రేపటి నుంచి వైఎస్‌ జగన్‌ పర్యటన | YS Jagan Visit to Alluri Sitarama Raju District on March 04: Ap | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి వైఎస్‌ జగన్‌ పర్యటన

Mar 3 2026 3:22 AM | Updated on Mar 3 2026 3:22 AM

YS Jagan Visit to Alluri Sitarama Raju District on March 04: Ap

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 4న బుధవారం విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం అరకు చేరుకుని తంగుల్‌గూడాలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.

అనంతరం విశాఖ చేరుకుని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ నివాసానికి వెళ్తారు. ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఈ నెల 5న గురువారం వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు చేరుకుని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement