breaking news
Amaravati
-
ఏపీ రైతులపై అత్యధిక అప్పుల భారం..
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలోనే అత్యధిక అప్పుల భారాన్ని మోస్తున్నారు. 2025, డిసెంబర్ 31 నాటికి ఏపీలో రైతన్నల నెత్తిన 3,75,254 కోట్ల రూపాయల అప్పుల భారం పడింది. ఈ పరిస్థితిని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్లో అధికారికంగా వెల్లడించింది. లోక్ సభలో లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. రైతుల పై 2,01,744 కోట్ల రూపాయల పంట రుణాల భారం ఉండగా, టర్మ్ లోన్ భారం 1,73,510 కోట్ల రూపాయలగా ఉంది. మొత్తం కలిపి రైతులపై 3,75,254 కోట్ల రూపాయల రుణ భారంగా మారింది. దేశంలో తమిళనాడు తర్వాత రుణభారం లో తల్లడిల్లుతున్నారు ఏపీ రైతులు.ఫలితంగా దేశంలోనే రైతుల రుణభారంలో రెండో స్థానంలో ఏపీ ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులకు ఆదరణ కరువు అన్న దానికి ఇది సంకేతంగా నిలుస్తుంది. అరకొరగా రైతులకు వాగ్దానాలు అమలు చేస్తుండటంతో ఏపీ రైతులపై అప్పుల భారం తడిపి మోపడైంది. ఇక పక్క రాష్ట్రం తెలంగాణలో రైతులపై 1,75,960 కోట్ల రూపాయల అప్పుల భారం ఉంది. తెలంగాణలో రైతులపై క్రాప్ లోన్ 95,167 కోట్లు రూపాయలు, 80,792 కోట్ల రూపాయల టర్మ్ లోన్ గా ఉంది. -
నీటిగుంతలో మునిగి 10వ తరగతి విద్యార్థి మృతి
మంగళగిరి టౌన్: నీటిగుంతలో మునిగి 10వ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. కృష్ణాయపాలేంకు చెందిన కంతేటి ప్రకాష్, విమల దంపతుల కుమారుడు ప్రజ్వల సంతోష్ (15) పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షల నేపథ్యంలో పెనుమాకలోని ట్యూషన్కు ఆదివారం వెళ్లాడు. ట్యూషన్ అనంతరం ఇంటికి వచ్చే మార్గంలో నీటిగుంతలో ఈతకు దిగి మునిగిపోయాడు. స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చేలోపే సంతోష్ మృతిచెందాడు. కాగా, రాజధాని రోడ్డు నిర్మాణ పనుల కోసం తవి్వన నీటిగుంతలోనే బాలుడు మృతిచెందినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదం జరిగిన నీటిగుంత వద్ద ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం వల్లే బాలుడు మృతి చెందాడని పలువురు స్థానిక దళితనాయకులు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు ప్రభుత్వం, సంబంధిత కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాలుడి మృతిని ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నట్లు ఉద్ఘాటించారు. పోలీసులు సుమోటాగా తీసుకుని దీనికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
పింఛన్లు, రేషన్ కోసం.. కుటుంబాలు విడిపోతున్నాయి
సాక్షి, అమరావతి: పింఛన్లు, రేషన్ కోసం కుటుంబాలు విడిపోతున్నాయని.. దీనిని నివారించేందుకు కొత్త విధానం తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే లబ్ధి చిన్న కుటుంబాలకు కాకుండా పెద్ద కుటుంబాలకే ఇస్తానని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధానిలో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. కుటుంబమే మనకు ఒక భద్రత అన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే మహిళలకు మాదిరిగానే పురుషులకు కూడా రెండునెలల వరకు సెలవు ఇస్తానని తెలిపారు. ఒకప్పుడు ముగ్గురు పిల్లలను కనొద్దని చెప్పిన తానే ఇప్పుడు రాష్ట్రంలో జనాభా తగ్గుదల నేపథ్యంలో ‘ముగ్గురు పిల్లలు ముద్దు’ అంటూ ఫ్యామిలీ మ్యానేజ్మెంట్ అంటున్నానన్నారు. ‘రాబోయే పదేళ్లు నేను చెప్పింది వినండి, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండకపోతే అప్పుడు నన్నడగండి’.. అంటూ వ్యాఖ్యానించారు. బాబు ఇంకా ఏమన్నారంటే..సెర్ప్, మెప్మాను ఒకే గొడుగు కిందకు తెస్తా..మా పార్టీ అధికారంలో లేనప్పుడు ఆయా ప్రభుత్వాలు పొదుపు సంఘాలను పట్టించుకోలేదు. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను 99.89 శాతం తిరిగి కట్టే వ్యవస్థ డ్వాక్రా వ్యవస్థే. రాబోయే రోజుల్లో మెప్మా, డ్వాక్రా (సెర్ప్) రెండింటిని వెలుగు అనే ఒక గొడుగు కిందకు తెస్తా. పొదుపు సంఘాల మహిళలు తయారుచేసే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేలా స్వయం పేరుతో ఒక బ్రాండ్ను ప్రారంభించా. ఈ ఏడాది మహిళల్లోనే లక్షల మంది పారిశ్రామికవేత్తలు తయారయ్యారు. మీకేదైనా అయితే నాకు ఫోను చేయండి.. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మన దగ్గర పెట్రోల్, గ్యాస్ రేట్లు పెరిగే పరిస్థితి ఉంది. ఓపెన్ మార్కెట్లో సిలిండర్ ధరలు పెరిగినా.. మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తా. ఐదేళ్లు గంజాయి బ్యాచ్లను తయారుచేశారు. ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయింది. మీకేదైనా జరిగితే నాకు ఫోన్ చేయండి. ఎవడైనా సరే.. తాటతీస్తా. ఇక ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాలకు రూ.10,100 కోట్ల రుణాల చెక్కును సీఎం చంద్రబాబు అందజేశారు. -
రేటు పెంచి పంచుకున్నారు..
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఏ చివర కూర్చున్నా పర్వాలేదు అన్నది సామెత... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు ఎల్–1గా రాకపోయినా సరే హెరిటేజ్ ఫుడ్స్కు అడ్డదారిలో టెండర్లు దక్కుతుండడం ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. నెయ్యి ధరను అమాంతంగా పెంచేసి మరీ కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులను బరితెగించి కొల్లగొడుతున్నారు. ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో చేసిన దుష్ప్రచార రాద్ధాంతం వెనుక ఎంతటి కుట్ర ఉందో తెలిపే వాస్తవాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇందాపూర్, ఇంకా హెరిటేజ్ అనుకూల డెయిరీలు మాత్రమే టీటీడీ టెండర్లలోపాల్గొనేలా.. అసలు నెయ్యి టెండర్లంటేనే ఇతర డెయిరీలు భయపడేలా చంద్రబాబు అండ్ కో కల్తీ దు్రష్పచార కుట్ర సాగించింది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు అడ్డగోలుగా కట్టబెట్టిన విషయం ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడింది. టీటీడీ టెండర్లలో ఎల్–1గా వచి్చన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని డెయిరీ)ని అడ్డంపెట్టుకుని ఇందాపూర్ డెయిరీకి భారీగా నెయ్యి కాంట్రాక్టులు కట్టబెట్టిన తీరు ఇదిగో ఇలా ఉంది... కిలో నెయ్యి ధర రూ.495 నుంచి రూ.716.92కు పెంచారు.. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టుల పేరిట దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా కథ నడిపింది. అందుకే టీటీడీ నెయ్యిని ఎంత ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే అంతగా అవినీతికి పాల్పడవచ్చని స్కెచ్ వేసింది. అందుకే 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత పక్కా పన్నాగంతో టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధరను క్రమంగా పెంచారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం... టీటీడీ పాలకమండలి ఆమోదించిన తీర్మానాల వివరాలు చూస్తే నెయ్యి ధరలను క్రమంగా ఎలా పెంచుతూ పోయారో అర్థం చేసుకోవచ్చు. » 2024 నవంబరులో కిలో నెయ్యి రూ.495 చొప్పున కొనుగోలుకు టీటీడీ పాలకమండలి ఆమోదించింది. » రెండు నెలల్లోనే... అంటే 2025 జనవరిలో కిలో నెయ్యి కొనుగోలు ధరను రూ.513కు పెంచింది. » 2025 మేలో నెయ్యి ధరను మరింత పెంచుతూ కిలో రూ.600గా ఖరారు చేసింది. » అంతటితో ఆగలేదు... 2025 అక్టోబరులో కిలో నెయ్యి ధరను రూ.716.92కు పెంచింది. » దాదాపు ఏడాదిలోనే కిలో నెయ్యి ధరను రూ.495 నుంచి రూ.716.92కు పెంచింది. అంటే నెయ్యి ధర 44.83 శాతం పెరిగిందన్నమాట. అయితే ఎందుకు ఇలా నెయ్యి ధరలను పెంచుతూ పోయారు? దీని వెనక ఉన్న మతలబేమిటి? సంప్రదింపులకు యత్నించకుండానే ఏకపక్షంగా... నందిని డెయిరీ టీటీడీ టెండర్లలో పాల్గొని భారీ ధరలకు టెండరు కోట్చేసింది. అయినా టీటీడీ ఏమాత్రం సంకోచించకుండా ఆమోదించేసింది. సాధారణంగా ధరలు అమాంతంగా పెంచుతూ సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే ప్రభుత్వంగానీ, టీటీడీగానీ ఇతర డెయిరీలతో సంప్రదింపులు జరపాలి. ధరలు తగ్గించమని కోరాలి. ఎందుకంటే 2025 అక్టోబరులో ఇందాపూర్ డెయిరీ బహిరంగ మార్కెట్లో నెయ్యి కిలో రూ.529కి విక్రయిస్తోంది. ఇక ఏపీలోని సహకార రంగ విజయ డెయిరీ కిలో రూ.675కు, తెలంగాణలోని సహకార రంగంలోని టీజీ విజయ డెయిరీ కిలో రూ.637 చొప్పునే రిటైల్ మార్కెట్లో విక్రయిస్తున్నాయి. రీటైల్ మార్కెట్లో విక్రయించే నెయ్యిని ప్యాకింగ్ చేసి విక్రయిస్తారు. ప్యాకింగ్ చార్జీలతోపాటు ఏజెన్సీకి లాభం(కమీషన్) అదనంగా భరించాల్సి ఉంటుంది. అదే టీటీడీకి నెయ్యిని ట్యాంకర్లలో సరఫరా చేస్తారు కాబట్టి ప్యాకింగ్ వ్యయం ఉండదు. మధ్యలో ఏజెన్సీ ఉండదు కాబట్టి కమీషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ దానిని చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ పట్టించుకోలేదు. వివిధ డెయిరీలతో సంప్రదింపులు జరిపితే నెయ్యి ధర తగ్గుతుందనే వాస్తవాన్ని కూడా ప్రభుత్వం, టీటీడీ విస్మరించాయి. ఏకపక్షంగా కిలో రూ.716.92లు చొప్పుననెయ్యికాంట్రాక్టు ఖరారు చేసేశారు. నందిని, ఇందాపూర్ ఫిఫ్టీ ఫిఫ్టీ... నెయ్యి ధరను అమాంతంగా పెంచుతూ టెండరు ఖరారు చేసిన తర్వాత అసలు దోపిడీ కథను ఎల్లో సిండికేట్ తెరపైకి తెచి్చంది. ముందుగా 2025 అక్టోబర్లో 20 లక్షల కిలోల నెయ్యి టెండర్లలో ఎల్–1గా వచ్చిన నందిని డెయిరీకి కాంట్రాక్టు ఖరారు చేశారు. అదీ కిలో రూ.716.92లు చొప్పున. ఆ మేరకు టీటీడీ పాలకమండలి తీర్మానం ఆమోదించిన తర్వాత.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నందిని డెయిరీ తాము 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయలేమని చెప్పింది. తాము 10 లక్షల కిలోల నెయ్యి మాత్రమే సరఫరా చేయగలమని తెలిపింది. కూటమి ప్రభుత్వ పెద్దలే ఆ విధంగా నందిని డెయిరీతో చెప్పించారన్నది బహిరంగ రహస్యం. మరి 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయలేని సంస్థ అసలు టెండర్లలో ఎందుకు పాల్గొంటుంది? అంటే కూటమి ప్రభుత్వ పెద్దలతో ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారమే నందిని డెయిరీ ఆ ప్రకటన చేసిందన్నది స్పష్టమవుతోంది. ఆ తర్వాత నందినీ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు చేశారు. మిగిలిన 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టును హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీకి కట్టబెట్టేందుకు పావులు కదిపారు. ఆ మేరకు టీటీడీ నెయ్యి కాంట్రాక్టుల్లో సవరణలు చేసి 2025 డిసెంబర్లో పది లక్షల కిలోల నెయ్యి చొప్పున మొత్తం మీద 20 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం రెండు వేర్వేరు టెండర్లు పిలిచింది. ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఖరారయ్యేలా ఇతర డెయిరీలనూ మేనేజ్ చేశారు. ఇందాపూర్ డెయిరీకి అడ్డగోలుగా నెయ్యి కాంట్రాక్టులను ఖరారు చేస్తూ టీటీడీ పాలకమండలి ప్రత్యేకంగా రెండు తీర్మానాల (590 తీర్మానం, 605 తీర్మానం) ద్వారా కథ నడిపింది. అవి ఇలా ఉన్నాయి... » టీటీడీ తీర్మానం 590 ప్రకారం 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు ఖరారు చేశారు. అందులో ఇందాపూర్ డెయిరీకి 65 శాతం వాటాతో... అంటే 6.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. మదర్ డెయిరీకి 35 శాతం వాటా... అంటే 3.50 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు కేటాయించారు. » ఇక టీటీడీ తీర్మానం 605 ప్రకారం మరో 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు ఖరారు చేశారు. అందులో ఇందాపూర్కు 35 శాతం వాటా.. అంటే 3.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. మదర్ డెయిరీకి 65 శాతం వాటా... అంటే 6.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు కేటాయించారు. ధర మాటున మతలబు ఇందాపూర్ డెయిరీకి అనుకున్నట్టుగానే 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కింది. మరీ కిలో రూ.716.92 అంటే బాగుండదు అనుకున్నారో ఏమో.. టీటీడీ తీర్మానం 590 ప్రకారం కిలో నెయ్యి రూ.658 చొప్పున ఇందాపూర్ డెయిరీకి 6.50 లక్షల కిలోల నెయ్యి టెండర్ ఖరారు చేశారు. ఇక టీటీడీ తీర్మానం 605 ప్రకారం కిలో నెయ్యి రూ.649 చొప్పున ఇందాపూర్ డెయిరీకి 3.50 లక్షల కిలోల నెయ్యి టెండరు కట్టబెట్టారు. ఇలా మొత్తంగా రూ.65.48 కోట్ల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్టును అడ్డగోలుగా కట్టబెట్టారు. అంటే ఇందాపూర్ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును కట్టబెట్టేందుకే పక్కా పన్నాగంతోనే ఈ కథంతా నడిపారని, నందిని డెయిరీకి నష్టం లేకుండా.. కిలో నెయ్యి ధరను రూ.495 నుంచి రూ.716.92కు పెంచారన్నది బట్టబయలైంది. ఇక ఇందాపూర్ డెయిరీకి ఖరారు చేసిన ధరలను ఏడాది క్రితం టీటీడీ నెయ్యి ధరతో పోలిస్తే చంద్రబాబు ముఠా దోపిడీ పన్నాగం బయటపడుతోంది. ఏకంగా 33 శాతం అధిక ధరకు ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఖరారు చేశారన్నది తేటతెల్లమవుతోంది. అందుకు సహకరించిన నందినీ డెయిరీకి కూడా రూ.76.19 కోట్ల కాంట్రాక్టు ఖరారు చేశారు. వెరసి దొంగలు దొంగలు కలిపి ఊళ్లు పంచుకున్నట్టుగా... నందిని డెయిరీ, ఇందాపూర్ డెయిరీ కలిపి తిరుమల శ్రీవారి నిధులను కొల్లగొట్టాయన్నది స్పష్టమైంది. చేతులెత్తేసి... మళ్లీ టెండర్లలో పాల్గొన్న ‘నందిని’... ఇక తిరుమల శ్రీవారి నిధులు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగం టీటీడీ సవరణ టెండర్ల వ్యవహారంలో బట్టబయలైంది. మొదట 20 లక్షల కిలోల నెయ్యి టెండర్లలో పాల్గొన్న నందిని డెయిరీ... తీరా టెండరు ఖరారు అయ్యాక (ముందుగా వేసుకున్న పథకం ప్రకారం) తాము 10 లక్షల కిలోలే సరఫరా చేయగలమని చేతులెత్తేసిన విషయం తెలిసిందే. దాంతో ఆ డెయిరీని కిలో రూ.716 చొప్పున 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టుకే పరిమితం చేశారు. తద్వారా ఇందాపూర్ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు మార్గం సుగమం చేశారు. అందుకోసం టీటీడీ 10 లక్షల కిలోల నెయ్యి చొప్పున రెండు వేర్వేరు అంటే 20 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం సవరణ టెండర్లు పిలిచింది. వాటిలో టీటీడీ 605 తీర్మానం ద్వారా ఆమోదించిన ఒక టెండరులో నందిని డెయిరీ కూడా పాల్గొనడం గమనార్హం. అంటే 10 లక్షల కిలోల కంటే ఎక్కువ సరఫరా చేయలేమని 2025 అక్టోబరులో పక్కకు తప్పుకొన్న నందినీ డెయిరీ... ఆ వెంటనే.. అంటే 2025 నవంబరులోనే పిలిచిన టెండర్లలో మరో 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయగలమని బిడ్ దాఖలు చేసి ఎల్–3గా నిలిచింది. అంటే 2025 సెప్టెంబరులో పిలిచిన టెండర్లలో కూడా 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయగల సామర్థ్యం నందిని డెయిరీకి ఉందనేది స్పష్టమైంది. కేవలం ఇందాపూర్ డెయిరీ కోసమే ఆ రోజు 10 లక్షల కిలోల నెయ్యి టెండరు నుంచి నందిని పక్కకు తప్పుకొంది. మళ్లీ 2025 డిసెంబర్లో పిలిచిన సవరణ టెండర్లలో కిలో నెయ్యి రూ.716 చొప్పున బిడ్ దాఖలు చేసింది. అంటే ఇందాపూర్ డెయిరీకి కిలో రూ.658 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేసేందుకే ఆ విధంగా అధిక ధరకు బిడ్ దాఖలు చేసింది. ఆ విధంగా చంద్రబాబు ముఠా ఇందాపూర్ డెయిరీకి అడ్డగోలుగా టెండరు ఖరారు చేసేందుకు పక్కాగా కథ నడపిందన్నది స్పష్టమవుతోంది. -
చీకటి కాలం.. దుశ్శాసన పర్వం
సాక్షి, అమరావతి: మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలమని, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత కూడా లేదని నిప్పులు చెరిగారు. మూడు రోజులుగా చంద్రబాబు సర్కారు ప్రజలకు మూడు డ్రామాలు చూపించిందని, అసెంబ్లీలో ఒక డ్రామా.. పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా.. ఈ రెండింటికీ కొనసాగింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు నాయుడు ట్రూప్ ఇంకో డ్రామా ఆడిందంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం ఆయన పోస్టు చేశారు. ‘నేను నేరుగా చంద్రబాబునాయుడిని అడుగుతున్నా.. జనాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు సక్రమంగా అమలు చేయకపోయినా, అన్నీ చేసేసినట్లు విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, పట్టపగలు డ్రామాలాడిన మీకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత ఉందా?’ అని నిలదీశారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో భాగంగా 19–59 మధ్య వయసున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1,500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ఒక్కో అక్కచెల్లెమ్మకు మూడేళ్లలో రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?⇒ 50 ఏళ్లకే పింఛన్ మరో హామీ. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.4 వేలు చొప్పున ఒక్కొక్కరికి ఏటా రూ.48 వేలు ఇవ్వాలి. మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు? ⇒ బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద ఇస్తామన్నారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. రాష్ట్రంలో యూడీఐఎస్ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్–యూడైస్) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగరగొట్టారు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే.. అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. మరి వీళ్లందరికీ మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారు? ఎగ్గొట్టిన మొదటి ఏడాది డబ్బులు ఎప్పుడిస్తారు? ⇒ సూపర్ సిక్స్లో ఉచిత గ్యాస్ చిన్న హామీ. ఇక్కడ కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య దాదాపు 1.59 కోట్లు. వీరికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలిండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు గారూ?⇒ ఉచిత బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చని మహిళలకు హామీ ఇచ్చారు. కడప నుంచి వైజాగ్కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేశారు. రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?⇒ సూపర్ సిక్స్లో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇలా వంచనగా మార్చటం వల్ల ప్రతి కుటుంబాన్ని, అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతను, మొత్తంగా మన రాష్ట్రంలో ఇంటింటి భవిష్యత్తును మీరు ఎంతగా దెబ్బతీశారో అర్థమవుతోందా?⇒ అక్కచెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం. అందులో 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబునాయుడు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈ రోజుకు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. దీని కోసం ఒక్క గజం కూడా స్థలం కొనలేదు. ఉన్న ఇళ్ల నిర్మాణాలను గాలికొదిలేశారు. మరి ఆ ఇళ్ల నిర్మాణాలను అక్కచెల్లెమ్మలకు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు? ⇒ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకానికి మూడు బడ్జెట్లలో అతీగతీ లేదు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పారు. పెంచడం సంగతి దేవుడెరుగు.. మామూలుగా ఇంతకు ముందు ఇస్తున్నట్టు ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. మీరు వచ్చి మూడు బడ్జెట్లు పెట్టారు. ఇప్పటికి ఒక్క పైసా కూడా సున్నా వడ్డీ కింద ఇవ్వలేదు. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ⇒ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు.. వైఎస్సార్ ఆసరా కింద 78,94,169 మందికి రూ.25,570 కోట్లు.. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మందికి రూ.2,029 కోట్లు.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.1,876 కోట్లు ఇచ్చాం. నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించింది అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అంటే అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ పథకాలన్నీ మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. మరి మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత ఉందా?⇒ మీ పాలనలో ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం అనే పథకమే లేదు. మీకు కాపుల్ని మభ్య పెట్టి.. వారి ఓట్లు కొల్లగొట్టే ప్యాకేజీ పథకాలు బాగా తెలుసుగానీ, కాపు నేస్తంగా ఒక్క రూపాయి కూడా ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన చరిత్ర మీకు కానీ, మీకు మద్దతిస్తున్న వారికి కానీ లేదు.⇒ ఇలా ఇవ్వక పోవటం కూడా మీకున్న విజన్లో భాగమే అని నమ్మించగల ఎల్లో మీడియా మీ చేతిలో ఉంది కాబట్టి.. ఇదీ గొప్ప ఎంపవర్మెంట్ అని పత్రికల్లో రాయించటం, టీవీల్లో వేయించటమే ఇక మిగిలింది!⇒ అక్కచెల్లెమ్మల కాపురాల్లో చిచ్చుపెట్టేలా వీధికో బెల్టుషాపు, ఊరికో మద్యం షాపు, బారు తెరవటమే మీకు తెలిసిన మహిళా సాధికారత. అదే మీకు తెలిసిన మహిళా భద్రత.⇒ దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్ను కూడా నిర్వీర్యం చేశారు. చివరికి రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ టీటీడీ చైర్మన్.. అత్యాచార ఆంధ్రప్రదేశ్ను నిర్మించారు. పసి పిల్లల్ని, ఆడపిల్లల్ని, చివరికి ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళల్ని మీరు, మీకు మద్దతిస్తున్న వాళ్లు పెంచి పోషిస్తున్న కామాంధులంతా ఎలా చిదిమేస్తున్నారో చూసి కూడా మీకు సిగ్గనిపించడం లేదా?⇒ మా పాలనలో 90 శాతం అక్కచెల్లెమ్మల పేరిట డీబీటీ పథకాలే. మేం ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ అక్కచెల్లెమ్మల పేరుమీదే. దేశ చరిత్రలో తొలిసారిగా.. మేం ఇచ్చిన వేల కొద్దీ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వాటా వారికే.⇒ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఎక్కువ మంది మహిళలకు ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులుగా అవకాశం ఇచ్చింది కూడా మా పాలనలోనే. అందుకే మా పాలన మహిళా సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ⇒ ఇప్పటి పరిస్థితి ఏమిటంటే.. మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలం. రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వం. -
నారా వారి నిర్వాకానికి 'నారీ విలాపం'!
నాడు: మహిళలకు స్వర్ణయుగం. అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబంతో పాటు రాష్ట్రం ప్రగతి బాట పడుతుందని వైఎస్ జగన్ ప్రత్యేకంగా పథకాలు అందించారు. ఆర్థిక సాధికారతతోపాటు రాజకీయంగానూ ఎదిగేలా ప్రోత్సాహం అందించారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళలకే దక్కేలా చట్టం చేసి మరీ అమలు చేశారు. వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ పథకాలతో పాటు మహిళల పేరిటే ఇళ్ల పట్టాలు అందించి పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను సైతం చేపట్టారు. పొదుపు మహిళలకు అండగా నిలిచారు. ‘చేయూత’ ద్వారా మహిళా సాధికారతకు వైఎస్ జగన్ ప్రభుత్వం బాటలు వేసింది. మహిళలు వివిధ వ్యాపారాల్లో రాణించి తమ కాళ్లపై తాము నిలదొక్కుకునేలా వారి ఉత్పత్తులను అమూల్, రిలయన్స్, ఐటీసీ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లీవర్ లాంటి ప్రముఖ సంస్థలతో అనుసంధానించి, రుణాలు అందచేసి తోడ్పాటునిచ్చారు. తద్వారా మహిళలను అన్ని రంగాల్లో అగ్రపథాన నిలిపారు.నేడు: 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు వరాల వల విసిరారు. జగన్ ఇచ్చిన వాటి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని నమ్మబలికారు. మహిళల ఓట్లు కొల్లగొట్టారు. అధికారం చేపట్టాక వారిని విస్మరించారు. ఒక్కటంటే ఒక్క హామీని అమలు చేయకుండా మహిళలకు మొండి చేయిచూపారు. ఒక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎగ్గొట్టడం ద్వారానే మహిళలకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర బకాయి పడ్డారు. గతంలో వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలను చంద్రబాబు ఇవ్వకపోగా, తాను ఇస్తానన్న వాటిని సైతం ఎగ్గొట్టారు. దీంతో చంద్రబాబును నమ్మి మోసపోయామని, 20 నెలలుగా ప్రతి అడుగులోనూ మోసమేనని, దేశంలో ఏ రాజకీయ నాయకుడూ ఇలా మోసాలు చేసి, హామీలను నెరవేర్చానని నిస్సిగ్గుగా బుకాయించరని మహిళలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ పాలన స్వర్ణ యుగమని, మహిళలను మహరాణులుగా చేశారని గుర్తు చేసుకుంటున్నారు.సాక్షి, అమరావతి: నారా వారి నిర్వాకానికి నారీలోకం విలపిస్తోంది! చంద్రబాబు ఎన్నికల మోసాలు.. సూపర్ సిక్స్ హామీల ఎగవేత.. ఓటు బ్యాంకు రాజకీయాలు.. మహిళా దినోత్సవం సాక్షిగా మరోసారి బట్టబయలయ్యాయి. ప్రధానంగా మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు మూడు బడ్జెట్లలోనూ కేటాయింపులు జరపని చంద్రబాబు అమరావతిలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సైతం ఆడబిడ్డ నిధి, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ, 50 ఏళ్లకే పెన్షన్, పెళ్లి కానుక.. తదితర పథకాల ఊసెత్తకపోవడం గమనార్హం. 2024 ఎన్నికల ముందు మేనిఫెస్టో పేరుతో ఇంటింటికి బాండ్లు, కరపత్రాలు పంచి పెట్టిన చంద్రబాబు ఇప్పుడు మహిళలను నయవంచన చేశారని ఆక్రోశిస్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అటకెక్కించడంతోపాటు చంద్రబాబు కనీసం తానిచ్చిన హామీలను సైతం నెరవేర్చకుండా దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి బకాయిలు రూ.97,200 కోట్లు ప్రతి అక్క చెల్లెమ్మకు మూడేళ్లలో రూ.54,000 ఎగవేత..! సూపర్ సిక్స్లో అతిముఖ్యమైన హామీ.. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున చంద్రబాబు ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తానన్నారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు మహిళలు 1.80 కోట్ల మంది ఉన్నారు. హామీ ప్రకారం ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.18 వేల చొప్పున ఏటా మొత్తం రూ.32,400 కోట్లు చెల్లించాలి. కానీ ఈ పథకానికి మూడు బడ్జెట్లలో కేటాయించింది సున్నా. మూడేళ్లకు కలిపి అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు బకాయి పడ్డ సొమ్ము అక్షరాలా రూ.97,200 కోట్లు. ప్రతి అక్కచెల్లెమ్మకు ఈ స్కీమ్ కింద మూడేళ్లలో రూ.54 వేలు ఎగరగొట్టారు! సున్నా వడ్డీకి శూన్యం.. మహిళలకు రూ.15 వేల కోట్లు బాకీ పొదుపు మహిళల సున్నా వడ్డీకి మూడు బడ్జెట్లలోనూ అతీగతి లేదు. స్వయం సహాయ సంఘాలకు వడ్డీలేని రుణాలను రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచుతామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చకపోగా గత ప్రభుత్వంలో అమలు చేసిన దాన్ని కూడా నిలిపివేశారు. గత ప్రభుత్వంలో కోటి మందికిపైగా పొదుపు మహిళలు సున్నా వడ్డీ ద్వారా దాదాపు రూ.ఐదు వేల కోట్ల మేర లబ్ధి పొందారు. మూడు బడ్జెట్లలోనూ నిధులు కేటాయించకుండా సున్నా వడ్డీ కింద పొదుపు మహిళలకు చంద్రబాబు ఏకంగా రూ.15 వేల కోట్లు మేర ఎగ్గొట్టారు! ఇక చంద్రబాబు ప్రభుత్వంలో పొదుపు సంఘాల పరపతి గణనీయంగా క్షీణించింది. నాబార్డ్ డేటా ప్రకారం 2023–24లో మహిళల పొదుపు రుణాలు రూ.49,626 కోట్లు కాగా చంద్రబాబు హయాంలో 2025–26 (డిసెంబర్ వరకు) రూ.30,698 కోట్లకు పడిపోయింది. మహిళలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పరపతి తగ్గిపోతోంది. 50 ఏళ్లకే పింఛన్.. వంచన ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు బకాయి సూపర్ సిక్స్లో ఇచ్చిన మరో హామీ 50 ఏళ్లకే పింఛన్. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేల చొప్పున సంవత్సరానికి రూ.48 వేలు ఇవ్వాలి. ఈ లెక్కన ఏడాదికి మొత్తం రూ.9,600 కోట్లు అవుతుంది. దీని ప్రకారం మూడేళ్లలో మొత్తం రూ.28,800 కోట్లు కేటాయించాల్సి ఉండగా మూడు బడ్జెట్లలో ఇచ్చింది సున్నా. ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు మేర చంద్రబాబు బాకీ పడ్డారు. అసలు కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్నవాటికే కోత పెడుతున్నారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 66,34,372 కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 60,96,108 మందికే ఫించన్లు ఇచ్చారు. అంటే ఏకంగా 5,38,264 పింఛన్లు కట్ చేశారు. మరోవైపు 2014లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 39 లక్షల పింఛన్లు మాత్రమే ఉండగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ సంతృప్త స్థాయిలో అందచేస్తూ 66 లక్షలకుపైగా పింఛన్లు ఇచ్చింది. మళ్లీ చంద్రబాబు వచ్చిన రెండేళ్లకే పింఛన్లు 66 లక్షల నుంచి 60 లక్షలకు తగ్గిపోవడం గమనార్హం. తల్లులకు బాబు దగా.. మూడేళ్లలో రూ.24,504 కోట్లు ఎగవేత తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. ఈ పథకానికి ఒక్కొక్కరికీ ఏటా రూ.15 వేల వంతున ఏడాదికి మొత్తం రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో కేవలం 67.27 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. రెండేళ్లలో తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా బకాయిపడ్డారు. ఇక తాజా బడ్జెట్లో రూ.8457.07 కోట్లు మాత్రమే ప్రతిపాదించి ఏకంగా రూ.4,655.75 కోట్ల మేర కోతలు పెట్టారు. తద్వారా మూడేళ్లలో పిల్లలకు రూ.24,504 కోట్ల మేర చంద్రబాబు ఎగ్గొట్టారు! ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఉచిత బస్సు, గ్యాస్.. తుస్సు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. తొలి ఏడాది హామీని పూర్తిగా ఎగ్గొట్టారు. ఇక రెండో ఏడాది ఆర్నెల్ల తరువాత ఆగస్టు నుంచి అరకొరగా మొదలుపెట్టి రూ.1,040 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఇక ఈ స్కీమ్ కోసం మూడో బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గానూ రూ.2,460 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే మహిళలకు ఉచిత బస్సులో ఏకంగా రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. అంతేకాదు.. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. ఇక ఉచిత గ్యాస్ కూడా మోసమే. రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు కాగా ఏటా మూడు సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.3,990 కోట్లకుపైగా ఇవ్వాలి. ఇలా మూడేళ్లకు మొత్తం లబ్ధిదారులకు రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు.అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల హామీ ఏమైంది..? చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాల కోసం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి మూడు బడ్జెట్లలోనూ పైసా కేటాయించలేదు. ఒక్కరికి కూడా సెంటు భూమి పట్టా ఇవ్వలేదు. పైగా వైఎస్సార్సీపీ హయాంలో 10 లక్షల ఇళ్లు పూర్తి కాగా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న మిగతా వాటిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించి 10 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేశారు. ఆడబిడ్డలకు రక్షణ కరువు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. గంజాయి, బ్లేడ్బ్యాచ్లు చెలరేగిపోవడంతో రాష్ట్రంలో రోజుకి నలుగురు, ఐదుగురు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రోజుకు 50 నుంచి 60 మందిపై లైంగిక వేధింపుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మహిళలపై నేరాలు 10 శాతం పెరగగా.. హోంమంత్రి అనిత ఇన్చార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలోనూ నేరాలు పెరిగాయని, లోకేశ్ నియోజకవర్గంలోనూ మహిళలపై నేరాలు పెరిగాయని పోలీస్ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. మదనపల్లెలో గంజాయి మత్తులో ఓ క్రూరమృగం ఏడేళ్ల బాలికపై హత్యాచారానికి తెగబడి డ్రమ్ములో పడేయడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. అరవ శ్రీధర్ అనే కూటమి ఎమ్మెల్యే తనను ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్లు చేయించినట్లు బాధితురాలు మొర పెట్టుకున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరించింది. పలువురు టీడీపీ, జనసేన ప్రజా ప్రతినిధులు మహిళలకు లైంగిక వేధింపులకు దిగడం రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు, సర్కారు వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.జగన్ పాలనలో మహిళలకు స్వర్ణయుగంవైఎస్ జగన్ నవరత్నాల పాలన మహిళలకు స్వర్ణయుగంగా సాగింది. అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి వైఎస్ జగన్ పథకాలను అమలు చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మహిళలకు పలు పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీతో ఏకంగా రూ.2,83,866.34 కోట్లు అందించారు. చట్టం చేసి మరీ 50 శాతం పదవులు.. నామినేటెడ్ పోస్టుల నుంచి కేబినెట్ వరకు మహిళలకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్, హోం, వైద్య ఆరోగ్య, పర్యాటక శాఖల మంత్రులుగా మహిళలకు పట్టం కట్టారు. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్ట్ పనుల్లో కూడా మహిళలకు 50 శాతం కేటాయిస్తూ చట్టం చేసి మరీ అమలు చేశారు. అక్క చెల్లెమ్మల పేరిటే ఇళ్లు.. స్థలాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంతగూడు ఉండాలన్న సంకల్పంతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేశారు. అక్క చెల్లెమ్మల పేరిట స్థిరాస్తిని సమకూర్చడం దేశంలోనే సరికొత్త చరిత్ర. సొంత ఇళ్లు లేని అక్కచెల్లెమ్మలకు ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా భూముల కొనుగోలు కోసం రూ.11,871 కోట్లు, ఇళ్ల నిర్మాణాలకు రూ.20,338 కోట్లు ఖర్చు చేశారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు వెచ్చించి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశారు. ఇదే విషయాన్ని సాక్ష్యాత్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో లోక్సభ సమావేశాల్లో లిఖిత పూర్వకంగా వెల్లడించడం గమనార్హం.మహిళా రక్షణకు పెద్దపీట.. మహిళల రక్షణ, భద్రత కోసం వైఎస్ జగన్ పలు వినూత్న చర్యలు చేపట్టారు. ప్రధానంగా దిశ బిల్లు తెచ్చి దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లతో అక్క చెల్లెమ్మలకు రక్షణ కవచంలా నిలిచారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒక మహిళా పోలీస్ను నియమించారు. ఏ మహిళకు ఆపద వచ్చినా సమాచారం అందుకున్న నిమిషాల వ్యవధిలోనే పోలీసులు రంగంలోకి దిగి అండగా నిలిచేలా దిశ యాప్ ద్వారా చర్యలు చేపట్టారు. -
భారతీయులు గర్వపడే విజయమిది : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టి20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ బృందానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అద్భుతంగా ఆడి మళ్లీ చాంపియన్లుగా నిలిచిన కెప్టెన్ సూర్యకుమార్ నేతృత్వంలోని జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. తుదిపోరులో ప్రారంభం నుంచే భారత్ ఆధిపత్యం ప్రదర్శించిందని కొనియాడారు. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్ బాగా ఆడారని, చివరి విజయ క్షణాలు భారతీయులందరినీ గర్వపడేలా చేశాయని అభివర్ణించారు. వరల్డ్ కప్ కిరీటం తిరిగి మన ఇంటిలోనే ఉందంటూ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్లో టీమిండియా ప్రదర్శించిన అద్భుత ఆటతీరు దేశ ప్రజలందరికీ గర్వకారణమని కొనియాడారు. ఈ విజయం దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తెచ్చిందని రేవంత్ అన్నారు. -
టీ20 వరల్డ్ కప్ విజేత భారత జట్టుకు వైఎస్ జగన్ ప్రశంస
సాక్షి, తాడేపల్లి: టీ20 వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించిన సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు మొత్తం టీమ్ ఇండియాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by YS Jagan Mohan Reddy (@ysjagan)అద్భుతమైన ఆటతీరు కనబరిచిన అభి, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లకు ప్రత్యేక అభినందనలు. దేశం అంతా గర్వపడే లాంటి విజయం సాధించారు. ఈ గెలుపు ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది అని పేర్కొన్నారు. భారత్ జట్టు కృషి, పట్టుదల, జట్టు స్పూర్తి వల్లే ఈ విజయాన్ని సాధించగలిగిందని జగన్ అన్నారు. ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఏపీలో నారావారి నరకాసుర పాలన: ఆర్కే రోజా
సాక్షి, తాడేపల్లి: మహిళా సాధికారత కోసం కృషి చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళలు రాజకీయాల్లో ఎదగాలంటే చాలా కష్టమని.. కానీ వైఎస్ జగన్ ప్రోత్సాహంతో పార్టీలో ఎంతోమంది మహిళలు ఎదిగారని ఆమె పేర్కొన్నారు. ఆదివారం.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా నేతలు ఆర్కే రోజాతో పాటు వరుదు కళ్యాణి, రాయన భాగ్యలక్ష్మి, పూజిత, హారిక సహా పలువురు పార్టీ నేతలు కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘‘నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చి వైఎస్ జగన్ ప్రోత్సాహించారన్నారు. కష్టపడే వారికి, టాలెంట్ఉన్న వారికి వైఎస్ జగన్ ఎప్పుడూ అవకాశం కల్పిస్తారు. వరుదు కళ్యాణి తన ఎమ్మెల్సీ పదవి అలంకార ప్రాయం కాదని.. ఆయుధమని నిరూపించారు. ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదగాలి. టీమ్ వర్క్గా పని చేసి మళ్లీ జగన్ను సీఎంగా చేసుకోవాలి’’ అని ఆర్కే రోజా పేర్కొన్నారు.‘‘రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతోంది. మహిళలకు రక్షణ కల్పించలేని దిక్కమాలిన ప్రభుత్వం ఇది. హోంమంత్రి అనిత తన పదవిని పట్టించుకోకుండా ఆట, పాటలతో కాలం గడుపుతోంది. అనితతో పాటు మరో ఇద్దరు మంత్రులు మహిళలకు ఏం మేలు చేశారు?. అలాంటి మంత్రులు సబిత, అనిత, గుమ్మడి సంధ్యారాణిలకు మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. అన్యాయానికి గురైన మహిళలు ఫిర్యాదులు చేస్తే వారిమీదే కేసులు పెడుతున్న దుస్థితి నెలకొంది...కులం, మతం, పార్టీ చూడకుండా వైఎస్ జగన్ అందరికీ మేలు చేశారు. చంద్రబాబు మాత్రం కులం, మతం, పార్టీ చూసి అందరికీ వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి పేరు చెప్పుకుని, ఆమె తల్లి కన్నీటిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన వ్యక్తి. ముప్పై వేల మంది మహిళలు కనిపించకపోయారని చెప్పిన పవన్ ఈ ఇరవై నెలల్లో ఎంతమందిని తిరిగి తీసుకు వచ్చారు?.మనం చేసిన మంచి వలనే ఇప్పటికీ జనం మనల్ని గౌరవవిస్తున్నారు. కూటమి నాయకులు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితే లేదు. చంద్ర మండలానికి కూడా చంద్రబాబు సీఎం అవుతాడని ఎల్లో మీడియా జాకీలు ఎత్తుతోంది. బీఆర్ నాయుడు తప్పు చేస్తే అందులో తప్పేం ఉందని ఎల్లోమీడియా ప్రశ్నిస్తోంది. బీఆర్ నాయుడుకి ఒళ్లంతా అహంకారమే. లడ్డూపై విష ప్రచారం చేసిన వారందరి లెక్కలూ వెంకటేశ్వరస్వామి తేల్చుతున్నాడు’’ అని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
వచ్చే మంగళవారం బాబు సర్కారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ రూ.3,000 కోట్లు అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ అప్పు తీసుకోనుంది. 13 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,000 కోట్లు, 15 సంవత్సరాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 17 సంవత్సరాల వ్యవధితో రూ.1,000 కోట్లు చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయనున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నోటిఫై చేసింది.చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే బడ్జెట్ పరిధిలో రూ.1,79,264 కోట్లు అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేసే రూ.3,000 కోట్ల అప్పుతో కలిపి మొత్తం బడ్జెట్ పరిధిలోనే చంద్రబాబు సర్కారు 21 నెలల్లో చేసిన అప్పు రూ.1,82,264 కోట్లకు చేరనుంది. -
మహిళల అభ్యున్నతే సమాజ ప్రగతికి కొలమానం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మహిళలతోపాటు యావత్ మహిళలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లని పేర్కొన్నారు. మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుందని, తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటాయని తెలిపారు. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితోపాటు మహిళా సాధికారత లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేసిందని గుర్తుచేశారు. అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించామని చెప్పారు. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకుమించిన పాత్ర పోషిస్తున్న మహిళల అభ్యున్నతే... ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం అని తన సందేశంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
కంపెనీ పెట్టెయ్.. భూములు కొట్టెయ్!
సాక్షి, అమరావతి: ముక్కుతూ మూలుగుతూ రూ.లక్ష మూలధనంతో ఏర్పాటైన నెలలు నిండని కంపెనీలు రూ.వందల కోట్ల పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తాయట! సత్తాలేని సంస్థలకు ఆగమేఘాలపై ఖరీదైన భూముల సంతర్పణ! పెట్టుబడుల ముసుగులో చంద్రబాబు సర్కారు భూముల పందేరం ఇదీ! తాజాగా ఎన్ఏఎన్ గ్రీన్మెట్, స్కై స్టోరేజ్ సంస్థలకు కూటమి ప్రభుత్వం ఇదే విధంగా భూములను కేటాయించింది. మూడు నెలల క్రితం కేవలం రూ.లక్ష మూలధన పెట్టుబడితో ముంబై కేంద్రంగా ఏర్పాటైన ఎన్ఏఎన్ గ్రీన్మెట్ లిమిటెడ్కు నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద 21.36 ఎకరాలను కేటాయిస్తూ పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వేదాంత గ్రూపు సమీప బంధువులైన అనన్య అగర్వాల్, నైవేద్య అగర్వాల్ 2025 నవంబర్10న ఎన్ఏఎన్ గ్రీన్మెట్ ప్రైవేట్ లిమిటెడ్ను నెలకొల్పారు. కంపెనీని ఏర్పాటు చేయడం.. రాష్ట్ర ప్రభ్వుత్వంతో చర్చలు జరపడం.. ఎస్పీసీ, ఎస్పీబీ, మంత్రివర్గం ఆమోదం పొందడం.. ఆ వెంటనే ఉత్తర్వులు జారీ అయ్యే విధంగా ఫైళ్లు శరవేగంగా పరిగెత్తాయంటే దీని వెనుక ఉన్న శక్తిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నాయుడుపేటలో రూ.కోట్లు పలుకుతున్న భూమిని ఎకరం కేవలం రూ.30 లక్షలు చొప్పున కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కారు చౌకగా భూమితో పాటు పెట్టుబడిలో 60.38 శాతం రాయితీల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. స్కై స్టోరేజ్ సొల్యూషన్స్.. వేర్ హౌసింగ్, లాజిస్టిక్ సేవలను అందించేలా స్కై స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2025 డిసెంబర్ 5న విశాఖ కేంద్రంగా ఏర్పాటైంది. కేవలం రూ.లక్ష మూలధనంతో పవన్ ప్యాలెస్, దొడపర్తి, అక్కయ్యపాలెం, విశాఖ చిరునామాతో సిదార్థ అగర్వాల్, యోగేష్ శాంతిలాల్ పటేల్లు దీన్ని నెలకొల్పారు. ఈ కంపెనీ ఏర్పాటైన రెండు నెలల్లోనే అనకాపల్లిలో 15 ఎకరాలు కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరం రూ.80 లక్షలు చొప్పున తక్కువ ధరకు ఏపీఐఐసీ భూమిని కేటాయించింది. నాయుడుపేటలో ఎన్ఏఎన్ గ్రీన్మెట్ లిమిటెడ్కు అత్యంత విలువైన భూమిని ఎకరం రూ.30 లక్షలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ⇒ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ లిమిటెడ్కు ఎకరా రూపాయి చొప్పున విశాఖ జిల్లా తర్లువాడ వద్ద 30 ఎకరాలు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సెమి కండక్టర్స్ పాలసీ కింద తొలి కంపెనీగా ప్రత్యేకంగా గుర్తిస్తూ ఎకరా రూపాయికే భూమిని కేటాయించినట్లు పేర్కొన్నారు. దీంతోపాటు పెట్టుబడిలో 40 శాతం వరకు ప్రోత్సాహకాల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. సిగాచీ ఇండస్ట్రీస్కు గుట్టపాడు క్లస్టర్లో ఎకరా రూ.30 లక్షలు చొప్పున 94.70 ఎకరాలు కేటాయించారు. వీటితోపాటు 45.02 శాతం రాయితీలు ఇవ్వనున్నారు. ⇒ వారీ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్కు కూటమి సర్కారు అనకాపల్లిలో సుమారు 300 ఎకరాలు ఎకరా రూ.50 లక్షలు చొప్పున కేటాయించింది. 59.73 శాతం ఫిక్స్డ్ క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ⇒ పల్నాడు జిల్లా కొండవీడు వద్ద 12.31 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు అర్షథాతు గ్రీన్ నానోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎకరానికి రూ.5 లక్షల క్యాపిటల్ సబ్సిడీతోపాటు ఆ భూమిని 22 ఏ నుంచి తొలగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ⇒ సిఫి ఇన్ఫినిటీ స్పేసెస్ ఐటీసెజ్కు కేటాయించిన భూములకు సకాలంలో నగదు చెల్లింపులో విఫలం కాగా ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించేందుకు 90 రోజుల గడువు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.⇒ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్కు నెల్లూరు జిల్లా దత్తులూరు వద్ద 400 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ⇒ రేమాండ్ అనుబంధ కంపెనీ జేకే మైనీకి కేటాయించిన భూములకు ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ⇒ విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ఫార్మా యూనిట్కు పెట్టుబడిలో 40 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ⇒ బయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో 28.05 ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 14.28 ఎకరాలను కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. -
‘విజయ’ పేరుతో కల్తీ నెయ్యి
లాలాపేట: సహకార స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం విజయ డెయిరీ బ్రాండ్(ఏపీ)ను మేఘనా ఫుడ్స్ అనే ప్రైవేట్ సంస్థకు ఫ్రాంచైజీ అప్పజెప్పడంతో వారు వెజిటెబుల్ ఆయిల్స్తో నెయ్యి తయారు చేసి ఏపీ విజయ పేరుతో కల్తీ నెయ్యి విక్రయిస్తున్నారని తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) తెలంగాణ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. ఒక్క హైదరాబాద్లోనే నెలకు దాదాపు 100 టన్నుల కల్తీ నెయ్యి విక్రయిస్తూ విజయ బ్రాండ్కు చెడ్డపేరు తీసుకురావడంతోపాటు తెలంగాణ పాడి రైతాంగానికి తీవ్రమైన నష్టం కల్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెజిటెబుల్ ఆయిల్తో తయారు చేసిన నెయ్యిలో మోతాదుకు మించి హానికరమైన రసాయనాలు ఉన్నట్లు ఎన్డీడీబీ(నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) పరీక్షలు చేసి తేల్చిందని అమిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం లాలాపేటలోని విజయ భవన్లో ఎండీ చంద్రశేఖర్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాటాడారు. ఏపీ డెయిరీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి పాల సేకరణగానీ, పాల విక్రయం కానీ చేయడంలేదన్నారు. ప్రైవేట్ వ్యక్తులు గుజరాత్లో తయారు చేసిన నెయ్యిని ఏపీ విజయ డెయిరీ పేరుతో హైదరాబాద్లో విక్రయిస్తూ ఇక్కడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. రైతుల ద్వారా సేకరించిన పాలు, పాల పదార్థాల నాణ్యతకు మారుపేరుగా తెలంగాణ విజయ నిలుస్తోందన్నారు. ప్రభుత్వ రంగసంస్థ అయిన విజయ తెలంగాణ బ్రాండ్ విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విజయ పేరుతో ఎవరూ కల్తీ చేసినాఅడ్డుకుని తీరుతామన్నారు.అవసరమైతే రైతులు రోడ్డెక్కి పోరాటం చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు లేఖలు రాసామని, స్వయంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా స్పందనలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించి మేఘనా ఫుడ్స్కు ఇచ్చిన విజయ ఫ్రాంచైజీని విరమించుకోవాలని, లేదంటే తెలంగాణ సహకారంతో దాన్ని తామే అడ్డుకుంటామన్నారు. పాలు, పాల పదార్థాలు కొనేటప్పుడు నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ విజయ లోగోను చూసి మాత్రమే పాలు, నెయ్యి ఇతర పాల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి వినియోగదారులకు సూచించారు. -
గ్రామ సర్వేయర్లపై చంద్రబాబు సర్కారు కక్ష
సాక్షి, అమరావతి: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళన బాట పట్టిన గ్రామ సర్వేయర్లపై చంద్రబాబు సర్కారు కక్షసాధిస్తోంది. ఇప్పటికే 40 మంది సర్వేయర్లను సస్పెండ్ చేసింది. అందులో గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గ్రామ సచివాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మధుబాబు కూడా ఉన్నారు. ఈ చర్యల ద్వారా మిగిలిన ఉద్యోగులను భయపెట్టవచ్చని సర్కారు యోచనగా కనిపిస్తోంది. అనుమతి లేకుండా యూనియన్లు పెట్టి పోరాటం చేస్తున్నారంటూ ప్రభుత్వం సస్పెన్షన్ ఆర్డర్స్లో పేర్కొంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈనెల 5 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సర్వేయర్లు రాష్ట్రవ్యాప్తంగా సహాయ నిరాకరణ ప్రారంభించారు. రీ సర్వే కార్యక్రమంలో పాల్గొనకుండా తమ డిమాండ్లపై చర్చించాలని కోరారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను కలిసినా ఉపయోగం లేకపోవడంతో ఆందోళనను ఉధృతం చేశారు. దీంతో ప్రభుత్వం మూడు రోజుల నుంచి వరుసగా సస్పెన్షన్లు ప్రారంభించింది. అయినా సర్వేయర్లు వెనక్కి తగ్గకుండా సర్వే శాఖ జిల్లా కార్యాలయాల వద్ద ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. ఇవీ డిమాండ్లు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఇతర ఉద్యోగుల మాదిరిగానే తమ పే రోల్లో మార్పు చేయాలనేది సర్వేయర్ల ప్రధాన డిమాండ్. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రూ.30 వేల బేసిక్ పే ఉండగా, సర్వేయర్లకు మాత్రం రూ.25,200 మాత్రమే ఉంది. దీన్ని అందరితో సమానంగా పెంచుతామని, ప్రమోషన్ ఛానల్ కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం యధావిధిగా ఆ హామీని తుంగలో తొక్కింది. కనీస వేతనం కూడా ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న జీతాన్నే కేవలం పోస్టు పేరు మార్చి ఇచ్చేందుకు ప్రభుత్వం నివేదిక తయారు చేసినట్లు చెబుతున్నారు. దీంతో సర్వేయర్లు ఆందోళన బాట పట్టారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన విరమించేది లేదని సర్వేయర్లు స్పష్టం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సర్వేయర్ల సంఘం సన్నాహాలు చేస్తోంది. -
కబ్జాల గీతం.. సర్కారు తాళం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు తన బంధువులకు, బినావీులకు ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు, 99 పైసలకు కట్టబెడుతుండటంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి, వాటిని సక్రమం చేసుకునేందుకు మంత్రి లోకేశ్ తోడల్లుడు, సినీనటుడు బాలకృష్ణ అల్లుడు, విశాఖపట్నం టీడీపీ ఎంపీ భరత్కు చెందిన ‘గీతం’ సంస్థ బరితెగించి అన్ని అడ్డదారులూ తొక్కుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ అండతో జీవీఎంసీలో దౌర్జన్యం చేసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవిఎంసీ) సమావేశంలో ఎలాంటి చర్చ లేకుండానే తను ఆక్రమంచిన రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించుకుంది. ఈ బరితెగింపు, దౌర్జన్యంపై యావత్ ప్రజా సంఘాలు, రాష్ట్ర ప్రజలు ఓ వైపు మండిపడుతుండగా.. ఆ స్థలాన్ని ‘గీతం’ తన ఆధీనంలోకి తీసుకుని చదును చేసే పనులు మొదలు పెట్టడం కలకలం రేపుతోంది. తీర్మానం మేరకు ఇంకా జీవో విడుదల కాకముందే అధికారం అండ చూసుకుని గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూములను సొంతం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. జీవీఎంసీ పాలకవర్గ సమావేశంలో అధికార బలాన్ని ప్రయోగించి, దాడులకు తెగబడి ఆ భూముల క్రమబద్ధీకరణకు తీర్మానాన్ని ఆమోదించుకున్న వైనంపై ఓ వైపు ఇంకా చర్చ జరుగుతూనే ఉండగా, ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. పైగా గతంలో ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ ప్రభుత్వం పాతిన బోర్డులను సైతం పీకేశారు. లారీల్లో ఎర్రమట్టిని తరలించి కబ్జా భూముల్లో చదును చేసే (లెవలింగ్) పనులు చురుగ్గా చేస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్లో అక్రమంగా ‘గీత’ దాటి చేపడుతున్న పనుల వైపు రెవెన్యూ యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదు. కొద్దిపాటి జాగాలో వ్యాపారం చేసుకుని పొట్టపోసుకునే చిరు వ్యాపారులపై ఆపరేషన్ లంగ్స్ పేరిట ప్రతాపం చూపిన ప్రభుత్వం.. రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిలో గీతం పనులు చేస్తున్నా, అడ్డు చెప్పడానికి సాహసించడం లేదు. ఇప్పటికి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్న ఈ భూములు తమవే అన్నట్లు గీతం వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం కాపాడితే.. ఈ ప్రభుత్వం ధారాదత్తంఅధికారికంగా గీతం యూనివర్సిటీ కోసం కేటాయించిన భూముల్లో మాత్రమే కాకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్లోకి సైతం గీతం ఆక్రమణల పర్వం మొదలైంది. ఈ ఆక్రమణలన్నీ సక్రమం చేసుకునేందుకు 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ‘గీతం’ పావులు కదిపింది. ఇందులో భాగంగా గీతం ఆక్రమణ చెరలో ఉన్న భూముల్ని సదరు వర్సిటీకి ఎలినేషన్ కింద బదలాయించేందుకు సన్నాహాలు చేశారు. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ భూ కుంభకోణాలపై చర్యలకు ఉపక్రమించింది. ఇలా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకంగా 2 వేల ఎకరాల మేర భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంరక్షించింది. వీటి విలువ రూ.6 వేల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇందులో భాగంగా గీతం భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. 40.51 ఎకరాలకుపైగా ఆక్రమించుకున్న స్థలాల్ని దశల వారీగా స్వాధీనం చేసుకున్నారు. భూమిని ఆక్రమించి చేపట్టిన రక్షణగోడ, గార్డెన్, గ్రావెల్ బండ్ నిర్మాణాల్ని అప్పట్లో గత ప్రభుత్వం తొలగించింది. ఇది ప్రభుత్వ స్థలం అంటూ బోర్డులను పాతింది. ఇంకా ఆక్రమిత భూములున్నాయని రెవెన్యూ అధికారులు చెప్పడంతో.. గీతం యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. మిగిలిన 14 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి కోర్టులో విచారణ పెండింగ్లో ఉంది. తుది తీర్పు వచ్చే వరకు ఆ భూముల్లో ఎలాంటి కొత్త చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. గీతం చెరలో ఉన్న భూములు ఆక్రమించినవేనని చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో వేసిన ‘సిట్’ కూడా స్పష్టం చేసింది. కబ్జా భూముల్లో లెవలింగ్ పనులు చేపట్టిన దృశ్యం బోర్డులను సైతం పీకేసి.. బలం లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీకి చెందిన మేయర్ను అధికార చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా తొలగించింది. కేవలం గీతం భూముల కోసమే మేయర్ పీఠాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేజిక్కించుకుందని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. కౌన్సిల్ సమయం ముగుస్తున్న సమయంలో హడావుడిగా ఎజెండాలో చివరి అంశంగా గీతం భూముల విషయాన్ని చేర్చి, ఆమోదం పొందేలా ఒత్తిడి తెచ్చిందని స్పష్టం అవుతోంది. సీఎం, లోకేశ్ పేషీ నుంచి జీవీఎంసీపై ఒత్తిడి నేపథ్యంలో ఆ భూముల్ని గీతం వర్సిటీకి క్రమబద్ధీకరించి, బదలాయింపు ప్రక్రియ వేగవంతం చేసింది. ఇందుకోసం కౌన్సిల్ సమావేశంలో పక్కాగా రౌడీయిజానికి దిగడం.. ఎటువంటి చర్చ, ఓటింగ్ లేకుండానే అన్ని అంశాలు ఆమోదం పొందినట్లుగా ఎజెండాను మేయర్ స్వయంగా చదివి ప్రకటించడం తెలిసిందే. జీవీఎంసీ తీర్మానం తర్వాత అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేయాల్సి ఉంటుంది. అయితే అప్పటి వరకు వేచి చూడలేమంటూ ‘గీతం’ ఈ భూముల్లో బరితెగించి లెవలింగ్ పనులు పెద్ద ఎత్తున చేస్తోంది. ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డులను సైతం పీకేసింది.పప్పు బెల్లాలకు భూ పందేరాలురాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వ పెద్దల బంధువులు, బినామీలకు భూ పందేరాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. పప్పు బెల్లాలకు, 99 పైసలకే భూములిచ్చేస్తున్నారు. పైగా ఎకరం 99 పైసలకు కాదు.. ఆయా సంస్థలకు కావాల్సిన మొత్తం భూమిని 99 పైసలకే ఇస్తామని నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. రెండు మూడు నెలల క్రితం కంపెనీలు పెట్టి.. వాటి పేరుతో భూ దోపిడీ సాగిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సైతం భూములు కేటాయించిన ఘనత ఒక్క చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది. -
మహిళలందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటుంది.. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితో పాటు, మహిళా సాధికారత లక్ష్యంగా మా హయాంలో పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేశాం...అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాం. దాదాపు 32కు పైగా పథకాల ద్వారా మహిళలకు భరోసా కల్పించాం. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్ర పోషిస్తున్నారు. మహిళల అభ్యున్నతే.. ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, కెమికల్ కలిపారని దుష్ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బతీయాలని చంద్రబాబు ప్లాన్. వైఎస్సార్సీపీ హయాంలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ను తీసుకొచ్చాం. మార్కెట్లో ఫిబ్రవరి 24న కేజీ హెరిటేజ్ నెయ్యి రూ.541 ఉంది. అదే రోజు మార్కెట్లో ఇందాపూర్ నెయ్యి రూ.578గా ఉంది. కేజీ అమూల్ నెయ్యిని రూ.525కే ఇస్తున్నారు’ అని సజ్జల తెలిపారు.అడ్డగోలుగా దోపిడీ చేయటానికే.. తిరుమల లడ్డూపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘నెయ్యి కాంట్రాక్టును కైవసం చేసుకోవటానికే ఇష్టానుసారం మాట్లాడారు. అధిక ధరలతో నెయ్యి కాంట్రాక్టు తీసుకుని స్వామి వారి సొమ్మును కాజేస్తున్నారు. అడ్డగోలుగా దోపిడీ చేయటానికే లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల వెనుక పెద్ద స్కాం ఉంది.స్వామి వారి డబ్బును దోచుకోవటానికి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారు. లడ్డూ ఇష్యూలో ప్లాన్ ప్రకారమే మా పార్టీపై బురద చల్లారు. లడ్డూ కాంట్రాక్టు వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉంది. దీనిపై సీబీఐ విచారణ జరపాలి. అప్పుడే కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి. అమరావతిలో జరుగుతున్న స్కాం మదరాఫ్ ఆల్ స్కామ్స్. నెయ్యి ఇష్యూ అంతకంటే పెద్ద స్కాం. సెప్టెంబరు 18న నెయ్యి గురించి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు.జంతువుల కొవ్వు ఉందని అనడమే దారుణం అనుకుంటే బాత్రూమ్ కెమికల్స్ కలిపారని కూడా చంద్రబాబు మళ్లీ మాట్లాడారు. సాధారణ మనుషులు ఎవరూ ఊహించని మాటలతో అందరినీ ఆందోళనకు గురి చేశారు. దీనంతటి వెనుక భారీ స్కాం చేయటానికి పన్నిన కుట్ర దాగి ఉంది. 2023లో జగన్ తిరుమలలో అత్యాధునిక ల్యాబులను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటిది ఒక్కటీ చేయలేదు. బీఆర్ నాయుడి వ్యవహారం బయటపడినా ఆయనను చంద్రబాబు ఎందుకు తొలగించలేదు? మా హయాంలో పృథ్వీ విషయం తెలియగానే రాజీనామా చేయించాం. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి. భక్తుల విశ్వాసాలంటే చంద్రబాబుకు లెక్క లేదని అర్థం అయింది’ అని ధ్వజమెత్తారు. -
పోలవరంలో పెను విధ్వంసం బాబు తప్పిదమే..!
సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో 2017, 2018లో చంద్రబాబు సర్కార్ పాల్పడిన తప్పిదాల వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతినడంతోపాటు పెను విధ్వంసం చోటుచేసుకుందని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చి చెప్పింది. ప్రాజెక్టు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) నిర్మాణ షెడ్యూల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేశాక.. ప్రధాన డ్యాం నిర్మాణం పునాది డయాఫ్రం వాల్ను నిర్మించాలని గుర్తు చేసింది. కానీ.. దానికి విరుద్ధంగా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ పనులను 2017 ఫిబ్రవరిలో రూ.399.77 కోట్లతో ప్రారంభించి 2018 జూన్ నాటికి పూర్తి చేశారని పేర్కొంది. 2019 వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయాలనే లక్ష్యంతో 2018 నవంబర్లో పనులు చేపట్టారని తెలిపింది. కానీ.. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేకపోవడంతో ఎగువ కాఫర్ డ్యామ్కు ఇరువైపులా 600 మీటర్ల వెడల్పుతో ఖాళీలను వదిలేశారని పేర్కొంది. దీంతో 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. ఎగువ కాఫర్ డ్యాంలో వదిలిన 600 మీటర్ల ఖాళీ ప్రదేశంలో కుంచించుకుపోయి ప్రవహించాల్సి వచ్చిందని.. ఫలితంగా వరద ఉద్ధృతి మరింత పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతిందని, ప్రధాన డ్యాం గ్యాప్–2లో భారీగా కోతకు గురైందని స్పష్టం చేసింది. అదే.. నిర్మాణ షెడ్యూలు ప్రకారం పనులు చేపట్టి ఉంటే ఈ విధ్వంసం చోటుచేసుకునేది కాదని.. డయాఫ్రం వాల్ కోసం చేసిన రూ.399.77 కోట్ల వ్యయం వృథా అయ్యిందని కాగ్ స్పష్టం చేసింది. ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యానికి ఇదే కారణమైందని పేర్కొంది. డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో దానికి సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని యధాస్థితికి తెచ్చే పనులకు రూ.2020.05 కోట్లతో 2023 ఏప్రిల్లో సర్కార్ పరిపాలన అనుమతి ఇచ్చిందని పేర్కొంది. పోలవరం పనులపై 2017–18 నుంచి 2023 మార్చి వరకూ అధ్యయనం జరిపి కాగ్ నివేదిక ఇచ్చింది. నిర్మాణ పనుల్లో తప్పిదాలు.. నామినేషన్ పద్ధతిలో భారీ ఎత్తున పనులు అప్పగించడం.. కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున ప్రయోజనం చేకూర్చడం.. భూసేకరణలో జరిగిన లోటుపాట్లను కాగ్ తన నివేదికలో తూర్పారబడుతూ చంద్రబాబు సర్కార్ను కడిగిపారేసింది. ప్రధాన డ్యాం పనులు సజావుగా సాగేందుకు నిర్మాణ షెడ్యూలుకు కట్టుబడి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలంటూ చంద్రబాబు సర్కార్కు అక్షింతలు వేసింది. కాగ్ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన.. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం) పనులను రూ.4,054 కోట్లకు ట్రాన్స్ట్రాయ్ 2013 మార్చిలో ఈపీసీ(ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో దక్కించుకుంది. 2018 మార్చి నాటికి పనులు పూర్తి చేసేలా ట్రాన్స్ట్రాయ్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిరి్మంచాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. ట్రాన్స్ట్రాయ్తో ప్రభుత్వం 2013లో కుదుర్చుకున్న ఒప్పందం 25వ నిబంధన ప్రకారం ప్రాజెక్టు పనులకు అవసరమైన సామగ్రి, పనిముట్లను కాంట్రాక్టరే సమకూర్చుకోవాలి. కానీ.. దానికి విరుద్ధంగా సామగ్రి, ఇతర ఖర్చుల కోసం కాంట్రాక్టర్కు 2017 మే నుంచి 2018 మే వరకూ రూ.170 కోట్లను ఇంప్రెస్ట్ అమౌంట్ కింద ప్రభుత్వం ఇచ్చింది. మొబిలైజేషన్ అడ్వాన్సుతో కలిపి రూ.446.32 కోట్లు కాంట్రాక్టర్కు ఇచ్చినట్లయింది. అందులో 2018 నవంబర్ నాటికి రూ.302.10 కోట్లను కాంట్రాక్టర్ నుంచి ప్రభుత్వం వసూలు చేసింది. మిగతా రూ.144.22 కోట్లలో బ్యాంకు గ్యారంటీల రూపంలో రూ.123.07 కోట్లను 2019 మార్చిలో వసూలు చేసింది. ఇప్పటికీ ట్రాన్స్ట్రాయ్ నుంచి ఇంకా రూ.21.15 కోట్లను వసూలు చేయాల్సి ఉందని కాగ్ పేర్కొంది. » 2018, జనవరి నాటికి రూ.1,755.05 కోట్ల విలువైన పనులను మాత్రమే ట్రాన్స్ట్రాయ్ చేసింది. పనుల్లో వేగం పెంచడం పేరుతో ఏపీడీఎస్ఎస్లో 60(సీ) నిబంధన ప్రకారం రూ.2,019.67 కోట్ల విలువైన పనులను ట్రాన్స్ట్రాయ్ నుంచి తొలగించి.. ఈపీసీ పద్ధతిలో కాకుండా ఎల్ఎస్(లంప్సమ్)విధానంలో నవయుగకు నామినేషన్ పద్ధతిలో 2018 ఫిబ్రవరి 17న నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు సర్కార్ అప్పగించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని కాగ్ స్పష్టం చేసింది. » ఏపీడీఎస్ఎస్లో 60(సీ) నిబంధన ప్రకారం పనుల ఒప్పందం విలువలో 5 శాతం అంటే రూ.269.29 కోట్లను ట్రాన్స్ట్రాయ్కు జరిమానాగా విధించి వసూలు చేయాలి. ఈపీడీఎసీఎల్కు రూ.26.02 కోట్లను ట్రాన్స్ట్రాయ్ చెల్లించాలి. ఇంప్రెస్ట్ అమౌంట్పై వడ్డీ రూ.30.61 కోట్లను కూడా కలుపుకొంటే మొత్తం రూ.331.90 కోట్లను ట్రాన్స్ట్రాయ్ నుంచి వసూలు చేయాలి. అయితే ట్రాన్స్ట్రాయ్ దివాలా తీసింది. రూ.331.90 కోట్లను వసూలు చేయడానికి ఎన్సీఎల్టీలో ప్రభుత్వం దావా కూడా వేయకపోవడాన్ని కాగ్ ఆక్షేపించింది. » నవయుగకు నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనులను నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. వాటితోపాటు జలవిద్యుత్కేంద్రం పనులకు రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్ నిర్వహించడంతో ఖజానాకు రూ.628.43 కోట్లు ఆదా అయ్యిందని కాగ్ నివేదికలో వెల్లడించింది. జలవిద్యుత్కేంద్రం పనుల్లో నవయుగకు రూ.145.47 కోట్లు అనుచిత లబ్ది.. » పోలవరం జలవిద్యుత్కేంద్రం పనులను 2017 డిసెంబర్లో రూ.3,220.28 కోట్లకు నవయుగ దక్కించుకుంది. టర్బైన్ నమూనా పరీక్ష విజయవంతంగా పూర్తయిన తర్వాత వడ్డీ లేని ముందస్తు చెల్లింపు కింద రూ.145.47 కోట్లను నవయుగకు చెల్లించింది. కానీ దీనికి జెన్కో బోర్డు ఆమోదంగానీ ప్రభుత్వం ఆమోదంగానీ లేదు. దీన్ని బట్టి చూస్తే నవయుగకు రూ.145.47 కోట్లను అనుచితంగా లబ్ధి చేర్చారని కాగ్ తప్పుబట్టింది. » కుడి, ఎడమ కాలువ తవ్వకంలో 12.02 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి కాలువ గట్లపై ఉంది. దీని విలువ రూ.1,660.15 కోట్లు. మట్టిని అమ్మితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దొంగతనం కాకుండా చూడాలని ప్రభుత్వానికి కాగ్ సూచించింది. భూసేకరణలో లోపం... పునరావాసం కల్పనలో నిర్లక్ష్యం.. » పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే భూమితోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మొత్తం 1,79,770 ఎకరాల భూమిని సేకరించాలని అంచనా వేశారు. ఇందులో 1,67,765 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2023 మార్చి నాటికి 1,13,119 ఎకరాలు సేకరించారు. మరో 54,646 ఎకరాలు సేకరించాల్సి ఉంది. » పోలవరం కోసం సేకరించాల్సిన భూమిలో 8,185.27 ఎకరాలకు డీకేటీ పట్టాలు జారీ చేశారు. 1,838.64 ఎకరాల ఆక్రమణకు గురైంది. మొత్తం ఈ 10,023.91 ఎకరాల సేకరణకు రూ.619.83 కోట్లు పరిహారం చెల్లించి సేకరించాల్సి వచ్చిందని కాగ్ పేర్కొంది. » ప్రాజెక్టుతో 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లోని 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. 2014 నాటికి 6 గ్రామాల్లోని 714 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తే.. 2014–15 నుంచి 2018–19 వరకూ 11 గ్రామాల్లోని 3,066 కుటుంబాలకు.. 2019–20 నుంచి 2023, మార్చి వరకూ 21 గ్రామాల్లోని 7,897 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. ఇంకా 94,329 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని కాగ్ ఆక్షేపించింది. -
'లెక్క'లేక చిక్కులు!
సాక్షి, అమరావతి : తన పాలనలో రాష్ట్రం వృద్ధిలో దూసుకుపోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న గణాంకాలన్నీ మిథ్యేనని తేలిపోయింది. బాబు తొలి బడ్జెట్ అంకెల గారడీతో మోసం చేయడమే తప్ప కేటాయింపులకు తగినట్లు వ్యయం లేదని స్పష్టమైంది. 2024–25లో అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే రెవెన్యూ రాబడులు ఏకంగా 3.51 శాతం తగ్గిపోయాయని తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించిన 2024–25 ఆర్థిక ఏడాది ఆర్థిక, ద్రవ్య అకౌంట్స్పై కాగ్ నివేదికలో ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా తిరోగమనంలో పయనిస్తున్నట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా 2024–25లో రాలేదని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో ఆదాయ వసూళ్లలో 3.51 శాతం తగ్గుదల ఉందని వెల్లడించింది. ఇదే రీతిలో రాష్ట్ర పన్నేతర ఆదాయం 19.64 శాతం తగ్గిపోయిందని స్పష్టం చేసింది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే ఏకంగా 41.82 శాతం తగ్గిపోయిందని ఎత్తి చూపింది. 2024–25 ఆర్థిక ఏడాది బడ్జెట్లో రెవెన్యూ రాబడులు రూ.2,69,928 కోట్లుగా పేర్కొనగా, వాస్తవంగా రూ.2,49,191 కోట్లే వచ్చాయని కాగ్ పేర్కొంది. అంటే రెవెన్యూ రాబడులు ఏకంగా రూ.20 వేల కోట్ల మేర తగ్గిపోయాయి. మూల ధన వ్యయం బాగా తక్కువ బడ్జెట్లో కేటాయింపుల మేరకు మూల ధన వ్యయం చేయలేదని.. ఇరిగేషన్, గృహ నిర్మాణం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు వ్యయం చేయలేదని కాగ్ స్పష్టం చేసింది. 40 రంగాల్లో.. 10 రంగాలకు చేసిన గ్రాంట్లలో 50 శాతం కన్నా తక్కువ వ్యయం చేసినట్లు ఎత్తి చూపింది. మరో పక్క గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలతోపాటు ఇతర సంస్థలకు గ్రాంట్లు కూడా అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25లో ఏకంగా రూ.10,620 కోట్లు తగ్గిపోయినట్లు పేర్కొంది. 2024–25లో మూల ధన వ్యయం కింద రూ.45,382 కోట్ల వ్యయం చేయనున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ, వాస్తవంగా రూ.16,141 కోట్లే వ్యయం చేశారని తెలిపింది. ఇది జీఎస్డీపీలో కేవలం ఒక శాతం మాత్రమేనని ఎత్తి చూపింది. అదే 2023–24 ఆర్థిక ఏడాదిలో మూల ధన వ్యయం రూ.23,330 కోట్లు అని పేర్కొంది. -
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి
మంగళగిరి టౌన్ : గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఏప్రిల్ 20 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతారని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. మంగళగిరి ఆటోనగర్లోని సీసీఎల్ఏ కార్యాలయం వద్ద శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా వీఆర్ఏలందరికీ పే స్కేలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వేతనాలు సరిపడాలేవన్నారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లక్షలాది రూపాయల వేతనాలు ఇస్తున్నారుగానీ వీఆర్ఏలకు మాత్రం పెంచడంలేదన్నారు. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 22 నెలలవుతున్నా నేటికీ వీఆర్ఏల సమస్యల్లో ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. నిబంధనలకు విరుద్ధమైన డ్యూటీలు వేస్తున్నారని, రీ సర్వే పేరుతో మైళ్లకొద్దీ ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్లకార్డులతో ప్రదర్శన.. ధర్నా అంతకుముందు.. ఎన్ఆర్ఐ వై–జంక్షన్ నుంచి సీసీఎల్ఏ కార్యాలయం వరకు వీఆర్ఏలు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ బందగీ సాహెబ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు, సంఘం కోశాధికారి రవికుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ త్రినాథరావు, ఉపా«ధ్యక్షులు నాగేంద్ర, సుబ్బయ్య, రాష్ట్ర నాయకులు కొండబాబు, శేఖర్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి భూములు ఎందుకివ్వాలి?
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్ : అమరావతి రాజధాని పేరుతో సంవత్సరానికి మూడుపంటలు పండే భూములను తీసుకోవద్దన్న సూచనలు, సలహాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ భూములను కాంక్రీట్తో నింపేశారని రైతునేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. భూసేకరణ సమయంలో ఇచి్చన హామీలకు దిక్కు ఎవరని ప్రశ్నించారు. రాజధాని పేరుతో రైతుల నుంచి అడ్డగోలుగా భూములు లాక్కుని వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రెండోవిడత భూసేకరణకు రైతులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ రెండోదశకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చావేదిక శుక్రవారం గుంటూరులో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నిర్మాణమే లేని రాజధానిలో ఐదువేల ఎకరాల్లో ఎయిర్పోర్టు, 1,500 ఎకరాల్లో రైల్వేస్టేషన్ అంటూ సీఎం చంద్రబాబు, మున్సిపల్శాఖ మంత్రి నారాయణ ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. సీఆర్డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందానికి చట్టబద్ధత లేదని, మొదటివిడతలో భూములిచ్చిన రైతులు నెత్తీనోరు బాదుకుంటున్నారని చెప్పారు. రెండోవిడత భూములు తీసుకునేముందు మొదటివిడతలో భూములిచి్చన రైతులకు ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన మెడికల్ కళాశాలల నిర్మాణాలను పూర్తిచేసేందుకు రూ.4,400 కోట్లు లేవని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి చుట్టూ నిర్మించేందుకు ప్రతిపాదించిన ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్)కు రూ.వేలకోట్లు ఏ విధంగా ఖర్చుచేస్తుందని ప్రశ్నించారు. మొదటివిడతలో భూములిచ్చిన రైతుల పిల్లల కోసం ఉచిత విద్య, వైద్య సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్న చంద్రబాబు సర్కారు.. రెండోవిడతకు వచ్చేసరికి దాన్ని ఉచిత విద్య, వైద్యానికి అర్హులు అని మార్పులు చేయడంతోనే భూసేకరణ వి«ధానంలోనే లోపముందని అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. రైతుల అంగీకారం లేకుండా సెంటు భూమి కూడా సైతం తీసుకోలేరని స్పష్టం చేశారు. భూముల కోసం వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు భూములిచ్చేది లేదని తెగేసి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కుర్రా వసుంధర, మహదేవ్, విశ్రాంత ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య, మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, చార్టర్ అకౌంటెంట్ పి.మల్లికార్జునరావు, హైకోర్టు న్యాయవాది కేవీఎం రజని, ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయరెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధులకు ఒకే రూల్ ఉండాలి
తాడేపల్లి రూరల్: ప్రజా ప్రతినిధులమైన తమపట్ల చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు ధ్వజమెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ప్రజాప్రతినిధులందరికీ ఒకే రూలు ఉండాలని, వివక్ష సరికాదని నినదించారు. ఈ సందర్భంగా ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మేకల హనుమంతరావు, రెడ్డప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అందరికీ ఒకే నిబంధన ఉండాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రం అవసరమైన అన్నింటిని సమకూర్చుకుని ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లకు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు రెండేళ్లవుతున్నా సీఎం అమలు చేయడంలేదన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ మంత్రిగా పవన్కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తరువాత తమ సమస్యలపై ఒక్కసారి కూడా పెదవి విప్పలేదని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నెలనెలా జీతాలు, అలవెన్సులు తీసుకుంటున్నారని, 30 నెలలుగా ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, వార్డు సభ్యులకు ఒక్క రూపాయి వేతనం కూడా చెల్లించలేదని చెప్పారు. మండల పరిషత్ నిధులతో చేపట్టిన పనుల బిల్లులు కూడా చెల్లించలేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. నెలకు ఎంపీపీలకు రూ.25 వేలు, ఎంపీటీసీ సభ్యులకు రూ.10 వేలు వేతనాలివ్వాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలన్నారు.సొమ్మసిల్లిన కాకినాడ జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ కమిషనర్ కృష్ణతేజకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో తీవ్ర ఆందోళనకు గురైన కాకినాడ జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఆయన్ని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు ఒత్తిడి తీసుకురావడం వల్లే నరసింహమూర్తి అస్వస్థతకు గురయ్యారని ఎంపీపీలు చెప్పారు. -
అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమీ దాచడానికి లేదని శాసనమండలి సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కుండబద్దలు కొట్టారు. బడ్జెట్ను పూర్తి పారదర్శకంగా తీసుకు వస్తున్నామని, ఇందులో ఏమీ దాచడం లేదని రాష్ట్రంలో అప్పులు తప్ప ఇక దాచడానికి ఏమీ లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను దాస్తున్న విషయాన్ని ఆర్థిక మంత్రి పరోక్షంగా అంగీకరించారు. శుక్రవారం మండలిలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా 2026–27 బడ్జెట్ పత్రాల్లో బడ్జెట్ బయట చేసే అప్పులు (ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్) దాచిన విషయంపై ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ గట్టిగా నిలదీసింది. బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎందుకు పేర్కొనలేదని, బడ్జెట్లో పేర్కొన్న రెవెన్యూ, ఆర్థిక లోటులను ఏ విధంగా పూడ్చుకుంటారన్న విషయాలు ఎక్కడున్నాయంటూ మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. గత ప్రభుత్వం మాకు రూ.9.74 లక్షల కోట్ల అప్పును వారసత్వంగా ఇచ్చి వెళ్లిందంటూ ఆర్థికమంత్రి కేశవ్ పేర్కొంటున్నారని, కానీ ఈ అప్పులు బడ్జెట్ పత్రాల్లో ఎక్కడ అంటూ ప్రశ్నించారు. బడ్జెట్ పత్రాల్లో చూపించకుండా అప్పులు ప్రభుత్వం విడుదల చేసిన వైట్పేపర్లో ఉన్నాయంటూ ఎలా చెపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కాగ్ గణాంకాల ప్రకారం రాష్ట్రం సొంత ఆదాయార్జనలో 22వ స్థానంలో ఉందని, ఆయా రాష్ట్రాల కాగ్ నివేదికలను పరిశీలిస్తే ఇది తెలుస్తుందన్నారు. వాస్తవాలు లేకుండా ఈ బడ్జెట్ను పూర్తిగా అంకెలగారడీగా మార్చేశారంటూ దుయ్యబట్టారు.సూపర్ సిక్స్లో మూడు సిక్స్లు ఔట్సూపర్ సిక్స్లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇస్తామన్న హామీలకు బడ్జెట్లో ఒక్క రూపాయికూడా కేటాయించలేదంటూ బొత్స ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్లో మూడు సిక్స్లను ఎగరగొట్టేసి సూపర్ హిట్ అంటూ ఎలా ప్రచారం చేసుకుంటారంటూ దుయ్యబట్టారు. కనీసం ఈ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా చెప్పకుండా అమలు చేసేశామంటూ మభ్య పెడుతున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు సున్నా వడ్డీ రుణాలకు మంగళం పాడేసి మహిళలను లక్షాధికారులను ఎలా చేస్తారంటూ నిలదీశారు. రాష్ట్రంలో ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందిపడుతున్న మాట వాస్తవం కాదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్ఆర్జీఎస్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా పెట్టకుండా కేంద్రం ఇస్తున్న రూ.8,500 కోట్లను చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నడవడానికి ద్రవ్యవినిమయ బిల్లు అత్యంత ప్రాధాన్యమైనది కావడంతో బడ్జెట్లో పేర్కొన్న అంకెల గారడీని నిరసిస్తూ మౌనంగా సభలోనే ఉంటామంటూ బొత్స ప్రకటించారు. అంతకుముందు వైఎస్సార్సీపీ సభ్యుడు మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ మేనిఫెస్టోలోని పథకాలకు, కేటాయించిన నిధులకు సంబంధం లేదన్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. కాగా, వేతనాల పెంపు కోసం అంగన్వాడీలు ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతోందంటూ వైఎస్సార్సీపీ సభ్యులు మండలిలో విమర్శించారు. అంగన్వాడీల వేతనాల పెంపునకు 2024 జనవరిలోనే అప్పటి తమ ప్రభుత్వం అగ్రిమెంట్ రూపంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అంగన్వాడీలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు బొత్స ప్రకటించారు. -
వాళ్లు 11 మందే అయినా.. 1,100 మందితో సమానం
సాక్షి, అమరావతి: శాసనసభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 11 మందే అయినా 1,100 మందితో సమానమన్నట్లు మాట్లాడుతారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా ఉండకపోతే వైఎస్సార్సీపీ బలపడుతుందని స్పష్టం చేశారు. ‘వైఎస్సార్సీపీ వాళ్లు చెప్పిన దానిని చాలా బలంగా నమ్ముతారు. కానీ, మనం చేసే పనులు మనం చెప్పుకోలేం. ఎందుకు సంకోచిస్తున్నామో తెలీదు. మనలో (కూటమి) ఏకాభిప్రాయం, ఏకత్వం ఉండాలి. వైఎస్సార్సీపీ వాళ్లను ఎదుర్కోవాలంటే కూటమి సభ్యులు చాలా బలంగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. -
అసెంబ్లీలో భజన.. కౌన్సిల్లో పలాయనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఆయన తనయుడు లేకపోతే ఈ రాష్ట్రమే లేదనే స్థాయిలో అసెంబ్లీలో భజన.. మరోవైపు ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్కు ఉన్న సంబంధం గురించి కనీస ప్రస్తావన కూడా రానీయకుండా కౌన్సిల్లో పలాయనం. 17 రోజులపాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆసాంతం ఆత్మస్తుతి, పరనిందను తలపించాయి. అసెంబ్లీలో చంద్రబాబును కారణజన్ముడిగా, లోకేశ్ను అపర మేధావిగా, దేవాన్ష్ ను భావినేతగా కీర్తిస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబు కీర్తన సభలుగా మార్చివేశారు. కౌన్సిల్లో మాత్రం బయటపడిన తమ గుట్టుపై చర్చ జరక్కుండా కుతంత్రాలకు దిగజారారు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలను లేని గొప్పల్ని చెప్పుకోవడం, గత వైఎస్ జగన్ పాలన గురించి అబద్ధాలు చెప్పడానికే కూటమి ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించుకుంది. అవాస్తవాల బడ్జెట్14వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిధులు కేటాయించకుండా వాటికి తిలోదకాలు ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. చేసిన అప్పుల గురించి వాస్తవాలు చెప్పకుండా, ఈ ఏడాది మాత్రం మరో రూ. లక్ష కోట్ల అప్పులు చేస్తామని నిర్భీతిగా బడ్జెట్లో పెట్టడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో సైతం చంద్రబాబును పొగడ్డానికే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాధాన్యత ఇచ్చారు. 20 నెలలుగా చేసిందేమిటో చెప్పుకోలేక బడ్జెట్ ప్రసంగంలోనూ పదేపదే గత ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేశారు. ప్రతిరోజూ జరిగిన ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చల్లోనూ చంద్రబాబును, లోకేశ్ను ఆకాశానికి ఎత్తేసి వారికి దగ్గరయ్యేందుకు కూటమి సభ్యులు అత్యుత్సాహం చూపారు. జనసేన ఎమ్మెల్యేలు సైతం బాబును పొగిడేందుకు పోటీపడడం గమనార్హం. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మరో అడుగు ముందుకేసి చంద్రబాబు, లోకేశ్తోపాటు లోకేశ్ కొడుకు దేవాన్‡్షను కూడా పొగుడుతూ స్వామిభక్తిని చాటుకోవడం చర్చనీయాంశమైంది. పీఏసీ చైర్మన్గా ఉన్న మరో జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు ఏకంగా చంద్రబాబును కారణ జన్ముడిగా అభివర్ణించారు. చర్చ ఏదైనా అందులో బాబు, లోకేశ్ను ఆకాశానికి ఎత్తడం, జగన్ను తిట్టడమే పనిగా అసెంబ్లీ నడించింది.టీడీపీ నేతల్లా స్పీకర్, డిప్యూటీ స్పీకర్అదే సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పీకర్ స్థానంలో కూర్చుని టీడీపీ నేతలా ప్రతిపక్షంపైనా, వైఎస్ జగన్పైనా విమర్శలు చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేలను ఏకవచనంతో సంబోధించడం, వారు మాట్లాడిన తర్వాత దానిపై జడ్జిమెంట్ ఇచ్చేయడం, అది అయ్యే పని కాదంటూ తీర్మానించి చెప్పేయడం, మాట్లాడిన సభ్యులను కామెంట్ చేసి అసెంబ్లీ స్థాయిని దిగజార్చారనే చర్చ అధికారపక్షంలోనే చోటుచేసుకుంది. చివరికి కూటమి ఎమ్మెల్యేలు తాము చేసిన భజనపై తమకే విసుగొచ్చి ప్రతిపక్షం లేకపోతే సభ బాగోలేదంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కౌన్సిల్ సమావేశంలో జరగనీయకుండా కుతంత్రాలు... మండలిలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం అడ్డగోలు కుతంత్రాలకు తెరలేపింది. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ సంస్థకు ఉన్న బంధం గురించి సమాధానం చెప్పలేమనే భయంతో మొత్తం సమావేశాలు స్తంభించేలా వ్యవహరించింది. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ తమ సొంత సంస్థ కోసం మంత్రులు, కూటమి ఎమ్మెల్సీలను ఉపయోగించుకుని ప్రజా సమస్యలు తమకు పట్టవని తేల్చేశారు. ఇందాపూర్ డెయిరీ–హెరిటేజ్ ప్రస్తావన రాకుండా చేసేందుకు చర్చను కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంది. స్వయంగా లోకేశ్ మండలికి వచ్చి తమ సంస్థకు మద్దతుగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్సీలను మోహరించి చర్చ జరగనీయకుండా చేయడం స్పష్టంగా కనిపించింది. చర్చకు ఒప్పుకుని చివరికి ప్లేటు ఫిరాయింపు వరుసగా నాలుగు రోజులు సభను స్తంభింపచేసి చివరికి విమర్శలు వస్తుండడంతో అధికారపక్షం బీఏసీ సమావేశం నిర్వహించి ఇతర అంశాలతోపాటు ప్రతిపక్షం కోరుతున్న అంశంపై చర్చించేందుకు అంగీకరించి ఆ తర్వాత ప్లేటు ఫిరాయించింది. ఇతర అంశాలన్నింటిపై చర్చించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు సహకరించినా.. ఇందాపూర్–హెరిటేజ్ అంశంపై వచ్చేసరికి మాట మార్చి సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కింది. ఈ విషయంలో మండలి చైర్మన్ మోషేన్రాజు అనుమతి లేకుండా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయడానికి ప్రయత్నించారు. చైర్ అనుమతి లేకుండా స్టేట్మెంట్కు ప్రయత్నించి చైర్మన్ స్థానాన్ని అవమానించారని మోషేన్ రాజు విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి సభను తప్పుదోవ పట్టించారని స్వయంగా చైర్మన్ సభలో ప్రకటించడాన్ని బట్టి టీడీపీ ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా అదే అంశంపై ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టగా మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్కు మతం ఆపాదించి అధ్యక్ష స్థానాన్నే అవమానించి చర్చ జరక్కుండా సమస్యను పక్కదారి పట్టించారు. ఇందాపూర్–హెరిటేజ్ బంధం గురించి మండలిలో చర్చ జరక్కుండా చేసేందుకు చివరికి టీడీపీ మత రాజకీయాలకు దిగి అభాసుపాలైంది. మొత్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రజా సమస్యలు కంటె టీడీపీ రాజకీయాలు, చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ప్రయోజనాల కోసమే జరిగినట్లు తేటతెల్లమైంది. -
చేబదుళ్లకూ భారీగా వడ్డీ చెల్లింపు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఏడాది పాలనలోనే ఆర్థిక ఆరాచకం సృష్టించారు. ఏడాదిలో 365 రోజుల్లో 357 రోజులు చేబదుళ్లతోనే ఆర్థిక నిర్వహణను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించిందని కాగ్ నివేదిక పేర్కొంది. పైగా చేబదుళ్లకు కూడా భారీగా వడ్డీలు చెల్లించిందని వెల్లడించింది. సాధారణంగా ఎవరైనా వ్యక్తులు డబ్బులు చేబదులు తీసుకుంటే చెప్పిన సమయానికి తిరిగి చెల్లించేస్తారు. అందుకు వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యక్తుల తరహాలనే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆర్బీఐ చేబదుళ్లకు వెసులుబాటు కల్పిస్తుంది. ఆ వెసులుబాటు సమయం వరకు చేబదుళ్లు వాడుకుని తిరిగి చెల్లించేస్తే ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే చంద్రబాబు సర్కారు తొలి ఏడాది పాలనలోనే సకాలంలో చేబదుళ్లు తిరిగి ఇవ్వలేక భారీగా వడ్డీలు చెల్లించిందని 2024–25 ఆర్థిక ఏడాది బడ్జెట్ అకౌంట్స్పై కాగ్ నివేదిక స్పష్టం చేసింది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పొందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద కేవలం ఎనిమిది రోజులు మాత్రమే కనీస నగదు నిల్వను నిర్వహించడం ఘోరమని కాగ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ స్ఫెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలను కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలో కనీస నగదు బ్యాలెన్స్ రూ.1.94 కోట్లలోపు ఉంటే ఈ సౌకర్యాలను వినియోగించుకుంటాయి. ఆర్థిక అరాచకానికి నిదర్శనం2024–25 ఆర్థిక ఏడాదిలో చంద్రబాబు సర్కారు 71 రోజులు రూ.42,004 కోట్ల మేర స్పెషల్ వేస్ అండ్ మీన్స్, 179 రోజులు రూ.73,897 కోట్ల మేర వేస్ అండ్ మీన్స్ వినియోగించుకుందని కాగ్ వెల్లడించింది. 107 రోజులు రూ.56,631 కోట్ల మేర ఓవర్ డ్రాఫ్ట్ను వినియోగించుకుందని స్పష్టం చేసింది. ఈ మొత్తాలను నిర్దేశిత సమయంలోగా తిరిగి చెల్లించక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.303 కోట్ల మేర వడ్డీగా ఆర్బీఐకి చెల్లించినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. చేబదుళ్లకే వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిందంటే ఆర్థిక నిర్వహణ ఎంత దారుణంగా దిగజారిపోయిందో అర్థం అవుతోంది. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ను వినియోగించుకోవడంలో తప్పులేదు కానీ ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా వడ్డీ భారం పడకుండా చూడాలి. అందుకు భిన్నంగా ఏడాదిలోనే చేబదుళ్లకు ఏకంగా రూ.303 కోట్లు వడ్డీ చెల్లించడం అంటే బాబు ప్రభుత్వ ఆర్థిక అరాచకానికి నిదర్శనం.స్ఫెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్42,004 (24%)189వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్73,897 (43%)82మొత్తం1,72,532303ఓవర్ డ్రాఫ్ట్56,631 (33%)32 -
అప్పులతో అభివృద్ధి శూన్యం
సాక్షి, అమరావతి : చంద్రబాబు ఏడాది పాలనలో ప్రస్తుత అభివృద్ధి దేవుడెరుగు, భవిష్యత్ అభివృద్ధిని కూడా శూన్యం చేశారని, ఆర్థిక క్రమ శిక్షణ, ఆర్థిక స్థిరత్వం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. భవిష్యత్ అభివృద్ధికి చోటు లేకుండా ఏడాదిలోనే భారీగా అప్పులు చేశారని తూర్పారపట్టింది. 2024–25 ఆర్థిక ఏడాది ఆర్థిక, ద్రవ్య వినియోగ అకౌంట్స్పై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది. అప్పులు తప్ప అభివృద్ధి లేదని, చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వినియోగించలేదని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. అప్పు చేయకుండా రోజు గడవడం లేదని, రోజువారీ ఖర్చులకు అప్పులు చేశారని, దీంతో వడ్డీ భారం గణనీయంగా పెరిగిందని ఎండగట్టింది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను తొలి ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు తుంగలో తొక్కిందని, నిబంధనలకు మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెరిగి పోయిందని ఎత్తి చూపింది. భారీగా అప్పు చేసినప్పటికీ మూల ధన వ్యయం తగ్గిపోయిందని, ఇది రుణ స్థిరత్వాన్ని మరింత దిగజార్చడంతో పాటు భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక అవకాశాన్ని తీవ్రంగా పరిమితం చేసిందని కాగ్ పేర్కొంది. అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో మూల ధన వ్యయం 12 శాతం తగ్గిందని, ఇది దీర్ఘకాలిక ఆస్తుల సృష్టిపై తగ్గిన ప్రాధాన్యతను సూచిస్తోందని వెల్లడించింది. రోజువారీ అవసరాలకూ అప్పులే ఆధారం» మూల ధన వ్యయం నుంచి రెవెన్యూ వ్యయం వైపు నిరంతరం మార్పు ఉందని, ఆఖరుకు రోజువారీ అవసరాలకు కూడా అప్పులపై ఆధార పడటం పెరిగిందని, ఇది ఆర్థిక క్రమ శిక్షణ, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని కాగ్ వ్యాఖ్యానించింది. » 2024–25లో చేసిన అప్పులు అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 16.68 శాతం పెరిగినట్లు కాగ్ పేర్కొంది. ఇది అప్పులపై ఆధారపడటం పెరగడాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే అప్పుల శాతం పెరిగినప్పటికీ, మూల ధన వ్యయం అంతకు ముందు ఏడాదితో పోల్చితే 12 శాతం తగ్గిపోయిందని, ఇది దీర్ఘకాలిక ఆస్తుల సృష్టిపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పింది. » 2024–25లో ప్రభుత్వ రెవెన్యూ లోటు ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు జీఎస్డీపీలతో 2.7 శాతం ఉండాల్సి ఉండగా, 3.75 శాతానికి పెరిగిందని, అలాగే ప్రభుత్వ ద్రవ్య లోటు ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు జీఎస్డీపీలో 4 శాతం ఉండాల్సి ఉండగా.. 5.05 శాతానికి పెరిగిందని పేర్కొంది. » 2024–25లో మొత్తం అప్పు రూ.81,071 కోట్లు చేసినట్లు కాగ్ తెలిపింది. దీంతో వడ్డీ భారం గణనీయంగా పెరిగిందని స్పష్టం చేసింది. 2024–25 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు రూ.5.67లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. » రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడం ద్వారా మార్కెట్, ఆర్థిక సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, సహకార సంఘాల ద్వారా నేరుగా అప్పులు చేస్తోందని కాగ్ పేర్కొంది. ఆ సంస్థలు రుణాలు చెల్లించడంలో విఫలమైన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెప్పింది. ఈ అప్పులు రాష్ట్ర బడ్జెట్ వెలుపల అప్పులుగా అంచనా వేసినట్లు తెలిపింది.» ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదిత ఆఫ్–బడ్జెట్ అప్పులు మొత్తంతో పాటు వాటిని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించలేదని కాగ్ ఎత్తి చూపింది. అయితే 2024–25లో ఎటువంటి ఆఫ్–బడ్జెట్ బాధ్యతలను పొందలేదని, కేవలం 2025 మార్చి 31 నాటికి రూ.27,241 కోట్లు బకాయి ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియజేసిందని పేర్కొంది.» 2024–25లో వోచర్ల పరిశీలన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించి, ఆఫ్ బడ్జెట్ రుణాల కారణంగా సహాయం, గ్రాంట్ల కోసం రూ.7,240.57 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసిందని, అయితే దీన్ని నిర్ధారించాలని తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది.నిబంధనలు తప్పుగా వర్గీకరింపురాష్ట్ర ఆర్థిక అంశాలపై చట్టబద్ధమైన నిబంధనలను తప్పుగా వర్గీకరించడం, పాటించకపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందని కాగ్ పేర్కొంది. రెవెన్యూ వ్యయం రూ.3,375.60 కోట్లు తక్కువగా, మూలధన వ్యయం రూ.2,648.92 కోట్లు అధికంగా, నగదు నిల్వ రూ.95.70 కోట్లు తక్కువగా అంచనా వేసినట్లు స్పష్టం చేసింది. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా నిబంధనలను, షరతులను పాటించకుండా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,005.31 కోట్ల రుణాలను హడ్కోకు, రాష్ట్ర ఆర్థిక సర్వీసు కార్పొరేషన్కు పంపిణీ చేసినట్లు కాగ్ తప్పు పట్టింది. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఆమె ప్రమాణ స్వీకారంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరుతుంది. జస్టిస్ లీసా గిల్ ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆమెను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో జస్టిస్ లీసా నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆమె వచ్చే వారం న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. జస్టిస్ లీసా గిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల నిర్ణయం తీసుకుంది. మొదట జస్టిస్ లీసా గిల్ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేసి, ఆ తరువాత హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేసిన వెంటనే ఆమెను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు.అపార అనుభవంజస్టిస్ లీసా గిల్ 1966 నవంబర్ 15న జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్ల తరఫున వాదించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తొలుత న్యాయమూర్తిగా ఎందుకంటే..?ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించిన న్యాయమూర్తిని సదరు హైకోర్టులో సీజే పోస్టు ఖాళీ అవడానికి కనీసం రెండు నెలల ముందే న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొత్త విధాన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జస్టిస్ లీసా గిల్ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేసింది. జస్టిస్ లీసా గిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైతే ఆమె ఆం«ధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. కాగా, 2028లో పదవీ విరమణ చేసే జస్టిస్ లీసా వచ్చే ఏడాది చివరి కల్లా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. -
శాసనమండలిలో బొత్సకు స్వల్ప అస్వస్థత
విజయవాడ: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసన మండలిలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్యుల్ని శాసనమండలికి పిలిపించిన అధికారులు.. పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్ల బొత్స స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణ హైబీపీ కారణంగా ఇబ్బందిపడినట్లు వైద్యులు తెలిపారు. ఒకవేళ బీపీ కంట్రోల్లోకి రాకపోతే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. దీనిలో భాగంగా బొత్సతో సిటీన్యూరో ఆస్పత్రి వైద్యులు ఫోన్లో మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో బొత్సకు డా. చంద్రశేఖర్రెడ్డి జాగ్రత్తలు చెప్పారు. అనారోగ్యం కారణంగా మండలి నుంచి ఇంటికి వెళ్లిపోయారు బొత్స. -
మంత్రి పయ్యావుల కేశవ్కు బొత్స స్ట్రాంగ్ రిప్లై
06-03-20265.25PMఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా4:19 PMమంత్రి పయ్యావుల కేశవ్కు బొత్స స్ట్రాంగ్ రిప్లై ఆదాయంలో ఏపీకి 22వ స్థానం ఎలా వచ్చిందో చూపించిన బొత్సకాగ్ నివేదిక లింక్ ను పయ్యావులకు సభలో పంపిన బొత్సమీకు డౌన్ లోడ్ చేయడం చేతకాకపోతే చేసి పంపిస్తానన్న బొత్సగత ఐదేళ్లలో పంటల కొనుగోళ్ల వివరాలను ఇచ్చిన బొత్సవైఎస్ జగన్ హయాంలో రూ. 7800 కోట్లతో పంటల కొనుగోలు చేశాంపంటల వారీగా కొనుగోలు చేసిన వివరాలు ఇస్తున్నా చూస్కోండిబొత్స డాక్యుమెంట్లు ఇవ్వడంతో ఖంగుతిన్న మంత్రి పయ్యావుల కేశవ్రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.. వారిని ఆదుకొండిప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంతా అంకెల గారడీ ఏపీ శాసనమండలి నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్👉అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్👉అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమంపై వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్న👉సభను తప్పుదోవ పట్టించకండి: విపక్షనేత బొత్స సత్యనారాయణఆనాటి ప్రభుత్వం చాలా హామీలు నెరవేర్చిందిచాలా హామీలకు సంబంధించి అధికారులను పిలిపించి సమాచారం తీసుకోండిలేనిపోని కల్లబొల్లి కబుర్లు చెప్పకండిసమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్న వారిని అవమానించకండిమంత్రి సమస్యల పరిష్కారం కోసం ఏ అగ్రిమెంట్ ఏమీ చేసుకోలేదంటున్నారు.ముందు అంతకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి.అంగన్వాడిల పట్ల సానుభూతితో ఈ ప్రశ్నకు సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం👉గీతం యూనివర్సిటీ రూ.5 వేల కోట్ల భూ దోపిడీపై సభలో చర్చించాలని కోరుతూ శాసనమండలి వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, పండుల రవీంద్రబాబు, పాలవలస విక్రాంత్లు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు.👉దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గీతం యూనివర్సిటీపై చర్చించాల్సిందేనని సభలో వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనకు దిగడంతో సభకు ఐదు నిమిషాల పాటు ఛైర్మన్ విరామం ప్రకటించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు.👉తల్లికి వందనం పథకంపై చంద్రబాబు సర్కార్ను వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. తల్లికి వందనం పథకం తల్లికి వంచనగా మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రతీ ఇంటి వెళ్లి నీకు 15 వేలు, నీకు 15 వేలు అని ప్రచారం చేశారంటూ దుయ్యబట్టారు.ఇది పెద్ద భూ కుంభకోణం: కుంభ రవిబాబు మండలి మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ.. గీతంకి ప్రభుత్వ భూములు ఇవ్వడంపై వాయిదా తీర్మానం ఇచ్చామని.. ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. రూ. 5 వేల కోట్ల భూములు గీతంకి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని.. ఇది పెద్ద భూ కుంభకోణమని ఆయన అన్నారు.‘‘గీతంకి భూములు ఇవ్వడంపై విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఇవ్వాలని తీర్మానం చేసినప్పుడు వ్యతిరేకత వచ్చింది. గీతం ఒక వ్యాపార సంస్థ. విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థకి 5000 కోట్లు భూములు ఇవ్వడంపై వైఎస్సార్సీపీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన గీతంకి ఉచితంగా భూములు ఇవ్వడం పరిపాటిగా మారింది. గతంలో ఎకరం 15 లక్షలకు ఇచ్చారు...రుషికొండలో ప్రభుత్వ భవనాలను వైఎస్ జగన్ కడితే కూటమి గగ్గోలు పెట్టింది. ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు.51 ఎకరాల 71 సెంట్లు కట్టబట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. అనేక కంపెనీలకి 99 పైసలకే భూములు ఇస్తుంది. భూములు అప్పనంగా కట్టబెట్టడాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. విలువైన భూములను కారు చౌకగా గీతంతో పాటు ఎన్నో సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం పూనుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అని రవిబాబు తేల్చి చెప్పారు.గీతం కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకోవాలి: వరుదు కళ్యాణిగీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. రెగ్యులరైజేషన్ ఆపాలి. 99 పైసలకు తన బినామీలు అనుచరులకు చంద్రబాబు భూములు కట్టబడుతున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన భూములు తన కుటుంబ సభ్యులకు కట్టబడుతున్నారు. విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటూ దోపిడీ క్యాపిటల్లా మార్చారు. బీసీ మహిళా మేయర్ని అడ్డగోలుగా పదవి నుంచి దించారు.కబ్జా భూమిని రెగ్యులరైజ్ చేయడం కోసమే మేయర్ ని తప్పించారు. కబ్జా చేసిన భూములపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలి.. కానీ రెగ్యులరేజ్ చేస్తున్నారు. చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుంటే ప్రోక్లైన్లతో తొలగించారు. పేదలు చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించారు. కుటుంబ సభ్యులకు మాత్రం 5 వేల కోట్లు కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఆధీనంలో ఉన్న భూములు ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదంటూ కోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు అంటే కూటమి పెద్దలకు చంద్రబాబుకి భయం లేదు. గీతం కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆగదు. -
ఔను.. రాధికకు రాయితీలిచ్చాం
సాక్షి, అమరావతి: ఔను.. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 44 శాతం మేర రాయితీలిచ్చిన మాట వాస్తవమేనని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో డాక్టర్ గెడ్డం శేఖర్బాబు స్పష్టం చేశారు. ‘రాధికకు ఇన్ని రాయితీలా?’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై గురువారం ప్రభుత్వం తరఫున ఆయన వివరణ ఇచ్చారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం రూ.200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే వాటిని మెగా పరిశ్రమలుగా పరిగణిస్తున్నామన్నారు. రూ.200 కోట్లకు పైగా ఉన్న మెగా ప్రాజెక్టులకు ఈ పాలసీ ప్రకారం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చే వెసులుబాటు ఉందన్నారు. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ లిమిటెడ్ ప్రాజెక్టు మూలధన పెట్టుబడి రూ.218 కోట్లకు పైగా ఉన్నందున పాలసీ ప్రకారం స్థిర మూలధన పెట్టుబడిలో 75 శాతం వరకు ప్రోత్సాహకాలు మంజూరు చేయవచ్చన్నారు. ఈ మేరకు రాయితీలిచ్చామని చెప్పారు. 'రాధిక'కు ఇన్ని రాయితీలా!? -
పోలవరంలో బాబు అవే తప్పులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో ప్రధాన(ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం పనులను నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధాన డ్యాం గ్యాప్–2లో చేస్తున్న పనుల్లో సాంకేతిక లోపాలపై సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) అభ్యంతరాలు వ్యక్తం చేయడం దీనికి నిదర్శనమన్నారు. తక్షణమే సాంకేతిక లోపాలను సరిదిద్ది సీడబ్ల్యూసీ డిజైన్లు, మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టు పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబుకు ఉండవల్లి గురువారం లేఖ రాశారు.ఈ లేఖను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి కందుల దుర్గేష్ లకు కూడా పంపారు. గతంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి, గోదావరి ప్రవాహాన్ని మళ్లించాల్సి ఉండగా, ఆ పనులు చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మించడంతో వరద ఉద్ధృతికి అది కోతకు గురై దెబ్బతిందని, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం కోతకు గుౖరె విధ్వంసం చోటుచేసుకుందని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.దానివల్లే ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడానికి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు రూ.3 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఆ మేరకు ప్రజాధనం వృథా అయిందంటూ ఎత్తిచూపారు. ఆ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిందిపోయి చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అవే తప్పులను చేస్తోందంటూ దుయ్యబట్టారు. సాంకేతిక లోపాలను సరిదిద్దకుండా ప్రాజెక్టును పూరి్తచేస్తే భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వాటిల్లితే దిగువ ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ఉండవల్లి లేఖలో ప్రధానాంశాలు ఇవీ..⇒ పోలవరం ప్రాజెక్టు పనులను జనవరి 19, 20, 21 తేదీల్లో నిపుణుల కమిటీ, పలు సాంకేతిక సంస్థలు, ఆఫ్రి వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రతినిధులతో సీడబ్ల్యూసీ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు పనులపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ సమావేశం మినిట్స్ను జనవరి 30న లేఖ రూపంలో సీడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ⇒ ప్రధాన డ్యాం గ్యాప్–2లో గోదావరి నదీ గర్భం సముద్రమట్టానికి 8.32 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి ప్రధాన డ్యాం నిర్మించాలి. కానీ.. 15.50 మీటర్ల నుంచి ప్రధాన డ్యాంను నిరి్మస్తున్నారు. దీని వల్ల డ్యాం కింద ఇసుక పొరలు కోతకు గురై డ్యాం కోతకు గురై ప్రమాదం ఉంది. ⇒ టెయిల్ వాటర్ లెవల్ను ఎలాంటి బలమైన సాంకేతిక కారణం లేకుండా 25 మీటర్ల నుంచి 16 మీటర్లు, 13.5 మీటర్లకు తగ్గించడం వల్ల నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్ని ప్రధాన డ్యాం దెబ్బతినే ప్రమాదం ఉందని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసింది. ⇒ ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ, వేవ్ రన్ అప్(అలల తాకిడి ప్రభావం) తదితర డిజైన్లు డిజైనర్ ఆఫ్రి నుంచి ఇంకా అందలేదని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. డ్యాం భూకంపాలకు తట్టుకోగలదా అనే అంశంపై ఆఫ్రి ఇచి్చన నివేదికలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని సీడబ్ల్యూసీ ఎత్తిచూపింది. ⇒ డిజైన్లు ఆమోదం పొందకుండా పనులు పూర్తి చేయడం.. ఆ తర్వాత వాటికి ఆమోదం పొందడం(పోస్ట్ ఫ్యాక్టో ఆప్రూవల్స్) అత్యంత ప్రమాదకరమని సీడబ్ల్యూసీ హెచ్చరించింది. ఒక సారి డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత దానిలో లోపాలు కన్పిస్తే వాటిని మార్చడం సాంకేతికంగా అసాధ్యమని.. దీని వల్ల భారీగా నష్టం వాటిల్లుతుందని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. -
‘స్కిల్’ కేసు క్లోజర్ కాపీ ఇప్పించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి సీఎం చంద్రబాబుపై గతంలో నమోదు చేసిన కేసును మూసివేసే నిమిత్తం సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను సవాల్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పటి చైర్మన్ అజయ్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను ఫిర్యాదుదారు అయితే సీఐడీ తనకు నోటీసు ఇవ్వకుండా క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనను థర్డ్పార్టీగా పేర్కొంటూ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. అజయ్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అజయ్రెడ్డి ఫిర్యాదుదారు అని తెలిపారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఫిర్యాదుదారు కాలమ్లో అజయ్రెడ్డి పేరే ఉందన్నారు. స్కిల్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలు చేసిన పలు వ్యాజ్యాల్లోనూ అజయ్రెడ్డిని డీఫ్యాక్టో ఫిర్యాదుదారుగా పేర్కొంటూ ప్రతివాదుల జాబితాలో కూడా చేర్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్పై తనకు ముందస్తు నోటీసు ఇవ్వాలని, ఆ రిపోర్ట్ను వ్యతిరేకించే అవకాశం కల్పించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో అజయ్రెడ్డి ఓ పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. అయితే అజయ్రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదంటూ, ఈ కేసులో అతన్ని థర్డ్ పార్టీగా పరిగణిస్తూ ఆ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసిందన్నారు. కేసును పూర్తిగా మూసివేస్తూ కోర్టు తుది నిర్ణయం తీసుకునేలోపు, సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ ‘ప్రొటెస్ట్ పిటిషన్’ దాఖలు చేసే అవకాశం పిటిషనర్కు ఇవ్వాలని కోరారు. సీఐడీ సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, మాధవ్ ఖురానా స్పందిస్తూ.. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. స్కిల్ కేసులో అజయ్రెడ్డి పిటిషనరే కాదన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు. ఐఆర్ఆర్ కేసును ‘ప్రత్యేక’ కోర్టుకు బదిలీ చేయండిహైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాథమిక చార్జిషీట్, క్లోజర్ రిపోర్ట్ కాపీలు ఇప్పించాలంటూ మరో పిటిషన్సాక్షి, అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్, మాస్టర్ ప్లాన్ అక్రమాలకు సంబంధించి తానిచి్చన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన కేసును విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కుంభకోణం కేసులో సీఐడీ 2024లోనే చార్జిషీట్ దాఖలు చేసిందని, ఈ కేసును ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయకుండా సాధారణ ఏసీబీ కోర్టులో విచారించడం చట్టవిరుద్ధమని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి, ఓ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారని తెలిపారు. నిందితుల హోదాను బట్టి కేసు విచారణ కేవలం ప్రత్యేక కోర్టులోనే జరగాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రస్తుతం ఈ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు విచారిస్తోందని తెలిపారు. తదుపరి చర్యలన్నీ నిలిపేయండి అశి్వనికుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన చరిత్రాత్మక తీర్పు ప్రకారం ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను విచారించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018లో విజయవాడలో ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందన్నారు. నిందితుల హోదాను బట్టి కేసు విచారణ కేవలం ఈ ప్రత్యేక కోర్టులోనే జరగాలని, సాధారణ ఏసీబీ కోర్టులో కాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణానికి సంబంధించిన కేసుపై ఏసీబీ స్పెషల్ కోర్టులో జరుగుతున్న విచారణలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. ‘క్లోజర్’ కాపీలు ఇప్పించండి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణం కేసులో 2024లో దాఖలు చేసిన ప్రాథమిక చార్జిషీట్, తాజాగా దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ కాపీలను తనకు అందచేసేలా సీఐడీని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు 2014–19 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంపై 2022లో తాను సీఐడీకి ఫిర్యాదు చేశానని రామకృష్ణారెడ్డి తెలిపారు. దర్యాప్తు జరిపిన సీఐడీ కుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించిందని తెలిపారు. 2024లో చార్జిషీట్ కూడా దాఖలు చేయగా.. కోర్టు దానిని సాంకేతిక కారణాలతో వెనక్కి పంపిందన్నారు. ప్రభుత్వం మారడంతో ఐఆర్ఆర్ కుంభకోణం కేసును మూసివేసేందుకు సీఐడీ సిద్ధమై విజయవాడ ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో గత నెల 18న సీఐడీ అధికారులు తనకు ఓ నోటీసు పంపి కేసును మూసివేస్తున్నట్లు తెలిపారన్నారు. 2024 నాటి తొలి చార్జిషీట్ కాపీని గానీ, ఇప్పుడు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ కాపీని కానీ తనకు అందించడం లేదని వివరించారు. దీంతో సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ కోర్టులో ‘ప్రొటెస్ట్ పిటిషన్’ దాఖలు చేయడం సాధ్యం కావడం లేదన్నారు. చార్జిషీట్ను, క్లోజర్ రిపోర్ట్ను ఫిర్యాదుదారునికి అందించడం దర్యాప్తు అధికారి బాధ్యత అని పిటిషన్లో పేర్కొన్నారు. -
ఉద్యోగాల్లేవ్.. భృతీ లేదు
సాక్షి, అమరావతి: అధికారం కోసం కూటమి ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన హామీలపై శాసనమండలి అట్టుడికింది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి, సభలో ఒకలెక్క, మండలిలో మరో లెక్క చెబుతున్నారని, అబద్ధాలు చెబుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం శాసనమండలిలో ఈ అంశంపై వాడీవేడీగా చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ సభ్యులు రాజగొల్ల రమేష్యాదవ్, డాక్టర్ మొండితోక అరుణ్కుమార్, డాక్టర్ పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజు నిరుద్యోగ సమస్యపై మంత్రిని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందా?, ఉంటే నివారణకు తీసుకున్న చర్యలు, నిరుద్యోగ యువతకు అందిస్తున్న ఆర్థిక సాయం వివరాలు వెల్లడించాలని ప్రశ్నించారు. దీనికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సమాధానమిస్తూ నిరుద్యోగ భృతి చెల్లించడం లేదని, దానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వంలో 5,72,280 ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు వాస్తవాలు చెప్పాలని నిలదీశారు. నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారునిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని ప్రభుత్వం వచ్చాక మోసం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రాజగొల్ల రమేష్ యాదవ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తప్పుడు సమాచారం ఇస్తూ నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత 20 నెలల కాలంలో రాష్ట్రంలో ఎంత శాతం నిరుద్యోగం ఉంది, ప్రభుత్వం ఏమైనా నివారణ చర్యలు తీసుకున్నారా? అని అడిగితే, పొంతన లేని సమాధానాలు చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి 15 వేల ఉద్యోగాలు డీఎస్సీ ద్వారా ఇచ్చి భారీ బహిరంగ సభలు పెట్టిన వారు 5,72,280 ఉద్యోగాలు ఇస్తే అసలు ఆగుతారా అంటూ ప్రశ్నించారు. ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడిచ్చారో ప్రజలకు తెలియాలని పట్టబట్టారు. ‘‘గడిచిన 20 నెలల్లో రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులున్నారో లెక్క ఏమైనా ఉందా? దీనిపై ఏమెనా కమిటీ వేశారా? శాసనసభ సాక్షిగా సీఎం 6,28,320 ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు, ఇప్పుడు మంత్రి 5,72,280 ఉద్యోగాలు అంటున్నారు. ఇద్దరిలో ఎవరు అబద్ధం చెబుతున్నారు? డిసెంబర్లో రాజ్యసభకు ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగం 5.2 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్లో 8.2 శాతం ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం సమాధానం చెబుతుంది? ఎన్నికల్లో మొదటి హామీగా 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ప్రకటించారు. ఇప్పటి దాకా జాబ్ కేలండర్ ఇచ్చిన పాపాన పోలేదు. దీనిపై మంత్రి సమాధానం చెప్పాలి’’ అంటూ నిలదీశారు. దేశంలో అత్యధిక నిరుద్యోగం ఏపీలోనేఎకనమిక్స్ సర్వే 2025–26 నివేదిక ప్రకారం ఏపీలో నిరుద్యోగం 8.2 శాతం ఉందని, ఇది దేశంలోనే అత్యధికమని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్సు సర్వేలో కూడా 8.2 శాతం నిరుద్యోగంతో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నిరుద్యోగ శాతం 8.2 శాతంతో దేశంలోనే ఏపీ టాప్లో ఉన్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. దీన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని అడిగితే పొంతనలేని సమాధానం చెబుతున్నారన్నారు. ‘కేంద్రం చెబుతున్న గణాంకాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవిస్తే నిరుద్యోగ నివారణకు తీసుకున్న చర్యలేంటి? ఉద్యోగాల కల్పనలో అసెంబ్లీలో సీఎం ఒక నంబర్, మండలిలో మంత్రి చెబుతున్న నంబర్లలో ఏది కరెక్టు? మీరు చెబుతున్న 5,72,280 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో జిల్లాల వారీగా, వారికి చెల్లిస్తున్న వేతనాలతో సమగ్రంగా రాతపూర్వకంగా ఇవ్వాలి’ అని పట్టుబట్టారు. జగన్ 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చారు, మీరేమిచ్చారు?నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించేందుకు ఎలాంటి పథకం అమలు చేయడం లేదని సభలో మంత్రి చెప్పడం సరికాదని ఎమ్మెల్సీ పెనుమత్స వరాహæ వెంకట సూర్యనారాయణరాజు అన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి, జాబ్ కేలండర్ ఇస్తామని యువతకు హామీ ఇచ్చారని, ఇప్పుడు జాబ్లెస్ కేలండర్గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి దాకా జాబ్ కేలండర్నే అమలు చేయలేదు. వైఎస్ జగన్ 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. మీ ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఎంత మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చారు, వారిలో ఎంత మందికి ఉద్యోగాలు లభించాయో జిల్లాల వారీగా నివేదిక ఇవ్వాలి. యువతకు స్వయం ఉపాధికోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాల’ని డిమాండ్ చేశారు.ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అని చెప్పాం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అనంతరం మంత్రి రాంప్రసాద్ సమాధానమిస్తూ తాము ఎన్నికల్లో ఇచ్చిన సూపర్–6 హామీల్లో చెప్పింది సరిగా అర్ధం చేసుకోలేదన్నారు. తాము ‘‘20 లక్షల ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగ భృతి’’ ఇస్తామన్నామన్నారు. రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తున్నామని, అవి వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు.ఆ లెక్కలు అప్పటివి.. ఈ లెక్కలు ఇప్పటివి: మంత్రి అచ్చెన్న నిరుద్యోగంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ సభలో సీఎం, మండలిలో మంత్రి తప్పుడు లెక్కలు చెబున్నారని, వీరిద్దరిలో ఎవరు చెప్పింది నిజమో చెప్పాలని నిలదీశారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకున్నారు. ‘‘నిన్న సభలో సీఎం చెప్పిన ఫిగరు 6,28,320 ఉద్యోగాల కల్పన పాతది. మండలిలో మంత్రి చెప్పిన 5,72,280 ఉద్యోగాలు ఇప్పటివి.. ఇది తెలుసుకోవాలి’’ అనగానే వైఎస్సార్సీపీ సభ్యులతో పాటు సభలోని చాలామంది సభ్యులు నవ్వుకున్నారు. ఒక్కరోజులోనే లక్ష ఉద్యోగాలు ఎలా తగ్గిపోతాయని ప్రశ్నించారు.టీటీడీ చైర్మన్ను తొలగించాలిమండలిలో వైఎస్సార్సీపీ డిమాండ్ సాక్షి, అమరావతి: కళంకిత ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్ను ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ గురువారం మండలిలో డిమాండ్ చేసింది. గురువారం ఈ అంశంపై అత్యవసర చర్చ కోరుతూ ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వరుదు కళ్యాణి, భరత్ మండలి చైర్మన్ మోషేన్రాజుకు వాయిదా తీర్మానం అందజేశారు. కాగా, సభ ప్రారంభం కాగానే చైర్మన్ మోషేన్రాజు వైఎస్సార్సీపీ సభ్యులు ఇచ్చిన ఆ వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్టు ప్రకటించి, ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ‘టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి’ అని నినాదాలు చేస్తూ పోడియం వద్ద నిలబడి ఆందోళన కొనసాగించారు. చైర్మన్ మోషేన్ రాజు వారించినప్పటికీ శాంతించని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు కొందరు పోడియం పైకి వెళ్లి నినాదాలు కొనసాగించారు. దీంతో, సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ ప్రకటించారు. వాయిదా అనంతరం దాదాపు అరగంట తర్వాత సభ ప్రారంభం కాగా, ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది. -
విచారణకు హాజరైన సునీల్ నాయక్
నగరంపాలెం: శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బిహార్ ఐజీ సునీల్ నాయక్ విచారణ నిమిత్తం గురువారం గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఉదయం పది గంటలకు హాజరైన ఐజీ సునీల్ నాయక్ సాయంత్రం ఐదు గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణ అధికారిగా వ్యవహరించారు. మరో నాలుగు రోజులు ఆయన్ను విచారించనున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో ఆ రోజు ఎంత మంది ఉన్నారని అడిగినట్లు తెలిసింది. -
సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడంపై ‘సాక్షి’ ప్రచురించిన వార్తాకథనం సభాహక్కుల ఉల్లంఘన కిందకు రాదని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం గురువారం హైకోర్టుకు నివేదించారు. సభ లోపల జరిగిన వ్యవహారాలపై రాసిన కథనాలకే సభాహక్కుల ఉల్లంఘన వర్తిస్తుందని చెప్పారు. సభ వ్యవహారాలతో సంబంధంలేని అంశాలపై వార్తా కథనం ప్రచురించడం తప్పు కాదన్నారు. సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని చెప్పారు. ప్రాథమిక ఆధారాలు లేకుండానే సభా హక్కుల ఉల్లంఘనపై ముందే ఓ నిర్ణయానికి వచ్చి, అందుకనుగుణంగా శాసనసభ సెక్రటరీ జనరల్ నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఆ కథనం కేవలం పరిపాలనపరమైన అంశానికి సంబంధించింది మాత్రమేనన్నారు. అసలు ఆ కథనం సభా హక్కుల పరిధిలోకి వస్తుందా.. రాదా.. అన్న విషయాన్ని ముందు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాస్తవానికి ఏది సభాహక్కుల పరిధిలోకి వస్తుంది, ఏది రాదు అన్న విషయంపై ఎక్కడా నిర్దిష్టమైన నిర్వచనం లేదని తెలిపారు. తమ కథనం సభాహక్కుల పరిధిలోకి వస్తుందా.. రాదా.. అన్నదానిపై ఓ వైపు న్యాయస్థానం విచారణ జరుపుతుండగానే, ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించిన ఆధారాలతో తమ ముందు హాజరుకావాలంటూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తాజాగా మరో నోటీసు ఇచ్చారని చెప్పారు. ఆ నోటీసుకు తాము సమాధానం కూడా ఇచ్చామని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో ముందుకెళ్లకుండా ప్రివిలేజ్ కమిటీని, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ సమయంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు అవసరం లేదని, తదుపరి విచారణ వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వబోమని చెప్పారు. ఏజీ చెప్పిన ఈ వివరాలను నమోదు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సభా హక్కుల కమిటీకి నివేదించిన స్పీకర్ సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దాన్ని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య గత ఏడాది ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్ను కోరుతూ నోటీసు ఇచ్చారు. దీంతో స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభాహక్కుల కమిటీకి నివేదించారు. ఈ కమిటీ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ‘సాక్షి’కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యే నోటీసుతోపాటు సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్ గత ఏడాది జూన్లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ఇచ్చింది షోకాజ్ నోటీసు మాత్రమేనని, దీని తరువాత చాలా ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవంటూ వాటిని కొట్టేశారు. ధర్మాసనం ముందు అప్పీళ్లు ఈ తీర్పును సవాలు చేస్తూ ధనంజయరెడ్డి, ఫణికుమార్ వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై గురువారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరాం, వేలూరు మహేశ్వర్రెడ్డి, అనూప్ కౌషిక్ వాదనలు వినిపించారు. శాసనసభ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నప్పుడు, వాటిని అడ్డుకున్నప్పుడే సభాహక్కుల ఉల్లంఘన అవుతుందని శ్రీరాం వివరించారు. సాక్షి కథనం ఎక్కడా సభ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం లేదన్నారు. శిక్షణ తరగతులు నిర్వహించకపోవడం వల్ల ప్రజాధనం వృథా అయిందన్న విషయాన్ని మాత్రమే ఎత్తి చూపిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉదహరించారు. రూ.కోట్ల ప్రజాధనం వృథాపై సాక్షి కథనం ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల నిర్వహణ విషయంలో సరైన ప్రణాళిక, అవగాహన లేకపోవడంతో కోట్ల రూపాయల మేర ప్రజాధనం వృథా అయింది. ఎమ్మెల్యేలకు రెండు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించాలని శాసనసభ వర్గాలు గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలకు, అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే లోక్సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి రాకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయింది. దీనిపై సాక్షి గత ఏడాది ఫిబ్రవరి 22న ‘కోట్లు ఖర్చు.. శిక్షణ తుస్సు’ శీర్షికన వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్తా కథనంతో కంగుతిన్న అధికార పార్టీ నేతలు సాక్షిపై కక్షసాధింపు చర్యలు చేపట్టారు. -
చర్చలేకుండా డైవర్షన్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై అధికారపక్షం అసలు చర్చే జరగనివ్వలేదు. శాసనమండలిలో గురువారం కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు పదేపదే అడ్డుతగులుతూ చర్చను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తన కుటుంబ సంస్థ హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం కల్తీ నెయ్యి పేరుతో అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, దానిపై చర్చిద్దామంటే సభ నుంచి ఆ పార్టీ సభ్యులు పారిపోతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. అశ్లీల వీడియోల్లో ఉన్నది తానేనని బీఆర్ నాయుడు అంగీకరించిన తర్వాత కూడా ఆయన్ను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి చంద్రబాబు ఎందుకు భయపడిపోతున్నారని ప్రశ్నించారు. హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి కాంట్రాక్టు కోసమే కల్తీ నాటకాన్ని తెరపైకి తెచ్చారని బయటపడడంతో అధికారపక్షం ఇరుకున పడిపోయింది. గురువారం తిరుమల లడ్డూపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతుండగా అడ్డుపడి అచ్చెన్నాయుడు లేచి సమస్యను పక్కదారిపట్టించేందుకు ప్రయత్నించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ పోడియంలోకి దూసుకు వచ్చారు. ఈ నిరసన కార్యక్రమం మధ్యనే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్టేట్మెంట్ను చదివేసి మమ అనిపించారు. వైఎస్సార్సీపీ సభ్యుల నిరసనతో సభను చైర్మన్ అయిదు నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే విధమైన పరిస్థితి కొనసాగడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.చర్చకు దూరంగా పలాయనం..కల్తీ ఆరోపణలపై చర్చిద్దామంటే అధికారపక్షం పూర్తిగా పలాయనం చిత్తగించింది. దానిపై చర్చ జరగనీయకుండా రకరకాల వాదనలతో సమస్యను డైవర్ట్ చేయడానికి ఆపసోపాలు పడుతోంది. హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి ఆరోపణలు చేశారని ఆధారాలతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మండలిలో నిరూపించారు. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్కి టీటీడీ నిధులు దోచిపెట్టడానికి చేసిన ప్రయత్నాలను వివరించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా చేయడానికి కాంట్రాక్టు దక్కించుకుందని వారు పేర్కొన్నారు. ఇందాపూర్ డెయిరీ.. హెరిటేజ్ అనుబంధ సంస్థేనని ఒకసారి, కాదు.. అక్కడ హెరిటేజ్ ఉత్పత్తులు మాత్రమే తయారవుతాయని మరోసారి.. హెరిటేజ్ వెబ్సైట్ను మార్చడమే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ సభ్యులు వివరించారు. హెరిటేజ్ ఆధ్వర్యంలో ఏఆర్, ఇందాపూర్, సంగం, ప్రీమియర్ ఆగ్రో, భోలేబాబా డెయిరీలతో ఏర్పడిన డెయిరీ సిండికేట్ గుట్టును బయటపెట్టడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వం చర్చలో పాల్గొనకపోవడమంటే హెరిటేజ్ అవినీతిని అంగీకరించినట్లేనని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు. కల్తీ జరగలేదని సీబీఐ సిట్ చార్జిషీట్లో పేర్కొనడాన్ని బట్టి రాజకీయ స్వార్థం కోసమే తిరుమల శ్రీవారిని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగారని ప్రజలు అర్ధంచేసుకున్నారని వారు వివరించారు. సమాధానం చెప్పలేకే డైవర్షన్..రాజకీయ లబ్ధి, హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం చంద్రబాబు ఘోరమైన కుట్రచేశారని తేలిపోయింది. దానిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతోంది. ఏఆర్ డెయిరీ పేరుతో వచ్చిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపితే దాన్ని వైష్ణవి డెయిరీ పేరుతో తిరిగి రప్పించి లడ్డూ తయారీకి ఎలా వాడారని అడిగితే దానికి దేవదాయ శాఖ మంత్రి నుంచి సమాధానం లేదు. టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టిన ఇందాపూర్ డెయిరీపై సస్పెన్షన్ ఎత్తివేసింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. భోలేబాబా డెయిరీకి టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చింది కూడా చంద్రబాబే. వీటిలో దేనికీ సమాధానం చెప్పలేక కూటమి సభ్యులు వేరే అంశాలను లేవనెత్తి సభను డైవర్ట్ చేశారు.టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలి..టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన బీఆర్ నాయుడు చైర్మన్ పదవికి అనర్హుడు. అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ‘ఆ వీడియోలో తప్పేముందని.. ఆమె కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఆ వీడియోలు, చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్కు బాధిత మహిళ రాసిన లేఖలపై పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం. పవన్ నిజంగా హిందువైతే బీఆర్ నాయుడిని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలి.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. -
‘ఆశ’యమే ఆగ్రహజ్వాలై
చంద్రబాబు సర్కారు నిరంకుశత్వంపై ఆశా కార్యకర్తలు గర్జించారు. ఆశయ సాధన కోసం రణన్నినాదం మోగించారు. ప్రభుత్వ విధానాలు, వెట్టిచాకిరీ, బానిసత్వంపై నిప్పులుగక్కారు. బెజవాడలో మండుటెండనూ లెక్కచేయక నిరసన గళమెత్తారు. పది డిమాండ్లతో బాబు కూటమికి అల్టిమేటం ఇచ్చారు. సర్కారు వెన్నులో వణుకుపుట్టించారు. సాక్షి, అమరావతి: ఆశా కార్యకర్తలు విజయవాడలో గురువారం చేపట్టిన ధర్నా జయప్రదమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వర్కర్లు చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవులు ఇవ్వకుండా, కనీసం మానవత్వం లేకుండా రేయింబవళ్లూ సర్వేల పేరుతో వేధించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా మభ్యపెడుతోందని మండిపడ్డారు. ఎన్నిసార్లు వినతులు సమర్పించినా సమస్యలను పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. అనేక రకాల విధులు అప్పగించి తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న చంద్రబాబు సర్కారు తమను బానిసలుగా చూస్తోందని దుమ్మెత్తిపోశారు. పనిభారం తీవ్రమై, చాలీచాలని జీతంతో నరకం అనుభవిస్తుంటే, ప్రభుత్వ వైఫల్యాలను తమపై నెట్టి సర్కా రు మానసిక క్షోభకు గురిచేస్తోందని ఆవేదన వెళ్లగక్కారు. అందుకే ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఆత్మగౌరవం గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు తమ ఆత్మగౌరవాన్ని పెంచిందని ఆశా కార్యకర్తలు చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే గౌరవ వేతనాన్ని రూ.పదివేలకు పెంచారని గుర్తుచేసుకున్నారు. కానీ, చంద్రబాబు ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి రాగానే నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలి.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనం పెంచాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.10 వేలు అసలు చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రవాణా ఖర్చులకు రూ.3 వేలు నుంచి రూ.4 వేలు ఖర్చుచేయాల్సి వస్తోందనిన్నారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలని, పనిభారం తగ్గించి వెట్టిచాకిరీ, బానిసత్వం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా కార్యకర్తలుగా మార్చాలని, ఖాళీలను భర్తీ చేయాలని, టీఏ, డీఏలు, ఏఎన్ఎం–జీఎన్ఎం శిక్షణ పొందిన వారికి పర్మినెంట్ పోస్టు, రూ.10 లక్షల బీమా, నాణ్యమైన మొబైల్స్, యూనిఫామ్ ఇవ్వడంతోపాటు విధినిర్వహణలో మృతి చెందిన వారికి దహన సంస్కార ఖర్చులుగా రూ.20వేలు ఇవ్వాలనే 10 రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఇదిలా ఉంటే ఆశా కార్యకర్తల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆశా కార్యకర్తలు ఆశాల పోరాటం వాయిదా ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హా మీ ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఆందోళ న, పోరాటాలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. చర్చల్లో రమణకుమారి, కమల, వాణిశ్రీ, సత్యవతి, పద్మ, లక్ష్మి పాల్గొన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి ఆశా కార్యకర్తలకు ఇచ్చే గౌరవ వేతనం పెంచాలి. అరకొర వేతనాలతో అవస్థలు పడుతున్నాం. ధరలు పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనం రూ.26వేలకు పెంచాలి. పనిభారం తగ్గించాలి. సెలవులు మంజూరు చేయాలి. వేధింపులు ఆపాలి. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలి. – ఎ.కమల, భవానీపురం, విజయవాడఉద్యోగ భద్రతేదీ? మా బతుకులకు ఉద్యోగ భద్రత లేదు. సెలవులు ఇవ్వడం లేదు. వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నాం. సెలవులు, మెడికల్ లీవులు ఇవ్వాలి. పనిభారం తగ్గించాలి. ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులు భర్తీ చేయాలి. కనీస వేతనాన్ని రూ.26వేలకు పెంచాలి. ఉద్యోగ భ««ద్రత కల్పించాలి. – బి.సరళ, చింతలపూడి ఎలా బతకాలి? కనీస వేతనాలు ఇవ్వకుండా మాతో అన్ని రకాల పనులు చేయిస్తున్నారు. ముఖ్యంగా యాప్ల పేరుతో సర్వేల భారం మోపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదు. ఆ నెపాన్నీ తమపైనే మోపి వేధింపులకు పాల్పడుతున్నారు. సిమ్లు సైతం పనిచేయకపోవటంతో సొంత డబ్బుతో రీచార్జి చేయించుకుని పని చేయాల్సి వస్తోంది. ఇచ్చే రూ.పదివేలలో రవాణా, ఇతర విధుల ఖర్చులకే నలభైశాతం ఖర్చుచేయాల్సి వస్తోంది. ఇక మిగిలి వాటితో ఎలా బతకాలి? – సీహెచ్ పద్మ, కాకినాడసెలవుల్లేవు.. లాస్ ఆఫ్ పేనే ఏఎన్ఎం శిక్షణ పూర్తిచేసుకున్న ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎం పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం సెలవు కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగా చాకిరీ పనిచేయిస్తున్న పభుత్వం కనీస వేతనం ఇవ్వటం లేదు. ఆన్లైన్ సర్వేలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు వెల్నెస్ సెంటర్లోనే కూర్చోమని చెప్పటం ఇబ్బందిగా ఉంది. సెలవులు లేకపోవటం వల్ల శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు లాస్ ఆఫ్ పే భరించాల్సి వస్తోంది. – ఎం.రాధ ధవళేశ్వరం -
‘అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి’
విజయవాడ: కులమతాలను రెచ్చగొట్టేలా సభలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్పీలు డిమాండ్ చేశారు. అన్ని మతాలను గౌరవించాలని రాజ్యాంగం చెబుతుంటే, అచ్చెన్నాయుడు మాత్రం కులమతలాను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మండిపడ్డారు. ఈరోజు(గురువారం, మార్చి 5వ తేదీ) శాసనమండలి సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. ‘ అచ్చెన్నాయుడితో మాట్లాడిస్తున్నది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. రేపు వ్యవసాయం పై జరగాల్సిన చర్చను డైవర్ట్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారు. అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. బీఆర్ నాయుడిని తొలగిస్తారా లేదా?’ అని ప్రశ్నించారు.మరో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘ సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. కులమత రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటు. మమ్మల్ని కాదు.. చంద్రబాబుని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించాలి. వెనక్కి పంపించిన ట్యాంకర్లు ఎందుకు వాడారో చంద్రబాబుని అడగాలి.ఇందాపూర్ కు ఎందుకు నెయ్యి టెండర్లు ఇచ్చారో చంద్రబాబుని అడగాలి. దేవుడి సొమ్మును ఎందుకు పక్కదారి పట్టించారని అడగాలి’ అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ తిరుపతి లడ్డూ పై అపవిత్రమైన మాటలు మాట్లాడింది చంద్రబాబు. లడ్డు పై మా ప్రశ్నలకు దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పలేకపోయారు. కల్తీ జరిగింది మీ హయాంలోనే. వెనక్కి పంపిన నెయ్యి ట్యాంకర్లు వాడింది మీ హయాంలోనే. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ కు దోచిపెట్టడానికే నెయ్యి ధరలు పెంచారు. దీని వెనుక పెద్ద ఆర్ధిక దోపిడీ కుట్ర ఉంది’ అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ లడ్డు పై చర్చను పూర్తిగా కొనసాగనివ్వలేదు. లడ్డు పై మా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ కల్తీ నెయ్యి తిరుమలకు వెళ్తోంది. తమ బండారం బయటపడుతుందని వాస్తవాలను రానివ్వడం లేదు. తిరుమల దర్శనం చేసిన తర్వాతే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా దేవదేవుడిని దర్శించుకున్నారు’ అని స్పష్టం చేశారు. -
‘అచ్చో’సిన మతవిద్వేషం
సాక్షి, అమరావతి: కుల మతాలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేస్తామంటూ ప్రమాణం చేసిన మంత్రులే బుధవారం శాసనమండలి సాక్షిగా వ్యక్తులకు మతాలను ఆపాదిస్తూ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ‘‘మీరు, మీ పార్టీ నాయకుడు క్రిస్టియన్లు కాబట్టే వెంకటేశ్వరస్వామి, హిందుసమాజంపై కక్ష కట్టి వ్యవహరిస్తున్నారు’’ అంటూ మంత్రి కె.అచ్చెన్నాయుడు నేరుగా మండలి చైర్మన్ మోషేన్ రాజు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తిరుమల లడ్డూపై చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేరుగా చైర్మన్ స్థానానికే మతాలను ఆపాదించడంతో సభ ఒక్కసారిగా భగ్గుమంది. మంత్రులమనే బాధ్యత మరిచి మరీ చట్ట సభలోనే ఎస్సీ వర్గానికి చెందిన హిందువైన మోషేన్ రాజు మతాన్ని మార్చే దుస్సాహసానికి టీడీపీ ఒడికట్టింది. తిరుపతి లడ్డూపై చర్చను పక్కదోవ పట్టించే పక్కా ప్రణాళికతో టీడీపీ మంత్రులు సభలో లేని వైఎస్ జగన్మోహన్రెడ్డి మత ప్రస్తావనను పదేపదే తీసుకొచ్చారు. వైఎస్ జగన్ను మతం ఆధారంగా నిందించడం, తిరుపతి లడ్డూకు కళంకం తేవడమే లక్ష్యంగా మంత్రులు ప్రవర్తించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు. తక్షణం ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించడంతో పాటు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను క్రిస్టియన్ అనడానికి మీరు ఎవరు? మీరు ఎలా చెప్పారం’టూ నిలదీయడంతో పాటు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరారు. అయినా అచ్చెన్నాయుడు ‘ఆ మాటలకు కట్టుబడి ఉన్నా... క్షమాపణ చెప్పేది లేదం’టూ భీష్మించి కూర్చున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తాను హిందువునని, తన మతాన్ని, కులాన్ని కించపర్చడం సరికాదని గట్టిగా చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో అధికారపక్షం కూడా ఇరుకునపడటంతో పలువురు మంత్రులు అచ్చెన్నాయుడు వద్దకు వచ్చి దీన్ని నుంచి ఎలా బయటడాలన్నదానిపై తీవ్ర తర్జనభర్జనలు చేశారు. అయినా అచ్చెన్నాయుడు తన అహాన్ని వీడకుండా ‘మీరు సభ సాక్షిగా హిందువునని చెప్పినందుకు ఎటువంటి భేషజాలకు పోకుండా ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా’ అని ప్రకటించారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందానని, ఇక చర్చను కొనసాగిద్దామని చైర్మన్ చెప్పారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు అచ్చెన్నాయుడు సభకు క్షమాపణ చెప్పాలిందేనంటూ పట్టుపట్టారు. దీంతో సభను అయిదు నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.తిరిగి అదే మత విద్వేష వ్యాఖ్యలుతిరిగి గంటన్నర తర్వాత మొదలైన తర్వాత కూడా అధికారపార్టీ సభ్యులు అదే విధంగా మత విద్వేష వ్యాఖ్యలను కొనసాగించారు. వెంకటేశ్వరస్వామి మీకు దేవుడు కాదా అంటూ మరింత విద్వేషకర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా చైర్మన్ నిజంగా హిందువైతే వైఎస్సార్సీపీ సభ్యులను కంట్రోల్ చేయాలంటూ మరోమారు చైర్మన్కు మతం రంగుపూసే ప్రయత్నం చేశారు. రూ.620లకు కేజీ నెయ్యిని కొనడాన్ని వ్యతిరేకించేవారు హిందువులు కారంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండటంతో చైర్మన్ సభను గురువారానికి వాయిదా వేశారు. -
దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యతని.. సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసి కూడా ఆరోపణలున్న వ్యక్తినే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్ట, పవిత్రతను చంద్రబాబు కాలరాశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ నాణ్యత లేదంటూ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు తిరిగి టీటీడీకి రావడం.. రిజెక్ట్ చేసిన వాటిని అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ సిట్ ఛార్జిషీట్లో స్పష్టం చేయడం ఆందోళనకరమన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేపుతూ.. నెయ్యి ధరల విషయంలో తప్పుడు ప్రచారం చేసి లాభాలు ఆర్జించడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. దేవుడిపై భక్తి ఉన్న వారు ఎవరైనా ఇలా చేస్తారా? అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ఆలయాల పవిత్రత, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వాల తొలి బాధ్యత అని గుర్తు చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కార్ తీరును సాక్ష్యాధారాలతో ఎండగడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ బుధవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..దేవుడిపై బాబుకు భక్తి, శ్రద్ధ, భయం లేదని మరోసారి రుజువైంది..దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అది అత్యంత నిష్టతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కళంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ట కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ చంద్రబాబు గారికి లేఖ రాస్తూ.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పని కోసం ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ చైర్మన్గా నియమించి, ఆలయ ప్రతిష్ట, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుకు భక్తీ లేదు.. శ్రద్ధ అంతకన్నా లేదు. దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.టీటీడీకి నెయ్యి సరఫరాను సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు..ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నారు. మరోవైపు 2014–19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278– రూ.330 ఉంది. 2019–24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే ఉంది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ.. తన హెరిటేజ్కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ డెయిరీకి కిలో నెయ్యి రూ.658లకు 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు.. శ్రద్ధ లేదు.. నిష్ట లేదు.. నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది.. లడ్డూ తయారీలో వాడింది బాబు హయాంలోనే..లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ(నాణ్యత) బాగోలేదని ఈ చంద్రబాబు గారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా.. మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం.. ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ–సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తీ లేదు.. ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. -
సమాధానం చెప్పలేక సత‘మతం’!
సాక్షి, అమరావతి: పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చార్జిషీట్లో సీబీఐ తేల్చేసినా, కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు నిర్ధారించినా పశ్చాత్తాపం లేదు..! కనీసం చట్టసభలోనూ కూటమి సర్కారు స్పందించలేదు! 2014–19 మధ్య టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీకి ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా కాంట్రాక్టు అప్పగించడంపైనా జవాబు లేదు! ఇటీవల వరకు హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా చూపించిన ఇందాపూర్ డెయిరీని గుట్టు చప్పుడు కాకుండా కో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేయడంపైనా నోరు విప్పలేదు! చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీటీడీ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్లను దొడ్డి దారిన రప్పించి తిరిగి అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూల తయారీకి వాడినట్లు సాక్షాత్తూ సీబీఐ తేల్చేసినా సమాధానం లేదు! ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్ ఎప్పుడూ పాల్గొనలేదంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్లో నిజం లేదని.. మండలి సాక్షిగా విపక్షం ఆధారాలను బహిర్గతం చేస్తే సమాధానం అంతకంటే లేదు!!చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేతిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు, సీబీఐ చార్జిషీట్లో తేల్చేయడం.. ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ వ్యాపార అనుబంధం.. నెయ్యిపై రాజకీయ, ఆర్థిక కుట్రలు బహిర్గతం కావడం.. ఇదంతా చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్కు లబ్ధి చేకూర్చేందుకేనని తేటతెల్లం కావడం.. టీడీపీ కూటమి సర్కారుకు దుర్బుద్ధి లేకుంటే దీనిపై చట్టసభలో చర్చకు ఎందుకు జంకుతోందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చర్చించుకోవడం.. శాసన మండలి చైర్మన్ న్యాయం వైపు గట్టిగా నిలబడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చర్చకు ఒప్పుకున్నట్లు నటిస్తూనే చంద్రబాబు సర్కారు డ్రామాలాడటం పట్ల హైందవ ధార్మిక సంస్థలు, హిందూ సమాజం తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇన్ని రోజులూ మొహం చాటేసిన చంద్రబాబు సర్కారు కుట్ర బుద్ధితో టాపిక్ డైవర్షన్ రాజకీయాలకు తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా అధికార పక్షమే ఇన్ని రోజులు సభను అడ్డుకున్న దాఖలాలు దేశ చరిత్రలో లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లడ్డూపై శాసన మండలిలో బుధవారం చర్చ మొదలు కాగానే మంత్రులు అడ్డుపడటం.. మతం ప్రస్తావన తేవడం.. ఎస్సీ వర్గానికి చెందిన మండలి చైర్మన్పై వ్యక్తిగత విమర్శలు చేయడం అంతా వ్యూహం ప్రకారం లడ్డూపై చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేనని మండలి సాక్షిగా బహిర్గతమైందని పేర్కొంటున్నారు. లడ్డూపై సభలో చర్చ జరిగితే చంద్రబాబు రాజకీయ, ఆర్థిక కుంభకోణం కుట్రలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో టీడీపీ తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ పాలిటిక్స్ను ఎంచుకుందని స్పష్టం చేస్తున్నారు. వెబ్సైట్లో తీసేస్తే హెరిటేజ్కు, ఇందాపూర్కు ఉన్న సంబంధాలు తెగిపోతాయా? ఒక పరిశ్రమ మరో పరిశ్రమతో కలసి వ్యాపారం చేస్తోందంటే వెబ్సైట్లో తీసేస్తే అయిపోతుందా? అంటూ వ్యాఖ్యానించిన మంత్రి అచ్చెన్న దీన్ని కవర్ చేసుకునేందుకే ‘మతం’ ప్రస్తావన తెచ్చారని విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి మొత్తం 19 నిమిషాలు మాట్లాడితే అందులో 12 సార్లు అడ్డుపడ్డారంటే అధికారపార్టీ ఏ స్థాయిలో భయపడిందో చెప్పేందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.బాబూ.. హిందూ సమాజం నిన్ను క్షమించదు..!రాజకీయ కుట్రతో ప్రారంభమైన నెయ్యి వ్యవహారం ఆర్థిక కుట్రగా ఎలా మారిందో విపక్ష సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, తూమాటి మాధవరావు సాక్ష్యాధారాలతో శాసన మండలిలో ఎండగట్టారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును హిందూ సమాజం క్షమించబోదని చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నియమించిన సిట్పై నమ్మకం లేకనే వైవీ సుబ్బారెడ్డి సీబీఐ దర్యాప్తు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని గుర్తు చేశారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్కు ఇందాపూర్ డెయిరీతో ఉన్న సంబంధాలను సాక్ష్యాధారాలతో వివరించారు. హెరిటేజ్ వెబ్సైట్లో ఇన్నాళ్లూ తమ తయారీ సంస్థగా చూపించిన ఇందాపూర్ డెయిరీని ఆరోపణలు రాగానే హఠాత్తుగా కో–మాన్యుఫాక్చర్గా మార్చడంతో పాటు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్తో రాజీనామా చేయించిన వైనాన్ని వివరించారు. 2016లో టీటీడీ నాణ్యత పరీక్షల్లో ఇందాపూర్ డెయిరీ ఫెయిల్ అయ్యిందని, ఇప్పుడు అదే ఇందాపూర్కి రూ.680కి నెయ్యి సరఫరా అప్పగించడం వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం దాగి ఉందన్నారు. ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీలను టీడీపీ ప్రభుత్వమే అనుమతించిందని, వారి హయాంలోనే ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసిందన్నారు. నాణ్యతా ప్రమాణాలు లేనందున నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరిస్తే వాటిని ఎవరి ఒత్తిడి మేరకు సంగం డెయిరీతో సంబంధం ఉన్న వైష్ణవీ డెయిరీ ద్వారా అనుమతించారో చెప్పాలంటూ నిలదీశారు. కల్తీ నెయ్యి సరఫరా టీడీపీ హయాంలో జరిగితే వైఎస్సార్ సీపీకి ఏం సంబంధమంటూ ప్రశ్నించారు. ఎన్డీడీబీ రిపోర్టు, సీబీఐ చార్జిషీటులో ఎక్కడా కూడా జంతుకొవ్వు కలిసిందని లేకపోయినా 120 కోట్ల మంది హిందువుల విశ్వాసాన్ని హేళన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం దారుణమన్నారు. సీబీఐ చార్జిషీటులో టీటీడీ జీఎం ఫిర్యాదును ప్రస్తావిస్తే, అదే నివేదిక అంటూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించారు. హెరిటేజ్ ప్రభుత్వ టెండర్లలో ఎప్పుడూ పాల్గొనలేదంటూ శాసన సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. టీటీడీకి పాలపొడి సరఫరా టెండర్లలో పాల్గొందని పేర్కొన్నారు. ఒకసారి టీటీడీకి హెరిటేజ్ పాలపొడి సరఫరా చేయగా బిల్లులు ఆగిపోతే ఒత్తిడి తెచ్చి ప్రత్యేకంగా రిజల్యూషన్తో డబ్బులు తీసుకున్న వైనాన్ని ఆధారాలతో వివరించారు. హెరిటేజ్ మజ్జిగ సరఫరాకు సంబంధించి కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలను కూడా సభ ముందుంచారు. చంద్రబాబు కుటుంబంతో కలసి గత ఐదేళ్లలో పలుదఫాలు తిరుమల వెళ్లి ప్రసాదం తిన్నారని మరి ఎప్పుడైనా లడ్డూ కల్తీ జరిగిందని ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. అయోధ్యకు వెళ్లి బాగుందంటూ తిరుమల లడ్డూలు తిన్న కూటమి నేతలు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. ఇందాపూర్ కోసం నిబంధనలు మార్చామని స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యుడే స్వయంగా శాసనసభలో వెల్లడించారని గుర్తు చేశారు. కేవలం గేదె పాలను మాత్రమే సేకరిస్తున్న సంగం డెయిరీ ఆవు నెయ్యి ఎలా సరఫరా చేస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ⇒ ఒకానొక దశలో తమ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని కోరిన తూమాటి మాధవరావుపై మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దాడి చేసే యత్నం చేశారు. ఇంత గందరగోళ పరిస్థితుల మధ్యలో కూడా విపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు పూర్తి ఆధారాలతో చంద్రబాబు కుట్రను మండలి సాక్షిగా బయటపెట్టారు.⇒ అంతకుముందు స్వల్పకాలిక చర్చ కంటే ముందు మంత్రి స్టేట్మెంట్ ఇస్తారంటూ అధికారపార్టీ సభ్యులు చర్చ జరగకుండా అడ్డుకున్నారు. అయితే సభలో కొత్త సంప్రదాయాలకు అవకాశం లేదని, నిబంధనల ప్రకారమే చర్చ తర్వాత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుందంటూ చైర్మన్ చర్చను ప్రారంభించారు. టీడీపీ తరపున అనురాధ మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డితో పాటు వైఎస్ జగన్పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. -
‘రాధిక’కు ఇన్ని రాయితీలా!?
సాక్షి, అమరావతి: దొడ్డిదారిన ప్రజాధనం లూటీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమకు ఆర్థిక చేయూతనివ్వకుండా ప్రైవేటు రంగంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు రాయితీల రూపంలో అడ్డగోలుగా లబ్ది చేకూరుస్తోంది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొత్తకి గ్రామం వద్ద రూ.240 కోట్లతో ప్రైవేటు రంగంలో ఆయిల్పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు‘రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు ప్రభుత్వం ఇస్తోన్న రాయితీలే ఇందుకు నిదర్శనం. ఎన్నడూ లేనివిధంగా ప్రాజెక్టు వ్యయంలో 44 శాతానికి పైగా రాయితీలు కల్పిస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవో ప్రకారం చూస్తే ఏ స్థాయిలో దోపిడీకి స్కెచ్ వేశారో ఇట్టే అర్థమవుతుంది.ఆయిల్ ఫెడ్ యూనిట్ను నిర్వీర్యం చేస్తూ..ఆయిల్ పామ్ రైతులకు ఓఈఆర్ (నూనె వెలికితీత నిష్పత్తి) నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఏపీ ఆయిల్ ఫెడ్ ప్లాంట్ను చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది మొదలు ఏదో విధంగా మూసివేసి తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తూనే ఉంది. వైఎస్ జగన్ హయాంలో రూ.10 కోట్లతో ఆధునికీకరణ పనులు పూర్తిచేసుకుని గంటకు టన్ను సామర్థ్యం కల్గిన ఈ ప్లాంట్ నేడు 24 టన్నుల క్రషింగ్ చేస్తోంది. 2018–19లో 90 వేల టన్నులు ప్రాసెస్ చేయగా, ప్రస్తుతం 1.20 లక్షల టన్నులు ప్రాసెస్ చేసే స్థాయికి చేరింది. దాదాపు రూ.200 కోట్లకు పైగా లాభాల్లో నడుస్తున్న ఈ యూనిట్ను ఆధునికీకరణతో పాటు కాకినాడ, ఏలూరుల్లో కొత్త యూనిట్ల ఏర్పాటుకు చేయూతనివ్వాలని ఏపీ ఆయిల్ ఫెడ్ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. కొత్త యూనిట్ల ఏర్పాటుకు రూ.250 కోట్ల రుణం ఇచ్చేందుకు ఎన్సీడీసీ, ఎన్డీడీబీ ముందుకొచ్చినా, ప్రభుత్వం మాత్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. పైగా గతంలో టీడీపీ హయాంలో ఎగ్గొట్టిన రూ.156 కోట్ల బకాయిలను చెల్లిస్తే, పెదవేగి యూనిట్ను ఆధునికీకరించుకుంటామని చెప్పినా స్వలాభం కోసం ఆ ప్రతిపాదనను గాలికొదిలేసింది. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న యూనిట్లను మూడుకు విస్తరించగా ఏపీలో మాత్రం ఉన్న ఏకైక యూనిట్ను మూసివేయాలని కుట్రలు చేయటం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో 14 ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఏకైక యూనిట్ను నిర్వీర్యం చేసి ఆయిల్ పామ్ రంగంలో గుత్తాధిపత్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమే లక్ష్యంగా ప్రైవేటురంగంలో ఈ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రూ.240 కోట్ల ప్రాజెక్టుకు.. రూ.95.98 కోట్ల రాయితీలా?సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు 10–15 శాతానికి మించవు. క్యాపిటల్ సబ్సిడీ రూపంలో నేరుగా రూ.42.50 కోట్లు ఉచిత గ్రాంట్ రూపంలో ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర జీఎస్టీ రీయింబర్సుమెంట్ రూపంలో ఐదేళ్ల పాటు 100 శాతం అంటే రూ.31.50 కోట్లు తిరిగి ఇచ్చేయనున్నారు. 304 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నందున ఉపాధి సబ్సిడీ రూపంలో రూ.13.64 కోట్ల రాయితీ ఇస్తున్నారు. అంటే ఒక్కో ఉద్యోగికి ప్రభుత్వం రూ.4.5 లక్షల చొప్పున సబ్సిడీ ఇస్తోంది. డీకార్బోనైజేషన్ సబ్సిడీ కింద రూ.3 కోట్లు, విద్యుత్ రాయితీల రూపంలో రూ.3.74 కోట్లు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు రూపంలో రూ.60లక్షల మేర రాయితీలు ఇస్తోంది. ఇలా రాయితీల రూపంలో ప్రాజెక్టు వ్యయంలో 44.02శాతం (రూ.95.98 కోట్లు)మేర లబ్ధి చేకూర్చడం పలు అనుమానాలకు తావిస్తోంది.అడ్డగోలు దోపిడీ కోసమే ఈ రాయితీలు..ఇంత పెద్దఎత్తున రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వానికి ఈ కంపెనీలో వాటా కానీ, లాభాల్లో వాటా కానీ ఏమైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు. తెరవెనుక పెద్దలకు ఈ కంపెనీలో వాటాలుండడం వలనే ఈ స్థాయిలో రాయితీలు ఇస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. రాబడి లేని రాయితీలు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ఆయిల్పామ్ రైతులు నిలదీస్తున్నారు.. ఇంత పెద్దఎత్తున రాయితీలివ్వడానికి బదులుæ ప్రభుత్వ యూనిట్ను ఆధునికీకరించడం లేదా ప్రభుత్వ రంగంలోనే కొత్త యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందంటున్నారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి కాకుండా.. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడిచే, ఎంపిక చేసిన వ్యక్తులు, సంస్థలకు లబ్ధి చేకూర్చడం ద్వారా తమ జేబులు నింపు కోవడమే లక్ష్యంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0ని రూపొందించినట్టు కన్పిస్తోందంటున్నారు. ఇది ముమ్మాటికి నీకింత..నాకింత తరహా దోపిడీకి తెరతీయడమేనని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని ఆయిల్ పామ్ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
నేలవాలిన అరటి ధర
కర్నూలు (అగ్రికల్చర్): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఏ పంటకూ కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోగా, అన్నదాతలు నష్టాలపాలయ్యారు. ఆ జాబితాలో ఇప్పుడు అరటి రైతులు కూడా చేరారు. సాగు కలిసిరాక.. పంటకు ధరలేక దిక్కుతోచని రైతులు తోటలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఒకప్పుడు రూ. 30 వేలు పలికిన టన్ను అరటి ధర ఇప్పుడు రూ. 5 వేలకు పడిపోయింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించడంలేదు. దీంతో దిక్కుతోచని రైతులు తోటలను దున్నేస్తున్నారు. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలంలోని కర్లకుంట, బాపనదొడ్డి, కోయిలకొండ గ్రామాల్లో దాదాపు 50 ఎకరాల్లో అరటిని తొలగించేశారు. అరటిరైతులను ఆదుకునేదిశగా చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించడంలేదు. రాయలసీమ జిల్లాల్లో మామిడి తర్వాత అరటి ప్రధాన పంట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 13,500, అనంతపురం జిల్లాలో 40 వేలు, వైఎస్సార్ కడప జిల్లాలో 36 వేలు, చిత్తూరు జిల్లాలో 6,500 ఎకరాల్లో.. మొత్తం 96 వేల ఎకరాల్లో అరటి సాగవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది, ఓర్వకల్లు మండలాల్లో సుగంధాలు, చిన్న పచ్చ అరటి సాగుచేస్తారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో టిష్యూకల్చర్ (గ్రాండ్ నైన్) అరటి మాత్రమే సాగుచేస్తారు. అనేకమంది రైతులు ల్యాబ్ల్లో వృద్ధిచేసిన పిలకలు తెచ్చి నాటుతున్నారు. అరటిసాగు కలిసి వస్తుండటం, గిట్టుబాటు ధరలు లభిస్తుండటంతో 2024–25, 2025–26 సంవత్సరాల్లో కూడా దీని సాగుపై ప్రత్యేకదృష్టి కేంద్రీకరించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ధరలు తారుమారవడంతో నష్టాలు తప్పని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ధరలు పడిపోయినపుడు చంద్రబాబు ప్రభుత్వం హడావుడి చేసింది. అరటి రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించకుండా ఫ్రూట్కేర్ యాక్టివిటీస్ చేపట్టాలని సూచించింది.ధరాఘాతం: గత ఏడాది నుంచి ఒక్కసారిగా ధరలు నేలను తాకడంతో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. టిష్యూకల్చర్ అరటిలో ఎకరాకు 25 టన్నుల దిగుబడి వస్తుంది. టన్నుకు కనీసం రూ.25 వేల ధర ఉంటే రైతుకు మేలు కలుగుతుంది. విదేశాలకు ఎగుమతి చేసే రకాలకే ధరలు పడిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. గత అక్టోబర్, నవంబర్ నెలల్లో జి–9 అరటి టన్నుకు సగటున రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు మాత్రమే ధర లభించిందంటే రైతులు ఏ స్థాయిలో నష్టపోయారో తెలుస్తుంది. తర్వాత ధరలు పెరిగినప్పటికీ అరటి కోతలు చురుగ్గా జరుగుతున్న వేళ ఇప్పుడు మళ్లీ ధరలు పడిపోయాయి. ఇటీవల టన్ను ధర రూ.20 వేల వరకు వెళ్లినా.. సరుకు మార్కెట్కు వచ్చే సమయానికి ఉన్నట్టుండి టన్ను ధర రూ.5 వేలకు పడిపోయింది.వక్రభాష్యం: అరటి ఒకసారి నాటుకుంటే మూడేళ్ల పాటు గెలలు వస్తాయి. ఏటా పిలకలు అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. మెయిన్టెనెన్స్పై ప్రత్యేకదృష్టి పెడతారు. ఇప్పుడు ధరలు పడిపోవడానికి చెబుతున్న కారణాలు వింతగా ఉంటున్నాయి. అనేకమంది రైతులు తక్కువ పెట్టుబడితో మూడోపంట తీస్తారు. రైతులను ఆదుకోవడానికి ముందుకురాని చంద్రబాబు ప్రభుత్వం.. ధరలు పడిపోవడానికి మూడోపంటే కారణమని ఉద్యాన అధికారులతో చెప్పిస్తోంది. మూడోపంటలో నాణ్యత ఉండదని, అందువల్ల గిట్టుబాటు ధరలు లభించవని చెబుతున్నారు. కొన్నేళ్లుగా అరటిలో రైతులు మూడోపంట తీస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మాత్రమే ధరలు పడిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపోతున్న రైతులను ఆదుకునేదిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో విదేశాలకు ఎగుమతి రాయలసీమ జిల్లాల్లో 2019–20 నుంచి 2023–24 వరకు రైతులకు అరటిసాగు కలిసి వచి్చంది. అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించే విధంగా టిష్యూకల్చర్ అరటిసాగుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. అప్పట్లో టన్ను ధర రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు లభించింది. నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల నుంచి విదేశాలకు అరటి ఎగుమతి అయింది. వైఎస్సార్సీపీ హయాంలో రాయలసీమ జిల్లాల నుంచి రైతులు విదేశాలకు 1.25 లక్షల టన్నుల టిష్యూకల్చర్ అరటిని ఎగుమతి చేశారు. ఏ పంట సాగుచేసినా.. ఆదుకోని చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఏం పంట సాగుచేసినా రైతులను ఆదుకున్న దాఖలాల్లేవు. 2024లో మిర్చి రైతులకు చేయూత ఇవ్వలేదు. మామిడి రైతులకు ఎలాంటి భరోసా దక్కలేదు. పొగాకు రైతు నష్టపోకుండా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయిస్తామని ప్రకటించి తర్వాత చేత్తులెత్తేశారు. ఉల్లి ధరలు పడిపోవడంతో క్వింటా రూ.1,200 మద్దతు ధరతో కొంటామని హడావుడి చేసి మూన్నాళ్ల ముచ్చటగా ముగించారు. తర్వాత ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లిస్తామని అరకొరగానే ఇచ్చారు. మొక్కజొన్న ధరలు పడిపోయి రైతులు గగ్గోలు పెట్టినా మద్దతు ధరతో కిలో కూడా కొనలేదు. ధరలు పడిపోయి టమాట రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయినప్పటికి చంద్రబాబు ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు.20 ఎకరాల్లో అరటిని ట్రాక్టరుతో దున్నేశాం మాకు అరటి ప్రధానపంట. కొన్నేళ్లుగా సాగుచేస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి అరటిసాగులో నష్టాలు మూటగట్టుకున్నాం. మేం నాలుగెకరాల్లో 2024లో అరటి సాగుచేశాం. రెండేళ్లు పంట తీసుకున్నాం. నాలుగెకరాల్లో ఆరువేల మొక్కలున్నాయి. మొదటి ఏడాది మూడువేల గెలలే అమ్ముడుపోయాయి. మరో మూడువేల గెలల్లో నాణ్యత లేదని వ్యాపారులు కొనలేదు. రూ.ఆరులక్షల పెట్టుబడి పెడితే మొదటి ఏడాది పంట పెట్టుబడి వరకే వచ్చింది. రెండో ఏడాది నష్టాలు మూటగట్టుకున్నాం. మామూలుగా మూడోపంట కూడా సాగుచేస్తాం. అయితే మార్కెట్లో ధరలు పడిపోవడం, మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో మా కుటుంబానికి చెందిన 20 ఎకరాల్లో అరటి తోటలను ఫిబ్రవరి మొదటి వారంలో ట్రాక్టరుతో దున్నేశాం. అరటిలో మొదటిసారిగా నష్టాలొచ్చాయి. – కృష్ణ, బాపనదొడ్డి, క్రిష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా -
ప్రమాద ఘంటిక.. మాయిస్ట్ హీట్
సాక్షి, అమరావతి: వేసవి అంటే మనకు గుర్తుకు వచ్చేది సెగలు గక్కే ఎండలు, వడగాడ్పులు. కానీ ఈ వేసవి సీజన్లో వాతావరణం ఒక కొత్త రూపం దాల్చబోతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు సాధారణంగానే ఉన్నట్లు అనిపించినా రానున్న రోజుల్లో ‘మాయిస్ట్ హీట్’ (తేమతో కూడిన వేడి) ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ, అంతర్జాతీయ పరిశోధన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గాలిలో ఉష్ణోగ్రతతో పాటు తేమ కూడా అధికంగా ఉండటాన్ని ‘మాయిస్ట్ హీట్’ అంటారు. సాధారణ పరిభాషలో దీన్ని ఉక్కపోతగా పేర్కొంటారు. సాధారణ ఎండల కంటే ఇది భిన్నమైంది. పొడి ఎండల్లో చెమట పడితే గాలికి ఆవిరై శరీరం చల్లబడుతుంది. కానీ గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆవిరి కాదు. దీనివల్ల శరీరం తనను తాను చల్లబరుచుకునే సహజ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రస్తుతం వాతావరణ పరిశోధనల్లో ‘వెట్–బల్బ్ టెంపరేచర్’ అనే పదం ప్రముఖంగా వినిపిస్తోంది. గాలిలోని వేడి, తేమను కలిపి కొలిచే కొలమానాన్నే ఇలా పిలుస్తున్నారు. సాధారణంగా వెట్–బల్బ్ ఉష్ణోగ్రత 31 డిగ్రీలు దాటితే అది మానవ శరీరానికి ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవేళ ఇది 35 డిగ్రీలకు చేరితే అత్యంత ఆరోగ్యవంతులు కూడా నీడలో ఉన్నా తట్టుకోవడం కష్టమవుతుందని నేచర్ క్లైమేట్ చేంజ్ వంటి అంతర్జాతీయ జర్నల్స్ పేర్కొన్నాయి. తీర ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ వరకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో గాలి మందగించడం వల్ల తేమ ఒకే చోట పేరుకుపోయి మాయిస్ట్ హీట్ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. వాతావరణ వ్యవస్థలు అస్థిరంగా ఉండడం వల్ల సముద్రపు గాలులు భూభాగంపైకి ఎక్కువ తేమను మోసుకొస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. రెండు మూడేళ్లుగా ఇదే ధోరణి.. వాస్తవానికి ఈ మార్పు ఇప్పుడు హఠాత్తుగా వచ్చిందేమీ కాదు. గత రెండు, మూడేళ్లుగా ఈ ధోరణి కనిపిస్తోంది. 2024, 2025 వేసవి కాలాల్లో ఉక్కపోత తీవ్రంగానే ఉంది. కానీ ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులు, అస్థిరమైన సముద్రపు గాలుల కలయిక వల్ల తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పట్టణాల్లో పెరుగుతున్న కాంక్రీట్ కట్టడాల ప్రభావం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చివేసింది.ముప్పు ఏమిటి? గాలిలో తేమ 70 శాతం ఉండి, ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉన్నా అది మన శరీరానికి 48 డిగ్రీల ఎండలో ఉన్నంత ప్రభావం చూపుతుంది. ఈ వేసవిలో ఇలాంటి అసౌకర్య రోజులు గతం కంటే 15 – 20 రోజులు అదనంగా ఉంటాయని అంచనా. జాగ్రత్తలు ముఖ్యం.. హీట్ ఇండెక్స్ గమనించండి: కేవలం డిగ్రీలను మాత్రమే కాకుండా ‘హీట్ ఇండెక్స్’ (గాలిలోని తేమను కలిపి చూపే ఉష్ణోగ్రత)ను గమనించాలి. ఫోన్లలోని వాతావరణ యాప్స్లో ఫీల్స్ లైక్ అని ఉండే ఉష్ణోగ్రతే దీనికి సంకేతం. నీటి వినియోగం: దాహం వేయకపోయినా నీరు తాగుతూ ఉండాలి. మాయిస్ట్ హీట్లో చెమట ఆవిరి కాకపోయినా శరీరం లోపల నీటి శాతం తగ్గుతుంది. గాలి సరఫరా: గదుల్లో గాలి ధారాళంగా ఆడేలా చూసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం ఫ్యాన్ వేసుకున్నా వేడి గాలి మాత్రమే వస్తుంది. కాబట్టి కిటికీలు తెరిచి ఉంచడం లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడడం మంచిది. -
13న కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి తీసుకువెళ్లాల్సిన ప్రతిపాదనలను ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా సాధారణ పరిపాలన శాఖ (కేబినెట్ విభాగం)కు పంపాల్సిందిగా అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. -
ఆ ప్రజాప్రయోజన ప్రాజెక్టు ఆగిపోకూడదు
సాక్షి, అమరావతి: బెంగళూరు–మైదుకూరు–అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే భూ సేకరణకు జాతీయ రహదారుల చట్టం కింద వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2022–23లో జారీ అయిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 124 కిలోమీటర్లు, 12 మండలాలు, 49 గ్రామాలకు సంబంధించిన పెద్ద ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్ అని, కొద్దిమంది అభ్యంతరాలతో మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోకూడదని న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు.అంతా సక్రమమే: హైకోర్టుబెంగళూరు–మైదుకూరు–అమరావతి గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణం కోసం వైఎస్సార్ కడప జిల్లాలో భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారుల చట్టం కింద 2022–23లో భూ సేకరణ నోటిఫికేషన్లు జారీ చేసింది. తరువాత గెజిట్ నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. వీటిని సవాలు చేస్తూ పలువురు భూ యజమానులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్రెడ్డి వాదనలు వినిపించారు. నోటిఫికేషన్లపై పిటిషనర్ల అభ్యంతరాలను హైకోర్టు తిరస్కరించిన తీరిది.. » జాతీయ రహదారుల చట్టం కింద భూములు సేకరిస్తుంటే, భూ సేకరణ నోటిఫికేషన్లో ఆ భూముల వివరాలను సంక్షిప్తంగా పేర్కొంటే సరిపోతుంది. » భూముల యజమానుల పేర్లను భూ సేకరణ నోటిఫికేషన్లో పేర్కొనాల్సిన అవసరం లేదు. » జాతీయ రహదారుల చట్టంలోని సెక్షన్ 3ఏ (1) ప్రకారం భూ సేకరణ నోటిఫికేషన్ను ఏవైనా రెండు స్థానిక పత్రికల్లో ప్రచురిస్తే సరిపోతుంది. ఆ పత్రికల సర్క్యులేషన్ ఎంత అన్నది అవసరం లేదు. » సాంకేతిక నిపుణుల ద్వారా రూపొందించిన జాతీయ ప్రాజెక్టుల విషయంలో న్యాయ సమీక్షా పరిధి చాలా పరిమితంగా ఉంటుంది. » పెద్ద ప్రాజెక్టులకు భూములిచ్చేందుకు మెజారిటీ యజమానులు అంగీకరించినప్పుడు, కొద్ది మంది అభ్యంతరాల ఆధారంగా ఆ ప్రాజెక్టును నిలిపివేయడం సాధ్యం కాదు. » పైగా చట్ట ప్రకారం పిటిషనర్లు 21 రోజుల్లో అభ్యంతరాలు తెలపాల్సి ఉండగా, ఆ గడువులో అభ్యంతరాలు చెప్పలేదు. » డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ మధ్యలో ఉన్న భూములు కూడా హైవేలో భాగమే. » సేకరించిన భూములను వాణిజ్య కార్యకలాపాల కోసం వాడతారనే అనుమానం ఆధారరహితం. -
అడ్డదారుల్లో మరింత పతనం
సాక్షి, అమరావతి: రాజకీయ లబ్ధి కోసం కలియుగదైవమైన వెంకటేశ్వరస్వామినే వివాదంలోకి లాగి కల్తీ డ్రామా ఆడి అభాసుపాలుకావడంతో అధికార టీడీపీ దాన్నుంచి బయటపడడానికి రకరకాల అడ్డదారులు వెతుకుతూ మరింత పతనావస్థకు చేరుతోంది. తాజాగా బుధవారం శాసన మండలి సాక్షిగా రాజ్యాంగబద్ధమైన శాసన మండలి చైర్మన్కు సైతం మతం రంగు పులిమారు. దళిత వర్గానికి చెందిన కొయ్యే మోషేన్రాజు క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు పదే పదే ప్రస్తావించి ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇది ముమ్మాటికీ అధికార టీడీపీ ఆగడాలకు పరాకాష్ట అని రాష్ట్ర ప్రజలు తప్పుబడుతున్నారు. శాసన మండలి చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక దళితవర్గానికి చెందిన నాయకుడిని వైఎస్ జగన్మోహన్రెడ్డి చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. అటువంటి గొప్ప సామాజిక సంస్కరణను స్వాగతించాల్సింది పోయి టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగానే దళిత వర్గానికి చెందిన మండలి చైర్మన్ను అవమానిస్తోంది. తిరుపతిలో మహిళా పార్లమెంట్ నిర్వహించిన సందర్భంలో మోషేన్రాజును ఆహ్వానించకుండా కించపరిచారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద నిర్మించిన కొత్త భవనం ప్రారంభోత్సవంలో శిలాఫలకంపై మోషేన్రాజు పేరు లేకుండా చేశారు. అధికార టీడీపీ తీరుపై అప్పట్లో విమర్శలు రావడంతో ప్రారంభోత్సవం అయ్యాక శిలాఫలకంపై పేరు పెట్టారు. ఇటీవల ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి శాసనమండలి చైర్మన్ను ఆహ్వానించ లేదు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అనేక సందర్బాల్లో ఆయనకు ఇవ్వాల్సిన ఫ్రొటోకాల్ను విస్మరించడం, శిలాఫలకాలపై పేరు లేకుండా చేయడం, అధికారిక కార్యక్రమాలకు పిలవకపోవడం వంటి చర్యలతో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చైర్మన్ అయ్యారనో? దళిత వర్గానికి చెందిన వ్యక్తి అనో? ఉద్దేశపూర్వకంగానే ప్రోటోకాల్ విస్మరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఆయనకు మతాన్ని కూడా ఆపాదించడం మరింత దుర్మార్గం. హిందువునని చెప్పుకోవాల్సిరావడం బాధాకరం..శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ తీరుపై మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజును బుధవారం రాత్రి సాక్షి సంప్రదించింది. సభలో మంత్రుల తీరుపై విచారం వ్యక్తం చేస్తూ తాను హిందువుగానే పుట్టానని, హిందువుగానే జీవిస్తున్నానని మోషేన్రాజు బదులిచ్చారు. తన సొంత గడ్డ అయిన భీమవరంలో వినాయక చవితి పందిళ్లు వేసి ఉత్సవాల్లో పాలుపంచుకుంటానని, మావూళ్లమ్మ ఉత్సవాల్లోనూ భాగస్వామిని అవుతానని, తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని వాటికి సంబంధించిన ఫొటోలను సైతం విడుదల చేశారు. తాను హిందువునే అని చెప్పుకోవాలి్సన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. -
మండలి చైర్మన్పై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అవమానకరం
సాక్షి, అమరావతి: శాసనమండలిలో బుధవారం చోటుచేసుకున్న ఘటనల కారణంగా ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని వైఎస్సార్సీపీ నేతలు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు పట్ల మంత్రులు, టీడీపీ సభ్యులు అమానవీయంగా, అవమానకరంగా ప్రవర్తించారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించాల్సింది పోయి కులం, మతం పేరుతో లక్ష్యంగా చేసుకోవడం చట్టసభల సంస్కృతికి విరుద్ధమన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని స్పష్టమైందని ఆరోపించారు. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికం కాదని, దీనివెనుక స్పష్టమైన దురుద్దేశం ఉందన్నారు. మంత్రి లోకేశ్ సభలో ఉండగానే ఈ ఘటన జరగిందన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న దళిత వ్యక్తిని మతం, కులం పేరుతో అవమానించడం కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాకుండా సామాజిక న్యాయం, సమానత్వంపై దాడి అని స్పష్టం చేశారు. చైర్మన్ను ఏ మతానికి చెందినవారు అని ప్రశ్నించడం చట్టసభల గౌరవాన్ని మంటగలిపిందని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ దుమారంగా మార్చి.. ఆ నీడలో హెరిటేజ్ ఫుడ్స్ అనుమానాస్పద లావాదేవీలపై వస్తున్న ఆరోపణలను దారి మళ్లించేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తిరుమల నెయ్యి కొనుగోళ్లలో అవకతవకలపై ఆధారాలతో ప్రశ్నలు లేవనెత్తగానే అధికార పక్షం అసహనానికి లోనైందన్నారు. మార్కెట్ ధరకంటే అధిక ధరలకు నెయ్యిని సరఫరా చేస్తూ హెరిటేజ్ యూనిట్ ద్వారా లాభాలు పొందుతున్నారనే అంశాలపై సమాధానం చెప్పలేకపోయినందుకే సభను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. మండలిని వారి చేతుల్లోకి తీసుకోవాలన్న దురుద్దేశంతోనే చైర్మన్పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరంగా వ్యవహరించిన మంత్రి అచ్చెన్నాయుడిపై తక్షణ చర్యలు తీసుకుని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ సీఈసీ సభ్యునిగా పామిరెడ్డిగారి పెద్ద నాగిరెడ్డి(నంద్యాల), ఎస్ఈసీ సభ్యునిగా వైసి గోవర్ధనరెడ్డి(మడకశిర), పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కంగాటి ప్రదీప్ రెడ్డి (పత్తికొండ), పార్టీ రాష్ట్ర సెక్రటరీ (పార్లమెంటు) పోరెడ్డి నరసింహారెడ్డి (ప్రొద్దుటూరు) నియమితులయ్యారు.కాగా, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ల నియామకం జరిగిన సంగతి తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బూడి ముత్యాలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. -
‘అంగన్వాడీ వర్కర్లపై పోలీసుల దాడి అమానుషం’
సాక్షి, తాడేపల్లి: అంగన్వాడీ వర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని, ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న అక్కచెల్లెమ్మలను దారుణంగా వేధించిందని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లుగా మభ్యపెడుతూ వచ్చారని వివరించారు.టెంట్లో ఉండి నిరసన వ్యక్తం చేస్తున్న ఉన్న మహిళలను వేకువ జామున ఒక్కసారిగా ఈడ్చి వ్యాన్లలోకి తరలించడం హేయమని చర్యగా పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్లకు వైయస్సార్సీపీ అండగా ఉంటుందని, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..రెండేళ్లుగా మభ్యపెడుతున్నారుఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అత్యంత అమానుషంగా వ్యవహరించింది. ప్రభుత్వంతో చర్చలకు పిలుస్తామని ముందురోజు రాత్రి నమ్మబలికి వేకువజామున టెంట్లు కూల్చేసి అక్రమంగా అరెస్టు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక దఫాలు శాంతియుతంగా నిరసనలు తెలిపిన అంగన్వాడీలను చంద్రబాబు ప్రతిసారీ మభ్యపెడుతూ వచ్చారు.ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడంతో సోమవారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరూ నిద్రిస్తుండగా వందలాది మంది మగ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి అంగన్వాడీ మహిళలను ఈడ్చి పారేశారు. వారు తేరుకునేలోగా టెంట్లు పడేసి, ప్లెక్సీలు చించేసి, ప్లకార్డులు విసిరేసి, అంతా చిందరవందర చేసేశారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులు వ్యవహరించిన తీరును వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వారికి పార్టీ అండగా ఉండి వారి తరఫున ఉద్యమిస్తుంది.హామీ అమలు చేయాలని కోరడం తప్పా?శాంతియుతంగా ఉద్యమించిన మహిళలపై కర్కశంగా వ్యవహరించింది. రోడ్డు పైనే సొమ్మసిల్లిన అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు పోలీసులను ప్రయోగించి విరుచుకుపడింది. అంగన్వాడీలు తేరుకుని ఏం జరుగుతోందో గ్రహించేలోపే మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేసి పోలీసు వ్యాన్లలోకి ఎక్కించేశారు. గతంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన నీచ చరిత్ర చంద్రబాబుది. అంగన్వాడీలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా చుట్టూ రోప్ పార్టీతో పోలీసులు దిగ్బంధించారు.రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన వారిని కనీసం బ్యాగులు, సెల్ఫోన్లు కూడా తీసుకోనివ్వకుండా నిర్బంధించారు. చేతికి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యాన్లలోకి తోసేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా గెంటేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురు అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమను అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం టాయిలెట్స్కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అంగన్వాడీ వర్కర్స్ వాపోతున్నారు. అంగన్వాడీ వర్కర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చూసి దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది.మూల్యం చెల్లించుకోక తప్పదుఅంగన్వాడీలు మాత్రమే కాదు.. టీచర్లు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు, పెన్షనర్లు ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఇప్పటికే అనేకసార్లు వినతులు, నిరసనలు తెలియజేశారు. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన ఉండటం లేదు. వైయస్సార్సీపీ హయాంలో ఉన్న పీఆర్సీ చైర్మన్ తో రాజీనామా చేయించిన చంద్రబాబు.. రెండేళ్లుగా కొత్త పీఆర్సీ కమిషన్ వేయకుండానే కాలయాపన చేస్తున్నారు.కనీసం ఒకటో తేదీన జీతాలు ఇస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఉద్యోగులకు రావాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్ల బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. బినామీ కంపెనీలకు 99పైసలకు వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్న ప్రభుత్వం... ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోతే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. -
మండలి ఛైర్మన్ను అవమానించడం దారుణం: శ్రీకాంత్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్కి మతం, పార్టీ ఆపాదిస్తూ మాట్లాడిన సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని, సభలో అడుగుపెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.రాజకీయ లబ్ధి కోసం ఇన్నాళ్లు దేవుడిని రాజకీయాల్లోకి లాగి ఆలయ ప్రతిష్టను మసకబార్చిన కూటమి నాయకులు.. మాట్లాడాల్సిన సబ్జెక్టుని పక్కన బెట్టి శాసనమండలి చైర్మన్ని చర్చలోకి లాక్కురావడమే కాకుండా ఆయన్ను కులమతాల పేరుతో కించపరచడం దారుణమని ఆయన ఆక్షేపించారు. రాజ్యాంగ వ్యవస్థలో ఈరోజును చీకటిరోజుగా చూడాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:కల్తీ నెయ్యి పేరుతో టీటీడీ నిధుల దోపిడీకి పాల్పడిన హెరిటేజ్ అంశం మండలిలో చర్చకు రావడంతో దానికి సమాధానం చెప్పలేక సభలో లేని వైఎస్ జగన్, మండలి చైర్మన్లు క్రిస్టియన్లు అని మాట్లాడుతూ సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య. పైగా మీ నాయకుడు జగన్ అంటూ మండలి చైర్మన్కు పార్టీని ఆపాదించి అవమానించారు. ఇది దారుణం. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్ చేసిన టీటీడీ నిధుల దోపిడీపై వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పుకోలేని ప్రభుత్వం సభను పక్కదోవ పట్టించడానికి చైర్మన్ని రాజకీయాల్లోకి లాగి మతాన్ని, పార్టీని ఆపాదించింది.అధికార పక్ష సభ్యుల అనైతిక ప్రవర్తన:అధికార పార్టీ సభ్యులం అన్న విషయమే మరిచిపోయి వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతుండగా ప్రసంగానికి పదులసార్లు అడ్డుతగలడమే కాకుండా మంత్రులంతా పోడియం చుట్టుముట్టి సభలో ఆందోళన చేయడం సిగ్గుచేటు. నేను ఫలానా మతం అని మండలి చైర్మన్ చెప్పుకునే దుస్థితి కల్పించినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి. పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోతే ఎవరికైనా కులమతాలు అంటగట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తామని కూటమి నాయకులు చెప్పకనే చెబుతున్నారు.అచ్చెన్నాయుడిపై చర్య తీసుకోవాలి:ఇప్పటికైనా సీఎం చంద్రబాబు కలగజేసుకుని మంత్రి కె.అచ్చెన్నాయుడిని రాబోయే మూడేళ్లపాటు సభలో అడుగుపెట్టకుండా శాశ్వతంగా సభ నుంచి సస్పెండ్ చేయాలి. మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే సరిపోదు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేయాలి. శ్రీవారిని రాజకీయాల్లోకి లాగినందుకు కూటమిని ప్రజలు అసహ్యించుకుంటుంటే దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కులమతాలతో రాజకీయాలు చేయడం అత్యంత హేయమైన చర్య అని శ్రీకాంత్రెడ్డి అభివర్ణించారు. -
మండలి చరిత్రలోనే ఇది చీకటి రోజు: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: తిరుపతి లడ్డూ, కల్తీ నెయ్యి, హెరిటేజ్ ఇందాపూర్ డెయిరీ మధ్య సంబంధాలపై శాసనమండలిలో లఘు చర్చ సందర్బంగా సభలో రగడ చోటుచేసుకుంది. అధికార పక్షం అడుగడుగునా అడ్డుకోవడంతో చివరకు సభ వాయిదా పడింది. అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.విలువలు మంటగలిపేలా అచ్చెన్న వ్యాఖ్యలు: లేళ్ల అప్పిరెడ్డిశాసనమండలి చరిత్రలో ఇవాళ జరిగిన ఘటనలు చీకటి రోజుగా నిలిచిపోతాయి. తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలని వైఎస్సార్సీపీ.. సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచీ నాలుగుసార్లు వాయిదా తీర్మానాలు ఇచ్చింది. మండలిని కూడా స్తంభింపజేశాం. ఎట్టకేలకు బీఏసీలో 23వ తేదీన మండలిలో చర్చకు అంగీకరించిన తర్వాత కూడా మంత్రులు చర్చ రాకుండా అడ్డుకున్నారు.తిరిగి వైఎస్సార్సీపీ సభ్యుల ఒత్తిడి మేరకు చర్చ ప్రారంభించినా.. మంత్రులు అడుగడుగునా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలోనే మండలికి ఉన్న గౌరవాన్ని మంటగలిపేలా సాక్ష్యాత్తు ఛైర్మన్పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన అధికారాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఛైర్మన్ మతాన్ని ఉద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపేలా ఉన్నాయి.మంత్రులు ఆరోపణలు చేస్తున్నా ఆధారాలు ఉండట్లేదు. దీంతో వారు కంగుతిన్నారు. అందుకే ఏదో విధంగా సభను డైవర్ట్ చేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే సభలో లేని జగన్మోహన్ రెడ్డిగారితో పాటు ఛైర్మన్ మతాల ప్రస్తావన తెచ్చారు. లడ్డూ కల్తీ ఆరోపణలు చేసిన ప్రభుత్వం.. ఇందాపూర్ లింకులు బయటపడే సరికి ఆత్మరక్షణలో పడిపోయింది. చివరికి హెరిటేజ్ కోసమే లడ్డూ కల్తీ వ్యవహారం తెరపైకి తెచ్చారని తేలిపోయింది. మా సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఛైర్మన్ కు ఇచ్చాం. దీనికి సమాధానాలు చెప్పలేక ఛైర్మన్ మత ప్రస్తావన తీసుకురావడం దారుణం. మోషేను రాజు ఛైర్మన్ గా ఉండటం మీకు ఇష్టం లేదా, ఎందుకు ఆయనపై అడుగడుగునా వివక్ష చూపుతూ అవమానిస్తున్నారు?.చంద్రబాబు తీరును ఆధారాలతో ఎండగట్టాం: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితిరుమల లడ్డూ నెయ్యిపై వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే 14 రోజులుగా ప్రయత్నిస్తున్నాం. ఇవాళ మండలిలో చర్చ ప్రారంభమయ్యాక ప్రతీ అంశంపై ఆధారాలు సమర్పించి మాట్లాడాం. ఇన్ని ఆధారాలతో రాజకీయ కుట్రను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే.. అధికార పక్షం వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉంది. సభలో లేని వైఎస్ జగన్ ప్రస్తావన తెచ్చి ఆయనపై విమర్శలు చేశారు. తన కుమారుడి పట్టాభిషేకం కోసం వైఎస్ జగన్ను అడ్డు తొలగించుకోవాలన్న రాజకీయ కుట్రే ఇందులో ఉంది.మీ హయాంలో టీటీడీలో నాలుగు నెయ్యి ట్యాంకర్ల నెయ్యిని కల్తీ పేరుతో వెనక్కి పంపి, తిరిగి వైష్ణవీ డెయిరీ ద్వారా లోపలికి పంపుకున్నారు. కల్తీ జరిగితే అది జరిగింది మీ ప్రభుత్వంలోనే, దాన్ని మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దాదాపు కిలో నెయ్యి రూ.300కు తీసుకుంటే, మీ హెరిటేజ్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీకి కిలో రూ.600 కు ఇచ్చేలా టెండర్ కట్టబెట్టారు. భోలేబాబా, ప్రీమియర్ డెయిరీ కూడా మీ హయాంలోనే 95 శాతం నెయ్యి సరఫరా చేసింది, ఇప్పుడు అదే ప్రీమియర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యి నాణ్యత లేకపోతే వైఎస్సార్సీపీకి అంటగట్టి ఆరోపణలు చేస్తున్నారు. భోలేబాబాకు అనుమతులు ఇచ్చింది మీ హయాంలోనే. ప్రజలకు మేం చెప్పాలనుకున్నది సభలో చెప్పాం. ప్రజలే దీనిపై నిర్ణయిస్తారు.హెరిటేజ్పై దొరికిపోయిన ప్రభుత్వం: తూమాటి మాధవరావుగత వారం అసెంబ్లీలో జరిగిన తిరుమల లడ్డూ చర్చలో హెరిటేజ్కు టీటీడీతో సంబంధాలు లేవని, కేజీ నెయ్యి కూడా సరఫరా చేయలేదని, టెండర్లలో పాల్గొనలేదని చంద్రబాబు ప్రకటించారు. కానీ 1998లో టీటీడీకి కేజీ రూ.70 చొప్పున టెండర్ లేకుండానే హెరిటేజ్ పాల పౌడర్ సరఫరా చేసిందని మేం ఆధారాలు బయటపెట్టాం. నిబంధనలకు విరుద్దంగా టెండర్ లేకుండా ఎలా డబ్బులు చెల్లిస్తారని టీటీడీ ఆపేస్తే.. తిరిగి బోర్డుకు పంపి ఆమోదం తీసుకుని చెల్లింపులు చేసారు. అదే విషయం ఇవాళ ప్రశ్నిస్తే 1998 విషయం ఎందుకు మాట్లాడుతున్నారని ఎదురు దాడి చేశారు. పాల పౌడర్ తిరుమలలో దేనికి వాడారో చంద్రబాబు సమాధానం చెప్పాలి.2008లో కాంగ్రెస్ ప్రభుత్వంలో టీటీడీ టెండర్లలో పాల్గొని ఎల్–3గా వచ్చారని కూడా ఆధారాలు చూపించాం. కేజీ రూ.117.75 చొప్పున టిన్నుల్లో సరఫరా చేస్తామని టెండర్ వేశారు కదా అని అడిగితే మేం ఎల్–1కాదని బుకాయించారు. దీనిపై నిలదీస్తే మాపై దాడికి ప్రయత్నించారు. మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతుంటే ఆర్ధికమంత్రి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అనుమతించాలని మండలి ఛైర్మన్ ను అడుగుతుంటే నన్ను అడ్డుకున్నారు. మా గొంతు నొక్కేందుకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను వెనక్కి తగ్గేది లేదు.అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి: తోట త్రిమూర్తులులడ్డూపై చర్చించాలని పది రోజులుగా కోరుతున్నా వెనక్కి పారిపోయిన ప్రభుత్వం.. ఎట్టకేలకు ఒప్పుకున్నట్లు చూపించి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్ కూ ఉన్న సంబంధం, వీళ్ల అవినీతి బయటపెట్టే సరికి జీర్ణించుకోలేకపోయారు. అందుకే సభను పక్కదారి పట్టించేలా సభలో లేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తెచ్చి ఆయనపై ఓ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. వైఎస్ జగన్ పలుమార్లు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి.కడప జిల్లాలో తాజాగా నందేశ్వర ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అయినా ఆయన హిందూ మతానికి వ్యతిరేకం అని ముద్ర వేసేందుకు కుట్ర చేస్తున్నారు. వైఎస్సార్ హయాంలో రెండు కొండలుగా ఉన్న తిరుమలను ఏడు కొండలంటూ జీవోలు ఇచ్చిన చరిత్ర ఉంది. వైఎస్సార్ ఇచ్చిన జీవోల్ని రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబా కాదా అనేది ప్రజలు గమనించాలి. ఎప్పుడూ తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే భక్తి ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా ఆయనకు తలనీలాలు సమర్పించారా చెప్పాలి. లడ్డూ నెయ్యిపై చర్చ పెట్టి తిరుమల ప్రతిష్టను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు. సభలో లేని వైఎస్ జగన్ ప్రస్తావన తెచ్చినందుకు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి.లడ్డూ నెయ్యిపై వాస్తవాలు చెప్పేశాం: వంకా రవీంద్రనాథ్ఇవాళ మంత్రులు తొలిసారి మండలిలో సభ్యులపై అనుక్షణం దాడికి ప్రయత్నించారు. మా వాదన వినిపించకుండా అడ్డుకున్నారు. ఈ సభ ద్వారా ప్రజలకు వాస్తవాలు చేరడం వారికి ఇష్టం లేదు. అయినా మా సభ్యులు లడ్డూ నెయ్యి మీద ప్రజలకు ఆధారాలతో వాస్తవాలు చెప్పారు. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో పాలు, ఇతర కల్తీల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వచ్చే మూడు రోజుల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని కోరుకుంటున్నాం.ఛైర్మన్ను మతం పేరుతో అవమానిస్తారా?: వరుదు కల్యాణిపది రోజులుగా లడ్డూ నెయ్యి మీద చర్చ అడుగుతుంటే ఇవాళ్టికి ఒప్పుకున్నారు. కానీ మా సభ్యులు మాట్లాడుతుంటే అధికార పక్షం దిగజారిపోయి ఛైర్మన్ ను కూడా మతం పేరుతో టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామా లేమా అనే పరిస్ధితిని కూటమి మంత్రులు కల్పించారు. లౌకిక దేశంలో ఇలాంటి ఘటనలు దురదష్టకరం. దీన్ని బట్టి ఈ చర్చకు మీరు ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది.లడ్డూ నెయ్యి మీద అనవసర ఆరోపణలు చేసి చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. దీనిపై సమాధానం అడిగితే చెప్పరు. తిప్పిపంపిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ ఎందుకు వాడారని అడిగితే సమాధానం లేదు. పాల ధర 2 రూపాయలు పెరిగితే నెయ్యి ధర 250 రూపాయలు ఎక్కడైనా పెరుగుతుందా చెప్పాలి. హెరిటేజ్, ఇందాపూర్ బంధాన్ని మా సభ్యులు బయటపెడితే సమాధానం చెప్పలేకపోయారు. ఈవోను ఎందుకు మార్చారంటే చెప్పరు. చర్చ జరగడం ఇష్టం లేదు కాబట్టే మిమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారుఆధారాలు బయటపడే సరికి అడ్డుకునే యత్నం: ఎంవీ రామచంద్రారెడ్డిబడ్జెట్ సమావేశాలు పెట్టినప్పటి నుంచీ చంద్రబాబు లడ్డూపైన చేసిన వ్యాఖ్యలపై చర్చ అడుగుతుంటే ఇవాళ స్వల్ప చర్చకు అనుమతించారు. ఇవాళ హెరిటేజ్, ఇందాపూర్ బంధంపై మా సభ్యులు ఆధారాలు బయటపెడుతుంటే మంత్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రంలో పాలతో పాటు అన్నీ కల్తీ అవుతున్నాయి. వీటిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు ఎక్కడున్నారు. సభలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా పూజించే శ్రీవారి జోలికి రావొద్దని, మీ తప్పులకు పశ్చాత్తాపం చెందాలని అధికారపక్షాన్ని కోరాం.ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయి: కల్పలతారెడ్డిలడ్డూ నెయ్యిపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలనే వాయిదా తీర్మానాలు ఇచ్చాం. ఎట్టకేలకు చర్చకు ఒప్పుకున్నా వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడకుండా అడ్డుపడ్డారు. తిరుమల లడ్డూ కల్తీపై వాళ్లు చేసిన తప్పుడు ఆరోపణలకు ఎక్కడ కౌంటర్ ఇస్తామో అని భయపడి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా మా సభ్యులు మాత్రం ఆధారాలతో అన్ని విషయాలు బయటపెట్టారు. ప్రజలకు ఈ విషయాలు తెలిసేలా చేశారు. మంత్రుల తీరునూ ప్రజలు గమనించారు.ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు: మొండితోక అరుణ్కుమార్ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ఈ ప్రభుత్వం బిచ్చగాళ్లుగా మార్చింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఈ ప్రభుత్వం మోసం చేసింది. టీడీపీ కండువా కప్పుకున్న వారికి 40%, సానుభూతి పరులకు 20% మాత్రమే ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఇన్సెంటివ్లు ఇవ్వాలంటే టీడీపీ ఎమ్మెల్యేల సంతకాలు కావాలని వేధించిన ప్రభుత్వం ఇది. తమకు న్యాయం చేయండని ధర్నా చేసినందుకు లాఠీఛార్జి చేశారు. టీడీపీ బడా నేతల కంపెనీలకు ఇన్సెంటివ్లు ఇస్తారు. కానీ ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు.సుమారు 500 మంది నారా లోకేష్ను కలవడానికి వస్తే కుదరదన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను కలిసేందుకు కేవలం ఐదుగురికే అనుమతిచ్చారు. ఎంఎస్ఎంఈలపై మండలిలో మా ప్రశ్నకు మంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మంత్రిపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. కోర్టుకు వెళతాం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు మేం అండగా ఉంటాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇన్సెంటివ్లు విడుదల చేయాలి. -
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: మండలి ఛైర్మన్పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మండలి ఛైర్మన్ను క్రిస్టియన్ అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నన్ను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరు?’’ అంటూ మండిపడ్డ మండలి ఛైర్మన్.. తాను క్రిస్టియన్ కాదని స్పష్టం చేశారు. తాను హిందువునని.. క్రిస్టియన్ కాదని మండలి ఛైర్మన్ తెలిపారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. బాబూ.. మీ మంత్రులకు ఇదేనా నేర్పింది?: బొమ్మి ఇజ్రాయెల్శాసనమండలి మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మాట్లాడుతూ.. కులాల మధ్య కుంపటి పెట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు బాటలోనే మంత్రులు నడుస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘సభ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు.. ఛైర్మన్ను అవమానించారు. ఛైర్మన్ దళితుడనే కారణంతో ఆయన్ని అవమానించారు. మీ నాయకుడు, మీ ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ మంత్రి అవమానించారు. అయ్యా చంద్రబాబు.. మీ మంత్రులకు ఇదేనా మీరు నేర్పింది?..దళితులు, క్రిస్టియన్ల పట్ల మీకెందుకు అంత వివక్ష. లోకేష్ సమక్షంలోనే అచ్చెన్నాయుడు మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడితో లోకేష్ ఇలా మాట్లాడించారా?. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు క్రిస్టియన్లకు క్షమాపణ చెప్పాలి. హెరిటేజ్, ఇందాపూర్, సంఘం డెయిరీలు, వైష్ణవి కంపెనీలను కాపాడుకోవడానికే మీ ప్రయత్నం. కచ్చితంగా దేవుడే మీకు బుద్ధి చెబుతాడు. తిరుమల లడ్డూపై చర్చకు రావాలని మేం వారం రోజుల నుంచి కోరుతున్నాం. చర్చకు రాకుండా పారిపోతున్నారు. ఈరోజుకి ఎట్టకేలకు చర్చకు అంగీకరించారు. చర్చకు పదే పదే మంత్రులు అడ్డుపడ్డారు’’ అంటూ బొమ్మి ఇజ్రాయెల్ మండిపడ్డారు. -
చిన్నారులకు వైఎస్ జగన్ అన్నప్రాసన
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల కోరిక మేరకు ఇద్దరు చిన్నారులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నప్రాసన చేశారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట 18వ వార్డు మెంబర్ చిట్లూరి వెంకటేష్, లక్ష్మీ చంద్రిక దంపతులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు.వారి విజ్ఞప్తి మేరకు వారి కుమారుడు ఆర్యన్కు వైఎస్ జగన్ అన్నప్రాసన చేసి, ఆశీస్సులు అందజేశారు. అలాగే నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా విభాగం కార్యదర్శి శ్రావ్య రెడ్డి, జీవన్ రెడ్డి దంపతుల కోరిక మేరకు వారి కుమారుడు శ్రియాన్ రెడ్డికి వైఎస్ జగన్ అన్నప్రాసన చేసి, ఆశీస్సులు అందజేశారు. దీంతో ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
హామీలు అమలు చేయమంటే అంగన్వాడీలపై దౌర్జన్యమా!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని శాంతియుత నిరసన తెలిపిన అంగన్వాడీలను ప్రభుత్వం దౌర్జన్యంగా పోలీసులతో అరెస్టులు చేయించడాన్ని వైఎస్సార్టీయూసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. విజయవాడలో అంగన్వాడీలను పాశవికంగా అరెస్టు చేయడాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కాల్వపల్లి చిన్నమ్మ, ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళ తప్పుబట్టారు.ఈ మేరకు మంగళవారం ప్రకటన చేస్తూ.. అంగన్వాడీ మహిళల పట్ల మగ పోలీసులు అమానవీయంగా వ్యవహరించిన తీరుపై హోంమంత్రిగా ఉన్న మహిళ సమాధానం చెప్పాలన్నారు. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు మహిళల ఆగ్రహానికి గురయ్యారన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనను అణచివేసేందుకు ప్రయత్నించి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరుఅంగన్వాడీ మహిళల అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంగన్వాడీ యూనియన్ నేతలు హెచ్చరించారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ యూనియన్ల నాయకులు లక్ష్మీదేవి. జైని, రత్నకుమారి, లలితమ్మ, సుజాత తదితరులు విజయవాడలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీలు నిద్రమత్తులో ఉండగా ప్రభుత్వం దుర్మార్గంగా అక్రమ అరెస్టులకు పాల్పడిందన్నారు.అరెస్టు చేసిన వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి అంగన్వాడీలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్లో పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అలాగే, శాంతియుతంగా ధర్నా చేసిన అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించాయి. అంగన్వాడీలు నిద్రిస్తుండగా తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డాయి. -
వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డీనేటర్స్ నియామకం
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని ఆ పార్టీ రీజినల్ కో–ఆర్డీనేటర్స్గా నియమించారు.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బూడి ముత్యాలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం జాబితా విడుదల చేసింది. -
భూ దాహం తీరనిది!
సాక్షి, అమరావతి: ఇప్పటికే 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణ పనులను చేపట్టిన ప్రభుత్వం.. రెండో దశలో 50 గ్రామాల పరిధిలో 1,75,347.43 ఎకరాల్లో (709.57 చదరపు కిలోమీటర్లు) రాజధానిని విస్తరించడానికి ‘మాస్టర్ ప్లాన్’ రూపకల్పనకు ఫిబ్రవరి 16న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో బిడ్ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది. అదే రోజున సాంకేతిక, గురువారం ఆర్థిక బిడ్ను తెరిచి అర్హత సాధించే కన్సల్టెన్సీకి మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలు అప్పగించనుంది. తొలి దశ, రెండో దశ కలుపుకుంటే మొత్తం 926.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి వందేళ్ల సమయం పట్టొచ్చునని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ లెక్కన 1.75 లక్షల ఎకరాల్లో రాజధాని విస్తరణకు ఇంకెన్ని వందల ఏళ్లు పడుతుందని సామాజిక, ఆర్థిక వేత్తలు, సిటీ ప్లానర్లు నిలదీస్తున్నారు. దేశంలో మహా నగరాలైన గ్రేటర్ హైదరాబాద్ 650 కి.మీ, గ్రేటర్ చెన్నై 438, బృహత్ బెంగళూరు 741, గ్రేటర్ ముంబై విస్తరించింది 603.4 చదరపు కిలోమీటర్లలోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఆ మహా నగరాలను ఎవరూ నిర్మించలేదని, వాటంతట అవే మహా నగరాలుగా అభివృద్ధి చెందాయని స్పష్టం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు రూ.47,438 కోట్లు అప్పు తెచ్చారని.. నగర నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.లక్షల కోట్ల అప్పు తేవాల్సి ఉంటుందని.. ఇది రాష్ట్రాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమరావతి రాజధాని 2,29,095.43 ఎకరాల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 11 ఏళ్లుగా ప్రాథమిక దశను దాటని రాజధాని ⇒ రాజధానిపై ముందే వందిమాగధులు, బినామీలకు లీకులు ఇచ్చి, ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి కారుచౌకగా భూములు కాజేసిన తర్వాత 2015లో గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ⇒ ఇందులో ప్రభుత్వ, అటవీ భూమి పోనూ 34,390 ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సమీకరించింది. పల్లపు ప్రాంతం.. కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రభావిత ప్రాంతమైన ఆ భూమిలో రాజధాని నిర్మించడానికి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరం అవుతుందంటూ అప్పట్లో కేంద్రానికి సీఎం చంద్రబాబు డీపీఆర్ సమర్పించారు. ⇒ కానీ.. 11 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. 2014–19 మధ్య రాజధాని నిర్మాణానికి రూ.5,500 కోట్లు వ్యయం చేసినా, శాశ్వత నిర్మాణం ఒక్కటంటే ఒక్కటీ కట్టలేదు. తాత్కాలిక నిర్మాణాల ముసుగులో కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకున్నారని.. షాపూర్జీ పల్లోంజీ నుంచి సీఎం వ్యక్తిగత కార్యదర్శి కమీషన్లు తీసుకుని, ఐటీ శాఖకు పట్టుబడటాన్ని బట్టి చూస్తే రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సర్కార్కు అప్పట్లో ఎంత చిత్తశుద్ధి ఉందన్నది స్పష్టమవుతోందని ఆర్థిక నిపుణులు ఎత్తిచూపుతున్నారు. ⇒ 2024 జూన్ 12న మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అధికారంలోకి వచ్చి ఇప్పటికే 21 నెలలు పూర్తయింది. రాజధాని నిర్మాణ పనుల కోసం రూ.47,387 కోట్లు అప్పు తెచ్చి.. సుమారు రూ.60 వేల కోట్ల అంచనాతో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ.. పనుల పురోగతిని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు సాగడం లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. తొలి విడత సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని, ఆ పదేళ్లు కౌలు చెల్లిస్తామని సీఆర్డీఏ చట్టం ద్వారా హామీ ఇచ్చారు. కానీ.. ఆ మేరకు హామీ అమలు చేయలేదు. దాంతో రైతులకు కౌలు చెల్లింపును మరో ఐదేళ్లు పొడిగించారు.పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రం ⇒ రాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి ప్రభుత్వం డీపీఆర్లు పంపింది. గతేడాది ఏప్రిల్ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు.⇒ ప్రస్తుత ధరల ప్రకారం 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ⇒ ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందల ఏళ్లు పడతాయి? ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది? ఇంకెన్ని రూ.లక్షల కోట్ల అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులతో పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తొలి విడతకు మూడింతలు.. ⇒ రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే చిన్న మున్సిపాలిటీగా మిగిలి పోతుందని, భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకోసం రెండో విడత భూ సమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసి చెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు.. వెరసి ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల్లో (82.9 చదరపు కిలోమీటర్లు) భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ⇒ వాటితోపాటు గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడికొండ మండలాలు, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లోని 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ⇒ ఇందులో ఏడు గ్రామాల్లోని 20,494 ఎకరాలను తొలుత భూ సమీకరణ చేసి.. ఆ తర్వాత అవసరమైనప్పుడు మిగతా భూమిని విడతల వారీగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా రాజధానిని ఆనుకుని ఉత్తరాన కృష్ణా నది నుంచి దక్షిణాన అవుటర్ రింగ్ రోడ్డు వరకు.. తూర్పున చెన్నై–కోల్కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతంలో రాజధాని విస్తరణకు మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ⇒ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు 6 నెలలు గడువుగా నిర్దేశించింది. తొలుత భూ సమీకరణ చేస్తున్న ఏడు గ్రామాల్లో వివరణాత్మక ప్రణాళిక.. ఆ తర్వాత మిగిలిన 43 గ్రామాల్లో రాజధాని విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. రహదారులు, వరద నీటి నియంత్రణ, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పన.. ఆ పనులకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం.. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించగా సీఆర్డీఏకు మిగిలే భూమిని విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్ డెవలప్మెంట్ వంటి నమునాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ వంటి మార్గాలను అన్వేషిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. -
ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్– ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్–2026ను వచ్చేనెల 25న నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చెల్లించి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులను https://polycetap.ap.gov. in లో సమర్పించవచ్చు. -
స్వదేశంలోనే విదేశీ విద్య
సాక్షి, అమరావతి: భారతీయ విద్యార్థులకు స్వదేశంలోనే విదేశీ విద్య అందుబాటులోకి వస్తోంది. ప్రపంచ యూనివర్సిటీలు భారత్ బాట పడుతున్నాయి. విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లకు అనువైన ఎంపికగా భారత్ మారుతోంది. 2040 నాటికి 5.60 లక్షల మందికి పైగా విద్యార్థులకు మన దేశంలో ఏర్పాటయ్యే విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లు సేవలందిస్తాయని డెలాయిట్ ఇండియా, నైట్ఫ్రాంక్సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. అలాగే ఏకంగా 113 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని తెలిపింది. 40 భారతీయ నగరాలకు సామర్థ్యం.. విదేశీ వర్సిటీలకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం 40 భారతీయ నగరాలకు ఉందని నివేదిక స్పష్టం చేసింది. వీటిలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై టాప్లో ఉన్నాయి. ఇక్కడ పరిశోధనకు అనువైన వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల రాకకు అనుకూలంగా ఉండటం, మౌలికవసతులు, పరిశ్రమ–విద్య అనుసంధానం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అడ్డంకులను అధిగమిస్తూ.. అధ్యయనం ప్రకారం.. ఉన్నత విద్య చదివే వయసున్న యువత కలిగిన దేశంగా భారత్ టాప్లో ఉంది. ప్రస్తుతం దేశంలో 15.50 కోట్ల మంది ఉన్నత కళాశాలల స్థాయి యువత ఉండగా.. 2030 నాటికి వారి సంఖ్య 16.50 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో 2035 నాటికి విద్యార్థుల స్థూల నమోదును ప్రస్తుత స్థాయి నుంచి 50 శాతానికిపెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు దేశీయ ఉన్నత విద్య సామర్థ్యం సరిపోవట్లేదని భావించిన విద్యార్థులు అమెరికా, యూకే, కెనడా, ఆ్రస్టేలియా తదితర దేశాలు వెళ్తుండేవారు. మారిన పరిస్థితుల్లో ఆయా దేశాలు వీసా నియమాలను కఠినతరం చేస్తుండడంతో భారత విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా పెరుగుతున్న ఖర్చులు కూడా వారికి అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్లోనే తమ క్యాంపస్ల ఏర్పాటుకు ప్రపంచ వర్సిటీలు ముందుకొస్తున్నాయి. విదేశీ వర్సిటీల ఏర్పాటుకు వెసులుబాటు..నూతన విద్యా విధానం తర్వాత దేశంలో ఉన్నత విద్యాసంస్థలను స్థాపించాలనుకునే విదేశీ వర్సిటీలకు వెసులుబాటు లభించింది. విదేశీ వర్సిటీల ఆఫ్షోర్ క్యాంపస్లు, జాయింట్ వెంచర్లు, ట్రాన్స్నేషనల్ ఎడ్యుకేషన్ మోడల్స్ ద్వారా భారత్లో స్వతంత్రంగా పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం బహుళ మార్గాలను కల్పించింది. వీటిలో పన్ను ప్రోత్సాహకాలు, సింగిల్ విండో క్లియరెన్స్ తదితరాలున్నాయి.ఫలితంగా 18 విదేశీ యూనివర్సిటీలు భారత్లో తమ క్యాంపస్ల ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం పొందాయి. ఇందులో ఆ్రస్టేలియాకు చెందిన డీకిన్, వోలోన్గాంగ్ వర్సిటీలు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ(గిఫ్ట్సిటీ)లో, యూకేకు చెందిన సౌతాంప్టన్ వర్సిటీ గురుగ్రామ్లో తమ క్యాంపస్లు ప్రారంభించాయి. -
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల మూత
కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం ముక్కంటి ఆలయం, సింహాచలం అప్పన్న ఆలయాలు పూజల అనంతరం మూసివేశారు. గ్రహణానంతర శుద్ధి కార్యక్రమాల తరువాత తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాత్రి 8.30 గంటలకు తెరిచారు. మరికొన్ని ఆలయాలు బుధవారం ఉదయం తెరిచి శుద్ధి, సంప్రోక్షణ, పూజాధికాల అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. – తిరుమల/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/సింహాచలం/శ్రీశైలం టెంపుల్తిరుమల శ్రీవారి ఆలయం చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ మూసివేశారు. గ్రహణానంతర శుద్ధి కార్యక్రమాల అనంతరం రాత్రి 8 గంటలకు ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. అన్నప్రసాద సముదాయం, లడ్డూ కౌంటర్లు కూడా రాత్రి 8.30 గంటల నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహణ ఇదిలా ఉండగా, మంగళవారం సాయంత్రం కొంతమంది భక్తులు కుమారధార తీర్థం ముక్కోటిని ఆచరించారు. అయితే చంద్రగ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులు తీర్థంలో పవిత్రస్నానం చేసి మధ్యాహ్వానికే తిరిగి వెళ్లిపోయారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆలయ అర్చకులు అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారాలను కవాట బంధనం చేశారు. బుధవారం తెల్లవారుజామున సంప్రోక్షణ, అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. విశాఖ జిల్లాలోని సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని గ్రహణం కారణంగా మూసిశారు. రాత్రి 7గంటల సమయంలో ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ పూజలు చేశారు. బుధవారం ఉదయం 6.30గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. శ్రీశైలం ఆలయ ద్వారాలు చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూసివేశారు. తిరిగి రాత్రి 7.30గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, తదితర పూజాదికాల తరువాత రాత్రి 9గంటలకు స్వామిఅమ్మవార్ల దర్శనాలను పునఃప్రారంభించారు. గ్రహణ కాలానికి అతీతం.. శ్రీకాళహస్తీశ్వరాలయంశ్రీకాళహస్తి: దేశంలో ఉన్న ఆలయాలు గ్రహణ కాలంలో మూసివేయడం ఆనవాయితీ. అయితే శ్రీకాళహస్తీశ్వరాలయం గ్రహణాలకు అతీతంగా ఉంటుంది. గ్రహణ కాలంలో కూడా ఈ ఆలయం తెరచి ఉంచుతారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. గ్రహణ కాలంలో రాహు–కేతు పూజలు అధిక సంఖ్యలో జరిగాయి. 35వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శివయ్య సేవలో నెలరేడు గ్రహణానంతరం పౌర్ణమి చంద్రుడు శివయ్యను సేవిస్తున్నాడా..? అన్నట్టుగా శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద ఉన్న భక్త కన్నప్పకొండపై గల శివపార్వతుల ముందు దర్శనమిచ్చారు. భక్తులు పున్నమి చంద్రుడ్ని ఫొటోలు తీస్తూ మురిసిపోయారు. -
అంగన్వాడీలపై ఆటవిక దాడి!
2000 జూలై 26..సమైక్యాంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో వేతనాలు పెంచాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న అంగన్వాడీలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమానవీయంగా గుర్రాలతో తొక్కించి, బాష్ప వాయువు ప్రయోగించి, అక్రమ అరెస్టులకు దిగింది.2026 మార్చి 3..విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని విజయవాడలో.. హామీలు నెరవేర్చాలని, వేతనాలు పెంచాలని శాంతియుతంగా నిరసన తెలిపి టెంటులో రోడ్డుపై నిద్రిస్తున్న అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు తెల్లవారుజామున విరుచుకుపడింది. పోలీసులతో ఈడ్చేసి అక్రమంగా అరెస్టులు చేసింది. మహిళల పట్ల చంద్రబాబు మార్కు దౌర్జన్యం, పాతికేళ్లుగా మారని బాబు తీరుకు ఈ రెండు ఘటనలు నిదర్శనం!సాక్షి, అమరావతి, నెట్వర్క్: నమ్మించి నయవంచన చేయడంలో తాను ఏమాత్రం మారలేదని సీఎం చంద్రబాబు అంగన్వాడీల విషయంలో రుజువు చేసుకున్నారు! 2024 ఎన్నికల ముందు వేతనాల పెంపు కోసం ఉద్యమించిన అంగన్వాడీలను కలిసిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని నమ్మబలికారు. అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తానని టీడీపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెట్టారు. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తే తమకు వేతనాలు పెంచుతారని, డిమాండ్లు పరిష్కరిస్తారని అంగన్వాడీలు ఆశ పడ్డారు. కానీ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ చెల్లింపు లాంటి హామీలకు అతీగతీ లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక దఫాలు శాంతియుతంగా నిరసనలు తెలిపిన అంగన్వాడీలను చంద్రబాబు ప్రతిసారీ మభ్యపెడుతూ వచ్చారు. తాజాగా అంగన్వాడీలు ‘ఛలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో వారిని మరోసారి మోసగించేందుకు.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ రెండు రోజుల ముందు మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, బాలవీరాంజనేయులు తదితరులతో ప్రకటనలు గుప్పించారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సోమవారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా పోటెత్తారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు చొరవ చూపని చంద్రబాబు మంత్రి అచ్చెన్నను రంగంలోకి దించి చర్చల పేరుతో మభ్య పెట్టారు. ఈ క్రమంలో అంగన్వాడీ నాయకులకు మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్ చేసి ప్రభుత్వం మంగళవారం రోజు చర్చలకు పిలుస్తుందని సమాచారం ఇచ్చినట్లు యూనియన్ నేతలు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని భావించిన అంగన్వాడీలు రాత్రి ధర్నా టెంట్లోనే రోడ్డుపై నిద్రకు ఉపక్రమించారు. అయితే నమ్మించి దగా చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు తెల్లవారుజామున పోలీసులను ప్రయోగించి అంగన్వాడీలను దౌర్జన్యంగా ఈడ్చేశారు! మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరూ నిద్రిస్తుండగా వందలాది మంది మగ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి అంగన్వాడీ మహిళలను ఈడ్చి పారేసిన తీరు దుశ్శాసన పర్వాన్ని తలపించింది. వారు తేరుకునేలోగా టెంట్లు పడేసి, ప్లెక్సీలు చించేసి, ప్లకార్డులు విసిరేసి, అంతా చిందరవందర చేసిన పోలీసులు కిష్కింధకాండను తలపించారు!!విజయవాడలో తెల్లవారుజామున అంగన్వాడీలను ఈడ్చుకెళ్తున్న పోలీసులు ఉద్యమంపై ఉక్కుపాదం..దుర్వాసన వెదజల్లే డ్రైయిన్.. ముసురుకున్న దోమల నడుమ పట్టు వదలకుండా, నిరసన చేపట్టిన టెంట్లోనే.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు పోలీసులను ప్రయోగించి విరుచుకుపడింది. చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ శాంతియుతంగా ఉద్యమించిన మహిళలపై కర్కశంగా వ్యవహరించింది. విజయవాడలో తెల్లవారుజామున అంగన్వాడీలు నిద్రిస్తున్న టెంట్లలోకి చొరబడిన వందలాది మంది పోలీసులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. అంగన్వాడీలు తేరుకుని ఏం జరుగుతోందో గ్రహించే లోపే మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేసి పోలీసు వ్యాన్లలోకి ఎక్కించేశారు. చుట్టూ రోప్ పార్టీ (తాడుతో వలయం) ఏర్పాటు చేసుకున్న పోలీసులు.. అంగన్వాడీలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా దిగ్బంధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన వారిని కనీసం బ్యాగులు, సెల్ఫోన్లు కూడా తీసుకోనివ్వకుండా నిర్బంధించారు. చేతికి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యాన్లలోకి తోసేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా గెంటేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురు అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమను అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం టాయిలెట్స్కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బరావమ్మ వాపోయారు. అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా ఏలూరులో భారీ ర్యాలీ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు తాము చేసిన తప్పేమిటని సత్తెనపల్లి టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట ఆక్రోశించారు. అరకొర వేతనాలు, అదనపు బాధ్యతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేతనాలు పెంచాలని కోరడం మినహా ఏం నేరం చేశామని నిలదీశారు. పోలీసుల దాడిలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి ఎడమ చేయి విరిగిందని పేర్కొన్నారు. ఈ దుర్మార్గమైన చర్యలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ మహిళలకు ఇచ్చిన గిఫ్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. వేతనాలు పెంచి న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. ఈడ్చేసిన మగ పోలీసులు..టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో యాక్షన్లోకి దిగిన పోలీసులు కేవలం 30 నిమిషాల్లో నిరసన దీక్ష టెంట్ను కకావికలం చేసి అంగన్వాడీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. మగ పోలీసులు అంగన్వాడీ మహిళలను ఇష్టానుసారంగా పట్టుకుని ఈడ్చేసి వ్యాన్ల్లోకి ఎక్కించారు. కనీసం మహిళల వ్యక్తిగత ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా గంటల తరబడి వ్యానుల్లోనే మగ్గిపోవడంతో నరక యాతన ఎదుర్కొన్నారు. విజయవాడ నుంచి పోలీస్ వ్యాన్ల్లో సుమారు 60 నుంచి వంద కిలోమీటర్ల దూరంలోని గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాల్లోని మారుమూల చోట్లకు తరలించి అక్కడ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి చంద్రబాబు మార్కు దౌర్జన్యాన్ని ప్రత్యక్షంగా చూపించారు.నెల్లూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు భగ్గుమన్న మహిళలు..చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొని సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు శాంతియుతంగా నిరసన తెలిపిన అంగన్వాడీలు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున చంద్రబాబు సర్కారు అక్రమ అరెస్టులకు దిగడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారు. అన్ని జిల్లాల్లో రోడ్లపైకి చేరుకుని నిరసన తెలిపారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను తరలించిన సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున బైఠాయించారు. తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో అరెస్టు చేసిన కార్యకర్తలను ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, చాట్రాయి లాంటి మారుమూల ప్రాంతాలకు తరలించగా స్థానిక అంగన్వాడీలు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అణచివేత విధానాలను అనుసరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తీరుకు నిరసనగా విశాఖ కలెక్టరేట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో అంగన్వాడీలు నల్ల బ్యాడీ్జలతో నిరసన తెలిపారు.కర్నూలులో కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్తున్న అంగన్వాడీలు బాబు మారలేదు.. అంగన్వాడీలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులతో కబురు పంపించిన చంద్రబాబు మరోవైపు పోలీసులను ప్రయోగించి అక్రమ అరెస్టులు చేయడం పట్ల సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ యూనియన్ల రాష్ట్ర కీలక నేతలు కె.సుబ్బరావమ్మ, జె.లలిత, వీఆర్ జ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు మారాడనుకున్నామని, అయితే ఆయన ఏమాత్రం మారలేదని రుజువైందన్నారు. దీనికి పర్యవసానం అనుభవించక తప్పదని హెచ్చరించారు. అరెస్టులకు భయపడేది లేదని, జిల్లాల్లో నిరసన ఉద్యమాన్ని కొనసాగించాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. పోలీసుల లాఠీలు, అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈమేరకు మూడు యూనియన్ల నేతలు సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు.‘సాక్షి’ కెమెరా లాక్కున్న పోలీసులుచంద్రబాబు సర్కారు ఆదేశాలతో స్వామి భక్తి ప్రదర్శించిన పోలీసులు రెచ్చిపోయి అంగన్వాడీ మహిళలను అరెస్టు చేస్తున్న దృశ్యాలను ఎవరూ చిత్రీకరించకుండా జాగ్రత్త పడ్డారు. అంగన్వాడీల వద్ద సెల్ఫోన్లు లాక్కున్నారు. పోలీసుల దమనకాండను చిత్రీకరిస్తున్న ‘సాక్షి’ కెమెరామెన్ను దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించి కెమెరా గుంజుకున్నారు. -
హామీలు అమలు చేయాలని అడిగితే తప్పా..?
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై చంద్రబాబు సర్కారు ప్రదర్శించిన దమనకాండ అత్యంత హేయమని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ‘ఛలో విజయవాడ’కు తరలివచ్చిన అంగన్వాడీ మహిళలను నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా అక్రమంగా అరెస్టులు చేయడాన్ని వైఎస్ జగన్ తప్పుబట్టారు. ఈ మేరకు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎక్స్’లో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా? రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ మొక్కూ లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా? అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం. మహిళలని కూడా చూడకుండా వారిపై లాఠీఛార్జీ.. పోలీసుల చేత బలప్రయోగం.. ఎక్కడికక్కడ నిర్బంధం.. వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా? వాళ్లు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే... ఈరోజు ఉదయం చర్చలకు పిలుస్తామని చెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా? ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు ఎగరగొట్టి పచ్చి మోసాలు ఎలా చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. ఒక్క అంగన్వాడీలకే కాదు.. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుగారూ.. మీరు తక్షణం అంగన్వాడీలు, వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని, వారికిచి్చన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా!! -
రాయితీలు ఇవ్వకుంటే ఏపీఐఐసీ స్థలాలకు నగదు చెల్లించలేం
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన రాయితీలు ఇస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) స్థలాలకు నగదు చెల్లించలేమని ఏపీ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అనార్ బాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 1,600 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు జీవో 7 ద్వారా ప్లాట్లు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీకి నగదు చెల్లించేందుకు మరో మూడు నెలలు మాత్రమే గడువు పొడిగించిందని ఆయన పేర్కొన్నారు. మూడు నెలల గడువు ఈ నెల 8తో ముగుస్తున్నందున మరో నాలుగు నెలలపాటు గడువు పెంచాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్కు అనార్ బాబు సోమవారం లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆ లేఖను ముఖ్యమంత్రి, పరిశ్రమలశాఖ మంత్రికి కూడా పంపారు. నిర్దిష్టమైన కారణాల వల్ల జీవో 7 ద్వారా ప్లాట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు నగదు చెల్లించలేకపోతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు రావడం లేదని, సబ్సిడీ నగదు ప్రభుత్వం వద్దనే ఆగిపోవడంతో బ్యాంకులు అదనపు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జీవో 7 పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1600 మంది ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులన్నారని, ఇందులో సగం మందికి నూరు శాతం సబ్సిడీలు రాలేదన్నారు. వారిలోనే ఎక్కువ మంది ఏపీఐఐసీకి నగదు చెల్లించాల్సిన వారు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రావాల్సిన సబ్సిడీ నగదు పరిశ్రమల శాఖ వద్దే ఉన్నందున ఆ నగదును ఏపీఐఐసీకి బదిలీ చేసి సర్దుబాబు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. సబ్సిడీలు వచ్చేంత వరకు మరో నాలుగు నెలలపాటు గడువు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వర్గాలకు జీవో నెంబర్ 7 కింద ఇచి్చన ప్లాట్లను రద్దు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఎస్సీల నుంచి రుణాలను ముక్కుపిండి రికవరీ చేయండి
సాక్షి, అమరావతి: జాతీయ దళిత ఆర్థిక సంస్థ(ఎన్ఎస్ఎఫ్డీసీ), జాతీయ సఫాయి కర్మచారీస్ ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్ఎస్కెఎఫ్డీసీ) పథకాల కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీల స్వయం ఉపాధి కోసం మంజూరు చేసిన రుణాలను వారి నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేకంగా రికవరీ బృందాలను ఏర్పాటు చేసింది. మండల స్థాయిలో రికవరీ బృందాలను ఏర్పాటు చేసి ఆ రుణాలను వసూలు చేయాలని జిల్లా యంత్రాంగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రికవరీ బృందాల పనితీరుపై దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించింది. కొన్ని సంవత్సరాలుగా ఎస్సీల స్వయం ఉపాధి కోసం రూ.396.96 కోట్లను రుణాలుగా మంజూరు చేశారు. ఇందులో ఇప్పటికే రూ.100.68 కోట్లను రికవరీ చేశారు. మిగతా 296.28 కోట్లను వసూలు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా రూ.30.69 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.25.10 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.7.68 కోట్లు ఎక్కువ బకాయిలున్నాయని, వాటిని రాబట్టాలని సూచించింది. ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందితో మండలాల వారీగా రికవరీ బృందాలను ఏర్పా టు చేసి ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు. -
విశాఖ తీర రక్షణకు తూట్లు!
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘమైన తీరప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం పగబట్టింది. అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు అభివృద్ధి పేరుతో తీరాన్ని విచ్చిన్నం చేసేందుకు కుట్ర పన్నుతోంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలను సడలించడం, జోన్లు మార్చడం వంటి చర్యలతో తీరప్రాంత సమతుల్యతను దెబ్బతీస్తోంది. పర్యాటక ముసుగులో న్యాయస్థానాల హెచ్చరికల్ని కూడా బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. కావాల్సిన వారికి ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతోంది. గతంలో పర్యావరణవేత్తలు, ప్రజలు పోరాడి కాపాడుకున్న తీరప్రాంతాలను ఇప్పుడు కమర్షియల్ హబ్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నగరంలోని సాగరతీర ప్రాంతాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వం ఎంతటి మొండివైఖరితో ఉందో అర్థమవుతోంది. తన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్ల కోసం పర్యావరణ అనుమతులను సైతం వేగవంతం చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాలను పక్కనపెట్టి అడ్జస్ట్మెంట్లతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. భీమిలి తీరంలో సీఆర్జెడ్ మాయాజాలం విశాఖ–భీమిలి తీరప్రాంతంలో సీఆర్జెడ్ జోన్ల మారి్పడి (రీక్లాసిఫికేషన్)పై చంద్రబాబు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం.. సీఆర్జెడ్–3 కేటగిరీలో ఉన్న ప్రాంతాలు తక్కువ నిర్మాణాలు కలిగి, ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. సముద్రమట్టం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. ఇక్కడి ఇసుకదిబ్బలు, చిత్తడినేలలు వంటివి అలల తాకిడిని, తుపాన్లను అడ్డుకునే సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. సీఆర్జెడ్–2 కేటగిరీలో సముద్రతీరానికి అత్యంత సమీపంలో భారీ కాంక్రీట్ కట్టడాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవచ్చు.విశాఖ–భీమిలి బీచ్ వెంబడి సీఆర్జెడ్–3 పరిధిలో 500 ఎకరాలకుపైగా భూములున్నాయి. వీటిలో భారీ కాంక్రీట్ నిర్మాణాలకు వీలులేదు. ఇప్పుడు ఈ భూముల్ని సీఆర్జెడ్–2 పరిధిలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. ఈ భూముల్లో మెజారిటీ వాటా ప్రభుత్వ నేతలదే కావడంతో.. మార్పిడి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విశాఖని గ్లోబల్ సిటీగా మారుస్తామనే సాకుతో తీరప్రాంత మాస్టర్ప్లాన్పై సమీక్షలు మొదలుపెట్టారు. 2024 అక్టోబర్–డిసెంబర్ మధ్య మాస్టర్ప్లాన్ సవరణల పేరుతో అంతర్గత కసరత్తు జరిగింది. ఆ సమయంలోనే సీఆర్జెడ్–3లోని భూముల్ని సీఆర్జెడ్–2 కిందకు చేర్చి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపించి మార్పులు చేసెయ్యాలని ప్రభుత్వం ఆరాటపడిపోతోంది. పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అన్న మంత్రి దుర్గేష్ నిబంధనల్ని పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు అభివృద్ధికి అవే అడ్డంకి అనటం ఆందోళన కలిగిస్తోంది. పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో మాట్లాడుతూ పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అంటూ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కూడా అసెంబ్లీలో నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి కోసం కాకుండా.. బీచ్రోడ్డుని సీఆర్జెడ్–2లోకి తీసుకురావాలని కోరారు. పర్యావరణ కంటే.. ప్రాఫిట్ ముఖ్యంవీటిని పరిశీలిస్తే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కంటే ప్రాఫిట్కే పెద్దపీట వేస్తోందని స్పష్టమవుతోంది. ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటే.. నగరంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. తీరంలో ఇసుక దిబ్బలు, ఖాళీ ప్రదేశాలు సహజ సిద్ధమైన బఫర్ జోన్లుగా పనిచేసి ఉప్పెనలు, తుపాన్ల తీవ్రతను తగ్గిస్తాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వాణిజ్య విస్తరణకు తెరతీస్తే.. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకు విశాఖను బలి చేయడమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ విధ్వంసాన్ని మాత్రమే కోరుకుంటోంది తప్ప.. అభివృద్ధిని కాదంటూ పర్యావరణవేత్తలు, కూటమి పారీ్టల ప్రతినిధులే సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆత్మహత్యా సదృశ్యమే.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ముప్పు పొంచి ఉన్న తరుణంలో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఓవైపు గ్రేట్ గ్రీన్వాల్ వంటి కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు పర్యాటకశాఖ దానికి విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయం. కేవలం రూ.4,098 కోట్ల పెట్టుబడులు, 2,800 హోటల్ గదులు వంటి తాత్కాలిక ఆరి్థక ప్రయోజనాల కోసం, శాశ్వత పర్యావరణ రక్షణ కవచాలైన సీఆర్జెడ్–3 నిబంధనలను సడలించి తీరాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చాలని చూడటం ఆత్మహత్యా సదృశ్యమే. ఇప్పటికే జీవీఎంసీ, ఏపీపీసీబీ పర్యవేక్షణ లోపంతో సముద్రజలాలు కలుషితమవుతున్నాయి. ఇప్పుడు అదనపు కట్టడాలకు అనుమతినిస్తే విశాఖ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అభివృద్ధి అంటే ప్రకృతిని ధ్వంసం చేయడంకాదు, భావితరాలకు సురక్షితమైన తీరాన్ని అందించడమే. ప్రభుత్వం సీఆర్జెడ్ పునర్వర్గీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. – బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన ప్రతినిధి, పర్యావరణవేత్త తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది విశాఖపట్నం తీరప్రాంతంలో సీఆర్జెడ్–3 నిబంధనలను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండటం గర్హనీయం. కేవలం పర్యాటక అభివృద్ధి, వాణిజ్య విస్తరణ పేరుతో చేస్తున్న ఈ మార్పువల్ల సాగరతీరంలోని ఇసుక దిబ్బలు, చిత్తడి నేలలు వంటి సహజ రక్షణ కవచాలు ధ్వంసమైపోతాయి. భవిష్యత్తులో తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది. ప్రభుత్వం తాత్కాలిక లాభాల కోసం మత్స్యకారుల జీవనోపాధిని పణంగా పెడుతోంది. ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న విశాఖకు ఇది మరో పెద్దదెబ్బ. చట్టబద్ధమైన పర్యావరణ రక్షణలను అడ్డంకులుగా చూడటం బాధ్యతారాహిత్యం. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందే. – వై.రాజే‹Ù, వీఎస్ కృష్ణ, మానవహక్కుల ఫోరం ప్రతినిధులు -
2, 3 రోజుల్లో ‘పది’ హాల్టికెట్ల విడుదల
సాక్షి, అమరావతి : పదో తరగతి పబ్లిక్ పరీక్షల(ఎస్ఎస్సీ–2026) హాల్టికెట్లను రెండు, మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ నెల 16 నుంచి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గురు, లేదా శుక్రవారం హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. -
ఈ నెలంతా సెలవుల్లేవు!
సాక్షి, అమరావతి: ఇంటి పన్ను, ఆస్తి పన్ను వసూళ్ల నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈనెలలో సెలవులు రద్దుచేస్తూ రాష్ట్రంలో పలుచోట్ల అధికారులు ఆదేశాలు జారీచేశారు. సర్వేలు, పన్నుల వసూళ్ల టార్గెట్ కారణంగా పని ఒత్తిడి పెరిగి ఇప్పటికే పెద్ద సంఖ్యలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు చనిపోతున్నారని ఉద్యోగ సంఘం నేతలు ఆందోళన చెందుతుండగా.. తాజాగా ఈ నెలంతా సెలవుల రద్దు ఆదేశాల జారీపై వారు మండిపడుతున్నారు.విజయవాడ కార్పొరేషన్ అధికారులు సోమవారం ‘ప్రస్తుత ఆరి్థక సంవత్సరం ఈనెల 31తో ముగుస్తున్నందున వార్డు ఆడ్మిన్ సెక్రటరీలు, నగర కార్పొరేషన్ రెవెన్యూ విభాగంలో పనిచేసే ఔట్ డోర్, ఇన్డోర్ సిబ్బంది, క్యాష్ కౌంటర్ల వద్ద పనిచేసే సిబ్బంది అందరూ 3వ తేదీ (మంగళవారం–హోలీ సెలవు) నుంచి ఈ నెలాఖరు వరకు సెలవు రోజులతో సహా అన్ని రోజులు పనిచేయాలి’.. అంటూ ఆదేశాలు జారీచేశారు.రాష్ట్రంలో ఇంకా చాలాచోట్ల కార్యదర్శులకు ఇలాంటి ఆదేశాలు మౌఖికంగా జారీ అయినట్లు ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. మార్చిలోనే హోలీ, ఉగాది, శ్రీరామ నవమి, రంజాన్ వంటి పండుగలతో పాటు ఆది, శనివారాలు కలిపి దాదాపు 10 రోజులు అధికారిక సెలవులు ఉండగా.. పండుగ రోజుల్లో సైతం సెలవులు రద్దుచేయడాన్ని ఉద్యోగ సంఘ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. -
రూ.6,000 కోట్లు ఔట్.. ‘పారి’.. శ్రమ!
సాక్షి, అమరావతి: ‘‘మీ కప్పాలు కట్టలేం.. మీ బెదిరింపులు భరించలేం.. మీ భూములు వద్దు.. మీకో దండం..!’’ అంటూ పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలేసి పారిపోతున్నాయి! రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని తీసుకోకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ముఖంమీదే విసిరి కొట్టి పారిశ్రామికవేత్తలు పరుగులు తీస్తున్నారు! చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములను సైతం వెనక్కి ఇచ్చేసి వెళ్లిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తోందో ఊహించవచ్చని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తాజాగా పలు కంపెనీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు ఇచ్చిన జీవోలే దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరిన హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి టీడీపీ కూటమి సర్కారు వచ్చాక ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన అజాద్ ఇండియా మొబిలిటీ, జ్యూపిటర్ రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్, జిన్ఫ్రా ప్రెసిషన్స్ వరకు ఒకేసారి నాలుగు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో మన రాష్ట్రం ఏకంగా రూ.6,096 కోట్ల విలువైన పెట్టుబడులను కోల్పోయిందని స్పష్టం చేస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరిట పారిశ్రామికవేత్తలను బెదిరించడం.. తాము చెప్పినంత కప్పం కట్టకుంటే యూనిట్లను పనిచేయనివ్వకుండా అడ్డుకుంటూ ఏపీ అంటేనే భయపడే పరిస్థితిని కల్పించారని పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వస్తూనే రెడ్బుక్ రాజ్యాంగానికి పని కల్పిస్తూ పారిశ్రామికవేత్తలపై తప్పుడు కేసులు, కథనాలు ప్రచురిస్తూ జిందాల్, అదానీలపై తమ అనుకూల పత్రికలు, ఎల్లో మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం కథనాలను ప్రచారం చేసిందని గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూపు నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణ పనులను తమకు కమీషన్లు ఇవ్వకుండా ఎలా మొదలు పెడతారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు సంస్థ కార్యాలయంపై రాళ్ల దాడి చేసి యంత్ర సామాగ్రిని ధ్వంసం చేయడంతోపాటు సిబ్బందిని గాయపర్చారు. ఇక అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతలు ఎంతగా బరితెగించారో వేరే చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా లాంటి కంపెనీలైతే కూటమి నేతల వసూళ్లపై నేరుగా కేంద్రానికే ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతోందని పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ‘సీమ’ దాకా సేమ్ సీన్..శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు బృందం యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ యాజమాన్యాన్ని ఒక్కో లారీకి రూ.వెయ్యి చొప్పున నెలకు సుమారు రూ.1.50 కోట్లు కప్పం కట్టాలని డిమాండ్ చేసింది. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ మామూళ్లు ఇవ్వాలని బెదిరింపులకు దిగడంతో కోకోకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలో సిమెంట్ కంపెనీలు మామూళ్లు, వాటాలు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు ముడిసరుకు రవాణా, సిమెంట్ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తరలించే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బహిరంగా బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. ఆరీ్టపీఎస్ బూడిద తరలింపు కాంట్రాక్టు తమకు కావాలంటే తమకు కావాలంటూ కొట్టుకోవడంతో ఈ పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై అదేపార్టీకి చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో ఇండియా సిమెంట్స్ బూడిద, మట్టి సరఫరా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు బీజేపీకి చెందిన ఎంపీ అదే పారీ్టకి చెందిన ఎమ్మెల్యేపై ఎస్పీకి ఫిర్యాదు చేశారంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. బైబై చెప్పేసిన కోకోకోలా.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద రూ.1,200 కోట్లతో శీతల పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటుకు హిందుస్థాన్ కోకోకోలా కంపెనీ 2023 మే 4న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గత ప్రభుత్వం దీన్ని పరిశీలించి 50.04 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు పలు రాయితీలను ప్రకటిస్తూ 2024 ఫిబ్రవరి 7న ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం కూటమి నేతల కప్పాల వసూళ్లతో జంకిన కోకోకోలా పెట్టుబడుల ప్రతిపాదనను ఉపసంహరించుకొని తెలంగాణకు తరలిపోయింది. తమకు కేటాయించిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని, తమ కంపెనీ పేరిట భూ సమీకరణ చేయవద్దని మొర పెట్టుకుంటూ కోకోకోలా కంపెనీ లేఖ రాసింది. 2026 ఫిబ్రవరి 27న కోకోకోలాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. తొలి ఒప్పందానికే దిక్కులేదు.. బాబు సర్కారు అధికారం చేపట్టిన తరువాత 2024 నవంబర్ 19న పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తొలి సమావేశం జరిగింది. రూ.85,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటిలో ఒక్క ఎలీజీ ఎల్రక్టానిక్స్ మినహా మరే ప్రాజెక్టు ఇంతవరకు పట్టాలు ఎక్కకపోగా ఆమోదం పొందిన ప్రతిపాదనలు సైతం వెనక్కి వెళ్లిపోయాయి. వడ్డీతో సహా ‘ఆజాద్’ వసూలు..! శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.1,046 కోట్ల పెట్టుబడితో 2,381 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. కానీ ఇప్పుడు ఆజాద్ మొబిలిటీ పెట్టుబడుల ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోవడమే కాకుండా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో 2026 ఫిబ్రవరి 18న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఆజాద్ మొబిలిటీకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈఎండీ కింద అజాద్ మొబిలిటీ చెల్లించిన రూ.2.51 కోట్లు 2024 ఆగస్టు 30 నుంచి వడ్డీతో సహా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది.జిన్ఫ్రా.. పరుగో పరుగు! రాష్ట్రంలో రూ.1,150 కోట్లతో 155 ఎంఎం ఆర్టిలరీ గన్స్లో ఉపయోగించే బైమాడ్యులర్ చార్జ్ సిస్టమ్స్తో పాటు ట్రిపుల్ బేస్ ప్రొపెలెంట్, సింగిల్ బేస్ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామంటూ జిన్ఫ్రా ప్రెసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదన సమర్పించింది. ఎస్ఐపీబీ 7వ సమావేశంలో కూటమి సర్కారు దీన్ని ఆమోదించింది. అనంతపురం జిల్లా తమ్మి సముద్రంలో ఎకరా రూ.8.3 లక్షలు చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ 2025 జూన్ 27న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు ఈ కంపెనీ రాష్ట్రంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగంతో బెంబేలెత్తి వెనక్కి వెళ్లిపోయింది. తమకు కేటాయించిన భూములను రద్దు చేయాలంటూ లేఖ రాసింది. దీంతో జిన్ఫ్రాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ 2026 ఫిబ్రవరి 27న పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు ఇచ్చారు. కంపెనీ విజ్ఞప్తి మేరకు భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాల్కో మిథాని యూనిట్ ప్యాకప్...!కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటూ రాష్ట్రానికి కొత్త పీఎస్యూ ప్రాజెక్టులను తేకపోగా గతంలో ఏపీకి వచ్చిన వాటిని కూడా చంద్రబాబు సర్కారు వెళ్లగొడుతోంది. రెండు కేంద్ర ప్రభుత్వ రంగ కీలక సంస్థలు నాల్కో, మిథాని కలిసి నెల్లూరు జిల్లాలో రూ.5,500 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ నెలకొల్పేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నాల్కో ప్రకటించింది. 2024–25 వార్షిక నివేదికలో ఈ ప్రాజెక్టు గురించి నాల్కో స్పష్టంగా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీ కూటమి పెద్దలు దీనిపై కనీసం స్పందించకపోవడం పట్ల అధికారులు విస్తుపోతున్నారు. ప్రైవేటు కంపెనీలకు సొంత ఇనుప గనులను కేటాయించేందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్న రాష్ట్ర మంతులు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు ఏపీ నుంచి వెనక్కు వెళ్లిపోతున్నా పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జారుకున్న ‘జూపిటర్..’ అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,700 కోట్ల పెట్టుబడితో 2,216 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనకు ఎస్ఐపీబీ 6వ సమావేశంలో ఆమోదం లభించింది. 4.8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్, 1.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు 142 ఎకరాలను కేటాయిస్తూ 2025 మే 23న జీవో ఎంఎస్ నెంబర్ 85 జారీ అయింది. ఎకరం కేవలం రూ.50 లక్షల చొప్పున రాయితీ ధరకు భూమిని కేటాయించారు. కానీ ఏడాది తిరగకుండా ఆ భూములు తమకొద్దని.. రూపాయి కూడా చెల్లించేది లేదని జూపిటర్ కుండబద్ధలు కొట్టింది. తమ పేరు మీద భూ కేటాయింపులను రద్దు చేయాలని కోరింది. దీంతో జూపిటర్కు కేటాయించిన 142 ఎకరాలను రద్దు చేస్తూ ఫిబ్రవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. -
నిర్బంధాల కంచె దాటి.. అంగన్వాడీ ఉద్యమవేడి
పోలీసులను ప్రయోగించి అంగన్వాడీ యూనియన్ నేతలను చంద్రబాబు ప్రభుత్వం గృహాల్లోనే నిర్బంధించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను పిలిచి మరీ విజయవాడ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ‘ఎక్కువ మంది వెళ్తే ఊరుకునేది లేదు.. తప్పదనుకుంటే నలుగురైదుగురు వెళ్లండి’ అంటూ ఐసీడీఎస్ అధికారులు ఆంక్షలు పెట్టారు. అయినా నిర్బంధాల కంచెను పెకలించుకుని అంగన్వాడీలు పోరుబాట పట్టి.. న్యాయం కోసం నినాదాల పొలికేక పెట్టారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా చంటి బిడ్డలను చంకనెత్తుకుని కొందరు.. చేతి సంచిలో అన్నం క్యారేజీలు పెట్టుకుని మరికొందరు విజయవాడ తరలివచ్చి నిరసన గళమెత్తారు. సాక్షి, అమరావతి: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఉద్యమంతో బెజవాడ మరోసారి ఎరుపెక్కింది. ఆంక్షల కంచెను పెకలించుకుని.. మండేఎండను సైతం లెక్కచేయక కదం తొక్కి మరీ ఉద్యమ వేడిని రగిలించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ సంఘాల చలో విజయవాడ పిలుపునందుకుని సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నగరానికి ఉవ్వెత్తున తరలివచ్చారు. అంతా విజయవాడ ధర్నా చౌక్కు చేరుకుని ‘ధర్నా’గ్రహానికి దిగారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తరలివచ్చిన అంగన్వాడీలతో ఐలాపురం జంక్షన్, రైల్వేస్టేషన్, బస్టాండ్, బందర్ రోడ్, ఏలూరు రోడ్ వంటి ప్రధాన రహదారులు కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. డిమాండ్లు నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గం ధర్నా చౌక్లో ఆందోళన సందర్భంగా జరిగిన సభలో మూడు యూనియన్ల ముఖ్య నాయకులు కె.సుబ్బరావమ్మ, బేబీరాణి, ఎన్సీహెచ్ సుప్రజ, జె.లలిత, వీఆర్ జ్యోతి తదితరులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు, ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఆందోళన విరమించేది లేదని అల్టీమేటం ఇచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, కార్మీక సంఘాలు అంగన్వాడీల పోరాటానికి సంఘీభావం ప్రకటించాయి. కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లను తాత్కాలిక జైళ్లుగా మార్చేసి.. ఒకవైపు అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నామని మంత్రులతో ప్రకటనలు చేయించిన చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు అంగన్వాడీల ఆందోళనను విఫలం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డింది. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు(హౌస్ అరెస్టుల)తో తీవ్రమైన ఆంక్షలు పెట్టింది.విజయవాడలో అంగన్వాడీలు అడుగుపెట్టకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డులో వేలాది మందిని అదుపులోకి తీసుకుని కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లలో నిర్బంధించి వాటిని తాత్కాలిక జైళ్లుగా మార్చేశారు. ఇబ్రహీంపట్నం, గన్నవరం, పెనమలూరు పరిసరాల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ తదితర ప్రాంతాల్లో యూనియన్ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఛలో విజయవాడకు బయలుదేరుతున్న వారిని రైల్వే స్టేషన్లలోనే నిలిపివేశారు.విశాఖలోని పలు ప్రాంతాల నుండి బయలుదేరుతున్న కార్యకర్తలను, సీఐటీయూ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశి్చమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో రైళ్లలో విజయవాడకు వస్తున్న వారిని రైల్వే స్టేషన్లలోనే అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోనూ పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు వచ్చే వారిపై ఎక్కడికక్కడ పోలీస్ నిఘా పెట్టారు. శ్రీకాకుళంలో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుంచి విజయవాడ వచ్చే ప్రధాన రహదారులపై పోలీసులు తనిఖీలు చేపట్టి పలువురు నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులు సైతం ఇచ్చారు. అనేక జిల్లాల్లో చెక్పోస్టులు పెట్టి తనిఖీలు చేసి అడ్డుకోవడం గమనార్హం. ఎలాంటి ఆంక్షలు విధించినా.. భారీ సంఖ్యలో అంగన్వాడీలు చేరుకోవడంతో చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ధర్నా చౌక్లోనే వంటా వార్పు.. రోడ్డుపైనే నిద్ర చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోడంతో సోమవారం రాత్రి కూడా అంగన్వాడీలు నిరసన కొనసాగించారు. ధర్నా చౌక్లోనే వంటా వార్పు చేపట్టి రోడ్లపైనే భోజనాలు చేశారు. అక్కడే నిద్రించి నిరసన తీవ్రతను చూపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం దాదాపు 20 నెలలపాటు ఎదురు చూశామని, ఇకపై ఓర్పు వహించేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. మంగళవారం నాటికి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం నెలకు రూ.32 వేలు ఇవ్వాల్సి ఉన్నా.. కనీసం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. వేతనం పెంపుతోపాటు మిగిలిన డిమాండ్స్ కూడా అమలు చేయకపోతే ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద ఉద్యమాన్ని చేపడతామని, రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెళ్తామని మూడు యూనియన్ల నేతలు హెచ్చరించారు.కీలక డిమాండ్లు ఇవీ..అంగన్వాడీలు ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు ఉంచారు. వేతనాల పెంపుపై ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ సౌకర్యం కలి్పంచాలి. యాప్ల ద్వారా ఆన్లైన్ పని భారాన్ని తగ్గించి, రిజిస్టర్ల నిర్వహణను సరళతరం చేయాలి. పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే ప్రయోజనాలను పెంచాలి. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నందున అంగన్వాడీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. -
‘బాబూ.. అగ్రి గోల్డ్ బాధితుల ఆర్తనాదాలు వినండి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అగ్రి గోల్డ్ బాధితుల ఆర్తనాదాలను సీఎం చంద్రబాబు పట్టించుకోవాలని, బాధితులకు చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు స్పష్టమైన చర్యలు చేపట్టాలని వక్తలు కోరారు. విజయవాడ ధర్నాచౌక్లో అగ్రి గోల్డ్ బాధితుల రిలే దీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. అగ్రి గోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు.కంపెనీ చైర్మన్ అవ్వా సీతారామారావు, వారి సోదరుల కుటుంబ సభ్యుల పేరిట గల ఆస్తులను కూడా తక్షణమే జప్తు చేయాలని కోరారు. అగ్రి గోల్డ్ ఆస్తులను వేలం వేసి నిలువునా మోసపోయిన బాధితులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. గత ఎన్నికల్లో ఓట్లను అభ్యర్ధించే సమయంలో ఇంటింటా ప్రచారం చేసిన కూటమి నేతలు అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.ఆ హామీలను అమలు చేయకుండా 20 నెలలుగా సీఎం చంద్రబాబు మౌనం వహించడం బాధ్యతారాహిత్యమేనన్నారు. అగ్రి గోల్డ్ బాధితుల నిరవధిక దీక్షలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి బి.చంద్రశేఖర్, అసోసియేషన్ నాయకులు రామదాసు, సుబ్రహ్మణ్యం, శంకరయ్య, వెంకటేశ్వర్లు మాట్లాడారు. తొలి రోజు రిలే దీక్షలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధితులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 4న బుధవారం విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం అరకు చేరుకుని తంగుల్గూడాలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.అనంతరం విశాఖ చేరుకుని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళ్తారు. ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఈ నెల 5న గురువారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు చేరుకుని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. -
ప్రవాసాంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలి: వైఎస్ జగన్
తాడేపల్లి: అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ల యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను తక్షణమే సురక్షితంగా తీసుకురావాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రవాసాంధ్రుల రక్షణ అంశానికి సంబంధించి వైఎస్ జగన్ ప్రకటన చేశారు.‘ఏపీకి చెందిన వేలాదిమంది గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలి. యుద్ధం వల్ల అనిశ్చితి నెలకొనడంతో పాటు భద్రత కొరవడింది. పలు విమానాశ్రయాల్లో ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దు వల్ల చాలామంది ఎక్కడికక్కడి చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ ఇక్కడకి తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపాలి. కేంద్రంతో ఏపీ ప్రభుత్వం సమన్వయం చేసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. ఆంధ్రుల భద్రత, సురక్షిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. సంక్షోభ సమయం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. అక్కడి వారి పరిస్థితిని ఎప్పడికప్పుడు, వారి కుటుంబాలకు తెలియజేసే విధంగా ఇక్కడ ప్రత్యేక కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసి, హెల్ప్లైన్ నెంబర్లు కూడా అందుబాటులోకి తేవాలి’ అని వైఎస్ జగన్ సూచించారు. -
నిర్బంధంతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం నిర్బంధంతో అంగన్వాడీల ఉద్యమాన్ని అడ్డుకోలేరని సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ నాగేశ్వరరావు, సిహెచ్.నరసింగరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విజయవాడలో మహాధర్నా చేపట్టనున్నారని పేర్కొన్నారు.విజయవాడకు వస్తున్న అంగన్వాడీలను కర్నూలు, నంద్యాల రైల్వేస్టేషన్లో నిర్బంధించడాన్ని ఖండించారు. ఎమ్మెల్యేలు అంగన్వాడీలను తమ ఆఫీసులకు పిలిచి మరీ బెదిరించడం సరికాదన్నారు. రెండేళ్ల నుంచి వేతనాల పెంపు ప్రకటన రాకపోవడంతో ఆందోళన బాట పట్టారని స్పష్టం చేశారు. -
ముంచుకొస్తున్న భారీ భయం!
సాక్షి, అమరావతి: దేశంలో ఊబకాయం సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశంలోని 9.8 శాతం మంది మహిళలు, 5.4 శాతం మంది పురుషులు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య 2050 నాటికి మహిళల్లో 17.4 శాతం, పురుషుల్లో 12.1 శాతానికి పెరుగుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ అంశాన్ని ఢిల్లీ ఎయిమ్స్, వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, గురుగ్రామ్లోని ఫోరి్టస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, త్రివేండ్రంలోని జ్యోతిదేవ్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన 12 మంది నిపుణులు రూపొందించిన నివేదికలో వెల్లడించారు. అంతర్జాతీయంగా ఊబకాయాన్ని దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తించినప్పటికీ.. భారత్లో మాత్రం జీవన శైలి సమస్యగా మాత్రమే చూస్తున్నారని పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న ఈ సమస్యను అరికట్టడానికి విధానపరమైన మార్పులు అవసరమని సిఫార్సు చేశారు. కొంప ముంచుతున్న హెడోనిక్ హంగర్ 5 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లలు, యువతలో ఊబకాయం సమస్య అత్యధికంగా ఉంటోంది. 1990–2022 మధ్య బాలికల్లో 0.1 శాతం నుంచి 3.1 శాతానికి, బాలురలో 0.2 శాతం నుంచి 3.7 శాతానికి సమస్య పెరిగింది. ఇది కేవలం జన్యులోపంతో వచ్చే సమస్య మాత్రమే కాదని.. జీవక్రియ, నరాల సంబంధిత, పర్యావరణ కారకాల కలయికతో వస్తుందని నిపుణులు స్పష్టం చేశారు. శరీరంలో కొవ్వు కణాలు పెరగడంతో వచ్చే వాపు ఇన్సులిన్ నిరోధకతకు, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులకు దారితీస్తోందని.. క్లోమ, మూత్రాశయ, రొమ్ము, గర్భాశయ కేన్సర్ల ముప్పు పెంచుతోందని హెచ్చరించారు.శరీరానికి శక్తి అవసరం లేకపోయినా.. కేవలం నోటికి రుచి కోసం తీసుకునే హెడోనిక్ హంగర్ కొంప ముంచుతున్నట్టు స్పష్టం చేశారు. ఆకలి లేకపోయినా ఆనందం, ఆహ్లాదం, నోటికి రుచి కోసం తీసుకునే స్వీట్లు, బిర్యానీ, పిజ్జా, ఇతర జంక్ ఫుడ్స్ ప్రమాదకరమని స్పష్టం చేశారు. ఆన్లైన్ యాప్ల ద్వారా ఫుడ్ డెలివరీ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక హెడోనిక్ హంగర్ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ఇలా హెడోనిక్ హంగర్ అలవాటు ఉన్న వాళ్లు పదేళ్లలో ఊబకాయం బారినపడతారని వైద్య నిపుణులు హెచ్చరించారు. కార్యాచరణ అత్యవసరం ఊబకాయాన్ని నిరోధించేందుకు అత్యవసర కార్యాచరణ చేపట్టాలని శ్వేతపత్రంలో నిపుణులు స్పష్టం చేశారు. ఊబకాయం నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన చికిత్స, పర్యవేక్షణకు మార్గదర్శకాలు అవసరమని నొక్కిచెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో క్లినిక్ల ఏర్పాటు, పాఠశాల దశలోనే పిల్లల ఆహార అలవాట్లలో మార్పు తెచ్చే కార్యక్రమాలు సహా ఈ చికిత్సలకు బీమా సౌకర్యం వంటివి కూడా తీసుకురావాలని శ్వేతపత్రంలో సూచించారు. -
బాబు బోర్డు తిప్పేశారు
సాక్షి, అమరావతి: హామీలతో నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, తమను ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి ఆందోళన బాట పట్టారు. కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో బాధితులకు అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు అమ్మి సొమ్ము చెల్లిస్తామనే హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడంతో బాధితులు మహా విజ్ఞాపన దినం, కన్నీటి పాదయాత్ర, అగ్రిగోల్డ్ ఆవేదన దీక్ష వంటి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మరోసారి ఉద్యమ కార్యాచరణ చేపట్టారు. తొమ్మిది ప్రధాన డిమాండ్లపై ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి అనితతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నెల 2వ తేదీ నుంచి మరోసారి విజయవాడ ధర్నా చౌక్లో నిరాహార దీక్షలు చేపట్టి తాజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు అగ్రిగోల్డ్ బాధిత సంఘం ప్రకటించింది. 4వ తేదీ వరకూ రిలే నిరాహార దీక్షాలు చేపట్టి, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే 5వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని ఆదివారం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం, దానికి తోడు ప్రభుత్వం అలసత్వం, మోసపూరిత విధానాలను ఈ సందర్భంగా నిరసించారు.హామీ ఇచ్చి ఆదుకున్న జగన్ 2019 ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితుల వేదనను పట్టించుకోకపోవడంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. అప్పట్లో వారిని కలిసి సంఘీభావం తెలిపిన వైఎస్ జగన్, బాధితుల పక్షాన పోరాడేందుకు ప్రస్తుత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. బాధితులకు అండగా అనేక ఆందోళనల్లో వైఎస్సార్సీపీ నేతలు పాల్గొని మద్దతు పలికారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి చంద్రబాబుకు మనస్సు రాకపోతే తాను అధికారంలోకి వచ్చాక రూ.20వేల లోపు డిపాజిట్లు చెల్లించి ఆదుకుంటామని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10వేలు, రూ.20వేలు చొప్పున డిపాజిట్లు ఉన్న 10.40లక్షల మందికి రెండు విడతల్లో మొత్తం రూ.905.57 కోట్లు చెల్లించి జగన్ ప్రభుత్వం ఆదుకుంది. వైఎస్ జగన్ తరహాలో మిగిలిన బాధితులను ఆదుకుని ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని చంద్రబాబుకు అగ్రిగోల్డ్ బాధితులు అల్టిమేటం ఇచ్చారు. -
మధ్యవర్తిత్వంతో మేలైన న్యాయం
సాక్షి, అమరావతి: కోర్టుల్లో కేసులు పేరుకుపోకుండా మధ్యవర్తిత్వం ఎంతో ఉపయోగపడుతుందని, కక్షిదారులకు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మేలైన న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేతృత్వంలో మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి సదస్సును ఆదివారం విజయవాడలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీజేఐ మాట్లాడుతూ మధ్యవర్తిత్వాన్ని కేవలం ప్రత్యామ్నాయంగా కాకుండా ప్రాధాన్యం గల పద్ధతిగా చూడాలన్నారు. ఇదో అద్భుతమైన మార్గమని, మొదటి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సు ఢిల్లీలో జరిగిందని చెప్పారు. వాస్తవానికి భారతదేశ డీఎన్ఏలోనే మధ్యవర్తిత్వం ఉందని, పురాణ కాలం నుంచే ఇది అమలులో ఉందన్నారు. కురుక్షేత్రం జరగకుండా పాండవులకు, కౌరవులకు మధ్య శాంతి కోసం శ్రీకృష్ణుడు చేసిన రాయబారాన్ని తొలి అధికారిక మధ్యవర్తిత్వంగా ఉదహరించారు. ఆర్బిట్రేషన్పై విశ్వాసం పెంచుకోవాలి మధ్యవర్తిత్వం(ఆర్బిట్రేషన్)తో పరిష్కారమయ్యే కేసులూ కోర్టుల్లో పెండింగ్లో ఉండిపోతున్నాయని, ఆర్బిట్రేషన్ ప్రక్రియపై కక్షిదారులు నమ్మకం పొందడం చాలా ముఖ్యమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. 2023లో వచ్చిన మధ్యవర్తిత్వ చట్టంతో దీనికి ఒక చట్టబద్ధత లభించిందని, దీని ద్వారా జరిగే పరిష్కారాలు కోర్టు డిక్రీతో సమానంగా అమలు చేస్తారని స్పష్టం చేశారు. మధ్యవర్తులుగా వ్యవహరించే వారికి సరైన శిక్షణ చాలా అవసరమని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం అంతర్జాతీయంగానూ ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషిస్తోందని, మలేషియాలో మధ్యవర్తిత్వానికి దొరుకుతున్న ప్రోత్సాహాన్ని తాను స్వయంగా చూసినట్టు జస్టిస్ సూర్యకాంత్ ఉదహరించారు. ఆంధ్రప్రదేశ్లో మీడియేషన్ విషయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రితో చేసిన మీడియేషన్ విజయవంతం అయిందన్నారు. ప్రజలు రాజీ మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించాలి : హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రజలు న్యాయ పోరాటాల కంటే రాజీ మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సాహించాలని సూచించారు. జమ్మూ కశ్మీర్లో జడ్జిగా ఉన్న సమయంలో అమెరికాలో సెటిల్ అయిన ఒక వ్యక్తి వారసత్వ ఆస్తి గురించి తనను ఓ న్యాయవాదిగా సంప్రదించారని, అప్పుడు తాను ‘‘ఎందుకు మీరు మీ సోదరునితో మాట్లాడకూడదు’’ అని ఆయనకు చెప్పినట్టు గుర్తు చేశారు. ఆరు నెలల తర్వాత ఆయన కనిపించి తన ఫ్యామిలినీ, తన సోదరుడిని దూరం చేసుకోలేదని తనకు చెప్పారని వివరించారు. రాజీకి ఉన్న శక్తి అలాంటిదని వివరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరి మాట్లాడుతూ.. చర్చల ద్వారా పరస్పర అంగీకారంతో చాలా సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. దీనివల్ల సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయన్నారు. ఏపీ లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం గొప్ప మార్గమని అభిప్రాయపడ్డారు. గతంలో మధ్యవర్తిత్వ చట్టం ద్వారా దాదాపు 2 లక్షల కేసులు పరిష్కరించినట్టు గుర్తు చేశారు. కేసులను మరింత సమర్థవంతంగా పరిష్కరించడానికి, ఇటీవలే దాదాపు 400 మంది న్యాయవాదులకు మధ్యవర్తుల అంశాలకు సంబంధించి శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జిల్లా జడ్జిలు, జుడీషియల్ అధికారులు, న్యాయవాదులు, బెజవాడ బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. సత్వర న్యాయంతో త్వరితగతిన అభివృద్ధి: సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంలో భాగంగా జస్టిస్ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, జుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి కేంద్రాలను సమీకృతం చేస్తూ బెస్ట్ జుడీషియల్ సిటీని నిరి్మస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో మధ్యవర్తిత్వం ద్వారా చాలా సమస్యలను పరిష్కరించేవారని, తన తండ్రి కూడా పెద్దరికం వహించి గ్రామంలోని సమస్యలను పరిష్కరించినట్టు చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరిస్తే రూ.10 వేలు ఇస్తామని, కేసులు పరిష్కారం కాకున్నా రూ.3 వేలు ఇస్తామని సీఎం ప్రకటించారు. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ–గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతి ఉంటుందని తెలిపారు. న్యాయమూర్తుల గృహ సముదాయం ప్రారంభం అమరావతిలో సీఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.210 కోట్లతో చేపట్టిన 36 మంది జడ్జిల బంగాళాల సముదాయాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. ఇక్కడ ప్రతి నివాస గృహాన్ని 7,841 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ 1 నమూనాలో నిర్మించారు. నివాస సముదాయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అనంతరం సముదాయ ఆవరణలో మొక్కలు నాటారు. మధ్యాహ్నం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని లోక్ భవన్లో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్కు మర్యాదపూర్వకంగా తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. జుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన తాడికొండ: అమరావతి సమీపంలోని పిచ్చుకలపాలెం వద్ద జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి ఆదివారం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. తొలుత జుడీషియల్ అకాడమీ రూపొందించిన ఆడియో, వీడియోను తిలకించిన అనంతరం ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జుడీషియల్ అకాడమీని రూ.165 కోట్లతో నిర్మిస్తుండగా దీనిలో బ్లాక్ బీలో జీ ప్లస్–3 అంతస్తులతో అకడమిక్ బ్లాక్ నిరి్మస్తున్నారు. జీ ప్లస్–8 అంతస్తులతో హాస్టల్ బ్లాక్, జీ ప్లస్–3 అంతస్తుల్లో ఇండోర్ స్పోర్ట్స్, గెస్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. మొత్తం భవన విస్తీర్ణం 2.05 లక్షల చదరపు అడుగులు. ఏపీ హైకోర్టు నుంచి ఈ అకాడమీ 5.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి 50 మీటర్ల వెడల్పు కలిగిన రహదారి సౌకర్యం ఉంది. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.ఎయిర్పోర్ట్లో సీజేఐకి ఘనస్వాగతం విమానాశ్రయం(గన్నవరం): భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్కు ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ, అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.35 గంటలకు గన్నవరం చేరుకున్నారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దొనడి రమేష్, జస్టిస్ జయసూర్య, జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ టీసీడీ శేఖర్ కూడా వచ్చారు. విమానాశ్రయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్కు డీజీపీ హరీష్ కుమార్గుప్తా, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు స్వాగతం పలికారు. అదేవిధంగా సాయంత్రం ప్రత్యేక విమానంలో సీజేఐ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయనకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, సీఎం చంద్రబాబు తదితరులు వీడ్కోలు పలికారు.న్యాయ వ్యవస్థపై విశ్వసనీయత పెరగాలిసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తిరుపతి లీగల్: ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వసనీయత పెరిగేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు విధులు నిర్వహించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఆదివారం తిరుపతి మండలం దామినేడు వద్ద కోర్టు భవనాల సముదాయానికి భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాన్ని సీజేఐ, ఇతర న్యాయమూర్తులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికీ సత్వర న్యాయం పొందే హక్కు ఉందని చెప్పారు. న్యాయవాదులు న్యాయవ్యవస్థలో భాగమని, వారు ప్రత్యేకం కాదన్నారు. నూతన కోర్టు భవన సముదాయంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీజేఐ సూచించారు. న్యాయం ఎప్పటికీ ఆగదుఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గతంలో కోర్టులలో సరైన వసతులు ఉండేవి కావని, మహిళా న్యాయవాదులు ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు పరిస్థితులు క్రమేణా మెరుగు పడుతున్నాయని, కోర్టులలో మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ కనిపిస్తోందని వెల్లడించారు. న్యాయం ఎప్పటికీ ఆగదు.. అదే న్యాయమూర్తుల ఆత్మస్ఫూర్తి అని కొనియాడారు. 2023లో రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో ఏసీలను ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేకే మహేశ్వరి మాట్లాడుతూ న్యాయవ్యవస్థ గొప్పదనం భవనాల్లో కాదని, వాటి లోపల జరిగే న్యాయప్రక్రియ, నిష్పాక్షిక తీర్పుల్లో ఉంటుందని పేర్కొన్నారు. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమే కాదని, ధర్మానికి ప్రతీకని అభివర్ణించారు. అనంతరం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిపాలన జడ్జి జస్టిస్ జయసూర్య, తిరుపతి న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు గొట్టి గజేంద్ర ప్రసంగించారు. భవన నిర్మాణాలకు సహకరించిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి.రమేష్, జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ శేఖర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషాద్రి నాయుడు, న్యాయవాదులు పాల్గొన్నారు.భూమి పూజకు అటెండర్ను ఆహ్వానించిన సీజేఐ నూతన కోర్టు భవనాల భూమి పూజ చేస్తున్నప్పుడు న్యాయమూర్తులు, ఇతర అధికారులందరూ ఇటుకలు పేర్చి పూజలు చేశారు. ఈ సమయంలో సీజేఐ సూర్యకాంత్ జిల్లా కోర్టు అటెండర్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఆయన చేత ఇటుక పెట్టించి పూజ చేయించారు. ఈ ఘటన అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. -
ఎంకే స్టాలిన్కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
సాక్షి, తాడేపల్లి: తమిళనాడు సీఎం స్టాలిన్కి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Warm birthday greetings to Thiru @mkstalin Avargal. Wishing you good health and continued happiness.— YS Jagan Mohan Reddy (@ysjagan) March 1, 2026 -
ఇరాన్, ఇజ్రాయిల్లో జాగ్రత్తగా ఉండండి
సాక్షి, అమరావతి: ఇరాన్పై అమెరికా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయిల్తోపాటు, సౌదీ అరేబియాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు జాగ్రత్తగా ఉండాలని ఏపీ ఎన్ఆర్టీఎస్ సూచించింది. ఇజ్రాయిల్, ఇరాన్లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడంతో పాటు ఆయా దేశాలు జారీచేసిన సూచనలను తప్పకుండా పాటించాల్సిందిగా భారత విదేశాంగ శాఖ సూచించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు అనవసర ప్రయాణాలను రద్దుచేసుకోవాలని కోరింది. ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం, టెల్ అవీవ్–24్ఠ7 హెల్ప్లైన్: +972–54–7520711.. ఇరాన్లోని +989128109 115, +989128109109, +989128109102, +9899321793 59 నంబర్లలో సంప్రదించాలని కోరింది. యుద్ధం విస్తరిస్తున్నందున పశ్చిమాసియాలోని ప్రవాసాంధ్రులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పింది. భారత ఎంబసీతో ఏపీ ఎన్ఆర్టీఎస్ సంప్రదింపులు జరుపుతుందని, అత్యవసరమైతే హెల్ప్లైన్ నంబర్ +91 8500 027678ను సంప్రదించాలని ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. -
మార్చి నుంచే భగభగలు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రాష్ట్రంలో ఎండల తీవ్రత గతం కంటే ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా ఏప్రిల్లో మొదలయ్యే ఎండల తీవ్రత ఈసారి మార్చి రెండో వారం నుంచే మొదలయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. రాయలసీమలో సాధారణంగా ఉండే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈసారి 42 నుంచి 44 డిగ్రీలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పగలుతో పాటు రాత్రుళ్లు కూడా వేడి తగ్గకుండా ఉక్కపోత ఎక్కువగా ఉండనుంది. కోస్తా తీర ప్రాంతాల్లో బయట 38 డిగ్రీలు ఉన్నా, మనకు అది 43 డిగ్రీల ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈసారి 15 రోజుల కంటే ఎక్కువ కాలం వడగాడ్పులు వీచే ప్రమా దం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
నీళ్ల చారు.. ఉడకని అన్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి పేద పిల్లలు నీళ్ల చారు, ఉడకని అన్నంతో కడుపునింపుకునే దుస్థితి నెలకొంది. ఈ దారుణ పరిస్థితులపై తాజాగా ఏపీ ఫుడ్ కమిషన్ సమావేశమై చర్చించింది. సమస్యలను ప్రభుత్వానికి నివేదించింది. దీంతో కమిషన్ ప్రస్తావించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని బీసీ గురుకులాల సంస్థ కార్యదర్శి మాధవీలత సంబంధిత ప్రిన్సిపాల్స్కు సర్క్యులర్ జారీ చేశారు. అధ్వాన్న పరిస్థితులు ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్రెడ్డి, కమిషన్ సభ్యులు సందర్శించిన గురుకులాల్లో గుర్తించిన దయనీయ అంశాల్లో కొన్ని.. » స్టోర్ రూమ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. » అల్పాహారంలో నీళ్ల చట్నీ వేస్తున్నారు. » ఇడ్లీలు సరిగా ఉడకడం లేదు. » అన్నం సరిగా వండటం (ఉడకడం)లేదు. » కొన్ని చోట్ల వండిన అన్నంలో ఎలుక పెంటలు కూడా ఉంటున్నాయి. » నిల్వ బియ్యాన్ని కనీసం శుభ్రం చేయకుండా వండేస్తున్నారు. » వండిన ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తున్నాయి. » భోజనంలో కేవలం రెండు చికెన్ ముక్కలు మాత్రమే వేసి ఎక్కువగా గ్రేవీ వేస్తున్నారు. » రుచిలేని కూరలు.. అదీ తక్కువ పరిమాణంలో వేస్తున్నారు. » వారానికి ఆరు గుడ్లు(ఎగ్స్) ఇవ్వకపోగా మూడు, నాలుగు గుడ్లతో సరిపెడుతున్నారు. » రోజువారీ పండ్లు ఇవ్వడం లేదు. » కొన్నిచోట్ల గడువు తేదీ (ఎక్స్పైరీ డేట్) దాటినా పాల ప్యాకెట్లు వాడుతున్నారు. » మెనూ, పరిమాణ బోర్డులు ప్రదర్శించడంలేదు. » మెనూ ప్రకారం ఆహారం అందించడంలేదు. » వంటశాల, స్టోర్ రూమ్లలో శుభ్రతలేదు. » సాంబారు తయారీకి కందిపప్పు బదులు శనగపప్పు వాడుతున్నారు. » రిజిస్టర్లు (స్టాక్, క్యాష్ మొదలైనవి) సరిగా నిర్వహించడంలేదు. -
ఇది హిందూ ధర్మంపై దాడే...
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూలో కల్తీ అంటూ చేస్తున్న ప్రచారం హిందూ ధర్మం పై దాడిగానే భావిస్తున్నామని పలువురు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి లడ్డూను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేస్తుండటం మహా అపచారమని వారు చెప్పారు. ప్రజల దృష్టి మళ్లించే మిషతో ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. రాజకీయం కోసం ఇంతగా దిగజారి వ్యవహరించడం క్షమార్హం కానేకాదని నొక్కి వక్కాణించారు. హిందూ ధర్మ పరిరక్షణ వేదిక, బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో తిరుమల లడ్డూ ఘటనలో ప్రజలకు వాస్తవాలు తెలియచేసేందుకు విజయవాడలోని ఓ కళ్యాణ మండపంలో శనివారం స్వామీజీలు ఓ సదస్సు నిర్వహించారు. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా సాగిస్తున్న కుతంత్రమని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన హిందూ ధర్మ పరిరక్షణ సభ్యులు, బ్రాహ్మణ సంఘాల నేతలు, పలువురు స్వామీజీలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో పలువురు స్వామీజీలు, తిరుపత్తూర్ శివశక్తి పీఠం నుంచి శ్రీ శివపరిమళమ్మ, కడలూరు శివపీఠం నుంచి సాయిబాబా స్వామి, హిందూ ధర్మ పరిరక్షణ వేదిక, బ్రాహ్మణ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ఆలయాల్లో జరిగిన అపచారాలపై క్యూఆర్ కోడ్తో కూడిన బ్రోచర్ ఆవిష్కరించారు. దుష్ప్రచారం దుర్మార్గం రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని అబాసుపాలు చేసే విధంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. లడ్డూ కల్తీ అంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ హిందువుల మనోభావాలపై దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ ధర్మాన్ని కాపాడారు. చంద్రబాబుకు ఒక ధర్మం అంటూ ఏమీ లేదు. ధర్మ శా్రస్తాన్ని పాటించని వారు ధర్మాన్ని నిర్వర్తించలేరు. లడ్డూలో ఎలాంటి కల్తీ లేదని సీబీఐ సిట్ తేల్చిన తర్వాత కూడా బాత్రూమ్ శుభ్రం చేసే కెమికల్స్ వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు దు్రష్పచారం చేయడం దుర్మార్గం. – శ్రీ జ్యోతి స్వామి, శ్రీకాకుళం త్రినాథ త్రివటి ధర్మక్షేత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు రాష్ట్రంలో హిందూ ధర్మంపై దాడి జరుగుతోంది. లడ్డూ ప్రసాదం కల్తీ అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి శ్రీవారి లడ్డూలో గొడ్డు కొవ్వు కలిసిందని మాట్లాడటం సరికాదు. ఇది హిందూ ధర్మంపై దాడిగానే భావించాలి. అందరం సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను ఊరూరా చాటి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి. – బలరామకృష్ణమూర్తి, బ్రాహ్మణ సంఘం నేత హైందవ ధర్మానికి వ్యతిరేకం నెయ్యిలో కల్తీ జరిగిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇది రాజకీయ కక్షల నేపథ్యంలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందంటూ మాట్లాడటం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. హైందవ ధర్మానికి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. తప్పు జరిగిందని పాలకులు లెంపలేసుకోవాలి. – రాధవస్వామి, హైదరాబాద్ స్థాయి దిగి మాట్లాడుతున్నారు శ్రీవారి లడ్డూలు కల్తీ అనే ప్రచారం హిందూ ధర్మంపై దాడిగానే భావించాలి. రాజకీయాల కోసం కలియుగ దైవం శ్రీవారి ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదు. గొడ్డుకొవ్వు, పందికొవ్వు కలిసిందని తొలుత చెప్పారు. కానీ.. సుప్రీంకోర్టు నియమించిన సిట్ జంతువుల కొవ్వు కలవలేదని తన ఛార్జిషీట్లో పేర్కొంది. దీంతో మళ్లీ బాత్రూమ్ కడిగే కెమికల్స్ కలిశాయంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి శ్రీవారి ప్రసాదం విషయంలో ఇంత దిగజారి మాట్లాడమంటే హైందవ ధర్మంపై దాడిగానే భావించాలి. – కామేశ్వరప్రసాద్, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నేత చంద్రబాబుదే ఈ పాపం బోలేబాబా డెయిరీకి ద్వారాలు తెరిచిందీ, ఆర్డర్లు ఇచ్చింది 2018లో చంద్రబాబే. పరాగ్ మిల్్క, దొడ్ల డెయిరీకి కూడా గత చంద్రబాబు ప్రభుత్వంలోనే ఆర్డర్లు ఇచ్చారు. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్కు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ అని అదే హెరిటేజ్లో స్పష్టంగా ఉంది. అయితే ఈ విషయం బట్టబయలు కాగానే హెరిటేజ్ వెబ్సైట్లో కో మాన్యుఫాక్చరింగ్ యూనిట్గా మార్పు చేయడం నిజం కాదా? రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంటే అన్నీ అపచారాలే. గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతి, ఆలయాల కూల్చివేత, తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి, సింహాచలంలో చందనోత్సవం రోజు, కాశీబుగ్గ ఆలయంలో తొక్కిలాస ఘటనలు జరిగి పలువురు మృతి చెందడమే ఇందుకు నిదర్శనం. టీటీడీ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ లోపలకు ఎలా అనుమతించారనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. – మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. కేవలం సొంత వ్యాపార ప్రయోజనాల కోసం (హెరిటేజ్ నెయ్యి విక్రయాల కోసం) గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసమే ఈ కల్తీ డ్రామా ఆడారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రే. రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధికి, 2019–24 మధ్య వైఎస్ జగన్ పాలనలో జరిగిన అభివృద్ధికి పోలికే లేదు. కాణిపాక ఆలయ పునర్నిర్మాణం, గండి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి వంటివి వైఎస్ జగన్ హయాంలోనే జరిగాయి. వీటిపై బహిరంగ చర్చకు సిద్ధమా? వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఆధ్మాత్మిక చైతన్యంతో.. గతంలో బూట్లతో పూజలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు బూట్లు విప్పుతున్నారు. – వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి -
రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు
సాక్షి, అమరావతి: ‘రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు... మన సహచర పోలీసు అధికారులను వేధించేందుకు మీ తెలివితేటలు ఉపయోగించవద్దు’ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పోలీసు అధికారులకు చేసిన సూచన ఇది. బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అక్రమ అరెస్టుకు ప్రయత్నించిన ఏపీ పోలీసులకు చెంపపెట్టుగా బిహార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే.బిహార్ ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ రిటైర్డ్ ఐజీ ఇ. దామోదర్ ఐపీఎస్ అధికారుల వాట్సాప్ గ్రూపులో ఒక పోస్టు పెట్టారు. ఆ గ్రూపులో ప్రస్తుతం సర్వీసులో ఉన్న, రిటైర్ అయిన ఐపీఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. దామోదర్ పోస్టుపై డీజీ మాదిరెడ్డి ప్రతాప్ స్పందిస్తూ సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారుల వాట్సాప్ గ్రూపులో ఇచ్చిన జవాబు ప్రస్తుతం యావత్ పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.బిహార్ ప్రభుత్వ నోటిఫికేషన్ న్యాయబద్దం కాదు: రిటైర్డ్ ఐజీ ఇ. దామోదర్ బిహార్ క్యాడర్ పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేముందు తమ అనుమతి తప్పనిసరి అని ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ న్యాయబద్ధమైనది కాదు. ఆ రాష్ట్ర క్యాడర్ పోలీసు అధికారి సునీల్ నాయక్ను రక్షించేందుకే హడావుడిగా ఆ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర సాయుధ బలగాలకు ఉద్దేశించిన నిబంధనను పోలీసు అధికారులకు వర్తింపజేయడం సరైన చర్య కాదు. రాజకీయ నేతల చేతిలో పావులు కావద్దు: మాదిరెడ్డి ప్రతాప్ ‘మన తెలివితేటలన్నీ కూడా సహచర పోలీసు అధికారులను వేధించేందుకు ఉపయోగించవద్దు. ఇప్పటికే దేశంలో ఏపీలో మాత్రమే పలువురు పోలీసు అధికారులు జైలుకు వెళ్లారు. విచారణ ఎదుర్కొంటున్నారు. అందుకే రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెడతాం. అంతేగానీ రాజకీయ నేతల ప్రభావానికి గురై ఇటువంటి కక్ష సాధింపు, ప్రతీకార చర్యలకు పాల్పడవద్దు. వాటికి ముగింపు పలుకుదాం’.మాదిరెడ్డి స్పందన పట్ల హర్షం రిటైర్డ్ ఐజీ దామోదర్ పెట్టిన పోస్టుపై పోలీసు అధికారుల్లోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పోలీసు అధికారులకు రక్షణ కల్పిస్తూ ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను సాటి పోలీసు అధికారి తప్పుబట్టడం ఏమిటని ప్రశ్నించారు. పైగా పోలీసు అధికారుల సంక్షేమం, సమన్వయం కోసం ఉద్దేశించిన వాట్సాప్ గ్రూపులలో అందుకు విరుద్ధమైన పోస్టు పెట్టడం పట్ల కూడా పోలీసు అధికారులు అంతర్గత సంభాషణల్లో తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే డీజీ ర్యాంకు అధికారి మాదిరెడ్డి ప్రతాప్ కాస్త కటువుగానే స్పందించి సరైన సమాధానం ఇచ్చారని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోలీసు శాఖ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఒక్కరైనా ధైర్యంగా స్పందించి పోలీసు అధికారులు చట్టబద్ధంగా చేయాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేశారని ప్రశంసిస్తున్నారు. -
భారీ విస్ఫోటనం.. మాటలకందని విషాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం సంభవించింది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రం శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 11 మంది కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు. సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు. పైగా మల్లిశాలలో జాతర కోసం సిద్ధమైన మందు గుండును కూడా ఇక్కడున్న గోడౌన్లోనే నిల్వ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అందరూ భోజనాలకు బయటకు వచ్చారు. 1.30 గంటలకంతా భోజనం ముగించుకున్న కూలీల్లో 30–40 మంది తిరిగి ఆ నాలుగు షెడ్లలోకి వెళ్లి పనిలో నిమగ్నం అయ్యారు. మరికొందరు బయటే సేద తీరారు. ఇంకొందరు సమీపంలోనే ఊరు ఉండటంతో భోజనానికి ఇంటికెళ్లి తిరిగి వస్తున్నారు. వేట్లపాలెం వద్ద జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు పేద్ద శబ్దం.. ఎగిరిపడ్డ దేహాలుమధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలిపోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి. శరీరాలు గుర్తు పట్టలేని రీతిలో చిధ్రమైపోయాయి. కొందరి తలా, మొండెం, కాళ్లు, చేతులు వేర్వేరు ప్రాంతాల్లో, సమీపంలోని పంట కాలువలు, పచ్చని వరి పొలాల్లో దూరంగా పడ్డాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. సంఘటన ప్రాంతమంతా మృతులు, క్షతగాత్రుల బంధువుల ఆర్తనాదాలతో హృదయ విదారకరంగా మారింది. భీతావహ దృశ్యంపేలుడు ధాటికి ఘటన స్థలి ఎటుచూసినా మంటల్లో కాలిపోయిన కూలీల మృతదేహాలతో భయానక వాతావరణం కనిపించింది. ఆ సమయంలో పనిలో ఉన్నవారెవరు, ఎంత మంది మృతి చెందారు, ఎవరు మిగిలి ఉన్నారనేది తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. చుటు్టపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చారు. పేలుడు ధాటికి సంఘటన స్థలానికి రెండు కిలోమీటర్ల దూరాన సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డులో ఉన్న గూడపర్తిలోని ఇళ్లల్లో ఉన్న వారు భూకంపం వచ్చినట్టు భయపడి బయటకు పరుగులు తీశారు. ఇంటిపై ఉన్న ఇనుప రేకుల నుంచి సైతం శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. వేట్లపాలెం, గూడపర్తి, పెదబ్రహ్మదేవం, జి.మేడిపాడు గ్రామాలకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాగా, మృతదేహాలను సేకరించేందుకు స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. కాలువలు, చేలల్లో గాలింపు చేపట్టి నుజ్జునుజ్జు అయిన శరీర భాగాలను సేకరించి ఒక చోటకు చేర్చారు. ఏది ఎవరి అవయవమో గుర్తించలేక కొన్నింటిని మూటలు కట్టారు. ఇలా అన్ని మృతదేహాలను, మూటలను అతి కష్టం మీద సామర్లకోట ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉండగా బాణసంచా నాణ్యత కోసం అధిక మోతాదులో సల్ఫర్, సూరేకారం కూరడం వల్లే ఒత్తిడికి గురై విస్ఫోటనం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.సూర్యశ్రీ ఫైర్వర్క్స్లో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది 11 మంది క్షతగాత్రులు వీరేసప్పా సత్య వెంకట లక్ష్మి, మోర్తా శ్రీను, కాతేటి శ్రీను, చిటికెల లక్ష్మి, దర్శిపర్తి రాజు, వేమగిరి లోవరాజు, వేమగిరి దావీదు, పల్లాపాటి వేద శ్రీను, దర్శిపాటి లోవరాజు, పెద్దాపురానికి చెందిన చాపల శామ్యూల్, వేట్లపాలేనికి చెందిన పచ్చిగళ్ల నూకరాజు తీవ్రంగా గాయపడ్డారు. 70 శాతం కాలిన గాయాలతో వీరు కాకినాడ జీజీహెచ్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు .20 మంది మృతులు వీరేవేట్లపాలేనికి చెందిన గంధి మంగ (43), వల్లూరి రవి (35), కడింపల్లి కృపమ్మ, గంపల మంగ, గంపల నాగరాజు, బిక్కిన కరుణ సుబ్బారావు (45), సాధనాల సత్యవేణి (44), గొడతా నాని (26), సంకుమళ్ల రాఘవ (50), ఫైర్క్స్ యజమాని అర్జున్ తండ్రి అడబాల శ్రీనివాసరావు (55), దుర్గానగర్కు చెందిన తుంపల లోవ (38), నూకెళ్ల దేవి (45), జొన్నలదొడ్డికి చెందిన చింతల రమణ (60), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని (44), గొడత మహేష్ (41), గొడత వీర వెంకట రమణ (48), కడింపల్లి ధనరాజు (55), కుమ్మరి వీధికి చెందిన దర్శిపాటి నాని (38), యేడిద సంపత్ కుమార్ (25), పెదబ్రహ్మదేవం గ్రామానికి చెందిన మాకర రాఘవమ్మ (55) మృతి చెందారు.ఫైరింజన్లు వెళ్లలేక... పెరిగిన ప్రమాద తీవ్రతసంఘటన స్థలానికి సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు నుంచి వెళ్లాలంటే సింగిల్ రోడ్డు. అది చాలా ఇరుకుగా ఉండటంతో ఆ సమయానికి అంబులెన్సులు చేరుకోలేకపోయాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. విస్ఫోటనం తీవ్ర స్థాయిలో ఉండటం, రెండు గంటల పాటు పేలుళ్లు కొనసాగడంతో స్థానికులు కూడా ఘటన స్థలి దగ్గరి వరకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. చివరకు ధైర్యం చేసి కొందరు స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండటంతో అక్కడకు ఫైరింజన్, అంబులెన్స్ వెళ్లే మార్గం కూడా లేదు. వరి పొలాలు బురద మయంగా ఉండటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉండగా జీజీహెచ్లో క్షతగ్రాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అంతకు ముందు హోం మంత్రి అనిత సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనపై సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరు చంద్రశేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్పై కేసు నమోదు చేశారు. శ్మశానంలా మారిన ప్రమాద స్థలం వద్ద గుమిగూడిన వేట్లపాలెం ప్రాంత ప్రజలు నా మనసును కలచివేసింది సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి, పలువురు మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా? లేదా? అన్నదానిపై పరిశీలన చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ‘ఎక్స్’లోనూ పోస్టు చేశారు. -
వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై కుట్రలు: కారుమూరు
సాక్షి, తాడేపల్లి: కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కలుషిత నీటి సరఫరా వంటి వరుస ఘటనల సాక్షిగా చంద్రబాబు కుట్రలు, అధికారుల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడిపోవడంతో వాటికి సమాధానం చెప్పుకోలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్రెడ్డి స్పష్టం చేశారు.అందుకే ఎవరో పెట్టిన పోస్టును తీసుకొచ్చి వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబును మార్ఫింగ్ ఫొటోలతో కించపర్చారంటూ వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ నాయకులు సీఐడీకి ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు. నిజానికి మార్ఫింగ్ల సంస్కృతి, తప్పుడు ప్రచారంతో వ్యక్తిత్వ హననం చేసే కుట్రలకు చంద్రబాబే ఆద్యుడని, వందల కోట్ల అవినీతి సొమ్ముతో వేల మంది సైకోలకు జీతాలిచ్చి ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు.తిరుమలలో కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారం ఆయన మెడకే చుట్టుకుందని, ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్కు చంద్రబాబు టీటీడీ నిధులు దోచిపెట్టిన వైనం ఆధారాలతో సహా బయటకొచ్చిందని గుర్తు చేశారు. కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కలుషిత నీటి సరఫరా.. వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను నిలువరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇలాంటి వాటికి ఏ మాత్రం భయపడే ప్రసక్తి లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కారుమూరు వెంకట్రెడ్డి తేల్చి చెప్పారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే..:కూటమి పాలనలో పంపిణీ అవుతున్న కల్తీ పాలు, కలుషిత నీరు తాగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వరుస ఘటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం, అధికారుల అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కల్తీ నెయ్యి పేరుతో చంద్రబాబు ఆడిన రాజకీయ డ్రామాలు హెరిటేజ్ ముంగిట్లోకి వచ్చి ఆగింది. ఈ వరుస ఘటనలతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇరుకున పడింది. తమ తప్పులకు సమాధానం చెప్పుకోలేక వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసే డైవర్షన్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం తెర లేపింది.ఆ దిశలోనే వర్ల రామయ్య నేతృత్వంలో కొందరు టీడీపీ నాయకులు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ను కలిసి వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు గురించి అసభ్యకర పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఎవరో పెట్టిన పోస్టులను తీసుకొచ్చి వైఎస్సార్సీపీకి ఆపాదించి సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ చేయించారంటూ కట్టుకథలు అల్లుతున్నారు.వ్యక్తిత్వ హనన కుట్రలకు ఆద్యుడు చంద్రబాబు:ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూటమి నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. అలాంటిది వాళ్ల గురించి మార్ఫింగ్లు, డీప్ ఫేక్ ఫొటోలతో పోస్టులు పెట్టాల్సిన అవసరం మాకులేదు. అసెంబ్లీలో, బయటా మహిళలతో కూటమి ఎమ్మెల్యేలు అసభ్యంగా, అశ్లీలంగా వ్యవహరిస్తున్నారు. మహిళలకు అర్థరాత్రి వీడియో కాల్స్ చేసి వేధిస్తూ దొరికిపోయారు.శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కూటమి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. అలాంటిది వీరి గురించి ప్రత్యేకంగా మేం ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. తప్పుడు ప్రచారంతో వ్యక్తిత్వ హననం చేసే కుట్రలకు ఆద్యుడు చంద్రబాబు. రెండు పత్రికలు, నాలుగు టీవీలు, వందలాది యూట్యూబ్ ఛానళ్లు, లక్షల్లో మీమ్ పేజీలతో నిత్యం తమకు గిట్టని వారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి నడిపిస్తున్నది చంద్రబాబే. ప్రజల నుంచి దోచుకున్న సంపదను ఐటీడీపీ పేరుతో ఆఫీస్ ఏర్పాటు చేసి వేల మంది సైకోలకు జీతాలిచ్చి ప్రోత్సహిస్తున్నదీ చంద్రబాబే.లడ్డూపై చేసిన ఏఐ వీడియోకి కేసు పెట్టాలి:ఆఖరుకి దేవదేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు, చేపల నూనె కలిసిందని చంద్రబాబు ప్రచారం చేశాడు. అదంతా అబద్ధమని సీబీఐ సిట్ తేల్చినప్పుడు ప్రజలకు క్షమాపణలు చెప్పి అంతటితో వివాదానికి ముగింపు పలకాల్సింది పోయి, బాత్రూమ్లు కడిగే రసాయనాలు కలిశాయని ఇంకా ఉన్నాదిలా మారి ప్రచారం చేశాడు. వైయస్సార్సీపీ మీద దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పవిత్రమైన తిరుమల లడ్డూకి కళ్లు, నోరు, నామాలు పెట్టి ఏఐ వీడియోలు చేసి తెలుగుదేశం అధికార సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. అలా తిరుమల పవిత్రతను, కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను గాయపరిచారు. ఇంతకన్నా అపచారం, మార్ఫింగ్ ఇంకోటి ఉంటుందా?.హెరిటేజ్ అవినీతిపై సమాధానం చెప్పే దమ్ము లేదు:చంద్రబాబు, లోకేష్ అవినీతి బాగోతం గురించి రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్ డెయిరీకి టీటీడీ నిధులు దోచిపెట్టడం, ఆ దోపిడీనికి అమలు చేయడంలో భాగంగా కల్తీ నెయ్యి పేరుతో సాగించిన కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చివరకు చంద్రబాబు తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయాడు. హెరిటేజ్ అవినీతిని జగన్గారు ఆధారాలతో సహా, బయటపెడితే దానికి సమాధానం చెప్పే దమ్ము కూటమి నాయకులకు లేదు. అందుకే నైతికంగా ఇంకా దిగజారి ఇలాంటి డైవర్షన్ డ్రామాలు మొదలు పెట్టారని కారుమూరు వెంకట్రెడ్డి ఆక్షేపించారు. -
జనసేన ప్రధాన కార్యాలయంలో యువకుడి హల్చల్
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్ : మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి శుక్రవారం ఓ యువకుడు ప్రవేశించి కారు అద్దాలను పగలగొట్టడం సంచలనం కలిగించింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అతను కార్యాలయంలో చొరబడ్డాడు. సాధారణంగా పార్టీ కార్యక్రమాలు ఉంటేనో.. లేదంటే పార్టీ కార్యాలయ సిబ్బంది ముందస్తు అనుమతి తీసుకుంటే తప్ప మీడియా ప్రతినిధులను సైతం భద్రతా సిబ్బంది జనసేన పార్టీ కార్యాలయంలోకి అనుమతించరు. అయితే ఆ వ్యక్తి ఎలా లోపలకు ప్రవేశించాడన్న దానిపై పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. ఘటన జరిగిన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ కార్యాలయంలోనే ఉన్నారు. ఈ ఘటనపై గుంటూరు ఐజీ, ఎస్పీ ప్రత్యేక విచారణ జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం సాయంత్రం అడిషనల్ డీజీ మహేశ్ చంద్ర లడ్డా భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఘటనకు పాల్పడిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల నారం నీలాద్రిగా సమాచారం. అతనికి మతిస్థిమితం లేదని.. పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ఆ వ్యక్తి నిర్మాణ పనులకొచి్చన కారి్మకుడిగా భద్రతా సిబ్బంది భావించడం వల్లే లోపలకు రాగలిగాడని చెబుతున్నారు. గత ఏడాది మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్ కలకలం రేపింది. మూడు రోజుల క్రితం మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఓ జనసేన నేత ‘జనసేన పార్టీని మంగళగిరి నియోజకవర్గంలో ఎదగనీయకుండా ఉండేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, దానికి జనసేన పార్టీలో కొందరు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు చేయడం గమనార్హం. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. పంజాబ్, హరియాణ హైకోర్టులో మూడోస్థానంలో కొనసాగుతున్న ఆమెను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా సిఫారసు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొదట జస్టిస్ లీసా గిల్ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తున్నారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24 పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణ చేసిన వెంటనే జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కూడా న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళితే ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ హైకోర్టు సీజేగా నియమితులవుతారు. 2028లో జస్టిస్ లీసా గిల్ పదవీ విరమణ.. ఆలోపు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం జస్టిస్ లీసా గిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2028 నవంబర్లో పదవీ విరమణ చేస్తారు. ఆ లోపు పంజాబ్, హరియాణ రాష్ట్ర కోటాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పంజాబ్, హరియాణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తో సహా మొత్తం ముగ్గురు న్యాయమూర్తులున్నారు. వీరిలో జస్టిస్ సూర్యకాంత్ 2027లో, జస్టిస్ రాజేష్ బిందాల్ ఈ ఏడాది ఏప్రిల్లో, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ 2028 మార్చిలో పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లీసా గిల్ హైకోర్టు సీజేగా పదవీ విరమణకు ముందే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లే అవకాశం ఉంది. కొత్త విధాన నిర్ణయం తీసుకున్న కొలీజియం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ లతో కూడిన కొలీజియం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం విషయంలో కొత్త విధాననిర్ణయం తీసుకుంది. న్యాయపాలన సామర్థ్యాన్ని, నాణ్యతను బలోపేతం చేయడానికి కొత్త విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్లు కొలీజియం తెలిపింది. ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించిన న్యాయమూర్తిని సదరు హైకోర్టులో ఆ ఖాళీ ఏర్పడటానికి కనీసం రెండునెలల ముందే న్యాయమూర్తిగా బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీనివల్ల సదరు న్యాయమూర్తికి ఆ హైకోర్టు వ్యవహారాలపై పూర్తి అవగాహన పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుందని, అక్కడ ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఖాళీ అయిన వెంటనే సీజేగా బాధ్యతలు స్వీకరించడానికి వీలుంటుందని కొలీజియం పేర్కొంది. గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేయగానే, అదే హైకోర్టులో రెండోస్థానంలో ఉన్న న్యాయమూర్తిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించేవారు. కొద్దినెలల తరువాత వేరే హైకోర్టు నుంచి పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించేవారు. చాలా సందర్భాల్లో హైకోర్టులో రెండోస్థానంలో ఉన్న న్యాయమూర్తిని మాతృ హైకోర్టు కోటా నుంచి వేరే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై నియమిస్తుండేవారు. ఆ న్యాయమూర్తి తాత్కాలిక సీజేగా కొంత అనుభవం గడిస్తారన్న ఉద్దేశంతో గతంలో సుప్రీంకోర్టు కొలీజియం ఆ నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక సీజే అదే హోదాలో పదవీ విరమణ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సీజే నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొత్త విధాన నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా గిల్ నేపథ్యం.. 1966 నవంబర్ 15న జన్మించిన ఆమె చండీగఢ్లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తిచేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయిన ఆమె పంజాబ్, హరియాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతోపాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హరియాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ హైకోర్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. -
బాబు సర్కారుకు బిహార్ ఝలక్ !
సాక్షి, అమరావతి : చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగ అరాచకానికి బిహార్ ప్రభుత్వం చెంపపెట్టులాంటి గట్టి ఝలక్ ఇచ్చింది. ఏపీ పోలీసు అధికారులు బిహార్ కేడర్ ఐజీ సునీల్నాయక్ను అరెస్టుచేసేందుకు ఆ రాష్ట్ర రాజధానిలో హంగామా చేయడంపై తీవ్రంగా స్పందించింది. తమ రాష్ట్ర కేడర్కు చెందిన పోలీసు అధికారులపై ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా తమ ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. బిహార్ కేడర్ అధికారులు డెప్యుటేషన్పై ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన విధులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా కేసులు నమోదు చేయాలనుకుంటే తమ అనుమతి తప్పనిసరని ఆ నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. అంతేకాదు.. ఆ అధికారులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా తాము అనుమతించాలంటే పాటించాల్సిన నిబంధనలను కూడా వెల్లడించింది. కేంద్ర పోలీసు బలగాలకు చెందిన అధికారులకు వర్తించే అన్ని రకాల రక్షణ చర్యలు బిహార్ ప్రభుత్వ అధికారులకు వర్తిస్తాయని పేర్కొంది. అంటే.. కేంద్ర బలగాలకు చెందిన అధికారులపై ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేసు నమోదుచేయాలంటే అనుసరించాల్సిన నిబంధనలను తమ అధికారుల విషయంలోనూ పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. అంతేగానీ.. ఇతర రాష్ట్రాల పోలీసులు బిహార్ వచ్చి తమ అధికారులను ఏకపక్షంగా అరెస్టు చేయడం, ఇతరత్రా చర్యలు తీసుకోడానికి వీల్లేదని కుండబద్దలు కొట్టింది. అందుకోసం బిహార్ కేడర్ అధికారులకు బీఎన్ఎస్ఎస్ చట్టం 218 కింద రక్షణ కల్పిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్లో ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు.. బిహార్ ప్రభుత్వ చర్య చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తప్పుడు ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన అక్రమ కేసులో ఐజీ సునీల్నాయక్ను వేధించేందుకు ఏపీ పోలీసులు తెగబడ్డారు. ఈ కేసు దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ తన బృందంతో పాట్నా వెళ్లి ఏకంగా ప్రస్తుతం బిహార్లో అగి్నమాపక, హోంగార్డుల విభాగం ఐజీగా ఉన్న సునీల్నాయక్ నివాసంలోకి గోడదూకి వెళ్లి అక్రమంగా అరెస్టు చేసేందుకు యతి్నంచింది. అయితే ఆ రాష్ట్ర పోలీసులు వీరి ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఈ కేసును విచారించిన పాట్నా సివిల్ కోర్టు ఏపీ పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సునీల్నాయక్ను అరెస్టుచేసి తీసుకువెళ్లేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీకి నిరాకరించింది. అయినా.. ఎస్పీ దామోదర్ టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం సాగించారు. సునీల్నాయ క్ను తాము అరెస్టుచేసినట్లు ప్రకటించారు.మరోవైపు న్యాయస్థానం తిరస్కరించినా సునీల్నాయక్ను ఏపీకి తీసుకొచ్చేందుకు దామోదర్ తనబృందంతో పాటా్నలోనే మకాం వేయడం గమనార్హం. అంతేకాదు.. ఆయన నివాసం, ఆఫీసుపై ఏపీ పోలీసులు నిఘా పెట్టారు. సునీల్ నాయక్ ఆఫీసుకు రావడంలేదని, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారని టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేశారు. రంగంలోకి బిహార్ సీఎం.. ఈ పరిణామాలపై బిహార్ పోలీసు ఉన్నతాధికారులు రగిలిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ పోలీసులు బిహార్లో మాటువేసి మరీ అరాచకానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని తమ సీఎం నితీశ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారం యావత్ బిహార్ పోలీసు శాఖ ప్రతిష్టకు సంబంధించినదిగా ఆయన భావించారు. దీంతో బిహార్ పోలీసు అధికారులపై ఇతర రాష్ట్రాలు అక్రమంగా చర్యలు తీసుకోకుండా తగిన ఆదేశాలు జారీచేయాలని ఆదేశించారు. ఫలితంగా.. బీఎన్ఎస్ఎస్–218 కింద బిహార్ పోలీసు అధికారులకు రక్షణ కల్పిస్తూ ఆ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పరిణామాలతో ఎస్పీ దామోదర్ తన బృందంతో వెనుదిరుగుతారా.. లేక అక్కడే మాటువేసి మళ్లీ దుస్సాహసానికి తెగబడతారా అన్నది చూడాలి. -
చర్చ జరగాల్సిందే
సాక్షి, అమరావతి: ‘‘తిరుమల ప్రసాదంపై చర్చిద్దామంటే భయమెందుకు? బీఏసీలో చర్చకు ఒప్పుకుని ఇప్పుడు ఎందుకు పారిపోతున్నారు?’’ అంటూ అధికారపక్షాన్ని వైఎస్సార్సీపీ గట్టిగా నిలదీసింది. టీటీడీలో ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ పాత్రపై సభలో చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలిలో గట్టిగా పట్టుబట్టారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో మండలి హోరెత్తింది. చర్చకు పట్టుబడుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడం, స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందని అధికారపక్షం తప్పించుకునే ప్రయత్నం చేయడంతో వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తంచేశారు. సభను స్తంభింపజేశారు. వాయిదా పడినా సభలోనే రెండుగంటలకు పైగా ఆందోళన చేశారు. అంతకుముందు అసెంబ్లీకి వచ్చే సమయంలో కూడా ఇవే డిమాండ్లతో వైఎస్సార్సీపీ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేసుకుంటూ ప్రదర్శనగా వచ్చారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలతో హోరెత్తించారు. అసెంబ్లీ వద్ద మండుటెండలోనే ధర్నాకు దిగారు. కాగా సభలో అధికారపక్ష సభ్యుల తీరుపై మండలి చైర్మన్ మోషేన్ రాజు మనస్తాపానికి గురయ్యారు. అధికారపక్షం చర్చకు అడ్డుపడడం విచారకరమని వ్యాఖ్యానించారు. అనుమతిలేకుండా స్టేట్మెంట్కు సిద్ధపడడం చైర్ను అవమానించడమేనని స్పష్టం చేశారు.చర్చిద్దామంటూనే అధికారపక్షం పలాయనం.. తిరుమల లడ్డూకి ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టడంతో శాసన మండలి శుక్రవారం వేడెక్కింది. ఈ అంశంపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు ఆర్.రమేష్యాదవ్, కేఆర్జే భరత్, సిపాయి సుబ్రమణ్యం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్రాజు తిరస్కరించారు. దీంతో చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం ఎక్కి నిరసనకు దిగారు. లడ్డూపై చర్చకు అధికారపక్షం భయపడుతోందని, బీఏసీలో అంగీకరించి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ సభ్యులు గట్టిగా నిలదీశారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మార్చి 4వ తేదీన చర్చిద్దామని, అప్పటికి సరిపోకపోతే ఐదు, ఆరు తేదీల్లో కూడా చర్చిద్దామన్నారు. గురువారం లఘు చర్చ అని చెప్పి అధికారపక్షం భయపడి పారిపోయిందని, స్టేట్మెంట్ ఇస్తే సరిపోదని, చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పట్టుబట్టింది. చర్చకు సిద్ధమంటూనే అధికారపక్షం ఎందుకు పారిపోతోందని వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. అధికార టీడీపీ సభ్యులు కూడా వెల్లోకి వచ్చి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో 10:19గంటలకు చైర్మన్ కొద్దిసేపు వాయిదా వేశారు.రెండు గంటలకు పైగా సభలోనే ఆందోళన..సభ వాయిదా పడిన అనంతరం కూడా చర్చపై పట్టువీడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు దాదాపు రెండు గంటలకుపైగా ఆందోళనను కొనసాగించారు. పోడియం ఎదురుగా వెల్లో నేలపై కూర్చోని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు నిరసనను కొనసాగించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, వరుదు కళ్యాణి, కల్పలత, మొండితోక అరుణుకుమార్, కాంట్రాక్ట్ ఇసాక్, రమేష్యాదవ్, తూమాటి మాధవరావు, పాలవలస విక్రాంత్, వంకా రవీంద్రనాథ్, ఎంవీ రామచంద్రారెడ్డి, ఇజ్రాయేల్, కేఆర్జే భరత్, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తదితరులు ఆందోళన కొనసాగించారు. హెరిటేజ్ నెయ్యి కల్తీ.. కూటమి పాలన కల్తీ, లడ్డూపై చర్చకు పారిపోయిన ప్రభుత్వం సిగ్గు సిగ్గు, స్వామివారిని కించపరిచిన ప్రభుత్వం, లడ్డూ చర్చపై చిత్తశుద్దిలేని ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. అనంతరం 12:53 నిముషాలకు మళ్ళీ సమావేశమైన సభను బుధవారం నాటికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు. మళ్లీ సభ వాయిదా పడిన తర్వాత కూడా పది నిముషాలపాటు వైఎస్సార్సీపీ సభ్యులు మండలి వెల్లోనే ఆందోళన చేశారు.వైఎస్సార్సీపీ నిరసనతో అట్టుడికిన అసెంబ్లీ ప్రాంతం..అంతకు ముందు వైఎస్సార్సీపీ శాసన మండలి సభ్యులు శుక్రవారం ఉదయం శాసన మండలి ప్రారంభ సమయంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలుత వారంతా అసెంబ్లీ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా సాధికారత సంస్థ భవన్ కి ఉదయం 9.50 గంటలకు చేరుకొన్నారు. పెద్ద బ్యానర్లు, ప్లకార్డులు చేత పట్టుకొని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘‘టీటీడీ లడ్డూ ప్రసాదం పై చర్చ అంటే భయమెందుకు? .. ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ దోపిడీ బయటపడుతుందన్న భయమా? .. టీటీడీలో ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ పాత్రపై వెంటనే సభలో చర్చ జరగాలి’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ‘‘ప్రకటన కాదు...చర్చ జరపాలి, లడ్డూపై చర్చ జరిగితే...నిజాలు ప్రజలకు తెలుస్తాయని భయమా ? లడ్డూ అంశంపై చర్చ అంటే..పాలకపక్షానికి భయమెందుకు? చర్చ అంటేనే పారిపోయిన ప్రభుత్వం...సిగ్గు సిగ్గు, చర్చ జరగాలి...హెరిటేజ్ దోపిడీ ప్రజలకు తెలియాలి, చర్చ జరిగితే మీ హెరిటేజ్ దోపిడీ బయటపడుతుందని భయమా ?, దైవం పవిత్రతను దెబ్బతీసి...హెరిటేజ్ దోపిడీకి బాటలు వేసుకుంటారా?’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్యానర్లు, ప్లకార్డులు చేతబట్టుకుని అసెంబ్లీ గేట్ నెంబర్ 4 వరకు ప్రదర్శనగా వచ్చి గేటు వద్ద బైఠాయించారు. ఎమ్మెలీల నినాదాలతో అసెంబ్లీ సమీప ప్రాంతం మార్మోగిపోయింది. అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకొంటూ సభ్యులంతా శాసనమండలిలోకి వెళ్లారు.మండుటెండలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ధర్నా...వైఎస్సార్సీపీ శాసన మండలి సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు శాసన మండలి నుంచి ప్రదర్శనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకొంటూ అసెంబ్లీ గేట్ – 2 వద్దకు వచ్చారు. గేటు బయట రోడ్డుపై మండుటెండలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సభ్యులందరూ టీటీడీ లో హెరిటేజ్ పాత్రపై విచారణ జరపాలి, మీ హెరిటేజ్ కోసం దైవం పై నిందలా.. సిగ్గు సిగ్గు, భోలే బాబా వెనుక ఉన్న అలీ బాబా..చంద్ర బాబే, ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ దోపిడీ నశించాలి, మీ రాజకీయాల కోసం దైవం ప్రవిత్రతను అవమానించిన చంద్రబాబు...వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి, భోలే బాబాను తెచ్చింది..హెరిటేజ్ బాబే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్సీల నినాదాలతో అసెంబ్లీ ఆవరణ మార్మోగిపోయింది.స్టేట్మెంట్ ఇచ్చేసి తప్పించుకునే పన్నాగం..లడ్డూ గురించి చర్చ జరిగితే హెరిటేజ్ అవినీతి బయటకొస్తుందనే భయంతో స్టేట్మెంట్ ఇచ్చేసి తప్పించుకోవాలనే పన్నాగానికి మంత్రి పయ్యావుల కేశవ్ తెరదీశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ ‘‘రాజకీయాల కోసం దేవుళ్లను రాజకీయాల్లోకి లాగిన చంద్రబాబు.. తన కుట్రలు బయటకు రావడంతో సమాధానం చెప్పలేక పారిపోతున్నారు. చేసిన తప్పుని అంగీకరించి భక్తులకు సమాధానం చెప్పాల్సిందిపోయి మరింత దిగజారి ప్రవర్తించడం రాష్ట్ర ప్రజలంతా చూశారు.’’ అని అరుణ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కలలో కూడా ఎవరూ వినకూడని మాటలతో తిరుమల పవిత్రతను, స్వామి వారి ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చాడు. కల్తీ నెయ్యి పేరుతో వైఎస్సార్సీపీ మీద నెపం నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన చంద్రబాబు, సీబీఐ సిట్ చార్జిషీట్తో అడ్డంగా దొరికిపోయాడు. వారి హయాంలో జరిగిన తప్పులకు బాధ్యత తీసుకోకుండా వైయస్సార్సీపీ మీద నిందలు మోపడం సిగ్గుచేటు.’’ అని విమర్శించారు.అనుమతిలేకుండా స్టేట్మెంట్.. చైర్ను అవమానించడమే.. టీడీపీ సభ్యుల తీరుపై మండలి చైర్మన్ మనస్తాపం శాసన మండలిలో లడ్డూపై చర్చను అధికారపక్షం అడ్డుకోవడం విచారకరమని, తన అనుమతి లేకుండా సభలో ఆర్థిక మంత్రి స్టేట్మెంట్ పెట్టేందుకు సిద్ధపడటం చైర్ను అవమానించడమేనని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.. శుక్రవారం ఉదయం మండలి సమావేశం ప్రారంభం కాగానే చైర్మన్ మాట్లాడుతూ.. గురువారం సభలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావించి అధికారపక్ష సభ్యుల తీరుపై మనస్తాపం చెందారు. మోషేన్రాజు ఏమన్నారంటే.. ‘‘నిన్నటి రోజు లడ్డూ ప్రసాదంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ పునః ప్రారంభమైనప్పుడు క్వశ్చన్ అవర్ను డీమ్డ్ చేసిన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు రూల్స్కు విరుద్ధంగా క్వశ్చన్ అవర్ను జరిపించాలని అడిగారు. లడ్డూ ప్రసాదం చర్చను అడ్డుకునే యత్నం చేయడం విచారకరం. అదే సందర్భంలో అర్థిక శాఖ మంత్రి నాపై కొన్ని సత్యదూరమైన ఆరోపణలు చేశారు. షార్ట్ డిస్కషన్ కోసం జరిపే సన్నాహక చర్యల్లో భాగంగా సెక్రటరీ జనరల్ ఆ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి షార్ట్ డిస్కషన్ టాపిక్పై నోట్స్ పంపించారు. ఆ ప్రతిని చూపించి.. నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికేందుకు టీడీపీ సభ్యులు యత్నించారు. సభను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. ఇది కూడా కరెక్టు కాదు. ఈ విధంగా అధికార పక్ష సభ్యులే సభలో చర్చను అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన ఇరు పక్షాల సభ్యులు సభ గౌరవం పెంచేలా నడుచుకోవాలని తెలియజేస్తున్నా’’ అని చైర్మన్ మోషేన్రాజు పేర్కొన్నారు. చైర్మన్ మాటలకు అడ్డుతగులుతూ మంత్రులు కె.అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. అదే విషయాన్ని ఇంకా పొడిగించి చైర్ను అవమానించాలనుకోవడం సరికాదంటూ చైర్మన్ తేల్చిచెప్పారు. ఆ తర్వాత చైర్మన్ అనుమతించడంతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రతిపక్షం ముందుగా నోటీసు ఇవ్వకపోయినా బీఏసీలో అంగీకరించాం కాబట్టి చర్చించేందుకు సిద్ధమయ్యామని, ఆ ముందు రోజునే తమ శాసన సభ్యుడితో నోటీసు ఇప్పించి శాసన సభలో చర్చించామని, అక్కడ జరిగిందే.. మండలిలో జరిగేలా చేశామని పేర్కొన్నారు. దీనికి చైర్మన్ మోషేన్ రాజు స్పందిస్తూ మండలిలో ప్రొసీడింగ్స్ వేరు అని, స్టేట్మెంట్ ఇచ్చాక చర్చ కాదని, చర్చ వేరు స్టేట్మెంట్ వేరని స్పష్టం చేశారు. అనంతరం సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తర్వాత చైర్మన్ చాంబర్కు పలువురు మంత్రులు వెళ్లి మాట్లాడినట్టు సమాచారం. సభలో చైర్మన్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. సభలో అధికారపక్షం వ్యవహరించిన తీరు సరికాదని, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని మంత్రుల వద్ద చైర్మన్ మళ్లీ తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అధికారపక్షం పలాయనమంత్రం తిరుమల లడ్డూకు ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చించేందుకు సిద్ధమేనంటూ పైకి గంభీరమైన మాటలు చెబుతున్న అధికారపక్షం తీరా చర్చ సమయానికి పలాయనం చిత్తగిస్తోంది. తిరుమల లడ్డూలో ఇందాపూర్ నెయ్యి సరఫరాపై చర్చకు వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో గత ఐదు రోజులుగా మండలి కార్యకలాపాలు స్థంభించాయి. దీంతో ప్రభుత్వ బిజినెస్ ఆమోదించుకోవడం మెట్టు దిగిన అధికారపక్షం ఈ నెల 26న లడ్డూపై స్వల్పకాలిక చర్చకు సిద్ధమని చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అధ్యక్షతన సోమవారం జరిగిన బీఏసీలో అంగీకరించింది. తీరా గురువారం ప్రశ్నోత్తరాల అనంతరం జరగాల్సిన చర్చ సమయం వచ్చే సరికి అధికార పక్షం మాట మార్చింది. చర్చ కాదు.. ప్రభుత్వం తరపున స్టేట్మెంట్ ఇస్తామని మెలికపెట్టింది. నిబంధనలు అంగీకరించవని చైర్మన్ చెప్పినా.. వినని శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేసిన తర్వాతనే చర్చను మొదలుపెట్టాలని పట్టుబట్టారు. దీంతో చర్చను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన చైర్మన్ మోషేన్రాజు వైఎస్సార్సీపీ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంతో మంత్రి కేశవ్ స్టేట్మెంట్పై బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు. ముందుగా మంత్రి స్టేట్మెంట్ సరికాదని, చర్చ అంటే సభ్యులు మాట్లాడతారని చైర్మన్ స్పష్టం చేశారు. ఆ స్టేట్మెంట్ మీరు అనుమతి ఇచ్చిందేనని మంత్రి కేశవ్ గురువారం సభలో చైర్మన్తో ప్రస్తావించారు. అసలు ఆ స్టేట్మెంట్ విషయం నాకు తెలియదని, అది సరికాదని చైర్మన్ అభ్యంతరం తెలిపారు. స్టేట్మెంట్ అని అధికార టీడీపీ, చర్చ కోసం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పట్టుబట్టాయి. గందరగోళ పరిస్థితుల మధ్య గురువారం మండలి చర్చ మధ్యలోనే ఆపి సభను శుక్రవారం నాటికి వాయిదా వేశారు. గురువారం చర్చను ప్రారంభించినందున శుక్రవారం అదే చర్చను కొనసాగించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేతల బొత్స సత్యనారాయణ చైర్మన్ మోషేన్రాజుకు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్కు లేఖ రాసారు. అయినా శుక్రవారం మళ్లీ చర్చకు అవకాశం లేకుండా ఎజెండాలో సైతం పెట్టకుండా నీటిపారుదల అంశాన్ని లఘు చర్చకు పెట్టారు. శుక్రవారం వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో మళ్లీ రగడ రేగింది. గురువారం నాటి సభలో అధికారపక్షం వ్యవహరించిన తీరుపై మనస్తాపం చెందిన చైర్మన్ మోషేన్రాజు శుక్రవారం సభ ప్రారంభంకాగానే ముందు రోజు పరిణామాలు సరికాదని తప్పుబట్టారు. చర్చ కోసం మళ్లీ వాయిదా తీర్మానం తిరస్కరించడంతో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మండలిలో పలాయనమంత్రం పఠిస్తున్న అధికార టీడీపీ మాత్రం మార్చి 4న చర్చను చేపడతామంటూ మళ్లీ కొత్తరాగం అందుకుంది. మొత్తానికి మండలిలో పరిణామాలు అధికారపక్షానికి చెమటలు పట్టిస్తున్నాయి. ప్రజల్లో పాలకపక్షం పరువును పలచన చేస్తున్నాయి. -
‘పడితేనే రెండు ఎముకలు విరిగాయి.. కొడితే ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్షా!’
సాక్షి, అమరావతి: ‘కస్టోడియల్ టార్చర్ కథ అబద్ధం. ఆటలో పడిపోతేనే రెండు ఎముకలు విరిగే వ్యక్తిని.. నిజంగా కొట్టి ఉంటే ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్షా!’ అని సీనియర్ ఐపీఎస్ పీవీ సునీల్కుమార్ ప్రశ్నించారు. ఆ రెండు ఘటనలకు సంబంధించిన ఎక్స్రే కాపీలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఆయన శుక్రవారం పెట్టిన రెండు వేర్వేరు పోస్టులు వైరల్గా మారాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు క్రికెట్ ఆడుతూ పొరపాటున కింద పడటంతో ఆయన చేతి ఎముకలు విరిగాయి. దీంతో ఆయనను హైదరాబాద్ తరలించి ఆస్పత్రిలో వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీవీ సునీల్కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘రఘురామకృష్ణరాజు పొరపాటున కింద పడితేనే ఆయన చేతి ఎముకలు రెండు విరిగాయి. నిజంగా ఆయన్ని ఆనాడు కస్టడీలో కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి. అది కూడా ఆయన వర్ణించినంత దారుణంగా కొడితే’ అని సునీల్కుమార్ ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం క్రికెట్ ఆడుతూ కిందపడటంతో రఘురామకృష్ణరాజు చేతికి ఫ్రాక్చర్ అయిన ఎక్స్రే కాపీని ఆయన పోస్టు చేశారు. అందులో ఆయన చేతి ఎముకలు విరిగిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రఘురామకృష్ణరాజు ఆరోపించినట్టు గతంలో కస్టోడియల్ టార్చర్ అనంతరం వైద్య పరీక్షలు చేసి తీసిన ఎక్స్రే కాపీని కూడా పీవీ సునీల్కుమార్ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. తన కాలు ఎముకలు విరిగేలా సీఐడీ పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. కానీ ఆ ఎక్స్రేలో ఆయన కాలు ఎముక విరిగినట్టు ఏమీ లేదు. ఆయన కాలికి ఎటువంటి గాయాలు లేనే లేవన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రెండు ఎక్స్రే కాపీలను పక్కపక్కనే పెట్టి పోస్టు చేసి పీవీ సునీల్కుమార్ సోషల్ మీడియాలో సంధించిన ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. -
బాబుదే మహాపచారం! ఇందాపూర్కు అవి‘నేతి’ విందు
సాక్షి, అమరావతి: నెయ్యి సరఫరా మాటున చంద్రబాబు అండ్ కో తిరుమల శ్రీవారి నిధులను కొల్లగొడుతోంది. ఆ కలియుగ దైవానికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే నిధులను నిస్సిగ్గుగా దోచుకుంటోంది. హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీ ఆన్లైన్లో కిలో నెయ్యి రూ.529 చొప్పున విక్రయిస్తోంది. మరి ఇదే ఇందాపూర్ డెయిరీ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ, ఇతర అవసరాల కోసం టీటీడీకి కిలో ఏకంగా రూ.638 చొప్పున సరఫరా చేస్తోంది. అంటే ఆన్లైన్లో కంటే టీటీడీకి కిలోకు రూ.109 అధిక ధరకు విక్రయిస్తోంది. వాస్తవానికి ఆన్లైన్లో విక్రయించే నెయ్యిని ప్యాకింగ్ చేసి మరీ వినియోగదారులకు డోర్ డెలివరీ విధానంలో సరఫరా చేస్తారు. దాంతో ప్యాకేజీ, మార్కెటింగ్ ఖర్చులు, డోర్ డెలివరీ రవాణా ఖర్చు అదనంగా వస్తుంది. కానీ టీటీడీకి ట్యాంకర్ల ద్వారా భారీ స్థాయిలో నెయ్యిని సరఫరా చేస్తారు. దాంతో ప్యాకేజీ ఖర్చులు ఉండవు. ఒకే ప్రదేశానికి భారీ పరిమాణంలో నెయ్యిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంలో రవాణా వ్యయం తగ్గుతుంది. ఈ లెక్కన ఆన్లైన్లో ధర కంటే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ కిలోకు ఏకంగా రూ.109 అధికంగా వసూలు చేస్తున్నారు. పోనీ బహిరంగ మార్కెట్తో పోల్చి చూసినా సరే హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీ బహిరంగ మార్కెట్లో ఏపీలో కిలో రూ.541 చొప్పున, హైదరాబాద్లో కిలో రూ.560 చొప్పున విక్రయిస్తోంది. బహిరంగ మార్కెట్ విధానంలో.. నెయ్యిని ప్యాకింగ్ చేసి, డెయిరీ హోల్సేల్ ఏజెన్సీ ద్వారా రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తుంది. అంటే ప్యాకింగ్ చార్జీలు, రవాణా చార్జీలతోపాటు హోల్సేల్ ఏజెన్సీ లాభం, రిటైల్ దుకాణదారు లాభం కలుపుకుని మరీ ధరను నిర్ణయిస్తారు. కానీ టీటీడీకి డెయిరీనే నేరుగా నెయ్యిని సరఫరా చేస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియలో హోల్సేల్ ఏజెన్సీ, రిటైల్ దుకాణదారు ఉండరు. దాంతో మొత్తం సరుకు మార్కెటింగ్, రవాణా వ్యయం తగ్గుతుంది. అందుకే బహిరంగ మార్కెట్ కంటే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ ఇందాపూర్ డెయిరీ బహిరంగ మార్కెట్ కంటే టీటీడీకి నెయ్యిని కిలోకు రూ.97 అధిక ధరకు విక్రయిస్తోంది. అంటే ఆ విధంగా లక్షల లీటర్ల నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కించుకుంది. అంటే ఏ స్థాయిలో దోపిడీ చేస్తోందనేది విభ్రాంతి కలిగిస్తోంది. ఈ దందా బయట పడగానే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డెయిరీ అనే విషయాన్ని వెబ్సైట్లో తొలగించి, కో మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థగా ఎడిట్ చేసింది. ఇందాపూర్’ రూటులోనే సంగం కల్తీ ‘వైష్ణవి’తో వ్యాపార బంధం» తిరుమల శ్రీవారి నిధులు కొల్లగొట్టేందుకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు తలుపులు బార్లా తెరిచారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల టీడీపీ గోబెల్స్ ప్రచార టీమ్లో ముఖ్యుడిగా ఉన్న సంగతి తెల్సిందే. ఆయన సేవలకు మెచ్చి టీటీడీ నెయ్యి కాంట్రాక్టును బహుమతిగా ఇచ్చారు. సంగం డెయిరీకి కూడా కిలో రూ.599 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేశారు. అంటే కిలోకు రూ.58 అధిక ధరకే కట్టబెట్టారు. ఆ విధంగా సంగం డెయిరీకి రూ.29.95 కోట్ల విలువైన 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారు. » ఇంతటి దోపిడీ సాగించేందుకే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ముందస్తు కుట్రతోనే తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేశారన్నది స్పష్టమవుతోంది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కోసం టీటీడీ పిలిచిన టెండర్లను సంగం డెయిరీకి కట్టబెట్టాలని నిర్ణయించారు. బిడ్లు దాఖలు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసిన ఇతర డెయిరీల యాజమాన్యాలను ప్రభుత్వ పెద్దలు బెదిరించారన్న ఆరోపణలున్నాయి. అందుకే టీటీడీ మూడు సార్లు టెండర్లు పిలిచినా ఏ డెయిరీ కూడా బిడ్లు దాఖలు చేయ లేదని వినిపిస్తోంది. ఈ కారణం సాకుగా చూపి ఆ టెండర్ నోటిఫికేషన్లను టీటీడీ రద్దు చేసింది. » తిరుమల లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సరఫరా అంశంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. గతంలో తిరస్కరించిన భోలేబాబా డెయిరీ అడ్డదారిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసినట్టు వెల్లడైంది. తమ నెయ్యి ట్యాంకర్లను తిరుపతి జిల్లాలోని పెనుబాకలో ఉన్న వైష్ణవి డెయిరీకి పంపించి... అక్కడ నుంచి తమిళనాడులోని ఏఆర్ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు వెలుగు చూసింది.» టీటీడీ ల్యాబ్ పరీక్షల్లో నాణ్యత లేవని వెల్లడైనా సరే అవే ట్యాంకర్లను కొన్ని రోజుల తరువాత తిరుమలకు పంపినట్టు కూడా వెల్లడైంది. దాంతో ఏఆర్ డెయిరీ, భోలే బాబా డెయిరీ ప్రతినిధులతోపాటు వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయకాంత్ చద్వాను అరెస్టు చేశారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ వ్యవహారం బరితెగించి సాగించారు. అంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అంతా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే సాగిందన్నది స్పష్టమైంది. » తిరుపతి జిల్లా పెనబాకలో ఉన్న వైష్ణవి డెయిరీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పాత్ర పోషించిందని సీబీఐనే నిగ్గు తేల్చింది. అసలు వైష్ణవి డెయిరీకి అంత అనుకూలంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు వ్యవహరించిందంటే... వైష్ణవి డెయిరీ టీడీపీ సిండికేట్లో సభ్య డెయిరీనే. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్గా ఉన్న గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ, వైష్ణవి డెయిరీ వ్యాపార భాగస్వాములు. ఆ రెండింటి మధ్య దృఢమైన వ్యాపార బంధం ఉందని తాజాగా వెల్లడైంది. వైష్ణవి డెయిరీ వెబ్సైటే ఆ విషయాలను పేర్కొనడం గమనార్హం. తిరుపతి జిల్లా పెనబాకలోని వైష్ణవి డెయిరీ ప్రధాన ద్వారంపై సంగం డెయిరీ ఎంబ్లమ్ కూడా ముద్రించి ఉంది. సంగం డెయిరీ ట్యాంకర్లు వైష్ణవి డెయిరీలోకి వెళ్తున్న వీడియోలు కూడా బయటపడ్డాయి.» చాలా జిల్లాల్లో వైష్ణవి, సంగం డెయిరీలు ఉమ్మడిగా రిటైల్ అవుట్ లెట్లను నిర్వహిస్తున్నాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సంగం డెయిరీకే టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు అడ్డగోలుగా కట్టబెట్టిన వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. అంటే గతంలో భోలేబాబా డెయిరీ కల్తీ నెయ్యిని వైష్ణవి డెయిరీ ద్వారా సరఫరా చేశారు. భోలేబాబా డెయిరీ వ్యవహారం బయటపడటంతో ప్రస్తుతం సంగం డెయిరీ ద్వారా కథ నడపించాలని ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది. » అందుకోసం టీడీపీ కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా సాగించిన బాగోతం ఇలా ఉంది... కాగా వైష్ణవి – సంగం డెయిరీల బంధం బయటపడడంతో ఎంబ్లమ్ లు కనపడకుండా వైష్ణవి గేట్ల రంగులు మార్చేయడం గమనార్హం. అంతేకాకుండా రెండు డెయిరీల వెబ్సైట్లను కూడా తాత్కాలికంగా నిలుపుదల చేయడాన్ని చూస్తే.. వాటి మధ్య బంధం మరింతగా బట్టబయలైందని స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దల బెదిరింపులకు తలొగ్గిన జాతీయ డెయిరీలు» సంగం డెయిరీకి అనుకూలంగా నాలుగోసారి నోటిఫికేషన్ జారీ చేశారు. సంగం డెయిరీకి అనుకూలంగా నిబంధనలు విధించారు. అయిదేళ్ల అనుభవం ఉండాలి...వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లు ఉండాలన్న నిబంధనలే అందుకు తార్కాణం. పోటీలో ఉండకుండా ఇతర డెయిరీలను బెదిరించారు. ముందే రింగ్గా ఏర్పడి సంగం డెయిరీకి అనుకూలంగా సిండికేట్ వ్యవహారం నడిపారు. » సంగం డెయిరీకి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టాలని ప్రభుత్వం మొండి పట్టుదలతో ఉందని జాతీయ డెయిరీ సంస్థలకు అర్థమైంది. కాదని తాము బరిలో ఉంటే తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారని కూడా ఆ డెయిరీల యాజమాన్యాలు భయపడ్డాయి. దాంతో ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గి పోటీ నుంచి తప్పుకున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఆదేశించిన ధరకు బిడ్లు దాఖలు చేసి సంగం డెయిరీకి మార్గం సుగమం చేశాయి. ఎంత పక్కాగా కథ నడిపారు అంటే.. బిడ్లు దాఖలు చేసేందుకు గడువు తేదీ 2025, సెప్టెంబరు 4 తో ముగిసిన రెండు రోజుల్లోనే అంటే సెప్టెంబరు 6నే టీటీడీ టెక్నికల్ కమిటీ సభ్యులు సంగం డెయిరీని సందర్శించి సానుకూలంగా నివేదిక సమర్పించారు. » అంటే సంగం డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టాలని ముందే నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది. కర్ణాటక సహకార పాడి రైతుల ఫెడరేషన్ను పక్కనపెట్టేశారు. ఇక జాతీయస్థాయి డెయిరీలు కిలో నెయ్యి రూ.600 చొప్పున సరఫరా చేసేందుకు కోట్ చేశాయి. ముందే నిర్ణయించిన స్క్రిప్ట్ ప్రకారం సంగం డెయిరీ ఒక్క రూపాయి తక్కువకు అంటే కిలో నెయ్యి రూ.599 చొప్పున సరఫరాకు బిడ్ దాఖలు చేసింది. దాంతో సంగం డెయిరీకి 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఖరారు చేసింది. టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు తోపాటు టీటీడీ పాలకమండలి అందుకు ఆమోదముద్ర వేసింది. ఏది కల్తీ... ఏది దోపిడీ చంద్రబాబూ.. తమ దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. టీటీడీకి నెయ్యి కిలో రూ.325 చొప్పున సరఫరా చేయగా ఆ ధరను టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.638కి పెంచింది. ఎందుకంటే కల్తీ నెయ్యి సరఫరాను అరికట్టడానికి ఇలా చేశామని వితండవాదం లేవనెత్తింది. రూ.638 చొప్పున అయితేనే నాణ్యతతో కూడిన నెయ్యిని సరఫరా చేయగలమని చెబుతోంది. మరి అదే ఇందాపూర్ డెయిరీ ఆన్లైన్లో కిలో రూ.529 చొప్పున బహిరంగ మార్కెట్లో కిలో రూ.541 చొప్పున ఎలా విక్రయిస్తున్నట్టు? అంటే ఆన్లైన్, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తోంది కల్తీ నెయ్యి అని ఆ డెయిరీ ఒప్పుకుంటున్నట్టా? కాదు.. తిరుమల శ్రీవారి నిధులు కదా... బరితెగించి దోపిడీ చేసేందుకే కిలో నెయ్యి ఏకంగా రూ.638 చొప్పున ధర నిర్ణయించినట్టు సమ్మతించినట్టే కదా. అదే చంద్రబాబు ముఠా దోపిడీ పన్నాగం. తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రం వేదికగా చంద్రబాబు ముఠా బరితెగించి సాగిస్తున్న అవినీతి దందాతో యావత్ భక్తులు నివ్వెరపోతున్నారు. -
తాచుపాముతో కౌన్సిల్ సమావేశానికి..
నిడదవోలు: విష సర్పాల సంచారం ఎక్కువగా ఉన్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఓ కౌన్సిలర్ కౌన్సిల్ సమావేశానికి తాచుపామును తీసుకువచ్చి నిరసన తెలిపిన ఉదంతమిది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ, అత్యవసర సమావేశాలను చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. 20వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్ ఏకంగా తాచుపాముతో సమావేశానికి వచ్చారు. తన పరిధిలోని ఎంవీ నగర్ మదర్ థెరిస్సా మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల, పాత కమిటీ భవనాల ప్రాంతాల్లో విష సర్పాల సంచారం ఎక్కువగా ఉందని చెప్పారు. కౌన్సిల్ సమావేశాల్లో ఎన్నిసార్లు ఈ అంశాన్ని ప్రస్తావించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పాఠశాల సమీపంలో సంచరిస్తున్న తాచుపామును పట్టించి, ఓ తెల్లని డబ్బాలో పెట్టి, ఆ డబ్బాను సంచిలో పెట్టుకుని కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. పామును అధికారులను చూపించి, వినూత్నంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. చైర్మన్ ఆదినారాయణకు ఈ విషయం తెలిసింది. సమావేశంలో ఓ కౌన్సిలర్ పాములు తీసుకువచ్చినట్లు సమాచారం వచి్చందని, దానిని వెంటనే బయటకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. దీంతో, కౌన్సిలర్ అనిల్ కుమార్ తాచుపాము ఉన్న సంచీని బయట పెట్టారు. సమావేశం ముగిసిన తర్వాత మున్సిపల్ కార్యాలయం బయట తాను తీసుకువచి్చన పామును విలేకరులకు చూపిస్తూ నిరసన తెలిపారు. -
అరవ శ్రీధర్ మోసాలపై సాక్ష్యాలతో సహా నిరూపించా
సాక్షి టాస్క్ ఫోర్స్: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనకు చేసిన అన్యాయంపై సాక్ష్యాలతో సహా నిరూపించి నెల అయిందని, కమిటీలు వేశారు గానీ చర్యలు తీసుకోలేదని బాధిత మహిళ తాజాగా వీడియో ఒకటి విడుదల చేశారు. ‘జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ప్రత్యేకంగా కమిటీ వేసి హడావుడి చేశారు. అయితే ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక మహిళకు అన్యాయం జరిగితే అధికారం అండతో చర్యలు తీసుకోవడం లేదు. అరవ శ్రీధర్పై కేసు నమోదు చేశారు. నాపై కేసు నమోదు చేశారు.. అయితే ఏమి చేశారు..’ అని బాధిత మహిళ ప్రశ్నించింది. జనసేన పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారానే అరవ శ్రీధర్ తనకు పరిచయమయ్యాడని, అతను ఎమ్మెల్యే కాకపోతే తన జీవితంలోకి వచ్చేవాడు కాదని, ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. తాను తల్లి, తండ్రీ లేని అనాథనని, ఇప్పుడు అరవ శ్రీధర్ చేతుల్లో మోసపోయి ఎవరూ లేని ఒంటరిదాన్ని అయిపోయానని వాపోయింది. తప్పు చేసిన వాడు దర్జాగా క్రికెట్ ఆడుతున్నాడని, అధికారం అండతో అతన్ని కాపాడుతున్నారని విమర్శించింది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని వీడియో ద్వారా కోరారు. -
ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి?
సాక్షి, అమరావతి : ఏపీలో పాలు, నీళ్లు కల్తీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంత మంది ప్రాణాలు పోవాలంటూ చంద్రబాబు సర్కార్ను ప్రశ్నించారు. ‘ఎవరైనా బతకడం కోసం పాలు, నీళ్లు తాగుతారు. కానీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయి. పలుచోట్ల కల్తీ పాలు, కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థ ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరమైన ఆ రెండింటి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడు పాలనలో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ఆ ఘటనలు అద్దంపడుతున్నాయి. పరిపాలనపై చంద్రబాబు పూర్తిగా తన పట్టు కోల్పోగా, మిగిలిన వారంతా ప్రతిపక్షంపై బురద చల్లడం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు, రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ స్వార్థ ప్రయోజనాలు ఆశించి పనిచేస్తూ.. ప్రజారోగ్యం, ప్రజా రక్షణ వంటి వాటికి పూర్తిగా మంగళం పాడుతున్నారు. హాస్టళ్ల పరిస్థితిని ఎండగట్టిన జాతీయ మీడియా కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 16 మంది విద్యారి్థనులు డయేరియాతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. ఇదే పాఠశాలలో గతంలో కలుషిత నీటి కారణంగా పచ్చ కామెర్లతో ఇద్దరు బాలికలు మృతి చెందగా, దాదాపు 100 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. అంత దారుణంగా ఘటనలు చోటు చేసుకున్నా, సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు ఆ విధంగా వ్యవస్థ దారుణంగా విఫలం కాగా, మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గత 14 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రతవల్ల వ్యాధుల వంటి ఘటనలు దాదాపు 25 చోటు చేసుకున్నాయి. వాటివల్ల 15 జిల్లాల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయాన్ని జాతీయ మీడియా సైతం ప్రముఖంగా ప్రచురించింది. పూర్తిగా కొరవడిన పరిశుభ్రత, కలుషిత నీరు, ఆహారం, హాస్టళ్లలో దారుణ పరిస్థితులను జాతీయ మీడియా కూడా ఎండగట్టింది. ఐదుగురు మృతి.. 200 మంది ఆస్పత్రుల పాలు రాష్ట్రంలో గడిచిన 18 నెలల్లో చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో పెద్దఎత్తున డయేరియా ప్రబలింది. ఫలితంగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రత అందుకు ప్రధాన కారణాలు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం, లెక్కలు కావు. ప్రభుత్వ నిర్లక్ష్యం, హాస్టళ్లపై పూర్తిగా కొరవడిన పర్యవేక్షణ, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టవలసిన చర్యల్లో వైఫల్యానికి అద్దంపడుతున్నాయి. గత వారం పరిస్థితి మరింత దారుణంగా మారింది. శ్రీకాకుళంలో కలుషిత నీటి కారణంగా తీవ్ర డయేరియా వ్యాప్తి చెందింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది ఆస్పత్రుల పాలయ్యారు. అతిసారం, ఇన్ఫెక్షన్లతో పలు కుటుంబాలు తల్లడిల్లాయి. ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్ష, సురక్షిత నీటి సరఫరా కోసం తగిన మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వేగంగా స్పందించి, నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో వైఫల్యాన్ని స్పష్టంగా చూపాయి. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం.. రాజమహేంద్రవరం ఘటనే సాక్ష్యం రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాల కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో వివిధ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. ఇంకా మరెందరో అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. పోషణ ఇవ్వాల్సిన పాలు చివరకు మరణానికి కారణమయ్యాయి. ఇది ఏదో ఒక చిన్నపాటి లోపం కాదు. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం, దానికి సంబంధించిన యంత్రాంగాల వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర లేచి, నిజాయితీగా పరిస్థితిని సమీక్షించాలి. ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించాలి. వాటన్నింటినీ సరిచేయాలి. వాటి ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన వీడాలి. సురక్షిత నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రత పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలుచేయాలి. వీటన్నింటిపై చిత్తశుద్ధితో పని చేయాలి. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏవో అద్భుతాలు కోరుకోవడం లేదు. ఇంకా మరిన్ని ప్రాణాలు పోకముందే ప్రభుత్వం మేల్కొని, తగిన చర్యలు చేపట్టాలని మాత్రమే ప్రజలంతా ఆశిస్తున్నారు. Hello India,People of Andhra Pradesh are dying after drinking milk and water. What should be, the most basic necessities of life, have turned into sources of fear. Under the TDP-led coalition government and Chief Minister @ncbn, repeated outbreaks of diarrhoea and food… pic.twitter.com/YaOts9IUcB— YS Jagan Mohan Reddy (@ysjagan) February 27, 2026 -
అర్చకులు సౌందర్ రాజన్ కన్నుమూత.. వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సౌందర్ రాజన్ దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ సేవలో అంకితభావంతో పనిచేశారని.. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు.సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలోనూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారన్న వైఎస్ జగన్.. సౌందరరాజన్ మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ అన్నారు. -
కుట్రలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: కుట్రలకు కేంద్రం, పాపాలకు కేంద్ర బిందువు చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిస్సిగ్గు రాజకీయాలు చంద్రబాబుకే చెల్లు అని దుయ్యబట్టారు. ‘‘చేసిన పాపాలు పండాయి.. ఇక శిక్ష అనుభవించటమే తరువాయి.. చంద్రబాబుకు దేవునిపై ఏమాత్రం భక్తి లేదు. దేవుడ్ని నమ్మనని 1995లోనే చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తి కాబట్టే తిరుమల లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు’’ అని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు.‘‘వైఎస్ జగన్ మీద దారుణమైన విమర్శలు చేశారు. దొంగదారిలో ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు జీవితం అంతా అత్యంత వివాదాస్పదమే. యూనివర్సిటీలో కూడా రెడ్డి, కమ్మల మధ్య గొడవలు పెట్టారు. తన అవసరాలకు ఎవర్నయినా, ఎలాగైనా వాడతారు. ఒక్కో ఎలక్షన్కు ఒక్కో పార్టీని వాడుకుంటున్నారు. మోదీని తీవ్రంగా విమర్శలు చేసి మళ్లీ ఆయన చెంతకే చేరారు. కాంగ్రెస్ని విమర్శలు చేసి మళ్లీ అదే పార్టీకి చేరారు...అతి పేదరికంలో పుట్టిన చంద్రబాబుకు డబ్బు మీద విపరీతమై ఆశ ఉంది. లక్షల కోట్లు సంపాదించాలనే లక్ష్యం తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం లేదు. ఏ మమకారం లేని చంద్రబాబు తన భార్యను కూడా రాజకీయాలకు వాడుకున్నారు. చంద్రబాబు ఆరు లక్షల కోట్లు సంపాదించారు. ఎన్నిసార్లు సీఎం అయినా ఏపీకి ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చారా?..ఎవరో తెచ్చిన ప్రాజెక్టును తానే తెచ్చానని గొప్పగా చెప్పుకుంటారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు నిష్ణాతులు. హెరిటేజ్ సంస్థలోని వాటాదారులను కూడా బలవంతంగా బయటకు పంపారు. కుట్రలకు కేరాఫ్ అడ్రెస్ చంద్రబాబు. ఆయన చదువుకునే సమయంలో పరీక్షలను కూడా వేరే వారితో రాయించి పాస్ అయ్యారు. ఆయన చెప్పుకునే వయసు కూడా కరెక్టు కాదు. షూ లేకుండా దేవుని పూజలు ఎప్పడైనా చేశారా?. దేవుడ్ని రాజకీయాల్లోకి తెచ్చిన చంద్రబాబు కఠినమైన శిక్ష అనుభవిస్తారు. రాయలసీమ లిఫ్టును ఆపేసి ఆ ప్రాంత ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. లడ్డూలో కల్తీ నెయ్యి వెనుక హెరిటేజ్ ఉందని తేలింది...అసెంబ్లీలోనూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. వైఎస్సార్సీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారు. చంద్రబాబు చేసే ఆరోపణలు చూస్తుంటే ఆయనకు మైండ్ పని చేయటం లేదని అర్థం అవుతోంది. అందుకే వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలపై ఆరోపణలు చేస్తున్నారు. సుబ్బారెడ్డి భార్య మీద కూడా ఆరోపణలు చేశారంటే చంద్రబాబు అంత నీచుడు మరొకరు లేరు. హిందూ, క్రైస్తవుల మధ్య గొడవలు సృష్టించటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ని హతమార్చి ఆయన కుటుంబాన్ని సైతం కనుమరుగు చేసిన నీచుడు చంద్రబాబు’’ అంటూ లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. -
రఘురామను కస్టడీలో కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?: సునీల్ కుమార్
సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామ జస్ట్ అలా కిందపడితేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి.. నిజంగా కస్టడీలో ఆయనను ఎవరైనా కొట్టి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ తాజాగా ట్విట్టర్ వేదికగా.. రఘురామకు కాలు, చెయ్యి విరగటంపై స్పందించారు. ఈ సందర్బంగా సునీల్ కుమార్..‘రఘురామ జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా ఆయనను కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?. అది కూడా ఆయన వర్ణించిన అంత దారుణంగా కొడితే?. అబద్ధాలు బయట పడుతున్నాయి.. నిజం దాగదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడి లో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి? అది కూడా ఆయన వర్ణించిన అంత దారుణంగా కొడితే ?అబద్ధాలు బయట పడుతున్నాయి… నిజం దాగదు pic.twitter.com/sdyw8IA0D7— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) February 27, 2026ఇక, అంతకుముందు కూడా రఘురామపై సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బ్యాంకులను మోసం చేసిన కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీబీఐని ట్యాగ్ చేస్తూ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు. సునీల్ నాయక్నే బెదిరించారంటే ఇక సీబీఐ కేసుల్లోని సాక్షులను కూడా రఘురామ బెదిరిస్తారని అన్నారు. అందుకు అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాక్షులను రక్షించడానికి నిందితుడు రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేయటమే సరైన మార్గం. ఈ విషయాలపై సీబీఐ దృష్టి సారించాలని దర్యాప్తు సంస్థను కోరారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే రఘురామపై రూ.947 కోట్లు, రూ.238 కోట్లు ఎగ్గొట్టారనే రెండు కేసులపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. -
ఉద్యోగులపై క్రమశిక్షణ కేసుల పరిష్కారంలో ఇంత జాప్యమా?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల కేసుల విచారణ ప్రక్రియలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మూడు నుంచి ఆరు నెలల్లో ఈ కేసులు పరిష్కారం కావాలన్న ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ కేసులను ఒక కొలిక్కి తెచ్చేందుకు అసాధారణ నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న 5,424 కేసులు పరిష్కారం అయ్యే వరకు ఈ వ్యవహారాన్ని నిరంతరం (కంటిన్యూస్ మాండమస్) పర్యవేక్షించాలని నిర్ణయించింది. 2025 డిసెంబర్ 15వ తేదీ నాటికి పెండింగ్లో ఉన్న 5,424 క్రమశిక్షణ చర్యల కేసులను మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 6 నెలల్లో కేసులు పరిష్కారం కావాలని ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ గడువులోపు విచారణను ముగించకుంటే ఏం చేయాలన్న దానిపై స్పష్టతనివ్వకపోవడం వల్ల ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇకపై నాలుగు నెలలకొకసారి ఈ కేసుల పురోగతిని తమకు తెలియచేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ ఇటీవల తీర్పు వెలువరించారు. తనపై రెండు అభియోగాలతో చేపట్టిన క్రమశిక్షణ చర్యల ప్రొసీడింగ్స్ను వీలైనంత త్వరగా ముగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈఎస్ఐ ఆసుపత్రిలో స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జన్గా పనిచేస్తున్న జి.రవికుమార్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. 5,424 క్రమశిక్షణ చర్యల కేసులుక్రమశిక్షణ చర్యల కేసుల్లో విచారణను ఎందుకు సకాలంలో ముగించడం లేదో చెప్పాలని ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని న్యాయమూర్తి ఆదేశించారు. కొత్త నియామకాలు, బదిలీలు, పదవీ విరమణలు, డేటా లభ్యత లోపం, ఫైళ్లు వివిధ కార్యాలయాల్లో ఉండడం, పదోన్నతుల వల్ల అధికార మార్పులు వంటి కారణాలతో క్రమశిక్షణ చర్యల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని ప్రధాన కార్యదర్శి రాతపూర్వకంగా హైకోర్టుకు నివేదించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2025 డిసెంబర్ 15వ తేదీ నాటికి మొత్తం 5,75,613 మంది ఉద్యోగులు ఉంటే, 5,70,713 మంది ఉద్యోగుల వివరాలు మ్యాప్ అయ్యాయి. 5,424 క్రమశిక్షణ చర్యల కేసులు పలువురు ఉద్యోగులపై పెండింగ్లో ఉన్నాయి. అత్యధికంగా హోంశాఖలో 1,558, రెవెన్యూ శాఖలో 854, రవాణా, రోడ్లు భవనాల శాఖలో 384, పురపాలక శాఖలో 366 కేసులు పెండింగ్లో ఉన్నాయి. జీవించే హక్కును హరించడమే: హైకోర్టు కీలక వ్యాఖ్యలు» ఈ కేసుల విచారణలో జాప్యం రాజ్యాంగం ప్రసాదించిన గౌరవంగా జీవించే హక్కును హరిస్తోంది. » క్రమశిక్షణ చర్యల కేసులు ఓ కొలిక్కి రాకుండా ఏళ్ల తరబడి పేరుకుపోతుండటంతో న్యాయస్థానాల్లో పెద్ద సంఖ్యలో కేసులు దాఖలవుతున్నాయి. » ఇవి న్యాయవ్యవస్థపై మోయలేని భారాన్నిమోపడమే కాకుండా, ఉద్యోగులూ మానసిక వేదనకు గురవుతున్నారు. » ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలు చాలా సందర్భాల్లో అతనిపై పెండింగ్లో ఉన్న క్రమశిక్షణ చర్యల కేసుతో ముడిపడి ఉంటాయి. » చార్జ్ మెమోలతో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పిం చాలని, సీనియారిటీ పునరుద్ధరించాలని, జాప్యం ఉన్నందున క్రమశిక్షణ చర్యలను కొట్టేయాలని, పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పించాలని, అలాగే కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని.. ఇలా పలు అంశాలపై పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలవుతున్నాయి. » క్రమశిక్షణ చర్యల కేసుల్లో విచారణను త్వరగా ముగించడమన్నది కేవలం ఆ ఉద్యోగి హక్కు మాత్రమే కాదు. సంబంధిత శాఖకు సైతం ఆ హక్కు ఉంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తప్పు చేసిన ఉద్యోగులను శిక్షించి, నిజాయితీపరులైన అధికారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. -
స్ట్రెచ్చర్లకూ దిక్కులేదు..
గుంటూరు మెడికల్: సుస్థిర పాలన అని డబ్బాలు కొట్టుకుంటున్న చంద్రబాబు సర్కారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులూ కల్పించలేక చతికిలపడుతోంది. ఫలితంగా పేద రోగులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. గుంటూరు జీజీహెచ్ అత్యవసర వైద్యసేవల విభాగంలో దర్శనమిచ్చిన ఈ చిత్రమే సర్కారు ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఈ ఆస్పత్రిలో రోగులను వార్డులకు, వైద్యుల వద్దకు తరలించేందుకు వీల్చైర్లు, స్ట్రెచ్చర్లు లేవు. ఫలితంగా గురువారం అత్యవసర సేవల కోసం తీసుకువచ్చిన ఓ రోగిని బంధువులే మోసుకెళ్లారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సర్కారు తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉంటే వైద్యులూ తమకు కేటాయించిన గదుల్లో అందుబాటులో ఉండడం లేదు. ఫలితంగా వైద్యసేవలు అందక రోగులు, వారి బంధువులు వార్డుల్లోనే పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పేద రోగులు ఎక్కువగా గుంటూరు జీజీహెచ్కి తరలివస్తుంటారు. రోజుకు సుమారు నాలుగు వేలకు పైగా ఓపీ ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ ఆస్పత్రిలోనే వసతుల కల్పనను ప్రభుత్వం గాలికొదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రివేళల్లో అయితే ఆస్పత్రిలో దుస్థితి మరీ ఘోరంగా ఉంటుందని రోగులు చెబుతున్నారు. డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఎమర్జెన్సీ, ఇతర వార్డుల్లో వైద్య సేవలు సక్రమంగా అందేలా చూడాల్సిన సివిల్ సర్జన్ ఆర్ఎంఓ వ్యవస్థ ఈ ఆసుపత్రిలో కానరాకపోవడం గమనార్హం. -
తప్పు ఒప్పుకోకుండాఉపన్యాసాలా?
సాక్షి, అమరావతి: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపించానని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.. అది వాస్తవమా? కాదా?.. రేవంత్ వ్యాఖ్యలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా?.. అది చూస్తూ మేం ఊరుకోవాలా? ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం సభలో మేం ప్రశ్నిస్తే సమాధానం చెప్పరా? మీరు ఏం చెప్పినా మేం తలూపాలా..?’’ అంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందో లేదో సూటిగా జవాబు చెప్పాలి అని నిలదీశారు. అధికారపక్షం జవాబు చెప్పకుండా దాటవేయటాన్ని బట్టి రేవంత్రెడ్డి చెప్పిందే నిజమేనని ఒప్పుకున్నట్లైందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మేం అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక దాటవేత ధోరణి ఎందుకు అని ప్రశ్నించారు. ‘సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి.. లేదంటే సమాధానం చెప్పలేం.. తర్వాత చెబుతామని ఒప్పుకోండి. ఇది రాజకీయ అంశం కాదు.. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం’ అని తేల్చి చెప్పారు. చంద్రబాబుతో తనకున్న సన్నిహిత సంబంధాలతో రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపివేయించానని రేవంత్రెడ్డి పేర్కొనటంపై అధికారపక్షం సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఈ ప్రాజెక్టు రాయలసీమకు ఎంత అవసరమో గుర్తించి ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎన్ని గొడవలు వచ్చినా పనులు చేపట్టామని గుర్తు చేశారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ‘పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్’పై గురువారం శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఇషాక్బాషా, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ 2014లో పూర్తయిందని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాల మేరకు నిలిపివేశారని, ఆ పథకంలో 22.82 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. స్వప్రయోజనాల కోసం బాబు లాలూచీ..!రాయలసీమకు ఎంతో అవసరమైన ఆ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇషాక్బాషా డిమాండ్ చేశారు. రాయలసీమ నీటి కష్టాలను తీర్చేందుకు వైఎస్ జగన్ ఆ ప్రాజెక్ట్ను ప్రారంభించారని గుర్తు చేశారు. రేవంత్రెడ్డి సూచనల మేరకు ఆ ప్రాజెక్టును నిలిపివేయడం వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతోందని, రాయలసీమ వాసిగా దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ఇషాక్ బాషా ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి రాయలసీమకు హక్కుగా రావాల్సిన నీటిని ఆపడం న్యాయమా? దాన్ని పూర్తి చేస్తారా? లేక రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారా? అని ఇషాక్ బాషా ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరంలేదని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు నుంచి గత 20 ఏళ్లుగా నీటిని పూర్తిగా వాడుకోలేకపోయామన్నారు. రేవంత్రెడ్డి ప్రకటనను సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఖండించకపోవడం దారుణమన్నారు. ఎత్తిపోతల ప్రాజెక్టును కచ్చితంగా చేపట్టి రాయలసీమ ఎడారి కాకుండా కాపాడాలని కోరారు. రాజకీయ ధృక్పధంతోనే ఆ ప్రాజెక్టును ఆపేశారని ప్రజలు నమ్ముతున్నారని, దానిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ఎమ్మెల్సీ సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.సమాధానం చెప్పకుండా అధికారపక్షం సుదీర్ఘ ప్రసంగాలువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న సమయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో 10.31 గంటలకు చైర్మన్ కొయ్యే మోషేన్రాజు సభను వాయిదా వేశారు. అనంతరం 10.43 గంటలకు సభ పునఃప్రారంభమైన వెంటనే ప్రభుత్వం రెండో ప్రశ్నకు జవాబు చెప్పాలని సూచించడంపై ప్రతిపక్ష నేత బొత్స అభ్యంతరం తెలిపారు. మొదటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకుండా రెండో ప్రశ్నకు ఎలా అనుమతిస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు వెల్లో నిల్చుని నిరసన తెలిపారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా మంత్రులు సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నారని బొత్స అభ్యంతరం తెలిపారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు వెల్లోకి చేరుకుని నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో మళ్లీ 10.48గంటలకు సభను రెండోసారి వాయిదా వేసిన చైర్మన్ మళ్లీ 11.03 గంటలకు తిరిగి ప్రారంభించారు. లైన్మెన్ల నియామకంపై టీడీపీ సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి బదులిచ్చిన అనంతరం గాలేరు–నగరి సుజల స్రవంతి, రాయలసీమ ప్రాజెక్టులపై ఎంవీ రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు బదులిచ్చారు. మంత్రి తాము అడిగిన దానికి కాకుండా ఏదో చెబుతున్నారంటూ వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. పోడియం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు వెల్లో నిల్చుని బిగ్గరగా కేకలు వేశారు. ఇలాంటి వ్యూహాలతో వస్తే సభను నడపలేమని చైర్మన్ మోషేన్రాజు అసహనం వ్యక్తం చేశారు. సభలో ఆందోళన నెలకొనడంతో కేవలం మూడు ప్రశ్నలకే సమాధానం రాగా మిగిలిన వాటిని డీమ్్డగా ప్రకటించిన చైర్మన్ మండలిని వాయిదా వేశారు.రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను చెబితేనే చంద్రబాబు ఆపారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శాసనసభ సాక్షిగా వెల్లడించారు. అది నిజమా.. కాదా? ఈ పథకాన్ని ఎప్పటిలోగా ప్రారంభించి, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలి. రేవంత్రెడ్డి బాధ్యత కలిగిన సీఎం పదవిలో ఉంటూ ఏపీ ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు జవాబు చెప్పాలి. అలా కాకుండా రాజకీయ ఉపన్యాసాలు ఏమిటి? మీకు రాయలసీమకు నీరు రావడం ఇష్టం లేదు.. అందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవం కాదని చెప్పడం లేదు.. – శాసన మండలిలో ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత బొత్స ధ్వజం -
ఈవీఎంలపై అనుమానాలు నివృత్తి చేయాలి
మహారాణిపేట: ఎన్నికల కమిషన్ చొరవ తీసుకొని ఈవీఎంల విషయంలో రాజకీయ పార్టీలు, ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు డిమాండ్ చేశారు. ‘ఈవీఎంలు–ఎన్నికల ఫలితాలు’ అనే అంశంపై గురువారం విశాఖలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో బెటర్ ఏపీ, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ సంయుక్తంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. వివిధ రాజకీయ పార్టీలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గతంలో ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని స్వయంగా చంద్రబాబు చెప్పారని అన్నారు. చంద్రబాబు దగ్గర ఐటీ సలహాదారుగా పనిచేసిన వేమూరి కృష్ణప్రసాద్ బహిరంగంగా ఈవీఎంలను హ్యాక్ చేయడమే కాకుండా వాటిని ఎలా హ్యాక్ చేయవచ్చనే అంశంపై ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారని గుర్తు చేశారు. వీటిని సునాయాసంగా హ్యాక్ చేయవచ్చని అపరకుబేరుడు, అమెరికాకు చెందిన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కూడా స్పష్టం చేశారన్నారు. ఈవీఎంలపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, భారత్లో కూడా ఇటువంటి అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం మౌనం వీడి, సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ డాక్టర్ శీతల్, బెటర్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర కన్వీనర్ జి.త్యాగరాజన్, ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు, వైఎస్సార్సీపీ నాయకులు పల్లా దుర్గారావు, మార్కండేయులు, కమ్యూనిస్టు నేత సూర్యనారాయణ, కాంగ్రెస్ నేత కస్తూరి వెంకటరావు, రైల్వే యూనియన్ నాయకుడు కె.రామచంద్రమూర్తి, పటా్నయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘సెకీ’కి సెల్యూట్!
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు (విద్యుత్ షెడ్యూలింగ్, ఆఫ్ టేక్ ప్రారంభం) ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇది చాలా ఉపయోగకర ఒప్పందమని ఏపీ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) చేసిన సూచనపై సానుకూలంగా స్పందించింది. తద్వారా ఇన్నాళ్లూ చంద్రబాబు అండ్ కో ‘సెకీ’ ఒప్పందంపై చేసిందంతా విష ప్రచారమేనని తేటతెల్లమైంది. 2021 డిసెంబర్ 1న కుదిరిన పవర్ సేల్ అగ్రిమెంట్ (పీఎస్ఏ) ప్రకారం ఈ విద్యుత్ సరఫరా జరుగుతుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ (కనెక్టివిటీ ఆపరేషనలైజేషన్) పూర్తయిన అనంతరం విద్యుత్ తీసుకునే ప్రక్రియ (షెడ్యూలింగ్) ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రక్రియలో ఏపీపీసీసీతోపాటు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు, ఏపీఆర్ఏపీఎల్, ఏపీఎస్ఎల్డీసీ సంస్థలు ఎస్ఈసీఐ, సీటీయూఐఎల్, ఆర్ఎల్డీసీలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పీఎస్ఏ నిబంధనలకు అనుగుణంగా వాణిజ్య లావాదేవీలు (కమర్షియల్ సెటిల్మెంట్) నిర్వహించాలని సూచించింది. దీర్ఘకాలిక విద్యుత్ వినియోగం కోసం జనరల్ నెట్వర్క్ యాక్సెస్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ(జిఎన్ఏ–ఆర్ఈ) వెసులుబాటును పొందాలని కూడా స్పష్టం చేసింది. అలాగే, ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం విద్యుత్ స్వీకరణ జరుగుతుందని, ఏపీ సరిహద్దు వరకు ఇంటర్ స్టేట్ ట్రాన్స్విుషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్–అంతర్రాష్ట్ర ప్రసారం) చార్జీలు, నష్టాలపై రాష్ట్రానికి ఎలాంటి బాధ్యతా ఉండదని తెలిపింది. ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపుతో యూనిట్ రూ.2.49కి సౌర విద్యుత్ సరఫరా చేస్తామంటూ గతప్రభుత్వానికి సెకీ రాసిన లేఖ అదీ విజన్ అంటే.. » రైతులు పడుతున్న అవస్థలను చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, వారికి ఉచిత విద్యుత్ను హక్కుగా అందించాలని సంకల్పించారు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్లపాటు రోజుకు 9 గంటల చొప్పున పగటిపూటే ఇవ్వాలని దృఢంగా భావించారు. దానికి తగ్గట్టుగానే ముందుచూపుతో ఆలోచించి సౌర విద్యుత్ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వ్యవసాయానికి సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టారు. » అదే సమయంలో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు (ఐఎస్టీఎస్) మినహాయించి, యూనిట్ రూ.2.49 చొప్పున విద్యుత్ను సరఫరా చేస్తామంటూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్ 15 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే యూనిట్ రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల విద్యుత్ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. » ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ ఆమోదించింది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్లపాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్విుషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుందని ఒప్పందంలో స్పష్టంగా ఉంది. అయినా ఈ ఒప్పందం వల్ల ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపు ఉండదని అప్పట్లో చంద్రబాబు అదే పనిగా దుష్ప్రచారం చేశారు. ఎల్లో మీడియా ఆయనకు వంత పాడుతూ పుంఖానుపుంఖాలుగా తప్పుడు కథనాలు ప్రచురించింది. » కానీ అవన్నీ అవాస్తవాలని ఒప్పుకుంటూ.. ఇప్పుడు అదే చంద్రబాబు కూటమి ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు, నష్టాలు సెకీ విద్యుత్కు వర్తించవని అధికారికంగా స్పష్టం చేసింది. దీంతో ఇన్నాళ్లూ వారు చేసిందంతా అసత్య ప్రచారమని వారే అంగీకరించినట్లయింది. -
చర్చ.. రచ్చ!
సాక్షి, అమరావతి: అటు రాయలసీమ లిఫ్ట్.. ఇటు తిరుమల లడ్డూ ప్రసాదం..టీడీపీ పెద్దలను ఇరుకున పెట్టిన రెండు అంశాలపైనా శాసన మండలిలో చర్చ జరగకుండా చంద్రబాబు సర్కారు పలాయనం చిత్తగించింది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు.. క్లోజ్డ్ రూమ్ మీటింగ్లతో చీకటి ఒప్పందాలు.. ఇందాపూర్ – హెరిటేజ్ అనుబంధంపై విపక్ష వైఎస్సార్సీపీ మండలిలో గట్టిగా నిలదీయడంతో చర్చకు అధికార పక్షం ముఖం చాటేసింది. విచిత్రంగా స్పల్పకాలిక చర్చలో ముందుగా ప్రభుత్వం తరపున మంత్రి ప్రకటన చేశాకే విపక్షం మాట్లాడాలంటూ మెలికపెట్టి పారిపోయింది! హెరిటేజ్ పేరు సభ సాక్షిగా బయటకు వస్తుందనే భయంతో అధికార పక్షం రభస సృష్టించింది. సీఎం చంద్రబాబుతో క్లోజ్డ్ రూమ్ మీటింగ్లో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పనులను తాను నిలుపుదల చేయించినట్లు తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటనపై సూటిగా సమాధానం చెప్పాలంటూ మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీయడంతో కూటమి సర్కారు దిక్కుతోచక పారిపోయింది. ఇక టీటీడీ లడ్డూ ప్రసాదం అంశంపై ప్రస్తుత సమావేశాల్లోనే చర్చకు పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఐదురోజుల పాటు శాసనమండలిని స్తంభింపచేశారు. ‘మండలి’ బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం గురువారం చర్చకు అంగీకరించిన కూటమి సర్కారు తీరా సభ ప్రారంభం కాగానే మెలిక పెట్టింది. స్వల్పకాలిక చర్చ నిబంధనలకు విరుద్ధంగా ముందుగా ప్రభుత్వం తరఫున ప్రకటన చేస్తామంటూ మంత్రులే చర్చను అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం స్వల్పకాలిక చర్చ జరిగితే.. లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో నిజం లేదని సీబీఐ చార్జిషీట్ సాక్షిగా వెల్లడి కావడం.. అధిక ధరలకు హెరిటేజ్ అనుబంధ సంస్థ ద్వారా టీటీడీ నెయ్యి కాంట్రాక్టులను దక్కించుకోవడం.. ఇందాపూర్తో చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ అనుబంధం.. లాంటి అంశాలన్నీ చట్టసభ సాక్షిగా విపక్షం ఎండగడుతుందనే భయంతో ప్రభుత్వం చర్చ జరగకుండా అడ్డుకుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లడ్డూ ప్రసాదంపై చర్చ గురువారం వాయిదా పడినప్పటికీ మరుసటి రోజు శుక్రవారం సభలో ఆ అంశాన్ని చేపట్టే అవకాశం ఉన్నా.. మంత్రి పయ్యావుల కేశవ్ బయట మీడియాతో మాట్లాడుతూ మార్చి 4న ఆ అంశంపై చర్చ చేపడతామని ప్రకటించడం ప్రభుత్వ ఎత్తుగడను తెలియచేస్తోందని స్పష్టం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీడీపీ చంద్రబాబు సర్కారు ఆడుతున్న కపట నాటకం శాసన మండలి వేదికగా మరోసారి బట్టబయలైంది! టీటీడీ లడ్డూ ప్రసాదంపై జరగాల్సిన స్వల్పకాలిక చర్చను గురువారం సభ ప్రారంభం కాగానే అధికార పక్షం అడ్డుకొని గందరగోళం సృష్టించింది. దీంతో మండలి వాయిదా పడింది. సభా నిబంధనల ప్రకారం స్వల్పకాలిక చర్చలో ముందుగా మంత్రి ప్రకటనకు అవకాశం లేదని మండలి చైర్మన్ మోషేన్రాజు స్పష్టం చేసినప్పటికీ.. శాసన సభావ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ముందుగా ప్రభుత్వం తరఫున ప్రకటన చేసిన తర్వాతే చర్చ చేపట్టాలని, సభను ఎలా జరపాలో ప్రభుత్వానికి చెబుతారా..? అంటూ రభస సృష్టించడంతో గందరగోళ పరిస్థితుల నడుమ సభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏదో ఒక వంకతో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోతోందని విమర్శించారు. ప్రభుత్వం చెప్పేవన్నీ సత్యదూరం, అబద్ధాలని ధ్వజమెత్తారు. తొలుత చైర్మన్ అనుమతితో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి లడ్డూ ప్రసాదంపై స్వల్పకాలిక చర్చను ప్రారంభిస్తూ రెండు సార్లు మాట్లాడేందుకు ప్రయత్నించినా టీడీపీ సభ్యులు గందరగోళ పరిస్థితులు సృష్టించడంతో ప్రసంగం ముందుకు సాగలేదు. ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా పడిన శాసన మండలి మధ్యాహ్నం 1.07 గంటల సమయంలో తిరిగి ప్రారంభమైంది. చైర్మన్ మోషేన్రాజు సభలోకి రాగానే టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు చేరుకుని ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించాలని పట్టుబట్టారు. దీనిపై చైర్మన్ మోషేన్రాజు స్పందిస్తూ.. నేను ఏం మొదలుపెడుతున్నానో తెలియకుండానే ప్రశ్నోత్తరాలు అంటున్నారంటే.. మీరు ముందుగానే నిర్ణయించుకుని వచ్చినట్లుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్సీలను వారి స్థానాల్లో కూర్చోవాలని సూచించారు. ఈ సమయంలో మంత్రి పయ్యావుల కేశవ్ జోక్యం చేసుకోవడంతో.. చైర్మన్ మోషేన్రాజు స్పందిస్తూ.. ‘మీరు శాసనసభా వ్యవహారాల మంత్రి. మీకు అన్నీ తెలుసు. ఒకసారి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ‘డీమ్డ్ టూ బీ ఆన్సర్..’ అన్న తర్వాత మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు..?’ అని వ్యాఖ్యానించారు. అనంతరం చైర్మన్ ఓ ప్రకటన చేశారు. లడ్డూ ప్రసాదం అంశంలో స్వల్పకాలిక చర్చ చేపడుతున్నామని, చంద్రశేఖర్రెడ్డిని చర్చ ప్రారంభించాలని సూచించారు.ఎలా జరపాలో ప్రభుత్వానికి చెబుతారా సార్..?చైర్మన్ అనుమతితో విపక్ష ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి లడ్డూ ప్రసాదం అంశంపై చర్చను ప్రారంభించి మాట్లాడడం మొదలుపెట్టగానే మంత్రి పయ్యావుల కేశవ్ అడ్డుపడ్డారు. ముందుగా ప్రభుత్వం తరఫున సంబంధిత శాఖ మంత్రి ప్రకటన చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ చైర్మన్కు సూచించారు. సభా నిబంధనలు అందుకు అనుమతించవని చైర్మన్ స్పష్టం చేయడంతో... ‘సభను ఎలా జరపాలో ప్రభుత్వానికి చెబుతారా సార్..? ఎలా జరపాలి? ఏం జరపాలన్నది ప్రభుత్వానికి సూచన చేస్తారా..?’ అంటూ పయ్యావుల వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, మంత్రి మధ్య కొద్దిసేపు సంభాషణ కొనసాగింది.మాటకు మాట...! మంత్రి కేశవ్: ప్రభుత్వం ఈ రోజు ఈ అంశంపై సమాధానం చెప్పడానికి ఎంతసేపైనా సిద్ధంగా ఉంది. వినడానికి ఓపికగా ఉండండి. సంప్రదాయం ప్రకారం మంత్రి మాట్లాడతారు. మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి.చైర్మన్ మోషేన్రాజు: ఆర్థిక మంత్రి గారూ.. మీరు చెప్పేది కరెక్టు కాదు. ఎందుకంటే.. స్వల్పకాలిక చర్చలో మంత్రి ప్రకటన చేయడమనే నిబంధన లేదు. ప్రకటనే చేయాలనుకుంటే ప్రభుత్వానికి హక్కు ఉంది. వేరే ఫార్మాట్లో వస్తే నేను ఖచ్చితంగా అవకాశం ఇస్తా. అంతేగానీ స్వల్పకాలిక చర్చలో మంత్రి ప్రకటనకు అవకాశం లేదు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఉంది కాబట్టే నేను అవకాశం ఇచ్చా.మంత్రి కేశవ్: ఒక నిమిషం సార్..చైర్మన్ మోషేన్రాజు: దీనిపై చర్చ వద్దండీ..!కేశవ్: స్వల్పకాలిక చర్చకు 150 కాపీల నోట్లు ఏర్పాటు చేయమని రాశారు. ఎవరు రాశారు? మీరే కదా? చైర్మన్: దటీజ్ రాంగ్ డాక్యుమెంట్. నా అనుమతితో చేసిన కమ్యూనికేషన్ కాదు.విపక్షం మైక్ కట్.. పోడియం వద్దకు సభ్యులుసభలో గందరగోళం మధ్యే లడ్డూపై చర్చను ప్రారంభించి మాట్లాడుతున్న విపక్ష ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి మైక్ కట్ కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన తెలుపుతూ చైర్మన్ పోడియం వద్దకు చేరుకున్నారు. తమ సభ్యుడు మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని, చర్చను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు ముందుగా ప్రభుత్వం తరఫున ప్రకటనకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. దీనిపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ప్రభుత్వం చర్చను పక్కదారి పట్టించాలని చూస్తోందని, బీఏసీలో అనుకున్న ప్రకారం చర్చకు రావాలని కోరారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డిని మాట్లాడేందుకు చైర్మన్ మరోదఫా అనుమతించగా.. మంత్రులతోపాటు టీడీపీ సభ్యులంతా ముందుగా ప్రభుత్వం తరఫున ప్రకటన చేసేందుకు అనుమతించాలంటూ తిరిగి గందరగోళం సృష్టించారు. ఇరుపక్షాల సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభను శుక్రవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. -
తిరుమల ప్రతిష్టను పెంచింది వారే: వరుదు కళ్యాణి
సాక్షి, అమరావతి: తిరుమల ప్రతిష్టను పెంచింది వైఎస్సార్, వైఎస్ జగన్లేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఆమె ఇవాళ(గురువారం) అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ఇంటి దైవం అంటూనే చంద్రబాబు శ్రీవారి ప్రసాదంపై నింద మోపాడంటూ.. ఆధారాలతో కూటమికి వరుదు కళ్యాణి కౌంటర్ ఇచ్చారు.టీడీపీ అంటేనే టెంపుల్ డిమాలిషన్ పార్టీ హిందూ మతాన్ని పరిరక్షిస్తామంటూనే తమ చర్యలతో కూటమి నాయకులు అడుగడుగునా హిందూ సాంప్రదాయాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కడపలోని వేంపల్లెలో నందీశ్వర ఆలయాన్ని ప్రారంభిస్తే దానిపైనే ఫేక్ వీడియాలతో తెలుగుదేశం సోషల్ మీడియా విషం కక్కింది. టీడీపీ అంటేనే టెంపుల్ డిమాలిషన్ పార్టీ అని అర్థం. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా విజయవాడలో పుష్కరాల పేరుతో 40కి పైగా ఆలయాలను కూల్చేస్తే, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని నిర్మించారు.చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తిరుమలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేశారు. ముఖ్యమంత్రులుగా ఉండి తిరుమల ప్రతిష్టను, స్వామి వారి వైభవాన్ని పెంచిన ఘనత తండ్రీకొడుకులు వైఎస్సార్, వైఎస్ జగన్లకే దక్కుతుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 4,111 కొత్త ఆలయాల నిర్మాణాలు మొదలు పెట్టి ఒక్కదానికి రూ.10 లక్షలు కేటాయించడం జరిగింది.అందులో 80 శాతం పనులు రామాలయాలే. రూ. 411 కోట్లతో 801 పురాతన ఆలయాల ఆధునికీకరణ పనులు చేయడం జరిగింది. దుర్గ గుడి అభివృద్ధి కోసం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వ నిధులు రూ.70 కేటాయించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా దుర్గమ్మ ఆలయంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు.వైఎస్ జగన్ పాలనలో శ్రీవారి వైభవంతూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీ నారాయణ స్వామి రథానికి దుండగులు నిప్పంటిస్తే కళ్యాణోత్సవం సమయానికి కొత్త రథం తయారు చేయించి ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రథాన్ని అందజేశారు. తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవ కోసం స్వచ్ఛమైన వెన్నను సమకూర్చడం కోసం తిరుమలలోని గోశాలను విస్తరించడం వైయస్ జగన్ సీఎంగా ఉండగానే జరిగింది. చిన్నారుల్లో భక్తిభావం పెంపొందించడం కోసం గోవింద కోటి, రామ కోటి రాసే వారికి ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేయడమే కాకుండా వారికి శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్పించడం జరిగింది.టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలతోపాటు వేతనాలు పెంచడమే కాకుండా కారుణ్య నియామకాలు చేపట్టారు. వంశ పారంపర్య అర్చకులకు రిటైర్మంట్ లేకుండా ఓపిక ఉన్నంత వరకు స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించారు. తిరుమలలోని స్వామి వారి గర్భగుడిని సన్నిధి గొళ్లలు తెరిచే సాంప్రదాయాన్ని పునరుద్ధరించారు. అమరావతి, చెన్నై, భువనేశ్వర్, జమ్ముకశ్మీర్, విశాఖపట్నంతోపాటు అమెరికాలో శ్రీవారి ఆలయాలను నిర్మించి స్వామి వారి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేశారు. గతంలో దివంగత వైఎస్సార్ తరహాలోనే వైఎస్ జగన్ కూడా ముఖ్యమంత్రిగా ఉండగా వేద విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవలో భక్తులందరూ దర్శించుకునేలా ప్రతి పౌర్ణమికి పున్నమి గరుడ సేవ నిర్వహించేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.బ్రాహ్మణుల సంక్షేమం కోసం వైఎస్ జగన్మఠాధిపతులు, ఆగమ పండితులతో ఆగస్టు 2022లో రెండో విడత ధార్మిక పరిషత్తును నియమించి నిర్ణయాధికారాలను కల్పించిన ఘనత కూడా వైఎస్ జగన్కే దక్కుతుంది. అంతేకాకుండా దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురికాకుండా వివాదాలతో కోర్టు కేసుల కారణంగా కాలయాపన జరగకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి నోటీస్ ఇచ్చిన వారం రోజుల్లో దేవాలయ భూములు స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి కల్పించి స్వామి వారి ఆస్తులను కాపాడారు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలకు వంశపారంపర్య హక్కులను స్ధానిక భక్తుల కమిటీలకు కల్పిస్తూ జీవో ఇచ్చారు.జీవో నెంబర్ 52 ద్వారా గతంలో రూ.5 వేలు వేతనాలు పొందేవారికి రూ.10 వేలు, రూ. 10 వేలు పొందేవారికి రూ.15625 ల చొప్పున వేతనాలు పెంచుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు నిర్ణయం తీసుకుంది. అర్చక సంక్షేమ ట్రస్టు ద్వారా బ్రాహ్మణులకు రూ.48 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లుగా అరర్చ సమాఖ్య నాయకులకు అవకాశం కల్పించారు. 16 ఆగమ వేద పాఠశాలల ద్వారా 400 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలతోపాటు వారికి స్టై ఫండ్ కింద రూ. 3 కోట్లు చెల్లించారు. ధూమదీప నైవేద్యాల పథకం గతంలో చంద్రబాబు హయాంలో కేవలం 1100 ఆలయాలకు మాత్రమే ఉండగా వైఎస్సార్సీపీ హయాంలో ఆ సంఖ్యను 5338 ఆలయాల్లో అమలు చేసింది.వైఎస్సార్ హయాంలోనే శ్రీవారి వైభవం పెరిగిందిఆలయాల్లో రాజకీయ నేతల జోక్యానికి తావులేకుండా దేవాదాయ శాఖలో కీలకనిర్ణయాలు తీసుకునేలా 21 మందితో ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేస్తూ 2007లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చట్ట సవరణ చేశారు. శ్రీవారి ఆలయంలో పిల్లలకు, క్యూలైన్లలో ఉండేవారికి ఉచితంగా పాలు, అన్నప్రసాద పంపిణీ కార్యక్రమానికి కూడా వైయస్సార్ గారే శ్రీకారం చుట్టారు. వేద విద్య, విజ్ఙానం, పరిశోధనలు ప్రోత్సహించే ఉద్దేశంతో 2006లో వైయస్సార్ గారు వేద విద్యాలయాన్ని ప్రారంభించారు. ఏడు కొండల వైభవాన్ని చాటేలా వేంకటేశ్వర భక్తి ఛానెల్ను ప్రారంభించారు.తిరుపతి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందజేయడంతోపాటు అలిపిరి వద్ద నిత్య హోమం జరిపేలా కూడా వైయస్సార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించారు. 2006లో కళ్యాణమస్తు పథకానికి రూపకల్పన చేసి మధ్యతరగతి కుటుంబాలలో వివాహం చేసుకునే ప్రతి జంటకు బంగారు మంగళ సూత్రం, వెండి మెట్టెలు, నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్లి సామాగ్రి, ధార్మిక స్తోత్ర పుస్తకం, పురోహితుడు, పెళ్లి భోజనం ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. బంగారు మంగళసూత్రం, వెండి మెట్టెలు, శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించి 36 వేల నూతన జంటలకు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.దళిత గిరిజన గోవిందం పేరుతో విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి శ్రీవారిని దళిత గిరిజన వాడలకు తీసుకెళ్లి దర్శన భాగ్యం కల్పించే భృహత్తర కార్యక్రమం కూడా దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారే ప్రారంభించారు. మత్స్యకారులకు వైదిక కర్మల్లో శిక్షణ ఇచ్చే సమానత్వాన్ని కూడా ఆయనే ప్రారంభించారు. హిందూ ధర్మ పరిరక్షణ, స్వామి వారి ప్రతిష్టను ఇనుమడింపజేయడం కోసం వైయస్సార్ గారు ఎంతో శ్రమించారు. కానీ చంద్రబాబు మాత్రం మా ఇంటి దైవం అంటూనే తన తప్పుడు ప్రకటనలతో ఆలయ ప్రతిష్టను మంటగలిపేశారు. -
‘రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం’
సాక్షి, తాడేపల్లి: తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు ఉరి బిగిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందాలను ఎండగట్టారు. తెలంగాణలో తనపై ఉన్న కేసులను కొట్టేయించుకోవడం కోసమే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కించారని చంద్రశేఖర్ ఆరోపించారు.తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్కడి సీఎం చెప్పిన మాటలపై చంద్రబాబు ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాయలసీమను శాశ్వతంగా కరువులో ఉంచి, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ‘బ్రీఫ్డ్ మీ బ్రదర్’తో లాలూచీ పడ్డారని మండిపడ్డారు.తెలంగాణ రోజుకు 8 టీఎంసీల నీటిని తోడుకుపోతుంటే, ఏపీకి కేవలం 0.63 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండటం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమన్నారు. పగలు ప్రజల ముందు బీజేపీతో బంధం ఉన్నట్టు నటిస్తూ, రాత్రికి కాంగ్రెస్తో ‘హాట్ లైన్’ చర్చలు జరపడం బాబు నైజమన్న చంద్రశేఖర్.. ఏపీలో కాంగ్రెస్తో విరోధులుగా ఉంటూ, తెలంగాణలో మాత్రం ఆ పార్టీతోనే అంటకాగుతున్నారని దుయ్యబట్టారు.ఓటుకు నోటు కేసు పత్రాలు తగలబడ్డాయన్న వార్తల వెనుక ఉన్న మర్మమేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు వెలిగొండ ప్రాజెక్టు పనులపై చంద్రబాబు ‘క్యాట్ వాక్’లు చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ఘనత వైయస్సార్ కుటుంబానిదేనని... చంద్రబాబుది శంకుస్థాపనల డ్రామా మాత్రమేనని స్పష్టం చేశారు. రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా వైఎస్సార్, వైఎస్ జగన్ కృషి కనిపిస్తుందని చంద్రశేఖర్ తెలిపారు.పుట్టిన గడ్డ సీమకైనా, పిల్లనిచ్చిన మామకైనా వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని.. ఇప్పటికైనా తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయవద్దని చంద్రశేఖర్ హితవు పలికారు. మరోవైపు రాష్ట్ర చరిత్రలో శాసనసభ వ్యవహారాలకు నేడు ఒక దుర్దినమని, మండలి చైర్మన్ సంతకాన్నే ఫోర్జరీ చేసే స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..ఇద్దరు నాయుడుల నాటకాలు..సీఎం, నీటిపారుదలశాఖ మంత్రి ఇద్దరు నాయుడు బ్రదర్స్ కలిసి.. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నాటకాలు ఆడుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు సందర్శనలో చంద్రబాబు నానా తంటాలు పడుతూ క్యాట్ వాక్లు చేస్తున్నాడు. జీవితంలో నిజాలే చెప్పని చంద్రబాబు.. తాను ఎప్పుడూ అబద్దాలు చెప్పనంటూ పెద్ద అబద్దం చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఉపయోగం లేదని కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రం రోజుకూ 8 టీఎంసీల నీటిని తోడుకుని పోతూ.. ప్రాజెక్టులు నిర్మించుకుంటుంటే, మరోవైపు పైనున్న కర్ణాటక నీ హయాంలో నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును మరింత పెంటుకుంటూ.. అదనంగా 120 టీఎంసీల నీటిని వాడుకుంటోంది.తెలంగాణ రాష్ట్రం 8 టీఎంసీలు రోజూ తీసుకుంటుంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న నీటి సామర్ధ్యం 0.63 టీఎంసీలు మాత్రమే. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా?. వాటర్ బోర్డు వ్యతిరేకించినా, పక్క రాష్ట్రం కాదన్న వైయస్సార్సీపీ హాయంలో రూ.990 కోట్లు ఖర్చుపెట్టి రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ పనులను ముందుకు తీసుకెళ్లడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. మీ స్వార్ధం కోసం రాయలసీమ భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం.పిల్లనిచ్చిన మామైనా- జన్మనిచ్చిన సీమైకైనా వెన్నుపోటే..ఇవాళ శ్రీశైలంలో 795 అడుగులు నీటిమట్టం ఉంటే మచ్చుమర్రి ద్వారా మనం 0.33 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాం. రెండోది 834 అడుగుల నీరున్నప్పుడు మాల్యాల దగ్గర 0.3 టీఎంసీలు మాత్రమే తీసుకునే పరిస్ధితి ఉంది. ఇంకా మీరు సిగ్గుపడరా? ఇన్నేళ్లు సీఎంగా పనిచేసిన మీరు జన్మనిచ్చిన రాయలసీమకు ఏం చేయలేదన్న బాధ్యత మీకు లేదా? కనీస ఇంగితం పనిచేయ లేదా? మీ స్వార్థరాజకీయాలు కోసం పిల్లనిచ్చిన మామైనా, జన్మనిచ్చిన రాయలసీమైనా మీకు ఒక్కటే. వెన్నుపోటు తప్పదు. ఇదే మీ స్వార్థరాజకీయం. మీ వైఖరిపై కచ్చితంగా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది.40 ఏళ్ల నుంచి ఉన్న తెలుగుగంగకు నిధులు కేటాయించి పనులు చేశారా? 3 టీఎంసీల నీళ్లు తీసుకుంటే.. రాయలసీమతో పాటు నెల్లూరు కూడా సస్యశ్యామలం అవుతుంది. దాన్ని కూడా మోసం చేశారు. రాయలసీమ నుంచి హంద్రీనీవా కాలువ పనుల్లోనూ మోసమే. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కిలోమీటర్ల మేర 15వేల క్యూసెక్కుల సామర్ధ్యం పెంచడం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేసాం. రెండోది శ్రీశైలం కుడి గట్టు కాలుల కింది 30వేల క్యూసెక్కులు పెంచాం. తెలుగుగంగకు రూ.500 కోట్లు ఖర్చు చేసి, హంద్రీనీవా కాలువ వెడల్పు పెంచాం. నిప్పుల వాగు ద్వారా నెల్లూరుకు 30 వేల క్యూసెక్కులు వెళ్లేలా పనులు ప్రారంభించారు. మరోవైపు హంద్రీనీవా సుజల స్రవంతి సామర్ధ్యాన్ని 2వేల క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచేలా పనులు ప్రారంభించిన వైఎస్ జగన్ వాటిని త్వరిత గతిన పూర్తి చేసే కార్యక్రమం చేపట్టారు. అవుకు 2 టన్నెల్స్ ద్వారా దాదాపు రూ.260 కోట్లు ఖర్చు చేసి 20వేల క్యూసెక్కుల నీళ్లని పంపించగలిగాం. మూడో టన్నెల్ పనులుకు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే మొదలుపెట్టాం.రాయలసీమ ప్రాజెక్టులన్నీ వైఎస్ జగన్ హయాంలోనే..27 టీఎంసీల సామర్ధ్యమున్న గండికోట రిజర్వాయరు పనుల్లో రూ.1000 కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ బకాయిలు పెట్టి పారిపోయిన చంద్రబాబు... ఇవాళ వెలిగొండ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ఇవ్వలేదని సిగ్గులేకుండా వైయస్.జగన్ ని విమర్శిస్తున్నాడు. గండికోట ఆర్ అండ్ ఆర్ పూర్తి ఆర్ అండ్ ఆర్ వైయస్.జగన్ హయాంలో రూ.1000 కోట్లు చెల్లించే ప్రాజెక్టు ప్రారంభించారు. చిత్రావతి ఆర్ అండ్ ఆర్ రూ.280 కోట్లు ఇచ్చిన తర్వాతే 10 టీఎంసీలు నింపగలిగాం. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులో కూడా లీకేజీ పనులు రూ.90 కోట్లతో పూర్తి చేసి 17 టీఎంసీల నీటిని నింపాం.వెలిగొండ ప్రాజెక్టూ వైఎస్సార్సీపీ ఘనతే..వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడల్లా ప్యాకేజీ ఇవ్వకుండా వైయస్. జగన్ ప్రాజెక్టుని జాతికి అంకితం ఇచ్చారని చెబుతున్నాడు. అసలు నీ హాయంలో ఏడుసార్లు పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసిన ఘన చరిత్ర నీదే చంద్రబాబూ. వెలిగొండను మేం ఆ విధంగా చేయలేదు. 2021 జనవరి 13 నాటికి వైయస్.జగన్ ప్రభుత్వంలో ఒక టన్నెల్ పూర్తి చేస్తే.. 2024 ఫిబ్రవరి నాటికి రెండో టన్నెల్ పూర్తి చేశాం. ఒక మిషన్ నిల్చిపోయిన ప్రాంతం తప్ప మిగిలిన పనంతా పూర్తి అయింది. మొదటి, రెండు టన్నెల్లను కలిపి జూన్లో నీరు విదుదల చేయడానికి మార్చి 6న వైఎస్ జగన్ వెలిగొండ ప్రాజెక్టు దగ్గరకి వచ్చారు. శ్రీశైలంలో 841 అడుగులు నీటిమట్టం ఉండదు కాబట్టి... జూన్లో వచ్చే నీటిని విడుదల చేస్తామని చెబుతూ.. రూ.950 కోట్ల ఆర్ అండ్ ఆర్ బాకీ ఉన్నాం. ఆ బకాయిలను జూన్ నాటికి చెల్లించి.. జూన్ నాటికి ఆ నీటిని నల్లమల సాగర్ కి తరలిస్తామని చెప్పారు.ఆ రోజు వైఎస్ జగన్ రెండు టన్నెల్స్ని, నల్లమల సాగర్ని జాతికి అంకితం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం తాను వచ్చిన ప్రతిసారీ అబద్దాలు చెప్పడం అలవాటు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో చేసిన పని కేవలం 2 కిలోమీటర్ల లైనింగ్ వర్క్ మాత్రమే. రూ.4వేల కోట్లు పెట్టుబడి పెడితే తప్ప వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాదన్న మీరు జూన్ 2026లో ఎలా నీళ్లిస్తామని చెప్పారు. కారణం వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 840 అడగులు ఉండాలి అది జూన్ లోనే సాధ్యమవుతుంది కాబట్టి, మా హయంలో రెండు టన్నెల్స్ పూర్తి అయ్యాయి కాబట్టి.. మీకు నీళ్లివ్వడం సాధ్యమవుతుంది.ఇదే పని ఆరోజు మేం 2025లో చెబితే.. ఇవాల్టికి మీరు ఆ పని చేయలేకపోయారు. ఫీడర్ కెనాల్ తవ్వలేదు.. రెండో కెనాల్ లో కోర్టు కేసుల వల్ల ఉండిపోయిన మిషన్ ను కోర్టు కేసుల వల్ల... డిస్ మెంటల్ చేయలేదు. మరి ఎలా నీళ్లు వదులుతున్నారు. రెండేళ్లలో మీరు రెండు దఫాలుగా రూ.200, రూ.350 కోట్లు కేటాయిస్తే.. రెండేళ్లు కలిపి కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రూ.4 వేల కోట్లు అవసరం అని చెప్పిన మీరు రెండేళ్లలో కేవలం రూ.400 కోట్లే ఎలా ఖర్చు చేయగలిగారు. అటం ఆరోజు వైఎస్ జగన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం వల్లే మీకు ఇధి సాధ్యమైంది.కానీ చంద్రబాబు మాత్రం పత్రికల్లో 1996 మార్చిలో వెలిగొండ పనులకు శ్రీకారం చుట్టామని ప్రచారం చేసుకుంటూ... ప్రాజెక్టు ఫీజబులిటీ రిపోర్టు మాత్రం 2001లో ఇచ్చారని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. వైయస్.రాజశేఖర్ రెడ్డి అన్ని అనుమతులు తెచ్చి.. రూ.500 కోట్లతో పనులు ప్రారంభించారు. అంటే మీ హయాంలో ఏ పనీ జరగలేదని అర్ధం అవుతుంది. 9 సంవత్సరాల సీఎంగా ఉండి.. పశ్చిమ ప్రకాశం వాసుల కలల కొండ వెలిగొండ ప్రాజెక్టుకు ఉరలేసింది నువ్వు కాదా చంద్రబాబూ?తట్టెడు మట్టి కూడా తీయని చంద్రబాబు ప్రభుత్వం..రూ.3543 కోట్లు వెచ్చించిన వైఎస్సార్ 2004లో అన్ని అనుమతులు తెచ్చి 3వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న ఒక టన్నెల్ ని 11.5 కిలోమీటర్లు, 8వేల క్యూసెక్కుల సామర్ధ్యమున్న మరో టన్నెల్ ని దాదాపు 6 కిలోమీటర్లు పూర్తి చేశారు. రెండూ కలిపి రోజుకు ఒక టీఎంసీ సామర్ధ్యంతో నిర్మించారు. నల్లమలసాగర్ సామర్ధ్యం 53.5 టీఎంసీలు కాగా.. శ్రీశైలంలో 45 రోజుల పాటు మాత్రమే 845 అడుగులపైన నీటి నిల్వ ఉంటుంది.రోజుకొక టీఎంసీ తరలిస్తేనే 53 టీఎంసీలు నిల్వ సాధ్యం. ఇందుకు అవసరమైన సొరంగాల తవ్వకం పూర్తైంది. వెలిగొండలో ఇంకా చేయాల్సింది తీగలేరు కెనాల్, గొట్టేపాడు కాలువ, ప్రధాన కాలులను పూర్తి చేయాలి. ఎర్రగొండపాలెనికి నీరు రావాలంటే తీగలేరు కెనాల్ పూర్తి చేయాలి. ఒక తట్టెడు మట్టి కూడా తీయకుండానే మేమేం చేశామని చెప్పుకుంటున్నారు.నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో 30 మండలాల ప్రజల 15.25 లక్షల మంది తాగునీటి అవసరాలు తీర్చే ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ఇలాంటి బాగోతాలు చేయడం సిగ్గుచేటని చంద్రశేఖర్ మండిపడ్డారు. ఐరన్ రాడ్లకు రిబ్బన్లు కట్టి కటింగ్లు చేసిన చరిత్ర చంద్రబాబు సొంతమైతే.. బాధ్యతతో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేసిన చరిత్ర వైయస్సార్ దని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పగలు బీజేపీతో సంసారం, రాత్రి కాంగ్రెస్తో ప్రేమాయణం చేస్తూ... రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయొద్దని సూచించారు.పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...రాయలసీమ ఎత్తిపోతల పథకంపై టీటీపీ నాయకుడే కేసు వేసినా మేం పనులు ఆపకుండా రూ.990 కోట్లు ఖర్చు చేశాం. తెలంగాణాలో ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఫైల్స్ తగలబడ్డాయి. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవన్నీ టీటీపీ స్వార్ధ రాజకీయం కోసమే జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంత ప్రజలకు భరోసానిచ్చేలా.. ఎత్తిపోతల నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలిస్తే 101 టీఎంసీలు ఎత్తిపోతల దగ్గర నుంచి తీసుకునే హక్కు మనకు ఉంది. 20 ఏళ్లలో ఎప్పుడూ 101 టీఎంసీల నీటిని వాడుకున్న చరిత్ర ఏపీకి లేదు.తెలంగాణా రాష్ట్రం 8 టీఎంసీలను 770 అడుగుల నుంచి 800 అడుగుల లూపే తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా? ఏపీలో అతిపెద్ద భూభాగమున్నా.. 834 అడుగుల వరకు 0.3 టీఎంసీల మాత్రమే మనం తీసుకెళ్లగలం. మరి ఈ సోయ ప్రభుత్వానికి లేదా? తెలంగాణాతో ఎందుకు లాలూచీ పడుతున్నారు. చర్చను సజావుగా జరపకుండా అడిగిన ప్రశ్నలకు బదులివ్వకుండా సభను ఎందుకు తప్పదోవ పట్టిస్తున్నారు. ? అడిగిన ప్రశ్నలకు ఎందుకు బదులివ్వడం లేదని నిలదీశారు.రాష్ట్ర చరిత్రలో శాసనసభ వ్యవహారాలలో ఇవాల ఒక దుర్దినం. మండలి చైర్మన్ గారి సంతకాన్నే ఫోర్జరీ చేయడం దురదృష్టకరం. తనకు సంబంధం లేదని చైర్మన్ గారు చెబుతున్నారు. లఘు చర్చకు అనుమతించిన తర్వాత ముందే ప్రభుత్వం ప్రకటన ఎలా ఇస్తుంది? చర్చకు అనుమతించిన తర్వాత స్టేట్ మెంట్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చినట్లు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒక పేపర్ చూపించారు. చైర్మన్ నేను ఇవ్వలేదని చెబుతుంటే.. పది మంది మంత్రులు పేపర్ చూస్తూ ఛైర్మన్ పోడియం చుట్టుముట్టారు. అంటే దొంగలు ఎవరు? ఆయన హక్కులకి కూడా భంగం కలిగించడం కాదా? తాను సంతకం చేయడం లేదని చెబుతున్నా.. ఉందని వాదిస్తున్నారంటే తప్పు ఎవరు చేసినట్లు? ఇది రాజ్యంగ విరుద్దమైన పరిణామమని మండిపడ్డారు.చర్చకు మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అడిగితే చైర్మన్ అనుమతిచ్చారు. ఆయన స్టేట్ మెంట్ చదువుతుంటే ఆ విజువల్స్, వీడియో ఆడియో బయటకు రాదు.. కానీ మంత్రి పయ్యావుల కేశవ్ అర్ధరాత్రి అయినా చర్చిస్తామన్న వీడియో మాత్రమే బయటకు విడుదల చేశారు. చర్చ జరగక ముందే మంత్రులు ఎందుకు పోడియం చుట్టుముట్టారు. కావాలనే చేస్తున్నారని చైర్మన్ చెప్పినా వినలేదు. కూటమి నేతలు అధికార మదాన్ని ప్రదర్శించారు. చర్చ జరిగితే చంద్రబాబు కుటుంబానికే నష్టం కాబట్టి అధికార పార్టీ చర్చ నుంచి నుంచి పారిపోయిందే అధికార పార్టీ. రూ.321 నెయ్యి రేటు ఉంటే.. ఇందాపూర్ రూ.658 కి కట్టబెట్టడానికి మాత్రమే టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఒక స్కామ్ కోసం తీసుకొచ్చిన స్కీమే కల్తీ లడ్డూ అని తేల్చి చెప్పారు.అధికార పార్టీ చీకటి దందాలు, లూఠీ వ్యాపారాలు, ఆర్దిక లావాదేవీలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.. పక్క రాష్ట్రం ఉపముఖ్యమంత్రి చనిపోతే ఆ లింకులు కూడా హెరిటేజ్ కంపెనీకే బయటపడుతుంటే మా కంపనీ హెరిటేజ్ ఫైనాన్స్ చేస్తుంది.. ఆ విమానం కూలిపోతుందని కలగన్నామా అని చెబుతున్నాడు. వీఎస్ ఆర్ విమానాల్లో మీరే జల్సాలు చేస్తున్నారు. విమానయానశాఖా మంత్రి మీ పార్టీ నేత. చనిపోయిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు కుట్ర ఉందని దుమ్మెత్తి పోస్తున్నారు. దాన్ని ఖండించకపోగా లోకేష్ కామెడీ చేస్తున్నాడని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా ఆ లింకులు చంద్రబాబు దగ్గరకు వస్తున్నాయని తేల్చి చెప్పారు. -
AP; ఫిరాయింపు ఎమ్మెల్సీల అంశం: మండలి చైర్మన్ విచారణ
విజయవాడ: ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీల అంశానికి సంబంధించి మండలి చైర్మన్ మోషేన్ రాజు విచారణ చేపట్టారు. ఏపీ శాసనమండలిలో చైర్మన్తో ఇద్దరు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. చైర్మన్తో ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్లు సమావేశమయ్యారు. గతవారం ఫిరాయింపు ఎమ్మెల్సీలకు ఏపీ మండలి నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25, 26న విచారణకు హాజరవ్యాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.ప్రలోభాలకులోనై ఫిరాయించారనే వైఎస్సార్సీపీ ఫిర్యాదు నేపధ్యంలో విచారణకు రావాలని మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. బల్లి కల్యాణ చక్రవర్తి, జయ మంగళ వెంకట రమణ, మర్రి రాజశేఖర్, పద్మ శ్రీ, సునీతలకు నోటీసులు జారీ అయ్యాయి. వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, కానీ రాజీనామాలు చేసి టీడీపీలో చేరారు. దీనిపై మండలి చైర్మన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయగా, వారికి నోటీసులు జారీ చేసిన అనంతరం విచారణ చేపట్టారు. -
లడ్డూ కల్తీపై చర్చ జరగాలంటే ఎందుకు పారిపోయారు?: బొత్స
సాక్షి, అమరావతి: ‘‘రాయలసీమ ఎత్తిపోతల పథకాన్నీ.. నేను చెప్తే చంద్రబాబు ఆపారని.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.. ఇది వాస్తవమా? కాదా? అని మండలిలో ప్రశ్నించాం. దీనిపై సరైన సమాధానం చెప్పడం లేదు’’ అంటూ శాసనమండలి విపక్ష నేతబొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం.. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేదే తమ డిమాండ్ అంటూ స్పష్టం చేశారు.‘‘తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన వ్యాఖ్యలను ఖండించలేదంటే ఆర్థిక శాఖ మంత్రి దానికి వత్తాసు పలికినట్టే.. అధికారం ఉపయోగించుకుని రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. విలువలను తాకట్టు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాట అబద్దం అని ఎందుకు చెప్పటం లేదు?. వ్యక్తిగత స్వార్థాలు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం.. మాకు అందరితో పరిచయాలు ఉన్నాయి.. అవి అనుబంధం వరకే. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని బొత్స నిలదీశారు.‘‘రాజమండ్రిలో కల్తీ పాలపై ప్రభుత్వం చర్చ జరపడం లేదు. చట్టాన్ని రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. లడ్డులో జంతు కొవ్వు ఉందని చంద్రబాబు చెప్పారు.. కోర్టు వేసిన సిట్ నిగ్గు తేల్చింది. 329 రూపాయలకు హిందూపూర్ డెయిరీ ఉంటే.. ఈరోజు టీటీడీ 650 రూపాయలు కొంటుంది.. హిందూపూర్ డెయిరీకి.. హెరిటేజ్కి ఉన్న సంబంధం అదే. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు.. ఇప్పుడు కో యూనిట్ అంటున్నారు.. డిప్యూటీ సీఎం పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా ఈరోజు ఎందుకు చర్చించలేదు...ఆ దేవదేవుడు కూడా ఇటువంటి దోపిడీలను క్షమించడు. ఈ దోపిడిని అరికట్టాలి. వైఎస్సార్ ఏడుకొండలు జీవో ఇచ్చారు. ఏడుకొండలపై ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. 2016లో.. మజ్జిగ సైతం హెరిటేజ్లో కొనాలని జీవో ఇచ్చారు. చంద్రబాబు బుర్ర ఏ విధంగా పనిచేస్తుందో అనేదానికి ఇదే నిదర్శనం. మండలిలో ఎందుకు చర్చించడం లేదు...విజయవాడలో పుష్కరాల పేరు చెప్పి చంద్రబాబు ఎన్ని గుళ్లు కూల్చేశారు. శ్రీశైలంలో లాఠీఛార్జి జరిగింది.. ఎవరిని సస్పెండ్ చేశారు. మీకు దేవుడిపైన దేవాలయాల పైన నమ్మకం లేదు.. కేవలం రాజకీయాలు కుర్చీలపైనే. ప్రజలను దగా చేయడం మోసం చేయడమే మీ ఎజెండా. చంద్రబాబు ధన దాహం కోసం దేవదేవుడు ప్రసాదాన్ని సైతం అవమానించారు. దేవదేవుడు ప్రసాదంపైనే అపోహలు సృష్టించారు...చంద్రబాబు నీ వయసుకి గాని ఆ ముఖ్యమంత్రి పదవి గాని న్యాయమా ఇది.. తప్పుని ఒప్పుకోకుండా ఎన్డీబీ రిపోర్ట్ అంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలోనే నాలుగు ట్యాంకులు పట్టుకోలేదా?. సభలో చర్చ జరిగే వరకు పట్టుబడుతూనే ఉంటాం. చంద్రబాబు మాయ మాటలు, ఊసరవెల్లి మాటలు, ధన దోపిడీ ప్రజలకు తెలిసే వరకు పోరాడతాం. మేము వాకౌట్ చేయలేదు... వారే చైర్మన్ దగ్గరికి వచ్చి హంగామా చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేయటానికి ఇది టీడీపీ ఆఫీస్ కాదు’’ అంటూ బొత్స మండిపడ్డారు.మండలిలో చర్చ జరగాలన్నదే వైఎస్సార్సీపీ డిమాండ్: లేళ్ల అప్పిరెడ్డిఈరోజు మండలిలో చీకటి రోజు.. ఇవాళ చర్చజరుపుతామని ఎజెండాలో పెట్టి.. లఘు చర్చలో మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతుంటే.. మంత్రి మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటున్నారు... ఇంతకన్నా దుర్దినం ఉందా?. హెరిటేజ్కి సంబంధించి కంపెనీ ఉత్పత్తులను ఏ విధంగా వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. 1998లోనే హెరిటేజ్ తిరుపతి లడ్డూ నెయ్యి టెండర్లలలో పాల్గొన్నదని సమాచారం ఉంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. మండలిలో చర్చ జరగాలి. తిరుమల ఏడుకొండల అంశంలో వైఎస్సార్పై చంద్రబాబు అభాండాలు వేస్తున్నాడు. ప్రజా కోర్టులో మీరు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. మండలిలో చర్చ జరగాలన్నదే వైఎస్సార్సీపీ డిమాండ్ -
రఘురామను అరెస్ట్ చేయాల్సిందే: సునీల్ కుమార్ డిమాండ్
సాక్షి, అమరావతి: ఐపీఎస్ అధికారి ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మరో సంచలన ట్వీట్ చేశారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీబీఐని ట్యాగ్ చేస్తూ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు.ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా.. ఇక, అంతకుముందు ఐపీఎస్ సునీల్ నాయక్.. తనను తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిందిగా రఘురామ బెదిరించారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అదే ట్వీట్ను రీట్వీట్ చేస్తూ.. బ్యాంకులను మోసం చేసిన కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును వెంటనే అరెస్టు చేయాలన్నారు. సునీల్ నాయక్నే బెదిరించారంటే ఇక సీబీఐ కేసుల్లోని సాక్షులను కూడా రఘురామ బెదిరిస్తారని అన్నారు. అందుకు అవకాశం ఉందన్నారు.అందుకే ఇలాంటి పరిస్థితుల్లో సాక్షులను రక్షించడానికి నిందితుడు రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేయటమే సరైన మార్గం. ఈ విషయాలపై సీబీఐ దృష్టి సారించాలని దర్యాప్తు సంస్థను కోరారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే రఘురామపై రూ.947 కోట్లు, రూ.238 కోట్లు ఎగ్గొట్టారనే రెండు కేసులపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.IPS Sunil Naik accuses RRR of threatening him to depose false evidence. This must be verified by going through the CDR and IPDR. The reason is RRR is facing CBI cases: RCBD1/2019/E/0003 (₹947 Cr fraud), RCBD1/2021/E/0002 (₹238 Cr fraud) and other bank fraud cases. If Mr Naik's… pic.twitter.com/Mdl5CeG53e— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) February 26, 2026 -
కోర్టులను మూసేయండి
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. కోర్టు ఆదేశాలను అమలు చేసే ఉద్దేశం లేకపోతే కోర్టులను మూసి వేయడం మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రజలకు, కక్షిదారులకు న్యాయం చేయలేకపోతే ఇక న్యాయస్థానాలు ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే కోర్టు ఆదేశాలను అమలు చేయకుంటే అతని కింద పని చేసే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కోర్టు ఆదేశాలంటే ఏం గౌరవం ఉంటుందని నిలదీసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం ద్వారా మిగిలిన అధికారులకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయన్ను ప్రశ్నించింది. ప్రజలకు న్యాయం చేయడానికి, న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడటానికే తాము ఇక్కడ ఉన్నామని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వాధికారుల తీరు వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. త్వరలో పదవీ విరమణ చేయనున్న విజయానంద్ను నాలుగు రోజుల పాటు జైల్లో ఉంచితే అధికారులందరూ దార్లోకి వస్తారంది. కోర్టు ఆదేశాలను అమలు చేయవద్దని సలహా ఇస్తే ఎంత మాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది. గ్రూప్–1 ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులై ప్రస్తుతం వివిధ పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులను నాన్ ఫోకల్ (ప్రాధాన్యత లేని) పోస్టులకు బదిలీ చేయాలన్న తమ ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్దేశ పూర్వకంగానే అమలు చేయలేదని హైకోర్టు ఆక్షేపించింది. నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలంటూ ఆదేశం.. గ్రూప్–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఈ నెల 11న ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్–1లో ఇప్పటికే ఎంపికై ప్రస్తుతం పలు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న అధికారులను తక్షణమే నాన్ ఫోకల్ (ప్రాధాన్యత లేని) పోస్టులకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఓ వారంలో ఆ అధికారుల బదిలీలకు సంబంధించిన వివరాలతో ఓ నివేదికను రిజి్రస్టార్ జ్యుడీషియల్కు అందచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం.. తమ ఆదేశాల మేరకు ఆ అధికారులను నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయకపోవడంతో విజయానంద్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏఐని అడిగితే ఏంటో తెలిసేదిగా.. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని, తమ ముందు వ్యక్తిగతంగా హాజరైన సీఎస్ విజయానంద్ను ప్రశ్నించింది. తక్షణమే బదిలీ చేయాలని తాము ఈ నెల 11న ఆదేశాలిస్తే, ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదని, దీని బట్టి ‘తక్షణమే’ అన్న పదానికి సీఎస్కు అర్థం తెలిసినట్లు లేదని పేర్కొంది. తమ ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందేనని, లేని పక్షంలో తాము తీసుకునే కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధంగా ఉండాలని విజయానంద్కు తేల్చి చెప్పింది. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటుండగా, సీఎస్ స్వయంగా తమ ముందు ఉన్నారని, ఆయన్నే అడిగి వివరాలు తెలుసుకుంటామని, ఈ దశలో మీ జోక్యం అవసరం లేదని ఏజీకి తేల్చి చెప్పింది. సర్వీసు నిబంధనల్లో ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టుల నిర్వచనం లేదని ఏజీ చెప్పగా.. 1966లోనే ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ ఉత్తర్వుల ఆధారంగానే ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీలు జరుగుతూ వస్తున్నాయని తెలిపింది. ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టులకు అర్థం తెలియకుంటే, నిఘంటువును చూసినా, ఏఐని అడిగినా తెలుస్తుందని పేర్కొంది. ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టుల గురించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కు కూడా తెలుసని, కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రం తెలియదని చెబుతున్నారంది. గ్రూప్–1 ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులై వివిధ పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమ్మక్కయ్యారని, అందుకే వారిని నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలన్న తమ ఆదేశాలను కావాలనే అమలు చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారులను సమర్థించొద్దు 1966 నాటి ఉత్తర్వుల గురించి తమ అధికారులకు తెలిసి ఉండకపోవచ్చునని ఏజీ చెప్పగా, కోర్టు ఆదేశాలను అమలు చేయని ఓ అధికారిని సమర్థించేందుకు ఎందుకింత తాపత్రయ పడుతున్నారని ఏజీని ప్రశి్నంచింది. తమ ఆదేశాలను అమలు చేసి, ఆ వివరాలను తమ ముందుంచాలని సీఎస్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, వ్యక్తిగత హాజరు నుంచి సీఎస్కు మినహాయింపు కావాలని కోరారు. తమ ఆదేశాలను అమలు చేస్తే వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, అమలు చేయకుంటే మాత్రం హాజరు కావాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. -
అధికారమదంపై ‘ధర్నా’గ్రహం
అధికారపార్టీ అడ్డగోలు వేధింపులు, అక్రమ తొలగింపులపై చిరుద్యోగులు నిరసన గళమెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచీ తరలివచ్చి బెజవాడలో కదంతొక్కారు. రాష్ట్రస్థాయి ధర్నాలో చంద్రబాబు సర్కారు దుర్నీతిపై ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని దిక్కులుపిక్కటిల్లేలా నినదించారు. సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : క్షేత్రస్థాయిలో పొదుపు సంఘాల కార్యక్రమాలను పర్యవేక్షించే గ్రామ సమాఖ్య సహాయకులు (వెలుగు వీవోఏ – డ్వాక్రా యానిమేటర్లు), మెప్మా రిసోర్స్ పర్సన్లు (ఆర్పీ)లు బుధవారం విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా చేపట్టారు. అధికార పార్టీ నేతల పెత్తనం పెరగడంతో పాటు నిబంధనలకు విరుద్ధ కార్యక్రమాల పేరిట వేధింపులు, అక్రమ తొలగింపులను నిరసించారు. తొలుత రాష్ట్ర నలుమూలల నుంచీ తరలివచ్చిన ఉద్యోగులు విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్కు చేరుకున్నారు. బాబు సర్కారుకు వ్యతిరేకంగా వారు చేసిన నినాదాలతో ధర్నాచౌక్ దద్దరిల్లింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు కనీస వేతనాలు వర్తింపజేయాలని, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో వీవోఏ–యానిమేటర్లతో పాటు ఆర్పీలకు ఇచ్చే నెలవారీ వేతనం రూ.8వేలు, రూ.పదివేలు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు రూ.26 వేల చొప్పున చెల్లించాలని.. హెచ్ఆర్ పాలసీ అమలు, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, అర్హులైన వారికి పదోన్నతులు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వీవోఏ – యానిమేటర్లకు స్త్రీనిధి ప్రోత్సాహకాలు రెండేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, ఒక్కొక్కరికీ రూ. 30 వేల నుంచి రూ.లక్ష వరకు రావాల్సి ఉందని వివరించారు. ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని నినదించారు. 60 ఏళ్లు నిండిన వీఓఏలకు నిలుపుదల చేసిన వేతనాలు చెల్లించాలని, మెప్మా ఆర్పీలకు గ్రేడింగ్ విధానం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచి్చన మేరకు మహిళలు పొదుపు సంఘాల ద్వారా తీసుకునే రుణాలపై రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీలు చెల్లించాలని, మహిళా మార్టులు, స్వావలంబన, అభయహస్తం నగదును పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరారు. చిరుద్యోగుల ధర్నాకు సీపీఎం నేత వి. శ్రీనివాసరావు సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు మద్దతుగా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్ర స్థాయి ధర్నా అనంతరం యూనియన్ ప్రతినిధులు సెర్ప్ సీఈవో వాకాటి కరుణ, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్లను కలిసి వినతిపత్రాలను అందజేశారు.అంగన్వాడీల వినూత్న నిరసనఏలూరు (టూటౌన్): ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులు భర్తీ చేయాలని, అంగన్వాడీల వేతనాలు పెంచాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద తలపెట్టిన నిరాహార దీక్షలు రెండోరోజు బుధవారం కొనసాగాయి. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది అంగన్వాడీలు తరలివచ్చారు. కనీస వేతనం రూ.26,000, సంక్షేమ పథకాల అమలు, యాప్స్ అన్నీ కలిపి ఒకే యాప్గా మార్చాలని, మెనూ చార్జీలు పెంచాలని పెద్దపెట్టున నినదించారు. మోకాళ్లపై నిలిచి నిరసన గళం వినిపించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ , ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి.భారతి పాల్గొన్నారు. -
టన్నుల్లో చంద్రబాబు అబద్ధాలు.. వెలిగొండలో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: మరో ‘క్రెడిట్’ చోరీకి సిద్ధమైన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మార్కాపురం సభ వేదికగా వెలి‘కొండంత’ అసత్యాలు వల్లె వేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో తానే శంకుస్థాపన చేశానని.. 2014–19 మధ్య పనులను పరుగులు పెట్టించానని.. కానీ 2019–24 మధ్య పనులు మూలన పడ్డాయని తనకు అలవాటైన రీతిలో అలవోకగా అబద్ధాలు చెప్పుకొచ్చారు. నిజానికి 1996 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వెలిగొండ పనులకు చేసిన వ్యయం అక్షరాలా రూ.పది లక్షలు మాత్రమే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసిందే. ఇక 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పనుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లు దోచిపెట్టింది. జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు) వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టారని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో కడిగిపారేయడమే అందుకు తార్కాణం. అలాంటి అవినీతి బాగోతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి రోజుకు సగటున 10 మీటర్ల పొడవున సొరంగం తవ్వేందుకు టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.68.44 కోట్లను ఇచ్చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. కానీ మరమ్మతులు చేయకపోవడం వల్ల టీబీఎంలు రోజుకు సగటున ఒకటి రెండు మీటర్ల పొడవున కూడా సొరంగాలను తవ్విన దాఖలాలు లేకపోవడం గమనార్హం..! ఇక సొరంగాలను నల్లమలసాగర్ను అనుసంధానం చేసే ఫీడర్ కెనాల్లో చేసిన పనులూ నాసిరకమే. 2017.. 2018.. 2019.. ఇలా వెలిగొండను పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు చంద్రబాబు ముహూర్తాలు మార్చుకుంటూ వచ్చారు. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి అధిక ధరలకు మరో కాంట్రాక్టర్కు కట్టబెట్టారు. అనంతరం కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారని సాగునీటిరంగ నిపుణులు, రైతులు అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆక్షేపించడం గమనార్హం. గతేడాది కురిసిన వర్షాలకు ఫీడర్ కెనాల్ బలహీనంగా ఉన్న చోట్ల కోతకు గురవడంతో ఇప్పుడు దానికి రిటైనింగ్ వాల్, కాంక్రీట్ లైనింగ్ పనులకు రూ.456 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఆ పనులను తనకు అత్యంత సన్నిహితుడైన గన్నమనేని దొరయ్యకు చెందిన జీడీఆర్ ప్రాజెక్ట్స్కు కట్టబెట్టారు. రూ.992 కోట్లతో పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఆగస్టులోనే నల్లమలసాగర్కు కృష్ణా జలాలుదశాబ్దాల స్వప్నం వెలిగొండ సాకారమైందని.. శ్రీశైలం నుంచి జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్కు చేరడంతో తమ కష్టాలు కడతేరుతాయనుకున్న ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం అడియాశలు చేసింది. ఈ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన జంట సొరంగాలను (ఆసియాలోనే అతి పొడవైనవి) రికార్డు సమయంలో నాటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి 2024 మార్చి 6న జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 2024 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్టైమ్ సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించింది. రూ.992 కోట్లు వ్యయం చేసి పునరావాసం కల్పించింది. 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. కేవలం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే దుగ్ధతోనే నల్లమలసాగర్ నిర్వాసిత కుటుంబాలకు 21 నెలలుగా పునరావాసం కల్పించకుండా చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తోందని సాగు నీటి నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2024–25లో 1,439 టీఎంసీలు, 2025–26లో 1,936.79 టీఎంసీల ప్రవాహం రాగా.. ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి 2024–25లో 848.96 టీఎంసీలు, 2025–26లో 1,652.12 టీఎంసీలు కలిశాయని గుర్తు చేస్తున్నారు. అదే చంద్రబాబు సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే 2024–25తోపాటు 2025–26లోనూ కృష్ణా వరదను ఒడిసి పట్టి నల్లమలసాగర్కు తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూరికార్డు వేగంతో జంట సొరంగాలు పూర్తి» వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్లో ప్రారంభించి కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగం రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్సార్సీపీ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను వైఎస్ జగన్ 2021లోనే పూర్తి చేయించారు. » రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచి పెట్టారు. వాటిని రద్దు చేసిన వైఎస్ జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి, టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు 7.698 కిలోమీటర్ల సొరంగం పనులను కాంట్రాక్టర్కు అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. రెండో సొరంగంలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో రోజుకు ఒక మీటర్ కూడా పని జరగడం కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేసి రికార్డు సమయంలో 7.685 కి.మీల పొడవున సొరంగం తవ్వకం పనులను 2024 జనవరి 21 నాటికి పూర్తి చేయించారు. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తి చేశారు. శ్రీశైలానికి వరద వచ్చేలోగా రెండో సొరంగం నుంచి టీబీఎంను బయటకు తీయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్ జగన్ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. » ఇక 2014–19లో టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు కాలువను నల్లమల సాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం, హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం తవ్వకం పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించింది. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించడానికి లైన్ క్లియర్ చేశారు. 2019–24 మధ్య కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1,046.46 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేయించింది. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది.‘కొండంత’ కలను సాకారం చేసిన వైఎస్సార్..» శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీల పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్కు తరలించి.. ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీళ్లు అందించాలని 1993–94లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించారు. కానీ.. 2004 వరకు ఈ ప్రాజెక్టు పనులను ఎవరూ చేపట్టలేదు.» జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.58 కోట్లు ఖర్చు చేసి.. నల్లమల సాగర్తోపాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా 21.8 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్, తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు» మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టు డీపీఆర్ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్లో నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 27న పనులకు శ్రీకారం చుట్టారు. -
28 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు దేశంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ) వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ పంపిణీని ఈ నెల 28న దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రారంభించనుంది. రాష్ట్రంలోని 3.45 లక్షలమంది బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాల శాఖ సమాచారం ప్రకారం అత్యధికంగా కర్నూలు జిల్లాలో 23,957 మంది, అత్యల్పంగా పోలవరం జిల్లాలో 2,777 మంది బాలికలు ఉన్నారు. 1,683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 0.5 ఎంఎల్ వ్యాక్సిన్ను ఇంజక్షన్ రూపంలో ఇస్తారు. సుమారు మూడు నెలలు జరిగే వ్యాక్సిన్ డ్రైవ్కు తొలివిడత కింద కేంద్రం నుంచి 1,90,890 డోసుల వ్యాక్సిన్ వెయిల్స్ రాష్ట్రానికి చేరుకున్నాయి. వ్యాక్సిన్ ఇచ్చే ముందు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి అని నిబంధన ఉంది. పీహెచ్సీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ పంపిణీ వివరాలను యూవిన్ డిజిటల్ పోర్టల్లో నమోదు చేస్తారు. వైఎస్ జగన్ హయాంలో కీలక ముందడుగు రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే కీలక ముందడుగు పడింది. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను తెచ్చారు. క్యాన్సర్ను ప్రారంభదశలోనే గుర్తించి ప్రాణాపాయాన్ని తప్పించడంతో పాటు, చికిత్స వ్యయాలకు అడ్డుకట్ట వేసేదిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగా సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి అప్పట్లో శ్రీకారం చుట్టారు. పైలెట్ ప్రాజెక్టుగా పలు జిల్లాల్లో స్క్రీనింగ్ కూడా చేశారు. 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టేందుకు విశాఖలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రితో ఎంవోయూ కుదుర్చుకుని వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే గ్రామాల్లో వైద్యసేవలు అందించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, వైద్యులకు శిక్షణనిచ్చారు. సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించడానికి సర్వం సన్నద్ధం చేసిన సమయంలోనే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో స్క్రీనింగ్ వాయిదా పడింది. ఎన్నికల తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (సీడీ–ఎన్సీడీ–3.0) సర్వేలో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ అంటూ హడావుడి చేసింది. స్క్రీనింగ్ నిర్వహణలో ఘోరంగా విఫలం అయింది. వైద్యశాఖ తప్పులతడకగా స్క్రీనింగ్ చేపట్టడంతో మరోమారు స్క్రీనింగ్ చేయాల్సి వచ్చింది. -
సచివాలయ ఉద్యోగులకు జీతాలివ్వద్దు
సాక్షి, అమరావతి: సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం, ఆ ఉద్యోగులపై వేధింపుల్లో మరో పర్వానికి తెరతీసింది. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వంద శాతం పూర్తి చేయని గ్రామ వార్డు సచివాలయాల (ప్రస్తుత పేరు స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు) ఉద్యోగుల వేతనాలు నిలుపుదల చేయాలంటూ సంబంధిత డీడీవోలకు రాష్ట్రంలో పలుచోట్ల ఎంపీడీఓలు ఆదేశాలు జారీ చేశారు. సర్వే చేయని సిబ్బందిపై నివేదికలు తయారు చేయాలంటూ ఆదేశించారు. సర్వే పూర్తి కాలేదని చెబుతూ జీతాలు ఆపమని నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం
సాక్షి, అమరావతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. తమకు ఇస్తానన్న ఆర్థిక ప్రయోజనాల విషయంలోనూ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు దాటుతున్నా నిర్లిప్తత ప్రదర్శిస్తోందని, తమ సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ‘చలో అసెంబ్లీ’ చేపట్టక తప్పదని హెచ్చరించారు. తమ ప్రయోజనాలను విస్మరిస్తే అధికారం నుంచి దించుతామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఏపీ ఎస్టీయూ) ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో ఉపాధ్యాయులు మూడో దశ మహా ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ఉపాధ్యాయులు తమ సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ కదం తొక్కారు. ‘సమర శంఖం’ పేరుతో నిర్వహించిన ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్.సాయిశ్రీనివాస్తో పాటు మాజీ ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, తర్వాత వాటిని విస్మరించి, ఉద్యోగులను పట్టించుకోకుండా గాలికి వదిలేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఎంటీఎస్, కాంట్రాక్టు ఉపాధ్యాయులకు సరైన వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి జి.సదానంద్ గౌడ్, జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సు«దీర్ బాబు మాట్లాడుతూ.. ఉద్యమాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న ప్రయోజనాలకు మంగళం పాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులను పరాయి వారిగా చూడడం ప్రభుత్వానికి తగదన్నారు. హైస్కూల్ ప్లస్లు నిర్వీర్యం 20 నెలల కాలంలో విద్యా రంగాన్ని పూర్తిగా దిగజార్చారని, బాలికల విద్యను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం హైసూ్కల్ ప్లస్లను ప్రారంభిస్తే.. ఈ ప్రభుత్వం వాటిల్లో ఉపాధ్యాయులను లేకుండా చేసిందని ఉపాధ్యాయ నేతలు మండిపడ్డారు. సమరశంఖం ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన ఏపీ జేఏపీ చైర్మన్, ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ.. సమస్యలపై రాజీలేని పోరాటం చేసి సాధించుకోవాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరిగే పోరాటాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ ధర్నాలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమణ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లె రవీంద్రనాథ్, ఎస్టీయూ అనుబంధ సంఘాల నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ఉపాధ్యాయులు భారీగా పాల్గొన్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. » వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి. 30 శాతం ఐఆర్ ప్రకటించాలి. » నాలుగు పెండింగ్ డీఏల్లో కనీసం రెండింటిని వెంటనే ప్రకటించాలి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాల్సిందే. » ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.35 వేల కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి. పే స్లిప్పుల్లో ఆ వివరాలు పొందుపరచాలి. » ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకుండా వేధించడం ఆపాలి. ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజే పెన్షన్ ప్రయోజనాలను చెల్లించాలి. » ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అన్ని రకాల వ్యాధులకు, అన్ని ఆస్పత్రుల్లో అనుమతించాలి. » అర్థం లేని పనులు, యాప్ల భారం తగ్గించాలి. ఆదివారం కూడా పని చేయించడం ఆపాలి. » కేజీబీవీలు, సమగ్రశిక్ష, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. » కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. » కారుణ్య నియామకాలను జిల్లా యూనిట్గా చేపట్టి, అర్హులైన వారందరికీ జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలి.ఒక్క హామీ అమలు చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 20 నెలలైనా ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. హమీలన్నీ అమలు చేస్తామని, ఉపాధ్యాయులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు కల్ల»ొల్లి మాటలు చెప్పి అధికారాన్ని చేపట్టారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉంది. వాటి గురించి ప్రస్తావనే లేదు. ప్రభుత్వం వీటిపై తక్షణం స్పందించి, పరిష్కారానికి రోడ్డు మ్యాప్ ప్రకటించాలి. – మల్లు రఘునాథరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఎస్టీయూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం పెడుతున్న ఒత్తిడిని భరించలేక ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంత మంది ప్రయాణాల్లో ప్రమాదాలకు గురవుతున్నారు. కొంత మంది అధికారులు సైతాన్లా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులను అధిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. డెప్యూటీ సీఎం సైతం అనేక వాగ్దానాలు చేశారు. ఆయన సైతం అమలుకు ముందుకు రావటం లేదు. ఉపాధ్యాయుల ఆవేదనను ప్రభుత్వం గమనించాలి. లేదంటే అన్ని సంఘాలను కలుపుకొని అసెంబ్లీని ముట్టడిస్తాం – ఎల్ సాయి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ ఎస్టీయూబడ్జెట్లో ఒక్క పైసా లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో ఉద్యోగ, ఉపాధ్యా యులకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఒక్క పైసా కూడా కేటాయింపు చూపించలేదు. పక్కన తెలంగాణలో ప్రతి నెలా బకాయిలు చెల్లిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు ఉపాధ్యాయులకిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. – సీహెచ్ జోసఫ్ సుదీర్బాబు, రాష్ట్ర నేత, ఏపీ ఎస్టీయూ -
వెలిగొండపై బాబు మాటలు 'నీటి మూటలే': ఎమ్మెల్సీ మాధవరావు
సాక్షి, తాడేపల్లి: మార్కాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ తూమటి మాధవరావు ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాణం పోసిందే వైఎస్సార్ కుటుంబమని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు ప్రతి అడుగులోనూ వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ జగన్ ముద్ర ఉందని ఆయన స్పష్టం చేశారు.2004 అక్టోబరు 27న దివంగత నేత వైఎస్సార్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, రూ.3581 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుడితే... 2014-19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు. తిరిగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి రెండు సొరంగాలను పూర్తి చేసిన మార్చి 6, 2024న జాతికి అంకితం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా ఇంతవరకు ఆర్ అండ్ ఆర్ (సహాయ పునరావాస) ప్యాకేజీ ఇవ్వకుండా.. ప్రాజెక్టు పూర్తైందని ప్రకటించడాన్ని ఆయన తప్పు పట్టారు.సహాయ పునరావాస ప్యాకేజీలో భాగంగా ఇళ్లు కోల్పోయిన 7300 కుటుంబాలకు రూ.1000 కోట్లు అవసరం కాగా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి డీఆర్సీ సమావేశంలో ఆర్ అండ్ ఆర్ ఎప్పుడిస్తారని మేము అడిగితే 2-3 నెలల్లో చెల్లిస్తామని చెప్పి 20 నెలలు గడుస్తున్నా... నేటికీ వారికి పరిహారం అందలేదని నిలదీశారు. మరోవైపు నిర్వాసితులకు పరిహారం పూర్తిగా చెల్లించామన్న చంద్రబాబు మాటలు పచ్చి అబద్ధమని.. నిజంగా చెల్లిస్తే ప్రాజెక్టును ప్రారంభించకుండా, కేవలం కెనాల్ను ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..ప్రకాశం జిల్లా అభివృద్ధి వైఎస్సార్సీపీతోనేప్రకాశం జిల్లాకు జరిగిన ప్రతి మేలు వైఎస్ జగన్ హయాంలోనే జరిగింది. రామాయపట్నం పోర్టు, ఇండోసోల్ కంపెనీ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడం వంటివి వైఎస్ జగన్ చొరవ వల్లే సాధ్యమయ్యాయి. "వ్యవసాయం దండగ" అన్న చంద్రబాబుకు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.లడ్డూ వివాదం - ఫేక్ వీడియోల బాగోతంశాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు చెప్పులతో స్వామివారిని అవమానించారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మేము చెప్పులతో ఉన్న వీడియోలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేస్తే, ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఆ వీడియోలు ఫేక్ అని ఒప్పుకున్న ప్రభుత్వం, వాటిని ప్రసారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పై ఏ చర్యలు తీసుకున్నారని తూమటి మాధవరావు నిలదీశారు. -
ఏపీలో 2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ
సాక్షి, విజయవాడ: ఏపీలో 2018 గ్రూప్-1 అధికారులను ప్రభుత్వం మూకుమ్మడి బదిలీ చేసింది. 2018 గ్రూప్-1 రిక్రూట్మెంట్ వివాదంపై విచారణ కొనసాగుతున్న క్రమంలో ఈ నియామక ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ హైకోర్టు.. 2018 రిక్రూట్మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యే వరకు అప్రాధాన్య పోస్టులో ఉంచాలంటూ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో 26 మందిని సాధారణ పరిపాలన శాఖ (GAD)కి సీఎస్ అటాచ్ చేశారు.ఈ నియామకాల్లోని అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించవద్దంటూ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో సీఎస్.. ప్రస్తుతం విధుల్లో ఉన్న 26 మంది అధికారులను వారి ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి.. జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
కర్ణాటక, తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు మౌనం: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: పొరుగు రాష్ట్రాల కారణంగా రాయలసీమ ప్రాంతానికి నీటి కష్టం వచ్చిందని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. కర్ణాటక, తెలంగాణ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరుమెదపడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ప్రయోజనాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..:అసెంబ్లీలో చర్చించండి బాబూ..:ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక మాట చెప్పదలిచాను. చంద్రబాబు గారూ.. రాయలసీమకు కష్టం వచ్చింది. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాలకు నీటి సమస్య ఎదురైంది. మేం లేవనెత్తిన అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించండి. అలాగే నీటి ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయండి.ఆల్మట్టి ప్రాజెక్టుపై ఎందుకు స్పందించడం లేదు?:1996 వరకు ఆల్మట్టి కేవలం ఒక ఆనకట్ట మాత్రమే. అప్పటికి 506 అడుగులుగా ఉన్నఈ ప్రాజెక్టు ఎత్తు తర్వాత 519.6 మీటర్లకు పెరిగింది. అప్పట్లో నేను దేశ రాజకీయాల్లో కీలకంగా ఉన్నానని, దేవెగౌడను ప్రధానిగా చేశానని చంద్రబాబు చెప్పుకునే రోజుల్లోనే ఆల్మట్టి డ్యామ్ 120 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పెద్ద జలాశయంగా మారింది.తాజాగా ఈ డ్యామ్ ఎత్తును 524.24 మీటర్లకు పెంచి అదనంగా మరో 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా ప్రణాళికలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అనేక అంశాలపై గంటల తరబడి మాట్లాడే చంద్రబాబు ఆల్మట్టి ప్రాజెక్టుపై ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. అనంతపురం, కర్నూలు జిల్లా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. కృష్ణా పరివాహక ప్రాంత భవిష్యత్పై భయం నెలకొంది.నీరు రాకపోతే సీమ ఎడారే:ఆల్మట్టి డ్యామ్ వద్ద 120 టీఎంసీల నీరు నిల్వ చేస్తేనే జూన్, జులైలో రావాల్సిన వరద నీరు ఆలస్యమై ఆగస్టులో వస్తోంది. రాబోయే రోజుల్లో అదనంగా మరో 100 టీఎంసీలు నిల్వ చేస్తే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వరద నీరు దిగువ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉండదు. ఎగువ నుంచి నీరు రాకపోతే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుంది. అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 5.62 లక్షల ఎకరాల ఆయకట్టుకు రెండు ప్రాజెక్టుల ద్వారా కలిపి 20.90 టీఎంసీల నీటి సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందకపోవచ్చనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు 2018లోనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీడబ్ల్యూసీ) అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ప్రభావంతో రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. తుంగభద్ర డ్యామ్, హెచ్ఎన్ఎస్ఎస్, ఎల్ఎల్సీ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. వేదావతి నదిపై కొత్త ప్రాజెక్టులు నిర్మించకూడదనే నిబంధనలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతానికి నీటి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించాలి.చంద్రబాబు మౌనం!:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులం మాట్లాడుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశామని చెప్పారు. ఈ పథకాన్ని ఆపేయడం వల్ల రాయలసీమ ప్రాంతంలోని అనేక ప్రాజెక్టులు, దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు భరోసా లేకుండా పోయే ప్రమాదం ఉంది.కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తుంటే, చివరకు శ్రీశైలం డ్యామ్కు నీరు వస్తుందా లేదా అన్న ఆందోళన నెలకొంది. చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు. పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకోవాలంటే 841 అడుగుల నీటి మట్టం అవసరం. వెంటనే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నాం. బనకచర్ల ఎత్తిపోతల సహా ప్రత్యామ్నాయ నీటి సరఫరా మార్గాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు రాయలసీమ బిడ్డగా తన బాధ్యతను నిర్వర్తించాలని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ సూచించారు. -
‘అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్దాలు’
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ని చూసి ఊసరవెళ్లి కూడా ఉరేసుకుంటుందన్నారు. ఇక లోకేష్ పులకేసిని తలపించారని.. ఈ ముగ్గురు సొంత డబ్బా కొట్టుకోవటానికే అసెంబ్లీని వేదికగా చేసుకున్నారంటూ చంద్రశేఖర్ దుయ్యబట్టారు.‘‘కల్తీ కారణంతో వెనక్కు పంపిన నాలుగు ట్యాంకర్లను తిరిగి ఎందుకు తీసుకున్నారు?. వైష్ణవి డెయిరీ సంగం డెయిరీ లోగోతో మజ్జిగ అమ్ముతున్నారు. వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి?. ఈ రాష్ట్రంలో పాలు, నీళ్లు అన్నీ కల్తీనే. పాలల్లో ఏం కలిసిందో ఎల్లో మీడియా ముందుగానే ఎలా రాస్తుంది?. లడ్డూ ఇష్యూలో కూడా ఇదే విధంగా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసింది. సీబిఐ రిపోర్టును కూడా తప్పుదారి పట్టించిన ఘనత చంద్రబాబు, ఎల్లో మీడియాది’’ అంటూ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘హెరిటేజ్ డెయిరీ ఎప్పుడూ ఆలయాలకు నెయ్యి సరఫరా చేయలేదని టీటీడీ నేతలు పచ్చి అబద్దాలు చెప్పారు. 2002లో రూ.117లకు టిన్ల ద్వారా హెరిటేజ్ నెయ్యి సరఫరా చేసింది.. కానీ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడారు. బోలేబాబాతో సహా అందరు బాబాలకు చంద్రబాబే పెద్ద దిక్కు. ఇందాపూర్ డెయిరీని మ్యానుఫ్యాక్చరింగ్ నుండి కో-మ్యానిఫాక్చరింగ్ యూనిట్గా ఎలా మార్చారు?. వైష్ణవి డెయిరీ గేట్లకు రంగు మార్చితే మీ బాగోతాలన్నీ కనుమరుగు అవుతాయా?..హెరిటేజ్ భాగోతం బయట పడగానే నేషనల్ సేల్స్ మేనేజర్ని మార్చేశారు. తిరుమల కొండ మీద ఎలాంటి ఎన్నికలు జరగకూడదని వైఎస్సార్ హయాంలో జీవో తెచ్చారు.. కానీ దాన్ని కూడా రెండు కొండలకే వెంకటేశ్వర స్వామిని పరిమితం చేశారంటూ చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేశారు. తిరుమలకు ఏడు కొండలు కాదు రెండు కొండలేనంటూ జీవో ఉంటే అది చంద్రబాబు బయట పెట్టాలి. తిరుమలలో అన్యమత ప్రచారం చేసుకోవటానికి అనుమతి ఇస్తానని బైబిల్ మిషన్ సభలో చంద్రబాబు మాట్లాడారు. తిరుమల వెళ్లే బస్ టిక్కెట్ల మీద కూడా అన్యమత ప్రచారం చేయటానికి చంద్రబాబే జీవో ఇచ్చారు.నెల్లూరు జోన్లో ముద్రించిన టిక్కెట్ రోల్స్ని తిరుమలకు కూడా పంపారు. వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిన ఘనుడు చంద్రబాబు. నీచమైన రాజకీయాలు చేయటం చంద్రబాబుకే చెల్లు. చంద్రబాబు జీవితంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించ లేదు. అలాంటి వ్యక్తి వెలిగొండ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్టు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు’’ అంటూ చంద్రశేఖర్ మండిపడ్డారు. -
రేపు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు( ఫిబ్రవరి 26, గురువారం) నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు వైఎస్సార్ కడప పులివెందుల భాకరాపురం నివాసం నుంచి బయలుదేరి 8.50 గంటలకు హెలిప్యాడ్కు చేరుకుంటారు.9 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. 10.10 గంటలకు రోడ్డు మార్గంలో గొలగమూడి రోడ్డులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కు 10.20 గంటలకు చేరుకుంటారు. స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్ కొండూరు అజయ్రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరుగు పయనమవుతారు. -
అప్పుల్లో బాబు సర్కార్ రికార్డు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడంలో తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. 2014–19 మధ్య ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రూ.2,49,530 కోట్లు అప్పు చేసిన ఆయన.. ఇప్పుడు రెండేళ్లు కూడా పూర్తవకుండానే ఆ రికార్డును అధిగమించారు. 20 నెలల్లోనే ఏకంగా రూ.3,28,321 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పులఊబిలో ముంచేశారు. మంగళవారం వస్తే చాలు అప్పుల పరంపరను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మంగళవారం 7.70 శాతం వడ్డీతో చంద్రబాబు సర్కారు రూ.3,100 కోట్లు అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ అప్పును రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించి ఇచ్చింది. దీంతో బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చంద్రబాబు ప్రభుత్వం అప్పులు ఏకంగా రూ.3,28,321 కోట్లకు చేరాయి. ఇందులో మంగళవారం చేసిన అప్పుతో కలిపి బడ్జెట్ అప్పులు రూ.1,79,264 కోట్లకు, బడ్జెట్ బయట అప్పులు రూ.1,49,057 కోట్లకు చేరాయి. ఇందులో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేస్తున్న అప్పులు రూ.1,01,670 కోట్లు ఉండగా, రాజధాని పేరుతో తీసుకున్న అప్పు రూ.47,387 కోట్లు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. కాగా, చంద్రబాబు ప్రభుత్వం నెలకు సగటున రూ.16,416 కోట్లు, రోజుకు రూ.547 కోట్లు అప్పు చేసినట్లయ్యింది. ఈ అప్పులతో సూపర్ సిక్స్తో పాటు ఇతర హామీలు అమలు చేయడం లేదు. అలాగే ఆస్తుల కల్పనకు కూడా వ్యయం చేయడం లేదు. మరి ఇన్ని అప్పులు దేని కోసం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. -
‘అన్నదాత సుఖీభవ’లో కోత
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలులో రైతులను నిలువునా మోసంచేస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం హయాంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద లబ్దిపొందిన రైతులతో పోలిస్తే భారీగా కోత పెట్టింది. ఈ విషయం శాసనసభ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో బట్టబయలైంది. పైగా తొలి ఏడాది ‘అన్నదాత సుఖీభవ’ను ఎగ్గొట్టడమే కాకుండా... రెండో ఏడాది రెండు విడతల్లో రూ.5వేల చొప్పున మాత్రమే చెల్లించింది. మూడో విడత అసలు ఇవ్వకుండానే నిధులు విడుదల చేసినట్టు ప్రకటించడం విస్మయాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చివరి ఏడాది 2023–24లో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద 53.18 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించిందని ఈ ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్య 46.86 లక్షలకు తగ్గినట్లు ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానంతో తేటతెల్లమైంది. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు బి.విరూపాక్షి, ఆకేపాటి అమరనాథ్రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాపై అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు దఫాల్లో రూ.4,685.84 కోట్లు మాత్రమే చెల్లించగా, శాసనసభకు ఇచ్చిన సమాధానంలో మాత్రం రూ.8,862.89 కోట్లు ఇచ్చినట్లు పేర్కొనడం గమనార్హం. ఒక్కో రైతుకు రూ.30వేలు ఎగనామం ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ‘అన్నదాత సుఖీభవ’ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది అన్నదాత సుఖీభవ ఊసే ఎత్తలేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయాలని నిలదీయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో ఏడాది అన్నదాత సుఖీభవను అమలు చేశారు. అది కూడా రాష్ట్ర వాటా రూ.14 వేలు, పీఎం కిసాన్ కింద మరో రూ.6 వేలు కలిపి రూ.20 వేలు.. అంటూ చంద్రబాబు మాట మార్చారు. అయితే, గత ప్రభుత్వం హయాంలో లబ్ధి పొందిన రైతుల సంఖ్యతో పోలిస్తే 6.32 లక్షల మందికిపైగా రైతులను తగ్గించి అరకొరగా రెండు విడతల్లో రూ.5వేలు చొప్పున కేవలం రూ.4,685.84 కోట్లు మాత్రమే ఇచ్చింది. మొత్తంగా రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.30 వేలు చొప్పున చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. మూడో విడత ఎప్పుడు జమ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మాత్రం రాష్ట్రం వాటా రూ.4,685.84 కోట్లు, కేంద్రం వాటా రూ.4,177.05 కోట్లు కలిపి రూ.8,862.89 కోట్లు విడుదల చేసినట్టు అసెంబ్లీలో సమాధానం ఇవ్వడం విస్తుగొలుపుతోంది. -
మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం
సాక్షి, అమరావతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అంటే భయం లేకుండా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అసెంబ్లీని అబద్ధాలకు వేదికగా మార్చుకుందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూలో నెయ్యి అంశంపై ప్రభుత్వం చేసిన చర్చ అంతా వైఎస్ జగన్పై రాజకీయంగా బురదజల్లడానికేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీల మధ్య ఉన్న అక్రమ సంబంధాలను కప్పిపుచ్చడానికి ఐదు రోజులు తాత్సారం చేసి, ఇవాళ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని స్పష్టం చేశారు. గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇవాళ అసెంబ్లీలో మాత్రం ‘కల్తీ జరిగింది’ అంటూ మాట మార్చడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. నిజంగా చంద్రబాబుకు దేవుడిపై భక్తి ఉంటే.. 2014 నుంచి ఇప్పటి వరకు సరఫరా అయిన నెయ్యి కంపెనీల మూలాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. ఈ సమావేశంలో పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు ⇒ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం నారా చంద్రబాబు ఒక రిపోర్టులోని అంశాలను దురుద్దేశంతో మాజీ సీఎం జగన్పై ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు కట్టుకుని గుడి మెట్లు కడిగారు. జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ‘మాజీ సీఎం కలిపారని నేను అనలేదు, టీటీడీ ఉద్యోగులు కలిపారని అన్నాను’ అంటూ మాట మార్చారు. ఇప్పుడు కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు. ⇒ జగన్ సీఎంగా ఉన్నప్పుడు దేవాలయాలపై దాడులు జరిగితే ఆయనకు రాజకీయ లాభం వస్తుందా? పవిత్ర విగ్రహాలు ధ్వంసం అయితే జగన్కు లాభం ఏంటి? ఏ రాజకీయ నాయకుడైనా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేస్తాడు? జగన్ హయాంలో ఆలయాలపై దాడులు జరిగితే ఆయనకు లాభమా? ప్రత్యర్థి అయిన చంద్రబాబుకే లాభం కాదా? ఇదేనా మీ భక్తికి తార్కాణం బాబూ? ⇒ 2014–2019 మధ్య ఎన్ని గుడులను జేసీబీలతో కూల్చారో.. రాజధాని నడిరోడ్డున ఎన్ని ఆలయాలు కూల్చారో వీడియోలు ఉన్నాయి. ఇలా గుడులు కూల్చిన మీకు దేవుడి పట్ల భయం ఉన్నట్టా? ఇదేనా మీ భక్తికి తార్కాణం? ⇒ కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత కాశీనాయన ఆలయంలో కూల్చివేతలు ప్రారంభించింది ఎవరు? సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్కు ఇవి తెలియవా? అటవీ శాఖ ఆదేశాలు లేకుండా కూల్చివేతలు జరిగాయా? ప్రజలు నమ్ముతారా? శ్రీకాకుళంలోని శ్రీకూర్మం మందిరానికి మచ్చ తెచ్చారు. సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. గుడిలో మరణాలు అపచారం కాదా? ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కాదా? అంతకు ముందు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆత్మపరిశీలన చేసుకున్నారా? ⇒ టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిశోర్ రెడ్డి ప్రోద్బలంతో అర్ధరాత్రి ఆలయ విధ్వంసం జరిగింది. తిరుచానూరులో వారాహి ఆలయాన్ని కూల్చింది ఎవరు? మీ పార్టీకి చెందిన వారు‡ కాదా? గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు మూడు మునకలు వేయడానికి 29 మంది భక్తులు ప్రాణాలు బలిగొన్నారు. తిరుమల తిరుపతిలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చింది మీరు కాదా? రామతీర్థంలో స్వామివారి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి సీఎంఆర్ఎఫ్ నిధులు ఎలా ఇచ్చారు? ⇒ చంద్రబాబు ప్రభుత్వంలో కూల్చిన ఆలయాలను జగన్ ప్రభుత్వం పునర్ నిరి్మంచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కల్తీ నెయ్యి పాపం మీదే ⇒ మీరు సీఎం అయ్యాక పెట్టిన రెండో సంతకంతో టీటీడీ ఈవో శ్యామలరావును నియమించారుగా.. ఇప్పుడు ఆయన ఎందుకు కనిపించట్లేదు? మీరు చెప్పిన డెయిరీల దగ్గర నెయ్యి కొనడం లేదనే ఆయన్ను బదిలీ చేశారా? ⇒ 2024 జూన్లో ఆయన్ను నియమిస్తే జూలై 6న నాలుగు శాంపిల్స్, జూలై 12వ తేదీన మరో నాలుగు శాంపిల్స్ తీశారు. జూలై 16న 6వ తేదీన తీసిన శాంపిల్స్ రిపోర్ట్ వచ్చింది. జూలై 12న తీసిన శాంపిల్స్ రిపోర్ట్ జూలై 23న వచ్చింది. ఎన్డీడీబీ ఇచి్చన రిపోర్టులు జూలై 16, 23న వచ్చాయి. జూలై 25వ తేదీన ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఆ ట్యాంకర్లు ఎక్కడికి వెళ్లాయో సిట్ ఇప్పటికే బయటపెట్టింది. ⇒ ఆ ట్యాంకర్లు వైష్ణవీ డెయిరీకి సమీపంలోని రాఘవేంద్ర క్రషర్ వద్ద పెట్టడం, తిరిగి కొన్నాళ్ల తర్వాత వైష్ణవీ డెయిరీకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి టీటీడీకి అప్పగించడం వాస్తవం కాదా? పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిన ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేసి భక్తులకు పంచేశారు కదా. ఈ విషయాన్ని సిట్ తేల్చింది. అప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం మీరే కదా.. ఈ పాపం వైఎస్ జగన్కు మీరు ఎలా అంటగడుతున్నారు? అసలు పాపం మీదే. వీళ్లు సరఫరా చేసింది కల్తీ నెయ్యా? తక్కువ రేటుకు నెయ్యి కొన్నారని ప్రశి్నస్తున్న మీరు.. మీ హయాంలో 2014–19లో రూ.278, రూ.264కు కేజీ నెయ్యి ఎలా కొన్నారో చెప్పండి. అప్పుడు టీటీడీ లడ్డూ ప్రసాదానికి అవసరమైన నెయ్యిలో 90 శాతం సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్లో ఉన్న ప్రీమియర్ ఆగ్రో డెయిరీ సరఫరా చేసింది. 2016 మార్చిలో కేజీ నెయ్యి రూ.332, సెపె్టంబర్ లో రూ.364కు, ఏప్రిల్ 2017లో రూ.411కు, అక్టోబర్ 2017లో రూ.378, జనవరి 2018 రూ.320, జూన్ 2018లో రూ.321కు సరఫరా చేసింది. ఇది కల్తీ నెయ్యా? మీ లాజిక్ ప్రకారమే చెప్పండి. ప్రీమియర్ డెయిరీకి చెందిన ఆశిష్ గుప్తా, రేణూ గుప్తాకు హెరిటేజ్ డెయిరీలో వాటాలుండటం నిజమో కాదో చంద్రబాబే చెప్పాలి. ఆల్ఫా డెయిరీకి కూడా హెరిటేజ్లో షేర్లు ఉన్నాయో లేదో చెప్పాలి. బయటపడ్డ హెరిటేజ్–ఇందాపూర్ బంధం ⇒ తమ డెయిరీకి బోలేబాబాతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో హెరిటేజ్ పిటిషన్ వేసింది. బోలేబాబా ఆర్గానిక్కూ, సీబీఐ చార్జిషీట్లో ఉన్న బోలేబాబా ఆర్గోనిక్కూ సంబంధం లేదని అందులో చెప్పారు. తమకు ఢిల్లీ, రాజస్థాన్లో ఉన్న బోలేబాబా డెయిరీలతో సంబంధం ఉన్నట్లు చెప్పారు. కానీ ఐటీ శాఖ ఉత్తరాదిలో 35 డెయిరీల్లో 131 గంటల పాటు సోదాలు చేసి ఉత్తరాఖండ్, ధోల్ పూల్, రాజస్థాన్, ఢిల్లీ బోలేబాబా డెయిరీలన్నీ ఒకే గొడుగు కింద ఉన్న సంస్థలని తేల్చింది. ⇒ దీన్నిబట్టి భారత్లో పెద్ద డెయిరీ మాఫియా నడుస్తోందని అర్థమవుతోంది. దీనికి వైట్ కాలర్ డాన్ ఎవరు? ఇండియా మాఫియా డెయిరీకి పాబ్లో ఎస్కోబార్ ఎవరు? బాబూ ఇదేనా మీ భక్తి? ⇒ మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు 2024 నవంబరు 16 న మరణిస్తే.. ఏడాది తిరక్కుండానే మార్చి 21, 2025న మీ మనవడి పుట్టిన రోజున తిరుమలకు వెళ్లి టీటీడీకి రూ.44 లక్షలు దానం ఇచ్చి పూజలు చేయలేదా? ⇒ చంద్రబాబు హయాంలో 2014 –19 మధ్య పవిత్ర జెరూసలెం యాత్ర, పవిత్ర మక్కా యాత్ర అని ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలను ఆర్టీసీ టికెట్ వెనుక ముద్రించాలని జీవో ఇచ్చింది మీరు కాదా? అవి జగన్ వచ్చే వరకు చలామణీలో ఉన్నాయి. దానికి జగన్కు ఏం సంబంధం? ఈ పాపం ఎవరిది? మీ హయాంలోనే నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలు ⇒ బోలేబాబా డెయిరీకి పొమిల్ జైన్, విపుల్ జైన్ ఓనర్లు. వైష్ణవీ డెయిరీ ఓనర్లు కూడా వాళ్లే. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన సంగం డెయిరీ వైష్ణవీ పార్ట్నర్. ఇవాళ అసెంబ్లీలో పెద్ద పెద్దగా రంకెలేసిన ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పుడేం చెప్తారు? బోలేబాబా, వైష్ణవీ డెయిరీల ఓనర్లు పొమిల్ జైన్, విపుల్ జైన్ ఇద్దరికీ హెరిటేజ్లో వాటాలు ఉన్నమాట వాస్తవం కాదా? ఏఆర్ డెయిరీ చంద్రబాబుకు దగ్గరా, జగన్కు దగ్గరా? ఏఆర్ డెయిరీ ఓనర్ రాజు రాజశేఖర్ డిండిగల్లో హెరిటేజ్ఫ్యాక్టరీని కట్టించింది నిజమా కాదా? ⇒ నిబంధనలు సడలించి, నాణ్యతా ప్రమాణాలు తగ్గించారని చెబుతున్న చంద్రబాబు.. దాని నేపథ్యం కూడా చెప్పాలి. ఇవాళి్టకీ అవే నిబంధనలు అమల్లో ఉన్నాయి. సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్లో ఉన్న ప్రీమియర్ డెయిరీ, ఆల్ఫా డెయిరీ, మాల్ గంగా డెయిరీ, వైష్ణవీ డెయిరీలు 2025 జనవరి వరకు నెయ్యి సరఫరా చేశాయి. ఇప్పుడు మీ నిబద్దత ఏమైందో చెప్పండి. -
అవును.. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ ‘కో మాన్యుఫాక్చరర్’
సాక్షి, అమరావతి: టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఇందాపూర్ డెయిరీ తమ కుటుంబ సంస్థ హెరిటేజ్కు కో–మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అని శాసన సభ సాక్షిగా సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారు. ఇందాపూర్ డెయిరీలో హెరిటేజ్ ఉత్పత్తులు తయారవుతాయని వెల్లడించారు. తమకు కో–మాన్యుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఇందాపూర్పై ఆరోపణలు చేస్తున్నారని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంలో హెరిటేజ్కు ముడిపెడుతున్నారని, దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై శాసన సభలో మంగళవారం నిర్వహించిన లఘు చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. హెరిటేజ్ సంస్థ తన ఉత్పత్తులను ప్రభుత్వానికి ఎన్నడూ సరఫరా చేయలేదని తెలిపారు. తిరుమల క్షేత్రం ఏడు కొండలపై వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ చేసిన 746, 747 జీవోలను తానెప్పుడూ వ్యతిరేకించలేదన్నారు.లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని వాడారని ఎన్డీడీబీ అనుమానిత నివేదిక ఆధారంగానే ప్రకటన చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యితో తయారు చేసిన 20.01 కోట్ల లడ్డు ప్రసాదాలను విక్రయించారని ఆరోపించారు. సీబీఐ సిట్ సిఫార్సులు అమలు చేయడం కోసం ఏకసభ్య కమిషన్ను నియమించామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక టీటీడీ ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నామన్నారు.గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి సతీమణి బైబిల్ పట్టుకున్నారని, కరుణాకర్రెడ్డి కుమార్తె వివాహం క్రైస్తవ సంప్రదాయంలో చేశారని విమర్శించారు. కాగా 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను అధికారంలోకి వస్తే 746, 747 జీవోలను రద్దు చేస్తామని గుంటూరులో నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. ఆ విషయాన్ని కప్పి పుచ్చి, ఆ జీవోలను తాను వ్యతిరేకించలేదని అసెంబ్లీ వేదికగా తనకు అలవాటైన రీతిలో కళ్లార్పకుండా అబద్ధాలను వల్లె వేశారు. పెరుమాళ్లకే ఎరుక: పవన్ కళ్యాణ్తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం విషయంలో గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తానెక్కడా అనలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని టీటీడీ పాలక మండలి దీనికి బాధ్యత తీసుకోవాలన్నారు. రసాయనాలు కలిపిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని తేలిందన్నారు. ఇందులో లక్ష లడ్డూలు అయోధ్యకు పంపారని, అయితే ఇది రికార్డుల్లో నిరూపితం కావడం లేదన్నారు. రసాయనాల్లో ఏముందో పెరుమాళ్లకే ఎరుక అని వ్యాఖ్యానించారు. నిబంధనలు సవరించి, నచ్చిన సంస్థలకు గత ప్రభుత్వంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లు ఇచ్చారని విమర్శించారు. -
వైఎస్ జగన్ పేరు చెప్పాలని రఘురామ టార్చర్!
సాక్షి, అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు తనపై బనాయించిన అక్రమ కేసులో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ పేర్లు చెప్పాలని తనపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన వాస్తవాలను బహిర్గతం చేశారు. రఘురామకృష్ణరాజు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని.. ఆయన ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో ఫోన్కు మెస్సేజ్ చేశారని వెల్లడించారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి, పీవీ సునీల్ కుమార్ పేర్లు చెప్పకపోతే నిన్ను నిందితుడిగా చేరుస్తాం..’ అని ఆ మెస్సేజ్లో బెదిరించారని పేర్కొన్నారు. అవాస్తవాలను చెప్పేందుకు సమ్మతించకపోవడం వల్లే తనపై అక్రమ కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. రఘురామకృష్ణరాజు కాల్ డేటా తీస్తే అవన్నీ బయటపడతాయని, చాలామందిని ఈ కేసులో అక్రమంగా ఇరికించారన్నది వెల్లడవుతుందన్నారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని ఆధారాలు చూపిస్తానని ప్రకటించారు. ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ దామోదర్ తన తల్లి పట్ల అసభ్యంగా, అవమానకరంగా వ్యవహరించారని సునీల్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎస్టీగా పుట్టడమే నేను చేసిన నేరమా..? చిన్న కులాల వారు కష్టపడి చదివి ఐపీఎస్ లాంటి ఉన్నత స్థానాలకు చేరితే జీర్ణించుకోలేరా?..’ అని సునీల్ నాయక్ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం బిహార్లో అగ్నిమాపక శాఖ, హోంగార్డ్స్ విభాగం ఐజీగా ఉన్న సునీల్ నాయక్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు పట్నాలో సోమవారం హల్చల్ చేసిన విషయం విదితమే. గతంలో డిప్యూటేషన్పై ఏపీలో పనిచేసిన సునీల్ నాయక్పై అక్రమంగా బనాయించిన కేసులో కనీసం అరెస్టు వారెంట్, కేసు డైరీ లేకుండా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు యత్నించారు. అయితే ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ఏపీ పోలీసుల అరాచకాన్ని బిహార్ పోలీసులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ఏపీ పోలీసుల తీరుపై పట్నా కోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఏపీ పోలీసులు అవమాన భారంతో తిరుగుముఖం పట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తనపట్ల వ్యవహరించిన తీరుపై సునీల్ నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఎక్స్ ఖాతాలో మంగళవారం సంచలన పోస్టు పెట్టారు. అందులో ఏమన్నారంటే.. » ఎస్టీగా పుట్టడమే నేను చేసిన నేరమా..? గిరిజన లంబాడి కుటుంబంలో పుట్టి చెన్నై ఐఐటీలో గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యా. చిన్న కులాల వాళ్లు ఉన్నత స్థానంలో ఉంటే జీరి్ణంచుకోలేరా..? రఘురామకృష్ణరాజు కేసులో నన్ను అక్రమంగా ఇరికించారు. 2021లో జరిగినట్లు చెబుతున్న సంఘటనపై 2024లో కేసు నమోదు చేశారు. అందులో నా పాత్ర ఏమాత్రం లేకపోయినా ఇరికించారు. » హెచ్డీఎఫ్సీ బ్యాంకు మహిళా మేనేజర్ను అడ్డు పెట్టుకుని ఆయన (ఎస్పీ దామోదర్) ఎన్నో భూ దందాలకు పాల్పడితే ఇప్పటికీ విచారణ లేదు. ఇసుక, గ్రానైట్, మైనింగ్ దందాలకు పాల్పడితే విచారణ లేదు. ధోతీ కార్యక్రమం నిర్వహించి రూ.4 కోట్లు విలువైన బంగారం, బహుమతులు పొందితే నేటికీ విచారణ లేదు. కానీ లంబాడీ కులంలో పుట్టిన నేను ఐపీఎస్ అధికారిని కావడమే నేను చేసిన నేరమా..? అందుకే నాపై అక్రమ కేసు పెట్టారా? అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఐడీ చీఫ్ పీవీ సునీల్కుమార్ పేర్లు చెప్పమని ఎంతోమంది నాపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నాతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డులు, ఇతర ఆధారాలన్నీ నా వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. తగిన సమయంలో ఆ ఆధారాలన్నీ బయటపెడతా. లంబాడీ కులంలో పుట్టిన నాకు మాట్లాడే హక్కు ఉండదనే అహంకారంతో వారు అలా వ్యవహరించారు. » పట్నాలో నా నివాసంలోకి అక్రమంగా ప్రవేశించిన ఏపీ పోలీసు అధికారి (ఎస్పీ దామోదర్) నిబంధనలకు విరుద్ధంగా, దురుసుగా వ్యవహరించారు. తన దగ్గర బాడీ కెమెరా ఉందంటూ మా ఇంట్లో అల్లరి చేశారు. ఆయనతో వచ్చిన పోలీసు అధికారులు నా తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అవమానపరిచారు. నా తల్లిని అవమానించిన అందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతా. -
9 నుంచి ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ
గుంటూరు వెస్ట్: ఏపీ, తెలంగాణ మహిళ, పురుష అభ్యర్థులకు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ మార్చి 9 నుంచి ప్రారంభమవుతుందని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. మంగళవారం గుంటూరు కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ ఎయిర్ఫోర్స్ రిక్రూటింగ్ డైరెక్టర్ వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ మాట్లాడుతూ.. మార్చి 9, 10 తేదీలలో ఏపీ, తెలంగాణ యువతులకు, 12, 13 తేదీలలో ఏపీ పురుష అభ్యర్థులకు, 15, 16 తేదీలలో తెలంగాణ పురుష అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందన్నారు. గుంటూరులోని నాగార్జున వర్సిటీలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 2005 జూలై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్కు అర్హులన్నారు. -
కోర్టు ముందు అసత్యాలు ఉంచడం సరికాదు
సాక్షి, అమరావతి: సర్వశిక్షాభియాన్ పీడీ శ్రీనివాసరావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ముందు అసత్యాలు ఉంచడం సరికాదని ఆక్షేపించింది. క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) బోధనా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించే వ్యవహారంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేజీబీవీల్లో పార్ట్టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న తమను అర్థాంతరంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ పలువురు పీజీటీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్జడ్జి అధికారుల తీరును తప్పుపట్టారు. వారి సేవలను కొనసాగించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అధికారులు ధర్మాసనం ముందు ఈ ఏడాది జనవరిలో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతూ వస్తోంది. సింగిల్ జడ్జి తీర్పును అమలు చేస్తామంటూ కోర్టుకిచి్చన హామీని ఉల్లంఘించినందుకు సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) శ్రీనివాసరావుపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. తాజాగా ధర్మాసనం ఈ సుమోటో కోర్టు ధిక్కార వ్యాజ్యంతో పాటు సింగిల్ జడ్జి తీర్పుపై అధికారులు దాఖలు చేసిన అప్పీళ్లపై కూడా విచారణ జరిపింది. శ్రీనివాసరావు ఈ విచారణకు సైతం వ్యక్తిగతంగా హాజరయ్యారు. కోర్టు ఆదేశాలను గౌరవించి అమలు చేయండి చాలు... ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న అంశాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టుకు అసత్యాలు చెప్పొద్దని తేల్చి చెప్పింది. క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలూ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసులో మీ చర్యలను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కి నివేదించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే 12 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు ఉన్న నేపథ్యంలో ఆ పని చేయడం లేదని స్పష్టం చేసింది. కోర్టు ముందు ఎందుకు అసత్యాలు చెప్పాల్సి వ చ్చిందని ధర్మాసనం ప్రశ్నించగా, కోర్టు అంటే భయమని శ్రీనివాసరావు చెప్పారు. కోర్టు అంటే భయమంటూ మళ్లీ అబద్ధం చెబుతున్నారని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. మరోసారి ఇలాంటి వాటిని పునరావృత్తం చేయవద్దని స్పష్టం చేసింది. పూర్తి వాస్తవాలతో మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆయన్ను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
మహాపచారం మీదే చంద్రబాబూ..!
సాక్షి, అమరావతి: ‘‘మోసానికి ఫ్యాంటూ చొక్కా వేస్తే అది చంద్రబాబు...!’’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలు నిజమేనని శాసనసభ వేదికగా మరోసారి రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని సీబీఐ తన చార్జిషీట్లో తేల్చేసినా ఆయన ఏమాత్రం పశ్చాత్తాపం చెందలేదు! దారుణమైన అబద్ధాలు మాట్లాడి వెంకన్న భక్తులను క్షోభకు గురిచేసి మోసగించాననే బాధ ఆయన మొహంలో ఏ కోశానా కానరాలేదు. 2014–19 మధ్య టీటీడీకి కిలో రూ.278కే ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఏడు కొండలూ తిరుమల దివ్య క్షేత్రానివేనని స్పష్టం చేస్తూ.. హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జారీ చేసిన జీవోలు ఇప్పుడు ఏకంగా కిలో నెయ్యి రూ.658 చొప్పున సరఫరా కాంట్రాక్టు అప్పగించడంపైనా సమాధానం లేదు! ఇందాపూర్ డెయిరీని హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా కొద్ది రోజుల క్రితం వరకు హెరిటేజ్ వెబ్సైట్లోనే చూపించారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా కో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేయడంపైనా సమాధానం లేదు! టీటీడీకి పంపిన నెయ్యి ట్యాంకర్లు రిజెక్టు కావడం.. వాటినే తిరిగి వినియోగించడం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జరిగాయని సీబీఐ దర్యాప్తులో తేల్చేసినా దానికీ సమాధానం లేదు. చంద్రబాబు వీటిలో ఏ ఒక్కదానికీ జవాబు చెప్పకుండా తిరుమల క్షేత్రం, ఏడుకొండల గురించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకుంటూ చట్ట సభ సాక్షిగా నిస్సిగ్గుగా బుకాయించారు. ‘‘టీడీపీ అధికారంలోకి వస్తే ఆ రెండు జీవోలు 746, 747లను రద్దు చేస్తాం..’’ అని స్వయంగా మీరే 2009లో గుంటూరులో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో చెప్పారు చంద్రబాబూ..! ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. తిరుమల ఏడుకొండలూ టీటీడీవేనని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన 746, 747 జీవోలను మీరు రద్దు చేస్తామన్నారు.. హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ మహానేత వైఎస్సార్ ఇచ్చిన జీవోను కూడా రద్దు చేస్తామని కూడా మీరే ప్రకటించారు చంద్రబాబూ..! అంటే.. తిరుమల శ్రీవారి పట్ల, హిందూమతం పట్ల అపచారానికి ఒడిగట్టింది మీరే.. అటువంటి మీరు ఇప్పుడు పరమ భక్తుడి మాదిరిగా కొంగ జపం చేస్తుంటే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నది గుర్తుంచుకోండి చంద్రబాబూ..! ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అటు కలియుగ దైవం తిరుమల శ్రీవారు అంటే ఏమాత్రం భక్తీ లేదు..! ఇటు ప్రజాస్వామ్య దేవాలయం శాసనసభ పట్ల కనీస గౌరవం లేదని నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు! భగవంతుడి గురించి ఏమాత్రం అవాస్తవం చెప్పాలన్నా ఏ ఒక్క భక్తుడూ సాహసించరు. వైఎస్సార్ తెచ్చిన 746, 747 జీవోలను రద్దు చేస్తానంటూ 2009 జనవరి 27న చంద్రబాబు చేసిన ప్రకటనలపై ‘ది హిందూ’తో పాటు చంద్రబాబు గెజిట్ పత్రికైన ‘ఈనాడు’లో ప్రచురితమైన వార్తలు అందుకే ‘దేవుడి తోడు.. నిజమే చెబుతున్నా!’ అని ప్రమాణం చేస్తారు. ఇక నిండు సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడాలంటే ఏ పాలకుడైనా కాస్త తటపటాయిస్తారు. కానీ తనకు అవేవీ పట్టవని చంద్రబాబు చాటి చెబుతూ, శాసనసభ వేదికగా తిరుమల క్షేత్రం గురించి పచ్చి అవాస్తవాలు వల్లిస్తూ, బుకాయిస్తూ రాజకీయ దురుద్దేశ ఆరోపణలు చేశారు. తిరుమలను రెండు కొండలకే పరిమితం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవోలు జారీ చేశారని చంద్రబాబు నిస్సిగ్గుగా అవాస్తవాలు ప్రచారం చేశారు.ఇక తిరుమల లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యి సరఫరా మహాపచారం టీడీపీ సిండికేట్ నిర్వాకమేనని బట్టబయలు కావడంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. కల్తీ దందా మహాపచారం పచ్చ ముఠా పనేనని ఆధారాలతో సహా నిగ్గు తేలడంతో చంద్రబాబు అసెంబ్లీలో అడ్డంగా బుకాయించి ప్రజల్ని మభ్య పెట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు. కానీ దాచేందుకు యత్నిస్తున్న కొద్దీ టీడీపీ కల్తీ నెయ్యి కంపు మరింతగా బయటపడుతోంది. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం సాగిందంతా 2024 జూన్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతేనన్నది తేదీలతో సహా వెలుగులోకి వచ్చింది. కల్తీ అని నిర్ధారణ అయినా సరే అదే నెయ్యిని తిరుమల ప్రసాదం కోసం సరఫరా చేసిన మహాపాపం టీడీపీ పాలకులదేనన్నదీ నిగ్గు తేలింది. ఇక కల్తీ నెయ్యి సరఫరాలో నిందితులుగా ఉన్న భోలే బాబా డెయిరీ, వైష్ణవి డెయిరీలతో చంద్రబాబు ముఠా వ్యాపార బంధం బట్టబయలైంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్గా ఉన్న సంగం డెయిరీకి వైష్ణవి డెయిరీతో వ్యాపార సంబంధాలు ఉండటం.. అదే సంగం డెయిరీకి 5 లక్షల కిలోల టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టడం.. మొత్తం పక్కా పన్నాగంతో కల్తీ దందా సాగిస్తున్నారన్నది టీటీడీ పాలక మండలి తీర్మానాల సాక్షిగా వెలుగులోకి వచ్చింది. వైష్ణవి, సంగం డెయిరీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అవుట్లెట్లు ఇక చంద్రబాబు బుకాయించేందుకు ఏమీ లేదు.. తిరుమల శ్రీవారి ఆలయం పట్ల... పవిత్ర ప్రసాదం పట్ల మీరు చేసిన మహాపచారం బట్టబయలైంది బాబూ! టీడీపీ అనుకూల పత్రికలు ఎంత భాజాభజంత్రీలు మోగించినా సరే కల్తీ నెయ్యి పాపాన్ని దాచిపెట్టడం సాధ్యం కాదు. ఇకనైనా లెంపలు వేసుకుని తిరుమల శ్రీవారిని క్షమాపణలు వేడుకోండి... యావత్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పండి అని పరిశీలకులు సూచిస్తున్నారు. ఇంకా మొండిగా రాజకీయ కుట్రతో తిరుమల క్షేత్రంపై దుష్ప్రచారం చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరిస్తున్నారు. శాసన సభ వేదికగా చంద్రబాబు చేసిన అవాస్తవ ఆరోపణలను వైఎస్సార్సీపీ పూర్తి ఆధారాలతో తిప్పికొట్టింది. వైఎస్సార్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్రెడ్డి, పేర్ని నాని వేర్వేరు విలేకరుల సమావేశాల్లో చంద్రబాబు బండారాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. -
అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పలాయనం
సాక్షి, అమరావతి: తిరుమల ఏడు కొండలు జీవో రద్దు హామీపై చంద్రబాబు అడ్డంగా దొరికేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పలాయనం చిత్తగించి అభాసుపాలయ్యారు. వైఎస్ జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు దాటవేశారు.జీవోలు 746, 747 రద్దు చేస్తానంటూ గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధించే జీవోను రద్దు చేస్తానని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. అయితే, సభలో తాను చేసిన ఆ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించలేదు. చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను వైఎస్ జగన్ ఇటీవలే ప్రదర్శించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నైజం బట్టబయలైంది. -
తన వారి లబ్ధి కోసమే బాబు ఐఆర్ఆర్ ప్లాన్ మర్చారు: ఆర్కే
సాక్షి, విజయవాడ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో సీఎం చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపిది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్కు విచారణార్హత లేదని ప్రభుత్వం తన వాదనలు వినిపించింది.ఈ కేసు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని 542 పేజీలతో సీఐడీ కౌంటర్ వేసినట్టు కోర్టుకు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. అదే సమయంలో కొన్ని ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించినట్టు కోర్టుకు చెప్పారు. కేసు క్లోజ్ చేయకుండా ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశామని ఈ నెల 27న ఏసీబీ కోర్టులో విచారణకు వస్తుందని శ్రవణ్కుమార్ కోర్టుకు తెలిపారు. వివరాలు సమర్పించాలన్న హైకోర్టు.. మార్చి 10కి వాయిదా వేసింది.మీడియాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో సీఎం గా ఉన్న సమయంలో ఐఆర్ఆర్ ప్లాన్ తన వారికి లబ్ధి పొందేందుకు మార్పులు చేశారని.. తాను ఈ అంశంపై సాక్ష్యాలతో సీఐడీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ‘‘నా సాక్ష్యాలను పరిశీలించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్షీట్ వేశారు. చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, లోకేష్, అంజనీ కుమార్పై కేసు నమోదైంది. వీళ్ళందరూ ఐఆర్ఆర్ను తమకు లబ్ధి కోసం అనేక మార్పులు ఐఆర్ఆర్లో అక్రమాలు చేశారు...అక్రమ మార్గంలో డబ్బు పొందేందుకు ఐఆర్ఆర్ను వాడుకున్నారు. 2014 ముందు లింగమనేని రమేష్ 500 ఎకరాలు పొలం ఐఆర్ఆర్ మార్గంలో కొన్నారు. చంద్రబాబు 2014లో సీఎం అయ్యాక హెరిటేజ్ సంస్థకు ఎకరం 7 లేదా 8 లక్షలకు మాత్రమే లింగమనేని అమ్మారు. ఐఆర్ఆర్ ద్వారా లాభం పొందిన కారణంగా హెరిటేజ్కు ఎకరం 4 కోట్లు ఉంటే 8 లక్షలకు అమ్మారు. నారా లోకేష్ కూడా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు. చంద్రబాబు అప్పట్లో ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ద్వారా రూ. 2500 కోట్లు లబ్ధి పొందారు..కానీ అప్పుడు 542 పేజీలతో బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో కౌంటర్ వేసిన సీఐడీ ఇప్పుడు కేసు లేదని ఏసీబీ కోర్టును ఆశ్రయించటం దారుణం. చంద్రబాబు హోం మంత్రిగా అనితకు ఇచ్చిన లా అండ్ ఆర్డర్ మాత్రం చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. ఐపీఎస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి చంద్రబాబు తన కేసు క్లోజ్ చేయించుకుంటున్నాడు. చంద్రబాబు ఐఆర్ఆర్ కేసులో తొలి ముద్దాయి, లోకేష్ 14వ ముద్దాయి. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముద్దాయిగా తేలడం ఖాయం’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
ఆ రూ.లక్ష గిఫ్ట్ కూపన్లు నాకొద్దు
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీలకు రూ.లక్ష విలువ చేసే గిఫ్ట్ కూపన్లు ఇచ్చిందని, అందుకే తాను ఆ కూపన్లను తిరిగి పంపుతున్నానని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఏసీ టైం టేబుల్ ప్రకారం శాసనమండలిలో ఐదు రోజుల పాటు బడ్జెట్పై చర్చ జరగాల్సింది పోయి ఇతర అంశాల వైపు దారి మళ్లిస్తున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీలో విపక్షం లేనందున, అధికార పార్టీ బడ్జెట్ను ప్రవేశపెట్టి, వాళ్లే జబ్బలు చరుచుకుంటున్నారనని ఆయన ఎద్దేవా చేశారు. అయితే మండలిలో విపక్షాలు ఉన్నాయి.. కనీసం ఇక్కడైనా చర్చించాల్సింది పోయి, తమ లాంటి స్వతంత్ర ఎమ్మెల్సీల హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, అంగన్వాడీలు, కేజీబీవీ సిబ్బంది, రైతుల సమస్యలపై అసలు చర్చించడం లేదని ఆరోపించారు. ఎలాంటి చర్చలు జరగని మండలిలో ఎమ్మెల్సీగా ఉన్న తనకు ఇచ్చిన రూ.లక్ష విలువైన గిఫ్ట్ కూపన్లను తిరస్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఏడాది పాటు టాటా సంస్థకు చెందిన ‘క్రోమా’ షో రూమ్లో రూ.లక్ష విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోమంటూ కూపన్లు ఇవ్వడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నట్లుగా భావించి ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. శాసన మండలి జాయింట్ సెక్రటరీ విజయరాజుకు సోమవారం కూపన్లు తిరిగి ఇచ్చేశారు. -
ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన పోస్ట్
సాక్షి, విజయవాడ: తాను ఎస్టీగా పుట్టడమే నేరమా? అంటూ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన పోస్ట్ చేశారు. ‘‘ఉన్నత ఉద్యోగాల్లో చిన్నకులాల వారు ఉంటే తట్టుకోలేరా?. రఘురామ కేసులో ఉద్దేశపూర్వకంగా నన్ను ఇరికించారు. 2021లో జరిగిన ఘటన ఇది. 2024లో ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు. నా పాత్ర లేకున్నా నన్ను నిందితుడిగా చేర్చారు’’ అంటూ సునీల్ నాయక్ ట్వీట్ చేశారు. రఘురామ కాల్ డేటా తీస్తే ఎంతమందిని బెదిరించారో తెలుస్తుందని.. సరైనా సమయంలో ఆధారాలు బయటపడతానంటూ సునీల్ నాయక్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.రెడ్బుక్ రాజ్యాంగ వేధింపులను బిహార్లో కూడా అమలు చేసేందుకు బరితెగించిన ఏపీ పోలీసులు ఘోర పరాభవానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిహార్లో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఐపీఎస్, ఐజీ స్థాయి అధికారి సునీల్ నాయక్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు అక్కడకు వెళ్లిన సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ దామోదర్ తన బృందంతో కలసి బీభత్సం సృష్టించారు. సోమవారం తెల్లవారుజామున పట్నాలోని సునీల్ నాయక్ నివాసం గోడదూకి మరీ ఎస్పీ దామోదర్ బృందం కిడ్నాపర్ల మాదిరిగా చొరబడటం తీవ్ర విభ్రాంతికి గురి చేసింది. ఏపీ పోలీసుల దౌర్జన్యాన్ని బిహార్ పోలీసు యంత్రాంగం యావత్తూ ఒక్కటై అడ్డుకుంది.మరోవైపు, ఏపీ పోలీసుల తీరుపై పట్నా కోర్టు తీవ్రంగా మండిపడింది. ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారులు పాటించాల్సిన కనీస నిబంధనలను కూడా అనుసరించకుండా ఓ ఐపీఎస్ అధికారి నివాసంలో చొరబడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఎఫ్ఐఆర్లో పేరు లేదు.. కేసు డైరీ లేదు.. స్థానిక కోర్టు నుంచి వారెంట్ లేదు.. ఇవేవీ లేకుండా ఒక సామాన్యుడిని కూడా అరెస్టు చేయడానికి వీల్లేదు.. అటువంటిది ఒక ఐపీఎస్ అధికారిని అరెస్టు చేయడానికి ఏపీ నుంచి పోలీసులు బిహార్ రావడం ఏమిటి..? సునీల్ నాయక్ అరెస్టును అనుమతించేది లేదు.. ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసే ప్రసక్తే లేదు..‘‘ అని పట్నా సివిల్ కోర్టు మండిపడింది. సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. -
ఏపీలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయి: వరుదు కల్యాణి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఆమె నిలదీశారు. సీఎం సొంత జిల్లాలోనే 10 శాతం నేరాలు పెరిగాయన్న వరుదు కళ్యాణి.. హోంమంత్రి అనిత ఇంఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో మహిళలపై నేరాలు పెరిగాయని వివరించారు.‘‘గంజాయి లేదని హోంమంత్రి చెబుతున్నారు. మదనపల్లిలో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి డమ్ములో వేసి చంపేశారు. తిరుపతిలోనే డ్రగ్స్, గంజాయి పెరిగిపోయింది. 112కి ఫోన్ చేస్తే రావడానికి 25 నిమిషాలు తర్వాత స్పందిస్తున్నారు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. కాపాడండని వేడుకుంటున్నా పట్టించుకున్న నాథుడు లేడు. కూటమి ఎమ్మెల్యే ఓ మహిళను గర్భవతిని చేసి ఐదు సార్లు అబార్షన్ చేయించాడు. ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?. ఆడపిల్లలంటే ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు. వరుదు కళ్యాణి ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానం చెప్పలేదు.మండలిలో మైకుల సమస్య ఏపీ శాసన మండలిలో మైకుల సమస్య ఏర్పడింది. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రుల సమాధానం చెప్పినప్పుడు మైకులు మ్యూట్లోకి వెళ్తున్నాయి. మైకుల సమస్య పరిష్కరించాలని ఛైర్మన్ దృష్టికి శానమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీసుకెళ్లారు.లా ఉంది.. కానీ ఆర్డర్ మాత్రం ఎక్కడా లేదు: భరత్ ఎమ్మెల్యే భరత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా ఉంది కానీ ఆర్డర్ మాత్రం ఎక్కడా లేదన్నారు. కొత్త చట్టాలు ఏయే రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో కేంద్రం ఓ నివేదిక ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన నివేదికలో ఏపీ 36వ స్థానంలో ఉంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల వేధింపులపై పెట్టిన శ్రద్ధ పోలీసింగ్పై పెట్టాలి. అలా చేస్తే రాష్ట్రం పరువైనా మిగులుతుందని భరత్ అన్నారు.టీడీపీ ఎమ్మెల్సీకి బొత్స స్ట్రాంగ్ కౌంటర్మండలిలో టీడీపీ ఎమ్మెల్సీకి బొత్స స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మండలిలో శాంతి భద్రతలపై చర్చలో సంబంధం లేని అంశాలను టీడీపీ ప్రస్తావించింది. ‘‘వైఎస్సార్ తండ్రిని ఎవరు చంపారు?. తన తండ్రిని చంపిన వారిపై వైఎస్సార్ కక్ష తీర్చుకుని ఉంటే ఈ రోజు ఇలా మాట్లాడి ఉండేవారా?. సభకు సంబంధం లేని అంశాలను ప్రస్తావించడం సరికాదు’’ అని బొత్స మండిపడ్డారు.ఏపీలో రౌడీలు రాజ్యమేలుతున్నారు: బొమ్మి ఇజ్రాయిల్ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి చాక్లెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. గంజాయి మత్తులో మదనపల్లిలో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. బాలికను చంపిన వ్యక్తి కూడా గంజాయి మత్తులో చనిపోయారని హోంమంత్రి చెబుతున్నారు. గంజాయి ఏరులై పారుతోందనడానికి ఇదే నిదర్శనం. కిందిస్థాయి నుంచిపై స్థాయి వరకూ పోలీసులు కుమ్మక్కైపోయారు. చినబాబుకి ఎంత పెదబాబుకి ఎంత అని వాటాలు పంచుకుంటున్నారు. మాజీ మంత్రుల ఇంటి పై దాడులు చేస్తే కేసుసులుండవ్. బాధితులపై మాత్రం కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్నారు. మహిళల రక్షణ కోసం వైఎస్ జగన్ దిశా యాప్ను తెచ్చారు. -
ప్రభుత్వంలో ఎక్కడో ఏదో తేడా ఉంది
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తూ యూజీసీ స్కేల్ పొందుతున్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయసును 62 నుంచి 65కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయసు 65కి పెంచకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ చర్యలు వివక్షాపూరితమని స్పష్టం చేసింది. ప్రభుత్వంలో ఎక్కడో ఏదో తేడా ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన హైకోర్టు, ముఖ్యమంత్రి కార్యాలయంలో (సీఎంఓ) కూర్చొని ఒకరిద్దరు అధికారులే అన్నీ నిర్ణయాలు తీసేసుకుంటున్నారని సూచించింది. మనది ప్రజాస్వామ్య దేశమే తప్ప, నియంతృత్వ దేశం కాదని, ఈ విషయాన్ని అధికారులందరూ గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేసింది. ఎలా పడితే అలా, ఏది పడితే అది చేయడానికి వీల్లేదంది. ఈ అంశంపై దాఖలైన అప్పీళ్లపై న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సుబేంధు శమం ధర్మాసనం సోమవారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బోధనా సిబ్బంది కొనసాగింపునకు ఆదేశాలు.. వ్యవసాయ శాఖ పరిధిలోని ఉద్యానవన, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య విశ్వవిద్యాలయాల్లో యూజీసీ స్కేల్ పొందుతున్న బోధనా సిబ్బందిని తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు కొనసాగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు తాజాగా ఆదేశించింది. పదవీ విరమణ వయసును 65కి పెంచాలంటూ ఈ నాలుగు విశ్వవిద్యాలయాలు చేసిన ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడిత రాజశేఖర్ ఏకపక్షంగా తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు రాజశేఖర్ ఇచి్చన లేఖ అమలును నిలిపేసింది. వ్యవసాయ శాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే పలువురు పదవీ విరమణ చేశారని, అయితే ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించింది. ఇలా అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశి్నంచింది. పదవీ విరమణ వయసు పెంపుపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి మూడు వారాల గడువునిచ్చింది. కాగా ఈ అంశంపై ధర్మాసనం ఆదేశాల మేరకు బుడిద రాజశేఖర్ కోర్టు ముందు స్వయంగా హాజరయ్యారు. -
రసాయనాలే శా‘పాలు’
సాక్షి, అమరావతి: అధిక మోతాదులో యూరియా, ఇథిలీన్ గ్లైకాల్ వంటి రసాయనాలు కలిసిన కల్తీ పాలే ప్రజల ప్రాణాల మీదకు తెచ్చినట్టు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజమహేంద్రవరం ఘటనలో మృతులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి గమనించిన ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిశోధన ఐసీఎంఆర్ బృంద సభ్యుడు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు ఇథిలీన్ గ్లైకాల్ ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. పాలు చిక్కగా ఉన్నాయని భ్రమింపజేయడానికి యూరియాను, కల్తీ చేసిన పాలు త్వరగా పాడవ్వకుండా ఉండటానికి, ఒకరకమైన తీపిదనాన్ని ఇవ్వడానికి ఇథిలీన్ గ్లైకాల్ కలుపుతుంటారు. ఈ రెండూ మోతాదుకు మించి కలపడం వల్లే ప్రస్తుతం రాజమహేంద్రవరం బాధితుల కిడ్నీలు షట్డౌన్కు దారితీసిందని వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది. రోజుకు రెండు సార్లు డయాలసిస్ రాజమండ్రిలో ఈ నెల 15వ తేదీ శివరాత్రి పండగ ముగిసిన మరుసటి రోజు నుంచి కల్తీ పాల వల్ల ప్రజల్లో అనారోగ్య సమస్యలు మొదలైనట్టు తెలుస్తోంది. క్రమంగా సమస్యలు తీవ్ర రూపం దాల్చి కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో మూత్రం ఉత్పత్తి పూర్తిగా దెబ్బతిని ‘అనూరియా’(హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి) సంభవించింది. రక్తంలో యూరియా, క్రియాటిన్ స్థాయిలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని బాధితులకు చికిత్స చేసిన వైద్యులు చెప్పారు. సాధారణంగా రక్తంలో యూరియా వయోజనుల్లో 8–24 మిల్లీగ్రాములు, వృద్ధుల్లో 8–26 మిల్లీగ్రాములు, సీరమ్ క్రియాటిన్ 0.7–1.3 మిల్లీగ్రాములు ఉండాలి. అయితే రాజమండ్రి బాధితుల రక్తంలో యూరియా 130–140 మిల్లీగ్రాములు, క్రియాటిన్ 9 మిల్లీగ్రాములు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. సాధారణంగా కిడ్నీలు ఫెయిల్యూర్ ఘటనల్లో బాధితులకు రోజుకు ఒకసారి డయాలసిస్ చేస్తే సరిపోతుందని, అయితే రాజమండ్రిలో కొందరు బాధితులకు రోజులో రెండోసారి కూడా డయాలసిస్ చేసినట్టు స్పష్టం చేశారు.సర్కారు పర్యవేక్షణ శూన్యంరాజమండ్రి ఘటనతో రాష్ట్రంలో పాల కల్తీ విచ్చలవిడిగా సాగుతోందని స్పష్టమవుతోంది. ఇంత భారీ స్థాయిలో కేటుగాళ్లు రెచి్చపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రోజుకు 500–50 వేల లీటర్ల పాలను సేకరించే/ప్రాసెస్ చేసే, ఏడాదికి రూ.20 కోట్లలోపు టర్నోవర్ ఉండే డెయిరీలు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం రాజమండ్రి ఘటనలో పాల సరఫరా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. ఈ లెక్కన పరిశీలిస్తే డెయిరీల్లో పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తుల తయారీపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏ మాత్రం లేదని తేటతెల్లమవుతోంది. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు సర్కారు గాలికొదిలేసిందని స్పష్టమవుతోంది. -
ఫెర్రో అల్లాయ్స్కు బాబు సర్కారు షాక్
సాక్షి, అమరావతి: ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పరిశ్రమలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలు ఈ ఏడాది మార్చి చివరి వరకే కొనసాగుతాయని, ఆ తర్వాత ఉండవని తేల్చి చెప్పింది. రెండేళ్ల పాటు రాయితీలు కొనసాగించాలని ఫెర్రో అల్లాయ్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ చేసిన అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించలేదు.మార్చి 31 వరకే రాయితీలు ఉంటాయని, ఈ ఏడాది ఏప్రిల్ 1 (వచ్చే ఆరి్థక సంవత్సరం) నుంచి రాయితీలు లేకుండా సాధారణ సుంకాలను చెల్లించడానికి సిద్ధం కావాలని ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ పరిశ్రమలు ఆరి్థక ఇబ్బందుల్లో పడి, ఆ ప్రభావం 50 వేల మంది జీవనోపాధి ప్రశ్నార్థకమవుతుందని పారిశ్రామిక, కారి్మక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇకపై నడపడం కష్టమే రాష్ట్రంలోని ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. వీరి సంక్షేమంతోపాటు పారిశ్రామిక రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్ ప్రభుత్వం ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు విద్యుత్ సుంకం యూనిట్కు రూ.0.6 పైసలకు, డిమాండ్ ఛార్జీలు 90 శాతం వరకూ తగ్గించింది. 10 శాతం మాత్రమే వసూలు చేసింది. పరిశ్రమలు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాహకాలను మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పాలకులు కరగలేదు.ఈ వెసులుబాటు ఆ పరిశ్రమలకు ఈ ఆర్థిక సంవత్సరంతో ముగుస్తుందని తెగేసి చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ముక్కుపిండి మరీ మొత్తం చార్జీలను వసూలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాదే ఈ పరిశ్రమలపై నిబంధనలు విధించింది. వాటికి అవసరమయ్యే కరెంటును కేవలం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నుంచే కొనాలని గతేడాదే నిబంధనలు విధించింది.మార్చి తరువాత వేసవిలో ఉష్ణోగ్రతల కారణంగా ఏర్పడే విద్యుత్ కొరత కారణంగా అధిక ధరలకు డిస్కంలు విద్యుత్ను కొంటాయి. దానిని సరఫరా చేసి ఎక్కువ చార్జీలు వసూలు చేయడం వల్ల ఫెర్రో పరిశ్రమలకు మరింత భారంగా మారుతుంది. దానికి తోడు ఈ రాయితీలు కూడా మార్చితో ముగిసిపోతే అవీ, ఇవీ కలిపి ఫెర్రో అల్లాయ్స్ మూతపడే పరిస్థితి వస్తుందని పారిశ్రామిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. -
‘ఇందాపూర్’పై చర్చించాల్సిందే
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా చేయడం, తిరుపతి లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు సోమవారం కూడా శాసనమండలిలో ఆందోళన చేశారు. ఉదయం పది గంటల ప్రాంతంలో మండలి ప్రారంభం కాగానే టీటీడీకి ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా చేయడం, తిరుపతి లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, వై.శివరామిరెడ్డి, పీవీవీ సూర్యనారాయణరాజు వాయిదా తీర్మానం ఇచ్చారు.దానిని తిరస్కరించిన చైర్మన్ మోషేన్రాజు... ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తమ స్థానాల వద్దే నిలుచుని ఇందాపూర్పై చర్చ జరగాలి.. హెరిటేజ్పై చర్చ జరగాలి... తిరుపతి లడ్డూపై చర్చ జరగాలి... అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. అయినా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కావడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేసుకుంటూ చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని చర్చకు పట్టుపట్టారు. అదే సమయంలో పలువురు టీడీపీ, జనసేన ఎమ్మెల్సీలు కూడా చైర్మన్ పోడియం ముందుకు వెళ్లి పోటీగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో... ప్రారంభమైన ఏడు నిమిషాలకే చైర్మన్ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.సభ ముగిశాక మీడియా పాయింట్ వద్ద మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘శ్రీ వేంకటేశ్వరస్వామి ఫొటోల్ని చెప్పులతో పట్టుకున్నామని సీసీ ఫుటేజ్ సగం తీసుకొచ్చి నానా హడావుడి చేశారు. బీఏసీ మీటింగ్లో ఫూర్తి ఫుటేజ్ కావాలని కోరాం. అందులో చూస్తే వైఎస్సార్సీపీ సభ్యులు దేవుని ఫొటో పట్టుకున్నప్పుడు చెప్పులు ధరించలేదని స్పష్టంగా ఉంది. చెప్పులు ధరించినట్లుగా ప్రచారం చేస్తున్న దృశ్యాలు లేవు. కాబట్టి ఈ వీడియోల్ని ఎలా మారి్ఫంగ్ చేశారన్నది చర్చించాలని మండలి చైర్మన్ను కోరాం.అలాగే, మండలిలో మేం మాట్లాడేది బయటకి రావడంలేదు. టీడీపీ సభ్యులు మాట్లాడితేనే లైవ్ ఇస్తున్నారు. అసలు మండలిలోని మా ఫొటోలు బయటికెవరు విడుదల చేశారు?’ అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు, ఇతర ప్రభుత్వ పెద్దలు చేసిన ఆరోపణలపై శాసనమండలిలో చర్చ కోసం మేము చేస్తున్న డిమాండ్ మేరకు ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. బీఏసీ సమావేశం సోమవారం జరిగింది.. ఇందులో ఈనెల 26న మండలిలో చర్చ చేపట్టాలని నిర్ణయించారు. ఈ అంశంపై చర్చకు పట్టుబడితే ఇప్పటివరకూ తప్పించుకున్నారు.సీబీఐపై నమ్మకంలేకే ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను వేసింది.. అయితే, న్యాయస్థానాలపై మాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. బీఏసీ భేటీలో మూడు అంశాలపై చర్చ చేపట్టాలని కోరాం. ఇందులో మొదటిది.. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, రెండోది.. రైతుల ఇబ్బందులు, మూడోది.. లడ్డూ నెయ్యి. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయాన్ని ఛిన్నాభిన్నం చేశారు.. గిట్టుబాటు ధరలేదు.. బీమా లేదు.. పొగాకు, మిర్చి, మొక్కజొన్న, కోకో, మామిడి రైతులు ఇబ్బందిపడుతున్నారు’ అని బొత్స తెలిపారు. విశాఖలో భూదోపిడీపైనా చర్చిస్తాం.. ‘మండలిలో విద్య, సాగునీటి ప్రాజెక్టులపైనా చర్చిద్దామన్నారు. అందుకు అంగీకరించాం. వైజాగ్లో గీతం వర్సిటీ పేరు మీద రూ.5 వేల కోట్ల విలువైన భూములు దోచుకోవాలని చూస్తున్నారు. నిన్న మొన్న పెట్టిన స్టార్టప్ కంపెనీలకు 99 పైసలకే కారు చౌకగా భూములు కట్టబెట్టిన వ్యవహారంపైనా చర్చ కోరాం. విశాఖలో భూములను చంద్రబాబు కుటుంబం ఎలా దోచుకుంటుందో మండలిలో చర్చిస్తాం’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘హెరిటేజ్ వెనుక ఉన్న ఇందాపూర్ డెయిరీ హైదరాబాద్ మార్కెట్లో కేజీ నెయ్యి రూ.560 (జీఎస్టీ అదనం)కి అమ్ముతూ.. టీటీడీకి మాత్రం రూ.658కు సరఫరా చేస్తోంది.దీన్నిబట్టి ప్రజలకు కల్తీనెయ్యి అమ్ముతున్నారని అనుకోవాలా? లేక టీటీడీకి ఎక్కువ ధరకు సరఫరా చేస్తూ శ్రీవారి సొమ్మును దోచుకుంటున్నట్లు అనుకోవాలా? ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. టీడీపీ కూటమి నేతలకు, వారి సంస్థలకు ధనార్జన ఆశ లేకపోతే దేవుడికి సరఫరా చేసే నెయ్యి రేటు తగ్గించి ఇవ్వాలి కదా?’ అని ప్రశి్నంచారు. కల్తీ పాలు మరణాలు సర్కారు హత్యలే.. రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో పలువురు చనిపోవడం, 20 మంది వరకూ ఆస్పత్రిపాలు కావడం దురదృష్టకరం. దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా అర్ధంచేసుకోవాలి. ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం, దిగువ స్థాయిలో అవినీతి పెచ్చుమీరిపోవడంవల్ల ఈ మరణాలు జరిగాయి. గతంలో కల్తీసారా మరణాలు చూశాం.. కానీ, కల్తీ పాలతో జనం చనిపోవడం ఇప్పుడే వింటున్నాం. అన్ని శాఖల్నీ గాలికొదిలేశారు. పచ్చ మీడియా వాస్తవాలు పక్కనబెట్టి ప్రభుత్వాన్ని మోస్తోంది. రాజమహేంద్రవరంలో జరిగిన మరణాలు ప్రభుత్వ హత్యలుగానే భావించాలి. కల్తీ చేసిన వారితో పాటు బాధ్యులైన అధికారులపైనా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అంటే భయం లేకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.బాబు దుర్మార్గాలు బయటకొస్తున్నాయి.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై మరో కొత్త వ్యవహారం వెలుగులోకి వచి్చంది. ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ వెల్లడించిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. హెరిటేజ్కి వీఎస్ఆర్ ఏవియేషన్కు ఉన్న బంధం ఏంటో రోహిత్ పవారే బయటపెట్టారు. దీనికి అధికార పక్షం ఏం సమాధానం చెబుతుంది? హెరిటేజ్ సంస్థ పాలు, పెరుగు వ్యాపారం మాత్రమే చేస్తుందని అందరం అనుకున్నాం. కానీ, హెరిటేజ్ ఫిన్లీజ్ అనే మరో సంస్థ ద్వారా వీఎస్ఆర్ వెంచర్స్లో పెట్టుబడులు పెట్టిన విషయం ఇప్పుడు బయటపడింది. చంద్రబాబు దుర్మార్గాలు ప్రజలకు ఒకొక్కటిగా తెలిసిపోతున్నాయి. -
నేటి నుంచి అంగన్వాడీల నిరాహార దీక్షలు
సాక్షి, అమరావతి: అంగన్వాడీలకు వేతనాల పెంపుపై ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. అంగన్వాడీలకు చెందిన 3 యూనియన్లు ఉద్యమ కార్యాచణ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి సంధ్యారాణి సంఘం నేతలతో సోమవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.దీంతో మంగళవారం నుంచి నిరాహార దీక్షలు ప్రారంభించనున్నారు. వెలగపూడిలోని సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారితో కలిసి జరిపిన చర్చల్లో వేతనాల పెంపు తప్ప, మిగిలిన అంశాలను చర్చించడంతో యూనియన్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
చంద్రబాబు కాపులను వేధిస్తున్నారు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్)/ఇబ్రహీంపట్నం: కాపుల వల్లే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వారిపైనే దాడులు చేయిస్తూ అవమానాలు, వేధింపులకు గురిచేస్తున్నారని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులంతా బానిసలుగా బతకాలని చంద్రబాబు కోరుకుంటున్నారని, అది జరగదని మండిపడ్డారు. సోమవారం ఆయన గుంటూరు సిద్ధార్థనగర్లోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో కలిసి వచ్చారు. అంబటిని పరామర్శించారు.ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ మాట్లాడుతూ గతంలో తనపైనా, తన కుటుంబంపైనా దాడి చేయించారని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబంపైనా దాడి చేయించారని చంద్రబాబుపై మండిపడ్డారు. ‘అయ్యా చంద్రబాబు నీకు, మీ సతీమణి, మీ కుమారుడు, కోడలికి అవమానం జరిగితే మీ ఫీలింగ్స్ ఏమిటి?’ అని ముద్రగడ ప్రశ్నించారు. మాజీ మంత్రుల నివాసాలపై దాడులు చేయించటం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు అబద్ధాలు వల్లించడం హాస్యాస్పదమన్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అరెస్టులు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరని స్పష్టం చేశారు.ఇప్పటికైనా అబద్ధాలు ఆపి దేవదేవుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను సోమవారం ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. దాడి జరిగిన తీరును జోగి రమేష్ ఆయనకు వివరించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా జోగి రమే‹Ùను పరామర్శించారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నగర గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గం ఇన్చార్జ్, ఉమ్మడి గోదావరి జిల్లాల కాపు సంఘం అధ్యక్షుడు చిలిమిలి వెంకటరాయుడు, పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ పాల్గొన్నారు. -
ఒప్పందాల కోసమే ‘క్వాంటమ్’ కంపెనీల సృష్టి?
సాక్షి, అమరావతి: ఇటీవల క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన సమయంలో 14 కంపెనీలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలో డొల్లతనం బయటపడింది. కేవలం ఒప్పందాల కోసమే కొన్ని కంపెనీలను సృష్టించి, వాటితో ఎంవోయూలు కుదుర్చుకున్నారంటూ ఆధారాలతో సహా నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఒప్పందాలు కుదుర్చుకున్న 14 కంపెనీల్లో... మూడు కంపెనీలు డిసెంబర్, జనవరి నెలల్లోనే ఏర్పాటయ్యాయని... మరో రెండు కంపెనీల అడ్రస్లు ఎంత వెతికినా దొరకడం లేదని విమర్శిస్తున్నారు. డిసెంబర్, జనవరిలో ఏర్పాటు చేసిన కంపెనీలతో ఫిబ్రవరి మొదట్లో ఒప్పందం కుదుర్చుకొని 35 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు ఉద్యోగులున్న కంపెనీతో ఒప్పందమా... 35 లక్షల ఉద్యోగాలా? చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వాటిలో ఐక్యూలీప్ అనే కంపెనీ డిసెంబర్లో ప్రారంభమైంది. ఈ కంపెనీలో ముగ్గురు ఉద్యోగులే ఉన్నారు. ఫోటాన్ కోర్ సిస్టమ్స్ అనే కంపెనీ రూ.10 లక్షల మూలధనంతో జనవరి 12న ఏర్పాటైంది. ఇక ట్రై క్వాంటా అనే కంపెనీ కూడా నెలల వ్యవధిలోనే ఏర్పాటైంది. అయితే ఆ కంపెనీ నెలకొ ల్పిన ఆరు నెలల్లోనే బెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అవార్డును కూడా కైవసం చేసుకుందని ప్రకటించారు. కానీ, ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్న క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అప్పుడే ఆ కంపెనీకి అవార్డులు ఎవరిచ్చారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ కంపెనీల ప్రొఫైల్స్ చూసిన నెటిజన్లు.. ఒకటి, రెండు నెలల కిందటే ఏర్పాటు చేయడంతోపాటు కేవలం ముగ్గురు ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థల ద్వారా ఎంత మందికి శిక్షణ ఇస్తారు? 35 లక్షల మందికి ఉద్యోగాలు ఎలా క ల్పిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. బాబు ప్రభుత్వం భారీ ప్రచారం ఎప్పటిలాగానే క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన పేరుతో గ్రాఫిక్ డిజైన్స్ విడుదల చేసి చంద్రబాబు సర్కారు భారీ ప్రచారం చేసుకుంది. రూ.9,000 కోట్లతో 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ భవనాలంటూ గ్రాఫిక్స్తో సినిమా చూపించింది. వాస్తవంగా చూస్తే ఒప్పందానికి ఒకటి, రెండు నెలల ముందు పుట్టిన మూడు కంపెనీలు, అడ్రస్ దొరకని మరో రెండు కంపెనీలతోపాటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, బోసాన్ క్యూసై, ఐక్యూలీప్, క్యూబిక్ఫోర్స్, క్వాంటమ్ ఫోకస్ ల్యాబ్స్ వంటి లోకల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఈ రంగంలో భారీ పెట్టుబడులు వచ్చినట్లు ప్రచారం చేసుకోవడంపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. -
నేడు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24, 25 తేదీల్లో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు తెలుసుకోనున్నారు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం పైన పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.25వ తేదీ ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు. అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. -
Andhra Pradesh: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు (ఐపీఈ–2026) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మంగళవారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు మొదలవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాల్లో 10,57,312 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్లోకి అనుమతించేది లేదని ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించింది.ఈ క్రమంలో విద్యార్థులు గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలు జరిగే అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పరీక్షల సందేహాలపై ఇంటర్మీడియెట్ విద్యామండలి కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1800–425–1531(టోల్ ఫ్రీ) నంబర్ను సంప్రదించవచ్చు. -
ఉపాధ్యాయుల బదిలీల్లో గందరగోళం తొలగేనా..?
సాక్షి, అమరావతి: గతేడాది చోటుచేసుకున్న అస్పష్టత కొనసాగుతున్న నేపథ్యంలోనే తాజాగా పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల రెగ్యులేషన్ చట్టం–2025 ప్రకారం బదిలీలు పదోన్నతులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే జిల్లాల నుంచి ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టీఐఎస్), లీప్ యాప్ వివరాల ఆధారంగా ఈ జాబితాలను రూపొందించారు.టీఐఎస్, లీప్ యాప్ డేటా ఆధారంగా రూపొందించిన జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతోంది. ఫిర్యాదుల పరిశీలనకు డీఈవో నేతృత్వంలో గ్రీవెన్స్ కమిటీలు ఏర్పాటు చేయగా, ఈ వారంలో తొలి తాత్కాలిక జాబితా విడుదల చేసి, మార్చి 5, 15న సవరణ జాబితాలు, మార్చి 30 నాటికి తుది జాబితా ప్రకటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది జరిగిన బదిలీలకు సంబంధించి అపరిష్కృత అంశాలపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త బదిలీల చట్టం ప్రకారం చేపట్టిన అస్తవ్యస్థ బదిలీలతో ఇప్పటికే బోధన కుంటుపడుతుండడం గమనార్హం. అపరిష్కృత అంశాలు..⇒ గత ఏడాది మే, జూన్లలో 68 వేల మంది టీచర్లను బదిలీ చేశారు. ⇒ వీరిలో 4,477 మందికి పదోన్నతులతో కూడిన బదిలీలు కల్పించారు. ⇒ అయితే, ఏడాది పూర్తయ్యి, కొత్త బదిలీల ప్రక్రియ ప్రారంభమైనా వారిలో 17 వేల మందికి పైగా ఉపాధ్యాయులు రిలీవర్లు లేక ఇంకా పాత స్థానాల్లోనే డెప్యుటేషన్లపై కొనసాగుతున్నారు. ⇒ సాంకేతికంగా వీరంతా బదిలీ అయిన కొత్త పాఠశాలల్లో రిపోర్టు చేసినా, ఇంకా పాత పోస్టులోనే ఉన్నారు.⇒ డీఎస్సీ–2025 ప్రక్రియ పూర్తయ్యి కొత్త టీచర్లు వస్తే సమస్య పరిష్కారమవుతుందని ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు, అయితే, కొత్త టీచర్లు వచ్చారు గాని బదిలీ ఉపాధ్యాయులు కదిలే పరిస్థితి లేకపోయింది. ⇒ ప్రత్యేకంగా 9,600 మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ‘ఒక తరగతి–ఒక టీచర్ విధానం అమలు చేస్తామని ప్రకటించినా, నియమితులైన ఉపాధ్యాయులు రిలీవర్లు లేక పాత స్కూళ్లలోనే ఉండిపోవడంతో అనేక చోట్ల హెచ్ఎంలే ఒక్కరే పాఠశాలను నడిపే పరిస్థితి ఏర్పడింది.⇒ గతేడాది 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ విధానాన్ని రద్దు చేశారు. దీంతో హైసూ్కళ్లల్లో మిగులు స్కూల్ అసిస్టెంట్లను బలవంతంగా పీఎస్ హెచ్ఎంలుగా సర్దుబాటు చేశారు. ఇలా 4,800 మందిని పంపించారు. తొలుత వీరి కేడర్ను పీఎస్ హెచ్ఎం/ఎస్ఏగా ఇచ్చారు. అనంతరం టీఐఎస్లో పీఎస్ హెచ్ఎంగా మార్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. దీంతో దిగొచి్చన విద్యాశాఖ తిరిగి ఎస్ఏను కూడా చేర్చింది. ఈ ఏడాది చేపట్టే బదిలీల్లో వీరికి అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తోంది. ⇒ అయితే, గతేడాది తమను బలవంతంగా సర్దుబాటు మాత్రమే చేశారని, తమను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ⇒ చట్ట ప్రకారం మూడేళ్ల సర్వీసు ఉంటేనే దరఖాస్తు పరిశీలనకు అవకాశం ఉంటుంది. మరీ టపీఎస్ హెచ్ఎంల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ గతేడాది చేపట్టిన గందరగోళ బదిలీల్లో దాదాపు 6,428 మంది మిగులుగా తేలారు. హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయుల సర్దుబాటు అనంతరం 2,754 మందిని క్లస్టర్ మొబలైజ్ టీచర్లుగా ప్రకటించారు. మరో 3,674 మందిని హెచ్వోడీ పూల్లో ఉంచారు. ప్రస్తుత పదోన్నతులు, బదిలీల్లో తమను పరిగణనలోకి తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. -
సర్కారు తీరు వల్లే సంక్షోభంలో ‘చేనేత’
మంగళగిరి టౌన్ : చేనేత పరిశ్రమను చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మండిపడ్డారు. తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన చేనేత కార్మికులు ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘చేనేత గర్జన’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. దేవస్థానం వద్ద నుంచి మొదలైన మహా ప్రదర్శన మెయిన్ బజార్, గౌతమ బుద్ధ రోడ్, ఎన్ఆర్ఐ హాస్పిటల్ మీదుగా నేతన్న సర్కిల్ వరకు సాగింది. అక్కడ నేతన్న విగ్రహానికి నూలు దండలు వేసి నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వినర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద ఉపాధి కల్పన రంగాల్లో ఒకటైన చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నిమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు ఇలా రోడ్డుపైకి వచ్చామని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో చేనేత రంగానికి కనీసం రూ.25 వేల కోట్లు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చేనేత రంగానికి రూ.115 కోట్లు మాత్రమే కేటాయించడం చిన్నచూపు చూడడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం అందించిందని, ఈ ప్రభుత్వం ఆ మేరకు కూడా సాయం చేయడం లేదన్నారు. కమిటీ కో కన్వినర్లు పిల్లలమర్రి బాలకృష్ణ, బండారు ఆనంద ప్రసాద్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడుతున్నా, ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడం దురదృష్టకరం అన్నారు. కాగా, భారీగా తరలి వచ్చిన నేత కార్మికుల నినాదాలతో మంగళగిరి పట్టణం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు దుర్గారావు, రమేష్, కృష్ణప్రసాద్, మాచర్ల మోహన్, రామనాథం పూర్ణచంద్రరావు, అప్పారావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇవీ నేతన్నల డిమాండ్లు» చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలి. » రాష్ట్ర బడ్జెట్లో కనీసం రూ.2 వేల కోట్లు కేటాయించడంతోపాటు సకాలంలో ఆ నిధులు విడుదల చేయాలి. » ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు ఏటా రూ.25 వేలు బకాయిలు సహా వెంటనే ఇవ్వాలి. » హ్యాండ్లూమ్కు 200 యూనిట్లు, పవర్లూమ్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్పై వెంటనే ఆదేశాలివ్వాలి. » మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. » ప్రభుత్వ సంస్ధలు చేనేత వ్రస్తాలను వినియోగించేలా ఆదేశాలు ఇవ్వాలి. » ప్రతి చేనేత కుటుంబానికి మూడు సెంట్ల భూమిని కేటాయించి హౌస్ కమ్ షెడ్లు నిర్మించాలి. » చేనేత కార్మికులకు పెన్షన్ల మంజూరులో జాప్యం నివారించాలి. » చేనేత సహకార సంఘాల పాలక మండళ్లకు వెంటనే ఎన్నికలు జరపాలి. చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. » కేంద్ర స్ధాయిలో హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. -
వీఎస్ఆర్ వెనుక హెరిటేజ్!
సాక్షి, అమరావతి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ తెలుగుదేశం పారీ్టపై అనేక అనుమానాలను లేవనెత్తి 36 గంటలు దాటినా ఆ పార్టీ నోరు మెదపడం లేదు. వీఎస్ఆర్ విమానయాన సంస్థ విమానాల కొనుగోళ్లకు హెరిటేజ్ సంస్థ వందల కోట్ల రూపాయలు నిధులు సమకూర్చిందంటూ సాక్ష్యాధారాలతో చూపించినా.. స్టాక్ మార్కెట్లో నమోదైన కంపెనీ అయ్యి ఉండి కూడా ఇంత వరకు స్పందనే లేదు. అజిత్ పవార్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందంటూ రోహిత్ పవార్ చేసిన ఆరోపణలపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా టీడీపీ నేతలు కానీ, హెరిటేజ్ సంస్థ కానీ స్పందించక పోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు నామినేట్ చేసిన కె.రామ్మోహన్నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేస్తేనే విచారణ పారదర్శకంగా జరుగుతుందంటూ రోహిత్ పవార్ చేసిన డిమాండ్ సహేతుకమైనదేనని స్పష్టం చేస్తున్నారు. నైతికతకు కట్టుబడి రామ్మోహన్నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయక పోవడాన్ని తప్పు పడుతున్నారు. నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మిణల ఫోటోలను ప్రదర్శిస్తూ రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణలు చేసినా, పార్టీ స్పందించక పోవడంపై ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. వీఎస్ఆర్ వెంచర్స్తో హెరిటేజ్ ఫిన్లీజ్ 2023లో కుదుర్చుకున్న ఒప్పందం గురించి రోహిత్ మీడియాకు పూసగుచ్చినట్లు వివరించిన విషయం తెలిసిందే. ఈ ప్రశ్నలకు బదులేదీ? – రూ.35 కోట్ల విలువయ్యే విమానానికి రూ.265 కోట్ల ఇన్సూయరెన్స్ ఎందుకు చేశారు? వాస్తవానికి ప్రమాదానికి గురైన అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం పాతది కావడంతో మార్కెట్లో రూ.15–20 కోట్లు కూడా చేయదని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ ఉద్దేశంతో అన్ని రెట్లు ఎక్కువ విలువతో ఇన్సూయరెన్స్ చేశారు? – విమానంలో టాయ్లెట్ వెనుక పెట్రోల్ క్యాన్లు ఎందుకు పెట్టారు? ఒక వీవీఐపీ ప్రయాణిస్తున్న విమానంలో పెట్రోల్ క్యాన్లు ఎలా వచ్చాయి? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రయాణించే ఆ విమానం బయలుదేరే ముందు ఆ విమాన సిబ్బంది ఎవరూ వాటిని గమనించలేదా? అసలవి అక్కడికి ఎలా వచ్చాయి? విమానంలో పెట్రోల్ క్యాన్లను ఉంచడమనేది విస్తుగొలుపుతోంది. – ట్యాంకులో సామర్థ్యానికి మించి ఎందుకు ఫ్యూయల్ నింపారు? ఏ విమానానికి ఎంత మేర ఇంధనం నింపాలనేది డీజీసీఏ నిబంధనల్లో కీలకం. వాటిని పాటించకుండా ఆ విమానంలో సామర్థ్యానికి మించి ఇంధనం నింపడంలో ఉద్దేశం ఏమిటి? సామర్థ్యానికి మించి విమానాల్లో ఇంధనం నింపితే ఎంతటి ప్రమాదమో వారికి తెలియదా? – ఎంత వేడినైనా తట్టుకునే బ్లాక్ బాక్స్ ప్రమాదంలో కాలిపోవడమేంటి? ఏదైనా విమాన ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు.. ఆ ప్రమాదం తాలూకు గుట్టు విప్పేదే బ్లాక్ బాక్స్. ప్రమాదానికి ముందు విమాన పైలట్ల మాటలన్నీ ఇందులో రికార్డు అయి ఉంటాయి. వాటి ద్వారా ప్రమాదానికి గల కారణాలపై ఒక అంచనాకు రావచ్చు. అందుకే ఇంత కీలకమైన బ్లాక్ బాక్స్ను అత్యున్నత ప్రమాణాలతో తయారు చేస్తారు. ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగినా ఈ బ్లాక్ బాక్స్ దెబ్బ తినకుండా ఉండటమే దీని ప్రత్యేకత. ఎంత వేడినైనా, మంచునైనా తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంటుంది. అలాంటి బ్లాక్ బాక్స్ ఈ ప్రమాదంలో కాలిపోయిందని చెప్పడం ఎంత వరకు నిజం? తద్వారా ఏదో దాస్తున్నారని, నిజాన్ని సమాధి చేస్తున్నారని ఇట్టే తెలియడం లేదా? – ఏ విచారణ జరక్క ముందే వీఎస్ఆర్ వెంచర్స్కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఎలా క్లీన్ చిట్ ఇచ్చారు? ఒక విమాన ప్రమాదం జరిగిన తర్వాత వివిధ కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది. వివిధ శాఖలు దర్యాప్తులో భాగమవుతాయి. అందునా ఆ విమాన ప్రమాదంలో మృతి చెందింది మామూలు వ్యక్తి కాదు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం. ఈ క్రమంలో ఒక కేంద్ర మంత్రిగా అత్యంత బాధ్యతాయుత స్థానంలో ఉన్న టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు.. ఆ విమానయాన కంపెనీ వీఎస్ఆర్ తప్పు లేదని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారు? ఏ ఆధారంతో ఆయన ఈ ప్రకటన చేశారు? అంటే దర్యాప్తు సంస్థ ఆయన ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పడం కాదా? ఎందుకోసం ఇలా తొందరపాటుతో ప్రకటన చేశారు? ఎవరి కోసం చేశారు? వీఎస్ఆర్ను ఎందుకు వెనకేసుకొస్తున్నారు? రోహిత్ డిమాండ్లన్నీ సహేతుకమే అంటున్న విశ్లేషకులు – విమాన ప్రమాదంలో ఒక రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి చనిపోతే ఇంత వరకు వీఎస్ఆర్ సంస్థ యజమాని వీకే సింగ్ను అరెస్ట్ చేయలేదని, డైరెక్టర్లు విదేశాలకు పారిపోవడానికి సహకరించారని, దీని వెనుక రామ్మోహన్ నాయుడు ఉన్నారంటూ రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణలే చేశారు. రూ.35 కోట్ల విలువైన విమానానికి రూ.265 కోట్ల బీమా చేయించడం, టాయిలెట్ వెనుక లగేజ్ పెట్టే ప్రాంతంలో పెట్రోల్ క్యాన్లను ఉంచడం, విమానంలో సామర్థ్యానికి మించి ఫ్యూయల్ నింపడం, ప్రమాదం తర్వాత తీవ్ర పేళ్లుళ్లు జరగడం, 1,100 డిగ్రీల వేడిలో ఉన్నా కాలిపోవడానికి అవకాశం లేని బ్లాక్ బాక్స్ కాలిపోయిందని చెప్పడం.. ఇవన్నీ చూస్తుంటే ఇందులో కుట్ర ఉన్నదని రోహిత్ పవార్ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని విమానయాన రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. – సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫిన్లీజ్ వీఎస్ఆర్ సంస్థకు రూ.వందల కోట్లలో ఫండింగ్ చేయడం, కంపెనీ వెనుక టీడీపీ కీలక నేతలు ఉండటం వల్లే 2016లో కేవలం రూ.10 కోట్ల టర్నోవర్తో ఉన్న వీఎస్ఆర్ కంపెనీ ఇప్పుడు రూ.500 కోట్లకు చేరుకుందని రోహిత్ ఆధారాలతో చెబుతుంటే టీడీపీ నేతలు, హెరిటేజ్ సంబంధికులు ఎందుకు బదులివ్వడం లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. – వీఆర్ఎస్ను వెనకేసుకు రావడానికి టీడీపీ ముఖ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్తో ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమని, అందువల్లే తక్షణం ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి, ఈ ప్రమాదంపై కుట్ర కోణంలో దర్యాప్తు జరిపించాలని రోహిత్ పవార్ డిమాండ్ చేయడం సహేతుకమేనని.. ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. విమానాల కొనుగోళ్లకు టీడీపీ నిధులు వీఎస్ఆర్ వెంచర్స్ విమానాల కోనుగోళ్లకు హెరిటేజ్ సంస్థతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కూడా నేరుగా నిధులు సమకూర్చినట్లు రోహిత్ పవార్ ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ హెరిటేజ్ ఫిన్లీజ్ ద్వారా వీఆర్ఎస్కు రూ.200 నుంచి రూ.300 కోట్ల వరకు ఫండింగ్ జరిగినట్లు తమకు సమాచారం ఉందంటూ రోహిత్ ఆరోపించారు. టీడీపీకి చెందిన కీలక వ్యక్తి రూ.650 కోట్లతో దుబాయ్లో వీఆర్ఎస్ ద్వారా లెగసీ విమానం కొనుగోలు చేశారని.. దాన్ని దుబాయ్లో పార్క్ చేశారని, ఏడాది క్రితం రాజస్తాన్లో జరిగిన వీఎస్ఆర్ కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్ ఫంక్షన్కు టీడీపీలోని ప్రముఖ నేతలు హాజరయ్యారని, ఇలా ఒకటి, రెండు కాదు..అనేక ఆర్థిక పరమైన వ్యవహారాలు వీఎస్ఆర్–టీడీపీ నేతల మధ్య ఉన్న విషయాన్ని రోహిత్ పవార్ బహిరంగ పరిచారు. ఈ నేపథ్యంలో దుబాయ్లో విమానాలు కొనుగోలు చేసిందెవరని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు కూడా వీఎస్ఆర్ కంపెనీతో సన్నిహిత సంబంధాలున్నాయని, అందువల్లే దర్యాప్తు పూర్తి కాకుండానే ఆ కంపెనీకి క్లీన్ చిట్ ఇస్తూ మాట్లాడటమే కాకుండా ఉద్దేశ పూర్వకంగా దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారని రోహిత్ ఎత్తి చూపారు. తక్షణమే రామ్మోహన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ విమానాల్లోనే తిరుగుతున్న బాబు కుటుంబం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక నారా కుటుంబమంతా ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతుండటం తెలిసిందే. ఈ విమానాలన్నీ వీఎస్ఆర్ ఏవియేషన్ సమకూరుస్తున్నవే. ఇదే విషయాన్ని ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ డేటాను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విజయవాడ ఎయిర్పోర్టు నుంచి ఆయన కుటుంబంహైదరాబాద్, ఢిల్లీ, పూణే, బెంగళూరు ఇలా ఎక్కడకు వెళ్లాలన్నా వీఎస్ఆర్ విమాన సర్వీసులనే వినియోగిస్తున్నారు. వీఎస్ఆర్ వెంచర్స్.. వీఎస్సార్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చార్టర్ ఫ్లైట్ కంపెనీ. 2011లో ఢిల్లీ కేంద్రంగా ఈ సంస్థను విజయ్ కుమార్ సింగ్ (వీకే సింగ్) స్థాపించారు. ఆయన కుమారుడు రోహిత్ సింగ్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. 2014లో నాన్ షెడ్యూల్డ్ విమాన సర్వీసులను నడపడానికి అనుమతి లభించింది. ఈ లైసెన్స్ను 2028 వరకు పొడిగించారు. ప్రస్తుతం ఈ సంస్థ లీయర్ జెట్ 45/45 ఎక్స్ ఆర్ వంటి విమానాలతో పాటు ఎయిర్ అంబులెన్స్, ఏవియేషన్ కన్సల్టెన్సీ సేవలను అందిస్తోంది. ఇటీవల మహారాష్ట్రలో వీఎస్సార్ లియర్ జెట్ కూలిపోవడం వల్లే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన విషయం తెలిసిందే. హెరిటేజ్ ఫిన్లీజ్.. హెరిటేజ్ అనుబంధ సంస్థగా పాడి రైతులకు రుణాలను ఇచ్చే లక్ష్యంతో 1996 డిసెంబర్ 23న హైదరాబాద్ కేంద్రంగా హెరిటేజ్ ఫిన్ లీజ్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, అక్కిరాజు చంద్రమౌళి, ఎం.సాంబశివరావు, కొల్లి దుర్గాప్రసాదరావు, భూదర్ కుమార్ కరుటూరి, కొంపెల్ల వెంకటేశ్వర్లు, నర్రావుల నాగేశ్వరరావులు డైరెక్టర్లుగా ఉన్నారు. రైతుల కోసం ఉద్దేశించిన ఈ సంస్థ వందల కోట్ల రూపాయలు విమానయాన సంస్థకు దారి మళ్లించడం చర్చనీయాంశంగా మారింది. -
అబుల్ కలాం ఆజాద్కు వైఎస్సార్సీపీ ఘన నివాళి
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ మొదటి విద్యా శాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ ఘనంగా నివాళులర్పించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి వైఎస్సార్సీపీ నేతలు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా శాఖా మంత్రిగా దేశానికి ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. లౌకిక జాతీయవాదాన్ని బలంగా సమర్ధించారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో వైఎస్ జగన్ హయాంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, ఎస్ఈసీ మెంబర్ షేక్ మెహబూబ్, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, బొందిలి విభాగం అధ్యక్షుడు సింగ్, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.సాయిబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి పాల్గొన్నారు. -
‘కాలుష్య నియంత్రణ’లో కమీషన్ల వేట
సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కమీషన్లతో కలుషితమవుతోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. కావాల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రాష్ట్రంలోని రెండు బయో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల నిర్వహణ కాంట్రాక్టులు ఇచ్చేందుకు నిబంధనలకు తిలోదకాలిచ్చింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నామినేషన్ విధానంలో తమకు కావాల్సిన సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చేందుకు బోర్డు తీర్మానం కూడా చేసేసింది. విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో బయో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల నిర్వహణ కాంట్రాక్టును ట్రైమెక్స్ ఎనర్జీ, గోదావరి బయో ఇండస్ట్రీస్ సంస్థలకు అప్పగించాలని గతనెల 13న జరిగిన పీసీబీ సమావేశంలో తీర్మానించారు. గతంలోనే ఈ ప్లాంట్లు ఏర్పాటైనా వాటి నిర్వహణ కాంట్రాక్టును ఇచ్చేందుకు గ్యాప్ ఎనాలసిస్ స్టడీ చేయాలని సీపీసీబీ సూచించింది. దీంతో పీసీబీ ఆ స్టడీ చేయించి 2025లో సీపీసీబీకి నివేదిక పంపింది. దాన్ని పరిశీలించిన సీపీసీబీ బయో వేస్ట్ నిర్వహణ అత్యంత జాగ్రత్తగా చేయాల్సిన పని కావడంతో టెండర్ల ప్రక్రియ ద్వారా అనుభవం ఉన్న కంపెనీలను ఎంపిక చేయాలని సూచించింది. టెండర్లు పిలిస్తే తమకు కావాల్సిన కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడం సాధ్యం కాదనే ఉద్దేశంతో నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇవ్వాలని పీసీబీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రతిపాదనలు తయారు చేసి బోర్డు సమావేశంలో ఆమోదించింది. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉమ్మడిగా బయో వేస్ట్ను సేకరణను సేకరిస్తుండగా దాన్ని విడగొట్టి కొత్తగా విజయనగరం జిల్లాకు ప్రత్యేక కాంట్రాక్టును ట్రైమెక్స్ కంపెనీకి ఇవ్వనుంది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం బయో వేస్ట్ను సేకరిస్తున్న కంపెనీకి పక్కనపెట్టి గోదావరి బయో ఇండస్ట్రీస్ కంపెనీని కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించింది. బోర్డు తీర్మానం కూడా చేయడంతో త్వరలో వారికి త్వరలో అధికారికంగా కాంట్రాక్టులు ఇవ్వనుంది. ఆ సంస్థలతో కుమ్మక్కవడంతోనే !నిర్వహణ కాంట్రాక్టు కోసం ఆ కంపెనీలు పీసీబీ చైర్మన్తో కుమ్మక్కయినట్లు ఆరోపణలున్నాయి. అందుకే సీపీసీబీ సూచనలు కూడా పట్టించుకోకుండా టెండర్లు లేకుండా నామినేషన్ల పద్ధతిలో అత్యంత కీలకమైన ప్లాంట్ల నిర్వహణను ఆ సంస్థలకు కట్టబెడుతున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో పీసీబీలోని కొందరు ఉన్నతాధికారులు కూడా చైర్మన్కు అండగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్లాంట్ల అప్పగింతతో భారీగా కమీషన్లు దండుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. పీసీబీ ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ శాఖ పరిధిలో ఉన్నా పీసీబీ చైర్మన్ చంద్రబాబుకు బాగా సన్నిహితమైన వ్యక్తి కావడం గమనార్హం. ప్రజారోగ్యం పోయినా.. కమీషన్లే కావాలిబయో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల నిర్వహణ అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. వీటివల్ల ఆ ప్రాంతంలో పర్యావరణం తీవ్రంగా ప్రభావితమవుతుంది. బయో వ్యర్థాలను కాల్చినప్పుడు ప్రమాదకరమైన డయాక్సిన్స్ వంటి వాయువులు విడుదలవుతాయి. వాటిని నియంత్రించే హై స్టాండర్డ్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉండాలి. అందుకే ఎన్జీటీ, కేంద్ర పర్యావరణశాఖ, సీపీసీబీ.. సరైన సామర్థ్యం ఉన్న కంపెనీలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నాకే అనుమతి ఇస్తుంది. లేకపోతే ఆయా ప్రాంతాల్లో ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో సీపీసీబీ విజయనగరం, తూర్పుగోదావరి ప్లాంట్ల నిర్వహణ కాంట్రాక్టులు ఇచ్చేందుకు సీపీసీబీ ఇచ్చిన పలు స్పష్టమైన మార్గదర్శకాలను పీసీబీ బుట్టదాఖలు చేసింది. ప్రజల ఆరోగ్యం పోయినా, పర్యావరణం నాశనమైనా సరే.. తమకు కమీషన్లు ఇచ్చే సంస్థలకే కాంట్రాక్టులు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. -
2న అంగన్వాడీల మహాధర్నా
సాక్షి, అమరావతి: అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 23 నుంచి 27 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ మూడు యూనియన్లకు చెందిన నాయకులు ప్రకటించారు. మార్చి 2న విజయవాడలో అంగన్వాడీల మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ), ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ), ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ (ఐఎఫ్టీయూ), హెల్పర్స్ యూనియన్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె.సుబ్బరావమ్మ, జె.లలితమ్మ, వీఆర్ జ్యోతి విజయవాడలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గతంలో నిర్వహించిన సమ్మె సమయంలో డిమాండ్స్ అంగీకరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ తుంగలో తొక్కిందన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం నెలకు రూ.20వేలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 1819 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని, గ్రాట్యూటీ అమలుకు గైడ్లైన్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. -
పని ఒత్తిడి పెంచి ప్రాణాలు తీస్తున్నారు
పటమట (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేల భారంతో తాము వెట్టిచాకిరీ చేయాల్సి వస్తోందని, పని ఒత్తిడి పెంచుతూ ఉద్యోగులు ప్రాణాలు తీస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు ప్లానింగ్ రెగ్యులరైజేషన్ సెక్రటరీలు (డబ్ల్యూపీఆర్ఎస్) ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూపీఆర్ఎస్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు సరైన సర్వీస్ రూల్స్ లేకపోవటంతో ప్రమోషన్లు, వేతనాల వ్యవహారాల్లో జాప్యం జరుగుతోందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న సచివాలయాల ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గౌరవ అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ టౌన్ప్లానింగ్ టెక్నికల్ అఫీసర్స్ అసోసియేషన్ అ«ధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్లానింగ్, రెగ్యులరైజేషన్స్ సెక్రటరీల ప్రమోషన్ చానల్ చేయటానికి సర్వీస్ రూల్స్ సవరించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 390 టీపీబీఓ పోస్టులు డబ్ల్యూపీఆర్ఎస్ ద్వారా భర్తీ చేయటానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. వారికి ట్రేసర్ పేస్కేల్ వర్తింపచేసేలా కృషి చేస్తామన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు యు.నవీన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులతో సంప్రదించి తమకు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ వర్తింపచేసేలా కృషి చేయాలని కోరారు. సచివాలయాల సెక్రటరీలు ఎవరూ కూడా పనిఒత్తిడితో ప్రాణాలు కోల్పోవద్దని, విధి నిర్వహణలో సమస్యలుంటే ఉన్నతాధికారులు, తమ తోటి ఉద్యోగులు, అసోసియేషన్ సభ్యులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు, అమరావతి జేఏసీ రాష్ట్ర కోశాధికారి టి.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ స్కామ్!
సాక్షి, అమరావతి: అక్రమార్జనే ధ్యేయంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆరోగ్య బీమా అమలులో స్కామ్కు రంగం సిద్ధమైంది! ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిన ప్రభుత్వ పెద్దలు బీమా విధానం పేరిట ఇన్సూరెన్స్ కంపెనీలకు నిధులు మళ్లించి భారీ అవినీతికి తెరతీసినట్లు విమర్శలు వస్తున్నాయి. తాజాగా పచ్చ పార్టీ కార్యకర్తల బీమా సేవలో తరిస్తున్న కంపెనీకే వైద్యశాఖలో రూ.నాలుగు వేల కోట్ల విలువైన ఆరోగ్య బీమా కాంట్రాక్ట్ను కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల అస్మదీయ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సంస్థ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి మళ్లించడం, ప్రీమియంపై భారీ మొత్తంలో కమీషన్ బ్రోకర్ ఏజెన్సీకి చెల్లించడం, ఏజెన్సీ నుంచి పెద్దలకు ముడుపులు చేరవేసేలా పావులు కదుపుతున్నారు. ఈ దోపిడీ పరంపరతో భారీ కుంభకోణానికి తెర తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతటా అస్మదీయ బ్రోకర్ ఏజెన్సీ..ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా అమలులో ప్రభుత్వ పెద్దల అస్మదీయ బ్రోకర్ సంస్థ చక్రం తిప్పుతోంది. పచ్చ పార్టీ కార్యకర్తలకు బీమా సేవలు అందించే ఇన్సూరెన్స్ కంపెనీ, పార్టీకి మధ్య ఓ సంస్థ బ్రోకింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ గతేడాది కోటి మంది కార్యకర్తలకు రూ.5 లక్షల చొప్పున ప్రమాద బీమా కోసం కేవలం రూ.42 కోట్లు ప్రీమియం చెల్లించేలా ఓ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిర్చింది. ప్రస్తుతం ఆ బ్రోకర్ ఏజెన్సీ ద్వారానే వివిధ శాఖల్లో బీమా అమలు స్కామ్ను ప్రభుత్వ పెద్దలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది విద్యుత్ శాఖలో ట్రాన్స్కో ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. రూ.100 కోట్ల విలువైన ఈ టెండర్ను తొలుత పచ్చ పార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ, బ్రోకర్ ఏజెన్సీకి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అయితే సాల్వెన్సీ నిబంధన, ప్రమాణాల కారణంగా ఆ బిడ్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో కోరినంత కమీషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకుని మరో ఇన్సూరెన్స్ కంపెనీకి అడ్డదారుల్లో కాంట్రాక్టు ముట్టజెప్పారు. కాంట్రాక్టు దక్కించుకున్న బీమా సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసేందుకు టెండర్ల సమయంలో తిరస్కరణకు గురైన అస్మదీయ బ్రోకర్ ఏజెన్సీని మళ్లీ రంగంలోకి దించారు. ఇన్సూరెన్స్ సంస్థకు, ఉద్యోగులకు మధ్య సమన్వయం కోసం టెండర్ల దశలో అనర్హతకు గురైన ఏజెన్సీని నియమించారు. పచ్చ పార్టీ బీమా సేవలో తరిస్తున్న కంపెనీకి మేలు చేసేందుకు వైద్యశాఖ బీమా టెండర్లో సాల్వెన్సీ నిబంధనకు మినహాయింపు ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని బీమా నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే అస్మదీయ ఏజెన్సీకి విజయవాడలోని థర్మల్ పవర్ స్టేషన్ ప్రమాద బీమాలో 15 శాతం వాటాను నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చేశారు. 2024–25, 2025–26లో ఇదే ప్రాతిపదికన ఎంపిక చేశారు. భవిష్యత్లో ఇబ్బందులు వస్తాయనే భయంతో విజయవాడతో పాటు మరో థర్మల్ పవర్ స్టేషన్కు 2026–27లో బ్రోకింగ్ ఏజెన్సీల ఎంపికకు టెయిలర్ మేడ్ నిబంధనలతో ఇటీవల టెండర్ పిలిచారు. ఇలా ప్రభుత్వ శాఖల్లో బీమా కార్యకలాపాలన్నింటిలో బ్రోకర్ ఏజెన్సీ ద్వారా దోపిడీకి పాల్పడుతున్నారు.సాల్వెన్సీ నిబంధన ఎత్తివేతవైద్య శాఖలో బీమా టెండర్ను ఎలాగైనా సరే పచ్చ పార్టీకి బీమా అందిస్తున్న ప్రైవేట్ కంపెనీకే కట్టబెట్టాలనే లక్ష్యంతో టెండర్ నిబంధనల్లో మార్పులు తెచ్చినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో అస్మదీయ బ్రోకర్ ఏజెన్సీ కీలక పాత్ర పోషిస్తోంది. పచ్చ పార్టీకి బీమా సేవలు అందిస్తున్న సంస్థ సాల్వెన్సీ నిబంధనతో ట్రాన్స్కో టెండర్లో వైదొలగింది. దీంతో వైద్య శాఖ బీమా టెండర్లో ప్రీ బిడ్ అనంతరం సాల్వెన్సీ షరతులో మెలిక పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సమర్పిస్తే సాల్వెన్సీ నుంచి మినహాయింపు ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.42 కోట్ల మంది పేద, మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య సంరక్షణతో చెలగాటమాడుతూ రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టు విషయంలో సాల్వెన్సీ నిబంధన నుంచి మినహాయిం ఇస్తామని పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వం తీరుపై పలు ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం అభ్యంతరం తెలపడం గమనార్హం. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఐఏ) నిబంధనల ప్రకారం ప్రతి బీమా సంస్థ (లైఫ్, జనరల్/హెల్త్ ఇన్సూరెన్స్) కనీసం 150 శాతం సాల్వెన్సీ రేషియోను నిరంతరం కొనసాగించాలి. ఉదాహరణకు ఒక సంస్థ చెల్లించాల్సిన క్లెయిమ్ల విలువ రూ.100 అనుకుంటే.. ఆ సంస్థ వద్ద కనీసం రూ.150 విలువైన ఆస్తులు సిద్ధంగా ఉండాలి. అయితే ప్రభుత్వ పెద్దలు ఎంపిక చేసుకున్న బీమా సంస్థ సాల్వెన్సీ రేషియో లోటులో ఉండటం గమనార్హం. దీంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి టెండర్ నిబంధనల్లో మార్పులు చేసినట్లు స్పష్టమవుతోంది. -
వైఎస్సార్సీపీ వెంకటగిరి సమన్వయకర్త రామ్ కుమార్రెడ్డిపై అక్రమ కేసు
సాక్షి,నెల్లూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. విద్యుత్ ఛార్జీలపై పెంపుపై చేపట్టిన నిరసనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ అక్రమ కేసుపై నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి స్పందించారు. ‘2024 డిసెంబర్లో జరిపిన నిరసనకు నేడు నోటీసులు పంపించారు. 2024లో జరిగిన నిరసన ఘటనలో పోలీసులు నాపై అక్రమ కేసు నమోదు చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదు’అని వ్యాఖ్యానించారు.


