికెట్ ఇచ్చారు. నువ్వు సైకోవు కాబట్టే ఇంటికి వచ్చిన స్నేహితుడిపై కాల్పులు జరిపావు. – జూపూడి ప్రభాకర్రావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిబాలకృష్ణకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయాలి అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్పై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. బాలకృష్ణ నిండు సభలో జేబులో చేతులు పెట్టుకుని సభామర్యాదలు పాటించకుండా మాట్లాడుతూ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సభలో బాలకృష్ణ ఉపయోగించిన భాష అభ్యంతకరం. ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయాలేమో అనిపించేలా దిగజారి మాట్లాడారు. – మార్గాని భరత్, మాజీ ఎంపీఆయన భాషలోనే బదులిస్తాం ఓజీ సినిమా టికెట్ను రూ.వెయ్యికి పెంచుకునేందుకు సీఎం చంద్రబాబు అవకాశం ఇచ్చారన్న కడుపుమంట బాలకృష్ణకు ఉంటే వెళ్లి చంద్రబాబుతో మాట్లాడుకోవాలి. పవన్కళ్యాణ్ మీద కోపం ఉంటే ఆయనతో తేల్చుకోవాలి. సభలోలేని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అమర్యాదకరంగా మాట్లాడటం సిగ్గుచేటు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఆయన వాడిన భాషలోనే మేమూ బదులిస్తాం. – తూమాటి మాధవరావు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ -
జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించారు: చిరంజీవి
సాక్షి, అమరావతి: సినీ పరిశ్రమలో సమస్యలపై చర్చించేందుకు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను సాదరంగా ఆహ్వనించినట్లు సినీ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. అసలు వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలిపారు. భోజనం చేస్తున్న సమయంలోనే తాను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని అప్పటి సీఎం జగన్కు వివరించినట్టు స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తన ప్రస్తావన తీసుకురావడంపై స్పందిస్తూ చిరంజీవి ఓ ప్రకటన విడుదల చేశారు.‘‘అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ. ఆయనంత గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టరును కలవండన్నాడట.. అంటూ బాలకృష్ణ ఒకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ చానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చినందుకు నేను ప్రజలకు వివరణ ఇవ్వాలనుకుంటున్నా’’ అంటూ చిరంజీవి స్పందించారు. ఆ ప్రకటనలో చిరంజీవి ఇంకా ఏం చెప్పారంటే.. నన్ను చొరవ తీసుకోమన్నారు.. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చారు. సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్, ఎన్టీ రామారావు, డీవీవీ దానయ్య, మైత్రి మూవీస్.. ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు నా దగ్గరకు వచ్చారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం సీఎంతో మాట్లాడి చెబుతానన్నారు. నా చొరవతోనే టికెట్ ధరల పెంపు సాధ్యమైంది సినీ ప్రముఖుల అందరి సమక్షంలోనే నాటి సీఎం వైఎస్ జగన్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించి సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యం. నేను ఆ చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయంతో మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్లు పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డి్రస్టిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకొనే విధానంలోనే మాట్లాడతా. నేను ఇండియాలో లేను. అందుకే ప్రకటన విడుదల చేస్తున్నాను. సీఎం ఆహ్వానం మేరకే ఇంటికి వెళ్లాను అప్పటి మంత్రి పేర్ని నాని ఓ రోజు ఫోన్ చేసి ‘ముఖ్యమంత్రి ముందు మీతో వన్ టు వన్ కలుస్తానని చెప్పారు. భోజనానికి (లంచ్కి) రావాలని చెప్పారు’ అంటూ అపాయింట్మెంట్ ఇచ్చారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించారు. భోజనం చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి, మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను.కొన్ని రోజుల తర్వాత మంత్రి నాని నాకు ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేనప్పుడు ఓ పది మంది వస్తామని చెబితే సరేనన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ను వెళ్లి బాలకృష్ణను కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారు. దీంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్.నారాయణమూర్తితో సహా కొంత మందిని తీసుకుని వెళ్లి సీఎం జగన్ను కలిశాం. -
కూటమి తీరుపై ఉపాధ్యాయుల రణభేరి
గుంటూరు (ఎడ్యుకేషన్): కూటమి ప్రభుత్వ తీరుపై రాష్ట్రంలోని ఉపాధ్యాయులు గుంటూరులో రణభేరి మోగించారు. పీఆర్సీ కమిటీని ఎప్పుడు నియమిస్తారని నిలదీశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు డీఏ బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై పెత్తనం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. గురువారం ఉపాధ్యాయులు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిర ప్రాంగణంలో రాష్ట్రస్థాయి ‘రణభేరి’ బహిరంగ సభ నిర్వహించారు. సభలో ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) చైర్మన్ ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటు 12వ పీఆర్సీపై ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాలు చెల్లించలేదన్నారు. నాలుగు విడతల్లో చెల్లించాల్సిన డీఏ బకాయిలతో పాటు ఉద్యోగులు ప్రభుత్వం వద్ద దాచుకున్న ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ డబ్బులు అడిగితే అంక్షలు పెడుతున్నారని ఆరోపించారు. రూ.15 వేల కోట్లకు పైగా నిధుల్లో నుంచి అత్యవసర పరిస్థితుల్లో దరఖాస్తు చేసుకున్న వారికి రూ.200 కోట్లు చెల్లింపుల కోసం సైతం పదేపదే తిరగాల్సి వస్తోందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అక్టోబర్లో జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులపై పనిభారం పెరిగిందని, 25 నెలలుగా పీఆర్సీ బకాయిలు పేరుకుపోయాయయని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకో యాప్.. పూటకో మెసేజా..?యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను రోజుకో యాప్, పూటకో మెసేజిలతో అష్టదిగ్భంధనం చేస్తున్న విద్యాశాఖ వారిపై పెత్తనం చేస్తామంటే సహించేది లేదన్నారు. ప్రపంచ బ్యాంకు విధానాలకు తలొగ్గి సాల్ట్ వంటి పథకాలను అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను 9 కేటగిరీలుగా మార్చి విద్యార్థులను అయోమయాన్ని గురి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్లో ప్రాథమిక పాఠశాలలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యారంగ సంస్కరణల పేరిట అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 32 లక్షల నుంచి 29.50 లక్షలకు పడిపోయిందన్నారు. ఉద్యోగుల బకాయిలు, సరెండర్ లీవులు, గ్రాట్యుటీ, ఇతర అలవెన్సుల చెల్లింపులపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 10,300 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని నిలుపుకోవాలన్నారు.9,600 మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వం చెప్పినట్టు ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల నియామకంతో పాటు 1998, 2008 ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. అన్ని మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎంఈఓ, డీవైఈవో, డీఈవోలుగా నియమించేందుకు కామన్ సర్వీస్ రూల్స్పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలన్నారు. అక్టోబర్ 3న జరిగే కేబినెట్ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రయోజనాలు, విద్యారంగ మార్పుల కోసం ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. కార్పొరేట్లకు కారుచౌకగా ప్రభుత్వ భూములుపీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల శ్రేయస్సును విస్మరించిన ప్రభుత్వం కార్పొరేట్లకు కారుచౌకగా సమాజ ఆస్తులను కట్టబెడుతోందని ఆరోపించారు. మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సభలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర ఎన్జీవో సంఘం కార్యదర్శి టీవీ రమణ, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.ప్రభుదాస్, యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు సురేష్, ఏఎన్ కుసుమకుమారి, కోశాధికారి మోహనరావు, ప్రచురణల కమిటీ అధ్యక్షుడు ఎం.హనుమంతరావు, గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్, ఎం.కళాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మిగనూరులో కూటమికి షాక్
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి పార్టీలకు భారీ షాక్ తగిలింది. బీజేపీ, టీడీపీకి చెందిన ముఖ్య నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీలో చేరినవారిలో కేఆర్ మురహరిరెడ్డి (బీజేపీ ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి), కిరణ్కుమార్ (బీజేపీ ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు), మాల మధుబాబు (టీడీపీ మాజీ కౌన్సిలర్), చేనేత మల్లికార్జున (టీడీపీ ఎమ్మిగనూరు పట్టణ ప్రధాన కార్యదర్శి) ఉన్నారు. వారికి వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. వైఎస్సార్సీపీలో చేరిన కర్నూలు కాంగ్రెస్, టీడీపీ నాయకులు కర్నూలు నగరానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేసిన పీజీ రాంపుల్లయ్య యాదవ్ (లక్కీ2)తోపాటు మోనికారెడ్డి (51 డివిజన్ టీడీపీ కార్పొరేటర్), నరసింహులు యాదవ్ (స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్), లోక్నాథ్ యాదవ్ (డీసీసీబీ మాజీ డైరెక్టర్), ప్రదీప్ వెంకటేష్ యాదవ్ (రైల్వే బోర్డ్ మాజీ మెంబర్), షబ్బీర్ అహ్మద్, ఫైరోజ్ (8వ డివిజన్ టీడీపీ నాయకులు)లకు వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు నగర అధ్యక్షుడు అలీఖాన్, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
పెద్దల సభలో.. 'కుప్పం ఎమ్మెల్యే'!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా 143 ఎన్నికల హామీల ఎగవేతపై చంద్రబాబు సర్కారు వంచన, మోసాలను విపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు పెద్దల సభ సాక్షిగా ఎండగట్టడంతో అధికార పక్షం చర్చను అడ్డుకుంది. కూటమి సర్కారు అసమర్థత, మోసాలను విపక్షం గట్టిగా నిలదీయడంతో చర్చను పక్కదారి పట్టించింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పలు సందర్భాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి పులివెందుల ఎమ్మెల్యే అంటూ సంబోధిస్తున్న నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గురువారం శాసనమండలిలో సూపర్ సిక్స్పై చర్చ జరిగిన సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అని పేర్కొన్నారు. దీన్ని రికార్డుల నుంచి తొలగించాలని, ఆ వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ సభను అడ్డుకునేందుకు యత్నించారు. సీఎం చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అని పేర్కొనటాన్ని అధ్యక్షస్థానంలో ఉన్న మీరు ఖండించాలంటూ ప్యానల్ చైర్మన్ ఇషాక్ను మంత్రులు కొల్లు రవీంద్ర, డోలా బాలవీరాంజనేయులు డిమాండ్ చేశారు. సభ జరగకుండా అడ్డుకోవడం సరికాదని ప్యానల్ చైర్మన్ పదేపదే సూచించినా టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. మీరు అలా అంటే.. మేమిలానే అంటాంబొత్య సత్యనారాయణ టీడీపీ ఎమ్మెల్సీలు సభ జరగకుండా అడ్డుకోవడం, మంత్రుల అభ్యంతరాలపై మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్య సత్యనారాయణ దీటుగా స్పందించారు. ‘సభ్యుడు చెప్పింది అవాస్తవమైతే.. అప్పుడు మీరు రూలింగ్ ఇవ్వండి. రికార్డులు పరిశీలించండి. ఆ తరువాత ముందుకు వెళ్దాం’ అని సభాపతిని కోరారు. అనంతరం బొత్స తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ఆనాటి కుప్పం ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు..’ అని తమ సభ్యుడు సంబోధించారని గుర్తు చేశారు. ‘మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే అని టీడీపీ వాళ్లు పలుమార్లు సంబోధించలేదా? గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం మా నాయకుడిని పులివెందుల ఎమ్మెల్యే అని సంబోధిస్తారో.. అప్పటి దాకా మేం కూడా కుప్పం ఎమ్మెల్యే అనే సంబోధిస్తాం.. ఇందులో రెండో ఆలోచన లేదు’ అని తేల్చి చెప్పారు. ‘సూపర్ సిక్స్ను ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు మేనిఫెస్టోను ప్రకటించారు. ఇది వాస్తవం..! అని స్పష్టం చేశారు. టీడీపీ తెచ్చిన సంప్రదాయమే: మాధవరావుసభలో సభ్యులెవరైనా సరే ముఖ్యమంత్రిని.. ముఖ్యమంత్రి అనే సంబోధించాలి. మాజీ ముఖ్యమంత్రిని కూడా మాజీ ముఖ్యమంత్రి అనే సంబోధించాలి. టీడీపీ వారు ఏక వచనంతో మాట్లాడుతూ తెచ్చిన సంప్రదాయానికి అందరూ అలవాటు పడిపోతున్నారు’ అని ఎమ్మెల్సీ మాధవరావు వ్యాఖ్యానించారు. ‘సీఎంని కుప్పం ఎమ్మెల్యే అని అనడం సరికాదు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి. ఒకరిని ఒకరు రెచ్చగొట్టేలా మాట్లాడడం సంప్రదాయం కాదు. సభను గౌరవంగా నడపాలి’ అని బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. తాము జగన్మోహన్రెడ్డిని.. మాఫియా డాన్ అనో.. పులివెందుల పులికేశి అని అంటే మీరు ఒప్పుకుంటారా?’ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ భృతి, ఆడ్డబిడ్డ నిధి ఎక్కడ? ‘సూపర్ సిక్స్’పై చర్చలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు సూపర్ సిక్స్లో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి హామీలు ప్రధానమైనవని ఊరూరా ప్రచారం చేసి ఓట్లు వేయించుకుని.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండానే ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ అని సభ నిర్వహించి సంబరాలు ఎలా చేసుకుంటారని శాసన మండలిలో వైఎస్సార్సీపీ నిలదీసింది. గురువారం శాసన మండలిలో ‘సూపర్ సిక్స్’పై వైఎస్సార్సీపీ సభ్యుడు రమేష్ యాదవ్ చర్చను ప్రారంభించి మాట్లాడారు. ‘ఇప్పుడు సూపర్ సిక్స్ లేదు.. సూపర్ హిట్ లేదు. మీరిచి్చన హామీల్లో 20 లక్షల ఉద్యోగాలు.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతికి రూ.7,200 కోట్ల బడ్జెట్ కావాలి. ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టలేదు. 50 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్కు రూ.13 వేల కోట్లు కావాలి. ఈ హామీలు నమ్మి ఓట్లేసిన ప్రజలందరూ టీడీపీ నాయకులు ఎప్పుడొస్తారా.. అడుగుదామని ఎదురు చూస్తున్నారు’ అని మండిపడ్డారు. మేనిఫెస్టోనే మార్చేశారు ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో.. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చాక ఇంకో మేనిఫెస్టో అన్నది ఒక్క చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మాత్రమే కనిపిస్తోందని రమేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచి్చన హామీలన్నీ అమలు చేసి చూపించింది వైఎస్ జగన్ మాత్రమేనని చెప్పారు. ఉద్యోగాల కల్పనపై చర్చకు కూటమి సిద్ధమా అని సవాల్ విసిరారు.సభా నాయకుడైనా.. మాజీలైనా కించపరచడం మంచిది కాదుచైర్మన్ రూలింగ్ ఈ అంశంలో రికార్డులు పరిశీలించి నిర్ణయం వెలువరించిన తర్వాతే సభ కొనసాగించాలని టీడీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు పట్టుబట్టడంతో మండలి చైర్మన్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం చైర్మన్ మోషేన్రాజు దీనిపై ప్రకటన చేస్తూ ‘ఈ రోజు సభలో గందరగోళం మధ్య జరిగిన ఘటనలు అన్నీ సంప్రదాయాలకు విరుద్ధం. ఇరుపక్షాల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత సభ్యుడు అన్న మాటల్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మంత్రి మాట్లాడిన కొన్ని మాటలూ అభ్యంతరకరంగా ఉన్నాయి. మరోసారి వాటిని పరిశీలించాక రికార్డుల నుంచి తొలగిస్తాం. సభా సంప్రదాయాలు ఎవరూ ఉల్లంఘించడం మంచిది కాదు. సభా నాయకుడిని, గతంలో వివిధ పదవుల్లో సేవలు చేసిన వారు ఓడిపోయారనో లేదంటే రాజకీయాల్లో లేరనో, రిటైరయ్యారనో ఎవరినీ కించపరచడం మంచిది కాదు. అందరం ఈ రోజుతో మరిచిపోయి పార్టీలకు అతీతంగా వ్యవస్థలను, వ్యక్తులను, ఆయా హోదాల్లో ఉన్న వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది..’ అని రూలింగ్ ఇచ్చారు. కొత్త సభ్యులకు సభా నియమావళిపై అవగాహన కోసం ఈ సమావేశాల అనంతరం నిర్వహించే కార్యక్ర మంలో అందరూ పాల్గొనాలని సూచించారు. -
1,036 ఎకరాల ఆలయ భూమికి హైకోర్టు 'రక్ష'!
సాక్షి, అమరావతి: వేల కోట్ల రూపాయల విలువైన 1,036.37 ఎకరాల దేవదాయ భూమిని అక్రమంగా కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రను హైకోర్టు భగ్నం చేసింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప గ్రామంలోని 300 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ జగన్మోహన వేణుగోపాలస్వామి దేవస్థానానికి ఇదే మండలం నారికంపాడు గ్రామంలోని పలు సర్వే నెంబర్లలో ఉన్న ఈ భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్ను కోరుతూ దేవదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ ఏడాది ఆగస్టు 13న రాసిన లేఖ అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ భూమి విషయంలో ఎలాంటి థర్డ్ పార్టీ హక్కులను సృష్టించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు దేవస్థానాలకు చెందిన భూములను తీసుకునే విషయంలో ప్రభుత్వానికి ఏం అధికారం ఉందో తేలుస్తామంది. దీనిపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.అక్టోబర్ 27న తదుపరి విచారణఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా దేవదాయ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా కలెక్టర్, శ్రీ జగన్మోహన వేణుగోపాలస్వామి దేవస్థానం ఈవోలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది. హైకోర్టు ఉత్తర్వులు 28.35 ఎకరాలకే, కానీ..వ్యాజ్యానికి సంబంధించి 1,036.37 ఎకరాల భూమిలో 28.35 ఎకరాల భూమి తమదేనంటూ మేకా తనుజ్ రంగయ్య అప్పారావు మరికొందరు 2022లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ 28.35 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ఈ 28.35 ఎకరాలను మాత్రమే నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశిస్తూ గత ఏడాది అక్టోబర్ 18న తీర్పునిచ్చారు. ఈ తీర్పును అమలు చేయాలంటూ అప్పారావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను కోరారు. దీంతో కలెక్టర్ లక్ష్మీశ ఈ ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పును జిల్లా రిజిస్ట్రార్ ద్వారా దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే దేవదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ ఏకంగా దాదాపు రూ. వెయ్యి కోట్ల రూపాయల విలువచేసే 1,036.37 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్కు లేఖ రాశారు.అప్పీల్కూ వెళ్లని వైనంఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యాంశం ఏమిటంటే.. 28.35 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని, అది తమ భూమేనంటూ వాదించిన దేవదాయ శాఖ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ సైతం దాఖలు చేయలేదు. ఈ భూమిని కాజేయాలని కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కుట్రపన్నడంతో దేవదాయ శాఖ అప్పీల్ జోలికి వెళ్లకపోవడం గమనార్హం. 28.35 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు ఎలా రిజిస్టర్ చేశారు? :పిటిషనర్ వాదనలుఈ మొత్తం వ్యవహారంపై గంపలగూడెంకి చెందిన అన్నవరపు క్రాంతికుమార్, విజయవాడకు చెందిన న్యాయవాది అనంతలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ వాదనలు వినిపించారు. వాస్తవానికి 28.35 ఎకరాల భూమి దేవదాయ భూమి అయినప్పుడు, దానిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం ఎలా సాధ్యమని ఈ సందర్భంగా వాదించారు. నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ప్రైవేటు వ్యక్తుల పేరు మీద ఎలా రిజిస్టర్ చేశారో అర్థం కావడం లేదన్నారు. ఎకరాకు రూపాయి చొప్పున భత్యం: ప్రభుత్వ వాదనలుప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, జిల్లా కలెక్టర్ ఈ భూమిని ఎకరాకు రూ.1.04 చొప్పున ఏడాదికి రూ. 1,080 భత్యం చెల్లించే ఒప్పందంతో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 1991 నుంచి 2006 వరకు భత్యం చెల్లించడం జరిగిందన్నారు. ఆ తరువాత ఈ భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చడం జరిగిందని తెలిపారు.వెలుగులోకి తెచ్చిన సాక్షి1, 036.37 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ రాసిన లేఖ వెనుక కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ‘గుడి వెనుక గూడు పుఠాణీ’ పేరుతో ఈ సెప్టెంబర్ 12న ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రభుత్వ పెద్దల్లో కలవరం సృష్టించింది. -
‘చిరు’.. ఎవడు?
శాసనసభ వేదికగా మెగాస్టార్ చిరంజీవిని ఎమ్మెల్యే బాలకృష్ణ దారుణంగా అవమానించారు. చిరంజీవిని ఉద్దేశించి ‘ఎవడు..?’ అంటూ తూలనాడుతూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. కాగా అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యలను విదేశాల్లో ఉన్న చిరంజీవి తీవ్రంగా ఖండించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నాడు తనను సాదరంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత కొద్దిరోజులకు సినీ ప్రముఖులతో కలసి మరోసారి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి పరిశ్రమ సమస్యలపై చర్చించానని పేర్కొన్నారు. నాడు.. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ రేట్లు పెంచడానికి ఆ సమావేశమే కారణమైందని స్పష్టం చేశారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ వాడు.. వీడు.. సైకో..! అంటూ బాలకృష్ణ దుర్భాషలాడటాన్ని బట్టి ఆయన మానసిక స్థాయిపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.సాక్షి, అమరావతి: ‘వాడెవడు....?’ఇదీ చిరంజీవిని ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ గురువారం శాసనసభలో చేసిన వ్యాఖ్య! మెగాస్టార్ చిరంజీవిపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా తీవ్ర కలకలం సృష్టించాయి. బావ చంద్రబాబు మనసులో మాటనే బావమరిది బాలకృష్ణ వెల్లడించారన్నది స్పష్టమైంది. అందుకే సభలో అధికార కూటమి సభ్యులు ఎవరూ వ్యతిరేకించ లేదు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దీనిపై కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సీఎం చంద్రబాబు కూడా మౌనముద్ర దాల్చి బాలయ్య వ్యాఖ్యలను పరోక్షంగా సమర్థించారు. తద్వారా చిరంజీవి గురించి టీడీపీ అధికారిక విధానమే అదని శాసనసభ వేదికగా సంకేతాలిచ్చారు. బాలకృష్ణ వ్యాఖ్యలు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి. చంద్రబాబు, బాలకృష్ణ గతంలో చిరంజీవిని అవమానించిన ఉదంతాలను అందరూ గుర్తు చేస్తున్నారు. కాపు సామాజిక వర్గాన్ని దూషించిన మాటలను ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ హయాంలో చిరంజీవిని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాదరంగా ఆహ్వానించి గౌరవించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వెరసి బాలకృష్ణ శాసససభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలయ్య తీరుపై చిరు అభిమానులు, కాపు సామాజికవర్గం రగిలిపోతోంది.బాబు మనసులో మాట బాలయ్య నోట.. రాజకీయ వ్యూహంతోనే చిరుపై అభ్యంతరకర వ్యాఖ్యలుమెగాస్టార్ చిరంజీవిని పదే పదే అవమానించడం టీడీపీ విధానమన్నది మరోసారి స్పష్టమైంది. 2024 ఎన్నికల ముందు గత్యంతరం లేక కుట్రపూరిత మౌనం వహించిన చంద్రబాబు, బాలకృష్ణ ప్రస్తుతం ఏరు దాటాక చిరంజీవిని బోడి మల్లన్నను చేశారు. అందుకే సందర్భం కాకపోయినా సరే బాలకృష్ణ శాసనసభ వేదికగా చిరంజీవిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి అనే కనీస గౌరవం కూడా లేకుండా ‘వాడెవడు..?’ అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఈ శాసనసభ సమావేశాల్లో ఇప్పటివరకు మాట్లాడని బాలకృష్ణ గురువారం హఠాత్తుగా లేచి చిరంజీవిని అవమానించడం వెనుక టీడీపీ రాజకీయ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. లేదంటే చర్చ సినిమా రంగం అభివృద్ధి అంశం వరకే పరిమితమై ఉండేది. సినిమా రంగంపై చర్చ కాదని, చిరంజీవిని మరోసారి అవమానించడమే తమ లక్ష్యమని బాలకృష్ణ ద్వారా టీడీపీ చాటి చెప్పింది.అభ్యంతరం చెప్పని బాబు... వారించని డిప్యూటీ స్పీకర్బాలయ్య వ్యాఖ్యలకు టీడీపీ కూటమి అధికారిక ముద్రముందస్తు వ్యూహంతోనే చిరంజీవిని అవమానించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు యావత్ అధికార కూటమి తమ వ్యవహారశైలి ద్వారా స్పష్టం చేసింది. అందుకే బాలకృష్ణ వ్యాఖ్యలపై శాసనసభాపక్ష నేత హోదాలో చంద్రబాబు కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆయన సభలోనే ఉన్నప్పటికీ అసలు ఆ విషయమే పట్టనట్లుగా వ్యవహరించారు. ఇక చిరంజీవిని అవమానిస్తూ బాలకృష్ణ మాట్లాడుతుంటే యావత్ అధికార కూటమి సభ్యుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డు చెప్పలేదు. కొందరు టీడీపీ సభ్యులు ముసిముసిగా నవ్వుతూ కనిపించడం గమనార్హం. తద్వారా ఆ వ్యాఖ్యలను అధికార కూటమి సభ్యులు బహిరంగంగానే సమర్థించారు. ఇక స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలను అడ్డుకునేందుకు, వారించేందుకు కనీసం ప్రయత్నించ లేదు. ఆయన మైక్ను కట్ చేయనూ లేదు. ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, సభలో లేనివారి గురించి మాట్లాడటం సరికాదని వారించలేదు. అంతేకాదు.. బాలకృష్ణ తన ప్రసంగం ముగించిన తరువాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ ‘వెరీ గుడ్ సర్..’ అని అభినందించడం గమనార్హం. అంటే చిరంజీవిని అవమానించడం టీడీపీ అధికారిక విధానమేనని శాసనసభ సాక్షిగా విస్పష్టంగా ప్రకటించారు.మానసిక రోగిగా సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలయ్య2004లో ఇద్దరిపై రివాల్వర్తో కాల్పులుకేసు నుంచి తప్పించుకునేందుకే మెంటల్ సర్టిఫికెట్తాజా పరిణామాల నేపథ్యంలో బాలకృష్ణ మానసిక రోగి అనే విషయం మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2004లో హైదరాబాద్లో తన సన్నిహితులైన నిర్మాత బెల్లంకొండ సురేశ్, సిద్ధాంతి సత్యనారాయణ చౌదరిలపై ఆయన రివాల్వర్తో కాల్పులు జరిపారు. తన భార్య వసుంధర పేరుతో లైసెన్స్ ఉన్న రివాల్వర్తో తన నివాసంలోనే ఈ కాల్పులకు తెగబడ్డారు. అప్పట్లో ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు బాలకృష్ణ అప్పటికప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. తరువాత ఆయన మానసికస్థితి సరిగా లేదని అప్పటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు సర్టిఫికెట్ జారీ చేశారు. ఆయన ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. అమెరికాలో స్థిరపడ్డ కాకర్ల సుబ్బారావును ఆహ్వానించి హైదరాబాద్లోని నిమ్స్ డైరెక్టర్గా నియమించింది ఎన్టీ రామారావే. ఆ అనుబంధంతోనే బాలకృష్ణను కాల్పుల కేసు నుంచి తప్పించేందుకు మెంటల్ సర్టిఫికెట్ జారీ చేయడానికి ఆయన సహకరించారని పరిశీలకులు చెబుతున్నారు. తనకు ఇంతగా సహకరించిన కాకర్ల సుబ్బారావును సైతం తరువాత బాలకృష్ణ అవమానించారు. బసవతారకం ట్రస్ట్ నుంచి ఆయన్ను తొలగించారు. టీడీపీ అనుకూల చానల్ ఇంటర్వ్యూలో కాకర్ల సుబ్బారావు వెల్లడించిన అంశాల వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.గతంలోనూ చిరంజీవికి ఎన్నోసార్లు అవమానంజనసేన, కాపు సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు అదే బాబు, బాలయ్య విధానంచంద్రబాబు, బాలకృష్ణ గతంలో కూడా చాలాసార్లు చిరంజీవిని అవమానించారు. 2014–19లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చిరంజీవిని అవమానించిన ఉదంతాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఓ కార్యక్రమంలో చంద్రబాబు, బాలకృష్ణ మొదటి వరుస కుర్చీల్లో కూర్చుని ఉండగా.. చిరంజీవి ఓ మూలన నిలబడే కార్యక్రమాన్ని వీక్షించిన దృశ్యాలు వైరల్గా మారాయి. మెగాస్టార్ చిరంజీవికి కనీసం కూర్చునేందుకు కుర్చీ కూడా ఇవ్వకుండా నిలబెట్టడం విభ్రాంతి కలిగించింది. ఇక గతంలో పలు బహిరంగ సభల్లో పీఆర్పీ, జనసేన పార్టీల కార్యకర్తలను, కాపు సామాజికవర్గాన్ని బాలకృష్ణ దూషిస్తూ మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జనసేన పార్టీ కార్యకర్తలను ఓసారి ‘అలగా జనం..’ అని బాలకృష్ణ దూషించారు. మరోసారి ‘సంకర జాతి... కొడుకులు..’ అని కూడా పరుష పదజాలంతో దుర్భాషలాడిన వైనాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. చిరంజీవి మాతృమూర్తి గురించి కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ శాసనసభలో అవమానకరంగా మాట్లాడారు. ఇలా ప్రతిసారి... సందర్భం కాకపోయినా దాన్ని సృష్టించి మరీ చిరంజీవిని, ఆయన కుటుంబాన్ని అవమానించడం చంద్రబాబు, బాలకృష్ణతోపాటు యావత్ టీడీపీ అధికారిక రాజకీయ విధానంగా మారిందన్నది సుస్పష్టం. -
అల్పపీడనం.. 27కి వాయు‘గండం’
సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తొలుత బుధవారమే ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించగా, తాజా బులెటిన్లో గురువారం ఏర్పడినట్లు తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని శుక్రవారానికి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. శనివారం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. శనివారం ఉత్తరాంధ్ర, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. -
‘ చంద్రబాబు ప్రభుత్వంలో విద్య, వైద్యం పూర్తిగా నాశనం’
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఇది నిజంగా కూటమి ప్రభుత్వం సిగ్గు పడాల్సిన అంశమని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ‘చంద్రబాబు ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఆ రెండు రంగాలనూ తమ గుప్పెట్లో పెట్టుకుని పేదలను పీల్చి పిప్పి చేస్తున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం కోసం జగన్ పాడేరులో మెడికల్ కాలేజీ పెట్టారు. అలాంటి కాలేజీని కూడా అడవి బిడ్డలకు దూరం చేస్తున్నారు. అదేమని అడిగితే చట్టసభలోనే లోకేష్ పీకుడు భాష మాట్లాడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి మెడికల్ కాలేజీలు వెళ్లిపోతే పేద, మధ్య తరగతి ప్రజలు బతికేది ఎలా?, జగన్ సీఎం అయ్యాక మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వపరం చేస్తాం. మంత్రి సత్యకుమార్ అసత్యాలు మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా కాకుండా బీజేపీ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ నోరు తెరిస్తే పీకుడు భాష తప్ప మరేమీ మాట్లాడటం లేదు. బూతు మాటలు మానేసి మంచి మాటలు నేర్చుకుంటే మంచిది. చంద్రబాబు తనవారికి మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు సహించే పరిస్థితి లేదు’ అని స్పష్టం చేశారు. -
బాబును కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పేంటి?: బొత్స
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలపై చర్చ సందర్భంగా గురువారం శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఒకరు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మంత్రులు(TDP Minister) అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నానాయాగీ చేశారు. అయితే వాటిని విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్(MLC Ramesh Yadav) ఎన్నికల హామీలు ఇచ్చే సమయాన్ని ప్రస్తావిస్తూ.. ఆనాడు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నారని అన్నారు. అయితే ‘సభాపతిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అంటూ అవమానిస్తారా?’ అని టీడీపీ మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రమేష్ యాదవ్పై చర్యలు తీసుకోవాలని.. ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో.. రమేష్ యాదవ్ వ్యాఖ్యలను సీనియర్ నేత బొత్స సమర్థించారు. ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిన అనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అనలేదు. అందులో తప్పేముంది?. కావాలంటే ఆయన వ్యాఖ్యలపై రికార్డులు పరిశీలించుకోవాలి. అని అన్నారు. దీంతో.. టీడీపీ మంత్రలు మరింత ఊగిపోయారు. ఈ తరుణంలో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు కలుగజేసుకున్నారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యాలను రికార్డుల నుంచి పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి మండలి కాసేపు వాయిదా వేశారు. ఆపై.. 👉విరామ సమయంలో ఎమ్మెల్సీలు మీడియా చిట్చాట్లో పాల్గొన్నారు. ‘‘మాజీ సీఎం వైఎస్ జగన్ను ప్రతీసారి పులివెందుల ఎమ్మెల్యే అని అంటున్నారు. అందుకే ఇక నుంచి మా పంథా కూడా మారుతుంది. మండలిలో సెం, మంత్రులను ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగానే సంబోధిస్తాం. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ అని.. ఇక నుంచి ఇలాగే మాట్లాడతాం అని అన్నారు. 👉తాజా పరిణామాలపై మండలి చైర్మన్ మోషేన్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా మర్యాద పాటించేలా మండలి సభ్యులు వ్యవహరించాలి. కొందరు సభ్యులు, మంత్రులు మాట్లాడిన మాటలు రికార్డుల నుండి తొలగిస్తాం. గతంలో పదవులు, హోదాలలో పనిచేసిన వారిని గౌరవించుకోవాలి. ఒడిపోయినంత మాత్రాన గౌరవించకుండా మాట్లాడతాం అంటే సమంజసం కాదు. ఎవరూ ఎవ్వరినీ అగౌరవంగా మాట్లాడొద్దు అని సభ్యులకు సూచించారు. అనంతరం మండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: ఓజీ సినిమా కోసం అసెంబ్లీకి డుమ్మా! -
బొత్స సవాల్.. నీళ్లు నమిలిన పయ్యావుల.. వైఎస్సార్సీపీ వాకౌట్
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో పీఆర్సీ పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపుపై చర్చ కూటమి ప్రభుత్వానికి, వైఎస్సార్సీపీకి మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది. సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నీళ్లు నమిలారు. ఒకానొక దశలో సహనం కోల్పోయిన ఆయన రాజకీయ విమర్శలు దిగారు. దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) గట్టి కౌంటర్ ఇచ్చారు.పీఆర్సీ పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపుపై చర్చలో భాగంగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయేలు, కల్పలత తొలుత మాట్లాడారు. ఉద్యోగులకు 30 వేల కోట్లు ఉన్నాయి. నేటి వరకు పీఆర్సీ చైర్మన్ నియామకం లేదు. పరిశీలిస్తామంటూ మంత్రి దాట వేస్తున్నారు. నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. ప్రతీ పండుగకు ఉద్యోగులకు డీఏ కోసం ఎదురుచూస్తున్నారు.. ..ఈ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్ లో పెట్టింది.. పెన్షనర్స్ ఒక్కొక్కరికీ 15 నుంచి 20 లక్షల బకాయిలు పెట్టారు. గతంలో జగన్ వచ్చిన 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి బకాయిలు చెల్లించాలి. ఇప్పటివరకు ఉద్యోగులకు ప్రభుత్వం ఎంత చెల్లింపులు చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. దీనికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(AP Finance Minister Payyavula Keshav) సమధానమిస్తూ.. గతంలో రివర్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వీళ్ళదే(వైస్సార్సీపీ సభ్యులను చూపిస్తూ..). ఉద్యోగులు మాకు కొత్త జీతాలు వద్దు పాత జీతాలే ఇవ్వండని బ్రతిమిలాడుకునే పరిస్థితికి తెచ్చారు. గతంలో ఒక మంత్రి మీకు 15వ తేదీ కల్లా జీతాలు ఇస్తున్నాం కదా అని హేళనగా మాట్లాడారు. ప్రభుత్వ మార్పుకు ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఒప్పుకుంటున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం మాకు మద్దతు ఇచ్చారు. గత ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ము ప్రభుత్వం వాడేసుకుంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది వైసీపీ సభ్యుల తీరు. మా ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో చిత్తశుధ్దితోనే ఉంది. పీఆర్సీని కమిషన్ డిసైడ్ చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. పయ్యావుల వ్యాఖ్యలకు విపక్షనేత బొత్స సత్యనారాయణ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పీఆర్సీ కమిషన్ రద్దు చేశారు. వీళ్లు ఒత్తిడి చేశారో.. వాళ్లు రిజైన్ చేశారో తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తోంది. ఉద్యోగుల శ్రేయస్సు కోరే వారై అయితే ఇప్పటికే కమిషన్ వేసేవారు. ఆర్థిక మంత్రి అడిగిన ప్రశ్నకు రాజకీయ కోణంలో సమాధానం చెప్పారు. ప్రభుత్వాలు మారాయి.. అటు ఉన్నవాళ్ళు ఇటు వచ్చారు.. ఇటు ఉన్నవాళ్ళు అటు వెళ్ళారు. గత ప్రభుత్వ హయాంలో 27 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వంలో పీఆర్సీ కమిషన్ వేస్తారా.. ఫిట్మెంట్ ఇస్తారా అనేది చెప్పాలి. అప్పులు ఎవరు ఎంత చేశారు అనేది డిబేట్ లో మాట్లాడటానికి సిద్ధం. ఎవరు దేనికి ఎంత ఖర్చు పెట్టారో చర్చిద్దాం. అన్నీ రికార్డు ప్రకారమే మాట్లాడుకుందాం అని సవాల్ విసిరారు. అయితే దీనికి మంత్రి పయ్యావుల నుంచి స్పందన రాలేదు. దీంతో పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరుకు నిదర్శనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు.అంతకు ముందు.. రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, అలాగే మహిళలు, చిన్నారుల అదృశ్యాలపై చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. ఛైర్మన్ మోషేన్ రాజు దానిని తిరస్కరించారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. ఖబడ్దార్ -
ఈ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: వైఎస్ జగన్
ఈ పెద్దమనిషి ఎన్నికలప్పుడు ఏం చెప్పి వచ్చాడు.. వచ్చాక ఏం చేస్తున్నాడు? అప్పట్లో సంపద సృష్టిస్తానని పదే పదే ప్రతి మీటింగ్లో చెప్పారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మాత్రమే కాదు.. జగన్ చేసినవన్నీ కూడా చేస్తూ.. ఇంకా ఎక్కువే ఇస్తానన్నాడు. ఈ రోజు పరిస్థితి చూస్తే.. సంపద సృష్టించడం అంటే.. కేవలం తనకు, తన మనుషులకే సంపద సృష్టించడం అని తేటతెల్లం అయింది. రాష్ట్రానికి సంపద సృష్టించడం దేవుడెరుగు.. స్కామ్లు చేస్తూ ఉన్న సంపద ఆవిరి చేస్తున్న పరిస్థితి. మన ప్రభుత్వంలో అమలు చేసిన స్కీములన్నింటినీ రద్దు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు గాలికెగిరిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.ప్రభుత్వం అనేది మంచి విద్యా వ్యవస్థను, ప్రతి పేదవాడికి అందుబాటులో మంచి వైద్య వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని అనుకుంటాం. రైతుకు అండదండగా ఉంటుందనుకుంటాం. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఎలాంటి వివక్ష లేకుండా ఉండాలని, అలాంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు. ఓట్లు వేసినప్పుడు ఎవరైనా ఇవన్నీ కోరుకుంటారు. కానీ ఇప్పుడు విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్.. ఇలా ఏది తీసుకున్నా, కనపించేది తిరోగమనమే. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. చంద్రబాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ అని ప్రజలకు అర్థమైందన్నారు. సంపద సృష్టించి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేస్తానని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక స్కామ్లు చేస్తూ, ఉన్న సంపదను ఆవిరిచేస్తూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను సైతం రద్దు చేశారని మండిపడ్డారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేయకపోయినా, అమలు చేసినట్లు గోబెల్స్ ప్రచారం చేస్తూ విజయోత్సవాలు జరిపిస్తున్నారని దెప్పిపొడిచారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్య బట్టారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం తన అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రీజినల్ కో–ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శుల (పార్లమెంటు)ను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించి.. భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశా నిర్దేశం చేశారు. సజావుగా ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా దక్కవని చంద్రబాబుకు తెలుసని.. అందుకే సజావుగా ఎన్నికలు జరపడని.. కాబట్టి మీరందరూ ఇంకా గట్టిగా నిలబడి, పోరాడాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో వ్యతిరేకత ⇒ ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి, ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారు. ⇒ ఇప్పుడు రాష్ట్రంలో ఎవరిని కదిలించినా ‘ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్’ అంటున్నారు. ఇది నిజంగా వాస్తవం. పథకాలు మాయమైపోయాయి ⇒ ఈమధ్య ఈ పెద్ద మనిషి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో విజయోత్సవ సభ పెట్టబోతున్నప్పుడు వాళ్ల పాంప్లెట్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్కు, ఈ అడ్వర్టైజ్మెంట్కు మధ్య స్పష్టమైన తేడా ఉంది. కొన్ని పథకాలను ఎగ్గొట్టేశారు. ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంశాలు మారిపోయాయి. ⇒ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, ఏడాదికి రూ.18 వేలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ మొన్నటి అడ్వర్టైజ్మెంట్లో కనిపించలేదు. ⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేసేశామంటూ అడ్వర్టైజ్మెంట్స్లోని అంశాలను మార్చేసి అన్నీ చేసేశాం అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఈ స్థాయిలో మోసం చేసే వారు ప్రపంచ చరిత్రలో మరొకరు ఉండరు. ఇంటింటికీ బాండ్లు, సంతకాలతో ప్రతిజ్ఞలు⇒ ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ బాండ్లు పంపించారు. బాండ్లకు సంబంధించి ప్రతి ఫోన్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఆడబిడ్డ నిధి కింద ఇంత, తల్లికి వందనం కింద ఇంత, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, యువగళం (నిరుద్యోగ భృతి) కింద నెలకు రూ.3 వేలు, ఏడాదికి రూ.36 వేల చొప్పున.. ఆ కుటుంబానికి ఏటా ఇంత మొత్తం ఇస్తామంటూ బాండ్లు ఇచ్చారు.⇒ ఇంకా ‘చంద్రబాబు నాయుడు అనే నేను అధికారంలోకి వచ్చాక, భవిష్యత్ గ్యారెంటీలోని హామీలను త్రికరణ శుద్ధితో నెరవేరుస్తానని, ఎలాంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు, మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయబడుతుంది’.. అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు, వారి సంతకాలతో కూడిన ప్రతిజ్ఞా పత్రాలు ఇంటింటికీ పంపించారు. వాస్తవంగా ఏం చేశారంటే..⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో కొన్నింటిని కొద్దో గొప్పో అమలు చేసినా, వాటిని కూడా అందరికీ ఇవ్వకుండా కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత పీఎం కిసాన్తో కలిపే రూ.20 వేలు ఇస్తామన్నారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. ఆ తర్వాత రెండేళ్లకు కలిపి రూ.40 వేలకు గాను రూ.5 వేలే ఇచ్చారు. ⇒ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు. రెండేళ్లకు కలిపి ఆరు సిలిండర్లకు ఇచ్చింది ఒక్కటే. అది కూడా కొందరికే. రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు. కానీ అది కొన్ని బస్సులకే పరిమితం చేశారు. మనం ఇచ్చిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. చివరికి 30 లక్షల మంది పిల్లలకు కట్ చేశారు. రూ.15 వేలు ఇస్తానన్నది కాస్తా రూ.13 వేలు చేశారు. అదీ పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి రూ.10 వేలు, ఇంకొందరికి రూ.9 వేలు, మరి కొందరికి రూ.8 వేలు మాత్రమే ఇచ్చారు. ఇలా చంద్రబాబు పాలనలో ప్రతి అడుగులోనూ మోసం, అబద్ధమే కనిపిస్తోంది. రైతులకు అంతులేని కష్టాలు⇒ వ్యవసాయానికి సంబంధించి ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. యూరియా దొరకని దుస్థితి. మార్కెట్లో బ్లాక్ చేసేశారు. రేట్లు పెంచేశారు. దళారీలతో ఈ ప్రభుత్వం చేతులు కలిపినందువల్లే ఈ దుస్థితి. ప్రైవేటుకి కోటా పెంచేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)కు వచ్చే సరుకును వీళ్ల కార్యకర్తలు ఎత్తడం మొదలుపెట్టారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ అనేది కనపడకుండా పోయింది. రైతన్నకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయిన పరిస్ధితి. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా పోయిన సంవత్సరం ఈ ప్రభుత్వం కట్టలేదు. మన ప్రభుత్వ ఐదేళ్లలో ఏనాడన్నా ఇలాంటి పరిస్థితి రైతు చూశాడా? ⇒ మన ప్రభుత్వంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు రావడమే కాకుండా, రైతులకు ఆర్బీకేల ద్వారా, ఈ క్రాప్ ద్వారా మద్దతు ధర కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. ఇంకా జీఎల్టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్టేషన్) కింద అదనంగా ఎకరాకు దాదాపు రూ.10 వేలు ఇచ్చిన పరిస్థితులు మన ప్రభుత్వంలో కనిపించాయి.ఈ ధాన్యం ప్రజలు తినరట.. ⇒ రైతులు పండించిన ధాన్యం తినే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు చెప్తాడు. అందుకే ధాన్యానికి గిట్టుబాటు ధర లేదంటున్నాడు. ఈ ధాన్యమంతా ఇథనాల్ (లిక్కర్లో వినియోగించే) తయారు చేసే దానికి వాడతారంటున్నాడు. అంటే రాబోయే రోజుల్లో కూడా ధాన్యం సేకరణలో నా విధానం ఇదేనని చెబుతున్నట్టేగా? ధాన్యానికి ఇంకెప్పుడూ గిట్టుబాటు ధర రాదు.. పండించడం మానేయండి.. అని చెబుతున్నాడు. ⇒ కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, అరటి, టమాటా, కోకో, చీనీ, మామిడి.. ఇలా ఏ పంటకూ ఈ రోజు గిట్టుబాటు ధర లేదు. కారణం.. దగ్గరుండి ఆర్బీకే వ్యవస్థను, ఈ క్రాప్ను నిర్వీర్యం చేయడమే.⇒ నాడు మన ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటూ రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కొనుగోలులో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు తోడుగా నిలిచాం. అధ్వానంగా విద్యా రంగం ⇒ విద్యా రంగంలో నాడు–నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్ చదువులు గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నీరుగారిపోయింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. ఇంగ్లిష్ మీడియం చదువులు పిల్లలకు ఎండమావి అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే.. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోతే ఆ త్రైమాసికానికి వెంటనే మన ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను మన ప్రభుత్వం గొప్పగా అమలు చేసింది.⇒ 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంతే.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఫినిష్. అప్పటి నుంచి ఈ సెప్టెంబరు వరకు 7 క్వార్టర్స్కు సంబంధించి, ఒక్కో క్వార్టర్కు రూ.700 కోట్లు.. ఇలా మొత్తం రూ.4900 కోట్ల బకాయిలు ఉన్నాయి. కానీ, ఈ పెద్దమనిషి రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ⇒ గత ఏడాది ఏప్రిల్లో ఎన్నికల కోడ్ వల్ల జగనన్న వసతి దీవెన ఆగిపోయింది. వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా ఇవ్వడం లేదు. అలా వసతి దీవెన కింద ఈ ప్రభుత్వం రూ.2,200 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది సున్నా. ఈ రోజు పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి. వైద్య రంగం నిర్వీర్యం⇒ ఆరోగ్యశ్రీలో మన ప్రభుత్వంలో రూ.25 లక్షల వరకు ప్రతి పేదవాడు దర్జాగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. ఆ రోజు 3 వేలకు పైగా ప్రోసిజర్లకు వైద్యం ఉచితంగా అందించాం. ఈ పెద్ద మనిషి ఆరోగ్యశ్రీకి గత 16 నెలలుగా బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నడపాలంటే ప్రతి నెలా రూ.300 కోట్లు అవసరం. ఈ 16 నెలల్లో దాదాపు రూ.4 వేల కోట్లు బకాయి పెట్టారు. దాంతో నెట్వర్క్ ఆస్పత్రులు బోర్డు తిప్పేశాయి. పేదవాడు వైద్యం కోసం ఈరోజు ప్రైవేట్ ఆçస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి. ⇒ రోగికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో డాక్టర్లు సూచించినంత కాలం రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల చొప్పున ఇచ్చి మన ప్రభుత్వంలో గొప్ప సహాయంగా ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని అమలు చేశాం. సంవత్సరానికి రూ.450 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ 16 నెలల్లో అయ్యే ఖర్చు దాదాపు రూ.600 కోట్లు ఉంటుంది. కానీ చంద్రబాబు ఈ పథకానికి ఇచ్చింది సున్నా. అమరావతికి రూ.2 లక్షల కోట్లట! ⇒ చంద్రబాబు ప్రాజెక్టు రిపోర్టు ప్రకారమే అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్లు కావాలంటున్నాడు. మొదటి దఫా 50 వేల ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున మౌలిక వసతుల కల్పనకు ఖర్చవుతుందంటున్నారు. ఇది రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ కోసం మాత్రమే. గత చంద్రబాబు ప్రభుత్వంలో వీటి కోసమే రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాడు. ఇంకా రూ.95 వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు చేస్తారు? ⇒ ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారని ప్రజలు ప్రశ్నిస్తుంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఇంకా 50 వేల ఎకరాలు కావాలంటున్నాడు. ఈ 50 వేల ఎకరాలకు మరో లక్ష కోట్లు కావాలని ఎస్టిమేషన్ వేశాడు. మొత్తంగా రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? రూ.5 వేల కోట్లు ఖర్చు చేయడానికి డబ్బు లేదట! చంద్రబాబూ అసలు నీవు మనిషివేనా? ఇక లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అంతులేని అవినీతి.. యథేచ్ఛగా దోపిడీ⇒ కూటమి పాలనలో అవినీతి లేనిది ఎక్కడో చెప్పాలి. మద్యం, ఇసుక, లాటరైట్, బాక్సైట్, క్వార్ట్›జ్, సిలికా, మట్టి దేన్నీ వదలడం లేదు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్లు. కుట్టుమిషన్ల నుంచి మొదలు పెడితే.. ఎకరా భూమి 90 పైసలే. మన ప్రభుత్వంలో రూ.2.40 చొప్పున యూనిట్ విద్యుత్ కొనుగోలు చేస్తే, వీళ్లు అదే యూనిట్ రూ.4.60తో కొనేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏది చూసినా స్కామ్లే. ⇒ మన హయాంలో ప్రభుత్వ ఖజానాకు ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రోజు ఖజానాకు రూపాయి కూడా రావడం లేదు. ఇసుక రేటు మాత్రం మన హయాంలో కన్నా డబుల్ అయ్యింది. ఆ ఆదాయం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. జీఎస్టీ ఎందుకు తగ్గుతుందంటే.. రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గబట్టే కదా? ⇒ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇది మనం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 57 శాతం. కొత్తగా స్కీమ్లు లేవు, పాత స్కీమ్లన్నీ రద్దు చేశారు. మరి ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది.. ఎవరి జేబుల్లోకి పోతోంది?మెడికల్ కాలేజీల అమ్మకం అత్యంత హేయం⇒ ఈ రోజు చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టాడు. బుద్ధి, జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని ఆలోచన చేస్తాడా? అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఎక్కడైనా మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వాలే ఎందుకు నడుపుతాయో అందరూ ఆలోచించాలి. గవర్నమెంట్ వాటిని నడపకపోతే నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో పేదలు తమ పిల్లలను చదివించగలిగే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ ఆస్పత్రులు లేకపోతే పేదలకు ఉచితంగా వైద్యం అందడం సాధ్యమేనా?. గవర్నమెంట్ బస్సులు నడపకపోతే ప్రజలు ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించగలరా? అందుకోసమే దేశ వ్యాప్తంగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్కూళ్లు, ఆసుపత్రులు, బస్సులు నడుపుతున్నారు.⇒ ఆ రోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ టీచింగ్ ఆస్పత్రిని తీసుకువచ్చాం. అంటే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకువచ్చాం. ఈ టీచింగ్ ఆస్పత్రుల్లో పనిచేసే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ మెడికల్, ఎంబీబీఎస్ విద్యార్థులు, నర్సులు, వివిధ సేవలు చేసే వ్యక్తులు మెడికల్ కాలేజీలో అందుబాటులో ఉంటారు. అంతమంది అందుబాటులో ఉంటారు కాబట్టి పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుంది. అలాంటి గొప్ప విప్లవాన్ని మన ప్రభుత్వంలో తీసుకువచ్చాం. ⇒ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. మన పిల్లలు చాలా మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. మిగిలిన వారికి కూడా ప్రైవేట్తో పోలిస్తే తక్కువ రేటుకే సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉంటాయి. ఇది రెండో అడ్వాంటేజ్. ఇలాంటి కార్యక్రమాన్ని.. చంద్రబాబు స్కామ్ల కోసం దుర్వినియోగం చేస్తూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేక చేతులెత్తేశాడు. ⇒ రూ.8 వేల కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి మన హయాంలోనే ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. మరో రెండు కాలేజీలు పులివెందుల, పాడేరు చంద్రబాబు ప్రభుత్వం రాకముందే ప్రారంభోత్సవానికి సిద్ధం చేశాం. వాటికి కూడా అనుమతులు వచ్చాయి. దాదాపుగా 17 కాలేజీలను మనం మొదలుపెట్టి వాటిలో 7 కాలేజీలను పూర్తి చేయగలిగాం. ఇంకో రూ.5 వేల కోట్లు అంటే, ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ఈ కాలేజీలన్నీ పూర్తి అవుతాయి కదా.. కానీ చంద్రబాబు అందుకు సిద్ధంగా లేరు. -
చంద్రబాబూ.. మా భూముల జోలికొస్తే ఖబడ్దార్
సాక్షి, అమరావతి: పారిశ్రామికీకరణ పేరిట టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు, వ్యవసాయ కార్మికులు చేపట్టిన ఆందోళనతో బుధవారం విజయవాడ దద్దరిల్లింది. ఆందోళన చేపట్టినవారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు పలువురు నేతల్ని అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత వదిలేశారు. చివరికి కొందరు ప్రతినిధులు అసెంబ్లీలో మంత్రిని కలిసేందుకు అనుమతించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మా భూముల జోలికొస్తే ఖబడ్దార్.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరించారు. బలవంతంగా భూసేకరణ జరిపితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఏపీ వ్యవసాయ కార్మిక, రైతుసంఘాలు ఇచ్చిన ‘చలో విజయవాడ’ పిలుపుతో అన్ని జిల్లాల నుంచి వచ్చిన రైతులు, వ్యవసాయ కార్మికులు తొలుత విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఆందోళనకు దిగారు. తమ గోడు వినేందుకు రెవెన్యూ మంత్రి లేదా ఉన్నతాధికారులు రావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అక్కడి నుంచి ఛలో అసెంబ్లీ చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అప్సర హొటల్ జంక్షన్లో ఏలూరు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకి దిగారు. దాదాపు గంటసేపు వాహనాల రాకపోకలు స్తంభించాయి. అనంతరం రైతులు, వ్యవసాయ కార్మికులు ఛలో రాజ్భవన్ అంటూ గవర్నర్ బంగ్లా వైపు ర్యాలీగా తరలివెళ్లారు. రాజ్భవన్ సమీపంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారికి, పోలీసులకు తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసులు ముఖ్యనేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల ఆందోళన మరింత తీవ్రతరం అవుతుండటంతో ఉన్నతాధికారులు స్పందించారు. కొద్దిమంది ప్రతినిధుల్ని అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం మంత్రిని కలిసిన నేతలు మాట్లాడుతూ రైతులతో పాటు రైతుకూలీల అనుమతి లేకుండా భూములు తీసుకోబోమని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రివా.. రాజకీయ బ్రోకర్వా? ధర్నాచౌక్లో వ్యవసాయ కార్మికసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రం చంద్రబాబు జాగీరా అని ప్రశ్నించారు. కరేడులో 20 వేల ఎకరాలు, కుప్పంలో రెండువేల ఎకరాలు కావాలంటున్నారని చెప్పారు. కరేడులో ఐదువేల ఎకరాలు, కుప్పంలో 1,500 ఎకరాలు, అమరావతిలో 50 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకొన్నారని చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా భూమి ఇచ్చేందుకు సిద్ధంగా లేడని చెప్పారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలకు 100 నుంచి 200 ఎకరాలున్నాయని, ఆ భూములు తీసుకుని ఏ ప్రాజెక్టు కావాలంటే ఆ ప్రాజెక్టు కట్టుకోవచ్చని చెప్పారు. చంద్రబాబూ నువ్వు ముఖ్యమంత్రివా.. రాజకీయ బ్రోకర్వా.. అదాని, అంబానీలకు గుమాస్తావా? అంటూ నిలదీశారు. కరేడులో ఎకరం కోటి రూపాయలైతే.. అప్పనంగా కాజేయాలని చూస్తున్నారన్నారు. వంద ఎకరాలు సరిపోయే ఇండోసోల్కు ఎనిమిదివేల ఎకరాలు కావాలనడం.. రియల్ ఎస్టేట్ కోసం కాదా? అని నిలదీశారు. అంతర్జాతీయ విమానాశ్రయానికే 500 ఎకరాలు చాలని, అలాంటిది కుప్పం ఎయిర్పోర్టుకు రెండువేల ఎకరాలు కావాలా? అని ప్రశ్నించారు. మా పేదల జోలికి వస్తే ఖబడ్దార్ చంద్రబాబూ.. అంటూ హెచ్చరించారు. ఈ ఆందోళనలోఆయా సంఘాల రాష్ట్ర నేతలు వి.కృష్ణయ్య, బలరాం, హరిబాబు, దడాల సుబ్బారావు, కె.ప్రభాకర్రెడ్డి వై.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.పాల రైతు సంఘ నేతల అరెస్టు హేయం విశాఖ డైరీలో అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనసభ కమిటీ నివేదిక తక్షణమే ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ధర్నాలో పాల్గొన్న రైతులను అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన చర్య అని ఏపీ రైతు సంఘం అధ్యక్ష,ప్ర«దాన కార్యదర్శులు వీ.కృష్ణయ్య, కే.ప్రభాకరరెడ్డి ఓ ప్రకటనలో ఖండించారు. -
అక్టోబర్ 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా బంద్
సాక్షి, అమరావతి: పెండింగ్ బిల్లులపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమానులు సిద్ధమయ్యాయి. వీరు ఈనెల 15 నుంచి పథకం కింద ఉచిత ఓపీడీ, ఇన్వెస్టిగేషన్స్ సేవలు నిలిపేసి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేకపోవడంతో సమ్మెను మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 10 నుంచి పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలన్నింటినీ నిలిపేసి ఉద్యమం ఉధృతం చేయబోతున్నట్టు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ప్రకటించింది. విజయవాడలో బుధవారం జరిగిన ఆశ జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సంఘం ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. క్లెయిమ్ల పరిశీలనకు 400 రోజులా? నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3,000 కోట్లకుపైగా బకాయిపడిందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్కుమార్ తెలిపారు. రూ.670 కోట్లు బిల్లులు సీఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్నాయని, మిగిలిన బిల్లులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో పరిశీలన దశలో ఉన్నాయని ఇటీవల వైద్య శాఖ మంత్రే స్వయంగా ప్రకటించారని అన్నారు. నిబంధనల ప్రకారం ఆస్పత్రుల్లో అందించిన చికిత్సలకు సంబంధించిన క్లెయిమ్లను ప్రభుత్వం 45 రోజుల్లో సెటిల్ చేయాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.2వేల కోట్లకు పైగా బిల్లులను 400 రోజులుగా పరిశీలన దశలోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో ఆస్పత్రుల యజమానులు అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆస్పత్రులను నిర్వహించలేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఇప్పటికే సరఫరా చేసిన మందులు, వైద్య పరికరాలకు బిల్లులు కట్టకపోవడంతో అప్పుపై సరఫరా చేయలేమని కంపెనీలు చెబుతున్నాయన్నారు. బయట, బ్యాంకుల్లోనూ అప్పు పుట్టడం లేదన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలన్నీ ఆపేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని, పాక్షికంగా సేవలు ఆపేసి సమ్మెలోకి వెళ్లామని పేర్కొన్నారు. ప్రజల గురించి తాము ఆలోచించి పాక్షికంగా సమ్మెలోకి వెళితే అదే రోజున రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడా ఆగలేదని మంత్రి ప్రకటన చేయడం బాధించిందన్నారు. పెద్ద ఎత్తున బకాయిలతో 50, 100 పడకల ఆస్పత్రుల మనుగడ కష్టతరం అవుతోందన్నారు. రూ.670 కోట్లు విడుదల చేశాకే చర్చలు పెండింగ్ బకాయిల కోసం తాము సమ్మెకు పిలుపునిచి్చన ప్రతిసారీ ప్రభుత్వం చర్చలకు పిలిచి కొంత బిల్లులు ఇస్తామని హామీ ఇవ్వడం అనంతరం అమలు చేయకపోవడం పరిపాటిగా మారిందని విజయ్కుమార్ తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్న రూ.670 కోట్లు బిల్లులు విడుదల చేసి, మిగిలిన నిధుల విడుదలకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాకే ప్రభుత్వంతో చర్చలకు వెళతామని తేల్చిచెప్పారు. మొత్తంగా రూ.3,000 కోట్లకు పైగా బకాయి పెట్టి తాము సమస్య లేవనెత్తిన ప్రతీసారి సీఎఫ్ఎంఎస్లో ఉన్న మొత్తాన్నే బకాయి కింద సర్కారు చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. ఆస్పత్రులకు పూర్తి స్థాయిలో నిధులన్నీ చెల్లించాకే బీమా విధానంలోకి వెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. పాత బకాయిలు చెల్లించకుండానే బీమా విధానంలోకి వెళితే ఆస్పత్రులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీమా విధానం అమలుపైనా ప్రభుత్వం శాస్త్రీయ అధ్యయనం చేయాలన్నారు. ప్రస్తుత ప్యాకేజీ రేట్లతోనే బీమా విధానానికి వెళితే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందవని వివరించారు. ఆశ ప్రతినిధి డాక్టర్ మురళీ మాట్లాడుతూ పెద్ద మొత్తంలో బకాయిలతో ఆస్పత్రుల మనుగడ కష్టతరమవుతున్న పరిస్థితుల్లో వైద్య రంగం అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే ఆస్పత్రులు సంక్షోభంలో ఉండటంతో రాష్ట్రంలో భారీ కార్పొరేట్ ఆస్పత్రుల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఇప్పటికే ఆస్పత్రులకు రూ.3,000 కోట్లు చెల్లించలేని పరిస్థితుల్లో బీమా అమలుకు బడ్జెట్ సరిపోతుందో లేదో ఆలోచించాలన్నారు. సరైన ప్రణాళిక లేకుండా ముందుకెళితే ప్రజలు ఇబ్బందుల్లో పడతారని వివరించారు. -
బరి తెగించిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రెడ్బుక్ వేధింపులను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తీవ్రతరం చేసింది. అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు మార్గదర్శకాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టుల పరంపరకు తెగించింది. భావప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రకు ఈసారి సీఐడీని అస్త్రంగా చేసుకుంది. పక్కా పన్నాగంతో ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఆ ఒక్క ఎఫ్ఐఆర్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతోంది. సీఐడీ, డీజీపీ కార్యాలయాల పర్యవేక్షణలో బరితెగించి సాగుతున్న రెడ్బుక్ రాజ్యాంగ వేధింపుల కుట్ర ఇలా ఉంది... ఒకే ఒక ఎఫ్ఐఆర్... అన్ లిమిటెడ్ అక్రమ కేసులు రాష్ట్రంలో గతేడాది చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రజల భావ ప్రకటన హక్కును కాలరాయడమే పనిగా పెట్టుకుంది. ఏడాది కాలంలోనే సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా ఏకంగా 282 పోలీసు కేసులు నమోదు చేయడంతోపాటు 84 మందిని అరెస్టు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వ నియంతృత్వ వైఖరి, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనపై హైకోర్టు, సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించాయి. పోలీసులను గట్టిగా మందలించాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలను వేధించేందుకు మరో కొత్త ఎత్తుగడ వేసింది.ఆ కుట్రలకు ఈసారి సీఐడీ విభాగాన్ని అస్త్రంగా చేసుకుంది. సోషల్ మీడియా పోస్టులపై ఈ నెల 9న సీఐడీ ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎవరిపై కేసు నమోదు చేశారన్నది స్పష్టం చేయకుండా ఫేస్బుక్ యూఆర్ఎల్, ఇన్స్ట్రాగామ్ యూఆర్ఎల్లను నిందితుల కాలమ్లో పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రభుత్వ కుతంత్రాన్ని స్పష్టం చేస్తోంది. అంటే తాము లక్ష్యంగా చేసుకున్న సోషల్ మీడియా కార్యకర్తల్లో ఎవర్నయినా అక్రమంగా అరెస్టు చేసేందుకే ఈ కుయుక్తి పన్నిందన్నది సుస్పష్టం. అక్రమ అరెస్టులకు తెగబడుతున్న సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత డీజీపీ కార్యాలయం, సీఐడీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్రమ అరెస్టులకు తెగబడటం మొదలెట్టాయి. డీఎస్పీలు, ఇతర అధికారులతో కూడిన ఈ బృందాలకు ఐజీ ఆకే రవికృష్ణ నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. డీజీపీ, అదనపు డీజీ(శాంతి భద్రతలు) ఈ వ్యవహారాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. స్థానిక పోలీసులకు కనీస సమాచారం లేకుండానే అక్రమంగా అరెస్టులకు తెగబడాలని కార్యాచరణ రూపొందించారు. ఈ అరాచక పర్వానికి ఈ ఘటనలే మచ్చుకు ఉదాహరణ.. గుంటూరులో నిర్బంధంలో సోషల్ మీడియా కార్యకర్త.. సోషల్ మీడియా కార్యకర్త పాలక ప్రతాప్రెడ్డిని గుంటూరులో బుధవారం అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఎవరు అదుపులోకి తీసుకున్నారు..? ఎక్కడికి తరలించారు? అనే కనీస సమాచారం కూడా లేదు. సోషల్ మీడియాలో ఏ పోస్టుపై అభ్యంతరంతో అదుపులోకి తీసుకున్నారో కూడా తెలియదు. సీఐడీ బృందాలుగా భావిస్తున్న అధికారులు గుంటూరు బస్ స్టేషన్ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. సోషల్ మీడియా కార్యకర్త స్నేహితుడినీ.... సోషల్ మీడియా కార్యకర్తలనే కాదు.. వారి స్నేహితులను కూడా అక్రమంగా అరెస్టు చేస్తుండటం చంద్రబాబు సర్కారు పాశవిక విధానాలకు నిదర్శనం. నెల్లూరు జిల్లాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త భరత్ చంద్రను అక్రమంగా అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు యత్నించారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ భరత్ సోదరి ప్రీతిని పది రోజుల క్రితం ఆత్మకూరు పోలీసుస్టేషన్లో సీఐడీ పోలీసులు నిర్బంధించారు. భరత్ తల్లి, అక్క, చెల్లెలు ఫోన్లు సీజ్ చేశారు. న్యాయవాదుల చొరవతో భరత్ సోదరి విడుదలయ్యారు. మహిళలను సైతం వేధిస్తుండటంపై నివ్వెరపోతున్నారు. భరత్ చంద్ర జాడ తెలియకపోవడంతో అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురానికి చెందిన ఆయన స్నేహితుడు బులగొండ సాయి భార్గవ్ను సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేసేందుకు తెగబడటం విస్మయపరుస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీలో స్నేహితులని, ఇద్దరి మధ్య బ్యాంకు లావాదేవీలున్నాయనే సాకుతో ఆయన్ను సీఐడీ అదుపులోకి తీసుకుని అమరావతికి తరలించింది.వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరులో ఓ సోషల్ మీడియా కార్యకర్తను అక్రమంగా అరెస్టు చేసేందుకు సీఐడీ బృందాలు ప్రయతి్నస్తున్నాయని తెలుస్తోంది. రానున్న రోజుల్లో అక్రమ అరెస్టులను మరింత తీవ్రతరం చేసేందుకు సీఐడీ సన్నద్ధమవుతుండటం ప్రజాస్వామికవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీం తీర్పు బేఖాతర్.. హైకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన రెడ్బుక్ వేధింపులే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తోంది. హైకోర్టు మార్గదర్శకాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు చేయవద్దని సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చింది. అటువంటి కేసుల్లో అరెస్టు చేస్తే రిమాండ్ విధించవద్దని కూడా న్యాయస్థానాలకు నిర్దేశించింది. ఈమేరకు ‘అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్’ కేసుల్లో విస్పష్టంగా పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వం ఆ తీర్పును ఉల్లంఘిస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులతో విరుచుకుపడింది. ఏడాది కాలంలోనే 253 అక్రమ కేసుల్లో 822 మందికి నోటీసులిచ్చింది. 86 మందిని అక్రమంగా అరెస్టు చేసింది. ఈ అక్రమ అరెస్టులపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ ఏడాది జూలైలో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సోషల్ మీడియా కేసుల్లో అక్రమ అరెస్టులు చేయవద్దని స్పష్టం చేసింది. అటువంటి కేసుల్లో రిమాండ్ విధించవద్దని మేజి్రస్టేట్లను ఆదేశించింది.ఈమేరకు సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ మేజి్రస్టేట్లకు స్పష్టమైన మార్గదర్శకాలిచ్చింది. ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. వీటిపై 14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలంది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం, సీఐడీ విభాగం దీన్ని లెక్క చేయకుండా బరి తెగించాయి. సోషల్ మీడియా పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే బీఎన్ఎస్ 35 (ఐపీసీ 41 ఏ) కింద నోటీసులిచ్చి వివరణ తీసుకోవాల్సి ఉండగా ఆ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. అక్రమ అరెస్టులతో అరాచకంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టు సవేంద్రరెడ్డిని తాడేపల్లిలో అక్రమంగా అదుపులోకి తీసుకుని ఏకంగా హైకోర్టునే బురిడీ కొట్టించేందుకు యత్నించడం సర్వత్రా తీవ్ర విభ్రాంతి కలిగించింది. హైకోర్టు తక్షణం స్పందించడంతో ఆయన్ను పోలీసులు విడిచిపెట్టారు.