Amaravati
-
డాల్ఫిన్.. నాట్ ఫైన్!
దేశంలో నదీ డాల్ఫిన్ల సంఖ్య ఒక పక్క పెరుగుతున్నా, మరోవైపు వాటి మనుగడ సైతం ప్రశ్నార్థకమవుతోంది. ఉత్తర భారతంలోని గంగా, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలే ప్రధానంగా వీటికి ఆవాసంగా ఉన్నాయి. తాజా సర్వే ప్రకారం, దేశీయ నదుల్లో 6,327 డాల్ఫిన్లను గుర్తించారు. వీటిల్లో రెండు రకాలుృ గంగాటిక్ , సింధు డాల్ఫిన్లుగా పరిగణిస్తున్నారు. ఈ జాతులను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) అంతరించిపోతున్న జాతులుగా వర్గీకరించడం ఆందోళన కలిగిస్తోంది. - సాక్షి, అమరావతి నదుల్లోకి ఎలా? మిలియన్ ఏళ్ల క్రితం ఇవి సముద్ర డాల్ఫిన్ల నుంచి ఉద్భవించినట్టు భావిస్తున్నారు. ఒకప్పుడు దక్షిణాసియాలో లోతట్టు ప్రాంతాలను సముద్రాలు ముంచెత్తినప్పుడు, ఈ డాల్ఫిన్లు నదుల్లోకి చేరుకున్నట్టు అంచనా. సముద్రంలో నివసించే డాల్ఫిన్ల నుంచి తమకు తాము వేరుచేసుకుని నివసించగలిగే లక్షణాలను అభివృద్ధి చేసుకున్నట్టు తెలుస్తోంది. సముద్రంలోని డాల్ఫిన్లకు గంగా నది డాల్ఫిన్లకు కొన్ని అంశాల్లో వ్యత్యాసాలు కనిపిస్తాయి. నది డాల్ఫిన్లు నీటిలో ఎగసి దూకలేవు. నిటారుగా కూడా ఈత కొట్టలేవు. పక్కకు ఈదుతాయి. ఎక్కువ సేపు నీటి అడుగు భాగానే ఉంటాయి. పొడవైన ముక్కు కలిగి, దాదాపు దృష్టి సామర్థ్యం తక్కువతో మనుగడ సాగిస్తాయి. జాతీయ జల జంతువుకు సమస్యలు.. » ఆనకట్టల నిర్మాణం. » డాల్ఫిన్లను వాటి మాంసం, బ్లబ్బర్ (మందపాటి కొవ్వు పొర) కోసం వేటాడుతున్నారు. వాటి నుంచి నూనెలు తీసి చేపలు పట్టడానికి ఎరగా ఉపయోగిస్తున్నారు. » చేపల వేట తీగల్లో చిక్కుకుని కొన్ని మృత్యువాత పడుతున్నాయి. » గత దశాబ్దంగా పుంజుకుంటున్న నది క్రూయిజ్ పర్యాటకం. క్రూయిజ్ల నుంచి వచ్చే శబ్దాలను తట్టుకుని డాల్ఫిన్లు మనుగడ సాగించడం కష్టంగా మారుతోంది. చైనాలోని యాంగ్జీ నదిలో బైజీ డాల్ఫిన్ల విషయంలో ఇదే జరిగింది. »దృష్టి సామర్థ్యం సరిగా లేకపోవడంతో ఈ డాల్ఫిన్లు నెమ్మదిగా ఈత కొడతాయి. ఫలితంగా పడవలను ఢీకొనే అవకాశం ఎక్కువగా ఉంటోంది. » దేశ వన్యప్రాణుల చట్ట ప్రకారం డాల్ఫిన్లకు హాని తలపెడితే కఠిన శిక్షలు విధిస్తారు. ఫలితంగా వీటి మరణాలపై జాలరులకు సమాచారం తెలిసినప్పటికీ, కేసులకు భయపడి రిపోర్టు చేయడం లేదు. » పునరుత్పత్తి చక్రం నెమ్మదిగానే ఉంటోంది. ఇవి 6ృ10 సంవత్సరాలకు మధ్య పరిపక్వం చెందుతున్నాయి. ప్రతి రెండు నుంచి మూడేళ్లకు ఒక జీవికి మాత్రమే జన్మనిస్తాయి. ఊరటనిచ్చే అంశమే అయినా... 2009లో గంగా నది డాల్ఫిన్ల పరిరక్షణ ధ్యేయంగా కేంద్రం దీనిని జాతీయ జల జంతువుగా ప్రకటించింది. 2020లో సర్వే కార్యాచరణ ప్రణాళిక, 2024లో ప్రత్యేక పరిశోధనా కేంద్రం ఏర్పాటు వంటి చర్యలతో వాటి సంఖ్యను పునరుద్ధరించడంలో అడుగులు పడ్డాయి. ఒకప్పుడు 10 వేలు ఉండే డాల్ఫిన్ల సంఖ్య గత శతాబ్దంలో 2 వేలకు పడిపోయింది. అయితే వాటి ప్రస్తుత సంఖ్య కొంత ఊరటనిస్తోంది. వాటి మనుగడ ప్రశ్నార్థకమే ఇప్పుడు సమస్య. 2021 నుంచి 10 రాష్ట్రాల్లో 8,507 కిలోమీటర్ల పొడవున 28 నదుల్లో పడవల ద్వారా, 30 నదుల్లో రోడ్డుమార్గం ద్వారా చేపట్టిన సర్వే వివరాలు రాష్ట్రాల వారీగా డాల్ఫిన్ల సంఖ్య ఉత్తరప్రదేశ్ 2,397పంజాబ్ 3పశ్చిమ బెంగాల్ 815బిహార్ 2,220అసోం 635జార్ఖండ్ 162రాజస్థాన్, మధ్యప్రదేశ్ 95 -
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
డాబాగార్డెన్స్: విశాఖ నగరంలో గజం స్థలం రూ.లక్ష, రూ.లక్షన్నర ఉంటే.. ఎకరా భూమిని 99 పైసలకే ఇవ్వడంలో ఆంతర్యమేంటని యూపీఎస్సీ మాజీ ఇన్చార్జి చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ చలం, పర్యావరణ ఉద్యమ కార్యకర్త సోహన్ హటంగడి, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ ప్రజలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉందని, ఇది పెద్ద భూ కుంభకోణమని, దీని వెనుక అధికార పార్టీ నాయకుడి హస్తం ఉందని ఆరోపించారు. ఈ భూముల విషయంపై చంద్రబాబు స్పందించకపోవడం శోచనీయమన్నారు.విశాఖలో ప్రభుత్వ భూములు, ఆస్తుల బదలాయింపుపై వార్వా నివాస్ ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రొఫెసర్ కేఎస్ చలం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకుని పెట్టుబడిదారులు మన ఆస్తులు, భూములు కొట్టేస్తున్నారని, మనపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డిరు. విస్తారంగా ఉన్న రక్షిత అడవుల్ని, తీర ప్రాంతాన్ని కూడా చేజిక్కించుకుంటున్నారని అన్నారు. టాటా ఏమైనా పేద సంస్థా? పర్యావరణ కార్యకర్త సోహన్ హటంగడి మాట్లాడుతూ విశాఖకు ప్రాణవాయువు సరఫరా చేసే ప్రాంతాన్ని ఎకరా 99 పైసలు చొప్పున 22 ఎకరాలు టాటా (టీసీఎస్) కంపెనీకి ఇచ్చేయడానికి టాటా ఏమన్నా పేద సంస్థా? అని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని, నగరంలోని పచ్చని ప్రదేశాల్ని కాంక్రీట్ అడవులుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్కే బీచ్ నుంచి హార్బర్ పార్క్ వరకు 14 ఎకరాల్లో లూలు మాల్ పెడితే ఆ ప్రాంతం, పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ట్రాఫిక్తోపాటు, కాలుష్యం భయంకరంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.తక్షణమే ఉపసంహరించుకోవాలి మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని, ప్రజల భూమిని ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాలని సూచించారు. ఉపాధి కల్పిస్తామనే ఉత్తుత్తి హామీలతో విశాఖలో భూముల్ని కార్పొరేట్లకు ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ఇలాగే భూములు ఇచ్చారని, కానీ ఉద్యోగాలు మాత్రం కల్పించలేదన్నారు. అభివృద్ధి పేరిట భూముల అమ్మకం నగర వినాశనానికే దారి తీస్తుందన్నారు. ఇటువంటి నిర్ణయాల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజా మద్దతుతో తిప్పి కొడతామని హెచ్చరించారు. వార్వా అధ్యక్షుడు ఎన్.ప్రకాశరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్, నివాస్ అధ్యక్షుడు బి.గురప్ప, ప్రధాన కార్యదర్శి పిట్టా నారాయణమూర్తి, హరి ప్రసాద్, బీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో పారని బాబు పాచిక!
సాక్షి, అమరావతి : బీజేపీ రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారులో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిన మంత్రాంగం పని చేయలేదు. ఆయన్ను పట్టించుకోకుండా పార్టీకి చెందిన ముఖ్య నేత పాకా సత్యనారాయణను బీజేపీ అగ్ర నాయకత్వం ఎంపిక చేసింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని బీజేపీలో తనకు అనుకూలంగా ఉండే వారికి ఇప్పించుకోవడానికి చంద్రబాబు తెర వెనుక శాయశక్తులా ప్రయత్నించినట్లు తెలిసింది. ఇటీవల రెండుసార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఈ విషయం గురించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షాతో మాట్లాడినట్లు సమాచారం. కానీ వారు చంద్రబాబు సూచనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఆయన ఒక నాయకుడి పేరు చెప్పి ఆయనకు ఇస్తే కూటమికి ఉపయోగం ఉంటుందని తన మాయజాలంతో బీజేపీ పెద్దలను ఒప్పించేందుకు యత్నించారు. ఆ వ్యక్తికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించేందుకు బీజేపీలోని తన మనుషులతో గట్టి లాబీయింగ్ కూడా చేయించారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసం పనిచేసే నేతలు అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారంతా చంద్రబాబు సూచించిన వ్యక్తికి సీటు ఇప్పించేందుకు గట్టిగా ప్రయత్నించారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం అవేమీ పట్టించుకోకపోవడం విశేషం.రకరకాల ప్రచారాలు..ఎత్తులుతాను సూచించిన అభ్యర్థికి రాజ్యసభ అభ్యర్థిత్వం వచ్చే అవకాశం లేదని తెలిశాక, మొదటి నుంచి బీజేపీలోనే ఉంటూ ఇప్పుడు రేసులో ఉన్న నాయకుల్లో తనకు అనుకూలంగా ఉండే ఒక నేతను చంద్రబాబు ప్రోత్సహించినట్లు తెలిసింది. ఒక దశలో ఈ సీటును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలైకి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ బీజేపీ అనూహ్యంగా భీమవరానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నేత పాకా సత్యనారాయణను ఎంపిక చేసింది. ఈ పేరు ఖరారైన తర్వాతే ఆయన గురించి అందరికీ తెలిసింది. నిజానికి ఒరిజినల్ బీజేపీకి చెందిన నేతలు చాలా మంది మాత్రం ఆయనకు అవకాశం ఉంటుందని భావించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయన పేరు బలంగా వినిపించింది. కానీ ఆ సీటును సోము వీర్రాజుకు కేటాయించారు. దీంతో ఇప్పుడు పాకా సత్యనారాయణకు రాజ్యసభ అవకాశం దక్కింది. ఈయనతో పాటు ప్రస్తుత కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, సోము వీర్రాజు వంటి వారంతా సుదీర్ఘకాలం నుంచి బీజేపీలో ఉంటూ ఆ పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేస్తున్న వారుగా పేరుంది. చంద్రబాబుకు షాకే!చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా తనకు అనుకూలంగా ఉండే వారిని విడతల వారీగా బీజేపీలోకి పంపారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వంటి చాలా మంది చంద్రబాబు అనుయాయులే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చంద్రబాబుకు స్వయానా వదిన. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీలో సగం మంది చంద్రబాబు వర్గానికి చెందిన వారే కనిస్తారు. తద్వారా బీజేపీకి కేటాయించిన ఏ పదవినైనా తన వర్గంలోని ఎవరో ఒకరికి ఇప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిసూ్తనే ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆయన మనుషులకే పదవులు కూడా దక్కాయి. కానీ కొద్ది కాలంగా బీజేపీ బాబు వ్యవహారాన్ని గమనించి సొంత నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి, సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ, ఇప్పుడు పాకా సత్యనారాయణకు రాజ్యసభ పదవులు దక్కాయి. ఈ నిర్ణయాలు ఒకరకంగా చంద్రబాబుకు షాక్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రభుత్వం విచక్షణాధికార పరిధిని దాటితే ఎలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జిల్లా వినియోగదారుల ఫోరంల అధ్యక్షులు, సభ్యుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం తన విచక్షణాధికార పరిధిని దాటి వ్యవహరించిందని హైకోర్టు ఆక్షేపించింది. జిల్లా వినియోగదారుల ఫోరంల అధ్యక్షులు, సభ్యుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నేపథ్యం, అర్హత, యోగ్యత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ఎంపిక కమిటీకి తెలియజేయాల్సిందేనని స్పష్టం చేసింది. సదరు పోస్టుకు దరఖాస్తుదారు చేసుకున్న అభ్యర్థి అర్హత, నిజాయితీ విషయంలో ఎంపిక కమిటీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత దానిపై రాష్ట్ర ప్రభుత్వం మదింపు చేయడానికి వీల్లేదంది. మెరిట్ ఆధారంగా ఎంపిక కమిటీ చేసిన నిర్ణయానికే కట్టుబడి నియామకాలు చేయాలని తేల్చి చెప్పింది. క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని న్యాయ పదవిలో నియమించడం వింతగా ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.ఆ నియామకాల రద్దుకు సమర్థనవైఎస్సార్, గుంటూరు, నెల్లూరు వినియోగదారుల ఫోరం అధ్యక్షులతో పాటు వైఎస్సార్, తిరుపతి ఫోరం సభ్యుల నియామకాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. చిత్తూరు జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలి నియామకాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీని నెల రోజుల్లోపు మళ్లీ నియమించాలని ఆదేశించింది. పునఃపరిశీలన నిమిత్తం అభ్యర్థుల నేపథ్యానికి సంబంధించిన రెండో నివేదిక, ఇతర సమాచారంతో పాటు తన అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక కమిటీ ముందుంచాలని స్పష్టం చేసింది. సంబంధిత ఫోరం కార్యకలాపాలకు విఘాతం కలగకుండా ఉండేందుకు గాను మొత్తం ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. -
ఓటీటీ జోరు... డిజిటల్ మీడియా హోరు
సాక్షి, అమరావతి: సినిమా చూడాలంటే థియేటర్కే వెళ్లాలనే రోజులకు కాలం చెల్లుతోంది. ఓటీటీ (ఓవర్ ద టాప్)ల్లో సినిమాలకే ఆదరణ పెరుగుతోంది. వినోదమంటే టీవీ చానళ్లు చూడాలనే రోజులు ఇక గతమే. వినోదం కోసం ప్రజలు డిజిటల్ మాధ్యమాలవైపే మొగ్గు చూపుతున్నారు. సినిమాలు, టీవీ చానళ్ల స్థానాన్ని డిజిటల్ మీడియా కబళిస్తోంది. ఆధునిక సమాచార సాంకేతిక విప్లవంతో డిజిటల్ మీడియా ప్రజల ఇళ్లల్లోకే దూసుకువస్తోంది. ఇది స్మార్ట్ ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చేస్తోంది. డిజిటల్ మీడియా ఏటా సగటున 7 శాతం వృద్ధి సాధిస్తోంది. రానున్న కాలంలో వినోద రంగం అంటే డిజిటల్ మీడియాదేనని ‘ఫిక్కీ–ఎర్నెస్ట్ యంగ్ ఇండియా’ తాజా నివేదిక వెల్లడించింది. వీక్షకుల ఆదరణే కాదు ప్రకటనల ఆదాయంలోనూ డిజిటల్ మీడియా ఆధిపత్యం సాధిస్తోందని తెలిపింది. టీవీని అధిగమిస్తున్న స్మార్ట్ ఫోన్ దేశంలో టీవీల ద్వారా వినోద కార్యక్రమాల వీక్షణం కంటే స్మార్ట్ ఫోన్ల ద్వారానే అధికంగా వినోద కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్, రియాల్టీ షోలు, క్రికెట్, ఇతర స్పోర్ట్స్ మొదలైవన్నీ కూడా టీవీల్లో కంటే స్మార్ట్ ఫోన్లలోనే వీక్షించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితి మున్ముందు మరింతగా పెరుగుతుంది.ఓటీటీ విప్లవం సినిమాలను థియేటర్ల కంటే ఓటీటీల్లో చూసేందుకే ఆసక్తి పెరుగుతోంది. 2024లో దేశంలో 1,600 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 500 సినిమాలు కేవలం ఓటీటీల్లోనే విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న కాలంలో ఓటీటీల్లో మాత్రమే విడుదలయ్యే సినిమాల సంఖ్య మరింతగా పెరుగుతుంది. 2027 నాటికి దేశంలో 6.50 కోట్ల ఇళ్లల్లో ఓటీటీ చానళ్లు చూస్తారు. ఆదాయంలోనూ డిజిటల్ మీడియా జోరు వీక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ప్రకటనల ఆదాయంలోనూ డిజిటల్ మీడియా ఆధిపత్యం సాధిస్తోంది. టీవీల్లోకంటే డిజిటల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు పారిశ్రామిక, వ్యాపార సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. డిజిటల్ మీడియా, టీవీలు, షార్ట్ వీడియోలు, సోషల్ మీడియా మొదలైన వాటిని కలిపి వీడియో వినోద రంగంగా పరిగణిస్తారు. వాటిలో అత్యధిక ప్రకటనల ఆదాయం ఎన్నో దశాబ్దాలుగా టీవీ రంగానికే దక్కేది. కానీ.. ఐదేళ్లుగా డిజిటల్ మీడియా అనూహ్యంగా దూసుకువస్తోంది. 2019లో దేశంలో మీడియా, వినోద రంగం ప్రకటనల ద్వారా రూ.1.90 లక్షల కోట్లు ఆదాయం సాధించింది. 2024లో అది మరింత పెరిగి రూ.2.50 లక్షల కోట్ల ఆదాయం రాబట్టింది. 2027 నాటికి రూ.3.1 లక్షల కోట్లు రాబడి సాధించవచ్చని అంచనా. -
అంతులేని అవినీతి.. అంతా అరాచకం: వైఎస్ జగన్
రాష్ట్రంలో ఇప్పుడు ఏ పంటకూ మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వివిధ జిల్లాల్లో కష్టాలు ఎదుర్కొంటున్నారు. మనం వారి తరఫున నిలబడి గట్టిగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అన్న దాతలకు ఆయా జిల్లాల్లో మీరంతా అండగా నిలిచి వారి డిమాండ్ల సాధనకు బలంగా ఉద్యమించాలి. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అన్నింటా ఘోర వైఫల్యం చెందిందని.. యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని.. అంతులేని అవినీతి జరుగుతోందని.. వీటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జిల్లాల అధ్యక్షులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో విధ్వంసమే కొనసాగుతోందన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లాల అధ్యక్షులతోపాటు రీజినల్ కో ఆర్డినేటర్లు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...ఎల్లప్పుడూ బాసటగా నిలిచేది మనమే..చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాల వల్ల కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడాలి. ఆ కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి దృష్టిని ఆకర్షిస్తాయి. వాటి ద్వారా మీ పనితీరు కూడా బయటపడుతుంది. ఈ ప్రక్రియలో పార్టీ జిల్లా అధ్యక్షులది చాలా కీలక బాధ్యత. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది ఎప్పుడైనా మనమే. ప్రతి సమస్యలోనూ మనం బాధితులకు తోడుగా ఉంటాం. తొలి నుంచి అలా నిలుస్తోంది, ఆ పని చేస్తోంది ఒక్క వైఎస్సార్సీపీనే.అక్టోబర్లోగా బూత్ కమిటీలుమే నెలాఖరులోపు పార్టీ మండల కమిటీలు ఏర్పాటు కావాలి. జూన్, జూలైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీల్లో డివిజన్ కమిటీలను పూర్తి చేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్ కమిటీలన్నీ ఏర్పాటవ్వాలి. ఇదే లక్ష్యంగా మీరంతా పని చేయాలి. అలాగే పార్టీని జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ మరింత బలంగా తీసుకెళ్లే బాధ్యత కూడా మీపై ఉంది. ఆ దిశలో పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. పార్టీలో జిల్లా అధ్యక్షుల పాత్ర చాలా కీలకం. గ్రామస్థాయి బూత్ కమిటీలు, గ్రామ కమిటీల ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. అందుకే పార్టీలో సమర్థులు ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు లీడ్ చేయగలరు? అనేది ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించాం.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మీరే పార్టీ.. పార్టీయే మీరుమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషి చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది. పార్టీకి జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరు. జిల్లాల్లో అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మణా అదే తలంపుతో పార్టీని నడపాలి. దీనికోసం ఏం చేయాలన్న దానిపై వ్యూహంతో కదలండి. గట్టిగా పని చేయండి. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పరిస్థితి మారకపోతే ప్రత్యామ్నాయం చూడాలి. అక్కడా మీ భాగస్వామ్యమే కీలకం. పార్టీలో ఎక్కడైనా ఇద్దరి మధ్య వివాదం తలెత్తితే వారిని పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో జిల్లాలో అన్ని స్థానాలు గెలిపించాల్సిన బాధ్యత మీది. అందుకే ఆ బాధ్యత, అధికారం.. రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించాం. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ కమిటీల నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి. నాయకత్వ ప్రతిభ బయటపడేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే..ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయట పడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్మన్ ప్రతిభ బయట పడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్మన్ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇది కూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనుల వల్ల ఎలివేట్ అవుతాం. తద్వారా ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ కూడా పెరుగుతుంది. మన పనితీరు వల్లే మన్ననలు పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. జిల్లాల్లో ఏం జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి. చురుగ్గా కార్యక్రమాలు చేయాలి. ప్రజా వ్యతిరేక అంశాల మీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. ప్రజలకు మరింత చేరువవుదాంబాధితులకు మనం ఎప్పుడూ అండగా ఉండాలి. మనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాల కోసం కేటాయించామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలి పెట్టకూడదు. జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకొస్తేనే ప్రజలకు మరింత దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.ఏడాదిలోపే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతసాధారణంగా రెండు, మూడేళ్లయితే గానీ ప్రభుత్వ వ్యతిరేకత బయటకు కనిపించదు. కానీ ఏడాదిలోపే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీల నిర్మాణం పూర్తి చేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తి స్థాయిలో పని ఉంటుంది. అందరం కలసికట్టుగా పార్టీ కార్యక్రమాలను బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలో గ్రామస్థాయిలో కూడా కమిటీలు, బూత్ కమిటీలు ఏర్పాటు అయితేనే మనం పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్లు అవుతుంది. ప్రతి జిల్లాలో బలంగా పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12 వేల మంది మన పార్టీ కార్యక్రమాల కోసం మీకు అందుబాటులో ఉంటారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 1,500 మంది అందుబాటులో ఉంటారు.ప్రజా సమస్యలపై సమన్వయంతో పోరాటంచంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో ఆయన చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో మీ జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదే. ప్రజా సంబంధిత అంశాల్లో మరింత చొరవ చూపాలి. ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్చార్జిని స్వయంగా కలవాలి. వారితో కలసి మొదట -పార్టీ జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం -
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో పాటు.. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాకే శైలజానాథ్ను నియమిస్తూ.. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వీరే1.శ్రీకాకుళం-కుంభా రవిబాబు (ఎమ్మెల్సీ)2.విజయనగరం- కిల్లి సత్యనారాయణ3.అరకు- బొడ్డేటి ప్రసాద్4.అనకాపల్లి-శోభా హైమావతి (మాజీ ఎమ్మెల్యే)5.విశాఖ-కదిరి బాబూరావు (మాజీ ఎమ్మెల్యే)6.కాకినాడ- సూర్యనారాయణరాజు (మాజీ ఎమ్మెల్సీ)7.అమలాపురం-జక్కంపూడి విజయలక్ష్మి8.ఏలూరు-వంకా రవీంద్రనాథ్ (ఎమ్మెల్సీ)9.రాజమండ్రి- తిప్పల గురుమూర్తిరెడ్డి10.మచిలీపట్నం -జెట్టి గురునాథం11.నరసాపురం- ముదునూరి మురళీకృష్ణంరాజు12.విజయవాడ-మోదుగుల వేణుగోపాలరెడ్డి (మాజీ ఎంపీ)13.గుంటూరు-పోతిన మహేష్14.నరసరావుపేట-డా.పూనూరు గౌతంరెడ్డి15.బాపట్ల-తూమటి మాధవరావు (ఎమ్మెల్సీ)16.ఒంగోలు-బత్తుల బ్రహ్మానందరెడ్డి17.నెల్లూరు-జంకె వెంకటరెడ్డి (మాజీ ఎమ్మెల్యే)18.తిరుపతి-మేడా రఘునాథరెడ్డి (ఎంపీ)19.చిత్తూరు-చవ్వా రాజశేఖర్రెడ్డి20.రాజంపేట- కొత్తమద్ది సురేష్బాబు (మేయర్)21.కడప-కొండూరి అజయ్రెడ్డి22.అనంతరం-బోరెడ్డి నరేష్కుమార్రెడ్డి( మాజీ ఎమ్మెల్సీ)23.హిందూపురం-ఆర్.రమేష్రెడ్డి24.నంద్యాల- కల్పలతారెడ్డి (ఎమ్మెల్సీ)25.కర్నూలు-గంగుల ప్రభాకర్రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ) -
మరో 36 స్పెషల్ ట్రైన్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..
విజయవాడ: విజయవాడ మీదుగా చర్లపల్లి–కాకినాడ టౌన్, చర్లపల్లి–నర్సాపూర్ మధ్య మరో 36 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి–కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07031) మే 2 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07032) మే 4 నుంచి జూన్ 29 వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి–నర్సాపూర్ ప్రత్యేక రైలు..చర్లపల్లి–నర్సాపూర్ ప్రత్యేక రైలు (07233) మే 2 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.15 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) మే 4 నుంచి జూన్ 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. -
హామీల అమలులో ‘కూటమి’ ఘోర వైఫల్యం: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ‘వాయిస్ ఆఫ్ వాయిస్లెస్’గా వైఎస్సార్సీపీ పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారని మాజీ మంత్రి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున వెల్లడించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారుఆ బాధ్యత పార్టీపై ఉంది:రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్దేశించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, ప్రజాసమస్యలపై ఉద్యమించేందుకు సిద్దంగా ఉండేలా పార్టీని సమాయత్తం చేయాలని ఆయన ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై, ప్రజల గోడు పట్టించుకోని నిర్లక్ష్యం తాండవిస్తోందని, దీనిపై ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని జగన్ గుర్తు చేశారు.వాటిపై దృష్టి సారించాల్సి ఉంది:రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారికి వైఎస్సార్సీపీ అండగా ఉండాలనే కోణంలో సమావేశంలో జగన్ పలు అంశాలు నిర్దేశించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ, కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్త నుంచి మండల స్థాయి వరకు పార్టీ శ్రేణులు పూర్తి సమన్వయంతో పని చేయాలని కోరారు.హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలి:రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బాధితులకు అన్యాయం జరుగుతున్న ప్రతిచోటా వైయస్ఆర్సీపీ ఉండాలని వైయస్ జగన్ సూచించారు. ప్రజలకు కూటమి పార్టీలు 143 వాగ్ధానాలను ఇచ్చాయి. సూపర్ సిక్స్ కాస్తా గాలికి వదిలేశారు. గత వైయస్ఆర్సీపీ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు, ప్రజల జీవన ప్రమాణాల్లో తీసుకువచ్చిన మార్పులను మరోసారి గుర్తు చేసుకోవాలి.ఇప్పుడు వాగ్దానాల అమలు అనేది ఎక్కడా లేదు. రెడ్బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోంది. సంక్షేమ పథకాలు పేదలకు చేరువ కావడం లేదు. విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పేదలు తమ పిల్లలను చదివించుకోలేక, బడికి పంపాల్సిన పిల్లలను కూలికి పంపుతున్నారు. ఇటువంటి స్థితిలో వైయస్సార్సీపీ వారికి అండగా నిలబడుతుంది.రైతుల్లో భరోసా కల్పించాలి:రైతులను పట్టించుకునే తీరికే కూటమి ప్రభుత్వానికి లేదు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో రైతేరాజుగా ప్రాధాన్యత ఇచ్చాం. రైతుభరోసా ద్వారా రైతులకు అండగా నిలిచాం. విత్తనం నంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా ఆనాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకుంది. నేడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవలే గుంటూరు మిర్చియార్డ్కు వెళ్ళిన వైఎస్ జగన్కి మిర్చిరైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీనిపై వెంటనే సీఎం చంద్రబాబు స్పందించి కేంద్రానికి ఒక లేఖ రాసి, కేంద్రం ద్వారా మిర్చి కొనుగోళ్లు చేయిస్తామంటూ ఒక ప్రకటన చేసి, చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత మిర్చి రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.ఇప్పుడు మిర్చి రైతులు కనీస ధరలు లేక, అప్పులపాలై దారుణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మిర్చి రైతులకు అండగా వైయస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంతో పాటు, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా మిర్చి రైతులను ఆదుకుంటామో కూడా వారికి ఒక భరోసాను కల్పించాలని వైఎస్ జగన్ నిర్ధేశించారు.పొగాకు రైతుల గోడు కూటమి సర్కార్కు పట్టడం లేదు:పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పొగాకు రైతులు తమ పంటను వ్యాపారులు కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయడం లేదని చెబితే, సదరు వ్యాపారుల ఫ్యాక్టరీలకు కరెంట్ తీసేస్తాను అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడారు. పొగాకు రైతులను అప్పటికప్పుడు నమ్మించి పంపి, ఆ తరువాత వారి గోడును కనీసం పట్టించుకోని ఘనుడు చంద్రబాబు.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పొగాకు రైతుల విజ్ఞప్తులకు స్పందించి వ్యాపారులు తప్పకుండా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి, మార్క్ఫెడ్ ద్వారా రూ.200 కోట్లకు పైగా వెచ్చించి మద్దతు ధరకు కొనుగోలు చేయించారు. అదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ది. ఈరోజు మార్కెట్లో క్వింటా పొగాకు రూ.36 వేలు ధర పలకాల్సి ఉండగా, మార్కెట్లో రూ.22 వేలకు కూడా కొనడం లేదు. అందుకే పొగాకు రైతుల పక్షాన ఉద్యమించడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉండాలని సమావేశంలో వైఎస్ జగన్ నిర్దేశించారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున వివరించారు. -
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ–2025 పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి కేంద్ర విద్యా శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. మే 4న దేశవ్యాప్తంగా 550 నగరాలు, పట్టణాల్లో 5,000 సెంటర్ల్లో ఈ పరీక్ష నిర్వహించనుంది. గతేడాది నీట్ ప్రశ్నాపత్రం లీక్, అవకతవకలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా నీట్ నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పోలీస్ ఎస్కార్ట్తో ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ఇతర కీలక సామాగ్రిని తరలించనున్నారు.పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ భద్రతతో బహుళ అంచెల్లో తనిఖీలు చేపట్టనున్నారు. వ్యవస్థీకృత మోసాలను అరికట్టడంపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కోచింగ్ సెంటర్లు, డిజిటల్ ప్లాట్ఫామ్ల్లో కార్యకలాపాలపైనా నిఘా పెట్టారు. నీట్ అభ్యర్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా పరీక్ష పత్రాలు లీక్, అవకతవకలు, ఇతర ఆరోపణలతో పుకార్లు పుట్టుకువస్తున్నాయి. ఈ సందర్భాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎనీ్టఏ) వివరణలు ఇస్తూ వస్తోంది.నీట్ 2025పై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తలెత్తే అనుమానాస్పద అంశాలు, సందేహాలను తెలియజేయడానికి ప్రత్యేక వెబ్సైట్లను ఎన్టీఏ అందుబాటులోకి తెచ్చింది. https:// neet. nta. ac. in, https:// nta. ac. in వెబ్సైట్ల్లో అభ్యర్థులు తమ దృష్టికి వచ్చిన అనుమానాలను తెలియజేసేందుకు వీలు కలి్పంచారు. ఈ వెబ్సైట్లు మే 4న సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. -
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ విద్య వన్నె తగ్గుతోంది. ఓవైపు ఏటికేటికీ తగ్గుతోన్న ప్రవేశాలు..కళాశాలల్లో అధ్యాపకుల కొరత ...ఉపాధి సామర్థ్యాన్ని పెంచడంలో వెనుకబాటు..మరోవైపు కొత్త పుంతలు తొక్కుతోన్న అధునాతన ఇంజినీరింగ్ కోర్సులు..వెరసి పాలిటెక్నిక్ ఉనికికి సవాల్ విసురుతున్నాయి. పాలిటెక్నిక్ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా కల్పించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రవేశపెట్టిన పథకాన్ని పరిశీలిస్తే విషయం స్పష్టమవుతోంది. ఈ స్వయం ప్రతిపత్తి విధానాన్ని రెండేళ్ల కిందట అమలు చేయగా...ఇప్పటిదాకా మహారాష్ట్ర, కర్నాటకలోని ఐదు కళాశాలలు మాత్రమే అర్హత సాధించడం గమనార్హం. 59 శాతం ప్రైవేటు యాజమాన్యాలే.. పాలిటెక్నిక్లో ప్రవేశాలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. దీనికి తోడు సీట్ల సంఖ్య కూడా క్షీణిస్తూ వస్తోంది. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలో ప్రైవేటు సంస్థలే కీలకంగా వ్యవహరిస్తున్నాయి. 2024–25లో ఏఐసీటీఈ ఆమోదించిన సంస్థల జాబితా ప్రకారం దేశంలో 3566 పాలిటెక్నిక్ కళాశాలలు ఉంటే వాటిలో 59 శాతం ప్రైవేటు యాజమాన్యాల చేతిలో ఉండటం గమనార్హం. ఆదర్శం..ఆ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాలిటెక్నిక్ విద్య ప్రారంభంలో ప్రభుత్వ హయాంలోనే నడిచేది. కాల క్రమేణా ప్రైవేటు పరం చేయడంతో కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దీంతో పాలిటెక్నిక్ విద్య నాసిరకంగా మారింది. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలిటెక్నిక్ కళాశాలలను ప్రభుత్వమే నడిపిస్తోంది. వాటిలో గోవా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, లక్షద్వీప్, దాద్రా–నాగర్ హవేలీ ఉన్నాయి. ఇక్కడ పాలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరగలేదు. ఏటా క్షీణిస్తున్న ప్రవేశాలు..పాలిటెక్నిక్లో ఏటా సీట్ల భర్తీ కోసం కళాశాలలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే 2017–23 వరకు ఐదేళ్ల కాలంలో దాదాపు ఐదో వంతు (19.7 శాతం) సీట్లు తొలగించినట్టు తెలుస్తోంది. మరోవైపు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు పూర్తయిన తర్వాత కూడా భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్యాంశాలు సవరించిన సంగతి తెలిసిందే. అయిననప్పటికీ తగిన ఫలితం కనిపించట్లేదు. మరోవైపు పాలిటెక్నిక్ విద్యను ఢిల్లీ మాదిరిగా కొన్ని రాష్ట్రాలు నైపుణ్య విశ్వవిద్యాలయాల కిందకు తీసుకురావాలని భావిస్తున్నాయి. మరోవైపు ఫీజులు కూడా భారీగా పెరగడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయ కోర్సుల వైపు మరలుతున్నారు.మెరుగుపడాలంటే.. ⇒ పాలిటెక్నిక్ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి అంశంలో ఏఐసీటీఈ, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ⇒ ప్రభుత్వాలు కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు పెంచాలి. ⇒ స్వయం ప్రతిపత్తి హోదాకు నిర్దేశించిన అంశాలను సంతృప్తి పరచడంలో చాలా విద్యా సంస్థలు విఫలమవుతున్నాయి. దీన్ని అధిగమించాలి. ⇒ ముఖ్యంగా అధ్యాపకుల కొరత పాలిటెక్నిక్ విద్యను ప్రభావితం చేస్తోంది. ఈలోటును భర్తీ చేయాలి. ⇒ లైబ్రరీలు, ప్రయోగశాలలు, తగినన్ని వనరుల కల్పనపై దృష్టి సారించాలి. అలాగే వర్క్షాప్లు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
చంద్రబాబు వికృత రాజకీయ క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సాక్షి, అమరావతి: రాజకీయం పేరుతో సీఎం చంద్రబాబు సాగిస్తున్న వికృత క్రీడను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులపై ఉందని పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి.దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఏం చేశామన్నది మాత్రమే రాజకీయ పార్టీ పనితీరుకు ప్రాతిపదిక అవుతుందని బలంగా నమ్మారు. చంద్రబాబు మాత్రం మీడియా ద్వారా ప్రజలను ప్రలోభపెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. టీడీపీ అనుకూలంగా ఓటు వేసింది. కానీ, టీడీపీ తిరిగి వారి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేసింది.టీడీపీ వాళ్లు చేసిన స్కామ్లకు ఆధారాలున్నా వాటిపై కూడా ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజలు ఆలోచించే అవకాశం లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో పై స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బందిపోట్ల తరహాలో ఇసుక, కాంట్రాక్టులు, నామినేటెడ్ పనుల్లో దోపిడీ చేస్తున్నారు. అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోచేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రకటిస్తూ మొబిలైజేషన్ అడ్వాన్సులు ప్రవేశపెట్టి దాని ద్వారా మొదట్లోనే కమీషన్లు దండుకుంటున్నారు. ప్రాజెక్టులు వచ్చినా, రాకపోయినా అడ్వాన్సుల పేరిట దోచుకుంటున్నారు. ఇవి ప్రజల దృష్టిలో పడకుండా డైవర్షన్ కోసం వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. అధికారంలో ఉండగా వైఎస్ జగన్ నిబద్ధతతో కూడిన రాజకీయం చేశారు.పేదలకు, సంపన్నులకు మధ్య అంతరాలు తగ్గించడం, నిజమైన ప్రజాస్వామ్యంలో మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడం కోసం ఏం చేయాలో... అది చేసి చూపించిన నాయకుడు వైఎస్ జగన్. ఐదేళ్లు జగన్ పాలనలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమాన్ని చూశాం. చంద్రబాబు పాలనలో టీడీపీ కార్యకర్తలు, నేతల ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
రాజధానిలో మరిన్ని భూములు సమీకరణ
సాక్షి, అమరావతి: రాజధానిలో మరిన్ని భూములు సమీకరించాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణాలకు మరికొంత భూమి అవసరం అని.. దీనికి అనుగుణంగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘‘హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూ సేకరణ జరిగినప్పుడు 5 వేల ఎకరాలు ఎందుకని కొందరు ప్రశ్నించారు. కానీ, నాడు ముందుచూపుతో సేకరించినందునే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణంతో పాటు పెద్ద హోటళ్లు, మాల్స్ వచ్చి ఎకనమిక్ యాక్టివిటీ పెరిగింది. చుట్టుపక్కల భూములకు విలువ పెరిగి రైతులకు మేలు చేకూరింది’’ అని అన్నారు. అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు సోమవారం తన నివాసంలో సమావేశమయ్యారు.రాజధాని అవసరాలకు అదనంగా భూ సేకరణ సహా పలు అంశాలను చర్చించారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా, వారికి నష్టం జరిగేలా ఏ కార్యక్రమం, నిర్ణయం ఉండదని సీఎం తెలిపారు. అదనపు భూసేకరణ కారణంగా ఈ ప్రాంతంలో ధరలు పడిపోతాయనే అపోహలకు గురికావద్దన్నారు. తనకు, రైతులకు మధ్య దూరం ఉండదని చెప్పారు. ‘కృష్ణా నదిపై మరో మూడు నాలుగు వారధులు కూడా వస్తాయి. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు వస్తాయి. ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. రాజధాని విస్తరించి పెద్దఎత్తున సంస్థలు, పెట్టుబడులు వస్తాయి.మీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ జరగదు’’ అని సీఎం పేర్కొన్నారు. రాజధాని ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని రైతులు కోరగా... శాతవాహన కాలం నుంచి అమరావతి ఉద్యమం వరకు జరిగిన పరిణామాలన్నీ క్రోడీకరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. రాజధాని పరిధిలోని గ్రామ కంఠాల్లో ప్రస్తుతం నివాసం ఉంటూ పట్టాలేని వారికి పట్టాలివ్వాలని అభ్యరి్థంచగా, దీన్ని కూడా త్వరలోనే చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. ⇒ అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రాజధాని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వనించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు అని.. రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య అడుగు అవుతుందని సీఎం చెప్పారు. రైతుల త్యాగం కారణంగానే నేడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నామని, రైతుల మంచి మనసును ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించే ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమం, పనుల్లో భాగస్వామ్యం కావాలని రాజధాని గ్రామాల రైతులను చంద్రబాబు ఆహ్వనించారు. సమావేశంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.బయటపడిన బాబు భూ దాహం రాజధాని అవసరాలకు మరో 44,676 ఎకరాలు సమీకరించనున్నట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం లీక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు భూ దాహం రాజధాని రైతులతో నిర్వహించిన సమావేశంలోనే బయటపడింది. ప్రభుత్వ భూమితో కలిపి ఇప్పటికే రాజధాని అవసరాలకు సీఆర్డీఏ చేతిలో 53,749 ఎకరాలున్న విషయం తెలిసిందే. ఇందులో రైతుల నుంచి సమీకరించిన భూమి 34,566 ఎకరాలు ఉంది. ఇంత భూమి ఉన్నప్పటికీ అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాల పేరుతో మరో 44 వేల ఎకరాలకు పైగా భూములను రైతుల నుంచి తీసుకోవాలని ముందుగా నిర్ణయించుకున్న తరువాతనే చంద్రబాబు ప్రభుత్వం మీడియాకు లీకు ఇచ్చింది.ఈ విషయం సోమవారం రైతులతో సీఎం నిర్వహించిన సమావేశంలోనే బట్టబయలైంది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధి లో మరిన్ని గ్రామాలలో భూములు సమీకరించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసేసుకుని.. ఇప్పుడు భూముల విలువ పెరగాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణం పేరు చెబుతోంది. అవి చేపట్టడానికి అవసరమైన భూములను రైతుల నుంచి తీసుకుంటామని రైతుల సమావేశంలో సీఎం చెప్పడం గమనార్హం. -
రద్దు దిశగా ఆప్కాస్!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఔట్సోగ్ ఉద్యోగుల జీవితాలతో మళ్లీ ఆటలు మొదలుపెట్టింది. చిరుద్యోగుల పొట్టకొట్టి అస్మదీయులకు చెందిన ప్రైవేటు ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఔట్సోగ్ విధానాన్ని సమీక్షించేందుకంటూ ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ సర్వీసెస్(ఆప్కాస్)ను రద్దు చేసి.. మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తే తమ జీవితాలు రోడ్డున పడతాయని చిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆప్కాస్తో చిరుద్యోగులకు భద్రత..గతంలో చంద్రబాబు హయాం(2014–19)లో ప్రైవేటు ఏజెన్సీలు, దళారుల చేతుల్లో చిరుద్యోగుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఔట్సోగ్ ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వకుండా ప్రైవేట్ ఏజెన్సీలు వేధించేవి. ఐదు శాతానికి పైగా కమీషన్లు తీసుకోవడంతో పాటు ఇష్టానుసారంగా ఉద్యోగులను తొలగించేవి. అనంతరం ఏర్పడిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఔట్సోగ్ ఉద్యోగుల నియామకాలు, జీతాల చెల్లింపుల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు.. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఆప్కాస్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారానే ఔట్సోగ్ ఉద్యోగుల నియామకాలు జరిగేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తద్వారా ప్రైవేట్ ఏజెన్సీల వేధింపులు, కమీషన్ల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు విముక్తి కల్పించింది. దీని ద్వారా లక్ష మంది ఔట్ సోగ్ ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తుండగా..లంచాలు అనే ప్రసక్తే లేకుండా ఠంచన్గా ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు అందేవి. ఈపీఎఫ్,ఈఎస్ఐ వంటివి కూడా ప్రతి నెలా సక్రమంగా జమ అయ్యేవి. విరమించుకోకపోతే.. ఉద్యమిస్తాంతాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఔట్సోగ్ ఉద్యోగులపై కక్ష కట్టింది. ఆప్కాస్ను రద్దు చేసి.. తమ ఏజెన్సీల ద్వారా ఔట్సోగ్ ఉద్యోగులను నియమించుకునే ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగానే మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిందని చిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తద్వారా ప్రైవేటు ఏజెన్సీలతో పాటు తమ జేబులు కూడా నింపుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏపీఐఐసీ, మారిటైమ్ బోర్డులలో పనిచేస్తున్న చిరుద్యోగులను తొలిగించిందని.. ఇప్పుడు ఆప్కాస్ రద్దు ద్వారా తమ పొట్టకొట్టేందుకు సిద్ధమైందని వాపోతున్నారు. ఈ ఆలోచనను విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామక వ్యవస్థపై సమీక్షమంత్రుల బృందం ఏర్పాటుసాక్షి, అమరావతి: ఔట్సోగ్ సిబ్బంది నియామక ప్రస్తుత వ్యవస్థను సమీక్షించడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. మంత్రులు నారాయణ, నారా లోకేశ్, పయ్యావుల కేశవ్లతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రుల బృందం కార్యకలాపాలను సమన్వయం చేయడానికి సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) ముఖ్యకార్యదర్శి కన్వీనర్గా వ్యవహరించనున్నారు. ఈ బృందం సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఆర్థిక శాఖ (హెచ్ఆర్) కార్యదర్శి హాజరవుతారు. మంత్రుల బృందం విధి విధానాలు ఇలా ఉన్నాయి..⇒ ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తోన్న ఔట్సోగ్ సిబ్బంది సంఖ్య ప్రస్తుత స్థితిని సమీక్షించాలి.⇒ ఔట్సోగ్ సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రస్తుత మెకానిజంను సమీక్షించాలి.⇒ వ్యవస్థలోని లోపాలు, ఫిర్యాదులను పరిశీలించాలి.⇒ ఇందుకోసం ఔట్సోగ్ సిబ్బందితో సంప్రదింపులు జరపాలి.⇒ ప్రస్తుత వ్యవస్థ కంటే మరింత జవాబుదారీగా, సమర్థవంతంగా, పారదర్శకంగా ఔట్సోగ్ సిబ్బంది సంక్షేమాన్ని పెంపొందించడానికి చర్యలను సూచించాలి.⇒ ఈ విషయంలో సముచితమని భావించే ఏదైనా ఇతర అంశాన్ని మంత్రుల బృందం పరిగణించవచ్చు. -
నేడు జిల్లాల అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ జిల్లాల అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. తాజా పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. -
కూటమి ఎత్తు.. ప్రజాస్వామ్యం చిత్తు
అధికార పార్టీ నేతలు ప్రలోభాల వల విసిరారు. ఉద్యోగాలు ఎరవేశారు. మాట వినని వారి అంతుచూస్తామని బెదిరించారు. కుప్పం, మాచర్ల, తుని, పాలకొండ, విశాఖపట్నం, గుంటూరు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లను అనైతిక మార్గాల్లో లొంగదీసుకున్నారు. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మేయర్ ఉప ఎన్నికల్లో మాయా పాచికలనే కూటమి పార్టీలు నమ్ముకున్నాయి. బలం లేకున్నా.. బరిలోకి దిగాయి. మొదట భంగపడినా.. చివరకు మాయతోనే మోసగించాయి. శకునికి మించిన ఎత్తులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పెత్తనం చెలాయించేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు.సాక్షి నెట్వర్క్: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. బలం లేకపోయినా కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని లాక్కున్నారు. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన కౌన్సిలర్లలో ఒక్కొక్కరికీ రూ.50 లక్షలు, ఒకరికి మున్సిపల్ ఉద్యోగం ఎరవేసి లొంగదీసుకున్నారు. మరో ఇద్దరిని భయపెట్టి ఎన్నికలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. 8మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి లాక్కుని చైర్పర్సన్ కుర్చీని దక్కించుకుని అనైతికంగా విజయం సాధించారు.కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ స్థానానికి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్ను మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉంటే.. అందులో 19 వార్డుల నుంచి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లే ఎన్నికయ్యారు. టీడీపీకి కేవలం ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చాక మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం బెదిరింపులకు తెరలేపారు. మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న డాక్టర్ సుధీర్ రాజీనామా చేయటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నలుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరినా.. వైఎస్సార్సీపీకి 15 మంది కౌన్సిలర్లతో చైర్పర్సన్ను ఎన్నుకునేందుకు అవసరమైన పూర్తిస్థాయి బలం ఉంది.బరితెగించి.. ఇబ్బందులకు గురిచేసి..టీడీపీ బరితెగింపునకు భయపడి 15 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు కౌన్సిలర్లకు చెందిన భూములు లాక్కుంటామని బెదిరించగా.. మరికొందరిని కేసులు పెడుతామని హెచ్చరించినట్లు తెలిసింది. తమకు మద్దతు ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఇస్తామని ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ విప్ జారీ చేసినా అధికారపార్టీ నేతల ప్రలోభాలకు 8 మంది కౌన్సిలర్లు లొంగిపోయారు.ఇద్దరు కౌన్సిలర్లు మునస్వామి, తిలగవతి టీడీపీ నేతల బెదిరింపులకు భయపడి ఎన్నికల్లో పాల్గొనకుండా గైర్హాజరయ్యారు. ఉప ఎన్నికలో మొత్తం 22 మంది కౌన్సిలర్లు పాల్గొనగా.. టీడీపీ బలపరచిన అభ్యర్థి సెల్వరాజ్కి 13 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. కాగా.. విప్ ధిక్కరించిన కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త భరత్ ప్రకటించారు. పాలకొండలో.. అడ్డదారిలో..పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ పదవి కోసం జరిగిన ఉప ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ఎస్సీలకు రిజర్వు చేశారు. మొత్తం 20 వార్డులు ఉండగా.. 17 వార్డుల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. 19, 2వ వార్డులకు చెందిన ఇద్దరు మాత్రమే ఎస్సీ సభ్యులు ఉండగా.. 19వ వార్డుకు చెందిన యందవ రాధాకుమారిని చైర్పర్సన్గా అప్పట్లో వైఎస్సార్సీపీ ఎంపిక చేసింది.ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాధాకుమారి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. చివరకు 2వ వార్డుకు చెందిన ఎస్సీ సభ్యురాలు ఆకుల మల్లీశ్వరి ఉండగా.. ఆమెనే తదుపరి చైర్పర్సన్గా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నాయకులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ పీఠంపై కూటమి పార్టీలు కన్నేశాయి. సోమవారం మరోమారు ఎన్నిక నిర్వహించగా.. టీడీపీ మాయోపాయంతో స్వతంత్ర అభ్యర్థినంటూ మల్లీశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యుల మద్దతు అందించడంతో ఆమె చైర్పర్సన్గా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఆ వెంటనే మల్లీశ్వరికి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ టీడీపీ కండువా వేసి పాలకొండ చైర్పర్సన్ పదవి తమదేనని ప్రకటించుకున్నారు. ఈ ఎన్నికకు వైఎస్సార్సీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు హాజరు కాలేదు. మిగిలిన చోట్ల ఇలా..⇒ గుంటూరు మేయర్గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర (నాని) గెలుపొందారు. మార్చిలో అప్పటి మేయర్ కావటి మనోహర్నాయుడు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 56 మంది సభ్యుల్లో కూటమి బలం కేవలం 11.. కాగా 18 మందిని చేర్చుకోవడంతో వారి బలం 29కి చేరింది. ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఎక్స్–అఫిషియో సభ్యులు ఉండటంతో వారి బలం 34 అయ్యింది. వైఎస్సార్సీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలతో కలిసి 29 మంది బలం ఉండగా.. ఇద్దరు సభ్యులు హాజరుకాకపోవడంతో 27 ఓట్లు వచ్చాయి. ⇒ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన 17 మంది కౌన్సిలర్లు హాజరు కాగా.. 11 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరించారు. పోటీలో మరెవరూ లేకపోవడంతో చైర్పర్సన్గా నార్ల భువనసుందరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి, డీపీఓ రవికుమార్ ప్రకటించారు.⇒ గ్రేటర్ విశాఖ మేయర్గా టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం ప్రిసైడింగ్ అధికారి మయూరి అశోక్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ⇒ మొత్తం మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉన్నాయి. 31 వార్డులనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. కూటమి అధికారంలోకి రావడంతో వైఎస్సార్సీపీ సభ్యులపై రకరకాల ఒత్తిళ్లు తెచ్చి.. భయపెట్టి పలుదఫాలుగా 21 మంది కౌన్సిలర్లను టీడీపీ తనవైపు తిప్పుకుంది. వారి సాయంతో వైస్ చైర్పర్సన్గా మదార్ సాహెబ్ను గెలిపించుకుని విలువలకు పాతరేసింది.⇒ తాడిపత్రి మునిసిపల్ వైస్ చైర్పర్సన్–1గా టీడీపీకి చెందిన 26వ వార్డు కౌన్సిలర్ షెక్షావలి, వైస్ చైర్పర్సన్–2గా సీపీఐకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ అరుణ ఎన్నికయ్యారు. అధికార పార్టీకి సంఖ్యాబలం ఉండటంతో ఈ పదవులకు వైఎస్సార్సీపీ నుంచి ఎవరినీ పోటీకి దింపలేదు.కూటమి విజయం అనైతికం: ఎమ్మెల్సీ భరత్కుప్పం రూరల్: ‘కుప్పంలో ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే. మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నికల్లో టీడీపీ అనైతికంగా విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అప్రతిష్ట పాలైంది’ అని ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ సీపీకి 18 మంది సభ్యుల బలముంది. అయినా ఓడిపోవాల్సిన దుస్థితి పట్టింది. అధికార పార్టీ నేతలు మా కౌన్సిలర్లను కూరగాయల్లా రూ.లక్షలకు లక్షలు పోసి కొన్నారు. అధికారం శాశ్వతం కాదు. హుందాతనం ముఖ్యం. సాక్షాత్తు సీఎం ప్రాతినిధ్య వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలా అనైతిక ఎన్నికలు జరుగుతుంటే.. ఇక రాష్ట్రమంతా పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగింది.ప్రజాస్వామ్యం ఖూనీ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, స్థానిక సంస్థల పదవులను చేజిక్కించుకునేందుకు గజారుడు రాజకీయానికి పాల్పడిందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రలోభాలు, బెదిరింపులతో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకుని పదవులను దక్కించుకోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. చంద్రబాబు అరాచక పాలనను చూసి ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోతున్నారని అప్పిరెడ్డి విమర్శించారు. కుప్పం, పాలకొండ, మాచర్ల, తుని, గుంటూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో తాడిపత్రి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ కంటే 2 స్థానాలు టీడీపీ అధికంగా గెలుచుకుంటే నాటి సీఎం వైఎస్ జగన్ హుందాగా వ్యవహరించారని గుర్తుచేశారు. -
నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు
చంటిపిల్లలతో అల్లాడిపోతున్నాం.. విద్యుత్ కోత వల్ల మేం సక్రమంగా నిద్రపోయి చాలా రోజులైంది. ఏ పనీ చేసుకోలేక పోతున్నాం. ఉక్కపోత వల్ల చంటి పిల్లలతో అల్లాడిపోతున్నాం. పట్టించుకునే నాధుడే లేడు. విద్యుత్ సరఫరా లేక వీధుల్లో నిరీక్షించాల్సి వస్తోంది. – చల్లపల్లి మంగ, తారకరామ కాలనీ, బొబ్బిలి.సాక్షి, అమరావతి: ఒకపక్క ముచ్చెమటలు పట్టిస్తున్న బిల్లులు.. మరోపక్క విద్యుత్తు కోతలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే డిమాండ్కు సరిపడా విద్యుత్ను సరఫరా చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు మండు వేసవిలో అనధికారిక కోతలతో విసనకర్రలే శరణ్యమనే స్థితికి తెచ్చింది. అధికారంలోకి రాగానే వినియోగదారులపై ఏకంగా రూ.15,485 కోట్ల భారం మోపిన టీడీపీ కూటమి సర్కారు కరెంట్ సరఫరాలో దారుణంగా విఫలమైందని.. నిరంతర విద్యుత్తు దేవుడెరుగు.. నిరంతరం కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై ‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్’లో అన్నదాతల అగచాట్లు, పట్టణాలు, పల్లెల్లో ప్రజల దుస్థితి వ్యక్తమైంది. ఏప్రిల్ నెలలో విద్యుత్తు సరఫరాకు సంబంధించి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ తక్కువగానే ఉన్నా అది కూడా సరఫరా చేయలేక కూటమి సర్కారు ఎడాపెడా కోతలు విధిస్తోంది. పల్లెల్లో అగమ్యగోచరం..నగరాల్లో గృహాలకు రోజుకు కనీసం మూడు గంటలు, పట్టణాల్లో నాలుగు గంటల పాటు అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. వారంలో ఒక రోజు నిర్వహణ పనుల పేరుతో సరఫరా నిలిపి వేస్తున్నారు. పట్టణాల్లో ప్రాంతాలవారీగా రాత్రిళ్లు రెండు గంటలు విద్యుత్ కోత పెడుతున్నారు. ఇక గ్రామాల్లో పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి తలెత్తింది. గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు హయాంలో ఇదే దుస్ధితి నెలకొందని గుర్తు చేసుకుంటున్నారు. ఎల్సీ, లైన్ల మరమ్మతులు, సబ్ స్టేషన్ నిర్వహణ సాకులు చెబుతూ కోతలు పెడుతున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే పార్టీ ముద్ర వేసి పథకాలు రాకుండా చేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు. బాబు హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే..రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 242.849 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. గతేడాది ఇదే సమయంలో 250.804 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. గతేడాదితో పోలిస్తే 3.17 మిలియన్ యూనిట్ల వినియోగం తక్కువే ఉన్నా సరఫరా చేయలేక కూటమి సర్కారు అనధికారిక కోతలు విధిస్తోంది. సాధారణంగా వేసవిలో విద్యుత్ వాడకం పెరుగుతుంది. కానీ ప్రస్తుతం డిమాండ్ గతేడాది కంటే తక్కువగా ఉన్నా సరఫరా చేయలేకపోతోంది. ఇక మే నెలలో రోజువారీ వినియోగం 260 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇక అప్పడు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ‘పవర్ హాలిడే’ పేరుతో పరిశ్రమలకు వారంలో రెండు రోజులు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేసింది. దీంతో కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. మళ్లీ ఇప్పుడు అవే దుర్భర పరిస్థితులు దాపురిస్తున్నాయనే ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.విజయనగరం జిల్లా బొబ్బిలి తారకరామ కాలనీలో విద్యుత్ కోతల వల్ల ఇళ్లలో ఉక్కపోత భరించలేక అర్ధరాత్రి చంటి బిడ్డతో సహా ఆరుబయట కూర్చుని జాగారం చేస్తున్న జనం భవిష్యత్ కోసం..భవిష్యత్లో విద్యుత్ కోసం ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రణాళికలు అమలుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి అత్యంత తక్కువ ధరకే తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది.నాడు విద్యుత్తు వెలుగులుఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి విద్యుత్ డిమాండ్ ప్రధాన సూచికగా భావిస్తుంటారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో గత ప్రభుత్వం విజయం సాధించింది. తీవ్ర బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాలు సంక్షోభం ఎదుర్కొన్నప్పటికి ఏపీలో వినియోగానికి సరిపడా విద్యుత్ సరఫరాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఫలితంగా 2020 నుంచి 2024కి 22.5 శాతం విద్యుత్ సరఫరా వృద్ధి చెందింది. తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 2020లో రాష్ట్రంలో ఏడాది మొత్తం మీద 65,414 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఉండగా 2024లో 80,151 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తింది. భారత్కు చైనా బొగ్గు దిగుమతులు పడిపోయాయి. ఆస్ట్రేలియా నుంచి కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. జపాన్లోనూ విద్యుత్ సంక్షోభం తాండవించింది. శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే దుస్తులు వాడి హీటర్లకు విద్యుత్ వినియోగం తగ్గించాలని అక్కడి ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో 15 శాతం విద్యుత్ వినియోగంతో పాటు సహజ ఇంధనం ధరలు పెరగడంతో ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్ బకాయి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టు విద్యుత్ను ఎలాంటి కోతలు లేకుండా గత ప్రభుత్వం ప్రజలకు అందించింది.మా బతుకుల్లో వెలుగు కరువుపగలు రెండు గంటలు, రాత్రి రెండు గంటలు కరెంట్ తీసేస్తున్నారు. రాత్రిళ్లు సరిగ్గా భోజనాల వేళకు కరెంట్ పోతోంది. వారంలో ఒక రోజు రోజంతా కరెంట్ ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా ఇంటికి ఎలాంటి మంచి జరగలేదు. నా భర్తకు పక్షవాతం వస్తే కనీసం పింఛన్ ఇవ్వడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ఇంట్లో, మా బతుకుల్లో ఈ ప్రభుత్వం వల్ల వెలుగు లేకుండా పోయింది. –దిద్దె రత్నకుమారి, జ్యోతి కాలనీ, నిడదవోలు, తూర్పు గోదావరి జిల్లాఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందోఉపాధి కోసం పిండి మర పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఓల్టేజ్ ఎక్కువ, తక్కువ అవుతోంది. దీనివల్ల మోటార్లు కాలిపోతున్నాయి. –కిశోర్, నాగమణి పిండిమిల్లు, టీఆర్ కాలనీ, బొబ్బిలితెల్లార్లూ కూర్చునే ఉంటున్నాం..కరెంటు కోసం రోజంతా ఎదురు చూడాల్సిందే. తెల్లార్లూ కూర్చునే ఉండాల్సిన పరిస్థితి. సాయంత్రం తీసి తెల్లవారు జామున 3 గంటలకు ఇస్తున్నారు. అందాకా మెలకువగానే ఉంటున్నాం. ఇదేనా నాణ్యమైన విద్యుత్తు? –సీహెచ్ లక్ష్మి, బొబ్బిలిఏం ప్రభుత్వమో ఏమో?గత ప్రభుత్వంలో నగరంలో విద్యుత్ సరఫరా ఆగడం ఎప్పుడూ చూడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెట్టుకొమ్మలు నరుకుతున్నాం, ట్రాన్స్ ఫార్మర్ బాగు చేస్తున్నాం.. అంటూ ఏదో ఒక సాకుతో వారంలో ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కరెంటు కట్ చేస్తున్నారు. ఇదేం ప్రభుత్వమో ఏమో? వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా..? మరి ఎందుకు పట్టించుకోరు? –డి.లలిత, విశాఖపట్నంపసిపాప అల్లాడుతోంది..మా అమ్మగారింటికి వచ్చా. ఇక్కడ కరెంట్ అసలు ఉండటం లేదు. అస్తమానూ తీసేస్తున్నారు. చిన్నపాప ఉక్కపోతకు అల్లాడి పోతోంది. మా పరిస్థితి ఏమని చెప్పుకుంటాం. కరెంటు కట్ చేయొచ్చు కానీ రాత్రిళ్లు కూడా లేకుండానా? కోతల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. –దివ్య, బొబ్బిలిబిల్లుల మోత.. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీలిచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. విద్యుత్ బిల్లుల మోత మోగిస్తున్న ప్రభుత్వం కోతలను పట్టించుకోవడం లేదు. – షేక్ మహమ్మద్ అలి, కంభం, ప్రకాశం జిల్లారైతన్న కష్టం వృథా...!నాకున్న ఎకరం పొలానికి తోడు మూడెకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. చివరి నేలకు తడి లేకపోతే ఇన్ని నెలల కష్టం వృథా అవుతుంది. ఎకరాకు కనీసం రూ.35 వేలు చొప్పున కౌలు చెల్లించాలి. గత ప్రభుత్వంలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ ఒకే విడతలో ఇచ్చేవారు. ఇప్పుడు రోజులో రెండు, మూడు విడతలుగా ఇస్తున్నారు. అది కూడా 7 గంటలు మించడం లేదు. దీంతో తడిసిన నేలే మళ్లీ తడిచి పంటలు ఎండిపోతున్నాయి. గతంలో రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు అదీ లేదు. –యాతం రామాంజనేయులు, కడియద్ద, పశ్చిమ గోదావరి జిల్లాఏ పురుగో పుట్రో కరిస్తే...!ఏం ప్రభుత్వమో ఏంటో..! చచ్చిపోతున్నాం ఆఫీసుల చుట్టూ తిరగలేక. నాలుగు రోజులుగా నరకం చూపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. పంట ఎండిపోతోందంటే ఎవరూ వినిపించుకోవడం లేదు. రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా కొత్తది ఇవ్వడం లేదు. గతంలో 9 గంటలు కరెంటు ఇచ్చేవారు. ఇప్పుడు 7 గంటలు ఇస్తే అదే ఎక్కువ. తెల్లవారుజామున 4 గంటలకు ఇస్తుండటంతో ఆ సమయంలో పొలానికి వచ్చి చేలకు నీరు పెట్టుకుంటున్నాం. ఏ పురుగో పుట్రో కరిస్తే మా పరిస్థితి ఏంటి? ఇదేం బాలేదు. ప్రభుత్వం ఇవన్నీ చూసుకోవాలి కదా!! –మదుకూరి కొండల రాజు, కృష్ణాపురం, పశ్చిమగోదావరి జిల్లా -
కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు
తిరుపతి రూరల్/పాకాల/అమరావతి: కారు అదుపు తప్పి కంటైనర్ను ఢీకొట్టి దాని దిగువన చిక్కుకుపోగా.. గుర్తించని కంటైనర్ డ్రైవర్ కారును ఈడ్చుకుని పోయిన ఘటన తిరుపతి జిల్లా పాకాల మండలం కోనపరెడ్డిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు కారులో శనివారం తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.సోమవారం వీరంతా ఒకే కారులో తిరిగి వెళుతుండగా.. పాకాల మండలం కోనపరెడ్డిపల్లి వద్ద కారు అదుపుతప్పి ముందు వెళుతున్న కంటైనర్ను వెనుకనుంచి ఢీకొట్టి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గమనించని కంటైనర్ డ్రైవర్, కంటైనర్తోపాటు కారునూ వంద మీటర్ల దూరం వరకూ లాక్కుని వెళ్లడంతో కారు మొత్తం నుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కర్ణాటకలోని బెంగుళూరు గౌడన్పాళ్యకు చెందిన విజయలక్ష్మి (50), సహాన (34), ఎస్ఆర్ రజని (27), ఆర్.లేఖన్ గౌడ (11), తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరుకు చెందిన ఎస్.త్యాగరాజన్ (42) అక్కడికక్కడే మృతి చెందారు.కర్ణాటకలోని సబ్బనహళ్లికి చెందిన గీతమ్మ, తమిళనాడులోని హోసూరుకు చెందిన టి.క్రిస్విన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జాతీయ రహదారిపై భారీ శబ్దం రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించి పరుగు పరుగున అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు ఘటనా స్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి కంటైనర్ను సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.సీఎం చంద్రబాబు విచారం ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కర్ణాటక, తమిళనాడు వాసుల కుటుంబీకులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని, చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కలెక్టర్, ఎస్పీలను సీఎం ఆదేశించారు. ఘటనపై మంత్రి రాంప్రసాద్రెడ్డి విచారం వ్యక్తం చేస్తూ మెరుగైన సేవలు అందించాలని జిల్లా అధికారులకు సూచించారు. -
డొల్ల కంపెనీలతో డీల్!
సాక్షి, అమరావతి: ఊరూ పేరు లేని ఉర్సా కంపెనీకి టీడీపీ సర్కారు విశాఖలో రూ.3,000 కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన భూములను ఎకరా 99 పైసలకే కేటాయించిన నేపథ్యంలో ఈ కుంభకోణం జాతీయ స్థాయిలో పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. భూ కేటాయింపులపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానాలను న్యాయ నిపుణులు, రాజకీయ పరిశీలకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒకపక్క కేంద్ర సంస్థలకు కేటాయించిన భూములకు రూ.కోట్లలో వసూలు చేస్తూ... మరోపక్క తన బినామీలు, వందిమాగదులకు కారుచౌకగా సంతర్పణ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత పది రోజులుగా ఉర్సా భూ కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా కూటమి సర్కారుతోపాటు అనుకూల మీడియా కిక్కురుమనకపోవడం ఆరోపణలకు మరింత బలం చేకూరుతోందని పేర్కొంటున్నారు.చంద్రబాబు సర్కార్ను ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన పోస్టు ఉర్సాకు భూ కేటాయింపులు చట్ట విరుద్ధం: ప్రశాంత్ భూషణ్ ఓ ఘోస్ట్ కంపెనీకి చంద్రబాబు సర్కారు చట్ట విరుద్ధంగా 59.6 ఎకరాలను కేటాయించిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్ వేదికగా విమర్శించారు. కనీసం ఆఫీసు, ఎలాంటి ట్రాక్ రికార్డు లేని కంపెనీతో ప్రభుత్వం ఎలా ఒప్పందం కుదుర్చుకుంటుందని ప్రశ్నించారు. ఇలాంటి దొంగ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం దాదాపు ఉచితంగా భూమి ఇచ్చిందని, ఇది కిక్ బ్యాక్స్ ఒప్పందమా? లేక ఉన్నతస్థాయి నాయకుల సంబంధమా? అని ప్రశ్నించారు.ఉర్సా ఎవరి క్లస్టర్?: తెలకపల్లి రవిఉర్సా క్లస్టర్కు భూ కేటాయింపులపై చాలా సందేహాలున్నాయని, అది ఎవరి క్లస్టర్ అన్నది తేలాలని సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తన యూట్యూబ్ చానల్లో పేర్కొన్నారు. ‘రెండు నెలల కిందట ఏర్పాటైన ఉర్సా క్లస్టర్ ప్రైవేటు లిమిటెడ్కు దాదాపు 60 ఎకరాల భూమిని కేటాయించారు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్తో పాటు ఐటీ, ఏపీఐఐసీ విభాగాలు, సోషల్ మీడియా వింగ్ స్పందించడం లేదు. ఉర్సా కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటోలు ఉన్నాయి. తెలంగాణ పత్రికలు ఈ విషయాన్ని ప్రముఖంగా ఇస్తుంటే ఆంధ్రాలో మాత్రం మీడియా మౌనంగా ఉండటం చాలా సందేహాస్పదంగా ఉంది. 2014–19లో కూడా టీడీపీ ప్రభుత్వం తన సన్నిహితులకు చాలా విలువైన భూములను ధారాదత్తం చేసింది’ అని పేర్కొన్నారు.అదే నిజమైతే కేటాయింపులు ఆపాలి: కె.నాగేశ్వరరావుఊరూ పేరులేని కంపెనీకి, లోకేశ్ బినామీలకు భూకేటాయింపులు చేశారన్న ఆరోపణలు నిజమైతే ఉర్సాకు భూ కేటాయింపులను తక్షణం ఆపాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కె.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ‘మా యూట్యూబ్ ఛానల్కు 99 పైసలకు విశాఖలో కనీసం ఒక ఎకరా ఇవ్వమని చెప్పండి. ఉర్సా.. టీసీఎస్ కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తా. పది పైసలకు పది గుంటలు ఇచ్చినా యూట్యూబ్ చానల్ను విస్తరించి పెద్ద మీడియా సంస్థ ఏర్పాటు చేస్తా.ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు భూములు విక్రయించడం ద్వారా హక్కులు వదులుకోకూడదు. ఫిబ్రవరిలో ఏర్పాటైన ఉర్సా కంపెనీకి 59.6 ఎకరాలు ఎలా కేటాయిస్తారు? ఉర్సాపై ఇంత దుమారం రేగుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? లోకేశ్ బినామీ కిలారు రాజేష్ సంస్థకు భూములు కేటాయించారంటున్నా ఎందుకు స్పందించడం లేదు?’అని తన యూ ట్యూబ్ చానల్లో పేర్కొన్నారు. -
AP: మళ్ళీ భూములు సమీకరణకు చంద్రబాబు
విజయవాడ: రాజధాని కోసం అంటూ ఇప్పటికే వేల ఎవరాలు సేకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మళ్లీ భూముల సమీకరణకు సిద్ధమయ్యారు. ఎయిర్ పోర్ట్, క్రికెట్ స్టేడియం పేరుతో మళ్లీ భూ సమీకరణ చేపట్టడానికి సిద్ధమైంది చంద్రబాబు సర్కారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతుల సమావేశంలో చెప్పేశారు. ఎయిర్ పోర్టు, స్టేడియం నిర్మాణంతో భూముల విలువ పెరుగుతుందని మరో కథ చెప్పేశారు చంద్రబాబు. రాజధాని పనులు పునః ప్రారంభ కార్యక్రమానికి రైతులను ఆహ్వనిస్తామన్నారు. రైతులకు రిటర్న్ బుల్ ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారు. త్యాగాలు చేసిన రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ కార్యక్రమమూ ఉండదన్నారు చంద్రబాబు. -
ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు అయ్యారు. బీజేపీ నేత, భీమవరానికి చెందిన పాక వెంకటసత్యనారాయణ(Paka Venkata Satyanarayana)ను ఎంపిక చేసింది ఆ పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. కూటమి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్ వేయబోతునున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. తొలుత తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు అవకాశం దక్కవచ్చనే ప్రచారం జరిగింది. చివరకు ఏపీ నేతకే ఆ అవకాశం దక్కింది. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా ఉన్నారు పాక వెంకటసత్యనారాయణ. గతంలో భీమవరం కౌన్సిలర్గా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశారీయన. -
రేపు పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) పార్టీ జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ చర్చించే అవకాశం ఉంది. -
‘ప్రజాస్వామ్యాన్ని టీడీపీ కూనీ చేసింది’
తాడేపల్లి : ప్రజాస్వామ్యాన్ని టీడీపీ కూనీ చేసిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. టీడీపీ వైఖరికి ప్రజాస్వామ్య వాదులు సిగ్గు పడుతున్నారని ధ్వజమెత్తారు.‘స్థానిక సంస్థల్లో సజావుగా సాగుతున్న పాలనను చెడగొడుతున్నారు. ప్రజలు మెజారిటీ ఇవ్వనప్పుడు ఎందుకు అధికారం కోసం తాపత్రయం పడుతున్నారు?, తాడిపత్రిలో మా పార్టీకి అధికారం రాకపోయినా గౌరవించాం. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి సైతం జగన్ ని మెచ్చుకున్నారు. కానీ నేడు ఏం జరుగుతుందో చూసి జనం నవ్వుతున్నారు.చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పంలో ఏరకంగా టీడీపీ గెలుస్తుంది?, మాచర్ల, కుప్పం, తుని, విశాఖపట్నం ఇలా అన్నిచోట్లా వైఎస్సార్ సీపీ సభ్యులే అధికంగా ఉన్నారు. మా సభ్యులను ప్రలోభపెట్టి, బెదిరించి టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కున్నారు. దొడ్డిదారిలో పదవులు కైవసం చేసుకోవటం సిగ్గుచేటు. విప్ ని ధిక్కరించిన వారిపై కోర్టుకు వెళ్తాం. పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నాం. అడ్డదారిలో గెలవటం కీసం కూటమి నేతలు అనేక కుట్రలు చేశారు’ అని లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. -
మూసివేత దిశగా ఫైబర్నెట్!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ (ఏపీ ఎస్ఎఫ్ఎల్) మూసివేత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నియామకాలంటూ కూటమి ప్రభుత్వం ఏకంగా 800 మంది ఉద్యోగులను తొలిగించి.. వారి జీవితాలను రోడ్డున పడేసింది. మిగిలిన సిబ్బందికి 4 నెలలుగా జీతాలు లేకపోవడంతో.. వారంతా ఏప్రిల్ 1నుంచి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. కేబుల్ కట్ అయినప్పుడు వెళ్లి సరిదిద్దడానికి వినియోగించే ఆటోలకు 8 నెలలుగా చార్జీలు చెల్లించకపోవడంతో వీరు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో కనీసం ప్రసారాలు ఆగిపోతే పునరుద్ధరించలేని పరిస్థితి. కస్టమర్ కేర్కు ఫోన్ చేసినా కాల్ రిసీవ్ చేసుకునే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వం నిరంకుశత్వ చర్యలతో విసుగు చెందిన వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గడిచిన 11 నెలల్లోనే కేబుల్ కనెక్షన్ల సంఖ్య 6.5 లక్షల నుంచి 4.5 లక్షలకు పడిపోయిందంటే పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదారుల నుంచి వస్తున్న ఒత్తిడితో సమాధానం చెప్పలేక లోకల్ కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.ముగ్గురు ఎండీలు మార్పు.. చైర్మన్ రాజీనామాకూటమి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ఫైబర్నెట్ ప్రధాన కార్యాలయాన్ని సుమారు 3 నెలలపాటు సీజ్ చేశారు. 10 నెలల్లోనే ముగ్గురు ఎండీలు మారారు. ఈ పరిస్థితుల్లో ఫైబర్నెట్మూసివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేసి మరీ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేశారు. గత ప్రభుత్వ హయాంలో టెరాసాఫ్ట్లో పనిచేసిన వారందరినీ ఉద్యోగంలోకి తీసుకుంది. కానీ.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా గత ప్రభుత్వం నియామకాలంటూ 800 మందికిపైగా ఉద్యోగాల నుంచి తొలగించింది. సెటాప్ బాక్స్ పాడైపోతే కొత్త బాక్సులు ఇవ్వకపోవడం, ప్రసారాలు ఆగిపోతే పునరుద్ధరించకపోతుండంటంతో వినియోగదారులు ఫైబర్ నెట్ సేవలకు దండంపెట్టి ప్రైవేటు సంస్థల కనెక్షన్లకు తరలిపోతున్నారు. దీంతో తమ ఉపాధి దెబ్బతింటోందని ఆపరేటర్లు లబోదిబోమంటున్నారునేటినుంచి విజయవాడలో ధర్నారాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫైబర్నెట్ ఆపరేటర్లు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌక్లో రెండు రోజుల పాటు ధర్నా నిర్వహించాలని తీర్మానించుకున్నారు. తక్షణం సర్వీసులను పునరుద్ధరించడంతోపాటు కొత్త బాక్సులు అందించడం, ఈఎంఐ చార్జీలను తొలగించాలన్న ప్రధాన డిమాండ్లతో ఆపరేట్లర్లు ధర్నా నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే టెక్నికల్ సిబ్బందికి జీతాలు అందజేసి తిరిగి విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన వచ్చేవరకు విజయవాడను వదిలి వేళ్లే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం స్పష్టం చేస్తోంది. -
అందినకాడికి దోచుకో..పంచుకో..!
సాక్షి, అమరావతి: ద్రవిడియన్ వర్సిటీలో అడ్డగోలు దందా రాజ్యమేలుతోంది. అకడమిక్ సంబంధిత వ్యవహారాల కంటే అవినీతి కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్డీలు జారీ చేయడం దగ్గర నుంచి దొడ్డిదారిన అడహక్ నియామకాలకు ఒడిగట్టడం వరకూ పలు అంశాలు వర్సిటీ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. వాస్తవానికి బోధనేతర వ్యక్తులకు పాలన పగ్గాలు అప్పగించడంతోనే వర్సిటీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకాలో వర్సిటీ ఉండడంతో, ‘తాము ఏం చేసినా అడిగేవారు లేరని’ కొందరు రాజకీయ పలుకుబడి కలిగినవారు భావిస్తున్నారు. దీనితో అందినకాడికి దోచుకోవడం..పంచుకోవడం సర్వసాధారణమైపోయింది. వర్సిటీ ఆస్తులను, ఆదాయాన్ని అప్పనంగా మింగేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అడహక్ పేరుతో అడ్డుగోలు వ్యవహారం ద్రవిడియన్ వర్సిటీలో అకడమిక్ పాలన పూర్తిగా గాడితప్పింది. తాజాగా ఒక అకడమిక్ కన్సల్టెంట్కు ఏకంగా ‘అడహక్ నియామకం ద్వారా’ భారీ పే స్కేల్ను ఇచ్చేందుకు చకచకా పావులు కదపడం వర్సిటీలో పెనుదుమారం రేపింది. వాస్తవానికి వర్సిటీలో వివిధ విభాగాల్లో 30 మందికిపైగా అకడమిక్ కన్సల్టెంట్లు పని చేస్తున్నట్లు సమాచారం. కానీ, వర్సిటీ పాలకులు మాత్రం ‘ఆ ఒక్క వ్యక్తి’పై మాత్రమే ప్రత్యేక ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. గతంలో వర్సిటీలో ఎంఎస్సీ గణిత విభాగంలో అకడమిక్ కన్సల్టెంట్గా సదరు ఉద్యోగి చేరారు. ఆ తర్వాత ప్రవేశాలు లేకపోవడంతో ఈ విభాగాన్ని మూసివేశారు. దీంతో అప్పటి అకడమిక్ కన్సల్టెంట్లు వర్సిటీ నుంచి బయటకు వెళ్లిపోయారు. కానీ, ఈ ఉద్యోగి మాత్రం తన పలుకుబడితో అక్కడే డిగ్రీ విభాగంలోని బీఎస్సీ (ఎంఎస్సీఎస్)లోకి మారిపోయారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంతో అడహక్ నియామకం పొందేందుకు బాటలు వేసుకున్నారు. నేడో, రేపో నియామక పత్రం కూడా రానున్నట్టు సమాచారం. దీంతో మిగిలిన విభాగాల అకడమిక్ కన్సల్టెంట్లు అగ్గిమీద గుగ్గిళం అవుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయ ఉపాధి కేంద్రం.. కుప్పం నియోజకవర్గంలోని టీడీపీకి చెందిన ఒక మహిళా నాయకురాలు కుమారుడికి రాజకీయ ఉపాధిలో భాగంగా వర్సిటీలో ఉద్యోగం కట్టబెట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిని కూడా నిబంధనలు పాటించకుండానే అడహక్ నియామకం కింద చేపట్టి, ఇంజనీరింగ్ విభాగంలో ఏఈ పోస్టులో కూర్చో బెట్టేందుకు మార్గం సుగుమం చేశారు. సాక్షాత్తు ముఖ్యనేత కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదేశాలతోనే ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ విభాగంలో సిబ్బందికే పని లేనప్పుడు కొత్తవారిని తీసుకొచ్చి వర్సిటీపై ఆరి్థక భారం పెంచడం తప్ప ఒరిగేది ఏమీలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. త్వరలో వంద మందికిపైగా ఉద్వాసన! వాస్తవానికి వర్సిటీ ఖజానాలో ఎటువంటి నిధులు లేవు. ప్రభుత్వం కూడా కొత్తగా అభివృద్ధి నిధులు కేటాయించలేదు. ఏడాదిగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో వర్సిటీ ఉంటే..కొత్తగా నియామకాలు చేపట్టి ఏం సందేశం ఇస్తున్నారని వర్సిటీ వర్గాలు మండిపడుతున్నాయి. మరోవైపు 235 మందికిపైగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో వంద మందికిపైగా సిబ్బందికి ఉద్వాసన పలికేందుకు వర్సిటీ యాజమాన్యం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు? వాస్తవానికి వర్సిటీల్లో ప్రత్యక్షంగా నియామకాలు చేపట్టే అధికారం ఇన్చార్జ్ పాలకులకు ఉండదు. ఇందుకు ప్రభుత్వం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందస్తు అనుమతి తప్పనిసరి. ఆ తర్వాత ఉద్యోగ వివరాలతో బహిరంగ ప్రకటనల ద్వారా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది సాధారణ, అడహక్ నియామకాలకు వర్తిస్తుంది. కానీ, ద్రవిడియన్ వర్సిటీలో మాత్రం ఇన్చార్జ్ పాలకులు ‘తాము చెప్పిందే వేదం.. చేసేదే శాసనం’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది జనవరిలో జారీ చేసిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ నియామక, ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
అబ్బో.. అబ్బూరి బ్రదర్స్!
అబ్బూరి సతీష్, అబ్బూరి వెంకట్, అబ్బూరి రామకృష్ణ.. అబ్బూరి ఫ్యామిలీ చేతిలో మా కష్టార్జితాన్ని పోసి పూర్తిగా మోసపోయాం. మాలా మీరెవరూ మోసపోవద్దు. వీళ్లు పెద్ద మోసగాళ్లు. నీతి, నిజాయితీ అన్నదే లేదు. ఇక్కడ మమ్మల్ని మోసం చేసినట్లే పెద్ద వెంచర్ పేరుతో వైజాగ్లో వ్యాపారం మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. – హైదరాబాద్లో ఉర్సా బాధితుల ఆక్రోశం సాక్షి, అమరావతి: మోసాలే లక్ష్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన అబ్బూరి బద్రర్స్ హైదరాబాద్లో విల్లాల పేరుతో అనేక మందికి కుచ్చుటోపీ పెట్టారు! తాజాగా ఉర్సా ముసుగులో విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా కొట్టేశారు! ఈ బాగోతం బయట పడటంతో ముసుగు దొంగల వెనక ఉన్న ముఖ్యనేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టైంది. ఈ నేపథ్యంలో ఓ ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భూమిని ఎలా ధారాదత్తం చేసిందని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అబ్బూరీ.. ఇది నిజం కాదా? ఉర్సా క్లస్టర్స్లో ప్రధాన ప్రమోటర్గా ఉన్న సతీష్ అబ్బూరి ఫ్యామిలీ ‘ట్వంటీ ఫస్ట్ సెంచురీ’ పేరుతో పలు డొల్ల కంపెనీలను నెలకొల్పి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో ఉంటున్నామని.. ఎన్నారైలమని.. తమ నెట్వర్త్ రూ.వందల కోట్లంటూ అబ్బూరి బ్రదర్స్ హైదరాబాద్లో విల్లాలు కడతామని ప్రచారం చేసుకుని కష్టార్జితాన్ని ధారపోసిన వారికి కుచ్చుటోపీ పెట్టారు. ముగ్గురు అన్నదమ్ముల్లో వెంకట్ అబ్బూరి, సతీష్ అబ్బూరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తుండగా హైదరాబాద్లో రామకృష్ణ అబ్బూరి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించారు.అమెరికాలో ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ ఎల్ఎల్సీ పేరుతో సతీష్ అబ్బూరి కంపెనీ నమోదు అయిన విషయాన్ని కేశినేని నాని సాక్ష్యాలతో సహా ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం తెలిసిందే. దీనికి అనుబంధంగా ఇండియాలో ఏర్పాటైన కంపెనీలో అబ్బూరి రామకృష్ణ, అబ్బూరి లతతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన భార్య కేశినేని జానకిలక్ష్మి డైరెక్టర్లుగా వ్యవహరించారు. కేశినేని చిన్ని వైదొలగిన తర్వాత జానకిలక్ష్మి డైరెక్టర్గా కొనసాగారు. అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సీకి అనుబంధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఇండియాలో ఏర్పాటు చేశారు. అంతా కలసి పంగనామం.. హైదరాబాద్లోని నిజాంపేట, బాచుపల్లి, గాజులరామారం, ఎల్బీనగర్ వద్ద ‘స్ప్రింగ్ వ్యాలీ’ పేరుతో విలాసవంతమైన విల్లాలు నిరి్మస్తున్నట్లు సతీష్ అబ్బూరి ఫ్యామిలీ భారీగా ప్రచారం చేసింది. ఆ తర్వాత కోట్లాది రూపాయలు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో వందలాది మంది తమ కష్టార్జితాన్ని వీరి వద్ద ఇన్వెస్ట్ చేసి దారుణంగా మోసపోయారు. కంపెనీ కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో రామకృష్ణ ఫ్యామిలి రెండేళ్లు కనపడకుండా పారిపోయినట్లు ఓ బాధితుడు పేర్కొన్నారు. బాధితులు అంతా కలసి ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో ఒక ఫోరం ఏర్పాటు చేసుకుని అబ్బూరి ఫ్యామిలీ చేతిలో ఎలా మోసపోయారో ప్రపంచానికి చాటి చెప్పారు. తమలా మరెవరూ మోసపోవద్దని హెచ్చరించారు.ఎట్టకేలకు అమెరికాలో పని చేస్తున్న సతీష్ అబ్బూరి ఒరాకిల్ కంపెనీ చిరునామా, ఫోన్ నంబరు వివరాలను సేకరించి అక్కడున్న వారు ఎవరైనా సాయం చేయాలంటూ ప్రాథేయపడ్డారు. దీన్ని బట్టి బాధితులు ఎంత నరకం అనుభవించారో ఊహించవచ్చు. ఆ ముగ్గురు సోదరులు తమ వెనుక పెద్ద శక్తులున్నాయని, తమను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగుతున్నారని ఓ బాధితుడు వాపోయాడు. ‘మోసగాళ్లయిన వీళ్లు వైజాగ్లో వెంచర్ ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాలా మీరు మోసపోకండి..’ అంటూ పలువురు బాధితులు గతంలోనే హెచ్చరించారు. అదే మోసగాళ్లు ఇప్పుడు ఉర్సా పేరుతో మళ్లీ విచ్చేస్తున్నారంటూ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘ట్వంటీ ఫస్ట్ సెంచురీ’తో తనకు సంబంధం లేదని సతీష్ అబ్బూరి జూమ్ మీటింగ్లో పేర్కొన్నాడు. ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో బాధితుల వాయిస్లున్న పేజీలను డేటాబేస్ నుంచి పూర్తిగా తొలగించేశారు. ఒకపక్క బాధితులను బెదిరిస్తూ.. మరోపక్క వెబ్సైట్లో పేజీలను డిలీట్ చేయించటాన్ని బట్టి దొంగెవరో ప్రత్యేకించి చెప్పాలా..? అని బాధితులు మండిపడుతున్నారు. ఇలాంటి ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భూమిని ఎలా ధారాదత్తం చేసిందని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
‘సన్’కటమే!
సాక్షి, అమరావతి: ‘‘అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం.. తగ్గిస్తాం.’’ అని ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబు పదవిలోకి రాగానే రూ.15,485 కోట్ల చార్జీల భారం ప్రజలపై వేశారు. ఇదేమిటని నిలదీస్తున్న వారికి సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాలని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు వారి చేత బలవంతంగా రిజి్రస్టేషన్ చేయిస్తున్నారు. ఇంటిపైనే కరెంటును ఉత్పత్తి చేసి, వాడుకోవడంతో పాటు అమ్ముకుని లాభం పొందవచ్చంటూ నమ్మిస్తున్నారు. ప్రతి ఇంటినీ ఓ విద్యుత్ గ్రిడ్గా మారుస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ ప్రజల నుంచి కనీస స్థాయిలో స్పందన రావడం లేదు. దీంతో ప్రజలను ఒప్పించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. విద్యుత్, అధికారులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు సోలార్ రూఫ్ టాప్ల రిజిస్ట్రేషన్లు చేయించాలని సర్కారు విద్యుత్ శాఖ అధికారులకు లక్ష్యాలను నిర్దేశిస్తోంది. దీంతో వారు క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఒత్తిళ్లు తెస్తున్నారు. వినియోగదారులతో బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు పాట్లు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీనే రూ.6వేల వరకు ఉండడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో రిజ్రస్టేషన్లు చేయించేందుకు సతమతమవుతున్నారు. విద్యుత్ బిల్లుల్లో రిజిస్ట్రేషన్ చార్జి సర్దుబాటు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించలేమంటున్న ప్రజలకు విద్యుత్ అధికారులు ఆ చార్జీ చెల్లించవలసిన అవసరం లేదని విద్యుత్ బిల్లుల్లో విడతల వారీగా సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. దీనిని నమ్మి సంతకాలు చేసిన వారికి నెలతిరక్కుండానే విద్యుత్ బిల్లు మోతమోగుతోంది. రాయితీల ఎర సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్న ప్రభుత్వం రాయితీల ఎర వేస్తోంది. దీనికోసం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి పలు ప్రతిపాదనలు చేయించింది. దీంతో ఇళ్లపై 10 కిలో వాట్ల సామర్ధ్యం వరకూ ఉండే సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ఏర్పాటుకు రిజిస్ట్రేషన్(దరఖాస్తు) చార్జీల మాఫీతో పాటు, నెట్మీటర్రింగ్ ఖర్చునూ మినహాయించాలని ఏపీఈఆర్సీ నిర్ణయించింది. ఈ మేరకు డిస్కంలకు ఆదేశాలు జారీ చేసింది. అయినా భారమే ప్రభుత్వం రాయితీలు ఇచ్చినా.. 3 కిలోవాట్ల సామర్థ్యం కల సోలార్ రూఫ్ టాప్ పెట్టాలంటే రూ.1.80 లక్షలు వెచ్చిoచాలి. దీనికి అదనంగా దరఖాస్తు రుసుం 5 కిలోవాట్ల వరకూ రూ.1000, ఆ పైన రూ.5వేలు చొప్పున చెల్లించాలి. మీటరింగ్ చార్జీలు కూడా ప్రస్తుతం అదనంగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అదనపు చార్జీలను మాత్రమే మినహాస్తామంటున్నారు. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ వల్ల రోజూ దాదాపు 12 యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. అంటే నెలకు 360 యూనిట్లు. రోజూ ఎండ ఉండదు కాబట్టి, సగటున 300 యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుందని ప్రభుత్వ అంచనా. రాష్ట్రంలో దాదాపు మూడు నెలలు వర్షాలు అధికంగా కురుస్తాయి. మిగతా రోజుల్లోనూ అనేక ప్రాంతాల్లో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంత విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం లేదు. నిజానికి విద్యుత్ ఉత్పత్తి విధానాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఎక్కువని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్లనే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కలిపి రూఫ్టాప్ సామర్ధ్యం 11 గిగావాట్లు కాగా అందులో నివాస గృహాలపై ఉన్నది కేవలం 2.7 గిగావాట్లు మాత్రమే.సోలార్ ప్యానళ్లు, పరికరాలకు అదనపు ఖర్చు! సోలార్ ప్యానళ్లతోపాటు పరికరాలకు సబ్సిడీ పోనూ రూ.2లక్షలుపైనే అవుతుంది. ఇది సామాన్యులకు పెనుభారమే. సోలార్ ప్యానళ్ల నిర్వహణ కూడా చాలా కష్టం. వాటిని తరచూ తుడవాలి, నీటితో కడగాలి. దుమ్ము పడకుండా చూసుకోవాలి. ఏ క్రికెట్ బాలో తగిలితే ప్యానెల్పై ఉండే అద్దం పగిలిపోయి వర్షం పడినప్పుడు పాడైపోతుంది. ఈ ప్యానెళ్లతోపాటు ఏర్పాటు చేసే 3 రకాల బాక్సులు పాడైతే మరింత ఖర్చు తప్పదు. ఈ బాధలన్నీ పడలేక ప్రజలు సోలార్ రూఫ్ టాప్పై ఆసక్తి చూపడం లేదు. -
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కాపాడండి: ఆప్టా
సాక్షి, అమరావతి: ప్రభుత్వం 117 జీవోకు ప్రత్యామ్నాయంగా తెస్తున్న మార్పులతో రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరిగి విద్యార్థుల చేరిక తగ్గిపోయి మూతబడే ప్రమాదముందని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.ఈ పరిస్థితి రాకుండా ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలలో 1:20 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం పోస్టులు కేటాయించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు లేఖ రాసినట్టు ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏజీఎస్ గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్ రావు తెలిపారు. మిగులు స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో హెచ్ఎంగా నియమించే కంటే వారిని యూపీ పాఠశాలలో నియమిస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలాగే, ఎస్జీటీలకు పదోన్నతి కలి్పంచి మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో హెచ్ఎంలుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. -
కేంద్ర సంస్థలకు రూ.కోట్లలో..'ఉర్సాకు ఊరికే'!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర సంస్థలకైతే ఎకరా రూ.4 కోట్లు.. ఆర్మీకైనా సరే కోటికి తగ్గేది లేదు..! ఉర్సాకైతే ఊరికే! ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? ఊరూ పేరు లేని కంపెనీపై ఔదార్యం వెనుక గుట్టు ఏమిటి? ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలు ఏర్పాటవుతుంటే ఏ ప్రభుత్వమైనా స్వాగతించి వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి భూముల కేటాయింపులో ఉదారంగా వ్యవహరిస్తుంది! కానీ.. ప్రముఖ కేంద్ర సంస్థల నుంచి ఎకరా రూ.నాలుగు కోట్ల చొప్పున వసూలు చేస్తూ.. ఊరూ పేరు లేని ఓ డొల్ల కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్లకుపైగా విలువ చేసే అత్యంత విలువైన దాదాపు 60 ఎకరాలను ఎకరా 99 పైసలకే కట్టబెట్టడం నాకింత.. నీకింత లాంటి లాలూచీ వ్యవహారాలకు పరాకాష్ట! పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలకు గతంలో చంద్రబాబు సర్కారు అమరావతిలో ఎకరా రూ.4 కోట్లు చొప్పున భూములను కేటాయించింది. హడ్కో, ఎల్ఐసీ, గెయిల్, ఎఫ్సీఐ, ఆర్బీఐ, ఎస్బీఐ, విజయా బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్ ఇండియా టెక్నికల్ ఎకనమిక్ సర్వీస్ లాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లు చొప్పున భూ కేటాయింపులు చేశారు. చివరకు దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతం ఎకరా రూ.కోటి చొప్పున భూమిని కేటాయించడం గమనార్హం. ఇలా కేంద్ర, జాతీయ సంస్థలకు భూములిచ్చినందుకు భారీగా వసూలు చేస్తూ ఊరూ పేరు లేని అనామక ఉర్సా కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్ల విలువైన 59.86 ఎకరాల ఖరీదైన భూమిని అత్యంత కారు చౌకగా కట్టబెడుతూ తన బంధువులు, బినామీలు, సన్నిహితులకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడంలో చేతికి ఎముకే లేదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు భూములు కేటాయించేటప్పుడు మాత్రం మార్కెట్ ధరను తెరపైకి తేవడం.. బంధుగణం, బినామీలకు మాత్రం కారుచౌకగా ప్రభుత్వ భూములను రాసిచ్చేయడం సీఎం చంద్రబాబుకు రివాజు అని పారిశ్రామికవేత్తలు, అధికార వర్గాలే స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ తనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీ రావుకు చెందిన బోగస్ కంపెనీ ఐఎంజీ భారత్కు గచ్చిబౌలిలో 400 ఎకరాలు.. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో 450 ఎకరాల భూమిని కేటాయించడం చంద్రబాబు భూ సంతర్పణకు పరాకాష్టగా పేర్కొంటున్నారు. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను కొనసాగించారని ప్రస్తావిస్తున్నారు. భూ పందేరానికి ఆధారాలివిగో.. నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ తండ్రి ఎం.పట్టాభిరామారావుకు చెందిన వీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్కు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన 498.93 ఎకరాల భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయిస్తూ 2015 జూలై 15న నాటి చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెంబరు 269) జారీ చేసింది. బహిరంగ మార్కెట్ ప్రకారం ఆ భూముల విలువ అప్పట్లోనే రూ.498 కోట్లు. ఆ తర్వాత ఆ భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) పరిధిలోకి తెస్తూ 2015 సెపె్టంబరు 22న ఉత్తర్వులు (జీవో ఎంస్ నెంబరు 207) జారీ చేయడం ద్వారా వాటి విలువను మరింతగా పెంచుకున్నారు. సత్తా లేని సంస్థకు సంతర్పణ..! జనసేన, బీజేపీతో జట్టుకట్టి 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన బంధువులు, సన్నిహితులు, బినామీలకు ప్రభుత్వ భూములను ఇష్టారీతిన ధారాదత్తం చేస్తున్నారు. ఊరూ పేరూ లేని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖలోని ఐటీ పార్క్లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు.. ఎకరం కేవలం 99 పైసలకే కేటాయించడమే అందుకు నిదర్శనం. వాస్తవంగా ఆ భూముల విలువ రూ.3 వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేవలం రెండు నెలల క్రితం ఏర్పాటైన కంపెనీకి రూ.5,278 కోట్ల పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ ప్రాజెక్టును నెలకొల్పే సామర్థ్యం ఉందా.. లేదా? అన్నది పరిశీలించుకోకుండా భూ కేటాయింపులు చేశారంటే.. ఆ సంస్థ ఎవరి బినామీలదో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్ర సంస్థలకు మార్కెట్ ధరకే.. విశాఖలో గతంలో టీడీపీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మార్కెట్ ధరకే భూమిని కేటాయించారు. కీలకమైన నావికాదళ స్థావరం ఏర్పాటుకు ఇండియన్ నేవీతో పాటు ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంటుకు కూడా మార్కెట్ ధరకే భూమి ఇచ్చారు. దీనికి భిన్నంగా ఉర్సాకు విశాఖలో అత్యంత ఖరీదైన ఐటీ పార్కులో 3.5 ఎకరాలతో పాటు కాపులుప్పాడలో ఏకంగా 56.36 ఎకరాలను కేటాయించేందుకు టీడీపీ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉర్సా కంపెనీ గత ఫిబ్రవరిలో హైదరాబాద్లోని నివాస ప్రాంతంలో ఓ అపార్టుమెంట్లోని ఫ్లాటు అడ్రస్తో ఏర్పాటు కాగా ‘ఎక్స్’ ఖాతాలో ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక పోస్టు పెట్టింది. అది కూడా భూ కేటాయింపులపై విమర్శల నేపథ్యంలో వివరణ ఇస్తూ చేసిన పోస్టు మాత్రమే. ఇక ఈ ఖాతాను కేవలం ఒకే ఒక్కరు ఫాలో అవుతుండటం గమనార్హం. దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రక్షణ వ్యవస్థలో భాగస్వామిగా ఉన్న ఇండియన్ నేవీకి కూడా మార్కెట్ ధరకే భూమిని కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఉర్సాకు మాత్రం నామమాత్ర ధరకే సంతర్పణ చేయడం వెనుక భారీ వ్యవహారమే ఉందనే ఆరోపణలున్నాయి. విశాఖలోని కీలకమైన ఏపీ సెజ్లో ఎకరా ధర లీజు రూ.35 లక్షల మేర పలుకుతోంది. ఏ సంస్థకు భూమి కావాలన్నా ఇదే ధర చెల్లించి భూమిని లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంస్థ కార్యాలయం నిర్మాణం కోసం అనకాపల్లిలోని రాజుపాలెం వద్ద మార్కెట్ ధర మేరకు ఎకరా రూ.80 లక్షల చొప్పున సర్వే నెంబరు 75/3లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 25 జనవరి 2016న టీడీపీ సర్కారు 326/2016 జీవోను జారీ చేసింది. నిబంధనలు ఏం చెబుతున్నాయి?2012లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు (జీవో నెంబరు 571– 14–9–2012) ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో.. మార్కెట్ విలువ మీద వార్షిక లీజు రెంటల్ పది శాతం కంటే తక్కువ ఉండకూడదు. లీజును ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మార్కెట్æ ధర ఆధారంగా సవరించాలి. విశాఖలో టీసీఎస్తో పాటు ఉర్సాకు ఇవ్వనున్న భూమి రిజిస్ట్రేషన్ ధరల మేరకే చదరపు గజం రూ. 30 వేల వరకు ఉంది. ఇక మార్కెట్ ధరను గనుక తీసుకుంటే రూ.లక్ష వరకూ పలుకుతోంది. ఇంత విలువైన భూమిని ఊరూ పేరు లేని ఉర్సాకు ఎకరం 99 పైసలకే ఇచ్చేందుకు టీసీఎస్ను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి కథ నడిపినట్లు స్పష్టమవుతోంది. -
శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నేడు కీలక సమీక్ష
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నేడు (సోమవారం) కీలక సమీక్షా సమావేశం జరగనుంది. ప్రాజెక్టు భద్రతకు చేపట్టాల్సిన మరమ్మతు పనులను నిర్దేశిత కాలపరిమితిలోపు చేపట్టకపోవడంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆప్రాన్ దిగువన 50 మీటర్ల దూరంలో 120 మీటర్ల లోతుతో భారీ గుంత పడింది. ఈ గుంత పునాది కింద వరకు విస్తరించిందన్నది నిపుణుల కమిటీ అనుమానం. కృష్ణా వరదల ఉద్ధృతికి స్పిల్ వే ఎగువన కటాఫ్ దెబ్బతినడం వల్ల స్పిల్ వేలో 490 అడుగుల వద్ద ఉన్న గ్యాలరీలో గరిష్ట నీటి మట్టం ఉన్నప్పుడు నిమిషానికి 450 గ్యాలన్లు, కనిష్ట నీటిమట్టం ఉన్నప్పుడు 220 గ్యాలన్ల మేర లీకేజీ (సీపేజీ) చోటుచేసుకుంటోంది.ప్రాజెక్టు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్.. తక్షణమే మరమ్మతులు చేపట్టి మే 31లోగా పూర్తి చేయాలని మార్చి 6న ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పటికీ ఈ పనులు చేపట్టకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే సమీక్షా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు భద్రతను సమీక్షించేందుకు అనిల్ జైన్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణుల బృందం విజయవాడ వస్తోంది.ఈ బృందం ఏపీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనుంది. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనుంది. బుధవారం హైదరాబాద్లో తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రాజెక్టు భద్రతపై సమీక్షించనున్న ఈ బృందం గురువారం నాగార్జునసాగర్ను పరిశీలించి.. భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ అధికారులకు మార్గనిర్దేశం చేయనుంది. -
ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు కొత్త ప్రిన్సిపాళ్లు
సాక్షి, అమరావతి: ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు కొత్త ప్రిన్సిపాళ్లను, ఐదు బోధనాస్పత్రులకు కొత్త సూపరింటెండెంట్లను నియమించినట్టు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయం ఆదివారం ప్రకటించింది. వైజాగ్ ఆంధ్ర, కాకినాడ రంగరాయ, రాజమండ్రి, కడప, నెల్లూరు, తిరుపతి శ్రీవెంకటేశ్వర వైద్య కళాశాలలకు ప్రిన్సిపాళ్లను నియమించారు.డీఎంఈ డాక్టర్ నరసింహాన్ని కాకినాడ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి తప్పించారు. అదే విధంగా వివిధ కళాశాలల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారిని ఒంగోలు, శ్రీకాకుళం, విజయవాడ, తిరుపతి రుయా, విశాఖ కేజీహెచ్లకు నూతన సూపరింటెండెంట్లుగా బదిలీ చేశారు. -
‘దక్షిణ భారతంలో కూడా అధికారంలోకి వస్తాం’
విజయవాడ: దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. డా. బీఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. దీనికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు మాట్లాడిన కిషన్ రెడ్డి.. ‘దక్షిణ భారతదేశంలో కూడా అధికారంలో కి వస్తాం. తమిళనాడు, తెలంగాణలో బిజెపి ప్రభుత్వాలు వస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నారు.అంబేద్కర్ ఉత్సవాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ప్రతిస్టాత్మకం గా నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ జయంతి అనేది ఏప్రిల్ 14వ తేదీనే కాకుండా 10 రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అంబేద్కర్ దళిత సామాజిక వర్గంలో జన్మించి అనేక ఒడిదుడుకులు ఎదురుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఎన్నో అవమానాలకి గురయ్యారు.ఒక మేధావిగా ఆయన ఎదిగి అనేక పోరాటాలు చేశారు. బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం నింపారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ కీలక పాత్ర వహించారు. అంబేద్కర్ ఎంపీ గా పోటి చేస్తే ఓడించాలని నెహ్రూ విస్తృతంగా ప్రచారం చేసారు. కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పి కొట్టి పార్లమెంట్ కి పంపించేలా మేధావులు కీలక పాత్ర వహించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కాంగ్రెస్ వ్యవహరించింది. రాజకీయ స్వలాభం కోసం ఆనాడు కాంగ్రెస్ పాలన ఉండేది. అడుగడుగునా అంబేద్కర్ ని అవమానపరిచేలా కాంగ్రెస్ చేసింది. అంబేద్కర్ ఒక మేధావి అయినప్పడికి అనేక రకాలుగా కాంగ్రెస్ అవమానపరిచింది. మొదటి సారి ప్రధానిగా మోదీ ఎన్నిక అయినప్పుడు అంబేద్కర్ కి నివాళులు అర్పించి పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తి తోనే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. రాజ్యాంగాన్ని మరింత శక్తీవంతంగా ఉంచాలని మోదీ ప్రభుత్వం పని చేస్తుంది. రాజ్యాంగానికి గౌరవం ఉండేలా మోదీ ప్రభుత్వం ఉంటుంది. అంబేద్కర్ అంతిమ సంస్కారం చేసిన స్థలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. అంబేద్కర్ ఉన్న ప్రదేశాలని పంచ తీర్థ పేరుతో నిర్మాణం చేపట్టాం. పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టి గౌరవించిన ఘనత ప్రధాని మోదీది. దేశానికి సేవ చేసిన అంబేద్కర్ కి కాంగ్రెస్ భారతరత్న ఇవ్వకుండా అవమానపరిచింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ కి భారత్ రత్న ఇచ్చింది. అంబేద్కర్ సిద్ధాంతం, స్ఫూర్తి తో ప్రధాని మోదీ పని చేస్తున్నారు’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
‘జత్వానీ కౌంటర్ కేసు ఒక దుష్ట సంప్రదాయానికి రోల్ మోడల్’
సాక్షి, తాడేపల్లి: కాదంబరీ జత్వానీతో కూటమి ప్రభుత్వం పెట్టించిన తప్పుడు కౌంటర్ కేసు దేశంలో ఒక దుష్ట సంప్రదాయానికే రోల్మోడల్గా మిగిలిపోతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి ఈ కేసు పరాకాష్టగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో మేజిస్ట్రేట్ ముందు ఏనాడు పోలీసులపై ఫిర్యాదు చేయని జత్వానీతో ఏడు నెలల తరువాత కూటమి ప్రభుత్వం కావాలనే పిలిపించి తప్పుడు ఫిర్యాదు చేయించిందని, దేశంలోనే ఇటువంటి కౌంటర్ కేసు ఇదే మొదటిదని అన్నారు.ఇంకా ఆయనేమన్నారంటే..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే ఇటు పోలీస్ వ్యవస్థలో, అటు న్యాయ ప్రక్రియ విషయంలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముంబైకి చెందిన కాదంబరీ జత్వానీ సినీనటి. దేశ వ్యాప్తంగా ఆమెపై కేసులు ఉన్నాయి. ఏపీలో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పాటు చేసుకుని, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, హనీ ట్రాప్తో రూ.కోటికి పైగా బ్యాంక్ల ద్వారా తన ఖాతాలకు జమ చేయించుకున్నారని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది.దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్లాక్ మెయిలింగ్కు లొంగకపోవడంతో కుక్కల విద్యాసాగర్ ఆస్థిని కాజేసేందుకు దొంగ సంతకాలతో డాక్యుమెంట్లను సృష్టించి ఇతరులకు అమ్మేందుకు రూ.5 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు తేలింది. కొనుగోలు చేసిన వ్యక్తులు దీనిపై కుక్కల విద్యాసాగర్తో క్రాస్ చెక్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.చట్టప్రకారమే జత్వానీ అరెస్ట్కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు జరిపి, ఇందులో ముద్దాయి కాదంబరీని అరెస్ట్ చేసేందుకు విజయవాడ న్యాయస్థానంలో పిటీషన్ వేసి, సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. అనంతరం ముంబై జూహూ పోలీస్ స్టేషన్కు వెళ్ళి, స్థానిక పోలీసుల సహకారంతో ముద్దాయిని, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, అంథేరీ కోర్ట్లో హాజరుపరిచారు. అక్కడి న్యాయస్థానం సంతృప్తి చెందిన తరువాత విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. తరువాత ఈ కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు, సిమ్ కార్డ్, సెల్ఫోన్లను మద్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.అనంతరం మొత్తం ఆధారాలతో ముద్దాయిలను కోర్ట్లో హాజరుపరిచారు. దీనిపై కోర్ట్ వారిని రిమాండ్కు పంపారు. అనంతరం పోలీసులు తదుపరి విచారణ కోసం పోలీస్ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై అయిదు రోజుల పోలీస్ కస్టడీకి జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను అప్పగించారు. కస్టడీలో కూడా వారు అనేక విషయాలను వెల్లడించారు. తరువాత ముద్దాయిలు వేసుకున్న రెండు బెయిల్ పిటీషన్లు కూడా డిస్మిస్ అయ్యాయి. 2024 ఏప్రిల్ 24న ముద్దాయిలు వేసుకున్న కండీషన్ బెయిల్ మంజూరయ్యింది.23 రోజుల తరువాత మోడిఫికేషన్ జరిగి బెయిల్ కండీషన్లను రిలాక్స్ చేశారు. ముంబైలో అరెస్ట్ చేసిన నాటి నుంచి విజయవాడ కోర్ట్కు తీసుకువచ్చిప్పడు, పోలీస్ కస్టడీలో విచారణ విషయలో ఎక్కడా పోలీస్ అధికారులపై ఆమె ఫిర్యాదు చేయలేదు. నాతో పోలీస్ అధికారులు చట్టప్రకారమే వ్యవహరించారని, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదని మేజిస్ట్రేట్ ముందు చెప్పారు. అలాగే ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేదు. పోలీస్ కస్టడీలో అడ్వకేట్ సమక్షంలోనే పోలీసులు విచారణ జరిపారు. మద్యవర్తులు, అడ్వకేట్ సమక్షంలో పోలీస్ కస్టడీలో జరిగిన విచారణలో జత్వానీ అంగీకరించిన అన్ని విషయాలను మధ్యవర్తులు రాసిన తరువాత దానిపై సంతకం చేసేందుకు ఆమె నిరాకరించారు. మద్యవర్తులు మాత్రం సంతకాలు చేశారు. దీనిని బట్టి ఆమెను ఎక్కడా పోలీసులు నిర్భందం, వత్తిడి చేయలేదు. పోలీసులు సమర్పించిన నివేదికలోనూ ఆమె సంతకం చేసేందుకు నిరాకరించారనే రాసి, కోర్ట్లో సమర్పించారు.కుట్రపూరితంగా జత్వానీతో తప్పుడు ఫిర్యాదు చేయించారువిజయవాడ, ముంబై కోర్ట్ల్లో తనపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని, తప్పుడు కేసు పెట్టారని జత్వాని ఎటువంటి ఆరోపణలు చేయలేదు. దర్యాప్తు ప్రక్రియ ముందుకు సాగుతున్న తరుణంలో ఆగస్టు 2024 అంటే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత టీవీ5 కి జత్వానీ ఇచ్చిన ఇంటర్వూలో నాపైన తప్పుడు కేసులు పెట్టాయంటూ ఆరోపణలు చేశారు. ఈ ఇంటర్వూ తరువాత ఆన్లైన్ ద్వారా పోలీస్ అధికారులు ఒక ఫిర్యాదు తెప్పించుకున్నారు. దానిని ఎల్లో మీడియాలో ప్రముఖంగా ప్రచురించారు. జత్వానీపై అప్పటి పోలీస్ అధికారులు దురుసుగా ప్రవర్తించి, తప్పుడు కేసులు పెట్టారంటూ కథనాలు రాశారు.ఎల్లో మీడియా వార్తల ఆధారంగా సిటీ పోలీస్ కమిషనర్ ఒక విచారణాధికారిని నియమించారు. తరువాత 2024 సెప్టెంబర్ 5న జత్వానీ విజయవాడకు వచ్చి నగర పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. తరువాత కొందరి స్టేట్మెంట్లను కూడా పోలీసులు తీసుకున్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందే జత్వానీ కేసులో కొందరు పోలీస్ అధికారులు సీఐ నుంచి సూపర్ వైజర్ స్థాయిలో ఉన్న డీజీపీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు వరకు కేసులు పెట్టారు. కుక్కల విద్యాసాగర్ను అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 13న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అంతకు ముందే విచారణాధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు.ఒక కేసులో నేరం చేశారన్న అభియోగాల నేపథ్యంలో చట్టప్రకారం అరెస్ట్ అయి ప్రధాన నిందితురాలుగా ఉన్న కాందబరీ జత్వానీ తనపై ఉన్న కేసుల దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే, ఇంకా చార్జ్షీట్ కూడా దాఖలు కాని సందర్భంలో, కోర్ట్లో ఉన్న కేసులో ఆ ప్రక్రియను నీరుగార్చేలా కేసును డైవర్ట్ చేసి, ఆ కేసులో ఫిర్యాదు ఇచ్చిన కుక్కల విద్యాసాగర్, ఆ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులపైన కౌంటర్ కేసులు పెట్టారు. ఇది దేశ చరిత్రలో ఎక్కడా ఇలా జరగలేదు. కేసు అండ్ కౌంటర్ కేసులంటే ఇరు వర్గాల మధ్య ఘర్షన జరిగిన్పపుడు ఇరు పక్షాలు కేసులు పెట్టుకుంటాయి.జత్వానీకి కూటమి సర్కార్ రాచమర్యాదలుజత్వానీ కేసులో ఏడు నెలల తరువాత ప్రభుత్వం మారగానే కూటమి ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు జత్వానీని విలాసవంతమైన హోటల్లో పెట్టి, ఆమెకు రాచమర్యాదలు చేసి, ప్రోటోకాల్ దర్శనాలు చేయిం, ఆమెతో తప్పుడు ఫిర్యాదులు తీసుకుని కేసు పెట్టారు. ఇది చట్ట ప్రకారం తప్పు. ఇది సెక్షన్ 195 సీఆర్పీసీ ప్రకారం ఆ న్యాయస్థానంలో ఏదైనా తప్పుడు కేసు పెట్టారని, తప్పుడ డాక్యుమెంట్లు చూపించారని, దర్యాప్తులో ఒక వర్గంకు అనుకూలంగా చేశారనే విషయాలు ఉంటే ఏ కోర్టులో ఆ వ్యవహారంలో జరుగుతుందో ఆ కోర్ట్ కొన్ని ఆదేశాలు ఇవ్వవచ్చు. దానిపై దర్యాప్తు చేయమని, బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని, డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవాలని కోర్ట్ మాత్రమే ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంది. కానీ ఈ కౌంటర్ కేసు ఏడు నెలల తరువాత పోలీస్ అధికారులపై కక్ష తీర్చుకోవడానికి ఇలా తప్పుడు కేసు పెట్టారు.చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని, పెద్ద ఎత్తున అల్లర్లు జరగాలని చంద్రబాబు సంకల్పించిన సమయంలో అప్పటి అధికారులు రాజమండ్రి జైలు వరకు ఎటువంటి అల్లర్లు జరగకుండా పకడ్భందీగా బందోబస్త్ నిర్వహించారనే కక్షతోనే వారిపై ఇలా తప్పుడు కేసులు పెట్టించారు. అలాగే సిట్ దర్యాప్తులో స్కిల్ డెవలప్మెంట్ ఇతర స్కాంలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. సిట్లోని అధికారులపై కక్ష తీర్చుకునేందుకు ఇలాంటి తప్పుడు కేసులు బనాయించారు. అలాగే సిట్కు సలహాదారుగా ఉన్న అడ్వకేట్ ఐ.వెంకటేశ్వర్లుపై కూడా కేసు పెట్టడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సందర్భంలో ఈ కేసు చట్టం ముందు నిలబడదని తెలిసి, తాత్కాలికంగా అధికారులను వేధించేందుకు జత్వానీ వ్యవహారాన్ని ప్రభుత్వం వాడుకుంటోంది.పోలీస్ అధికారుల మనోస్థైర్యం దెబ్బతీశారుకూటమి సర్కార్ వల్ల కక్షసాధింపులు ఎదుర్కొంటున్న అధికారులు తమ సుదీర్ఘ కెరీర్లో ఒక్క చిన్న మచ్చ కూడా లేదు. వారికి అనేక అవార్డులు, మెడల్స్, ప్రభుత్వాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పతనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతోంది. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇదే పద్దతి వచ్చే ప్రభుత్వం కూడా అమలు చేస్తే ఏమవుతుంది? సోషల్ మీడియా, పలు తప్పుడు కేసుల్లో పోలీసులు తమపైన బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకున్నారని ముద్దాయిలు ఎదురు కేసులు పెట్టే అవకాశం ఉంది. బలవంతంగా మాతో సాక్షాలు చెప్పించారంటూ పోలీసులపై సాక్షులు కేసులు పెట్టే అవకాశం ఉంది.ఒక దుష్ట సంప్రదాయంకు ఆజ్యం పోస్తున్నారు. పోలీసులు కూడా ఆలోచించాలి. పై అధికారుల ఒత్తిడితో ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు. వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తే, దాని పరిణామాలు ఎలా ఉంటాయి? గూగూల్ టేక్ అవుట్స్, ఫోన్ రోమింగ్ సమాచారం, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు ఇలా ప్రతి అంశాన్నీ పరిగణలోకి తీసుకుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లుగానే వచ్చే ప్రభుత్వం చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికే అనేక మంది పోలీస్ అధికారులకు జీతాలు చెల్లించకుండా, రీజనల్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలంటూ వేధింపులకు గురి చేస్తోంది. పోలీస్ అధికారుల సంఘాలు కూడా దీనిపై స్పందించాలి. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి, అధికారులను సంతృప్తి పరిచామంటూ చేతులు దులుపుకుంటే, భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా కేసుల్లో పోలీస్ అధికారులు గతంలో అరెస్ట్ చేసిన ముద్దాయిలతో ఎదురు కేసులు పెట్టిస్తున్నారు.మద్యంపైనా ఇదే తరహా కౌంటర్ కేసులుతెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మద్యంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు దీనిలో ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారనే కక్షతోనే బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు పలువురు అధికారులపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం అంటూ కౌంటర్ కేసులు పెట్టింది. ప్రభుత్వమే మద్యంను విక్రయించిన నేపథ్యంలో స్కాం అనే దానికే అర్థం లేదు. అలాంటిది రాజకీయంగా వైఎస్సార్సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని లిక్కర్ స్కాం అంటూ కేసులు పెట్టారు.అధికారులను దీనిలో భాగస్వాములు చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల్లో మద్యం కేసుల్లో ఏ అధికారి ఎవరి ఇంటికి వెడుతున్నారు, ఏ డిస్టిలరీ యజమానితో మాట్లాడారు, ఎవరితో ఏ రకంగా ఫిర్యాదులు చేయిస్తున్నారో అందరికీ తెలుసు. భవిష్యత్తులో వీటిపై పోలీసులు న్యాయస్థానాల ముందు ఇబ్బందులను ఎదుర్కొంటారు. పోలీసులు చట్ట ప్రకారం, న్యాయ ప్రక్రియ ప్రకారం పనిచేయాలి. రాజకీయ విశ్వాసం కోసం కాకుండ ప్రజల విశ్వాసం కోసం పనిచేయాలి. -
‘తల్లికి వందనం అమలు ఎప్పుడు చంద్రబాబూ?’
సాక్షి, తాడేపల్లి: విద్యతోనే పేదరికంను నిర్మూలించాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూసిన ఘనత వైఎస్ జగన్ది అయితే, విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దానిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లల చదువులపైనా చంద్రబాబు కర్కశత్వం చూపుతున్నారని, విద్యార్ధుల ఉసురుపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది. సామాజిక రుగ్మతలు పోవాలంటే చదువే ప్రామాణికమని ఆనాడు బీఆర్ అంబేద్కర్ చెప్పారు. విద్యతోనే పేదల తలరాతలు మారుతాయని వైయస్ జగన్ నమ్మి, తన పాలనలో దానిని ఆచరణలోకి తీసుకువచ్చారు. సామాజిక మార్పు కోసం విద్యకు పెద్దపీట వేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్షేత్రస్థాయి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలను జమ చేయడం ద్వారా రాష్ట్రంలో గొప్ప సంస్కరణలకు ఆద్యుడు అయ్యారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించారు. ఏ కుటుంబంలో అయినా ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళేవారు ఉంటే ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఆ పిల్లల తల్లికి ఇస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు గొప్పగా ప్రచారం చేసుకున్నాయి.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు బహిరంగసభల్లో ఏం మాట్లాడారో కూడా ఈ మీడియా సమావేశంలో ప్రజలు గమనించేందుకు వీలుగా ప్రదర్శిస్తున్నాం. అలాగే ప్రస్తుత మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ప్రతి ఇంటికి వెళ్ళి 'నీకు పదిహేను... నీకు పదిహేను వేలు అంటూ' అందరినీ నమ్మించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనం కింద ఇస్తామన్న సొమ్ము ఏమయ్యిందని ప్రశ్నిస్తున్నాం. సీఎం చంద్రబాబు చదువులమ్మ తల్లిని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.వాయిదాల రూపంలో ఇస్తారా..కూటమి ప్రభుత్వం మిగిలిన అన్ని హామీలతో పాటు తల్లికివందనంను కూడా గాలికి వదిలేసింది. దీనిపై మేం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంటే, ఖజానా ఖాళీ అయ్యిందని చంద్రబాబు వంకలు వెతుకుతున్నాడు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తల్లికివందనం కింద ఇచ్చే రూ.15వేలను కూడా వాయిదాల రూపంలో ఇస్తానని మాట మార్చారు. మేం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే... 'అమ్మ ఒడి-నాన్న బుడ్డీ' అంటూ కూటమి పార్టీలు అత్యంత హేయంగా విమర్శించారు. ఇప్పుడు కూటమి పాలనలో మంచినీళ్ళు దొరకడం లేదు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. విద్యపట్ల, విద్యార్ధుల తల్లులకు ఇచ్చే అమ్మ ఒడి పట్ల చంద్రబాబుకు ఉన్న చిన్నచూపుకు గతంలో ఆయన చేసిన విమర్శలే నిదర్శనం.విద్యారంగానికి పెద్దపీట వేసిన వైఎస్ జగన్‘‘డబ్బు లేక పిల్లలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైయస్ జగన్ అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా నాలుగేళ్ల పాటు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. అయిదో ఏడాది కూడా 2024 జూన్ నాటికి ఇవ్వడానికి అన్ని సిద్దం చేసి ఎన్నికలకు వచ్చారు. జగన్ ప్రభుత్వంలో 83 లక్షల మంది పిల్లలకు 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ. 26,౦67 కోట్లు జమ చేశారు. 57 నెలల్లో విద్య కోసం ఆనాడు వైఎస్ జగన్ జగనన్న విద్యాకానుక కోసం రూ.3366 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.4417 కోట్లు, మాబడి నాడు-నేడు రెండు దశలకు కలిపి రూ. 13000 కోట్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ కోసం రూ.6688 కోట్లు, ఆడపిల్లల నాప్కిన్ల కోసం రూ.32 కోట్లు, విద్యార్ధులకు బైజూన్ కంటెంట్ ట్యాబ్ల కోసం రూ.1300 కోట్లు..విద్యాదీవెన కోసం 12610, వసతి దీవెన కోసం రూ.5392 కోట్లు, విదేశీ విద్యాదీవెన కోసం రూ.107 కోట్లు ఇలా వివిధ పథకాల కోసం మొత్తం దాదాపు 72,919 కోట్లు ఖర్చు చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చదువుల కోసం, విద్యాప్రమాణాలను పెంచడం కోసం ఇలా ఖర్చు చేయలేదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి అక్కచెల్లెమ్మల పిల్లలకు మేనమామగా వారి విద్యకు అండగా నిలుస్తానని ఆనాడు వైఎస్ జగన్ ముందుకు వచ్చారు. కానీ నేడు ఆ పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా మార్చేశారు. తల్లికి వందనంపై రోజుకో మాట చెబుతూ, విద్యార్ధులను వారి తల్లులను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతాం. ఇచ్చిన మాట ప్రకారం తక్షణం తల్లికి వందనం కింద విద్యార్ధులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. -
బాబు మార్క్ పాలన.. సీఎం బంధువుకు దక్కలేదని టెండర్ రద్దు
సాక్షి, అమరావతి: అస్మదీయులకు కాంట్రాక్ట్లు కట్టబెట్టి కమీషన్ల రూపంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని దండుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. కనీస అనుభవం, అర్హతలేని సంస్థలకు రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్లను అడ్డగోలుగా కట్టబెడుతున్నారు. ప్రభుత్వ పెద్దల బంధువులు, సన్నిహితులు, కమీషన్లు ముట్టజెప్తే కంపెనీలకు కాంట్రాక్ట్ దక్కని పరిస్థితుల్లో ఏకంగా టెండర్లనే రద్దు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్ టెండర్లలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన సంస్థ2014–19 మధ్య అధికార బలంతో సీఎం బంధువు దేవదాయ, వైద్య శాఖల్లో పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్ట్లు దక్కించుకున్నారు. పనులు సక్రమంగా చేయకపోయినప్పటికీ సీఎం బంధువు కావడంతో అధికారులు సైతం నోరెత్తకుండా అడ్డగోలుగా బిల్లులు చేశారు. గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం బంధువు కంపెనీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు కూడా దేవదాయ, వైద్య శాఖల్లో కాంట్రాక్ట్లపై సీఎం బంధువు కన్నేశారు. కొద్దినెలల క్రితం ఏపీ ఎంఎస్ఐడీసీ ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ పనుల కోసం టెండర్లు పిలవగా.. బిడ్ దాఖలు చేయడంతో పాటు, సీఎంవో నుంచి ఉన్నతాధికారులకు సదరు కంపెనీ సిఫార్సు చేయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, పరిశీలన దశలోనే బిడ్ అనర్హతకు గురైంది. దీనికి తోడు వివిధ మార్గాల్లో ప్రభుత్వ పెద్దలతో డీల్ కుదుర్చుకున్న సంస్థలకు పనులు దక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో కోర్టు కేసులు, వివాదాలు, ఇతర కారణాలను బూచిగా చూపి మొత్తం టెండర్నే ప్రభుత్వం రద్దు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కుట్ర బట్టబయలుడీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ నిర్వహణకు ఒకేసారి టెండర్లు పిలిచారు. కాగా, ఒక్క శానిటేషన్ టెండర్లనే ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ టెండర్ల ప్రక్రియలోనూ అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. సెక్యూరిటీ విభాగంలో ఒక సంస్థ టెండర్ నిబంధనలకు విరుద్ధంగా తక్కువకు ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. నిర్దేశిత నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేస్తే రద్దు చేస్తామని టెండర్ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.అయినప్పటికీ ఈ సంస్థ బిడ్ను ప్రభుత్వం తిరస్కరించలేదు. కోర్టు కేసులు, బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయని, వారికి పనులు కట్టబెట్టకుండా చూడాలని కోర్టులో కేసులు దాఖలయ్యాయి. టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగానే పెస్ట్ కంట్రోల్ విభాగంలో సాయి సెక్యూరిటీ అనే సంస్థపై చీటింగ్ కేసు నమోదైంది. కాగా, ఆయా సంస్థలన్నీ అమాత్యుడు, ఇతర ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ముట్టజెప్పేలా డీల్ కుదుర్చుకోవడంతో ఈ పనుల వరకూ కాంట్రాక్టర్ల ఎంపిక ముగించేశారు. కుంటి సాకులతో ఒక్క శానిటేషన్ టెండర్లను రద్దు చేయడంతో ప్రభుత్వ పెద్దల కుట్ర బట్టబయలైంది. -
60 ఏళ్లు.. సగర్వంగా మన ‘ఆంగ్రూ’
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) 60 ఏళ్ల పండుగకు ముస్తాబయ్యింది. ఈ నెల 29, 30 తేదీల్లో ఈ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ 60 ఏళ్ల సాధించిన పురోగతిపై ప్రత్యేక కథనం..సాక్షి, అమరావతి: స్వాతంత్ర్యానంతరం రెండో జాతీయ విద్యా కమిషన్ సిఫార్సు మేరకు రాష్ట్రానికో వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రాతిపదికన ఏర్పాటైన తొలి యూనివర్సిటీ ఇది. ఈ వర్సిటీ పరిధిలో ప్రస్తుతం ఏడు ప్రభుత్వ వ్యవసాయ, 6 అనుబంధ, 2 ఫుడ్ సైన్స్, 2 అగ్రి ఇంజనీరింగ్, ఒక కమ్యూనిటీ సైన్స్, 19 ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్, 62 ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఏటా 45 వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు. అరవై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వర్సిటీ ఎన్నో విజయాలు సాధించింది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి.. రెట్టింపు ఆదాయం లక్ష్యంగా ఏటా పదుల సంఖ్యలో కొత్త రకాలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తెగుళ్లు, కీటకాలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను తట్టుకునే వంగడాలు అభివృద్ధి చేయడమే కాకుండా, సన్న రకాల సృష్టికర్తగా ఖ్యాతి గడించింది. ఫలితంగా దశాబ్దాలుగా వరి వినియోగంలో వర్సిటీ రకాలు తమ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. కీర్తి కిరీటంలో ఆణిముత్యాలు.. » దేశంలో మూడో వంతు ప్రజలు ఆహారంగా తింటున్న వరి రకాలను అభివృద్ధి చేసిన ఘనత ఆంగ్రూకు దక్కుతుంది. దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు..తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పది మందిలో తొమ్మిది మంది తినే ఆహార గింజలను వర్సిటీ సృష్టించింది. » 60 ఏళ్లలో 503 వంగడాలను వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిలో ప్రధానంగా చిరుధాన్యాలు, ధాన్యాలు 217, అపరాలు 84, నూనె గింజలు 56, వాణిజ్య పంటలు 89, ఉద్యాన పంటలు 54లతో పాటు రెండు పశుగ్రాస, ఒకటి బయో డీజిల్ పంటలకు సంబంధించిన వంగడాలున్నాయి. దేశంలోని 4.60 కోట్ల హెక్టార్ల వరి విస్తీర్ణంలో 1.40 కోట్ల హెక్టార్లలో వర్సిటీ రకాలే సాగవుతున్నాయి. » ఏపీలో వర్సిటీ వరి రకాలు 87 శాతం, నువ్వుల రకాలు 87.50 శాతం, వేరుశనగ రకాలు 95 శాతం, కందుల రకాలు 72 శాతం, చెరుకు రకాలు 62 శాతం, పప్పు ధాన్యాలు 36 శాతం విస్తీర్ణంలో సాగవుతున్నాయి. » వర్సిటీ అభివృద్ధి చేసిన వరి రకాలు ఏపీలో 74 శాతం, జాతీయ స్థాయిలో 25 శాతం విస్తీర్ణంలో సాగవడమే కాకుండా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఉగాండా, ఇథియోఫియా, కెన్యా వంటి దేశాల్లో కూడా సాగవుతున్నాయి. » 15 రాష్ట్రాలతో పాటు 150కు పైగా ప్రైవేటు విత్తన కంపెనీలకు బ్రీడర్ విత్తనాలను ఇస్తున్న ఏకైక వర్సిటీ కూడా ఇదే. » వర్సిటీ అభివృద్ధి చేసిన రకాలతో జాతీయ స్థాయిలో రూ.62,317 కోట్ల ఆదాయాన్ని రైతులు ఆర్జిస్తుండగా, ఏపీలో వర్సిటీ వరి రకాల ద్వారా రూ.20,243 కోట్లు, అపరాల ద్వారా రూ.2,113 కోట్లు, నూనె గింజల ద్వారా రూ.2,862 కోట్లు కలిపి మొత్తం రూ.25 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని రైతులు ఆర్జిస్తున్నారు. » ఎగుమతుల్లో సింహ భాగమైన బాస్మతేతర బియ్యంలో మూడోవంతు ఆంగ్రూ అభివృద్ధి చేసిన రకాలే. వీటి ద్వారా ఏటా 8–10 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్య ఆర్జన జరుగుతోంది.జగన్ హయాం.. స్వర్ణ్ణయుగంవైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో వర్సిటీ అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిచింది. అత్యాధునిక సౌకర్యాలు. అధునాతన భవనాలు సమకూర్చడంతో విస్తృత పరిశోధనలతో దూసుకెళ్లింది. డీజీసీఏ ఆమోదించిన డ్రోన్ శిక్షణ కేంద్రాన్ని గుంటూరు లాంలోని అప్సరా సెంటర్లో ప్రారంభించారు. పురుగు, తెగులు మందుల పిచికారికి ఆంగ్రూ పుష్పక్–1, విత్తనాలు, ఎరువుల పిచికారికి పుష్పక్ –2 డ్రోన్స్ను అభివృద్ధి చేశారు. 10 పంటల్లో పిచికారీ చేసి సత్ఫలితాలను సాధించారు. జాతీయ స్థాయిలో డ్రోన్ పైలెట్ శిక్షణ కోసం డీజీసీఏ సర్టిఫికేషన్ పొందిన తొలి వర్సిటీగా నిలిచింది. ఐసీఏఆర్ ర్యాంకింగ్స్లో 2022–23లో జాతీయ స్థాయిలో వర్సిటీ ఏడవ స్థానంలో నిలవగా, పీజీ అడ్మిషన్స్లో రెండో స్థానంలో నిలిచింది. అన్ని ఇనిస్టిట్యూట్స్లలో 11వ స్థానంలో నిలిచింది. అగ్రిప్రెన్యూర్షిప్ ఓరియంటేషన్, ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ (సంకల్ప, 2021)లో 55 ఇంక్యుబేట్లు ఎంపికయ్యాయి. ఆర్ఎఆర్ఎస్– తిరుపతిలో అభివృద్ధి చేసిన మల్టీ టాస్క్ టూల్ బార్, నాప్సాక్ వీడర్లు వినూత్న వ్యవసాయ యంత్రాలుగా ఎంపికయ్యాయి. 2020లో రెండో అత్యధిక సంఖ్యలో ఐసీఏఆర్ పీజీ స్కాలర్షిప్లను పొందిన వర్సిటీగా ఐసీఏఆర్ నుంచి జాతీయ అవార్డు దక్కింది. గిరిజన వ్యవసాయ వ్యవస్థల్లో అత్యుత్తమ పరిశోధన కోసం ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అవార్డు–2020 వరించింది. వ్యవసాయ పరిశోధన, విద్యారంగ కేటగిరిలో 2022లో స్కాచ్ సిల్వర్,, స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు సర్టిఫికెట్సహా ఎన్నో అవార్డులు వర్సిటీకి దక్కాయి. అలాంటి యూనివర్సిటీ 2024–25లో వ్యవసాయ వర్సిటీల్లో 26వ స్థానానికి, ఓవర్ ఆల్గా 151వ స్థానానికి దిగజారిపోయింది. ఎంతో గర్వంగా ఉందిఈ 60 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆంగ్రూ ఎన్నో విజయాలను సాధించింది. జాతీయ స్థాయిలో 40 శాతం మంది రైతులు ఆంగ్రూ రకాలు సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి రైతు వర్సిటీ రకాలపైనే ఆదారపడి వ్యవసాయం చేస్తున్నారు. ప్రతి ఏటా వరితో పాటు ఇతర పంటల్లో కూడా పెద్ద సంఖ్యలో కొత్త వంగడాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. ఆంగ్రూ 60 ఏళ్లు పండుగ వేళ వీసీగా ఉండడం గర్వంగా ఉంది. – డాక్టర్ శారదా జయలక్ష్మి దేవి, వైస్ చాన్సలర్ -
డీఎస్సీ వెబ్సైట్లో మార్పులు
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెన్త్, ఇంటర్ మార్కుల పర్సంటేజీ సీలింగ్ తొలగించింది. డీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై శుక్రవారం ‘మెగా అగచాట్ల డీఎస్సీ’ పేరుతో సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై విద్యాశాఖ స్పందించింది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో జనరల్ అభ్యర్థులు 50 శాతం, రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు 45% మార్కులు తప్పనిసరి చేసింది. ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50, 45 శాతం మార్కులు నిర్ణయించింది. అయితే, ఈ మార్కుల శాతం కనీస అర్హతలైన ఎస్ఏలకు పదో తరగతి, ఇంటర్లోను అనుసరించడంతో అంతకంటే తక్కువ మార్కులు వచి్చన అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అలాగే, బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తిచేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కు అర్హత కల్పించారు. అయితే, వెబ్సైట్లో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ లేకపోవడంతో వారం రోజులుగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. దీంతోపాటు ఓపెన్ స్కూలింగ్లో పది, ఇంటర్ పూర్తిచేసిన వారికీ ఆప్షన్ లేకపోవడంతో అభ్యర్థుల్లో కంగారు మొదలైంది. ఈ సమస్యలపై కథనం రావడంతో అధికారులు పరిష్కరించారు. వీటితోపాటు అరబిక్ లాంగ్వేజ్ ఆప్షన్ను ఇంటర్, డిగ్రీ కోర్సులకు ఎంపిక చేసుకునేలా ఆన్లైన్లో మార్పులు చేశారు. డిగ్రీలో 35 మార్కులకూ అప్లోడ్పై ఆశ్చర్యం ఎస్జీటీ రాసేవారికి ఇంటర్లో జనరల్ అభ్యర్థులు 50 శాతం, రిజర్వుడు అభ్యర్థులకు 45 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50, 45 శాతం, పీజీటీలకు పోస్టు గ్రాడ్యుయేషన్లో 55, 50 శాతంగా మార్కుల సీలింగ్ పెట్టారు. దీంతో డిగ్రీ సీలింగ్ మార్కులు కంటే తక్కువ ఉంటే దరఖాస్తు ప్రక్రియలో ఎర్రర్ చూపించేది. కానీ, శనివారం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఆయా పోస్టులకు 35 శాతం మార్కులు ఉన్నా దరఖాస్తు ప్రక్రియ కొనసాగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
కాలుష్యకాసారంగా కృష్ణా నది
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్కు సమీపంలో జన్మించి, ఒంపు సొంపులతో బిరబిరా సాగుతూ కృష్ణా జిల్లా హంసలదీవి వరకు పరుగులిడే కృష్ణా నది తెలుగు రాష్ట్రాలకు జీవనాధారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాగు, తాగునీటి కోసం అధికంగా ఆధారపడేది కృష్ణా జలాలపైనే. నిత్యం నీరు పారే ఈ జీవ నది మానవ తప్పిదాల కారణంగా ఇప్పడు కాలుష్యకాసారంగా మారింది. ఒకప్పుడు నేరుగా తాగేంత స్వచ్ఛంగా ఉన్న కృష్ణా నది నీరు ఇప్పుడు శుద్ధి చేయనిదే తాగకూడని దశకు చేరాయి. ఈ నది జలాల్లో క్షార స్వభావం, బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ), ప్రమాదకర బ్యాక్టీరియా (ఫీకల్ కోలిఫారమ్), ఘన వ్యర్థాలు అధికంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (ఏపీపీసీబీ) గత నెల (మార్చి)లో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. కృష్ణా నీటిని శుద్ధి చేయకుండా తాగడం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. శుద్ధి చేయకుండా తాగితే డయేరియా, చర్మ వ్యాధుల, ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నది పరీవాహక ప్రాంతంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగునీటిని యథేచ్ఛగా వదిలేయడం, పారిశ్రామిక వ్యర్థాలను విడిచిపెట్టడం, అనేక ప్రాంతాల్లో నదినే డంపింగ్ యార్డ్గా మార్చేయడం వల్ల జలాలు కలుషితమవుతున్నాయి. అడవులను నరికివేయడం, గనులను ఇష్టారాజ్యంగా తవ్వడం వల్ల కూడా నది కలుషితమవుతోంది. పర్యవసానంగా కృష్ణా జలాలు నేరుగా తాగడానికి పనికి రాకుండా పోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, అమరావతి ప్రమాదకర బ్యాక్టీరియా కృష్ణా జలాల నాణ్యతపై ఏపీపీసీబీ ప్రతి నెలా పరీక్షలు చేస్తోంది. ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్షల్లో కృష్ణా జలాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. పీహెచ్ 7 శాతం లోపు ఉంటే ఆమ్ల స్వభావం.. 7 శాతం కంటే ఎక్కువ ఉంటే క్షార స్వభావం ఉన్నట్లు లెక్క. పీహెచ్ 7 ఉంటే స్వచ్ఛమైన నీరుగా లెక్క. కానీ.. కృష్ణా జలాల్లో పీహెచ్ 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంటే జలాల్లో క్షార స్వభావం ఎక్కువ ఉన్నట్లు స్పష్టమవుతోంది. నీటిలో కరిగిన ఆక్సిజన్ (డీవో), బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) కూడా మోతాదుకు మించి ఉన్నట్లు వెల్లడైంది. తాగే నీటిలో అత్యంత ప్రమాదకరమైన ఫీకల్ కోలీఫామ్ బ్యాక్టీరియా వంద మిల్లీ లీటర్లకు ఒక్కటి కూడా ఉండకూడదు. కానీ.. కృష్ణా జలాల్లో వంద మిల్లీ లీటర్లకు 11 నుంచి 58 వరకూ ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది.నీటిలో ఘనవ్యర్థాలు వంద మీల్లీ లీటర్లకు 500 మిల్లీ గ్రాముల వరకూ ఉండవచ్చు. కానీ.. కృష్ణా నీటిలో ఘన వ్యర్థాలు అంతకంటే ఎక్కువ ఉన్నట్లు వెల్లడైంది. మురుగు నీటిని, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేయడం, వ్యర్థాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా కృష్ణా నదిని స్వచ్ఛంగా మార్చవచ్చునని నిపుణులు చెబుతున్నారు. బీఐఎస్ ప్రమాణాల మేరకు తాగు నీటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలు1. పీహెచ్ 6.5 నుంచి 8.5 శాతం లోపు ఉండొచ్చు 2. డీవో (డిజాల్్వడ్ ఆక్సిజన్) లీటర్ నీటికి 6 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండాలి 3. బీవోడీ (బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్) లీటర్ నీటికి 2 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు 4. టోటల్ కోలీఫామ్ (టీసీ– బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్ల నీటికి 50 లోపు ఉండొచ్చు 5. ఫీకల్ కోలీఫామ్ (ఎఫ్సీ– ప్రమాదకర బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్లకు నీటికి ఒక్కటి కూడా ఉండకూదు 6. టీడీఎస్ (టోటల్ డిజాల్్వడ్ సాలిడ్స్) లీటర్ నీటికి 500 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు -
‘సిట్’ చిలకమ్మ.. కట్టుకథలు
సాక్షి, అమరావతి: టీడీపీ వీరవిధేయ సిట్ కట్టుకథలు అంతూ పొంతూ లేకుండా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు నివేదికల పేరిట అవాస్తవాలు, అభూతకల్పనలతో కనికట్టు చేసేందుకు బరితెగిస్తోంది. ఆ కేసులో అక్రమంగా అరెస్టు చేస్తున్నవారి వాంగ్మూలాల పేరిట న్యాయస్థానానికి సమర్పిస్తున్న రిమాండ్ రిపోర్టులే చంద్రబాబు ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తున్నాయి. మొన్న రాజ్ కేసిరెడ్డి.. నిన్న చాణక్య.. నేడు శ్రీధర్ రెడ్డి.. ఈ ముగ్గురి రిమాండ్ రిపోర్టులు పరిశీలిస్తే ప్రభుత్వ కుతంత్రం బయటపడుతోంది. అంతా కనికట్టే! వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. దీనికోసం టీడీపీ వీరవిధేయ అధికారులతో కూడిన సిట్ ద్వారా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఈ కేసులో న్యాయస్థానానికి సమర్పించిన వరుసగా మూడో రిమాండ్ రిపోర్ట్ కూడా సిట్ కుయుక్తులను బయటపెట్టింది. ఈ కేసులో ఆరో నిందితుడిగా శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానంలో శనివారం హాజరు పరుస్తూ సిట్ రిమాండ్ రిపోర్టు సమర్పిoచింది. అంతకుముందు రాజ్ కేసిరెడ్డి, చాణక్య రిమాండు రిపోర్టుల్లో పేర్కొన్న అవాస్తవ ఆరోపణలు, కల్పిత అభియోగాలనే శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ సిట్ పునరుద్ఘాటించింది. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్రెడ్డి తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ అవాస్తవాలను వండి వార్చింది. పైగా అవన్నీ కూడా శ్రీధర్రెడ్డి తమ విచారణలో వెల్లడించారని సిట్ పేర్కొనడం గమనార్హం. కానీ ఆ వాంగ్మూలంపై సంతకం చేసేందుకు శ్రీధర్ రెడ్డి నిరాకరించారని ఆ నివేదికలో పేర్కొంది. మధ్యవర్తుల సమక్షంలో తాము వాంగ్మూలాన్ని నమోదు చేశామని తెలిపింది. అంటే ఈ కేసులో కుట్ర క్రమం అంటూ సిట్ వివరించిన విషయాలేవీ వాస్తవం కాదని స్పష్టమైంది. వాటిని శ్రీధర్రెడ్డి చెప్పనే లేదని.. అందుకే ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారన్నది బయటపడింది. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేస్తూ సిట్ అధికారులే అవాస్తవాలు, అభూతకల్పలను వాంగ్మూలంగా నమోదు చేసేశారని స్పష్టమైంది. ఇదే కేసులో రాజ్ కేసిరెడ్డి, చాణక్య కూడా చెప్పని విషయాలను చెప్పినట్టుగా సిట్ ఏకపక్షంగా వారి పేరిట వాంగ్మూలంగా నమోదు చేసింది. కానీ తాము సంతకాలు చేయలేదనే విషయాన్ని వారే న్యాయస్థానం దృష్టికి తీసుకువెళితే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే సిట్ అధికారులు ఆ విషయాన్ని రిమాండ్ రిపోర్టులో తప్పనిసరై వెల్లడించారు. ఇంత బరి తెగింపా..! ఇంత నిర్భీతిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్ దర్యాప్తు పేరుతో అటు న్యాయస్థానాలను ఇటు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు అధికారులు యత్నిస్తుండటం విస్మయపరుస్తోంది. ఆ అబద్ధపు వాంగ్మూలాలను టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడమే సిట్ లక్ష్యమన్నది తేటతెల్లమవుతోంది. ఈ కేసు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తుంది కేవలం రెడ్ బుక్ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది. -
రైతుకు ‘సేవలు’ దూరం!
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల (పూర్వపు ఆర్బీకేలు) స్ఫూర్తిని దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. క్రమబద్ధీకరణ పేరిట రైతు సేవా కేంద్రాలతో (ఆర్ఎస్కే) పాటు సిబ్బందిని కూడా కుదించేస్తున్న ప్రభుత్వం, వాటి నిర్వహణను సైతం పూర్తిగా గాలికొదిలేసింది. పీ4, కుల గణన, పింఛన్ల పంపిణీ వంటి తమకు సంబంధం లేని అడ్డమైన సర్వేల కారణంగా తీవ్రమైన పని ఒత్తిడితో సిబ్బంది పనిచేయాల్సి వస్తోంది. పక్కదారి పడుతున్న నిధులు..గడచిన 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఎస్కేల నిర్వహణకు రూ.35.05 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.19 కోట్లు విడుదల చేశారు. దీనిలో రూ.10.52 కోట్లు అద్దెలకే పోవడం గమనార్హం. సిబ్బందికి చివరికి కష్టమే మిగులుతోంది. మంజూరు చేసిన నిధులు గతంలో నేరుగా ప్రతి ఆర్ఎస్కే అకౌంట్లో పడేవి. ఇప్పుడు సబ్ డివిజన్ అధికారుల ఖాతాకు జమ చేస్తున్నారు. ఈ నిధులు వారు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులతో పాటు తమకు రావాల్సిన బకాయిల కోసం అడిగితే ‘వస్తాయిలే..ఇస్తాం లే..’ అంటూ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే అడ్డమైన పనులు అప్పగిస్తూ పని ఒత్తిడి పెంచుతూ వేధింపులకు గురిచేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. మరొక వైపు పాడిపంటలు మ్యాగజైన్ కోసం కూడా లక్ష్యాలను నిర్ధేశిస్తుండడంతో వాటి చందాల కోసం కూడా తమ జేబులకే చిల్లుపడుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నాడు పారదర్శకంసచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 రైతు సేవా కేంద్రాల్లో 15,667 మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అద్దెలతో పాటు ఇంటర్నెట్, విద్యుత్ బిల్లులకు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసేవారు. గతేడాది ఏప్రిల్ నాటికి అద్దెల రూపంలో రూ.33 కోట్లు, స్టేషనరీ కోసం రూ.3 కోట్లు, విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు చెల్లించారు. అంతేకాదు విద్యుత్ బిల్లులకు అవసరమైన బడ్జెట్ను విద్యుత్ శాఖకు కేటాయించేలా ఉత్తర్వులిచ్చారు. హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ సదుపాయాన్ని సమకూర్చేందుకు రూ.23 కోట్లు ఖర్చు చేసారు. మరొక వైపు మట్టినమూనాలు, ఈ పంట నమోదు, ధాన్యం కొనుగోలు, ఎరువుల అమ్మకాలు, పంట కోత ప్రయోగాలు ఇలా ప్రతీ పనికి నిర్ధేశించిన ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు నేరుగా వారి ఖాతాలకే జమ చేసేవారు.నేడు లోపభూయిష్టం..రైతు భరోసా కేంద్రాలు– ఆర్బీకేల పేరును రైతు సేవా కేంద్రాలుగా (ఆర్ఎస్కే) మార్చేందుకు చూపిన ఉత్సాహం వాటి నిర్వహణపై కూటమి ప్రభుత్వం చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే..» ప్రతిరోజూ ఆర్ఎస్కేలను శుభ్రం చేసేందుకు, నీటి వసతి కల్పించేందుకు స్టేషనరీకి, ఇంటర్నెట్ చార్జీలు, మైనర్ రిపేర్లు తదితర ఖర్చుల కోసం ప్రతీ నెలా రూ.2,000 చెల్లించేవారు. »ఇవి కాకుండా వ్యక్తిగతంగా సిబ్బందికి ఒక్కో మట్టి నమూనాకు రూ.50, టన్ను యూరియాకు రూ.50, డీఏపీ, ఇతర ఎరువులకు రూ. 100 చొప్పున చెల్లించేవారు. » దీనితోపాటు ఒక్కొక్క పంట కోత ప్రయోగానికి రూ.150 చొప్పున ఇచ్చేవారు. » ఆర్ఎస్కే పరిధిలో ప్రతీ సీజన్లో నాలుగు పంటకోత ప్రయోగాలు జరుగుతుంటాయి. పొలంబడుల నిర్వహణకు రూ.20,514 ఖర్చు అయ్యేది. ధాన్యం కొనుగోలు నిర్వహణ ఖర్చు నిమిత్తం ఒక్కొక్క క్లస్టర్కు సుమారు రూ.5 వేలకు పైగా చెల్లించేవారు. » కానీ గడిచిన సీజన్కు సంబంధించి ఏ ఉద్యోగికి పైసా కూడా జమ కాలేదు. కేంద్ర నిధులతో చేపట్టే సామూహిక ఎలుకల నివారణకు ఉపయోగించే గ్లౌవ్స్, కత్తెర, ప్యాకింగ్ మెటీరియల్కే కాదు చివరికి బ్యానర్ తయారీకి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదంటున్నారు.»కేవలం ఆర్ఎస్కేల నిర్వహణ కోసం ప్రతీ నెలా సగటున రూ.2,500 నుంచి రూ.3వేల వరకు తమ జీతాల నుంచి ఖర్చు చేయాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు. » ఇక ఆర్ఎస్కేల్లో ఎక్కడా ఇంటర్నెట్ సేవలు లేనే లేవు. ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు అలంకార ప్రాయంగా మారిపోయాయి. » కరెంట్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా మరిచి పోయారు. 25–30 శాతం ఆర్ఎస్కేలు అంధకారంలో ఉన్నాయని సమాచారం. విద్యుత్ బకాయిల బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. -
రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'
అప్పుల కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బరితెగించింది. రూ.9 వేల కోట్ల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ను ప్రైవేట్ వారికి అప్పగిస్తోంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు.తద్వారా ఆ గనులపై పెత్తనం అంతా అప్పు ఇచ్చిన వారిదే ఉంటుంది. పైగా ఆ గనుల్లో ఏం జరిగినా.. ఎన్ని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నా కూడా ప్రశ్నించ కూడదట! కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయకూడదట! ఈ గనులను తమ ఇష్టం వచ్చిన వాళ్లకు అప్పగించేలా ఘనత వహించిన విజనరీ చంద్రబాబు ప్రభుత్వం సదరు అప్పు ఇచ్చిన వారికి హక్కులు కట్టబెట్టింది. ఏమిటీ పరిణామం.. ఎందుకీ బరితెగింపు.. ఇందులో లోగుట్టేంటి.. అంటూ వివిధ రంగాల నిపుణులు విస్తుపోతున్నారు. ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఇంతకు మించిన కేస్ స్టడీ మరొకటి అక్కర్లేదంటున్నారు. 436 గనులపై కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం, రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలోని భాగంసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ప్రైవేటు కంపెనీకి రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సర్వ హక్కులు ధారపోయడం విస్తుగొలుపుతోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనులపై ప్రైవేట్కు పెత్తనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు, మైనింగ్ హక్కులను ప్రభుత్వం.. ప్రైవేట్ వారికి ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ గనుల్లో అక్రమ మైనింగ్ జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఏవైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండదు. కనీసం అందులో మార్పులు చేయడానికి, సవరించడానికి సైతం ఆస్కారం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం మారినా, తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేకపోతే డిబెంచర్ ట్రస్టీ (పైవేటు కంపెనీ) ఆ ఖనిజాలపై మైనింగ్ హక్కులను వేరే వారికి బదిలీ చేసే హక్కు సైతం కట్టబెట్టారు. కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. వివాదాలు వచ్చినా నిస్సహాయతే! ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏమైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దానిపై ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని కల్పించడం చట్ట విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన లీజులపై గనుల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయి. మైనింగ్ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా.. ఏ సమయంలోనైనా లీజు రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరించక తప్పదు. ఏ గనుల్లో అయినా అనుకున్నంత ఆదాయం రాకపోతే అంతే విలువైన వేరే గనుల్ని మళ్లీ ఏపీఎండీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ లేకుండా మైనింగ్ లీజులు, మైనింగ్ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపునకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు తనఖా పెడుతున్నారంటే ఆయన ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులను ప్రజల మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్ లేకుండా, ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారు. డీఎస్ఆర్ఏ ద్వారా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వారికి హక్కులా? మరోవైపు ఇదే ఒప్పందంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా రాష్ట్ర ఖజానాను అప్పగించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. అప్పులు చెల్లించేందుకు డీఎస్ఆర్ఏ (డెబిట్ సర్వీస్ రిజర్వ్ ఎకౌంట్) తెరుస్తోంది. ఏపీఎండీసీకి వచ్చే ఆదాయాన్ని డీఎస్ఆర్ఏ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని చెబుతోంది. ఒకవేళ డీఆర్ఎస్ఏ ఖాతాలో నిధుల లభ్యత లేకపోతే.. ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల నుంచి తీసుకునే అధికారాన్ని బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు ఇస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు ఇలా హక్కులు ఇవ్వలేదని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయంపై అప్పులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకుంది. కేవలం 11 నెలల్లోనే బడ్జెట్ లోపల.. బడ్జెట్ బయట రూ.1,54,865 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా గురువారం ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) బాండ్లు జారీ చేసి రూ.9 వేల కోట్ల నిధుల సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాండ్లకు ఆర్ధిక భద్రత కల్పిస్తూ 436 గనులను కేటాయించి ఆ గనులను తాకట్టు పెట్టింది. తద్వారా ఆ గనుల నుంచి భవిష్యత్లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిందని అర్థం. ఆ గనుల ద్వారా వచ్చే ఆదాయంతో బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పును చెల్లిస్తామని చెప్పింది. ఒకవేళ గనుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కొత్త గనులు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే.. ఏపీఎండీసీకి భవిష్యత్లో వచ్చే ఆదాయంపైనా అప్పులు చేస్తోందన్నది స్పష్టమవుతోంది. సంపద సృష్టితో అద్భుతాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పని చేయలేకపోగా ఉన్న సంపదను కూడా అడ్డగోలుగా తాకట్టు పెడుతున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాండ్ల జారీకి సంబంధించి నియమించబడిన డిబెంచర్ ట్రస్టీ లేదా ట్రస్టీ తరఫున వ్యవహరించే ఏ ఇతర వ్యక్తికైనా 436 గనులపై సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పుట్టకే ఎన్సీడీ బాండ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డు సృష్టించింది. ఇక రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు çసుముఖత వ్యక్తం చేయక పోవడంతో బడ్జెట్ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్లను సమీకరించడానికి పూనుకుంది. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలంటే ఏపీఎండీసీకి మంచి రేటింగ్ అవసరం అవుతుంది. ఇందుకోసం ముంబయికి చెందిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థను ప్రభుత్వం సంప్రదించింది. ఏపీఎండీసీ ఆస్తులు, ఆదాయం, అప్పులపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ‘సీఈ’ రేటింగ్ ఇచ్చింది. అంటే.. డీఎస్ఆర్ఏ ఖాతాలో నిధులు లేకపోతే ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన వారి ఖాతాలో జమ చేసేందుకు అంగీరించడం. అందువల్లే ఏపీఎండీసీకి ‘సీఈ’ రేటింగ్ ఇచ్చిందని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాజ్యాంగ ఉల్లంఘనే ఏపీఎండీసీ జారీ చేసే బాండ్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి (అప్పు) చెల్లించేందుకు డీఎస్ఆర్ఏ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తుంది. ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఆరు నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డీఎస్ఆర్ఏ ఖాతాలో ముందుగానే నిల్వ ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నేరుగా డీఎస్ఆర్ఏ ఖాతాలో నిధులు జమ చేస్తారు. అంటే.. కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇవ్వడమేనని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని నిలువునా ఉల్లంఘించడమేనని తేల్చి చెబుతున్నారు. సాధారణంగా ఆర్బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ), వేజ్ అండ్ మీన్స్ (చేబదులు) ద్వారా తీసుకునే అప్పును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా చెల్లించడంలో విఫలమైతే.. వాటిని వడ్డీతో సహా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఆర్బీఐ మినహాయించుకుటుంది. కానీ ఇలా ప్రైవేటు వారికి పెత్తనం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రమాదకర ప్రయోగమని నొక్కి చెబుతున్నారు. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులే⇒ గనుల తాకట్టుపై అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన ⇒ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఒత్తిడి వల్లే ఇలా.. ⇒ ఏమాత్రం అడ్డుచెప్పని గనుల శాఖ కార్యదర్శి ⇒ ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు ⇒ అన్ని శాఖల్లోనూ ఇలా చేయాలనే ఒత్తిడి రావచ్చుబాండ్ల జారీ ద్వారా రూ.9 వేల కోట్లను సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతిచ్చే విషయంలో ఐఏఎస్ అధికారి అయిన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ (ఆర్ధిక శాఖ) పీయూష్ కుమార్, మరో ఐఏఎస్ అధికారి అయిన గనుల శాఖ కార్యదర్శి కమ్ కమిషనర్ ప్రవీణ్కుమార్ తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీయూష్ కుమార్ తీవ్రంగా ఒత్తిడి తేవడం వల్లే ఈ వ్యవహారం ముందుకు కదిలినట్లు చర్చ జరుగుతోంది. తమకు మంచి పోస్టింగ్లు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలాడిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ఐఏఎస్ అధికారులు చర్చించుకుంటున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బాండ్ హోల్డర్లకు సర్వ హక్కులు కల్పించడం, ఈ క్రమంలో ఏపీఎండీసీ, గనుల శాఖ ప్రయోజనాలు, స్ఫూర్తికే విఘాతం కలిగేలా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బాండ్ల కోసం ఏకంగా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులు నేరుగా ప్రైవేటు వ్యక్తులు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వడం చిన్న విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇచ్చిన ఉత్తర్వులు, ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదని, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం కూడా వీటిని మార్చకూడదనే రీతిలో ఉత్తర్వులివ్వడం సరికాదని సీనియర్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని చూపి.. మిగతా అధికారులు సైతం ఇలాగే చేయాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తారని, అప్పుడు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక ఐఏఎస్ అధికారి అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా నిబంధనలు, రాజ్యాంగ నియమాలను మరచిపోకూడదని.. వాటి విషయంలో రాజీ పడితే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని తెలిపారు. సర్వీస్ రూల్స్ను ఉల్లంఘించి మరీ పొలిటికల్ బాస్ చెప్పారని పనిచేస్తే, మునుముందు ఆందోళన తప్పదని చెబుతున్నారు. తాము ఇచ్చిన ఉత్తర్వులు న్యాయస్థానాల్లోనూ నిలబడే విధంగా ఉండాలని, రాజ్యాంగ ఉల్లంఘన అని తెలిసినా ఉత్తర్వులు ఇవ్వడం న్యాయస్థానాల్లో నిలబడవని చెబుతున్నారు. అదే జరిగితే సర్వీసులో మాయని మచ్చగా మిగిలి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చేబ్రోలు కిరణ్ను పెంచి పోషించేది చంద్రబాబే: అంబటి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఏడాది కాలం పాలనలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏమీ చేయకపోయినా చంద్రబాబును హీరోలా చూపిస్తూ ఆయన అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేస్తుందని.. చంద్రబాబు హీరో కాదు.. విలన్’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. గతంలోనూ విలన్ లాగే వ్యవహరించారు. సోషల్ మీడియా సైకోల తోక కత్తిరిస్తానంటూ అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టేవారి కోరలు పీకేస్తామన్నారు. పిడి యాక్ట్ పెట్టి తాటతీస్తామన్నారు. చంద్రబాబు అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.‘‘వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై చాలా దారుణమైన పోస్టులు పెట్టారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చేబ్రోలు కిరణ్ను పెంచిపోషించింది చంద్రబాబు కాదా?. చేబ్రోలు కిరణ్ ఎంతో మందిపై చాలా దారుణంగా మాట్లాడాడు. చేబ్రోలు కిరణ్ను అరెస్ట్ చేసి వదిలేశారు. చేబ్రోలు కిరణ్ విడుదలైనంత తొందరగా సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయిన వారెవరూ విడుదల కాలేదు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా వారిని పిటిషన్ వేసి కస్టడీకి తీసుకుంటున్నారు. కానీ చేబ్రోలు కిరణ్ను మాత్రం పోలీస్ కస్టడీకి తీసుకోలేదు. చంద్రబాబు పెంచి పోషించాడు కాబట్టే.. చేబ్రోలు కిరణ్ కేసులో 24 గంటల్లో విచారణ పూర్తయిపోయింది..చంద్రబాబు చేయించిన ఏ అరెస్ట్ లోనూ ఇంత త్వరగా విచారణ పూర్తికాలేదు. చంద్రబాబు డైరెక్షన్లో కొన్ని వందల మంది ఐ-టీడీపీలో పనిచేస్తున్నారు. ఎవరిని ఎక్కువ బూతులు తిడితే వారిని అంత పోషిస్తామని చెబుతున్నారు. చంద్రబాబు మాటలన్నీ దొంగమాటలు. స్వాతి రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త పేరు స్వాతి చౌదరి. వైఎస్ జగన్ ఫోటోలు మార్ఫింగ్ చేయించేది చంద్రబాబు, లోకేష్లే. టీడీపీని మేం ప్రశ్నిస్తే వాళ్లకంటే ముందు సీమ రాజా అనేవాడు స్పందిస్తాడు. వైఎస్సార్సీపీ కండువా వేసుకుని టీడీపీ తరపున మమ్మల్ని తిడతాడు. సీమరాజాపై ఒకసారి కేసుపెట్టా.. మళ్లీ పెడతా. కిరాక్ ఆర్పీ అనేవాడు రోజూ వైఎస్ జగన్ను, నన్ను, రోజాను తిడతాడు. చంద్రబాబుతో ఫోటోలు దిగుతాడు. వ్యక్తిత్వ హననం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టి విద్య. ఎన్టీఆర్తో మొదలుపెట్టి ఇప్పటికీ ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూనే ఉన్నాడు..వ్యక్తిత్వ హననం చేసి చంద్రబాబు పైశాచికానందం పొందుతున్నాడు. సోషల్ మీడియాలో వారిని పెంచి పోషించేది వారికి డబ్బులిచ్చేది చంద్రబాబే. సోషల్ మీడియాలో పనిచేస్తే పేమెంట్ ఇస్తానని చెప్పింది చంద్రబాబు. ఎవరు బాగా తిడితే వారికి ఎక్కువ పేమెంట్ ఇస్తామని సాక్షాత్తూ చంద్రబాబే చెప్పారు. యూ ట్యూబ్లలో సైతం ఎంతో దుర్మార్గంగా.. దారుణమైన పోస్టులు పెడుతున్నారు. వెంకట కృష్ణ ఒక కీ ఇచ్చే బొమ్మ. వెనకుండి నడిపించేది రాధాకృష్ణ. మార్ఫింగ్ చేసిన పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. చేబ్రోలు కిరణ్ వంటి వారిని పెంచి ప్రోత్సహిస్తూ.. మహిళలను ఏదైనా అంటే సహించేది లేదని బిల్డప్ ఇస్తున్నారు...చంద్రబాబుని మోసేది సీమరాజా, కిర్రాక్ ఆర్పీ వంటి వారే. ఇంత నీచమైన స్థితికి టీడీపీ దిగజారిపోవడం బాధాకరం. ఐ-టీడీపీ ద్వారా జరుగుతున్న నీచమైన ప్రచారాలకు చంద్రబాబు చెక్ పెట్టాలి. ఏ ఒక్కరినీ వదలం అందరిపైనా కేసులు పెడతాం. అనిత పేరుకే హోంమంత్రి. హోంశాఖ గురించి ఆమెకు తెలియదు.. హోంశాఖను నడిపించేది లోకేష్. మా ఫిర్యాదులపై పోలీసులు కేసులు రిజిస్టర్ చేయకపోతే న్యాయపరంగా పోరాడతా. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వికృతచేష్టలపై పోరాడతాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
‘ఏపీలో స్కీములు లేవు.. అన్నీ స్కాములే’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో స్కీములు లేవు కానీ.. స్కాములు మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి మండిపడ్డారు. ఇసుక, మట్టి, లిక్కర్, మైనింగ్, రాజధాని పనుల్లో సైతం అవినీతి విలయ తాండవం చేస్తోందన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు వారి సన్నిహితులకు కారుచౌకగా భూములు కట్టబెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కనీసం ఒక టీ కంటే తక్కువ ఖర్చుకు భూములు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు.అమరావతిలో జి+1 బిల్డింగ్లు కట్టేందుకు అధిక ధరలకు తన అనుంగులకు చంద్రబాబు కట్టబెట్టారు. వారి ద్వారా హైదరాబాద్లో ఒక బిల్డింగ్, మంగళగిరిలో పార్టీ కార్యాలయం కట్టించుకున్నారు. టెక్నాలజీ కంపెనీల పేరుతో చంద్రబాబు తన మనుషులకు భూములు దోచిపెడుతున్నాడు. ఊరూ పేరులేని ఉర్సా కంపెనీకి 3 వేల కోట్ల ఖరీదైన భూమిని కట్టబెట్టారు. ఏం అర్హత ఉందని... ఉర్సాకు 59.65 ఎకరాలు కేటాయించారు’’ అంటూ శివశంకర్రెడ్డి నిలదీశారు.2024 సెప్టెంబర్ 27వ తేదీన అమెరికాలో ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయ్యింది. అక్టోబర్లో లోకేష్ పర్యటన తర్వాత పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ఓ కథ అల్లారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన భారత దేశంలో ఉర్సా కంపెనీ రిజిస్టర్ చేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇంటిలో ఉర్సా కంపెనీ కార్యాలయం ఉంది. పది లక్షల రూపాయల మూలధనం పెట్టుబడితో ఉర్సా కంపెనీ పెట్టారు. అరసెంటు భూమి కూడా కేటాయించే అర్హత కూడా ఉర్సాకు లేదు. ఆఫీస్ కూడా లేని ఉర్సాకు మూడువేల కోట్ల రూపాయలు భూములు కట్టబెడతారా?’ అంటూ శివశంకర్రెడ్డి ప్రశ్నించారు.21st సెంచ్యూరీ కంపెనీ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి పారిపోయిన వ్యక్తులు అబ్బూరి సతీష్. ఉర్సా కంపెనీ కేటాయింపులపై ఇంత రచ్చ నడుస్తుంటే ప్రభుత్వం, సీఎం, మంత్రులు ఎందుకు స్పందించరు?. ప్రభుత్వానికి బదులు ఉర్సా కంపెనీ ప్రతిధులు ఎలా సమాధానం చెబుతారు?. ప్రైవేట్ కంపెనీని టీడీపీ పార్టీ ఎందుకు భుజాన వేసుకుంటుంది?. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకోవడం దేనికి?. మూడు వేల కోట్ల రూపాయలు భూములు కేటాయింపులో ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్లాయి? ఈ వాటాల లెక్కలు తేలాల్సిందే’’ అని శివశంకర్రెడ్డి డిమాండ్ చేశారు.ఉర్సాకు భూముల కేటాయింపు అతిపెద్ద కుంభకోణం. ఉర్సా భూ కుంభకోణం పై సీబిఐతో విచారణ జరిపించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. భవిష్యత్తు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఎండీసీ 9 వేల కోట్ల రుణంతీసుకున్నారు. రోడ్లను సైతం ప్రైవేట్ పరం చేస్తోంది. రాజధానిలో ప్రజల సొమ్ముతో చంద్రబాబు ఐదెకరాల్లో ఇల్లు కట్టుకుంటున్నారు’’ అని శివశంకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాసింత నీడ.. కాస్తంత నీరు..!
సాక్షి, అమరావతి: ఈ వేసవిలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మేలో 47 వరకూ వెళ్లే అవకాశాలున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా. రాష్ట్ర ప్రభుత్వం వేసవిని ఎదుర్కొనేందుకు హెచ్చరికలు జారీ చేయడం తప్ప, క్షేత్ర స్థాయిలో తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు కనపడడంలేదు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వేడిగాలులు పెరిగాయి. డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాష్టన్, హీట్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలకు ఇవి దారితీస్తాయి. ప్రభుత్వ తక్షణ దృష్టి అవశ్యం తీవ్ర ఉష్ణోగ్రతల నమోదు నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉంచే దిశలో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోవాలి. భారత వాతావరణ శాఖ భాగస్వామ్యంతో జిల్లాల వారీగా హీట్ అలర్ట్స్ మరింత కచ్చితత్వంతో జారీ చేయాలి. అన్ని వర్గాలకు ఈ హెచ్చరికలు చేరేలా చూడాలి. బస్టాండ్లు, ఆటోస్టాండ్లు, రోడ్డు పక్కన పలు ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి. కూల్ రూఫ్ బస్టాండ్లు, షెడ్లను శాశ్వతంగా నిర్మించడం మంచిది. ఆసుపత్రుల్లో హీట్ స్ట్రోక్ యూనిట్లు, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్, ఐవీ ఫ్లూయిడ్స్, ఎమర్జెన్సీ బెడ్లు సిద్ధం చేయాలి. ఇక బడుల సమయాల్లో మార్పులు చేయాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు తరగతులు ఉండకుండా చూడాలి. బయట తరగతులు నిర్వహించకూడదు. హీట్ అలర్ట్ వచి్చనపుడు సెలవులు ప్రకటించాలి. ప్రజా రవాణా పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలి.ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు» బయటకి వెళ్లే సమయాన్ని తగ్గించుకోవాలి. » మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి. » తప్పనిసరిగా బయటకి వెళ్లాల్సివస్తే తలపై టోపీ, తెల్లని దుస్తులు ధరించాలి. » రోజుకు కనీసం 3–4 లీటర్ల వరకు నీటిని తాగాలి. కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగడం మంచిది. » ఆహార నియమాలు పాటించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. వేడి ఆహారం, మసాలా పదార్థాలు, డ్రై ఫుడ్స్ తగ్గించి ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. » వృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీరిని వేడి సమయాల్లో ఇంట్లోనే ఉంచాలి. తగినంత నీటిని తాగేలా చూడాలి. » వ్యాయామాలు ఉదయం, సాయంత్రం మాత్రమే చేయాలి » కూలీలు, రైతులు ఉదయం 6–10 లేదా సాయంత్రం 5–7 సమయంలో పని చేయాలి. » రోడ్లపై పనిచేసే ట్రాఫిక్ పోలీసులు, కూలీలకు జాకెట్లు, నీటి పంపిణీ జరగాలి. వడదెబ్బ తగలకుండా ఢిల్లీ తరహాలో కూల్ రూమ్ కాన్సెప్్టను ప్రవేశపెడితే మంచిది. » అడవుల్లో జంతువుల కోసం నీరు అందుబాటులో ఉంచాలి. హీట్ వేవ్ హాట్ స్పాట్లుకర్నూలు, నంద్యాల, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలుఅన్ని చర్యలు తీసుకుంటున్నాంరోణంకి కూర్మనాథ్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీఈ సంవత్సరం వేసవి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేసి, తగిన చర్యలను సూచిస్తున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించడం మంచిది. కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదు. -
ఇక బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు!
సాక్షి, అమరావతి: బ్యాంకు ఖాతాదారులు నలుగురిని నామినీలుగా నియమించుకునే అవకాశం రానుంది. ఆరి్థక ఆస్తుల నిర్వహణలో పారదర్శత తీసుకురావడంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్యను తగ్గించడం కోసం కేంద్రం ఈ మార్పు తీసుకొస్తోంది. ఇందుకోసం ఇటీవలే బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నాలుగు రోజుల క్రితమే ఈ సవరణపై నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా నామినేషన్ నియమాలలో త్వరలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఖాతా దారులకు రెండు ఆప్షన్లునలుగురు నామినీల్లో ఎవరిని హక్కుదారుగా నిర్ణయించాలనేది బ్యాంకు ఖాతాదారు ఇష్టం. దీనికోసం రెండు ఆప్షన్లను కేంద్రం ప్రతిపాదించింది. మొదటి ఆప్షన్లో ఓ ఖాతాదారుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉంటే అందరినీ నామినీలుగా పెట్టుకుని ఒకరి మరణానంతరం మరొకరిని హక్కుదారుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు తొలుత భార్య ఆమె మరణానంతరం కుమారుడు, అతని మరణానంతరం కుమార్తెలను హక్కుదారులుగా సూచించవచ్చు. రెండో ఆప్షన్లో తన ఖాతాలోని ఆస్తిని శాతాలవారీగా నలుగురికీ కేటాయించవచ్చు. ఈ మార్పు అన్ని ఖాతాలకు (మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా, బ్యాంక్) వర్తిస్తుంది. బ్యాంకు ఖాతాకు మాత్రమే నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా వంటి వాటికి ముగ్గురు నామినీలను నియమించే అవకాశం మాత్రమే ఉంది.గతంలో ఒక్క నామినీకే అవకాశం గతంలో బ్యాంక్ ఖాతాకు ఒక్క నామినీని మాత్రమే పేర్కొనే అవకాశం ఉండేది. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు చాలాకాలం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. నామినీ మరణించినా అతని ఖాతాలోని ఆస్తులు వారసులకు బదిలీ కాకపోవడంతోపాటు రెండో నామినీ లేకపోవడం వల్ల చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి పదేళ్ల తర్వాత ఖాతాలోని ఆస్తులు ఎవరికీ క్లెయిమ్ చేయకపోవడం వల్ల డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్నెస్ ఫండ్కి అవి జమ అయిపోతున్నాయి. -
మే 19 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలతోపాటే ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మే 19 నుంచి 24 వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల విడుదల చేసిన ఫలితాల ప్రకారం పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు సప్లిమెంటరీలో భాగంగా అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్లో ఈ నెల 26వ తేదీ(నేటి) నుంచి 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని కోరింది. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను మే 26 నుంచి 30వరకు నిర్వహించనుంది.పరీక్ష ఫీజు ఇలా..పదో తరగతిలో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షకు రూ.150, ప్రాక్టికల్ పరీక్షకు రూ.100 చొప్పున నిర్ణీత వ్యవధిలో పరీక్ష ఫీజుగా చెల్లించాలని సూచించింది. ఓపెన్ ఇంటర్మీడియెట్లో ఉత్తీర్ణులు కాని అభ్యర్థులు పాసైన సబ్జెక్టులో మాత్రమే బెటర్మెంట్ కోసం థియరీకి రూ.250, ప్రాక్టికల్కు రూ.100, అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఇంప్రూవ్మెంట్ కోరుకునే అభ్యర్థులు పదో తరగతిలో రూ.200, ఇంటర్మీడియెట్ థియరీకి రూ.300, ప్రాక్టికల్స్కు రూ.100 చెల్లించాలని కోరింది. ఈనెల 30 నుంచి మే 2 వరకు ప్రతి సబ్జెక్టుకు రూ.25, మే4 వరకు ప్రతి సబ్జెక్టుకు రూ.50 అపరాధ రుసుంతో, మే 5న తత్కాల్ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు విధించింది. తత్కాల్ రుసుము పదో తరగతికి అయితే రూ.500, ఇంటర్మీడియెట్కు రూ.1000గా పేర్కొంది. www.apopenschool.ap.gov.in వెబ్సైట్ ద్వారా సప్లిమెంటరీ పరీక్ష ఫీజులను చెల్లించాలని సార్వత్రిక విద్యా పీఠం డైరెక్టర్ ఆర్.నరసింహారావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.మే 18 వరకు ఫీజు చెల్లింపునకు గడువుపదో తరగతి రెగ్యులర్ ఫలితాల్లో విఫలమైన విద్యార్థులకు మే 19 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. ఇప్పటికే పాఠశాలల హెచ్ఎంలు ఆన్లైన్లో ఈనెల 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. మే 1నుంచి 18 వరకు రూ.50 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చింది. స్కూల్ లాగిన్ల నుంచి మాత్రమే చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. మే 19 నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. -
అవినీతి 'ఐకానిక్'!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగు రూ.8,981.56 చొప్పున రూ.4,688.82 కోట్లను కాంట్రాక్టుగా విలువగా నిర్ణయించి సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలవడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. ఇదే ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నాడు టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అప్పటితో పోల్చితే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేదు. పోనీ.. నిర్మాణ పద్ధతి ఏమైనా మారిందా? అంటే అదీ లేదు. అప్పుడూ ఇప్పుడూ డయాగ్రిడ్ విధానమే. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం పెరగకూడదు. కానీ.. 2018తో పోల్చితే చదరపు అడుగుకు ఏకంగా రూ.4,631.14 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేశారు. దీన్నిబట్టి ఐకానిక్ టవర్ల టెండర్లలో భారీ గోల్మాల్ జరిగినట్లు స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యనేత తన సిండికేట్లో ముగ్గురు బడా కాంట్రాక్టర్లు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకేజీ చొప్పున పనులు అప్పగించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని తొలి విడత కమిషన్గా రాబట్టుకుని.. ఆ తర్వాత ప్రతి బిల్లులోనూ పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్ రూపంలో రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చ.అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత డిజైన్లలో మార్పు, పని స్వభావం మారిందనే సాకులతో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున పెంచేశారు. ఈ లెక్కన ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందోనన్న చర్చ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది.డయాగ్రిడ్ విధానంలో నిర్మాణం..సంప్రదాయ పద్ధతిలో భవనాలను కాలమ్స్ (నిలువు కాంక్రీట్ దిమ్మెలు), బీమ్స్ (అడ్డు కాంక్రీట్ దిమ్మెలు) నిర్మించి కాంక్రీట్తో శ్లాబ్ వేస్తారు. ఇటుకలతో గోడలు కట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు. ఐకానిక్ టవర్ల(ఆకాశ హర్మ్యాలు)ను సంప్రదాయ పద్ధతిలో నిర్మించడం సాధ్యం కాదు. డయాగ్రిడ్ విధానంలో నిర్మించేలా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ డిజైన్ చేసింది. డయాగ్రిడ్ విధానంలో కాలమ్స్, బీమ్స్ను ఒక మూల నుంచి మరో మూలకు కలుపుతూ కాలమ్స్ నిర్మిస్తారు. దీనివల్ల గాలి వేగాన్ని తట్టుకుని గురుత్వాకర్షణ శక్తితో ఉంటుంది. అమరావతి ఐకానిక్ టవర్లలో నాలుగింటిని బీ+జీ+39 అంతస్తులతో.. జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో కడుతున్నారు. సచివాలయంలో 1, 2, 3, 4, జీఏడీ టవర్లో ఒక్కో అంతస్తు 47 మీటర్లు వెడల్పు, 47 మీటర్ల పొడవుతో 2,209 చదరపు మీటర్లు (23,777 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో నిర్మించనున్నారు. ఇందులో 1,200 చదరపు మీటర్లు(12,916 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతాన్ని వినియోగించేలా నిర్మిస్తారు.వాస్తవానికి చ.అడుగు రూ.2 వేలకు మించదు..!సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని పేర్కొంటున్నారు. అయినా సరే.. 2018తో పోల్చితే ఐకానిక్ టవర్ల అంచనా వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేసి సీఆర్డీఏ టెండర్లు పిలవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మొత్తం ఐదు ఐకానిక్ టవర్లను పరిశీలిస్తే.. సగటున చదరపు అడుగుకు రూ.8,981.56 చొప్పున కాంట్రాక్టు విలువగా నిర్దేశించినట్లు స్పష్టమవుతోంది. రాజధానిలో ఇప్పటివరకూ ఆమోదించిన టెండర్లను పరిగణలోకి తీసుకుంటే.. ఐకానిక్ టవర్ల పనులను కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం అధిక ధరకు టెండర్లలో నిర్మాణ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ఈ లెక్కన అంచనా వ్యయం నిర్మాణం ప్రారంభించక ముందే పెరగనుంది. గతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని బట్టి చూస్తే.. ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.నాడూ నేడూ అదే దోపిడీ..!2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్కు దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచి పాలన అంటూ ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఏకంగా రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి తెరతీసినట్లు స్పష్టమవుతోంది.సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం..అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్– జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులను 2018 ఏప్రిల్లో కాంట్రాక్టు సంస్థలకు టీడీపీ సర్కారు అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తి కాగా మిగిలిన పనులకు సీఆర్డీఏ ఇప్పుడు టెండర్లు పిలిచింది.» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,897.86 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో షాపూర్జీ పల్లోంజీ సంస్థకు రూ.932.46 కోట్లకు అప్పగించడం గమనార్హం.» సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,664.45 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.784.62 కోట్లకు అప్పగించారు.» ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,126.51 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు అప్పగించింది. -
ఏపీ గవర్నర్ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కలిశారు. తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారనే సంగతిని పంకజశ్రీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. తన భర్త వంశీపై అక్రమ కేసులను బనాయించి వేధిస్తున్నారని గవర్నర్ కు చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. పంకజశ్రీ వెంట వైఎస్సార్ సీపీ నేతలు పేర్ని నాని, తలశిల రఘురామ్ లు ఉన్నారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. 14 మంది రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీ హైకోర్టులో విడదల రజినికి ఊరట
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను శుక్రవారం ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే విచారణలో భాగంగా.. 41 ఏ నోటీస్ ఫాలో కావాలని స్పష్టం చేసింది.అదే సమయంలో విచారణకు సహకరించాలని, కేసుకు సంబంధించి బహిరంవ్యాఖ్యలు చేయొద్దని రజినికి కోర్టు స్పష్టం చేసింది. శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారంటూ విడదల రజినిపై కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా ఏసీబీ చేత నమోదు చేయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా రజిని ఉన్నారు. అయితే తమపై కక్ష పూరితంగా కేసులుట్టారని, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి విడుదల రజిని తో పాటు ఆమె పీఏ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ3గా ఉన్న ఆమె మరిది గోపీనాథ్ను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. -
‘పవన్.. మీరు సామాన్యులను, దళితులను పట్టించుకోరా?’
తాడేపల్లి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హెంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్నవారినే తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరా? అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా? అని పేర్ని నాని మండిపడ్డారు. ఈరోజు’(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు పేర్ని నాని. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో అప్పులపై విషం ప్రచారం చేశారని, ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నానాయాగి చేశారన్నారు. పెద్దపెద్ద మేధావులకే చంద్రబాబు ఆర్థిక పాఠాలు నేర్పురారన్నట్లుగా జాకీలతో లేపారని, ఇప్పుడు చంద్రబాబు రూ. లక్షా 3 వేల కోట్లు అప్పు నేరుగా తెచ్చారన్నారు.‘రూ.44 వేల కోట్లను కార్పొరేషన్ ల ద్వారా తెచ్చారు. ఒక లక్షా 47 వేల కోట్లకు పైనే అప్పు చేశారు. జగన్ చేసిన అప్పులతో పోర్టులు, సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్ల అభివృద్ధి ఇలా అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి. జగన్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. కానీ చంద్రబాబు చేస్తున్న అప్పులు ఏం చేస్తున్నారో చెప్పటం లేదు. ఎన్నికలకు ముందు ఉత్తరకుమారుడిలా చంద్రబాబు మాటలు చెప్పారు. ఇప్పుడేమో సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో అర్థం కావటం లేదంటున్నారు. చంద్రబాబు మాటలకు పవన్ కళ్యాణ్ చిడతలు కొడుతున్నారు. తాజాగా లక్షా 91 వేల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టేశారు.రూ.9 వేల కోట్ల అప్పుల కోసం తాకట్టు పెట్టారు. దీనిమీద ఎల్లోమీడియా ఎందుకు మాట్లాడటం లేదు?, ఆరు మాసాలకు చెందిన కిస్తీలను ముందుగానే బ్యాంకులో వేయాలనే నిబంధన పెట్టటం దుర్మార్గం.అప్పు ఇచ్చిన వారు రిజర్వ్ బ్యాంకులో ఉండే ప్రభుత్వ నిధులను నేరుగా తీసుకోవచ్చని కూడా నిబంధన పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? , ఇలాంటి వ్యవహారాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అసలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు? , ఇంతకంటే బరితెగింపు ఉంటుందా?, జగన్ కంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తామనీ, అప్పు చేయకుండా సంపద సృష్టిస్తామని అప్పట్లో తెగ బిల్డప్పులు ఇచ్చారు.ఇప్పుడు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. రాష్ట్రం అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అమరావతి ఒక్కటేనా?, ఎన్నికలకు ముందు అద్దె ఆఫీసుల్లో ఉన్నవారు ఇప్పుడు ప్యాలెస్లు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కారుపైకి ఎక్కి ప్రయాణించారు. ఇప్పుడు జనానికి కనపడకుండా ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతున్నారు. సొంత కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలే. రాష్ట్ర ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తారా? , ఈ విమానాలు, హెలికాఫ్టర్లకు ఎవరి డబ్బు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రత్యేక విమానాలకు ఖర్చు పెడతారా?’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు. -
ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారు. కస్తూరి రంగన్కి నివాళులు అర్పిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్యూ ఛాన్సలర్గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్గా పనిచేశారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరి రంగన్. కేరళ ఎర్నాకులంలో కస్తూరిరంగన్ జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్లో మాస్టర్స్ చేసిన రంగన్.. అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ మీద 240 పేజీల థియరీని సమర్పించారాయన.1994 నుంచి 2003 దాకా.. తొమ్మిదేళ్లపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కి ఆయన చైర్మన్గా పని చేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్కు డైరెక్టర్గా పనిచేశారు.మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్తో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారాయన. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు ఇస్రో చైర్మన్గా ఉంది కస్తూరి రంగనే. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్ భార్య 1991లో కన్నుమూశారు.Deeply saddened to learn of the passing of Dr. K. Kasturirangan, former Chairman of #ISRO — an eminent scientist, visionary educator, and passionate environmentalist. He leaves an indelible mark on the annals of India’s space history. My tributes to this legend. May his soul rest… pic.twitter.com/cDEHln1tet— YS Jagan Mohan Reddy (@ysjagan) April 25, 2025 -
తాకట్టులో ఖజానా: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, అమరావతి: దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన విధానాలకు తెగబడిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ నుంచి రూ.9 వేల కోట్ల అప్పులను బాండ్ల రూపంలో సేకరిస్తున్న విధానంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు మళ్లించేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఇది దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధ పాలన, అస్తవ్యస్త ఆర్థిక విధానాలకు ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యకు అనుమతించిన అధికారులు భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. బుగ్గన గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులకు స్కీంకూటమి ప్రభుత్వం కొత్తగా బడ్జెట్ వెలుపల భారీ అప్పులు చేయడం ప్రారంభించింది. సంపద సృష్టి జరగడం లేదు. ఏపీఎండీసీ ద్వారా రూ.9 వేల కోట్లకు బాండ్లు విడుదల చేయడం ద్వారా కొత్తగా అప్పులు చేయాలని స్కీం ప్రారంభించారు. ఏపీఎండీసీ ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులు చేయాలనేదే ఈ స్కీం. బ్యాంకుల నుంచి అప్పు పుట్టకపోవడంతో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ (ఎన్సీడీ) బాండ్స్ మీద అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఎండీసీ ఎక్కువగా ఔట్ సోర్సింగ్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కాబట్టి ఆ సంస్థకు మూలధన వ్యయం పెద్దఎత్తున అవసరం లేదు. కానీ, రూ.9 వేల కోట్లు కావాలని బాండ్లు జారీ చేస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేదు..ఇండియా రేటింగ్స్ సంస్థ ప్రభుత్వ ఆదాయం గతేడాది అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. 1.3 శాతమే వృద్ధి కనిపిస్తోందని, ద్రవ్యలోటు స్థూల ఉత్పత్తిలో 4.2 శాతం ఉండాల్సి ఉంటే 4.6 శాతానికి పెరిగిందని చెప్పింది. అయినా ‘సీఈ’ రేటింగ్ ఇచ్చారు. ఎందుకంటే.. డిబెంచర్ కొనుగోలుదార్లకు డీఎస్ఆర్ఏ ఖాతాలో నిల్వ లేకపోతే నేరుగా ఆర్బీఐ నుంచి నిధులు జమయ్యేందుకు అంగీకరించడం వల్లే. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఏపీ ఎండీసీ గత వార్షిక నివేదికలో 9 నెలలకు రెవెన్యూ రూ.910 కోట్లుగా ఉంది. 12 నెలలకు చూస్తే సుమారు రూ.1200 కోట్లు వస్తుంది. కానీ వీరు చేస్తున్న అప్పులు, డీఎస్ఆర్ఏ ఖాతాలో ముందుగా పెట్టే 6 నెలల నిల్వలతో కలిపి చూస్తే రూ.10 వేల కోట్లు. వీరి ఆదాయంతో పోలిస్తే చేస్తున్న అప్పులు ఎనిమిది రెట్లు ఎక్కువ. దీనిని ఏ బ్యాంక్ కూడా అంగీకరించదు.గతంలో ఎక్కడా లేని విధానం..ఇటువంటి నిబంధనలు, వెసులుబాట్లు చరిత్రలో ఎప్పుడూ లేవు. ఖజానాలో ఏ కారణంతో అయినా నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు బాండ్లు కొనుగోలు చేసినవారికి వెళ్లిపోతాయి. బాండ్లు కొన్నవారికి చెల్లింపుల కోసం ముందుగానే నిర్దేశించిన ఖాతాల్లో మొదటి నెలలోనే 30 శాతం.. అంటే మూడో భాగం కచ్చితంగా ఉంచాలి. ఇలా ప్రతి నెల ఉంచాలి. ఇదికాకుండా డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్(డీఎస్ఆర్ఏ) ఖాతాలో 6 నెలలకు చెల్లించాల్సిన మొత్తాలను కూడా నిల్వగా చూపుతూ రావాలి. ఈ నిధులు తగ్గిపోతే ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు నేరుగా బాండ్లు కొన్నవారికి వెళ్లిపోతాయి. ⇒ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోతే.. గనులను తాకట్టులో ఉంచుకున్న ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఖజానాలోకి వెళ్లి డబ్బు తీసుకోవచ్చు. నాడు బెవరేజెస్ కార్పొరేషన్పై అప్పులు తెస్తే భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టుపెట్టారంటూ ఆరోపణలు చేశారు. ఇవాళ గనులను తాకట్టుపెట్టడమే కాక... ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలన్నింటినీ తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీ రెవెన్యూ అంతా ఒకే ఖాతాలోకి వచ్చేలా నిబంధన పెట్టారు. ఆ ఖాతాను సంపూర్ణంగా అప్పుల కోసం తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీకి వచ్చే ఒక్క రూపాయి అయినా ఇతర పనులకు వాడుకునే అవకాశం లేదు.మిసిలేనియస్ జనరల్ హెడ్కు ఇంత భారీ కేటాయింపులా?2025–26 రాష్ట్ర బడ్జెట్లో మిసిలేనియస్ జనరల్ హెడ్–0075 కింద ప్రభుత్వం రూ.7,916 కోట్లు చూపించింది. ఇవి ప్రత్యేకంగా ఏ డిపార్ట్మెంట్కు కేటాయించని ఖర్చులు. చిన్న చిన్న వ్యయాలకు ఈ నిధులను వాడతారు. ఈ హెడ్ కింద 2016 –17లో రూ.131 కోట్లు, 2017 –18లో రూ.307 కోట్లు, 2018 –19లో 135 కోట్లుగా ఉండేది. 2023–24లో రూ.153 కోట్లు, 2024–25లో రూ.226 కోట్లు చూపించారు. కానీ, మొదటిసారి ఏపీ చరిత్రలో ఈ హెడ్ కింద 2025–26కి గానూ రూ.7,916 కోట్లుగా చూపించారు. అంటే, పక్కా ప్లాన్ ప్రకారం ఇంత పెద్ద మొత్తాన్ని ఆ హెడ్లో చూపించి కూటమి ప్రభుత్వ రెవెన్యూ ఖర్చులకు ఇష్టం వచ్చినట్లు వాడేందుకు సిద్ధమయ్యారు. ⇒ గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఇలాగైతే చైనా వంటి దేశాల్లో అధికారులను ఉరి తీస్తారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న పనులకు అధికారులకు ఎలాంటి శిక్ష పడుతుందో ఆలోచించుకోవాలి. ఏపీఎండీసీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా వారికి తాకట్టు పెడుతున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే?తాజా అప్పులూ రాష్ట్ర అప్పుల పరిమితి కిందకేఎప్పుడైతే ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇస్తారో అది రాష్ట్ర అప్పుల పరిమితి కిందకు వస్తుంది. రాష్ట్ర అప్పుల పరిమితి కింద రాష్ట్రం చేసే అప్పులకు 7 శాతం కన్నా తక్కువ వడ్డీ పడుతుంది. కానీ ప్రభుత్వం తాజాగా చేయబోయే అప్పు కూడా దీని కిందే వస్తుంది, కానీ దాదాపు 10 శాతం వడ్డీ పడుతుంది. దీనికి బ్రోకరేజీ అదనం. ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు డైరెక్ట్గా తీసుకుని పోయేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇది రాజ్యాంగం ఉల్లంఘన. రాజ్యాంగంలోని 293(1), 293(3), 203, 204 ఆర్టికల్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. అధికారులు దీనిని గుర్తించాలి.ఇదేనా సంపద సృష్టి అంటే?రాష్ట్ర అప్పులపై కూటమి పార్టీలు అబద్ధాలు చెప్పాయి. మొదట్లో రూ.14 లక్షల కోట్ల అప్పులన్నారు. తరువాత రోజుకో రకంగా అప్పులపై అంకెలను మారుస్తూ మట్కా లెక్కల స్థాయికి తెచ్చారు. వైఎస్సార్సీపీ ఐదేళ్లలో చేసిన అప్పులు రూ.3,32,500 కోట్లే. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.1.40 లక్షల కోట్లు అప్పులు చేశారు. 11 నెలలకు రూ.90 వేల కోట్ల మేరకు ఆర్బీఐ ద్వారా అప్పు చేసింది. మార్చి 2025లో రూ.8 వేల కోట్లు అడ్వాన్స్గా తీసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో మరో రూ.5 వేల కోట్ల అప్పు చేశారు. అమరావతి అప్పులు, బాండ్లు, మార్క్ఫెడ్, సివిల్ సప్లయిస్ అప్పులు తదితర అన్నీ కలిపితే రూ.1,47,655 కోట్లు అప్పులు చేశారు. ఈ సొమ్ము ఎక్కడకు వెళ్ళింది? మా ప్రభుత్వ హయాంలో ఏటా పేదలకు సంక్షేమ పథకాలను అందించాం. ఈ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. మరి అప్పులు చేసిన సొమ్ములు ఎక్కడకు పోతున్నాయి. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి ఉద్యోగుల సొమ్ము రూ.76,516 కోట్లు వాడుకుంది. -
మూడు పూట్లా తిండి పెట్టలేకపోతున్నాం
గాందీనగర్ (విజయవాడసెంట్రల్): ‘మా కుటుంబాలకు మూడు పూట్లా తిండిపెట్టలేకపోతున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఆరోగ్య కేంద్రాల అద్దెలు సైతం మేమే చెల్లిస్తున్నాం. జీతాలు పెంచమని అడిగితే రూ.40 వేలు జీతం ఇస్తున్నామంటూ ప్రభుత్వం దు్రష్పచారం చేస్తోంది. పని ఆధారంగా చెల్లించే ప్రోత్సాహకాల్లోనూ కోత పెడుతున్నారు. ఇచ్చే అరకొర ప్రోత్సాహకం కూడా ఆలస్యమవుతోంది’ అంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సీహెచ్వో) వాపోయారు. గురువారం విజయవాడలోని ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎంసీఏ) ఆధ్వర్యంలో సీహెచ్వోల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి సీహెచ్వోలు తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు, గర్భిణులు ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం సీహెచ్వోలను క్రమబద్దికరించాలని, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని, క్లినిక్ అద్దె బకాయిలు చెల్లించాలని, ఈపీఎఫ్వో పునరుద్ధరించాలని, జాబ్ చార్ట్ అందించాలని, హెచ్ఆర్ పాలసీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్ల కారణంగా పలువురు సీహెచ్వోలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శాఖను పటిష్టం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. జీతాలు పెంచమని అడిగితే ఇప్పటికే రూ.40వేలు ఇస్తున్నామని ప్రభుత్వం దు్రష్పచారం చేస్తోందని మండిపడ్డారు. ఇదే ఎన్హెచ్ఎంలో పని చేస్తున్న 119 కేటగిరీల వారికి 23 శాతం వేతన సవరణ చేశారన్నారు. ప్రోత్సాహకాల నెపంతో తమకు వేతన సవరణ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తీవ్రమైన ఆరి్థక ఇబ్బందులతో కడుపు రగిలి రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. అసోసియేషన్ కార్యదర్శి సందీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4వేల సెంటర్లు అద్దెప్రాతిపదికన నడుస్తున్నాయన్నారు. హెల్త్ సెంటర్ల అద్దెలు, కరెంట్ బిల్లులు తామే చెల్లిస్తున్నామన్నారు. సొంత డబ్బుపెట్టుకొని సేవ చేస్తుంటే ప్రభుత్వం రూ.40 వేలు ఇస్తున్నట్టు దు్రష్పచారం చేస్తోందన్నారు. కేవలం రూ. 25వేలు ఇస్తున్నారని, ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీహెచ్వోలు ప్రమాదవశాత్తు చనిపోతే మట్టి ఖర్చులు, ఎక్స్గ్రే షియా కూడా ఇవ్వడం లేదన్నారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో సీహెచ్వోలు పాల్గొన్నారు. -
మోసాల కూటమిని ప్రజలు క్షమించరు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నులమడం అసాధ్యం..! ఇచ్చిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టుకోకుంటే నీ తోలు తీస్తాం.. అని చెప్పగలిగిన సత్తా వైఎస్సార్ సీపీకి ఉంది..’ అని చంద్రబాబు సర్కారును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై గ్రామ గ్రామాన వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిలదీస్తారని చెప్పామని గుర్తు చేశారు. ‘వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో తెగువ ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు సెల్యూట్ చేస్తున్నా’ అని పార్టీ శ్రేణులను అభినందించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ మండలం స్థానిక సంస్థల వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పక్షాన గట్టిగా నిలబడిన ప్రజాప్రతినిధులను అభినందించారు. ఆయా మున్సిపల్ ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారికి వైఎస్ జగన్, నాయకులు నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..మీ తెగువకు మరోసారి సెల్యూట్..ఇవాళ రాష్ట్రంలో ప్రజలు యుద్ధ వాతావరణంలో బతుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన, రెడ్ బుక్ పాలన రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి సర్కారు అన్యాయాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు నుంచి వచ్చిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, గోపవరం పంచాయితీ నుంచి వచ్చిన సర్పంచి, వార్డు మెంబర్లకు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్ల తెగువకు మరోసారి సెల్యూట్ చేస్తున్నా.జీర్ణించుకోలేక అక్రమ కేసులు..» ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా టీడీపీకి బలం లేదు. ప్రతి చోటా వైఎస్సార్సీపీ జెండా మీద, గుర్తు మీద గెలిచిన సభ్యులే ఉన్నారు. » అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కంబదూరులో 15కు 15 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలిచింది. మరి అక్కడ టీడీపీ ఎందుకు పోటీ పెట్టింది? అక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా 13 మంది వైఎస్సార్సీపీ వెంట నిలబడ్డారు. అది మనమే గెల్చుకున్నాం.» ప్రొద్దుటూరులో గోపవరం చిన్న పంచాయితీ. అక్కడ ఉప సర్పంచ్ ఎన్నికలో చంద్రబాబు తన బుద్ధి ప్రదర్శించారు. 20 మంది వార్డు మెంబర్లకుగానూ 19 మంది వైఎస్సార్సీపీకి చెందిన వారే ఉన్నా చంద్రబాబు ఎందుకు పోటీ పెట్టారు? అక్కడ ఎంత దారుణంగా భయపెట్టారో, దాడులు చేయించారో రాష్ట్రమంతా చూసింది. చివరికి గొడవల ద్వారా మొదటిసారి ఎన్నికలు వాయిదా వేశారు. రెండోసారి కారణం దొరక్క.. ఎన్నికల అధికారికి హఠాత్తుగా గుండెపోటు అని చెప్పి వాయిదా వేశారు.» తిరుపతి రూరల్ మండలానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు ఇల్లు ఉంది. చంద్రబాబు మొదటిసారి గెలిచింది, మళ్లీ ఓడిపోయింది ఇక్కడే. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడిస్తే.. ఇక్కడ ప్రజలు తంతే చంద్రబాబు కుప్పం వెళ్లారు.బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వారికి ప్రాధాన్యతనిచ్చి పైకి తేవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. బీసీలు ఆర్థికంగా అంత బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టవచ్చని చంద్రబాబు అక్కడ పాగా వేశారు. చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి రూరల్ మండలంలో 40 మంది ఎంపీటీసీలకు గానూ 34 మంది వైఎస్సార్సీపీ తరపున గెలిచారు. అక్కడ నామినేషన్ వేయకుండా రకరకాలుగా భయపెట్టారు. 34 మందిలో 33 మందితో మోహిత్ ఓటేయించాడు. ఒక్కరే జారిపోయారు. మిగిలిన అందరూ ఒక్క తాటిమీద నిలబడి వైఎస్సార్సీపీ తెగువను చూపించారు. దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక ఎన్నికలు అయిపోయిన తర్వాత జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని వారి మీద కేసులు పెట్టించారు.» వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి 25 మంది కౌన్సిలర్లు ఉంటే ఒక్కరూ టీడీపీ నుంచి గెలవలేదు. అక్కడ ఛైర్మన్ను దింపాలని చంద్రబాబు ఆరుగురిని భయపెట్టి, బెదిరించి కొనుగోలు చేయగలిగారు. మిగిలిన 19 మంది వైఎస్సార్సీపీ వెంట నిలబడ్డారు.» అంతకుముందు రాష్ట్రంలో 50 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. చంద్రబాబుకి ఎక్కడా బలం లేదు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు. ఆయన ఎందుకు ఇంతలా దిగజారిపోయాడంటే సంవత్సరం పాటు చేసిన పాలనే నిదర్శనం. అన్నీ కోతలు.. అవకతవకలేఇవాళ వ్యవస్థలు పూర్తిగా అధ్వాన్నమైన పరిస్థితుల్లో నీరుగారిపోయాయి. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి. ఏ బెల్టు దుకాణాన్ని చూసినా.. షాపుల్లో ధర కన్నా రూ.20 ఎక్కువకు అమ్ముతున్న పరిస్థితి కళ్లముందే కనిపిస్తోంది. మన హయాంలో కన్నా ఇసుక రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మట్టి, మైనింగ్, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అంతో ఇంతో ముట్టజెప్పాల్సిందే. ఆయన ముఖ్యమంత్రికి ముట్టజెప్పాలి. నాకింత.. నీకింత అని దోచుకుని తింటున్న పరిస్థితి రాష్ట్రమంతా కనిపిస్తోంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకొక డైవర్షన్ టాపిక్ ఎంచుకుంటున్నారు. అడ్డగోలుగా భూ పందేరాలు..విశాఖపట్నంలో ఊరూపేరు లేని ‘ఉర్సా’ లాంటి కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో నివాస గృహాలకు చెల్లించే కరెంటు బిల్లును ఆ కంపెనీ కడుతోంది. ఇక అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. ఊరూపేరు లేని కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువ చేసే భూమి, అది కూడా కేవలం రూ.99 పైసలకే ఎకరా భూమి కట్టబెడుతున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు..చంద్రబాబు వచ్చిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సు ముందే ఇస్తారు. వాళ్ల దగ్గర నుంచి 8 శాతం చంద్రబాబు తీసుకుంటారు! ఇలా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. అప్పు అంతా ఏమైపోతోంది..?మరి చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు ఎందుకు లేవు? గతంలో జగన్ చేయగలిగాడు...మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే అందుకు కారణం ఎన్నికలప్పుడే చెప్పా. జగన్ నేరుగా బటన్ నొక్కుతాడు. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళుతుంది. అదే చంద్రబాబు ఉంటే బటన్లు ఉండవు. నేరుగా ఆయన జేబుల్లోకే పోతుందని ఆ రోజు ఎన్నికలప్పుడు నేను మొత్తుకుని చెప్పా. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. ఆ రోజు నేను చెప్పింది మీరు మళ్లీ వింటే.. జగన్ కరెక్టుగా చెప్పాడు, మనమే మోసపోయామని మీకే అర్ధం అవుతుంది. ఈరోజు ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోంది.ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్జరుగుతున్న వాటికన్నింటికీ సమాధానం చెప్పుకోలేకే ప్రతి రోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికారుల అరెస్టులు అంటాడు. షాక్ కొట్టేలా పెంచిన కరెంట్ బిల్లుల గురించి అడిగితే... ఆయన చేసిన లిక్కర్ స్కాంను ఇంకొకరి మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒకటి సృష్టించి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. చరిత్రలో రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తోందని గ్లాడియేటర్స్ అని గేమ్స్ నిర్వహించేవారు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను బరిలో దించి చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటిని ప్రజలు చూసేలా చేసి మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు వాటి గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలా ప్రతి రోజూ ఒక డైవర్షన్ టాపిక్, డ్రామా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతోంది.హామీలకు దిక్కులేని పరిస్థితుల్లో పాలన..చాలా మంది ఇళ్లల్లో చంద్రబాబు మేనిఫెస్టో ఉంది. అప్పట్లో భారీగా ప్రకటనలు ఇచ్చారు. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపి బాండ్లు కూడా రాసిచ్చారు. జగన్ ఇచ్చినవన్నీ చంద్రబాబు కూడా ఇస్తారని, అంతేకాదు అదనంగా కూడా ఇస్తారంటూ వాళ్ల కార్యకర్తలతో చెప్పించి బాండ్లు కూడా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇంకా 143 హామీలు ఇచ్చారు. మరి నా అక్కచెల్లెమ్మలు ప్రొద్దుటూరు, కడపలో నిరీక్షిస్తున్నారు. ఉచిత బస్సు ద్వారా విశాఖపట్నం వెళ్లి రావాలని ఎదురు చూస్తున్నారు. దానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది.వ్యవస్థలన్నీ విధ్వంసం.. » మరోవైపు వ్యవస్థలన్నీ ఇప్పుడు పూర్తిగా విధ్వంసం అయ్యాయి. వైఎస్సార్సీపీ హయాంలో మా పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతున్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. అప్పట్లో ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సందేహిస్తున్న దుస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వ స్కూళ్లు అంతలా నాశనం అయ్యాయి. ఇంగ్లిషమీడియం, మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసేశారు. మూడో తరగతి నుంచే టోఫెల్ని సైతం పీరియడ్గా పెట్టి చదివించే గొప్ప కార్యక్రమాన్ని రద్దు చేశారు. నాడు–నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాసిరకంగా అయిపోయింది. పిల్లలను బడికి పంపిస్తే తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చిన అమ్మ ఒడి గాలికెగిరిపోయింది. నాడు 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్లు కనిపించే పరిస్ధితి ఉండేది. ఇప్పుడు వాటిని కూడా ఆపేశారు. బడికి పిల్లలు పోవటాన్ని ఇవాళ నరకంగా మార్చేశారు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా పూర్తి ఫీజులు కట్టి వారి వసతి ఖర్చుల సైతం ఇచ్చిన కార్యక్రమాలు రద్దయ్యాయి. విద్యాదీవెన, వసతి దీవెన అందక ఇంజనీరింగ్ విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి నెలకొంది.» వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైంది. ఏ పేదవాడికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఉచితంగా పెద్దాసుపత్రిలో వైద్యం చేయించుకుని చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి గతంలో ఉండేది. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3,300 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించుకునే పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు చొప్పున 12 నెలలకు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్లో పెట్టారు. దీంతో ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయలేమని బోర్డు పెట్టాయి. ఇవాళ దురదృష్టవశాత్తూ ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని అప్పులు పాలైతేగానీ పేదవాడు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు.» ఇక వ్యవసాయం రంగం గురించి చూస్తే ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికెగిరిపోయింది. ఈ–క్రాప్ ఎక్కడుందో తెలియని దుస్థితి. రైతులు రోడ్డున పడి అల్లాడుతున్నారు. జగన్ ఇచ్చిన రూ.13,500 పెట్టుబడి సాయం ఆగిపోయింది. అన్నదాతా సుఖీభవ కింద చంద్రబాబు ఇస్తానన్న రూ.26 వేలు పెట్టుబడి సాయం కూడా గాలికెగిరిపోయిందని ఇవాళ ప్రతి రైతూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.వైఎస్సార్సీపీ అఖండ విజయంతో అధికారంలోకి రావడం తథ్యం..నేను అందరికీ ఒక్కటే చెబుతున్నా. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయని, మోసం చేసిన చంద్రబాబునాయుడు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పరిస్థితి ఒకేలా ఉంటుంది. ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు. తప్పకుండా ఆరోజు వస్తుంది. మరో మూడేళ్లు గడిచిన తర్వాత.. కచ్చితంగా వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఈసారి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నా. గతంలో మీరు అనుకున్నంత స్థాయిలో కార్యకర్తలకు తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కారణం.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. రెండేళ్లు కోవిడ్ వల్ల వేరే అంశాల మీద ధ్యాస పెట్టలేకపోయాం. పూర్తిగా ప్రజల బాగోగులు, వారి ఆరోగ్యం మీదనే ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1న మెయిన్ పరీక్ష
సాక్షి, అమరావతి: కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1వ తేదీన మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన 38,910 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఒకే పేపర్ ఉంటుంది. జూన్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంటవరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇతర వివరాలకు తమ వెబ్సైట్ http://slprb.ap.gov. in సందర్శించాలని రాష్ట్ర పోలీసు నియామక మండలి గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
మెగా అగచాట్ల డీఎస్సీ!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ను ఓపెన్ చేసిన నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కొన్ని నిబంధనలు అడ్డంకి కాగా, ఆన్లైన్లోనూ సాంకేతిక కారణాలతో దరఖాస్తుకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతున్నాయి. హెల్ప్ లైన్ నెంబర్లు కూడా సకాలంలో పని చేయడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. కఠిన నియమాలతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల కు పదవ తరగతి, ఇంటర్మీడియట్లో కూడా కనీస మార్కులు 45–50 శాతం లేకుంటే ఇన్ వ్యాలిడ్గా చూపిస్తోంది. ఆ మేరకు మార్కులు లేకుంటే కనీస విద్యార్హత అయిన డిగ్రీలో సగటు మార్కులు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నా కూడా దరఖాస్తు సబ్మిట్ అవ్వడం లేదు. ఓపెన్లో ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేసిన వారికి వరుసగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడీ వరుస క్రమంలో విద్యార్హతలు నమోదు చేసేందుకు వీలు పడటం లేదు. దీనికితోడు కొన్ని ఆప్షన్లు లేకపోవడంతో ఇబ్బందికి గురవుతున్నారు. ఉదాహరణకు.. ఓ డీఎస్సీ అభ్యర్థి ఇంటర్మీడియట్లో అరబిక్ను ద్వితీయ భాషగా తీసుకుంటే.. మెగా డీఎస్సీ అప్లికేషన్లో రెండవ భాష సెలెక్ట్ చెస్తే డ్రాప్–డౌన్ మెనూలో అరబిక్ ఆప్షన్ కనిపించట్లేదు. 2024లో అప్లై చేసేటప్పుడు ‘ఏదైనా ఇతర భాష’ అనే ఆప్షన్ ఉండేది. ఈసారి అది ఎత్తేశారు. మరోవైపు ఓపెన్ స్కూల్లో చదివిన కోర్సుల నమోదుకు ప్రత్యేక ఆప్షన్ ఇవ్వలేదు.డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివిన వారు అప్లై చేసేందుకు ఆ సబ్జెక్ట్ ఆప్షన్ కనిపించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఇలాంటి వాటిని సరిదిద్దకుంటే నష్టపోతామని, పరీక్ష కేంద్రం ఎక్కువ దూరం వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలిమెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. కొంత మంది నిరుద్యోగులు డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తు పూరించడంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు దొర్లడంతో చూసుకోకుండానే దరఖాస్తును సబ్మిట్ చేశారు. దీంతో హాల్ టికెట్ రాదేమోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి తప్పిదాలు చేసిన వారికి కరెక్షన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నిరుద్యోగుల అభ్యసనానికి తగిన సమయం దొరికేలా డీఎస్సీ షెడ్యూల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.పోటీ పరీక్షలకు కనీస మార్కులేంటి?» విద్యార్హతల్లో కనీస మార్కులు పెట్టడం ఏమిటని రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. టెట్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి డీఎస్సీ రాసే అర్హత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో టెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెగా డీఎస్సీలో నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కుదరట్లేదు. » ఎస్జీటీకి ఇంటర్మీడియట్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్కు డిగ్రీలో 50 శాతం కనీస మార్కులు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్ అభ్యర్థులకు ఐదు శాతం మినహాయింపు ఉంది. కానీ, అనేక మంది నిరుద్యోగులు టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన క్రమంలో అప్పట్లో 40 శాతం కనీస అర్హత మార్కులుగా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు వారంతా అనర్హులుగా మారిపోతున్నారు. » పీజీ ఇంగ్లిష్లో 42.5 శాతం మార్కులు కలిగిన ఓ మహిళ కొన్ని నెలలుగా డీఎస్సీ కోసం శిక్షణ పొందుతోంది. ఇలాగే ఇంటర్మీడియట్లో 47.5 శాతం మార్కులున్న ఓ జనరల్ అభ్యర్థి దరఖాస్తు చేయడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలా వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు వేచిచూస్తున్న తరుణంలో కనీస మార్కులు 50 శాతం నిర్దేశించడంతో దిక్కు తోచక కొట్టుమిట్టాడుతున్నారు.» టెట్లో ఉత్తీర్ణత సాధించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. టెట్ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కనీస మార్కులతో సంబంధం లేకుండా మెగా డీఎస్సీకి అర్హత కల్పించాలని కోరుతున్నారు. టెట్ ఉత్తీర్ణులయ్యామంటే డీఎస్సీకి అర్హత ఉన్నట్లే కదా.. అని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు టెట్ ఎందుకు రాయించారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి కనీస మార్కులు 40 శాతానికి తగ్గించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
చంద్రబాబు సర్కార్ మరో భూ పందేరం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం మరో భూ పందేరానికి తెరలేపింది. చింతాస్ గ్రీన్ ఎనర్జీ సంస్థకు భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల కిందటే పుట్టిన చింతాస్కు భారీగా భూ కేటాయింపులు చేసింది. 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఎకరం 31 వేలకే లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.నవయుగ సంస్థకు చెందిన డైరెక్టర్లతో చింతాస్ ఏర్పాటు చేయగా, చింతాస్కు ఆగమేఘాల మీద భూముల కేటాయింపులు జరిగిపోయాయి. చింతాస్ డైరెక్టర్లతో ఈనాడు యాజమాన్యానికి బంధుత్వం ఉన్నట్లు సమాచారం. 2 నెలలకే భారీగా భూములు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో భూములను కేటాయించింది. హరే సముద్రం, బుల్లసముద్రం, ఉప్పెర్లపల్లి, ఎర్రబొమ్మన హల్లి, కల్లుమరి, మానూరె పరిసర గ్రామాల్లో భూముల కేటాయింపు జరిగింది.కాగా, ఊరు పేరు లేని ‘ఉర్సా క్లస్టర్స్’కు విశాఖలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన భూమిని చంద్రబాబు సర్కారు అప్పనంగా కట్టబెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు నెలల వయసు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్, వెబ్సైట్ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన అనంతరం రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉర్సా క్లస్టర్స్ రూ.5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటాక్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 3లో ఐటా క్యాంపస్కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్కు 56.36 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ గురించి ‘సాక్షి’ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
అప్పుల కోసం చంద్రబాబు సర్కార్ కొత్త మార్గం!
సాక్షి, విజయవాడ: సంపద సృష్టించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు.. అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు. అప్పులు చేయడంతో సరికొత్త మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో అప్పుల కోసం చంద్రబాబు సర్కార్ కొత్త మార్గం ఎంచుకుంది. ఏపీ ఎండీసీ ద్వారా 9 వేల కోట్లు బాండ్లు జారీ చేయాలని నిర్ణయించింది. రాజ్యాంగ విరుద్ధమని విమర్శలొస్తున్నా వెనక్కి తగ్గని ప్రభుత్వం.. 436 మైనర్ మినరల్ ప్రాజెక్టులపై ఏపీఎండీసీకి హక్కులు ఇచ్చేసింది. క్వారీ లీజు హోల్డ్ హక్కులు ఏపీ ఎండీసీకి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మైనింగ్ హక్కులు కూడా ఏపీఎండీసీకి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని చూపించి ఏపీఎండీసీ బాండ్లు జారీ చేయనుంది. రాష్ట్ర ఖజానాను తాకట్టుపెడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు నేరుగా రాష్ట్ర ఖజానా నుండి వెసులుబాటు కల్పించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారాయన.సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసిన సంగతి తెలిసిందే. ఒక వైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వం.. పది నెలల కాలంలో రూ.90 వేల కోట్లు అప్పులు చేసిందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని.. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్ముకశ్మీర్లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపంగా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. దుర్మార్గమైన రెడ్బుక్ పాలనలో..‘ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. దుర్మార్గమైన రెడ్బుక్ పాలన జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజావ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన.. మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త నిలదీస్తాడని చెప్పారు. ‘‘బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రజలు ఓడించారు కాబట్టే.. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయాడు. అక్కడ బీసీలు ఉన్నారు.. వారు ఆర్థికంగా ఇతరత్రా బలంగా ఉండరు కాబట్టి, వారిని తొక్కితొక్కిపెట్టవచ్చని చంద్రబాబు కుప్పంలో పాగావేశారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.జై జగన్.. అన్నారని కేసులు పెట్టారు..చంద్రగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో గెలిచాక జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని కేసులు పెట్టారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు తిరిగే ధైర్యంలేదు. తిరిగితే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడాన్ని నరకంగా మార్చేశారు. విద్యా, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయి. చంద్రబాబుగారు అధికారంలో వచ్చాక 4 లక్షలు పెన్షన్లు తీసేశారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ....ప్రతి బాటిల్పైన రూ.20ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వైఎస్సార్సీపీలో కన్నా ఇసుక రేటు రెండింతలు పెరిగింది. ఉచితం అని చెప్పి.. దోచుకుంటున్నారు. పైనుంచి కిందిదాకా ముడుపులు చెల్లిస్తేనే మైనింగ్ అయినా, పరిశ్రమ అయినా నడిచేది. అవినీతినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ టాపిక్స్ ఎంచుకుంటున్నారు. విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు రూ.3,000 కోట్లు ఖరీదు చేసే భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో రెషిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడుతుంది. అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు హయాంలో ఉర్సా లాంటి ఊరూ పేరు కంపెనీకి రూ.3,000 కోట్ల డబ్బులు దోచిపెడుతున్నారు. విశాఖఫట్నంలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500- 2000 వేల కోట్లు ఖరీదు చేసే భూములను.. టెండర్లు లేకుండా కట్టబెట్టారు.జగన్ చేయగలిగాడు.. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’..లెఫ్ట్, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లోనూ దోపిడీ. 2018లో ఐదేళ్ల కిందట చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచినప్పుడు పనుల విలువ రూ. రూ.36,000 కోట్లు. అప్పట్లో ఇప్పటికన్నా స్టీలు, సిమెంట్లు రేట్లు ఎక్కువ. అయినా కూడా ఆ రూ.36,000 కోట్ల విలువ ఈరోజు రూ.78,000 కోట్లకు పెంచేశారు. టెండర్లు రింగ్ ఫార్మ్ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారు. మొబలైజేషన్ అడ్వాన్వులు కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టాడు. 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వడం, అందులో 8శాతం కమీషన్లుగా తీసుకోవడం.. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడంలేదు. గతంలో ఎందుకు జగన్ చేయగలిగాడు.. చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.బాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే డబ్బులు‘‘జగన్ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే పోతున్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మొత్తుకుని చెప్పాను. చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికార్ల అరెస్టులు అంటూ డైవర్షన్లుఇలాంటి పాలనే రాష్ట్రంలో జరుగుతోంది....కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా పెంచారు.. వీటి గురించి అడిగితే.. ఆయన చేసిన లిక్కర్ స్కాంను మరలా ఇంకొకరు మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసి దాన్నుంచి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని గ్లాడియేటర్స్ను పెట్టిన గేమ్స్ ఆడించేవాళ్లు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను పెట్టి.. చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటని ప్రజలు చూసేలా చేసి వారిని మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు ఆ ఆటలు గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఎంతో మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయకుండా, మోసం చేసిన చంద్రబాబు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు..ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు.ఆ రోజు వస్తుంది. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నాను. ఈ రోజు కార్యకర్త ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాను’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) గురువారం సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. దీనికి ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వానించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు. -
నేటి నుంచి వేసవి సెలవులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, పాఠశాలలకు గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం విద్యా సంవత్సరం ముగియడంతో వేసవి సెలవులు ప్రకటించారు. జూనియర్ కాలేజీలు జూన్ 2న, పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం అవుతాయి. అయితే, అన్ని యాజమాన్య పాఠశాలల్లోని ఉపాధ్యాయులు జూన్ 6న విధుల్లో చేరాలని విద్యా శాఖ ఆదేశించింది. -
‘పది’పోయిన ఫలితాలు
సాక్షి, అమరావతి: విద్యా సంవత్సరం మధ్యలో ప్రారంభించిన ఉపాధ్యాయుల సర్దుబాటు సెప్టెంబరు వరకు సాగదీత.. అప్పర్ ప్రైమరీ (యూపీ) పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల తొలగింపు.. ఇలా పాఠశాల విద్యలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫలితాలు దిగజారాయి. గత ఏడాది కంటే ఉత్తీర్ణత 5.55 శాతం తగ్గింది. పదో తరగతి ఫలితాలను బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకే‹శ్ ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్లో విడుదల చేశారు.⇒ ఈ ఏడాది పరీక్షలకు 6,19,286 మంది రిజిస్టర్ చేసుకోగా, 6,14,459 మంది హాజరయ్యారు. వీరిలో 4,98,585 మంది (81.14 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పాసైన వారిలో బాలికలు 2,53,278 మంది (84.09 శాతం), బాలురు 2,45,307 మంది (78.31 శాతం) ఉన్నారు. ⇒ ఈ ఏడాది పరీక్షలు ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలోనూ రాసేందుకు అవకాశం కల్పించారు.⇒ ఇంగ్లిష్ మీడియంలో రాసిన 5,60,864 మందిలో 4,66,586 మంది (83.19 శాతం), తెలుగు మీడియంలో 49,519 మందికి గాను 29,012 మంది (58.59 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ⇒ మొత్తం విద్యార్థుల్లో 65.36 శాతం ప్రథమ, 10.69 శాతం ద్వితీయ, 5.09 శాతం మంది విద్యార్థులు తృతీయ శ్రేణి సాధించారు. టాప్లో మన్యం.. చివరిలో అల్లూరి జిల్లాలుపదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతంతో టాప్లో నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఈ ఘనతను అందుకుంది. ⇒ 47.64 శాతం ఉత్తీర్ణతతో అల్లూరు సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. ⇒ మొత్తం 11,819 ఉన్నత పాఠశాలల (4,879 ప్రైవేటు, మిగిలినవి ప్రభుత్వ యాజమాన్యంలోనివి) నుంచి విద్యార్థులు పరీక్షలు రాశారు. 1680 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయి. 19 ‘సున్నా’ ఫలితాలను నమోదు చేశాయి. నేటి నుంచి రీ కౌంటింగ్కు అవకాశంపరీక్షలు తప్పిన, మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు విద్యాశాఖ అవకాశం కల్పించింది. పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్లో వారివారి స్కూల్ లాగిన్లో గురువారం నుంచి మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్కు రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.మే 19 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీపదో తరగతి పరీక్షల్లో విఫలమైన విద్యార్థుల కోసం పాఠశాల విద్యా శాఖ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్ ప్రకటించింది. మే 19 నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. త్వరలోనే టైమ్ టేబుల్ విడుదల చేయనున్నట్టు పేర్కొంది. విద్యార్థులు గురువారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని, ఆలస్య రుసుముతో జూన్ 18 వరకు గడువు ఇచ్చింది.కనిపించని మెరుపులు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విజయవంతమైన విద్యా సంస్కరణలతో మెరుగైన ఫలితాలను సాధించింది. రెండేళ్ల పాటు కోవిడ్–19తో సరిగా తరగతులు జరగక, పరీక్షలు నిర్వహించకపోయినా, 2022–23 విద్యా సంవత్సరంలో 933 స్కూళ్లు పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి.⇒ 2023–24 విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన వాటి సంఖ్య 2,803కు పెరగడంతో పాటు జీరో ఫలితాలు సాధించినవి 17కి తగ్గాయి.⇒ తాజాగా 2024–25 విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూళ్లు 1,680కి తగ్గిపోగా, జీరో ఫలితాల స్కూళ్ల సంఖ్య 19కి పెరిగింది.సివిల్స్ సాధిస్తా పది ఫలితాల్లో 600 మార్కులు సాధించిన నేహాంజనిబాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాకినాడకు చెందిన యాళ్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించి విశేష ప్రతిభ చూపింది. ప్రాథమిక విద్య నుంచి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తోంది. ప్రణాళికాబద్ధంగా చదివి కాకినాడ చరిత్రలో పదిలో నూటికి నూరుశాతం మార్కులతో ఘనత చాటింది. సివిల్స్ సాధించి పేద ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు నేహాంజని తెలిపింది. తండ్రి శ్రీనివాసరావు ప్రైవేట్ ఉద్యోగి కాగా తల్లి గంగాభవానీ గృహిణిగా ఉన్నారు. తమ విద్యార్థిని వై.నేహాంజని స్టేట్ టాపర్గా నిలిచిందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు.ఓపెన్ పది, ఇంటర్ ఫలితాలు విడుదలఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024–25 విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా మంత్రి లోకేశ్ బుధవారం విడుదల చేశారు. 26,679 మంది పదో తరగతి పరీక్షలు రాయగా, 10,119 మంది (37.93 శాతం) ఉత్తీర్ణులవగా, ఇంటర్మీడియట్లో 63,668 మందికి గాను 33,819 మంది (53.12 శాతం) విజయం సాధించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 26 నుంచి మే 5 వరకు ఏపీ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. ప్రతి సబ్జెక్టు రీకౌంటింగ్కు రూ.200, రీ వెరిఫికేషన్ కు రూ.రూ.1000 ఫీజుగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పది, ఇంటర్ మే–2025 పరీక్షలు రెగ్యులర్ పదో తరగతి పరీక్షలతో కలిపి నిర్వహించనున్నట్టు తెలిపారు. -
భారత్కు పోటెత్తిన పర్యాటకులు
సాక్షి, అమరావతి: భారతదేశానికి విదేశీ పర్యాటకులు పోటెత్తుతున్నారు. 2023–24లో 95,20,928 మంది విదేశీ పర్యాటకులు భారత్ వచ్చినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో కేవలం 10 దేశాల నుంచే 67.25 లక్షల మంది మన దేశంలో పర్యటించినట్టు పేర్కొంది. వీరిలో అత్యధికంగా బంగ్లాదేశ్ నుంచి, ఆ తరువాత స్థానంలో అమెరికా నుంచి పర్యాటకులు వచ్చినట్లు తెలిపింది. 2022–23 సంవత్సరంతో పోలిస్తే.. 2023–24లో 30.83 లక్షల మంది విదేశీయులు అధికంగా వచ్చినట్లు వివరించింది.వహ్.. తాజ్! 2023–24లో స్వదేశీ పర్యాటకులతోపాటు విదేశీ పర్యాటకుల్లో అత్యధికులు తాజ్మహల్ను సందర్శించినట్టు పర్యాటక శాఖ గణాంకాలు వెల్లడించాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో కుతుబ్ మినార్ రెండో స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది ఆగ్రా పోర్ట్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. స్వదేశీ పర్యాటకుల రాకలో కోణార్క్లోని సూర్య దేవాలయం రెండో స్థానంలో నిలిచింది. -
పక్కా కక్షే... అక్రమ కేసే
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై టీడీపీ కూటమి సర్కారు పక్కా పన్నాగంతో అక్రమ కేసు నమోదు చేసింది. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ నివేదికే ఆ కుట్రలను బహిర్గతం చేసింది. వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు ఇప్పించేందుకు ఎంతటి పన్నాగంతో వ్యవహరించారో బయటపడింది. ఆమెపై గతంలో నమోదైన క్రిమినల్ కేసులు దర్యాప్తు ఉండగానే వాటిని వక్రీకరిస్తూ... భారత సాక్ష్యాధారాల చట్టానికి విరుద్ధంగా కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసినట్లు స్పష్టమైంది. తాను ఎలాంటి తప్పూ చేయలేదని... జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పీఎస్ఆర్ ఆంజనేయులు తన వాదనలను న్యాయస్థానంలో స్వయంగా వినిపించారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన అక్రమ కేసులోనూ పీఎస్ఆర్ పేరును చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేయడంతోపాటు మరిన్ని అక్రమ కేసులకు ప్రభుత్వం సిద్ధమైంది.జత్వానీ అబద్ధపు ఫిర్యాదు.. అక్రమ కేసుటీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించింది. అందుకోసం కాదంబరీ జత్వానీని సాధనంగా చేసుకుంది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్కు చెందిన భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు యత్నించిన కేసులో ఆమె నిందితురాలు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ అతిథిగా మారిపోయారు. అక్రమ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తూ ముందుగా 2024 ఆగస్టులో టీడీపీ అనుకూల చానల్తో ఆమెను మాట్లాడించారు. వెంటనే విజయవాడ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమెను 2024 సెప్టెంబరు 5న విజయవాడకు రప్పించడంతో ఏసీపీతోపాటు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబును కలిశారు. వారం రోజులు ఆమె విజయవాడలోనే ప్రభుత్వ అతిథి హోదాలో ఉన్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా నియమించాలని అప్పటికే నిర్ణయించిన ఉమామహేశ్వరరావు ఆమెకు కుట్ర కేసు నమోదు కథను వివరించారు. అనంతరం 2024 సెప్టెంబరు 13 అర్ధరాత్రి కాదంబరీ జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిరా>్యదు చేయడం... వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి.జత్వానీ ఫోర్జరీ పత్రాలపై కేసు విచారణలో ఉండగానే పోలీసులపై ఫిర్యాదా..!పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకే కాదంబరీ జత్వానీతో అబద్ధపు ఆరోపణలతో ఫిర్యాదు చేయించినట్లు సీఐడీ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. కుక్కల విద్యా సాగర్కు చెందిన భూములను విక్రయించేందుకు వాటిని 2018లో కొనుగోలు చేసినట్టు ఆమె 2023లో ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కానీ తనపై అక్రమ కేసు పెట్టారని జత్వానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫిర్యాదు చేయడం గమనార్హం. అవి ఫోర్జరీ పత్రాలో.. కావో అన్నది పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలుతుంది. అంతిమంగా న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వాలి. అంతేగానీ ఇంకా దర్యాప్తులో ఉన్న కేసులోని అభియోగాలు తప్పని చెబుతూ నిందితులు పోలీసులపైనే ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయడం నిబంధనలకు విరుద్ధం. అదే విధానంగా మారితే దేశంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న అన్ని క్రిమినల్ కేసుల్లోనూ నిందితులు తిరిగి పోలీసులపై ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టేందుకు అనుమతించినట్టే అవుతుంది. తప్పు చేయలేదు... జత్వానీ ఎవరో తెలియదుతనపై నమోదు చేసిన అక్రమ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. కాదంబరి జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు. సివిల్ పోలీసులు పర్యవేక్షించే క్రిమినల్ కేసులు, ఇతర దర్యాప్తులతో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం ఉండదని పోలీసు సర్వీసు నియమావళిని ఉటంకిస్తూ వివరించారు. జత్వానీ తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలన్నారు. అందుకే తాను కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. తనపై అబద్ధపు అభియోగాలతోనే పోలీసులు, సీఐడీ అధికారులు అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల ఒత్తిడితో ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోకూడదని కోరారు. తాను సదా అందుబాటులో ఉన్నానని... దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధమని చెప్పినా సరే సీఐడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.అబద్ధపు వాంగ్మూలం కోసం పీఎస్ఆర్పై ఒత్తిడిఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాల కోసం సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఆయన్ను హైదరాబాద్లో అరెస్టు చేసే సమయంలో తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఫోన్ను సీఐడీ అధికారులకు అప్పగించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు సమ్మతించారు. కానీ పీఎస్ఆర్ను విజయవాడకు తీసుకువచ్చిన తరువాత సీఐడీ అధికారులు మధ్యవర్తుల నివేదిక పేరుతో ఓ పత్రాన్ని తెచ్చి సంతకం చేయాలని పేర్కొన్నారు. అందులో ఆయన వద్ద ల్యాప్టాప్, ఐప్యాడ్, మరో సెల్ ఫోన్ ఉన్నాయని అంగీకరించినట్లుగా పొందుపరిచారు. దీనిపై పీఎస్ఆర్ ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వద్ద లేని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టుగా రాసేందుకు నిరాకరించారు. హైదరాబాద్లో తన ఇంటి వద్దే అన్ని విషయాలు చెప్పానని, ఇప్పుడు ఇలా అబద్ధపు వాంగ్మూలం రాయమని చెప్పడం ఏమిటని నిలదీశారు. తమపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని సీఐడీ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని పీఎస్ఆర్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.సాక్ష్యాధారాల చట్టం వక్రీకరణ...పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టి వెంటనే స్వాధీనం చేసుకున్నారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొనడం మరో అబద్ధపు అభియోగం. విచారణ జరుగుతున్న కేసులో భారత సాక్ష్యాధారాల చట్టాన్ని వక్రీకరించేందకు తెగించడం గమనార్హం. డ్రగ్స్, గంజాయి, ఇతర స్మగ్లింగ్ నిరోధక కేసుల్లో దేశవ్యాప్తంగా పోలీసులు, కస్టమ్స్ అధికారులు అనుసరించే విధానాన్నే నాడు విజయవాడ పోలీసులు పాటించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా ఫోర్జరీ పత్రాలు లభించాయి. పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టారని ఆమె ప్రస్తుతం తప్పుడు అభియోగాలు మోపడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల పన్నాగం ఉంది.టిఫిన్ కూడా పెట్టకుండా.. సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు పట్ల మానవత్వం లేకుండా, అగౌరవంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆయన్ని బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం న్యాయస్థానానికి తరలించారు. ఆయనకు కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు. అనంతరం మధ్యాహ్నం రిమాండ్ కోసం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. పీఎస్ఆర్పై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.⇒ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గతంలో ఇచ్చిన అబద్ధపు ఫిర్యాదులో పీఎస్ఆర్ ఆంజనేయులును ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. తనను సీఐడీ అధికారులు హింసించారని రఘురామ గతంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చినప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్కుమార్తోపాటు ఇతర అధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులును కూడా చేరుస్తూ న్యాయస్థానంలో సీడీఐ బుధవారం మెమో దాఖలు చేయడం గమనార్హం. అసలు ఆయనకు సీఐడీతో ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా లేరు. ఏసీబీ డీజీగా ఉన్నారు. అయినా సరే పీఎస్ఆర్ను ఆ కేసులో నిందితుడుగా చేర్చడం విస్మయం కలిగిస్తోంది.⇒ పీఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఏపీపీఎస్పీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో కొన్ని ఫైళ్లు కనపడకుండా పోయాయంటూ దాదాపు నాలుగేళ్ల తరువాత ఏపీపీఎస్పీ కార్యదర్శితో తాజాగా ఫిర్యాదు ఇప్పించడం కూటమి సర్కారు కుట్రలకు నిదర్శనం.⇒ గతంలో పీఎస్ఆర్ ఆంజనేయులు తనను బెదిరించారంటూ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణతో టీడీపీ ప్రభుత్వం ఇటీవల అబద్ధాలతో ఫిర్యాదు ఇప్పించింది. ఆ ఫిర్యాదును సీఐడీకి తాజాగా పంపించడం ప్రభుత్వ కుటిల పన్నాగానికి నిదర్శనం. -
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
విద్యార్థి వీసాల ముసుగులో అక్రమ వలసల నిరోధానికి ఆస్ట్రేలియా చేపట్టిన చర్యలు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆస్ట్రేలియాలోని అనేక యూనివర్సిటీలు భారత విద్యార్థుల నమోదును నిషేధించాయి. ముఖ్యంగా హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్కు చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంపై కఠిన నిబంధనలు, పరిమితులు విధించాయి. ఈ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో వీసాలు పొందుతూ వలస విధానాలకు తూట్లు పొడుస్తున్నారని వర్సిటీలు గుర్తించాయి. నియంత్రణ లేని ఏజెంట్లు, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు, కొందరు ఆపరేటర్లు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని సమాచారం. ఫలితంగా విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం మొత్తం భారతదేశ విద్యార్థులపై పడే ప్రమాదం నెలకొంది. – సాక్షి, అమరావతిప్రతి నాలుగు దరఖాస్తుల్లో ఒకటి నకిలీ..భారత్ నుంచి వచ్చే ప్రతి నాలుగు విద్యార్థి వీసా దరఖాస్తుల్లో ఒకటి నకిలీదిగా ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ధ్రువీకరించింది. భారత్ నుంచి వచ్చే మొత్తం దరఖాస్తుల్లో దాదాపు 24.3 శాతం మోసపూరితమైనవని చెబుతోంది. అంతర్జాతీయ వర్సిటీలకు అతిపెద్ద విద్యార్థి వనరుగా భారత్ ఉంది. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా వర్సిటీల తాజా నిషేధంతో చట్టబద్ధమైన దరఖాస్తుదారుల భవితవ్యం గందరగోళంలో పడుతోంది. ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించకుంటే ద్వైపాక్షిక విద్యా సంబంధాలు ప్రభావితమవుతాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ విద్యార్థుల వీసాలకు సంబంధించి కఠినమైన నిబంధనలను అమలు చేసిన తర్వాత ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న భారత విద్యార్థులకు ఆస్ట్రేలియా వర్సిటీల నిర్ణయం శరాఘాతమేనని నిపుణులు చెబుతున్నారు.వలసలను తగ్గించేందుకు..గత ఏడాది రికార్డు స్థాయిలో వలసలను నియంత్రించే యత్నంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం వర్సిటీలను హెచ్చరించింది. విద్యార్థి వీసా మంజూరుకు పొదుపు డిపాజిట్ మొత్తాన్నీ పెంచింది. గత ఏడాది మే 10 నుంచి విద్యార్థి వీసా మంజూరుకు కనీసం రూ.16.30 లక్షలు (29,710 ఆస్ట్రేలియన్ డాలర్ల) బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్టు ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. అంతకుముందు 2023 అక్టోబర్లో పొదుపు మొత్తాన్ని రూ.11.46 లక్షల నుంచి రూ.13.35 లక్షలు (21,041 ఆస్ట్రేలియన్ డాలర్ల నుంచి 24,505 ఆస్ట్రేలియన్ డాలర్లకు)కు పెంచింది. -
ఇదేం ధ‘రొయ్యో’..!
రొయ్య రైతులు విలవిల్లాడుతున్నారు. గిట్టుబాటు ధర రాక సతమతమవుతున్నారు. ట్రంప్ సుంకాల పేరు చెప్పి ఎగుమతిదారులు అడ్డగోలుగా ధరలు తగ్గించేయడంతో ఈ దుస్థితి తలెత్తింది. అయినా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.సాగు సమ్మె బాట పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పట్టుబడి పూర్తయిన 25 శాతం విస్తీర్ణంలో మెజార్టీ రైతులు పంట విరామం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన, కంపెనీలు చెల్లిస్తున్న ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావని ఆవేదన చెందుతున్నారు. – సాక్షి, అమరావతిపశ్చిమగోదావరిలో నిరసన గళం వారం రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం శిరగాలపల్లి, పాలకొల్లు మండలం చందుపర్రు గ్రామాల రైతులు సాగు సమ్మెకు శ్రీకారం చుట్టారు. తాజాగా ఇదే జిల్లాలో నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంతోపాటు పోడూరు మండల రైతులు కూడా సాగు సమ్మెకు సిద్ధపడుతున్నారు. ఆక్వా సాగు ఇక చేయలేమని, క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయించామని చెరువుల వద్ద బోర్డులు పెట్టి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులూ సాగు సమ్మెకు సిద్ధమవుతున్నారు. 5.72 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు రాష్ట్రంలో ఈ–ఫిష్ డేటా ప్రకారం 1.62 లక్షల మంది ఆక్వా రైతులు 5.72 లక్షల ఎకరాల్లో సాగు చేçస్తున్నారు. అత్యధికంగా ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనే 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు.కౌంట్ల పేరిట.. అడ్డగోలు దోపిడీప్రస్తుతం పెరిగిన లీజు, ఫీడ్, విద్యుత్ చార్జీల వల్ల రొయ్యలు 100 కౌంట్కు రావాలంటే కిలోకు రూ.220–250 వరకు ఖర్చవుతుంది. అదే 50 కౌంట్కు చేరాలంటే కిలోకు రూ.330–350 వరకు, గరిష్టంగా 30 కౌంట్కు రావాలంటే కిలోకు రూ.450 చొప్పున ఖర్చవుతుంది. కానీ ప్రస్తుతం 100 కౌంట్ రూ.230, 50 కౌంట్ రూ.325, 30 కౌంట్ రూ.425 చొప్పున కంపెనీలు ధరలు ప్రకటించాయి. ఈ ధరల్లోనూ ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, వ్యాపారులతోపాటు గ్రామ స్థాయిలో రొయ్యలు కొనుగోలు చేసే షెడ్ల నిర్వాహకులు సిండికేట్గా మారి అడ్డగోలుగా కోత విధిస్తున్నారు. కిలోకు రూ.పది నుంచి రూ.30 వరకు కోత పెడుతున్నారు. 1–3 టన్నుల్లోపైతే 100 కౌంట్కు రూ.220, 50 కౌంట్కు రూ.310, 30 కౌంట్కు రూ.400 చెల్లిస్తున్నారు. అదే నాణ్యత కొంచెం తక్కువగా ఉంటే ధరలో ఇంకా భారీగా కోత పెడుతున్నారు. ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు ప్రస్తుతం ఉన్న ధరలు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావట్లేదు. 100 కౌంట్కు కిలోకు రూ.220–250 వరకు ఖర్చవుతుంటే, కంపెనీలు రూ.230 ధరగా ప్రకటించాయి. అది కూడా 3 టన్నుల పైబడి అమ్మితేనే ఈ ధర. 3 టన్నులలోపు అయితే వ్యాపారులు అడ్డగోలుగా కోత కోస్తున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందువల్లే సాగు సమ్మెకు దిగాల్సి వచి్చంది. – మామిడిశెట్టి గిరిధర్ తూర్పుతాళ్లు, పశ్చిమగోదావరి జిల్లారూ.13 లక్షలు నష్టపోయాను ఎగుమతి దారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తున్నారు. ఈ సీజన్లో ఎకరాకు 1.50 లక్షల రొయ్య పిల్లలు వేశాను. ఆరెకరాలకు రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టా. 70 కౌంట్ వచి్చంది. వ్యాపారులు ధర బాగా తగ్గించారు. కిలో రూ.280 చొప్పున ఇచ్చారు. రూ.17లక్షల రాగా, రూ.13 లక్షలు నష్టపోయా. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. – ఈమన రామాంజనేయులు పోడూరు, పశ్చిమగోదావరి జిల్లా -
‘ఉపాధి’లో రాష్ట్రాలకు చక్రబంధనాలు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణను మరింత పెంచింది. రాష్రాల్లో పథకం అమలులో దుర్వినియోగానికి తావులేకుండా పలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా పథకం పనుల ప్లానింగ్, మంజూరులో సైతం మార్పులు తెచ్చింది. ఇందుకోసం ‘యుక్తధార’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ను ఇస్రో – నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో అనుసంధానం చేసింది. తద్వారా ఈ పనులను తన నియంత్రణలోకి తీసుకుంటోంది. ఈ విధానం వల్ల ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు చాలా వరకు తగ్గిపోతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. చాలా కాలం నుంచి ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను కేంద్రమే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇటీవల మెటీరియల్ కేటగిరీ (సిమెంట్ రోడ్లు లేదా ఇతర కూలీలను ఉపయోగించని) పనుల బిల్లులనూ నేరుగా కేంద్రమే ఆ వ్యక్తులకు, సంస్థలకు చెల్లిస్తోంది. ఇందులో రాష్ట్రాలు వాటి వాటా 25 శాతం నిధులను ఉమ్మడి ఖాతాకు జమ చేస్తేనే కేంద్రం 75 శాతం వాటా కలిపి బిల్లులు చెల్లిస్తోంది. ఇప్పుడు ఈ పథకం పనుల ప్రణాళిక, అమలును కూడా కేంద్రమే ప్రత్యక్షంగా పర్యవేక్షించనుంది.వచ్చే ఏడాది నుంచి అన్ని గ్రామాల్లో అమలు..ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. ఏటా పంచాయతీల వారీగా ఉపాధి హామీ పథకం పనుల కల్పన, ప్రణాళికల రూపకల్పన ఆర్థిక సంవత్సరం ఆరంభానికి ముందే అక్టోబరు–ఫిబ్రవరి నెలల మధ్య రాష్ట్ర స్థాయిలో జరుగుతుండేది. ఈ ప్రణాళికలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మార్చి నెలలో రాష్ట్రాలవారీగా సమావేశాలు నిర్వహించి వాటికి లేబర్ బడ్జెట్ పేరుతో ఆమోదం తెలిపేది. కొత్తగా గుర్తించిన పనులను గ్రామ పంచాయతీ లేదా మండల, జిల్లా పరిషత్లో తీర్మానం అనంతరం మంజూరు చేసేవారు. కేంద్రం తెచ్చిన కొత్త విధానం ప్రకారం ఇకపై ఆర్థిక సంవత్సరం మొత్తానికి కేంద్రం ఒకేసారి ఆ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వారీగా లేబర్ బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. ఏడాది మధ్యలో పనులు మంజూరు కావు. ఇలా ఏడాది ప్రణాళిక రూపకల్పనకు ‘యుక్తధార’ మొబైల్ యాప్ ప్రవేశపెట్టింది. ఈ ఏప్రిల్ 1 నుంచి మండలానికి ఒక గ్రామ పంచాయతీ చొప్పున ఈ విధానం అమలు చేస్తుండగా, వచ్చే ఏడాది నుంచి అన్ని గ్రామాల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.పనుల గుర్తింపు కూడా సాంకేతికతోనే.. ఈ పథకంలో అవకతవకలకు సైతం వీలుండదని అధికారులు చెబుతున్నారు. ఒక ప్రాంతంలో చేపట్టడానికి అవకాశం లేని పనులను ప్రణాళికలో చేర్చే అవకాశం ‘యుక్తధార’ యాప్లో ఉండదని చెబుతున్నారు. యాప్ పూర్తిగా ఇస్రో ఆధ్వర్యంలో సమగ్ర గూగుల్ మ్యాప్నకు అనుసంధానమై ఉండటం వల్ల చెరువులు ఉన్న ప్రాంతంలోనే వాటి పూడిక తీత పనులు చేపట్టే వీలుంటుందని తెలిపారు. కొన్ని రకాల పనులకు ఆ ప్రాంత భూగర్భ పరిస్థితులు అనుకూలమా లేదా అన్నది కూడా పని నిర్ధారణ సమయంలోనే తెలిసిపోతుందని వివరించారు. తద్వారా పనుల గుర్తింపులో అక్రమాలకు తెరపడుతుందని చెబుతున్నారు.దొంగ మస్టర్లకూ చెక్! ఉపాధి హామీ పథకంలో దొంగ మస్టర్లకూ కేంద్రం చెక్ పెట్టబోతోంది. దీని ప్రకారం ఒక ప్రదేశంలో కూలీలు పనిచేసే సమయంలో రోజూ ఉపాధి హామీ పథకం సిబ్బంది ఫొటో తీయాలి. ఆ ఫోటోలో ఉన్న కూలీల సంఖ్య, అక్కడ పనికి హాజరైనట్టు సిబ్బంది మస్టర్ షీట్లో నమోదు చేసే కూలీల సంఖ్య ఒక్కటిగా ఉంటేనే ఆ రోజు వేతనాల చెల్లింపు జరుగుతుంది. ఫోటోలో, మస్టర్ షీట్లో సంఖ్యలో తేడా ఉంటే ఆ మస్టర్ షీటును పరిగణనలోకి కూడా తీసుకోరు.ఇస్రో - నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో యాప్ అనుసంధానంప్రస్తుతం ఈ పథకం పనుల ప్రణాళిక ఆఫ్ లైన్ విధానంలో రూపొందించి, ఎంత మంది పేదలకు పనులు కల్పిస్తారో సంఖ్య మాత్రమే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకం పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఆ పనుల నంబర్లను పోర్టల్లో ఎంటర్ చేసి, వాటికి బిల్లులు పెడుతున్నారు. కొత్త విధానంలో మొబైల్ యాప్ ద్వారా ప్రణాళిక పూర్తిగా ఆన్లైన్లో రూపొందుతుంది. ఏ పంచాయతీలో ఏ రకమైన పనిని ఏ ప్రదేశంలో చేపడతారో గూగుల్ మ్యాప్లో గుర్తించి, యాప్లో నమోదు చేస్తారు.ఈ యాప్ పూర్తిగా ఇస్రో - నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో అనుసంధానమై ఉంటుంది. ఇలా అన్ని పనులు జియో ట్యాగింగ్ చేసి, మ్యాప్లోనే ఒక్కో పనికి ఒక్కో నంబరును కేటాయిస్తారు. ప్రతి పనికి అంచనా విలువ సైతం యాప్లోనే నమోదు చేస్తారు. ఏ పనికి బిల్లులు పెట్టాలన్నా యాప్లో నమోదు చేసిన ప్రకారం వర్క్ ఐడీలను ఎంపిక చేసుకొని బిల్లులు పెట్టాలి. -
ఒక్క మరుగుదొడ్డీ లేదా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో సామాన్యుల కోసం ఒక్క మరుగుదొడ్డి కూడా లేకపోవడం పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇది తమను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ కార్యాలయంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం ఏమిటని ప్రశ్నించింది. మరుగుదొడ్డి కూడా లేకపోతే సమాచార కమిషన్ కార్యాలయానికి వచ్చే సామాన్యులు, ముఖ్యంగా మహిళల పరిస్థితి ఏమిటని నిలదీసింది. మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వం విస్మరించిందా? అంటూ సందేహం వ్యక్తం చేసింది. మరుగుదొడ్డి లేకుంటే సమాచార కమిషన్ను మరో చోటుకి తరలించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ఆదేశించింది. లేకుంటే వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తామని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో కనీస మౌలిక సదుపాయాలు ముఖ్యంగా మరుగుదొడ్డి సౌకర్యం కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన బి.కాంత్రికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఉప్పలూరి అభినవ్ కృష్ణ వాదనలు వినిపిస్తూ, సమాచార కమిషన్ సామాన్యుల కోసం ఒక్క మరుగుదొడ్డి కూడా లేదన్నారు. ప్రభుత్వ్ర ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, భవన యజమానితో వివాదం కొనసాగుతోందన్నారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని ఆమె తెలిపారు. -
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ స్థానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో రేపు(గురువారం) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కానున్నారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ నేతలతో భేటీ కానున్నారు.ఈ సమావేశానికి ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వానించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. -
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ శాంతి ర్యాలీ
సాక్షి, తాడేపల్లి: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతి ర్యాలీ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేస్తున్నారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, మంగళగిరి ఇన్ఛార్జి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పహల్గాం ఘటన పిరికిపంద చర్య అని.. ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని చెదరగొట్టలేరన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించామని సజ్జల పేర్కొన్నారు. ‘‘మా ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాం. మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరపున సానుభూతి తెలియజేస్తున్నాం.. అందరం సంఘటితంగా నిలపడాల్సిన సమయం ఇది’’ అని సజ్జల చెప్పారు.కశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు చేపట్టింది. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్న వైఎస్ జగన్.. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. విజయవాడ నగరంలో..పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఉగ్ర దాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమన్నారు. ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మరణించారని.. వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఉగ్ర వాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో..పహల్గాం జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ రాజమండ్రిలో వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు నినదించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వెంకటరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.అనంతపురం జిల్లాలో..అనంతపురం జిల్లా: జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా అనంతపురంలో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ దాకా నిరసన ప్రదర్శన చేపట్టింది. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడులకు నిరసనగా కడపలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.తిరుపతిలో..జమ్మూకశ్మీర్ పహల్గాం ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయాలని భూమన అన్నారు.విశాఖలో.. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్ పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు. అమాయకులైన ప్రజల ప్రాణాలను తీసుకోవడం ఉన్మాద చర్యగా ఆయన అభివర్ణించారు. 145 కోట్ల భారతీయులు ఏకతాటిపైకి రావాలని.. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్న మట్టు పెట్టాలన్నారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. -
‘మంత్రి నారా లోకేష్ బినామీలదే ఉర్సా కంపెనీ’
సాక్షి, తాడేపల్లి: విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఆయన బినామీలే సూత్రదారులని వైఎస్సార్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను సృష్టించి, వాటికి ప్రభుత్వం ద్వారా కారుచౌకగా విలువైన భూములను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని చెబుతున్న చంద్రబాబు ప్రజల సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతోంది. ఊరు, పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టింది. గత వారం రోజులుగా దీనిపై రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ డొల్ల కంపెనీ హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో రెండు నెలల కిందటే రిజిస్టర్ అయ్యింది. అటువంటి కంపెనీకి 56 ఎకరాల భూమిని కట్టబెడతారనే దానిపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ అవినీతిపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, దీనిపై రాష్ట్రంలోని ఒక్క మంత్రి కూడా ధైర్యంగా ప్రజల ముందకు వచ్చి వివరణ ఇవ్వలేదు.ఎందుకంటే ఇది డొల్ల కంపెనీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు డైరెక్టర్లు తప్ప ఒక్క ఉద్యోగి కూడా లేని ఈ కంపెనీకి ఎకరం రూ.50 కోట్ల విలవైన భూములు, అంటే దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇటువంటి సూట్కేస్ కంపెనీలను పెద్ద ఎత్తున రిజిస్టర్ చేయించడం, వాటికి కారుచౌకగా ఖరీదైన భూములను కట్టబెట్టించడం చేయిస్తున్నారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ స్కామ్. ప్రభుత్వమే తమ బినామీలను ముందు పెట్టి, ఆస్తులను దోచేస్తోంది.వైఎస్ జగన్ హయాంలోనే టీసీఎస్తో సంప్రదింపులువైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే టీసీఎస్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. తరువాత కోవిడ్ కారణంగా టీసీఎస్ ఏపీకి రావడం ఆలస్యం అయ్యింది. 2022లో టీసీఎస్కు చెందిన చంద్రశేఖరన్ ఏపీకి వచ్చి ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. తరువాత ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. టీసీఎస్తో ప్రభుత్వ సంప్రదింపులు కొనసాగాయి. టీసీఎస్కు విశాఖలో 21.16 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే విక్రయిస్తూ కూటమి ప్రభుత్వం ఈనెల 21వ తేదీన జీవో జారీ చేసింది. ఈ భూముల విలువ వేలకోట్ల రూపాయలు ఉంటుంది. కనీసం వాటి మార్కెట్ విలువపై కొంతశాతం తగ్గించి విక్రయించినా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది.అలా కాకుండా 99 పైసలకు విక్రయించడం చూస్తే, దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా అనే అనుమానం కలుగుతోంది. ప్రజాసంపదను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో ప్రోత్సహాకరంగా విధానాలు ఉండాలే తప్ప, పూర్తిగా ఉచితంగా దారాదత్తం చేసేలా ఏ ప్రభుత్వమైనా వ్యవహరిస్తుందా? ఇలా 99 పైసలకే భూములను విక్రయించినందుకు ఏపీకి టీసీఎస్ నుంచి ఏదైనా ప్రత్యేకమైన మేలు జరుగుతుందా అని చూస్తే, ఆ సంస్ధ కల్పించే 12వేల ఉద్యోగాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. వైయస్ జగన్ సీఎంగా ఈ రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలు ఖచ్చితంగా డెబ్బై శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధనలు తీసుకువస్తే, ఆనాడు కూటమి పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు టీసీఎస్ కల్పించే ఉద్యోగాల్లో ఓ రెండు వేల మంది ఏపీకి చెందిన వారు ఉంటే, మిగిలిన పదివేల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు. అలాంటప్పుడు ఈ కేటాయింపులను ప్రశ్నిస్తే, పరిశ్రమలను, ఐటీ సంస్థలను అడ్డుకుంటున్నారని మాపైన దుష్ర్పచారం చేస్తున్నారు.డొల్ల కంపెనీలకు భూకేటాయింపులుటీసీఎస్ను చూపిస్తూ, ఉర్సా లాంటి డొల్ల కంపెనీలను కూడా ఇదే విధంగా గొప్ప ఐటీ సంస్థలుగా చిత్రీకరిస్తూ భూకేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం తెగబడింది. ఇరవై వేల రూపాయల అద్దె ప్లాట్లో నడిచే ఉర్సా సంస్థ ఏకంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందంటే, ప్రభుత్వం ఎలా నమ్మింది? పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, ఆమోదం తెలిపిన బోర్డ్లు ఏ అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాయి? ఈ కంపెనీ ప్రమోటర్లు ఎవరు, వారి ఆర్థిక సామర్థ్యం ఎంత, గత అనుభవం ఏమిటీ, ఎంత మంది ఉద్యోగులు దీనిలో పనిచేస్తున్నారనే కనీస వివరాలను కూడా పరిశీలించకుండానే ప్రభుత్వం ఈ సంస్థకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది?ఎందుకంటే ఇది నారా లోకేష్కు చెందిన బినామీలకు చెందిన సంస్థ. ఉర్సా ప్రతినిధిలు పెందుర్తి విజయ్కుమార్, ఆయన కుమారుడు పెందుర్తి కౌశిక్, మరో వ్యక్తి అబ్బూరి సతీష్. వీరు అమెరికాలోని తన సొంత ఇంట్లో ఒక కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీని చూపించి ఇటీవల దావోస్లో తెలంగాణలో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామంటూ ఎంఓయు చేసుకున్నారు. తరువాత ఎపీలో కూడా ఇదే తరహాలో మరో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ స్కామ్ను నడిపించారు. గతంలో ఐఎంజీ భారత్ పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన భూములను బిల్లీరావుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ఏరకంగా ప్రయత్నించాడో అందరికీ తెలుసు. ఇప్పుడు లోకేష్ తండ్రిని మించిన తనయుడిగా ఉర్సా సంస్థను తెరమీదికి తీసుకువచ్చారు. ఉర్సాకు చేసిన భూకేటాయింపులకు సంబంధించిన జీఓను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. టీసీఎస్కు జీఓ ఇచ్చారు, ఉర్సాకు మాత్రం జీఓను జారీ చేయలేదు. అంటే ఉర్సాకు సంబంధించిన జీఓను రహస్యంగా ఉంచుతున్నారా?ఉర్సా సంస్థ ఫైలు ఉరుకులు పెట్టించారుఉర్సా సంస్థ ప్రతినిధులు పెందుర్తి విజయ్కుమార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ఉద్యోగి. మరో డైరెక్టర్ అబ్బూరి సతీష్ అమెరికాలో ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరిద్దరూ కలిసి ఏపీలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెబుతున్నారు. దీనిని స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదించడం, వెంటనే కేబినెట్కు వెళ్ళడం, కేబినెట్ కూడా కాపులుప్పాడులో 56 ఎకరాలను 99 పైసలకే అమ్మేయాలని నిర్ణయించడం. ఇదంతా ఎంత ప్రణాళికాబద్దంగా స్కామ్ను నడిపించారో అర్థం అవుతోంది. గత వారం రోజులుగా దీనిపై వైఎస్సార్సీపీ మాట్లాడుతూ ఉంటే ఎల్లోమీడియాలో పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం అంటూ సిగ్గులేకుండా తప్పుడు రాతలు రాశాయి.డొల్ల కంపెనీలకు విలువైన భూములను దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? వైఎస్సార్సీపీ హయాంలో అనేక కంపెనీలను ప్రోత్సహించాం, మీలా ఉచితంగా భూములను దారాదత్తం చేయలేదు. పలు ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి విశాఖలో 161 స్టార్ట్ అప్ ఐటీ కంపెనీలు ఉంటే, వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా 425 కంపెనీలు ఏర్పాటయ్యాయి. తెలుగుదేశం దిగిపోయే నాటికి ఐటీ ఉద్యోగులు ఏపీలో 27643 మంది ఉంటే వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో 75,551 మందికి పెరిగారు. మేం అడ్డుకునే వారిమే అయితే వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కంపెనీలు ఎలా పెరిగాయి, ఉద్యోగులు ఎలా పెరిగారు? ఉర్సా, లులూ వంటి సంస్థలకు కారుచౌకగా భూములను కట్టబెట్టడం ద్వారా, పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి విధానాలను ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. -
జత్వానీ కేసుతో నాకేం సంబంధం లేదు: పీఎస్ఆర్ స్వీయ వాదనలు
విజయవాడ, సాక్షి: ముంబై నటి జత్వానీ కాదంబరి కేసుతో తనకేం సంబంధం లేకపోయినా ఇబ్బంది పెడుతున్నారని సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu) అన్నారు. బుధవారం ఉదయం ఆయన్ని సీఐడీ పోలీసు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్ కోసం వాదనలు జరగ్గా.. తన కేసులో తానే పీఎస్ఆర్ వాదనలు వినిపించారు.ముంబయి నటి జెత్వానీ కాదంబరిని వేధించారంటూ ఏపీ సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులును మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ బేగంపేటలోని నివాసం నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఈ ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. జత్వానీ కేసులో ఏం జరిగిందనేది జడ్జి ముందు స్వయంగా వాదనలు వినిపించారు. తన పాత్ర లేకపోయినా కేసు పెట్టారని వాదించారు. అసలు ఈ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికి వివరించారు. మాజీ డీసీపీ విశాల్ గున్నీని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో అప్రూవర్గా మారారు. 164 స్టేట్ మెంట్ ఇవ్వమని విశాల్ గున్నీని అడిగినా.. ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ కేసులో తనకు సంబంధం లేని విషయాలను చెప్పించారు అని జడ్జి ముందు పీఎస్ఆర్ వాపోయారు. అయితే వాదనలు ముగిసిన అనంతరం పీఎస్ఆర్కు సీఐడీ కోర్టు వచ్చే నెల 7వ తేదీదాకా రిమాండ్ విధించారు. దీంతో విజయవాడ సబ్ జైలుకు ఆయన్ని తరలించనున్నారు.ఇదీ చదవండి: పీఎస్ఆర్ అరెస్ట్పై వైఎస్ జగన్ ఏమన్నారంటే.. -
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థుల్లో 81.14 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. పదో తరగతి ఫలితాలను www.sakshieducation.comతో విద్యార్థులు తెలుసుకోవచ్చు.AP 10th Class Results 2025 Direct Links..Server-1https://results2.sakshieducation.com/Results2025/Andhra-Pradesh/SSC/ap-ssc-10th-class-results-2025.html Server-2https://education.sakshi.com/sites/default/files/exam-result/AP-SSC-10th-Class-Results-2025-Direct-Link.html Server-3http://results1.sakshieducation.com/results/SSC/ap-ssc-10th-class-results-2025.htmlఅలాగే, https:// bse.ap.gov.in, https:// apopenschool.ap.gov.in/లో చూడవచ్చు. అలాగే, వాట్సాప్లో 9552300009 నంబర్కు ‘హాయ్’ అని మెసేజ్ పంపి, విద్యాసేవల్లో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను పొందవచ్చు. -
నేడు ఏపీ టెన్త్ ఫలితాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. దీంతోపాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాలను సైతం ప్రకటించనున్నారు. ఫలితాల కోసం విద్యార్థులు www.sakshieducation.comతో పాటు https:// bse.ap.gov.in, https:// apopenschool.ap.gov.in/లో చూడవచ్చు. అలాగే, వాట్సాప్లో 9552300009 నంబర్కు ‘హాయ్’ అని మెసేజ్ పంపి, విద్యాసేవల్లో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను పొందవచ్చు. -
వేట నిషేధ భృతి నిబంధనలు మార్పు
సాక్షి, అమరావతి: ‘గంగపుత్రులకు తీరని అన్యాయం.. వేటకు వెళ్లే మత్స్యకారులకు సంక్షేమ పథకాలు కట్’ పేరుతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో కూటమి ప్రభుత్వం దిగివచ్చింది. ‘వేట నిషేధ భృతి’కి అర్హుల గుర్తింపు కోసం జారీ చేసిన నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. భృతికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్(మత్స్యకార పెన్షన్) పొందే వారు మాత్రమే అనర్హులని.. మిగిలిన సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేసింది. ఇతర నిబంధనలను కొంతమేర సడలించింది. కలకలం రేపిన ఉత్తర్వులు.. సముద్రంలో మత్స్యసంపద వృద్ధి కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమలవుతుంటుంది. ఈ దృష్ట్యా జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాల పోషణ కోసం ప్రభుత్వం పరిహారం ఇచ్చేది. గతంలో రూ.4 వేలు ఉన్న వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మత్స్యకారులకు అందించింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా 5.38 లక్షల మందికి రూ.538 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. అలాగే వేట నిషేధ భృతి పొందిన వారికి సైతం అన్ని సంక్షేమ పథకాలనూ వర్తింపజేశారు. అధికారంలోకి వస్తే భృతిని రూ.20 వేలకు పెంచి ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. తొలి ఏడాది ఎగ్గొట్టింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి వారం రోజుల క్రితం మార్గదర్శకాలు జారీ చేసింది. కుటుంబంలో ఒకరికి మాత్రమే వేట నిషేధ భృతి ఇస్తామని.. ఈ భృతి పొందే వారు ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని ప్రకటించింది. ఈ నిబంధనలను ప్రశ్నిస్తూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. నిబంధనలు మార్చాలంటూ మత్స్యకారులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం నిబంధనలను మారుస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మారిన నిబంధనలు.. వేటకు వెళ్లే బోట్లన్నీ ఏప్రిల్ 14కు ముందు ఎంఎస్ యాక్టు 1958 కింద రిజిస్టరై ఉండాలని.. ఎఫ్ఎంఎఫ్ఆర్ యాక్టు 1995 కింద లైసెన్స్ సర్టిఫికెట్ పొంది ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. సబ్సిడీ ఆయిల్ ఎంత వినియోగించుకున్నా అర్హులేనని స్పష్టం చేసింది. కాగా, వేట నిషేధ భృతి పొందేవారు ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ విద్యోన్నతి, ఎనీ్టఆర్ భరోసా పెన్షన్ పొందేందుకు అనర్హులని ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఒక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్(మత్స్యకార పింఛన్) పొందే వారు మాత్రమే అనర్హులంటూ నిబంధనల్లో మార్పులు చేసింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 1.20 లక్షలు, అర్బన్ ప్రాంతంలో 1.44 లక్షల ఆదాయానికి మించి ఉండకూడదని.. 3 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట లేదా 10 ఎకరాల్లోపు మెట్ట, మాగాణి కలిసిన భూములు, 4 చక్రాల వాహనాలు, ఏడాదిలో గరిష్టంగా నెలకు 300 యూనిట్ల విద్యుత్ వినియోగం, కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లింపుదారులు, పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సొంత ఇల్లు కలిగిన వారు అనర్హులని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం ఆ నిబంధనల స్థానంలో గతంలో మాదిరిగా 6 దశల వెరిఫికేషన్ ద్వారా అర్హులను గుర్తిస్తామని స్పష్టం చేసింది.రూ.40 వేలు జమ చేయాలి.. తాజా నిబంధనల ప్రకారం బుధవారం(23వ తేదీ) సాయంత్రంలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని మత్స్యశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగే కార్యక్రమంలో ఈ ఏడాది వేట నిషేధ భృతి జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది ఎగ్గొట్టిన రూ.20 వేలు కూడా కలిపి రూ.40 వేలు జమ చేయాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మునగాల హరీశ్వర్రెడ్డి మంగళవారం హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్, రిజిష్ట్రార్ (జ్యుడీషియల్)కు ఫిర్యాదు చేశారు. వీరిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేర చర్యలు తీసుకోవాలని కోరారు. హరీశ్వర్రెడ్డి తరఫున ఆయన న్యాయవాదులు కాసా జగన్మోహన్రెడ్డి, కె.జానకిరామిరెడ్డి, యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి, పొన్నపురెడ్డి శశివర్థన్రెడ్డి, పాపుడిప్పు శశిధర్రెడ్డి తదితరులు ఫిర్యాదు కాపీని రిజిష్ట్రార్ జనరల్, రిజిష్ట్రార్ (జ్యుడీషియల్)కు అందజేశారు.పోలీస్ అధికారులు, అలాగే మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ధిక్కరించి, ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలలోనూ నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు పంపుతున్నారని హరీశ్వర్రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై కూడా తిరుపతి తూర్పు పోలీసులు పలు సెక్షన్ల కింద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని, ఈ సెక్షన్లన్నీ ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడేవేనన్నారు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు తనను అరెస్ట్ చేశారని తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, మేజిస్ట్రేట్ తగిన కారణాలను వెల్లడించకుండా యాంత్రికంగా తనను రిమాండ్కు పంపారని హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు.తమ ఆదేశాల అమలును హైకోర్టులు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు చెప్పిందితాను కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు ఎన్నో జరిగినట్లు తెలిసిందని హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు పలువురిని అరెస్ట్ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తమ మార్గదర్శకాల అమలును దేశంలోని అన్నీ హైకోర్టులు పర్యవేక్షించాలని, వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సంతేందర్ కుమార్ అన్టిల్ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు సైతం చెప్పింది..ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం బొల్లినేని రాజగోపాల్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొందన్నారు. ‘సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసే ముందు మేజిస్ట్రేట్లు తమ సంతృప్తిని రికార్డ్ చేయాలి. వాస్తవాల విషయంలో నిష్పాక్షికంగా ఆలోచించి, కారణాలతో కూడిన ఉత్తర్వు ఇవ్వాలి. దీనికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా తీవ్రంగా పరిగణిస్తాం. మేజిస్ట్రేట్లు లోపభూయిష్టమైన రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని నిందితులు కానీ, వారి తరఫున ఇతరులు గానీ హైకోర్టు దృష్టికి తీసుకొస్తే ఆ మేజిస్ట్రేట్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం’ అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆదేశాలను ఉల్లంఘించిన విచారణాధికారులు, మేజిస్ట్రేట్ల వివరాలను కేసుల వివరాలతో సహా ఈ ఫిర్యాదుకు జత చేస్తున్నానని, వాటిని పరిశీలించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన రిజిస్ట్రీ దీనిని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచుతామని హరీశ్వర్రెడ్డి న్యాయవాదులకు చెప్పినట్లు తెలిసింది. మొత్తం 149 కేసులకు సంబంధించిన వివరాలను, ఆయా మేజిస్ట్రేట్ కోర్టుల వివరాలను హరీశ్వర్రెడ్డి తన ఫిర్యాదుతో జత చేశారు. -
సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా..బాబు భేతాళ కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు భేతాళ కుట్ర బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్ నివేదిక సాక్షిగా రెడ్బుక్ కుతంత్రం బెడిసికొట్టింది. తద్వారా చంద్రబాబు తాను తీసిన గోతిలో తానే పడ్డారు! వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక ఆ విషయాన్ని బట్టబయలు చేసింది. కానీ ఆయన ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ వెల్లడించడం అసలు కుట్రను వెల్లడించింది. అంటే రాజ్ కసిరెడ్డి చెప్పకుండానే.. తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సిట్ అంగీకరించింది. ఇక మద్యం డిస్టిలరీలకు ఆర్డర్లలో వివక్షకు పాల్పడి అవినీతి చేశారని సిట్ పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం నాలుగు కంపెనీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని వెల్లడించింది. ఇక టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సి–టెల్ సాఫ్ట్వేర్ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్లు జారీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మరి సి–టెల్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు ఎందుకు చేశారనే దానిపై సిట్ మౌనం వహించింది. తద్వారా టీడీపీ హయాంలోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని అసలు గుట్టు విప్పింది. ఇక నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు చొప్పున రాజ్ కేసిరెడ్డి వసూలు చేసి వైఎస్సార్ సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒకచోట... రాజ్ కేసిరెడ్డే ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరోచోట పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా తన దర్యాప్తులో డొల్లతనాన్ని బయటపెట్టింది. తాము బెదిరించి వేధించిన వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ తదితరులతో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు పేరిట కనికట్టు చేసినట్టు అంగీకరించింది. అంతిమంగా టీడీపీ గత ఐదేళ్లలో చేసిన అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలనే గుదిగుచ్చి దర్యాప్తు నివేదికగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించిందన్నది స్పష్టమైంది. దర్యాప్తు పేరిట తాము సాధించింది శూన్యమని గ్రహించిన సిట్ ఏమీ చేయలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. సిట్ నివేదిక సాక్షిగా వెల్లడైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది...డిస్టిలరీలూ బాబు దందానే బట్టబయలు చేసిన సిట్ నివేదికవైఎస్సార్సీపీ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారని, వాటికే అత్యధిక మద్యం ఆర్డర్లు ఇచ్చారని సిట్ ఆరోపించింది. తద్వారా కొన్ని డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి కమీషన్లు తీసుకున్నారని ఆవాస్తవ అభియోగాలు మోపింది. కానీ స్వామి భక్తి చాటుకునే హడావుడిలో అసలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే వాస్తవాన్ని బయటపెట్టేయడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని సిట్ నివేదికలో తెలిపింది. అంటే చంద్రబాబు హయాంలోమద్యం కొనుగోలు ఆర్డర్లలో ఏకంగా 53.21 శాతం కేవలం నాలుగు డిస్టిలరీలకే ఇవ్వడం అంటే అక్రమాలకు పాల్పడినట్టే కదా? తద్వారా మద్యం ఆర్డర్లలో కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు ప్రభుత్వమేనని రూఢీ అయింది. సి–టెల్ సాఫ్ట్వేర్ ద్వారా కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని, దాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిందని సిట్ పేర్కొంది. లోపభూయిష్టమైన ఆ సాఫ్ట్వేర్ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లే కదా!రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం పేరిట కుట్ర..సిట్ కుట్రను బయటపెట్టిన రిమాండ్ నివేదిక వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగినట్టుగా దుష్ప్రచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో కుట్రకు తెగించింది. అందుకోసమే రాజ్ కేసిరెడ్డి విచారణ ప్రక్రియను అడ్డంపెట్టుకుని పన్నాగం రచించింది. ఆయన్ను సోమవారం హైదరాబాద్లో అరెస్టు చేసిన సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు విచారణ పేరుతో తతంగం నడిపించారు. అనంతరం ఆయన వాంగ్మూలంగా పేర్కొన్నారంటూ ఓ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అందులో మద్యం కుంభకోణం కుట్ర అంటూ కట్టుకథ అల్లారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ప్రస్తావించడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా... మరోవైపు వైఎస్సార్సీపీకి ఫండింగ్ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో చెప్పినట్టుగా రాజ్ కేసిరెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొంది. కానీ వాస్తవం ఏమిటంటే... రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం అంటూ సమర్పించిన నివేదికపై ఆయన సంతకం చేయడానికి పూర్తిగా నిరాకరించారని సిట్ నివేదిక వెల్లడించింది. మరి అలాంటప్పుడు ఇక కుంభకోణం ఎక్కడ...? రిమాండ్ నివేదికలో పేర్కొన్న అభియోగాలన్నీ కట్టుకథలేనని సిట్ స్వయంగా అంగీకరించినట్లైంది. సంతకం చేసేందుకు రాజ్ కేసిరెడ్డి నిరాకరించిన విషయాన్ని కూడా ఎందుకు పేర్కొన్నారంటే..న్యాయస్థానంలో హాజరు పరిచేటప్పుడు ‘మీరే చెప్పారా...? సంతకం చేశారా’ అని ఆయన్ను న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పుడు తమ బండారం బయటపడుతుందని ముందు జాగ్రత్తగా ఆయన సంతకం చేయలేదని వెల్లడించక సిట్ అధికారులకు తప్ప లేదు. కుట్రకు అనుకూలంగా సిట్ అధికారులు ఓ రిమాండ్ నివేదికను సృష్టించి కనికట్టు చేసేందుకు యత్నించారన్నది దీంతో బట్టబయలైంది. ఆ విషయాలను రాజ్ కేసిరెడ్డే వెల్లడించి ఉంటే...ఆయన ఆ వాంగ్మూలం కాపీపై సంతకం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తారు?.. అంటే రిమాండ్ నివేదిక పేరిట సిట్ కుట్రకు పాల్పడిందన్నది స్పష్టమైంది. సిట్ అధికారులే న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక దీనికి సాక్ష్యం. నాడు టీడీపీ దుష్ప్రచారమే...నేడు సిట్ రిమాండ్ నివేదికచంద్రబాబు, లోకేశ్, టీడీపీ అధికార ప్రతినిధులు టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన మాటల్నే సిట్ తన రిమాండ్ నివేదికగా న్యాయస్థానానికి సమర్పించడం విడ్డూరంగా ఉంది. అందులో పేర్కొన్నవన్నీ అసత్య ఆరోపణలేననడానికి ఇవిగో తార్కాణాలు..అబద్ధపు వాంగ్మూలాలే కుట్రకు ప్రాతిపదికసిట్ అధికారులు బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలే ప్రాతిపదికగా రిమాండ్ నివేదిక రూపొందించినట్టు వెల్లడైంది. వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డితోపాటు అప్పటి ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగానికి తెగబడింది. తాము భయభ్రాంతులకు గురిచేసి బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్తో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాలనే ప్రస్తావించింది. డిస్టిలరీల ఏర్పాటు కోసం విజయసాయిరెడ్డి నివాసంలో ఎంపీ మిథున్ రెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి తదితరులు సమావేశమై చర్చించినట్టు సిట్ పేర్కొంది. కారు కూతలు... కాకి లెక్కలులేని కుంభకోణం ఉన్నట్టు చూపించే కుట్రటీడీపీ కార్యాలయం చెప్పిన కాకి లెక్కలతో సిట్ అధికారులు తమ రిమాండ్ నివేదికను రూపొందించడం పోలీసు వ్యవస్థ సర్వభ్రష్టత్వాన్ని వెల్లడిస్తోంది. ఏకంగా నెలకు రూ.50కోట్ల నుంచి రూ.60 కోట్ల చొప్పున వసూలు చేసి ఇచ్చారని దుష్ప్రచారానికి తెగబడింది. మళ్లీ అదే నివేదికలో ఆ నిధులను రాజ్ కేసిరెడ్డి దేశంలోనే బంగారం, భూములు, ముడి సరుకు తదితర కొనుగోళ్ల రూపంలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. నిధులు వేరే వారికి ఇచ్చారని ఓ చోట... కాదు వివిధ వివిధ స్థిర, చరాస్తులుగా పెట్టుబడి పెట్టారని పరస్పర విరుద్ధంగా పేర్కొనడం సిట్ కుట్రకు నిదర్శనం.మద్యం మాఫియా దోపిడీదారు బాబే సీఐడీ నమోదు చేసిన కేసు సంగతేమిటో...!అసలు విషయం ఏమిటంటే...రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. మద్యం మాఫియాను ఏర్పాటు చేసి... పెంచి పోషించి వేళ్లూనుకునేలా చేసిన వ్యవస్థీకృత దందాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అందుకోసం మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో మోసానికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. అందుకోసం చీకటి జీవోలు 218, 468 జారీ చేశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5వేలకోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్పీ కంటే ఏకంగా 20శాతం వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20వేలకోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25వేలకోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. ప్రస్తుతం సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వ మద్యం విధానంలో అక్రమాలు మరోసారి వెల్లడయ్యాయి. ఇప్పటికైనా సీఐడీ ఆ కేసు దర్యాప్తు చేపట్టాలని... లేదా సీబీఐకి అప్పగించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబూ...మీరు అందుకు సిద్ధమేనా అని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్లు, బెల్టు షాప్లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. -
గన్నవరం విమానాశ్రయం రికార్డు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) ప్రయాణికుల రద్దీ పరంగా 2024–25 ఆ ర్థిక సంవత్సరంలో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఇక్కడి నుంచి 13,83,855 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వారిలో దేశీయంగా 13,54,925 మంది, అంతర్జాతీయంగా 28,930 మంది ప్రయాణం చేశారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రయాణికుల వృద్ధి రేటు 30.24 శాతంగా నమోదైంది. ఈ విమానాశ్రయం ద్వారా 10 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించడం ఇది నాలుగోసారి. పెరిగిన విమాన సర్వీస్లు, ఎయిర్లైన్స్ సంస్థల మధ్య పోటీ కారణంగా టిక్కెట్ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి రావడం ప్రయాణికుల వృద్ధికి కారణమని ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. -విమానాశ్రయం (గన్నవరం)విస్తరిస్తున్న విమాన సర్వీసులుకోవిడ్ సమయంలో రద్దయిన అనేక విమాన సర్వీసులను ఎయిరిండియా, ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థలు పునఃప్రారంభించాయి. కొత్తగా 2024–25లో ముంబైకి రెండు సర్వీస్లు, న్యూఢిల్లీకి అదనంగా మూడో సర్వీస్, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరుకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సర్వీస్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడికి రోజుకు 25 వరకు విమాన సర్వీస్లు వస్తుండగా, మరో 25 సర్వీస్లు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. రోజుకు సగటున 3,850 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దేశీయంగా న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, కడప నుంచి ఇక్కడికి విమాన సర్వీస్లు నడుస్తున్నాయి. అంతర్జాతీయంగా షార్జా–విజయవాడ మధ్య వారానికి రెండు సర్వీస్లు నడుస్తున్నాయి. భవిష్యత్లో వారణాసి, కొచ్చి, మలేషియా, శ్రీలంక, సింగపూర్, కువైట్కు సర్వీస్లు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.గణనీయంగా పెరిగిన ప్రయాణికులు రెండో ప్రపంచ యుద్ధ అవసరాల నిమిత్తం బ్రిటీష్ పాలకులు నిర్మింంచిన ఈ విమానాశ్రయం అంచలంచెలుగా ఎదిగి 2017లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా గుర్తింపు సాధించింది. అందుకు తగ్గట్లుగా దేశంలోని ప్రధాన పట్టణాలకు విమాన సర్వీస్లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా 2017–18లో 7,46,392 మంది ఉన్న ప్రయాణికుల సంఖ్య 2018–19కు 11,92,000 మందికి చేరుకుంది.2019–20 ఆర్థిక సంవత్సరం చివరిలో కోవిడ్ ప్రభావం కారణంగా ప్రయాణికుల సంఖ్య 11,30,583కు తగ్గింది. అనంతరం రెండేళ్ల పాటు విమానయాన రంగం కుదేలైంది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి రావడంతో 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఎయిర్పోర్ట్ పూర్వ వైభవం సంతరించుకుంది. -
పరాకాష్టకు రెడ్బుక్ కుట్ర .. పీఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్ట్
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర నిఘా విభాగం పూర్వ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్టుకు కూటమి ప్రభుత్వం తెగబడింది. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులో ఆయన్ను సస్పెండ్ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు బరితెగించింది. వలపు వల వేసి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబయికి చెందిన మోడల్ కాదంబరి జత్వానీ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ కుతంత్రాన్ని రచించింది. మేనిఫెస్టో అమలు చేయలేని దుస్థితిలో ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పీఎస్ఆర్ ఆంజనేయులును అక్రమంగా అరెస్టు చేసింది.మంగళవారం తెల్లవారుజామునే సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులను హైదరాబాద్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి, మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి వరకు విచారించారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. జత్వానీని అడ్డుపెట్టుకుని కుట్ర కాదంబరి జత్వానీ విషయంలో చట్టబద్ధంగా సాగిన వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఆమెతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్ గున్నీలపై కేసు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసింది. వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యా సాగర్ను అరెస్టు చేసింది. అనంతరం ఈ కేసును సీఐడీకి అప్పగించింది.అయితే ఈ కేసులో టి.కాంతిరాణా, విశాల్ గున్నీలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వారిపై కేసు నమోదు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. కాగా, ఎలాంటి తప్పు చేయనందునే ముందస్తు బెయిల్కు వెళ్లాలన్న పలువురి సూచనను పీఎస్ఆర్ సున్నితంగా తిరస్కరించారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన్ను అరెస్టు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు ఈ అక్రమ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులను సీఐడీ అధికారులు ఇప్పటి వరకు విచారించనే లేదు. నోటీసులు కూడా ఇవ్వలేదు. విచారణకు పిలవనూ లేదు. తాను ఎక్కడ ఉన్నదీ ఆయన ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తూనే ఉన్నారు. ఏనాడూ తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోలేదు. అయినాసరే సీఐడీ అందుకు విరుద్ధంగా వ్యవహరించి, ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. కాగా, పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది.ఈ కేసుతో కానీ, సీఐడీతో కానీ సంబంధంలేని కోయ ప్రవీణ్.. మరికొందరు పోలీసులతో కలిసి పీఎఎస్ఆర్ ఆంజనేయులు నివాసం సమీపంలో హడావుడి చేశారు. పీఎస్ఆర్ ఇంట్లో ఉన్నారా.. లేదా.. ఎక్కడికైనా వెళ్తున్నారా.. అంటూ ఆరా తీస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. తనను అరెస్టు చేసేందుకు మంగళవారం తన నివాసానికి వచ్చిన సీఐడీ అధికారులకు పీఎస్ఆర్ ఆంజనేయులు పూర్తిగా సహకరించారు. పోలీసు వాహనంలో విజయవాడకు బయలుదేరారు. కానీ కోయ ప్రవీణ్ మాత్రం పీఎస్ఆర్ నివాసంలోకి వెళ్లి ల్యాప్టాప్ కావాలి.. ఏవేవో పత్రాలు కావాలి.. డివైజుసులు కావాలంటూ హడావుడి చేశారు. ఇరికించే కుట్రతోనే విచారణ పీఎస్ఆర్ ఆంజనేయులు విచారణ పేరిట సీఐడీ అధికారులు పచ్చ కుట్రను అమలు చేసేందుకే పెద్దపీట వేశారు. విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ని దాదాపు 6 గంటలపాటు విచారించారు. హనీట్రాప్ నిందితురాలు కాదంబరి జత్వానీని అరెస్టు చేయాలని అప్పటి విజయవాడ సీపీ కాంతికాణా, డీసీపీ విశాల్ గున్నీని ఆదేశించారా.. అందుకోసం వారిని పిలిపించి మాట్లాడారా.. అని ప్రశి్నంచారు. తనకు ఆ ఉదంతంలో ఎలాంటి సంబంధం లేదని.. ఇంటలిజెన్స్ అధికారులు కేసుల దర్యాప్తు వ్యవహరాలను పర్యవేక్షించారని పీఎస్ఆర్ జవాబు ఇచ్చినట్టు తెలిసింది.తనకు తెలిసినంత వరకు న్యాయస్థానం అనుమతితోనే అప్పటి విజయవాడ పోలీసులు వ్యవహరించారని, కాదంబరి జత్వానీని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారని.. న్యాయస్థానం ఆదేశాలతో ఆమెను రిమాండ్కు తరలించారని చెప్పినట్టు తెలుస్తోంది. తనపై కదాంబరి జత్వానీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ వ్యవహారంలో తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. అందుకే తాను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని తేల్చి చెప్పారు. మరిన్ని అక్రమ కేసులకు కుట్ర కాగా పీఎస్ఆర్ ఆంజనేయులపై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం పన్నుతున్నట్టు సమాచారం. కదాంబరి జత్వానీ తప్పుడు ఫిర్యాదుతో నమోదు చేసిన కేసు న్యాయస్థానంలో నిలవదని ప్రభుత్వానికి తెలుసు. అందుకే అవాస్తవ ఆరోపణలతో మరికొన్ని కేసులు నమోదు చేయాలని భావిస్తోంది. అందుకోసం ఏపీపీఎస్సీ కార్యదర్శితో ముందస్తు కుట్రతోనే తప్పుడు ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. కాగా రఘురామకృష్ణంరాజు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు, ఇతరత్రా అక్రమ కేసులతో ఆయన్ను వేధించేందుకు ప్రభుత్వం తన కుట్రకు పదును పెడుతున్నట్టు సమాచారం. -
వ్యవస్థల విధ్వంసం: వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వం దేన్నీ వదిలి పెట్టడం లేదు. వైఎస్సార్సీపీ మీద బురదజల్లి, డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోంది. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టి.. గ్యాలరీల్లో మనుషులను చంపుకునే పోటీలు పెట్టేవారు. వినోదం కింద రోజుకో దుర్మార్గమైన ఆట ఆడిస్తూ ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది. ఏదైనా ముఖ్యమైన సమస్య తలెత్తిన వెంటనే చంద్రబాబు డైవర్షన్ చేస్తున్నాడు. ఏమీ లేకపోతే ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి జగన్ మీద మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నారు. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి : రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించి.. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్రలో కూటమి ప్రభుత్వం నిత్యం మునిగి తేలుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వ్యవస్థలన్నీ దిగజారిపోయేలా చేస్తూ.. వాటి విధ్వంసానికి పాల్పడుతోందని, రాష్ట్రంలో మొదటిసారిగా ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నామని నిప్పులు చెరిగారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించదన్నారు. చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి ప్రలోభపెట్టి, భయపెట్టి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని చెప్పారు. ఈ పరిణామాలతో రాష్ట్రం ఎటువైపు వెళ్తోందో అర్థం కావడం లేదని, దుర్మార్గపు సంప్రదాయాలకు తెర లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడం దారుణమని, ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు తప్పు పట్టినా పద్ధతి మార్చుకోలేదన్నారు. మంగళవారం ఆయన తాడుపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ ఇంకా ఏమన్నారంటే..అసలు లిక్కర్ స్కాం ఎవరిది? » లోక్సభ సభ్యుడు మిథున్రెడ్డిని టార్గెట్ చేసి, ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు. తన కాలేజీ రోజుల్లో చంద్రబాబును.. పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి.. ఆయన పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష పెట్టుకున్నాడు. లేని ఆరోపణలు సృష్టించి, తప్పుడు సాక్ష్యాలతో వారిని ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్పై సీఐడీ గతంలో కేసు కూడా పెట్టింది. » లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? దుకాణాలకు తోడు పర్మిట్ రూములు, బెల్టుషాపులు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూములు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?» 2014–19 మధ్య చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లు కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ఇప్పుడున్న డిస్టిలరీల్లో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అన్ని పథకాలకు మంగళం ప్రజల నోటిలోకి నాలుగు వేళ్లు ఎందుకు పోవడం లేదు? మన ప్రభుత్వ పథకాలన్నింటినీ ఎందుకు రద్దు చేశారు? సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి? ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.3,900 కోట్లు బకాయి పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కలుపుకుంటే, మొత్తం రూ.7,800 కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చారు. దీనివల్ల ప్రజలు కష్టాల్లో, బాధల్లో మునిగి ప్రభుత్వ నిర్వాకాలపై దృష్టి పెట్టరని అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు అదే చేస్తున్నారు.భూ పందేరాలు.. పనుల్లో యథేచ్ఛగా దోపిడీలులూ గ్రూపునకు రూ.1500–2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే స్టీల్, సిమెంటు రేట్లు పెద్దగా పెరగక పోయినా.. పెరిగాయని చెబుతూ రూ.36 వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేల కోట్లకు పెంచారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానం తీసుకొచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. బటన్లు నొక్కితే దోపిడీకి వీలు కాదని..గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా చంద్రబాబు ఎందుకు బటన్లు నొక్కలేదు అని అడిగాను. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తుంది. అందుకనే చంద్రబాబు బటన్లు నొక్కడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కానీ దేశ వ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయి. ఏ రైతుకూ గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. దాదాపు 4 లక్షల పెన్షన్లు తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. గతంలోనూ మనపై తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కానీ ప్రజలు మనల్ని నమ్మారు. ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబునాయుడిపై వ్యతిరేకతను కప్పి పుచ్చడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తోంది. కానీ ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబునాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు.వక్ఫ్ చట్టం విషయంలో టీడీపీ వ్యవహార శైలిపై చర్చ వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి టీడీపీ పార్లమెంట్ ఉభయ సభల్లో మద్దతు పలికి, కింది స్థాయిలో కప్పదాటు వైఖరితో వ్యవహరిస్తోందని పలువురు పీఏసీ సభ్యులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. టీడీపీ చేసిన ద్రోహాన్ని మైనార్టీలు ఎండగడుతున్నారని.. ఊరూరా ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ.. వక్ఫ్ చట్టం అన్నది కేవలం ఒక మతానికో, ఒక వర్గానికో సంబంధించినది కాదని, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది కాబట్టే దీనిపై న్యాయపరంగా పోరాడేందుకు సుప్రీంకోర్టులో కేసు వేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గడం గురించి సమావేశంలో చర్చకు వచ్చింది. ధాన్యం, పెసలు, మినుములు, కందులు, శనగలు, పొగాకు, మిర్చి, అరటి, టమాటా, కోకో సహా అన్ని పంటల ధరలు తగ్గిపోయాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, టారిఫ్ల బూచి చూపి రైతులను నిలువునా దోచుకున్నారని చెప్పారు. ఆక్వా రైతులకు మేలు చేయడానికి, వారికి ప్రభుత్వం అండగా ఉండేందుకు మన ప్రభుత్వం హయాంలో చట్టాలు తీసుకు వచ్చి, విద్యుత్ రాయితీలు కూడా కల్పించామని, కానీ ఈ ప్రభుత్వం ఆ చట్టాలను వాడుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులకు జరుగుతున్న నష్టంపై పార్టీ పలు దఫాలుగా స్పందించిందని, దీనిపై పార్టీ పరంగా మరింతగా పోరాటం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని.. కమిటీలుగా ఏర్పడి ముందుకెళ్లాలని వైఎస్ జగన్ చెప్పారు.చంద్రబాబు పెడుతున్న కేసులతో ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరు. 16 నెలల పాటు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కాని ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెడితే, ప్రజలు అంతగా స్పందిస్తారు. కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. ఇందుకు భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తి నింపాలి. - వైఎస్ జగన్యుద్ధ వాతావరణంలో పుట్టిన పార్టీ» పార్టీని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాలను నిర్మిస్తూ వస్తున్నాం. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులందర్నీ నియమించాం. వాళ్లు క్షేత్ర స్థాయిలో గట్టిగా యుద్ధం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ యుద్ధ వాతావరణంలోనే పుట్టింది. పార్టీ పుట్టిన తర్వాత పదేళ్లపాటు మనం యుద్ధ వాతావరణంలోనే ఉన్నాం. రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజకవర్గాలకూ పరిశీలకులను నియమిస్తాం. పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లకు వారు అన్ని రకాలుగా సహాయపడతారు. ఇది పార్టీలో సమన్వయానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ నియామకాల తర్వాత పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతుంది.» జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులు, పీఏసీ ఏర్పాటు.. ఇలా అన్ని రకాలుగా పార్టీ నిర్మాణం అవుతోంది. కింది స్థాయిలో జిల్లా కమిటీలు, నియోజకవర్గాల కమిటీలు, మండల స్థాయి కమిటీలు కూడా దాదాపు ఏర్పాటయ్యాయి. ఇక గ్రామ స్థాయికి కూడా పార్టీ వెళ్లాలి. బూత్ లెవెల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే ఆరు నెలల్లో మొత్తం నిర్మాణం పూర్తి కావాలి. మన పార్టీ బలోపేతంగా ఉంటేనే, మనకు చాలా ప్రయోజనకరం. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. » ప్రజల తరఫున మనం పోరాటాలు ఇప్పటికే మొదలుపెట్టాం. ఈ పోరాటాలు మరింత ముమ్మరం అవుతాయి. వచ్చే రెండు, మూడేళ్లలో ప్రజల తరఫున ప్రణాళికా బద్ధంగా పోరాటం చేస్తాం. చివరి ఏడాదిలో ఎన్నికలపై దృష్టి పెడతాం. పార్టీ పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలి. ప్రజల తరఫున గొంతు విప్పాలి. అందరూ ప్రజల తరఫున మాట్లాడాలి. దీనివల్ల అన్ని అంశాలూ ప్రజల్లోకి వెళ్తాయి.» మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామ స్థాయిలో కార్యకర్తలను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సా«ధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి.» కష్టాల నుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పోరాటాలు, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పని తీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు. పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది.. ప్రజల్లోకీ వెళ్తుంది. ఈ మూడేళ్లూ ప్రజల్లోకి ఉధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి. పోరాటం చేయాలి. ఇందులో ఎలాంటి రాజీ పడొద్దు. -
‘ఉర్సా’.. ఎంపీ కేశినేని చిన్ని బినామీదే!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విశాఖపట్నంలో డేటా సెంటర్ ప్రాజెక్టు ముసుగులో 60 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన బినామీతో కలిపి కుట్ర పన్నారని విజయవాడ మాజీ ఎంపీ, శివనాథ్ సోదరుడు కేశినేని శ్రీనివాస్ (నాని) ఆరోపించారు. ఇందుకోసం కొన్ని వారాల క్రితమే ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ఏర్పాటు చేశారని చెప్పారు.ఉర్సా డైరెక్టర్లలో ఒకరైన సతీష్ అబ్బూరి, కేశినేని చిన్ని క్లాస్మేట్స్ అని ‘ట్వంటీఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీ స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన వ్యాపార భాగస్వాములు కూడా వీరేనని గుర్తు చేశారు. ఆ అక్రమ సంస్థ ఉర్సాకు భూకేటాయింపులను తక్షణమే రద్దు చేసి.. ఆ కంపెనీ యాజమాన్యం, మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను ఫేస్బుక్, ‘ఎక్స్’లో పోస్టు చేశారు.లేఖలో ఏం రాశారంటే.. » విశాఖలో రూ.5,278 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట ఇటీవల ఏర్పాటు చేసిన కంపెనీకి విశాఖ ఐటీ పార్క్లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించడం ఆందోళనకరం. » ఆ కంపెనీకి భూ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కుట్ర, భూదోపిడి దాగి ఉంది. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం బినామీని ముందుపెట్టి అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాజేయడానికి ఎంపీ చిన్ని ప్రయత్నిస్తున్నారనడానికి బలమైన ఆధారాలున్నాయి. » ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కేవలం కొన్ని వారాల ముందు మాత్రమే స్థాపించారు. ఆ కంపెనీకి ఎలాంటి అనుభవం లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టును అమలు చేసే సామర్థ్యం లేదు. » ఉర్సా డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ ఎంపీ కేశినేని శివనాథ్కు ఇంజనీరింగ్ కాలేజీ సహచరుడు. దీర్ఘకాల మిత్రుడు. గతంలో ట్వంటీఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీ స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యాపార భాగస్వామి కూడా. ఉర్సా బినామీ అబ్బూరి సతీష్ వెనుక ఉన్నది కేశినేని శివనాథే అన్నది ప్రజల్లో బలంగా ఉంది. » మీడియా నివేదికల ప్రకారం.. ఎంపీ కేశినేని శివనాథ్ ఫ్లైయాష్, ఇసుక, గ్రావెల్ను కొల్లగొడుతూ.. గాంబ్లింగ్ డెన్స్ (పేకాట శిబిరాలు) నిర్వహిస్తూ.. రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్నారనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. » పారిశ్రామిక అభివృద్ధి కోసం కాకుండా.. ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉర్సా పేరుతో భూములను కాజేయడానికి ఎంపీ కేశినేని శివనాథ్ కుట్ర చేసినట్లు కనిపిస్తోంది. దీన్ని అనుమతించటం ప్రజా ప్రయోజనాలకు హానికరం. కాబట్టి తక్షణమే ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూకేటాయింపును రద్దు చేయండి. » ఆ కంపెనీ యాజమాన్యం, పెట్టుబడుల మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణకు ఆదేశించండి. -
రాజ్ కేసిరెడ్డికి రిమాండ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ : మద్యం అక్రమ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కేసిరెడ్డికి ఏసీబీ న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు. అంతకు ముందు రిమాండ్ రిపోర్ట్పై విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం రాత్రి వాడివేడిగా వాదనలు జరిగాయి. అరెస్ట్లో సాంకేతిక తప్పిదాల గురించి నిందితుడి తరుఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి ప్రస్తావించారు. ప్రభుత్వ సలహాదారు పబ్లిక్ సర్వెంట్ ఎలా అవుతారని ప్రశ్నించారు. పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్) యాక్ట్ అమలు విషయంలో నిందితుడు రాజ్ కేసిరెడ్డి పబ్లిక్ సర్వెంట్ అని నిరూపించేందుకు పీపీ కల్యాణి ప్రయత్నించారు. ఐటీ సలహాదారుగా పని చేసి ప్రభుత్వం నుంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నేపథ్యంలో కేరళ కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉటంకించారు. అయితే రాజ్ పబ్లిక్ సర్వెంట్ కాదని, అతనికి 17(ఎ) వర్తించదన్న డిఫెన్స్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ విషయంలో న్యాయస్థానానికి మరింత స్పష్టత ఇవ్వాలని ప్రాసిక్యూషన్ను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎంత మొత్తంలో అవినీతి జరిగింది.. ఇప్పటి వరకు ఎంత నగదు, ఆస్తులు, ఇతర సామగ్రి సీజ్ చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. రూ.3,200 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. నగదు, ఆస్తులు వంటివి ఏమీ సీజ్ చేయలేదని చెప్పారు. ఈ సమాధానం విన్న న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. గత ఏడాది సెపె్టంబర్లో నమోదు చేసిన కేసుకు సంబంధించి.. సిట్ ఏర్పాటై, ఇన్ని నెలల దర్యాప్తు చేశాక.. ఎలాంటి నగదు, ఆస్తులు, వస్తువులు సీజ్ చేయనపుడు.. అవినీతి చేశాడంటూ అభియోగం ఎలా మోపుతారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కేవలం రూ.3,200 కోట్లు అవినీతి జరిగిందని ఊహించుకుని అరెస్ట్ చేసి, రిమాండ్ కోసం కోర్టుకు తీసుకొచ్చారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హవాలా రూపంలో సెల్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడు దర్యాప్తునకు సహకరించడం లేదని, అందుకే రిమాండ్ అడుగుతున్నామని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. గంట ముందు న్యాయస్థానానికి మెమో కేసు కోర్టుకు అటాచ్ చేసే అంశంలో ప్రాసిక్యూషన్ ఇచ్చిన మెమోను న్యాయస్థానం తప్పు పట్టింది. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్యాణి ఇచ్చిన పొంతనలేని సమాధానాలపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. అవినీతి నిరూపణ కానప్పుడు కేసును సీఐడీ దర్యాప్తు చేయాలని, సీఐడీ కోర్టులోనే విచారణ జరగాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఏసీబీ కోర్టుకు అటాచ్ చేయాల్సి వచ్చినపుడు మెమో ఎప్పుడిచ్చారంటూ ప్రశ్నించారు. సాయత్రం నాలుగు గంటలకు మెమో ఇస్తే.. విచారణ ఎప్పుడు చేయాలని నిలదీశారు. అయితే ఉదయమే మెమో ఇచ్చామని పీపీ చెప్పడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. మెమో షీట్పై సమయం వేసి ఉన్నప్పటికీ, అందుకు భిన్నంగా ఎలా మాట్లాడతారంటూ అసహనం వ్యక్తం చేశారు. నిందితుడు పబ్లిక్ సర్వెంట్ అయితే అతని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా? ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ అధికారినైనా ఇప్పటి వరకు అరెస్ట్ చేశారా? అన్న న్యాయమూర్తి ప్రశ్నలకు ప్రాసిక్యూషన్ సరైన సమాధానం కరువైంది. కనీసం కోర్టుకు మెమో ఇచ్చే అంశంలోనే స్పష్టత లేనపుడు ఈ కేసు వాదనలకు ఆధారం ఎక్కడుంటుందని, వెంటనే మెమోను వెనక్కి తీసుకుంటే కేసును సీఐడీ కోర్టుకు రిటర్న్ చేస్తామని, పై అధికారులతో మాట్లాడుకుని ఏ విషయం చెప్పాలని న్యాయమూర్తి అసహనంగా బెంచ్ దిగి వెళ్లిపోయారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ ఎలా?న్యాయస్థానానికి సిట్ అధికారులు సమర్పించిన ఎఫ్ఐఆర్లో నిందితుడు రాజ్ కేసిరెడ్డి పేరు లేకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్లో పేరు లేని వ్యక్తిని నిందితుడు అంటూ ఎలా అరెస్ట్ చేశారని, రిమాండ్ ఎలా అడుగుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టు నియమాలను అనుసరించాలని సుప్రీంకోర్టు, తాము ఎన్నిసార్లు చెప్పినా మీలో మార్పు రావడం లేదని విచారణ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేశామని, ఏ3గా ఉన్న నిందితుడు విచారణకు ఏ మాత్రం సహకరించట్లేదని, పూర్తి స్థాయిలో కస్టడికి తీసుకుని విచారణ చేయాల్సి ఉందని పీపీ న్యాయస్థానాన్ని కోరారు.తప్పుల తడకగా రిమాండ్ రిపోర్ట్విచారణ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్పై ప్రాసిక్యూషన్ సైతం అసహనం వ్యక్తం చేసింది. కోర్టుకు ఇచ్చిన మెమో విషయంలో సిట్ అధికారులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసి బెంచ్ దిగి వెళ్లిపోవడంతో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హుటాహుటిన కోర్టు హాల్కు చేరుకున్నారు. కోర్టుకు ఇచ్చిన మెమో, 17(ఎ), ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు నమోదు చేయక పోవడం వంటి అంశాలను తిరిగి లేవనెత్తారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ను సక్రమంగా చదవాలని న్యాయమూర్తి సూచించడంతో కొన్ని పేరాలను ఏజీ దమ్మాలపాటి చదివేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తప్పులను గమనించి విచారణ అధికారులైన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిమాండ్ రిపోర్ట్ను పక్కన విసిరారు. కేసులో సరైన ఆధారం లేకుండా, ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు లేకుండా కేసు ఎలా వాదిస్తామంటూ పోలీసులపై మండిపడ్డారు. కనీసం పేరాలు, పేజీ నంబర్లు లేకుండా రిపోర్ట్ ఎలా తయారు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.విచారణకు వస్తానని చెప్పినా.. ఈ కేసులో విచారణకు స్వచ్ఛందంగానే హాజరవుతానని, సిట్ అధికారులు నోటీసులో ఇచ్చిన తేదీనే విచారణకు వస్తానని చెప్పినా పోలీసులు తనను అరెస్ట్ చేశారంటూ నిందితుడు రాజ్ కేసిరెడ్డి కోర్టుకు వివరించారు. మంగళవారం కేసు విచారణకు హాజరయ్యే నిమిత్తం సోమవారం మధ్యాహ్నం గోవా నుంచి బయలుదేరి సాయంత్రానికి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నానని, అక్కడి నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అత్యుత్సాహంతో అరెస్ట్ చేశారని చెప్పారు. తన కారును సీజ్ చేశారని, బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారని, విచారణ పేరుతో తన తల్లి, తండ్రిని ఇబ్బందులు పెడుతున్నారని న్యాయమూర్తికి తెలిపారు. సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని, అందులో తాను సంతకాలు చేయలేదని వివరించారు. కాగా, అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి భాస్కర్రావు తీర్పు వెలువరించారు. -
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
తాడేపల్లి : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైఎస్సార్ సీపీ నుండి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే సస్పెండ్ చేసినట్టు సమాచారం. -
UPSC CSE 2024:: తెలుగు అభ్యర్థులకు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన తెలుగు అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. వారు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్. మన రాష్ట్రానికి, దేశానికి గర్వంగా నిలవాలని ఆశిస్తున్నట్లు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Congratulations to all The Telugu Aspirants who have excelled in UPSC Civil Services 2024. Wishing you even greater success in the future and hoping you continue to bring pride to our state and nation.#UPSC— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2025 -
పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్కు ఫిర్యాదు
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు , మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియా యాక్టివిస్టు మునగాల హరీశ్వర్ రెడ్డి హైకోర్టు రిజిస్టర్ జనరల్ కు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులోని ముఖ్యమైన అంశాలుపోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారువీరిపై సుప్రీంకోర్టు ఆదేశాలకు మేర తగిన చర్యలు తీసుకోండిఏడేళ్లు లోపు శిక్ష పడే కేసుల్లో కూడా యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారుమేజిస్ట్రేట్లు తగిన కారణాలు కూడా వెల్లడించటం లేదుఇది అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను దిక్కరించడమేఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు చెప్పిందితమ ఆదేశాల అమలను పర్యవేక్షించాలని కూడా హైకోర్టులకు సుప్రీంకోర్టు చెప్పిందిలోపు భూయిష్ట ఉత్తర్వులను తమ దృష్టికి తీసుకువస్తే హైకోర్టు చర్యలు తీసుకుంటామందిఅందుకే ఏ ఏ కేసుల్లో నిబంధనలు పాటించలేదు మీ దృష్టికి తీసుకు వస్తున్నదీని ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవాలిహరీశ్వర్ రెడ్డి ఫిర్యాదును సీజేకు ఇస్తామన్న రిజస్ట్రీ -
విచారణకు వస్తానని చెప్పినా అరెస్ట్ చేశారు: కోర్టులో రాజ్ కేసిరెడ్డి
విజయవాడ తాను సిట్ విచారణకు హాజరవుతానని చెప్పినా అరెస్టు చేశారని ఏసీబీ కోర్డులో రాజ్ కేసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు(మంగళవారం) రాజ్ కేసిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీనిలో భాగంగా రాజ్ కేసిరెడ్డిని న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు. సోదాల్లో ఏమైనా సీజ్ చేశారా? అని న్యాయమూర్తి అడగ్గా, కారు తప్ప ఏమీ సీజ్ చేయలేదని కేసీరెడ్డి తెలిపారు. తన ఇంటితో పాటు బంధువులు ఇళ్లల్లో,స్నేహితుల ఇళ్లల్లో సోదాలు చేశారని కేసిరెడ్డి తెలిపారు. విచారణ పేరుతలో తల్లి దండ్రలను ఇబ్బందులు పెట్టారని తెలిపిన కేసిరెడ్డి.. సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని, తాను సంతకాలు చేయలేదని కోర్టుకు తెలిపారు. -
‘ఆ విషయంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?’
తాడేపల్లి : లిక్కర్ స్కామ్ ను వైఎస్సార్ సీపీ పై మీద వేసి తాము రాష్ట్రాన్ని దోచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తుగడ వేశారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. అసలు లిక్కర్ స్కామ్ జరిగిందే చంద్రబాబు హయాంలోనని, 2014 19లో లిక్కర్ స్కామ్ జరిగిందని సీఐడీ చంద్రబాబు మీద కేసు పెట్టిన విషయాన్ని టీజేఆర్ ప్రస్తావించారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ ఆ లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు ఏ 3గా ఉన్నారు. దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?, టీడీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు అడ్డదిడ్డంగా కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందుకోసం ఎక్సైజ్ పాలసీనే చంద్రబాబు మార్చారు. ప్రభుత్వానికి రావాల్సిన రూ.2,984 కోట్లు తమవారి జేబుల్లోకి వేసుకున్నారు. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వానికి నష్టం, టీటీడీ నేతలకు లాభం జరిగింది. ఆ స్కామ్ గురించి మాట్లాడటం లేదు. 2019లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పట్నుంచి పోలింగ్ మధ్యలో అనేక డిస్టలరీలకు ఎందుకు అనుమతులు ఇచ్చారు?, క్యాబినెట్ కు తెలియకుండానే నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలి. బార్లకు మేలు చేస్తూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వెనుక కారణం ఏమిటి?, వీటిన్నంటిపై విచారణ చేస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నాడంటూ వాసుదేవరెడ్డి మీద నాలుగు కేసులు పెట్టారు. కాగితాలపై సంతకాలు పెట్టించుకుని రిలీవ్ చేయటం వెనుక కారణం ఏంటి?, ఈ అక్రమ కేసులు పెట్టడం ద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అధికారులు గుర్తుంచుకోవాలి. ఇష్టానుసారం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి లిక్కర్ పాలసీతో ఏం సంబంధం ఉంది?, చిత్తూరులో చంద్రబాబుకు ప్రత్యర్థిగా ఉన్నందున అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా?, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజంగా కేసిరెడ్డికి లిక్కర్ పాలసీ గురించి తెలిసి ఉంటే బేవరేజ్ కార్పోరేషన్ లో పదవి ఇచ్చేవాళ్లం కదా? , ఆయన ఐటీకి సంబంధించి సలహాదారుడు మాత్రమే. చంద్రబాబు, జగన్ హయాంలో లిక్కర్ పాలసీలపై చర్చకు మేము సిద్ధం. ప్రజలు పడుతున్న కష్టాలపై ఎల్లోమీడియా ఎందుకు చర్చలు పెట్టటం లేదు?పులివెందుల ఎమ్మెల్యే పదవిని రద్దు చేసి తిరిగి గెలిచే దమ్ముందా?, ఎన్నికలలో పోటీ చేసే సత్తా టీడీపీ కి ఉందా?, చంద్రబాబు సాధించిన ఘనత వైన్ షాపులు, పర్మిట్ రూములు పెట్టడమే. అధిక ధరలకు మదగయం అమ్ముతుంటే ఒక్క కేసు కూడా ఎక్సైజ్ శాఖ ఎందుకు నమోదు చేయలేదు? , విజయసాయిరెడ్డి ఎవరితోనో కమిట్ అయ్యారు. అందుకే మాపై ఆరోపణలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు టీజేఆర్. -
'చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలు'
సాక్షి, తాడేపల్లి: హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ భయపడరని ఆర్కే రోజా అన్నారు.దమ్ముంటే ఫైబర్ నెట్, స్కిల్ స్కామ్పై విచారణ జరిపించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకం ఎందుకు అమలు కాలేదు?. చంద్రబాబు మొదటి సంతకం చిత్తు కాగితంతో సమానం. గ్రామాల్లోకి టీడీపీ నేతలు వెళ్ళే ధైర్యం ఉందా?. డైవర్షన్ డర్టీ కేసులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసే వాళ్లు భవిష్యత్లో జైలులో ఉంటారు. పోలీసు అధికారులకు హైకోర్టు అనేకసార్లు అక్షింతలు వేసింది. రాష్ట్రాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నాడని గతంలో మోదీనే చెప్పారు’’ అని ఆర్కే రోజా గుర్తు చేశారు.‘‘అమరావతిలో 36 వేల కోట్ల టెండర్లు.. 77 వేల కోట్లకు ఎందుకు పెంచారు?. అమరావతి టెండర్ల అంచనాలు పెంచి దోపిడీకి సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు ఆయన మనుషులు తప్పితే ఎవరూ అభివృద్ధి చెందకూడదా?. అమరావతి రాజధాని టెండర్లపై ప్రధాని మోదీ విచారణ జరిపించాలి. రూపాయి కూడా అవినీతి లేకుండా వైఎస్ జగన్ లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా? తెలంగాణకు ముఖ్యమంత్రా?. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని రోజా ఎద్దేవా చేశారు...చంద్రబాబు మళ్లీ తన నిజ స్వరూపం చూపిస్తున్నారు. డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. రైతుల వెన్నుముక విరిచేశారు. ల్యాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు డర్టీ డైవర్షన్ పాలిటిక్స్కి నిదర్శనం. తప్పు చేయని పీఎస్ఆర్ని అరెస్టు చేయటం దారుణం. కొందరు పోలీసులు తీవ్రమైన తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారెవరినీ వదిలిపెట్టేదే లేదు. అలాంటి వారందరినీ జైలుకు పంపుతాం. స్కిల్ కేసులో అక్రమాలు చేసి చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయన తప్పులను ఈడీ కూడా గుర్తించి కొందరిని అరెస్టు చేసింది. ఆ కేసును చంద్రబాబు ఎందుకు తొక్కి పెట్టారు?. చంద్రబాబుకు దమ్ముంటే తన కేసులపై సీబిఐ విచారణ జరిపించండి..చంద్రబాబు సంతకాలకు విలువ లేదు. నాలుగోసారి సీఎం అయినా మొదటి సంతకానికే దిక్కులేదు. హామీలు అమలు చేయలేని పాలకులు జనంలోకి వెళ్తే జనం వెంటపడి కొడతారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద విష రాజకీయాలు చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అమరావతిలో గతంలో రూ.36వేల కోట్లతో టెండర్లు వేశారు. ఇప్పుడు అవే పనులకు రూ.76 కోట్లకు ఎలా పెంచారో ప్రధాని గుర్తించాలి. రాజధానిలో ఆయన మనుషులు, ఆయన కులంవారు తప్ప మరెవరూ ఉండకూడదా?. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండకూడదా?. దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా చంద్రబాబు ఎలా అయ్యారో జనానికి తెలుసుకుప్పంలో చంద్రబాబు ఎందుకు ఇల్లు కట్టు కోలేదు?. అమరావతిలో మాత్రమే ఇల్లు కట్టుకోవడం వెనుక కారణం ఏంటో జనానికి చెప్పాలి. వీకెండులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. చంద్రబాబుది విజన్ కాదు.. విస్తరాకుల కట్ట. ఆయనపై ఉన్న కేసులను విచారిస్తే ఎవరు విజనరీనో, నేరస్తుడో తేలుతుంది. ప్రధాని మోదీ.. చంద్రబాబు అక్రమాలపై విచారణ జరపాలి. అమరావతిలో శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని.. చంద్రబాబు మీద విచారణకు ఆదేశించాలి. అడ్రెస్ కూడా లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాల భూమిని ఎలా ధారాదత్తం చేశారు?. దావోస్ వెళ్తే ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టటానికి రాలేదు. కానీ ఊరూ పేరు లేని కంపెనీలకు భూములు ఇవ్వటం వెనుక కారణాలేంటి?ఉర్సా భూముల కేటాయింపును వెంటనే ఆపేయాలి. టీటీడీ గోశాలలో 191 ఆవులు చనిపోతే అసలేమీ చనిపోలేదని చంద్రబాబు నిస్సిగ్హుగా మాట్లాడుతున్నారు. గోవుల మృతిపై ఛాలెంజ్లు చేసి వెనక్కు వెళ్లారు. తిరుమలలో తాగి మర్డర్లు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోవటం అనర్ధం. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. తిరుమల, శ్రీకూర్మం ఘటనలపై ఎందుకు నోరు మెదపటం లేదు?. చంద్రబాబు చేస్తున్న తప్పులు బీజేపీకి కనపడటం లేదా?. జగన్ అధికారంలోకి వచ్చాక 43 వేల మద్యం బెల్టుషాపులు తొలగించాం. మద్యం షాపులను బాగా తగ్గించాంమద్యం షాపులు పెంచితే లంచాలు వస్తాయా? తగ్గిస్తే వస్తాయా?. మిథున్రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అసలు మద్యం పాలసీకి, మిథున్రెడ్డి కి ఏం సంబంధం?. చంద్రబాబు లక్ష కోట్లు రాజధానిలో పెట్టి, కమీషన్లు కొట్టేస్తున్నారు. చంద్రబాబు లిక్కర్ పాలసీ వలనే మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయి. రాజకీయాల కోసం భగవంతుడిని వాడుకుంటే కష్టాలు తప్పవని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రహించాలి. పిఠాపురంలో మహిళపై అత్యాచారం జరిగినా పవన్ పట్టించుకోలేదు. దళితులను వెలేసినా పట్టింపులేదు. చంద్రబాబుకు కష్టం, నష్టం వచ్చినప్పుడు మాత్రమే పవన్ బయటకు వస్తారు’’ అంటూ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతిలోకి వెళ్లారు: అంబటి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.సూట్కేస్ కంపెనీ ఉర్సుకు విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని, రాజధాని అమరావతిలో కోట్ల రూపాయల కమిషన్లు విలువైన పనులను కావాల్సిన వారికి కట్టబెట్టి కోట్లాధి రూపాయలు కమీషన్లుగా దండుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి వారి దృష్టిని మళ్ళించేందుకే ఈ తాజా అరెస్ట్ల డ్రామాకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే..తన అవినీతి, అసమర్థ పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తున్నారు. అరెస్ట్లకు ఎవరూ అతీతం కాదని చంద్రబాబు అంటున్నారు. తనకు నచ్చని వారిని ఎవరినైనా సరే అరెస్ట్ చేసేస్తాననే పద్దతిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులును హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన ఏపీలో అనేక చోట్ల పనిచేశారు. నీతీ, నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు.పదోన్నతులతో డీజీపీ స్థాయికి వచ్చారు. డీజీపీ కావాల్సిన అధికారిని ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. గతంలో ఒక కేసులో ఆనాటి ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై కూడా ఎదురు కేసులు నమోదు చేశారు. వారిద్దరూ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పీఎస్ఆర్ ఆంజనేయులు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకు వెళ్లలేదు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదు. ఈ రోజు హఠాత్తుగా ఆయనను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు సిద్దహస్తుడుఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయలేకపోతున్నాను, బడ్జెట్ చూస్తుంటే భయం వేస్తోందంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తూ చంద్రబాబు అబద్దాల కోరు అని జనం చర్చించుకుంటున్నారు. ఒక్క హమీని కూడా నెరవేచ్చని దుర్మార్గమైన పాలన సాగుతోంది. దీనిపై ప్రజల దృష్టిని మళ్ళించేందుకు తాజాగా ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఉర్సు అనే కంపెనీకి విశాఖలో మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 99 పైసలకు ఎకరం చొప్పున ఇచ్చేశారు. ఇది దోపిడీ కార్యక్రమం కాదా?ఇది ప్రజలు చర్చించుకోకుండా పీఎస్ఆర్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కసిరెడ్డిలను అరెస్ట్ చేసి, దానిపై పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. మరోవైపు రాజధాని పేరుతో విపరీతంగా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువస్తున్నారు. ఆ సొమ్ముతో కాంట్రాక్ట్లకు ఇస్తూ, వారి నుంచి కమిషన్లు దండుకుంటున్నారు. ఈ పనులకు రెండో తేదీన అమరావతిలో రెండోసారి శంకుస్థాపనకు ప్రధానమంత్రిని ఆహ్వానించారు. విపరీతమైన దోపిడీతో రాష్ట్రం సతమతమవుతోంది.లిక్కర్, ఇసుక, మట్టి పేరుతో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలోని టీడీపీ నాయకులు, చంద్రబాబు, నారా లోకేష్లు విపరీతంగా దోచుకుంటూ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేవలం పదకొండు నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక్కటే. ఏపీలో లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే, దానిలో కుంభకోణం ఎలా జరుగుతుంది. ఒక్క కొత్త డిస్టలరీకి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వం కన్నా తక్కువ రేట్లకే మద్యం విక్రయించాం, బెల్ట్ షాప్లను తొలగించాం దీనికి ఎవరైనా లంచాలు ఇస్తారా? పర్మిట్ రూంలు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టలరీలకు అర్డర్లు ఇచ్చాం. దీనిలో ఏదో స్కాం జరిగిపోయిందంటూ చంద్రబాబు హంగామా చేస్తున్నారు.రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారుకూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని తప్పుడు కేసులతో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? చంద్రబాబే శాశ్వతంగా సీఎంగా ఉంటారా? సీఎంలు మారితే ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయవచ్చా? డీజీపీలుగా పనిచేసిన వారిని కూడా అరెస్ట్లు చేయవచ్చా? ఏమిటీ ఈ అన్యాయం? కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గాలపై న్యాయస్థానాలు వాతలు పెడుతున్నా వారికి బుద్ది రావడం లేదు. పోసాని కృష్ణమురళిపై బీఎన్ఎస్ 111 సెక్షన్ పెట్టినందుకు సదరు విచారణాధికారిని కోర్ట్ ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.ప్రేమ్కుమార్ అనే వ్యక్తి మీద ఎక్స్ట్రార్షన్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే, కోర్టు దానిని తీవ్రంగా ఆక్షేపించింది. అవసరమైతే డీజీపీని కోర్ట్కు పిలుస్తామని కూడా హెచ్చరించాయి. కలకాలం చంద్రబాబే సీఎంగా ఉండరని గుర్తుంచుకోవాలి. పరిపాలన చేయలేక, కక్షసాధింపులతో పనిచేస్తున్నారు. కూటమి పార్టీలకు ఓటు వేసిన వారు సిగ్గుపడేలా పరిపాలన చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పాలన చేయాలనుకున్న వారు ఎవరూ మనజాలలేదు.గోరంట్ల మాధవ్ వ్యవహారంలో పదకొండు మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇది కక్షసాధింపు చర్యలు కావా? నిజంగా పోలీసులు తప్పు చేశారని నిర్ధారిస్తే దీనికి బాధ్యత వహించి హోమంత్రి రాజీనామా చేయాలి. డీజీపీ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పోలీసులు ఆలోచించాలి. మీ తోటి అధికారులను కక్షసాధింపుల్లో భాగంగా తప్పుడు కేసులతో మీతోనే అరెస్ట్ చేయించింది. ఇదే పద్దతి కొనసాగితే రేపు ప్రభుత్వాలు మారితే మీమ్మల్ని కూడా అరెస్ట్ చేసేయవచ్చు కదా? ఈ సంప్రదాయం వల్ల ఎవరికి నష్టం జరుగుతోంది? ప్రతి ఐపీఎస్ అధికారి దీనిపై ఆలోచించుకోవాలి.అణిచివేస్తే భయపడతామా?గతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ఇందిరాగాంధి, జయలలిత, వైయస్ జగన్ వంటి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారులపై వారి ప్రభుత్వాలు వచ్చిన తరువాత ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? చంద్రబాబును అరెస్ట్ చేశారనే కక్షతోనే ఇలా అరెస్ట్లు చేసుకుంటూ పోతున్నారు. రేపు చంద్రబాబు, లోకేష్లు మాజీలు కాకుండా పోతారా? ప్రభుత్వాలు మారి, మీరు ప్రతిపక్షంలోకి రాకుండా పోతారా? ఎవరు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని అరెస్ట్ చేస్తారా?కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మరింత బలంగా ఈ అక్రమాలపై పోరాడేందుకు ముందుకు వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. మూడున్నరేళ్ళ పదవీకాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారు. కూటమి కోసం తన పదవిని వదిలేశారు. కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలకు, సాక్ష్యాలకు విశ్వసనీయత ఏముంటుందీ? వారి మాటలకు, వాదనలకు విలువ ఏముంటుందీ? -
చంద్రబాబు.. మరీ ఇంతగానా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలు విన్నా.. చదివినా రక్తపోటు, మధుమేహం గ్యారెంటీ అనిపిస్తోంది. కించపరచాలన్న ఉద్దేశం కాదు కానీ.. ఇటీవలి కాలంలో ఆయన అబద్ధాలకు, అతిశయోక్తులకు అంతు లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ విషయంలో ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు. స్వోత్కర్ష వరకూ ఓకే గానీ.. మితిమీరితే అవే ఎబ్బెట్టుగా మారతాయి.కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం మూడు మతాలను వాడుకుంటున్నట్లు ఆరోపించారు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు. కూటమి సర్కారు పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ ఏనాడైనా జగన్ మతపరమైన అంశాలు మాట్లాడారా? లేదే! కానీ జగన్ ఫోబియాతో బాధపడుతున్న చంద్రబాబు మాత్రం ప్రతిదానికీ మాజీ సీఎంపై అభాండాలు వేసేస్తున్నారు. ఈ తీరు చూసి ఆయన కేబినెట్ మంత్రులే విస్తుపోతున్నట్లు కథనాలు వచ్చాయి. జగన్ను ఎందుకు విమర్శించడం లేదు.. అంటూ సీఎం ప్రశ్నిస్తున్నారని ఒక మంత్రి వాపోయారట.తిరుమల గోవుల మరణాలపై భూమన కరుణాకర రెడ్డి వెలుగులోకి తీసుకు వచ్చిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదని సీఎం అన్నారట. టీటీడీ ఛైర్మన్, ఈవో, సీఎం తలా ఒక్కోలా మాట్లాడుతూంటే వాటిల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకుని తాము మాట్లాడాలని ఒక మంత్రి తన సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం. గోవులేవీ చనిపోలేదని సీఎం చెబుతూంటే.. వృద్ధాప్యంతో 23 ఆవులు మరణించాయని టీటీడీ ఛైర్మన్, 43 ఆవులు చనిపోయాయని ఈవో చెబుతున్నారని దీన్నిబట్టి చూస్తే సీఎం అబద్ధమాడినట్లే కదా అని మంత్రులు కొందరు ఉన్నట్లు తెలుస్తోంది.జగన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డితో అబద్ధాలు చెప్పించారని చంద్రబాబు ఆరోపిస్తూన్నారు. భూమన ఎవరైనా చెబితే మాట్లాడే వ్యక్తేనా? తను నమ్మితే, ఆధారాలు ఉంటేనే మాట్లాడతారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అందువల్లే ఆయన ధైర్యంగా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన సవాల్ను స్వీకరించి తన ఆరోపణలను రుజువు చేయడానికి సిద్దమయ్యారు. పల్లా అసలు తిరుపతి రాకుండా ముఖం చాటేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు గోశాల వద్దకు వెళ్లి హడావుడి చేసి భూమన రావడం లేదని వ్యాఖ్యానించారు. తీరా చూస్తే భూమనను పోలీసులు అడ్డుకోవడం, గృహ నిర్భంధం చేయడం అందరు చూశారు.టీడీపీ నిస్సిగ్గుగా డబుల్ గేమ్ ఆడిన విషయం బహిర్గతమైంది. భూమన తిరుమల గోవుల, లేగ దూడల మరణాల గురించి ఆధార సహితంగా బయటి ప్రపంచానికి తెలియ చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు అసలు గోవుల మరణాలు జరగలేదని అబద్దం చెప్పారన్నది చాలామంది భావన. దానిని టీటీడీ చైర్మన్, ఈవోలే నిర్థారించారు. దాంతో ఏమి చేయాలో పాలుపోని స్థితి చంద్రబాబుకు ఏర్పడింది. అయినా టీడీపీలో అందరూ తన వాదననే ప్రచారం చేయాలన్నది సీఎం ఉద్దేశం కావచ్చు. ఇలాంటివి విన్నా, చదివినా ఎవరికైనా రక్తపోటు రాకుండా ఉంటుందా?. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర అని ఆయన అంటున్నారు.అసలు అలాంటి ఆలోచనలు చేయడంలో చంద్రబాబుకు ఉన్నంత సమర్ధత మరెవరికైనా ఉంటుందా అన్నది విశ్లేషకుల ప్రశ్నగా ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్పై ఒక పచ్చి అబద్దాన్ని ప్రచారం చేశారే. వెంకటేశ్వర స్వామి తన ఇంటి దైవం అని చెప్పుకుంటూనే, తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి తీరని అపచారం చేశారే! పోనీ అది నిజమని ఇంతవరకు ఎక్కడైనా రుజువు చేశారా? ఈ విషయంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరచామన్న కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారే?. నిజంగా దైవ భక్తి ఉన్నవారెవరైనా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా?. పవన్ కళ్యాణ్ కూడా ఆయన దారిలోనే పిచ్చి ఆరోపణలు చేసి పరువు పోగొట్టుకున్నారే! లడ్డూ వివాదాన్ని ఎలాగొలా జగన్కు అంటగట్టాలని విశ్వయత్నం చేశారే. కాని విఫలమయ్యారే. ఆ తర్వాత అయినా చేసిన పాపం కడుక్కోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే లేదే !జగన్ టైమ్లో ఏ చిన్న విషయం దొరికినా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. అంతర్వేది వద్ద ఆలయ రథం దగ్దమైతే బీజేపీ, జనసేనలతో కలిసి చంద్రబాబు రచ్చ చేశారు. అయితే జగన్ సీబీఐ విచారణకు ఓకే చేస్తే కేంద్రం ఎందుకు సిద్దపడలేదు? రికార్డు సమయంలో కొత్త రథాన్ని తయారు చేయించిన జగన్ మతాల మధ్య ద్వేషం పెంచుతారంటే ఎవరైనా నమ్ముతారా? కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలే ఆలయాలపై దాడులు చేస్తే, దానిని కప్పిపుచ్చి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఆ రోజుల్లో కూటమి పార్టీలు ఎంత ప్రయత్నించి తెలియనిది కాదు. తన హయాంలో విజయవాడ తదితర చోట్ల నలభై గుడులను పడగొట్టిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే హిందూ మతోద్దారకుడిగా ప్రచారం చేసుకున్నారు.జగన్పైనే కాకుండా, ఆనాటి డీజీపీపై కూడా క్రిస్టియన్ మత ముద్ర వేసి ప్రజలలో ద్వేషం పెంచడానికి యత్నించారా? లేదా? తిరుమలలో ఏ చిన్న ఘటన జరిగినా జగన్ పై నెట్టేయడమే పనిగా పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు తిరుమలలో మద్యం అమ్ముతున్నా, బిర్యానీలు తెచ్చుకుంటున్నా, చెప్పులు వేసుకుని గుడి వరకు వెళుతున్నా, ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక చర్చిపై హిందూ మత రాతలు కనిపించాయి. వెంటనే హోం మంత్రి దానిని వైసీపీపై ఆరోపించారు. తీరా చూస్తే ఇద్దరు పాస్టర్ ల మధ్య గొడవలలో ఆ పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరి దీనికి చంద్రబాబు ఏమి బదులు ఇస్తారు? ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో ఇలా మతపరమైన వివాదాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ. చంద్రబాబు చేతిలోకి టీడీపీ వచ్చాక అధికారం కోసం ఎలాంటి ద్వేషాన్ని అయినా రెచ్చగొట్డడానికి వెనుకాడరన్న అభియోగాలు ఉన్నాయి.వక్ఫ్ బిల్లుపై జగన్ రాజకీయం చేస్తున్నారట. ఇది విన్నవారికి ఏమనిపిస్తుంది? వైసీపీ అంత స్పష్టంగా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించినా, పచ్చి అసత్యాలను ప్రచారం చేయడానికి టీడీపీ ఏ మాత్రం సిగ్గుపడడం లేదని అనిపించదా? తాజాగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది కదా? అసలు వక్ఫ్ చట్టంపై చంద్రబాబు, పవన్ల వైఖరి ఏమిటి అన్నది ఇంతవరకు చెప్పారా? ఒకప్పుడు ప్రధాని మోదీపై తీవ్రంగా విమర్శలు చేస్తూ ముస్లింలను బతకనివ్వడని, తలాఖ్ చట్టం తెచ్చారని ఆరోపించిన చంద్రబాబు బతిమలాడుకుని మరీ బీజేపీతో ఎలా జతకట్టారు? పోనీ ఇప్పుడు వక్ప్ చట్టాన్ని ఏపీలో అమలు చేయబోమని చెప్పగలరా? లేదా సుప్రీం కోర్టు విచారణలో ఇంప్లీడ్ అవ్వగలరా? అటు బీజేపీకి మద్దతు ఇవ్వాలి. ఇటు ముస్లింలను మోసమో, మాయో చేయాలని ప్రయత్నించడం చంద్రబాబుకే చెల్లుతుంది. అందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏపీ సీఎం చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని విమర్శించారు.ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై కూడా వైసీపీ మీద ఆయన ఆరోపణలు చేశారు. ఈ పాస్టర్ మృతిపై క్రైస్తవ సమాజానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండా ప్రభుత్వం ఎందుకు దబాయించే యత్నం చేస్తున్నదీ ఎవరికి అర్థం కాదు. దీనిపై ఒక రిటైర్డ్ ఐఎఎస్తో సహా పలువురు వేస్తున్న ప్రశ్నలకు పోలీసు అధికారులు జవాబు ఇస్తున్నట్లు అనిపించదు. సీసీటీవీ దృశ్యాలపై కొందరు తమ అనుమానాలను తెలియచేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. జగన్ కాని, వైసీపీ నేతలు ఎవరూ ఈ అంశం జోలికి వెళ్లకపోయినా, తాను ఇబ్బంది పడినప్పుడల్లా జగన్ పై తోసేసి కథ నడిపించాలన్నది చంద్రబాబు వ్యూహం.జగన్ టైమ్లో ఒక డాక్టర్ మద్యం మత్తులో రోడ్డుపై నానా యాగీ చేస్తే అక్కడ ఉన్న పోలీసు కానిస్టేబుల్ అతని రెక్కలు కట్టి పోలీసు స్టేషన్కు తీసుకు వెళ్లారు. అంతే! అదేదో జగనే దగ్గరుండి చేయించినట్లుగా దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ విషయంలో మాత్రం తాను చెప్పిందే రైటు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. కులపరమైన, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ఢిల్లీలో కూర్చుని టీవీలలో లైవ్ లో మాట్లాడిన ఒక నేతకు ఇదే చంద్రబాబు పెద్ద పదవి ఇచ్చారే!నిజానికి మతపరమైన అంశాలకు ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత మంచిది. కాని ఒకప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని, మత తత్వ పార్టీ అని ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుని, ఎదుటివారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే ఏమనిపిస్తుంది. హేతుబద్దంగా ఆలోచించేవారికి ఎవరికైనా చంద్రబాబు ఇలాంటి నీతులు చెబుతున్నప్పుడు వినాలంటే బీపీ రాకుండా ఉంటుందా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని.. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ పీఏసీ మీటింగ్లో స్పందించారు. ‘‘రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులును అరెస్ట్ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్ అధికారుల పట ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టింది. .. మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారస్తున్నారు. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగలదు. .. ఎంపీ మిథున్ రెడ్డిని(MP Mithun Reddy) కూడా టార్గెట్ చేశారు. ఎలాగైనా మిథున్రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదురించారు. కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. బాబు హయాంలో లిక్కర్ స్కాంపైనా గతంలో సీఐడీ కేసు పెట్టింది. మనం తెచ్చిన లిక్కర్ పాలసీ(YSRCP Liquor Policy) విప్లవాత్మకమైంది. ప్రైవేట్ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి..’’ అని పీఏసీ సభ్యులను ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘విశాఖలో రూ.3వేల కోట్ల భూమిని ఊరు పేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు. లులూ గ్రూపునకు రూ.1500-2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్ రేట్లు పెరిగాయి. రూ.36వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేలకు పెంచారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబలైజేషన్ అడ్వాన్స్లు తీసుకు వచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా ఎందుకు బటన్లు నొక్కలేదు అని అడిగాను. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తోంది. అందుకనే చంద్రబాబు బటన్లు నొక్కడంలేదు...రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కాని, దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబు డైవర్ట్ చేస్తున్నాడు. ఏమీలేకపోతే.. జగన్ మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నాడు. ప్రజల నోటిలోకి నాలుగేళ్లు ఇప్పుడు ఎందుకు పోవడంలేదు? మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దుచేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు?..ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదు. ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్లు ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు బకాయి గత ఏడాది పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ కలుపుకుంటే రూ.7వేల కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చాడు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించాడు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా రెడ్బుక్ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో PAC గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని అందించాలి. ..పార్టీ అధికారంలోకి వస్తుంది.. మరింతగా ప్రజలకు సేవలందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీకి చెందిన ప్రతీ కార్యక్రమాన్ని మనది అనుకుని చేసుకోవాలి. అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నారు. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామస్థాయిలో కార్యకర్తను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సాధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి...కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే మనపై తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కాని ప్రజలు మనల్ని నమ్మారు, ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబుపై వ్యతిరేకతను మూసేయడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తుంది. కాని ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు. చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కానీ ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారు...కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. కాని, భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తిని నింపాలి. కష్టాలనుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యలపట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పనితీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు...పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి.. పోరాటం చేయాలి. ఎలాంటి రాజీపడొద్దు. ప్రతి సమావేశంలోనూ అజెండాను నిర్దేశించుకుని దానిపైన డిస్కషన్ చేయాలి. పార్టీకి సూచనలు చేయాలి. పార్టీ ఐక్యంగా ఉండి, పార్టీ కార్యక్రమాలను బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఏ జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య మనది అనుకుని దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎవరో ఏదో ఆదేశాలు ఇస్తారని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు అండగా ఉండడం, పార్టీని బలోపేతం చేయడం అన్నది ముఖ్యం’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై కూటమి కక్ష సాధింపు
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోంది. ఈ క్రమంలో.. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని(PSR Anjaneyulu) అరెస్ట్ చేసింది. ముంబై నటి కేసుకుగానూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ముంబై నటి జత్వానిని ఆయన వేధించారనే అభియోగాల కింద సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బేగంపేట నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నటి కాదంబరి జత్వానీ(Kadambari Jatwani) కేసులో ప్రధాన నిందితుడు ఇప్పటికే బెయిల్ మీద ఉన్నాడు. మరోవైపు.. పలువురు పోలీసు ఉన్నతాధికారుల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని విపరీతంగా ప్రయత్నించింది. కక్ష పూరితంగా కేసులు నమోదు చేయించగా.. హైకోర్టు ఆ ఇద్దరు అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పీఎస్ఆర్ను కక్ష పూరితంగా అరెస్ట్ చేయించింది. -
తిరగబడ్డ విద్యార్థి లోకం
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: కూటమి ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు సోమవారం కదంతొక్కారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ర్యాలీ నిర్వహించారు. పోలీసులు రోడ్లపై ఎక్కడికక్కడ నిర్బంధించే ప్రయత్నం చేయగా.. విద్యార్థులు వాటిని దాటుకొని ముందుకు కదిలారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని చెప్పినప్పటికీ.. విద్యార్థులు, నాయకులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వారిని పోలీసులు ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థులు అక్కడ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వినతిపత్రం ఇచ్చేందుకు సైతం విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఓ విద్యార్థి చేతిని గేటు మధ్యలో పెట్టి లోపల ఉన్న పోలీసులు నొక్కడంతో.. ఆ విద్యార్థి బాధతో విలవిలలాడాడు. చివరకు తాడేపల్లి సీఐ కల్యాణ్రాజు ఐదుగురు నాయకులను లోపలకు అనుమతించారు.వారు సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్కు వినతిపత్రం సమర్పించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ధర్నాలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.రవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పులగం సందీప్ రెడ్డి, కె.శివారెడ్డి, గోలి నరసింహ, గోపి కృష్ణ, వినోద్, కోమల్ సాయి, ఐ.శ్రీనివాస్, కొండల్ రావు, సందీప్, గోపీచంద్, నారాయణ, పూజిత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆది ఆగడం!
సాక్షి ప్రతినిధి, కడప: అల్ట్రా టెక్ సిమెంట్ పరిశ్రమకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వేధింపులు తప్పడం లేదు. ఎమ్మెల్యే తన చర్యలను సమర్థించుకుంటూనే అనుచరగణాన్ని రెచ్చగొట్టి సిమెంట్ పరిశ్రమపై ఫిర్యాదు చేయించడమే కాకుండా అధికారులను ఉసిగొల్పి ముడిఖనిజం సరఫరా టిప్పర్లను సీజ్ చేయించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎర్రగుంట్ల సీఐ నరేశ్బాబు అల్ట్రా టెక్ పరిశ్రమకు ముడిఖనిజం సరఫరా చేసే ఐదు టిప్పర్లను అధిక లోడు పేరిట సోమవారం సీజ్ చేశారు.దీంతో ట్రాన్స్పోర్టర్ సిమెంట్ పరిశ్రమకు ముడి ఖనిజం సరఫరా నిలిపేశారు. ఆపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రధాన అనుచరుడు, మండల బీజేపీ ఇన్చార్జి మధుసూదనరెడ్డి సతీమణి పేరిట నిర్వహిస్తున్న ప్యాకింగ్ ప్లాంట్ పనులు నిలిపేశారు. యాజమాన్యంతో నిమిత్తం లేకుండా 40 మంది కార్మికులను పనుల నుంచి వెనక్కి పిలిపించారు. దీంతో సిమెంట్ సరఫరా చేసే ట్రాన్స్పోర్టు లారీలు ఆగిపోగా.. సిమెంట్ ఉత్పత్తి సైతం నిలిచిపోయింది. 40 ఏళ్లలో తొలిసారి టిప్పర్లు సీజ్ 40 ఏళ్లలో సిమెంట్ పరిశ్రమలకు ముడి ఖనిజం సరఫరా చేసే టిప్పర్లు అధిక లోడుతో వెళ్తున్నాయన్న ఆరోపణలు కూడా లేవు. గత ఏడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన సీఐ సోమవారం హఠాత్తుగా ఐదు టిప్పర్లను సీజ్ చేశారు. దీనివెనుక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఉన్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్యాకింగ్ ప్లాంట్ నిలిపేయడం పరిశ్రమ యాజమాన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టడమేనని పలువురు విమర్శిస్తున్నారు.చేతులెత్తేసిన కలెక్టర్ అల్ట్రా టెక్ పరిశ్రమలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వలేదని, కాలుష్య నియంత్రణ సక్రమంగా లేదని, చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదనే వంకతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన అనుచరుల ద్వారా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు ఫిర్యాదు చేయించారు. వాస్తవంగా అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో 89 శాతం మంది ఉద్యోగులు స్థానికులే ఉన్నారని సమాచారం. మరోవైపు నష్టాల్లో ఉండటంతో ఈ పరిశ్రమను ఐసీఎల్ యాజమాన్యం అల్ట్రా టెక్ సంస్థకు అప్పజెప్పింది. కాలుష్య నియంత్రణ సక్రమంగా పాటిస్తున్నామని పరిశ్రమ ప్రతినిధులు వివరిస్తున్నా కలెక్టర్ శ్రీధర్ నుంచి స్పందన లేదు. తానేమీ చేయలేనంటూ చేతులెత్తిసినట్లు సమాచారం. క్షమాపణ చెప్పకుంటే నీ దందాలు బయటపెడతా టీడీపీ అధ్యక్షుడు పల్లాకు తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్ హెచ్చరిక ఎంవీపీకాలనీ(విశాఖపట్నం): తనను బహిరంగంగా దూషించడంతోపాటు అవమానానికి గురిచేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ చేశారు. లేకుంటే ఆయన దందాలను, సెటిల్మెంట్లను బయటపెతానని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓ సమస్య విషయమై ఇటీవల పల్లా శ్రీనివాస్ను కలవడానికి వెళ్లగా వ్యక్తిగతంగా తనను అవమానపరిచినట్లు బీవీ రామ్ పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ కోసం విశేషకృషి చేసిన తననే అవమానిస్తే మిగతా నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై పలువురు టీడీపీ ముఖ్యనాయకులతోపాటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈనెల 29లోపు పల్లా శ్రీనివాస్ క్షమాపణలు చెప్పకపోతే అధికార మదంతో విర్రవీగుతున్న అతడి భూదందాలు, సెటిల్మెంట్లు ఇతర అక్రమాలను బయట పెడతానని స్పష్టం చేశారు. -
మద్యం మసి పూసి.. సిట్ పోలీసుల ‘కసి’
సాక్షి, అమరావతి: అక్రమ కేసులు నమోదు చేయడం..లేని ఆధారాలు సృష్టించేందుకు బెదిరింపులు, వేధింపులకు పాల్పడడమే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక విధానంగా మారింది. రెడ్ బుక్ కుట్రలను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దల కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తూ బరితెగిస్తున్నారు. ఇందులోభాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ పన్నాగం పరాకాష్టకు చేరింది. ఈ అక్రమ కేసులో సాక్షిగా విచారణకు పిలిచిన రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు సోమవారం హైదరాబాద్లో అరెస్టు చేయడమే దీనికి తాజా నిదర్శనం. విజయవాడలో సిట్ అధికారుల ఎదుట మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పిన ఆయనను హడావుడిగా అరెస్టు చేయడం వెనుక పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమవుతోంది. గోవా నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలోనే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పినా వినిపించుకోకుండా తమ వాహనంలోకి ఎక్కించి విజయవాడకు తరలించారు. ఓ వైపు న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ సిట్ అధికారుల రాజ్ కసిరెడ్డిని హడావుడిగా అరెస్టు చేయడం వెనుక అసలు పన్నాగం ఇలా ఉంది. విచారణకు వస్తానంటే అరెస్టు ఏమిటో...? రెడ్బుక్ కక్ష సాధింపే తప్ప మరొకటి తమ ఉద్దేశం కాదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ కేసులో రాజ్ కసిరెడ్డిని సోమవారం హడావుడిగా అరెస్టు చేసిన తీరే అందుకు నిదర్శనం. మంగళవారం సిట్ విచారణకు హాజరవుతానని ఆయన సోమవారం మధ్యాహ్నం ఆడియో సందేశం విడుదల చేశారు. అయినా సోమవారం సాయంత్రం హడావుడిగా హైదరాబాద్లో అరెస్టు చేయల్సిన అవసరం ఏమిటి? అంటే ఆయనను విచారించడం.. వాస్తవాలు తెలుసుకోవడం తమ లక్ష్యం కాదని సిట్ తన చేతల ద్వారా వెల్లడించింది. అరెస్టు చేసి వేధించి.. ప్రభుత్వ రెడ్బుక్ కుట్రకు అనుకూలంగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే తమ అసలు కుట్ర అని తేల్చిచెప్పింది. రాజ్ కసిరెడ్డి విషయంలో సిట్ మొదటి నుంచీ అదే కుతంత్రంతో వ్యవహరిస్తోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాలని ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటంబ సభ్యులకు నోటీసులు అందించారు. తనను ఏ విషయంలో విచారించాలని భావిస్తున్నారో తెలియజేస్తే తగిన సమాచారంతో వస్తానని ఆయన సిట్ అధికారులకు ఈ–మెయిల్ ద్వారా తెలిపారు. కానీ, ఆయన అడిగిన సమాచారం ఇవ్వకుండా వెంటనే మరోసారి ఈ–మెయిల్ ద్వారా నోటీసులు పంపడం గమనార్హం. దాంతో రాజ్ కసిరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు నిర్ణయం అనంతరం విచారణకు స్వయంగా వస్తానని.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రెండు రోజుల క్రితం ఓ ఆడియో సందేశం పంపించారు. ఇంతలో న్యాయ ప్రక్రియకు కాస్త సమయం పడుతుండటంతో ఇక తానే మంగళవారం విచారణకు వచ్చి పూర్తిగా సహకరిస్తానని సోమవారం తెలిపారు. అంటే మంగళవారం ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వస్తారని తెలుసు. మరి రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్లో సోమవారమే అరెస్టు చేయల్సిన అవసరం ఏమొచ్చింది? న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం ఈ అంశం ప్రసుతం న్యాయస్థానం పరిధిలో ఉంది కూడా. తనకు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు ప్రస్తుతం ఆయా న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. మరోవైపు విచారణకు హాజరవుతాను.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రాజ్ కసిరెడ్డి చెప్పారు. అయినా సరే అరెస్టు చేయడం గమనార్హం. దీని వెనుక పోలీసుల పక్కా కుట్ర ఉందన్నది సుస్పష్టం బెదిరించి లొంగదీసుకునేందకునా..! ఇప్పటికే కుటంబు సభ్యులను తీవ్రంగా వేధించిన సిట్ రెడ్బుక్ కుట్రకు అనుకూలంగా రాజ్ కసిరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే సిట్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఆయనను హడావుడిగా అరెస్టు చేసింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సోమవారం అర్ధరాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తీసుకువచ్చారు. సిట్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబు ఆ సమయంలో కార్యాలయంలోనే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజాము వరకు ఆయనను బెదిరించి పూర్తిగా తమకు అనుకూలంగా లొంగదీసుకోవడమే సిట్ ప్రస్తుత లక్ష్యం. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులను సిట్ అధికారులు కొన్ని రోజులుగా తీవ్రంగా వేధించి బెంబేలెత్తించారు. హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి నివాసానికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు సమీప బంధువులను కూడా బెదిరించి వేధించారు. ఆయన సన్నిహితుడు, ఎరేట్ హాస్పిటల్స్ అధినేత విజేయంద్రరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు. ఈ విధంగా రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితులు అందరినీ లక్ష్యంగా చేసుకుని పోలీసులు తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి పైనే పూర్తి స్థాయిలో పోలీసు మార్క్ ప్రతాపం చూపించనున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయనను బెదిరిస్తున్నట్టు సమచారం. మొదటినుంచీ సిట్ తీరు అంతే.. అక్రమ కేసులో లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ మొదటి నుంచి కూడా దండనీతినే నమ్ముకుంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రస్థాయిలో వేధించి సాధించింది. సిట్ అధికారుల బెదిరింపులపై ఆయన మూడు సార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా సరే సిట్ తీరు మాత్రం మారలేదు. వాసుదేవరెడ్డిని మూడు రోజుల పాటు గుర్తు తెలియని ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించి మరీ వేధించింది. తద్వారా తాము చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా ఒప్పించింది. వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఆయనను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్, చిరుద్యోగి అనూషను కూడా సిట్ అధికారులు వేధించి బెదిరించి వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇక విజయ సాయిరెడ్డి ఎంపీగా మరో మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా సరే కేవలం టీడీపీకి కూటమికి రాజ్యసభలో ప్రయోజనం కలిగించేందుకే రాజీనామా చేశారు. ఉప ఎన్నిక నిర్వహిస్తే ఆ సీటు గెలుచుకునేందుకు వైఎస్సార్సీపీకి తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేదని తెలిసినా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కేవలం చంద్రబాబు కుట్రలో భాగమే. అసలు ఎలాంటి కుంభకోణం జరగనే లేదని విజయసాయిరెడ్డే సిట్ విచారణ అనంతరం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా సరే అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి సిట్ అధికారులు బరితెగించి బెదిరింపులకు పాల్పడుతూ అధికారికంగా గూండాగిరీకి తెగిస్తున్నారు. కుట్రతోనే వక్రీకరణ ప్రైవేట్ కంపెనీల వ్యవహారంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎలాంటి అవినీతి లేని ఈ వ్యవహారంలో నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ కొత్త కొత్త కట్టుకథలను తెరపైకి తెస్తోంది. అదాన్ డిస్టిలరీల ఏర్పాటుకు రూ.100 కోట్ల అప్పు ఇప్పించడం అంటూ వినిపించిన కథ తాజా వక్రీకరణ. తన అల్లుడు కుటుంబానికి చెందిన అరబిందో కంపెనీ అదాన్ డిస్టిలరీ ఏర్పాటునకు రూ.100 కోట్లు అప్పు ఇచ్చిందని విజయసాయిరెడ్డి చెప్పారు. అంటే అరబిందో కంపెనీ అప్పు ఇచ్చింది. అదాన్ డిస్టిలరీస్ తీసుకుంది. అది రెండు కంపెనీల మధ్య వ్యవహారం. దేశంలో ఎన్నో ప్రైవేటు కంపెనీల మధ్య అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం సర్వసాధారణం. దానిపై ఆ రెండు కంపెనీల్లో ఎవరూ కూడా ఫిర్యాదు చేయనే లేదు. మరి ఆ వ్యవహారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం ? ఆ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ ఈ కేసుకు ముడిపెట్టాలని యత్నించడం హాస్యాస్పదంగా ఉంది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే.. దర్యాప్తు పేరిట సిట్ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మరి మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి..? ఇవ్వవనే ఇవ్వవు. ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసును కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. అసలు లేని కుంభకోణంపై అక్రమ కేసు నమోదు చేసి రాజ్ కసిరెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతుండడం గమనార్హం. ఆయన కేవలం కొంత కాలం అదీ కోవిడ్ వ్యాప్తి ఉన్న రోజుల్లో పరిశ్రమల శాఖ సలహాదారుగా మాత్రమే వ్యవహరించారు. ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెన్యువల్ కూడా చేయనే లేదు. రాజ్ కసిరెడ్డికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానానికి ఎలాంటి సంబంధమే లేదు. -
చట్టం అంటే లెక్క లేదా?: హైకోర్టు
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని బేఖాతర్ చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకు మించి మాకు ఏదీ ముఖ్యం కాదు. ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించినా పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్కచేయడం లేదు. పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికా? లేక దాన్ని ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులను వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? ఇలా చేయమని ఏ చట్టం మీకు చెబుతోంది? పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? – హైకోర్టుసాక్షి, అమరావతి: రెడ్బుక్ అరాచకాలకు కొమ్ము కాస్తూ రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, సిట్ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని బేఖాతర్ చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు మించి తమకు ఏదీ ముఖ్యం కాదని, ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించినా పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్కచేయడం లేదని మండిపడింది. ‘‘పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికా? లేక దాన్ని ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులను వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? ఇలా చేయమని ఏ చట్టం మీకు చెబుతోంది? పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? దర్యాప్తు అధికారినే మా ముందుకు రమ్మనండి.. చట్టం ఏం చెబుతుందో ఆయన్ను అడిగి తెలుసుకుంటాం. సిట్లోని అధికారులు వారికి వారు చాలా పెద్దవాళ్లం.. శక్తిమంతులం అని అనుకుంటున్నారు. శక్తిమంతులం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారు. చట్టం అవసరం లేదు.. అధికారమే ముఖ్యమని అనుకుంటున్నారు. ఒంటిపై యూనిఫాం ఉంది కదా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఆలోచనలో ఉన్నారు. సిట్ అదనపు ఎస్పీ ఎవరు కావాలంటే వారిని తీసుకొచ్చేస్తారా? పోలీసుల వ్యవహారశైలి అత్యంత దురదృష్టకరం’’ అని సోమవారం ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సాక్షిగా ఓ వృద్ధుడిని విచారించాలంటే చట్టం ఏం చెబుతుందో మీకు తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆయన్ను సిట్ అదనపు ఎస్పీ తిరుపతి నుంచి విజయవాడకు ఎందుకు పిలిపించాల్సి వచ్చిందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో దర్యాప్తు అధికారి శ్రీహరిబాబుని సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావుల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ దర్యాప్తు అధికారిపై నిప్పులు.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతున్న తీరు, పోలీసుల దుర్మార్గ పోకడను తిరుపతికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, విశ్రాంత పోలీసు అధికారి సుబ్రహ్మణ్యంరెడ్డి హైకోర్టుకు పూసగుచి్చనట్లు నివేదించారు. కేసు ఏమిటి? నేరం ఏమిటి? అనే విషయాలను చెప్పకుండా తనను అర్ధరాత్రి తిరుపతి నుంచి విజయవాడకు ఆగమేఘాలపై తరలించిన పోలీసులు విచారణ పేరుతో దారుణంగా వ్యవహరించారని హైకోర్టుకు మొర పెట్టుకున్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న తన భార్యకు కనీసం మందులు కొనేంత వరకైనా ఆగాలని ప్రాథేయపడినా వినకుండా బలవంతంగా తరలించారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. పదోన్నతి కూడా వద్దనుకుని భార్యకు సపర్యలు చేస్తూ ఇంటి వద్ద ఉంటున్న తన పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. తానేదో నేరం చేసినట్లు ఇంటి వద్ద మోహరించారన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ముఖ్యంగా దర్యాప్తు అధికారి (ఐవో) విచారణ పేరుతో తనను బంధించి చిత్రహింసలు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించి తనను తీవ్ర భయభాంత్రులకు గురి చేశారన్నారు. ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడి నుంచి వచ్చి తన వెంటపడతారోనని భయంగా ఉందన్నారు. సుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సిట్ దర్యాప్తు అధికారి, అదనపు ఎస్పీతో పాటు ఇతర పోలీసులపై నిప్పులు చెరిగింది. ‘అసలు ఏం కేసు ఉందని సుబ్రహ్మణ్యంరెడ్డిని తిరుపతి నుంచి విజయవాడకు పిలిపించారు. ఆయన ఏ కేసులోనూ నిందితుడు కారు. అలాంటప్పుడు ఆయన పట్ల దురుసుగా ఎందుకు ప్రవర్తించినట్లు? అధికారం ఉంది కాబట్టి చేశామంటారా? అదే విషయం చెప్పండి.. ఏం చేయాలో మాకు బాగా తెలుసు...’ అని న్యాయస్థానం మండిపడింది. బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ రాత్రి 11.50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లడంపై వైఎస్సార్సీపీ నేత మేకా వెంకటరామిరెడ్డి గత వారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం ఆదేశాల మేరకు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి స్వయంగా కోర్టు ముందు హాజరై వాస్తవాలను నివేదించారు. ‘పోలీసు వాహనంలో నన్ను విజయవాడ కమిషనర్ వద్దకు తరలించి నా మొబైల్ లాక్కున్నారు. సిట్ అదనపు ఎస్పీ నన్ను దూషించారు. బంధించి హింసలు పెట్టారు. ముందు రోజే నోటీసులు ఇచి్చనట్లు ఆ తేదీ వేసి నన్ను సంతకం చేయమన్నారు. కాపీ మాత్రం ఇవ్వలేదు. తెల్ల కాగితాలపై నా సంతకాలు తీసుకున్నారు..’ అని కోర్టుకు విన్నవించారు.ఆటిట్యూడ్ చూపితే ఏం చేయాలో తెలుసు...బాలసుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచితేనే వాటికి సమాధానం ఇవ్వడం సాధ్యమవుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) పేర్కొనటంపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ న్యాయవాది నుంచి తాము ఇలాంటి తీరును ఆశించడం లేదని స్పష్టం చేసింది. అఫిడవిట్ దాఖలు చేస్తేనే స్పందిస్తామంటే ఆ దిశగా ఆదేశాలు ఇస్తామని, ఆ అఫిడవిట్కు వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి తేల్చి చెప్పింది. ఇలాంటి ఆటిట్యూడ్ చూపిస్తే ఏం చేయాలో తమకు తెలుసునంది. బాలసుబ్రహ్మణ్యంరెడ్డి ఇంటి వద్ద ఉన్న పోలీసులెవరని ప్రశ్నించగా ఎస్జీపీ వారి పేర్లను తెలిపారు. అసలు ఇదంతా చేయమని వెనకుండి ఎవరు చెబుతున్నారో వారిని ముందుకు రమ్మనండని, చట్టం గురించి వారితోనే మాట్లాడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరమైతే ఈ కేసులో తామే ట్రయల్ కూడా నిర్వహిస్తామని, సుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలను వాంగ్మూలంగా తామే నమోదు చేస్తామంది. ఈ సమయంలో పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్ స్పందిస్తూ, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179ని చదివి వినిపించారు. ఈ సెక్షన్ ప్రకారం 60 ఏళ్ల పైబడిన వారిని వారి ఇంటి వద్దనే విచారించాల్సి ఉంటుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పోలీసులు దురుద్దేశంతో, బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని వివరించారు. చట్టం అంటే గౌరవమే లేదని, చట్ట నిబంధనలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని పోలీసులను ఉద్దేశించి ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. దర్యాప్తు పేరుతో ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. 18-12-2024..మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు..‘సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు చూపలేదు. అయినా కింది కోర్టు మెజిస్ట్రేట్ ఆధారాలున్నాయనడం తప్పు. మెజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా, యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులిచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో అరెస్ట్కు గల కారణాలను చెప్పలేదు..’ – సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకట రమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్ను రద్దు చేయాలని కోరుతూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.06-01-2025కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా..?‘సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రరెడ్డి నిర్బంధానికి సంబంధించి మేం అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వాలి. రవీంద్రరెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు? ఎప్పుడు అరెస్ట్ చూపారు? ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు కావాలి. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి మా ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా? కడప ఎస్పీ తీరు చూస్తుంటే అలాగే ఉంది. ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి..!’ – వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధంపై ఆయన భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు18-02-2025..లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు?‘వ్యక్తులపై కేసులు పెట్టడం.. వారిని కొట్టడం.. లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు? కేసులు పెట్టి లోపల వేయడం మినహా ఏ కేసులోనూ దర్యాప్తు చేయడం లేదు. కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. బొసా రమణ అనే వ్యక్తి అరెస్ట్ విషయంలో దర్యాప్తు చేసి ఉంటే ఆ వివరాలను మా ముందు ఉంచేవారు. దర్యాప్తు చేయలేదు కాబట్టే ఏ వివరాలను సమర్పించలేదు. అతడిపై 27 కేసులున్నాయని చెబుతున్నారు. కానీ ఆ కేసుల దర్యాప్తు వివరాలను మా ముందు ఉంచడంలేదు. మా ఆదేశాలపై డీజీపీ ఏ చర్యలు తీసుకున్నారు..?’ – విశాఖకు చెందిన బొసా రమణ అరెస్టుపై ఆయన భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు25-02-2025పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు..‘పోలీసులు వాస్తవాలను దాచి పెడుతూ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. బొసా రమణ అరెస్టు విషయంలో డీజీపీ నివేదిక ఇస్తారని ఆశించాం. కానీ ఎలాంటి నివేదిక రాలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని డీజీపీని నివేదిక కోరాం. డీజీపీ పోస్టుపై ఉన్న గౌరవంతో వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వలేదు. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తామని డీజీపీ భావిస్తే అలాగే ఆదేశాలు ఇస్తాం. రమణ అరెస్టు విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం జిల్లా కలెక్టర్ నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి...’ – బొసా రమణ భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.11-03-2025‘పౌరుల స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం..‘పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే ఊరుకోం. ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు. రుజువు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా? తాము చట్టం కంటే ఎక్కువని పోలీసులు భావిస్తున్నారు. చిన్న తప్పులేనని వదిలేస్తే.. రేపు కోర్టులకు వచ్చి మరీ అరెస్టు చేస్తారు. ప్రతి దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారు..’– సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్రెడ్డికి కింది కోర్టు విధించిన రిమాండ్ చట్ట విరుద్ధమని కొట్టివేసిన సందర్భంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు25-03-2025హద్దు మీరొద్దు ‘తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరుగుతోంది. – మాదిగ మహాసేన అధ్యక్షుడు ప్రేమ్కుమార్ అరెస్ట్పై హైకోర్టు వ్యాఖ్యలు10-04-2025ఇది ధిక్కారమే... హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండా పోయింది. సెక్షన్ 111ను ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడమంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లే. ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? అంటే ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నట్లు కాదా?’ – పోసాని కృష్ణ మురళిపై కేసు విచారణలో హైకోర్టు న్యాయమూర్తి -
కూటమి పాలనలో దళితులపై పెచ్చరిల్లుతున్న దాడులు
సాక్షి, అమరావతి: కూటమి పాలనలో దళితులపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లుతున్నాయని దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్ జగన్ను మరోసారి సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు.కూటమి పాలనలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను అంటరాని వారిగా చూస్తున్నారని చెప్పారు. అణగారిన వర్గాలకు పూర్తిగా న్యాయం చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్దేనన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఐదుగురు దళితులకు క్యాబినెట్లో చోటు కలి్పంచిన ఘనత జగన్ది అన్నారు. మాల, మాదిగలు కలిసే ఉన్నారు రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ మాల, మాదిగలు విడిపోయారని కూటమి నేతలు పగటి కలలు కంటున్నారని, కాని కలిసే ఉన్నారని చెప్పారు. ఇకపై మాల, మాదిగలు కలిసి వైఎస్ జగన్ నేతృత్వంలో పేదల ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణంలో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన పద్ధతులపై ప్రసంగించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. జగనన్న అణగారిన వర్గాలకు అండగా ఉంటే.. చంద్రబాబు మాత్రం అణగదొక్కుతున్నారన్నారు.మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళితులకు దక్కిన గౌరవాన్ని జీరి్ణంచుకోలేక కూటమి పార్టీలు అసత్య ప్రచారం చేశాయని, దళితులకు అత్యున్నత గౌరవం ఇచ్చిన వైఎస్సార్సీపీని బలోపేతం చేసుకుందామన్నారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీల జీవితాలు మార్చడానికి జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలు ఎవరూ మరిచిపోరన్నారు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై దళిత నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, తలారి వెంకట్రావు, కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, కైలే అనిల్కుమార్, అలజంగి జోగారావు, పార్టీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్రావు మాట్లాడారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. జనం మధ్య ఉందాం: సజ్జల సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా వైఎస్ జగన్ పాలన చేశారని గుర్తు చేశారు. కలలు కనడం కాదని, వాటిని ఆచరణలోకి తీసుకురావాలని ఒక్క జగన్ మాత్రమే భావించారని, అసమానతలు ఉన్న సమాజాన్ని ఐదేళ్లలో సమాన స్థాయికి తీసుకొచ్చారన్నారు. వైఎస్సార్సీపీ పేదల పక్షమని గుండెమీద చెయి వేసుకుని చెప్పగలిగిన ధైర్యాన్ని అందరికీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకోవడం, సంస్థాగతంగా బలోపేతం అవడంపై దృష్టి పెడదామని పిలుపునిచ్చారు. -
ఉర్సాకు భూకేటాయింపులపై నిరసన
సాక్షి, అమరావతి/మధురవాడ(విశాఖ): ఊరూపేరూ లేని, కనీసం అడ్రస్ కూడా లేని ఉర్సా(Ursa) క్లస్టర్స్ అనే ఉత్తుత్తి కంపెనీకి విశాఖ ఐటీ సెజ్ మధురవాడ హిల్–3లో రూ.3 వేల కోట్ల విలువైన భూములు కేటాయించడంపై వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి. ఈ భూకేటాయింపులను రద్దు చేయకపోతే తీవ్ర నిరసన తప్పదని హెచ్చరించాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.లేకపోతే విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల అధ్వర్యంలో ప్రజా ఉద్యమం తప్పదంటూ హెచ్చరించాయి. ఉర్సాకు కేటాయించిన భూముల్లో బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. ఖబడ్దార్ లోకేశ్, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, ప్రభుత్వ భూములను రక్షించాలంటూ నేతలు నినదించారు. భూముల ధారాదత్తం ఆపాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఊరూపేరూ లేని ఉర్సా క్లస్టర్స్కు కేటాయించిన భూములను వెంటనే రద్దు చేయాలి. ఐటీలో ఎలాంటి అనుభవం, చరిత్ర లేని, నిన్నమొన్న ప్రారంభించిన కంపెనీకి ఉచితంగా 60 ఎకరాలు ఎలా కట్టబెడతారు? డొల్ల కంపెనీ ‘ఉర్సా’కు భూ కేటాయింపు తగదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డొల్ల కంపెనీ ‘ఉర్సా’కు రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా కేటాయించడం తగదు. ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ భూములు ధారాదత్తం చేయడం సరికాదు. రెండు నెలల క్రితం హైదరాబాద్లో ఉత్పత్తి కంపెనీగా రిజిస్టరైన ఊరూ పేరూ లేని ఉర్సా క్లస్టర్స్ అనే ఒక ఐటీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో దాదాపు రూ.3వేల కోట్ల విలువైన 60 ఎకరాల భూమిని కేవలం 99పైసలకే కట్టబెట్టడం తీవ్ర ఆక్షేపణీయం. రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమమే.. జన జాగరణ సమితి రాష్ట్ర కన్వినర్ ఎస్ఎల్ఎన్ వాసు ఉర్సాకు కేటాయించిన విలువైన భూములు వెంటనే రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదు. రూ.3 వేల కోట్లు విలువ చేసే 60 ఎకరాల భూమిని మంత్రి లోకేశ్ ఉత్తుత్తి కంపెనీకి ఎలా కట్టబెట్టే యత్నం చేస్తారు? ఇప్పటికే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కబ్జాకోరు అనే పేరుంది. ఆయన రికార్డును మంత్రి లోకేశ్ తిరగరాయాలని చూస్తున్నట్లుంది.ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఎంత వరకైనా వెళ్లడానికి మాతోపాటు ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. ఉర్సా కంపెనీని రెండు నెలల క్రితమే ఏర్పాటు చేశారు. దీనికి కనీసం అడ్రస్, ఫోన్ నంబర్ కూడా లేవు. ఎక్కడా ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటి కంపెనీకి ఇంత విలువైన భూములు ఎలా ఇచ్చేస్తారు? విశాఖ వాసులు హర్షించరు టీసీఎస్కి 21 ఎకరాలు ఇచ్చినట్టు చూపించి దాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఉత్తుత్తి కంపెనీకి రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కారు చౌకగా ఇచ్చేస్తోంది. ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకునే ఎత్తుగడగా దీనిని మేం చూస్తున్నాం. ఇలా పంచుకుంటూ పోతే విశాఖలో భూములు మిగలవు. దీన్ని విశాఖ వాసులు హర్షించరు. ప్రభుత్వ పాలన ముగిసేలోపు మొత్తం ఖాళీ చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. – చింతపల్లి సునీల్కుమార్, విశాఖ నగర కన్వినర్99 పైసలకే మొత్తం 21.16 ఎకరాలు విశాఖ ఐటీ హిల్ నంబర్–3లో టీసీఎస్కు భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ సాక్షి, అమరావతి: టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్ (టీసీఎస్)కు విశాఖపట్నంలోని ఐటీ హిల్ నంబర్–3లో 21.16 ఎకరాలను కేవలం 99 పైసలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)ని భూమి కేటాయించాలని సూచిస్తూ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐదారేళ్లలో క్యాంపస్ను అభివృద్ధి చేయడానికి 20 నుంచి 25 ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని టీసీఎస్ కోరింది.కారు చౌకగా భూములు కేటాయించమని అడగకపోయినా ఐటీ కంపెనీల ఆకర్షణ పేరుతో మొత్తం 21.16 ఎకరాలను కేవలం 99 పైసలకే ప్రభుత్వం అప్పగించేసింది. ఏకంగా మొత్తం అన్ని ఎకరాలు 99 పైసలకే అంటూ ఉత్తర్వులు ఇవ్వడంతో సామాజిక మాధ్యమాల్లో మరోమారు టీసీఎస్కు భూ కేటాయింపులు పెద్ద చర్చకు దారితీశాయి.టీసీఎస్ ముసుగులో వేరే ఇతర అనామక కంపెనీలకు కారుచౌకగా భూములు కేటాయించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశంలో ఎక్కడా టీసీఎస్ భూములను ఉచితంగా ఇవ్వమని అడిగిన దాఖలాలు లేవని, ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పుడు టీసీఎస్ బ్రాండ్పై కూడా నీలినీడలు కమ్ముకునే ప్రమాదం ఉందని అంటున్నారు. -
నేడు వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. -
Andhra Pradesh: రేపు పదో తరగతి ఫలితాలు
సాక్షి, అమరావతి: మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు, ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటరీ్మడియెట్ ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయారామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్సైట్లతోపాటు ‘మనమిత్ర’ (వాట్సాప్), లీప్ (ఎల్ఈఏపీ) మొబైల్ యాప్లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ద్యార్థులు వాట్సాప్లో 9552300009 నంబర్కు ‘హాయ్’ అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, విద్యార్థి హాల్టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. లీప్ మొబైల్ యాప్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించినట్టు తెలిపారు. -
55 మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్లకు షోకాజ్ నోటీసులు
సాక్షి, అమరావతి: ఇంటర్మిడియెట్ ఫలితాల్లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించని మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్లకు వేధింపులు మొదలయ్యాయి. మొత్తం 55 ఏపీ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లతోపాటు వాటిలో పనిచేస్తున్న టీచర్లకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేగింది. రాష్ట్రంలో 164 ఏపీ మోడల్ స్కూళ్లు ఉండగా, 163 స్కూళ్లల్లో ఇంటర్మిడియెట్ ఉంది.ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 75 శాతం కాగా, 55 మోడల్ సూళ్లలో దానికన్నా తక్కువగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ‘ప్రిన్సిపాళ్లు, సబ్జెక్ట్ టీచర్లకు విద్యా సమీక్ష సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేసినా 55 పాఠశాలలు 75 శాతం కంటే తక్కువగా ఉత్తీర్ణత శాతం సాధించడం ఏమిటి? దీనిపై మూడు రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలి. అలాగే, తదుపరి తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలి..’ అని సోమవారం ఉన్నతాధికారులు ఆయా స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్లకు నోటీసులు పంపించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో ఫలితాలు మెరుగుపరిచేందుకు ఏపీ మోడల్ సూళ్లలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఈ విధుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే వివరణ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేయడంపై ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. భయాందోళనలకు గురిచేయొద్దు: ఏపీటీఎఫ్ అమరావతి సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను భయాందోళనలకు గురి చేయవద్దని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ విద్యాశాఖను కోరారు. ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండటానికి గల కారణాలను విశ్లేషి చాలని ఆయన సూచించారు. -
3 నుంచి గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 3 నుంచి 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలుంటాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు ప్రకటించారు. హాల్టికెట్లను https://psc.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.సొంతంగా సహాయకులను ఎంపిక చేసుకున్న దివ్యాంగులు స్క్రైబ్ వివరాలు, సర్టీఫికెట్లను పరీక్షలు ప్రారంభానికి 5 రోజుల ముందే ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. -
మహిళామణులు
తరాలు మారాయి. అంతరాలు పోతున్నాయి. ఒకప్పుడు మహిళలంటే.. వంటింటికే పరిమితమని.. నాయకత్వ బాధ్యతలకు పనికిరారని ఉండేవన్నీ అపోహలే అని తేలిపోతోంది. ‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే.. ముద్దార నేర్పించినన్..’ అన్నది రుజువవుతోంది. పదుగురికీ ఉపాధి కల్పించే సంస్థల్లో నాయకత్వ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ఒకరు ఇద్దరుగా.. ఇద్దరు నలుగురిగా.. మొదలైన మహిళల ప్రస్థానం నేడు అక్షరాలా లక్షల్లోకి చేరింది. సాక్షి,అమరావతి: దేశంలో అన్ని రంగాల్లోని కంపెనీల్లో మహిళల విశిష్ట పాత్ర పెరుగుతోంది. కంపెనీల్లో మేనేజర్ నుంచి కంపెనీ డైరెక్టర్లు, అత్యున్నత స్థాయిలోనూ రాణిస్తున్నారు. 2017 నుంచి 2025 వరకు దేశంలోని కంపెనీల కీలక స్థానాల్లో మహిళల పాత్ర పెరుగుదలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విశ్లేíÙంచింది. ‘మహిళలు–పురుషులు–2024’ నివేదికలో ఆ వివరాలు వెల్లడించింది. కంపెనీ బోర్డు డైరెక్టర్ల పదవుల్లో 2017లో 4.47 లక్షల మంది మహిళలుండగా, 2025 నాటికి ఈ సంఖ్య 9.08 లక్షలకు పెరిగినట్లు ఈ నివేదిక తెలిపింది.సీనియర్ మేనేజ్మెంట్ పదవుల్లో 2017లో 23 వేల మంది మహిళలుండగా 2025 నాటికి 38 వేలకు పెరిగారు. ఇతర నిర్వహణ పదవుల్లో 2017లో 4.32 లక్షల మంది మహిళలుండగా 2025 నాటికి 8.83 లక్షలకు పెరిగారు. ఇతర సీనియర్ నిర్వహణ పదవుల్లో పురుషులు, మహిళల నిష్పత్తి 2017లో 1:0.36 ఉండగా 2025 నాటికి 0.41కి పెరిగింది. బోర్డు డైరెక్టర్ల పదవుల్లో మహిళల నిష్పత్తి 0.35 నుంచి 0.40కి పెరిగింది. ఈ పదవుల్లో మహిళల నిష్పత్తి 0.16 నుంచి 0.20 మాత్రమే పెరిగింది. ఇక్కడ లింగ అంతరాలను మరింత తగ్గించాల్సి ఉందని నివేదిక పేర్కొంది.ఈ ఎంఎస్ఎంఈలకు మహిళలే మహారాణులుదేశంలోని ఎంఎస్ఎంఈల్లో ‘ఉద్యమ్’ పోర్టల్లో నమోదైన వాటిలో 2020 జులై 1 నుంచి 2024 సెప్టెంబరు 31 నాటికి.. మహిళలు యజమానులుగా ఉన్నవి 66,61,675. వీటిలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులు 4.05 కోట్లకుపైనే. మహిళా శక్తికి ఇదొక నిదర్శనం. ఈ ఎంఎస్ఎంఈల్లో 25 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్న రాష్ట్రాలు 7 మాత్రమే. అందులో దక్షిణాది రాష్ట్రాలే 4 ఉండటం విశేషం. -
ఏపీలో టెన్త్ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్
అమరావతి: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఎల్లుండి(బుధవారం) పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది ఏపీ ఎస్ఎస్సీ బోర్డు. బుధవారం ఉదయం గం. 10ల.కు పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీనే పలితాలను విడుదల చేసే అవకాశం ఉందని భావించారు. కానీ దాన్ని ఒకరోజు వెనక్కి పొడిగించారు. రంజాన్ సందర్భంగా టెన్త్ క్లాస్ చివరి పరీక్షను ఒక రోజు వెనక్కి జరపిన కారణంగా ఫలితాల విడుదలను కూడా రోజు వెనక్కి జరిపినట్లు తెలుస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ పరీక్షలు జరిగాయి. 2024–25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. -
‘కూటమి ప్రభుత్వంలో ధర్మ పరిరక్షణ కరువైంది’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ అనేది కరువైందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు.. ‘హిందూధర్మంపై నిత్యం దాడి జరుగుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే తిరుమల లడ్డూ గురించి విషప్రచారం చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు సరైన ఏర్పాట్లు చేయకుండా ఆరుగురు భక్తుల మరణానికి కారకులయ్యారు. కాశీనాయన దివ్యక్షేత్రంలో గోశాల, అన్నదాన సత్రాలను నిలువునా కూల్చేశారు. ఇప్పుడు శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడ్డాయితాబేళ్ల సంరక్షనే కాదు, పార్కు నిర్వహణను కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. మా హయాంలో ఏ పొరపాట్లు జరగకపోయినా ఏదో జరిగినట్లు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు హైందవ ధర్మం మీద దాడి జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు?, కాశీనాయన క్షేత్రంలో అధికారులే వెళ్లి నిర్మాణాలను కూల్చేస్తే ఎందుకు మాట్లాడలేదు?, శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోతుంటే దేవాదాయ శాఖ ఏం చేస్తోంది?రెండు వందల తాబేళ్ల పరిరక్షణ కూడా ప్రభుత్వానికి పట్టదా? , మా హయాంలో ప్రతి తాబేలుకూ నెంబర్ ఇచ్చి వాటి పరిరక్షణ చూశాం. కానీ ఈ ప్రభుత్వం తాబేళ్లకు ఎలాంటి పోస్టుమార్టం చేయకుండా ఎలా దహనం చేస్తారు?, అసలు రాష్ట్రంలో హిందూ ధర్మం ఏమవుతోంది? , వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. శ్రీకూర్మం ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు -
పోప్ ఫ్రాన్సిస్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి
తాడేపల్లి : క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలిపారు వైఎస్ జగన్. ‘పోప్ మృతి చాలా బాధాకరం. కాథలిక్ చర్చి సమాజానికి ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన లాటిన్ అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్. శాంతి, కరుణ కోసం ప్రపంచ వ్యాప్త గొంతుకగా నిలిచిన నిజమైన మానవతావాది. పోప్ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. Saddened by the passing of Pope Francis. A transformative and influential head of the Catholic Church — the first Pope from the Latin Americas. A true humanitarian and global voice for peace and compassion. His humility and humanity touched the world.May his soul rest in eternal…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2025 కాగా క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు.ఈస్టర్ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. -
రేపు సిట్ విచారణకు హాజరవుతా: రాజ్ కేసిరెడ్డి
అమరావతి: తాను రేపు(మంగళవారం) సిట్ విచారణకు హాజరవుతున్నట్లు రాజ్ కేసిరెడ్డి వెల్లడించారు. రేపు మధ్యాహ్నం గం. 12:00ల,కు సిట్ ఆఫీసుకు వస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చానన్నారు. ఈ విషయాన్ని ఆడియో ద్వారా తెలిపారు. ఇక తన ముందస్తు బెయిల్ అంశానికి సంబంధించి హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉందని, అందుజేత సిట్ విచారణకు హజరవుతున్నట్లు పేర్కొన్నారు.రెండురోజుల క్రితం విజయసాయి రెడ్డిపై రాజ్ కేసిరెడ్డి ధ్వజమెత్తారు. విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా’ అని గత ఆడియోలో పేర్కొన్నారు రాజ్ కేసిరెడ్డి. -
2024లో భారీగా పెరిగిన వడగాడ్పులు
సాక్షి, అమరావతి: దేశంలో గతేడాది వడగాడ్పుల రోజుల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి 2024లో 554 వేడి రోజులు నమోదైనట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ గర్భ శాస్త్రాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022లో దేశంలో 467 వేడి గాలుల రోజులు నమోదుకాగా 2023లో 230 నమోదైనట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2023లో రాయలసీమలో ఒక్కరోజు మాత్రమే వేడి గాలులు నమోదుకాగా, 2024లో 16 రోజులు నమోదైనట్లు పేర్కొంది. తెలంగాణలో 2023లో 14 రోజులు, 2024లో 12 రోజులు వేడి గాలులు నమోదైనట్లు పేర్కొంది. గతేడాది అత్యధికంగా ఒడిశాలో 37 రోజులు, తూర్పు ఉత్తరప్రదేశ్లో 33 రోజులు, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో 32 రోజులు, బిహార్లో 30 రోజులు, పశ్చిమ రాజస్థాన్లో 29 రోజులు వేడి గాలులు నమోదైనట్లు తెలిపింది. వేడి గాలుల ప్రభావాన్ని తగ్గించడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ జారీ చేస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. వేసవి కాలం ప్రారంభానికి ముందుగానే జాతీయ, రాష్ట్ర స్థాయి హీట్ వేవ్ సంసిద్ధత సమావేశాలను నిర్వహిస్తుందని పేర్కొంది. ఎండాకాలంలో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5.4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదైతే ఆ పరిస్థితులను హీట్వేవ్గా పేర్కొంటారు. కొన్నిసార్లు అది 6.4 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉంటే దానిని తీవ్రమైన హీట్వేవ్ అంటారు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. వడగాడ్పుల రోజుకు ఐఎండీ ఇచ్చిన నిర్వచనం ప్రకారం.. ఒక రాష్ట్రంలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటిన రోజును ‘ఒక వడగాడ్పు రోజు’గా పరిగణిస్తున్నారు. ఒకే తేదీలో 10 రాష్ట్రాల్లో వడగాడ్పులు ఉంటే ‘10 వడగాడ్పు రోజులు’గా పరిగణిస్తారు. -
ఇన్చార్జిల పాలన ఇంకెన్నాళ్లు!
రాష్ట్రంలోని ఉన్నత విద్యారంగంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉన్నత విద్యామండలిపై ఉన్నత విద్యాశాఖ ఆధిపత్య పోరు కారణంగా కీలక ఫైళ్ల కదలిక ఆగిపోయింది. ఫలితంగా నెలలు గడుస్తున్నా విశ్వవిద్యాలయాలకు వైస్ చానల్సర్ల నియామకం ఎటూ తేలడంలేదు. ఫలితంగా విజ్ఞానాన్ని పంచే యూనివర్సిటీల్లో పాలన గాడి తప్పుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైస్ చాన్సలర్లపై కత్తికట్టింది. దాదాపు 17 వర్సిటీ వీసీలను ప్రభుత్వం బలవంతంగా రాజీనామా చేయించింది. ఆనక నెలలు తరబడి ఇన్చార్జిల పాలనలోనే వర్సిటీలను గాలికి వదిలేసింది. ఫలితంగా వర్సిటీల్లో బోధనాంశాలు మరుగునపడి వర్గ విభేదాలు రాజ్యమేలుతున్నాయి. – సాక్షి, అమరావతి9 వర్సిటీలపై స్పష్టత ఏదీ!?యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో అనుమతి ఇచ్చింది. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత స్రూ్కటినీలో చాలా జాప్యం చేసింది. ఈ ఏడాది జవనరిలో సెర్చ్ కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా.. ఆ కమిటీల నివేదిక ఆధారంగా ఫిబ్రవరిలో గవర్నర్ ఆమోదంతో 9 వర్సిటీలకు వీసీలను నియమించింది. ఇక్కడ 13 వర్సిటీలకు సెర్చ్ కమిటీల సమావేశాలు పూర్తయి నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. అందులో 9 వర్సిటీలకే మోక్షం లభించింది. మిగిలిన నాలుగు వర్సిటీలకు వీసీల నియామకంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని సమాచారం. తాము ఎన్నిసార్లు సంప్రదించినా స్పష్టత రావడంలేదని ఉన్నత విద్యామండలి అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే యోగి వేమన యూనివర్సిటీ వీసీగా నియమితులైన పి.ప్రకాశ్బాబు పాండిచ్చేరి సెంట్రల్ వర్సిటీకి వీసీగా అవకాశం రావడంతో ఇక్కడ రాజీనామా చేశారు. ఈ వర్సిటీతో కలుపుకుని ఇంకా ఐదు వర్సిటీలకు సెర్చ్ కమిటీ సమావేశాలు జరగాల్సి ఉంది. దాదాపు 11 నెలలు గడుస్తున్నా వర్సిటీలకు వీసీలను నియమించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం గమనార్హం. తాజాగా కర్నూలులోని క్లస్టర్ వర్సిటీ వీసీ పదవీ కాలం ముగియడంతో అక్కడ కూడా ఇన్చార్జి పాలనే నడుస్తోంది. పేరు నచ్చకపోతే ఆపేస్తారా? వీసీల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం నిబంధనలకు పాతరవేసింది. సెర్చ్ కమిటీల్లో అనర్హులకు స్థానం కల్పించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 13 వర్సిటీలకు గాను 9 వర్సిటీలకు వీసీలను నియమించింది. మిగిలిన వర్సిటీలకు వైస్ చాన్సలర్లుగా సెర్చ్ కమిటీలు సూచించిన పేర్లపై ప్రభుత్వం అయిష్టత చూపిస్తుండటంతోనే జాప్యం చేస్తున్నట్టు సమాచారం. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వానికి నచ్చిన వ్యక్తిని నియమించుకోవాలనుకుంటే సెర్చ్ కమిటీల సమావేశాలు, సిఫారసులతో అవసరం లేకుండా చేసుకోవాలని మండిపడుతున్నారు. నిపుణులతో సెర్చ్ కమిటీ వేసి అందులో తమకు నచ్చిన వారి పేర్లు సిఫారసు చేయమనడం దుర్మార్గమని విమర్శిస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ ప్రకారం వీసీలను ఎంపిక చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎంపిక సమయంలో కాకుండా నోటిఫికేషన్ సమయంలో వర్సిటీల వారీగా వీసీల పోస్టులను రోస్టర్ ప్రకారం రిజర్వ్ చేస్తే అందుకు తగ్గట్టుగానే దరఖాస్తులు చేసుకునే వారమని ఆశావహులు పేర్కొంటున్నారు.సమీక్షలే.. పురోగతి శూన్యం!ఉన్నత విద్యపై మంత్రి లోకేశ్ సమీక్షలతో సరిపెట్టడం తప్ప అందులో పురోగతి ఎక్కడా కనిపించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 11 నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో వీసీలను నియమించలేక తన అసమర్థతను బయట పెట్టుకుంటున్నారని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. మరోవైపు ఉన్నత విద్యా శాఖకు, ఉన్నత విద్యా మండలికి మధ్య కోల్డ్వార్ నడుస్తుంటే తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం గమనార్హం. వీటిన్నింటి పర్యవసానాలు ఉన్నత విద్యా వ్యవస్థను భ్రషు్టపట్టిస్తోందని విద్యావేత్తలు వాపోతున్నారు. గతంలో కంప్యూటర్ల పేరు స్మరించిన నేతలే ఇప్పుడు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పేరుతో ప్రచారం చేసుకుంటూ సాంకేతిక విద్యా సంస్థల్లోని వ్యక్తులను వీసీలుగా నియమించి గొప్పగా చేస్తున్నట్టు మభ్యపెట్టే ప్రయత్నం తప్ప వర్సిటీల్లో క్రమం తప్పకుండా జీతాలిచ్చే పరిస్థితి లేదని మేధావి వర్గం ఆరోపిస్తోంది. ప్రభుత్వానికి సాంకేతిక సహాయం కావాలంటే జేఎన్టీయూలు, తిరుపతి ఐఐటీ నుంచి తీసుకోవచ్చని, ఎక్కడో సాంకేతిక విద్యా సంస్థల్లో పని చేస్తున్నవారే కావాలని ఏరుకోరి తెచ్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
మెగా డీఎస్సీలో మెలిక!
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో కూటమి సర్కారు మెలిక పెట్టింది. ఇంటర్మీడియట్, డిగ్రీల్లో కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన విధించి, దరఖాస్తు దశలోనే సగం మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది. విద్యా రంగాన్ని ఉద్ధరిస్తామన్న కూటమి సర్కారు.. డిగ్రీలో అర్హత మార్కుల నిబంధన విధించి దాదాపు 8 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. బీఈడీ అర్హతతో రాసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఇంటర్ అర్హతతో రాసే ఎస్జీటీ పోస్టులకు ఇదే తరహా నిబంధన విధించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. 2024 ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్లో అర్హత మార్కుల నిబంధనను విధించలేదని, ఆ నోటిఫికేషన్ను పూర్తి చేసి ఉంటే తమకు మేలు జరిగేదని అభ్యర్థులు వాపోతున్నారు. తాజా నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. దాదాపు 11 నెలల పాటు ఇదిగో అదిగో నోటిఫికేషన్ అంటూ ఆశలు చూపించిన కూటమి ప్రభుత్వం.. నోటిఫికేషన్ ఇచ్చి తమ ఆశలను చిదిమేసిందని అభ్యర్థులు మండిపడుతున్నారు. హడావుడి చేసినంత కూడా లేదు.. ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేసి వెంటనే పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు టీడీపీ అగ్ర నాయకులు హామీలు గుప్పించారు. గతేడాది జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేసి 16,347 పోస్టులను ప్రకటించారు. ఆగస్టులో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి, గత ప్రభుత్వంలో 6,100 పోస్టులకు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేశారు. తర్వాత టెట్ రాసేందుకు అవకాశం ఇస్తున్నామంటూ ఒకసారి, టెట్కు, డీఎస్సీకి 3 నెలల కాలం ఉండాలని మరోసారి కాలయాపన చేశారు. వాస్తవానికి పాఠశాల విద్యా శాఖలో 27,333 పోస్టులు ఖాళీ ఉన్నా, కేవలం 16,347 పోస్టులకే ఏడాది తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. తుదకు అర్హత మార్కుల నిబంధన పెట్టి అన్యాయం చేశారు. గ్రామీణ పేద విద్యార్థులపై వేటు రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో చదువుకునే వారిలో పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులే అధికం. కోర్సులు పూర్తయిన వెంటనే జీవితంలో స్థిర పడేందుకు వీరి ముందున్న ఏకైక అవకాశం డైట్ లేదా బీఈడీ మాత్రమే. దాంతో కోర్సులు ఏదోలా పాసై ఇంటర్ అర్హతతో డైట్, డిగ్రీ అర్హతతో బీఈడీ చేసిన వారు 15 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో 8 లక్షల మందికి పైగా ఇంటర్, గ్రాడ్యుయేషన్లో సాధించిన మార్కుల శాతం 40–45 ఉంటుంది. ప్రస్తుత డీఎస్సీ–2025లో జనరల్ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్కు డిగ్రీలో 50 శాతం, పీజీటీకి పోస్టు గ్రాడ్యుయేషన్లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేశారు. అలాగే, రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎస్జీటీ/ఎస్ఏ పోస్టులకు 45, పీజీటీకి 50 శాతంగా ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో దాదాపు 8 లక్షల మంది అర్హత గల అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశమే లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో బోధన అందిస్తున్న టీచర్లు డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలని కోరుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ్ పాఠశాలల్లో గత 15 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ టీచర్లుగా సుమారు 1,200 మంది పని చేస్తున్నారు. బీసీ, సాంఘిక సంక్షేమం, ఏపీ మోడల్ స్కూళ్లలో మరో 2 వేల మంది పని చేస్తున్నారు. ప్రస్తుత డీఎస్సీలో వారికి ఎలాంటి వెయిటేజీ ఇవ్వకుండానే దాదాపు 3,109 పోస్టులు రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సర్వీసు అందిస్తున్న వారు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. -
అవుకులో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లా అవుకులో ఆదివారం అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా పునుగోడులో 42.5 డిగ్రీలు, నెల్లూరు జిల్లా మనుబోలులో 42.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా వినుకొండ, వైఎస్సార్ జిల్లా ఉప్పలూరులో 42.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 100కిపైగా ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంలోని 31 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 20 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అకస్మాత్తుగా పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
రూ.41.42 కోట్లతో..‘తుంగభద్ర’ గేట్ల మార్పు
సాక్షి, అమరావతి: కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు తుంగభద్ర డ్యాంలో కాలం చెల్లిన 32 గేట్లను తొలగించి, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు తుంగభద్ర బోర్డు సిద్ధమైంది. ఈ పనులకు రూ.41.42 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఆదివారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 32 గేట్లు అమర్చే పనులు 15 నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించింది. టెండర్లో బిడ్ల దాఖలుకు ఈనెల 28 వరకూ అవకాశం ఇచ్చింది. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరుస్తుంది. అందులో అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థల ఆర్థిక బిడ్లను మే 2న తెరవనుంది. తక్కువ ధర(ఎల్–1)కు కోట్ చేసిన సంస్థకు గేట్ల మార్పిడి పనులు అప్పగించనుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యాం నిర్వహణకు కేంద్రం తుంగభద్ర బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం డ్యాం, ఎగువ, దిగువ ప్రధాన కాలువల మరమ్మతులు, లైనింగ్ తదితర పనులకు తొలుత ఏపీ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయాలి. ఆ తర్వాత కర్ణాటక వాటా నిధులను ఏపీకి కేంద్రం సర్దుబాటు చేస్తుంది. ఈ నిబంధన ప్రకారం తొలుత ఏపీ ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉన్నా రూ.10వేలు మాత్రమే కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గేట్ల మార్పిడికి నిధుల కొరత అడ్డంకి మారిందని, అందుకే 15 నెలలు గడువు పెట్టినట్లు బోర్డు అధికార వర్గాలు చెబుతున్నాయి. గతేడాది తరహాలో భారీ వరదలు వస్తే తుంగభద్ర డ్యాం భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదముందని, ఈ ఏడాది 80 టీఎంసీల కంటే ఎక్కువ నీరు నిల్వ చేయకూడదని నిపుణులు సూచించారని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఇది మూడు రాష్ట్రాల్లోని ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.గేట్ల మార్పులో తీవ్ర జాప్యంగతేడాది ఆగస్టు 10న తుంగభద్ర డ్యాంకు వచ్చిన భారీ వరదకు 19వ గేటు కొట్టుకుపోయింది. దాంతో కర్ణాటక వినతి మేరకు కేంద్రం సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలో హర్కేష్కుమార్, తారాపురం సుధాకర్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షేత్ర స్థాయి పరిశీలన, అధికారులతో సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా.. గేట్ల కాలపరిమితి ముగియడం, బలహీనంగా మారడం వల్లే 19వ గేటు కొట్టుకుపోయిందని తేల్చింది. డ్యాం భద్రత దృష్ట్యా 33 గేట్లు మార్చాల్సిందేనని సీడబ్ల్యూసీకి సెప్టెంబరు 11న నివేదిక ఇచ్చింది. గేట్ల మార్పిడికి మూడు రాష్ట్రాలు అంగీకరించాయి. దాంతో ఒక్కో గేటు 48 టన్నుల బరువుకు మించకుండా 14 ఎంఎం ఇనుప రేకుతో 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో రూపొందించేలా సీడబ్ల్యూసీ డిజైన్ను కూడా ఖరారు చేసింది. కానీ.. నిధుల విడుదలపై ఏపీ ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో గేట్ల మార్పుపై సత్వరమే నిర్ణయం తీసుకోలేకపోయామని బోర్డు అధికారులు చెబుతున్నారు. కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో కొత్త గేటు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి.. రూ.1.66 కోట్లకు అహ్మదాబాద్కు చెందిన సంస్థకు పనులు అప్పగించామని తెలిపారు. గేట్ల మార్పులో జాప్యం వల్ల.. డ్యాంలో పూర్తి నీటి మట్టం 105.79 టీఎంసీలకుగానూ.. 80 టీఎంసీలకు మించి నిల్వ చేయలేమని.. ఈ ఏడాది ఖరీఫ్, రబీల్లో తుంగభద్ర డ్యాంపై ఆధారపడిన 13.28 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం సవాల్గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.70 ఏళ్లుగా అవే గేట్లుతుంగభద్ర డ్యాం నిర్మించి 71 ఏళ్లు పూర్తయింది. గరిష్ఠ నీటి మట్టం 1,633 అడుగులు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలు. కనీస నీటి మట్టం 1,613 అడుగులు. అదే స్థాయి నుంచి 1,633 అడుగుల వరకూ 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో స్పిల్వేకు 33 గేట్లు బిగించారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం గేట్ల కాలపరిమితి 45 ఏళ్లే. అనంతరం మార్చాల్సి ఉంటుంది. కానీ.. డ్యాం నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఇప్పటిదాకా గేట్లను మార్చలేదు. -
పల్లె నిధులకు ప్రభుత్వ గ్రహణం
పంచాయతీలలో అభివృద్ధి పడకేసింది.. మండల పరిషత్లలో ప్రగతి మందగించింది.. జిల్లా పరిషత్లలో సమస్యలు ముసురుకుంటున్నాయి.. ఏదైనా పని చేద్దామంటే పైసల్లేకుండా పోయాయి..! రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు ఇస్తుందా అనే ఎదురుచూపులతో నాలుగు నెలలు గడిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులొచ్చినా రాష్ట్ర ఖజానా నుంచి బయటకు రావడం లేదు. మరోవైపు స్థానిక సంస్థలకు ఇవ్వకపోయినా పర్లేదు.. అసలు ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అని అంటే మాత్రం అనుమానమే అని తెలుస్తోంది.సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలు మండల, జిల్లా పరిషత్ల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,121.20 కోట్లను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నాలుగు నెలలుగా తొక్కిపెట్టింది. ఖజానాలో ఉంచుకుని అవసరాలకు వాడేసుకుంటోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం గ్రామీణ స్థానిక సంస్థల కోసం విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకుండా సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ల ఆధ్వర్యంలోని స్థానిక సంస్థల పాలక వర్గాలు అభివృద్ధి పనులకు ఖర్చు చేసుకునే వీలుంటుంది. స్థానిక గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ల తీర్మానాల ప్రకారం చేపట్టే అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల ప్రభుత్వాలే నేరుగా బిల్లులు చెల్లించుకునేలా, రాష్ట్ర ఖజానా ఆంక్షలు లేకుండా స్థానిక సంస్థల ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం అమలులో ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే కొత్తగా ఈ విధానం అమలులోకి వచ్చింది.» 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖలకు విడుదల చేసే నిధులు రాష్ట్ర ఖజానాలో జమయిన పది పని దినాల్లో ప్రభుత్వం స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. » గత ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.2,152 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. తొలి విడత సెప్టెంబర్లో, రెండో విడతగా డిసెంబర్లో రూ.1,121.20 కోట్లు ఇచ్చింది. (డిసెంబరు 16న రూ.446.48 కోట్లు, డిసెంబరు మూడో వారంలో రూ.674.72 కోట్లను విడుదల చేసింది)» ఈ నిధులను 70–20–10 నిష్పత్తిన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు వాటి బ్యాంకు ఖాతాలలో జమ చేయాల్సి ఉంటుంది. దీనికి పది పని దినాలు నిర్దేశించింది. అయితే, శనివారం వరకు (ఏప్రిల్ 19) కూటమి ప్రభుత్వం ఆయా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయలేదు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేస్తోంది అనే చర్చ అధికార వర్గాలో సాగుతోంది.» నిబంధనల ప్రకారం వెళ్తే ఆ నిధులను వినియోగించుకునే అవకాశం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ కారణంగానే నిధుల జమ విషయంలో కాలయాపన చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.» నిధుల కొరత కారణంగా స్థానిక సంస్థలు తాగునీరు, పారిశుధ్యం సంబంధిత పనులను చేపట్టడం లేదు. పలు గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.11 నెలల్లోనే మూడోసారి..కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 11 నెలల కాలంలో స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన నిధులను నెలల తరబడి రాష్ట్ర ఖజానాలో ఉంచుకోవడం ఇది మూడోసారి. గతంలో విమర్శలు వచ్చిన తరువాత తప్పనిసరై స్థానిక సంస్థలకు విడుదల చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులు రూ.988.76 కోట్లను గత సెప్టెంబర్ లో విడుదల చేయగా, దాదాపు రెండు నెలల తర్వాత నవంబరులో జమ చేసింది. » 2023–24 ఆర్థిక సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం విడుదల చేసిన రూ.998 కోట్లనూ ఆలస్యంగా విడుదల చేసింది. రెండో విడతగా గత ఏడాది మార్చి నెలాఖరున కేంద్రం ఇచ్చింది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం జూన్ 12న బాధ్యతలు చేపట్టినా ఆగస్టు దాకా స్థానిక సంస్థలకు ఇవ్వలేదు. » ఈ అంశంపై ఆగస్టు 13న ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించిన తర్వాత కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది. -
ఏటా కోటి పెళ్లిళ్లుమన వివాహ మార్కెట్ రూ.11 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: దేశంలో వివాహ ఖర్చు భారీగా పెరుగుతోంది. సగటు కుటుంబ వార్షిక ఆదాయం కంటే మూడు రెట్ల అధిక వ్యయం జరుగుతోంది. ఆభరణాల కొనుగోలు నుంచి దుస్తులు, పెళ్లి మండపాలు, అతిథి సత్కారాలకు వెనుకడుగు వేయకుండా భారీ వ్యయాలు చేస్తున్నారు. దీనికి తోడు వధూవరుల ప్రత్యేక కోర్కెలు సైతం వివాహ ఖర్చులను అమాంతం పెంచేస్తున్నాయి. ఔట్ఫిట్స్, ఫస్ట్లుక్, మెహందీ, హల్దీ, ఫొటోషూట్, వినోద కార్యక్రమాలను యువత అమితంగా ఇష్టపడుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ వివాహాలు ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా రూపాంతరం చెందడం ఆసక్తి కలిగిస్తున్న అంశం. దేశ వివాహ మార్కెట్ విలువ రూ.11 లక్షల కోట్లుగా మార్కెట్ వర్గాల అంచనా. ఏటా దేశంలో దాదాపు కోటి వివాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘వెడ్డింగ్వైర్ ఇండియా’ సర్వే వివాహాల ఖర్చుపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది.ఆకాశమంత పందిరి... భూదేవంత పీటభారతీయ కుటుంబ వివాహాల్లో విలాసానికి ప్రాధాన్యం పెరుగుతోంది. సగటున పెళ్లిళ్ల కోసం రూ.29.60 లక్షలకుపైగా ఖర్చవుతోంది. ఇందులో వివాహ వేదికకే 20 శాతానికిపైగా వెచ్చిస్తుండటం విశేషం. 2023లో ఒక వేదికకు సగటున రూ.4.70 లక్షలు ఖర్చు చేస్తే, ఇప్పుడు రూ.6 లక్షలకుపైగా కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఒక్కోసారి రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెరుగుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. ఆ సందర్భాల్లో మొత్తం వివాహ వ్యయం రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉండడం విశేషం. తగ్గేదేలే..భారతీయ వివాహ వేడుకలు కనీసం మూడు, నాలుగు రోజులు కొనసాగుతున్నాయి. భారీగా వివాహ వ్యయం ధోరణి గ్రామాల్లోకీ విస్తరిస్తోంది. అవసరమైతే అప్పుచేసి మరీ భారీగా శుభ కార్యాన్ని నిర్వహిస్తున్నారు తప్ప, ఖర్చుకు వెనుకాడని పరిస్థితి కనబడుతోంది. అతిథులకు చిరస్మరణీయ ఆతిథ్యం ఇవ్వాలని యువత భావిస్తోంది.ఇందులో భాగంగా ఆహారం, పానీయాలపై దృష్టి పెడుతున్నారు. క్యాటరింగ్, వినోద కార్యక్రమాలపై ఖర్చులు పెరుగుతున్నాయి. శుభ లేఖలూ ‘వైభవంగా’ ఉండాల్సిందే. అయితే వివాహ ఆహ్వానాలు డిజిటల్ రూపంలోకి మారుతుండడం కొత్త ట్రెండ్.రెండో అతిపెద్ద మార్కెట్2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రిటైల్ మార్కెట్లో వివాహ పరిశ్రమ రూ.11 లక్షల కోట్లతో ఆహారం, నిత్యావసరాల తరువాత రెండో అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. కొన్ని కీలక విభాగాల మార్కెట్ విలువలు ఇలా... -
ఊరూపేరు లేని 'ఉర్సా'
సాక్షి, అమరావతి : రూ.10,000 కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీ అంటే దాని స్థాయి ఎంత గొప్పగా ఉండాలి..? నిత్యం వేలాది మంది ఉద్యోగుల కోలాహలంతో పాటు పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు ఉండాలి కదా..? కానీ రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన ఆ కంపెనీలో కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేడు. ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు కూడా లేవు. అంతెందుకు..? అసలది ఆఫీసే కాదు! వాడుకునేది కూడా గృహ విద్యుత్తే. కనీసం కార్యాలయం కూడా లేని కంపెనీకి ఎకరం 99 పైసలకే అత్యంత ఖరీదైన భూమిని ఉరుకులు పరుగులపై అప్పగించడం నీకింత.. నాకింత! దోపిడీకి పరాకాష్ట. ప్రపంచ చరిత్రలో ఇది వింతల్లో వింత! ఊరు పేరు లేని ‘ఉర్సా క్లస్టర్స్’కు విశాఖలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన భూమిని టీడీపీ సర్కారు అప్పనంగా కట్టబెట్టడం తాజాగా అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు నెలల వయసు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్, వెబ్సైట్ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన అనంతరం రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయడం పట్ల అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.రెండు నెలలు తిరగక ముందే.. టీసీఎస్ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో..! సొంత కార్యాలయం.. కనీసం ఫోన్ నెంబరు కూడా లేని ఓ అనామక కంపెనీ ఏర్పాటై రెండు నెలలు తిరగక ముందే తెలుగు రాష్ట్రాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామనడం.. ఆ ప్రతిపాదనకు ముచ్చట పడి చంద్రబాబు సర్కారు విశాఖలో కారు చౌకగా అత్యంత ఖరీదైన భూములు కేటాయించేయడం, ఇందుకోసం టీసీఎస్ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో ఎకరం 99 పైసలకే అంటూ ప్రత్యేకంగా పాలసీ తెస్తుండటంపై రాష్ట్ర ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యనేతలు తమ కుట్ర అమలులో భాగంగా తొలుత టీసీఎస్కు ఎకరా 99 పైసలకే కేటాయించి, అదే ధరకు ఉర్సా కస్టర్స్కు విలువైన భూములు ధారాదత్తం చేసేలా పావులు కదిపారు. ‘ఉర్సా క్లస్టర్స్’ పేరుతో విశాఖలో డేటా సెంటర్, ఐటా క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించడమే తడవుగా చౌకగా భూములు కేటాయించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించడం.. ఆ వెంటనే క్యాబినెట్లో భూ కేటాయింపులు చేయడంపై అనుమానాలు బలపడుతున్నాయి. కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్ కూడా లేని కంపెనీ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఎలా ఆమోదించిందో అర్థం కావడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భూ కేటాయింపులకు పచ్చజెండా.. ఉర్సా క్లస్టర్స్ రూ.5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటాక్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 3లో ఐటా క్యాంపస్కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్కు 56.36 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ గురించి ‘సాక్షి’ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.రెండు నెలల క్రితం పుట్టిన ఉర్సాకుమారుడేమో సాధారణ ఉద్యోగి తండ్రేమో కంపెనీకి డైరెక్టరట.. ఇంకో డైరెక్టర్ కథ ఇదీ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.10 వేల కోట్లు పెట్టుబడులు పెడుతుందని చెబుతున్న ఉర్సా క్లస్టర్స్ మార్చి నెల కరెంటు బిల్లు ఇది. హైదరాబాద్లో కార్యాలయమే లేదు..! కేరాఫ్ అడ్రస్ ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టే సంస్థ కార్యాలయం ఎంత పెద్దగా ఉంటుందో..? వందలాది మంది ఉద్యోగులతో కోలాహలంగా ఉంటుందని ఊహించుకుంటే పప్పులో కాలేసినట్లే. టీడీపీ కూటమి సర్కారు భూ కేటాయింపులు చేయడానికి కేవలం రెండు నెలల ముందు అంటే 2025 ఫిబ్రవరి 12న ఉర్సా క్లస్టర్స్ హైదరాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైంది. హైదరాబాద్కు చెందిన పెందుర్తి విజయ్కుమార్, అమెరికాలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న సతీష్ అబ్బూరి డైరెక్టర్లుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. ప్లాట్ నెంబర్ 705, ఏక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ– 500084 చిరునామాతో దీన్ని నెలకొల్పారు. అయితే ఆ చిరునామాకు వెళ్లి పరిశీలించగా... అది పూర్తిగా నివాస ప్రాంతమని తేలింది. పెందుర్తి విజయ్కుమార్కు అత్యంత దగ్గరి బంధువైన పెందుర్తి పద్మావతికి చెందిన త్రీ బెడ్ రూమ్ నివాస ఫ్లాట్ను ఉర్సా ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. అది పూర్తిగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. ఒక్కో అంతస్తుకు నాలుగు ఫ్లాట్ల చొప్పున మొత్తం 28 ఫ్లాట్లున్నాయి. ఉర్సా కార్యాలయంగా పేర్కొన్న ఒక ఫ్లాట్లో ఓ కుటుంబం నివాసం ఉంటోందని, అసలు అక్కడ ఐటీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదని స్థానికులు వెల్లడించారు. ఇక రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటున్న ఉర్సా క్లస్టర్స్ వాణిజ్య విద్యుత్ కాకుండా గృహ విద్యుత్తు కనెక్షన్ను వినియోగి స్తోంది. ఆర్వోసీలో నమోదుకు సమర్పించిన ఫ్లాట్ నెంబర్ 705 విద్యుత్ బిల్లే దీనికి నిదర్శనం. ఉర్సా క్లస్టర్ కంపెనీకి కనీసం ఓ ఫోన్ నెంబరు గానీ వెబ్సైట్గానీ లేకపోవడం గమనార్హం. పెందుర్తి విజయకుమార్ తన వ్యక్తిగత ఈ మెయిల్ను ఆర్వోసీకి అందించారు. అమెరికాలోనూ అంతే.. లోకేశ్ పర్యటనకు నెల ముందు...!ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాతృసంస్థగా చెబుతున్న అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సీ పరిస్థితి కూడా ఇంతే. అది లిమిటెడ్ లయబులిటీ కంపెనీ. ఏడు నెలల క్రితం.. అంటే 2024 సెపె్టంబర్ 27న ఉర్సా క్లస్టర్స్ అమెరికాలో ఏర్పాటైంది. అమెరికాలోని డెలావర్లో 611, సౌత్ డ్యూపాంట్, హైవే సూట్, 102 డోవెర్, డీఈ 19901 చిరునామాతో ఈ కంపెనీ నమోదైంది. పెందుర్తి విజయ్కుమార్ తనయుడు కౌశిక్ దీనికి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనకు సరిగ్గా నెల రోజుల ముందు ఈ కంపెనీ ఏర్పాటు కావడం గమనార్హం. ఇక ఈ కంపెనీ ఇప్పటి వరకు చెల్లించిన పన్ను కేవలం 300 అమెరికన్ డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు రూ.25,000. అమెరికా చిరునామాతో ఉన్న ఇల్లు కూడా పూర్తిగా నివాసప్రాంతం. కేవలం 1,560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక చిన్న కుటుంబం నివాసం ఉండటానికి అనువుగా ఉన్న ఇంటిని ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. ఇక అక్కడ కూడా ఉర్సా క్లస్టర్స్ బోర్డు లేదు.. ఉద్యోగులు లేరు. కనీసం ఫోన్ నెంబర్లు లేవు. కౌశిక్ పెందుర్తి ప్రస్తుతం టాలస్ పే అనే కంపెనీలో సీపీటీవోగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన లింక్డిన్ ఖాతా ద్వారా తెలుస్తోంది. అంటే ఆయన అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగి. మరో డైరెక్టర్ సతీష్ అబ్బూరి ఎలిసియం అనలిటిక్స్కు వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఉన్నారు. అలాంటి ఉర్సా కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెడతామనడం, అడిగిందే తడవుగా రూ.వేల కోట్ల విలువైన భూమినికారుచౌకగా కట్టబెడుతుండటంపై పెద్ద ఎత్తున అనుమానాలు ముసురుకుంటున్నాయి.‘ఐఎంజీ భారత్’ను మించిన స్కామ్..ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 2004లో తన బినామీ బిల్లీరావు చేత ‘ఐఎంజీ భారత్’ అనే డొల్ల కంపెనీని పెట్టించి.. అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడెమీకి చెందిన కంపెనీ అని నమ్మించి.. హడావిడిగా దానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కేటాయించి సేల్డీడ్ కూడా చేసేశారు.. అంతేకాదు శంషాబాద్ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ ఆ కంపెనీకి 45 ఏళ్లపాటు లీజుకిచ్చేసి వాటి నిర్వహణ చార్జీలను మాత్రం ప్రభుత్వమే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.. ఇపుడు ‘ఉర్సా క్లస్టర్స్’ కంపెనీని హడావిడిగా ఏర్పాటు చేసి విలువైన భూములు కేటాయించడం చూస్తుంటే ఐఎంజీ స్కామ్ గుర్తుకొస్తోందని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. -
‘పీడీఎస్’లో.. కందిపప్పు కనుమరుగు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) నుంచి ‘కందిపప్పు’ నెమ్మదిగా కనుమరుగు కానుంది. పేదలకు సబ్సిడీపై ఇచ్చే నిత్యావసరాలను ప్రభుత్వం ఆర్థిక భారంగా భావిస్తోంది. అందుకే 10 నెలలుగా క్రమంగా కందిపప్పును తగ్గిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలకు మాత్రమే కందిపప్పును సేకరిస్తోంది. టెండర్లకు మంగళం.. కొద్దికాలంగా బహిరంగ మార్కెట్లో కందిపప్పు రేటు కిలో రూ.180కిపైగా పలికింది. ఈ ధర చాలా కాలం పాటు కొనసాగడంతో సామాన్యులు కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో సబ్సిడీపై కందిపప్పును సరఫరా చేసి ఆదుకోవాల్సిన సమయంలోనూ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు అధిక రేట్లకు కోట్ చేస్తున్నారని మొత్తం పంపిణీకే మంగళం పాడేసింది. ప్రజల నుంచి దృష్టి మరల్చేందుకు కందులు సరఫరా చేయాలంటూ కేంద్రానికి లేఖలు పేరిట డ్రామాకు తెరలేపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) దగ్గరే కందులు నిల్వలు లేనప్పుడు ఏకంగా ఏడాదికి సరిపడా నిల్వలను ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలంటూ లేఖల్లో కోరడంతోనే ప్రభుత్వ కుటిల నాటకం బయటపడింది. పేదలకు పంచేది కూడా ఆర్థిక భారమేనా? ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర తగ్గి కిలో రూ.120–130 పలుకుతోంది. ఇది హోల్ సేల్లో అయితే రూ.100–110లోపు ఉంటోంది. రేటు ఎక్కువగా ఉన్నప్పుడు సబ్సిడీపై కందిపప్పు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం రేటు దిగివచ్చిన తర్వాత కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి కిలో కందిపప్పు సబ్సిడీపై రూ.67కు వినియోగదారులకు అందించాలి. అంటే ఇప్పుడు బహిరంగ మార్కెట్లో హోల్ సేల్లో కొనుగోలు చేసి ఇచ్చినా ప్రభుత్వంపై కిలోకు రూ.40–50 మించి భారం పడదు. ఇది సామాన్య ప్రజలకు ఎంతో కొంత ఊరటనిస్తుంది. కానీ, పేదల జీవితాలను కూడా బడ్జెట్ కోణంలో చూస్తోన్న ప్రభుత్వం ఆ కాస్త మొత్తాన్ని కూడా ఆదా చేసుకునేందుకు పీడీఎస్లో కందిపప్పు ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కొత్తేమీ కాదు.. గతంలో టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 93,000 టన్నుల కందిపప్పును మాత్రమే పంపిణీ చేసింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం జూన్ 2014 సెప్టెంబర్ నుంచి 2015 జూలై వరకు అసలు కందిపప్పు పంపిణీ గురించి పట్టించుకోలేదు. నవంబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే దీన్ని పంపిణీ చేసింది. 2017–18లో రాష్ట్రంలో ఎక్కడా పంపిణీ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తుండగా మార్చి 2018 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు 2 కిలోల కందిపప్పు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టింది. అంతే తప్ప ఆ ఒక్క ఏడాది కూడా సక్రమంగా కందిపప్పును అందించలేదు.సబ్సిడీ రేట్లు పెంచిన ఘనుడు బాబుగారే! ఆగస్ట్ 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు కిలో చొప్పున రూ.50–120 మధ్యన రేట్లు పెంచి విక్రయించింది. 2015 డిసెంబర్లో ఏకంగా రూ.90కి, 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.120కి పెంచేసింది. 2018లో కందిపప్పుకు రూ.23 మాత్రమే రాయితీ ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కందిపప్పు రేటు ఎంత పెరిగినా కిలో రూ.67కే స్థిరంగా అందించింది. దీంతో వినియోగదారులకు భారీగా మేలు జరిగింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రాకతో కందిపప్పు పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. -
22న వైఎస్సార్సీపీ పీఏసీ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 22వ తేదీ (మంగళవారం) ఉదయం 10.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులందరూ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించారని, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కో–ఆర్డినేటర్గా వ్యవహరిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)..వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, విడదల రజిని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్బాబు, మాజీ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి..మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ మంత్రులు షేక్ బెపారి అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ఖాన్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్లను నియమించారు. పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. -
‘ప్రవీణ్ పగడాల పోస్ట్మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు?’
సాక్షి, తాడేపల్లి: ప్రవీణ్ పగడాల మృతిపై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున కోర్టులో పిల్ వేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని.. పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్టులో స్పష్టత లేదన్నారు. ట్రావెల్ చేసింది.. ఆగింది.. మద్యం కొనుగోలు చేసింది ప్రవీణ్ కుమార్ అని ఎక్కడా నిరూపణ కాలేదు. చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అనేది తప్ప పోలీసులు చూపిన వీడియోల్లో అతను ప్రవీణ్ కుమార్ అని నిర్ధారణ కాలేదు’’ అని విజయ్ కుమార్ వివరించారు.‘‘నాకు ఎన్నో పోస్టుమార్టం రిపోర్టులు చూసిన అనుభవం ఉంది. మద్యం సేవించడం వల్లే చనిపోయాడని పోస్టుమార్టంలో కావాలని రాసినట్లుంది. మద్యం తాగడం వల్లే చనిపోతే ఈ దేశంలో రాష్ట్రంలో ఇంతమంది ఎలా బతికున్నారు?. ప్రిలిమినరీ రిపోర్టులో ప్రవీణ్ కడుపులో 120 ఎంఎల్ ఫ్లూయిడ్ ఉందని రిపోర్టు ఇచ్చారు. ఈ ఫ్లూయిడ్లో అనుమానాస్పదమైన ఎలాంటి ఆల్కహాల్ లేదని ఇచ్చారు. ప్రిలిమినరీ రిపోర్టులో ఆల్కహాల్ లేదని చెప్పిన వైద్యులు.. ఫైనల్ రిపోర్టులో ఆల్కహాల్ ఉందని ఇవ్వడం చిత్రంగా ఉంది. ఎందుకు ఆల్కహాల్ గురించి ఇంతగా ప్రస్తావిస్తున్నారు. పోలీసులు మొదట చెప్పిన ప్రెస్ మీట్లో ఎక్కడా ఆల్కహాల్ గురించి ప్రస్తావన లేదు. తర్వాత ఒక స్టోరీని అల్లడం కోసం ఆల్కహాల్ను వాడుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి’’ అని విజయ్కుమార్ పేర్కొన్నారు. ‘‘పనిగట్టుకుని ఆల్కహాల్ ఉందని రిపోర్టులో రాశారని అనిపిస్తోంది. మొహం రాళ్లకు గుద్దుకున్నందుకు గాయాలయ్యాయన్నారు. మరి తలవెనుక గాయం ఎలా అయ్యింది?. వెల్లకిలా పడిన వ్యక్తి పై మోటార్ సైకిల్ ఎలా పడింది?. అనేక సందేహాలున్నాయి వాటికి ఎక్కడా సమాధానం లేదు. హర్షకుమార్ అరెస్టును మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఏపీలో అసలు మానవహక్కులు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాం. స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు కూడా పౌరులకు లేదా?. రెండు సార్లు ఎంపీగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి వేధించడం పద్ధతేనా?. ముందస్తు అరెస్ట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది.మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న కొద్ది ప్రవీణ్ కుమార్ది హత్యేనేమోనని అనుమానాలు బలపడుతున్నాయ్. ప్రవీణ్ మృతిపై మాట్లాడాలంటేనే భయపడేలా చేస్తున్నారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ద్రోహులెవరో తెలిసిపోతారని ప్రభుత్వం ఉలిక్కిపడుతుందనే అనుమానం కలుగుతోంది. ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. పేదల ఓట్లు మీకు కావాలి?. పేదల భావాలతో మీకు పనిలేదా?’’ అంటూ విజయ్కుమార్ ప్రశ్నించారు. -
‘మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా డీఎస్సీకి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేమిటని నిలదీశారు.టీచర్ పోస్ట్ల నియామక ప్రక్రియపై నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా ఆరు లక్షల మంది అభ్యర్ధుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడితే సహించేది లేదని హెచ్చరించారు. మెగా డీఎస్సీని చిత్తశుద్దితో నిర్వహించకపోతే అభ్యర్ధుల తరుఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.ఇంకా ఆయనేమన్నారంటే..డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియలో లోపాలను సవరించకపోతే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై నిరుద్యోగుల తరుఫున ప్రభుత్వాన్ని మేలుకొలుపేందుకు కొన్ని అంశాలను మీడియా ద్వారా ఈ ప్రభుత్వం ముందు పెడుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్లో మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. పదకొండు నెలల తరువాత చంద్రబాబు పుట్టినరోజు నాడు తాజా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే చంద్రబాబు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చేందుకేనా ఈ పదకొండు నెలలుగా మెగా డీఎస్సీని ఆలస్యం చేశారు?.గత ఏడాది జూన్ 14న కూటమి ప్రభుత్వం తొలి కేబినెట్ సమవేశంలో మెగా డీఎస్సీ కింద 16,357 పోస్ట్ల భర్తీపై సంతకం చేశారు. వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తాం, పరీక్ష ప్రక్రియ, నియామకాలను వెంటవెంటనే చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలిఫైల్ పై సంతకం చేసిన రెండు రోజుల్లోనే టెట్ నిర్వహించిన తరువాతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం అంతకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు కూడా అదే జూన్ నెలలో వెలువడ్డాయి. మళ్లీ టెట్ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం సాకు చెప్పడం పెద్ద మోసం కాదా?తరువాత గత ఏడాది కూటమి ప్రభుత్వం టెట్ నిర్వహించి, నవంబర్ 4వ తేదీన ఫలితాలను విడుదల చేసింది. అదే సందర్భంగా నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. అయితే నవంబర్ 5వ తేదీన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఒక వ్యక్తితో కోర్ట్లో పిటీషన్ వేయించారు. కోర్ట్లో కేసు పెండింగ్లో ఉన్నందున వర్గీకరణ బిల్లు ఆమోదం తరువాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తూ వచ్చిన వైయస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది. శాసనమండలిలో ప్రతిసారీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, నిరుద్యోగుల తరుఫున గళాన్ని వినిపించడం ద్వారా ఒత్తిడి తీసుకువచ్చింది.వైఎస్సార్సీపీ ఒత్తిడితో ఎట్టకేలకు నోటిఫికేషన్మెగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ చేసిన ఒత్తిడి కారణంగానే కూటమి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ను తీసుకువచ్చి, చంద్రబాబు పుట్టినరోజున మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న ఆరు లక్షల మంది అభ్యర్థుల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత పదకొండు నెలలుగా వాయిదాల మీద వాయిదాల వేయడం, కోర్టుల్లో పిటీషన్లు వేయడం చూస్తుంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ను అయినా కార్యరూపంలోకి తీసుకువస్తారా అని పలువురు ప్రభుత్వ చిత్తశుద్దిని శంకిస్తున్నారు.స్కూల్స్ తెరిచే నాటికి అంటే జూన్ 1వ తేదీ నాటికి డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి, మొత్తం పోస్ట్లను భర్తీ చేస్తామని లోకేష్, చంద్రబాబు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకువచ్చారు. ఈ ఆర్డినెన్స్లో ఎస్సీల్లో ఆర్ఓఆర్పై కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండానే ఆర్డినెన్స్ను అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం డీఎస్సీపై పడుతోంది. ప్రభుత్వం ఇప్పుడు కేవలం సుమారు పదహారు వేల టీచర్ పోస్ట్లను భర్తీ చేస్తూ, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును సాకుగా చూపడం ఎంత వరకు సమంజసమని అభ్యర్ధులు ప్రశ్నిస్తున్నారు.టీచర్ పోస్ట్ల నియామక ప్రక్రియలో స్పష్టత ఏదీ?ఏప్రిల్ 20న నోటిఫికేషన్, జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షల ప్రక్రియను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. డీఎస్సీ పరీక్షా ఫలితాలు ఆగస్టులో ఇస్తామని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో ఫలితాలను ప్రకటిస్తే, ఉద్యోగాల భర్తీ ఎప్పుడూ? మరోవైపు మే నెలలో టీచర్ల బదిలీలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. సుమారు 16 వేల పోస్ట్లను బ్లాక్ చేయకుండానే బదిలీలను ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అంటే మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో ఉండే టీచర్ పోస్ట్లు ఖాళీగానే ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. కొత్త డీఎస్సీ ఫలితాలే ఆగస్టు మొదటి వారంలో వస్తే, ఉద్యోగాల నియామకాలు సెప్టెంబర్ దాటి పోయే అవకాశం ఉంది.అంటే అప్పటి వరకు మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో ఉపాధ్యాయుల ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులు టీచర్ లేక, విద్యాసంవత్సరం ప్రారంభమైన నాలుగు నెలల పాటు పాఠాలు చెప్పేవారు లేక నష్టపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ మొత్తం ప్రక్రియపైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? జూన్లోగానే నియామక ప్రక్రియను పూర్తి చేస్తే, విద్యార్ధులకు ఈ నష్టం జరగదు. కానీ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ వరకు టీచర్ పోస్ట్ల భర్తీని సాగదీయడం వల్ల విద్యార్ధులే అంతిమంగా నష్టపోతున్నారు. పదకొండు నెలల కిందట 16347 పోస్ట్లకు కేబినెట్లో సంతకం చేశారు. నేటికీ అదే పోస్ట్లకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం ఎంత వరకు సమంజసం? ఈ మధ్య కాలంలో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి? వాటి పరిస్థితి ఏమిటీ?అసమర్థతతో విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారుకూటమి ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో విద్యారంగం నాశనమవుతోంది. ఆనాడు సీఎంగా వైయస్ జగన్ గారు జీఓ 117 ద్వారా ప్రభుత్వ విద్యావ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతూ మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పించాలని సంకల్పించారు. దీనిపై కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తూ అనేక అసత్య ఆరోపణలు చేసింది. జీఓ 117లో ఏమున్నాయో తెలియకుండానే ఆ జీఓను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. తరువాత ఆ జీవో మీద ఒక కొత్త మెమోను తీసుకువచ్చారు. ఈ మెమో కారణంగా అనేక ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించారు. సుమారు 19271 ప్రైమరీ స్కూళ్ళు వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్గా మారిపోతున్నాయి.ఒక పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ను పెడతామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో దాదాపు 31 వేల ప్రైమరీ స్కూల్స్ ఉంటే, పంచాయతీకి ఒక్క స్కూలే పెడితే 19,271 స్కూల్స్ మాత్రమే మిగులుతాయి. రాష్ట్రంలో మొత్తం 3156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఈ స్కూల్స్నే తీసివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉన్న ఈ స్కూళ్ళలో 83 శాతం ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు అరవై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఈ స్కూళ్ళన్నీ కూడా ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్ల కింద పడిపోయే ప్రమాదం ఉంది.కేవలం 17 శాతం స్కూళ్లను మాత్రమే హైస్కూళ్ళుగా మారుస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాగే 510 హైస్కూల్ ప్లస్ విద్యా సంస్థలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 1800 మందికి పీజీటీలుగా పదోన్నతులు కల్పించి, ఇంటర్మీడియేట్ వరకు ఈ స్కూళ్లలో విద్యాబోధన కల్పించాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అవసరమైతే విద్యార్థుల కోసం పోరాడతామని చెప్పడంతో వాటిల్లో ఈ ఒక్క ఏడాది మాత్రమే 290 హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థలను కొనసాగిస్తామని చెప్పి, వాటిపైనా కూడా ఒక అయోమయాన్ని కల్పించారు. అలాగే 117 జీఓ రద్దు వల్ల స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన వారి 8000 మంది పరిస్థితి ప్రశ్నార్థకం అయ్యింది.ఉద్యోగాల కల్పనపైనా అబద్దాలేనా?చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగాల వెల్లువ అంటూ తప్పుడు ప్రచారంతో అబద్దాలను గొప్పగా చెప్పుకుంటున్నారు. అయిదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని పచ్చి అబద్దాలు చెప్పారు. మేం దానిని ప్రశ్నించగానే పొరపాటుగా చెప్పామంటూ మాట మార్చారు. మరోవైపు ఉన్న ఉద్యోగాలను కూడా క్రమంగా తొలగిస్తూ యువత జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పదకొండు నెలల్లోనే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వారిని ఏకంగా మూడు లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.ఇప్పుడు ఏడాది సమయం తరువాత 16 వేల టీచర్ పోస్ట్లను భర్తీ చేస్తామంటుంటేనే అనేక సందేహాలు కలుగుతున్నాయి. 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018లో ఏడు వేలకు పైగా పోస్ట్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. తీరా ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారా అని చూస్తే కేవలం 300 పోస్ట్లు భర్తీ చేసి, 6900 మందిని గాలిలో పెట్టారు. తరువాత వైయస్ జగన్ గారి ప్రభుత్వం వాటిని భర్తీ చేసింది. అలాగే 1998 డీఎస్సీని కూడా సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఇరవై అయిదేళ్ళ తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వారికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది.తాజా నోటిఫికేషన్లో వైఎస్ జగన్ అయిదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని చెప్పారు. చంద్రబాబు గత అయిదేళకల పాలనలో ఎన్ని టీచర్ పోస్ట్లను భర్తీ చేశారని చూస్తే, 2014-19లో 10,313 పోస్ట్లు మాత్రమే భర్తీ చేశారు. వైఎస్ జగన్ అయిదేళ్ల కాలంలో రెండేళ్ళు కోవిడ్ సంక్షోభం ఉన్నా కూడా మూడేళ్ళలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన పాపాలను సరిచేసి అనేక వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. 1998 డీఎస్సీలో నాలుగు వేల మందికి పాతికేళ్ళ తరువాత ఉద్యోగాలు ఇచ్చారు.2018 డీఎస్సీ కింద వైఎస్ జగన్ హయాంలో 6954 మందికి టీచర్ పోస్ట్లు ఇచ్చారు. 2008 డీఎస్సీలో ఉతర్ణులైన వారికి 2193 మందికి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే టీచర్ పోస్ట్లు ఇచ్చింది. 602 పోస్ట్లను స్పెషల్ డీఎస్సీ ద్వారా, కేబీబీవీల్లో 1200 పోస్ట్ లను ఇలా మొత్తం 15008 టీచర్ పోస్ట్లను ఆయన హయాంలో భర్తీ చేయడం జరిగింది. అలాగే 2024 లో 6100 పోస్ట్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే 21000 టీచర్ పోస్ట్ల భర్తీకి వైయస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.కేవలం పదివేల పోస్ట్లను భర్తీ చేసిన చంద్రబాబ ప్రభుత్వం తమదే గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా? ఎక్కడా బర్త్డే గిఫ్ట్లుగా ప్రచారం చేసుకుంటూ ఉద్యోగాలు ఇవ్వలేదు. భారతదేశంలోనే 1.36 లక్షల ఉద్యోగాలను ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి, రెండు నెలల్లో భర్తీ చేయడం ఒక రికార్డ్. ఇన్ని చేసిన వైఎస్ జగన్పై కూటమి పార్టీలు విమర్శలు చేయడం హాస్యాస్పదం. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే వరకు వారికి నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పారు. ఒక్కరికైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉద్యగాలు లేవు, భృతి అంతకన్నా లేదు. కనీసం ఈ మెగా డీఎస్సీన అయినా చిత్తశుద్దితో నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి చెబుతున్నాం. -
8 కేటగిరీల్లో 11,489 పోస్టులు హుష్!
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎసరు పెట్టే ప్రక్రియను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 కేటగిరీల్లో ఉద్యోగులు పనిచేస్తుండగా.. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా జనరల్ కేటగిరీ (మల్టీ పర్పస్) ఉద్యోగులుగా పేర్కొన్న 8 కేటగిరీల్లో ఏకంగా 11,489 పోస్టులకు కోత పెట్టేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, మహిళా పోలీసుల కేటగిరీ ఉద్యోగుల విషయంలో ఏ సచివాలయంలో ఎవరుండాలి.. ఎవరు కొనసాగకూడదు అనే అంశంపై ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసింది. గ్రామ సచివాలయాల్లో సంబంధిత నాలుగు కేటగిరి ఉద్యోగులలో 9,201 పోస్టులు తగ్గిపోయాయి. వార్డు సచివాలయాల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీ, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా పోలీసు కేటగిరీ ఉద్యోగుల క్రమబదీ్ధకరణ ప్రక్రియ పూర్తి చేయగా.. అందులో 2,288 పోస్టులకు కోత పెట్టేశారు. టెక్నికల్ కేటగిరీ ఉద్యోగుల కోసం ‘క్లస్టర్లు’ రేషనలైజేషన్ ప్రక్రియకు ప్రభుత్వం నిర్ధారించిన నిబంధన ప్రకారం.. మిగిలిన 11 కేటగిరీల (టెక్నికల్) ఉద్యోగులను రెండు మూడు సచివాలయాలకు ఒకరు చొప్పున నియమించాల్సి ఉండడంతో, రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను క్లస్టరు వారీగా వర్గీకరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. 15,004 గ్రామ వార్డు సచివాలయాలను 7,600 దాకా క్లస్టర్లు వారీగా వర్గీకరించాలని జిల్లాల నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రతిపాదనలు పంపారు. వర్గీకరణకు జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, కలెక్టర్ల ఆమోదం అనంతరం, సచివాలయాల ఉద్యోగులలో కోతల సంఖ్య మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేనట్లే..! క్రమబద్దికరణ పేరుతో సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులలోనే వేల మంది ఉద్యోగులను మిగులుగా తేల్చి, వారిని ఇతర శాఖల్లో అవసరాలకు ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా ప్రస్తుతం సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అవకాశాలే లేకపోవడంతో పాటు ఇప్పుడు సచివాలయాల్లో పనిచేసే మిగులు ఉద్యోగులనే ఇతర శాఖల్లో ఖాళీలకు ఉపయోగించుకోవడం కారణంగా ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తలుపులు క్లోజ్ అయినట్లేనని స్పష్టమవుతుంది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి శిక్షణ తీసుకుంటున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీరు జల్లే పరిస్థితి. 1.34 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించిన జగన్ సర్కార్.. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం, సంక్షేమ పథకం ఎటువంటి అవినీతి, పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా చిట్టచివరి స్థాయి వరకు సమర్థవంతంగా చేరవేసే ఉద్ధేశంతో గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019లో రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో మరో 3,842 వార్డు సచివాలయాలను మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు అప్పట్లో ఏర్పాటయ్యాయి. ఒక్కో సచివాలయంలో 10– 11 మంది ఉద్యోగులు చొప్పున పనిచేసేలా మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 1,49,235 మంది దాక పనిచేసేలా రూపకల్పన చేశారు. 15,004 సచివాలయాల్లో పనిచేసేందుకు.. అప్పట్లో గ్రామాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలుగా పనిచేసే వారికి అదనంగా మరో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 జూలైలోనే మంజూరు చేసి, కేవలం నాలుగు నెలల్లో భారీగా భర్తీ ప్రక్రియను సైతం పూర్తి చేసింది. -
సర్కారు క‘బడి’
సాక్షి, అమరావతి: ఇంటి పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై 4 కి.మీ. దూరంలోని హైస్కూళ్లకు వెళ్లాల్సిందే. ఇప్పటివరకు గ్రామాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6నుంచి 8 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న స్కూల్ అసిస్టెంట్లు ఇకపై పాఠాలు చెప్పరు. అలాగే.. హైస్కూల్లోకి మారిన 3నుంచి 5 తరగతులు అక్కడే ఉన్నా వారికి చదువు చెప్పేది ఎస్జీటీలే. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా మారుస్తామని ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం.. సర్కారీ స్కూళ్ల విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయే పరిస్థితులను తీసుకొస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసుతో 117 జీవో రద్దు కోసం కూటమి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నాయి. విద్యా సంస్కరణల పేరుతో తాజాగా చేపట్టిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, బోధన సిబ్బంది కూర్పుపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనవరిలో ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా ఇచ్చిన తాజా ఆదేశాలు విద్యార్థులకు నష్టం చేసేలా ఉన్నాయి. 5 రకాల పాఠశాలలను పునర్ వ్యవస్థీకరిస్తామని ప్రకటించిన విద్యాశాఖ.. తాజాగా ఆరో రకం (1–10 తరగతులు) పాఠశాలలను సృష్టించింది. కొత్త నిబంధనలతో ఏ పాఠశాలలో ఏ టీచర్ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కో స్కూల్కు ఒక్కో విధానంజీవో నం.117కు ప్రత్యామ్నాయంగా తాజాగా విడుదల చేసిన బోధన సిబ్బంది కేటాయింపు నిబంధనల్ని చూసి ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రాథమిక (1–5) తరగతుల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్, విద్యార్థుల సంఖ్య 1:30 నిష్పత్తిలో ఉండాలి. అయితే, విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లో ఈ చట్టాన్ని కేవలం ఫౌండేషన్ స్కూల్ (1, 2 తరగతులు), బేసిక్ ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే అమలు చేస్తోంది. ఇక మోడల్ ప్రాథమిక పాఠశాలల(1 నుంచి 5)ల్లో 59 మంది విద్యార్థుల వరకు నలుగురు ఎస్జీటీలను కేటాయించింది. ఒకవేళ మిగులు ఎస్జీటీలు అందుబాటులో ఉండి.. 50 మంది విద్యార్థులుంటే ఒక పీఎస్ హెచ్ఎంతో పాటు నలుగురు ఎస్జీటీలను కేటాయించింది. అంటే మోడల్ స్కూళ్లకు 1:10 ప్రకారం ఉపాధ్యాయులను ఇచ్చింది. గతంలో 120 మంది దాటితేనే హెడ్ మాస్టర్ అన్న నిబంధనను సడలించింది. గతంలో ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేస్తామని పేర్కొన్నారు. కానీ.. తాజాగా యూపీ స్కూళ్లను కొనసాగిసూ్తనే 6–8 తరగతులకు స్కూల్ అసిస్టెంట్లను తొలగించి, వారి స్థానంలో ఎస్జీటీలను కేటాయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా హైస్కూళ్లల్లో 1 నుంచి 10 తరగతుల వరకు బోధన అందించనున్నారు. ఈ హైస్కూళ్లలో 1 నుంచి 5 తరగతుల వరకు బేసిక్ ప్రైమరీ పాఠశాల ఏ ర్పాటు కానుంది. ఇందులో మొదటి 10 మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్జీటీలు (1:5 ప్రకారం), తర్వాత 1:10 నిష్పత్తిలో సిబ్బందిని కేటాయిస్తున్నారు. తాజా నిబంధనలపై తీవ్ర విమర్శలుప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉపాధ్యాయుల కేటాయింపులో ఏకీకృత విధానం లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైస్కూళ్లల్లో 3–4 తరగతులు ఉన్నా ఇప్పటివరకు వారికి బోధిస్తున్న సబ్జెక్టు టీచర్ విధానం రద్దు చేయడం, యూపీ స్కూళ్లలోనూ ఉన్నత తరగతులకు ఎస్జీటీలనే కేటాయించడం విస్మయానికి గురిచేస్తోంది. కొన్ని ప్రైమరీ స్కూళ్లలో టీచర్, విద్యార్థుల నిష్పత్తి 1:30గా ఉంటే.. మరికొన్నింటిలో 1:5గా ఉంది. ఈ ఎంపిక ఉపాధ్యాయులను అభద్రతకు గురి చేస్తోంది. ఏలూరు జిల్లాలోని ఓ హైస్కూల్లో ఉన్న బేసిక్ ప్రైమరీ పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ముగ్గురు ఎస్జీటీలు పనిచేసేలా, సమీప గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీ, మరో గ్రామంలో బేసిక్ ప్రైమరీ పాఠశాలలో 29 విద్యార్థులకు ఇద్దరు ఎస్జీటీలను కేటాయించడం గమనార్హం. ఈ ఆశాస్త్రీయ విధానాలు విద్యావేత్తల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కొత్తగా వస్తున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లలో టీచర్లకు ఎస్జీటీలుగా పదోన్నతులు ఇచ్చి, పీఎస్ హెచ్ఎంలుగా నియమించాలి. స్కూల్ అసిస్టెంట్లు ఉన్నత తరగతులకు బోధించాలి. కానీ ప్రైమరీ స్కూళ్లల్లో హెచ్ఎం పోస్టులను స్కూల్ అసిస్టెంట్లతో సర్దుబాటు చేస్తున్నట్లు విద్యాశాఖ చెప్పడం విస్మయం కలిగిస్తోంది.అంతుబట్టని సర్కారు విధానాలువైఎస్సార్ జిల్లాలోని ఒక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రస్తుతం అంగన్వాడీ, 1, 2 తరగతులకు ఫౌండేషన్ స్కూల్, 3 నుంచి 10వ తరగతి వరకు హైస్కూల్ కొనసాగుతున్నాయి. 1, 2 తరగతులకు ఎస్జీటీలు బోధిస్తుండగా, మూడో తరగతి నుంచి స్కూల్ అసిస్టెంట్లు బోధిస్తున్నారు. తాజా నిబంధనలతో ఒకటి, రెండు తరగతులను హైస్కూల్లో విలీనం చేసి, ఇప్పటివరకు అదే హైస్కూల్లో ఉన్న 3–5 తరగతులు అదే ప్రాంగణంలోని ఫౌండేషన్ స్కూల్లోకి తీసుకొచ్చి, ఎస్జీటీతో బోధించనున్నారు. అంటే ఒకటి నుంచి 5 తరగతుల పిల్లలు వేళ్లేది హైస్కూల్కే అయినా చదివేది మాత్రం ప్రాథమిక పాఠశాలలోనే. దీంతో హైస్కూల్లోని సబ్జెక్ట్ టీచర్లను సర్ప్లస్గా చూపిస్తున్నారు. ఉన్నత తరగతులు కొనసాగుతున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎస్జీటీలకు బదులు స్కూల్ అసిస్టెంట్లను ఇవ్వాలని, ఒకటి నుంచి 10 తరగతులు కొనసాగుతున్న హైస్కూళ్లలో 3వ తరగతి నుంచి గత ప్రభుత్వం జీవో 117 ద్వారా అమలు చేసిన స్కూల్ అసిస్టెంట్లతో బోధన చేయిస్తేనే విద్యార్థులు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ప్రాథమిక, యూపీ స్కూళ్లలోని విద్యార్థులు ప్రైవేటు బాటపట్టడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రికార్డుల గల్లంతు.. అప్డేట్ కాని మ్యుటేషన్
సాక్షి, అమరావతి:ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ (ఏపీఎఫ్ఆర్) ముందుకు సాగడం లేదు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయ లోపం ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో ప్రతిబంధకంగా మారింది. ఫార్మర్ రిజిస్ట్రీలో అవకతవకలను మార్చి నెలాఖరు నాటికి చక్కదిద్దాలని తొలుత భావించినప్పటికీ.. సాంకేతిక సమస్యల కారణంగా ఏప్రిల్ 15లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయినా ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.రికార్డుల గల్లంతే ప్రధాన సమస్యరాష్ట్రంలో 612 గ్రామాల్లో ల్యాండ్ రికార్డ్స్ గల్లంతైనట్టు గుర్తించారు. మరోవైపు స్టేట్ ఫ్యామిలీ డేటా బేస్ (ఎస్ఎఫ్డీబీ)లో 6 వేలకు పైగా గ్రామాల్లో 2.27 లక్షల రైతుల ఖాతాల వివరాలు దొరకడం లేదు. ఎస్ఎఫ్డీబీ డేటా ప్రకారం డీ పట్టా, జిరాయితీ, అసైన్డ్, ఇనామ్, ఇతర భూ వివరాలు కూడా కనిపించడం లేదు. యాజమాన్య హక్కు బదలాయింపు (ల్యాండ్ మ్యుటేషన్) 2024 నవంబర్ నుంచి అప్డేట్ కాలేదు. సర్వే పూర్తయిన గ్రామాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్స్ (ఎల్పీఎం) రికార్డ్స్ డేటాతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ వెబ్సైట్లోని అటవీ భూ సాగుదారుల వివరాలు కూడా ఫార్మర్ రిజిస్ట్రీతో అనుసంధానం కాకపోవడం ఫార్మర్ రిజిస్ట్రీ ముందుకు సాగకపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ కారణంగానే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసిన రైతులకు విశిష్ట సంఖ్య జారీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వీటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించి పూర్తిస్థాయిలో డేటాను అందజేయాలని వ్యవసాయ శాఖ పలుమార్లు అభ్యర్థించినా రెవెన్యూ శాఖ నుంచి కనీస స్పందన కరువైంది. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వెబ్ అప్లికేషన్ స్థానంలో మొబైల్ అప్లికేషన్ తీసుకు రావాలని, తద్వారా వెరిఫికేషన్, అప్రూవల్ మరింత వేగవంతం చేయాలని భావించారు. కానీ సాంకేతిక సమస్యలు వెబ్ అప్లికేషన్కు ఇబ్బందికరంగా మారాయి. ఐదో స్థానానికి దిగజారిన ఏపీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి గతేడాది అక్టోబర్లో శ్రీకారం చుట్టగా, మన రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న ప్రారంభించారు. తొలి దశలో పీఎం కిసాన్ లబ్ధిదారులు, మలి దశలో భూమిలేని కౌలుదారులను గుర్తించి విశిష్ట సంఖ్యను జారీ చేయాల్సి ఉంది. వెబ్ల్యాండ్ డేటా ప్రకారం రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్ధిదారులు 60 లక్షల మంది ఉండగా.. మార్చి 22 నాటికే 40 లక్షల మంది రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదుతో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత ఒక్కో స్థానం దిగజారిపోతూ వస్తోంది. గడచిన నెల రోజుల్లో కేవలం 4 లక్షల మందిని మాత్రమే నమోదు చేయడంతో రాష్ట్రం ఐదో స్థానానికి పడిపోయింది. ఫార్మర్ రిజిస్ట్రీ డాష్బోర్డు ప్రకారం ఇప్పటివరకు 44.03 లక్షల మంది రైతుల వివరాలు నమోదు చేయగా.. 35 లక్షల మందికి ఫార్మర్ ఐడీ అప్రూవ్ అయినట్టుగా చెబుతున్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడంతో ఫార్మర్ రిజిస్ట్రీలో వెనుకబడిపోయామని.. లేదంటే ఇప్పటికే లక్ష్యాన్ని అధిగవిుంచే వారమని వ్యవసాయ శాఖ చెబుతోంది. -
ఎట్టకేలకు డీఎస్సీ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: దాదాపు 11 నెలలుగా మెగా డీఎస్సీ అంటూ అభ్యర్థులను ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం శనివారం రాత్రి ఎట్టకేలకు డీఎస్సీ–2025 షెడ్యూల్ విడుదల చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించారు. గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసి.. మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,347 డీఎస్సీ పోస్టుల భర్తీ ఫైల్పై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు గతేడాది డిసెంబర్ నాటికే పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎట్టకేలకు అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 16,347 పోస్టుల కోసం షెడ్యూల్ వెలువరించింది. ఇందులో ఎస్జీటీ 6,599, స్కూల్ అసిస్టెంట్ 7,487, పీఈటీ 2 పోస్టులు ఉన్నాయి. దీంతోపాటు ఏపీఆర్ఎస్, ఏపీఎంఎస్, సాంఘిక, బీసీ, ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి మరో 2,259 స్టేట్/జోనల్ పోస్టులు ఉన్నాయి. పోస్టుల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్ తదితర వివరాలను ఆదివారం ఉదయం 10 గంటల నుంచి విద్యా శాఖ వెబ్సైట్లో ఉంచనున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. వివరాలకు https:// cse. ap. gov.in / https// apdsc. apcfss. in వెబ్సైట్లను చూడవచ్చు. షెడ్యూల్ ఇదీదరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు: నేటినుంచి మే 15వ తేదీ వరకూమాక్ టెస్ట్: మే 20 నుంచిహాల్టికెట్ల డౌన్లోడ్: మే 30 నుంచిపరీక్షలు: జూన్ 6 నుంచి జూలై 6 వరకుప్రాథమిక కీ విడుదల: ప్రతి పరీక్ష పూర్తయిన రెండవ రోజునఅభ్యంతరాల స్వీకరణ: ప్రాథమిక కీ విడుదలైన 7 రోజుల వరకు ఫైనల్ కీ: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారుమెరిట్ జాబితా: ఫైనల్ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారు -
అస్మదీయులపై అవ్యాజమైన ప్రేమ
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు కారుచౌకగా భూములు, భారీ ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.4,200.07 కోట్లతో నాయుడుపేట సెజ్లో 8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్న ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్పై రాష్ట్ర ప్రభుత్వం అవ్యాజమైన ప్రేమను చూపింది. కేవలం 1,500 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తామని చెప్పిన ఈ యూనిట్కు ఏకంగా రూ.1,573 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు ఎకరం రూ.60 లక్షలు చొప్పున 106.6 ఎకరాలను కేటాయించింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వద్ద మీడియా మాట్రిక్స్ వరల్డ్ వైడ్ లిమిటెడ్ రూ.1,197 కోట్లతో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. దీనికి తొలి దశ యూనిట్ ఏర్పాటుకు ఎకరా రూ.7లక్షలు చొప్పున 329 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ ఈ భూములను ఎకరా రూ.21.95 లక్షలు చొప్పున సేకరించినప్పటికీ రూ.49.18 కోట్ల నష్టానికి మాట్రిక్స్ వరల్డ్ వైడ్కు భూములను కేటాయించింది. రెండో దశకు అవసరమైన 671 ఎకరాలను కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మరికొన్ని సంస్థలకు ప్రోత్సాహకాలు, భూ కేటాయింపులు.. » విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఉన్న మా మహామాయ సంస్థ రూ.2,063 కోట్లతో ప్రతిపాదించిన స్టీల్ ప్లాంట్ విస్తరణ ప్రాజెక్ట్కు ప్రభుత్వం రూ.797.96 కోట్ల రాయితీలు ప్రకటించింది. ప్రస్తుతం యూనిట్ ఉన్న ప్రాంతంలోనే మరో 82.80 ఎకరాలను ఏపీఐఐసీ సేకరించి ఇవ్వడానికి అనుమతించింది. ఈ భూమిలో 25.88 ఎకరాల్లో ఉన్న నీటి వనరులను ముందస్తు అనుమతులతో వినియోగించుకోవడానికి కూడా ఆమోదం తెలిపింది. » శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.585.64 కోట్లతో ఇంటిగ్రేటెడ్ క్వార్ట్జ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న పెట్రా సిలికాన్కు 224.35 ఎకరాలను కేటాయించింది. » నంద్యాల మండలం కోటపాడులో సుమారు రూ.478 కోట్లతో రామ్కో ఏర్పాటు చేస్తున్న సిమెంట్ పరిశ్రమకు 79.91 ఎకరాలను కేటాయించింది. » తిరుపతి జిల్లా శ్రీ సిటీలో సుమారు రూ.1,055.55 కోట్లతో ప్రోటేరియల్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న ఆమ్రోఫస్ మెటల్ తయారీ యూనిట్కు రూ.237.71 కోట్ల రాయితీలతోపాటు ఇతర ప్రోత్సాహకాలను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » స్నేహ ఫామ్స్ రూ.459.97 కోట్లతో నెల్లూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న కోళ్ల దాణా, మొక్కజొన్న నిల్వ గోడౌన్లు, బాయిలర్ ఫామ్స్కు రూ.67.44 కోట్ల ప్రోత్సాహకాలకు అనుమతించింది. » శ్రీ సిటీలో ఎల్జీ ఎల్రక్టానిక్స్ వెండర్స్ ఏర్పాటు చేస్తున్న వివిధ యూనిట్లకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. » డిక్సన్ టెక్నాలజీస్ తిరుపతి, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)లకు సంబంధించి రూ.3.08 కోట్ల లీజ్ రెంటల్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ (ఈవోటీ) ఫీజును, టాప్స్టోన్ మెటల్స్కు సంబంధించి రూ.28.82 లక్షల ఈవోటీని రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. -
వైఎస్సార్సీపీ హయాంలోనే సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని ఆ పార్టీ బీసీ విభాగం నేతలు కొనియాడారు. పార్టీ నేతలెవరైనా కాలర్ ఎగరేసుకుని తిరిగేలా వైఎస్ జగన్ పాలించారని చెప్పారు. సామాజిక న్యాయం విషయంలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వ్యవస్థాగతంగా మరింత బలోపేతం అవుదామని చెప్పారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో శనివారం ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ.. బీసీలు ఎవరికీ భయపడనవసరం లేదన్నారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదని.. బ్యాక్ బోన్ క్లాసెస్ అని మన నాయకుడు జగన్ నిర్వచించారన్నారు. కూటమి పాలనలో అరాచకాలు అణగారిన వర్గాలపైనే ఎక్కువగా జరిగాయని చెప్పారు. అనంతపురం జిల్లాలో బీసీ నేత కురుబ లింగమయ్యను దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో బీసీ కులాలు ఆత్మగౌరవంతో జీవించాయన్నారు. అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందుకుని, రాజ్యాధికారాన్ని అనుభవించాయని గుర్తు చేశారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాచగొల్ల రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ పాలన బీసీలకు స్వర్ణయుగం అని కొనియాడారు. బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ మాట్లాడుతూ.. కూటమి పార్టీలకు బీసీల సత్తా చూపిద్దాం అన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పూలే ఆశయాలను జగనన్న కొనసాగించారని చెప్పారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి సూపర్ సిక్స్ మోసాలను బయటపెడతామని చెప్పారు. కూటమి దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం అందించి ప్రగతికి బాటలు వేయాలని అన్ని రాజకీయ పార్టీలు చెబుతాయని, దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించింది ఒక్క వైఎస్సార్సీపీనే అని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమం విషయంలో వైఎస్ జగన్ చెప్పనివి కూడా చేసి ఆ తర్వాత ప్రజల వద్దకు వెళ్లారని గుర్తు చేశారు. చంద్రబాబుది అవకాశవాద రాజకీయమని, అధికారంలోకి రాగానే దోచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారని విమర్శించారు. కూటమి దుష్ప్రచారాన్ని తిప్పికొడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను ప్రజల్లోకి తీసుకెళదామని చెప్పారు. వ్యవస్థాగతంగా మరింత బలోపేతం అవుదామని, గతంలో కంటే మెరుగ్గా పూర్తి స్థాయి కమిటీలు నియమించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
కప్పం కట్టలేం
సాక్షి, అమరావతి: యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా.. చాలా పెద్ద సంస్థలు. ఇలాంటి కంపెనీలే రాష్ట్రంలో కూటమి పార్టీల నేతల వసూళ్లు, ఒత్తిళ్లపై నేరుగా కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ జిల్లాలో రూ.9 వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీతో పాటు విజయనగరంలో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత నవీన్ జిందాల్ను కూటమి సర్కారు సినీ నటి కాదంబరి జత్వానినీ అడ్డుపెట్టుకుని కేసులు పెట్టి మరీ వేధిస్తోంది. దీంతో ఆ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆపేసి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో పోర్టులు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన అదానీ గ్రూప్పై కూటమి పచ్చ పత్రికల ద్వారా విషం చిమ్మడంతో ఆ ప్రాజెక్టులు డోలాయమానంలో పడ్డాయి. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూప్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం చేపడితే తమకు కమీషన్లు ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్ది అనుచరులు గూండాగిరీ చేశారు. ఆ సంస్థ కార్యాలయంపై రాళ్లతో దాడికి దిగి యంత్ర సామగ్రిని ధ్వంసం చేసి సిబ్బందిని గాయపర్చారు. అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతల బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.కొత్త పెట్టుబడులు తేవడం కంటే.. ఉన్న కంపెనీల్లో వాటాలు మామూళ్ల పైనే శ్రద్ధ..! శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో అందినంత వసూళ్లు..! వసూళ్ల వేధింపులు భరించలేక యూనిట్లకు తాళాలు వేసుకుని పోతున్నవారు కొందరు.. ఏకంగా పెట్టుబడులను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న మరికొందరు..! వెరసి కూటమి సర్కారు కప్పం దెబ్బకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో ఏపీకో దండం అంటూ పారిపోతున్నారు.కేంద్రానికే మొరశ్రీకాకుళం జిల్లాలోని యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీపై బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఆయన అనుచరులు బెదిరింపులకు దిగారు. కంపెనీకి వచ్చే ప్రతి లారీపై రూ.వెయ్యి చొప్పున నెలకు రూ.కోటిన్నర కప్పం కట్టాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేం అని చెప్పడంతో ఎమ్మెల్యే అనుచరులు కంపెనీపై దాడి చేసి ఉద్యోగులను చితకబాదారు. కంపెనీ ప్రతినిధులు ఈ వ్యవహారంపై నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. » మామూళ్ల కోసం అనకాపల్లి జిల్లాలో ఉన్న కోకోకోలా ఫ్యాక్టరీపై యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ బెదిరింపులకు దిగడంతో ఆ కంపెనీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. » చెప్పుకొంటూ పోతే మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఎమ్మెల్యే తమ శక్తి మేరకు మామూళ్ల కోసం బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు.కొత్తవి రాకపోయేసరికి పాతవి తమ ఖాతాలోకికొత్తగా పెట్టుబడులను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమై దావోస్ నుంచి ఉత్తి చేతులతో తిరిగొచి్చన సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్.. గత ప్రభుత్వంలో వచి్చన ప్రాజెక్టులను వారి ఖాతాలోకి వేసుకుంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఎన్టీపీసీ దేశంలోనే తొలిసారిగా రూ.1,10,000 కోట్లతో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ యూనిట్ ఏర్పాటు చేసేలా 2023 విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఒప్పందం చేసుకుంది. అన్ని పరిపాలన అనుమతులు, భూ బదలాయింపులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. దాన్ని కూడా తామే తీసుకొచ్చినట్లు బాబు, లోకేశ్ డప్పు కొంటుకుంటున్నారు. » గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.పది లక్షల కోట్లకుపైగా గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటే కూటమి సర్కారు తమ ఖాతాలోకి వేసుకుంటోంది. కాకినాడ గ్రీన్కో, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ వంటి వాటినీ తమ ఘనతగానే చెప్పుకొంటున్నారు. » వైఎస్ జగన్ దావోస్ పెట్టుబడుల సమావేశానికి వెళ్లి ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ సీఈవో ఆదిత్య మిట్టల్తో ప్రత్యేకంగా సమావేశమై ఏపీలో పెట్టబడులకు ఒప్పించారు. అయితే, ఒక్కసారి కూడా నేరుగా కలవకుండానే ఒక్క ఫోన్ కాల్తో అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ను తామే తీసుకొచ్చామని కూటమి నేతలు చెప్పుకొంటున్నారు.మరికొన్ని చిలక్కొట్టుళ్లు» రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో తమకు వాటా ఇవ్వాలంటూ లారీలను అడ్డుకున్న కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు » తమ నియోజయోకవర్గం గుండా వెళ్లే గ్రానైట్ లారీలపై కప్పం కట్టాల్సిందేనని పల్నాడు, ప్రకాశం ఎమ్మెల్యేల హుకుం » నంద్యాలలో పొగాకు గోదాంల దగ్గరనుంచి చికెన్ షాపుల వరకు కమీషన్లు » కప్పం కడితేనే గనులకు లీజ్ ఇస్తుండటంతో 50 శాతం పడిపోయిన ఆ శాఖ ఆదాయం » నెల్లూరు జిల్లాలో రొయ్యల ఫీడ్ తయారు చేసే వాటర్బేస్ కంపెనీలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్టు తమకే ఇవ్వాలంటూ ఒత్తిడి » కృష్ణపట్నం పోర్టు సమీపంలోని పామాయిల్ తయారీ యూనిట్ల నుంచి లారీ కదలాలంటే సొంత టోల్ ట్యాక్స్ చెల్లింపుసిమెంట్ పరిశ్రమల్లో మరీ దారుణ పరిస్థితితాజాగా పల్నాడు జిల్లాలో ఉన్న సిమెంట్ కంపెనీలపై స్థానిక ఎమ్మెల్యేలు మామూళ్లు, వాటాలు అంటూ దందాకు దిగారు. ముడి సరుకు, సిమెంట్ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ సంస్థలు ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు.» తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ఒక తెలుగు చానల్ను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఆ సంస్థకు ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు చెందిన సున్నపురాయి సరఫరాను కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో కార్యకలాపాలను నిలిపేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. » రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తీసుకువెళ్లే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బహిరంగానే బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు మాకు కావాలంటే మాకు కావాలంటూ కొట్టుకోవడంతో పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. » నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై తమ పార్టీకే చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో అ్రల్టాటెక్ సిమెంట్స్ బూడిద, మట్టి సరఫరా లేక ఇబ్బందులను ఎదుర్కొంది. » సిమెంటు సరఫరా దందాలో ఎస్పీకి ఫిర్యాదు చేసినందుకు తమ పార్టీ ఎమ్మెల్యేపైనే బీజేపీకి చెందిన ఎంపీ ఫైర్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.» శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మరో మంత్రి గ్రీన్ టెక్ రెడీమిక్స్ కంపెనీలో వాటాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. -
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం
చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతో పెడుతున్న తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి స్పష్టం చేశారు. ‘కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత పెట్టిన ఎన్నో కేసుల్లో ఆరోపణలు అవాస్తవమని ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. అదే రీతిలో ప్రస్తుతం మద్యం విధానంపై పెట్టిన అక్రమ కేసులో ఆరోపణలు కూడా అవాస్తవమేనని త్వరలో నిర్ధారణ అవుతుంది’ అని ఆయన చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణ అనంతరం మిథున్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం పూర్తి విషయాలు మాట్లాడలేను. చంద్రబాబు ప్రభుత్వం మొదట మదనపల్లిలో ఏదో జరిగిందని రెండు నెలలు రాద్ధాంతం చేసింది. ఆ కేసులో అనుమానితుడిని తీసుకెళ్లి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసి విచారించారు. ఆరోపణలన్నీ కట్టు కథ అని తేలింది. తర్వాత గనుల శాఖలో అవకతవకలు, ఇసుకలో రూ.వేల కోట్లు అవినీతి అని అన్నారు. అది కూడా అవాస్తవ ఆరోపణలు, తప్పుడు కథనమేనని తేలింది. వందల గనులు అన్యాక్రాంతం అని మరో తప్పుడు ఆరోపణలు చేశారు. అవీ నిరూపించలేదు. మా సొంత భూములను అటవీ భూముల ఆక్రమణ అని కొన్నాళ్లు రాద్ధాంతం చేశారు. దీనిపై మేం కోర్టుకు వెళ్లాం. అవన్నీ అటవీ భూములు కాదని అంతా సక్రమంగానే ఉందని మళ్లీ వాళ్లే కోర్టుకు నివేదిక ఇచ్చారు. తర్వాత భూముల ఆక్రమణ అని మరో తప్పుడు కేసు పెట్టారు. ఏదీ నిరూపించలేకపోయారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అని ఆరోపణ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు రమ్మని సవాల్ విసిరాం. ఒక్కరూ రాలేదు. ప్రతి రెండు నెలలకు కూటమి ప్రభుత్వం ఏదో ఒక స్కాం అంటూ మాపై నిందలు వేస్తోంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే. ఇప్పుడు లిక్కర్ స్కాం అని మరో ఆరోపణ చేస్తున్నారు. అన్నింటి మాదిరిగానే ఇదీ తప్పుడు కేసని నిర్ధారణ అవుతుంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే. డ్రగ్స్, మానవ అక్రమ రవాణా మినహా అన్ని కేసులను మా పార్టీ నాయకులపై పెట్టి వేధించాలని ప్రయత్నించారు. లిక్కర్ స్కాం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అన్ని వివరాలు చెప్పలేకపోతున్నాను. కోర్టు నిర్ణయం వచ్చిన తరువాత మీడియా ముఖంగా అన్ని వివరాలు చెబుతాను’’ అని పేర్కొన్నారు. -
అక్రమ కేసే.. బాబు కుట్రే!
సాక్షి, అమరావతి: కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ అక్రమ కేసుల పరిస్థితి. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో నియమించిన సిట్ దర్యాప్తులోనే ఆ కేసుల డొల్లతనం బట్టబయలైంది. తాము బెదిరించి.. వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తోందన్నది నిగ్గు తేలింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన తప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని సిట్ అధికారులు విచారించిన తీరే అందుకు నిదర్శనం. కేవలం గాలి పోగేసి నిరాధార ఆరోపణలతోనే ఈ కేసు కేసు పెట్టారన్నది స్పష్టమైంది. న్యాయస్థానం ఆదేశాలతో తన న్యాయవాదితో కలిసి మిథున్రెడ్డి శనివారం ఉదయం 10.30 గంటలకు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6.30 వరకు న్యాయవాది సమక్షంలో ఆయనను రెండు దఫాలుగా సిట్ అధికారులు విచారించారు. కేవలం తాము వెంటాడి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ప్రాతిపదికనే ఎంపీ మిథున్రెడ్డిని సిట్ అధికారులు విచారించడం ఈ కేసులో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. అసలు కుంభకోణమే లేనప్పుడు దర్యాప్తు అధికారులు చేయగలిగేదీ ఏమీ ఉండదని తేలిపోయింది. అబద్ధపు వాంగ్మూలాలే సిట్కు ఆధారం విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. దర్యాప్తు ముసుగులో సిట్ అధికారులు తాము వెంటాడి వేధించి నమోదు చేయించిన అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే మిథున్రెడ్డిని ప్రశి్నంచారు. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్లను వేధించి బలవంతంగా తీసుకున్న అబద్ధపు వాంగ్మూలాలు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగానే ప్రశ్నలు వేయడం గమనార్హం. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వేధిస్తున్నారని, కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారంటూ వాసుదేవరెడ్డి మూడు సార్లు కోర్టుకెళ్లినా.. ఆయనను బెంబేలెత్తేలా చేసి, సిట్ అధికారులు అబద్ధపు వాంగ్మూలంపై సంతకం తీసుకున్నారు. అదే వాంగ్మూలంలోని అంశాల గురించి ఎంపీ మిథున్రెడ్డిని విచారణలో ప్రశి్నంచారని తెలిసింది. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి చెప్పిన విషయాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు అడిగారని, అంటే గంటల పాటు సిట్ విచారణ అంతా పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే సాగిందని తెలుస్తోంది.సిట్ ప్రశ్నలకు మిథున్ సమాధానాలివీ...అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా సాగిన సిట్ విచారణను ఎంపీ మిథున్ రెడ్డి దీటుగా తిప్పికొట్టారని, అధికారుల ఆరోపణలన్నీ నిరాధారం, అవాస్తవాలని ఆయన ఆధారసహితంగా బదులిచ్చారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ విచారణ ఇలా సాగింది.. సిట్: అడాన్ కంపెనీని నెలకొల్పేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా? మీరు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు కదా? మిథున్రెడ్డి: విజయసాయిరెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం. ఆయన నివాసంలో ఆ తేదీల్లో ఎలాంటి సమావేశంలోనూ నేను పాల్గొనలేదు. నాకు ఆ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే మీరు గూగుల్ టేక్ అవుట్ తెప్పించండి. విజయసాయిరెడ్డి చెప్పింది పూర్తిగా అవాస్తవమని తేలుతుంది. (దాంటో సిట్ అధికారులు మౌనం వహించారు) సిట్: ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పీఎల్ఆర్ గ్రూప్నకు రూ.5 కోట్లు బదిలీ అయ్యాయి కదా.. ఎందుకు? మిథున్రెడ్డి: ఔను. ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది. అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాంట్రాక్టు పనుల ఈఎండీ, బ్యాంక్ గ్యారంటీ కోసం 2019 నవంబరులో రూ.5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది. దీంతో రూ.5 కోట్లను తిరిగిచ్చేశాం. ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు. అందుకు ఇవిగో ఆధారాలు.. (అగ్రిమెంట్ కాపీ, బ్యాంకు లావాదేవీల రికార్డులు చూపించారు). ఇందులో నిబంధనలకు విరుద్ధమైనది ఏమీ లేదు. ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుందని మేం ఆరేళ్ల క్రితమే ఈ అగ్రిమెంట్లు చేసుకోం కదా..? ఇదంతా పారదర్శకంగా సాగిన వ్యవహారం. (దాంతో సిట్ అధికారులు ఈ అంశాన్ని విడిచిపెట్టారు) సిట్: రాజ్ కసిరెడ్డి కంపెనీ కోసం విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబ వ్యాపార సంస్థ నుంచి రూ.100 కోట్లు అప్పు ఇప్పించారా? మిథున్రెడ్డి: ఆ వ్యవహారంతో నాకేం సంబంధం? అది ఎవరో కొందరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వ్యవహారం. దానిపై నేనేం చెబుతాను? విజయ సాయిరెడ్డి అల్లుడి కంపెనీ ఎవరికో అప్పు ఇస్తే.. అప్పు ఇచ్చిన అరబిందో కంపెనీ వాళ్లను, తీసుకున్నవాళ్లను, ఇప్పించిన విజయసాయిరెడ్డిని అడగాలి. (దాంతో సిట్ అధికారులు ఆ అంశాన్ని కొనసాగించలేకపోయారు) సిట్: రాజ్ కసిరెడ్డి తెలుసా.. ఆయనతో మీకు వ్యాపార సంబంధాలున్నాయా? మిథున్రెడ్డి: రాజ్ కసిరెడ్డితో పరిచయం మాత్రమే ఉంది. ఆయనతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. సిట్: మీరు కొన్ని రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొనుగోలు చేశారు కదా? (అని కొన్ని పత్రాలు చూపించారు) మిథున్రెడ్డి: అవును. అవన్నీ సక్రమంగా కొనుగోలు చేసిన ఆస్తులే. ఆ వివరాలన్నీ నా ఎన్నికల అఫిడవిట్లో కూడా వెల్లడించాను. రాజకీయ కుట్రతో నమోదు చేసిన కేసు.. వాంగ్మూలంలో నమోదు టీడీపీ కూటమి ప్రభుత్వంరాజకీయ కుట్రతోనే తమపై ఈ అక్రమ కేసు నమోదు చేసిందని మిథున్రెడ్డి సిట్ అధికారులకు విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు ఆ విషయాన్ని తాను వెల్లడించినట్టుగా వాంగ్మూలంలో సిట్ అధికారులతో రికార్డు చేయించారు. తన అభిప్రాయాన్ని అధికారికంగా నమోదు చేయాలని ఆయన పట్టుబట్టారు. దాంతో సిట్ అధికారులు ఆ విషయాన్ని నమోదు చేశారు. -
కట్టు కథలు.. తప్పుడు ప్రచారాలు.. కూటమి సర్కార్పై మిథున్రెడ్డి ఫైర్
సాక్షి, విజయవాడ: కూటమి సర్కార్ వచ్చాక తమపై కక్ష సాధింపులకు దిగుతున్నారని.. కట్టు కథలు అల్లి తప్పుడు ప్రచారాలకు తెగబడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి మండిపడ్డారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టను దిగజారుస్తున్నారని.. తమ సొంత భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ మిథున్రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని.. అందుకే మద్యం కేసు గురించి తాను పూర్తిగా మాట్లాడలేనని తెలిపారు. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో భాగంగా పెట్టిన కేసు మాత్రమే. నాపై పెట్టడానికి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి’’ అని మిథున్రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘మద్యం కేసు తప్పుడు కేసు అని చెప్పగలను. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానంలో కేసు గురించి తేలిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అంశంపై వివరంగా మాట్లాడతాను’’ అని మిథున్రెడ్డి చెప్పారు. -
బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అరాచకాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ‘‘చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్ పదవి ఏరకంగా వస్తుంది?..బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీకాలం పూర్తవుతుందని తెలిసీ, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా, ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబూ.. మీకులేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారు.ఇన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీవైపు, ప్రజలవైపు నీతి, నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైయస్సార్సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నాను.రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబుగారి కుటిల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న మా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్సాప్ చెప్తున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. .@ncbn గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.ప్రజలు ఇచ్చిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2025 -
‘సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన నాయకుడు జగన్’
తాడేపల్లి : సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన నాయకుడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సెల్ సమావేశంలో సజ్జల పాల్గొన్నారు.ఈ సమావేశానికి మాజీ మంత్రులు జోగి రమేష్, ధర్మాన కృష్ణదాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్, అన్ని జిల్లాల బీసీ నేతలు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని జగన్ నిరూపించారు. చంద్రబాబుది అవకాశవాద రాజకీయం. అధికారంలోకి రాగానే దోచుకోవడం, దాచుకోవడమే. ఈసారి మరింత బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఈ పది నెల చంద్రబాబు పాలన చూస్తేనే జనానికి అర్ధమవుతుంది. ఈ దుర్మార్గపు పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయాలి. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. గతంలో కంటే మెరుగ్గా పూర్తిస్థాయి కమిటీలు నియమించుకుందాం’ అని సజ్జల పేర్కొన్నారు.రాష్ట్రంలో నియంతృత్వ పాలనను చూస్తున్నాంఅధికార యంత్రాంగమే మాఫియా ముఠాలా వ్యవహరిస్తోంది.అందరూ కలిసి ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేస్తున్నారు, విశాఖలో నానారకాలుగా అక్రమాలు చేసి బీసీ మహిళను పదవి నుంచి తప్పించారు. కూటమి నేతల ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను గట్టిగా తిప్పికొడదాం’ అని సజ్జల సూచించారు. -
విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి
సాక్షి, అమరావతి: విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. న్యాయపరమైన రక్షణ తర్వాత విచారణకు హాజరవుతా. సాక్షిగా పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని లాయర్లు చెప్పారు. అందుకోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’’ అని రాజ్ కసిరెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే -
ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు విడుదల
సాక్షి, అమరావతి: ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం... దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల(ఉప వర్గీకరణ) నిబంధనలు–2025 పేరిట మార్గదర్శకాల(రూల్స్)ను విడుదల చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్లోని సెక్షన్–3 ప్రకారం రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా చేసి 15శాతం రిజర్వేషన్ను వర్గీకరించినట్లు తెలిపారు. » గ్రూప్–1లో ఉన్న 12 రెల్లి ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇందులో బావురి(సీరియల్ నంబర్ 8), చచటి(12), చండాల(16), దండసి(18), డోమ్, దొంబర, పైడి, పనో(20), ఘాసి, హడ్డి, రెల్లి చచండి(22), గొడగలి, గొడగుల(23), మెహతార్(48), పాకీ, మోతి, తోటి(51), పమిడి(53), రెల్లి(55), సప్రు(58) కులాలు ఉన్నాయి. » గ్రూప్–2లో 18 మాదిగ ఉపకులాలకు 6.50శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ గ్రూపులో అరుంధతీయ(సీరియల్ నంబర్ 5), బైండ్ల(10), చమర్, మోచి, ముచి, చమర్–రవిదాస్, చమర్–రోహిదాస్(14), చంభర్(15), డక్కల్, డొక్కల్వార్(17), ధోర్(19), గోదారి(24), గోసంగి(25), జగ్గలి(28), జంబువులు(29), కొలుపులవాండ్లు, పంబాడ, పంబండ, పంబాల(30), మాదిగ(32), మాదిగ దాసు, మష్తీన్(33), మాంగ్(43), మాంగ్ గరోడి(44), మాతంగి(47), సమగర(56), సింధోల్లు, చిందోల్లు(59) కులాలు ఉన్నాయి. » గ్రూప్–3లో 29 మాల ఉపకులాలకు 7.5శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ గ్రూపులో ఆది ద్రవిడ(సీరియల్ నంబర్ 2), అనాముక్(3), అరే మాల(4), అర్వమాల(6), బరికి(7), బయగార, బయగారి(11), చలవాడి(13), ఎల్లమలవార్, ఎల్లమ్మలవాండ్లు(21), హోలెయా(26), హోలెయ దాసరి(27), మాదాసి కురువ, మదారి కురువ(31), మహర్(34), మాల, మాల అయ్యవారు(35), మాలదాసరి(36), మాలదాసు(37), మాలహన్నాయి(38), మాలజంగం(39), మాలమస్తీ(40), మాలాసేల్, నెట్కాని(41), మాలసన్యాసి(42), మన్నె(45), ముండాల(50), సంబన్(57), యాతల(60), వల్లువన్(61), ఆది ఆంధ్ర(1), మస్తీ(46), మిత అయ్యాళ్వార్(49), పంచమ, పరియా(54) కులాలు ఉన్నాయి. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఎస్సీ ఉపకులాల వర్గీకరణలో మూడు గ్రూపుల్లోను మహిళలకు 33(1/3)శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నియామకాలు, బ్యాక్లాగ్ పోస్టులు తదితర వాటిలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ వర్తింపజేస్తారు. 200 రోస్టర్ పాయింట్లు... రెండు సర్కిల్స్గా అమలు ఆర్డినెన్స్లో పేర్కొన్న ఎస్సీ ఉప కులాలకు మొత్తం 200 రోస్టర్ పాయింట్లను రెండు సర్కిల్స్గా అమలుచేయాలని సీఎస్ నిర్దేశించారు. మొదటి వంద (1 నుంచి 100 వరకు)లో రెల్లి ఉపకులాలకు ఒకటి, మాదిగ ఉపకులాలకు ఆరు, మాల ఉపకులాలకు ఎనిమిది రోస్టర్ పాయింట్లు కేటాయించారు. రెండవ వంద(101 నుంచి 200 వరకు)కు రెల్లి ఉపకులాలకు ఒకటి, మాదిగ ఉపకులాలకు ఏడు, మాల ఉపకులాలకు ఏడు చొప్పున రోస్టర్పాయింట్లు కేటాయించారు. రోస్టర్ ప్రకారం మొదటి వంద పోస్టుల్లో గ్రూప్–1కు 2, గ్రూప్–2కు 7, 22, 41, 52, 66, 77, గ్రూప్–3కు 16, 27, 47, 62, 72, 87, 91, 97 రోస్టర్ విధానం నిర్ణయించారు. రెండవ వంద పోస్టుల్లో గ్రూప్–1కు 2, గ్రూప్–2కు 7, 22, 41, 52, 66, 77, 97, గ్రూప్–3కి 16, 27, 47, 62, 72, 87, 91 రోస్టర్ విధానాన్ని సిఫార్సు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చే నోటిఫికేషన్లలో పోస్టులకు రోస్టర్ పాయింట్ల ప్రకారం ఆయా గ్రూపుల్లో అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే వేరేవారితో భర్తీ చేకూడదు. నిర్దేశించిన వారి కోసమే రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలి. అప్పటికీ ఆ గ్రూపులో అర్హులైన అభ్యర్థులు లేకపోతే మూడవసారి నోటిఫికేషన్ ద్వారా ఆ తర్వాత గ్రూపులో అర్హులతో భర్తీ చేయవచ్చు. -
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: ఇప్పటికే టోఫెల్ ఎత్తేశారు.. అమ్మ ఒడి ఆపేశారు.. విద్యార్థుల ట్యాబ్లకు ఎగనామం పెట్టారు. నాడు–నేడు నిలిపివేశారు. గోరుముద్ద నాణ్యత తగ్గించేశారు. ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్లను ఎత్తివేస్తూ ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను పునర్ వ్యవస్థీకరించనున్నారు. ఐదు రకాల పాఠశాలలకు తగినట్లుగా టీచర్లను కేటాయించనున్నట్టు (టీచర్స్ రీపోర్షనేట్) పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఎంఈవోలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. దీని ప్రకారం రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. ఇందులో ఫౌండేషన్ స్కూల్ (1, 2 తరగతులు), బేసిక్ ప్రైమరీ స్కూల్ (1–5), మోడల్ ప్రైమరీ స్కూల్ (1–5), అప్పర్ ప్రైమరీ స్కూల్ (1–8), ఉన్నత పాఠశాలలు (1–10) ఉండనున్నాయి. టీచర్ల కేటాయింపు ఇలా.. » ఫౌండేషన్ (1, 2): ఒకటి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీ, 31–60 మంది వరకు ఇద్దరు ఎస్జీటీలు ఉంటారు. » బేసిక్ ప్రైమరీ (1–5): ఒకటి నుంచి 20 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీ, 21 నుంచి 60 వరకు విద్యార్థులుంటే ఇద్దరు ఎస్జీటీలు బోధిస్తారు. » మోడల్ ప్రైమరీ (1–5): 59 మంది విద్యార్థుల వరకు నలుగురు టీచర్లను కేటాయించారు. ఎస్జీటీల్లో మిగులు ఉంటే ఐదుగురిని కేటాయిస్తారు. విద్యార్థుల సంఖ్య 60 మంది, ఆపై 150 వరకు ఉంటే ఒక హెచ్ఎం, నలుగురు ఎస్జీటీలను ఇస్తారు. అలాగే, 120 దాటిన తర్వాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీని కేటాయిస్తారు. » ప్రాథమికోన్నత (యూపీ) పాఠశాలలు (1–8): ఈ పాఠశాలల్లోని 1–5 తరగతుల వరకు బోధనా సిబ్బంది నియామకానికి బేసిక్ ప్రైమరీ/ మోడల్ ప్రైమరీ స్కూళ్ల నిబంధనలే వర్తిస్తాయి. ఆరు నుంచి 8వ తరగతి వరకు 10 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీ, 11 నుంచి 30 వరకు ఇద్దరు ఎస్జీటీలు 31– 140 వరకు నలుగురు ఎస్జీటీలు, 141–175 మంది విద్యార్థుల వరకు ఐదుగురు ఎస్జీటీలను మంజూరు చేస్తారు. » ఉన్నత పాఠశాలలు (1–10): బేసిక్ ప్రైమరీ స్కూల్లో కేవలం ఎస్జీటీలే ఉంటారు. ఇందులో 10 మంది విద్యార్థుల వరకు ఇద్దరు టీచర్లు, 11 నుంచి 30 మంది విద్యార్థులకు ముగ్గురు, 31–40 మందికి నలుగురు, 40 మందికి పైన విద్యార్థులకు ఐదుగురు ఎస్జీటీలు ఉంటారు. 6–10 తరగతులకే సబ్జెక్టు టీచర్లు గత ప్రభుత్వంలో హైసూ్కళ్లలో విలీనమైన 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ బోధనను రద్దు చేశారు. కేవలం 6 నుంచి 10 తరగతులకు మాత్రమే స్కూల్ అసిస్టెంట్లు బోధిస్తారు. ఇందులో సెక్షన్ బట్టి టీచర్ల కేటాయింపు జరిగింది. సెక్షన్ల ఆధారంగా స్టాఫ్ ప్యాట్రన్ నిర్ణయించారు. 54 మంది విద్యార్థుల వరకు మొదటి సెక్షన్గా పరిగణిస్తారు. అనంతరం ప్రతి 40 మందికి ఒక అదనపు సెక్షన్గా లెక్కిస్తారు. ఇలా 5 నుంచి 25 సెక్షన్ల వరకు విభజించి, 8 నుంచి 31 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. ఉన్నత పాఠశాలల్లో 76 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీని కేటాయిస్తారు. అంతకంటే తక్కువుంటే ఈ పోస్టులు ఉండవు. జనవరిలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో 3–5 తరగతులతో ఏర్పాటు చేస్తామన్న మోడల్ ప్రైమరీ స్కూళ్ల ప్రస్తావన తాజా ఆదేశాల్లో లేకపోవడంపై టీచర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే
సాక్షి, అమరావతి: రెడ్బుక్ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం వెర్రితలలు వేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో బరితెగిస్తోంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పచ్చగణంతో కూడిన ‘సిట్’ ద్వారా దర్యాప్తు పేరిట అరాచకాలకు తెగబడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు.. వేధింపులు, బెదిరింపులు, కిడ్నాపులు, దాడులతో పోలీసులు గూండాగిరీకి తెగిస్తున్నారు. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, మరో ఇద్దరు ఉద్యోగులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. తనను వేధిస్తున్నారని కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి.. అనంతరం సిట్ చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఆ వాంగ్మూలానికి ఏం విశ్వసనీయత ఉంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక డిస్టిలరీల ప్రతినిధులపై దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో నిమిత్తం లేని ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి చుట్టూ దర్యాప్తును కేంద్రీకృతం చేస్తున్నారు. ఏమాత్రం సంబంధంలేని ఎంపీ మిథున్రెడ్డి, తదితరులను అక్రమ కేసులో ఇరికించడమే లక్ష్యంగా కుట్రలకు పదును పెడుతున్నారు.వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డిని అందుకే తెరపైకి తెచ్చారు. ఇలా చంద్రబాబు పక్కా పన్నాగంతో ఓ భేతాళ కథ అల్లుతున్నారు. ఇంతటి కుట్రలు, అరాచకానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు తెగబడుతోందంటే... సమాధానం ఒక్కటే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పారదర్శకంగా అమలు చేయడమే. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకే కూటమి ప్రభుత్వం ఇంతటి కుతంత్రాలకు పాల్పడుతోందన్నది సుస్పష్టం.దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకంవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగిస్తోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూష ఉదంతమే ఇందుకు తార్కాణం. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయన డెప్యుటేషన్ ముగిసినప్పటికీ రిలీవ్ చేయలేదు. తాము చెప్పినట్టుగా సీఆర్పీపీ 164 సెక్షన్ కింద అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వాసుదేవరెడ్డిని పోలీసులు తీవ్ర స్థాయిలో వేధించారు. తాము చెప్పినట్టు చేస్తేనే రిలీవ్ చేస్తామని, లేకపోతే ఎప్పటికీ సర్వీసులో చేరలేరని హెచ్చరించారు. ఆయన్ను అపహరించుకునిపోయి మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో ఉంచి బెదిరించారు. కుటుంబ సభ్యులను సైతం బెదిరించారు. పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా వాసుదేవరెడ్డి న్యాయస్థానాన్ని మూడుసార్లు ఆశ్రయించారు కూడా. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం తన కుతంత్రాలను కొనసాగించింది. ఆయన్ను తీవ్ర స్థాయిలో రోజుల తరబడి బెదిరించి లొంగదీసుకుంది. వాసుదేవరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అంటే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు కోసం ఎంతగా బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను కూడా తీవ్ర స్థాయిలో వేధించారు.అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఈ కేసులో సాక్షులుగా పేర్కొంటామని.. లేకపోతే అక్రమ కేసుల్లో దోషులుగా ఇరికించి వేధిస్తామని బెదిరించారు. దాంతో వారిద్దరు కూడా సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ విధంగా బెదిరించి, వేధించి నమోదు చేసే వాంగ్మూలాలకు ఏం విశ్వసనీయత ఉంటుంది.. ఏం ప్రామాణికత ఉంటుంది..? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.బరితెగిస్తున్న సిట్ఈ కేసులోదర్యాప్తు ముసుగులో సిట్ అధికారులు చేస్తున్న అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాల్లో డిస్టిలరీల ప్రతినిధుల నివాసాల్లో సోదాల పేరుతో సిట్ అధికారులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. డిస్టిలరీల ప్రతినిధులను బలవంతంగా విజయవాడకు తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించారు. ఒకర్ని తీవ్రంగా కొట్టారు కూడా. వృద్ధులని కూడా చూడకుండా శార్వాణీ ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్లను సిట్ అధికారులు కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమను ఇంటి వద్దే విచారించేట్టుగా ఆదేశించాలని కోరారు. ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్ను వారి ఇంటి వద్దే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అబద్ధపు వాంగ్మూలాల నమోదు కోసం సిట్ పాల్పడుతున్న అరాచకాలకు ఈ ఉదంతం ఓ మచ్చుతునక మాత్రమే.అందుకే తెరపైకి విజయ సాయిరెడ్డి అక్రమ కేసు కుట్రను కొనసాగిస్తూ చంద్రబాబు పక్కా పన్నాగంతోనే మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డిని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఆయనతో తాము లక్ష్యంగా చేసుకున్నవారి పేర్లు చెప్పించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా రాజ్యసభలో కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా సిట్ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు అసలు కుట్రను బయట పెట్టాయి. మద్యం విధానంపై కొందరు తన ఇంట్లో నిర్వహించిన సమావేశంలో కొందరు పాల్గొన్నారు.మరికొందరు పాల్గొన్నారో లేదో గుర్తు లేదని విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. గుర్తుకు వచ్చాక ఆ విషయం చెబుతానన్నారు. అంటే భవిష్యత్లో చంద్రబాబు ఏం చెప్పమంటే అది చెబుతా అని పరోక్షంగా స్పష్టం చేశారు.మద్యం విధానంతో రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం!?మాజీ ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి కేంద్ర బిందువుగా దర్యాప్తు కొనసాగిస్తుండటం కూడా సిట్ కుట్రలో భాగమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంతో అసలు రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం? ప్రభుత్వంలో ఎందరో సలహాదారుల్లో ఆయన ఒకరు. సలహాదారుగా ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెన్యువల్ కూడా చేయనే లేదు. ఇక రాజ్ కసిరెడ్డికి బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో సంబంధమే లేదు. ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే బెవరేజస్ కార్పొరేషన్కు చైర్మన్గానే నియమించి ఉండేవారు కదా.. కానీ ఆయనకు అంతా తెలుసని విజయ సాయిరెడ్డి చెప్పడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నది తేటతెల్లమవుతోంది. తద్వారా మునుముందు మరిన్ని అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోందని స్పష్టమవుతోంది.అవినీతి లేదు.. కుంభకోణం అసలే లేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా మద్యం విధానంచట్టాలను ఉల్లంఘిస్తూ.. న్యాయ స్థానాలను బేఖాతరు చేస్తూ మరీ చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇంతగా బరితెగిస్తోందన్నది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసు కాబట్టి. అసలు మద్యం విధానంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అంతకు ముందు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన మద్యం సిండికేట్ దోపిడీని నిర్మూలించింది. ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాల సంఖ్యను 2,934 కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. 2019 వరకు మద్యం దుకాణాలకు అనుబంధంగా అనధికారిక బార్లుగా కొనసాగిన 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 14 డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వగా... వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం దుకాణాల వేళలను కుదించింది. మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచి మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచింది. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గితే డిస్టిలరీలకు లాభాలు తగ్గుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి లాభాలు తగ్గితే డిస్టిలరీలు ప్రభుత్వానికి ఎందుకు కమీషన్లు ఇస్తాయని ఎవరైనా ప్రశ్నిస్తారు. మద్యం అమ్మకాలను పెంచితే.. తద్వారా లాభాలు పెరిగితే అందుకు ప్రతిగా ప్రభుత్వానికి కమీషన్లు ఇస్తారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాలతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్న వాస్తవం. మరి డిస్టిలరీలు.. కమీషన్లు ఇవ్వవవన్నది నిగ్గు తేలిన నిజం. అయినా సరే కేవలం రెడ్బుక్ కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. అందుకోసమే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు కుతంత్రాలకు తెగబడుతోందన్నది సుస్పష్టం. వాస్తవంగా కుంభకోణమే జరిగితే.. దర్యాప్తు పేరిట ఇంతటి అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు, అవనీతి జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు సాక్ష్యాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోందన్నది సుస్పష్టం. -
టీటీడీ గోవుల మరణాలపై కోర్టులో కేసు వేస్తా
సాక్షి, అమరావతి: టీటీడీ గోశాలలో ఒకేసారి వందల గోవులు చనిపోవడం అనుమానాలు రేకెత్తిస్తోందని, దీనివెనుక కుట్ర ఉందని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి, విరాట్ హిందూస్థాన్ సంఘం అధ్యక్షుడు సుబ్రమణియన్స్వామి అభిప్రాయపడ్డారు. కొన్ని గోవులే చనిపోయాయని తేలిగ్గా వదిలేసే విషయం కాదని, ఇది చాలా తీవ్రమైన అంశమని అన్నారు. తిరుపతి నుంచి అధికారికంగా అందుబాటులో ఉన్న సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తిరుమల వెళ్లి పూజల్లో పాల్గొన్న అనంతరం గోవుల మరణంపై అదనపు సమాచారం సేకరించి, జూలై మొదటి వారంలోగా కోర్టును ఆశ్రయించనున్నట్లు వివరించారు. సమర్థ చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తోందని, ఇదొక సర్వ సాధారణంగా మారిందని సుబ్రమణియన్స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లమంది ఆరాధ్య దైవంగా భావించే గోవుల రక్షణకు రాజ్యాంగ పరంగా ప్రాధాన్యం ఉందని.. కానీ, టీటీడీ పెద్దలు, ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని పేర్కొన్నారు. గోవుల మృతిపై టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని సుబ్రమణియన్స్వామి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని, లేదంటే సీఎం చంద్రబాబే తప్పించాలని డిమాండ్ చేశారు. సుబ్రమణియన్స్వామి శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘టీటీడీ గోవుల మృతి నాకు చాలా బాధ కలిగించింది. ఎన్ని చనిపోయాయన్నది కాదు. రాజ్యాంగంలో గో సంరక్షణ గురించి స్పష్టంగా ఉంది. ప్రతి ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉండాలి. వయసు మళ్లిన మనుషుల్లాగే గోవులు కూడా చనిపోతున్నాయంటూ టీడీడీ చైర్మన్ బాధ్యతారహితంగా మాట్లాడారు. రేపు నువ్వు చనిపోతే కూడా వయసు మళ్లిందని వదిలేస్తారా? ఎవరినైనా వృద్ధులని చంపేస్తుంటే అది సాధారణమే అనుకోవచ్చా? ఇవి పరిణతి లేని వ్యాఖ్యలు.చంద్రబాబు ప్రభుత్వానిది వ్యాపార ధోరణిగోవుల జీవనశైలి భిన్నమైనది. చాలా ఊళ్లలో ఎవరి అజమాయిషీ లేకుండా ఆరోగ్యంగా జీవిస్తుంటాయి. ఒకేసారి పెద్ద సంఖ్యలో చనిపోయే పరిస్థితి సాధారణంగా ఉండదు. టీటీడీలో చంద్రబాబు ప్రభుత్వ వ్యాపార ధోరణి కారణంగా ఇలా జరుగుతుండొచ్చు. గోవులకు సరైన వైద్యం అందించకుండా వదిలేస్తున్నందుకే ఇలా జరిగి ఉండొచ్చు. ఈ విషయాన్ని ఆషామాషీగా తీసుకోలేం. గోవుల కళేబరాలను ఏం చేశారన్నది తేలాల్సి ఉంది. మాంసాన్ని రెస్టారెంట్లకు పంపుతున్నారా? గోవు కోట్లాది మందికి ఆరాధ్య దైవం. రాజ్యాంగంలో గోవుకు అత్యున్నత స్థానం కల్పించారు. టీటీడీ చైర్మన్ దానిగురించి తెలుసుకోవాలి. రాజ్యాంగంపై అవగాహన ఉన్నవారు ఎవరూ అలా మాట్లాడరు. ఒకేసారి పెద్ద సంఖ్యలో గోవుల మృతి వెనుక టీటీడీ నిర్లక్ష్యం ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అందుకని టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి.టీటీడీలో పాలనా వైఫల్యంవరుస ఘటనలు టీటీడీ పాలనా వైఫల్యాలే. టీటీడీ బోర్డు పాలన అధ్వానంగా ఉంది. సీఎం వెంటనే చైర్మన్ను బర్తరఫ్ చేయాలి. గత ప్రభుత్వంలో టీటీడీ నిర్వహణ చేపట్టినవారు ప్రతి అంశంలో బాధ్యతగా వ్యవహరించారు. చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు. ఎవరు ఏమడిగినా సమాధానం ఇచ్చేవారు. -
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
సాక్షి, అమరావతి: కావాల్సిన వారికి కారు చౌకగా భూములు కేటాయించాలంటే ఏం చేయాలి..? ముందుగా పేరెన్నికగన్న కంపెనీకి అలా కొంత భూమి కేటాయించి.. అదే మా పాలసీ అంటూ మనవాళ్లకు కట్టబెట్టేయడమే. ఇప్పుడు కూటమి సర్కారు అమలు చేస్తున్నది ఇదే.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఐటీ కంపెనీలకు చౌకగా భూములు కేటాయించే అంశాన్ని పరిశీలించండి అని మంత్రి నారా లోకేశ్.. సీఎం చంద్రబాబుకు చెప్పడం.. వెంటనే ఆయన ఆ విధంగా ఐటీ పాలసీని రూపొందించండి అంటూ అధికారులను ఆదేశించడం.. అసలు ఐటీ పాలసీ రాకుండానే ఐటీ కంపెనీలకు ఎకరా రూ.50 కోట్ల విలువ చేసే భూమిని 99 పైసలకే కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదించడం వెంటవెంటనే జరిగిపోయాయి. వాస్తవానికి భారీ లాభాలతో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చౌకగా భూములు కేటాయించండి అని అడగనేలేదు. అయినా, విశాఖ ఐటీ హిల్ నంబర్ 3లో 21.16 ఎకరాలను ఎకరా 99 పైసలకే టీసీఎస్కు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా మంచి పేరున్న టీసీఎస్కి చౌకగా భూములు కేటాయించినా ఎవరూ ఏమీ అనరు అన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే, ఇక్కడే ఉంది అసలు సిసలైన గిమ్మిక్కు. ‘‘ఇదిగో ఇదీ మా ఐటీ పాలసీ’’ అంటూ ఘనంగా ప్రచారం చేసుకుంటూ స్వామి కార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టేస్తోంది. అలా టీసీఎస్కు భూమి కేటాయించగానే.. ఇలా డేటా సెంటర్ పేరుతో ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు ఏకంగా 60 ఎకరాల విలువైన భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడో విచిత్రం ఏమిటంటే ఈ కంపెనీ ఏర్పాటైంది రెండు నెలలు క్రితమే. అయినప్పటికీ అత్యంత విలువైన ఐటీ హిల్ నెంబర్3 లో 3.5 ఎకరాలు , కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించడానికి రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చేసింది. టీసీఎస్ పాలసీ ముసుగుఉర్సా క్లస్టర్కు భూమిని ఎంత రేటుకు కేటాయిస్తుంది మంత్రి మండలిలో స్పష్టంగా చెప్పకుండా పాలసీ నియమ నిబంధనల ప్రకారం భూకేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. పాలసీ ప్రకారం రెండు నెలల క్రితం ఏర్పాటైన ఉర్సా క్లస్టర్కు కారు చౌకగా భూములు కేటాయించడానికి ప్రభుత్వం ఈ విధానం ఎంచుకుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మధురవాడ, కాపులుప్పాడలో ఎకరా రూ.50 కోట్లపైనే పలుకుతోంది. ఇంతటి ఖరీదైన భూములను తమ వారి చేత కంపెనీలు పెట్టించి భూములు కొట్టేసే విధంగా కూటమి సర్కారు ప్రణాళికలు వేస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు టీసీఎస్కు ఇచ్చిన ప్రకారం ఎకరా 99 పైసలకే ఇస్తే సుమారు రూ.3,000 కోట్ల విలువైన భూములను కేవలం రూ.59కే ఇచ్చే విధంగాప్రభుత్వ ముఖ్య నేతలు ఎత్తుగడ వేశారంటున్నారు. ఫిబ్రవరి 12న హైదరాబాద్ కేంద్రంగా ఉర్సా క్లస్టర్స్ కంపెనీ ఏర్పాటైంది. అప్పటి వరకు శంషాబాద్ జీఎంఆర్ ఎయిర్పోర్టులో మేనేజర్గా పనిచేస్తున్న పెందుర్తి విజయకుమార్, అమెరికాలో మన రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ అబ్బూరి కలిసి రూ.9.10 లక్షల మూలధనంతో కంపెనీని ఏర్పాటు చేశారు. కేవలం రెండు నెలల క్రితం అదీ కూడా డేటా సెంటర్, ఐటీ కార్యాలయాలు నిర్వహణలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు ఏర్పాటు చేసిన సంస్థకు ఇంతటి ఖరీదైన భూములు కేటాయిస్తుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎటువంటి రాయితీలు లేకుండానే టీసీఎస్ మిలియన్ టవర్లో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే అడగకపోయినా 99 పైసలకే భూములు కేటాయిస్తూ... దీన్ని ఒక పాలసీగా చూపిస్తూ విలువైన భూములను రాజమార్గంలో కొట్టేయడమేనని పదవీ విరమణ చేసిన మాజీ ఐఏఎస్ ఒకరు వ్యాఖ్యానించారు.ఇలా పెట్టు.. అలా భూమి పట్టు‘ముందుగా వచ్చి మాట్లాడు.. ఆ తర్వాత వెళ్లి కంపెనీ పెట్టు.. వెంటనే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకో.. ఆ తర్వాత వందల ఎకరాల భూమి తీసుకో..’ ఇప్పుడిది మన రాష్ట్రంలో జరుగుతున్న తీరు. గతేడాది డిసెంబర్ ఆఖరు వారంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కొంతమంది వ్యక్తులు వచ్చి కలిసి వెళ్లారు. వెంటనే జనవరి 3న రూ.కోటి మూలధనంతో కాన్పూర్ ఆర్వోసీలో ఇండిచిప్ పేరిట కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ వెంటనే జనవరి 11న ఏకంగా రూ.14,000 కోట్లతో కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తరప్రదేశ్లోని నోయిడా కేంద్రంగా ఏర్పాటైన ఇండిచిప్ సెమీ కండక్టర్ కంపెనీలో పీయూష్ బిచోరియా, వెబ్ చాంగ్, సందీప్ గార్గ్లు డైరెక్టర్లుగా, కీలక అధికారిగా రాజీవ్ వ్యవహరిస్తున్నారు. వీరికి ఇంత వరకు సెమీకండక్టర్ తయారీ విభాగంలో ఎలాంటి అనుభవం లేదు.. అంత ఆర్థిక శక్తి కూడా లేదు. అయినప్పటికీ ఇప్పుడు ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్లో అత్యంత విలువైన వందల ఎకరాలను ఇండిచిప్కు అత్యంత చౌకగా కేటాయించనున్నారు. అలాగే రెండు నెలల క్రితం ఏర్పాటైన చింతా గ్రీన్ ఎనర్జీ తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో సుమారు రూ.10,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఐదో రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ కంపెనీలో నవయుగ గ్రూపునకు చెందిన చింతా విశ్వేశ్వరరావు, అట్లూరి గౌరీనాథ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కారులోని పెద్దలకు అత్యంత దగ్గరగా ఉండే నవయుగ గ్రూపునకు గ్రీన్ ఎనర్జీ పేరిట వేల ఎకరాలను కట్టబెట్టనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకనేతగా ఉన్న వ్యక్తికి అత్యంత సన్నిహితునిగా ఉన్న పేరున్న కిలారు సునీల్కి చెందిన డల్లాస్ టెక్నాలజీ సెంటర్ రూ.50 కోట్లతో పెట్టుబడి పెడుతుందంటూ తొలి ఎస్ఐపీబీలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి చెందిన డల్లాస్ టెక్నాలజీ సెంటర్ను టీసీఎస్కు కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చివరకు టీసీఎస్ను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి చెందిన మిలీనియం టవర్స్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా అత్యంత విలువైన భూములను సొంత వారికి వేగంగా కేటాయిస్తూ పోతుండటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని నిర్మాణ పనుల్లో.. రూ.9,000 కోట్ల ప్రజాధనానికి ’టెండర్’!
అప్పు చేసి పప్పు కూడు తినకూదదంటారు పెద్దలు..! ఎందుకంటే చేసిన అప్పును వడ్డీతో కలిపి చెల్లించాలి కాబట్టి..! అప్పుగా తెచ్చిన డబ్బులను ఆస్తుల కల్పన కోసం కాకుండా జల్సాలకు ఖర్చు చేస్తే ఇల్లు గుల్లవుతుంది కాబట్టి! రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ పెద్దలు రాజధానికి రుణ పాశం బిగిస్తున్నారు! అప్పు చేసి మరీ జేబులు నింపుకొంటున్నారు! రాజధాని అమరావతి నిర్మాణ పనులే అందుకు నిదర్శనం. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే రూ.31 వేల కోట్లు అప్పులు తెచ్చిన కూటమి సర్కారు మరో రూ.46,249 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తోంది. అలా అప్పు తెచ్చిన నిధులతో చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి సిండికేట్ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెడుతోంది. కాంట్రాక్టు అగ్రిమెంట్ విలువలో పది శాతం మొబిలై జేషన్ అడ్వాన్సు ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని ముఖ్యనేత నాకింత..! అంటూ వసూలు చేసుకుంటున్నారు. జ్యుడీషియల్ ప్రివ్యూ–రివర్స్ టెండరింగ్ విధానానికి పాత రేసి.. అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి దోచేస్తూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడంపై ఆర్థిక నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధాని పనుల టెండర్లలో ఈ సిండి ‘కేటు’ దందా తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే!! సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో 2014లో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు కాజేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు రాజధాని నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున దోపిడీకి తెర తీశారు. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించక ముందే సన్నిహితులకు చెందిన తొమ్మిది కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేత సిండికేట్ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.40,497.55 కోట్ల విలువైన 63 ప్యాకేజీల పనులను సిండికేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఆ మేరకు పనులు అప్పగిస్తూ సిండికేట్ కాంట్రాక్టర్లతో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్) అగ్రిమెంట్ (ఒప్పందం) చేసుకున్నాయి. ఆ వెంటనే అగ్రిమెంటు విలువలో పది శాతం అంటే రూ.4,049.75 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పాయి. అందులో ఎనిమిది శాతం అంటే రూ.3,239.80 కోట్లను ముఖ్యనేత వసూలు చేసుకున్నారు! అధిక ధరలకు కట్టబెట్టి.. రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రూ.5 వేల కోట్లు.. వెరసి రూ.31 వేల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెచ్చింది. రాజధాని నిర్మాణ పనులకు రూ.77,249 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశామని.. మరో 46,249 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తున్నామని ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు చెప్పారు. అప్పు తెచ్చిన నిధులతో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు. పనుల అంచనాలను భారీగా పెంచేశారు. అధిక ధరలకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానాపై తీవ్ర భారం మోపారు. » ప్రస్తుత ఎస్ఎస్ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్లకు మించదు. ప్రస్తుత ధరల ప్రకారం మట్టి తవ్వకానికి క్యూబిక్ మీటర్కు రూ.వంద చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 10 నుంచి 11 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ తవ్వకానికి కి.మీ.కి రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్లకు మించి వ్యయం కాదని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ రాజధాని వరద ముంపు నివారణ పనుల్లో 0.4 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన నీరుకొండ రిజర్వాయర్ నిర్మాణ పనులకు రూ.470.74 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. ఆ పనిని రూ.487.41 కోట్లకు(3.54 శాతం అధిక ధరకు) ఎన్సీసీ సంస్థకు అప్పగించారు. జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్ చేయనున్నారు. అంటే 0.4 టీఎంసీల సామర్థ్యం కలిగిన నీరుకొండ రిజర్వాయర్ పనులను రూ.555.41 కోట్లకు కట్టబెట్టినట్లు స్పష్టమవుతోంది. అంచనా వ్యయాన్ని రూ.305.41 కోట్లు పెంచేసినట్లు వెల్లడవుతోంది. » దేశంలో ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) కి.మీ.కి సగటున రూ.20 కోట్ల చొప్పున ఆరు వరుసలతో కూడిన జాతీయ రహదారులను నిర్మిస్తోంది. కానీ అమరావతిలో ఆరు వరుసల రహదారి నిర్మాణ పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. ఈ–13 రహదారిని ఎన్హెచ్–16 వరకూ పొడిగిస్తూ 7.29 కి.మీ.ల పొడవున ఆరు వరుసలతో నిర్మించడానికి రూ.384.78 కోట్ల అంచనాతో ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీఎస్టీ, సీనరేజీ లాంటి పన్నుల రూపంలో 81.92 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. అంచనా వ్యయం రూ.466.7 కోట్లు అన్నమాట. ఈ లెక్కన కి.మీకి 64.01 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణ పనులకు టెండర్ పిలిచినట్లు స్పష్టమవుతోంది. జాతీయ రహదారికి కి.మీ.కి అయ్యే వ్యయం కంటే ఈ–13 రహదారి వ్యయం రూ.44.01 కోట్లు అధికంగా పెంచేశారు. » భూసమీకరణ కింద రాజధానికి 29,357 మంది రైతులు 34,773.76 ఎకరాల భూమిని ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ స్కీం కింద ఆ రైతులకు 17 వేల ఎకరాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలి. ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధి పనులకు 18 ప్యాకేజీల కింద రూ.14,887.64 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించింది. కాంట్రాక్టు విలువలో 18 శాతం జీఎస్టీ, 0.45 శాతం సీనరేజీ, 0.1 శాతం న్యాక్ పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. అప్పుడు వాటి వ్యయం రూ.2,761.66 కోట్లు ఇస్తారన్నమాట. ఈలెక్కన ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధి పనుల కాంట్రాక్టు విలువ రూ.17,649.3 కోట్లుకు చేరుతుంది. ఈ లెక్కన ఎకరంలో లే అవుట్ అభివృద్ధికి రూ.కోటికి పైగా వెచ్చిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించి లేఅవుట్ను అభివృద్ధి చేసినా ఎకరానికి రూ.50లక్షల నుంచి రూ.60 లక్షలకు మించదని బడా రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. » అత్యాధునిక హంగులతో భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదు. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన రాజధానిలో భవనాల నిర్మాణ వ్యయం తగ్గాలి. కానీ వ్యయాన్ని భారీగా పెంచేసి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులను చదరపు అడుగుకు రూ.10,042.86 చొప్పున అప్పగించడం గమనార్హం. మిగతా భవనాల నిర్మాణ పనుల్లోనూ అదే తీరు.జ్యుడీషియల్ ప్రివ్యూ–రివర్స్ టెండరింగ్ రద్దు.. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా జ్యుడీషియల్ ప్రివ్యూ–రివర్స్ టెండరింగ్ విధానం వల్ల 2019–24 మధ్య ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేసి రాజధాని పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. ఇప్పటిదాకా కాంట్రాక్టర్లకు అధిక ధరలకు రూ.40,497.55 కోట్ల విలువైన పనులు అప్పగించింది. దీనివల్ల ఖజానాపై రూ.1231.42 కోట్ల మేర భారం పడింది. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా టెండర్లు నిర్వహించి ఉంటే కాంట్రాక్టర్లు పోటీ పడి ఖజానాకు రూ.3,500 నుంచి రూ.4 వేల కోట్ల మేర ఆదా అయ్యే అవకాశం ఉండేదని ఇంజినీరింగ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బీఎస్సార్కు రూ.7,298.97 కోట్లు.. ఆర్వీఆర్కు రూ.6,031.79 కోట్ల పనులురాజధాని పనుల టెండర్లలో సిండికేట్ కాంట్రాక్టు సంస్థలు మినహా ఇతరులు బిడ్లు దాఖలు చేస్తే టెక్నికల్ బిడ్లోనే ఆ సంస్థపై అనర్హత వేటు వేస్తున్నారు. » సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్కు జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నులతో కాకుండా రూ.7,298.97 కోట్ల విలువైన పనులు ఇప్పటికే అప్పగించారు. » సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కృష్ణారెడ్డికి చెందిన మేఘా సంస్థకు జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నులతో కాకుండా రూ.7,022.38 కోట్ల విలువైన పనులను అప్పగించేశారు. » టీడీపీకి బాకా ఊదే ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు రూ.6,031.79 కోట్లు విలువైన పనులు కట్టబెట్టారు. » ఎన్సీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఏవీ రంగరాజు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆ సంస్థకు శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం సహా రూ.6,910.93 కోట్ల విలువైన పనులు అప్పగించారు. » ఎల్ అండ్ టీ సంస్థకు శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణంతోపాటు రూ.1,427.21 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. » నారా లోకేశ్ తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్కు అత్యంత సన్నిహితుడు ఎం.వెంకట్రావు. ఆయనకు చెందిన ఎంవీఆర్ ఇన్ఫ్రా సంస్థకు రూ.796.04 కోట్ల విలువైన పనులు అప్పగించారు. » చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన బీఎస్సీపీఎల్ సంస్థకు రూ.779.82 కోట్ల విలువైన పనులు అప్పగించారు. » సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్కు ఆప్తుడైన కనకమేడల వరప్రసాద్కు చెందిన కేఎంవీ ప్రాజెక్ట్స్కు రూ.429.23 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. » జాయింట్ వెంచర్గా ఏర్పడిన పీవీఆర్ కన్స్ట్రక్షన్స్–కె.రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకు రూ.309.6 కోట్ల విలువైన పనులు అప్పగించారు. మరో రూ.7,202.3 కోట్ల పనులూ సిండికేట్కే.. గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్కు సంబంధించి నాలుగు ప్యాకేజీల కింద రూ.1,960.36 కోట్ల అంచనాతో నాలుగు ప్యాకేజీల కింద పిలిచిన టెండర్లు ఆర్థిక బిడ్ దశలో ఉన్నాయి. ఈనెల 16న శాశ్వత సచివాలయం నిర్మాణంలో భాగంగా ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణానికి రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ టెండర్లు పిలిచింది. ఈ–13, ఈ–15 రహదారుల పొడిగింపు పనులకు రూ.553.12 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్ల దశలో ఉన్న ఈ రూ.7,202.3 కోట్ల విలువైన పనులను సిండికేట్ కాంట్రాక్టర్లకే కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు. రాజధానికి వరద ముప్పును నివారించేందుకు కొండవీటివాగుపై మరో ఎత్తిపోతల, గ్రావిటీ కెనాల్పై మరో నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి.. కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఏడీసీఎల్, సీఆర్డీఏ కసరత్తు చేస్తున్నాయి. ఈ పనులు కూడా సిండికేట్ కాంట్రాక్టు సంస్థలకే కట్టబెట్టనున్నారనే అభిప్రాయం అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ప్రాథమిక అంచనా వ్యయం రూ.77,249 కోట్లు.. రాజధాని పనులకు ప్రాథమిక అంచనా వ్యయం రూ.77,249 కోట్లు అని ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ, హడ్కో నుంచి రూ.31 వేల కోట్లు రుణం తెచ్చారు. మరో రూ.46,249 కోట్ల రుణం కోసం ఆర్థిక సంస్థలు, జాతీయ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చదరపు అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున చెల్లించారు. అంటే అంచనా వ్యయం చదరపు అడుగుకు రూ.15,833 పెరిగింది.తాత్కాలిక సచివాలయం నిర్మాణ వ్యయమే ఈ స్థాయిలో పెరిగితే శాశ్వత నిర్మాణాల వ్యయం ఇంకెంత పెరుగుతుందో ఊహించుకోవచ్చు. కనీసం రూ.లక్ష కోట్ల నుంచి 1.50 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ డబ్బంతా అప్పులు తేవాల్సిందే. అదంతా వడ్డీతో సహా చెల్లించాల్సిందే. ఇలా అప్పు తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలసి దోచుకుంటూ రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారనే ఆందోళన అటు మేధావులు.. ఇటు అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఇదీ స్థూలంగా నష్టం..!రాజధాని పనులను అధిక ధరలకు కట్టబెట్టడం వల్ల జానాపై అదనపు భారం: రూ.1,231.42 కోట్లకుపైగాజ్యుడీషియల్ ప్రివ్యూ– రివర్స్ టెండరింగ్ అమలు చేయకపోవడంతో నష్టం: రూ.4,000 కోట్లుకాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి 8 శాతం కమీషన్లు వసూళ్లతో అక్రమాలు: రూ.3,200 కోట్లకుపైగా -
ఈవీ @20 లక్షలు
సాక్షి, అమరావతి: పెరుగుతున్న పెట్రోల్ ధరలకు తోడు కలవరపెడుతున్న కాలుష్యం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే విద్యుత్ వాహనాల(ఈవీ)లను వాడాలని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఓ నినాదం ఉద్యమంలా నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే మన దేశంలోనూ విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీలను రూపొందించి అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 20 లక్షల విద్యుత్ వాహనాల విక్రయాలు జరగడమే ఇందుకు నిదర్శనం. 2023–24లో ఈ సంఖ్య 16 లక్షలు ఉండేది. జేఎంకే రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ విడుదల చేసిన ‘ఇండియా ఈవీ వార్షిక నివేదిక కార్డ్ 2025’ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. ఈవీ విక్రయాలు ఇలా..2024–25 ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన 20 లక్షల విద్యుత్ వాహనాల్లో సగం (60 శాతం)పైగా ఈవీ ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. అంటే 12 లక్షలు ఈవీ మోటార్ సైకిళ్ల విక్రయాలు జరిగాయి. 2023తో పోల్చితే ఈవీ విక్రయాల వృద్ధి 24 శాతం. ప్రయాణికులు, సరుకు రవాణాకు వినియోగించే త్రిచక్ర వాహనాల వాటా దాదాపు 36 శాతం. వీటి విక్రయాలు సుమారు 7 లక్షల వరకు జరిగాయి. మొత్తంగా 2020 నుంచి చూస్తే నాలుగేళ్లలో 61.66 లక్షల వాహనాల కొనుగోలు జరిగింది. ఈ ఫలితం.. గత ప్రభుత్వ పుణ్యమే ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. వీటికి సంబంధించి సర్వీస్ చార్జీలను నిర్ణయించాల్సిందిగా రాష్ట్రాలకు గతంలో కేంద్రం సూచించింది. ఈమేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోని గత ప్రభుత్వం చొరవ చూపింది. ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) నేతృత్వంలో 266 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒక ఈవీ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది. టెండర్లు కూడా పిలిచింది. ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలన్నీ నిలిచిపోయాయి.‘ఇండియా ఈవీ వార్షిక నివేదిక కార్డ్ 2025’ ప్రకారం.. » ఈవీ విక్రయాలు, వినియోగంలో మొదటి ఐదు రాష్ట్రాలుః ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ » ద్విచక్ర ఈవీ విక్రయాల్లో 50 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే జరిగాయి. » తొలి మూడుస్థానాల్లో ..ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ సంస్థలు » 70 శాతం విక్రయాలు ఈ మూడు సంస్థలవే. » మూడు చక్రాల వాహనాల్లో 11% పెరుగుదల » విద్యుత్ కార్ల విక్రయాల్లో 11 శాతం వృద్ధి » గతేడాదిలో లక్ష విద్యుత్ కార్ల విక్రయాలు » ఈవీ కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్56 శాతంతో ముందంజ » ఎంజీ మోటార్స్ 28 శాతంతో రెండో స్థానం » ఎలక్ట్రిక్ బస్సుల విక్రయాలు 3,834 » గతేడాది కంటే 3 శాతం క్షీణించిన ఈవీ బస్సుల విక్రయాలు -
టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము కలకలం
తిరుపతి,సాక్షి: తిరుపతి టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము కలకలం రేపింది. గురువారం రాత్రి నాగుపాము ప్రత్యక్షమవ్వడంతో అప్రమత్తమైన టీటీడీ ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులు సమాచారం ఇచ్చారు. ఈవో శ్యామలరావు సమాచారంతో పామును పట్టుకునేందుకు రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడు బంగ్లాకు చేరుకున్నారు. బంగ్లాలో బుసలు కొడుతున్న పామును చాకిచక్యంగా పట్టుకున్నారు. అనంతరం, పామును గోనె సంచిలో వేస్తుండగా ఒక్కసారిగా ఆయన చేతిపై కాటు వేసింది.దీంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర చికిత్స నిమిత్తం రవీందర్ నాయుడును స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులోనే చికిత్స కొనసాగుతోంది. -
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
పల్నాడు జిల్లా,సాక్షి: దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ తనను బాగా ఇబ్బంది పెట్టారంటూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి గురజాల కోర్టు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.రెడ్బుక్ రాజ్యాంగం మేరకు పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని పోలీసులు గురువారం గురజాల కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో పాలేటి కృష్ణవేణి అరెస్టుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. ‘దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. నిన్న సాయంత్రం హైదరాబాదులో ఐదు గంటల పది నిమిషాలకు నన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. రాత్రి తినడానికి నాకు ఆహారం కూడా ఏమి పెట్టలేదు. మూడున్నరకి కొంత ఆహారం పెట్టారు. మేం చెప్పినట్టు వినకపోతే సీఐ భాస్కర్ కేసులు పెడతామని బెదిరించారు.నా భర్త రాజ్ కుమార్పైన గంజాయి కేసు పెడతామని సీఐ భాస్కర్ బెదిరించారు. నీ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం అని సీఐ భాస్కర్ నన్ను వేధించాడు. నీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా అని టార్చర్ చేశారు. ఈ పోస్టులు వెనక పార్టీ నాయకులు ఎవరెవరు ఉన్నారో చెప్పమని ఇబ్బంది పెట్టారు. పార్టీ నాయకుల పేర్లు చెప్పమని బలవంతం చేశారు’ అని అన్నారు. అయితే తాను పెట్టిన పోస్టులకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కృష్ణవేణి న్యాయమూర్తికి చెప్పారు. అనంతరం మిమ్మల్ని పోలీసులు ఎలా చూసుకున్నారని కృష్ణవేణిని న్యాయమూర్తి ప్రశ్నించారు. నన్ను బాగా ఇబ్బంది పెట్టారని కృష్ణమూర్తి చెప్పగా.. పోలీసులు పైన కంప్లైంట్ ఇస్తారా? అని న్యాయమూర్తి కృష్ణవేణిని అడిగారు. అందుకు తాను పోలీసులపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.ఈ సందర్భంగా.. కృష్ణవేణి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఆమె తరుఫు న్యాయవాది.. న్యాయమూర్తిని కోరారు. వాదన సందర్భంగా దాచేపల్లి పోలీస్ స్టేషన్ గేట్లకు బేడీలతో తాళాలు వేసిన విజువల్స్ న్యాయమూర్తిగా చూపించారు. అనంతరం, కృష్ణవేణికి 14 రోజులు పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను గుంటూరు కోర్టుకు తరలించారు. కృష్ణవేణి కస్టోడియల్ టార్చర్పై దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్కు కోర్టు మెమో జారీ చేసింది. -
ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు
దేశంలో ప్రాంతీయ భాషల్లోనూ ఇంజినీరింగ్ విద్యను అందించడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. స్థానిక భాషల్లో ఇంజినీరింగ్ పాఠ్య పుస్తకాలను అందించడానికి కసరత్తు చేస్తోంది. తద్వారా ప్రాథమిక, హైసూ్కల్ విద్యను మాతృభాషలో చదువుకుని ఇంజినీరింగ్లో ఆంగ్లమాధ్యమంతో ఇబ్బందులు పడుతున్న వారు స్థానిక భాషలోనే చదువుకుని అర్థం చేసుకునేందుకు వీలుకల్పిపస్తోంది. 2026 డిసెంబర్ నాటికి 12 భారతీయ భాషల్లో పూర్తి స్థాయిలో ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టనుంది. హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో బోధనకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల రూపకల్పనలో నిమగ్నమయింది. – సాక్షి, అమరావతిస్థానిక భాషలో పెరుగుతోన్న ఆదరణ సాంకేతిక విద్యా వ్యవస్థలో భాషా అవరోధాన్ని నివారించడానికి ఏఐసీటీఈ గతంలోనే ప్రాంతీయ భాషలో ఇంజినీరింగ్ విద్యను ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా 18 ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ ప్రోగ్రామ్ కోసం 11 ప్రాంతీయ భాషల్లో 1140 సీట్లను ఏఐసీటీఈ ఆమోదించింది. తొలి ఏడాది 2021–22లో కేవలం 233 సీట్లు మాత్రమే భర్తీ అవ్వగా 80 శాతం మేర ఖాళీగా ఉండిపోయాయి. ఆ తర్వాత ఏడాది 2022–23లో 683 సీట్లు, 2023–24లో 928 సీట్లలో విద్యార్థులు చేరారు. కృత్రిమ మేధ సాయంతో 10 నిమిషాల్లో తర్జుమా ఇంజినీరింగ్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో ప్రాంతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలను ఏఐసీటీఈ రూపొందిస్తోంది.ఈ పుస్తకాలను స్థానిక భాషల్లో వేగంగా తర్జుమా చేసేందుకు కృత్రిమమేధ సాయాన్ని తీసుకుంటోంది. దాదాపు 80 శాతం కచ్చితత్వంతో 10 నిమిషాల్లో పుస్తకాన్ని తర్జుమా చేస్తోంది. మిగిలిన 20 శాతం తప్పొప్పులను నిపుణులు సరిదిద్దుతున్నారు. వాస్తవానికి రాజ్యాంగం 22 ప్రాంతీయ భాషలను గుర్తించినప్పటికీ నిధుల కొరతతో తొలుత 12 స్థానిక భాషల్లో అనువదిస్తోంది. కెనడా, స్విట్జర్లాండ్ దేశాలు స్థానిక భాషల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అనుమతిస్తున్నాయి. ఇదే బాటలో రష్యా, చైనా, జపాన్ ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలోనూ మాతృభాషలో ఇంజనీరింగ్ పాఠ్యాంశాలను ఏఐసీటీఈ ప్రోత్సహిస్తోంది. -
బంధువే.. రాబందై
తాడేపల్లి రూరల్: మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాధితురాలి సోదరిపైన కూడా అత్యాచారం చేయబోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అంజిరెడ్డి కాలనీలో ఇటీవల జరగ్గా..ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు..కాలనీలోని ఓ మహిళ తన భర్తను వదిలేసి..తండ్రి రెండో భార్య కుమారుడు కొండపాటి లంకబాబుతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. ఆ మహిళకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పదేళ్లు. రెండవ కుమార్తెకు తొమ్మిదేళ్లు. వీరి తల్లి మద్యానికి బానిస అయ్యింది. చిన్నారులకు మేనమామ వరుస అయ్యే లంకబాబు పదేళ్ల చిన్నారిపై తరచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బుధవారం తల్లి మద్యం తాగి ఉన్నప్పుడు ఆమె రెండో కుమార్తెతో లంకబాబు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ చిన్నారి ఇంట్లో నుంచి పరుగులు తీసి బయటకు వచ్చి పక్క ఇంట్లో మహిళలకు చెప్పింది. దీంతో వారు లంకబాబును చితకబాది పోలీసులకు సమాచారమిచ్చారు. ఈలోగా లంకబాబు పరారయ్యాడు. లంకబాబు ఆ మహిళ పెద్ద కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆ చిన్నారి భయంతో బయటకు చెప్పలేక తీవ్ర ఇబ్బందులు పడిందని, పోలీసులు జోక్యం చేసుకుని వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో బాధిత చిన్నారులను పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి ఏం జరిగిందో తెలుసుకుని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లంకబాబు కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అదుపులోకి తీసుకుని ఆయనపై పోక్సో కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
జేఈఈ మెయిన్ ఫలితాలపై గందరగోళం
సాక్షి, అమరావతి: జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(మెయిన్) సెషన్–2 ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విద్యార్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులకు ఎటువంటి అప్డేట్ ఇవ్వని ఎన్టీఏ.. ఫలితాల విడుదలలో దోబూచులాడింది. సాయంత్రం తుది ఆన్సర్ కీ విడుదల చేసినట్టే చేసి, కొద్దిసేపటికే వెబ్సైట్ నుంచి తొలగించింది. ఫలితాల విడుదల, ఆన్సర్ కీలపై అప్డేట్ లేకుండా విద్యార్థులను గందరగోళానికి గురిచేయడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. -
అసెంబ్లీ ఎల్అండ్టీకి.. హైకోర్టు ఎన్సీసీకి..
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ టెండర్లను అధిక ధరలతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. హైకోర్టు భవన నిర్మాణానికి రూ.752,06,25,211ను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలిచింది. ఈ టెండర్లో 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786,05,57,470.54 కోట్ చేసిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ ఎల్–1గా నిలిచింది. అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ.590,86,61,979ను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లో 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.617,33,70,035.66 కోట్ చేసిన ఎల్ అండ్ టీ లిమిటెడ్ సంస్థ ఎల్–1గా నిలిచింది. ఈ టెండర్లను ఈనెల 5న జరిగిన సమావేశంలో సీఆర్డీఏ అథారిటీ ఆమోదిస్తూ తీర్మానం చేసింది. అసెంబ్లీ భవన నిర్మాణ పనులను ఎల్ అండ్ టీకి, హైకోర్టు భవన నిర్మాణ పనులను ఎన్సీసీ సంస్థకు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈనెల 7న సీఆర్డీఏ కమిషనర్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు పంపారు. వాటిని పరిశీలించిన ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఆమోదిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్డీఏ అథారిటీ చేసిన తీర్మానం మేరకు అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ పనులను ఆ సంస్థలకు అప్పగించడానికి చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ను ఆదేశించారు. కాగా, ఈ రెండు టెండర్లలో అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.60.46 కోట్ల భారం పడింది. గత ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం ప్రకారం టెండర్లు నిర్వహించి ఉంటే కనీసం 4.5 నుంచి 5 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లకు ముందుకొచ్చేవారు. దీని వల్ల ఖజానాకు రూ.67.74 కోట్ల మేర ఆదా అయ్యేదని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. -
ఆగిన ‘అల్ట్రాటెక్’!
సాక్షి టాస్క్ఫోర్స్: సీఎం చంద్రబాబు సర్కారు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు బదులుగా ‘స్పీడ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్’ విధానాన్ని అమలు చేస్తోందని సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు హోరెత్తుతున్నాయి. వైఎస్సార్ జిల్లా చిలంకూరులోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో కార్యకలాపాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం నాలుగైదు రోజులుగా అడ్డుకోవడంతో ఉత్పత్తి ఆగిపోయి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న బెదిరింపులు మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.మొన్న అదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను అడ్డుకుని విధ్వంసం..! నిన్న ఆర్టీపీపీలో ఫ్లైయాష్ రవాణా లారీలను అడ్డుకుని దౌర్జన్యం..! తాజాగా అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి బెదిరింపులు..! వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి ఆది నుంచి అరాచకాలనే ప్రోత్సహిస్తూ దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు.మూడున్నర దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధి..చిలంకూరు సిమెంట్ పరిశ్రమలో సుమారు 35 ఏళ్ల నుంచి స్థానికులు ఉపాధి పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకే అన్ని పనులు కావాలంటూ పరిశ్రమకు రవాణా అవుతున్న సున్నపురాయి, ఫ్లైయాష్ను బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులు శనివారం నుంచి అడ్డుకుంటున్నారు. దీంతో సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అగిపోయి మూతపడే దశకు వచ్చింది.అల్ట్రాటెక్ పరిశ్రమలో ఉత్తరం వైపు సున్నపురాయి మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినా మొత్తం పనులు తమకే కావాలని ఆదినారాయణరెడ్డి వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. చిలంకూరులోని ఐసీఎల్ (అల్ట్రాటెక్) సిమెంట్ పరిశ్రమకు సరఫరా అయ్యే సున్నపురాయిని ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవటంపై యజమాన్యం ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు. చిలంకూరు సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అడ్డుకోవడంపై ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులైన ఎస్.జగదీశ్వర్రెడ్డితో పాటు పది మందిపై కేసు నమోదు చేసినట్లు యర్రగుంట్ల సీఐ నరేష్బాబు తెలిపారు. గురువారం చిలంకూరు ఐసీఎల్ (అల్ట్రాటెక్) మైనింగ్ క్వారీ వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ఇవి అరాచకాలు» గండికోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టిన అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను తమ వర్గీయులకే అప్పగించాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరులు మందీ మార్బలంతో విధ్వంసం సృష్టించారు.» ఆర్టీపీపీ నుంచి సిమెంట్ కంపెనీలకు ఫ్లైయాష్ రవాణా చేస్తున్న జేసీ ప్రభాకర్రెడ్డికి చెందిన లారీలను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం దీన్ని తమకే అప్పగించాలంటూ వీరంగం సృష్టించింది.» ఎర్రగుంట్ల మండలం చిలంకూరు పరిధిలో అల్ట్రాటెక్ (ఐసీఎల్) సిమెంటు పరిశ్రమకు ఫ్లైయాష్, సున్నపురాయి, ఇతర ముడి ఖనిజం సరఫరా, ప్యాకింగ్ ప్లాంట్ కాంట్రాక్టు పనులను 40 ఏళ్లుగా మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు ఎంవీ రమణారెడ్డి చేస్తున్నారు. ఆ పనులన్నీ తమ వర్గీయులకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొంతకాలంగా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తోంది. -
డీఎస్సీకి వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా డీఎస్సీ రాసే అభ్యర్థుల వయో పరిమితిని ప్రభుత్వం పెంచింది. అభ్యర్థుల గరిష్ట వయసును 42 సంవత్సరాల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ గురువారం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులిచ్చారు. 2024 జూలై 1 నాటికి ఈ వయసును పరిగణిస్తామని, ఈ ఒక్కసారికే ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పలు పరీక్షల షెడ్యూల్ను వెల్లడించిన ఏపీపీఎస్సీ సాక్షి, అమరావతి: పలు పోస్టుల భర్తీకి ఉద్దేశించిన పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను https://psc.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని కార్యదర్శి రాజాబాబు చెప్పారు. దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు– సీనియర్ పౌరుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల రాత పరీక్షను ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. 27న మధ్యాహ్నం పేపర్–2, 28న ఉదయం పేపర్–1 ఉంటుంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో లైబ్రేరియన్ పోస్టులకు ఈనెల 27న ఉదయం పేపర్–2, 28న ఉదయం పేపర్–1 పరీక్ష ఉంటుంది. ఏపీ ఫిషరీస్ సర్వీస్లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల మెయిన్స్ పరీక్షలో భాగంగా ఈనెల 28న ఉదయం పేపర్–1, 30న ఉదయం పేపర్–2, మధ్యాహ్నం పేపర్–3 పరీక్ష జరగనుంది. ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోసు్టల రాత పరీక్ష ఈనెల 28న ఉదయం, మ«ద్యాహ్న సమయాల్లో నిర్వహించనుంది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల పరీక్ష ఈనెల 28, 29 తేదీల్లో జరగనుంది. -
జగన్ పాలనలోనే అత్యుత్తమ పోలీసింగ్!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ సమర్థ పనితీరుకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు దక్కాయి. మూడు ప్రధాన విభాగాలు– పోలీసుల పనితీరు, న్యాయ సహాయం, జైళ్ల పరిస్థితికి సంబంధించి మొత్తం 102 అంశాల ప్రాతిపదికన విడుదలైన ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్– 2025’నివేదిక రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థను రెండవ స్థానంలో (10 పాయింట్లకు 6.32 స్కోర్) నిలిపింది. 2024 క్యాలñæండర్ ఇయర్ ప్రాతిపదికన ఈ నివేదిక విడుదలైంది. 2024 సంవత్సరం జూన్లో కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పటికీ, అప్పటికి గడచిన ఐదేళ్లలో పోలీసింగ్ వ్యవస్థలో జగన్ ప్రభుత్వం అత్యుత్తమ సంస్కరణలను తెచ్చింది.ఈ సంస్కరణల ప్రభావం తాజా ర్యాంకింగ్లో ప్రతిబింబించింది. అలాగే 2018లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దిగజారిన పోలీసు వ్యవస్థలో అన్ని విభాగాలూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గణనీయంగా మెరుగుపడుతూ వచ్చినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కామన్కాజ్ సంస్థతో కలిసి లోక్నీతి ‘సెంటర్ ఫర్ ద స్డడీ డెవలపింగ్ సొసైటీ’(సీఎస్డీఎస్) గతంలో ‘ద స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్–2025’పేరుతో నిర్వహించిన మరో సర్వేలో కూడా జగన్ పాలనా కాలం 2023–24లో శాంతి భద్రతల పరిరక్షణ, కేసుల పరిష్కారంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ దేశంలోనే రెండోస్థానంలో నిలవడం గమనార్హం. చంద్రబాబు హయాంలో దేశంలో 13వ స్థానంలో..దేశంలో పోలీసు, న్యాయ సహాయం, జైళ్ల స్థితిగతులను మెరుగుపరిచే ఉద్దేశంతో 2018 నుంచి ‘ఇండియా జస్టిస్ రిపోర్టు’ ఇస్తున్నారు. కేంద్ర నేర గణాంక విభాగం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు శాఖల గణాంకాలు న్యాయకోవిదులు, వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందుతోంది. 18 పెద్ద రాష్ట్రాలు, 11 చిన్న రాష్ట్రాలను వేర్వేరు విభాగాలుగా అధ్యయనం చేస్తూ ఈ నివేదిక విడుదలవుతోంది.2018లో దేశంలోని పోలీసింగ్ వ్యవస్థను (మూడు విభాగాలూ కలిసి) విశ్లేషిoచి 2019లో విడుదలైన నివేదిక ప్రకారం 18 పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది. అంటే కింద నుంచి ఆరో స్థానంలో నిలవడం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పోలీసు శాఖ అధ్వాన్న పనితీరుకు దర్పణం పడుతోంది. సంస్కరణల బాటన నడిపిన జగన్ ప్రభుత్వం 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచి్చన తరువాత రాష్ట్ర పోలీసు వ్యవస్థను అత్యుత్తమ సంస్కరణల బాటలో నడిపింది. దీనితో 2014–19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అధ్వాన్న స్థితిలో ఉన్న పోలీసు శాఖ వైఎస్ జగన్ పాలనా కాలంలో క్రమంగా మెరుగుపడుతూ వచి్చంది. ఈ ఫలితాలు తాజా ఇండియా జస్టిస్ రిపోర్ట్లో ప్రతిబింబిస్తున్నాయి. 2022 నివేదిక ప్రకారం (2021లో పనితీరు ఆధారంగా) ఆంధ్ర ప్రదేశ్ పోలీసింగ్ వ్యవస్థ (మూడు విభాగాలూ కలిసి) దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో 5వ స్థానానికి ఎగబాకింది. 2025 నివేదిక ప్రకారం (2024లో పనితీరు ఆధారంగా) దేశంలో రెండోస్థానం సాధించింది. 2020, 2021, 2023, 2024లో నివేదికలు విడుదల కాలేదు.బాబు ఘనతగా నమ్మించేందుకు కుయుక్తి తనది కాని ఘనతను తనదిగా చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా యత్నిస్తుండటం విస్మయపరుస్తోంది. తమ సోషల్ మీడియా విభాగం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచారని ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్’నివేదిక స్పష్టం చేసింది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయేనాటికి ఏపీ పోలీసు శాఖ దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో 13వ స్థానంలో ఉందని ఆ నివేదిక వెల్లడించింది. అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖ పనితీరు క్రమంగా మెరుగుపడిందని సవివరంగా పేర్కొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2024 నాటికి ఏపీ పోలీసు శాఖ దేశంలోనే రెండో స్థానానికి చేరుకుందని తెలిపింది. వాస్తవాలు ఇలా ఉంటే.. టీడీపీ సోషల్ మీడియా విభాగం మాత్రం ఆ ఘనతను చంద్రబాబు ప్రభుత్వానికి ఆపాదించేందుకు తప్పుడు ప్రచారాన్ని వైరల్ చేసేందుకు పడరానిపాట్లు పడుతోంది. -
మద్యం మాఫియా మూలవిరాట్టు బాబే
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై కూటమి సర్కారు సారథి, సీఎం చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుండడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత విడ్డూరంగా ఉంది. ఎందుకంటే.. రాష్ట్రంలో మద్యం మాఫియా సృష్టికర్త చంద్రబాబే. మద్యం మాటున మహా దోపిడికీ బ్రాండ్ అంబాసిడర్ ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీనే అన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ.. రెడ్బుక్ కుట్రలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్య విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. ఐదేళ్ల పాటు పాదర్శకంగా అమలు చేసిన విధానంపై టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు పేరుతో అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి కూటమి ప్రభుత్వం కుతంత్రాలు పన్నుతోంది. ఈ హడావుడి అంతా.. అసలు మద్యం దందా ఘనాపాఠి చంద్రబాబే అన్నది మరుగునపరచాలన్నది పన్నాగం. కానీ, టీడీపీ మద్యం సిండికేట్ మహా దోపిడీ దాచేస్తే దాగేది కాదు. తన బినామీలు, సన్నిహితులకు డిస్టిలరీల లైసెన్సులు ఇచ్చి.. టీడీపీ ప్రజాప్రతినిధులతో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి.. ఊరూరా బెల్ట్ దుకాణాలు తెరిచి.. ఊరూపేరు లేని బ్రాండ్లను ప్రవేశపెట్టి.. మూడు బార్లు ఆరు దుకాణాలుగా రాష్ట్రమంతా మద్యం ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదే. ఈ క్రమంలో చీకటి జీవోలతో కనికట్టు చేశారు.. 2014–19 మధ్య ప్రభుత్వ ఖజానాకు రూ.5 వేల కోట్ల పన్ను రాబడికి గండికొట్టారు. సిండికేట్ ద్వారా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. చంద్రబాబు పాలనకు పూర్తి విరుద్ధంగా మద్యం విధానంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినూత్న సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రైవేటు దుకాణాలను రద్దు చేసి సిండికేట్ను రూపుమాపింది. దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేసింది. కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతినివ్వ లేదు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలు కమీషన్లు ఇస్తాయి. కానీ, తగ్గితే కమీషన్లు ఇవ్వవన్నది ఎవరైనా ఠక్కున చెప్పే వాస్తవం. కానీ, కుట్రపూరితంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కమీషన్లు తీసుకున్నారని కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాతిపెట్టిన ప్రైవేట్ మద్యం సిండికేట్ భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం తవ్వి తీసి ప్రజలపైకి వదిలింది. యథేచ్ఛగా దోపిడీకి బరితెగిస్తోంది. అందుకే.. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు.. చంద్రబాబు మద్యం దోపిడీ సమగ్ర కుట్రను చాటేందుకు.. మద్యం మాఫియాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసిన విధానాన్ని చెప్పేందుకు.. ప్రస్తుతం మళ్లీ పేట్రేగుతున్న మద్యం దందాను తెలియజేస్తోంది ‘సాక్షి’. » 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండికొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా.. వారి కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి కొట్టారు. ఈ విషయమై.. రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. » చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు, ఎక్సైజ్ కమిషనర్గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 5 డిస్టిలరీల నుంచే.. ముసుగులో చంద్రబాబు దందా డిస్టిలరీలతో కుమ్మక్కయి కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్ను సృష్టించి దోపిడీకి తెరతీసింది చంద్రబాబు ప్రభుత్వం. 2015–19 మధ్య ఇలా కేవలం ఐదు డిస్టిలరీలకే లబ్ధి చేకూరింది. వీరి నుంచే 50 శాతానికిపైగా కొనుగోళ్లు చేశారు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో... » 2017–18లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.8,106 కోట్ల మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో రూ.4,122.28 కోట్లు ఐదు డిస్టిలరీలలకే ఇవ్వడం గమనార్హం. పెర్ల్ డిస్టిలరీకే రూ.1,374.79 కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. పెర్నోడో రిచర్డ్ ఇండియా లిమిటెడ్కు రూ.548.03కోట్లు, ఎస్వీఆర్ డిస్టిలరీస్కు రూ.395.1 కోట్లు, అలైడ్ బ్లెండర్స్–డిస్టిలరీస్కు రూ.457.86కోట్లు, ఎస్వీవై ఆగ్రో ఇండస్ట్రీస్కు రూ.319.57కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. » 2018–19లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.4,765.75 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో కేవలం మూడు డిస్టిలరీలకే ఏకంగా రూ.2,244.44కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. » పెర్ల్ డిస్టిలరీస్కు అత్యధికంగా రూ.1,462.41కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. సెంటిని బయో ప్రొడక్ట్స్కు రూ.638.52కోట్లు, ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్ రూ.143.51 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. తద్వారా కేవలం ఈ మూడు డిస్టిలరీల నుంచే రూ.47.09 శాతం మద్యం కొనుగోలు చేశారు. బార్లలోనూ అదే బరితెగింపు.. చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసేందుకు ఎక్సైజ్ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుపై 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు వినతిపత్రం సమర్పించినట్లు రికార్డుల్లో చూపారు. సెపె్టంబరు 9న వినతిపత్రం సమర్పిస్తే దానికి 9 రోజులు ముందుగానే సెపె్టంబరు 1నే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఎలా ఇచ్చారన్నది చంద్రబాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్ ఆమోదమూ పొందలేదు. ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబరు 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబరు 3న సంతకం చేయగా సీఎం హోదాలో చంద్రబాబు 2015 డిసెంబరు 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. డిస్టిలరీలన్నిటికీ అనుమతినిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు చంద్రబాబు సర్కారే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి.వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న 2019–24లో రాష్ట్రంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. 2014 నవంబరులో జీవో నంబర్ 993 ప్రకారం రెవెన్యూ (ఎౖక్సైజ్2) డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కేబినెట్కు చెప్పకుండానే.. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానం తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు ఎక్సైజ్ కమిషనర్ మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాక 10 రెట్లు పెంచాలని ఓ నోట్ ఫైల్ను పంపారు. ఈ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ అజెండాలో చేర్చలేదు. కొత్త మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేశారు. ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్లు పేర్కొనలేదు. కానీ, అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ, ఎక్సైజ్ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. ఆ నోట్ ఫైల్ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈ మేరకు ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని నోట్ ఫైల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసనేది సుస్పష్టం. అదే రోజు అంటే.. 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. దీని గురించి కేబినెట్లో చర్చించలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయనే లేదు. ‘పవర్ స్టార్’, ‘లెజెండ్’లను తెచ్చింది ఎవరు?పవర్ స్టార్, లెజెండ్.. ఇవేవో టీడీపీ కూటమిలోని నాయకుల పేర్ల ముందు ఉండే బిరుదులు కావు. మద్యం బ్రాండ్లు. ఈ రెండే కాదు.. ఊరూ పేరు తెలియని అనేక బ్రాండ్ల మద్యంకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం బ్రాండ్లలో కొన్ని .. ప్రెసిడెంట్ మెడల్: ఈ బ్రాండ్కు 2017 నవంబరు 22న చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హై వోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ బీర్ ఉత్పత్తులకు 2017 జూన్ 7న చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల విస్కీలకు 2018 అక్టోబరు 26న అంగీకారం తెలిపారు. రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 నవంబరు 9న అనుమతిచ్చింది. బీరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు 2019 మే 13న అప్పటి టీడీపీ ప్రభుత్వమే పచ్చజెండా ఊపింది. టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 మే 15న అనుమతినిచ్చింది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే.. » మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? » మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? » విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? » మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? »దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్లు, బెల్టు షాప్లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? » 2014 - 19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? » మద్యంపై తక్కువ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? » ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? » ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. » 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. » లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. » 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. » మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. » మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. » మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. లబ్ధి పొందిన చంద్రబాబు బినామీలు, సన్నిహితులు వీరు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ప్రస్తుత ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు తండ్రి ఈయన. టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబం టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం. 2014లో వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆయన డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్ అప్పటి టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి చెందింది.