Peddapalli
-
ప్రజా సంక్షేమమే ధ్యేయం
ఎలిగేడు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్ర భుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం బుర్హాన్మియాపేటలో గుజ్జుల రవళి–విజేందర్రెడ్డి, బొంగోని రమ–సంపత్, గుజ్జుల లావణ్య–ప్రశాంత్రెడ్డిలు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొని ఇళ్లను ప్రారంభించారు. అనంతరం రూ.10లక్షలతో గ్రామంలోని అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. నర్సాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను మభ్యపెట్టి ఇళ్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. సర్పంచులు గోపు లక్ష్మారెడ్డి–రజిత, పల్లెర్ల వెంకటేశ్గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, నాయకులు సంతోష్రావు, ఉప సర్పంచులు, వార్డుసభ్యులు, కాంగ్రెస్పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు పాల్గొన్నారు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఓదెల: అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆదివారం రాత్రి బాయమ్మపల్లెలలో సీసీ రోడ్ల నిర్మాణాలు, కంపౌండ్వాల్, బ స్టాండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు -
భళా.. బాలిక
పెద్దపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండియర్లో 68.29, ఫస్టియర్లో 57శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 24వ స్థానంలో నిలిచారు. ఓవరాల్గా బాలికలే పైచేయి సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గతేడాది 68శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకుని రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా 16వ స్థానంలో నిలిచింది. సెకండియర్లో.. సెకండియర్లో బాలురు 1,536 మంది పరీక్షలకు హాజరు కాగా 845 మంది పాసయ్యారు. 55శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 2,226 మంది పరీక్షలకు హాజరు కాగా 1,724 మంది పాసై 77.45శాతం సాధించారు. మొత్తంగా జిల్లాలో 3,762 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 2,569 మంది విద్యార్థులు (68.29శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్లో.. ఫస్టియర్లో బాలురు 1,704 హాజరు కాగా 668 మంది పాసై 39శాతం సాధించారు. బాలికలు 2,412కు 1,682 ఉత్తీర్ణత సాధించి 69.73శాతం నమోదైంది. మొత్తంగా బాలికలు 4,116 మంది పరీక్షలకు హాజరు కాగా 2,350 ఉత్తీర్ణత సాధించి 57 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఒకేషనల్ విభాగంలో.. ఒకేషనల్లో జిల్లావ్యాప్తంగా బాలురు 445 పరీక్ష రాస్తే 249 ఉత్తీర్ణులయ్యారు. 55.96శాతం ఫలితాలు నమోదు చేశారు. బాలికలు 518కు 460 మంది పాసై 88.80 శాతం సాధించారు. మొత్తంగా 963 మంది పరీక్షలు రాయగా 709 మంది 73.62శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్లో 582 మందికి 445 ఉత్తీర్ణత (76.46శాతం) సాధించారు. మే 13 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియట్లో తప్పిన విద్యార్థుల కోసం ప్రభుత్వం డిగ్రీ వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను మే 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన అమ్మాయిలు రాష్ట్రస్థాయిలో 24వ స్థానంలో పెద్దపల్లి జిల్లా సెకండియర్లో 68.29, ఫస్టియర్లో 57శాతం ఉత్తీర్ణతఇంటర్ ఫలితాలు ఇలాగతేడాది సెకండియర్ ఉత్తీర్ణత శాతం 68 ఈ ఏడాది సెకండియర్ ఉత్తీర్ణత శాతం 68.29 గతేడాది ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 59 ఈ ఏడాది ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 57 -
‘ఎర్లీబర్డ్’ టార్గెట్ రూ.9 కోట్లు
కోల్సిటీ(రామగుండం): జిల్లాలోని మున్సిపాలిటీలు ఆస్తిపన్ను వసూళ్లే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈనెల 30వ తేదీ వరకు 2026–27 ఆర్థిక సంత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను ముందుగా చెల్లించే వారికి ఎర్లీబర్డ్ ఆఫర్ పేరిట ఆస్తిపన్నులో ఐదు శాతం రాయితీ వర్తింపజేస్తున్నాయి. తద్వారా నిర్దేశిత లక్ష్యం కన్నా అధికంగా వసూలు చేయాలని ప్రణాళిక రూపింంచాయి. జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఎర్లీబర్డ్ ఆఫర్ ద్వారా ముందస్తు ఆస్తిపన్ను రికార్డుస్థాయిలో వసూలు చేయాలనే లక్ష్యంతో మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో ఎర్లీబర్డ్ ఆఫర్ స్కీంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ కేటగిరీలో అగ్రస్థానం రామగుండం కార్పొరేషన్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఆస్తిపన్ను వసూళ్లలో అత్యధిక శాతం వసూలు సాధిం కార్పొరేషన్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను డిమాండ్ రూ.19 కోట్ల 22 లక్షల 97 వేలు ఉండగా, రూ.14కోట్ల 47 లక్షల 67వేలు వసూలయ్యాయి. దీంతో ఆర్థిక సంఘం పెర్ఫార్మెన్స్ గ్రాంట్ పొందడానికి అర్హత సాధించినట్లయింది. ప్రజలకు అవగాహన రామగుండం నగరపాలక సంస్థ అధికారులు ఎర్లీబర్డ్ స్కీం ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.9కోట్ల వరకు ముందస్తు ఆస్తిపన్ను వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. బిల్కలెక్టర్లు ఆస్తిపన్ను నమోదు చేయడానికి ఉపయోగించే హ్యాండ్ మిషన్లలో 5 శాతం రాయితీ కలిగిన సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు. పరిశ్రమలకు లేఖలు రామగుండం బల్దియాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.18.95 కోట్ల వరకు డిమాండ్ ఉంది. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి, జెన్కో తదితర ప్రభుత్వరంగ సంస్థల నుంచి ఎర్లీబర్డ్ ఆఫర్ ద్వారా ముందస్తు ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. గతేడాది ఎన్టీపీసీ రూ.3.88కోట్లు, ఆర్ఎఫ్సీఎల్ రూ.1.8కోట్లు, సింగరేణిలోని ఆర్జీ–1 ద్వారా రూ.73.76లక్షలు, ఆర్జీ–2 ద్వారా రూ.43.37లక్షలు, జెన్కో ద్వారా రూ.5.99 లక్షల వరకు ఆస్తిపన్ను చెల్లించాయి. ఈఏడాది ఎర్లీబర్డ్ ఆఫర్లో కూడా ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్తోపాటు సింగరేణి, జెన్కో నుంచి కూడా ముందుస్తు ఆస్తిపన్ను చెల్లించేలా ఆయా సంస్థలకు లేఖలు పంపించారు. అలాగే రైస్మిల్లులతోపాటు బడా వ్యాపారులకూ అవగాహన కల్పించి ముందస్తు ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. రామగుండంలో ఎర్లీబర్డ్ వసూళ్లుఆర్థిక సంవత్సరం వసూలు(రూ.కోట్లలో) 2019–20 0.8292 2020–21 1.13 2021–22 1.14 2022–23 1.55 2023–24 1.54 2024–25 1.60 2025–26 9.7 పురపాలికల్లో ముందస్తు వసూలుకు కార్యాచరణ ముందుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి 5శాతం రాయితీ ఈనెల 30లోగా చెల్లిస్తేనే పథకం వర్తింపు ప్రత్యేక దృష్టి సారించిన మున్సిపల్ కమిషనర్లు -
మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ
ఓదెల: ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. కోనేరులో స్నానాలు ఆచరించి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మల్లికార్జున స్వామి, సీతారామచంద్రస్వామి, నందీశ్వరులను దర్శించుకున్నారు. ఒగ్గుపూజాలతో పట్నాలు వేసి బోనాలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ జూనియర్ అసిస్టెంట్ ముద్దసాని కుమరస్వామి ఏర్పాట్లు చేశారు. ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలిరామగుండం: ఆర్టిజన్ కార్మికులకు పూర్వపు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (ఏపీఎస్ఈబీ) సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వాగునాయక్ అన్నారు. మల్యాలపల్లి సబ్స్టేషన్ వద్ద ఐదురోజులుగా ఆర్జిజన్ కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్ష శిబిరాన్ని ఆదివారం సందర్శించి సంఘీభా వం తెలిపారు. అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. దీక్షలో ఆర్టిజన్ కార్మికులు కొంకటి శ్రీనివాస్, వడ్డెపల్లి సురేష్, లగిశెట్టి మధు, ఆవుల మహేశ్, దుర్గం విశ్వనాథ్, బోరె శ్రీని వాస్, సందీప్, ప్రణయ్, జనార్దన్, రమేశ్, తేజ, కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లిలో.. పెద్దపల్లిరూరల్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ విద్యుత్ ఆర్టిజన్లు పెద్దపల్లి మండలం రాఘవాపూర్లోని విద్యుత్ సర్కిల్ ఆఫీసు వద్ద చేపట్టిన నిరసన దీక్ష ఆదివారం ఐదోరోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్, ఎండీ ఖాజా, ప్రశాంత్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు మంథనిలో మంత్రి శ్రీధర్బాబు పర్యటనమంథని: మంథని నియోజకవర్గంలో సోమవా రం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పర్యటించనున్నారు. మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా మంథనిలోని శ్రీపాదరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారు. ప్రతిమ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించే బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభిస్తారు. శ్రీలక్ష్మీనారాయణ ఆలయం వద్ద 13వ వార్డు కార్యాలయం ప్రారంభోత్సవం, రూ.1.98కోట్ల టూరిజం నిధులతో రావుల చెరువు కట్ట అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. మార్కెట్యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అదే విధంగా ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనజ్యోతినగర్: రామగుండం కార్పొరేషన్ జంగాలపల్లెలోని నృసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రోక్షణ సహిత ధ్వజస్తంభ, నవగ్రహ, నాగదేవత ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్ వెంగల బాపు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాంట్రాక్టర్ ఏబీసీ రెడ్డి, కార్పొరేటర్ మారెల్లి రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ వెంగల పద్మలత, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
● వార్డు సభ్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు భాగస్వామ్యం ● రాష్ట్ర డీజీపీ బి.శివధర్రెడ్డి గోదావరిఖని: అలైవ్ అరైవ్ కార్యక్రమంలో వార్డు సభ్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు భాగస్వామ్యులుగా చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్రెడ్డి అన్నారు. ఆదివారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐబీకాలనీలో రూ.12.29కోట్లతో నిర్మించిన నూతన ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బంది క్వార్టర్లను ప్రారంభించారు. కమిషనరేట్లో సాయుధ పోలీసు సిబ్బంది గౌరవవందనం సమర్పించి డీజీపీకి స్వాగతం పలికారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఒక సామాజిక సమస్యగా మారాయన్నారు. వాటిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. వేగం కన్నా ప్రాణం ముఖ్యం అనే సందేశాన్ని ప్రతీ ఒక్కరికి చేరేలా సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల కుటుంబ సభ్యుల అనుభవాలు, అభిప్రాయాలను ప్రజలతో పంచుకోవడం ద్వారా అవగాహన మరింత పెరుగుతుందన్నారు. నూతన క్వార్టర్లు ప్రారంభించిన డీజీపీ గోదావరిఖని ఐబీ కాలనీలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.12.29 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పోలీస్ క్వార్టర్స్ను ఆదివారం డీజీపీ శివధర్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ఝా, టీజీపీఐసీఎస్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి, పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం, జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గీత్, ఎసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
మహిళ కళ్లలో కారం కొట్టి గొలుసు అపహరణ
వీర్నపల్లి(సిరిసిల్ల): వృద్ధురాలి కళ్లల్లో కారం చల్లి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన శనివారం క లకలం రేపింది. బాధితురాలి కథనం ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా వీ ర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన గుగులోతు హంసి శనివారం తెల్లవారుజాము న 5 గంటల సమయంలో తన ఇంటి బయట పనులు చేస్తుంది. ఇదే సమయంలో గుర్తు తె లియని వ్యక్తులు ఆమైపె దాడి చేసి, కళ్లలో కా రం చల్లి మెడలోని 2.5 తులాల బంగారు గొ లుసును లాక్కెళ్లారు. ఈ హఠాత్పరినామంతో హంసి గగ్గోలు పెట్టడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చినా దుండగులు కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై వేముల లక్ష్మణ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో గంజాయి రవాణా చేస్తున్న గాజానవేణి రాకేశ్, అంబాల తరుణ్ను అరెస్టు చేసినట్లు పొత్కపల్లి ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ఆదేశాల మేరకు గుంపుల గ్రామంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రాకేశ్, తరుణ్ బైక్పై అటుగా వస్తూ అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని ఆగాలని సూచించడంతో అంతలోనే పారిపోవడానికి యత్నించారు. పోలీసులు వారిని పట్టుకొని విచారించగా.. గంజాయి విక్రయించేందుకు అటుగా వచ్చినట్లు అంగీకరించారు. వారినుంచి గంజాయితో పాటు బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకొన్నారు. -
తల్లిని హతమార్చిన తనయుడు
● మల్లాపూర్లో దారుణం ● కుటుంబ కలహాలే కారణంమల్లాపూర్ : కుటుంబ కలహాలతో కన్నతల్లినే కడతేర్చాడు కొడుకు. ఈ ఘటన మల్లాపూర్ మండలకేంద్రంలో శనివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల ప్రకారం గ్రామానికి చెందిన కుడుదుల వెంకవ్వ (90)కు కుమారుడు నంబయ్య (73), కూతురు ఉన్నారు. భర్త చనిపోయినప్పటి నుంచి వెంకవ్వ కుమారుడితోనే ఉంటోంది. నంబయ్య భార్య లక్ష్మీతో తరచూ గొడవ పడుతుంటే వెంకవ్వ సర్దిచెప్పేది. శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. వెంకవ్వ అడ్డుకుంది. దీంతో నంబయ్య ఆమె ముఖంపై దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. మెట్పల్లి సీఐ అనిల్కుమార్, ఎస్సై అనిల్ ఘటనస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆర్ఐ అశోక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డిప్యుటేషన్పై పంపండి రాయికల్: మండలంలోని మైతాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థి దుగ్గిళ్ల అక్షయ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీనికి ప్రధానోపాధ్యాయుడి వేధింపులే కారణమని ఆయన బంధువులు ఆరోపిస్తూ ఆందోళన చేయడం సరికాదని, తాము పాఠశాలలో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నామని, ఈ క్రమంలో తమను మరో పాఠశాలకు డిప్యూటేషన్పై పంపించాలని ఏడుగురు ఉపాధ్యాయులు ఎంఈవో రాఘవులుకు వినతిపత్రం సమర్పించారు. విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పాఠశాలలో ఉత్తీర్ణత కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులపై ఆరోపణలు చేయడం సరికాదని, విద్యార్థుల భవిష్యత్ కోసమే ఉపాధ్యాయులు పాటుపడతారని, తల్లిదండ్రులు గమనించాలని కోరారు. ఉపాధ్యాయుల కౌన్సెలింగ్పై అపర్థం చేసుకోవద్దని, విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకే ఉపాధ్యాయులు పాటుపడతారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గంగనర్సయ్య, ప్రధాన కార్యదర్శి మానుపాటి బన్న, హెచ్ఎంలు బోగ రమేశ్, ఉపాధ్యాయులు గుర్రం శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మైతాపూర్లో డీఈవో విచారణ టెన్త్ విద్యార్థి అక్షయ్ ప్రధానోపాధ్యాయుడి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణల మేరకు శనివారం డీఈవో రాము పాఠశాలను సందర్శించారు. విచారణ చేపట్టారు. అనంతరం అక్షయ్ తల్లిదండ్రులను పరామర్శించారు. శరీరదానానికి రిటైర్డ్ హెచ్ఎం అంగీకారంకరీంనగర్/కరీంనగర్రూరల్: కరీంనగర్ మెహర్నగర్కు చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు సాగి రాంచందర్రావు దేహదానం చేసేందుకు ముందుకొచ్చారు. శనివారం సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మాచారి ఆధ్వర్యంలో రాంచందర్రావు కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ మెడికల్ కళాశాలను సంప్రదించారు. సీఏవో రాంచందర్రావు సూచనల మేరకు శరీరదానానికి సంబంధించిన దరఖాస్తుఫాంలో వివరాలు నింపి ఎనాటమీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపాల్కు అందించారు. హెచ్ఎంగా ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక సేవాకార్యక్రమాల్లో భాగస్వాములవుతూ ప్రస్తుతం మెడికల్ కళాశాలకు శరీరదానం చేసేందుకు రాంచందర్రావు ముందుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఫౌండేషన్ ప్రతినిధులు నేదునూరి కనుకయ్య, ఆడెపు రాజకనుకయ్య, శ్రీపతి ప్రభాకర్, మెరుగు దేవిక, ద్వారకామయి తదితరులు పాల్గొన్నారు. కాగా సమాజహితం కోసం శరీరదానానికి ముందుకొచ్చిన రాంచందర్రావుకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ముఖ్యసలహాదారు రమేశ్, ప్రచార కార్యదర్శి వాసు, చంద్రమౌళి తదితరులు అభినందనలు తెలిపారు. -
బతకాలి.. విజయాన్ని వెతకాలి..!
● ఫెయిల్ అయ్యామని మనోధైర్యం కోల్పోవద్దు ● ముందుంది ఉజ్వల భవిష్యత్సప్తగిరికాలనీ(కరీంనగర్): ఫస్ట్ ర్యాంక్.. ఫస్ట్ ర్యాంక్.. ఫస్ట్ ర్యాంక్.. నేటి విద్యార్థులు ఇదేదో జీవితలక్ష్యం అనుకుంటున్నారు. ఇక్కడే వారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. చదువు అంటే ర్యాంకులు.. మార్కులు అనే కోణంలోనే చూస్తున్నారు. చదువు అంటే ఏం నేర్చుకున్నాం.. ఎంత నేర్చుకున్నాం.. మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుందనే ఆలోచన లేకుండా పోయింది. తక్కువ మార్కులు వచ్చిన తమ స్కూల్ సీనియర్ విద్యార్థులు జీవితాల్లో ఉన్నతంగా తమ కళ్లముందే ఎదుగుతున్నా వారిని స్ఫూర్తిగా తీసుకోవడం లేదు. మార్కులు వస్తేనే సక్సెస్... లేకుంటే జీవితమే లేదు.. అన్న ఆలోచనలో పడిపోయారు. అయితే ఇక్కడే ఒక్క క్షణం ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. నేడు ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్కులే జీవితం కాదనే సత్యాన్ని నేటి విద్యార్థులు గుర్తించాలి. రిజల్ట్స్ అనేవి ఒక దశ మాత్రమేనని.. అంతిమ గమ్యం కాదని విద్యానిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఫెయిల్ అయితే మళ్లీ ప్రయత్నించే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం సక్సెస్ అయిన బిజినెస్మెన్లు.. విద్యావేత్తలు.. క్రీడాకారులు.. తమ జీవితాల్లో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన వారేనని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయనే.. ఫెయిల్ అయ్యామనో అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరుతున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా మనోధైర్యంగా ముందుకెళ్తే విజయతీరాలను అందుకుంటామనే ఆలోచనతో ఉండాలని సూచిస్తున్నారు.నిలిచి గెలిచిన హీరోలు ప్రస్తుతం మన కళ్లెదుట రాణిస్తున్న వారు, ఒకప్పుడు ప్రతిభ చాటిన ప్రముఖులు పడిలేచిన కెరటాలు. నేటి ఓటమి రేపటి గెలుపునకు పునాదిని వేసుకొని గెలిచారు. మార్కులు, ర్యాంకులు జీవితం కాదని గ్రహించారు. ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్లే భవిష్యతులో గొప్పవాళ్లు కావచ్చుననే లక్ష్యంతో ముందుకుసాగారు. ఒక్కసారి ఆలోచించండి ఎవరి కుటుంబం వారికి ఓ అందమైన లోకం. అమ్మానాన్నలతో కలిసి ఆనందంగా గడిపిన క్షణలను గుర్తు చేసుకోండి. ఫెయిల్ అయ్యామని కుంగిపోకుండా సప్లిమెంటరీలో మంచిగా ప్రయత్నిస్తే విజయం మనదేనని గుర్తుంచుకోవాలి. మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటే.. ఆ తర్వాత ఇంకేమి మిగిలి ఉండదనే విషయాన్ని గుర్తుంచుకుంటే అందమైన జీవితం మన సొంతమవుతుందనే ఆలోచన తెచ్చుకోవాలి. విద్యార్థులు ఫలితాల గురించి తల్లిదండ్రులకు.. తోటి స్నేహితులతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు సైతం తమ కాలేజీలో చదువుకున్న విద్యార్థులతో ఒకసారి మాట్లాడి మనోధైర్యం కల్పించాలని పలువురు విద్యావేత్తలు కోరుతున్నారు. ఇదే సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచొద్దని సూచిస్తున్నారు. -
‘అక్షర పౌర్ణమి’కి ఆఖరి వీడ్కోలు
మలయశ్రీ పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న సాహితీవేత్తలు మలయశ్రీ రచనలు విద్యానగర్(కరీంనగర్)/కరీంనగర్ కల్చరల్: శతాధిక గ్రంథకర్త, రంగస్థల నటులు, వేమన నాటక దర్శకులు మలయశ్రీ మృతి తీరని లోటని కవులు, సాహితీవేత్తలు అన్నారు. పద్యం, గద్యం, కథ నవల, బాల సాహిత్యం, సాహితీ విమర్శ, అనువాదాలు, నాటక ప్రక్రియలో రచనలు చేసి కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్రపై పరిశోధనాత్మక గ్రంథాన్ని అందించి సాహిత్య చరిత్రలో తన పత్య్రేకతను చాటుకుంటు తన పుట్టిన రోజు అయిన కార్తీక పున్నమి సందర్భంగా పత్రి పౌర్ణమి రోజు సాటి కవులు, సాహితీవేత్తలను సాదరంగా సత్కరించే కవి, రచయిత డా.మలయశ్రీ గురించి సాహితీవేత్తల మదిలోని భావాలు. ఏటా తన పుట్టినరోజున.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో 1940 సంవత్సరంలో కార్తీక పున్నమి రోజు జన్మించిన డా.మలయశ్రీ కరీంనగర్లోని రేకుర్తిలో స్థిరపడ్డారు. ఎంఏ(తెలుగు), ఎంఓఎల్, పీహెచ్డీ చదివిన ఆయన తెలుగు పండిత్ ఉపాధ్యాయునిగా, ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి విరమణ పొందారు. ఆయన రాసిన శాంతిపథం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపవాచకంగా ఉండేది. కరీంనగర్ వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. తన ఇద్దరు పిల్లలకు ఆదర్శ వివాహాలు చేశారు. ఏటా తన పుట్టినరోజు అయిన కార్తీక పున్నమి రోజు సాహితీవేత్తలను సత్కరించేవారు. 1960 నుంచి రచనలు ప్రారంభించి 4 భాషల్లో దాదాపు 136పైగా రచనలు చేసిన ఆయన అందుకోని అవా ర్డు, పొందని సత్కారం లేదంటే అతిశయోక్తి కాదు. అభ్యుదయవాదిగా, బౌద్ధేయవాదిగా నమ్మి న ఆశయాలు, సిద్ధాంతాలతో జీవితాన్ని చివరి వర కు సా గించిన ఆయన అనారోగ్యంతో శుక్రవారం కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సూచన మేరకు కు టుంబ సభ్యులు స్వగృహానికి తరలించగా శని వారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రచయితలు వేణుశ్రీ, సరిపల్లి కృష్ణారెడ్డి, బాలసాని రాజ య్య, కూకట్ల తిరుపతి, లక్ష్మణబోధి, గండ్ర లక్ష్మణ రావు, బూర్ల వెంకటేశ్వర్లు, రంగినేని మోహనరావు, జూకంటి జగన్నాథం, కలవకుంట్ల రామకృష్ణ, సబ్బని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మలయశ్రీకి సాహితీవేత్తల కన్నీటి నివాళి -
నా తొలి కవిత్వ పుస్తకాన్ని అందించాను
2007లో నా మొదటి కవిత్వ పుస్తకం వాకిలిని మలయశ్రీకి అందించాను. దాన్ని చదివిన తర్వాత ఆయన నాకు ఉత్తరం రాశారు. తెలంగాణ రచయితల వేదిక సభలలో, అనేక సమావేశాల్లో వారిని కలిసేవాళ్లం. వారి ఇంటికి వెళ్లి కలిసినప్పుడు వారు అనువాదం చేస్తున్న దమ్మపదం పద్యాలను చూపించారు. అనేకమార్లు భౌతికవాది పత్రికలను అందించారు. సాహిత్యంలో, జీవితంలోనూ నిర్మోహమాట భావ ప్రకటన, సూటిదనం ఉన్న వ్యక్తి. – బూర్ల వెంకటేశ్వర్లు, కవి, రచయిత, కరీంనగర్ విలక్షణ సాహితీవేత్త మలయశ్రీ బహు ప్రక్రియలలో రచనలు చేసి, బహు గ్రంథాలను వెలువరించిన అరుదైన, విలక్షణ సాహితీవేత్త. సామాజిక చైతన్యమే ధ్యేయంగా శాసీ్త్రయ దృక్పథంతో రచనలు చేసిన హేతువాది. తరతరాలుగా సమాజంలో నాటుకొని పోయిన మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలను తెగనాడుతూ రచనలు చేశారు. సమాజంలో సాహితీ కళారంగాల్లో ఆధిపత్య భావజాలాన్ని వ్యతిరేకించారు. మలయశ్రీ రచనలు మానవీయ సమాజాన్ని నిర్మాణం చేయడానికి దోహదం చేస్తాయి. – కూకట్ల తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ రచయితల వేదిక కచ్చితత్వం ఆయన జీవన విధానం మలయశ్రీ కరీంనగర్ జిల్లా సాహిత్య ప్రపంచంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన రాసింది కేవలం కవిత్వమే కాదు.. ఆయన చేసిన విస్తృత సాహిత్య ప్రయాణంలో కరీంనగర్ చరిత్ర, భాష, సాహిత్య చరిత్ర, సామాజిక చైతన్యం అన్నీ కలగలిసిపోయాయి. నిర్మోహమాటం, సూటిదనం, కచ్చితత్వం ఆయన జీవన విధానం. అధ్యాపకుడిగా, గురువుగా ఉన్నారు కానీ సాహిత్య రంగంలో గురుస్థానాన్ని ఆశించలేదు. – వారాల ఆనంద్, సాహితీవేత్త, కరీంనగర్ గొప్ప రచయిత మలయశ్రీ విశిష్టమైన రచయిత, నవలాకారుడు, కవి, అనువాదకుడు. తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన మహనీయుడు. శతాధిక గ్రంథకర్త జీవితమంతా సాహిత్యానికి ధారపోసిండు. బౌద్ధ తాత్వికత నాస్తిక హేతువాద ధృక్పథాన్ని జీవితంలో ఆచరించిన వ్యక్తి. ఆయనతో నాకు మూడు దశాబ్దాల అనుబంధం. ఆయన పేరున నెలకొల్పిన మలయశ్రీ అవార్డు 2006లో అందుకోవడం నాకు ఒక గొప్ప జ్ఞాపకం. – అన్నవరం దేవేందర్, కవి, రచయిత, రాష్ట్ర ప్రభుత్వ దాశరధి పురస్కార గ్రహీత -
మరణించి.. వెలుగులు నింపి
కోల్సిటీ(రామగుండం): వచ్చేనెలలో ఉద్యోగ విరమణ చేసే అతడొక సాధారణ వాచ్మన్.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా మరొకరి జీవితంలో వెలుగులు నింపాడు. మానవత్వానికి అద్దం పట్టే ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హృదయాలను కదిలించింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నైట్ వాచ్మన్ ఇందారపు రాయపోశం(60) కాకతీయ నగర్నివాసి. భార్య సమ్మక్క, ఇద్దరు కుమారులు ప్రశాంత్–పద్మ, కుమారస్వామి–జ్యోతి, కూతురు సత్యవతి–శ్రీనివాస్తోపాటు మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ప్రమాదం.. విషాదాంతం.. ఈనెల 10న రాత్రి విధులకు హాజరైన రాయపోశం.. తోటిఉద్యోగితో కలిసి గోదావరిఖని బస్టాండ్ సమీపంలో టీ తాగి తాగడానికి బైక్పై వెళ్తుండగా టీ జంక్షన్ వద్ద కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషాదంలోనూ మానవత్వం రాయపోశం చిన్నప్పుడే ఒకకంటి చూపు కోల్పోయాడు. అయినా విధి నిర్వహణలో ఆదర్శంగా నిలిచిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తి ఇచ్చింది. విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కకన్ను కూడా దానం చేసి మరొకరికి చూపునివ్వాలని అంగీకరించారు. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధుల సూచనతో, ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్నాయక్ సహకారంతో శనివారం కార్నియా సేకరించి హైదరాబాద్కు తరలించారు. నివాళి రాయపోశం పార్థివదేహానికి జీజీహెచ్ మార్చురీ వద్ద బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, కార్మిక సంఘాల ప్రతినిధులు నివాళి అర్పించారు. దహన సంస్కారాల కోసం మున్సిపల్ అధికారులు రూ.20 వేలు అందించారు. మేయర్ అభినందన విషాదంలోనూ మానవత్వాన్ని చాటిన రాయపోశం కుటుంబాన్ని మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, ఎసాబ్లిష్మ్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు అభినందించారు. ఆయన అకాల మరణంపై సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు. చనిపోయాక కూడా ఒంటికన్ను దానం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాచ్మన్ కుటుంబ సభ్యుల దాతృత్వం -
చోరీ కేసులో పాత నేరస్తుడి అరెస్టు
● బంగారం, వెండితోపాటు బైక్లు స్వాధీనం ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని వివిధ ఆలయాలు, ద్విచక్ర వాహనాలు, ఆరుబయట నిద్రిస్తున్న వారి వస్తువులు చోరీచేసిన ఘటనల్లో శానగొండ గ్రామానికి చెందిన పాత నేరస్తుడు గుంటి శ్రావణ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పోలీసు సిబ్బందితో కలిసి ఎస్సై శానగొండ గ్రామంలో శనివారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటుగా బైక్పై వచ్చిన వ్యక్తిని వాహన ధ్రువీకరణ పత్రాల గురించి ఆరా తీశారు. వివరాలు చెప్పకపోవడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తాను జీలకుంట, గుండ్లపల్లి, బాయమ్మపల్లె, పొత్కపల్లి ఆలయాల్లో చోరీలతోపాటు ద్విచక్రవాహనాలు అపహరించినట్లు ఒప్పుకున్నాడు. ఇతడు పాతనేరస్తుడని పోలీసులు వివరించారు. నిందితుడి నుంచి 5గ్రాముల బంగారం, 4 తులాల వెండి రింగులు, 10 తులాల రాముక్కలు, మూడు బైక్లు స్వాధీనం చేసుకొన్నారు. ఈమేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై వివరించారు. -
బంగారం, వెండి పోగులతో చీర
సిరిసిల్ల: సిరిసిల్ల నేతకళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతాన్ని మగ్గంపై ఆవిష్కరించారు. రెండు గ్రాముల బంగారం, వెండి పోగులతో చీరను నేశారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు.. రెండు గ్రాముల బంగారం, మరో రెండు గ్రాముల వెండిని ఉపయోగించి బంగారు, వెండి పోగులతో ఆకర్షణీయమైన చీరను రూపొందించారు. సుమారు 25 రోజులపాటు శ్రమించి, ఐదున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో తీర్చిదిద్దారు. బంగారు, వెండి పోగు తీగలతో నేసిన ఈ చీరను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు హైదరాబాద్లో శనివారం ఆవిష్కరించారు. రూ.85వేల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ చీర మంత్రముగ్ధులను చేస్తోందని, సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందుతోందని కేటీఆర్ అభినందించారు. అగ్గిపెట్టెలో ఇమిడేచీరను నేసి ప్రపంచానికి సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు తనయుడే నల్ల విజయ్. తండ్రి చేనేత వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని కళాకండాలను ఆవిష్కరిస్తున్నారు. తాను నేసిన బంగారం, వెండిపోగుల చీరను కేటీఆర్ ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని నల్ల విజయ్ అన్నారు. భవిష్యత్లోనూ మరిన్ని వినూత్న ప్రయోగాలు చేస్తానని స్పష్టం చేశారు. సిరిసిల్ల నేతకళాకారుడి అద్భుత సృష్టి అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
భరోసా కల్పించాలి
పిల్లల ఫలితాల కంటే వారి ఆరోగ్యం, ఆనందమే ముఖ్యమని తల్లిదండ్రులు భావించాలి. వారు ఎంత కష్టపడ్డారో గుర్తించాలి. ఫలితాలు ఎలా వచ్చినా మేము అండగా ఉంటామన్న భరోసాను కల్పించాలి. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ప్రేమ, నమ్మకం ఇవ్వడం చాలా అవసరం. – కె.సత్యనారాయణ, పేరెంట్ పరీక్షలు ఒక భాగం మాత్రమే పరీక్షలు చదువులో ఒక భాగం మాత్రమేనని విద్యార్థులు గ్రహించాలి. మార్కులు తక్కువ వచ్చినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. లోపాలను గుర్తించి మళ్లీ ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఉపాధ్యాయులు ఎప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటారు. కష్టపడితే విజయం తప్పక దక్కుతుంది. – ఎ.నిర్మల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, కరీంనగర్ -
వేజ్బోర్డు ఏర్పాటు చేయాలి
గోదావరిఖని: బొగ్గు గని కార్మికులకు 12వ వేజ్బో ర్డు కోసం జేబీసీసీఐ ఏర్పాటు చేయాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎంఎస్ 113వ వర్కింగ్ కమిటీ సమావేశం ఈనెల 9, 10వ తేదీల్లో ఒడిశాలోని తాల్చేర్ అంగుల్ ప్రాంతంలో నిర్వహించినట్లు తెలిపారు. కోల్ ఇండియా, సింగరే ణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలు అ మలు చేస్తున్నాయని, వీటిని ఉపసంహరించుకోవాలని సభ డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. అధికారుల వేతన సవరణను నిబంధనలకు విరుద్ధంగా ముందుగానే అమలు చేయడానికి యత్నించారని, కార్మికుల విషయంలో నోటిఫికేషన్ విడుదల చేయ కపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. నా యకులు యతిపతి సారంగపాణి, మాదాసి రవీంద ర్, ఆకుల హరిణ్, తాట్ల లక్ష్మయ్య, ఎల్లావుల కోట య్య, తుమ్మ గట్టయ్య, పుప్పాల నాగేంద్రప్రసాద్, సురేశ్, సమ్మయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్లో ఫెయిలైనా.. ఐఏఎస్
శంకరపట్నం: సక్సెస్కు మార్కులే కొలమానం కాదని నిరూపించారు ప్రస్తుత హైదరాబాద్ మెట్రోవాటర్బోర్డు ఎండీ కోరెం అశోక్రెడ్డి. ఇంటర్ ఫెయిలైన అశోక్రెడ్డి.. తర్వాత పట్టవదలని విక్రమార్కుడిలా పుస్తకాలతో కుస్తీ పట్టి గ్రూప్–1 సాధించారు. ప్రస్తుత కన్ఫార్మ్డ్ ఐఏఎస్ అధికారి హోదాలో సేవలందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్రెడ్డి మొలంగూర్ జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. హుజూరాబాద్ జూనియర్ కాలేజీ ఇంటర్ చదివారు. సెకండియర్లో ఫెయిల్ అయినా సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యారు. జమ్మికుంటలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపికయ్యారు. సీ్త్రశిశుసంక్షేమశాఖ పీడీగా ఉద్యోగంలో చేరి, కన్ఫార్మ్డ్ ఐఏఎస్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్కులు, ర్యాంకులు కొలమానం కాదని పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని అశోక్రెడ్డి అంటున్నారు. -
టార్గెట్ 65 మిలియన్ టన్నులు
గోదావరిఖని: బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై సింగరేణి యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఏటా ఉత్పత్తి పెంచుతూ వస్తున్న బొగ్గు గనుల సంస్థ.. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించింది. గత ఆర్థిక సంవ త్సరంలో 72 మిలియన్ టన్నులు లక్ష్యంగా నిర్దేశించింది. కానీ, 60 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది. బొగ్గు గ్రేడ్పై వినియోగదారులు ఆసక్తి చూపకపోవడంతో రెండు ఏరియాల్లో ఉత్పతి భారీగా తగ్గించింది. దీని ప్రభావం మొత్తం సింగరేణిపై పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆనవాయితీకి భిన్నంగా.. వాస్తవానికి ప్రతీ ఆర్థిక సంవత్సరంలో మార్చి 15వ తేదీ నాటికి వచ్చే ఆర్థిక ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఖరారు చేయడం ఆనవాయితీ. ఈసారి ఇందుకు భిన్నంగా ఏప్పిల్ 10వ తేదీ తర్వాత టార్గెట్ ప్రకటించడం గమనార్హం. అయితే, గత లోటును పూడ్చడంతోపాటు కచ్చిమైన లక్ష్యంతో ముందుకు సాగాలనే ఆలోచనతో సింగరేణి ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం, మణుగూరులో తగ్గిన టార్గెట్ సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 12 ఏరియాల వారీగా కేటాయించింది. గతేడాదితో పోల్చి తే కొత్తగూడెం, మణుగూరులో ఉత్పత్తి బాగా తగ్గించింది. కొత్తగూడెంలో 156.50లక్షల టన్నులు కేటాయించగా ఈసారి 22.50లక్షల టన్నులకే పరిమితం చేసింది. మణుగూరులో గతేడాది 114.90లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనేది లక్ష్యంగా నిర్దేశించగా.. ఈసారి 96.26లక్షల టన్నులకు కుదించారు. జీ–14, 15 గ్రేడ్ రకం బొగ్గు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో సింగరేణి యాజమాన్యం ఈనిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నెల ఆలస్యంగా వార్షిక లక్ష్యం 2026–27 ఆర్థిక సంవత్సరంలో నెల ఆలస్యంగా సింగరేణి వార్షిక లక్ష్యం ఖరారు చేసింది. వాస్తవానికి ఏటా మార్చి మధ్యలోనే వార్షిక లక్ష్యం ప్రకటించడం ఆనవాయితీ. టార్గెట్ కమిటీలు ఏరియాల వారీగా పర్యటించి వార్షిక లక్ష్యాన్ని ఖరారు చే స్తాయి. ఈ బృందాల పర్యటన ఈసారి సకాలంలో పూర్తయినా.. యాజమాన్యం జాప్యం చేసింది. కలగా వంద మిలియన్ టన్నులు? భవిష్యత్లో వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తామని సింగరేణి యాజమాన్యం గతంలో అనేకసార్లు ప్రకటించింది. కొత్తగనులు ప్రారంభించి వార్షిక లక్ష్యం పెంచుకుంటూ పోతామని చెప్పింది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేవిత లక్ష్యం చూస్తే సంస్థ తిరోగమన దిశలో ముందుకు సాగుతోందని అంటున్నారు. -
శ్లోకాల పఠనంలో ప్రతిభ
కాల్వశ్రీరాంపూర్: గణపతి సచ్చితానంద మైసూర్ దత్త పీఠం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టా ల్లో ఇటీవల నిర్వహించిన భగవత్ గీత ఆన్లైన్ శ్లో కాల పోటీల్లో కోలేటి రమాదేవి గోల్డ్ మెడల్ సాధించారు. 700 శ్లోకాలు కంఠస్థం చేసిన రమాదేవి అలవోకగా ఆన్లైన్లో పఠించి పురస్కారానికి ఎంపికయ్యారు. శ్రీలలితా పారాయణం గ్రూపు మహిళలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు కోలేటి రమాదేవి–రామయ్య దంపతులను శనివారం మండల కేంద్రంలో శాలువాలు కప్పి సన్మానించారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు రాఘవులు, అశోక్, మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి, లలితా పారాయణం గ్రూపు మహి ళలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. -
అపరిచితుల సమాచారం ఇవ్వండి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో అపరిచితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వాలని ఏసీపీ కృష్ణ కోరారు. పట్టణంలోని సాగర్ రోడ్డు(మినీ ట్యాంకు బండ్ ఏరియా)లో శనివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఏసీపీతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్ సీఐలు ప్రవీణ్కుమార్, సుబ్బారావు, పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఆధారాల్లేని 70 బైక్లు, నాలుగు ఆటోలు, ఒక ట్రాలీ, సమీపంలోని బెల్ట్ దుకాణాల్లో మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని ఏసీపీ హెచ్చరించారు. పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చి కిరాయికి ఉండే వారిగుర్తింపు వివరాలను ఇంటి యజమానులు తీసుకోవాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు వాహనదారులు రోడ్సేఫ్టీ నిబంధనలను పాటించాలని ఏసీపీ అన్నారు. -
పదో తరగతి విద్యార్థులు
మార్కులు..ర్యాంకులే చదువుకు కొలమానం అనుకుంటున్న నేటితరం విద్యార్థులు ఒక్కక్షణం ఆగండి.. వీరి విజయగాథలు చదవండి. పదో తరగతిలో ఫెయిలైన వారు.. ఇంటర్లో అత్తెసరు మార్కులతో పాసైన వారు.. డిగ్రీ కూడా చదవని వారు.. అద్భుతాలు సృష్టించారు. వారు వేసిన మార్గంలోనే నేడు డిగ్రీ.. బీటెక్.. ఎంటెక్ విద్యార్థులు ముందుకెళ్తున్నారు. డిగ్రీ పూర్తి చేయని బిల్గేట్స్.. బోర్డు ఎగ్జామ్ రాయని సచిన్ టెండూల్కర్.. ఆటోడ్రైవర్గా జీవితాన్ని ఆరంభించిన సత్యశంకర్ విజయాలే మనకు మార్గంకావాలి. అంతెందుకు మన జిల్లా వాసి.. కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్రెడ్డి ఇంటర్ ఫెయిలయ్యానని కుంగిపోయి ఉంటే ఈరోజు ఐఏఎస్ అయ్యేవారే కాదు.. అందుకే ఒక్క క్షణం ఆలోచించండి.. పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని.. ఇంటర్ ఫెయిల్ అయ్యామని కుంగిపోకండి. దీని తర్వాత జీవితం చాలా ఉంది. ధైర్యంతో ముందుకెళ్తే మీలో నుంచే ఓ బిల్గేట్స్.. సత్యశంకర్.. మనోజ్కుమార్శర్మ.. కోరెం అశోక్రెడ్డి వారసులు రావచ్చు. ఇంటర్ ఫలితాలు ఎలా ఉన్నా.. ధైర్యంగా ముందుకెళ్దాం.. – సప్తగిరికాలనీ(కరీంనగర్) – వివరాలు 8లో...36,4268,10618,2514,06018,175కరీంనగర్రాజన్నసిరిసిల్ల‘మనోజ్కుమార్శర్మ.. మధ్యప్రదేశ్లోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. కానీ నిరాశ చెందలేదు. ఐపీఎస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర పోలీస్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో పనిచేస్తున్నారు.’‘సత్యశంకర్.. ఓ పానీయం ఉత్పత్తి చేసే బిందు కంపెనీ యజమాని. ఆయన ఇంటర్ వరకు చదువుకుని ఆటో డ్రైవర్గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఇప్పుడు రూ.800 కోట్ల వ్యాపారానికి యజమాని అయ్యారు. ఆయనే వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.’ -
పూలే ఆశయాలు సాధించాలి
పెద్దపల్లి: సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూ లే ఆశయాలు, ఆలోచనలను అదరూ ఆచరించాల ని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా వెనుకబ డిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివా రం కలెక్టరేట్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణు తో కలిసి కలెక్టర్.. జ్యోతిబా పూలే చిత్రపటానికి పూ లమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం క లెక్టర్ మాట్లాడుతూ, సమాజంలోని అసమానతల ను తొలగించడంలో పూలే చేసిన సేవలు అమోఘమన్నారు. సామాజిక సమానత్వం కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని అన్నారు. అంతకుముందు పెద్దపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్, జిల్లా వైద్యాధికారి ప్రమోద్కుమార్, బీసీ సంఘాల నాయకులు సారయ్యగౌడ్, దాసరి ఉష, ఆకుల స్వామి వివేక్ పటేల్, శంకర్, కొండి సతీశ్, శ్రీమాన్, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ బాపయ్య తదితరులు పాల్గొన్నారు. హౌస్లిస్టింగ్లో కచ్చితత్వం జనగనణలో భాగంగా చేపట్టిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ ల వివరాలు కచ్చితత్వంతో, సమగ్రంగా పూర్తి చే యాలన కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, సుల్తానాబాద్ పురపాలక సంఘంలో చేపట్టిన జనగణన ప్రక్రియను శనివారం కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చే శారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్ల ఫిజికల్ వెరిఫికేషన్ను తప్పనిసరి నిర్వహించాలన్నారు. ల్యాండ్మార్క్లు, పాఠశాలలు, దేవాలయాలు, కార్యాలయాలు తదితర గుర్తులను బ్లాక్ వారీగా స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. పెద్దపల్లి డిప్యూటీ తహసీల్దార్ విజయ్, అధికారులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలతో ముప్పు
కోల్సిటీ(రామగుండం): యువత మత్తుపదార్థాల కు దూరంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో ఏర్పాటు చేసిన ‘అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ’ కేంద్రాన్ని గోదావరిఖని ఏసీపీ రమేశ్తో కలిసి డీసీపీ శనివారం ప్రారంభించారు. సిమ్స్ విద్యార్థులకు మ త్తు పదార్థాల వినియోగం, నష్టాలపై నిర్వహించిన ఆర్ట్స్, క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన మెడికో లకు డీసీపీ సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగా న్ని అరికట్టడంతోపాటు వ్యసన బాధితులకు స మగ్ర వైద్య సేవలు అందించేందుకే జీజీహెచ్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగం సమాజానికి ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశా రు. అలాంటి వ్యసనాల నుంచి బయటపడేందుకు ఇలాంటి చికిత్స కేంద్రాలు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ మాట్లాడుతూ, డ్రగ్ అడిక్షన్ కౌన్సెలింగ్ సెంటర్, సబ్స్టాన్స్ ఇంటాక్సికేషన్ కేర్ యూ నిట్తోపాటు ఔషధ చికిత్స, పునరావాస సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయన్నారు. ఆర్ఎంవోలు కృపాభాయి, దండె రాజు, సైకియాట్రిస్ట్ రవివర్మ మాట్లాడుతూ, వ్యసనాలతో శారీరక, మా నసిక సమస్యలు తీవ్రంగా ప్రభావితం అవుతాయన్నారు. సమయానికి సరైన చికిత్స తీసుకుంటే బాధితులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, మెడికల్ విద్యార్థులు, నర్సింగ్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
ధర్మారం: కటికెనపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయ కులు, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు ఇద్ద రు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సర్పంచ్ చేపూరి లచ్చయ్య ఆధ్వర్యంలో శనివారం ధర్మపురిలోని మంత్రి క్యాంపు కా ర్యాయలంలో మంత్రి లక్ష్మణ్కుమార్ను వార్డు సభ్యులు అనపురం వెంకటేశ్, మల్లెత్తుల రవి, వారి అనుచరులు కాంగ్రెస్లో చేరారు. మంత్రి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉపసర్పంచ్ బోనగిరి అజయ్, మా జీ ఉపసర్పంచ్ గంగారెడ్డి పాల్గొన్నారు. నేడు పెద్దపల్లికి కేటీఆర్ పెద్దపల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ ఆదివారం జిల్లా కేంద్రానికి వస్తారని మా జీఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్తూ మార్గమధ్యంలోని పెద్దపల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేస్తారన్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడతారని ఆయన పేర్కొన్నారు. బస్టాండే టీకా కేంద్రం కమాన్పూర్: స్థానిక బాపూజీనగర్లో చిన్నారులకు వ్యాక్సిన్ వేయడానికి అరోగ్య ఉప కేంద్రం లేదు. దీంతో వైద్యసిబ్బంది రోడ్డు పక్కన ఉన్న బస్టాండ్లో చిన్నారులకు టీకా వేశారు. అంగన్వాడీ కేంద్రం కూడా అందుబాటులోలేదు. దీంతో చిన్నారులకు వ్యాక్సిన్, ప్రజలకు వైద్యసేవలు అందించడానికి ఇబ్బంది పడుతున్నా మని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. సివిల్స్ సాధించడమే లక్ష్యం పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో కేబుల్ ఆపరేటర్గా పనిచేసే లైసెట్టి భిక్షపతి – అనిత దంపతుల కుమారుడు లైసెట్టి అఖిల్కృష్ణ స్టాఫ్ సె లక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించిన పరీక్ష లో ప్రతిభ కనబర్చి(390కు 333 మార్కులు) క స్టమ్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించారు. ప్రాథమిక విద్య పెద్దపల్లి, ఇంటర్ హైదరాబాద్, ఇంజినీరింగ్ చెన్సైలో పూర్తిచేసిన అఖిల్.. ప్రస్తు తం ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు ఇ చ్చిన ప్రోత్సాహంతో తాను ముందుకు సాగానని, కోచింగ్కు వెళ్లకుండానే కష్టపడి చదివానని అన్నారు. సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. పలువురు అభినందించారు. చెరువు అభివృద్ధికి నిధులుపెద్దపల్లి: సుల్తానాబాద్లోని ఊరచెరువును మి నీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసేందుకు ప్ర భుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో జీవో నంబర్ 170 ద్వారా రూ.8 కోట్ల 77 లక్షల 50 వేలు మంజూరు చేస్తూ సర్కారు శనివారం ఉత్తర్వు లు జారీచేసింది. నిధులు మంజూరు చేసిన సీ ఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్రె డ్డి, శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావు చిత్రపటాలకు నాయకులు క్షీరాభిషేకం చేశారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, పట్టణ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ ఇంటర్న్షిప్ రామగుండం: అంతర్గాం మండలం లింగాపూ ర్ మోడల్ స్కూల్ ఒకేషనల్ విద్యార్థులు స మ్మర్ ఇంటర్న్షిప్ విజయవంతంగా పూర్తిచేశా రని ప్రిన్సిపాల్ పంబాల సదానందం తెలిపా రు. 10రోజులు ఇంటర్న్షిప్ జరిగిందన్నారు. -
● సాదాబైనామాలకు ఎట్టకేలకు మోక్షం ● అమ్మకందారు అఫిడవిట్ ఎత్తివేత ● జిల్లావ్యాప్తంగా 35,323 అర్జీలు
సాక్షి పెద్దపల్లి: తెల్లకాగితంపై ఒప్పందం చేసుకొ ని(సాదాబైనామా) భూములు కొనుగోలు చేసిన వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభు త్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లాలో దాదాపు 70 నుంచి 90శాతం వరకు చిన్న, సన్నకారు రైతులు తాము సాగు చేస్తున్న భూములు త మవే అయినా వాటి స్వరూపం, క్రమబద్ధీకరణకాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు, బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారు. రైతుబంధు సాయం, రైతుబీమా వర్తించడంలేదు. ధాన్యం కొనుగోలు సందర్భంలోనూ ఇబ్బందులు తప్పడంలేదు. భూవివాదాలకు ప్రధాన కారణమిదే.. సుమారు నాలుగైదు దశాబ్దాల క్రితం వ్యవసాయ భూములు, ఇళ్లస్థలాల క్రయ, విక్రయాలు తెల్లకాగితాలపైనే జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు స్టాంపు పేపర్లపై ఒప్పందాలు రాసుకునేవారు. తమ పూర్వీ కులు ఇతరులకు భూముల విక్రయించినట్లు చిన్నకాగితం ఉన్నా వారి వారసులు ఆ భూముల జోలికి వెళ్లేవారు కారు. ఆ పరిస్థితులు ఇప్పుడు మారిపో యాయి. భూముల ధరలు పెరగడంతో రియల్ వ్యాపారం జోరందుకుంది. దీంతో రికార్డుల్లో తమ పేర్లు ఉన్నాయంటూ కొందరు వారసులు తిరగబడుతున్నారు. ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు వచ్చి ఆ భూములు తమవి అంటే ఎ లా అని బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలా వివాదాలు ప్రారంభమవుతున్నాయి. అనేకమంది రైతులు నిత్యం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తాజా నిబంధనల ప్రకారం.. తాజా నిబంధనలో కొనుగోలుదారు ఒకరే అఫిడవిట్ సమర్పిస్తే సరిపోతుంది. ఆ తర్వాత అర్జీలోని వివరాల ప్రకారం.. దరఖాస్తుదారు మోఖాపై ఉ న్నారా? లేరా? అని తహసీల్దార్ విచారణ చేస్తారు. సర్కారు, అసైన్డ్, అటవీ, పట్టాభూమి, విస్తీర్ణం తదితర వివరాలను పరిశీలించి పంచనామా చేస్తారు. నివేదికను ఆన్లైన్లో ఆర్డీవోకు పంపిస్తే ఆయన తిరస్కరించడమో, లేక ఆమోదించడమో చేస్తారు. దరఖాస్తును భూభారతి పోర్టల్లో నమోదు చేసి 30 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ కోసం గడవు ఇస్తారు. గడువులోగా ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఆ భూమికి హక్కుల నమోదు ప్రక్రియను నిలిపివేస్తారు. దరఖాస్తుదారు సమర్పించే అఫిడివిట్లో సమాచారం తప్పుగా తేలితే చెల్లించిన ఫీజులు, స్టాంపు డ్యూటీ జప్తు చేయడంతోపాటు, క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. దీంతో ఆరేళ్లుగా హక్కులు లేక సాగులోనే ఉన్న రైతులకు భూయజమాన్య హక్కులు పొంది పట్టాలు పొందేందుకు వీలు కలుగనుంది. సాదాబైనామా దరఖాస్తులు మండలం దరఖాస్తులు సర్వే నంబరు అంతర్గాం 903 1075 ధర్మారం 2,294 2685 ఎలిగేడు 1,215 1471 జూలపల్లి 1,220 1408 ఓదెల 3,557 4334 పాలకుర్తి 1,385 1523 పెద్దపల్లి 5,939 6822 రామగుండం 412 478 కాల్వశ్రీరాంపూర్ 5,670 6461 సుల్తానాబాద్ 3,556 4107 కమాన్పూర్ 532 655 మంథని 4,563 5211 ముత్తారం 2,834 3194 రామగిరి 1,243 1431 30 రోజుల్లో అభ్యంతరాలు లేకపోతే.. నాదాబైనామా నిబంధనల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలోని 6(3) నిబంధన ప్రకారం.. భూహక్కుల కోసం దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తుదారుతోపాటు భూమి విక్రయించిన వ్యక్తి సైతం అఫిడవిట్ సమర్పించాల్సి ఉండేది. దీంతో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురై సమస్యలు అలాగే ఉండిపోయాయి. -
ఓసీపీ–1లో సినిమా షూటింగ్
గోదావరిఖని: ఓసీపీ–1లో శుక్రవారం కోల్గోల్డ్ సి నిమా షూటింగ్ జరిగింది. సంయుక్త మీనన్ హీరోయిన్గా ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు. ఓసీపీ–2లో, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్నగర్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ చేశారు. హామీలు నెరవేర్చాలి పెద్దపల్లి: ఆర్టిజన్ల సమ్మైపె ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఆర్టిజన్ కార్మికుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ తూళ్ల నాగరాజు అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికులను చర్చలకు పిలిచి, హామీలు నేరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ కో కన్వీనర్ ఇ.ప్రసాద్, పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఎస్డీ కలీమొద్దీన్, ఎన్.సతీశ్రావు, ఎస్.రవి, ఎస్.నర్సింగం, సింగమల్ల తదితరులు పాల్గొన్నారు. -
13 నుంచి మొబైల్ఫోన్ల పంపిణీ
పెద్దపల్లి: జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు ఈనెల 13 నుంచి మొబైల్ఫోన్లు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే ఫోన్లు జిల్లా కేంద్ర కార్యాలయానికి చేరాయి. గత ప్రభుత్వం 3–జీ మొబైల్ఫోన్లను పంపిణీ చేసింది. అవి ఇప్పు డు పనిచేయక ఇబ్బంది పడుతున్నారు. ఈమేరకు 5జీ, ఎయిర్ఫోన్స్, డాటా కేబుల్, పౌచ్, సిమ్ కా ర్డులు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 706 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, టీచర్లు 706 మంది ఉండాలి. ఇందులో కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఈ విషయంపై జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్రావు మాట్లాడుతూ, అంగన్ వాడీ టీచర్లకు ఈనెల 13న మొబైల్ఫోన్లు పంపిణీ చేస్తామన్నారు. 17, 18వ తేదీల్లో మహాసభలు పెద్దపల్లి : వరంగల్లో ఈనెల 17, 18వ తేదీల్లో దళిత హక్కుల పోరాట సమితి రెండో మహాసభలు నిర్వహిస్తామని సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్ అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం ఆయన మహాసభ ప్రచార పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడా రు. సభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నాయకులు పేరుక లక్ష్మణ్, పేరుక సతీశ్, క్యాదాసి రాజు, మోల్గూరి కల్యాణ్, ఇంజపురి దేవదాస్, కల్వల మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
చలివేంద్రాలు ఏర్పాటు చేయండి
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని బల్దియా కమిషనర్ అరుణశ్రీ కోరారు. వార్డు అధికారులతో శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు, వివిధ అసోసియేషన్ల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలన్నారు. ఎవరూ ముందుకు రానిచోట బల్దియా ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేద్దామని అన్నారు. ఆస్తిపన్నుపై రాయితీ.. ఈనెల 30వ తేదీలోగా చెల్లించిన వారికి ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీపై ప్రచారం కల్పించాలని అరుణశ్రీ అన్నారు. మొక్కలు నాటడానికి అనువైన ప్రాంతాల జాబితా ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించిఉన్న వారిని ఎల్ –2 నుంచి ఎల్ –1 కేటగిరీలో చేర్చాలని అన్నారు. జనగణన హెచ్ఎల్బీ పూర్తి చేయాలని కోరారు. అమృతం యాప్లో నల్లా కనెక్షన్ వివరాలు అప్లోడ్ చే యాలని చెప్పారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వా మి, ఎస్ఈ గురువీర, ఈఈ రామన్, అసిస్టెంట్ క మిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి పాల్గొన్నారు. -
● మంత్రి అడ్లూరికి శాతవాహన విద్యార్థుల ఫిర్యాదు ● విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణాకు ఫోన్ ● మొత్తం వివాదంపై విచారణ చేపట్టాలని కోరిన మంత్రి ● ఘటనపై పోలీసులకు ప్రొఫెసర్ సుజాత ఫిర్యాదు ● అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కంప్లైంట్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ వివాదం రోజురోజుకు ముదిరి పతాకస్థాయికి చేరుకుంది. ఇంతకాలం కరీంనగర్కే పరిమితమైన ఈ వ్యవహారం తాజాగా రాజధానికి చేరుకుంది. తమను అర్బన్ నక్సలైట్లంటూ వేధిస్తున్నారంటూ ఎస్సీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కి శాతవాహన విద్యార్థులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం శాతవాహన యూనివర్సిటీ జాక్ విద్యార్థులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ధర్మారంలో కలిశారు. అక్కడ వీసీ ఉమేశ్ కుమార్, బాటనీ పార్ట్టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్ తమను అర్బన్ నక్సలైట్లంటూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లక్ష్మణ్ అక్కడ నుంచే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణాకు ఫోన్ చేశారు. అసలు యూనివర్సిటీలో ఏం జరగుతుందో? తెలుసుకోవాలని కోరారు. వెంటనే ఈ వ్యవహారంలో నిజనిజాలు నిర్ధారించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. దీనికి యోగితా రాణా సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.‘శాతవాహన యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను అర్బన్ నక్సలైట్లంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ప్రొఫెసర్ సుజాత, ఇతర దళిత విద్యార్థులకు ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుంది. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు త్వరలోనే ఎమ్మార్పీఎస్ పక్షాన ఉద్యమిస్తాం’ అని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ, ఉపాధ్యక్షుడు కనకం అంజిబాబు, సీనియర్ నాయకుడు పొత్తూరి రాజన్న, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చెంచాల నవీన్ మాదిగ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వీసీ ఉమేశ్కుమార్ తనను వ్యక్తిగతంగా వేధిస్తుండగా.. బాటనీ విభాగం పార్ట్టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్ తనను అర్బన్ నక్సలైటంటూ ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజరీ మెంబర్, సోషియాలజీ విభాగాధిపతి డాక్టర్ సూరేపల్లి సుజాత కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో వారిపై వేసిన విచారణ కమిటీ రిపోర్టు కాపీలను కూడా పోలీసులను అందజేశారు. దీంతోపాటు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ వాట్సప్ గ్రూపుల్లో శాతవాహన వర్సిటీలో తనను అర్బన్ నక్సలైట్గా చిత్రీకరిస్తూ.. చేసిన పోస్టుల స్క్రీన్షాట్లు, వారి ఫోన్ నంబర్లు ఫిర్యాదుకు జతచేశారు. కొన్నిరోజులుగా దళిత మహిళా ప్రొఫెసర్నైన తనను అసభ్యపదజాలంతో సోషల్ మీడియాలో వేధిస్తోన్న వారిపైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె ఫిర్యాదులో కోరారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారం జరుగుతున్న తీరు, సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధంపై ఇంటెలిజెన్స్ పోలీసులు వివరాలు సేకరించి నివేదిక ఇచ్చారు. -
ఖాళీ చేయించారు సరే..
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలో జిల్లా గ్రంథాలయానికి ఆధునిక హంగులు జోడించి కొత్త భవనం నిర్మించేందుకు పాలకులు చర్యలు చేపట్టారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఆవరణలోని ప్రభుత్వ భవనంలోనే ఇప్పటివరకు జిల్లా గ్రంథాలయం కొనసాగింది. అదేస్థలంలో రూ.6కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో సొంత భవనం నిర్మించేందుకు పాలకులు, అధికారులు సన్నద్ధమవుతున్నారు. పాత భవనం కూల్చివేత.. అద్దె భవనంలో లైబ్రరీ.. కొత్త భవన నిర్మాణం కోసం జిల్లా గ్రంథాలయాన్ని శాంతినగర్ ప్రాంతంలోని ఓ అద్దెభవనంలోకి ఇటీవల మార్చారు. కింది భవనంలో జిల్లా గ్రంథాల య సంస్థ కార్యాలయం ఉండగా, పైఅంతస్తులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజ న్లు మెట్లు ఎక్కి పైకివెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పాఠకులకు సౌకర్యంగా ఉండేల గ్రంథాలయసంస్థ పాలకమండలి, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని పాఠకులు కోరుతున్నారు. కూలనున్న భవనం ఇదే.. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని ఆనుకుని ఉన్న భవనాన్ని కూల్చి అదేస్థలంలో రూ.6 కోట్ల వ్యయంతో బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గ్రంథాలయ సంస్థ అధికారులు తెలిపారు. ఈ భవనంలో మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో డిజిటల్ లైబ్రరీ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. పోటీపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అనుకూలంగా అన్ని వసతులు కల్పించేలా దృష్టి సారిస్తామని జిల్లా గ్రంధాలయసంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ తెలిపారు. వీలైనంత త్వరలోనే భవన నిర్మాణం ప్రారంభిస్తామని ఆయన వివరించారు. శాంతినగర్లోని అద్దెభవనంలో జిల్లా గ్రంథాలయంకొత్త భవన నిర్మాణం కోసం కూల్చివేసే పాత భవనం -
అదనపు జిల్లా జడ్జిగా లావణ్య
గోదావరి టౌన్: గో దావరిఖని అదనపు జి ల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. హన్మకొండ లేబ ర్ కోర్టుకు బదిలీ చేయగా ఆయన స్థానంలో సంగారెడ్డి నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి లావణ్యను నియమించారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 35 మంది జిల్లా న్యాయమూర్తులను హైకోర్టు రిజిస్ట్రార్ బదిలీ చేశారు. క్యూఆర్ కోడ్తో దరఖాస్తు జ్యోతినగర్: రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు ప రిధిలోని నిరుద్యోగ యువత పోటీపరీక్షల శిక్షణకు క్యూ ఆర్ కోడ్ తో దరఖాస్తు చేసుకోవాలని సీఎస్సార్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ప్రభావిత, పునరావాస ప్రాంతాలకు చెందిన యువత కోసం దీప్తి మహిళా సమితి సహకారంతో ఆర్నెల్లపాటు ఉచితంగా కోచింగ్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సౌకర్యాలు కల్పించాలి ఓదెల: పనిప్రదేశాల్లో కూలీలకు సౌకర్యాలు క ల్పించాలని డీఆర్డీవో కాళిందిని సూచించారు. కొలనూర్లో చేపట్టిన పంట కాలువ పనులను డీఆర్డీవో శుక్రవారం పరిశీలించారు. ఆమె మా ట్లాడుతూ, పనిప్రదేశాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడకోసం టెంట్, దప్పిక తీర్చడం కోసం మంచినీటి వసతి కల్పించాలన్నారు. ఎంపీడీవో అనిల్రెడ్డి, కార్యదర్శి శంకర్, టెక్నికల్ అసిస్టెంట్ జనార్దన్, మేట్ స్పప్న పాల్గొన్నారు. భద్రత ప్రమాణాలు పాటించాలి గోదావరిఖని: విద్యుత్ సరఫరాలో అత్యున్నత భద్రత ప్రమాణాలు పాటించి ప్రమాదాలను నివారించాలని డీడీఎంఎస్(ఎలక్ట్రికల్) కమలేశ్చౌదరి సూచించారు. సింగరేణి ఆర్జీ–వన్ ఏరి యాలోని గనుల్లో విద్యుత్ భద్రత, హైటెన్షన్ విద్యుత్ సరఫరా, సబ్స్టేషనన్ల నిర్వహణపై శు క్రవారం సదస్సు నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోచించాలని అన్నా రు. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం అప్రమ త్తంగా ఉండడం ద్వారానే ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ఏరియా ఇంజినీర్ రాంమోహనరావు, టీటీసీ మేనేజర్ అశోక్రావు, ప్రాజెక్ట్ ఇంజినీర్లు, డీజీఎంలు, గనుల గ్రూప్, పిట్ ఇంజినీర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు, ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. మట్టి తరలింపు అడ్డగింత పెద్దపల్లిరూరల్: పాలితంలో శుక్రవారం మట్టి తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నా రు. తమ గ్రామశివారు నుంచి అక్రమంగా మ ట్టి తరలించుకుపోతున్నారని ఆరోపిస్తూ మ హిళలతో సహా గ్రామస్తులు అడ్డుకున్నారు. స మచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘట నా స్థలికి చేరుకుని సమస్యపై ఆరా తీశారు. మట్టి తరలింపునకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని, వేబిల్లులను చూపించినా గ్రామస్తులు ససేమిరా అన్నారు. నిబంధనల మేరకు తరలించుకుపోతున్నా అడ్డుకోవడం సరికాదని పోలీసులు గ్రామస్తులను సముదాయించారు. అధికారులతో చర్చించి వాస్తవాలు తెలుసుకో వాలని సూచించి ఆందోళన విరమింపజేశారు. ప్రశ్నించే గొంతుకగా టీఎన్జీవోపెద్దపల్లి: ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా మారాలని, ఇందులో టీఎన్జీఓ నా యకత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ అన్నారు. ప్రభు త్వ ఉద్యోగులకు శుక్రవారం చేపట్టిన సభ్యత్వ నమోదు సందర్భంగా మాట్లాడారు. ప్రతిని ధులు కొమురయ్య, అయిరెడ్డి సందీప్రెడ్డి, ప్రవీణ్, ప్రేమ్సాగర్, పురుషోత్తంరెడ్డి, వెంకటేశం, హరీశ్, సంగీత, మోహన్, వెంకటహన్మంతు, శంకర్, అనిత, రాకేశ్, రమేశ్, సౌమ్య, సాధిక్, జహీర్ తదితరులు పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,968 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ. 7,968 ధర పలికింది. కనిష్టంగా రూ.6,161, సగటు రూ.7,658గా ధర నమోదైంది. -
పుష్కరఘాట్లకు రోడ్డు సౌకర్యం
పెద్దపల్లి: వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు వేగంగా చేయాలని, ప్రధానంగా ఘాట్ల వరకు రోడ్లు సకాలంలో నిర్మించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇంజినీరింగ్ చీఫ్ మోహన్నాయక్తో కలిసి కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల అధికారులతో గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలోని మంథని, గోలివాడ, గోదావరిఖని పుష్కరఘాట్లకు రహదారులు నిర్మించాలని ఆయన అన్నారు. గోదావరిఖని సమ్మక్క– సారలమ్మ జాతర వద్ద 50 శాతం శాశ్వత పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆర్ అండ్ బీ ఈఈ భావ్సింగ్, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆయుర్వేద సేవలు సద్వినియోగం చేసుకోవాలి ఆయుర్వేదం, యునాని, హోమియోపతి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష కోరా రు. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఉచిత ఆయుష్ వైద్యశిబిరం నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఆయుష్ ఆస్పత్రిలో రోజూ 100 నుంచి 120 మంది అవుట్ పేషెంట్లు వైద్యసేవలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్కుమార్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం రోజూ యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ అరుణ అ న్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని ర్వహించిన యోగా కార్యక్రమంలో ఆమె మాట్లాడా రు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్ను విమర్శించే అర్హత లేదు
ధర్మారం: పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎ స్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రజలను, కార్యకర్తలను పట్టించుకోని కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని ఆరోపించడం విడ్డూరంగా ఉందని మంత్రి లక్ష్మణ్కుమార్ విమర్శించారు. నందిమేడారంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. కవులు, కళాకారులు, ప్రజలు తమ ప్రా ణాలను పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పోరాడిన వారికి దక్కిన గౌరవం ఏమిటో తెలుసన్నారు. కేసీఆర్ కుటుంబంలోని కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, కవిత, సంతోష్రావుకు మాత్రమే స్వరాష్ట్రంలో రాజకీయ ఉద్యోగాలు లభించాయని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉంటూ నేడు క్యాబినేట్ మంత్రి వరకు పార్టీ గుర్తింపు నిచ్చిందని ఆయన అన్నారు. పేదలకు ఉచితవైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు అత్యాధునిక వైద్యసేవలు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి లక్ష్మణ్కుమార్ అన్నారు. అన్నిగ్రామాల ప్ర జలకు అందుబాటులో ఉండేలా మేడారంలో ఆస్ప త్రి నిర్మించామన్నారు. వైద్యులు, సిబ్బంది, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కలెక్టర్తోపాటు వైద్య, ఆరోగ్య అధికారులు క్రమం తప్పకుండా ఆస్పత్రిని సందర్శించి వైద్యసేవలపై ఆరా తీయాలని సూచించారు. ఈసందర్భంగా ఆస్పత్రి స్థలదాత పొనుగోటి నర్సింగరావును మంత్రి శాలువాతో సన్మానించారు. అనంతరం నర్సింగరావు మాట్లాడుతూ, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే తపనతో 1968లో సర్పంచ్గా కొనసాగిన తన తండ్రి మురళీధర్రావు నాలుగు ఎకరాలను ఆస్పత్రి నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారన్నారు. సర్పంచ్ మ్యాడా రం వీర్పాల్, ఉపసర్పంచ్ రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, జిల్లా వైద్యాధికారి ప్రమో ద్కుమార్, సూపరెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటున్న చేనేత హస్తకళా మేళా
కోల్సిటీ(రామగుండం): చూడచక్కని బొమ్మలు.. ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, పోచంపల్లి చీరలు, ఇలా కళ్లు మిరుమిట్లు గొలిపే వస్తువులకు గోదావరి ఖని వేదికయ్యింది. ఆధునిక సొబగులద్దుకుంటున్న సంప్రదాయ హస్తకళను హైదరాబాద్కు చెందిన ‘కళా సిల్క్ చేనేత హస్తకళా సొసైటీ’ ఇటీవల గోదావరిఖనిలో ప్రత్యేక మేళాను ప్రారంభించింది. ఆర్జీ–1 జీఎం ఆఫీస్ సమీపంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో సుమారు 40 వరకు హస్తకళా, చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ధర్మవరం, వెంకటగిరి తదితర చీరలు తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, గద్వాల, నారాయణపేట పట్టు చీరలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కళంకారి, ఉప్పాడ, అస్సాం మూగా, బిహార్ బాగల్పుర సిల్క్స్, టస్సర్, జమ్మూ, కశ్మీర్లోని ఎంబ్రాయిడరీ చీరలు, గుజరాత్లోని బాందని, కచ్చ ఎంబ్రాయిడరీ శారీస్, రాజస్థాన్లోని కోటా, బంధాని, ఉత్తరప్రదేశ్లోని జమ్దాని, బనారస్, లక్నో డ్రెస్ మెటీరియల్స్ ఛత్తీస్గఢ్ ట్రిబిల్ వర్క్స్ కోసా సిల్క్, ఫ్యాన్సీ చీరలు, చుడీదార్స్ ఆకట్టుకుంటున్నాయి. -
శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పరిసరాలను శుభ్రం చేస్తున్న ఉద్యోగులుభగ్గుమంటున్న భానుడుభానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఇలాఉంటే రానున్న ఎండలను ఊహించుకుని జంకుతున్నారు. ఉక్కపోతకు చిన్నా పెద్ద తేడా లేకుండా అల్లాడుతున్నారు. గురువారం ఎండ తీవ్రతకు పెద్దపల్లిలో వాహనదారులు అవస్థలు పడుతూ, పాదచారులు గొడుగు నీడన ప్రయాణాలు సాగిస్తూ ‘సాక్షి’కి కనిపించారు. కాగా, ఎండ తీవ్రతకు బస్టాండ్, అయ్యప్పగుడి, కూనారం చౌరస్తాల్లో సిగ్నల్స్ వద్ద వేచి ఉండేందుకు వాహనదారులు విసిగిపోయారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ఆర్టిజన్ల సేవలను గుర్తించని ప్రభుత్వం
రామగుండం: ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ కార్మిక నేత కౌశికహరి మండిపడ్డారు. మల్యాలపల్లి సబ్స్టేషన్ వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు గురువారం సంఘీభావం ప్రకటించారు. తమ గోడును రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రకాలుగా వినిపించినా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూనే ఉందని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఎంప్లాయీస్ జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ తూళ్ళ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారన్నారని విమర్శించారు. ఆర్టిజన్లు చేపట్టే వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని చందర్ స్పష్టం చేశారు. కొంకటి శ్రీనివాస్, వడ్డెపల్లి సురేశ్, ఆవుల మహేశ్, మాటూరి రవీందర్, మల్లారపు ప్రభాకర్, రవి, ధర్మానాయక్, లగిశెట్టి మధు, జ్యోతి, కాటం రమేశ్ తదితరులున్నారు. -
కార్పొరేట్కు దీటుగా జిల్లా ఆస్పత్రిలో సేవలు
పెద్దపల్లి: కార్పొరేట్కు దీటుగా జిల్లా ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారని బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ కొండి సతీశ్ అన్నారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా నాలుగు రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ను జేఏసీ ఆధ్వర్యంలో సత్కరించారు. పేద రోగులను దృష్టిలో ఉంచుకొని వారికి ఆర్థిక భారం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారని జిల్లా ఆసుపత్రి వైద్యబృందాన్ని అభినందించారు. హైదరాబాద్లో జరిగే శస్త్రచికిత్సలను సైతం జిల్లా కేంద్రంలోనే విజయవంతంగా నిర్వహించటం గొప్ప విషయమన్నారు. నాయకులు అరగొండ రాజ్కుమార్, మిట్టపల్లి శ్రీను, గుమ్మడి ప్రసాద్, తిరుమలేశ్, అరుణ్, రవి తదితరులు పాల్గొన్నారు. ఐదెకరాల భూమి కేటాయించాలిపెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులు కెమసారం తిరుపతి అన్నారు. గురువారం ప్రెస్క్లబ్లో జిల్లా అధ్యక్షుడు మానుపాటి రవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎరుకల కులస్తులకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పందుల పెంపకందారులకు ప్రతీ కుటుంబానికి 5ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. ఏకలవ్వ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500కోట్ల బడ్జెట కేటాయించాలన్నారు. బల్దియాల్లో పందులను చంపి తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని, పందుల యజమానులకు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలన్నారు. శాసీ్త్రయ పద్ధతిలో పందుల పెంపకం కోసం ప్రభుత్వమే శిక్షణ ఇప్పించి 100శాతం సబ్సిడీతో పందుల ఫామ్స్ ఏర్పాటు చేయలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానుపాటి శ్రీనివాస్, సంపత్, రేవెళ్ళి తిరుపతి, మంచిర్యాల జిల్లా అధ్యక్షడు ఉండ్రాళ్లు ఎల్లయ్య, సార్ల తిరుపతి, లోకిని శారద, కర్ర రామమల్ల మ్మ, మానుపాటి కనుకమ్మ, బిజిలి శ్రీనివాస్, అంజి, మానుపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కస్టమ్స్ ఇన్స్పెక్టర్గా ఎంపిక పెద్దపల్లి: జిల్లాకేంద్రానికి చెందిన లైశేట్టి అఖిల్కృష్ణ గురువారం ఎస్ఎస్సీ (స్టాఫ్ సెలక్షన్ కమిటీ) ప్రకటించిన ఫలితాల్లో జనరల్ కేటగిరిలో కస్టమ్స్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. లైశెట్టి భిక్షపతి–అనిత దంపతులకు కుమారుడు అఖిల్కృష్ణ 2025లో ప్రకటించిన గ్రూప్– 4 ఫలితాల్లో ఉస్మానియా యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్గా, ఐడీబీఐ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగాలు సాధించాడు. ఉద్యోగం చేస్తూనే ఉన్నత ఉద్యోగం సాధించాలని లక్ష్యంతో ఎస్ఎస్సీకి ప్రిపేర్ అయి సెలెక్ట్ అయ్యాడు. అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలి పెద్దపల్లి:జిల్లా కేంద్రంలో ఈనెల 14న నిర్వహించే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, వివిధ సంఘాల బాధ్యులు వేడుకల్లో పాల్గొనాలని కోరారు. -
ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి: రబీ ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ధారించామని, ఈనెలలో కొనుగోళ్లు ప్రారంభించి మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. తేమ శాతం వచ్చిన వెంటనే 24 గంటల్లో ధాన్యం కొనుగోలు చేసి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొన్ని కొనుగోలు కేంద్రాలు కేటాయించని మిల్లర్లకు ధాన్యం పంపిస్తున్నట్లు గమనించామని, యాసంగిలో ఇది పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సరఫరా పర్యవేక్షణకు కమిటీ జిల్లాలో గ్యాస్ సరఫరా పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కమిటీకి కలెక్టర్ చైర్మన్గా, అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. జిల్లా అటవీ అధికారి, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ కమిషనర్, ఐఓసీఎల్ ప్రతినిధి మొత్తం 14 మంది సభ్యులు ఉంటారని తెలిపారు. ఐఓసిఎల్ ఆధ్వర్యంలో జిల్లాల్లో గ్యాస్ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీ, డీసీపీ రాంరెడ్డి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పట్టుబడినా ఆగని అక్రమార్కులు
ఈఏడాది ఫిబ్రవరి 20న మంథని సబ్రిజిస్ట్రార్ ఆఫీస్పై ఏసీబీ అధికారులు దాడి చేసి సబ్రిజిస్ట్రార్ కసర్లి రాజేందర్ లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడితో పాటు ప్రైవేట్ డ్యాక్యుమెంట్ రైటర్ ఎండీ రీషీద్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన రైతు కన్నూరి బాపు వద్ద భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.16,500 లంచం డిమాండ్ చేయగా, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు.● జిల్లాలో కొనసాగుతున్న ఏసీబీ దాడులు ● అయినా మారని అవినీతి తిమింగలాలుపెద్దపల్లి మండల అగ్రికల్చర్ అధికారి కార్యాలయంలో ఈఏడాది ఫిబ్రవరి 24న ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. స్పూరియస్ (నకిలీ) విత్తనాలు, యూరియా అక్రమ నిల్వ, స్టాక్ రిజిస్టర్లు అప్డేట్ చేయకపోవడం, ఫార్మ్ మెకనైజేషన్ అప్లికేషన్లు ఆలస్యం చేయడం వంటి అంశాలు బయటపడటంతో ఎంఓఏ అలివేణిని సస్పెండ్ చేశారు.తాజాగా గురువారం అంతర్గాం మండల తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ శ్రీమాన్, రాయదండి గ్రామానికి చెందిన మాచర్ల వెంకటస్వామి అనే సింగరేణి ఉద్యోగి నుంచి రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం డబ్బులు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తండ్రి చనిపోతే తల్లిపేరుమీద ఽభూభారతిలో పేరు మార్చడానికి ఆరునెలలుగా తిప్పలు పెడుతుండడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా వలపన్ని పట్టుకున్నారు. గోదావరిఖని(రామగుండం): పట్టుబడుతున్నా అక్రమార్కుల అవినీతి దందా ఆగడం లేదు. వచ్చిన జీతంతో సంతృప్తి చెందక బల్లకింద చేతులు చాపుతున్నారు. అవినీతి సొమ్ముకు అలవాటు పడిన ప్రభుత్వాధికారులు వరుసగా ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలో దిగుతున్న ఏసీబీ అధికారులు పక్కాస్కెచ్తో లంచావతారులను పట్టుకుంటున్నారు. వివిధ శాఖల్లోని అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులతో ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. జిల్లాలో గడిచిన నాలుగునెలల్లో ఇలాంటి ఘటనలు మూడు జరిగాయి. అయినా ఏదో ఒక ప్రాంతంలో లంచావతారులు తమ విశ్వరూపం చూపిస్తూనే ఉన్నారు. అన్యాయంగా డబ్బులు డిమాండ్ చేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతున్నారు. ప్రధానంగా తహసీల్ కార్యాలయం, రిజిస్ట్రేషన్లశాఖ, మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈమేరకు ఆయా కార్యాలయాలపై దృష్టి సారించారు. ఈక్రమంలో నాలుగు నెలల్లో ముగ్గురు ఏసీబీకి చిక్కారు. పట్టుబడుతున్నా మారని తీరు.. బల్లకింద చేయిచాచడం, ఇష్టానుసారంగా దోచుకోవడం కొంతమంది అధికారుల నైజంగా మారింది. పనిచేయాలంటేనే చేతులు తడపాల్సి రావడంతో అడిగినంత చెల్లించలేక ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి తిమింగలాలను రెడ్హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. జిల్లాలో వరుస దాడులు జరుగుతున్నా లంచావతారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఫిర్యాదు చేస్తే రంగంలోకి.. అవినీతి తిమింగలాలను పట్టుకునేందుకు ఏసీబీ శాఖ ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పని కోసం లంచం డిమాండ్ చేస్తే 1064టోల్ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని కోరుతోంది. ఫిర్యాదుదారు ల వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు సత్వరమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది.రెండేళ్లకోసారి.. అధికారుల తప్పుదారిరామగుండం: అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో రెండేళ్లకోసారి అధికారులు ఏసీబీ చిక్కడం చర్చనీయాంశంగా మారింది. అంతర్గాం ప్రత్యేక మండలంగా ఆవిర్భవించిన ఎనిమిదేళ్లలో ఇద్దరు తహసీల్దార్లు, ముగ్గురు ఆర్ఐలు రెండేళ్లకు ఒకరు చొప్పున ఏసీబీకి చిక్కడం రెవెన్యూ అధికారుల అవినీతికి అద్దం పడుతోంది. ప్రధానంగా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్చడం, తప్పొప్పులను సవరించడం, భూముల హద్దు పంచాయితీలు, సర్వే పనులను అధికారులు నిస్వార్థంగా చేపట్టి అసలైన పట్టాదారులకు న్యాయం చేయాల్సి ఉండగా, సంపాదనే లక్ష్యంగా రెవెన్యూ అధికారులు సాధారణ ప్రజలను వేధిస్తున్నారు. 2022లో తహసీల్దార్, ఆర్ఐతో పాటు కార్యాలయ సహాయకుడు ఏసీబీ వలకు చిక్కగా, 2024లో మరో తహసీల్దార్, ఆర్ఐ, ప్రస్తుతం ఆర్ఐ ఏసీబీకి చిక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కాగా, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం అధికారులు విపరీతంగా లంచాలు వసూలు చేస్తున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులకు సంబంధించి వివిధ రకాల ధ్రువీకరణపత్రాలు, ఇతర ఉద్యోగాలకు అందించే క్లియరెన్స్ పత్రాలకు సంబంధిత శాఖల అధికారులు భారీ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
కేసుల పరిష్కారంలో పోలీసుల పాత్ర కీలకం
పెద్దపల్లి: పెండింగ్ కేసుల పరిష్కారంలో పోలీస్ల పాత్ర కీలకమని జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. గతనెలలో నిర్వహించిన లోక్ అదాలత్ను విజయవంతం చేయడంలో పోలీసుల పాత్రపై జిల్లా కేంద్రంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడు తూ, పరస్పర అవగాహనతో త్వరితగతిన కేసులు పరిష్కరించడంలో పోలీస్ శాఖ సమర్థవంతంగాపనిచేసిందన్నారు. భవిష్యత్లో కూడా ఇలాగే సేవలు అందించాలని సూచించారు. డీసీపీ రాంరెడ్డి మాట్లాడారు. లోక్ అదాలత్ నిర్వహణలో కీలకపాత్ర పో షించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసపత్రాలను జిల్లా న్యాయమూర్తి అందజేశారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి, స్వప్నరాణి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి భావాని, జూనియర్ సివిల్ జడ్జి, మంజుల, పెద్దపల్లి, గోదావరిఖని ఏిసీపీలు రమేశ్, కృష్ణ, సీఐలు ప్రవీణ్ కుమార్, రాజుగౌడ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యంపై పోరుబాట
కోనరావుపేట(వేములవాడ): పల్లెల్లో మద్యం మహమ్మారిని పారదోలేందుకు ప్రజలంతా ఒక్కటవుతున్నారు. మద్యం పెడుతున్న చిచ్చును ఆర్పేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నారు. మద్య నిషేధం అమలు చేయాలంటూ తీర్మానాలు చేస్తున్నారు. కోనరావుపేట మండలం మల్కపేట, గోవిందరావుపేట, నిజామాబాద్ గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహించరాదని తీర్మానించారు. గ్రామంలో మద్యం అమ్మినా, కొనుగోలు చేసినా జరిమానా విధించాలని నిర్ణయించారు. ఒకప్పుడు ఎర్రజెండా భావాలతో చైతన్యానికి మారుపేరుగా నిలిచిన కోనరావుపేట మండలం ఇప్పుడు మద్య నిషేధం అమలు చేస్తూ అవే పల్లెలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బెల్ట్షాపులతో అనర్థాలు గ్రామాల్లో కొన్నేళ్లుగా బెల్ట్ దుకాణాలు కొనసాగుతున్నాయి. హమాలీలు, వ్యవసాయ కూలీలు పొద్దంతా కష్టపడి సంపాదించిన డబ్బును రాత్రయితే తాగుడుకు ఖర్చు చేస్తున్నారు. దీంతో పలు కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. మద్యంబాబులు అనారోగ్యం పాలవుతున్నారు. కదిలిన మహిళా లోకం కుటుంబ పెద్ద మద్యానికి బానిసైతే.. ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. దీంతో మహిళలు తాము అనుభవిస్తున్న మానసిక క్షోభను దూరం చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామాల్లో మద్యం విక్రయాలు నిషేధానికి గ్రామస్తులను ఒప్పించాలని మహిళా సంఘాల్లో నిర్ణయించుకున్నారు. మహిళా సంఘాల ప్రతినిధులు ఆయా గ్రామాల సర్పంచులను కలిసి తమ సమస్యను వివరించారు. సర్పంచులు సైతం మద్దతు తెలపడంతో గ్రామంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులు, మహిళా సంఘాలు సమావేశమై మద్యనిషేధానికి పూనుకున్నాయి. పంచాయతీ సాక్షిగా తమ గ్రామంలో మద్యం విక్రయాలు జరుపనివ్వబోమంటూ ప్రమాణం చేశారు. జిల్లాలోనే ఆదర్శం గ్రామాల్లో మద్యం దుకాణాలను రద్దు చేస్తూ మల్క పేట, నిజామాబాద్, గోవిందరావుపేట గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం జిల్లాలోనే ఆదర్శమైంది. గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించినా రూ.50వేలు జరిమానా, పట్టించిన వారికి నజరానా అందించాలని తీర్మానించాయి. పల్లెల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం కోనరావుపేట మండలంలో మూడు గ్రామాలలో అమలు మరికొన్ని గ్రామాలు అదే బాటలో.. హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు -
మీర్జంపేటలో తల్లీకూతుళ్ల అదృశ్యం
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు రామిడి లక్ష్మి(48), శ్వేత(28) అదృశ్యమయ్యారు. ఈనెల 7వ తేదీన ఇంట్లోనుంచి బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు ఎంతకీ తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు తమకు తెలిసిన వారు, బంధువుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. ఆందోళనకు గురైన లక్ష్మి భర్త వెంకట్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై వెంకటేశ్ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకున్నామన్నారు. అదృశ్యమైన వారు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కనిపించినట్లు సమాచారం ఉందని, కానిస్టేబుళ్లను బుధవారం హైదరాబాద్ పంపించామని తెలిపారు. పూర్తిసమాచారం తెలిస్తే.. ఎస్సై 87126 56512, సుల్తానాబాద్ సీఐ 87126 56510 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.వృద్ధుడి ఆత్మహత్యమల్యాల: మండలంలోని గొల్లపల్లెకు చెందిన ఎల్కపల్లి రాయమల్లు(85) ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. రాయమల్లు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈనెల 7న రాత్రి తన ఇంట్లోనే ఎలుకల మందు తాగాడు. సమీప బంధువులు గమనించి ఆయన కుమారుడు గంగమల్లయ్యకు సమాచారం అందించారు. 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. గంగమల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. బావిలో దూకి మహిళ..పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన బట్ల స్వరూప(34) బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్వరూప మూడేళ్లుగా మానసికంగా బాధపడుతోంది. గతంలోనూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడింది. ఈ మేరకు మృతురాలి తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పెద్దపల్లిరూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. ఉరేసుకుని వివాహిత..జమ్మికుంట: దంపతుల మధ్య గొడవతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం బిహార్ రాష్ట్రం నల్లంద జిల్లా బద్రు బీహార్ గ్రామానికి చెందిన రాహుల్కుమార్కు పూజాకుమారితో 2018లో వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం జమ్మికుంటలోని కోరపల్లి రోడ్డులో ఉన్న ఓ రైస్ మిల్లులో కూలీకి చేరారు. రెండు రోజుల క్రితం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. బుధవారం భర్త పనికి వెళ్లిన తరువాత పూజాకుమారి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాహుల్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ తెలిపారు. మద్యానికి బానిసై వ్యక్తి..శంకరపట్నం: మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన ఇజ్జిగిరి ఐలయ్య (50) మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపా రు. ఐలయ్య మద్యం మానలేక జీవితంపై విరక్తి చెంది మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐలయ్య కుమారుడు విజయ్కుమార్ బుధవారం ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై శేఖర్రెడ్డి తెలిపారు. -
సమాజానికి చేసిన సేవలే చిరస్థాయిగా మిగులుతాయి
మంథనిరూరల్: సమాజానికి చేసిన సేవలే చిరస్థాయి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంథని మండలం చిల్లపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ పిక్కల పెద్ద రాజయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్తో కలిసి మాజీ మంత్రి ఆవిష్కరించారు. పెద్ద రాజయ్య ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. నాయకులు తగరం శంకర్లాల్, ఏగోళపు శంకర్గౌడ్, పిక్కల రాజయ్యతో పాటు రాజయ్య కుటుంబసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అమ్మా నేను వెళ్లిపోతున్నా.. క్షమించు
ముస్తాబాద్: అమ్మా నేను వెళ్లిపోతున్న.. ఈ అప్పులు భరించలేను. బాపు చనిపోయాక నిన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్లిపోతున్న.. నన్ను క్షమించు అమ్మ.. అంటూ ఓ కొడుకు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన పాకదాని నర్సింలు(35) ఇంట్లో ఉరేసుకొని బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్న నర్సింలు తండ్రి చంద్రయ్య 2020లో కరోనాతో మృతి చెందగా, అప్పటి నుంచి తల్లి ఎల్లవ్వను పోషిస్తున్నాడు. ఇంకా పెళ్లికాని నర్సింలు స్వగ్రా మం పోతుగల్కు ఒక్కడే వచ్చి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నర్సింలు తన ఆత్మహత్యకు అప్పులే కారణమని లేఖలో రాశాడు. అమ్మను ఎవరు ఏమీ అనవద్దని, స్నేహితులు ఆమెను చూసుకోవాలని కోరాడు. కొడుకు మృతితో తల్లి ఎల్లవ్వ ఒంటరి అయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. అమ్మను బాగా చూసుకోవాలి కారు డ్రైవర్ ఆత్మహత్య -
క్రిటికల్ కేర్ సెంటర్తో విశేష సేవలు
కోల్సిటీ(రామగుండం): నగరంలో క్రిటికల్ కేర్ సెంటర్ అందుబాటులోకి రావడం ద్వారా ప్రజల కు విశేష సేవలు అందుతాయని రామగుండం ఎ మ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. ప్రభు త్వ సహకారంతోనే చిన్నఆస్పత్రి నుంచి బోధనా స్పత్రి వరకు గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధి చెందిందన్నారు. రూ.23.75కోట్ల వ్య యంతో నిర్మించిన క్రిటికల్ కేర్ భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష, మేయర్ మహంకాళి స్వామితో కలి సి ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించి మాట్లాడారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హ యాంలోనే చిన్న ఆస్పత్రి ప్రారంభించారని గుర్తుచే శారు. కలెక్టర్ శ్రీహర్ష, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, ఆస్పత్రి సూపరింటెండెంట్ దయాళ్సింగ్, డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, డాక్టర్లు హిమబిందు, అరుణ తదితరులు పాల్గొన్నారు. అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు గోదావరిఖని: సంక్షేమ పథకాల ఫలాలు అన్నివర్గా లకు అందుతున్నాయని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ అ న్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు 18 స్కూటీలు, విద్యార్థులకు 7 ల్యాప్ట్యా ప్లు, 203 మంది అంగన్వాడీ టీచర్లకు 5జీ మొబైల్ఫోన్లు, 2ట్యాబ్లు అందజేసి మాట్లాడారు. మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్సీ భవనం ప్రారంభం రామగుండం: అంతర్గాం ఎమ్మార్సీ భవనాన్ని ఎ మ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఎంఈవో సంగీతతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంగోతు రవికుమార్, హెచ్ఎం ఏకాంబరం, పీఈటీ శోభారాణి, ఎమ్మార్సీ సహాయకుడు రేగొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మండలంలో చలివేంద్రాలు ప్రారంభం
రామగిరి: ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, బాటసారులకు తాగునీరు సౌకర్యం కల్పించేందుకు ఆయా గ్రామాల్లో చలివేంద్రాలుఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో శైలజారాణి తెలిపారు. జెడ్పీ సీఈవో, డీపీవో ఆదేశాల మేరకు మండలంలోని లద్నాపూర్, ఆదివారంపేట, బుధవారంపేట, నవాబ్పేట, రత్నపూర్ గ్రామాల పరిధిలోని బస్టాండ్లు, రహదారి పక్కన, గ్రామ కూడళ్ల వద్ద బుధవారం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. సర్పంచులు పల్లె ప్రతిమ పీవీరావ్, వనం రాంచందర్రావు, కార్యదర్శులు పాల్గొన్నారు. -
స్తంభించిన రెవెన్యూ సేవలు
బోసిపోయి కనిపిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కుర్చీ ఖాళీగా ఉన్న తహసీల్దార్ కుర్చీ జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం పక్షంరోజులుగా అధికారులు లేక బోసిపోయి కనిపిస్తోంది. మొన్నటివరకు పనిచేసిన ఇన్చార్జి తహసీల్దార్ శ్రీపాద ఈశ్వర్తోపాటు డిప్యూటీ తహసీల్దార్ ఇటీవల బదిలీపై వెళ్లారు. ఆర్ఐలు సెలవులో ఉన్నారు. ఇందుకు కారణాలపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లా? కార్యాలయంలో చోటుచేసుకుంటున్న మానసిక పరిస్థితుల ప్రభావమా? అనేది తెలియడం లేదని అర్బన్ మండలవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడకు బదిలీపై వచ్చేందుకు పలువురు తహసీల్దార్లు జంకుతున్నారని తెలిసింది. జీపీవోలు, కంప్యూటర్ ఆపరేటర్లు, సిబ్బంది మినహా కీలకమైన కులం, ఆదాయం, నివాసం తదితర ధ్రువీకరణపత్రాల జారీకోసం సంతకం చేసే అధికారులు లేక వందలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లను తక్షణమే నియమించేలా కలెక్టర్ చొరవ తీసుకోవాలని నేషనల్ యూత్ ప్రాజెక్టు రాష్ట్ర అధ్యక్షుడు కె.యాదవరాజు కోరారు. అధికారులు లేక ఖాళీగా తహసీల్దార్ కార్యాలయం -
‘ఆంధ్రప్రదేశ్పై ప్రేమ తెలంగాణపై విషం’
పెద్దపల్లి: కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పై ప్రేమ చూపుతూ, తెలంగాణపై విషం కక్కుతోందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. కూనారం – పెద్దపల్లి మధ్య చేపట్టిన రైల్వేఫ్లైఓవర్ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాల ని సూచించారు. కూనారంతోపాటు కన్నాల, కుందనపల్లి, కొలనూరు ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధుల కోసం పార్లమెంటులో ప్రస్తావించానని అన్నారు. మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, నా యకులు సదానందం, సజ్జత్, బండారి సునీల్గౌడ్, శ్రీనివాస్, కనకయ్య, సతీశ్ పాల్గొన్నారు. మరమ్మతులు పూర్తిచేయాలి ఓదెల: రైల్వేలైన్ మరమ్మతులు సత్వరమే పూర్తిచేయాలని ఎంపీ వంశీకృష్ణ సూచించారు. కొలనూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని లెవల్క్రాసింగ్ గేట్ మరమ్మతులను ఎంపీ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి జంక్షన్లో సూపర్ఫాస్ట్ రైళ్ల హాల్టింగ్ కోసం కృషి చేశామన్నారు. నాయకులు అల్లం స తీశ్, పల్లె ప్రశాంత్, మాటురి రవి, శివశంకర్, రా జేశం, ఐలయ్యయాదవ్, చంద్రయ్య పాల్గొన్నారు. అనంతరం రేషన్ షాపులో రేషన్ బియాన్ని పంపిణీ చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. డీల ర్లు మద్దెల నర్సయ్య, నాగరాజు పాల్గొన్నారు. -
బైక్ దొంగలించిన వ్యక్తి అరెస్ట్
చందుర్తి(వేములవాడ): భార్య పిల్లలతో కలిసి వేములవాడకు వెళ్తుండగా సమీపంలో బైక్లో పెట్రోల్ లేక ఆగిపోయిందన్న మాయమాటలు చెప్పి ఏడు నెలల క్రితం ద్విచక్రవాహనం చోరీ చేసిన కేసును బుధవారం చందుర్తి పోలీసులు చేధించారు. చందుర్తి ఎస్సై జిల్లెల్ల రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చందుర్తి మండలం మల్యాలకు చెందిన పీసరి నాగరాజు వద్దకు 2025 సెప్టెంబర్ 19న గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తమ మోటార్ సైకిల్లో పెట్రోల్ లేక ఆగిపోయిందని, బైక్పై తమ భార్య, చిన్న పిల్లలున్నారని, మీ బైక్ ఇస్తే పెట్రోల్ తెచ్చుకుంటానని చెప్పి బైక్ను తీసుకెళ్లాడు. ఇదే అదునుగా భావించి మోటారు సైకిల్తో పారిపోవడంతో బాధితుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుగ్గారం తండాకు చెందిన కృష్ణ రాథోడ్ ఊరఫ్ భూక్యా కృష్ణ రాథోడ్గా గుర్తించి ఎత్తు కెళ్లిన మోటారు సైకిల్ను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. బైక్ను సీజ్ చేసి దొంగతనానికి పాల్పడిన కృష్ణ రాథోడ్ను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రమేశ్ వివరించారు. గొర్రెలు, కోళ్ల దొంగల..సుల్తానాబాద్రూరల్: జల్సాలకు అలవాటుపడి గొర్రెలు, కోళ్లను చోరీ చేస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. సుల్తానాబాద్ పోలీస్స్టేషన్లో బుధవారం వివరాలను ఎస్సై వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన నలుగురు సిరిపురం రాకేశ్, నూనే అభిలాష్, గరిగంటి రాజ్కుమార్తోపాటు ఓ మైనర్ గతనెల 31న సుద్దాల గ్రామంలో ఒజ్జ రాములుకు చెందిన 5 గొర్రెలు, ఈనెల 6న చిన్నబొంకూర్ గ్రామంలో కల్వల లక్ష్మారెడ్డితోపాటు మరో ముగ్గురు రైతులకు సంబంధించిన దాదాపు 20 కోళ్లను దొంగతనం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా.. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులు దొరికారన్నారు. వారిని అరెస్టు చేయడంతోపాటు దొంగతనానికి ఉపయోగించిన కారును సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. యువతిని వేధించిన వ్యక్తి..సిరిసిల్ల క్రైం: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని వేధించిన సింగారపు గణేశ్ అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. సిరిసిల్లకు చెందిన యువతిని రుద్రంగి మండలానికి చెందిన గణేశ్ పరిచయం చేసుకొని ప్రేమిస్తున్నాని చెప్పి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చి వేధిస్తున్నట్లు బాధితురాలు సిరిసిల్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. అమ్మాయిలను వేధించడం, ప్రేమ పేరుతో వెంటపడడం, సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆర్టిజన్ల సమ్మె విజయవంతం
రామగుండం: ఆర్టిజన్ల కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో యాజమాన్యం జరిపిన చర్చల్లో స్పందన లేకపోవడంతో బుధవారం నుంచి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు నిరవధిక సమ్మె చేపట్టారు. మల్యాలపల్లి సబ్స్టేషన్ ప్రాంగణంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్లకార్డులతో ఆర్టిజన్లు నినాదాలు చేసి విధులకు దూరంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వారు పేర్కొన్నారు. సమ్మెలో జేఏసీ ప్రతినిధులు కొంకటి శ్రీనివాస్, వడ్డెపల్లి సురేశ్, ఆవుల మహేశ్, దుర్గం విశ్వనాథ్, ఖలీద్, మల్లారపు ప్రభాకర్, రవి, ధర్మానాయక్, కిరణ్, సందీప్, శ్రీనాథ్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ
యైటింక్లయిన్కాలనీ: రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ 19వ డివిజన్ ఏరియాలో కనకలక్ష్మికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా బుధవారం డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీల–రాజిరెడ్డి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ ఏరియాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తామని పేర్కొన్నారు. అల్లూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వంటగది లేకపోవడంతో విషయని తెలుసుకున్న కార్పొరేటర్ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే వంటగది నిర్మాణం, మెయింటెన్స్ కోసం రూ.15లక్షల నిధులు మంజూరు చేయించారు. దీంతో బుధవారం పాఠశాలలో వంటగది నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. డివిజన్ అధ్యక్షులు మార్క రాజు, రాకేశ్, అజయ్, కనకయ్య, రాజు, శ్రీనివాస్, అరుణ్, నాగరాజు, అంజి, విజయ్ పాల్గొన్నారు. -
మట్టి తోడేళ్లు
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలోని సహజ సంపద తరిగిపోతోంది. అ నుమతి లేకుండా కొండలు, గుట్టలను అక్రమార్కు లు రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వేస్తున్నారు. గు ట్టల నుంచి జేసీబీలతో మట్టి తోడి టిప్పర్లు, ట్రా క్టర్లలో నింపి యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు అనుమతి పేరిట ఇష్టానుసారంగా తరలిస్తున్నా రు. ఇంత జరుగుతున్నా పోలీస్, రెవె న్యూ, మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. అసైన్డ్, పట్టా భూముల్లో రైతులకు ఎంతోకొంత ముట్టజెప్పి వ్యాపారం దర్జాగా కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల నామామాత్రంగా మైనింగ్ అధికారుల వద్ద అనుమతి తీసుకొని వేల ట్రిప్పులు తోడేస్తున్నా రు. మరికొన్నిచోట్ల ప్రభుత్వ పనుల పేరిట అక్రమంగా తరలిస్తూ సర్కారు ఆదాయానికి గండికొడు తున్నారు. ఓవర్లోడ్ వాహనాలు తిరగడంతో కొద్దిరోజులకే బీటీ రోడ్లు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి అనుమతి తీసుకుంటే రాయల్టీ కింద ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ, ఇష్టానుసారంగా మట్టి తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఫాంహౌస్ లకు ఒక్కో ట్రిప్పును రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు విక్రయిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. అధికారుల కళ్లెదుటే ఇంత జరుగుతున్నా పట్టించుకోవ డం లేదని విమర్శలు వస్తున్నాయి. మట్టి దందాపై తహసీల్దార్, మైనింగ్ అధికారుల వివరణ కోరగా.. అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపడితే జేసీబీ, ట్రాక్టర్లను సీజ్ చేస్తామని తెలిపారు.ఈ గుట్ట పెద్దపల్లి మండలం రాంపల్లి శివారులోనిది. అనుమతి లేకుండానే జేసీబీలతో మట్టి తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. తుర్కలమద్దికుంట, పాలితం, ర్యాకల్దేవ్పల్లి, కొదురుపాక, కాట్నపల్లి, గర్రెపల్లి, కనగర్తి, శానగొండ, వెన్నంపల్లి, చిన్నరాతుపల్లి, పెద్దరాతుపల్లి, రాఘవాపూర్, బూర్హాన్మియాపేట, శివపల్లి, చీమలపేట, తెలుకుంట తదితర గ్రామాల్లోనూ మట్టి దందా ఇలాగే యథేచ్ఛగా సాగుతోంది. అయినా, ఎవరూ పట్టించుకోవడం లేదు. -
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం
పెద్దపల్లిరూరల్: ‘నేను పోత బిడ్డో సర్కారు దవాఖానాకు’ అంటూ అన్ని ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వైద్యసేవలు పొందుతున్నారని, రోజు సుమారు వెయ్యి మంది చికిత్స పొందడం ఇందుకు నిదర్శనమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి అందిస్తున్న వైద్యసేవలకు గుర్తింపుగా నాలుగు రాష్ట్రస్థాయి అవార్డులు సాధించిన వైద్యాధికారులు, సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. తన క్యాంపు కార్యాలయంలో బుధవా రం సూపరింటెండ్ శ్రీధర్, మున్సిపల్ చైర్మన్ నూగి ల్ల మల్లయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కొత్త భవనం వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని, ఆలోగా జిల్లా ఆస్పత్రిలో అన్నిరకాల ఆధునిక వైద్యసేవలు, పరీక్షలు అందుబాటులోకి తీసుకొస్తా మని తెలిపారు. డాక్టర్ శ్రీధర్ పర్యవేక్షణలో వైద్యు లు, సిబ్బంది సేవలకుతోడు వసతుల కల్పన, మందుల లభ్యత తదితర అంశాలపై కలెక్టర్ శ్రీహర్ష, తాను పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ప్రభుత్వాస్పత్రిపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని అన్నారు. -
సింగరేణిలో మెడికల్ బోర్డు ఎత్తివేసే కుట్ర
గోదావరిఖని: సింగరేణిలో మెడికల్ బోర్డు ఎత్తివేసే కుట్ర జరుగుతోందని మాజీమంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రెస్క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో కార్మికుల సంఖ్య ఎక్కువైందని, దీనిపై విచారణ జరపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని చూస్తుంటే మెడికల్ బోర్డ్ను ఎత్తివేసే కు ట్ర జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. భట్టి వ్యాఖ్యలను టీబీజీకేఎస్ వ్యతిరేకిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలు సింగరేణిలో కార్మికుల సంఖ్య తగ్గిస్తూ వచ్చాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కారుణ్య నియామకాల పేరిట సింగరేణిలో దాదాపు 20 వేల ఉద్యోగాలను కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డును ఎత్తివేయాలని చూస్తోందని, అదేజరిగితే టీబీజీకేఎస్ ఉద్యమాలు ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కహామీ కూడా నెరవేర్చలేక పోయాయని విమర్శించారు. వాటికి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా ఉండే అర్హత లేదన్నారు. సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు నూనె కొమురయ్య, గోపు ఐలయ్యయాదవ్, వడ్డేపల్లి శంకర్, మల్లేశం, మదాసు రామ్మూర్తి, చెలుకలపల్లి శ్రీనివాస్, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
తెల్లబంగారం మెరుపులు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పత్తి దిగుబడి చివరి దశకు చేరుతోంది. ఈక్రమంలో ధర ఆకాశాన్ని అంటుతోంది. ప్రతికూల పరిస్థితులు, చీడపీడల ఉధృతితో ఈసారి ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. కానీ, చివరిదశలో ధర మెరుగ్గా ఉండడం అన్నదాతల్లో కొంత సంతోషం నింపుతుండగా.. ఇప్పటికే పత్తి విక్రయించిన వారిలో నిర్వేదం నెలకొంది. 48వేల ఎకరాల్లో సాగు జిల్లాలో ఈసారి 48వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 5.78 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అయితే, ఇప్పటివరకు అందులో సగం కూడా కొనుగోలు చేయలేకపోయారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు దిగుబడిపై ప్రభావం చూపడంతోనే ఆశించిన స్థాయిలో పంట చేతికి రాలేదన్న అభిప్రాయాలను పలువురు రైతులు వ్యక్తం చేశారు. ఎకరాకు నాలుగు క్వింటాళ్లు మించలే.. అకాల వర్షాలతో పంటకు చీడపీడలు సోకాయి. గులాబీపురుగు లాంటివి పంటను ఆశించాయి. ఎకరాకి 12 క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చే అవకాశం ఉందని భావించినా.. 3 క్వింటాళ్ల నుంచి 4 క్వింటాళ్లు మించి దిగుబడి చేతికి అందే పరిస్థితి లేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. కొనుగోలు చేసింది 2.58 క్వింటాళ్లే జిల్లా వ్యాప్తంగా 48 వేల ఎకరాల్లో పత్తి సాగుకాగా.. 5.78 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనాకు వచ్చారు. కానీ ఈనెల 6వ తేదీ(సోమవారం) నాటికి అందులో సగమే కొనుగోలు చేశారు. కొనుగోళ్ల తీరు పరిశీలిస్తే.. దిగుబడిపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అక్కడక్కడా కొంతమేర మంచి దిగుబడి వచ్చినా.. ధర ఇంకా పెరగక పోతుందా? అనే ఆశతో కొంతమంది రైతులు తమ ఇళ్లలో పత్తి నిల్వ చేసుకోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఇప్పటివరకు సీసీఐ ద్వారా 1,57,380 క్వింటాళ్లు, ప్రైవేట్ వ్యాపారులు (మిల్లుల వద్ద) 43,885 క్వింటాళ్లు, మార్కెట్లో అడ్తిదారులు 56,569 క్వింటాళ్ల మేర కొనుగోలు చేసినట్టు మార్కెటింగ్ అధికారులు తెలిపారు. మంగళవారం నాటి ధరలు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.8,011 ధర పలికింది. కనిష్టంగా రూ.5,818, సగటు రూ. 7,588గా ధర ఉందని అధికారులు వివరించారు. జిల్లాలో ఈనెల 6వ తేదీ వరకు పత్తి కొనుగోళ్లు(క్వింటాళ్లలో) సీసీఐ కేంద్రాలు 1,57,380 ప్రైవేట్ సెంటర్లు 43,885 మార్కెట్యార్డు 56,569 -
ఘనంగా హోమం
పెద్దపల్లిరూరల్: పెద్దకల్వల శివాలయంలో బు ధవారం హోమం, యాగం ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా శ్రీకాంతేశ్వరస్వామి ఆధ్వర్యంలో లక్ష్మీనర్సింహస్వామి, భాస్కరా చారి పూజాకార్యక్రమాల్లో పాలుపంచుకున్నా రు. ఈప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని హోమం, యాగయజ్ఞాలను నిర్వహించినట్టు సర్పంచ్ నర్లకనకమ్మ, పోల్రాజ్ తెలిపారు. ఆకుల భూమయ్య జయంతి జూలపల్లి: కాచాపూర్ నివాసి, తెలంగాణ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల భూమయ్య జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించా రు. గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సర్పంచ్ పెంట కావేరి – కిశోర్, ఉపసర్పంచ్ దాడి మనోహర్, మాజీ సర్పంచ్ ఆకుల రాజయ్య, వార్డు సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ కల్పించండి మంథనిరూరల్: సింగరేణి ప్రభావిత మంథని మండలం చిల్లపల్లి, దుబ్బపల్లిలోని పేద కు టుంబాలకు ఉపాధిహామీ పనులు లభించడం లేదని, ప్రత్యామ్నాయంగా సింగరేణి ప్లాంటేషన్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని దుబ్బపల్లి సర్పంచ్ ఎరవెల్లి కృష్ణవేణి – నరేశ్రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుడుదుల రవి కోరారు. ఈమేరకు సింగరేణి ఆర్జీ –1 జీఎం లలిత్కుమార్ను బుధవారం కలిశారు. గ్రామ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. శాలువాతో సన్మానించారు. ప్లాస్టిక్ నిర్మూలన కోసం పంచాయతీకి స్టీల్ప్లేట్లు, గ్లాసులు అందజేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా వృత్తి విద్య శిక్షణ(వీటీసీ) ఇ ప్పించాలని, మినీఫంక్షన్హాల్ నిర్మాణానికి ని ధులు మంజూరు చేయాలని కోరారు. సమస్యలపై జీఎం సానుకూలంగా స్పందించారు. క్రీడల్లోనూ రాణించాలి రామగిరి: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో నూ ప్రతిభ చూపాలని మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ విస్ణువర్ధన్ అన్నారు. హుజూరాబాద్లో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో మంథని జేఎన్టీయూ విద్యార్థులు బ హుమతులు సాధించారు. వారిని కళాశాలలో బుధవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. బాలుర బాడ్మింటన్ డబుల్స్లో బి.సాయిదీప్, సీహెచ్ వంశీ ప్రథమ, బాలికల బ్యాడ్మింటన్ సింగిల్స్లో ఎం.మైత్రి ప్రథమ, బాలికల క్యారమ్ సింగిల్స్లో పి.అలేఖ్య ద్వితీ య బహుమతులు సాధించగా ప్రశంసాపత్రా లు అందజేశారు. పరిపాలన అధికారి సుమన్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు కృష్ణారెడ్డి, సునీల్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారంతో తల్లీబిడ్డలు క్షేమంపెద్దపల్లి: పౌష్టికాహారంతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటారని జిల్లా వైద్యాధికారి ప్రమోద్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భిణులు ప్రసవ సమ యం వరకు కనీసం నాలుగుసార్లు వైద్యపరీక్ష లు చేయించుకోవాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీరాములు, ప్రోగ్రాం అధికారి వాణిశ్రీ, ఆర్ఎంవో విజయ్, పిల్లల వైద్యుడు రవీందర్, జమున తదితరులు పాల్గొన్నారు. లింగనిర్ధారణ నేరం లింగనిర్ధారణ చట్ట వ్యతిరేకమని డాక్టర్ ప్రమోద్కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జరిగిన అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆ యన మాట్లాడారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ స్కా నింగ్ సెంటర్లు 33 ఉన్నాయని, ప్రతీనెల వాటి ని తనిఖీ చేయాలన్నారు. డాక్టర్లు వాణిశ్రీ, శ్రీ రాములు, కిరణ్, అనూషరెడ్డి, రెడ్క్రాస్ సొసై టీ అధ్యక్షుడు రాజగోపాల్ పాల్గొన్నారు. -
బాసరకు శిలలు.. శివయ్యకు సిమెంటు!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బాసర ఆలయ పునర్నిర్మాణానికి పూనుకుంది. ఈ నిర్మాణానికి శిలలు వినియోగించనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సరస్వతీ భక్తులంతా ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇలవేల్పు, దక్షికాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం సిమెంటుతో పునర్నిర్మాణం జరపడంపై భక్తులు పెదవి విరిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత పురాతన ఆలయాల్లో రాజన్న ఆలయం ఒకటి. 1800 సంవత్సరంలోనే తిరుపతి ఆలయంతో సమానంగా ఆదా యం ఉన్న ఏకై క దేవాలయం. అలాంటి ఆలయ పునర్నిర్మాణంలో ప్రభుత్వం సిమెంటు వాడుతుండడం వివక్షే అని భక్తులు అభిప్రాయపడుతున్నారు. సర్వత్రా అసంతృప్తి వందలాది ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయ గోపురం పునర్నిర్మాణంలో భాగంగా పనులు ప్రారంభించినప్పటికీ ప్రస్తుత పాలకులు నిర్మాణ పనుల్లో నాటి చరిత్ర లేకుండా సిమెంట్ స్తంభాలతో పనులు జరపడాన్ని రాజన్న భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని నాటి పాలకులు చెప్పినప్పటికీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయ పునర్నిర్మాణానికి నడుం బిగించింది. సిమెంటుతో కూడిన స్తంభాల నిర్మాణంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. 6 బ్లాకులు...314 సిమెంట్ పిల్లర్లు రాజన్న ఆలయ పునర్నిర్మాణంలో గతంలో ఇంజినీరింగ్, స్థపతులు, నిర్మాణ నమూనాను పరిశీలించి ధ్రువీకరించారు. ఆ నమూనాలో భాగంగా ఆలయాన్ని వెయ్యి ఫైల్ ఫౌండేషన్లతో నిర్మించాల్సి ఉండేంది. ఒక్కో ఫైల్ ఫౌండేషన్ సుమారు 10 నుంచి 12 మీటర్ల లోతుతో ఫౌండేషన్ వేసి ఆలయ నిర్మాణం పటిష్టంగా చేయాలని డిజైన్ చేశారు. ఫైల్ ఫౌండేషన్ పనులు చేపట్టినప్పుడే చుట్టుపక్కల ఉన్న ఇతర ఆలయాలతో పాటు పెద్ద పెద్ద భవనాలకు డ్యామేజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో పనులను నిలిపివేసి మరోసారి స్ట్రక్చర్ ఇంజినీంగ్ నిపుణులు ఆలయాన్ని పరిశీలించి మరో నమూనాను తయారు చేసి డీపీఆర్ ఇవ్వాలని హైదరాబాద్లోని ఓ కన్సల్టెన్సీని ఆదేశించారు. వారు ఆలయాన్ని ఆరు బ్లాకులుగా విభజించి 314 పిల్లర్లతో నిర్మించేందుకు మరో బ్లూ ప్రింట్తో కూడిన డీపీఆర్ను సీఎం సమక్షంలో అధికారులకు ప్రజెంట్ చేశారు. దీంతో ప్రభుత్వం రెండవ నమూనాకు ఫైనల్ చేసి నిర్మాణం చేసేందుకు సంవత్సర కాలంలో పూర్తి చేయాలని ఆదేశించింది. రెండో నమూనా ప్రకారం ప్రధాన ఆలయంలో మహా మంటప నిర్మాణానికి 94 పిల్లర్లు, ఈస్ట్ గోపురానికి 52 పిల్లర్లు, బ్రాహ్మణ సత్రానికి 44 పిల్లర్లు, కోటి లింగాలకు 36 పిల్లర్లు, నిత్య కల్యాణ మంటపానికి 56 పిల్లర్లు, అద్దాల మంటపానికి 32 పిల్లర్లతో నిర్మాణం చేపట్టేలా పనులు ప్రారంభించారు. ఆలయం ఇప్పటికే చెరువు పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తుండడంతో ర్యాఫ్ట్ ఫౌండేషన్తో చేపట్టారు. ర్యాప్ట్ ఫౌండేషన్లో చెరువు మట్టిని పూర్తి స్థాయిలో కింది నుంచి తీసివేసి మొదట ఉడెన్ ఫైల్స్ తరువాత మంచి మొరం పోసి దానిపై సిమెంట్ కాంక్రీట్తో పైభాగానికి తీసుకువచ్చిన అనంతరం స్టీల్ మ్యాట్ కట్టి ఆలయాన్ని నిర్మించనున్నారు. బాసర ఆలయాన్ని శిలలతో నిర్మించేందుకు ముందుకు వస్తున్న ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని అదే విధంగా నిర్మించాలంటున్నారు. చారిత్రక దర్పం ఉట్టిపడేవిధంగా, రాబోయే తరాలకు మరింత ఆకర్షణీయంగా కనిపిచేందుకు శిలలైతేనే బాగుంటుందని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. -
రజకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
రామగిరి: రజకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ రజకులకు అండగా ఉంటుందని కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు అన్నారు. మండలంలోని సెంటినరికాలనీలో రజకులకు స్థలం కేటాయించినందుకు బుధవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఏఎంసీ డైరెక్టర్ ప్రవీణ్నాయక్, మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు తోట చంద్రయ్య, నాయకులు ఆరెల్లి కొమురయ్యగౌడ్, ముస్త్యాల శ్రీనివాస్, కాటం సత్యం, అవినాష్, రజక సంఘం నాయకులు ధర్ముల రాజయ్య, పున్నం సమ్మయ్య, కొత్తపల్లి రాజమల్లు, నల్లూరి లింగయ్య, మాదాసి శ్రీనివాస్, బండి రంజిత్ కుమార్ పాల్గొన్నారు. -
ఐదు రోజుల పసికందు మృతి
వేములవాడఅర్బన్: వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐదు రోజుల పసికందు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన అనూష ఐదు రోజుల క్రితం డెలివరీ కోసం ఏరియా ఆసుపత్రికి రాగా వైద్యులు కాన్పు చేయడంతో బాబు జన్మించాడు. ఐదు రోజుల తర్వాత బాబు మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యంతో బాబు మృతి చెందాడంటూ అనూష కుటుంబసభ్యులు బుధవారం ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రసూతి కోసం ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా వైద్య అధికారులు డెలివరీ చేసినప్పటి నుంచి సరైన వైద్య సేవలు అందించలేదని, వైద్యుల నిర్లక్ష్య కారణంగానే తమ బాబు మృతి చెందాడన్నారు. మెరుగైన వైద్యం అందించాం వేములవాడ ఏరియా ఆసుపత్రి పిడియాట్రిక్ ఇన్చార్జి డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ బాబు జన్మించిన నాటి నుంచి బాగానే ఉన్నాడని, మెరుగైన వైద్యం అందించామని, అయితే అకస్మాత్తుగా వచ్చిన ఇన్ఫాంట్ సిండ్రోమ్ వల్ల ఇలా జరిగి ఉండవచ్చునని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని, పోస్ట్ మార్టం చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏమి లేదన్నారు. వివాదాల్లో ఏరియా ఆసుపత్రి వేములవాడ ఏరియా ఆసుపత్రి రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో సైతం డెలివరీ కోసం ఓ మహిళ ఏరియా ఆసుపత్రికి రాగా వైద్యులు లేరంటూ వెనక్కి పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలా జరగడంతో ఆసుపత్రి సేవలపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే అంటూ కుటుంబ సభ్యుల అందోళన -
ఆర్ఎఫ్సీఎల్ మాజీ కాంట్రాక్టర్ ఇంటి ఎదుట నిరసన
ఫెర్టిలైజర్సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరిట నగదు తీసుకుని నేటికీ తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మధ్యవర్తి సిలివేరి రవి ఆవేదన చెందాడు. ఈమేరకు మంగళవారం గౌతమినగర్లోని మాజీ సబ్ కాంట్రాక్టర్ గోపగాని మోహన్గౌడ్ ఇంటిఎదుట కుటుంబ సభ్యులతో నిరసనకు దిగాడు. రవి మాట్లాడుతూ, ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో రూ.కోటి 30 లక్షలను మోహన్గౌడ్ తీసుకొని తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించాడు. మధ్యవర్తిత్వం వహించినందుకు బాధితులకు తన సొంత స్థలం అమ్మి డబ్బులు చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశాడు. తీసుకున్న డబ్బులు చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా వాయిదాల పేరుతో దాటేస్తున్నాడని ఆరోపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిలివేరి రవిని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్కు తరలించారు. -
ఎట్లున్నవ్ రాజన్నా..
● స్వగ్రామానికి మావోయిస్ట్ మల్లా రాజిరెడ్డి ● ఆప్యాయతతో పలకరించిన శాస్త్రుల్లపల్లి గ్రామస్తులు మంథనిరూరల్: ‘ఎన్నాళయ్యింది చూసి.. ఎట్లున్నవ్ రాజన్నా’ అని మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ను శాస్త్రులపల్లి గ్రామస్తులు పలకరించారు. మావోయిస్టు పార్టీని వీడి ఇటీవల జనజీవనంలోకి వచ్చిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి తన స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని శాస్త్రులపల్లికి మంగళవారం వచ్చారు. మావోయిస్టు పార్టీని వీడిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఎప్పుడు తమ గ్రామానికి వస్తాడా.. ఎప్పుడు ఆయనను చూస్తామా.. అని ఎదురు చూస్తున్న క్రమంలో మంగళవారం వచ్చిన ఆయనను గ్రామస్తులు ఆప్యాయతతో పలకరించారు. చిన్నాపెద్దా, తేడా లేకుండా గ్రామస్తులు ఆయనను పలకరిస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మల్లా రాజిరెడ్డి ఉద్యమంలో వెళ్లిన సమయంలో యువకులుగా ఉన్నవాళ్లంతా ఆయనను కలుసుకుని కాసేపు ముచ్చటించారు. అయితే తన ఆరోగ్య సమస్యలతో అజ్ఞాత జీవితాన్ని వీడి బయటకు వచ్చినట్లు మీడియాకు తెలిపారు. మల్లాను కలిసిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఇటీవల జనజీవనంలోకి వచ్చిన మల్లా రాజిరెడ్డి ఉరఫ్ సంగ్రామ్ 40ఏళ్ల తర్వాత తొలిసారి తన స్వగ్రామమైన మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శాస్త్రులపల్లికి రాగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆయనను కలిసి మాట్లాడారు. శాస్త్రులపల్లి గ్రామంలో తన నివాసంలో మల్లా రాజిరెడ్డిని కలిసిన మధూకర్.. మావోయిస్టు ఉద్యమంలో అనుభవాలు, ఎదురైన సంఘటనలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పుట్ట మధూకర్ వెంట స్థానిక నాయకులు తగరం శంకర్లాల్, లొడారి రాములు తదితరులు ఉన్నారు. -
హామీలు నెరవేరుస్తా.. మళ్లీ ఓట్లు అడుగుతా
పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చి మళ్లీ ఓట్లు అడుగుతానని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ రిక్రియేషన్ క్లబ్లో మంగళవారం ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం సందర్భంగా గర్రెపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రక్రి య ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ సహకారం అందించింది. విప్ మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం కడుపుకుంటున్నారన్నారు. సుల్తానాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులు పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ వైస్చైర్ పర్సన్ అంతటి పుష్పలత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, మా ర్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, కౌన్సి లర్లు చింతల రాజు, గరిగే శోభారాణి, మున్సిపల్ కమిషనర్ రమేశ్, తహసీల్దార్ బషీరొద్దీన్, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, డాక్టర్ ఉదయ్ పాల్గొన్నారు. -
ఆటోమేషన్ .. మానవరహితం
పెద్దపల్లిరూరల్: వినియోగదారులకు మెరుగైన నా ణ్యమైన విద్యుత్ సేవలు నిరంతరం అందించేందుకు ట్రాన్స్కో ఆధునిక సాంకేతికతతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే నిరంతరాయంగా విద్యుత్ సేవలను ఆందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న అధికారులు.. తాజాగా ‘ఆటోమేషన్’ పద్ధతిన సబ్స్టేషన్లను నిర్వహించేందుకు శ్రీకా రం చుడుతున్నారు. ఇది అమల్లోకి వస్తే సబ్స్టేషన్ల నిర్వహణ కోసం ఉద్యోగ, సిబ్బంది అవసరమే ఉండదు. మానవరహిత సబ్స్టేషన్లుగా మారనున్నా యి. ఇందుకోసం జిల్లాలో ప్రయోగాత్మకంగా రామగుండం నియోజకవర్గంలోని గౌతమినగర్, రాంమందిర్ఏరియా విద్యుత్ సబ్స్టేషన్లలో ఈనెల నుంచి అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. తొలివిడతలో 28 సబ్స్టేషన్లలో.. జిల్లాలో 69 విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నాయి. అందులో ఆటోమేషన్ పద్ధతిని అమలు చేసేందుకు వీలుగా తొలివిడతలో 28 విద్యుత్ సబ్స్టేషన్లలో ఆటోమేషన్ పద్ధతికి శ్రీకారం చుడుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. మలివిడతలో మరో 8 విద్యుత్ సబ్స్టేషన్లలో ఈ పద్ధతి అమలు కానుందని పేర్కొన్నాయి. ఆధునికీకరించేందుకు రూ.30 లక్షల ఖర్చు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణ, సరఫరా విషయంలో తలెత్తే సాంకేతిక సమస్యలను సులువుగా గుర్తించడమే కాకుండా నేరుగా వరంగల్ సర్కిల్లోని ఉన్నతాధికారులకు చేరవేసేలా ఆటోమేషన్ పద్ధతి(స్కాడర్ కంట్రోల్రూం) ద్వారా అనుసంధానిస్తారు. ఇందుకోసం ఒక్కోవిద్యుత్ సబ్స్టేషన్లో రూ.27 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా ఖర్చుచేయనున్నట్టు సమాచారం. ఇందుకోసం జిల్లాకు ఇప్పటికే రూ.17కోట్లు కేటాయించినట్టు తెలిసింది. ఆటోమేషన్ పద్ధతి అమల్లోకి వస్తే సమస్యలను గుర్తించడం చాలా తేలిక అవుతుంది. దీంతో సమయం ఎంతగానో ఆదా అవుతుంది. సబ్స్టేషన్ల నుంచి నిరంతరం విద్యుత్ సరఫరా ఆధునిక సాంకేతితతో నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రయోగాత్మకంగ జిల్లాలో రెండు సబ్స్టేషన్లలో అమలు ఉద్యోగ, సిబ్బంది లేకుండానే ఆటోమేషన్ పద్ధతి అమల్లోకి వస్తే సాంకేతికతతోనే సమస్యలను గుర్తించి అందుబాటులో ఉన్న సిబ్బందిని వరంగల్ కంట్రోల్రూం నుంచి అప్రమత్తం చేసి నేరుగా సమస్య ఉన్న చోటికే వెళ్లి తక్కువ సమయంలోనే పరిష్కా రం చూపేలా చర్యలు తీసుకుంటారు. ఇందు కోసం ఇప్పటికే అవసరమైన వాహనాలు, ఇ తర సదుపాయాలను సైతం సమకూర్చుకున్నారు. ఆటోమేషన్ సిస్టం అమలైతే విద్యుత్ సబ్స్టేషన్లు మానవరహిత సబ్స్టేషన్లుగా మా రడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విద్యుత్ వినియోగదారుల కు నిరంతరాయంగా మెరుగైన విద్యుత్ సేవలను అందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నా ం. సబ్స్టేషన్లలో లేదా ఇతర లైన్లలో తలెత్తే అంతరాయాలను ఆటోమేషన్ గుర్తించి వరంగల్ కంట్రోల్రూంకు, సమీప అధికారులకు వాట్సాప్ ద్వార సమాచారం అందిస్తుంది. అక్కడి నుంచి అధికారులు పర్యవేక్షించి సమీప అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చి సమస్యకు పరిష్కారం చూపుతారు. – గంగాధర్, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
పెద్దపల్లి: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. గోదావరిఖని గర్నమెంట్ జనరల్ ఆస్పత్రి పనితీరుపై అదనపు కలెక్టర్ అరుణశ్రీ, రామగుండం మేయర్ మహంకాళి స్వామితో కలిసి మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. అన్ని విభాగాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవుట్ సోర్సింగ్ విధానంలో ఖాళీలు భర్తీ చేయాలని తెలిపారు. డయాగ్నొస్టిక్ హబ్ సేవల్లో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారు. ఆస్పత్రి నుంచి వెలువడే వ్యర్థాలను నిబంధనల ప్రకారం డిస్పోస్ చేయాలని సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మే 1 నుంచి జాబ్మేళాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా మే ఒకటి నుంచి 13వ తేదీ వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెగా జాబ్మేళాలు నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మెగా జాబ్మేళా నిర్వహణపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. మెరుగైన ఉపాధి అవకాశాలు సాధించేలా యువతను సిద్ధం చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మధ్యవర్తులు అవసరం లేదని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ప్రజా సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రతీ బుధవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు, పరిశ్రమల అధికారి కీర్తికాంత్, టాస్క్ సెంటర్ అధికారి కౌసల్య, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సేవలు అందించాలి జూలపల్లి: అధికారులు తమ సేవలను సమర్థవంతంగా అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. తెలుకుంట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, పెద్దాపూర్ ఆదర్శ విద్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఆందించాలని సూచించారు. అనంతరం జూలపల్లి తహసీల్దారు కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. -
ఎల్ఐసీ ఏజెంట్ హఠాన్మరణం
కోల్సిటీ: గోదావరిఖని జీఎంకాలనీకి చెందిన ఇరుగురాళ్ల శ్రీనివాస్ (50) అనే ఎల్ఐసీ ఏజెంట్ మంగళవారం అకస్మాత్తుగా మృతి చెందాడు. ఇంట్లో అస్వస్థతకు గురైన శ్రీనివాస్ను జీజీహెచ్కు తరలించారు. చికిత్స ప్రారంభించేలోగా మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుకి సన్స్ట్రోక్ లక్షణాలే అయి ఉంటాయని కుటుంబ సభ్యులు, ఏజెంట్లు తెలిపారు. అంత్యక్రియల కోసం వారి స్వగ్రామమైన ధూళికట్ట గ్రామానికి తరలించారు. కాగా, శ్రీనివాస్ పార్థివదేహానికి ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు జనగామ సదయ్య, ప్రధాన కార్యదర్శి కటకం సతీశ్, కోశాధికారి అంబాల బాబు, జోనల్ నాయకులు బుర్ర దామోదర్తోపాటు ఎంప్లాయ్ అసోసియేషన్ నాయకులు, ఏజెంట్లు నివాళి అర్పించారు. మహిళ ఆత్మహత్య పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామానికి చెందిన యాదగిరి భాగ్యలక్ష్మి(45) కడుపునొప్పి బాధ భరించలేక మంగళవారం క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకులు వెంటనే పెద్దపల్లి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. మృతురాలి భర్త కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. కాలువలో పడి వ్యక్తి మృతి ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి–ఓదెల గ్రామాల మధ్య ఎస్సారెస్పీ డీ–86కాలువలో గోదావరిఖనికి చెందిన బండారి రామరాజు(58) పడి మృతిచెందాడు. మంగళవారం ఉదయం కాలువలో రామరాజు మృతదేహం కొట్టుకురాగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బంధువులకు సమాచారం ఇచ్చారు. గోదావరిఖనికి చెందిన రామరాజు ఎలిగేడు మండలం శివపల్లికి తన స్నేహితుడి వద్దకు వచ్చినట్లు సమాచారం. అయితే, ప్రమాదవశాత్తు జారిపడ్డడా, లేదా ఇతరత్రా కారణాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
వైద్యసేవల్లో ‘పెద్ద’పల్లి భేష్
పెద్దపల్లి: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి అవార్డుల పంట పండింది. రాష్ట్రంలోనే అత్యధిక పురస్కారాలు సాధించిన ఘనత దక్కింది. హైదరాబాద్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నుంచి ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ పురస్కారాలు అందుకున్నారు. వైద్య, సేవల్లో నాణ్యత, ప్రజారోగ్య పథకాల అమలులో సాధించిన విజయానికి ఇది నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పెంచడం, నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడంలో పెద్దపల్లి జిల్లా ఆ స్పత్రి సాధించిన విజయం ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతిష్టాత్మక అవార్డులు జిల్లా ఆస్పత్రి కీలక అవార్డులు సొంతం చేసుకుంది. సూపరింటెండెంట్ కేటగిరీలో శ్రీధర్కు బెస్ట్ సూపరింటెండెంట్ పురస్కారం లభించింది. అనెస్థీషియా, సివిల్ సర్జన్గా ఆయన అందిస్తున్న అత్యుత్తమ వైద్యసేవలకు ఈ గుర్తింపు దక్కింది. ఆరోగ్యశ్రీ ద్వారా అత్యధిక కేసులు విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా ఆస్పత్రికి రాష్ట్రంలోనే ప్రథమ బహుమతి లభించింది. టీ – హబ్ ద్వారా అత్యధిక రక్తపరీక్షలు నిర్వహించినందుకు మరోప్రత్యేక అవార్డు అందుకుంది. రేడియాలజీ విభాగానికి గుర్తింపు కేవలం ఆస్పత్రి స్థాయిలోనే కాకుండా, విభాగాల వారీగా కూడా జిల్లా ఆస్పత్రికి ప్రత్యేక గుర్తింపు లభించింది. రేడియాలజీ విభాగంలో అత్యధిక స్కానింగ్లు నిర్వహించినందుకు డాక్టర్ సంధ్యారాణిని ప్రత్యేక అవార్డుతో సత్కరించారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ మాట్లాడుతూ, ఇది తన వ్యక్తిగత విజయం కాదన్నారు. వైద్యసిబ్బంది సమష్టి కృషి ఫలితం అని పేర్కొన్నారు. పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. అవార్డులు తమ బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు. -
జీజీహెచ్లో ‘క్రిటికల్ కేర్’ సేవలు
కోల్సిటీ(రామగుండం): అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జిల్లావాసులకు ఊపిరి పోసేందుకు గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది. జీజీహెచ్ ఆవరణలోనే సుమారు రూ.23.75 కోట్ల వ్యయంతో 50 పడకల సామర్థ్యంతో రెండు అంతస్తుల్లో భవనం నిర్మించారు. పెద్దపల్లికేకాకుండా పొరుగున ఉన్న మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి తదితర జిల్లాల ప్రజలకు కూడా అత్యవసర వైద్యసేవలు మరింత వేగంగా అందనున్నాయి. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ బుధవారం క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభిస్తారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. రూ.23.75 కోట్ల వ్యయం క్రిటికల్ కేర్ కోసం జీ ప్లస్– 2 పద్ధతిన ఆధునిక భవనం నిర్మించారు. భవన నిర్మాణం కోసం రూ.10 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.13.75 కోట్లు వెచ్చించారు. 2024 ఫిబ్రవరిలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ భూమిపూజ చేశారు. ఆధునిక సదుపాయాలు.. 50 పడకలు క్రిటికల్ కేర్ సెంటర్ 50 పడకల సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రతీబెడ్ వద్ద ఆధునిక మానిటరింగ్ పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ లైన్లు, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టమ్, సర్జికల్ సపోర్ట్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. పేషెంట్లకు 24 గంటలపాటు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందిని నియమించనున్నారు. క్రిటికల్ కేర్ విభాగంలో 60 రకాల అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చాలని కోరుతూ ఆరు నెలల క్రితమే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కి జీజీహెచ్ సూపరింటెండెంట్ దయాళ్సింగ్ ప్రత్యేకంగా లేఖ రాశారు. కలెక్టర్ పర్యవేక్షణలో భవన నిర్మాణం కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ విభాగం పనులు వేగంగా పూర్తయ్యాయి. నిర్మాణంలో ఆలస్యం జరగకుండా తరచుగా సమీక్షించారు. ఇంజినీర్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ పనుల్లో వేగం పెంచేలా చొరవ తీసుకున్నారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ప్రమాదాలు, గుండె సంబంధిత సమస్యలు, తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించేందుకు అవసరమైన పరికరాలు, ప్రత్యేక విభాగాలు ఈ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఏర్పాట్లు చేస్తున్నాం క్రిటికల్ కేర్ను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు బుధవారం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేపట్టాం. ఇప్పటికే అత్యాధునిక వైద్యపరికరాలు తెప్పించాం. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. – అరుణ, డిప్యూటీ సూపరింటెండెంట్, జీజీహెచ్ -
సొంతింటి కలను నిజం చేస్తున్న ప్రభుత్వం
గోదావరిఖని/కోల్సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కల నిజం చేస్తోందని రామగుండం ఎ మ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ తెలిపారు. గోదావరిఖ ని జవహర్నగర్లోని 54వ డివిజన్లో లబ్ధిదారు చే పట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మేయర్ మ హంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే మక్కాన్సింగ్ మంగళవారం భూమిపూజ చేశారు. కార్పొరేటర్ ముస్తఫా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య పాల్గొన్నారు. పనిస్థలాల సందర్శన రామగుండం: ఎమ్మెల్యే ఠాకూర్ ఉపాధి కూలీల ప నిస్థలాలను సందర్శించారు. మక్కాన్సింగ్ఠాకూర్ సేవా సమితి తరఫున టోపీలు, గ్లూకోస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పెండ్యాల మహేశ్, బీసీ సెల్ మండల ప్రతినిధి సింగం కిరణ్కుమార్, మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక సాంకేతికత వినియోగించాలి
గోదావరిఖని: నేరస్తులను పట్టుకోవడంలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. మంగళవారం నేరసమీక్ష సమావేశం సీపీ కార్యాలయంలో నిర్వహించారు. పెండింగ్కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, పోలీస్ సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు. బాధితులకు న్యాయం త్వరితగతిన అందేలా న్యాయాధికారులతో సమన్వయం పాటించాలని అన్నారు. చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లు తెరవాలని, చోరీలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, రామ్రెడ్డి, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ ఏసీపీలు రమేశ్, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, కిరణ్కుమార్, నాగేంద్రగౌడ్, శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ ఎండీ ఇస్మయిల్(50)దుర్మరణం చెందాడు. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీకళాశాల సమీపంలోని రాజీవ్ రహదారిపై వెళ్తున్న ఆటోను వెనకాల వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీస్ల కథనం ప్రకారం.. రామగుండం ముబారక్నగర్కు చెందిన ఎండీ ఇస్మాయిల్ మంగళవారం వేకువజామున తన ఆటోలో ఎన్టీపీసీ నుంచి గోదావరిఖని బస్టాండ్ వైపు బిజిలీ రాధ అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని ఎక్కించుకుని వస్తున్నాడు. హైదరాబాద్ నుంచి వెనకాలే వచ్చిన షిఫ్ట్కారు బలంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటో తలకిందులు కాగా బిజిలీ రాధ తలకు గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కారు కూడా తలకిందులైంది. స్థానిక కల్యాణ్నగర్కు చెందిన బొంకూరి పవన్కుమార్ తనమిత్రులు చిరంజీవి, రాజేశ్తో కలిసి హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న పవన్కుమార్, చిరంజీవి, రాజేశ్కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇస్మాయిల్ మృతి చెందారు. మృతుడి సోదరుడు ఇబ్రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఇంద్రసేనారెడ్డి కేసునమోదు చేసుకున్నారు. కళ్లెదుటే ఉంటానన్నాడు.. కనిపించకుండా పోయాడు రామగుండం: ‘కళ్లెదుటే ఉంటానన్నాడు.. కనిపించకుండా పోయాడు.. హెవీలైసెన్స్ ఉంది.. డ్రైవింగ్లో నిష్ణాతుడు.. దూర ప్రాంతాలకు వెళ్తే కుటుంబసభ్యులకు రోజుల తరబడి దూరంగా ఉండాల్సి వస్తుందన్నాడు.. నేషనల్ హైవేలపై అనూహ్య ఘటనలు జరిగితే భార్యాపిల్లల భవితవ్యం ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన చెందాడు.. అందుకే మూడేళ్లక్రితం ఆటో కొనుగోలు చేశాడు.. స్థానికంగానే ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకున్నాడు. లారీ డ్రైవర్ పని వద్దనుకున్నా మృత్యుడు మాత్రం వెంటాడింది’ అని మృతుడి భార్య నసీమా, కూతుళ్లు తహసీన్, తన్వీర్ రోదిస్తున్న తీరు ప్రతీఒక్కరిని కంటతడి పెట్టించింది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా రామగుండం ముబారక్నగర్లో నివాసం ఉంటున్న ఇస్మాయిల్(36)తోపాటు తండ్రి, నలుగురు కుమారులు డ్రైవర్లుగానే పనిచేస్తున్నారు. ఇస్మాయిల్కు 17ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. అయోధ్యనగర్లో భార్యాపిల్లలతో వేరేకాపురం పెట్టాడు. లారీలు రోడ్డు ప్రమాదాలకు గురై డ్రైవర్లు మృత్యువాత పడుతుండడంతో భార్య నసీమా.. భారీ వాహనాల డ్రైవింగ్ వద్దని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మూడేళ్లక్రితం ఆటో కొనుగోలు చేసి స్థానికంగానే నడుపుతున్నాడు. పెద్ద కూతురు తహసీన్ ఇంటర్మీడియట్, చిన్న కూతురు తన్వీర్ పదో తరగతి చదువుతోంది. మరోమూడు రోజుల్లో ఈమే చివరి పరీక్ష రాయాల్సి ఉంది. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతో భార్య కుట్టుమిషన్తో వచ్చే సంపాదన ఇంటి ఖర్చులకు ఆసరాగా నిలుస్తోంది. ఎంతోహాయిగా సాగిపోయే కుటుంబంలో గోదావరిఖనిలో మంగళవారం కారు, ఆటో ఢీకొన్ని ప్రమాదంలో ఇస్మాయిల్ దుర్మరణం చెందడం తీవ్ర విషాన్ని నింపింది. ముబారక్నగర్, అయోధ్యనగర్ కాలనీవాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. గోదావరిఖనిలో కారు, ఆటోఢీ రాజీవ్ రహదారిపై ఘటన -
హైదరాబాద్కు తరలిరండి
పెద్దపల్లి: హైదరాబాద్లో ఈనెల 14న నిర్వహించే పీడీఎస్యూ నేత జార్జిరెడ్డి వర్ధంతి స భను విజయవంతం చేయాలని ఆ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కూతటి రాణాప్రతాప్ కోరారు. జార్జిరెడ్డి వర్ధంతి సభ ప్రచార పోస్టర్ను స్థానిక నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థి ఉద్యమాలకు మార్గదర్శకుడు జార్జిరెడ్డి అన్నారు. పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు లోకిని రమేశ్, ప్రతినిధులు సుమన్, చందు, నవీన్, శ్యామ్, సంధ్య, శ్రావణి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య రక్షణపై అవగాహన కోల్సిటీ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో మంగళవారం ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఆర్ఎంవో కృపాబాయి మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు జీవనశైలిలో మార్పులు అవసరమని అన్నారు. వ్యాధులను నివారించడంలో టీకాల ప్రాముఖ్యతను గుర్తించాలని తెలిపారు. వైద్యుల సూచనలు లేకుండా మందులు వాడకూడదని, స్వయంగా చికిత్స చేసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్సీడీ పీవో రాజమౌళి, మెడికల్ ఆఫీసర్ అతుల్య, హెల్త్ ఎడ్యుకేటర్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. చికిత్స పొందుతూ మృతిముత్తారం: ఇప్పలపల్లి(రామకృష్ణాపూర్) గ్రా మానికి చెందిన తుండ్ల సుమతి(50) పురుగు ల మందు తాగిన మైకంలో కాలుజారీ వ్యవసాయ బావిలోపడగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈనెల 4న ఆర్థిక ఇబ్బందులతో పురుగులమందు తాగిన సుమతి.. తనఇంటి సమీపంలోని వ్యవసా య బావిలో ప్రమాదవశాత్తు పడగా చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. భర్త రాములు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. మంగళవారం.. ‘మహాలక్ష్మి’జిల్లాలో మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా వైద్యపరీక్షలు చేశారు. గర్భిణులతోపాటు సాధారణ మహిళలకూ నిత్యం జరిగే పరీక్షలతోపాటు విటమిన్ బీ– 12, డీ–3, థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలు అదనంగా చేశారు. సీ్త్రవైద్య నిపుణులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. ఈ ప్రక్రియ ‘మంగళవారం.. మహాలక్ష్మి’అని సిబ్బంది ‘సాక్షి’కి తెలిపారు. -
బాధితులకు ఊరట
పెద్దపల్లి: వ్యవసాయ బావులు, నివాసాల్లో విద్యుత్ ప్రమాదాలతో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఊరట కలిగించింది. గతంలో చెల్లించే పరిహారాన్ని పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇస్తుండగా దానిని రూ.8 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పశువులకు చెల్లించే పరిహారరాన్ని గతంలో మాదిరిగా రూ.40 వేలు చెల్లించాలని నిర్ణయించిందని ట్రాన్స్కో ఎస్ఈ గంగాధర్ తలిపారు. అర్ధంటపాటు నడవాలి పెద్దపల్లి: సంపూర్ణ ఆరోగ్యం కోసం అందరూ రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవా లని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ప్రమో ద్ కుమార్ కోరారు. ప్రజా పాలన.. ప్రగతి ప్ర ణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐటీఐ మైదానం నుంచి జిల్లా కేంద్ర ఆస్పత్రి వరకు సోమవారం వాక్థాన్ నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ, సరైన సమయంలో, సరైన మోతాదులో ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మున్సిపల్ క మిషనర్ వెంకటేశ్, ఇండియన్ రెడ్క్రాస్ సొ సైటీ జిల్లా అధ్యక్షుడు కావేటి రాజగోపాల్, స భ్యులు బోడకుంట రామకృష్ణ, మీచాల సత్య నారాయణ, రేకులపల్లి శశాంక్, ప్రతినిధులు రాజమౌళి, కొట్టె లక్ష్మయ్య, శ్రవణ్, మమత, సంయుక్త, విద్యార్థులు పాల్గొన్నారు. బీజేపీ జెండా ఎగురవేస్తాం పెద్దపల్లి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షు డు కర్ర సంజీవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సు ల్తానాబాద్, శాసీ్త్రనగర్, పూసాలలో సోమరవారం నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ యా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్రావు, నాయకులు గొట్టిముక్కుల సురేశ్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, సౌదరి మహేందర్ యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్, కామని రాజేంద్ర ప్రసాద్, చాతరాజు రమేశ్, కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్, కొ మ్మిడి రాజేందర్రెడ్డి, వడ్లకొండ శశివర్ధన్, మ ల్క భాగ్యలక్ష్మి, పెరక రమేశ్, మారం రమేశ్, ఏనుగు రాజిరెడ్డి, వి.కిరణ్ పాల్గొన్నారు. ప్రథమ చికిత్స పోటీలు గోదావరిఖని: ఆర్జీ–1లోని జీడీకే–1, 3గనిపై సోమవారం ప్రథమ చికిత్స పోటీలు నిర్వ హించారు. గాయపడినవారికి సీపీఆర్, చికిత్స చేయడం, వారిని అంబులెన్స్లో సకాలంలో ఆస్పత్రికి తరలించే అంశాలపై పోటీ నిర్వహించారు. కార్యక్రమములో ప్రథమ చికిత్స తనిఖీ బృందం ఎస్.సాయిప్రసాద్, కె.ఉదయ్కుమార్, జి.మధుబాబు, గని ఏజెంట్ ఎల్.రమేశ్, గనిమేనేజర్ సుధీర్జక్కుల్వార్, రక్షణ అధికారి శ్రీను పాల్గొన్నారు. -
తాగుతూ.. చిక్కుతూ..
సాక్షి పెద్దపల్లి: 35,78,108, 152.. ఈ అంకెలు చూడగానే ఓ విద్యాసంస్థ సాధించిన ర్యాంకులు అనుకుంటున్నారా.. కానేకాదు.. ఇటీవల మద్యం మత్తులో పోలీసుల కు చిక్కి ఊదిన వారి రీడింగ్లు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు పెరుగు తున్నా కొందరు మందుబాబు లు ఏ మాత్రం బెదరడం లేదు. మద్యం మత్తులో వాహనాలు న డుపుతూనే ఉన్నారు. గతంలో మాదిరిగా మద్యం తాగి పట్టుబడితే ఎంతోకొంత జరిమానా చె ల్లించో లేదా ఏదైనా సిఫారసుతోనో అక్కడి నుంచి బయటప డే అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష పడొచ్చు. అయి నా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. తనిఖీ సమయంలో పక్కా ఆధారాలతో పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చుతున్నారు. మో టారు వాహన చట్టం 185 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఒకసారి కేసు నమోదైతే కోర్టులో రూ.500 నుంచి రూ.10 వేల వరకు జరిమానా లేదా జైలుశిక్ష లేదా రెండూ విధించే అవకాశాలున్నాయి. మద్యం తాగి పట్టుబడే వారి విషయంలో కోర్టులు సైతం కఠిన వైఖరి అవలంబిస్తున్నాయి. తప్పించుకునేందుకు ప్రయత్నాలు డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్స్లో పోలీసులకు చిక్కకుండా మందుబాబులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో తా ము ప్రయాణించేదారిలో ఎక్కడైనా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీ ఉంటే వాహనాలు వెనక్కి తిప్పి జారుకునేవారు. అయితే పోలీసులు అటువంటి అవకాశం లేకుండా మూడు వైపులా దారి లేకుండా.. నాలుగో వైపు తాము ఉండి చెకింగ్స్ చేస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం మందుబాబులు వెతుకుతున్నారు. ఏరియాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రతిరోజూ ఎక్కడికక్కడ చెకింగ్స్ అవుతున్నాయో పోస్ట్ చేస్తూ ప్పించుకుంటున్నారు. మత్తుతో నియంత్రణ కోల్పోయి మద్యం తాగి వాహనాలు నడపడంతో శరీరంపై పట్టుకోల్పోతారు. వాహనాలపై నియంత్రణ ఉండదు. మద్యం మత్తులో తూలుతూనే వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడి తీవ్ర గాయాలపాలవుతున్నారు. లేదంటే ప్రాణాల మీదకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మద్యం తాగితే ప్రయాణాలకు వీలైనంత దూరంగా ఉండాలి. డ్రంకెన్ డ్రైవ్ కేసులు వివరాలు 2025 2026లో(ఇప్పటివరకు) కేసులు 9,674 1,915జైలుశిక్ష 30 15 జరిమానా(రూ.లో) 1,01,39,700 13,64,906‘ఒక్కటే బీరు తాగినా.. రెండు పెగ్గుల విస్కీ తాగాను.. ఇంతశాతం ఎలా వచ్చింది.? అంత రాకూడదు అసలు..’ ఇలా సాధారణంగా మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడిన వారిమధ్య సాగే చర్చ. కానీ వాహనదారుల రక్త నమూనాల్లో 30 మి.గ్రా. మద్యం మోతాదు దాటితే కేసు నమోదవుతోంది. ఇది తెలియకుండా కొందరు వాహనదారు లు కొద్దిగానే తాగాం కదా అనుకుంటూ మత్తులో ఊగుతూ ప్రమాదాలకు కారణమవుతూ పోలీసులకు చిక్కుతున్నారు. మరికొందరు ‘పోలీసు మామల స్క్వాడ్’, ‘చెకింగ్ పాయింట్స్’.. ఇలా పలు పేర్లతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని పోలీసుల చిక్కకుండా తప్పించుకుంటున్నారు.మదం్య తాగి నడిపితే చర్యలు మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం మత్తులో వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తున్నాం. – రమేశ్, ఏసీపీ, గోదావరిఖని -
స్కూల్ను సందర్శించిన జర్మనీ బృందం
ధర్మారం: జర్మనీ దేశానికి చెందిన మై వాయిస్ ఫర్ పూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఓడేట్టే మేజమే కల్డవెల్ పత్తిపాక ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, బోధన విధానాలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రధానోపాధ్యాయుడు నూతి మల్లన్న పాఠశాల ప్రగతి గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. సుమారు 70 ఏళ్లక్రితం ప్రారంభించిన ఈపాఠశాలకు కాలినడకన వచ్చిన వేలాది మంది విద్యార్థులకు అక్షరజ్ఞానం అందించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నూతి మల్లన్న, జమునరాణి, విఠల్, విద్యార్థులు పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన సాగర్ రంజన్ సాహూ
జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ –తెలంగాణ ప్రాజెక్టు ఏజీఎం(హెచ్ఆర్)గా సాగర్ రంజన్ సాహూ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంతను కలిసి మొక్క అందజేశారు. ప్రాజెక్టు ఏజీఎం బిజయ్ కుమార్ సిగ్దర్ గతనెల ఉద్యోగ విరమణ పొందడంతో ఎన్టీపీసీ మౌదా ప్రాజెక్టు నుంచి సాగర్ రంజన్ సాహూను రామగుండం బదిలీ అయ్యారు. రామగుండంలో డీడీఎంఎస్ పర్యటన గోదావరిఖని: సింగరేణి రా మగుండం రీజియన్లో ఎ లక్ట్రికల్ డీడీఎంఎస్ కమలేశ్చౌదరి సోమవారం పర్యటించారు. ఇల్లెందు గెస్ట్హౌస్కు చేరుకున్న ఆయన కు జీఎం లలిత్కుమార్ స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. నాలుగురోజుల పాటు గనుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధికారులు రామమోహనరావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,968 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో సోమవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,968 పలికింది. కనిష్టంగా రూ.5,826గా, సగటు రూ.7,468గా నిర్ధారించినట్టు మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి వివరించారు. -
నిర్లక్ష్యం.. గందరగోళం
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)తోపాటు సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్)లో పా లన లోపాలు ముదురుతున్నాయి. బాధ్యతా రాహిత్యం, సమన్వయాలోపం పేషెంట్లకు నరకం చూ పుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లోపించిన జవాబుదారీతనం మెడికల్ సూపరింటెండెంట్ విభాగం జవాబుదారీతనం కోల్పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. సూపరింటెండెంట్ సంతకాలు, చాంబర్కే పరిమితమవుతున్నారని, నిర్వహణ బాధ్యతలు ఆర్ఎంవోలపై పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొందరు వైద్యులు, సిబ్బంది వారంలో రెండు, మూడుసార్లే విధులకు హాజరువుతున్నారని స మాచారం. హైదరాబాద్ నుంచి వచ్చిపోయే వైద్యాధికారులపై చర్యలకు వెనుకాడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఇది ఆస్పత్రిలోని పలువురు వైద్యుల మధ్య మనస్పర్థలకు దారితీస్తోంది. మందులు, స్కానింగ్కు ప్రైవేటుకే.. పేషెంట్లకు మందులు లేవని చెబుతూ బయట కొ నుగోలు చేయాలని సూచిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్కానింగ్ పరీక్షలు ఆస్పత్రిలో అందుబా టులో ఉన్నా.. తాము సూచించిన ప్రైవేట్ సెంట ర్లకు రెఫర్ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దేహదాత కుటుంబాలకు అవస్థలు మెడికల్ కాలేజీకి పార్థివదేహాలు దానం చేసేందుకు వస్తున్న అనేక కుటుంబాలకు అనవసరమైన నిబంధనలు విధిస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం గౌరవవందనం చేపట్టకుండా, మార్చురీలో రోజుల తరబడి నిల్వచేస్తూ అవమానిస్తున్నారని అంటున్నారు. అనాటమీ, ఆస్పత్రి అధికారుల మధ్య సమన్వయ లోపం సమస్యను మరింత జటిలం చేస్తోంది. రక్తదాతలకు అందని అభినందన పత్రాలు? బ్లడ్బ్యాంకులో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారికి అభినందన పత్రాలు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. సర్టిఫికెట్లపై ఆలస్యంగా సంతకాలు చేయడంతో దాతలు మరోసారి ఆస్పత్రికి రావాల్సి వస్తోంది. కొందరు అధికారులు దాతలను అవమానిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీసీ కెమెరాలు నిర్వీర్యం ఆస్పత్రి భద్రతలో అ త్యంత కీలకమైన సీసీ కె మెరాల నిర్వహణలో తీ వ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. పలు విభాగాల్లో కెమెరాలు పనిచేయక ఆందోళన కలిగిస్తోంది. గాడి తప్పిన శానిటేషన్ ప్రభుత్వ ఆస్పత్రి పరిసరాల్లో పరిశుభ్రత లోపించింది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. మరోవైపు.. సిబ్బంది పేషంట్లతో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సేవలు మెరుగుపడేనా? జీజీహెచ్లో వైద్యసేవలపై దృష్టి సారించడంతోపాటు పలు స మస్యలు పరిష్కారం, అభివృద్ధి తదితర అంశాలపై ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మంగళవారం కలెక్టరేట్లో సమావేశం కానుంది. బోధనాస్పత్రి, మెడికల్ కాలేజీ అభివృద్ధి తదితర అంశాలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్షిస్తారని తెలిసింది. ముఖ్యంగా వసతుల కల్పన, వైద్య సేవల విస్తరణ, సమస్యల పరిష్కారం, బిల్లుల చెల్లింపులు వంటి కీలక అంశాలు చర్చకు వస్తాయని సమాచారం. ఆస్పత్రి నిర్వహణలోని లోపాలను గుర్తించి, పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టే దిశగా అధికారులకు సూ చనలు జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
రుణాల పంపిణీలో నంబర్ వన్
పెద్దపల్లి: మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం మహిళలకు రుణాలు అందిస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు ఆర్థికంగా ఎదురగుతున్నారు. ఈక్రమంలోనే రుణాల పంపిణీ, రికవరీలో జిల్లా తెలంగాణకే ఆదర్శంగా నిలిచింది. సీ్త్రనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ద్వారా మెప్మా పరిధిలో అందించిన సేవలకు గుర్తింపుగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకుంది. 96శాతం రికవరీ రేటు, రూ.22.19 కోట్ల రుణ పంపిణీతో జిల్లా యంత్రాంగం చరిత్ర సష్టించింది. రాష్ట్రంలో అగ్రస్థానం జిల్లా సాధించిన విజయం కేవలం సంఖ్యల వరకే కాదు.. మహిళల నమ్మకం, అధికారుల కృషి కలగలిపిన ఫలితం. 96శాతం రికవరీ రేటు రాష్ట్రంలోనే అత్యధికం. మహిళా సంఘాల సభ్యులు క్రమశిక్షణతో సకాలంలో వాయిదాలు చెల్లించడమే ఇందుకు కారణం. జిల్లాలోని మహిళల ఆర్థిక పురోభివద్ధి కోసం రికార్డుస్థాయిలో రూ.22.19 కోట్ల రుణాలు మంజూరు చేశారు. చిన్న వ్యాపారాలు, గృహ, పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాలకు ఇవి ఊతమిచ్చాయి. ఈ ఘనతకు గుర్తింపుగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్, అరుణశ్రీ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. 2025–26 జిల్లాలో డిమాండ్ రూ.18 కోట్ల 43 లక్షల రూ.22 కోట్ల 19 లక్షలు(120) శాతం పంపిణీ చేసినట్లు ఆర్ఎం దుర్గాప్రసాద్ తెలిపారు. రికవరీ చేయాల్సింది రూ.15 కోట్ల 25 లక్షలకు రూ.14 కోట్ల 53 లక్షలు రికవరీ చేశారు. జిల్లాలో ఎస్ఎస్జీలు 4,644 ఉండగా 44,172 మంది సభ్యులు ఉన్నారు. మహిళలకు ఆర్థిక ఊతం సీ్త్రనిధి ద్వారా అందించే రుణాలు మహిళలకు ఊరటనిస్తున్నాయి. కేవలం 92 పైసల వడ్డీకే(సంవత్సరానికి 11.04శాతం) రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఇది బ్యాంకుల వడ్డీరేట్ల కన్నా చాలాతక్కువ. చిన్నతరహా పరిశ్రమలు, వ్యాపారాలు చేసే మహిళలకు ఈ తక్కువ వడ్డీరేటు ఎంతో ప్రయోజనకరంగా మారింది. డిజిటల్ విప్లవంతో పారదర్శకత రుణాల పంపిణీ, వసూళ్లలో పారదర్శకత సాధించడానికి జిల్లా యంత్రాంగం శ్రీమన సీ్త్రనిధిశ్రీ యాప్ను విరివిగా ప్రోత్సహిస్తోంది. ప్రతీసభ్యురాలు తన వ్యక్తిగత రుణ వివరాలు, వాయిదాలు, బ్యాలెన్స్ను నేరుగా యాప్లో చూసుకోవచ్చు. తద్వారా ఎవరూ మోసపోయే అవకాశం లేదు. స్వయం సహాయక సంఘం ఆర్థిక స్థితిగతులు, గ్రూపు లెడ్జర్ వివరాలు పారదర్శకంగా తెలుస్తాయి. అధికారుల కృషి, మహిళల క్రమశిక్షణ అధికారుల చొరవ, మహిళల క్రమశిక్షణ అవార్డు సాధించడానికి దోహదం చేశాయి. అదనపు కలెక్టర్ అరుణశ్రీ నేతత్వంలోని మెప్మా సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ల సహకారం కీలకమైంది. ‘మన సీ్త్రనిధి’ యాప్పై అవగాహన కల్పించడంతో మహిళలు డిజిటల్ పద్ధతిని అలవర్చుకున్నారు. సీ్త్రనిధి బ్యాంకు సిబ్బంది సహకారం రుణాల పంపిణీ, వసూళ్లలో వేగం పెంచింది. ఇది కొత్త అధ్యాయం జిల్లా సాధించిన విజయం కేవలం అవార్డు కాదు.. మహిళా సాధికారతలో కొత్త అధ్యాయం. రుణాలు పొందిన మహిళలు స్వయం ఉపాధి పొంది, కు టుంబ ఆదాయాలు పెంచుకున్నారు. ఆర్థిక స్వావలంబన సాధించారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం, సమాజంలో గౌరవం పెరిగాయి. భవిష్యత్లో కూడా ఇదే స్ఫూర్తితో మహిళా సంక్షేమంలో ముందంజలో ఉంటామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. -
సమస్యలు వింటూ.. పరిష్కారం చూపుతూ..
పెద్దపల్లి: అభాగ్యుల సమస్యలు వింటూ అక్కడిక క్కడే పరిష్కరించేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్ర త్యేక చొరవ తీసుకున్నారు. కలెక్టరేట్లో సోమవా రం నిర్వహించిన ప్రజావాణి ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. పాలకవర్గం తీర్మానం ప్రకారం మట్టి తీయొ ద్దని పెద్దపల్లి మండలం తురకలమద్దికుంట సర్పంచ్ రాజయ్య కోరారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంట నష్టంపై వ్యవసాయాధికారులు సర్వే చేయా లని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కో ఆర్డినేటర్ ఆ కుల స్వామి వివేక్ పటేల్ విన్నవించారు. కన్నాలలో ఫ్లై ఓవర్ ఒకవైపు ఉంటే మరోవైపు రోడ్డు నిర్మిస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి రాజీవ్నగర్లోని ఆర్.రాధ.. తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరింది. అంతర్గాం మండలం విస్సంపేటకు చెందిన పి.కిట్టయ్య.. తాము బర్రెలు కాసుకుంటూ బతుకుతున్నామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విన్నవించాడు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్.. వాటిని పెండింగ్లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న సుమారు 12 వేల మంది విద్యార్థులకు రాజీ లేకుండా నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. కేజీబీవీ, గురుకుల విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలల వంట మనుషులతో తన కార్యాలయంలో సమీక్షించారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలో విద్యార్థులు బయటి ఆహారం తీసుకొని అస్వస్థతకు గురయ్యారని, అయినా ప్రభుత్వ పాఠశాలలపై విమర్శలు వస్తున్నాయని, ఇలాంటి వాటికి తావివ్వరాదని పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ప్రమోద్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్రెడ్డి పాల్గొన్నారు. -
రోడ్లపై కంకర, ఇసుక పోస్తే చర్యలు
కోల్సిటీ: వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగేలా రోడ్లపై ఇసుక, కంకర పోస్తే తగిన చర్జీ వసూలు చేయడంతోపాటు జరిమానా విధిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, 52వ డివిజన్ కార్పొరేటర్ చిదురాల నాగరాజుతో కలిసి సోమవారం ఆయన కాకతీయనగర్లో పర్యటించారు. కంకర, ఇసుక రోజుల తరబడి రోడ్లపై ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దుకాణ యజమానులు సామగ్రిని రోడ్డుపై పెట్టొద్దని సూచించారు. జేసీబీ, బ్లేడ్ ట్రాక్టర్, బాబ్కార్ట్లు, 15 మంది సిబ్బందితో మురుగునీటి కాలువలో సుమారు కిలో మీటర్ దూరం వరకు పూడిక తీశారు. పిచ్చిమొక్కలు, చెట్లకొమ్మలు తొలగించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఏఈ జమీల్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, జవాన్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు. సౌకర్యాల కల్పనకు రూ.20 కోట్లు రామగుండం: సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ రూ.20 కోట్లు వెచ్చించాలనే ఆదేశాల మేరకు ప్రతీవీధిలో రహదారుల విస్తరణతో ఊహించని అభివృద్ధి సాగుతోందని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. 25వ డివిజన్ మల్యాలపల్లిలో రూ.మూడు కోట్ల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతీవీధిలోని చివరి ఇంటివరకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లేలా విస్తరిస్తున్నామన్నారు. కార్పొరేటర్ సిరిశెట్టి సతీశ్గౌడ్, కాంగ్రెస్ నాయకులు అయోధ్యసింగ్ఠాకూర్, ఈదునూరి హరిప్రసాద్, కార్పొరేటర్లు ఇసంపెల్లి అంజులు, దాసరి సాంబమూర్తి, వడ్లూరి రవి, అప్పాసి శ్రీనివాస్, బల్వన్సింగ్ఠాకూర్, యాసిన్, జబ్బార్, మోసం పృఽథ్వీ తదితరులు ఉన్నారు. -
కర్ణాటక వాటర్ ఫాల్స్లో యువకుడి మృతి
కోరుట్ల: కర్ణాటకలోని అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో విభూత వాటర్ ఫాల్స్లో ప్రమాదవశాత్తు పడి కోరుట్ల మున్సిపల్ వీలిన గ్రామం ఎఖీన్పూర్కు చెందిన శీలం అజయ్గౌడ్(25) మృతిచెందాడు. వివరాలు.. ఎఖీన్పూర్కు చెందిన శీలం వెంకటేశ్–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు అజయ్గౌడ్ 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చాడు. ఆదివారం సరదాగా హైదరాబాద్లో ఉండే ఇద్దరు స్నేహితులతో కలిసి కర్ణాటక టూర్ వెళ్లాడు. సోమవారం ఉదయం అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని విభూత వాటర్ ఫాల్స్లో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీటిలో ఉన్న రాయి తాకి శ్వాస ఆడక మృతిచెందినట్లు సమాచారం. ఆయన వెంట ఉన్న స్నేహితులు ఆజయ్గౌడ్కు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. సోమవారం సాయంత్రం కర్ణాటక వెళ్లారు. అంకోలా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
మీడియాపై వీసీ చిందులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో అర్బన్ నక్సలైట్లు ఉన్నారంటూ రేగిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదు. ఒకవైపు పోలీసులు అలాంటి వ్యక్తులు ఎవరూ లేరని ప్రకటనలు జారీ చేస్తున్నా.. కొందరు మాత్రం ఈ ప్రచారాన్ని ఆపడం లేదు. ప్రొఫెసర్ సుజాత, వైస్ చాన్స్లర్ వర్గాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇందులో భాగంగా సోమవారం వర్సిటీలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై వీసీ చిందులు తొక్కడం, పోలీసులతో బెదిరించేందుకు యత్నించడం, విద్యార్థులపై కేసులు పెడతా అంటూ హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వర్సిటీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సాయంత్రానికి యూనివర్సిటీ విద్యార్థులు సీపీ గౌస్ ఆలం చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం విశేషం. మీడియాతో వీసీ వాగ్వాదం శాతవాహన గాథల పేరుతో ఔట్సోర్సింగ్ పోస్టులను అమ్ముకుంటున్నారంటూ ‘కొలువులమ్మా.. కొలువులు’ అన్న శీర్షికన సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. అర్బన్ నక్సలైట్లు, కొలువుల విక్రయాలపై వార్తలను కవర్ చేసేందుకు సోమవారం సాక్షి టీవీతోపాటు, ఇతర ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు శాతవాహన వర్సిటీకి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వైస్ చాన్స్లర్ ఉమేశ్కుమార్ వారిపై చిందులు తొక్కారు. అసలు మీరెవరు? మిమ్మల్ని ఎవరు లోనికి రానిచ్చారు? ఎవరి అనుమతి తీసుకున్నారు? అని వాగ్వాదానికి దిగారు. దీనికి మీడియా ప్రతినిధులు దీటుగానే స్పందించారు. యూనివర్సిటీ పౌరుల ఆస్తి అని, ఇక్కడకు వచ్చేందుకు తాము ఎవరినీ అనుమతి కోరనవసరం లేదని బదులిచ్చారు. ఈ లోపు వీసీ ఎప్పటిలాగే కొత్తపల్లి పోలీసులను క్యాంపస్లోకి దింపి మీడియాను నియంత్రించేందుకు విఫలయత్నం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ సీసీ కెమెరాల ద్వారా క్యాంపస్ను పర్యవేక్షిస్తూ.. త నకు అనుమానం వచ్చిన ప్రతీ విద్యార్థిని తన ఛాంబర్కి పిలిపించుకుని కేసులు పెడతామంటూ వీసీ హెచ్చరించే వారని విద్యార్థులు తొలినుంచి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా వీసీ ఉమేశ్కుమార్ పలువురు విద్యార్థులను త న ఛాంబర్కి పిలిపించి కేసులు పెట్టి లోపలేస్తానంటూ మాట్లాడిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇవే ఆడియోలు, వీడియోలను త్వరలోనే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు కూడా వర్సిటీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ రు సమర్పించనున్నారు. అదేవిధంగా బాధితులు తమ ను అర్బన్ నక్సలైట్లంటూ చిత్రీకరిస్తున్న వారిపై జా తీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేయనున్నారు. శాతవాహన వర్సి టీలో ఎలాంటి అర్బన్ నక్సలైట్లు లేరని స్పష్టం చే స్తూ ప్రకటించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చిత్రపటానికి విద్యార్థులు వర్సిటీ ప్రధానద్వారం ఎదుట క్షీరాభిషేకం చేయడం విశేషం.కరీంనగర్సిటీ: తమపై తప్పుడు ప్రచారం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాతవాహన విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం సీపీ గౌస్ఆలం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. 10 రోజుల నుంచి విద్యార్థులు, పలువురు ప్రొఫెసర్లపై వస్తున్న ఆరోపణలపై సీపీ స్పందించి వర్సిటీలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగ డం లేదని తెలుపడంతో తమ ఆత్మవిశ్వాసం పెరి గిందన్నారు. పోలీస్శాఖ ఇప్పటికే విచారణ చేసి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని భరోసా ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అశోక్, రోహిత్, మహేశ్, లక్ష్మ ణ్సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
స్టడీ సర్కిల్కు రూ.5కోట్లు హర్షణీయం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ స్టడీ సర్కిల్ భవనాన్ని రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు ప్రకటించడం సంతోషకరమని అంబేడ్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య అన్నారు. బ్రాహ్మణపల్లిలో సోమవారం వైస్చైర్మన్ కొంకటి లింగమూర్తి, నారాయణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పోటీపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ భవనం ఎంతోఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 14లోపే స్టడీ సర్కిల్ పనులు ప్రారంభిస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారని వారు పేర్కొన్నారు. ‘రామాయణం’పై అవగాహన పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లాస్థాయి రామాయణం పరీక్షలు నిర్వహించారు. వేదపండితుడు కొండపాక శ్రీనివాసాచార్యులు రామాయణం విశిష్టత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శ్రీరాముని జీవితం మానవాళికి ఆదర్శమని, ఆయన చూపినబాటలో ముందుకు సాగాలని సూచించారు. పరీలక్షకు 22 పాఠశాలలకు చెందిన 134 మంది విద్యార్థులు హాజరయ్యారని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి నాగులమల్యాల సత్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జడల సురేందర్, నగర సంయోజక్ మణిదీప్, చందు, జాగర్ల సతీశ్చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
గోదావరిఖని(రామగుండం): లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్కిషోర్ఝా ఆదివారం ప్రకటనలో హెచ్చరించారు. గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు చట్టబద్ధమైన నమోదు ద్వారా మాత్రమే నిర్వహించాలని సూచించారు. మొదటిసారి నేరం చేస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారని, పునరావృతం అయితే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేలు లేదా అంతకుమించి జరిమానా విధిస్తారన్నారు. సంబంధిత వైద్యులు, సిబ్బంది చట్టాన్ని ఉల్లంఘిస్తే వారి వైద్య అనుమతిపత్రాన్ని సస్పెండ్ చేయడం, పూర్తిగా రద్దు చేస్తారని పేర్కొన్నారు. సింగరేణిని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం యైటింక్లయిన్కాలనీ(రామగుండం): సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుంటూ నిర్వీర్యం చేస్తుందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్కాలనీ టీబీజీకేఎస్ కార్యాలయంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభత్వం రెండున్నరేళ్లలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా కారుణ్య నియామకాలను తొలగించే కుట్ర చేస్తుందని ఆరోపించారు. రూ.56కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో కార్మికులకు ఇంక్రిమెంట్లు రాకుండా నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికై నా కొంత మేర బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో సంస్థను రక్షించుకునేందుకు కార్మికులను చైతన్యం చేసేలా ‘కాంగ్రెస్ హటావో.. సింగరేణి బచావో’ నినాదంతో బీఆర్ఎస్ పార్టీ సహకారంతో సింగరేణిని రక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఆర్జీ–2 వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్, సంపత్, శ్రీనివాస్, రామ్చంద్రారెడ్డి, శంకర్, రవి, రామ్చరణ్, జీవన్, కుమారస్వామి, నారాయణరెడ్డి, వెంకట్, రాజు పాల్గొన్నారు. సీఎంను సొంత పార్టీ కార్యకర్తలే గుర్తిస్తలేరు మంథని: సీఎం రేవంత్రెడ్డిని సొంత పార్టీ కార్యకర్తలే గుర్తిస్తలేరని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఎద్దేవా చేశారు. ఆదివారం మంథనిలోని రాజగృహాలో మాట్లాడారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో చులకనైందని, ప్రజల చివాట్ల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ ఆఫీసులపై దాడులకు పాల్పడుతోందని అన్నారు. గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఆఫీస్పై దాడి చేయడం ప్రజాస్వామ్యానికే అవమానమన్నారు. రాష్ట్రంలో సంపాదన సృష్టించకుండా ధ్వంసం చేస్తున్నారని, అన్ని వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. అనంతరం జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు ఏగోళపు శంకర్గౌడ్, నాయకులు తగరం శంకర్లాల్, వేల్పుల గట్టయ్య, కనవేన శ్రీనివాస్, పుప్పాల తిరుపతి, లొడారి రాములు, గొబ్బూరి వంశీ తదితరులు పాల్గొన్నారు. క్రీడా పాఠశాల పోటీలకు ఎంపిక ధర్మారం: మండలంలోని పత్తిపాక ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఎదుల్ల ప్రజ్వల్ రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాల పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం మల్లన్న తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన తొమ్మిది రకాల ఈవెంట్స్లో ప్రతిభ కనపర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సురేశ్ ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ నెల చివరి వారంలో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర పోటీల్లో పాల్గొంటాడని వివరించారు. ఈసందర్భంగా ప్రజ్వల్ను సర్పంచ్ మాందాల శ్రావణి, ఉపాధ్యాయులు అభినందించారు. -
సకల విద్యార్థి సమీకృతం
మంథనిరూరల్: కుల, మత, వర్గ వివక్ష లేకుండా ఒకేచోట పేద విద్యార్థులకు విద్య బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. ఆధునిక కాలానికి అనుగుణంగా బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న సంకల్పంతో సకల విద్యార్థి సమీకృతం వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మంథని మండలం అడవిసోమన్పల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి గతేడాది మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేయగా పనులు కొనసాగుతున్నాయి. 25ఎకరాలు.. రూ.145కోట్ల వ్యయంతో.. అడవిసోమన్పల్లి శివారులో సుమారు 25ఎకరాల విస్తీర్ణంలో రూ.145కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాదిలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. 4వ తరగతి నుంచి.. నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన అందించనున్నారు. తరగతి గదుల్లో డిజిటల్ స్మార్ట్ బోర్డు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే క్రీడా ప్రాంగణం, సౌకర్యాలు కల్పించనున్నారు. విద్యుత్ సమస్యలు రాకుండా సోలార్ విద్యుత్తో లిఫ్ట్లు, ఇతర ఉపకరణాల నిర్వహణ జరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. 2,500మంది విద్యార్థులకు.. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 2,500 మంది విద్యార్థులకు విద్యాబోధన అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు సమీకృత భవనంలో చదువుకోనున్నారు. సమీకృత భవనంలో వివిధ బ్లాకులుగా విభజించి విద్యాబోధన చేస్తారు. ఒక్కో బ్లాక్లో 640 మంది విద్యార్థుల చొప్పున కేటాయిస్తారు. ప్రత్యేక నివాస సముదాయాలు విద్యార్థులతో పాటు విద్యాబోధన అందించేందుకు జీ ప్లస్ 2 భవనాలు నిర్మించనున్నారు. ఇందులో పాఠశాల ప్రిన్సిపాల్స్, బోధన సిబ్బంది, వసతి గృహా వార్డెన్ల కోసం ప్రత్యేక భవన సముదాయం ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు సైతం ప్రత్యేక బెడ్లు, ఒకేసారి 1,200 మంది భోజనం చేసేలా డైనింగ్ హాల్ నిర్మించున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం కోసం ఆరోగ్య సంరక్షణ కేంద్రం, తల్లిదండ్రులు, సందర్శకుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయనున్నారు. విద్యాహబ్గా మారనున్న అడవిసోమన్పల్లి మంత్రి శ్రీధర్బాబు చొరవతో జిల్లా సరిహద్దు మానేరు నది తీరంలోని అడవిసోమన్పల్లి విద్యాహబ్గా మారనుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలతో గ్రామం రూపురేఖలు మారనున్నాయి. ఈ పాఠశాల పూర్తయితే వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడే చదువుకునే అవకాశాలుంటాయి. దీంతో మంథని– కాటారం ప్రధాన రహదారిలోని ఈ గ్రామానికి ఇన్నేళ్ల తర్వాత మంత్రి చొరవతో మహర్దశ సంతరించుకోనుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.145కోట్లతో పనులు షురూ కార్పొరేట్కు దీటుగా సకల సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు అడవిసోమన్పల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేద విద్యార్థులకు ప్రయోజనం మా ఊరిలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మంచి బోధన అందుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేలా మంత్రి చర్యలు తీసుకోవడం అభినందనీయం. – గట్టు జనార్ధన్, అడవిసోమన్పల్లి మంత్రి శ్రీధర్బాబు చొరవతో.. మంత్రి శ్రీధర్బాబు చొరవతోనే మా గ్రామానికి అభివృద్ధి బాటలు పడుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్తో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు ఇక్కడే చదువుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మా ఊరికి అన్ని సౌకర్యాలు మెరుగుపడుతాయి. మా ఊరి అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రికి కృతజ్ఞతలు. – గట్టు దామోదర్, సర్పంచ్, అడవిసోమన్పల్లి -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
ఎస్యూ వీసీ ఉమేశ్ కుమార్ ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం, ఉద్యోగాల నియామకం, అభివృద్ధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. కొలువుల ఆశ చూపించి పేదల వద్ద రూ.లక్షలు వసూలు చేయడం హేయం. ఆయన వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఫుల్ టైం ఈసీ లేకుండా ప్రొఫెసర్లు నియమించడంపైనా విచారణ జరిపించాలి. – మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అవన్నీ నిరాధార ఆరోపణలు శాతవాహన వర్సిటీలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతోంది. నేను వచ్చాక వర్సిటీలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను. లా, ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. క్యాంపస్లో ఔట్సోర్సింగ్ పోస్టులు అమ్ముకుంటున్నారన్నది కేవలం నిరాధార ఆరోపణలు. అందులో ఎలాంటి వాస్తవమూ లేదు. – ఉమేశ్కుమార్, వైస్ చాన్స్లర్ -
కొలువులమ్మా.. కొలువులు!
శాతవాహన గాథలు–3సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అర్బన్ నక్సలైట్లు, విద్యార్థుల ఆందోళనలు, దళితులపై వివక్ష తదితర వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న శాతవాహన యూనివర్సిటీలో మరో దుమారం చెలరేగుతోంది. యూనివర్సిటీలో అంతా తానై షాడో వీసీలా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ఔట్ సోర్సింగ్ నియామకాల్లో చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పోస్టుకు ఇంత రేటు అంటూ ఫిక్స్ చేసి మరీ నియామకాల్లో అంతా తానై వ్యవహరిస్తున్నాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అర్బన్ నక్సలైట్లు, దళితులపై వివక్ష అన్న ఆరోపణలపై యూనివర్సిటీ మొత్తం రాజకీయ రణంగంగా మారింది. ప్రొఫెసర్ సుజాత వైపు కొందరు.. వీసీ ఉమేశ్ వైపు మరికొందరు చేరి ఎవరికి వారు మద్దతుగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. సంతోషంగా విక్రయం.. అతను రాజకీయ పలుకుబడితో వర్సిటీలో చేరా డు. ఒక రకంగా అతనే షాడో వీసీ అన్న పేరుంది. అందుకే శాతవాహన యూనివర్సిటీలో ఎంత సీని యర్ ప్రొఫెసర్ అయినా సరే అతని జోలికి వెళ్లరు. అతను ఏం చెప్పినా.. స్థాయి మరిచి తూ.చా తప్పకుండా పాటిస్తారు. చిన్నస్థాయి ఉద్యోగుల విష యం చెప్పనక్కర్లేదు. పొరపాటున అతనికి వ్యతిరేకంగా స్వరం పెంచితే ఇక అంతే.. మరో విభాగాని కి బదిలీ చేసి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. అతని వ్యవహారం, పలుకుబడి తెలిశాక.. అతనితో అంతా అనివార్యంగా సఖ్యతగా ఉండాల్సి వస్తోంది. అలాంటి వ్యక్తి కొంతకాలంగా ఔట్సోర్సింగ్ కొలువుల భర్తీని సొమ్ము చేసుకుంటున్నాడు. వాస్తవానికి ఇవేమీ పర్మినెంట్ పోస్టులు కావు. కాకపోతే నెల తిరిగే నాటికి జీతం ఠంఛన్గా వస్తుందన్న భరోసా ఉంది. అందుకే ఈ పోస్టులకు ఉన్న డిమాండ్తో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు తీసుకుని కొలువులు పెట్టిస్తున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 15కుపైగా పోస్టులు ఇలా తన పరపతితో సంతోషంగా అమ్ముకున్నాడన్న విమర్శలున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–4 ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసింది. అయినా కీలక పోస్టుల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఉంచడంతో అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కీలక పోస్టుల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.నేటి నుంచి ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ మరోవైపు తనపై వ్యక్తిగత కక్షలతో అర్బన్ నక్సల్ అంటూ వేధించడం, వరుసగా పదవుల నుంచి తప్పించడంపై కలత చెందిన సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఇటీవల ఎస్సీ కమిషన్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆదివారం వరకు వరుస సెలవుల నేపథ్యంలో ఈ విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. సోమవారం నుంచి ఈ ఫిర్యాదుపై ఎస్సీ కమిషన్ విచారణ జరిపి, చర్యలు చేపట్టనుంది. తొలుత కరీంనగర్ కలెక్టర్, సీపీకి నోటీసులు జారీ చేయనున్నామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పీఏ శ్రీధర్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీలో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో అవసరమైతే ఈ వారంలో ఎస్సీ కమిషన్ సభ్యులు యూనివర్సిటీని సందర్శించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. -
మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
పెద్దపల్లి: మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఆదివారం జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా బస్టాండ్ సమీపంలోని విగ్రహానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ డి.వేణు నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జగ్జీవన్రామ్ చిన్నతనంలో అంటరానితనం సమస్యతో అనేక బాధలు అనుభవించారని, 29 ఏళ్ల వయస్సులో శాసన మండలి సభ్యునిగా, 1937లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో 30 ఏళ్ల పాటు వివిధ మంత్రిత్వ శాఖలలో పని చేశారని వివరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన మహనీయుడు జగ్జీవన్రామ్ అని కొనియాడారు. రాజ్యాంగ సవరణలో అణగారిన వర్గాలకు న్యాయం చేస్తూ అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. అంతకు ముందు వివిధ సంఘా ల నాయకులు, ప్రతినిధులు మాట్లాడారు. ఆర్డీ వోలు గంగయ్య, సురేశ్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎం.రవీందర్, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. రాంగ్రూట్ ప్రమాదాలు జరుగుతున్నందున, వాటి నివారణకు సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని, రాంగ్రూట్లో ప్రయాణించే వాహనదారులకు భారీ జరిమానా విధించాలన్నారు. రాఘవపూర్, సబ్బితం గ్రామాల వద్ద మెయిన్ రోడ్డుకు జీబ్రా క్రాసింగ్, మంథని ఫ్లైఓవర్ వద్ద అవసరమైన చోట కాన్వెక్స్ మిర్రర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్అండ్బీ ఈఈ భావ్సింగ్, ట్రాఫిక్ సీఐ రమేశ్ పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
నోరూరేనంట.. యాదమ్మ వంట
విద్యానగర్(కరీంనగర్): యాదమ్మది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. చిగురుమామిడి మండలం కొండాపూర్కు చెందిన చంద్రయ్యతో పదిహేనేళ్ల వయసులోనే వివాహమైంది. కొడుకు పుట్టిన మూడు నెలలకే చంద్రయ్య ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో కొడుకును తీసుకుని కరీంనగర్కు వలసొచ్చారు. కొన్ని రోజులు స్కూల్లో ఆయాగా పని చేశారు. తరువాత మంకమ్మతోటకు చెందిన వెంకన్న వద్ద వంటపనిలో హెల్పర్గా చేరారు. అందుకు రోజూ రూ.15 కూలీ తీసుకునేవారు. కాలక్రమేణ చిన్నచిన్న ఫంక్షన్లలో వంటచేస్తూ మన్ననలు పొందారు. క్రమేనా పెద్దపెద్ద ఫంక్షన్లకు క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 50 వేల మందికై నా ఒంటిచేత్తో వంటచేసేలా ప్రావీణ్యం సంపాదించారు. 2022లో హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న వందలాది మంది ప్రముఖులకు యాదమ్మ తన చేతి వంటలు రుచి చూపించి శభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ వంటలు రుచిచూసిన ప్రధాని యాదమ్మను ప్రత్యేకంగా అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పలుమార్లు యాదమ్మ వంటలను మెచ్చుకున్నారు. కేటీఆర్ నిర్వహించిన మూడు బహిరంగసభలు, వేములవాడ శివరాత్రి ఉత్సవాలు, కొండగట్టు హనుమాన్ జయంతి, గోదావరి పుష్కరాల్లో వేలాది మందికి వంటలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు పెళ్లిలో 30వేల మందికి, కరీంనగర్ తీగల వంతెన ప్రారంభం అప్పుడు 20వేల మందికి వంటలు చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసాల్లో జరిగిన ఫంక్షన్లకూ యాదమ్మ క్యాటరింగ్ చేశారు. గతనెల 27న కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో 25వేల మందికి రుచికరమైన వంటకాలు చేసిపెట్టారు. కిరాయి పెంకుటిళ్లు నుంచి ఇప్పుడు సప్తగిరికాలనీలో తనకంటూ ఒక మంచి సొంతిళ్లు నిర్మించుకుని దుర్గా నిలయంగా పేరు పెట్టుకున్నారు. ఒక్కగానొక్క కొడుకును చదివించి రూ.12 లక్షలు ఖర్చు చేసి అమెరికా పంపింపారు. అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలు కావడంతో స్వదేశానికి వచ్చి అతనూ క్యాటరింగ్ చేస్తున్నాడు. యాదమ్మ వద్ద దాదాపు 200 మంది వంటలు నేర్చుకుని సొంతంగా క్యాటరింగ్లు నిర్వహిస్తున్నారు. మీర్జాపూర్కు చెందిన 20 మంది మహిళలు వంటలు నేర్చుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. సీజన్లో 200మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మిగతా రోజుల్లో నిత్యం 10 నుంచి 20 మంది యాదమ్మ వంటకు సాయంగా ఉంటారు. కరీంనగర్లోని మారుమూల పల్లెలో పుట్టిన నేను ఈ దేశ ప్రధానికి నా చేతి వంట రుచి చూపిస్తానని కలలో కూడ అనుకోలేదు. శాకాహారమే కాకుండా నాన్ వెజ్ వంటకాలు కూడా బాగా చేస్తాను. గంగుల కమలాకర్, బండి సంజయ్లు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు, కాలేజీ ఫంక్షన్లకు, రాజకీయ సభలకు దాదాపు 20 నుంచి 30వేల మందికి వంట చేయగలను. నా వద్ద ప్రస్తుతం 40మంది వరకు పని చేస్తారు. నా దగ్గర పని నేర్చుకున్న వారు స్వయంగా క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. వారి పిల్లలను అమెరికా సైతం పంపించారు. – గూళ్ల యాదమ్మ -
ఆక్రందన.. ఆందోళన
● కవలల హత్యతో జూబ్లీనగర్లో విషాదం ● నిందితుడిని శిక్షించాలంటూ ఆందోళన ● పోస్ట్మార్టం కోసం ప్రభుత్వాస్పత్రి వద్ద పడిగాపులు ● పోలీస్ బందోబస్తు మధ్య రాత్రి 9గంటలకు అంత్యక్రియలు కరీంనగర్రూరల్: కన్నతండ్రి కాలయముడుగా మారి కవల ఆడబిడ్డలను బావిలో పడేసి చంపిన సంఘటన పలువురిని కలచివేసింది. చిన్నారుల మృతితో జూబ్లీనగర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు, బంధువుల్లో తీరని ఆగ్రహాన్ని రగిలించింది. శనివారం నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నిందితులను కఠినంగా శిక్షించి, న్యాయం చేయాలంటూ చిన్నారుల తల్లితోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోస్ట్మార్టం ఆలస్యమైంది. రాత్రి 8.30గంటలకు చిన్నారుల మృతదేహాలను అంబులెన్స్లో గ్రామానికి తీసుకరావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసు బందోబస్తు నడుమ అంత్యక్రియలు పూర్తి చేశారు. పిల్లలను చంపి బావిలో పడ్డారంటూ డ్రామా కరీంనగర్ మండలం జూబ్లీనగర్కు చెందిన కచ్చు శ్రీశైలం ఐదేళ్లక్రితం మానకొండూరు మండలం లక్ష్మిపూర్కు చెందిన మౌనికను వివాహం చేసుకున్నాడు. 2021లో కవల ఆడపిల్లలు గీతాన్శ్రీ, గీతాన్వికలు జన్మించగా అప్పటి నుంచి శ్రీశైలం మౌనికను ఆడపిల్లలను ఎందుకు కన్నావంటూ వేధింపులకు గురిచేశాడు. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు ఇద్దరు పిల్లలను బైక్పై ఎక్కించుకుని పొలం వద్దకు తీసుకెళ్లాడు. పిల్లలను చంపి వ్యవసాయబావిలో పడేసిన, తనపై అనుమానం రాకుండా కాపాడుతున్నట్లుగా బావిలో దూకాడు. ఒక పాప మృతదేహాన్ని బావిలోని దరికి చేర్చి అరుస్తుండగా మౌనిక అక్కడికి రావడంతో సమీపంలో ఉన్న వాళ్లందరూ వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి గజ ఈతగాళ్ల సాయంతో మరో పాప మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల శ్రీశైలంకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో బంధువుల ఆందోళన శ్రీశైలంను శిక్షించాలంటూ శనివారం ప్రభుత్వ ఆస్పత్రిలో మౌనికతో పాటు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోస్ట్మార్టం నిర్వహించేది లేదంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పలు దఫాలుగా సాగిన చర్చల అనంతరం చట్టప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ నిరంజన్రెడ్డి నచ్చచెప్పడంతో రాత్రి 8.30గంటలకు మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించి అంబులెన్స్లో జూబ్లీనగర్కు తరలించారు. చిన్నారుల మృతదేహాలను చూడటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. మహిళలందరూ కంటతడిపెట్టారు. ఏసీపీ విజయ్కుమార్, సీఐలు నిరంజన్రెడ్డి, కోటేశ్వర్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు నడుమ రాత్రి 9గంటలకు అంత్యక్రియలను పూర్తి చేశారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం గుంటూరుపల్లి రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన పోతర్ల అశోక్(31) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వ్యక్తిగత పనినిమిత్తం పల్సర్ బైక్పై ఇరుకుల్లకు వచ్చాడు. రాత్రి 9గంటలకు కరీంనగర్కు బైక్పై వెళ్తుండగా గుంటూరుపల్లి రైల్వే అండర్బ్రిడ్జి సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చల్మెడ ఆనందరావు ఆస్పత్రికి తరలించగా వైద్యుల సలహామేరకు హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించడంతో శనివారం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు లారీడ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. గీతకార్మికుడికి గాయాలు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో తాటిచెట్టు పైకి ఎక్కి కల్లుగీస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో బాలసాని రాజయ్య గాయాలపాలయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిరుపేద అయిన రాజయ్యకు ప్రభుత్వపరంగా సాయమందించాలని సర్పంచ్ జూపాక శ్వేత, గీతకార్మికసంఘ నాయకులు కోరారు. కిరీటం, నగలు మాయంకోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లలోని శివసాయి ఆలయంలో సాయిబాబా కిరీటం, ఉత్సవ విగ్రహాల పుస్తెలు కని పించడం లేదు. భక్తులు సమర్పించిన ఈ కానుకలు కనిపించకపోవడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయంలోని నగలు అపహరణకు గురయ్యాయా, లేక ఎవరైనా భద్రపరిచారా అన్న విషయాలు తెలియాలని నవచైతన్య యూత్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.25 ఏళ్లుగా రోడ్లపైనే తిరిగి..● కలెక్టర్ చొరవతో కుటుంబం చెంతకు కామారెడ్డిఅర్బన్: కామారెడ్డి పట్టణంలో రోడ్ల వెంట తిరుగుతున్న మానసిక వైకల్యం గల వ్యక్తి 25 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి (50) మానసిక వైకల్యంతో రోడ్ల వెంబడి తిరుగుతున్న విషయం ఇటీవల కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన స్పందించి జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించడంతో శనివారం అతన్ని వృద్ధాశ్రమానికి తరలించి వైద్యసేవలు, ఆహారం అందించారు. తాను జగిత్యాల జిల్లాకు చెందిన వాడినని చెప్పడంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు కామారెడ్డికి రాగా, అధికారులు అతడిని అప్పగించారు. 25ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుడిని కలుసుకోవడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా కలెక్టర్ ఆదేశం ప్రకారం మానసిక వైలక్యం వ్యక్తి వివరాలు, కుటుంబసభ్యుల వివరాలు గోప్యంగా ఉంచారు. వాకిలి శుద్ధి చేస్తుండగా బావిలో పడ్డ మహిళ ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఇప్పలపల్లి(రామకృష్ణాపూర్)కు చెందిన తూండ్ల సుమతి శనివారం ఉదయన వాకిలి శుద్ధి చేసే క్రమంలో కాలు జారి వ్యవసాయ బావిలో పడి తీవ్రగాయాలపాలైంది. బాధితురాలి కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీశారు. 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్, ఫైలెట్ హబీబ్ ప్రఽథమ చికిత్స అందించారు. ఆ తర్వాత మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
శాంతియుతంగా ఉండాలి
పెద్దపల్లి: విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని, ముఖ్యంగా ప్రపంచ శాంతి కోరుకోవాలని జిల్లా విద్యా ధికారి శారద సూచించారు. జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 2025–26 పీఎంశ్రీ పాఠశాలల పోటీలు శనివారం కలెక్టరేట్లో నిర్వహించారు. విద్యార్థుల స మగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ, అంతర్జాతీయ సమస్యలు, న్యాయం, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్, రిసోర్స్ పర్సన్, ప్రోగ్రాం సమన్వయకర్త జగదీశ్వర్ మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు అగయ్య, పురుషోత్తం పాల్గొన్నారు. అనంతరం జరిగిన పోటీల్లో సీహెచ్ కీర్తి ప్రథమ, బి.అద్వైత ద్వితీయ, టి.రిషిత తృతీయ బహుమతులు సాధించారు. జిల్లానుంచి 11 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని డీఈవో వివరించారు. -
సీపీ ప్రకటనను స్వాగతిస్తున్నాం
వర్సిటీలో సమస్యలపై ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ల నిందలు వేస్తున్నారు. నిరాధార ఆరోపణలతో యూనివర్సిటీ అకడమిక్ వాతావరణాన్ని దెబ్బ తీస్తున్న వ్యక్తులపై వీసీ, రిజిస్ట్రార్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు. జిల్లాలో అర్బన్ నక్సలైట్లు లేరని సీపీ గౌస్ ఆలం ప్రకటనను స్వాగతిస్తున్నాం. పోలీస్ ఉన్నతాధికారులు ఒకవైపు కరీంనగర్ లో అర్బన్ నక్సలైట్లు ఎవరూ లేరని చెప్తుంటే.. విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తూ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. – అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడువర్సిటీ ప్రతిష్టకు విఘాతం పోలీస్ ఉన్నతాధికారులు కరీంనగర్లో అర్బన్ నక్సలైట్లు లేరని చెప్తుంటే.. విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తూ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులపై యూనివర్సిటీ ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వర్సిటీలో ఇష్టానుసార నియామకాలు, కొత్త నిర్మాణాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి అవకతవకలను ప్రశ్నిస్తే ఇలా అర్బన్ నక్సలైట్లు ఉన్నారంటూ ప్రకటనలు చేయడం వల్ల యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉంది. – మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లీగల్ నోటీసులు పంపుతున్నాం కొందరు పనిగట్టుకుని వర్సి టీలో దళిత సిబ్బంది, విద్యార్థులపై అర్బన్ నక్సలైట్లంటూ విషప్రచారం చేస్తున్నా రు. అందుకే, ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశాను. ఈ దుష్ప్రచారానికి కారకులను గుర్తించి లీగల్ నోటీసులు పంపుతున్నాం. సివిల్, క్రిమినల్ చర్యలకూ వెనకాడేది లేదు. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, వ్యక్తిత్వ హననంపై వెనక్కి తగ్గేది లే దు. వర్సిటీలో దళితులపై జరుగుతున్న అకృత్యాలపై సోమవారం పోలీసులకు కూడా ఫి ర్యాదు చేస్తాం. – ప్రొఫెసర్ సుజాత, సోషియాలజీ విభాగాధిపతి -
చెట్టును ఢీకొని వ్యక్తి మృతి
రాయికల్(జగిత్యాల): మండలంలోని అల్లీపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై సుధీర్రావు తెలిపిన వివరాలు.. జగిత్యాల మండలం లింగంపేట గ్రామానికి చెందిన సిరికొండ చంద్రశేఖర్ (25) శుక్రవారం ద్విచక్రవాహనంపై తన తల్లి గంగుతో కలిసి రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలోని సీతారాముల జాతరకు వెళ్లాడు. తర్వాత తల్లిని లింగంపేటలో దింపాడు. అనంతరం తన స్నేహితులు ఫోన్ చేయడంతో చంద్రశేఖర్ మళ్లీ వారితో కలిసి జాతరలో పాల్గొన్నాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా అల్లీపూర్ శివారులో వేగంగా చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ..జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన బొల్లారం రాజం (67) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఎస్సై ఉమాసాగర్ తెలిపిన వివరాలు.. రాజం కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది గత నెల 30న సాయంత్రం పొలం వద్ద పురుగులమందు తాగగా కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మళ్లీ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కరీంనగర్లో..కరీంనగర్క్రైం: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పోలీస్ అవుట్ పోస్టు వెనకాల శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు. సుమారుగా వయసు 40 ఏళ్ల వయసు ఉంటుందని, బిచ్చగాడిగా ఆస్పత్రి పరిసరాల్లో తిరుగుతూ ఉండేవాడని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే టూటౌన్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. అనుమానాస్పందంగా..కరీంనగర్క్రైం: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కరీంనగర్ టూటౌన్ పోలీసులు తెలిపారు. రామడుగు మండలం గోపాలరావుపేటకు చెందిన అలువాల రవి(48)కి 27 ఏళ్ల క్రితం లలితతో వివాహమైంది. ఇద్దరు కుమారులున్నారు. రెండేళ్ల క్రితం లలితతో గొడవపడి కరీంనగర్లోని రాంనగర్లో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి భార్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. శనివారం అతని భార్య ఫోన్ చేయగా, రూం పక్కన అద్దెకు ఉండే ఓ మహిళ ఎత్తింది. ఎంతపిలిచినా రవి కదలడం లేదని చెప్పింది. వెంటనే 108కు ఫోన్చేయగా వారు వచ్చి పరీక్షించి, మృతిచెందినట్లు తెలిపారు. శరీరంపై రక్తపు మరకలున్నాయని, రవి మృతిపై అనుమానం ఉందని లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. -
మెడికల్ బోర్డు కొనసాగించాలి
● బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య గోదావరిఖని: సింగరేణిలో మెడికల్ బోర్డును య థావిధిగా కొనసాగించాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–2ఏ గనిపై ఏర్పాటు చేసిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు రావాల్సిన విద్యుత్, బొగ్గు బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కర్రావుల మహేశ్, మాదాసు రవీందర్, సంగాని సాంబయ్య, ఎల్లావుల కోటయ్య, బోడకుంట రాజేశం, ఆరెల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నిరంతర నిఘా!
శాతవాహన గాథలు–2సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో దళితులపై అర్బన్ నక్సలైట్లంటూ జరుగుతున్న దుమారం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఈ విషయంలో వైస్ చాన్స్లర్ వర్గం, సోషియాలజీ విభాగాధిపతి సూరేపల్లి సుజాతల వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. వైస్ చాన్స్లర్కు అనుకూలంగా కొందరు పీహెచ్డీ స్కాలర్స్ ముందుకు వస్తుండగా.. ఫ్రొఫెసర్ సుజాతకు దళిత సంఘాలు, మేధావులు, విద్యార్థి నాయకులు అండగా నిలుస్తున్నారు. కొంతకాలంగా యూనివర్సిటీలో వీసీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై చర్చ జరగాలంటూ, అవసరమైతే జరుగుతున్న పరిణామాలు, వస్తున్న అవినీతి, అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వింత నిర్ణయాలపై విస్మయం క్యాంపస్లోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలపై ఇటు సిబ్బంది, అటు విద్యార్థులు మండిపడుతున్నారు. సీసీ టీవీల్లో పరిశీలిస్తూ వీసీ పలువురు విద్యార్థులు, సిబ్బందిని నేరుగా తన చాంబర్కు పిలిపిస్తూ నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. క్యాంపస్లో 800మంది విద్యార్థులు ఉంటే దాదాపు 200కుపై సీసీ కెమెరాలు ఉన్నాయని అంటున్నారు. చివరికి క్యాంటీన్లోనూ ఆడియో రికార్డ్ చేసే కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డిసెంబరు మొదటివారంలో హాజరుశాతం, లైబ్రరీ పనివేళలపై ఆంక్షలపై క్యాంపస్లో వందలాది విద్యార్థులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. పదే పదే పోలీసులను క్యాంపస్లోకి తీసుకువచ్చి తమలో భయానక వాతావరణ సృష్టిస్తున్నారని విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వీసీ ఉమేశ్కుమార్ను వివరణ కోరగా.. క్యాంపస్లో సీసీ కెమెరాలు కేవలం విద్యార్థుల భద్రత కోసమే ఏర్పాటు చేశాం. వర్సిటీలో వేధింపులు, అక్రమాలు అంటూ కొందరు చేస్తున్న ప్రచారం కేవలం నిరాధారం’ అని ఖండించారు. ఎస్యూ క్యాంపస్లో సీసీ కెమెరాల ద్వారా నియంత్రణ క్యాంటీన్లోనూ ఆడియో రికార్డింగ్ కెమెరాలు హాజరు శాతం, లైబ్రరీ నిబంధనలపై కన్నెర్ర వీసీ వింత నిర్ణయాలపై విద్యార్థుల ఆగ్రహం విచారణ జరగాలంటున్న విద్యార్థి సంఘాలు -
విద్యార్థులు ఇష్టపడి చదవాలి
పెద్దపల్లి: విద్యార్థులు ఇష్టపడి చదువుతూ తల్లిదండ్రుల కలలు, లక్ష్యాన్ని నెరవేర్చాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ హైస్కూల్లో శనివారం రాత్రి నిర్వహించిన ఫేర్వెల్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో కార్పొరేట్ విద్యను అందిస్తూ నరేందర్రెడ్డి అందరికీ ఆదర్శప్రాయుడు అయ్యాడని కొనియాడారు. అంతకుముందు విద్యార్థులు పలు రకాల సంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, వైస్చైర్మన్ అంతటి పుష్పలత, కౌన్సిలర్లు గాదాసు మంజుల, రవి, గరిగె శ్రీనివాస్, చింతల రాజు, టీకే ప్రభాకర్, మహేందర్, పెద్దన్న, ఐల రమేశ్, అబ్బయ్యగౌడ్, కుమార్ పాల్గొన్నారు. నృత్యం చేస్తున్న విద్యార్థినులు మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ విజయరమణారావు -
అతివేగం.. అదుపుతప్పిన కారు
గోదావరిఖని: అతి వేగం.. లిప్తపాటులో జరిగిన ప్రమాదంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం అర్ధరాత్రి ఘటన జరిగింది. గోదావరిఖని వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. ఓ వేడుకకు హాజరై చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వైపు నలుగురు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్ టాకీష్ సమీపంలో కారు అదుపుతప్పింది. ఎడమవైపు ఉన్న ఓ షాపుతోపాటు, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో జీడీకే–11గనిలో అసిస్టెంట్చైన్మెన్గా పనిచేస్తున్న ఏల్పుల శ్రీధర్(39) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరందరినీ స్థానిక సింగరేణి ఏరియా లాస్పత్రికి తరలించిచారు. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ రెఫర్ చేశారు. ఈసంఘటనలో జీడీకే–1వగనిలో జనరల్అసిస్టెంట్గా పనిచేస్తున్న తడకల మహేందర్, నామిని లక్ష్మణ్, మాలోతు శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ ఎస్ఐ రమేశ్ కేసు నమోదు చేసుకున్నారు. ఏల్పుల శ్రీధర్ మార్కండేయకాలనీలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు సింగరేణి కార్మికుడు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు -
సొంత జిల్లాల్లో పనిచేయొద్దొన్న నిబంధన ఎత్తివేయాలి
పెద్దపల్లి: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిపార్టుమెంటులో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, వారి సొంత జిల్లాల్లో పనిచేయకూడదన్న నిబంధన ఎత్తివేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును జిల్లా ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు ఇప్పటివరకు పని చేస్తున్న జిల్లాలో వారి సొంత జిల్లాలో పనిచేయకూడదు అంటూ 8(ఎఫ్ ) క్లాజ్ చేర్చారని, వాటిని సవరించేలా చూడాలని కోరారు. ప్రభుత్వం పునరాలోచన చేసేలా చొరవ తీసుకొని న్యాయం చేయాలని విన్నవించారు. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని వారు తెలిపారు. శ్రావణి, తిరుపతి, రాజు, రాజకుమార్, నరేశ్, శ్రీనివాస్, నిరంజన్, రమేశ్ ఉన్నారు. -
రైల్వేవంతెనల పరిశీలన
పెద్దపల్లిరూరల్: గౌరెడ్డిపేట, చీకురాయి ప్రాంతాల్లోని రైల్వే లెవల్క్రాసింగ్ గేట్ల వద్ద వంతెనల నిర్మాణం కోసం శనివారం ఆర్డీవో గంగయ్య పలు శాఖల అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. పనులు ప్రారంభమైతే గేట్ల నుంచి రాకపోకలు నిలిపి వేసి ఇతర మార్గాల ద్వార వెళ్లేలా సూచనలివ్వాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్ విజేందర్, రైల్వే ఇంజినీరింగ్, విద్యుత్, మిషన్భగీరథ, ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పనితీరుకు పురస్కారం పెద్దపల్లి: ప్రతీనెల మాదిరిగానే ఈనెలలోనూ పనితీరు ఆధారంగా పర్ఫార్మెన్స్ అవార్డును అందజేసినట్లు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. ఈనెలలో మంచిపనితీరు కనబర్చిన ఫార్మసిస్ట్ జి.కవిత, సిబ్బంది ఎస్.శైలజకు పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. శనివారం ఆస్పత్రిలో జరిగిన కార్య క్రమంలో ఆర్ఎంవో విజయ్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున పాల్గొన్నారు. చికితకు ‘విప్’ అభినందన ఎలిగేడు: సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి, వరల్డ్ చాంపియన్ తానిపర్తి చికిత ఇటీవల బ్యాంకాక్లో జరిగిన ఆసియాకప్ వరల్డ్ ర్యాకింగ్ టోర్నీలో గోల్డ్మెడల్, ఉమెన్స్ టీం విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో శివపల్లిలోని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారణారావు తన నివాసంలో శనివారం చికితను సన్మానించారు. చికిత తండ్రి తానిపర్తి శ్రీనివాసరావు, యూత్ కాంగ్రెస్ నాయకుడు దుగ్యాల సంతోష్రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ అర్షనపల్లి వెంకటేశ్వర్రావు, మాజీ ఉపసర్పంచులు కోరుకంటి వెంకటేశ్వర్రావు, వెంకటేశ్వర్రావు, బూర్ల వెంకటసత్యం, తానిపర్తి మహిపాల్రావు తదితరులు పాల్గొన్నారు. 8న జాబ్మేళా పెద్దపల్లి: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్ కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 8న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జి ల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపా రు. ఈకంపెనీలో 15 మార్కెటింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీ కలిగిఉండి 25– నుంచి 40ఏళ్ల వయసు ఉన్నవారు బుధవారం ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్లతో కలెక్టరేట్లోని రూమ్నంబరు 233లో సంప్రదించాలని సూచించారు. వివరాలకు 89853 36947, 81212 62441 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. నేడు జగ్జీవన్రాం జయంతి పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా ఆదివారం బాబూ జగ్జీవన్రామ్ జయంతి నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేదపాఠశాలలో ప్రవేశాలు కాల్వశ్రీరాంపూర్: పాండవులగుట్ట శ్రీజగత్ మౌనీశ్వరస్వామి ఆశ్రమంలోని వేదసంస్కృత పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యులు సత్యాచార్యు లు తెలిపారు. కోర్సు శిక్షణకాలం మూడేళ్లు, వయస్సు 12 – 18 మధ్య ఉండాలన్నారు. వివరాలకు 95059 25999, 99484 18410 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. నగరంలో పోలీసుల తనిఖీలు గోదావరిఖని: వన్ టౌన్ పోలీసులు శనివారం రాత్రి నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించా రు. జీఎం ఆఫీస్, ఫైవింక్లయిన్చౌరస్తా, అడ్డగుంటపల్లి తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. నిషేధిత పదార్థాల రవాణా, అనుమానితుల కట్టడి, నేరాల నియంత్రణ, అవాంఛనీ య ఘటనలను అరికట్టడంపై దృష్టి పెట్టారు. -
శ్రీపాద ట్రస్ట్ కంటి వైద్యశిబిరానికి విశేష స్పందన
ముత్తారం: సాథనిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీపాద ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ పుష్పగిరి కంటి వైద్య బృందం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. దివంగత అసెంబ్లీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా చేపట్టిన శిబిరంలో 1536 మందికి కంటి పరీక్షలు చేశారు. 717మందికి అద్దాలు, 491 మంది శస్త్ర చికిత్సకు ఎంపికయ్యారు. శిబిరాన్ని త హసీల్దార్ మధుసూదన్రెడ్డి సందర్శించారు. సేవలు అందించిన కంటి వైద్యులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఎస్సైలు రవికుమార్, శ్రీనివాస్, పోలీ సు సిబ్బందిని కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానించా రు. డీసీసీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, అధి కార ప్రతినిధి సెగ్గం రాజేశ్, పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
జనగణనలో పొరపాట్లు జరగొద్దు
పెద్దపల్లిరూరల్: జనగణన నమోదు పక్కాగా ఉండాలని, కచ్చితమైన సమాచారం నమోదు చేయాలని, గ్రామాల వారీగా పాఠశాలలు, దేవాలయాలు, పంచాయతీ ఆఫీసులు తదితర గుర్తులను బ్లాక్ వారీగా నమోదు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కొత్తపల్లి గ్రామంలో చేపట్టిన జనగణన నమోదు తీరును ఆయన శనివారం పరిశీలించారు. జనగణన సమయంలో ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులపై తహసీల్దార్ రాజయ్య, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జనగణనను కచ్చితత్వంతో పూర్తిచేయాలి సుల్తానాబాద్రూరల్: జనగణన సర్వేను కచ్చితత్వంతో పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. దుబ్బపల్లి, చిన్నకల్వలలో చేపట్టిన జనగణన సర్వేను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. తహసీల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, అధికారులు ఉన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష సర్వే తీరు పరిశీలన -
ఐఎన్టీయూసీ నేతకు డాక్టరేట్
గోదావరిఖని: రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఐఎన్యూటీసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్కు అరుదైన గౌరవం లభించింది. కార్మికుల హక్కుల పరిరక్షణ, ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ అవార్డు లభించింది. జీహెఆర్టీ ఇండియా సంస్థ, వెబ్బైక్ యూనివర్సిటీ, ఏఐయూ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో శనివారం కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో క్లిష్టమైన ఆర్థో ఆపరేషన్ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఓదెల మండలం పొత్కపల్లికి చెందిన గంగారం గంగమ్మ(80) ప్రమాదవశాత్తు జారిపడి తొంటి ఎముక విరిగింది. తీవ్రగాయమైన గంగమ్మను బంధువులు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. శనివారం బాధితురాలికి డాక్టర్ కుమార్ ఆర్థో సర్జన్ 4గంటలు శ్రమించి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్ బంధువులు ప్రభుత్వ విప్ విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఆర్థో సర్జన్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. అన్నివర్గాల ప్రజల భాగస్వామ్యంతో ముందుకు గోదావరిఖని: అన్నివర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్లడమే ధ్యేయంగా సామాజిక సమతా వేదిక ఉద్దేశమని నాయకులు అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. 5న జగ్జీవన్రావు, సాయంత్రం అంబేడ్కర్ జీవిత చరిత్ర నాటిక ప్రదర్శన ఉంటుందన్నారు. అంబేడ్కర్ 135వ జయంతి ఉత్సవాలు, మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంబేడ్కర్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు. నాయకులు కె.స్వామి, గుమ్మడి కుమారస్వామి, పెంట రాజేశ్, మాదాసు రామ్మూర్తి, కోటగిరి పాపయ్య, పర్లపల్లి రవి, జేవీరాజు, రాసపెల్లి రవికుమార్, పులి మోహన్, కాసిపేట శివాజీ, కల్వల సంజీవ్, చింటూ, శ్రావణ్, గన్నాల శ్రీధర్గౌడ్ పాల్గొన్నారు. -
అప్పుల బాధతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులు తాళలేని ఓ ఆటో డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆటో నడవక సరైన ఉపాధి లేక కటుంబాన్ని పోషించేందుకు అప్పులు చేసిన ఆటోడ్రైవర్ తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముస్తాబాద్ ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మారెల్లి శ్రీనివాస్(52) అద్దె ఇంట్లో ఉరివేసుకుని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్నెళ్లుగా ఆటో నడుపుతున్న శ్రీనివాస్ ఏడాది క్రితమే కూతురు వివాహనికి అప్పులు చేశాడు. ఆటోకు సరైన గిరాకీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అప్పులు తీరేమార్గం కనిపించక, ఆటో నడిపిన సరైన గిరాకీలు లేవని తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాస్ జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ మృతితో భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుతున్న శ్రీనివాస్ చివరికి ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబం వీధిన పడింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వివాదాల వర్సిటీ..!
వర్సిటీ గాథలు–1సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ వివాదాలకు ని లయంగా మారుతోంది. క్రమశిక్షణ పేరిట కొంతకాలంగా వీసీ ఉమేశ్కుమార్ తీసుకుంటున్న చర్యల పై విద్యార్థులు నిరసన బాట పట్టగా.. తాజాగా ద ళితులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారంటూ ఏ కంగా ప్రొఫెసర్లు బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. దళిత మహిళనైన తనను అసంబద్ధ చర్యలతో వేధిస్తున్నారంటూ తెలంగాణ విద్యా కమిషన్ సలహా కమిటీ సభ్యురాలు, సోషియాలజీ విభాగాధిపతి సూరేపల్లి సుజాత రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అకారణంగా తనను, మరికొందరు దళిత విద్యార్థులను అర్బన్ నక్సలైట్లు అంటూ ప్రచారం చేయ డం తన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓవైపు తెలంగాణలో మావోయిస్టులు లేరంటూ డీజీపీ ప్రకటిస్తుంటే.. తమను అర్బన్ నక్సలైట్లంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని, వారిని ప్రోత్సహిస్తున్న వీ సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో వర్సిటీ వివిధ ఆరోపణలపై తొలగించిన ఇద్దరు అధ్యాపకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. వర్సిటీకి 12–బీ హోదా ఇవ్వకూడదంటూ యూజీసీకి అధ్యాపకులు కొందరు లేఖ రాశారు. విచారణ జరిపిన వర్సిటీ ఐ దుగురు అధ్యాపకులను బాధ్యులుగా గుర్తించి వి ధుల నుంచి తప్పించింది. ఆ ఐదుగురిలో ఇద్దరిని ఇటీవల వీసీ విధుల్లోకి తీసుకున్నారు. ఇక్కడే సి బ్బంది రెండు వర్గాలుగా చీలిపోయారు. వీరి ని యామకాన్ని కొందరు విద్యార్థులు, సిబ్బంది వ్యతి రేకిస్తున్నారు. మరోవైపు వర్సిటీలో కొందరు అర్బన్ నక్సలైట్లు చేరారంటూ ఆరోపిస్తూ.. మరోవర్గం కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఇందులో ప్రొఫెసర్ సుజా త పేరు ఉండటంతో ఆమె ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారు. గతంలో రిజిస్ట్రార్గా పనిచేసిన సమయంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకు ని ఉమేశ్కుమార్ కొంతకాలంగా ప్రతీకార చర్యల కు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. 12–బీ వ్య వహారంలో బహిష్కరణకు గురైన అధ్యాపకుడు పెంచాల శ్రీనివాస్తో కలిసి ఆయన తనపై దుష్ప్రచారానికి తెరతీశారని మండిపడుతున్నారు. కనీసం నోటిఫికేషన్ లేకుండా వారిద్దరిని ఎలా నియమిస్తారంటూ విద్యార్థులు ధర్నా చేయడంతో వారంపా టు వారికి క్లాసులు ఇవ్వమంటూ వీసీ హామీ ఇవ్వడంతో శాంతించారు. వసతులు, హక్కుల కోసం ప్రశ్నిస్తే.. తమను అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేసి బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఫ్రొఫెసర్ సుజాత ను పదవుల నుంచి తప్పించడంపై వీసీ స్పంది స్తూ .. ఆమెను ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా తొలగించినందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని వివరించారు.గతేడాది వర్సిటీలో ఎస్సీ సంక్షేమ నిధులతో చేపట్టిన భవన నిర్మాణ పనుల ప్రారంభ సమయంలో మంత్రి లక్ష్మణ్కు ప్రాధాన్యం తగ్గించిన విషయం అప్పట్లో వివాదాస్పదమైంది. ఇది ఇద్దరు రాష్ట్ర మంత్రుల మధ్య మాటల చిచ్చు పెట్టింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆ సమయంలో వీసీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తన శాఖ నిధులతో జరిగే పనులలో తనకు ప్రాధాన్యం తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ విషయంలో పొరపాట్లు పునరావృతం కాకూడదని మందలించారు. తాజాగా తనను వరుసగా పదవుల నుంచి తప్పించడంపైనా ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత మంత్రి లక్ష్మణ్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో దళితులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని మంత్రి లక్ష్మణ్ ఫోన్లో వీసీకి హితవు పలికారు. సాక్షాత్తూ ఎస్సీ సంక్షేమ మంత్రి చెప్పినా వీసీ తనను వేధించడం ఆపడం లేదంటూ, అందుకే, అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించానని సుజాత ‘సాక్షి’కి వెల్లడించారు.కరీంనగర్లో అర్బన్ నక్సల్స్ ఉన్నారంటూ మాకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై మా నిఘా విభాగాలు ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వలేదు. దీనిపై విద్యార్థులు ఎలాటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కమిషనరేట్ పరిధిలో అర్బన్ నక్సలైట్లు ఎవరూ లేరు. – గౌస్ ఆలం, పోలీస్ కమిషనర్ -
కమలం బలపడేనా?
సాక్షి పెద్దపల్లి: బీజేపీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. అందులో జిల్లాకు పెద్దపీట దక్కింది. శాశ్వత ఆహ్వానితులుగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులతో ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీలో జిల్లానుంచి ఏకంగా ఏడుగురికి చోటుకల్పించారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతీఒక్కరు కృషి చేయాలని కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు నేతలకు పిలుపునిచ్చారు. అయితే జిల్లాలో బీజేపీ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. బీజేపీలోని నలుగురైదుగురు నాయకులు కూడా ‘తలోదారి’ అన్నట్లు తయారైంది. కొత్త, పాత నేతలు గ్రూపులుగా విడిపోవడంతో పార్టీ అస్తవ్యస్తంగా మారింది. నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదు. ‘ఎవరికివారు.. యము నా తీరు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారనే విమ ర్శలు ఉన్నాయి.. దీంతో ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభావం పాలైంది. స్థానిక ఎన్నికల్లో ఓటమి పాలైనా.. రాష్ట్ర కార్యవర్గంలో పలువురు నేతలకు చోటు లభించడంతో బీజేపీ జిల్లా నేతల్లో జోష్ కనిపిస్తోంది. మనోళ్లే ఏడుగురు బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, గోదావరిఖనికి చెందిన కాసిపేట లింగయ్య, మాజీ ఎంపీ వెంకటేశ్ నేతలకు ప్రత్యేక ఆహ్వానితులుగా చోటు లభించింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గోదావరిఖనికి చెందిన బల్మూరి వనిత, జూలపల్లికి చెందిన నల్లా మనోహర్రెడ్డి, మంథని నుంచి చందుపట్ల సునీల్రెడ్డి, పెద్దపల్లి నుంచి దుగ్యాల ప్రదీప్రావులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అవకాశం కల్పించారు. కలిసి నడిస్తేనే.. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను వెనక్కి నెట్టి రెండోస్థానంలో నిలిచిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ కై వసం చేసుకుని సత్తా చాటింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల్లో అభ్యర్థుల త రఫున ప్రచారం, దిశానిర్దేశం చేసే నేతలు లేక చతికిలబడ్డారు. దీనికి ప్రధానంగా నేతల మధ్య నెలకొన్న అనైక్యతే కారణమని సొంతపార్టీ నేతలే బాహాటంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పటి నుంచైనా పార్టీ పదవులు పొందిన బీజేపీ నేతలు కలిసికట్టుగా శ్రమించాలంటున్నారు. కేడర్కు మార్గనిర్దేశనం చేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటవచ్చని భావిస్తున్నారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడవచ్చని కమలం శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఏడుగురు జిల్లావాసులకు చోటు పదవుల పందేరంతో పువ్వుగుర్తు పార్టీలో నయా జోష్ పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలంటున్న కేడర్ -
వైభవంగా నృసింహుని రథోత్సవం
శ్రీలక్ష్మీనర్సింహస్వామి రథోత్సవంలో భక్తులు, స్వామివారి సన్నిధిలో పూజలు చేస్తున్న ప్రభుత్వ విప్ విజయరమణారావు, నాయకులుజూలపల్లి: పెద్దాపూర్ శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నా యి. ఇందులో భాగంగా శుక్రవారం రథోత్సవం, జాతర ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆల యంలో ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం స్వా మివారి ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకొచ్చి రథంపై ఆశీనులను చేశారు. అనంతరం పువీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరుకాగా ఆలయ ఈవో సదయ్య, అర్చకులు, ధర్మకర్తలు, సర్పంచ్ తొగరు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రజని– రవీందర్రెడ్డి, సభ్యులు ఘనస్వాగతం పలికారు. ధర్మకర్తలు రాజభాస్కర్రెడ్డి, నరేశ్రెడ్డి, బీజేపీ నాయకుడు సురేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, ఆర్డీవో గంగయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నల్ల మనోహర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తదితరులు వేడుకలకు హాజరయ్యారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు సనత్కుమార్, మధుకర్, సిబ్బంది పటిష్ట బందో బస్తు చేపట్టారు. ప్రత్యేకపూజలు చేసిన ప్రముఖులు -
శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం
ముత్తారం: దివంగత అసెంబ్లీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన పుష్పగిరి కంటి ఆస్పత్రి శుక్రవారం ఉచిత కంటివైద్య, శస్త్రచికిత్స శిబిరం ఏర్పాటు చేసింది. టీ పీసీపీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల ఽశ్రీనుబాబు, డీసీపీ రాంరెడ్డి, డీఎంహెచ్వో ప్రమోద్కుమార్తో కలిసి క లెక్టర్ శుక్రవారం శిబిరం ప్రారంభించారు. అనంత రం మాట్లాడుతూ, సర్పంచ్ నుంచి శాసనసభ స్పీక ర్ వరకు ఎదిగిన శ్రీపాదరావు నమ్ముకున్న సిద్ధాతా లకు కట్టుబడి సేవలు అందించారన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా మారుమూల ప్రాంతాల పేద ల కోసం ఉచిత కంటి వైద్యపరీక్షలతోపాటు శస్త్రచికిత్సలు అందించేందుకు దుద్దిళ్ల కుటుంబం ముందు కు రావడం అభినందనీయమన్నారు. తండ్రి బాట లో తనయులు శ్రీధర్బాబు, శ్రీనుబాబు సమాజ సేవ చేపట్టడం ప్రశంసనీయమన్నారు. మంథని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం సుమారు 40 ఏళ్లుగా తమను నమ్ముకుని అధికారం ఇస్తున్న మంథని ప్రజలకు సేవచేయడం తమ దు ద్దిళ్ల కుటుంబం లక్ష్యమని టీపీసీసీ ప్రధాన కార్యద ర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. తమ తండ్రి శ్రీపాదరావు ఆశయ సాధన కోసం సంక్షేమ పథకాల ఫ లాలను పేదలకు అందిస్తామని తెలిపారు. తొలిరో జు 1,030 కంటి పరీక్షలు చేయగా.. అందులో 300 మందికి కళ్లద్దాలు, 250 మందిని శస్త్రచికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తున్నట్లు వివరించారు. శనివారం కూడా ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐలు రాజు, ప్రసాద్రావు, ఎ స్సై రవికుమార్, పుష్పగిరి కంటి వైద్యుడు ప్రదీప్, ఆప్తాలిక్ వేణుబృందం, సందరవేన మహేందర్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు అన్నయ్యగౌడ్, రాజాబాబు, డీసీసీ ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు, కమాన్పూర్ ఏఏంసీ చైర్మన్, వైస్ ఛైర్మన్ వైనాల రాజు, మద్దెల రాజయ్య, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ బియ్యని శివకుమార్, నాయకులు తూటి రఫీ, బోల్నేనేని బుచ్చాంరావు, సుదాడి సంపత్రావు, బక్కతట్ల వీనిత్, నూనేటి కృష్ణ, కేవీ చారి, తాటిపాముల ఽశంకర్, కొల విజయ్, అనుము ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష శ్రీపాద ట్రస్టు ఆధ్వర్యంలో వైద్యశిబిరం -
దొడ్డి కొమురయ్య పోరాటం స్ఫూర్తిదాయకం
పెద్దపల్లి: తెలంగాణ తొలిఅమరుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి నిర్వహించారు. తొలుత దొడ్డి కొమురయ్య చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రంగారెడ్డి మా ట్లాడుతూ, నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ కో సం సాయుధపోరు సాగించిన దొడ్డి కొమురయ్య నేటి తరానికి ఆదర్శమన్నారు. బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కో ఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ప్రధాన కార్యదర్శి కర్రె కుమారస్వామి, సర్పంచ్ గుంటి బాపు, ఉపసర్పంచ్ తొంటి మధుకర్, సామాజిక కార్యకర్త కోమటిపల్లి రాజేందర్ నేత పాల్గొన్నారు. అక్రమ కేసులు నమోదు చేస్తారా? పెద్దపల్లి: ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసులు.. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ప్రజలపైనే అక్రమ కేసులు నమోదు చేసి రాజకీయ నాయకులకు అండగా ఎలా నిలుస్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ ప్ర శ్నించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద శు క్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. రాఘవపూర్లోని శ్మశానవాటిక వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని ముందస్తు సమాచారం ఇచ్చిన తమ పార్టీ నాయకులు అశోక్, నవీన్ను జైలుకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. కమ్యూనిస్టు నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయ డం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు భూపాల్, బండ రవికుమార్, శోభన్, ముత్యంరావు, రవీందర్ పాల్గొన్నారు. దళారులను నమ్మొద్దు పెద్దపల్లి: వైద్య, విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారులను నమ్మి మోసపోవద్దని పెద్దపల్లి ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ సూచించారు. అంతేకాకుండా పెండింగ్ బిల్లులు మంజూరు చేయిస్తామనే ఏజెంట్ల మాటలూ నమ్మవద్దని సూచించారు. కేంద్ర కార్యాలయాన్ని తరలించేదిలేదు ఫెర్టిలైజర్సిటీ: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) కర్మాగారం కార్పొరేట్ కార్యాలయం నోయిడా నుంచి రామగుండం తరలించాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ 16 ఆగస్టు 2025న కేంద్రప్రభుత్వానికి వినతిపపత్రం అందజేశారు. స్పందించిన కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి జగత్ ప్రకాశ్నడ్డా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారం కార్పొరేట్ కార్యాలయాన్ని నోయిడాలోనే కొనసాగిస్తామని వివరణ ఇచ్చారు. ఆర్ఎఫ్సీఎఫ్ ప్లాంట్ హెడ్, మె కానికల్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఫైనాన్స్ విభాగం అధికారులు రామగుండంలోనే ఉంటారని బదులిచ్చారు. నోయిడాలోని కార్పొరేట్ కార్యాలయం ఎరుగ శాఖ ప్రమోటర్లు ఈక్విటీ భాగస్వాములతో సమన్వయం చేసుకోవడానికి, ఢిల్లీలో చట్టపరమైన మధ్యవర్తిత్వ విషయాలను నిర్వహించడానికి అత్యంత అవసరమని మంత్రి వివరించారు. సెప్టిక్ ట్యాంక్లు శుభ్రం చేయించండి ● నోటిఫికేషన్ జారీ చేసిన రామగుండం బల్దియా కమిషనర్ కోల్సిటీ(రామగుండం): ప్రతీ సెప్టిక్ ట్యాంక్ను మూడేళ్లకోసారి తప్పనిసరిగా శుభ్రం చేయించాలని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ సూచించారు. ఈమేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీచేశారు. ప్రొ హిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాస్ మా న్యూవల్ స్కావెంజర్స్ అండ్ దెయిర్ రిహాబిలిటేషన్(పీఈఎంఎస్ఆర్) చట్టం–2013 ప్రకా రం సెప్టిక్ ట్యాంక్లోకి మనుషులు ప్రవేశించి శుభ్రం చేయడం నిషేధించారని గుర్తుచేశారు. సెప్టిక్ టాంక్ శుభ్రం చేసే సేవలు పొందడానికి టోల్ ఫ్రీ నంబరు 14420 లేదా, కాల్సెంటర్ నంబరు 93924 83959కు ఫోన్ లేదా వా ట్సాప్ సందేశం ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించరు. సెప్టిక్ ట్యాంకుల రూపకల్పన, నిర్మాణం, ఇండియన్ స్టాండర్డ్స్ ‘ఐఎస్ 2470’ ప్రకారం చేపట్టాలని కమిషనర్ తెలిపారు. నగరవాసులు, మేషన్లు, కాంట్రాక్టర్లు ఈ నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని నోటిఫికేషన్లో ఆమె పేర్కొన్నారు. -
17 నుంచి మహాసభలు
పెద్దపల్లి: వరంగల్లో ఈనెల 17, 18వ తేదీల్లో చేప ట్టే దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్ కోరారు. జిల్లా కేంద్రంలో మహాసభల ప్రచార పోస్టర్ను సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర సదానందంతో కలిసి శు క్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, వివిధ కేంద్రప్రభుత్వ శాఖల్లో 45 శాతం ఎస్సీ రిజర్వ్డ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. 45 యూనివర్సిటీల్లోగల 42 శాతం వివిధ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కందుకూరి రాజారత్నం, పెరు క లక్ష్మణ్, పెరిక సతీశ్, అరికిల్ల గణపతి, కల్లపల్లి న వీన్, ఆరెపల్లి మానస, ప్రశాంత్ పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన
రామగుండం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శుక్రవారం పలు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించారు. తొలుత రామునిగుండాల, ఆబాది రామగుండంలోని స్వయంభూ శ్రీకాశీవిశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానికుడు తిప్పని సత్తయ్య రామునిగుండాల విశిష్టతను వివరించారు. ఆబాది రామగుండంలోని శ్రీకాశీవిశ్వేశ్వరాలయంలో పూజారి విజయ్కుమార్ ఆచార్య, ఆలయ కమిటీ ప్రతినిధి సాయి తదితరులు సీపీ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చేరుకున్న సీపీ దంపతులకు ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత మాచిడి మహేందర్గౌడ్ మూలవిరాట్ చిత్రపటాన్ని బహూకరించి శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ దాత మంగీలాల్, కోల కు సుమకుమారి, రామగుండం సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో చదువుకోవాలి
రామగిరి: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ బులుసు విష్ణువర్ధన్ సూచించారు. శుక్రవారం సెంటినరీకాలనీ క మ్యూనిటీహాల్లో కల్వచర్ల ప్రగతి పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డేలో మాట్లాడారు. తొలుత టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యా ల రాజిరెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ అబ్బు కేశవరెడ్డితో కలిసి విద్యార్థులకు ప్రశంసపత్రాలు, జ్ఞాపిక లు అందజేశారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే నైతిక విలువలు, క్రమశిక్షణ, శ్రద్ధ వంటి లక్షణాలు నేర్పుతూ ఉత్తములుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లాస్థాయిలో అద్భుత ప్రతిభ అంగుళీయ అబాకస్ పోటీల్లో జిల్లాస్థాయిలో ప్రతి భ కనబర్చిన విద్యార్థులకు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశంసపత్రాలు అందజేశారు. అబాకస్ శిక్షణతో పిల్లల్లో జ్ఞాపకశక్తి, తార్కిక ఆలోచన పెరుగుతాయని తెలిపారు. వీరిప్రతిభ భ విష్యత్లో గొప్పగణిత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడుతుందని ప్రశంసించారు. పాఠశాల కరస్పాడెంట్ అబ్బు కేశవరెడ్డి మాట్లాడుతూ పోటీ ప్ర పంచంలో గణితంపై పట్టు సాధించేందుకు అంగు ళీయ అబాకస్ ఒకసంజీవనిలా పనిచేస్తుందన్నారు. తమ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో మెడల్స్ సాధించడం గర్వకారణమన్నారు. పాఠశాల ఇన్చా ర్జి కొప్పుల గోవర్ధన్రావు, అధ్యాపకులు, విద్యార్థు లు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జేఎన్టీయూ ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ -
అత్యుత్సాహం.. అతివేగం
కరీంనగర్రూరల్: ఇంజినీరింగ్ విద్యార్థుల అత్యుహ్సం, అతివేగం రెండు నిండుప్రాణాలను బలితీ సుకుంది. బొమ్మకల్ బైపాస్రోడ్డులో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. అతివేగంగా వెళ్తున్న కా రు అదుపుతప్పి ఎదురుగా ఆగిఉన్న లారీని ఢీకొ ట్ట డంతో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా మరో ఇ ద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. కరీంనగర్రూరల్ పోలీసుల కథనం మేరకు క రీంనగర్లోని అజ్మత్పురాకు చెందిన సయ్యద్ అ త్యాబ్(21) తన స్నేహితులైన అబ్దుల్ రహమాన్(19), అద్నాన్, అబ్రార్ హౌసింగ్బోర్డు కాలనీ నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో గురువారం రాత్రి 10.30గంటలకు టీ తాగేందుకు బొమ్మకల్ బైపాస్రోడ్డులో బయల్దేరారు. అత్యాబ్ వేగంగా కారు నడుపుతూ వీ కన్వెన్షన్ సమీపంలో ఎదురుగా రోడ్డుపై ఆగిన లారీ ని బలంగా ఢీకొట్టాడు. కారులోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు, పోలీసులు కారులోంచి బయటకు తీశారు. అత్యాబ్ను చల్మెడ ఆనందరావు ఆస్పత్రికి తరలించగా రాత్రి 11గంటలకు మృతిచెందాడు. మిగితా ముగ్గురిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ అబ్ధుల్ రహమాన్ అర్ధరాత్రి ఒంటిగంటకు మృతిచెందాడు. మిగితా ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతులు ఇద్దరు బీటెక్, గాయపడిన వారు ఇంటర్ చదువుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని శుక్రవారం కరీంనగర్ సీపీ గౌస్ఆలం, రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీఐ నిరంజన్రెడ్డిలు పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సయ్యద్ అత్యాబ్(ఫైల్)అబ్దుల్ రహమాన్(ఫైల్) -
భట్టి గారు.. ఈ సమస్యకు పరిష్కారం చూపండి
● ‘సాక్షి’ కథనాన్ని ‘ఎక్స్’ ద్వారా డిప్యూటీ సీఎంకు ట్వీట్మల్లాపూర్: మల్లాపూర్కు చెందిన వృద్ధురాలు ముష్కరి గంగామణి గ్రామసభలో నా 20 గుంటల వ్యవసాయ భూమిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 8విద్యుత్ స్తంభాలు వేసిండ్రు అంటూ తన ఆవేదనను వెల్లడిస్తూ ట్రాన్స్కో ఏఈ వినీత్రెడ్డిని వేడుకుంటున్న కథనం శుక్రవారం ‘సాక్షి’లో ‘‘కాల్మొక్త సారూ.. కనికరించండి’ శీర్షికన ప్రచురితమైంది. ఈ కథనాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ట్విట్ చేశారు. విద్యుత్శాఖ మంత్రి భట్టి గారూ.. ఈ సమస్యకు పరిష్కారం చూపండి అంటూ 20 గుంటల భూమిలో ఇష్టరీతిన స్తంభాలు వేస్తే సాగుకి నాగలి ఎట్టా తిరుగుతది? పంట ఎట్ల పండుతది? అంటూ డిప్యూటీ సీఎం బట్టితో పాటు మాజీ మంత్రి కేటీఆర్కు, సీఎంవో కార్యలయానికి పోస్టు చేశారు. -
నిజాయతీ చాటుకున్న వ్యాపారి
యైటింక్లయిన్కాలనీ: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని యైటింక్లయిన్కాలనీలో రెగ్జిన్ బ్యాగులు కుట్టే హాపిజిల్లాఖాన్ ఓ బ్యాగులో లభించిన దాదాపు 5 తులాల బంగారు నెక్లెస్ను యజమానికి అందించి నిజాయతీ చాటుకున్నారు. బ్యాగు కుట్టుమని తోటపల్లి యాదగిరిరావు ఆయనకు ఇటీవల అప్పగించాడు. దానిని కుడుతున్న క్రమంలో 5 తులాల నెక్లెస్ లభ్యమైంది. దానిని వెంటనే యాదగిరి రావుకు ఫోన్చేసి అప్పగించారు. ఖాన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు స్థానిక అబ్దుల్ కలాం స్టేడియంలో వాకర్స్, యోగా సోసియేషన్ సభ్యులు శుక్రవారం ఖాన్ను అభినందించి సన్మానించారు. ఈకార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రేసవేన కేశవులు, ఉపాధ్యక్షుడు సంపత్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మాజీ కౌన్సిలర్ దుర్మరణం రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే వంతెన సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ కౌన్సిలర్ రంగు భారతి(50) దుర్మరణం చెందారు. అంతర్గాం నుంచి గోదావరిఖని వెళ్తుండగా స్థానిక రైల్వే వంతెనపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో రంగు భారతి–బ్రహ్మం దంపతులు కిందపడిపోయారు. భారతి ఎగిరి కిందపడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. భర్త బ్రహ్మం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై సంధ్యారాణి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన రెహనా(56) శుక్రవారం రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. తనకు అవసరమైన కిరాణ సామగ్రి కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. హుజూరాబాద్రూరల్: ఇప్పలనర్సింగాపూర్కు చెందిన కస్తూరి రాధ(47) శుక్రవారం ప్రమాదవశాత్తు కాకతీయ ప్రధాన కాలువలో పడి మృతి చెందిందని సీఐ కరుణాకర్ తెలిపారు. బట్ట లు ఉతికేందుకు కెనాల్ వద్దకు వెళ్లగా కాలు జారి రాధ కాలువలో పడిపోయింది. నీటి ఉధృతికి కొట్టుకపోయి పెద్దపాపయ్యపల్లి శివారులో తేలడంతో గ్రామస్తులు పైకి తీసుకువచ్చారు. అప్పటికే ఆమె మృతి చెందిందని, కుమారుడు హరికృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
గ్యాస్ కొరతతో ఇబ్బందులు
మల్లాపూర్: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో గ్యాస్ కొరతతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద శుక్రవారం ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు బారులుతీరారు. గ్యాస్ సిలిండర్ల స్టాక్ వచ్చిందనే సమాచారంతో వినియోగదారులు ఉదయాన్నే ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్నారు. అందరూ ఒకేసారి గ్యాస్ బుక్ చేసుకోవడంతో అందరికీ సరిపడా సిలిండర్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. గంటల వ్యవధిలోనే పంపిణీ పూర్తవుతుండడంతో నో స్టాక్ బోర్డును పెట్టడంతో అప్పటి వరకు నీరిక్షించిన వినియోగదారులు ఖాళీ సిలిండర్లతోనే నిరసన వ్యక్తం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులు రసీదులు ఇచ్చి స్టాక్ వచ్చిన తర్వాత తీసుకెళ్లాలనడంతో చేసేదేమి లేక వెనుదిరుతున్నారు. సిలిండర్ల సరఫరాలో అక్రమాలపై దృష్టి సారించి ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
‘ఎల్లంపల్లి’లో పడిపోతున్న నీటినిల్వలు
● ఎగువ పంపుహౌస్లకు కొనసాగుతున్న ఎత్తిపోతలు రామగుండం: పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టులో నీటినిల్వలు సగానికిపైగా పడిపోయాయి. కాళేశ్వరం ఎత్తిపోతలు మూడేళ్లుగా నిలిచిపోవడంతో ఏటా మే చివరినాటికి ప్రాజెక్టులో నీటి మట్టం అడుగంటిపోతోంది. ఈసారి కూడా అదేపరిస్థితి పునరావృతమవుతోంది. అయితే, రెండేళ్లక్రితం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో అధికారులు ఆగమేఘాలపై ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మెరుగైన పరిస్థితి హైదరాబాద్ ప్రజల తాగునీటి అవరాల కోసం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి పంపుహౌస్ నుంచి 6.6 కేవీ సామర్థ్య కలిగిన ఆరు విద్యుత్ మోటార్లతో ప్రతీరోజు 56 క్యూసెక్కులు(0.03 టీఎంసీ)లు తరలిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా శుక్రవారం 144.50 మీటర్ల ఉంది. 11.65 టీఎంసీలు నీరునిల్వ ఉంది. గతేడాది ఇదేరోజు నీటిమట్టం 143.42 మీటర్లు, నీటినిల్వలు 9.67 టీఎంసీలు ఉన్నాయి. గతేడాదితో పోల్చితే రెండు టీఎంసీలు అధికంగా ఉండడం ఊరటనిచ్చే అంశం. కొనసాగుతున్న ఎత్తిపోతలు ఎల్లంపల్లి నుంచి ఎన్టీపీసీ 242 క్యూసెక్కులు, గూడెం పంపుహౌస్కు 290 క్యూసెక్కులు, హైదరాబాద్కు 300 క్యూసెక్కులు పంపింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 1,251 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది. అధికారుల ప్రత్యేక దృష్టి ఎల్లంపల్లిలో నీటినిల్వల లభ్యతపై హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రెండేళ్ల క్రితం డ్యాంలో నీటినిల్వలు అడుగంటిపోయాయి. పంపుహౌస్లోని విద్యుత్ మోటార్లకు నీరు అందలేదు. లోతట్టులోని నీటి నిల్వల నుంచి ప్రత్యేక పైపులైన్ నిర్మించి మోటార్లకు అనుసంధానించారు. తద్వారా తాగునీటి పంపింగ్ సులువయ్యింది. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నారు. -
5న గూడూరి పురస్కారం
● పురస్కారానికి ఎంపికై న స్వర్ణ కిలారిసిరిసిల్ల అర్బన్: ప్రసిద్ధ తెలంగాణ కథా రచయిత గూడూరి సీతారాం యాదిలో గూడూరి ఫౌండేషన్–మారసం కథా పురష్కారం ఏటా అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే 2024 పురస్కారానికి రచయిత్రి, అనువాదకులు స్వర్ణ కిలారి రాసిన ‘నల్ల బంగారం’ కథల పుస్తకం ఎంపికై ందని గూడూరి ఫౌండేషన్ నిర్వాహకులు ఎలగొండ రవి, మారసం కార్యదర్శి ఆడెపుల లక్ష్మణ్ తెలిపారు. ఈ పురస్కారాన్ని 5 ఏప్రిల్, 2026న సిరిసిల్లలోని డాక్టర్ సినారె విజ్ఞాన మందిరం, జిల్లా గ్రంథాలయంలో జరిగే సభలో పురస్కారం ప్రధానం చేయనున్నారు. తెలంగాణ జీవితాలు, బొగ్గుబాయి బతుకులను ‘స్వర్ణ కిలారి’ నల్లబంగారం కథలుగా రాసినట్లు తెలిపారు. గతంలో ఈ పురస్కారాలు వరుసగా పూడూరి రాజిరెడ్డి, డాక్టర్ సూర్య ధనంజయ్, పిన్నమశెట్టి కిషన్ అందుకున్నట్లు తెలిపారు. -
కాలువలోపడి యువకుడి మృతి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రా మానికి చెందిన కొంతం నాగరాజు(28) ఎస్సారెస్పీ కాలువలో పడి దుర్మరణం పాలయ్యాడు. నాగరాజు ద్విచక్రవాహనం, చెప్పులు చందపల్లి కెనాల్ వద్ద లభించగా.. మృతదేహం ముత్తారం గ్రామశివారులో కనుగొన్నట్టు ఎస్సై మల్లేశ్ తెలిపారు. మృతుడి తల్లి రాధమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా, తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నట్టు రాధమ్మ పేర్కొనగా.. పూర్తిస్థాయి పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని గ్రామస్తులు చెబుతున్నారు. చిగురుమామిడి: హైనా దాడిలో లేగదూడలు, మేక పిల్లలు మృతిచెందాయి. మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన రైతు గండికోట పెద్దశ్రీనివాస్ వ్యవసాయ బావి వద్ద రోజు మాదిరిగానే గురువారం సాయంత్రం పాడిఆవులు, లేగదూడలు, మేక పిల్లలను కట్టేసి ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం వెళ్లేసరికి లేగదూడలు, మేక పిల్లలు మృతి చెంది ఉన్నాయి. సమాచారం అందుకున్న ఫారెస్టు సెక్షన్ అధికారి శేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హైనా దాడిలో మృతిచెందవచ్చని పరిహారం కోసం మీసేవాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.ఆకట్టుకున్న ‘అగ్గిపెట్టెలో చీర’సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళాకారుడు విజయ్కుమార్ నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే చీర ఆకట్టుకుంది. హైదరాబాద్లోని ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్లో సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్కుమార్ నేసిన అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఇక్కత్ పట్టు చీరలను ప్రదర్శించారు. వివిధ దేశాల నుంచి ప్రముఖులు ఈ కాన్ఫరెన్స్కు రాగా.. సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేశారు. చీర పొడవు ఆరు మీటర్లు, వెడల్పు 48 ఇంచులు. దీన్ని పూర్తి పట్టు దారాలు, జరీతో తయారు చేశారు. బరువు 250 గ్రాములు ఉంది. రెగ్యులర్గా వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు రామగుండం: పెద్దపల్లి–నిజామాబాద్ నుంచి నడిచే నాందేడ్–తిరుపతి(07015/16), నాందేడ్–ధర్మవరం(07189/90) వారాంతపు ఎక్స్ప్రెస్ రైళ్లను క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రైళ్లకు కొత్త నంబర్లు కేటాయించారు. ప్రస్తుత రైలు నంబరు 17633/34(నాందేడ్–తిరుచానూరు –తిరుపతి) ఇరువైపులా వారాంతపు రైలుగా రాకపోకలు సాగించనుంది. దీనికి బాసర, నిజామాబాద్, కోరుట్ల, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబ్బాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.టాటాఏస్లో మంటలుతిమ్మాపూర్: కరీంనగర్ నుంచి సిద్దిపేటకు ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్ ఆటో తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద మంటల్లో కాలిపోయింది. ఆటోలో ఇంజిన్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ హైమద్ పాషా ఆటోను పక్కకు ఆపి, అందులోని ప్రయాణికులను సురక్షితంగా దింపాడు. ఇంజిన్ను పరిశీలిస్తుండగా మంటలు మరింత ఎక్కువయ్యాయి. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కరీంనగర్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్ మంటలను ఆర్పేసింది. అప్పటికే ఆటో పూర్తిగా కాలిపోయిందని డ్రైవర్ అహ్మద్ పాషా తెలిపారు. ప్రమాద సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్పై ఆటో డ్రైవర్ దాడి
జగిత్యాలక్రైం: జగిత్యాల కొత్తబస్టాండ్లో సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్పై ఆటో డ్రైవర్ దాడిచేశాడు. వరంగల్ పెర్కవాడకు చెందిన మహ్మద్ జలీల్ ఆర్టీ సీ డ్రైవర్ శుక్రవారం విధుల్లో భాగంగా వరంగల్ డి పో నుంచి నిజామాబాద్కు బస్సు తీసుకుని వెళ్తుండగా జగిత్యాలలో ఆటో నడుపుతున్న ముస్కు ప్రదీ ప్ బస్సు వెనుక నుంచి హారన్ కొట్టగా సైడ్ ఇవ్వలేదు. దీంతో ప్రదీప్ ఆగ్రహం చెందుతూ బస్సును వెంబడించి కొత్తబస్టాండ్లోకి వచ్చిన తర్వాత బ స్సు డ్రైవర్ మహ్మద్ జలీల్ను దుర్భాషలాడుతూ దాడిచేశాడు. దీంతో అతడి ముఖానికి బలమైన గా యాలవడంతో ఆర్టీసీ అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ ముస్కు ప్రదీప్పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. -
తండ్రికి తనయల కన్నీటి వీడ్కోలు
● మద్దిమల్లలో విషాదం ● మా నాన్నలా అర్ధంతరంగా వెళ్లొద్దు : రిషిక కన్నీటి విన్నపంవీర్నపల్లి(సిరిసిల్ల): ఆ కుటుంబానికి అతడే ఆధారం. ఆ పిల్లలకు అతడే సర్వస్వం. కానీ విధి ఆడిన నాటకంలో ఆ ముగ్గురు ఆడపిల్లలు అనాథలయ్యారు. అనారోగ్యంతో తండ్రి మరణించగా.. కూతురే తండ్రికి తలకొరివి పెట్టి కన్నీటి వీడ్కోలు పలికిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్లలో విషాదం నింపింది. మద్దిమల్లకు చెందిన కడవ శ్రీబాబు(35) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. శ్రీబాబుకు భార్య అనిత, ముగ్గురు కుమార్తెలు రిషిక(8వ తరగతి), లాస్య(7వ తరగతి), నిత్యశ్రీ(3వ తరగతి) ఉన్నారు. తండ్రి మరణంతో ఆ కుటుంబం వీధినపడింది. కలచివేసిన కూతుళ్ల రోదనలు శ్రీబాబుకు కుమారులు లేకపోవడంతో పెద్దకూతురు రిషిక తలకొరివి పెట్టింది. తమకు అండగా ఉంటాడనుకున్న తండ్రి ఇలా మధ్యలోనే వదిలివెళ్లడంతో ఆ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. అంత్యక్రియల సమయంలో శ్రీబాబు పెద్దకుమార్తె రిషిక రోదించిన తీరు కలచివేసింది. ‘నాన్న.. ఒక్కసారి లేచి చూడు నాన్న. మేము ఎంత ఏడుస్తున్నామో. మా వంటి పిల్లలకు తండ్రి ప్రేమను దూరం చేయకండి.’ అంటూ రోదించిన తీరు కలచివేసింది. -
గుండెపోటుతో సీనియర్ పాత్రికేయుడి మృతి
చొప్పదండి: పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు సంబోజి శేఖర్ (48) శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురై మృతి చెందాడు. వేకువజామున మూడు గంటలకు గుండెపోటుకు గురవగా కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా, ఉదయం ఆరు గంటలకు మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అన్నకు కూడా గుండెపోటే.. శేఖర్ సోదరుడు సంబోజి విజయ్ కూడా గతంలో గుండెపోటుతో మృతి చెందాడు. 90వ దశకంలో పాత్రికేయ వృత్తిలో పని చేసిన విజయ్ అనంతరం న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ 2002లో గుండెపోటుకు గురై మృతి చెందాడు. అన్నదమ్ములిద్దరు గుండెపోటుకు గురై మృతి చెందడంతో వృద్ధ తల్లిదండ్రులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్లో శేఖర్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, పాత్రికేయులు, పాఠశాలల ఉపాధ్యాయులు, కరస్పాండెంట్లు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. -
పరిశీలిస్తూ.. పరిష్కరిస్తూ..
● డివిజన్ బాటకు శ్రీకారం చుట్టిన మేయర్ మహంకాళి స్వామికోల్సిటీ: రామగుండం మేయర్ మహంకాళి స్వామి బుధవారం డివిజన్ బాటకు శ్రీకారం చుట్టారు. స్థానిక 3వ డివిజన్లోని ప్రశాంత్ నగర్, వినాయకనగర్, దొడ్డి కొమురయ్యనగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ వడ్లూరి రవి, అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, సమస్యలపై ఆరా తీస్తూ ముందుకు సాగారు. స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆయన సూచన మేరకు అధికారులు.. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మురుగునీటి కాలువల్లో యంత్రాలతో పూడిక తొలగించారు. సుమారు 10 వీధిదీపాలు వెలిగేలా చర్యలు తీసుకున్నారు. తాగునీటి సరఫరాలో సమస్యలనూ పరిష్కరించారు. నివాసాలపై వేలాడుతున్న కరెంట్ తీగలను సవరించాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు. కాలువల్లో చెత్త పడవేస్తున్నారనే ఫిర్యాదు మేరకు హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీచేశారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, డీఈఈ మనోజ్, చంద్రమౌళి, రాంజీ, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు మౌనిక, కిశోర్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగ భూషణం, సంపత్ పాల్గొన్నారు. -
వలసజీవుల బతుకుచిత్రం
ఊరు లేవకముందే ఊళ్లకు పయనమై గాజులు, బొట్టుబిళ్లలు, ఇంటిసామాన్లు అమ్ముతున్నారు వలసజీవులు. జానెడు పొట్టకోసం అనేక తిప్పలు పడుతున్నారు. నాలుగు గుంజలు, నాలుగు కవర్లు ఉంటే చాలు.. గూడుగా మార్చుకొని జీవనం సాగిస్తున్నారు. సరిపడా గిన్నెలు, వంటకు కట్టెలు, నీళ్లకు క్యాన్లు, నేలపై చద్దర్లు, ఒంటిపై బట్టలు వాటిని ఆరేసేందుకు దండాలు.. ఇవీ వాళ్లగూడుకు ఆధారాలు. ఒకచోట ఆగకుండా కాలంతోపాటు పయనిస్తూ ఊరు చివరన చిన్నగుడారాలు ఏర్పాటు చేసుకుంటున్న వలసజీవుల కుటుంబాల బతుకుపోరాటం వర్ణణాతీతం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుర్మపల్లి శివారులో వలసజీవన కుటుంబాల గూడు చిత్రం ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి
పెద్దపల్లి: సుల్తానాబాద్లోని రైస్మిల్ కెనాల్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నల్లజెండాలు, బ్యాడ్జీలతో బుధవారం నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య మాట్లాడుతూ లేబర్ కోడ్లను వెంటనే ఉపసమరించుకోవాలని కోరారు. మండల కోకన్వీనర్ మాతంగి రాజమల్లు, రైస్మిల్ ఆపరేటర్ల సంఘం, కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి, ఉపాధ్యక్షులు, కల్లెపెల్లి ప్రసాద్, కొల్లూరు తిరుపతి, మంజూర్, ప్రభాకర్, శ్రీశైలం, చొప్పరి రాజు, తిరుపతి, ఓదెలు, బాలకృష్ణ, సుధాకర్రావు, రాము, కిరణ్, రాజు, రాజేశం, శీను, రమేశ్, సారయ్య, అశోక్, మహేందర్, మురళి, అనిల్, సంతోష్, సంపత్, శ్రీధర్, రవీందర్ పాల్గొన్నారు. జ్యోతినగర్: కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద జేఏసీ నాయకులు బుధవారం కార్మికులకు నల్లబ్యాడ్జీలు ధరింపజేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతన లేబర్ చట్టాలను అమలు చేయాలని జారీ చేసిన జీవోలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు చిలుక శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, భూమల్ల చందర్, ఇజ్జగిరి భూమయ్య, తోకల రమేశ్, సత్యం పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలతో నిరసన రామగిరి: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఐటీయూ ఆర్జీ–3 బ్రాంచ్ సెక్రటరీ డి.కొమురయ్య, నాయకులు వెంకటేశ్వర్లు, రవికుమార్, గోపాల్, సదానందం పాల్గొన్నారు. -
పకడ్బందీగా జనగణన
● 15లోగా హెచ్ఎల్బీ నిర్ధారణ పూర్తి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి: జిల్లాలో జనగణన – 2027 పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. హౌస్లి స్టింగ్ బ్లాక్(హెచ్ఎల్బీ) నిర్ధారణ ప్రక్రియను ఈనెల 15లోగా పూర్తిచేయాలన్నారు. జనగణన –2027పై సంబంధిత అధికారులు, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి కలెక్టరేట్లో బుధవారం సమీక్షించారు. ప్రస్తుతం హౌస్ లిస్టింగ్ బ్లాక్ మే 10న ప్రారంభమవుతుందని, ప్రతీ 300 ఇళ్ల, 800 జనాభాను ఒకబ్లాక్గా హెచ్ఎల్బీ నిర్దేశించి వివరాలు సేకరిస్తామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హెచ్ఎల్బీ పరిధిలోని నివాసాలు, ఆలయాలు, ఇతర ప్రార్థనామందిరాలు, ఆటస్థలాలు, ఆస్పత్రులు తదితర వివరాలు పకడ్బందీగా సేకరించాలని సూచించారు. జనగణన చాలాముఖ్యమైన అంశమని, నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. హౌస్ లిస్టింగ్ కోసం జిల్లావ్యాప్తంగా 1,400 మంది ఎన్యూమరేటర్లు అవసరం ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. హింసకు గురయ్యే మహిళలకు సఖి సేవలు హింసకు గురవుతున్న మహిళలకు సఖి సెంటర్ ద్వారా సేవలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. రంగంపల్లిలోని సఖి సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని, కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని న్యాయ సలహా అందించాలని సూచించారు. -
ఘనంగా మహనీయుల జయంతి
పెద్దపల్లి: జిల్లాలో ఈనెల 5న బాబూ జగ్జీవన్రామ్, 14న అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకుందామని జయంతి ఉత్సవ కమిటీ విన్నవించింది. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం కమిటీ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. కుల, మతాలకు అతీతంగా అందరూ హాజరై మహనీయుల జయంతి పండుగలను విజయవంతం చేయాలని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య, బాబూ జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవ కమటీ చైర్మన్ అంబాల రాజేందర్, ప్రతినిధులు ఆరెల్లి మల్లేశ్, బొంకూరి కై లాసం, బొంకూరి సురేందర్ సన్నీ, లింగమళ్ల శంకరయ్య, కోండ్ర శంకర్, కుక్క కనకరాజ్, తుల్లా నాగరాజ్, కుక్క ఆశోక్, బొంకూరి నరేందర్, బొంకూరి నవీన్బాబు, కల్లేపల్లి రవి, కొంకటి లింగమూర్తి, కల్వల మల్లేశ్, పెర్క శివకుమార్, ఈదునూరి విజయ్, కాసిపాక వాసు, కనుకుంట్ల సదానందం, కుక్క శ్రావణ్ కుమార్, బొంకూరి రమేశ్, దొమ్మటి సదయ్య, అంబాల నరేశ్, పెర్క సతీశ్, కల్లేపల్లి అశోక్, రామిళ్ల శారద, గూల్ల రాజు, సత్యనారాయణ, సలిగంటి రామలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి వెనుకంజ
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యం చేరుకోలేకపోయింది. టార్గెట్లో కేవలం 81శాతమే నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈసారి బొగ్గు ఉత్పత్తిలో సింహభాగం గతంలో ఉన్న లోటును పూడ్చేందు(బ్యాక్ ఫిల్లింగ్)కే కేటాయించారు. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి భారీగా తగ్గిందనే చర్చ సాగుతోంది. వెనుకబడిన 10 ఏరియాలు.. వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో సింగరేణి బొగ్గు గనులు వెనకపడ్డాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించగా 58 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించి 81 శాతం నమోదు చేసిది. సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో 2 ఏరియాలు వందశాతం ఉత్పత్తి సాధించగా, మిగతా 10 ఏరియాలు లక్ష్యం చేరుకోలేకపోయాయి. ఈసారి బ్యాక్ఫిల్లింగ్తోనే ఉత్పత్తి లక్ష్యం అందుకోలేకపోయాయి. బొగ్గు నిల్వల లోటును పూడ్చేందుకు సీఎండీ కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో మూడునెలలుగా బొగ్గు ఉత్పత్తి భారీగా సాధించినా లోటును పూడ్చడానికే సరిపోయింది. మరోవైపు.. లాభాల్లో సింగరేణి ఉద్యోగులకు వాటా వచ్చే విషయం కూడా అనుమానమే అని అధకారులు బాహాటంగానే చెబుతున్నారు. ఈక్రమంలో సింగరేణి సంస్థ ఆర్థిక గణాంకాలు పూర్తయితే తప్ప వాస్తవ లాభాలు ప్రకటించే అవకాశం లేదు. భారీగా తగ్గిన బొగ్గు ఉత్పత్తి బ్యాక్ ఫిల్లింగ్ ప్రక్రియ కారణం టార్గెట్ 72 మిలియన్ టన్నులు సాధించించి 58 మిలియన్ టన్నులు 2025–26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన బొగ్గు ఉత్పత్తి(మిలియన్ టన్నుల్లో) ఏరియా లక్ష్యం సాధించింది శాతం ఆర్జీ–1 46.90 36.53 81 ఆర్జీ–2 98.70 87.56 89 ఆర్జీ–3 65.00 46.15 71 ఏపీఏ 15.50 1.71 11 భూపాలపల్లి 46.54 27.90 60 కొత్తగూడెం 92.05 84.36 92 సత్తుపల్లి 64.45 66.38 103 ఇల్లెందు 50.00 24.65 49 మణుగూరు 11.49 10.54 92 బెల్లంపల్లి 35.00 35.35 101 మందమర్రి 27.80 19.81 71 శ్రీరాంపూర్ 65.16 44.06 68 -
నేడు 60 డివిజన్లలో సభలు
● బల్దియా కమిషనర్ అరుణశ్రీ కోల్సిటీ: రామగుండం నగరంలో గురువారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపడతామని కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. ఉదయం 10 గంటలకు 60 డివిజన్లలో ఏకకాలంలో వార్డు సభలు నిర్వహిస్తామన్నారు. సంక్షే పథకాలు, సమస్యలు గుర్తించి పరిష్కారంపై చర్చిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పింఛన్లు, షాదీముబారక్, కొత్తరేషన్ కార్డులు తదితర పథకాలపై చర్చ ఉంటుందని తెలిపారు. సభలపై సమీక్ష సభల నిర్వహణపై బల్దియా అధికారులు, సిబ్బందితో నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ అరుణశ్రీ బుధవారం స్నాహక సమావేశం నిర్వహించారు. సభసజావుగా జరగడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణ సన్మానం
కాల్వశ్రీరాంపూర్: మండలంలోని గంగారం గ్రామానికి చెందిన వరంగల్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ మార్చి 31న ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రభాకర్–వసంతాదేవి దంపతులను కాల్వశ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ సన్మానించారు. మాజీ సర్పంచులు సత్యనారాయణరెడ్డి, సతీశ్, నాయకులు, గుడ్ల శ్రీనివాస్, బైరి రాజవీరు. సంపత్, ఓదెలు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, గంగారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. -
కదలని క్యాథ్ల్యాబ్
గోదావరిఖని(రామగుండం): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ మేరకు మార్చి 10వ తేదీలోగా క్యాథ్ల్యాబ్ అందుబాటులోకి రావాలి. కానీ, ఇప్ప టివరకు గదులు మాత్రమే సిద్ధమయ్యాయి. అతిముఖ్యమైన వైద్య పరికరాలు రాలేదు. కాంట్రాక్టర్ విన్నపం మేరకు నెలపాటు సింగరేణి గడువు పొడిగించింది. ఈలెక్కన చూసినా ఈనెల 10వ తేదీ వరకు క్యాథ్లాబ్ సేవలు అందుబాటులోకి రావాలి. అయి నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం పురోగతిలో లేదు. అయితే 65 కి.మీ.. లేదంటే 250 కి.మీ.. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు చికిత్స కోసం సుమారు 65 కి.మీ. దూరంలోని కరీంనగర్ లేదా దాదాపు 250 కి.మీ. దూరంలోని హైదరాబాద్లోని ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సకాలంలో చేరితే ప్రాణాలు దక్కుతాయి. లేదంటే మార్గమధ్య ంలోనే తుదిశ్వాస విడిచిన సందర్భాలూ ఉన్నాయి. ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా.. గోల్డెన్ అవర్లో ప్రాణాలు కాపాడే లక్ష్యంతో గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో క్యాథ్ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం సింగరేణి రూ.13కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.7కోట్లతో క్యాత్ల్యాబ్ యంత్రం, మిగతా నిధులతో ఫర్నిచర్ కొనుగోలు, అదనపు గదులు నిర్మించాల్సి ఉంది. కార్పొరేట్ ఆస్పత్రులకు రూ.వేల కోట్లు.. కార్మికులు, ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యం అందేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రులకు సింగరేణి ఏటా రూ.వేల కోట్లు వెచ్చిస్తోంది. ఈ భారం తగ్గించడం, గోల్డెన్ అవర్లో ప్రాణాలు కాపాడడమే క్యాథ్ల్యాబ్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు రూ.26లక్షలతో బయోకెమిస్ట్రీ అనాలిసిస్, రూ.27లక్షలతో మైక్రో బయోలజీ యంత్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.2 కోట్లతో 50 పడకల మాతాశిశు సంక్షేమ భవనం నిర్మిస్తోంది. ఈసీజీ సేవలకే పరిమితం గుండెపోటుకు గురైన కార్మికులు, వారి కుటుంబసభ్యులను తొలుత సమీప డిస్పెన్సరీ తీసుకెళ్తున్నారు. తర్వాత ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. ఇక్కడ ఈసీజీ తదితర పరీక్షలు చేశాక కార్పొరేట్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఈప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం 3 గంటల సమయం పడుతోంది. ఈలోగా మరోసారి గుండెపోటు వస్తే ప్రాణాలు పోవడం తప్ప గత్యంతరం లేదు. గుండెపోటుకు గురైన గంటలోపే చికిత్స అందితే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీనికోసమే క్యాథ్ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ముందుకు సాగని పనులు నెల రోజులపాటు గడువు పొడిగించినా అందుబాటులోకి రావడం అనుమానమే.. కార్మికులకు తప్పని తిప్పలుగుండె సంబంధిత సమస్యలతో బాధపడే కార్మికులకు వైద్యసేవలు అందించేందుకు త్వరలోనే సింగరేణి ఆస్పత్రిలో క్యాథ్ల్యాబ్ ప్రారంభమవుతుంది. గుండెపోటు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. – రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండంమూడు నెలల్లో కార్డియాలజీ ఏర్పాటు చేస్తాం. పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గుండెపోటుకు గురైన కార్మికుడికి గంటలోగా చికిత్స అందిస్తాం. – అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కాసుల వర్షం
రామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో కాసుల వర్షం కురిసింది. కరీంనగర్, గంగాధర, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ రూరల్, భీమదేవరపల్లి, మల్యాల, కోరుట్ల, మంథని, సుల్తానాబాద్, హుస్నాబాద్, హుజూరాబాద్, రామగుండం, మెట్పల్లి, వేములవాడ, జగిత్యాలలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 82,249 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రూ.210.83 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. నెల రిజిస్ట్రేషన్లు ఆదాయం (రూ.కోట్లలో) ఏప్రిల్ 6,754 రూ.18.64 మే 8,108 20.17 జూన్ 7,446 19.10 జూలై 6,962 16.71 ఆగస్టు 6,546 16.92 సెప్టెంబర్ 6,756 17.20 అక్టోబర్ 6,210 15.15 నవంబర్ 6,625 17.56 డిసెంబర్ 6,524 18.06 జనవరి 6,238 15.77 ఫిబ్రవరి 6,652 17.95 మార్చి 7,428 17.60 -
పోటీపడాలి.. సీటు సాధించాలి
పెద్దపల్లి: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన బాలికలు వివిధ పోటీపరీక్షలు రాసేందుకు రాష్ట్రప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. కేజీబీవీల్లో అధిక సంఖ్యలో పేద విద్యార్థునులే విద్యాభ్యాసం చేస్తున్నారు. అర్హత, నైపుణ్యం ఉన్నా ప్రోత్సాహం లేక పోటీ పరీక్షలు రాయలేకపోతున్నారు. దీనిని గమనించి ప్రభుత్వం ఉన్నత విద్యలో కార్పొరేట్స్థాయిలో సీట్లు సాధించేలా తర్ఫీదు ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఉచితంగా నోట్బుక్కులు పంపిణీ చేస్తోంది. వైద్యం, ఇంజినీరింగ్పై ప్రత్యేక దృష్టి ఇంటర్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు నీట్, జేఈఈ, క్లాట్ వంటి రాష్ట్ర, జాతీయ పోటీపరీక్షల్లో ప్రతిభ చాటేందుకు నిపుణులతో శిక్షణ ఇప్పిస్తంది. వీరికోసం జూలపల్లిలో నీట్, రామగుండంలో జేఈఈ, సుల్తానాబాద్లో క్లాట్ కోచింగ్ ఇప్పిస్తోంది. ప్రతీ తరగతికి 40 మంది ఎంపిక ఎంపిక చేసిన కేజీబీవీల్లో ఆసక్తిగల విద్యార్థినులకు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ప్రతీ తరగతిలో 40 మందిని ఎంపికచేస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిన తర్ఫీదు ఇస్తారు. ఈ సందర్భంగా బాలికల అభివృద్ధి జిల్లా అధికారి కవిత మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్యలో మంచి కాలేజీల్లో సీట్లు సాధించడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రభుత్వం స్టడీ మెటీరియల్ అందిస్తోంని తెలిపారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా మాక్ టెస్టులు నిర్వహిస్తూ నైపుణ్యం పెంచుతామని వివరించారు. పోటీపరీక్షలకు శిక్షణ ఎంపిక చేసిన బాలికలకు తర్ఫీదు -
రైల్వే కార్మికుల నిరసన
రామగుండం: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ రామగుండంలో రైల్వే కాంట్రాక్టు కార్మికులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు భిక్షపతి మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్కోడ్లు అమలులోకి తీసుకు రావడం సరికాదన్నారు. వీటిని రద్దు చేయకేంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రైల్వే కాంట్రాక్ట్, క్యాజువల్ అండ్ ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ అనుబంధ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి బొంకూరి మహేశ్, కోశాధికారి తిరుపతి, సరళ, రాధ, ఈదునూరి బాబు, అవినాష్, శ్రీకాంత్, దేవేందర్, సుక్క కుమార్, బాలాజీ, సుమన్, అమృత, పద్మ, మహేశ్వరి తదితరులు ఉన్నారు. లేబర్ కోడ్లు ఎత్తివేయాలి పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు ఎత్తివేసే వరకు ఉద్యమం ఆగదని సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు ఎరవెల్లి ముత్యంరావు, కడారి సునీల్, బి.అశోక్ అన్నారు. లేబర్ కోడ్లను రద్దుచేయాలనే డిమాండ్తో తొలుత జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. లేబర్ కోడ్లు రద్దుచేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు బిక్షపతి, సీపెల్లి రవీందర్, జ్యోతి, తాండ్ర అంజయ్య, పూసల రమేశ్, పేర్క రాయమల్లు, మేకల సతీశ్, శివరామకృష్ణ, యాకుబ్, సాగర్, నరేశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ సాంస్కృతిక సేన కార్యవర్గం పెద్దపల్లి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడిగా పిట్ట రమేశ్, ప్రధాన కార్యదర్శిగా తూండ్ల రాజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేశ్, రాజయ్య మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు చక్రాల రఘు ఆదేశాల మేరకు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. గౌరవ అధ్యక్షుడిగా బుర్రగడ్డ రవి, ఉపాధ్యక్షుడిగా పోలివేణి శ్రీనివాస్, కోశాధికారిగా దాసరి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా పూసాల రమణాచారి, ముఖ్య సలహాదారుగా మంద భాస్కర్ యాదవ్, సహాయక కార్యదర్శి బియ్యన్న తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా కమేర పద్మ, ప్రధాన కార్యదర్శి కోండ్ర సునీత, కార్యవర్గ సభ్యులుగా కన్నూరి రాజయ్య, తాండ్ర మహేశ్, భర్ల తిరుపతిని ఎన్నుకున్నామని తెలిపారు. పెద్దపల్లి: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 20 గుంటల భూమిని మున్నూరుకాపు సంఘం భవనానికి కేటాయించాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, సింగిల్విండో మాజీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు కందుకూరి ముత్యాలు, ప్రధాన కార్యదర్శి అమిరిశెట్టి రాజలింగం, వార్డు కౌన్సిలర్ గాజుల రాజమల్లయ్య, కామ సంపత్ ఉన్నారు. -
రైల్వే టికెట్ బుకింగ్కు కొత్త నిబంధనలు
రామగుండం: భారతీయ రైల్వేలో టికెట్ బుకింగ్, రద్దు, రిఫండ్ తదితర సేవల్లో చేసిన మార్పులు ఈనెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. తద్వారా టికెట్ బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడం, ప్రయాణికులకు సరిపడా సీట్లు అందించడం సులభతరం కానున్నాయి. కొత్త నిబంధనలు ఇవీ.. ● రైలు బయలుదేరడానికి 8 గంటల్లోపు కన్ఫర్మ్ అయిన టికెట్లను రద్దు చేస్తే రిఫండ్ ఉండదు. రైలు బయలుదేరు సమయానికి 8–24 గంటల మధ్య రద్దు చేసుకుంటే 50 శాతం, 24–72 గంటలకు ముందు రద్దు చేసుకుంటే రద్దు చార్జి మినహా మొత్తం రిఫండ్ చేస్తారు. ● రైల్వే రిజర్వేషన్ చార్ట్ ప్రిపరేషన్ సమయాన్ని 4 గంటల నుంచి 9–18 గంటలకు పెంచారు. ఫలితంగా ప్రయాణానికి 18 గంటల ముందే రిజర్వేషన్ సీటింగ్ పొజిషన్ తెలుస్తుంది. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ప్రత్యామ్నాయం చూసుకునే వీలుంటుంది. ● బోర్డింగ్ స్టేషన్ మార్పు చేసుకునేందుకు రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు తాము ఎక్కబోయే రైల్వేస్టేషన్ను మార్పు చేసుకునే వీలు కల్పించారు. ఇది ప్రయాణికులకు ఎంతోసౌకర్యంగా ఉంటుంది. ఉదా: శబరిమలై యాత్రికులు ఢిల్లీ నుంచి త్రివేండ్రం రిజర్వేషన్ చేసుకుని బోర్డింగ్ రామగుండం నమోదు చేస్తారు. తద్వారా రైల్వేశాఖ ఢిల్లీ నుంచి రామగుండం వరకు మరో ప్రయాణికుడికి సీటు కన్ఫర్మ్ చేసుకోవడంతో రైల్వేశాఖకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ● గతంలో ప్రయాణికుడు తీసుకున్న బుకింగ్ కౌంటర్లోనే తమ టికెట్లను రద్దు చేసుకునే అవకాశం ఉండేది. నూతన విధానం ద్వారా ఏ రైల్వేస్టేషన్లోనైనా రద్దు అవకాశం ఉంటుంది. నిమిషం వ్యవధిలో బుకింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. అమలులోకి వచ్చిన రూల్స్ -
యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి
పెద్దపల్లిరూరల్: రానున్న మండల, జిల్లాపరిషత్ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరి అవినాష్ కోరారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల నరేశ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఈనెల 15న అసెంబ్లీ స్థాయి క్రికెట్ పోటీలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్నామని, క్రీడాకారులు పాల్గొనాలని ఆయన కోరారు. నాయకులు ప్రసాద్, రాజు, తిరుమలేశ్, అయుబ్, అభినయ్, మధుకర్, శ్రవణ్, రాజు, రాహుల్, అజయ్, దేవేందర్రెడ్డి, ఆరగొండ రాజ్కుమార్, రాకేశ్, గుర్రాల వాసు, స్వామి తదితరులు ఉన్నారు. ఆస్తిపన్నులో 5శాతం రాయితీ కోల్సిటీ: ముందస్తు ఆస్తిపన్ను చెల్లించే వారికోసం ప్రభుత్వం ఎర్లీబర్డ్ ఆఫర్ వర్తింపజేస్తోంది. 2026 –27 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన ఆస్తిపన్ను ఈనెల 30వ తేదీలోగా చెల్లించిన వారికి ఎర్లీబర్డ్ పథకం ద్వారా పన్ను మొత్తంలో 5 శాతం రాయితీ కల్పిస్తున్నామని బల్దియా కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. జ్యోతినగర్: హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి పావనం, జోగు కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ రామగుండం కృష్ణానగర్లోని మంథని మున్సిపాలిటీ కౌన్సిలర్ మాచిడి రాజుగౌడ్, ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత మాచిడి మహేందర్గౌడ్ జోగు సమర్పించి పూజలు చేశారు. మేరుగు యాదగిరిగౌడ్, బాలసాని స్వామి గౌడ్, శ్రీనివాస్గౌడ్, విజయ్కుమార్గౌడ్, అధిక సంఖ్యలో గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్రూరల్: మండలంలోని మంచిరామిలో సర్పంచ్ ఉప్పు లక్ష్మి ఆధ్వర్యంలో కోతుల బెడద నియంత్రణకు బుధవారం సిబ్బందితో కొండెంగ వేషధారణ వేయించి వినూత్న ప్రయోగం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ గత సంవత్సరం కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులు భయందోళనకు గురి కాగా సొంత ఖర్చులతో కోతులను పట్టించి అడవుల్లో వదిలివేసినట్లు తెలిపారు. మళ్లీ కోతుల బెడద ఎక్కువ కావడంతో కొండెంగ వేషధారణతో తరిమివేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్, పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. -
అయ్యప్ప ఆలయంలో పూజలు
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు గూడ రమేశ్శర్మ, సాయినాథ్ ఆధ్వర్యంలో పత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరి మహేందర్, మిట్టపల్లి మురళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, కందుకూరి ప్రకాశ్, ముస్త్యాల రవీందర్, వేగోళం అబ్బయ్య,రాజు, మాజీ సర్పంచ్ పద్మ, సాంబయ్య, తుమ్మ రాములు, మేరుగు వెంకటేశ్, వేగోళం శంకర్, అల్లంకి ఆనందం పాల్గొన్నారు. నీరుకుల్ల రోడ్డులో ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ను సన్మానించారు. -
ఏడో తేదీలోగా వేతనాలు
సైకిళ్లు పంపిణీ చేస్తున్న మంత్రి అడ్లూరి, కలెక్టర్ శ్రీహర్ష, విద్యార్థుల సమక్షంలో కేక్ కట్చేస్తూ..ధర్మారం: సంక్షేమ గురుకులాల అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉపాధ్యాయులు, నాన్టీచింగ్ స్టాఫ్కు ప్రతీనెల ఏడో తేదీలోగా వేతనాలు చెల్లించేలా చర్య లు తీసుకున్నట్లు మంత్రి లక్ష్మణ్కుమార్ చెప్పారు. స్థానిక గిరిజన మినీ గురుకుల విద్యాలయంలో బు ధవారం అదనపు గదుల నిర్మాణానికి కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్చేసి మిఠాయిలు పంచిపెట్టారు. రాష్ట్రంలోనే తొలిసారి విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. అనంతరం ప్రభుత్వ భూము లు పరిశీలించారు. కాంగ్రెస్ నాయకుడు జంగ మ హేందర్యాదవ్ మంత్రి చేతుల మీదుగా వి ద్యార్థులకు పుస్తకాలు, ఇతర వస్తువులు పంపి ణీ చేయించారు. మంత్రి మాట్లాడుతూ, వి ద్యార్థులకు వసతులు కల్పిస్తామన్నారు. ఐదో తరగతి నుంచి పదోతరగతి వరకు అప్గ్రేడ్ చేసేందుకు ప్రతిపాది స్తే ప్రభుత్వం నుంచి అనుమతులు జారీ చే స్తామని అభయం ఇ చ్చారు. వైఎస్సార్ హ యాంలో ఇంటర్మీడియ ట్ కళాశాల తీసుకొచ్చానని, ప్రస్తుత సీఎం రే వంత్రెడ్డి సహకారంతో ఐటీఐ మంజూరు చే యించానని గుర్తుచేశా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వి ద్యార్థుల కోసం ధర్మపు రికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ విద్యాలయానికి 35 ఎకరాలు కేటాయించామని, మూడేళ్లలో పూర్తిచేసి విద్యార్థులకు బోధన ప్రారంభిస్తామని చెప్పారు. గిరిజన విద్యా ర్థులకు నాణ్యమైన విద్య అందించడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఏప్రిల్, మేలో భవనాలకు అవసమైన మరమ్మతులు పూర్తిచేయిస్తామన్నారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, రెండేళ్లలోనే మినీ గురుకు లం రూపురేఖలు మారిపోయాయన్నారు. మంత్రి ఆదేశాల మేరకు డైనింగ్హాల్, డార్మెటరీలో పడకలు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. ఏఎంసీ చైర్మన్ రూప్లానాయక్, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సంగ రంజిత్, సర్పంచులు ఆవుల మల్లయ్య, వేల్పుల రేవతి –నాగరాజు, భూక్య సంగీత – ఆంజనేయులు, కూస శ్రీవాణి – తిరుపతి, కల్లెం గంగారెడ్డి, చేపూరి లచ్చయ్య, మ్యాడారం వీర్పాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహం, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అసోద అజయ్, మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు పాలకుర్తి రాజేశంగౌడ్, కాడే సూర్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ సిబ్బందికి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు ధర్మారం మినీ గురుకులాన్ని టెన్త్ వరకు అప్గ్రేడ్ చేస్తాం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
త్వరలో ప్రారంభిస్తాం
సింగరేణి కార్మిక కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం. ఇప్పటికే అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. గుండె సంబంధిత వ్యాధులకు వైద్యం, మోకాలిచిప్ప మార్పిడి ఆపరేషన్ కూడా చేయాలని నిర్ణయించాం. దశలవారీగా మిగతా ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తాం. గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో సాధ్యమైనంత త్వరగా క్యాథ్ల్యాబ్ ప్రారంభిస్తాం. ఇటీవల దీనిపై సమీక్షించాం. – కిరణ్రాజ్కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, సింగరేణి -
హైలెవల్ వంతెన పనుల్లో వేగం పెంచాలి
ఓదెల: ఓదెల మండలం రూపునారాయణ పేట – జమ్మికుంట మండలం విలాసాగర్ మధ్య మానేరుపై చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి ప నుల్లో వేగం పెంచాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. రూపునారాయణపేట మానేరుపై చేపట్టిన హైలెవల్వంతెన, డబుల్రోడ్డు నిర్మాణాన్ని బుధవారం పరిశీలించారు. వంతెన నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి రూ.80కో ట్లు మంజూరు చేశారన్నారు. బ్రిడ్జికి అనుబంధంగా చేపట్టిన పొత్కపల్లి శివారులోని సీసీరోడ్డు, పొత్కపల్లి – కాల్వశ్రీరాంపూర్ మధ్య రూ.27కోట్లతో చేపట్టిన డబుల్రోడ్డు పనులు ప రిశీలించారు. కాంగ్రెస్ నేత ప్రేంసాగర్రెడ్డి, స ర్పంచ్ బొంగోని రమాశ్రీనివాస్గౌడ్, మాజీ స ర్పంచ్ అంకం రమేశ్, మాజీ ఎంపీటీసీ నీర్ల శ్రీనివాస్, నాయకుడు కుమార్గౌడ్ ఉన్నారు. భక్తాంజనేయస్వామి ఆలయంలో పూజలు రూపునారాయణపేట భక్తాంజనేయస్వామి ఆల యంలో చండీయాగం, హోమం కార్యక్రమాల్లో ప్ర భుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారా వు – పావని దంపతులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు -
తక్కువ పీఎల్ఎఫ్ లోడ్తో విద్యుత్ ఉత్పత్తి
జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రెండు విద్యుత్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తగ్గించి విద్యుత్ తయారుచేయడం గమనార్హం. రామగుండం ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యం 2,600 మెగావాట్లు కాగా 13,757 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. మార్చిలో 1,242 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించి 64 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) నమోదు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 13,757 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని 60 శాతం పీఎల్ఎఫ్తో ఉత్పత్తి చేసింది. ఇక తెలంగాణ స్టేజ్–1లోని 1,600 మెగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులో 2025–26లో 10,786 మిలియన్ యూనిట్ల విద్యుత్ను 58 శాతం పీఎల్ఎఫ్, గత మార్చిలో 969 మిలియన్ యూనిట్ల విద్యుత్ను 62 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్తో సాధించింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి నేపథ్యంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించిన విషయం విదితమే. రామగుండం ప్రాజెక్టులో 13,757 మిలియన్ యూనిట్లు తెలంగాణ స్టేజ్–1 ప్రాజెక్టులో 10,786 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి -
నేటినుంచి రేషన్ బియ్యం పంపిణీ
పెద్దపల్లి: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆదేశాల మేరకు మూడు నెలల కోటా రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. రేషన్కార్డుదారులకు బుధవారం నుంచి బియ్యం పంపిణీ చేస్తామని డీఎస్వో శ్రీనాథ్ తెలిపారు. అయితే, మూడు నెలల కోటా కోసం ఒక్కో కార్డుదారు ఈపాస్ యంత్రంలో మూడుసార్లు వేలిముద్ర వేయాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. డీలర్ల వద్ద స్థలం కొరత ఇప్పటికే పలు రేషన్దుకాణాల్లో దొడ్డుబియ్యం మిగులు నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా వెనక్కి తీసుకెళ్లి గోదాముల్లో నిల్వచేయడం లేదు. దీంతో ప్రస్తుతం సరఫరా చేస్తున్న మూడు నెలల కోటా బియ్యం నిల్వచేసేందుకు తమ వద్ద స్థలం సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని డీలర్లు అంటున్నారు. దీంతో స్టాక్ను ఎప్పకప్పుడు లారీల ద్వారా చేర్చాలని కోరుతున్నారు. -
విజయ్కుమార్ సేవలు ప్రశంసనీయం
జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్ఆర్)బిజయ్కుమార్ సిగ్దర్ సేవలు ప్రశంసనీయమని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత అన్నారు. మంగళవారం పరిపాలనా భవనంలో జరిగిన ఎన్టీపీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉద్యోగ విరమ ణ పొందుతున్న ఏజీఎం బిజ్కుమార్ సిగ్దర్, రమణారెడ్డి, భీమ్రావు, రాజమహెందర్రెడ్డి, దామోదర్రావును సన్మానించారు. ఈడీ మాట్లాడుతూ, 2007 లో ఎన్టీపీసీలో ఉద్యోగంలో చేరిన సిగ్దర్ అంకితభావంతో పనిచేశారన్నారు. హెచ్ఆర్ పద్ధతులను బలోపేతం చేయడం, సానుకూల పని సంస్కృతిని పెంపొందించడం, బలమైన ఉద్యోగి సంబంధాలను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించారని స్పష్టం చేశారు. అనంతరం ఏజీఎం సిగ్దర్ను రామగుండం మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు శాలువాలతో సన్మానించారు. చెత్తవేస్తే మార్కెట్ నుంచి ఖాళీ చేయిస్తాం కోల్సిటీ: కాలువల్లో పళ్లు, కూరగాయలు, మాంసం వ్యర్థాలు, చెత్త పడవేస్తే రూ.500 జరిమానా విధించడంతోపాటు పునరవృతమైతే మార్కెట్ నుంచి ఖాళీ చేయిస్తామని మేయర్ మహంకాళి స్వామి వ్యాపారులను హెచ్చరించారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి జరిమానా విధిస్తామన్నారు. గోదావరిఖని శివాజీనగర్లోని మార్కెట్ వ్యాపారులతో మంగళవారం బల్దియా కార్యాలయంలో మేయర్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ, ప్రతీవ్యాపారి గురువారంలోగా రెండు బకెట్లు(పచ్చ, నీలిరంగు) సమకూర్చుకుని అందులోనే వ్యర్థాలు వేయాలన్నారు. మార్కెట్ అభివృద్ధి, పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. తడిచెత్తను రీసైక్లింగ్ చేసే బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. సుమారు రూ.3కోట్ల వ్యయంతో నిర్మించిన షెడ్ ఏప్రిల్ చివరివారం వరకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రోడ్లు, యూజీడీ, రైతులకు రెస్ట్ రూమ్స్, ఆర్వోప్లాంట్, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పిస్తామని వివరించారు. అద్దె బకాయిలు సక్రమంగా చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీ రామన్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ పాల్గొన్నారు. -
‘కను’సన్నల్లో పొలం!
ఒకవైపు ప్రకృతి వైపరీత్యం.. మరోవైపు పశువులు, పక్షులు.. ఇంకోవైపు వన్యప్రాణులు.. కోతుల దాడులు వెరసి ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్న రైతును నిండా ముంచుతున్నాయి. అనేక కష్టనష్టాలకు ఓర్చి పంటను కాపాడుకుంటే చివరివరకు చేతికొస్తుందో? లేదో? అనే బెంగ వెంటాడుతూనే ఉంటుంది. ఈక్రమంలోనే తన పొలాన్ని కాపాడుకునేందుకు ఓ రైతు విత్ సౌండ్ సోలార్ సీసీ కెమెరాను తన వరిపొలంలో ఏర్పాటు చేసుకున్నాడు. దాని పరిసరాల్లో మనుషులు, జంతువులు, వన్యప్రాణుల జాడ కనిపిస్తే చాలు హాఠాత్తుగా శబ్దం చేస్తోంది. రైతు మొబైల్కు ఫొటోలూ పంపిస్తోంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం అటవీ ప్రాంతంలోని పంట పొలాల్లో ఓ రైతు ఏర్పాటు చేసుకున్న సోలార్ పవర్తో కూడిన సీసీ కెమెరా ‘సాక్షి’కి కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ఆశలు గాలికి..
పెద్దపల్లిబుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267పెద్దపల్లిరూరల్/జూలపల్లి/ఎలిగేడు/ధర్మారం/పాలకుర్తి/ఓదెల/కాల్వశ్రీరాంపూర్: జిల్లాలో ని ఏడు మండలాల్లో మంగళవారం వేకువజామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో సుమారు 55 గ్రామాల్లో మొక్కజొన్న, వరితో కలిపి సాగుచేసిన రైతులు 1,757 మంది తీవ్రంగా నష్టపోయారు. సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటలో నేలవాలిన పంటలను ఇన్చార్జి డీఏవో కాంతారావు స్థానిక వ్యవసాయ అధికారులు, రైతులతో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించారు. భారీగాలులతో కూడిన వర్షం భారీ గాలులకు మామిడితోటల్లో కాయలు, చింతకాయలు రాలిపోయాయి. స్థానికులు ఉచితంగా తీసుకెళ్లేందుకు పోటీపడ్డట్టు సమాచారం. ధర్మారంలో 3.3 మి.మీ., అంతర్గాంలో 17.4 మి.మీ., రామగిరిలో 3.4 మి.మీ., జూలపల్లిలో 1.0 మి.మీ., ఓదెలలో 2.3 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు సీపీవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. పంట నష్టంపై ప్రాథమిక అంచనా.. ఈదురుగాలులతో కూడిన వర్షంతో పంటలకు జరిగిన నష్టంపై వ్యవసాయాధికారులు ప్రాథ మిక అంచనాకు వచ్చారు. జిల్లావ్యాప్తంగా వరి 410 ఎకరాలు, మొక్కజొన్న 1,821 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు ప్రాథథమిక అంచనాకు వచ్చారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలో వరి అత్యధికంగా 271 ఎకరాల్లో దెబ్తిన్నట్లు అధికారులు గుర్తించారు. కాల్వశ్రీరాంపూర్లో 443 ఎకరాల్లో మొక్కజొన్న కూడా దెబ్బతిన్నట్లు వివరించారు. వంగిన ఆలయ కమాన్ రామగుండం: స్థానిక శ్రీభక్తాంజనేయస్వామి ఆలయ కమాన్ ఈదురుగాలుల ధాటికి వంగిపోయింది. కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. సుమారు రెండు దశాబ్దాల క్రితం కమాన్ నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులు నేలవాలిన మొక్కజొన్న, వరి, మామిడి మొత్తం 2,231 ఎకరాల్లో పంటలకు నష్టం వ్యవసాయ శాఖ అంచనా -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
కరీంనగర్క్రైం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. న గరంలోని రాంనగర్లో నివాసముంటున్న ఇస్లావత్ కిషన్(55) మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం స్వగ్రామం సిద్దిపేట జి ల్లా కోహెడ మండలం జ్యోతిరాంనాయక్ తండాకు వెళ్లాడు. మంగళవారం సాయంత్రం కరీంనగర్కు వస్తుండగా, అల్గునూర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వెనకనుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అల్లుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. -
తెలంగాణ స్టేజ్–2కు అడుగులు
జ్యోతినగర్: తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్–2 నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈమేరకు ఎన్టీపీసీ నుంచి రూ.15,500 కోట్ల ఆర్డర్ను భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) దక్కించుకుంది. ఒక్కోటి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంగల మూడు యూనిట్లను ఈ ప్రాజెక్టు ద్వారా నిర్మించనున్నారు. పనులు ప్రారంభం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్–2 నిర్మాణం కోసం ఇప్పటికే స్థలం కేటాయించారు. పర్యావరణ అనుమతులు, కోల్లింకేజీ, బూడిద చెరువు నిర్మాణానికి భూసేకరణ తదితర పనులన్నీ సిద్ధం చేశారు. పీపీఏలోనే జాప్యం విద్యుత్ కొనుగోలు కోసం రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు ఒప్పందం చేసుకోలేదు. దీంతో కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇటీవల దీనిపై సీఎం రేవంత్రెడ్డి లేఖ కూడా రాశారు. తెలంగాణ ప్రభుత్వం పీపీఏ(పవర్ పర్చేజ్ అగ్రిమెంట్)చేసుకోకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాజెక్టు స్వరూపం ఇది.. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆవరణలోనే తెలంగాణ స్టేజ్–2 ప్రాజెక్టు నిర్మిస్తారు. ఇందులో ఒక్కోటి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంగల మూడు యూనిట్లు ఉంటాయి. మెయిన్ ప్లాంట్ ప్యాకేజీ పనుల్లో ప్రధానంగా బాయిలర్, టర్బైన్, జనరేటర్ ఉంటాయి. ప్రాజెక్టు డిజైన్, ఇంజినీరింగ్, తయారీ, సరఫరా, నిర్మాణం, ప్రారంభించడం, పరీక్షించడం తదితర అంశాలపై ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. అయితే, నోటిఫికేషన్ ఆఫ్ అవార్డ్(ఎన్వోఏ) తేదీ నుంచి 62 నెలలోగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. రూ.15,500 కోట్లకు బీహెచ్ఈఎల్ ఆర్డర్ 62 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు -
దళితుడిని చితకబాదిన ఎస్సై తీరుపై విచారణ
సైదాపూర్(హుస్నాబాద్): దళితుడిని చితకబాదిన ఎస్సై తీరుపై హుజూరాబాద్ ఏసీపీ మాధవి సోమవారం విచారణ చేపట్టారు. వివరాలు.. గతేడాది మే 8న సైదాపూర్– మొలంగూర్ రోడ్లోని సోమారం శివారులో కెనాల్ వద్ద అప్పటి ఎస్సై ఆగస్త్య భార్గవ్, సిబ్బంది డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తుండగా పోలీసులు ఆపారు. దీంతో పోలీసులు, మహేందర్ మధ్య గొడవ జరిగింది. పోలీసులు అకారణంగా నడిరోడ్పై చితకబాదారని, కులంపేరుతో దూషించారని, ఎస్సై భార్గవ్పై చర్యలు తీసుకోవాలని మహేందర్ జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు, మానవహక్కుల సంఘం, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. కోర్టును సైతం ఆశ్రయించాడు. ఈనేపథ్యంలో ఏసీపీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అప్పటి సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ఘటన జరిగి ఏడాది కావస్తున్నా ఉన్నతాధికారులు, కోర్టు, కమిషన్లకు చేసిన ఫిర్యాదులకు కదలిక వచ్చిందని, ఇప్పటికై నా పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితుడు కోరారు. -
చర్చనీయాంశమైన చైన్స్నాచింగ్
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్స్టేషన్ వెనకాల గల పాతబజార్లో సోమవారం రాత్రి జరిగిన చైన్స్నాచింగ్ ఘటన పాతబజార్తో పాటు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. పట్టణంలో ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. దీనిని సీరియస్గా పరిగణిస్తూ పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వాకింగ్ చేస్తుండగా.. స్వశక్తి సంఘాల ముఖ్య ప్రతినిధి కోల కుసుమకుమారి.. సోమవారం సాయంత్రం వేళ అల్పాహారం చేసింది. ఆ తర్వాత తన ఇంటి ఎదుట కాసేపు వాకింగ్ చేసింది. ఆ వీధిలోని పల్లెర్ల శ్రీనివాస్ ఇంటి ఎదుట పొరుగు మహిళలతో ముచ్చటిస్తోంది. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని యువకుడు అక్కా అని పిలుస్తూ కుసుమ వద్దకు వస్తూనే మెడలోని నాలుగున్నర తులాల పుస్తెలతాడును కట్టర్తోకట్ చేసి పట్టుకొని పరుగులుపెట్టాడు. అప్పటికే ప్రధాన రోడ్డుపై పల్సర్ బైక్తో సిద్ధంగా ఉన్న మరోవ్యక్తితో కలిసి క్షణాల్లో మాయమయ్యాడు. సినీఫక్కీగా జరిగిన ఘటనతో అర్ధగంట వరకు బాధితురాలు తేరుకోలేకపోయింది. గ్రూపు లీడర్ కావడంతో అక్కా అని పిలుస్తూ వచ్చిన వ్యక్తిని గుర్తించలేకపోయామని స్థానికులు తెలిపారు. కాలనీలో అంధకారం కాలనీలో వీధిదీపాలు వెలుగడంలేదు. చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. సీసీ కెమెరాలు లేవు. దీంతోనే నిందితుడు చాకచాక్యంగా తనపని ముగించుకొని వెళ్లిపోయాడు. ఘటనకు ముందు సదరు వ్యక్తి ఒకసారి పాతబజార్కాలనీ చివరి వరకు రెక్కీచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. చైన్స్నాచింగ్పై డీసీపీ విచారణ స్థానిక పాతబజార్లో సోమవారం రాత్రి జరిగిన చైన్స్నాచింగ్పై పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. బాధితురాలు కోల కుసుమకుమారితో మాట్లాడి వివరాలు సేకరించారు. విచారణలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం ఎస్సై సంధ్యారాణి తదితరులు ఉన్నారు. కాగా, పోలీస్స్టేషన్ వెనకాలే చైన్స్నాచింగ్ ఘటన జరగడాన్ని పోలీసు యంత్రాంగం సీరియస్గా పరిగణిస్తోంది. విచారణ చేపట్టాం పాతబజార్కాలనీలో ఇప్పటివరకు చైన్స్నాచింగ్లు చోటుచేసుకోలేదు. ఈ ఘటనపై విచారణ చేపట్టాం. పలుప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. ఆరుబయటకు వెళ్లే మహిళలు చాలాజాగ్రత్తలు పాటించాలి. – రమేశ్, ఏసీపీ, గోదావరిఖని పాతబజార్కాలనీలో కలకలం నిందితుల వేటలో పోలీస్యంత్రాంగం -
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
● రోడ్డుపక్కకు దూసుకెళ్లి ఆగిన వైనం జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఒకటో డివిజన్ న్యూపీకే రామయ్య కాలనీ సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఉదయం గోదావరిఖని నుంచి లింగాపూర్ మోడల్ స్కూల్కు విద్యార్థులను తీసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. అక్కడ విద్యార్థులను దించి గోదావరిఖని వైపు వస్తోంది. ఈక్రమంలో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకు వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఉరేసుకొని వివాహిత ఆత్మహత్యచిగురుమామిడి(హుస్నాబాద్): చిన్నముల్కనూర్ గ్రామానికి చెందిన మెడవేని రాధిక (25) ఉరేసుకు ని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై పృథ్వీధర్గౌడ్ తెలి పిన వివరాలు.. సుందరగిరి గ్రామానికి చెందిన రా ధికను 2021లో చిన్నముల్కనూర్కు చెందిన రమేశ్కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి మూడేళ్ల కూతు రు మనస్విని ఉంది. అదనపు కట్నం తేవాలంటూ రాధికను తరుచూ భర్త రమేశ్, అత్త కమలవ్వ వేధింపులకు గురిచేసేవారు. వేధింపులు తట్టుకోలేక సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా చుట్టుపక్కల వారు గమనించి 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సమన్వయంతో పనులు
పెద్దపల్లి: బీఎస్ఎన్ఎల్ చేపట్టే భూగర్భ కే బుల్ పనులను సమన్వయంతో పూర్తిచేయా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అండర్గ్రౌండ్ కేబుల్ నిర్మాణంపై సంబంధిత అధికారులు, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో క లిసి కలెక్టరేట్లో మంగళవారం సమీక్షించా రు. రామగుండంలో ధ్వంసమైన చోట్ల మ రోసారి అండర్గ్రౌండ్ కేబుల్ వేస్తామన్నారు. విద్యుత్ స్తంభాలు, తాగునీటి పైప్లైన్లు, రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో అండర్గ్రౌండ్ ధ్వంసం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఆర్డీవో కాళిందిని, ఆర్అండ్బీ ఈఈ భావ్సింగ్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ కుమారస్వామి పాల్గొన్నారు. కేజీబీవీల్లో బాలికలకు శిక్షణ పెద్దపల్లి: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లోని విద్యార్థినులను జాతీయస్థాయి పో టీపరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని జిల్లా బాలికల అభివృద్ధి అధికా రి కవిత తెలిపారు. జూలపల్లిలో నీట్, రామగుండంలో జేఈఈ, సుల్తానాబాద్లో క్లాట్లో నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా అందిస్తామన్నా రు. పట్టణ విద్యార్థులతో సమానంగా గ్రామీ ణ బాలికలకు అన్నిరంగాల్లో అవకాశాలు క ల్పించాలనేది దీని లక్ష్యమని వివరించారు. స్వల్పంగా పెరిగిన పత్తి ధర పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమ వారం క్వింటాల్కు రూ.7,455 ధర పలుకగా.. మంగళవారం గరిష్టంగా రూ.7,611 పలి కిందని మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి అన్నారు. కనిష్టంగా 5,544గా, సగటు రూ.7,272గా ధర ఉందని వివరించారు. 300 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగినట్టు వారు పేర్కొన్నారు. మహనీయుల జయంతికి అధిక ప్రాధాన్యం పెద్దపల్లి: మహనీయుల జయంతి నిర్వహణ కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్ వేణు సూచించారు. జయంతి నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవా రం తన కార్యాలయంలో సమీక్షించారు. ఈ నెల 5న బాబూ జగ్జీవన్రామ్, 14న అంబేడ్కర్ జయంతి ఉంటాయని, వీటిని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వీరి జీవిత చరిత్ర తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. నేడు బ్లాక్డే పాటించాలిపెద్దపల్లి: కేంద్రప్రభుత్వం అమలు చేసే నాలుగు లేబర్ కోడ్ల రద్దును డిమాండ్ చేస్తూ బుధవారం బ్లాక్డే నిర్వహిస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ డిమాండ్ తెలిపారు. ఉద్యోగులు, కార్మికులు జిల్లావ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపాలని ఆయన కోరారు. -
డీపీవో ఉద్యోగ విరమణ
పెద్దపల్లిరూరల్: జిల్లా పంచాయతీ అధికారి వీరబు చ్చయ్య మంగళవారం ఉద్యో గ విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి కలెక్టర్ శ్రీహర్ష హాజరయ్యారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తప్పనిసరన్నారు. టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, అధికారులు పాల్గొన్నారు. ఉత్సాహంగా వాలీబాల్ పోటీలు జ్యోతినగర్: ఎన్టీపీసీ సదరన్ రీజియన్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ మహాత్మా గాంధీ క్రీడామైదానంలో మంగళవారం రాత్రి పోటీలు జరిగాయి. రామగుండం, సింహాద్రి జట్లు పోటీపడ్డాయి. రామగుండం జట్టు 16 పాయింట్లు పొంది విజయం సాధించింది. పోటీల్లో సదరన్ రీజియన్లోని సింహాద్రి, కుడ్గి, వల్లూరు, రామగుండం, కాయంకుళం జట్లు హాజరయ్యాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో చోటుమంథని: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మంథనికి చెందిన చంధ్రుపట్ల సునీల్రెడ్డిని నియమించారు. తనపై నమ్మకంతో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన బాధ్యతకు అన్నివిధాలుగా కట్టుబడి ఉంటానని సునీల్రెడ్డి పేర్కొన్నారు. తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మదర్ థెరిసాలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్ పెద్దపల్లిరూరల్: మదర్ థెరి సా ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం ఐసీఈఎండీటీ – 2కే26 పేరిట అంతర్జాతీ య టెక్నికల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేఎన్టీయూ హెచ్వోడీ సతీశ్కుమార్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ సంబిసన్తో కలిసి ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏవో పవన్కుమార్ రెండురోజుల కాన్పరెన్స్లో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు వివిధఅంశాలపై ఇచ్చిన ప్రదర్శనలను తిలకించారు. నవసమాజ నిర్మాణంలో ఉత్తమ ఇంజినీర్ల పాత్ర కీలకమన్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలిస్తూ ఆలోచనాశక్తి పెంపొందించుకునేందుకు అంతర్జాతీయ స్థా యి కాన్ఫరెన్సు ఉపకరిస్తుందని అన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ గాజుల కిశోర్కుమార్, హెచ్వోడీ కొంతం శ్రీధర్, రమేశ్, వంశీరాజ్, రవి, సవిత, సదానందం, సంతోష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, జయంత్రెడ్డి ఉన్నారు. స్పోర్ట్స్ స్కూల్కు ఎంపిక పోటీలు పెద్దపల్లి: స్థానిక ఐటీఐ మైదానంలో మంగళవారం స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాధికారి శారద పోటీలు ప్రారంభించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలని డీఈవో కోరారు. జిల్లా యువజన క్రీడా అధికారి సురేశ్ మాట్లాడుతూ, జిల్లాస్థాయిలో 28 మంది బాలబాలికలు మాజరయ్యారని, ఎంపికై న వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వేల్పుల సురేందర్, దాసరి రమేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తుల శోభా రాణి, కొమురోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జేఎన్టీయూ విద్యార్థులకు రోస్ స్కాలర్షిప్ రామగిరి: మంథని జేఎన్టీయూలోని ముగ్గురు విద్యార్థులు రోస్(రాయల్ ఆర్గనైజేషన్ ఫర్ సర్వీస్ అండ్ ఎడ్యుకేషన్) స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. హైదరాబాద్కు చెందిన ఈ సామాజిక సేవా సంస్థ విద్యారంగంలో ప్రతిభ కనబరుస్తున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఏటా స్కాలర్షిప్లు అందజేస్తోంది. ఈవిద్యా సంవత్సరానికి మంథని జేఎన్టీయూలో మైనింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఇమ్ముడి శరత్కుమార్, ద్వితీయ సంవత్సరం చదువుతున్న సీఎన్ఎన్ విభాగానికి చెందిన బత్తుల శ్రావణి, తాటిసాయి శరణ్యను స్కాలర్షిప్కు ఎంపిక చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్కాలర్షిప్ ద్వారా ఒక్కో విద్యార్థికి ఏటా రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఎంపిక పత్రాలను ప్రిన్సిపాల్ బులుసు విష్ణువర్ధన్ మంగళవారం విద్యార్థులకు అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్, పరిపాలనాదికారి సుమన్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ పింగిలి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యుద్ధోన్మాదాన్ని ఖండించండి పెద్దపల్లి: అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని ఖండించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యద ర్శి కుమారస్వామి కోరారు. విరసం జిల్లా కన్వీనర్ బాల సాని రాజయ్య అధ్యక్షతన ఇ రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి నిరసనగా స్థానిక బస్టాండ్ వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ప్ర జలపై చేస్తున్న దాడులు మానవత్వానికి విఘాతంగా మారుతున్నాయన్నా రు. సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే యుద్ధం చేస్తున్నారని ధ్వజమె త్తారు. యుద్ధం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధ రలు రవాణా ఖర్చులు పెరిగి ఆహార పదార్థాల ధరలపై తీవ్రప్రభావం చూపుతాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవిచవరకు సాధారణ ప్రజలకు గుదిబండగా మరుతుందని అన్నారు. ఇప్పటికై నా యుద్ధం ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు వెల్తురు సదానందం, రత్నకుమార్, తాంద్ర సదానందం, మార్వడి సుదర్శన్, కోరేఫు మల్లేశ్, రమేశ్, అరికిళ్ల లలితక్క, పెర్కా సతీశ్, బాలసాని లెనిన్, తిప్పరపు సురేశ్, పులిపాక రవీందర్, గోపాల్ యాదవ్, బొంకురి లక్ష్మణ్,రాజు, రాజగోపాల్, తాళ్లపెల్లి మల్లయ్య, తిర్రి బాలకృష్ణ, శ్రావ్య, స్మయిలి, శ్వేతా తదితరులు పాల్గొన్నారు.


