జ్వరం.. ఒళ్లు నొప్పులు
‘జాతర వోయచ్చినం బిడ్డా.. లచ్చలమంది జనం.. నీళ్లు మారినయ్.. బాగ దూరం నడ్సినం.. దుమ్ము, ధూళి.. ఏమైందో గనీ.. ఒకటే దగ్గు, తుమ్ములు.. పెయ్యినొప్పులు.. జెరం.. వాంతులు, విరేచనాలు.. తగ్గుతనే లెవ్వు.. గందుకే గీ దవాఖానాకు అచ్చినం బిడ్డా’ అని సమాధానం ఇచ్చారు పలువురు పేషెంట్లు. మొన్నటి జాతరలకు వెళ్లినవారిలో కొందరు తీవ్రఅస్వస్థతకు గురై పీఎంపీలు, ఆర్ఎంపీల వద్ద చికిత్స తీసుకుంటున్నారు. చాలామంది సోమవారం పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రి కి తరలివచ్చారు. వారిరాకతో సర్కారు ఆస్పత్రి రద్దీగా మారింది. అవే ఈ దృశ్యాలు..
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
జ్వరం.. ఒళ్లు నొప్పులు
జ్వరం.. ఒళ్లు నొప్పులు


