breaking news
Peddapalli District Latest News
-
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
గోదావరిఖని: చివరిదశ పంచాయతీ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేందుకు పోలీసుశాఖ డేగకన్ను వేసింది. రామగుండం పోలీసు కమిషనరేట్ లోని అన్నిపోలింగ్ కేంద్రాల వద్ద బలగాలను మోహరించింది. పెద్దపల్లి జోన్లోని చివరి విడతలో సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మంచిర్యాల జోన్ పరిధిలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తంగా కమిషనరేట్లోని 1,720 పోలింగ్ కేంద్రాల్లో 563 సమస్యాత్మకమైనవిగా గుర్తించి పోలీస్ బందోబస్తు పటిష్టం చేశారు. భారీ పోలీసు బందోబస్తు చివరివిడత పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు డీసీపీలు, ఏడుగురు ఏసీపీలు, 32 మంది సీఐలు, 97 మంది ఎస్సైలు, 270 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, 520 మంది కానిస్టేబుళ్లు, 240 మంది హోంగార్డులు, 190 మంది ఆర్ముడ్ సిబ్బంది, 54క్యూఆర్టీ టీంలు, 57 రూట్మోబైల్ పార్టీలను ఎన్నికల విధుల్లో నియమించారు. సుమారు 1,700మందితో బందోబస్తు చేపట్టారు. 1,700 మంది పోలీస్ బలగాలతో పహారా ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక నిఘా సమస్యాత్మక ప్రాంతాలపై డేగకన్ను -
పోలీసుల డేగకన్ను
సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలపై డేగకన్ను వేశాం. అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాం. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచాం. ఓటింగ్, కౌంటింగ్ సమయంలో పరిస్థితులను నిరంతరం గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచుతాం. నియమావళి ఉల్లంఘనలు, బెదిరింపులు, గొడవలు, అక్రమ మద్యం, డబ్బు పంపిణీ వంటి వాటిపై కఠిన చర్యలుంటాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలుంటాయి. ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి. – అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండం -
పులి ఎక్కడుంది?
రామగుండం: మూతపడిన సింగరేణి మేడిపల్లి ఓపెన్కాస్టు ప్రాజెక్టు పరిసరాలు, గోదావరి నదీతీరంలో రెండురోజుల పాటు సంచరించిన పులి ఆనవాళ్లు గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు మూడో రోజు మంగళవారం కూడా అన్వేషణ కొనసాగించా రు. అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీప గోదావరి నది, రామునిగుండాల శివారు, పాములపేట, ఆబాది రామగుండం, లింగాపూర్ సమీప సింగరేణి ఓబీ కుప్పలు తదితర వన్యప్రాణులు సంచరించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో గాలింపు చర్య లు చేపట్టారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తిరుమల సతీశ్కుమార్ నేతృత్వంలో అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశా రు. ఆయా ప్రాంతాల్లో పులి సంచరించినట్లు ఆనవాళ్లు ఏమీ లభించలేదని వారు తెలిపారు. అయి నా.. పులి సంచరిస్తున్నట్లుగానే భావిస్తూ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అటవీశాఖ అధికారులు కోరారు. పులిని బందించే వరకు వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఫారెస్టు ఉన్నతాధికారులు జి.కొమురయ్య, పి.దేవదాస్, సయ్యద్ రహ్మతుల్లాతోపాటు యానిమల్ ట్రాకర్స్ సెర్చ్ బృందాలు అన్వేషణలో పాలుపంచుకుంటున్నారు. ఈ జాగ్రత్తలు పాటించాలి.. గాలిస్తున్న అటవీఅధికారులు మూడు బృందాలుగా అన్వేషణ మూడోరోజు కనిపించని ఆనవాళ్లు -
కాంగ్రెస్ పాలనలో విధ్వంసం
గోదావరిఖని: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసమే కొనసాగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పాలన సాగిందన్నారు. రెండేళ్ల ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ పాలనపై చార్జీషీట్ విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. కూల్చివేతల తో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని, వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్లో తవ్వకాలతో వ్యాపారం కుంటుపడిందన్నారు. ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం చేపట్టిన పనులను పూర్తిచేసే బాధ్యత తీసుకుంటుందని, కానీ రామగుండంలో తన హయాంలో చేప ట్టిన ఒక్కపని కూడా ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పూర్తిచేయలేదని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.వందల కోట్లను ఈ ప్రభుత్వం విడుదల చేసిందని, ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో కూడా తెలియని పరిస్థితి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఉన్న డ్రైనేజీలనే తవ్వడం, సెంటర్ లైట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించడం, కొత్త పోల్స్ వేయడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన విధ్వంసం, కూల్చివేతలు, ప్రశ్నించే గొంతులను అణిచివేయడం, కక్షసాధింపులు, కేసులు బనాయించడం తప్ప ఏమీ సాధించలేదన్నారు. అర్ధరాత్రి గుడులు కూల్చిన వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆయన గుర్తుచేశారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, ఈపాలనకు చరమగీతం పాడాలని చూస్తున్నారని అన్నారు. సమావేశంలో నాయకులు మూల విజయారెడ్డి, జనగామ కవితసరోజిని, నూతి తిరుపతి, బుర్రి వెంకటేశ్, కిరణ్జీ, సట్టు శ్రీనివాస్, గుర్రం పద్మ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ -
పకడ్బందీ ఏర్పాట్లు చేశాం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్/ఎలిగేడు/ఓదెల/సుల్తానాబాద్రూరల్: జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల మండలాల్లో బుధవారం జరిగే మూడోవిడత పంచాయతీ ఎన్నికలకు అన్నిఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి, సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఓదెల మోడల్ స్కూల్, ఎలిగేడు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. చివరి విడతలో 91 పంచాయతీలు, 852 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేశామని, ఇందులో 6 సర్పంచ్, 215 వార్డులు ఏకగ్రీవమయ్యాయని అన్నారు. మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహిస్తామని, ఈమేరకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఆయన చెప్పారు. ఎన్నికల అధికారులు విధులను పకడ్బందీగా నిర్వర్తించాలని సూచించారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, తహసీల్దార్లు రాజయ్య, యాకన్న, బషీరొద్దీన్, ధీరజ్ తదితరులు ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డీసీపీ రాంరెడ్డి హెచ్చరించారు. పోలీసు సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. సుల్తానాబాద్, ఓదెల తదితర మండలాల్లో పర్యటించారు. ఎన్నికల బందోబస్తుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. అనంతరం ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఐ సుబ్బారెడ్డి, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన -
తుది సంగ్రామం
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పార్లమెంట్లో నిరసన గోదావరిఖని: ఉపాధిహామీ పథకం పేరు మా ర్పును వ్యతిరేకిస్త్తూ పార్లమెంట్లోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. పథకంలోని మహాత్మాగాంధీ పేరు తొలగించాలనే ప్రయత్నం రాజ్యాంగంపై చేసిన దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధిహామీ కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదని, ఇది పేదలకు పని, గౌరవం, జీవన భద్రతకు హామీ ఇచ్చిన రాజ్యాంగపరమైన హక్కు అని ఆయన అన్నారు. ప్రణాళిక ప్రకారం అభివృద్ధి గోదావరిఖని: ప్రణాళిక ప్రకారం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఆయన స్కూటీపై పర్యటించారు. స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సహకారంతో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలకు అనుగుణంగా నాణ్యమైన పనులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. వైకుంఠ ధామాన్ని సందర్శించి సౌకర్యాలు, నిర్వహణపై ఆరా తీశారు. నాయకులు మహంకాళి స్వామి, సింగరేణి శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాశ్, సమ్మక్క ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.బాలికలకు టీకా వేస్తాం పెద్దపల్లి: గర్భాశయ క్యాన్సర్ నియంత్రణ కోసం 14ఏళ్ల వయసు గల బాలికలకు టీకా వే స్తామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వా ణిశ్రీ తెలిపారు. తన కార్యాలయలో వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలు, సూపర్వైజర్లకు టీ కాపై మంగళవారం శిక్షణ ఇచ్చారు. జిల్లా వై ద్యాధికారి మాట్లాడుతూ, బాలికలు ముందస్తుగా టీకా తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్ దరి చేరదని, ఈ విషయంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు కిరణ్కుమార్, సుధాకర్రెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప లు ఆస్పత్రులు తనిఖీచేశారు. ప్రైవేట్ ఆస్పత్రు లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆమెవెంట డాక్టర్లక్ష్మీభవాని, డిప్యూటీ మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రోడ్డు పనుల పరిశీలన పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో చేపట్టిన బీటీ రోడ్డు పనులను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ మంగళవారం పరిశీలించారు. సుమారు రూ.70 లక్షల అంచనా వ్యయంతో కొనసాగుతున్న పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రైనేజీ నిర్మాణం, కొత్త విద్యుత్ స్తంభా ల బిగింపు తదితర పనులు పూర్తిచేశామని తెలిపారు. బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయితే జెండా చౌరస్తా వరకు బైపాస్ అందుబాటులో వస్తుందని ఆయన చెప్పారు. అసిస్టెంట్ ఇంజినీర్ సతీశ్, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేశ్, వినయ్, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,383 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7383 ధర పలికింది. కనిష్టంగా రూ.6,073గా నమోదైంది. సగటు రూ. 7,171గా ఉందని మార్కెట్ ఇన్చారి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. మంగళవారం 975 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. సాక్షి పెద్దపల్లి: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనున్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. లెక్కింపు పూర్తికాగానే ఉపసర్పంచ్ను ఎన్నుకుంటారు. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. పెద్దపల్లి, ఓదెల, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లోని పంచాయతీలకు బ్యాలెట్ బాక్స్తోపాటు సరిపడా బ్యాలెట్ పేపర్లను తీసుకుని ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు మంగళవారం సాయంత్రమే తరలివెళ్లారు. ఆరు సర్పంచ్లు ఏకగ్రీవం.. మూడోవిడతలో 91 సర్పంచ్ స్థానాలకు 6 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 85 స్థానాలకు 300 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 852 వార్డులకు 215 ఏకగ్రీవంకావడంతో మిగిలిన 636 వార్డులకు 1,797మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి మండలం రాంపల్లి, సుల్తానాబాద్లో నారాయణరావుపల్లి, గొల్లపల్లి, రామునిపల్లి, ఓదెల మండలంలో పిట్టలఎల్లయ్యపల్లి, ఎలిగేడులో ర్యాల్దేవ్పల్లి గ్రామాలు ఏకగ్రీవం అయినవాటిలో ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది.. ఎన్నికల అధికారులు ఆయా మండల కేంద్రాల్లో సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేశారు. అక్కడి నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు మంగ ళవారం రాత్రికే సిబ్బంది చేరుకున్నారు. రూట్మ్యా ప్ ప్రకారం బూత్ల గదులను ఏర్పాటు చేసుకు న్నారు. పంచాయతీ కార్యదర్శులు వారికి కావా ల్సిన వసతులను కల్పించారు. అసిస్టెంట్ ఎన్నికల అధికారులు పోలింగ్ సిబ్బందిని తరలించడానికి బస్సులను ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నికల అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా చేరుకున్నారు. మద్యం, మాంసం పంపిణీ పోలింగ్కు ముందు ఓటర్లకు అభ్యర్థులు తాయిలాలను పంచిపెట్టారు. చివరి రెండురోజులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పోటాపోటీగా మద్యం, చికెన్, మటన్ పంపిణీ చేశారు. ఈ రెండు రోజుల్లోనే రాత్రివేళల్లో విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేశారు. ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా అభ్యర్థుల స్థాయిని బట్టి ప్రలోభాల పంపిణీ జరిగింది. ఒక అభ్యర్థి ఓటుకు రూ.500 ఇస్తే, మరొకరు రూ.1,000 చొప్పున పంపిణీ చేశారు. ఒక్కొక్క ఓటుకు క్వార్టర్ మద్యం పంచితే, మరొకరు హాఫ్ బాటిల్ మద్యం అందించినట్లు తెలిసింది. సర్పంచ్, వార్డుల అభ్యర్థులు కొన్నిచోట్ల ఉమ్మడిగా, మరికొ న్నిచోట్ల వేర్వేరుగా పంచిపెట్టారు. ఇంకొందరు నేరుగా ఓటర్ల ఫోన్నంబర్లు తీసుకొని రూ.500, రూ.1,000 చొప్పున ఫోన్పే, గూగుల్ పే చేస్తున్నా రు. కొన్నిచోట్ల ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3వేల చొప్పున గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేశారు. సిబ్బందికి సూచనలు సుల్తానాబాద్రూరల్: మూడోవిడత పంచాయతీ ఎన్నికలకు అన్నిఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ వేణు తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశా లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మంగళవారం ఆయ న తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ పూర్తికాగానే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామని ఎంపీడీవో దివ్యదర్శన్రావు తెలిపారు. అప్రమత్తంగా ఉన్నాం ఓదెల(పెద్దపల్లి): స్థానిక ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ సూచించారు. స్థానిక పోలీసులతో మంగళవారం వారు సమావేశమై పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తొలి, మలివిడతల మాదిరిగా చివరిదశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐలు సుబ్బారెడ్డి, ప్రసాదరావు, ఎస్సైలు రమేశ్, వెంకటేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమం పెద్దపల్లి: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఉ ద్యమం చేస్తామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జోన్ ఎన్నికల పరిశీలకుడు వీరమ ల్ల వెంకటరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలో సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో మంగళవారం స మావేశం నిర్వహించారు. ఆయన మాట్లాతూ, ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించాలన్నారు. 2010 కన్నా ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని కోరారు. అనంతరం తపస్ జిల్లా అధ్యక్షుడిగా ముస్కుల సునీల్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గుండవేని జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జోన్ ఎన్నికల పరిశీలకుడు వెంకటేశ్ పాల్గొన్నారు.మూడోవిడత సమాచారం పంచాయతీలు 85 సర్పంచ్ అభ్యర్థులు 300 వార్డులు 636 అభ్యర్థులు 1797 పోలింగ్ కేంద్రాలు 91 ఓటర్లు 1,44,563 పీవోలు 128 ఏపీవోలు 166 జోన్లు 16 రూట్లు 35 వెబ్కాస్టింగ్ కేంద్రాలు 67 జిల్లాలో నేడు చివరిదశ పోలింగ్ సర్వం సిద్ధం చేసిన అధికారులు గ్రామాలకు తరలిన పోలింగ్ సిబ్బంది గెలుపు కోసం అభ్యర్థుల భారీ ఖర్చు పటిష్ట బందోబస్తు చేపట్టిన పోలీస్లు ఉదయం 7గంటల నుంచే.. పెద్దపల్లిరూరల్: జిల్లాలోని నాలుగు మండ లాల్లో బుధవారం ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. వార్డుకో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అందులో 67 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించి, అక్కడ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసింది. హోరాహోరీగా పోరు.. పంచాయతీ స్థానాలకు హోరాహోరీగా పోరు జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ప్రచార రథాలతో చిన్నపల్లెల్లోనూ ఈసారి ఎన్నికల ప్రచారం నిర్వహించడం గమనార్హం. కొన్ని పంచాయతీల్లో ముఖాముఖి పోటీ జరుగుతుండగా, మరికొన్నిచోట్ల బహుముఖ పోటీ సాగుతోంది. 2,500 మంది ఓటర్లు మొదలు.. దాదాపు 4వేల మంది ఓటర్లుగల పంచాయతీల్లో పోరు రసవత్తరంగా సాగుతోంది. పెద్దపల్లి మండలంలోని రంగాపూర్, రాఘవాపూర్, పెద్దకల్వల, తుర్కలమద్దికుంటతోపాటు మిగతా మండలాల్లోని ఒకట్రెండు పంచాయతీల్లో పోటీ ఉత్కంఠ భరితంగా మారింది. ఉపసర్పంచ్ గిరీపై కన్ను.. పంచాయతీల్లో వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారిలో.. ఎలాగైనా ఉపసర్పంచ్ గిరీ దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్నవారే అధికమంది ఉన్నారు. అందుకే వార్డు సభ్యుడిగా ఎలాగైనా ఎన్నిక కావాలనే ఆశతో ఓటర్లకు ఎన్నడూ లేనివిధంగా ఒక్కో ఓటుకు రూ.400 మొదలు రూ.వెయ్యి దాకా నజరానా అందిస్తున్నట్లు సమాచారం. ఉపసర్పంచ్కు సర్పంచ్తోపాటు చెక్పవర్ ఉండడంతోనే ఆ పదవికి అంతటి ప్రాధాన్యం పెంచిందని రాజకీయ విశ్లేషకులు పలువురు భావిస్తున్నారు. పాపా.. ఇదేమిటి? పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: ‘పాపా.. ఇదేమిటి చెప్పు.. ఇందులోని అక్షరాలు ఏమిటో చదువు’ అని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఓ చిన్నారిని ఆప్యాయంగా పలకరించడం అక్కడున్నవారిలో ఉత్సాహం నింపింది. పెద్దపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్రీప్రైమరీ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్, లర్నింగ్ మెటీరియల్, ఆటవస్తులను కలెక్టర్ అందజేశారు. ఈసందర్భంగా చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. భావిభారత పౌరులను క్రమశిక్షణతో తీర్చిదిద్దేలా బలమైన పునాది వేసేందుకు ప్రీప్రైమరీస్కూళ్లు దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 58 ప్రీప్రైమరీ స్కూళ్లు ఉన్నాయని, వీటికి అదనంగా మరో 5 పీఎంశ్రీ పాఠశాలలు పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. -
రండి.. ఓటేయండి
పెద్దపల్లిరూరల్: ఓటుహక్కు కలిగిఉన్న పల్లెవాసులు అందరూ ఓట్లు వేసేలా అధికారయంత్రాంగం చర్యలు చేపట్టింది. వివిధ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది మంగళవారం ఎన్నికల సామగ్రితో బయలు దేరి సాయంత్రం వరకు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంది. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో ఎన్నికల అధికారులు, సిబ్బంది చేరుకున్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల్లో 636 పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని చేర్చేందుకు 16 జోన్లు ఏర్పాటు చేసి 35 రూట్లుగా విభజించారు. 59 బస్సుల్లో సామగ్రి, సిబ్బందిని తరలించారు. వరండాల్లోనే పోలింగ్ కేంద్రాలు.. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం కొన్నిచోట్ల వరండాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే మరికొన్ని పాఠశాలల్లో అవసరమైనన్ని గదులు అందుబాటులో లేకపోవడంతో ఒకేగది ఆవరణలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రానికి, ఈ కేంద్రానికి మధ్య టేబుళ్లను ఉంచారు. ఏ వార్డు ఓటరు ఆ వార్డు బూత్కే టేబుల్ మధ్య నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది -
సీనియర్ సిటిజన్ల సంక్షేమంపై దృష్టి
పెద్దపల్లి: తల్లిదండ్రులతోపాటు సీనియర్ సి టిజన్ల సంక్షేమం లక్ష్యంగా లీగల్ ఎయిడ్ క్లిని క్లు ప్రారంభిస్తున్నామని, వీటిని సద్వినియో గం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. కలెక్టరేట్లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సీనియర్ సి టిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ను సోమవారం జడ్జి ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ సోమవారం ప్యానల్ న్యాయవాది ఎస్.అశోక్ కుమార్, లీ గల్ వలంటీర్ ఎస్.మల్లేశ్ క్లినిక్లో అందుబాటులో ఉంటారన్నారు. తమ పిల్లలతో సమస్య లు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు ఇక్కడ ఫి ర్యాదు చేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, ఎఫ్ఆర్వో స్వర్ణలత, ప్రతినిధులు శేఖర్, అశోక్ పాల్గొన్నారు. రైల్వేమంత్రి దృష్టికి సమస్యలురామగుండం: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సోమవారం రైల్వేస్టేషన్లలో సమస్యలను ఆ శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రిని కలిసి న మంత్రి.. రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లిలోని రైల్వే కార్మికులకు మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేయాలని, రామగుండంలో వి విధ కారణాలతో మూతపడిన పాఠశాలను తె రిపించాలని, రైల్వే డిస్పెన్సరీకి అంబులెన్స్ కే టాయించాలని, బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో తొలగించిన అంబేడ్కర్ విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించారు. కుందనపల్లి, పెద్దంపేటలో రైల్వే వంతెనల టెండర్ ప్రక్రియను పూర్తిచేయించాలన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. జాతీయ పోటీలకు ఎంపిక జూలపల్లి(పెద్దపల్లి) : మండల కేంద్రా నికి చెందిన అక్షయ్రాజ్ వాలీబాల్ పో టీల్లో జాతీయ స్థా యికి ఎంపికయ్యా డు. 2024లో స్పో ర్ట్స్ అథారిటీ ఆఫ్ తె లంగాణ అకాడమీ కి ఎంపికై .. సీనియ ర్ కోచ్ సంపత్గౌడ్ వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. క్రీడాకారులు హన్మంతరెడ్డి, కొసరి కృష్ణ, కమలాకర్రెడ్డి, రవీందర్, గంగాధర్గౌడ్ ఆయనను సోమవారం అభినందించారు. సాధువులకు సన్మానం మంథని: గోదావరి పరిక్రమణ యాత్రలో భా గంగా యానాం నుంచి ధర్మపురి వెళ్తున్న పలువురు సాధువులకు సోమవారం పట్టణంలో ఘ నస్వాగతం లభించింది. ఉత్తరప్రదేశ్లోని వింద్రావన్ పీఠానికి చెందిన మలూక్పీత్ శ్రీరాజేంద్రదాస్జీ మహారాజ్తోపాటు పలురాష్ట్రాలకు చెందిన సాధువులు, మండేశ్వరులు, మహామండలేశ్వరులు సుమారు 500 మంది తొలుత కాళేశ్వరం సందర్శించారు. ఆ తర్వాత ధర్మపురి వెళ్తుండగా మంథనిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, మంథని ప్రఖండ ఉపాధ్యక్షుడు రావుల సతీశ్, ప్ర చారక్ తూర్పాటి రాము, సత్రంగ ప్రముఖ మే డగోని రాజమౌళిగౌడ్, బోట్ల ఆంజనేయులు, బత్తుల సత్యనారాయణ తదితరులు ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి రామగిరి(మంథని): ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా ఉండలని భద్రతా తనిఖీ బృందం క న్వీనర్ వెంకటరమణ అన్నారు. ఆర్జీ–3 ఏరి యా ఓసీపీ–2లో సోమవారం నిర్వహించిన వార్షిక భద్రతా పక్షోత్సవాల్లో జీఎం సుధాకర్రావుతో కలిసి మాట్లాడారు. గతాను భవాలను దృష్టిలో పెట్టుకుని విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ఆర్జీ రీజియన్ సేఫ్టీ జీఎం మధుసూ దన్, ప్రతినిధులు రామచంద్రరెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, రామ్మోహన్, రాజశేఖర్, శంకర్, చంద్రశేఖర్, రామారావు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్రూరల్/ఎలిగేడు: పల్లెలు, పట్టణాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట, నిట్టూరు, పెద్దకల్వల, సుల్తానాబాద్ మండలం సుద్దాల, కనుకుల, తొగర్రాయి, కదంబాపూర్తోపాటు ఎలిగేడు మండలం నర్సాపూర్, రాములపల్లి, ముప్పిరితోటలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వసతుల కల్పన, కొత్త రేషన్కార్డులు, సన్నబియ్యం పంపిణీ కాంగ్రెస్ సర్కార్ ఘనతేనని అన్నారు. ఈనెల 17న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులనే గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. అభ్యర్థులు ఆరె సంతోష్, అర్కుటి ధనలక్ష్మి, గిర్నేని స్రవంతి, ఢిల్లేశ్వర్రావు, మీస లక్ష్మి, చిలుక స్రవంతి, గొస్కుల సదయ్య, పల్లెర్ల వెంకటేశ్గౌడ్, సిద్ధి తిరుపతి, రామిడి శైలజ – వెంకట్రామ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, నాయకులు పడాల అజయ్గౌడ్, పెగడ రమేశ్, సంతోష్, సంపత్రావు, దుగ్యాల సంతోష్రావు తదితరులు పాల్గొన్నారు. -
మేడిపల్లి నుంచి లింగాపూర్ వైపు..
గోదావరిఖని/రామగుండం: మూతపడిన సింగరే ణి మేడిపల్లి ఓపెన్కాస్టు ప్రాజెక్టు పరిధిలోని గోదా వరి తీరంలో ఆదివారం సంచరించిన పులి.. సోమ వారం లింగాపూర్ గ్రామ శివారులో ప్రత్యక్షమైనట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మేడిపల్లి, మల్కాపూర్ గ్రామ శివారుల నుంచి లింగాపూర్ గ్రామ శివారులోని గోదావరి పంపుహౌస్ పరిసరాల్లో తిరిగినట్లు పులి అడుగుజాడలు గుర్తించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగతుందోనని స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అనుకూలంగా అటవీప్రాంతం.. సింగరేణికి చెందిన మేడిపల్లి ఓపెన్కాస్టు ప్రాజెక్టు మూతపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన అట వీ ప్రాంతంగా వృద్ధి చెందింది. ఇది పులికి నివా సయోగ్యంగా మారినట్లు అధికారులు చెబుతున్నా రు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి.. గోదావరి నదిదాటి మేడిపల్లికి చేరుకుందని, ఆ తర్వాత లింగాపూర్ గ్రామ శివారులోకి వచ్చిందని వారు భావిస్తున్నారు. ఒంటరిగా వెళ్లొద్దు.. గోదావరి నదీపరీవాహక ప్రాంతాల్లోని గ్రామస్తులు రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు రాకూడదని అట వీ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైన వా రు, రైతులు తప్పనిసరైతే.. అలజడి చేస్తూ సామూహికంగా వెళ్లాలని వారు పేర్కొంటున్నారు. సోమ వారం పులి పాదముద్రలు గుర్తించిన వారిలో కా ళేశ్వరం ఫారెస్ట్ సర్కిల్ అధికారి ప్రభాకర్, జిల్లా అ టవీశాఖ అధికారి శివయ్య, అధికారులు ఎంవీ నా యక్, కొమురయ్య, సయ్యద్ రహ్మతుల్లా, మంగీలాల్, స్రవంతి, రామ్మూర్తి తదితరులు ఉన్నారు. -
వీ హబ్ పనులు పూర్తిచేయండి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి: వీ హబ్ భవనం పెండింగ్ పనులు పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రంగంపల్లిలో చేపట్టిన వీ హబ్ భవన నిర్మాణ ప్రగతిని ఆయన సోమవారం పరిశీలించారు. సీసీ కెమేరా లు, ఏసీలను త్వరగా బిగించాలని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్ష ణ, అవగాహన కల్పించడం లక్ష్యంగా వీ హబ్ భవ నం నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కాళిందిని, పంచాయతీరాజ్ అ సిస్టెంట్ ఇంజినీర్ పవన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరా తీస్తూ.. అడ్రస్ తెలుసుకుంటూ
పెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికల్లో ప్రతీఒక్క ఓటు కీలకమేనని భావించిన సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థులు.. ఉపాధి కోసం దూర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన ఓటర్లపై దృష్టి సా రించారు. ఓటరు జాబితా ఆధారంగా వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. వలస ఓటర్లు ప్రస్తుతం ని వాసం ఉంటున్న చిరునామాలు సేకరించి ఓటు హక్కు వినియోగించునేందుకు రప్పించేలా ఏర్పా ట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. పోటీ తీవ్ర తను బట్టి ఒక్కఓటుతో ప రాజయం పాలైన వారుకూ డా ఉండడంతో జాబితాలో ని ఓటర్లు అందరూ ఓట్లు వేసేలా చూసేందుకు నానాపాట్లు పడుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారిపై దృష్టి.. ఇరుగు, పొరుగు జిల్లాల్లో వలస ఓటర్లు ఉంటే తమ బంధుగణాన్ని అక్కడకు పంపించి వాహనంలో రా వాలని, అందుకయ్యే ఖర్చు తామే భరిస్తామని, ఇంకా ఇతరత్రా కూడా కొంత సమకూర్చుతామంటూ అభ్యర్థులు ఆఫర్ ఇస్తున్నారు. దీంతో చాలామంది వలస ఓటర్లు సైతం తమ ఊళ్లకు వచ్చి ఓటేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫోన్లో అందుబాటులో ఉన్నవలస ఓటర్లకు సొమ్మును ఫోన్పే, గూగుల్పే ద్వారా చెల్లించి వారినే వాహనం సమకూర్చుకుని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న అభ్యర్థు లూ ఉన్నారు. వలస ఓటర్ల కరుణతోనైనా పంచా యతీ ఎన్నికల్లో గట్టెక్కుతామేమోనన్న గంపెడాశ తో అభ్యర్థులు ఎంతఖర్చుకై నా వెనుకాడడం లేదు. చివరి విడతలో 91 పంచాయతీలు.. పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలోని సుల్తానాబాద్, ఎలిగే డు, పెద్దపల్లి, ఓదెల మండలాల్లో 91 పంచాయతీ లు, 852 వార్డు స్థానాలకు ఈనెల 17న ఎన్నికలను నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో ఆరు పంచాయతీ సర్పంచ్, 215 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగ తా 85 సర్పంచ్, 636వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు ప్రణాళిక రూపొందించారు. 85 సర్పంచ్ స్థానాలకు 294 మంది, 636 వార్డు స్థానాలకు 1,582 మంది అభ్యర్థులు పోటీపడు తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శతవిధాలా ప్రయ త్నాలు చేస్తున్నారు. ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర.. పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల కోసం పోటీపడుతున్న అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా పల్లెల్లోనూ ప్రచార రథాలను ఏర్పాటు చేసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. సోమవారం (ఈనెల15)తో ప్రచార పర్వం ముగిసింది. బుధవారం చివరి దశ పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నగదు, మద్యం, చీరలు పంపిణీ చేసే పనిలో అభ్యర్థులు, వారి మద్దతుదారులు తలమునకలయ్యారు. మద్యం దుకాణాల మూసివేత మూడోవిడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 17న జరగనున్నాయి. దీంతో మద్యం దుకాణాలను సో మవారం సాయంత్రమే మూసివేయించినట్లు ఎక్సై జ్ అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు విఘాతం కలుగకుండా మద్యం దుకాణాలు మూసివేయించినట్లు వారు వివరించారు. పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వలస వెళ్లింది. ఈనెల 17న పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలు ఉండడంతో ఓటేసేందుకు రావాలని ఓ అభ్యర్థి వారికి విన్నవించారు. రానుపోను రవాణా ఖర్చులను ఫోన్పే ద్వారా పంపించారు. దీంతో ఆ కుటుంబం ఇటీవలే స్వగ్రామానికి చేరుకుంది. వలస ఓటర్లను సొంతఊళ్లోకి రప్పించి ఓటు వేయించుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు నానాపాట్లు పాట్లుపడుతున్నారు. దూరాన్ని బట్టి వాహనాలను సమకూర్చుతున్నారు. కొందరు బస్సు, రైలు చార్జీలు చెల్లిస్తున్నారు. వలస ఓటర్లను ఎలాగైనా రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. -
స్వేచ్ఛగా ఓటు వేయాలి
పెద్దపల్లి: స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత పోలింగ్కు ప్ర జలు సహకరించాలని, ఓటుహక్కును స్వేచ్ఛగా వి నియోగించుకోవాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి కో రారు. మూడోవిడతలో పోలింగ్ నిర్వహించే పెద్దపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన సోమ వారం తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల్లోని పోలీస్లు ఎన్నికల అధికారులకు సహకారం అందించాలన్నారు. ఎన్నికల ప్రక్రి య ప్రశాంతంగా సాగేందుకు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలాన్నారు. మద్యం తాగి పోలింగ్ కేంద్రా లకు రావడం నిషేధమన్నారు. తప్పుడు ప్రచారం, వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని సూ చించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మహిళల తీర్పే కీలకం
తుదివిడతకు పటిష్ట బందోబస్తు పెద్దపల్లిరూరల్: జిల్లాలో మూడోవిడతగా పంచాయతీలకు ఈనెల 17న నిర్వహించే ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. చివరి విడతలో పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల్లోని 91 పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఇందులో ఆరు పంచాయతీలు ఏకగ్రీవం కా వడంతో 85 సర్పంచ్, 636 వార్డు స్థానాలకు పోలింగ్ ని ర్వహిస్తారు. మొత్తం 1,44,563 మంది ఓటర్లు త మ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 73,669 మంది మహిళా ఓటర్లుండగా.. 70,892 మంది పురుష ఓటర్లు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. మహిళా ఓటర్ల కటాక్షం కోసం అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. గ్రామాల్లోని స్వశక్తి సంఘాల మహిళలతో సమావేశాలు నిర్వహించి తమకే మద్దతు ఇవ్వాలంటూ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్లోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో చివరి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పెద్దపల్లి జోన్లోని మూడోవిడతలో సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలు, మంచిర్యాల జోన్ పరిధిలోని భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఈనిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఐదుగురు లేక అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడవద్దని, అత్యవసరమైతే అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకు ని చట్టబద్ధంగా సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈఉత్తర్వులు ఈ నెల 15 న సాయంత్రం 5గంటల నుంచి ఈనెల 17న ఎ న్నికల ప్రక్రియ కౌంటింగ్ ముగిసేంత వరకూ అమలులో ఉంటుందని ఆయన వివరించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఆయన హెచ్చరించారు. ఓటర్లు అందరూ ఓటు వేయాలని ఆయన కోరారు.పెద్దపల్లి: చివరిదశ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని డీపీవో వీరబుచ్చయ్య సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్టిబ్యూషన్ సెంటర్ను ఆయన సోమ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పోలింగ్ విధులు నిర్వ హించాలలని ఆయన కోరారు.డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలిస్తున్న డీపీవో మూడోవిడత ఎన్నికల్లో ఓటర్ల వివరాలు మండలం మొత్తం ఓటర్లు మహిళలు పురుషులు పెద్దపల్లి 50,986 25,996 24,989 ఎలిగేడు 18,570 9481 9088 ఓదెల 35,807 18,219 17,588 సుల్తానాబాద్ 39,200 19,973 19,227 మొత్తం 70,892 73,669 70,892 -
కార్మికులపై కేంద్ర ప్రభుత్వం దాడి
గోదావరిఖని: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులపై దాడికి దిగుతోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ జెండా ఎగురవేశారు. ఆయన మా ట్లాడుతూ ఈనెల 31న యూనియన్ 18వ మహాసభలు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామన్నారు. పెట్టుబడుదారులకు అనుకూలంగా కార్మిక చ ట్టాల ను నాలుగు లేబర్కోడ్లుగా మార్చిందని ఆయన ఆరోపించారు. దీనిని అమలు చేయడానికి రాష్ట్రప్రభుత్వాలపై ఒత్తిడి పెంచిందని ఆరోపించారు. లేబర్కోడ్లు అమలైతే.. భారత కార్మికవర్గం బానిసత్వంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్కోడ్ల రద్దు కోసం కార్మిక వర్గం ఏకతాటిపైకి వచ్చి పోరాటాలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెండే శ్రీనివాస్, మేదరి సారయ్య, శివరాంరెడ్డి, రమేశ్, మధు, మల్లేశ్, సమ్మయ్య, సారయ్య, ఆంజనేయులు, గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
మేజర్ పంచాయతీల సర్పంచులు
పెద్దంపేట : ఆముల శ్రీనివాస్ (బీఆర్ఎస్) పాలకుర్తి: పెద్దపల్లి తిరుమల (బీఆర్ఎస్) ఈసాల తక్కళ్లపల్లి : బండి శ్రీనివాస్ (బీఆర్ఎస్)నంది మేడారం : వీర్పాల్ (కాంగ్రెస్) జూలపల్లి : పాటకుల అనూష (బీఆర్ఎస్) టీటీఎస్ అంతర్గాం : ఎ.రవికుమార్ (స్వతంత్ర) -
పోలింగ్ ప్రశాంతం: కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: రెండోవిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి మండలాల్లో పోలింగ్ 84.15 శాతం నమోదైందని అన్నారు. రెండోవిడత పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. మొత్తం 94,807 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలిపారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, ఆర్డీవో గంగయ్య, తాహసీల్దార్లు శ్రీనివాస్, సునీత, ఎంపీడీవో ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్గాంలో పర్యటన.. రామగుండం: అంతర్గాం మండలంలోని 15 పంచాయతీల్లో చేపట్టిన పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యవేక్షించారు. తొలుత ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, ఇతరత్రా అంశాలు, అభ్యర్థుల వివరాలు, ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలను ఎంపీడీవో సుమలతను అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, ఎంపీవో వేణుమాధవ్ ఉన్నారు. -
ఓటుహక్కు వినియోగించుకున్నారా?
● వృద్ధురాలిని పలుకరించిన ఏసీపీ కృష్ణ పెద్దపల్లి/ధర్మారం: ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ఆదివారం సందర్శించారు. అక్కడ చేపట్టిన పోలీస్ బందోబస్తు తీరును తనిఖీ చేశారు. ఇదేసమయంలో ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి ఓ వృద్ధురాలి వచ్చింది. ఏసీపీ కృష్ణ ఆమెను ఆప్యాయంగా పలుకరించారు. ఆ తర్వాత ఓటు వేశావా?, పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి పోలీస్ సిబ్బంది సాయం చేశారా? ఆరోగ్య పరిస్థితి బాగుందా? అని అడిగి తెలుసుకొన్నారు. పోలీసులు ప్రజలకు సాయం ఉంటారని, ప్రజలందరూ ఇబ్బందులు లేకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఏసీపీ సూచించారు. -
చెయ్యెత్తి.. జైకొట్టి..
సాక్షి పెద్దపల్లి: మలివిడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది. అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి మండలాల్లోని 73 పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగా.. మూడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అందులో కాంగ్రెస్ మద్దతుదారులు బొట్లవనపర్తిలో సంగ రంజిత్కుమార్, బంజేరుపల్లిలో కల్లె ఇందిర, బీఆర్ఎస్ బలపరిచిన షైనేని రవి నాయకంపల్లిలో ఏకగ్రీవంగా గెలుపాందారు. మిగిలిన 70సర్పంచ్ స్థానాలకు 286 మంది అభ్యర్థులు పోటీపడగా, 684వార్డుల్లో 177వార్డులు ఏకగ్రీవమయ్యారు. మి గిలిన 507 వార్డుల్లో 1,417మంది పోటీపడ్డారు. ఏ కగ్రీవంతో కలుపుకుని 49 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సత్తాచాటారు. బీఆర్ఎస్ 18 స్థానాల తో సరిపెట్టుకుంది. బీజేపీ బోణీకొట్టింది. 5చోట్ల స్వతంత్రులు, అంతర్గాం మండలం ఎక్లాస్పూర్లో సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ అభ్యర్థి గెలుపొందారు. పల్లెల్లో కాంగ్రెస్ జోరు మొత్తం 70 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సింహభాగం స్థానాలను దక్కించుకున్నారు. ఏకగ్రీవ మైన స్థానాలతో కలిపి మొత్తం 49 స్థానాలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. రెండోస్థానానికే పరిమితమైన బీఆర్ఎస్ తొలివిడత ఎన్నికల్లో బీఆర్ఎస్ ద్వితీయ స్థానానికి పరిమితమవ్వగా, రెండోవిడతలో తలపడి రెండోస్థానానికే పరిమితమైంది. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల తో పోల్చితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్.. స్థానిక ఎన్నిక ల్లో ద్వితీయ స్థానంతో పట్టును నిలుపుకుంది. రెండోవిడతలో ఏకగ్రీవంతో కలుపుకు ని 18సీట్లు గెలుపొందింది. జూలపల్లిలోని 13 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ను వెనక్కినెట్టి 8 సీట్లు సాధించింది. బోణీ కొట్టిన బీజేపీ.. తొలివిడతలో ఖాతా కూడా తెరవని బీజేపీ.. రెండోవిడతలో జూలపల్లి మండలం కోనరావుపేటలో తన మద్దతుదారు విజయంతో బోణీ కొట్టింది. అక్కడ బీజేపీ మద్దతుతో నల్లా నరేందర్రెడ్డి సర్పంచ్గా గెలుపొందారు. ఎంపీ ఎన్నికల్లో ద్వితీయ, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రథమ స్థానంలో నిలిచి సీట్లను కై వసం చేసుకున్న బీజేపీ.. పంచాయతీ ఎన్నికల్లో డీలా పడింది. రెండోవిడత 84.15 శాతం పల్లె ఓటర్లు ఓటెత్తారు. రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలిసారి ఓటుహక్కు పొందిన యువత ఉ త్సాహంగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నా రు. పోలింగ్ పూర్తయ్యాక మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. వార్డుల వారీగా తొ లుత ఫలితాలు ప్రకటించి, అనంతరం సర్పంచ్ ఫ లితాలు వెల్లడించారు. అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి మండలాల్లోని 70 పంచాయతీల్లో సర్పంచ్, వార్డుస్థానాలకు పోలింగ్ జరిగింది. ఏజెంట్ల రాక ఆలస్యంతో.. పలుచోట్ల పోలింగ్ ముగిసిన తర్వాత భోజన వి రామం ప్రకటించారు. ఆ తర్వాత ఏజెంట్లు సకాలంలో లెక్కింపు కేంద్రాలకు చేరుకోలేదు. దీంతో ఓట్ల లెక్కింపు కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్లను వేరుచేసి 25 బ్యాలెట్ పేపర్లకు ఒకకట్టగా కట్టారు. ఆ తర్వాత అభ్యర్థులకు వచ్చిన ఓట్లు లెక్కించారు. ముందుగా వార్డు స్థానాల ఫలితాలు ప్రకటించారు. అనంతరం సర్పంచ్ ఫలితాలు వెల్లడించారు. ఓట్లు తక్కువగా ఉన్న చిన్నగ్రామ పంచాయతీల్లో సాయంత్రం ఐదు గంటల వరకే ఫలితాలు వెల్లడయ్యాయి. మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో ఫలితాలు కాస్త ఆలస్యంగా వచ్చాయి. 1.88 శాతం పెరిగిన పోలింగ్.. వణికించే చలితో ఓటర్లు పొద్దున కాస్త ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు కదిలివచ్చారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. గడువు ముగిసే స మయానికి పెరుగుతూ వచ్చింది. గడువు ముగిసిన పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లను ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల అధికారు లు అనుమతించారు. ఉదయం 9 గంటలకు 23.94 శాతం, ఉదయం 11 గంటలకు 55.20 శాతం, పోలింగ్ ముగిసే సమయానికి 84.15 శాతం పోలింగ్ నమోదైంది. తొలివిడతలో 82.27శాతం పోలింగ్ నమోదుకాగా, మలి దశలో 1.88శాతం పెరిగింది. గుర్తింపు కార్డులేక.. ఫోన్లు అనుమతించక బీఎల్వోలు ఓటర్లకు పోల్చీటీలను ముందుగానే పంపిణీ చేశారు. అయినా, పలువురు ఓటర్లు పోల్ చీటీలతోపాటు గుర్తింపుకార్డులు తీసుకునిరాలేదు. దీంతో ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల అధికారులు వారిని అనుమతించలేదు. ఇలాంటివారు మళ్లీ ఇళ్లకు వెళ్లి తమ గుర్తింపుకార్డులు తీసుకొని వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ఫోన్లు అనుమతించలేదు. విష యం తెలియక ఫోన్లతో తరలివచ్చిన పలువురు ఓ టర్లు వాటిని పోలింగ్ కేంద్రాల బయ ట ఉన్నవారికి అప్పగించారు. ఆ తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్యాలెట్ పేపర్పై అభ్యర్థి పేరు లేకుండా కేవలం గుర్తు మాత్రమే ఉండడంతో కొందరు ఓటర్లు ఓటు వేసేందుకు తికమకపడ్డారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా రెండోదశ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది.రామగుండం : కుందనపల్లి పోలింగ్ కేంద్రం ఎదుట ఓటర్ల సందడిధర్మారం ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లుఓటుహక్కు వినియోగించుకున్న ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, పలువురు యువ ఓటర్లురెండోవిడత పోలింగ్ వివరాలు మండలం మొత్తం ఓట్లు పోలైనవి శాతం అంతర్గాం 17930 15455 86.20 ధర్మారం 42447 35178 82.88 జూలపల్లి 24163 20590 85.21 పాలకుర్తి 28118 23584 83.88 మొత్తం 1,12,658 94807 84.15 గెలుపొందిన వివిధ పార్టీల మద్దతుదారులు మండలం జీపీలు ఏకగ్రీవం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు పాలకుర్తి 16 0 14 02 0 0 అంతర్గాం 15 0 12 01 0 2 జూలపల్లి 13 0 03 08 1 1 ధర్మారం 29 3 18 06 0 2 మొత్తం 73 3 47 18 1 5 -
పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ
జూలపల్లి(పెద్దపల్లి): మండలంలోని 13 పంచాయతీల్లో ఆదవారం జరిగిన ఎన్నికల సరళిని అ దనపు కలెక్టర్ వేణు పర్యవేక్షించారు. ఓటర్లు ఉ దయమే ఓటువేసేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. మొత్తం 130 పోలింగ్ కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. జూలపల్లి పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ వేణు పర్యవేక్షించి పలు సూ చనలు చేశారు. ఇన్చార్జి డీల్పీవో దేవకి, డి ప్యూటీ కలెక్టర్, ఇన్చార్జి తహసీల్దార్ బానవాత్ వనజ, ఎంపీడీ పద్మజ, డిప్యూటీ తహసీల్దార్ అనిల్కుమార్ పర్యవేక్షించారు. ఏఆర్డీఎస్పీ ప్రతాప్, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై సనత్కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. మంత్రిని కలిసిన సర్పంచులు ముత్తారం(మంథని): కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు శనివారం రాత్రి హైదరాబాద్లో మంత్రి శ్రీధర్బాబును కలిశారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో మంత్రిని కలిశారు. సర్పంచులకు మంత్రి శుభకాంక్షలు తెలిపారు. కొత్త సర్పంచులు పెగడ తిరుమలకుమార్, ఇండ్ల కృష్ణావేని– సదయ్య, బియ్యని శివకుమార్, తాని ప్రభాకర్, సిలివేరి జ్యోతి – లక్ష్మణ్, చొప్పరి సంపత్, మెంగని స మత – తిరుపతి, బొంతల అన్నపూర్ణ – ఉపేందర్, రాపెల్లి రాజయ్య, గడ్డం రాజేశం మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ధాన్యం గోల్మాల్పై నిరసన ముత్తారం(మంథని): కేశనపల్లి ఐకేపీ కొనుగో లు కేంద్రంలో ధాన్యం గోల్మాలైందని ఓ రైతు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశాడు. బాధితు డు తాత కుమార్కు మద్దతుగా మాజీ సర్పంచ్ నూనె కుమార్తోపాటు స్థానికులు ఐకేపీ అధికారులను నిలదీశారు. కుమార్ 30 బస్తాల ధా న్యాన్ని తూకం వేసి వేరే రైతు ఖాతాలో జమచేశారని ఆరోపించారు. ఎన్నికల వేళ రైతులు స్పందించలేదని, లారీలో తక్కువ ధాన్యం ఉండడంతో వేరే రైతు ఆ ధాన్యం తనవే అని చె ప్పడంతో తూకం వేశామని ఐకేపీ అధికారి తి రుపతి తెలిపారు. బాధిత రైతుకు తెలియకుండా కాంటా వేయడం పొరపాటేనని, ధాన్యం డబ్బులు ఆయనకే వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతు అందోళన విరమించాడు. ఢిల్లీ ర్యాలీలో ‘ఖని’ నేతలుగోదావరిఖనిటౌన్: కాంగ్రెస్ అగ్రనేత రా హుల్ గాంధీ అధ్యక్షత న ఆదివారం న్యూఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగిన ‘ఓట్ చోర్.. గ డ్డి చోడ్’ మహార్యాలీ లో గోదావరిఖనికి చెందిన ఎన్ఎస్యూ నేతలు పాల్గొన్నారు. ఎమ్మె ల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆదేశాల మే రకు ఎన్ఎస్యూఐ నేషనల్ ప్రెసిడెంట్ వరుణ్ చౌదరి నేతృత్వంలో దాసరి విజయ్కుమార్, గుడికందుల రవి, నేరెళ్ల రమేశ్, రాహుల్, అరవింద్, మహేశ్ ర్యాలీలో పాల్గొన్నారు. అప్పుడు భర్త ఓటమి.. ఇప్పుడు భార్య గెలుపు రామగుండం: అంతర్గాం మండలం రాయదండి గ్రామ పంచాయతీకి గ తంలో జరిగిన ఎన్నికల్లో సాదుల సదానందం ఓటమి పాలయ్యారు. తన ప్రత్యర్థి ధర్మాజి కృష్ణ ఒక్క ఓటుతో ఆయనపై గెలుపొందడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయినా మనస్తాపం చెందకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రజల మధ్యే ఉన్నారు. గ్రామాభివృద్ధిలో పాలుపంచుకున్నారు. గ్రామస్తుల సమ స్యలు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందా రు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సర్పంచ్ ఎన్నిక ల్లో బీసీ(మహిళ) రిజర్వు స్థానం నుంచి తన భార్య సాదుల స్వప్నను బరిలో నిలిపారు. ఆ మె తన సమీప ప్రత్యర్థి మేడి వసంతపై 19 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఒక్క ఓటుతో ఓటమి పాలైన సదానందం.. తిరిగి సర్పంచ్ స్థానాన్ని తన సతీమణి స్వప్నతో భర్తీ చేయించారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
పల్లెలకు పట్టణ శోభ తెస్తాం
పెద్దపల్లిరూరల్: పల్లెలకు పట్టణ శోభ తీసుకొస్తామ ని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దబొంకూర్, రాఘవాపూర్, రంగాపూర్, కనగర్తి, పా లితం, కాసులపల్లి, తుర్కలమద్దికుంట గ్రామాల్లో ఆదివారం పంచాయతీ ఎన్నికల సభల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని అ భ్యర్థించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు లు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించే వారు కాంగ్రెస్ మద్దతుదారులనే గెలిపించుకోవాలని కోరారు. నాయకులు ఆడెపు వెంకటేశం, గంట రమేశ్, ముడుసు సాంబిరెడ్డి, కూ రమల్లారెడ్డి, ఇనుగాల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. గ్రామాభివృద్ధిపై దృష్టి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పాలకవర్గం గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. మొట్లపల్లి పంచాయతీ పాలకవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు. సర్పంచ్ తులా మనోహర్రావు, ఉపసర్పంచ్ బొమ్మల సుమలత – సదయ్య, వార్డుసభ్యులు దొమ్మటి శంకరమ్మ, పోశా లు, శారద, రమేశ్, రాజేశం, మానస, కాంగ్రెస్ నాయకులు దొమ్మటి రవి, శ్రీనివాస్, సంపత్, తిరుపతి, గాదర్ల వెంకటేశ్, ఎండీ ఫారూక్ పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు
పెద్దపల్లి: జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చివరిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ధాన్యం రాకపోవడంతో కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఈ సీజన్లో 333 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇప్పటివరకు 62,756 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించారు. వారినుంచి సేకరించిన ధాన్యం విలువ రూ.695 కోట్ల 18 లక్షలు కాగా ఇప్పటివరకు రూ.647 కోట్ల 50 లక్షలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తినడానికి సన్నవడ్లు.. వానాకాలంలో అత్యధిక మంది రైతులు సన్నరకం వరి సాగుచేస్తారు. ఇందులో తినడానికి కొంత నిల్వచేసుకుని మిగతా ధాన్యం విక్రయిస్తారు. ఈసారి ఇప్పటివరకు సన్నరకం 2,53,418 మెట్రిక్ టన్నులు, దొడ్డురకం 37,438 మెట్రిక్ టన్నులను నిర్వాహకులు కొనుగోలు చేశారు. ధాన్యం విక్రయించిన రైతులకు 72 గంటల్లోనే ధాన్యం సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఎవరికై నా జమ కాకుంటే వెంటనే ఏఈవోలను సంప్రదించాలని అధికారులు సూచించారు. 40 సేకరణ కేంద్రాల మూసివేత 93 శాతం మంది రైతులకు ధాన్యం డబ్బులు చెల్లింపు రానివారు అధికారులను సంప్రదించాలి -
ఆధునిక సాంకేతికతపై ఇల్లెందు క్లబ్లో సదస్సు
గోదావరిఖని: ఆధునిక సాంకేతికతపై స్థానిక ఇల్లెందు క్లబ్లో శనివారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్(ఐఈఐ) సదస్సు నిర్వహించారు. గనులు, విద్యుత్, మౌలిక సదుపాయాలు, డిజిటల్ సాంకేతికత, వ్యవసాయం వంటి విభిన్న రంగాలపై నిపుణులు అవగాహన కల్పించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, మాజీ ఎమ్మెల్యే, ఇంజినీర్ సోమారపు సత్యనారాయణ, ఐఈఐ రాష్ట్ర కమిటీ చైర్మన్ రమణ నాయక్, గౌరవ కార్యదర్శి మర్రి రమేశ్, సభ్యులు కె.లక్ష్మీనారాయణ ఆర్జీ–వన్ జీఎం లలిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. గనుల అక్రమ తరలింపు, ఫ్లైయాష్ నిర్వహణ, స్మార్ట్ మైనింగ్లో 5ఏ అడ్వాన్స్డ్, ‘క్రాప్ దర్పణ్’ యాప్, ఏఐ ఆధారిత పంట ఆరోగ్య నిర్ధారణ, ఎంఎండీఆర్ చట్టంపై సుదీర్ఘంగా చర్చించారు. సాంకేతిక సదస్సు జ్ఞాన మార్పిడి, వృత్తిపరమైన పరస్పర చర్యలు, విధానాలు – సాంకేతికత – సుస్థిరతపై చర్చకు వేదికగా సదస్సు నిలిచింది. -
70 పల్లెలు
4 మండలాలు..సాక్షి,పెద్దపల్లి/పెద్దపల్లి: జిల్లాలో రెండోవిడత పంచాయతీ సమరానికి ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఉద యం 7 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్లను ఎ న్నుకుంటారు. జిల్లాలోని ధర్మారం, పాలకుర్తి, జూలపల్లి, అంతర్గాం మండలాల్లోని 70 గ్రామాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. శనివారం ఉదయం నుంచే ఆయా మండల కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. భద్రత బలగాలు వారివెంట తరలివెళ్లాయి. పల్లెలు ప్రశాంతం.. శుక్రవారం వరకు ప్రచారంలో హోరెత్తిన పల్లెలు ఇప్పుడు ప్రశాంతంగా మారాయి. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీపడుతున్న అభ్యర్థులు వారంరోజులుగా ఇంటింటా ప్రచారం చేశారు. ఊరేగింపులు, నమూనా బ్యాలెట్ పత్రాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం గడువు ముగియడంతో ప్రలోభాలకు తెరతీశారు. రెండోవిడతలో 73 పంచాయతీలో ఎన్నికలు జరపాల్సి ఉండగా.. బొట్లవనపర్తి, బంజేరుపల్లి, నాయకంపల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 70 సర్పంచ్ స్థానాల కు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 286 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 684 వార్డులకు 177 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 507 వార్డులకు 1,454 మంది పోటీపడుతున్నారు. 1,13,908 మంది ఓటర్లు.. రెండోవిడతలో 1,13,908 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అంతర్గాం మండలంలో 17, 930మంది, ధర్మారంలో 43,697మంది, జూలపల్లి మండలంలో 24,163 మంది, పాలకుర్తి మండలంలో 28,118 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 57,702 మంది కాగా.. మహిళలు 56,201 మంది ఉండగా.. ఇతరులు ఐదుగురు ఉన్నారు. అమలులో 163 బీఎన్ఎస్ఎస్ యాక్టు.... ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 163 బీఎన్ఎస్ఎస్ యాక్టు అమలులో ఉండనుంది. ఓట్ల లెక్కింపు పూర్తికాగానే సాయంత్రం ఐదు గంటల నుంచి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీస్శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆంక్షల సమయంలో నలుగురికి మించి గుంపులుగా చేరడం, కర్రలు, కత్తులు తదితర మారణాయుధాలతో సంచరించడాన్ని నిషేధించారు. పల్లెబాట పట్టిన ప్రజలు హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆయా పల్లెల ప్రజలు పోలింగ్ నేపథ్యంలో స్వగ్రామాల బాటపట్టారు. సర్పంచ్, వార్డుస్థానాల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు కూడా ఓటర్ల కోసం సొంతంగా వారికి వాహనాలు సమకూర్చుతున్నారు. చివరి ప్రయత్నంగా అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఓటుకు నోటు, మద్యం సీసాలు పంపిణీ చేస్తున్నారు. తమకే ఓటు వేయాలంటూ కాళ్లు మొక్కుతూ, ఒట్టు కూడా వేయించుకుంటున్నారు. అయితే, మరికొద్ది గంటల్లోనే ఎవరి భవితవ్యం ఏమిటో తేలిపోనుంది. అధికారులు, సిబ్బంది సమాచారం పోలింగ్ కేంద్రాలు 684 పీవోలు 787 ఏపీవోలు 1,031 రూట్లు 2 జోన్లు 12 వెబ్కాస్టింగ్ కేంద్రాలు 39 రెండోవిడతలో మొత్తం పంచాయతీలు 73 ఏకగ్రీవమైన సర్పంచులు 3 ఎన్నికలు జరిగేవి 70 పోటీలో ఉన్న అభ్యర్థులు 286 మొత్తం వార్డులు 684 ఏగ్రీవమైనవి 177 ఎన్నికలు జరిగేవి 507 బరిలో ఉన్నవారు 1,454 -
పోలింగ్ కేంద్రాలపై పోలీస్ ఫోకస్
గోదావరిఖని: రెండోవిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీలపై పోలీసులు డేగకన్ను వేశా రు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో 1,680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1,700 మంది పోలీసు బలగాలను మోహరించారు. 519 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. పోలీసు బందోబస్తు ఇలా రామగుండం పోలీసు కమిషనరేట్లోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కోసం భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు. ఇందులో ఇ ద్దరు డీసీపీలు, ఏడుగురు ఏసీపీలు, 30మంది సీఐ లు, 95మంది ఎస్సైలు, 270 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 520మంది కానిస్టేబుళ్లు, 240మంది హోంగార్డులు, 190మంది ఆర్ముడ్ సిబ్బంది, 32 క్యూర్టీ టీంలు ఉన్నాయి. వీరితోపాటు రెండు రూట్ మొ బైల్ పార్టీలు 62 ఏర్పాటు చేశారు. చెక్పోస్ట్ల్లో భ ద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా స్థానిక పోలీసులతోపాటు డయల్ 100 నంబరకు సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారులు సూచించారు. కమిషనరేట్లోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. పాతనేరస్తుల కదలికలపై డేగకన్ను వేశాం. రూట్ మొబైల్స్, స్ట్రెకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రెకింగ్ ఫోర్స్ను నియమించాం. ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలు చేపట్టాం. క్రిటికల్ పోలింగ్ గ్రామాల్లో ఫ్లాగ్మార్చ్ నిర్వహించి ఎన్నికలపై ప్రజల్లో భరోసా కల్పించాం. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం -
ఎంపీల నివాసాల ఎదుట నిరసన
పెద్దపల్లి: పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశ పెట్టాలనే డిమాండ్తో న్యూఢిల్లీలోని తెలంగాణ ఎంపీల నివాసాల ఎదుట బీసీ నాయకులు శనివారం నిరసన తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాగరుషి అరుణ్ కుమార్, జేఏసీ కో ఆర్డినేటర్ గుజ్జ సత్యం, నాయకుడు తాళ్లపల్లి మనోజ్ కుమార్గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కోమటిపల్లి రాజేందర్ మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రెండేళ్లుగా నమ్మించి. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ప్రతీ ఎన్నికలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమేనని, జనవరి 10న ఎంపీల ఇళ్లు ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. -
ఎన్నికలకు బందోబస్తు
జూలపల్లి(పెద్దపల్లి): పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి చెప్పారు. స్థానిక కళాశాల ఆవరణలో శనివారం పోలీసు సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై ఆరా తీశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, ఓటర్లు సహకరించాలని ఆయన కోరారు. ఏసీపీ కృష్ణ, ఏఆర్ డీసీపీ ప్రతాప్, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై సనత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వి‘జయలక్ష్మి’ పెద్దపల్లిరూరల్: రాంపల్లి ఉపసర్పంచ్గా మడుపు జయలక్ష్మి ఎన్నికయ్యారు. సర్పంచ్తో పాటు 8మంది వార్డుసభ్యులు ఏకగ్రీవమైన విషయం విదితమే. ఉపసర్పంచ్ ఎన్నిక కోసం రాంపల్లి రైతువేదికలో శనివారం సమావేశమయ్యారు. మడుపు జయలక్ష్మి, కనుకుంట్ల అంజ య్య పదవిని ఆశించారు. ఎవరికి వారే తమకు కావాలంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో గ్రామపెద్దల సమక్షంలో లాటరీ ద్వారా డ్రా తీయగా జయలక్ష్మిని ఉపసర్పంచ్ పదవి వరించింది. ఆమెను సర్పంచ్ కనపర్తి సంపత్రావు, మాజీ సర్పంచ్ ప్రభాకర్రావు, నాయకులు నర్సింగం తదితరులు అభినందించారు. సైక్లింగ్తో సంపూర్ణ ఆరోగ్యం సైక్లింగ్లో అపర్ణ–సాయి కృష్ణ దంపతులు జ్యోతినగర్(రామగుండం): ఆరోగ్యమే మహాభాగ్యమనే సందేశాన్ని ప్రజలకు చేరవేయడం, సైక్లింగ్ ప్రాముఖ్యతను చాటిచెప్పడం కోసమే సైక్లింగ్ చేపట్టామని కరీంనగర్కు చెందిన చిందం అపర్ణ – సాయికృష్ణ దంపతులు తెలిపా రు. 600 కి.మీ. వరకు చేపట్టిన సైకిల్ యాత్ర శనివారం ఎన్టీపీసీకి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వ్యాయామం ఎంతో అవసరమన్నారు. కరీంనగర్లో ప్రారంభమైన సైకిల్రైడ్ రామగుండం, వాంకిడి, కరీంనగర్, హైదరాబాద్(రింగ్ రోడ్డు) నుంచి కరీంనగర్ మీదుగా సాగుతుందని వారు తెలిపారు. కోల్ ఇండియా సైక్లింగ్లో గోల్డ్మెడల్ సాధించిన వెంకటతిరుపతిరెడ్డి తదితరులు వారిని కలిసి అభినందనలు తెలిపారు. రేపు పత్తి మార్కెట్ బంద్ పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నామని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. మార్కెట్లో అడ్తిదారు బుద్దె చంద్రమౌళి ఆకస్మిక మృతికి సంతాపసూచకంగా అడ్తిదారులంతా మార్కెట్ బంద్ ఉంచాలని కోరారని ఆయన పేర్కొన్నారు. రైతులు ఈనెల 15న (సోమవారం) పత్తి నిల్వ లు మార్కెట్కు తేవొద్దని ఆయన సూచించారు. ఎన్టీపీసీలో సమ్మెలు నిషేధం జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీలో ఆరు నెలలపాటు సమ్మెలు నిషేధించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్, 1971 (1971లోని చట్టం 20) నిబంధనల ప్రకారం, ఈనెల 14 నుంచి ఆరు నెలలపాటు సమ్మెలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు. కల్లుకు తగ్గిన డిమాండ్ పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పంచాయతీ సర్పంచ్, వార్డుస్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రోజూ మద్యం, మాంసంతో విందులు ఇస్తున్నారు. దీంతో తెల్లకల్లుకు గిరాకీ బాగా పడిపోయింది. పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులకు పోటీపడేవారు ఇలా ఓటర్లకు మద్యం అందిస్తుండడంతోనే తెల్లకల్లు తాగేందుకు ఎవరూ రావడంలేదని పలువురు గీతకార్మికులు తెలిపారు. అందుబాటులో బీర్లు, విస్కీ, బ్రాండీ ఉండగా.. తెల్లకల్లు తాగుడేందని ఓటర్లు భావిస్తున్నారో ఏమో! తమ వద్ద రోజూ ఈతకల్లు తాగేందుకు వచ్చే వారు ఎవరూ ఇటువైపు వచ్చిన దాఖలాలు కనిపించడం లేదని పలువురు గీతకార్మికులు పేర్కొంటున్నారు. -
ఏఐసీసీ నేతలు స్పందించాలి
పెద్దపల్లి: బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ మన్నారాయణ శనివారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ కా ర్యాలయాన్ని సందర్శించారు. జాతీయ స్థాయిలో ఓబీసీ ఉద్యమం ఆవశ్యకతపై ఏఐసీసీ అగ్రనేతలకు వివరించారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని రాహుల్ గాంధీ కార్యాల య కార్యదర్శికి వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.తీరని రైల్వేగేట్ కష్టాలు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి – కూనారం మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్తో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ప్రతీ పది, ఇరవై నిముసాలకో రైలు రాకపోకలు సాగిస్తూ ఉంటుంది. తరచూ గేట్ వేయక తప్పని పరిస్థితి ఉంది. గంటల కొద్దీ నిరీక్షించలేని వాహనదారులు.. ప్రమాదం అని తెలిసినా గేట్ కిందనుంచి వాహనాలను ఇలా దాటిస్తూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. – పెద్దపల్లిరూరల్కొద్దిపాటి నీళ్లతోనే నారుమడులు ఎస్సారెస్పీ కాలువ ద్వారా సరఫరా అయ్యే సాగునీటిపై ఆధారపడిన రైతులు వరి నారుమడి సిద్ధం చేసేందుకు నీటికష్టాలు తప్పడం లేదు. ఎస్సారెస్పీ కాలువ అడుగున మిగిలిన కొద్దిపాటి నీటిని సైతం తోడేందుకు విద్యుత్ మోటార్లు అమర్చుకుంటున్నారు కొందరు రైతులు. ఆ నీటితోనే నారుమడిని సిద్ధం చేసుకుంటున్నారు. రాంపల్లి గ్రామశివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద కనిపించిందీ దృశ్యం. – పెద్దపల్లిరూరల్ రైస్మిల్లుల్లో ధాన్యం గుట్టలు వానాకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఆశించిన దానికన్నా అధికంగానే పంట రైతుల చేతికి అందింది. ఐకేపీ, ప్యాక్స్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. ఇలా తరలివచ్చిన ధాన్యం బస్తాలను మిల్లుల్లో నిల్వచేయగా.. గుట్టల్లా కనిపిస్తున్నాయి. సుల్తానాబాద్లోని మిల్లుల్లో కనిపించిన ధాన్యం బస్తాలు ఇవీ.. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పెరిగిన చలితీవ్రత
● 8.5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు జ్యోతినగర్(రామగుండం): జిల్లాలో చలితీవ్రత పెరుగుతోంది. రామగిరి మండలంలోని సింగరేణి ఆర్జీ–3 ఏరియాలోగల ముల్కలపల్లి గ్రామంలో శుక్రవారం గరిష్టంగా 29.4 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 8.5 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలితీవ్రత పెరిగి జిల్లావాసులు వణిపోయారు. వారంరోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో రోజూ సాయంత్రం ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. జన సంచారం లేక ప్రధాన రహదారులు అన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చలితీవ్రతతో ఇప్పటికే చాలామంది జ్వరం, జలుబు తదితర సీజనల్ వ్యాధుల తో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధు లు, దీర్ఘకాలిక, శ్వాసకోక, ఆస్తమా తదితర వ్యాధిగ్రస్తులు ఇళ్లనుంచి బయటకు వెళ్లకూడదని వైద్యు లు సూచిస్తున్నారు. జిల్లాలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెల్సియస్) ప్రాంతం గరిష్టం కనిష్టం ముల్కలపల్లి 29.4 8.5 కమాన్పూర్ 31.4 9.4 ఓదెల 30.4 9.5 ఎక్లాస్పూర్ 30.2 9.7 కూనారం 29.1 9.9 ధర్మారం 31.5 9.9 కనుకుల 29.9 10.0 -
అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా..
పెద్దపల్లిరూరల్: పంచాయతీల్లో పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 263 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తొలివిడత పూర్తయ్యింది. ఆదివారం రెండోవిడత పోలింగ్ నిర్వహిస్తారు. పార్టీ రహితమైనా.. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగానే జరుగుతున్నా.. అభ్యర్థులు ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వారే కావడం గమనార్హం. తొలివిడతలో 5 మండలాల్లోని 99 పంచాయతీలు, 896 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దతుదారులే అత్యధికంగా 70 స్థా నాల్లో విజయం సాధించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ 22 పంచాయతీలకే పరిమితమైంది. మరో ఏడు గురు స్వతంత్రులు కూడా సత్తాచాటారు. రేపే మలివిడత ఎన్నికలు.. జిల్లాలోని పాలకుర్తి మండలంలో 16, అంతర్గాంలో 15, ధర్మారంలో 29, జూలపల్లి మండలంలోని 13 పంచాయతీలు, 684 వార్డులకు ఈనెల 14న (ఆదివారం) పోలింగ్ నిర్వహిస్తారు. తొలివిడత ఫలితా లను విశ్లేషించుకున్న నేతలు.. రెండోవిడతకు అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు. చివరి విడతలో పెద్దపల్లి సెగ్మెంట్.. పెద్దపల్లి అసెంబ్లీ పరిధిలోని కాల్వశ్రీరాంపూర్ మండలంలోని 24 పంచాయతీలకు తొలివిడత గురువారం ఎన్నికలు జరిగాయి. 18 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్ ఐదు, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈనెల 17న పెద్దపల్లి మండలంలోని 30 పంచాయతీలు, సుల్తానాబాద్లోని 27, ఎలిగేడులోని 12, ఓదెల మండలంలోని 22 పంచాయతీలు, 852 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. పోటాపోటీగా వ్యూహాలు.. తొలివిడత ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించి ఊపు మీదున్న కాంగ్రెస్ను కట్టడి చేసి పల్లెస్థాయి నుంచే పట్టు సాధించాలన్న ఆలోచనతో బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. చివరి విడత పోరులో అక్క డక్కడా సర్పంచ్ స్థానం కోసం ఒకరికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండడంతో ఆ ఊళ్ల జోలికి వెళ్లకుండా.. ‘ఎవరు గెలిచిన మనోళ్లే’.. అన్న ధోరణిని ఎమ్మెల్యే విజయరమణారావు ప్రదర్శిస్తున్నారు. మిగతా గ్రామాల్లో పోటీ తీవ్రతను బట్టి ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో పర్యటించి తమ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నా రు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైతం ఎలాగైనా త మ మద్దతు దారులను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకునేందుకు అభ్యర్థులతో సమావేశాలను నిర్వ హించి పలు సూచనలు చేశారు. ఇలా వ్యూహ, ప్రతివ్యూహాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారహోరు సా గిస్తుండగా..బీజేపీ నేతల్లో నెలకొన్న అంతర్గత విభేదాలతో ఎవరికి వారే యమునాతీరే అన్నరీతిన వ్య వహరిస్తున్నారు. పెద్దపల్లి మండలంలో రెండు పంచాయతీల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటా మని నేతలు పట్టుదలతో పనిచేస్తున్నారు. హోరెత్తుతున్న ప్రచారం.. జిల్లాలో గ్రాయ పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. కేవలం ఐదారువందల ఓట్లు ఉన్న పంచాయతీలో పోటీపడే వారు సైతం ప్రచార రథాలతో వాడవాడలా ప్రచారం చేయడం గమనార్హం. దీనిని బట్టి నాలుగైదువేల మంది ఓటర్లున్న పెద్దపంచాయతీల్లో ప్రచారం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. తొలివిడతలో హస్తం విసిరిన పంజాతో డీలా పడ్డ విపక్ష పార్టీలు రెండు, మూడోవిడత ఎన్నికల్లో సత్తాను ఏమేర చాటుతాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
పంచాయతీల్లో వెన్నుపోట్లు
పొద్దున ప్రచారం.. రాత్రి విందు మంథని: తొలివిడత పంచాయ తీ పోరులో చిత్రవిచిత్రాలు చో టుచేసుకున్నాయి. సర్పంచ్ అభ్యర్థుల ఎత్తులు, పైఎత్తులకు ఓటర్లు వెన్నుపోటు పొడిచారు. అనేక ప్రలోభాలకు గురిచేసిన వారుకూడా చివరకు ఓటమి చవిచూడటంతో ఆసక్తికర చర్చ సా గుతోంది. ‘మీకే ఓటేస్తమని మా టిచ్చి ఇచ్చినకాడికి పుచ్చుకుని చేతిలో చెయ్యేసి బంధుత్వాలు, స్నేహాలు వలకబోసి నిండా ముంచార’ని ఓడిన అభ్యర్థులు తిట్ల పురాణాలు అందుకుంటున్నారు. పైసలు పంచినా మద్దతు రాకపాయే.. పైసలు పంచినా ఓటర్లు తమకు మద్దతు ఇవ్వక మరొకరిని ఆదరించి వెన్నుపోటు పొడిచినట్లు ఓటమి పాలైనవారు ఆవేదన చెందుతున్నారు. పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో కొంద రు ఆస్తులు, ఆభరణాలు అమ్ముకుని, తాకట్టు పెట్టి మరీ రూ.లక్షల్లో ధారపోశారు. కానీ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇవ్వడంతో బరిలో నిలిచినవారు లబోదిబో మంటున్నారు. పోలింగ్కు ఒక రోజు ముందు డబ్బుల ప్రభావం చూపుతుందని తెలిసిన కొందరు అభ్యర్థులు పోటాపోటీగా పంపిణీ చేసినట్లు తెలిస్తోంది. అయితే ముందుగా డబ్బులు తీసుకున్న ఓటర్లు ‘మీకే ఓటు వేస్తాం’ అని హామీ ఇచ్చి మరోకరు ఎక్కువ సొమ్ము ఆ వ్యక్తి ఓటు వేసినట్లు చర్చించుకుంటున్నారు. రూ.లక్షల్లో అప్పులు చేసిన అభ్యర్థులు ఓటమి తర్వాత వాటిని ఎలా తీర్చాలని తలలు పట్టుకుంటున్నారు. ఎ న్నికలకు ముందు వాగ్ధానాలు ఇ చ్చి అధికారంలోకి వచ్చాక మా టమార్చే నాయకులనే చూశాం.. కానీ ప్రస్తుతం నాయకులను మించి ఓటర్లు తయారయ్యారనే ఆసక్తికర చర్చ సాగుతోంది. మావోడు ఒక్క ఓటేస్తే.. ‘మావోడు వచ్చి ఒక్క ఓటేస్తే నేను గెలిచటోన్ని’ అని ఓ అభ్యర్థి.. ‘నాతోటి తిరిగినోడు పక్కోడికి ఓటు వేయడంతోనే నేను ఓడిపోయా’ అని మరోఅభ్యర్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నావోళ్లని నమ్మితే పరాయోడికి ఓటు వేసిండ’ని ఇంకో అభ్యర్థి వాపోయారు. అనేక గ్రామ పంచాయతీల్లో ఒక్కఓటు కీలకమై అభ్యర్థుల తలరాతనే మార్చేసింది. తొలివిడత ఎన్నికల్లో ఓ పంచాయతీలో ఇద్దరికి సమానంగా ఓట్లు రాగా డ్రా తీయడంతో ఒకరు గెలిచారు. అలాగే మరో పంచాయతీలో కేవలం ఒక్క ఓటుతోనే సమీప అభ్యర్థి విజయం సాధించారు. గెలుపు అంచుల వరకు వచ్చి.. మంథని డివిజన్లోని కొందరు సర్పంచ్ అభ్యర్థులు విజయావకాశాల అంచుల వరకు వచ్చి ఒక్కఓ టు తేడాతో ఓడిపోయారు. ఇలాంటి వారు దుఃఖంలో ఉంటే.. గెలిచిన అభ్యర్థులు సంబురాల్లో మునిగితేలారు. కేవలం ఒక్కఓటు అభ్యర్థి తలరాతను మార్చుతుందని దీనిద్వారా మరోసారి తేలిపోయిందనే చర్చ సాగుతోంది.వేడెక్కిన రెండోవిడత పంచాయతీ పెద్దపల్లిరూరల్: వణికిస్తున్న చలికాలంలోనూ తొ లివిడత పంచాయతీ ఎన్నికలు పల్లెవాసుల్లో వేడి పుట్టించాయి. అదేవిధంగా రెండోవిడతలోనూ గ రంగరంగా ఎన్నికల ప్రచారం సాగింది. మూడో విడత రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికల్లో ఎ వరు గెలుస్తరు.. కుల ఓట్లు ఎవరివి ఎక్కువున్నయ్.. అందరూ కట్టడిగనే ఉంటరా?.. ఇలా తుదివిడత ఎన్నికలు జరిగే పల్లెల్లో పంచాయతీ ముచ్చట్లే వినబడుతున్నాయి. పెద్దపల్లి, ఓదెల, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లోని 85 సర్పంచ్, 636 వార్డులకు ఈనెల 17న పోలింగ్ నిర్వహిస్తారు. పట్టణాలకు సమీపంలోని మేజర్ పంచాయతీల్లో పోరు ‘నువ్వా.. నేనా’ అన్నట్లుంది. పొద్దంతా ఎన్నికల ప్రచారం.. అభ్యర్థులు తమ ఆధిపత్యం చూపించి అధికారం దక్కించుకునేందుకు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. మూడో విడతకు కొద్దిరోజులే గడువు ఉండడంతో ఉదయం నుంచే ప్రచారం జోరుగా చేస్తూ తమ గుర్తును ఓటర్ల ముంగిటకు చేర్చేందుకు నానాతంటాలు పడుతున్నారు. పొద్దంతా ప్రచారం చేసి.. మద్దతుదారులతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాత్రివేళల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. స్టేటస్లు.. వాట్సాప్ గ్రూపుల్లో.. ఈసారి పంచాయతీ ఎన్నికల ప్రచారం ‘డిజిటల్’ మయమైంది. సర్పంచ్, వార్డు స్థానా ల్లోని అభ్యర్థులు సోషల్మీడియా ద్వారా ప్రచా రం హోరెత్తిస్తున్నారు. వాట్సాప్ గ్రూప్లు క్రియే ట్ చేస్తూ ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు. కుల బలం కోసం.. అభ్యర్థులు తమ కుల బాంధవులతో సమావేశా లు జరిపి మద్దతునివ్వాలని అభ్యర్థిస్తున్నారు. పె ద్దపల్లి మండలంలోని ఓ పల్లెలో తమ ఆరాధ్య దైవం గల ఆలయాన్ని రూ.30లక్షలతో అభివృద్ధి చేసేందుకు బాండ్ రాసివ్వడంతో కులబలగమంత సదరు అభ్యర్థికి బాసటగా నిలుస్తున్నట్లు స మాచారం. మరోఊరులో.. తమ కాలనీ రోడ్డు అ ధ్వానంగా ఉందని, గెలిచిన వెంటనే రోడ్డు వేయిస్తానని ఓ వార్డు అభ్యర్థి బాండ్ రాసిచ్చినట్లు తెలిసింది. ఇలా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. కా నీ, ఓటరు మహాశయుడి కరుణ ఎవరిపై ఉందో ననే విషయం ఈనెల 17న తేలిపోనుంది. -
ఆధిపత్య ఆరాటం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలిఘట్టం ముగిసింది. తొలివిడతలో 397 గ్రామాలకు ఎన్నికలకు జరగ్గా 51శాతానికి పైగా (205) స్థానాలు కై వసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక 29శాతం (116) సీట్లు దక్కించుకుని బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలవగా, బీజేపీ 9శాతం (35) సీట్లతో మూడో స్థానం దక్కించుకుంది. ఉమ్మడి జిల్లాలో తొలివిడతలో 398 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. పెద్దపల్లి జిల్లా పెద్దంపేట గ్రామం ఎన్నిక కోర్టు కేసు నేపథ్యంలో వాయిదా పడింది. మొత్తంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. బీఆర్ఎస్, బీజేపీలు చెప్పుకోదగ్గ సీట్లు సాధించాయి. నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఏయే గ్రామాల్లో ఎవరు ఎన్ని ఓట్లు సాధించారు? ఎంత వ్యత్యాసంతో ఓటమి చెందారు? ఏ కారణాలు విజయావకాశాలను ప్రభావితం చేశాయన్న విషయాలపై పార్టీలపరంగా ఆలోచనలు చేస్తున్నారు. బీజేపీ అనూహ్య ఫలితాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీజేపీ బలపరచిన దాదాపు 35 మంది సర్పంచులు గెలిచారు. మరో 35మంది వరకు స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ ప్రభావం కనిపించలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కరీంనగర్లో 14, సిరిసిల్లలో 07 స్థానాలు గెలచుకుని సత్తా చాటింది. జగిత్యాలలోనూ 14 స్థానాలు కై వసం చేసుకుని మొత్తంగా 35 సర్పంచులను గెలిపించుకుంది. ఈ విజయానికి రెండో, మూడో విడతలను వేదికగా చేసుకోవాలని పథకాలు రచిస్తోంది. వాస్తవానికి ఒక్క కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లోనే తాము బలపరిచిన 50 మంది సర్పంచ్గా గెలిచారంటూ ప్రకటించడం విశేషం. మొత్తానిక బీజేపీ అనూహ్య ఫలితాలు ఆ పార్టీలో సరికొత్త జోష్ నింపింది. 10శాతం ఇతరులపై అధికార పార్టీ కన్ను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలివిడతలో 44 మంది అభ్యర్థులు ఇతరులు/ స్వతంత్రులు ఉన్నారు. వీరందరినీ ఇప్పటికే అధికార పార్టీ తమ వైపు తిప్పుకునే పనిలో నిమగ్నమైంది. దాదాపుగా వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మిగిలిన బీఆర్ఎస్ నుంచి గెలిచిన 116 మంది సర్పంచుల్లో పలువురితో అధికార పార్టీ మంతనాలు మొదలుపెట్టింది. గెలిచిన వారంతా మనోళ్లే అన్న సిద్ధాంతంతో అధికార పార్టీ ముందుకు వెళ్తుండగా.. అప్పులు చేసి గెలిచిన వాళ్లు, అధికార పార్టీతో మనకెందుకు అన్న ఆందోళనలో ఉన్న వారంతా హస్తం తీర్థం పుచ్చుకునే ఆలోచిస్తున్నారు. వీరంతా తోడైతే అధికార పార్టీ మద్దతు ఉన్న సర్పంచుల సంఖ్య అమాంతం పెరగనుంది. తొలివిడతలో పెద్దపల్లిలో కాంగ్రెస్ 90 గ్రామాల సర్పంచ్ స్థానాలకుగాను 70 స్థానాలు గెలిచి పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. కరీంనగర్లో 92 స్థానాలకు కాంగ్రెస్ 44 గెలవగా, 24 చోట్ల కారు పార్టీ విజయం సాఽధించింది. జగిత్యాలలో 122కి 52 సర్పంచులను కాంగ్రెస్ గెలవగా.. 42 సర్పంచు సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుని గట్టిపోటీ ఇచ్చింది. సిరిసిల్లలోనూ 85 సర్పంచి స్థానాలలో 39 కాంగ్రెస్ దక్కించుకోగా.. 28 బీఆర్ఎస్ వశపరచుకుంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా.. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీగా సర్పంచి స్థానాల కోసం పోటీ పడ్డాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కరీంనగర్, కోరుట్లలో బీఆర్ఎస్ చక్కటి ఫలితాలు సాధించింది. 14వ తేదీన జరగనున్న రెండో విడత, 17వ తేదీన జరిగే మూడో విడతలో మరిన్ని సీట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. -
ప్రజల కోసం హెల్ప్డెస్క్
పెద్దపల్లి: లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ను ప్రజ లు వినియోగించుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ శ్రీధర్తో కలిసి లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. వైద్యసేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. ఓదెలలో స్థల పరిశీలన ఓదెల(పెద్దపల్లి): మండల కేంద్రంలో జూనియ ర్ సబ్కోర్డు పక్కా భవన నిర్మాణానికి సుల్తానాబాద్ కోర్డు జడ్జి గణేశ్ శుక్రవారం ఓదెలలో స్థల పరిశీలన చేశారు. ఎస్సారెస్పీ కార్యాలయం స మీపంలోని 1.5ఎకరాల్లో భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు హద్దులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ధీరజ్కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు. నేడు నవోదయ ప్రవేశ పరీక్ష పెద్దపల్లి: ఆరో తరగతిలో ప్రవేశాల కోసం శని వారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జవహర్ నవోదయ పరీక్ష నిర్వహిస్తారని డీఈవో శారద తెలిపారు. ఉమ్మ డి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 6,892 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. విద్యార్థుకు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆమె సూచించారు. ఎన్టీపీసీలో ఓపెన్హౌస్ ఫోరంజ్యోతినగర్(రామగుండం): ఎగ్జిక్యూటివ్ డైరె క్టర్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ పరిపాలన భవనంలో శుక్రవారం ఓపెన్ ఫోరం హౌస్ నిర్వహించారు. సంస్థ అభివృద్ధిలో ఉద్యోగుల కృషి ఎంతో ఉందని ఆయన అన్నారు. అధికారులు, ఉద్యోగులు సంస్థాగత ప్రభావంపై పలు సూ చనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాఽధికారులు, అధికారులు, వివిధ యూనియన్ల ప్రతి నిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో విశ్వం ఎడ్యు టెక్ ఆధ్వర్యంలో అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ జిల్లాస్థాయి పోటీలు శుక్రవారం జరిగాయి. ప లు ప్రాంతాల నుంచి 40 పాఠశాలలకు చెందిన 500 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 31 మంది ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్ ఎంపికైన విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలు జనవరిలో ఉంటాయని రీజినల్హెడ్ వినాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు స్రవంతి, సురేందర్, సాగర్, నాగరాజు, కిశోర్, శివ, సూరజ్ పాల్గొన్నారు.ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికల నిర్వహణరామగుండం: రెండోవిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ బందోబస్తు చేపట్టామని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. ఓటర్లపై ఒత్తిడి తేవొద్దన్నారు. అంతర్గాం మండలం గోలివాడలో శుక్రవారం ఆయన అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం సీఐ ప్రవీణ్కుమార్, అంతర్గాం ఎస్సై వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.క్వింటాల్ పత్తి రూ.7,431 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,431 ధర పలికింది. కనిష్టంగా రూ. 6,878, సగటు రూ.7,211గా ధర నిర్ణయించినట్లు మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి రైతులు తీసుకొచ్చిన 532 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. సూచనలిస్తున్న డీసీపీ రాంరెడ్డి -
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ధర్మారం(ధర్మపురి): అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని, పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని నర్సింహులపల్లి, ఖిలావనపర్తి, పైడిచింతలపల్లి, బుచ్చయ్యపల్లె, ఖానంపల్లి, దొంగతుర్తి గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
కాంగ్రెస్ సర్కారుతోనే పేదలకు మేలు
పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం అందుగులపల్లిలో గురువారం పార్టీ గ్రామ అధ్యక్షుడు గొడ్డేటి రాజయ్య, మార్కెట్కమిటీ డైరెక్టర్ గౌస్మియా, తలారిసాగర్, లక్ష్మినారాయణ, చంద్రయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. గ్రామంలో మహిళాసంఘ భవనం నిర్మించాలని మహిళలు కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. రోడ్ల అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జూలపల్లి(పెద్దపల్లి): గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులతోనే సాధ్యమని ఎమ్మెల్యే విజయరమణారావు ఆన్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు నాగులపల్లె తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. నాయకులు దారవేని నర్సింహయాదవ్, రాజేశం, రాంచంద్రం, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
21న జాతీయ లోక్అదాలత్
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: న్యాయస్థానాల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునేందుకు వీలుగా ఈనెల 21న జాతీయ మెగా లోక్అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. జిల్లా న్యాయస్థానంలో గురువారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రధానకార్యదర్శి భవాని, సీనియర్ సివిల్జడ్జి స్వప్నరాణి, జూనియర్ సివిల్జడ్జి మంజులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 13న నిర్వహించాల్సిన జాతీయ లోక్అదాలత్ను పంచాయతీ ఎన్నికల కారణంగా 21న నిర్వహిస్తామని పేర్కొన్నారు. లోక్అదాలత్లో సివిల్, క్రిమినల్, బ్యాంకు రికవరీ, ఇన్సూరెన్సు క్లెయి మ్, కుటుంబ తగాదాలకు సంబంధించి కేసులను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అవకాశముందన్నారు. న్యాయసేవలను ఉచి తంగా పొందాలనుకునే వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. ప్రశాంతంగా తొలివిడత పంచాయతీ ఎన్నికలుపెద్దపల్లి: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 82.27 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం జిల్లాలోని 5 మండలాల పరిధిలో ఎన్నికలు జరుగగా, కలెక్టరేట్లో వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, 1,18,346 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వివరించారు. డీపీవో వీరబుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. నగరంలో పారిశుధ్యం మెరుగుపర్చండికోల్సిటీ(రామగుండం): నగరంలో కొత్తగా ప్రవేశపెట్టిన రెండుపూటల శానిటేషన్ విధానం ద్వారా పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపర్చాలని రామగుండం నగరపాలక కమిషనర్ జె.అరుణశ్రీ ఆదేశించారు. గురువారం కార్యాలయంలో పారిశుధ్య విభాగం సూపర్వైవర్లు, వార్డు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అదనంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్నం షిఫ్ట్లో పారిశుధ్య సిబ్బందితో టీమ్ వర్క్ చేయించాలన్నారు. సిబ్బంది హాజరు, పని తీరును వార్డు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. సిబ్బంది తమకు కేటాయించిన డివిజన్లలోనే పని చేయాలని, ప్రతీ స్వచ్ఛ ఆటో తప్పనిసరిగా డీఆర్సీ, కంపోస్ట్యార్డ్కు వెళ్లాలన్నారు. అడిషనల్ కమిషనర్ మారుతిప్రసాద్, ఎస్ఈ గురువీర, ఈఈ రామన్, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, సెక్రెటరీ ఉమామహేశ్వర్రావు, ఆర్వో ఆంజనేయులు, డీఈలు శాంతిస్వరూప్, జమీల్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సంపత్, సీనియర్ అసిస్టెంట్ శ్రీపాల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయాలు.. ఉన్నత విద్యకు సోపానాలు జ్యోతినగర్(రామగుండం): కేంద్రీయ విద్యాలయాలు ఉన్నత విద్యకు సోపానాలుగా నిలుస్తున్నాయని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, విద్యాలయ మేనేజ్మెంట్ చైర్మన్ చందన్కుమార్ సామంత అన్నారు. గురువారం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో కేంద్రీయ విద్యాలయ వార్షిక క్రీడా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎన్టీపీసీ నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ అంశం, వివిధ క్రీడల్లో విజయం సాధించినవారికి జ్ఞాపికలు అందజేశారు. ఏజీఎం బిజ య్ కుమార్ సిగ్దర్, ధన్వంతరి ఆస్పత్రి సీఎంవో డాక్టర్ లహరి, రామగుండం సీఐ ప్రవీణ్కుమార్, ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ రవి, విద్యాలయ ప్రిన్సిపాల్ శోభన్బాబు పాల్గొన్నారు. -
‘మెమొరీ’ కొమురయ్య
● నిత్యం యాదిలోనే వందలాది ఫోన్నంబర్లు ● నంబర్ ఫీడ్ చేయని సాధారణ ఫోన్ వినియోగంరామగుండం: సుమారు వంద మందికి పైగా ప్రముఖులు, సాధారణ వ్యక్తుల ఫోన్నంబర్లను చూడకుండా చెబుతూ అప్పటికప్పుడు వారితో సంభాషిస్తుంటాడు గోపు కొమురయ్య యాదవ్. ఆండ్రాయిడ్ కాకుండా సాధారణ ఫోన్ వినియోగిస్తూ నంబర్లను గుర్తుంచుకుంటూ సంభాషిస్తుండడం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామానికి పదిహేనేళ్ల క్రితం సర్పంచ్గా పని చేసిన గోపు కొమురయ్యయాదవ్ నేటికీ సాధారణ ఫోన్ వినియోగిస్తుంటాడు. అతనికి ఇతర ఫోన్ నంబర్లను ఫీడ్ చేసుకోవడం రాకపోగా, ఫీడ్ చేసి ఉన్న నంబర్లను గుర్తించడం కూడా రాదు. ఆయన పదవీ కాలం నుంచే సెల్నంబర్లను గుర్తుంచుకుంటూ ఫోన్లో డయల్ చేసి మాట్లాడడం ఆయన ప్రత్యేకత. ఒకవేళ ఊర్లో ఎవరికై నా ఎవరి నంబరైనా కావాల్సి వస్తే కొమురయ్యను సంప్రదిస్తుంటారు. పేపర్లో రాసుకో అంటూ నంబర్ను టకాటకా చెప్పేస్తారు. ఒకసారి అతనికి మన నంబర్ చెబితే అట్టే గుర్తుంచుకోవడం ఆయన ప్రత్యేకత. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులకు ఓటర్ల నంబర్లు కావాల్సి వస్తే నేరుగా కొమురయ్యను సంప్రదిస్తుంటారు. -
ఓటెత్తారు..
తొలివిడత పోలింగ్ వివరాలుమండలం మొత్తం పోలైన శాతం ఓట్లు ఓట్లు కాల్వశ్రీరాంపూర్ 34,821 28,922 83.06 కమాన్పూర్ 20,145 16,839 83.59 రామగిరి 31,832 24,815 77.96 మంథని 33,861 28,575 84.39 ముత్తారం 23,197 19,195 82.75 మొత్తం 1,43,856 1,18,346 82.27 జిల్లాలో 82.27 పోలింగ్ శాతం నమోదు మంథనిలో అత్యధికం, రామగిరిలో అత్యల్పం ప్రశాంతంగా ముగిసిన పోలింగ్, కౌంటింగ్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన పలువురు అభ్యర్థులు మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే -
భర్త మృతి.. భార్య గెలుపు
ముత్తారం(మంథని): పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబరుగా పోటీ చేసి గెలువాలని భార్యను బరిలో నిలిపాడు. భార్యాభర్తలు కలిసి తమను గెలిపించాలని ప్రచారం చేశారు. అంతలోనే ఏమైందో కాని భర్త పురుగులమందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేటకు చెందిన పోలుదాసరి శ్రీనివాస్(38) ఈనెల 9న పురుగులమందు తాగగా, చికిత్స నిమిత్తం పెద్దపల్లి, కరీంనగర్ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య శ్రీలత నాల్గో వార్డులో పోటీ చేసి గెలుపొందింది. భర్త రెండురోజులుగా చావుబతుకుల మధ్య కొట్టమిట్టాడిన, పంచాయతీ ఎన్నికలో వార్డు మెంబరుగా ఓటర్లు పట్టం కట్టారు. శ్రీనివాస్ మృతికి పూర్తి వివరాలు తెలియరాలేదు. ఎన్నికల్లో గెలుపొంది సంబరంలో ఉండాల్సిన కుటుంబంలో శ్రీనివాస్ మృతి విషాదం నింపింది. ఈ ఘటనపై ఎస్సై రవికుమార్ను వివరణ కోరగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, హైదరాబాద్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. -
హస్తం హవా
కరీంనగర్: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 398స్థానాలకు గానూ 203 స్థానాలు కై వసం చేసుకొని అధికార పార్టీ సత్తా చాటింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ 121స్థానాలతో పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 37 స్థానాలతో మూడో స్థానం దక్కించుకుంది. గత ఎన్నికలతో పోల్చినప్పుడు కాంగ్రెస్ మొదటి స్థానంలోకి దూసుకురాగా, బీజేపీ తన స్థానాలను మెరుగుపరుచుకొని మూడో స్థానంలో నిలిచింది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 99 స్థానాలకు గానూ కోర్టు వ్యవహారంతో పెద్దంపేట ఎన్నికల నిలిచిపోయింది. జూలపల్లి, కమాన్పూర్ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. నాలుగు గ్రామాలను కాంగ్రెస్ ఏకగ్రీవంతో ఎగరేసుకుపోయింది.ఉమ్మడి జిల్లాలో పార్టీల పరంగా గెలిచిన మద్దతుదారులు జిల్లా గ్రామాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు కరీంనగర్ 92 44 24 14 10 పెద్దపల్లి 99 69 21 00 06 జగిత్యాల 122 51 48 16 07 సిరిసిల్ల 85 39 28 07 11 మొత్తం 398 203 121 37 34 -
యంత్రాంగం.. సిద్ధం
సాక్షి పెద్దపల్లి/మంథని: జిల్లాలో తొలివిడత జరిగే పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంథని, కమాన్పూర్, రామగిరి, ముత్తారం, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో గురువారం పోలింగ్ నిర్వహిస్తారు. ఈమేరకు అధికారులు స ర్వం సిద్ధం చేశారు. ఎన్నికల సిబ్బంది సామగ్రితో బుధవారమే ఆయా కేంద్రాలకు తరలివెళ్లారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. ఆలోపు పోలింగ్ కేంద్రంలోని వారందరూ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం క ల్పిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభి ఫలితలు వెల్లడిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక చేపడతారు. అనివార్య కారణాలతో ఎన్నిక జరగకుంటే మరుసటి రోజు నిర్వహిస్తారు. 95 సర్పంచ్ స్థానాల్లో 377మంది పోటీ.. తొలివిడతలోని 99 పంచాయతీల్లో 4 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 95 సర్పంచ్ స్థానాలకు 377 మంది పోటీపడుతున్నారు. 896 వార్డు స్థానాల్లో 211 ఏకగ్రీవం కాగా, మిగిలిన 685 వార్డు స్థానాల కోసం 1,880 మంది పోటీ పడుతున్నారు. ఈమేరకు ఎన్నికల సిబ్బంది సామగ్రితో బుధవారమే ఆయా కేంద్రాలకు తరలివెళ్లారు. 5 మండలాలు.. 1.45 లక్షల మంది ఓటర్లు.. తొలివిడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో 1,45,710 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 39 రూట్లు, 18 జోన్లుగా విభజించారు. 685 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశా రు. డిస్ట్రిభ్యూషన్ కేంద్రాల్లో సామగ్రిని సరిచూసుకున్న ఎన్నికల సిబ్బంది.. పోలీసు బందోబస్తు మ ధ్య తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వా హనాల్లో తరలివెళ్లారు. అధికారుల పర్యవేక్షణ.. మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకుడు నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంథని ఆర్జీవో సురేశ్, గోదావరిఖ ని ఏసీపీ రమేశ్, ఎంపీడీవో శ్రీనిజరెడ్డితోపాటు పలువురు జిల్లాస్థాయి అధికారులు ఎన్నికల సా మగ్రి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. 27 సమస్మాత్మక ప్రాంతాలు.. జిల్లాలో 27 సమస్యాత్మక గ్రామాలు, వార్డుల్లోని 305 సున్నితమైన కేంద్రాలుగా పోలీసులు గుర్తించా రు. పోలింగ్ కేంద్రాల వద్ద కఠిన నిబంధనలు అ మలులో ఉన్నాయని, సభలు, ర్యాలీలకు అనుమతిలేదని లేదని, ప్రజలు తమతో సహకరించాలని పోలీస్ అధికారులు సూచించారు. క్వార్టర్ బాటిల్.. కిలో చికెన్.. ఓటుకు నోటు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి పలువురు అభ్యర్థులు బుధవారం రాత్రి నుంచే చీరలు, ఇతర విలువైన గిప్ట్లు పంపిణీ చేశారు. మరికొందరు క్వార్టర్ మందు, ఇంటికి కిలో చికెన్ అందజేశారు. తమకు ఓటు వేస్తారనుకునే వారి జాబితా సిద్ధం చేసుకుని ఒక్కో ఓటుకు ఏరియాను బట్టి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు నగదు పంచిపెట్టారు. సర్పంచ్ అభ్యర్థులు పోలింగ్ ముగిసేవరకు ప్రలోభపర్వం కొనసాగించి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, ఉపసర్పంచ్ ఎన్నిక సమస్యాత్మక గ్రామాలపై పోలీసుల ప్రత్యేక నిఘాతొలివిడత పోలింగ్ స్వరూపం పంచాయతీలు 99 ఏకగ్రీవం 04 పోలింగ్ జరిగేవి 95 సర్పంచ్ అభ్యర్ధులు 377 వార్డులు 896 ఏకగ్రీవం 211 ఎన్నికలు జరిగేవి 685 అభ్యర్థులు 1,880 పోలింగ్ కేంద్రాలు 896 పీవోలు 1,031 ఏపీవోలు 1,346 వెబ్కాస్టింగ్ కేంద్రాలు 114 -
ఓటేసేందుకు కాదు.. భోజనం కోసం బారులు
ఓటు వేయడం ఈరోజా? లేక రేపు ఉంటుందా? అని అక్కడి జనాలు నివ్వెరపోయేలా మధ్యాహ్న భోజనం కోసం ఎన్నికల సిబ్బంది బారులు తీరి కనిపించారు. అప్పటివరకు సర్పంచ్ ఎన్నికలు ఒకరోజే ముందే వచ్చాయా? అని ఆశ్చర్యపోయిన వారికి అసలు విషయం తెలిశాక ఆశ్యర్యం వేసింది. కమాన్పూర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో బుధవారం ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తయ్యాక మధ్యాహ్న భోజనం కోసం సిబ్బంది గంటల తరబడి ఇలా బారులు తీరారు. తమ వంతు వచ్చే వరకూ నిరీక్షించక తప్పలేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
రెస్క్యూ పోటీల్లో సింగరేణి కీర్తిపతాక
గోదావరిఖని: జాతీయ స్థాయి రెస్క్యూ పోటీల్లో సింగరేణి కీర్తిపతాకం ఎగురవేసింది. ఈనెల 2 నుంచి 7వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీప మాంగనీస్ ఓవర్సీస్(ఎంవోఐఎల్) ఆధ్వర్యంలో వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(డబ్ల్యూసీఎల్) మెయిన్రెస్క్యూస్టేషన్లో నిర్వహించిన పోటీల్లో సింగరేణి జ ట్టు ఓవరాల్ ప్రథమ స్థానం సాధించింది. దేశంలో ని మెటల్ మైన్, కోల్మైన్ టీంలు పోటీలకు హాజరయ్యాయి. సింగరేణి నుంచి రెండు పురుష, ఒక మహిళా రెస్క్యూ జట్టు పాల్గొన్నాయి. హోరాహోరీ పోటీల్లో 29 పురుష, ఏడు మహిళా బృందాలు తలపడ్డాయి. సింగరేణి పురుషుల బీ– టీం ఓవరాల్ ప్రథమ స్థానం సాధించింది. ఏ–టీం ఓవరాల్ నాలుగోస్థానం దక్కించుకుంది. తొలిసారి పోటీల్లో పాల్గొన్న సింగరేణి మహిళా రెస్క్యూ జట్టు ఓవరాల్రెండో స్థానం సాధించింది. జాతీయ, అంతర్జాతీయంగానూ. సింగరేణి జాతీయ, అంతార్జాతీయ స్థాయిలో రెస్క్యూ పోటీల్లో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కోలిండియాలోని అనేక రెస్క్యూ బృందాలకు శిక్షణ కూడా ఇచ్చింది. రెస్క్యూ, రికవరీ, థియరీ, ఫస్ట్ఎయిడ్, స్టాట్యుటరీ తదితర విభాగాల్లో సింగరేణి మెయిన్ రెస్క్యూ స్టే షన్ లో జాతీయస్థాయి ప్రతినిధులకు 70రోజు ల పాటు ఇటీవల ప్రత్యేక తర్ఫీదు ఇచ్చిన విష యం కూడా తెలిసిందే. అత్యవసర సమయా ల్లో స్పందించే తీరుపై అవగాహన కల్పించింది. హాజరైన 29 జట్లు కోలిండియాకు చెందిన 29 జట్లు జాతీయస్థాయి రెస్క్యూ పోటీల్లో పాల్గొన్నాయి. సింగరేణి జట్టు అగ్రస్థానంలో నిలిచింది. కోలిండియాలోని ఏడు మహిళా టీంలు పాల్గొనగా.. తొలిసారి హాజరైన సింగరేణి మహిళా జట్లు ఓవరాల్ రెండోస్థానం సాధించడం విశేషం. 11 ఏళ్లుగా ప్రథమ స్థానం జాతీయ పోటీల్లో విజయకేతనం ఓవరాల్ ఫస్ట్ప్లేస్లో బీ–టీం నాలుగోస్థానంలో ఏ–టీం -
1600 మందితో బందోబస్త్
గోదావరిఖని: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు 1,600 మంది పోలీస్లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తొలివిడతలోని కాల్వశ్రీరాంపూర్, కమాన్పూర్, రామగిరి, మంథని, ముత్తారం మండలాల్లో గల 685 పోలింగ్ కేంద్రాల్లో 135 పోలింగ్ లొకేషన్లు ఏర్పాటు చేశారు. కమిషనరేట్లోని 1,712 పోలింగ్ కేంద్రాల్లో 538 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. గోదావరి వంతెన, ఎక్లాస్పూర్, దుబ్బపల్లి, గుంపు ల చెక్పోస్ట్ల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. ఇద్దరు డీసీపీలు.. ఆరుగురు ఏసీపీలు తొలివిడత ఎన్నికల్లో బందోబస్తు పర్యవేక్షణకు ఇద్దరు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలు, 30 మంది సీఐలు, 95 మంది ఎస్సైలను నియమించారు. 270 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, 520 మంది కానిస్టేబుళ్లు, 240 మంది హోంగార్డులు, 170 మంది ఆర్మ్డ్ సిబ్బంది, క్యూఆర్ టీంలు 72 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతియుత వాతావరణంలో స్థానిక ఎన్నికల నిర్వహణ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా -
అన్నీ అసౌకర్యాలే..
మంథని: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అ ధికారుల అలసత్వం కొట్టచ్చినట్లు కనిపించింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూష న్ కేంద్రంలో సరైన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో ఎన్నికల సిబ్బంది నానాతంటాలు పడ్డా రు. తమకు కేటాయించిన కేంద్రానికి తరలి వెళ్లేముందు సామగ్రిని సరిచూసుకునేందుకు సౌకర్యాలు లేక కింద కూర్చుండిపోయారు. అలాగే రూట్ సిబ్బందిని తరలించేందురు సరిపడా వాహనాలు సమకూర్చలేదు. ఉన్నవాటిలోనే సిబ్బంది కిక్కిరిసి ప్రయాణం చేశారు. క్రీడలతో ఆరోగ్యం జ్యోతినగర్(రామగుండం): క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని ఎన్టీపీసీ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అ న్నారు. బుధవారం ఎన్టీపీసీ సచ్దేవ స్కూల్ ఆ ఫ్ ఎక్స్లెన్స్ వార్షిక క్రీడా దినోత్సవం జరిగింది. ఈడీ మాట్లాడుతూ, క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అ నంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి క కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ జ్ఞాన్చంద్, ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్ఆర్)బిజయ్ కుమార్ సిగ్దర్, డిప్యూటీ మేనేజర్లు ఏకే సింగ్, కేవీఎంకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నీటి సరఫరాపై అవగాహన కోల్సిటీ(రామగుండం): నగరంలో తాగునీటి సరఫరా నిర్వహణపై ఈఈ రామన్ అవగాహన కల్పించారు. స్థానిక శారదానగర్ జలాశయం వద్ద బుధవారం జరిగిన సమావేశంలో ఆయన వార్డు ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. నగరంలోని 13 ఉపరితల జలశయాల నుంచి సుమారు 40,500 నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. నీటిలో క్లోరిన్ పరీక్ష చేయడంపై అవగాహన కల్పించా రు. కార్యదర్శి ఉమామహేశ్వర్రావు, నీటిసరఫరా సూపర్వైజర్ శశికుమార్ పాల్గొన్నారు. టీబీ చాంపియన్లే కీలకం కోల్సిటీ(రామగుండం): క్షయ నిర్మూలనలో టీ బీ చాంపియన్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వాణిశ్రీ అన్నారు. గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన టీబీ చాంపియన్ల శిక్షణ శిబిరాన్ని బుధవారం డీఎంహెచ్వో ప్రారంభించి మాట్లాడారు. టీబీ బారినపడి కోలుకున్నవారిని టీబీ చాంపియన్లు అంటారని, వారి అనుభవాలను పంచుకోవడం ఎంతోముఖ్యమన్నారు. మందులు సక్రమంగా వాడి తే వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపా రు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీరాములు, డీటీవో సుధాకర్రెడ్డి, జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి సుధాకర్రెడ్డి, ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ స్టేట్ లీడ్ పురుషోత్తం, జిల్లా లీడ్ శ్రీనివాస్, ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ కిరణ్కుమార్, డాక్టర్ లక్ష్మీభవాని, ఆర్పీ అంజలి, గోపీకృష్ణ పాల్గొన్నారు. పెరిగిన పత్తి ధర పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,435 ధర పలికింది. మంగళవారం క్వింటాల్కు రూ.7,361 ధర పలికిన పత్తి.. బుధవారం రూ.7,435కు చేరడం గమ నార్హం. కాగా, కనిష్టంగా రూ.6,861, సగటు ధ ర రూ.7,235గా నమోదైందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 144 మంది రైతులు తీసుకొచ్చిన 558 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. బీఆర్ఎస్ నేతల ప్రచారం పాలకుర్తి(రామగుండం): బీఆర్ఎస్ నాయకు లు వివిధ గ్రామాల్లో బుధవారం పంచాయతీ ఎన్నికల ప్రచారం చేశారు. పాలకుర్తిలో ఆ పా ర్టీ బలపర్చిన మాదాసు స్వప్న–సతీశ్కు మద్దతుగా బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మాట్లాడుతూ, పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రతీకార్యకర్త కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘సిమ్స్’కు మరో 12 పీజీ సీట్లు
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలో పీజీ మెడికల్ కాలేజీగా గుర్తింపు పొందిన సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ)లో మరికొన్ని పీజీ కోర్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే నాలుగు విభాగాల్లో 16 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) మంజూరు చేసింది. తాజాగా మరోమూడు వి భాగాల్లో 12 సీట్లు కేటాయించాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ)కు సిమ్స్ యాజమా న్యం ఇటీవల దరఖాస్తు చేసింది. రెండు నెలల క్రితం 16 పీజీ సీట్లు.. సిమ్స్కు నాలుగు విభాగాల్లో 16 పీజీ సీట్లు మంజూరు చేస్తూ ఈ ఏడాది అక్టోబర్లో ఎన్ఎంసీ ఉత్వర్వులను జారీ చేసింది. ఇందులో ఎండీ(ఎమర్జెన్సీ మెడిసిన్), ఎంఎస్(ప్రసూతీ, గైనకాలజీ), ఎంఎస్(ఆర్థోపెడిక్స్), ఎండీ(బయో కెమెస్ట్రీ)లో నాలుగు చొప్పున పీజీ సీట్లకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఈ సీట్ల భర్తీకి అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మూడు విభాగాల్లో సీట్ల కోసం.. మరోమూడు విభాగాల్లో 12 పీజీ సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ యాజమాన్యం ఇటీవల డీఎంఈకి దరఖాస్తు చేసింది. మెడిసిన్, సర్జరీ, పీడియా ట్రిక్స్ విభాగాల్లో నాలుగు చొప్పున మొత్తం 12 పీజీ సీట్లు మంజూరు చేయాలని విన్నవించింది. త్వరలో ఎన్ఎంసీ బృందం తనిఖీ మెడికల్ కాలేజీ దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో నివేదికను డీఎంఈ ఉన్నతాధికారులు ఎన్ఎంసీ పరిశీలనకు పంపించనున్నారు. అయితే, కోర్సుల విభాగాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రొఫెసర్ల సంఖ్య, క్లినికల్ మెటీరియల్ తదితర వివరాలను పరిశీలించడానికి ఎన్ఎంసీ అధికారులు త్వరలోనే మెడికల్ కాలేజీని తనిఖీ చేయనున్నారు. వారు సంతృప్తి చెందేలా కాలేజీలో అవసరమైన సదుపాయాల కల్పనకు యాజమాన్యం ఇప్పటి నుంచే ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా దరఖాస్తు చేసిన మెడికల్ కాలేజీ యాజమాన్యం ఇప్పటికే 16 పీజీ సీట్లు మంజూరు చేసిన ఎన్ఎంసీ -
పంచింగ్ స్టార్ట్
జిల్లా మొదటి ఏకగ్రీవం ఎన్నికలు కరీంనగర్ 92 03 89 పెద్దపల్లి 99 04 95 సిరిసిల్ల 76 09 67 జగిత్యాల 122 04 118 మొత్తం 389 20 369సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పంచాయతీ ఎన్నికలు రసవత్తరస్థాయికి చేరుకున్నాయి. తొలి విడత పోలింగ్ ప్రచార గడువు ముగియడంతో ప్రలోభాలు ఊపందుకున్నాయి. మైకులు బంద్ కావడంతో నిన్న మొన్నటి వరకు హోరెత్తిన ప్రచారం మూగబోయింది. మందు.. విందుతో ఓటర్లను ఖుషీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 389 గ్రామాల్లో తొలివిడత ఎన్నికలు జరగాల్సి ఉండగా... వీటిలో 20 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడతలో 369గ్రామాల్లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. చాలా చోట్ల అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుల మధ్య పోటీ కనిపిస్తుండగా కొన్ని గ్రామాల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఎంత ఖర్చయినా సరే అనే రీతిలో ముందుకు సాగుతున్నారు. డబ్బులు లేకున్నా మిత్రులు, బంధువుల వద్ద తీసుకోవడమో.. లేదా అప్పు చేసేందుకు వెనకాడటం లేదు. ఆరున్నరేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా ప్రతి అభ్యర్థి ఏదో ఒక పార్టీకి అనుబంధంగానే బరిలోకి దిగుతున్నారు. తొలి విడతలో 369 జీపీలకు ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 389 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా... వీటిలో 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 369 పంచాయితీలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిత్యం మందు, విందుతో దావతుల్లో ముంచెత్తారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విందులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దావత్లకు వ్యవసాయ క్షేత్రాలు, పంట పొలాలు, రహస్య ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. మద్దతుదారులు చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. కొందరైతే ఓటుకు ఇంతని లెక్కలేసి డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో ఇళ్లకు నేరుగా మద్యాన్ని చేరవేస్తున్నట్లు సమాచారం. కొరవడిన నిఘా ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులను నిఘా విభాగం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపిండం లేదు. ఇదే అదనుగా భావించిన అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పరిశీలకులను నియమించినా పోటీదారులు ఖాతరు చేయడంలేదు. బహిరంగంగానే మద్యం, మందు పంపిణీ చేస్తూ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గ్రామాల్లో పోలీసుల నిఘా కనిపించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరీంనగర్, రామగుండం, జగిత్యాల, సిరిసిల్ల పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. తెరవెనక పంపిణీని పూర్తిస్థాయిలో ఆపలేకపోతున్నారన్న విమర్శలున్నాయి.మూడుదశల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. పోటీ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వారం పది రోజుల నుంచే మందు, విందుతో ముంచెత్తుతున్నారు. మహిళా సంఘాల వారీగా డబ్బులు, చీరలు పంచుతున్నారు. మొదటి విడత పోలింగ్కు ఒక రోజే గడువు ఉండడంతో ప్రలోభాల పర్వం కీలక దశకు చేరుకుంది. ఇంటింటికీ డబ్బులు పంచుతూ... మద్యం ఏరులై పారించేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్లో అందుబాటులో లేని వారికి యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తూ ఓట్లు రాబట్టుకునేందుకు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఘనంగా దీక్షా దివస్
గోదావరిఖని: దీక్షా దివస్ను స్థానిక ప్రధాన చౌరస్తా లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజర య్యారు. తెలంగాణ అమరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మూల విజయరెడ్డి, పాముకుంట్ల భాస్కర్, కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, గాధం విజయ, బాదే అంజలి, చెలకలపల్లి శ్రీనివాస్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మారుతి తదితరులు పాల్గొన్నారు. మంథనిలో.. మంథని/మంథనిరూరల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలకమలుపు తిరిగిన డిసెంబర్ 9న తెలంగాణ విజయ్ దివస్ను బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పూలమాలలు వేసి వేడుకలను నిర్వహించారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గిన అప్పటి కేంద్రప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని గుర్తుచేశారు. భూపాలపల్లి మాజీ జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కమాన్పూర్ మాజీ ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, నాయకులు తగరం శంకర్లాల్, రాజుగౌడ్, పుప్పా ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 24 పైసల పనికూడా చేయని ఎమ్మెల్యే.. మంత్రిగా మంథని ఎమ్మెల్యే 24 నెలల్లో 24 పైసల పనికూడా చేయలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూ కర్ ఆరోపించారు. అడవిసోమన్పల్లిలోని వంతెన ను ఆయన పరిశీలించి మాట్లాడారు. వంతెనకు ఒకవైపే.. అదికూడా సగం వరకు సున్నం వేసి మరోపక్క విస్మరించారని దుయ్యబట్టారు. పీవీ హయాంలో అడవిసోమన్పల్లి బ్రిడ్జి నిర్మించారని, ఆ తర్వాత ఒక్కటి కూడా నిర్మించలేదని, బీఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అనేక వంతెనలు, ప్రాజెక్టులు నిర్మించారని ఆయన గుర్తుచేశారు. -
ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక
పెద్దపల్లి: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ప్రతిబింబింపజేసేది తెలంగాణ తల్లి విగ్రహమని కలెక్టర్ కో య శ్రీహర్ష అన్నారు. అదనపు కలెక్టర్ వేణుతో కలి సి కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించి మాట్లాడారు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా డిసెంబర్ 9న కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తొలిసారి ప్రకటన చేసిందని కలెక్టర్ గుర్తుచేశారు. కలెక్టరేట్కు వచ్చేవారిని ఆకట్టుకునేలా విగ్రహ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లా పాలనాధికారి ప్రకాశ్, ఆర్ అండ్ బీ ఈఈ భావ్సింగ్ పాల్గొన్నారు. అవినీతిని అరికట్టాలి.. టోల్ఫ్రీ నంబరు 1064కు ఫోన్కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా తన కా ర్యాలయంలో విజిలెన్స్ వారోత్సవాల ప్రచార పోస్ట ర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. గడువులోగా సీఎమ్మార్ పూర్తిచేయాలి యాసంగి సీఎంఆర్ సరఫరాలో నాణ్యత ప్రమాణా లు పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సీఎమ్మార్ డెలివరీపై అధికారులు, రైస్ మిల్లర్లతో ఆయన సమీక్షించారు. నాణ్యమైన బియ్యాన్ని గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, మేనేజర్ శ్రీకాంత్, ఎఫ్ సీఐ డివిజనల్ మేనేజర్ రవిప్రకాశ్ పాల్గొన్నారు. అరవై ఏళ్ల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో కలెక్టర్ కోయ శ్రీహర్ష -
పకడ్బందీగా ఎన్నికలు
● అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని, ఇందుకోసం అధికారులకు శిక్షణ ఇచ్చామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. అర్హులందరూ ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 263 పంచాయతీలు, 2,432 వార్డులు ఉన్నాయని, అన్నింటా వెబ్కాస్టింగ్ నిర్వహిస్తామని, తొలివిడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించే 78 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని తెలిపారు. తొలిదశ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తిచేశామని, ఈనెల 11న మంథని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని 99 పంచాయతీలు, 896 వార్డులకు పోలింగ్ జరుగుతుందన్నారు. కలెక్టర్తో జరిపిన ఇంటర్వ్యూ వివరాలు..జిల్లాలో ఎన్ని విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు? కలెక్టర్ : జిల్లాలో మూడువిడతల్లో పోలింగ్ నిర్వహిస్తాం. తొలివిడత ఈనెల 11న నిర్వహిస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తిచేశాం. బ్యాలెట్ బాక్స్లు పరిశీలించాం. ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుంది? కలెక్టర్ : సర్పంచ్ ఎన్నికలు పూర్తికాగానే అదేరోజు మెజారిటీ వార్డు సభ్యుల అభిప్రాయం మేరకు ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఓటరు జాబితాలో మృతుల పేర్లు ఉన్నాయి? కలెక్టర్ : జూన్ రెండోతేదీ వరకు మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఈఆర్వో, ఆర్డీవో, తహసీల్దార్ అఖిలపక్ష సమావేశంలో పొరపాట్లు సరిచేశారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ ఎలా? కలెక్టర్ : పోలీస్ పహారాలో పోలింగ్ నిర్వహిస్తాం. ఇందుకోసం అనుసరించే విధానాలపై పోలీసు అధికారులతో ఇప్పటికే సమీక్షించాం. రెండు, మూడో విడత ఎన్నికలు? కలెక్టర్ : రెండోవిడతలో అంతర్గాం, ధర్మారం, జూలపల్లి, పాలకుర్తి మండలాల్లోని 73 పంచాయతీలు, 684 వార్డులు, మూడోవిడతలో ఎలిగేడు, ఓదెల, పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల్లోని 91 పంచాయతీల్లో 852 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తాం. -
అప్రెంటిస్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం
జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టులో కంప్యూటర్ ఆపరేటర్ – ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్ అప్రెంటిషిప్ కోసం దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. 2022, ఆ తర్వాత సంవత్సరంలో కంప్యూ టర్ ఆపరేటర్ – ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై, జిల్లాకు చెందిన వారే అర్హులు. ఈ నెల 1వ తేదీవరకు 18 ఏళ్లు నిండి, 24ఏళ్లకన్నా త క్కువ వయసు ఉండాలి. నిబంధనల ప్రకారం వ యసులో సడలింపు ఉంటుంది. మెట్రిక్యులేషన్ లే దా తత్సమాన విద్యార్హతలు ఉండాలి. ఎన్సీవీటి ద్వారా గుర్తింపు పొందిన ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్ – ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్ ఉత్తీర్ణులు కా వాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడి/ఈడబ్ల్యూఎస్ లకు రిజర్వేషన్ మార్గదర్శకాలు పాటిస్తారు. ఎన్టీపీ సీ ప్రభావిత ప్రాంతాల్లోని పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి, అర్హతగలవారు www.apprentic es hipindia.org పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. బయోడేటా ఫార్మాట్ను ఎన్టీపీసీ ఉద్యోగ వికాస కేంద్రంలో సేకరించాలి. పూర్తిచేసిన దరఖాస్తులను ఉద్యోగుల అభివృద్ధి కేంద్రంలోని డ్రాప్ బా క్స్లో వేయాలి. ఎస్సెస్సీ మెమో, ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్, ఆధార్, కుల ధృవీకరణపత్రం, హార్డ్కాపీలతో జతచేయాలి. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల పిల్లలు గేట్పాస్తోపాటు భూ నిర్వాసిత పత్రాలను జత చేయాలి. దరఖాస్తుల దాఖలుకు ఈనెల 22వ తేదీ వరకు గడువు ఉందని అధికారులు వివరించారు. రేపు గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు గోదావరిఖని: స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 11న గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తామని పాస్టర్లు మహిపాల్రెడ్డి, ఐజయ్య, డిలై ట్, సాల్మన్ తెలిపారు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహిస్తామన్నారు. నాయకులు జిమ్మిబాబు, శ్రీనివాస్, రవిపాల్, ప్రహర్షి, గాబ్రియల్, థామస్, గంట భబిత తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఆస్పత్రి తనిఖీ గోదావరిఖని: రక్షణ కమిటీ బృందం మంగళవారం స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసింది. బృందం కన్వీనర్ డాక్టర్ రమేశ్బాబు ఆధ్వర్యంలో పీఎంఈ సెక్షన్ ఉద్యోగుల రికార్డులను పరిశీలించింది. ప్రతిభ కనబరచిన సిబ్బందికి ప్రోత్సాహక బ హుమతులు అందజేసింది. ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
లోపాలు తలెత్తకుండా చర్యలు
కోల్సిటీ(రామగుండం): నగరంలో పారిశుధ్యం, వీధిదీపాల నిర్వహణ, తాగునీటి సరఫ రా తదితర వసతుల కల్పనలో లోపాలు తలెత్తకుండా వార్డు ఆఫీసర్లు సమర్ధవంతంగా పర్యవేక్షించాలని కమిషనర్ అరుణశ్రీ ఆదేశించారు. తన కార్యాలయంలో మంగళవారం వార్డు అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ని ర్ణీత సమయంలో తాగునీరు విడుదల చేయడం, లీకేజీ అరికట్టాలని, 15రోజులకోసారి వా టర్ ట్యాంకులు శుభ్రం చేసేలా పర్యవేక్షించాల ని అన్నారు. వీధిదీపాలు వెలిగేలా చూడాలని, కొత్త స్తంభాలకు లైట్లు బిగించాలని, ఆస్తిప న్ను, నల్లా బిల్లులు వసూలు చేయాలని సూ చించారు. ఇంకుడుగుంతల ఫొటోలు, నల్లా వినియోగదారుల వివరాలు ఆన్లైన్ అప్లోడ్ చేయాలని అన్నారు. అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, కార్యదర్శి ఉమామహేశ్వర్రావు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీఎన్ఎస్ 163 యాక్ట్ అమలు గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఎన్నిక లు సజావుగా నిర్వహించేందుకు 163 బీఎన్ఎస్ ఎ యాక్ట్ అమలు చేస్తు న్నామని సీపీ అంబర్ కిశోర్ ఝా మంగళవా రం తెలిపారు. పెద్దపల్లి జోన్లోని కాల్వశ్రీరాంపూర్, కమాన్పూర్, రామగిరి, మంథని, ము త్తారం, మంచిర్యాల జోన్లోని దండేపల్లి, జ న్నారం, లక్సెట్టిపేట మండలాల్లో తొలివిడత లో ఈనెల 11న పోలింగ్ జరుగుతుందన్నారు. ఈనెల 9వ తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లడించే వరకూ సెక్షన్ 163 అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల వాతావరణం దెబ్బతినేలా వ్య వహరిస్తే చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నా రు. ఊరేగింపులు, సమావేశాలు అనుమతిలేకుండా చేపట్టకూడదని తెలిపారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన కమాన్పూర్(మంథని): స్థానిక జెడ్పీ హైస్కూ ల్లోని పోలింగ్ కేంద్రాన్ని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి మంగళవారం పరిశీలించారు. పోలీస్ సి బ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట గోదావరిఖని ఏసీపీ రమేశ్, టూటౌన్ సీఐ ప్రసాదరావు, ఎస్సై ప్రసాద్, ఎంపీడీవో ప్రియాంక, ఎంపీవో తదితరులు ఉన్నారు. పోలీసుల కవాతు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): స్థానిక జెడ్పీ హై స్కూల్లోని పోలింగ్ కేంద్రాన్ని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. తొలివిడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే మండలం కావడంతో స్థానిక అంబేడ్కర్ చౌ రస్తాలో పోలీసుల కవాతు నిర్వహించారు. పో లింగ్కు పకడ్బందీ బందోబస్తు చేపడతామని ఆయన తెలిపారు. ఎస్సై వెంకటేశ్, ఏఎస్సై నీలిమ, సిబ్బంది ఉన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలి కమాన్పూర్(మంథని): ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుఖప్రసవాల సంఖ్య పెంచాలని డీఎంహెచ్వో వాణిశ్రీ సూచించారు. స్థానిక పీహెచ్సీని మంగళవారం ఆమె సందర్శించారు. కమాన్పూర్, బేగంపేట పీహెచ్సీ వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లతో ప్రసవాలపై స మీక్షించారు. గర్భిణులు 102 వాహనాలను వి నియోగించుకోవాలని ఆమె సూచించారు. ప్రతీగ్రామంలో జ్వరాల సర్వే చేయాలని, శుక్రవారం డ్రైడే పాటించాలని అన్నారు. డాక్టర్లు రాజమౌళి, రవిసింగ్, శ్రీరాములు, సుధాకర్రెడ్డి, సల్మాబేగం, ప్రదీప్, డేటా అధికారి మ హేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్నల్స్ వాయిదా
సాక్షిప్రతినిధి,కరీంనగర్: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు రెండు రోజులుగా చేపట్టిన ఆందోళన ఎట్టకేలకు సద్దుమణిగింది. వర్సిటీ ఉన్నతాధికారుల తీరుతో తాము నష్టపోతున్నామంటున్న విద్యార్థుల డిమాండ్లపై వీసీ సానుకూలంగా స్పందించడంతో శాంతించారు. ఐదు డిమాండ్లతో మొదలైన ఆందోళనలో రెండు ప్రధానమైనవి ఆమోదించడం, మిగిలినవాటిపై హామీ దక్కకపోవడంతో విద్యార్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాము ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా.. ఇంటర్నల్స్, 3వ సెమిస్టర్ పరీక్షల తేదీలను మార్చాలని కోరుతూ చేస్తూ చేపట్టిన ఆందోళన మంగళవారం రెండో రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ శాతవాహన యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో తొలుత సైన్స్ కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. అక్కడ కాసేపు రిజిస్ట్రార్తో మాట్లాడారు. రిజిస్ట్రార్ నుంచి స్పందన లేకపోయే సరికి డప్పులు కొడుతూ అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట మరోసారి ధర్నాకు పూనుకున్నారు. వీసీ, రిజిస్ట్రార్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ విద్యార్థులను కళాశాలల ప్రిన్సిపాల్స్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. వీసీ వచ్చి సమస్యను పరిష్కరించేంత వరకు కదిలేది లేదంటూ బైఠాయించడంతో వీసీ ఉమేశ్ కుమార్ విద్యార్థులను చర్చలకు ఆహ్వానించారు. సంక్రాంతి ముందు కొన్ని.. తరువాత కొన్ని విద్యార్థుల ఆందోళనతో చర్చలకు దిగొచ్చిన వీసీ సుమారు గంటన్నర సేపు వారితో చర్చలు జరిపారు. వీసీతోపాటు రిజిస్ట్రార్ రవికుమార్, ఓఎస్డీ హరికాంత్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత చర్చల్లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇంటర్నల్ పరీక్షలు వాయిదా వేసేందుకు అంగీకారం తెలిపారు. 3వ సెమిస్టర్ పరీక్షలను సంక్రాంతి పండుగకు ముందు కొన్ని, తరువాత కొన్ని నిర్వహించేలా షెడ్యూల్లో మార్పులు జరిపేందుకు సరే అన్నారు. నెట్, సెట్కు సన్నద్ధమవుతున్న వారికి సెమిస్టర్ పరీక్షలు అవే తేదీల్లో వస్తుండటాన్ని విద్యార్థులు వీసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నెట్, సెట్ రాసే విద్యార్థులకు వీలుగా షెడ్యుల్లో మార్పులు చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. లైబ్రరీపై పట్టు యూనివర్సిటీలో 24 గంటల లైబ్రరీ సదుపాయంపై వీసీ పట్టు వీడలేదు. మధ్యాహ్నం తరువాతే లైబ్రరీలోకి అనుమతిస్తామని, కావాల్సిన వారు ఎన్ని పుస్తకాలైనా తీసుకెళ్లి చదువుకోవచ్చని స్పష్టంచేశారు. అంతకుముందు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో 24 గంటలు లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని, అలాంటి వెసులుబాటును శాతవాహన కల్పించాలని కోరారు. యూనివర్సిటీలోని మెస్ విషయంలో కేర్ టేకర్స్ పట్టించుకోవడం లేదని, మెస్లో సరిపడా సిబ్బంది లేరన్న విద్యార్థుల వాదనను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఎల్ఎల్బీ విద్యార్థులకు వెంటనే హాస్టల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేసినా దానిని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విద్యార్థులు లైబ్రరీ, లా విద్యార్థులకు హాస్టల్ విషయంలో తీవ్ర నిరాశకు గురయ్యారు.యుజీసీ నెట్, సెట్ పరీక్షలకు శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. అందుకే పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 5 నుంచి నిర్వహించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. – వీసీ ఉమేశ్ కుమార్ -
నిరంతర తనిఖీలు
పెద్దపల్లి: జిల్లాలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. వారితోపాటు ఫ్లయింగ్ సర్వేలెన్స్ టీం, స్టార్టింగ్ సర్వేలైన్స్ బృందాలు నిరంతరం తనిఖీ లు చేస్తున్నాయి. మద్యం, నగదు అక్రమ రవాణా ను నిలువరించేందుకు యత్నిస్తున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా కట్టుదిట్టమైన చర్య లు తీసుకుంటున్నాయి. చెక్పోస్టుల ఏర్పాటు మండలాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి, గోదావరిఖని, మంథని, గుంపుల సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటుచేసిన ఉన్నతాధికారులు.. 24 గంటలపాటు నిఘా పెడుతున్నా రు. వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తున్నారు. సీసీ కెమెరాలతోనూ నిఘా ఉంచుతున్నారు. ఎస్సై నుంచి పోలీస్ కమిషనర్ వరకు అన్నిస్థాయిల అధికారులు చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఉద్యోగులు అప్ర మత్తంగా ఉండాలని, ఏ వాహనాన్ని కూడా వదిలిపెట్టకుండా తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. రూ.50 వేలకన్నా ఎక్కువ నగదు తీసుకెళ్లవద్దు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. రూ.50 వేల నగదు మాత్రమే వెంట తీసుకువెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ తీసుకువెళ్తే అధికారులు సీజ్ చేస్తారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాక తగిన ఆధారాలు చూపిస్తే వదిలిపెడతారు. రూ.10,000 విలువైన ఒకేరకం వస్తుసామగ్రి రవాణా చేసినా వివరణ ఇవ్వాల్సిందే. గంపగుత్తగా చీరలు, మద్యం వంటివి తీసుకెళ్లినా అధికారులు ఆధారాలు అడుగుతారు. ఫిర్యాదులు చేసే అవకాశం మండలానికి ఒకటి చొప్పున జిల్లాలోని 13 మండలాలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనలు, నియమావళి అమలు చేయకపోవడం వంటి ఫిర్యాదులపై ఈ బృందాలు తక్షణం స్పందిస్తాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీ స్ అధికారులు నివేదిక తయారు చేశారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. తొలివిడతలో ఈనెల 11న కాల్వశ్రీరాంపూర్, రామగిరి, మంథని, ముత్తారం, కమాన్పూర్ మండలాలు, రెండోవిడత(ఈనెల 14న)లో పాలకుర్తి అంతర్గాం, ధర్మారం, జూలపల్లిలో, మూడో విడత(ఈనెల 17న)లో సు ల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలాల లోని పంచాయతీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. సరిహద్దుల్లో చెక్పోస్టులు నిత్యం సోదాలు చేస్తున్న వైనం రంగంలోకి పోలీసులు ప్రత్యేక అధికారులు కూడా.. -
విద్యార్థులకు అభినందన
పెద్దపల్లిరూరల్: జిల్లా ఉపాధికల్పనాధికారి కా ర్యాలయం, టాస్క్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వ హించిన జాబ్మేళాలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన 8 మంది విద్యార్థులు పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. దీంతో ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య సోమవారం విద్యార్థులను అభినందించారు. టాస్క్ కో ఆర్డినేటర్ మారుతి, కౌసల్య తదితరులతో కలిసి నియామక పత్రాలను అందించారు. విద్యార్థుల్లో ప్రతిభానైపుణ్యాలను పెంపొందించేలా టాస్క్ నిర్వాహకులు అందిస్తున్న సేవలను ప్రిన్సిపాల్ ప్రశంసించారు. అధ్యాపకులు పురుషోత్తం, నారాయణ తదితరులు ఉన్నారు. నిబంధనలు పాటించాలి పెద్దపల్లిరూరల్: వాహనదారులు రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయ ని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్లో సోమవారం వాహనా ల తనిఖీ కోసం స్పెషల్డ్రైవ్ నిర్వహించారు. మద్యం, గంజాయి లాంటి మత్తులో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారకులవుతున్నారన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలను ఇస్తే తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తా మని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణపెద్దపల్లిరూరల్/కాల్వశ్రీరాంపూర్/ఓదెల: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని డీసీపీ భూ క్యా రాంరెడ్డి అన్నారు. పెద్దపల్లి రూరల్ పోలీస్స్టేషన్ను ఆయన సోమవారం సందర్శించారు. కాల్వశ్రీరాంపవూర్లోని పలు గ్రామాలతోపా టు ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో ఆ యన పర్యటించారు. ఏసీపీ కృష్ణ, సీఐలు ప్రవీణ్కుమార్, సుబ్బారెడ్డి, ఎస్సైలు మల్లేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. స్వేచ్ఛగా ఓటు వేయాలిపాలకుర్తి: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని బసంత్నగర్ ఎస్సై శ్రీధర్ సూచించారు. పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లిలో సోమవారం అభ్యర్థులు, స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప లు సూచనలిచ్చారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహ క్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. హెడ్కానిస్టేబుల్ నరేందర్గౌడ్, సిబ్బంది కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు వద్దు పాలకుర్తి(రామగుండం): బాల్య వివాహాల ని ర్మూలన అందరి బాధ్యతని జెండర్ స్పెషలిస్ట్ సుచరిత అన్నారు. బసంత్నగర్, రాణాపూర్ గ్రామాల్లో సోమవారం జిల్లా మహిళా సాధికారిత ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూల నపై అవగాహన కల్పించారు. ఏపీఎం భా గ్యమ్మ, సీసీ రాంబాయి, ఎంఎస్ ఎంఈ కౌన్సెలర్ విజయ తదితరులు పాల్గొన్నారు. నేడు ఉపసంహరణకు గడువు ● అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పెద్దపల్లిరూరల్: పంచాయతీ చివరి విడత స ర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటాపోటీ గా నామినేషన్లు దాఖలు కాగా.. వారిలో కొందరిని తమకు అనుకూలంగా ఉపసంహరించుకోవాలంటూ సాగిన బుజ్జగింపులకు మంగళవా రం తెరపడనుంది. నామినేషన్ల ఉపసంహర ణకు మంగళవారం మధ్యాహ్నం మూడుగంటల వరకే గడువు ఉంది. ఈలోగా ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు అభ్యర్థులు ఉపసంహరించుకుంటారో తేలనుంది. అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత ఎన్నికల రణ రంగంలో మి గిలిన అభ్యర్థులందరికీ మంగళవారమే గుర్తు లు కేటాయిస్తారు. ఇక బుధవారం నుంచి అ భ్యర్థులు తమ గుర్తుతో ఓటర్ల వద్దకు వెళ్లి అభ్యర్థిస్తూ ప్రచారం చేయనున్నారు. -
కిక్కులో పల్లెలు
పొలం పనులకు వెళ్లకముందే తమ అనుచరులతో కలిసి పొద్దున్నే ఇంటింటి ప్రచారం చేస్తున్న అభ్యర్థులు.. ఓటర్లకు టీలు, టిఫిన్లు అందిస్తున్నారు. దూరప్రాంతంలోని వారిని మధ్యాహ్నం ఫోన్లో సంప్రదిస్తున్నారు. పొలం పనులు ముగించుకొని వచ్చాక సాయంత్రం మరోసారి కలుస్తున్నారు. రోజంతా తమతో తిరిగిన అనుచురులకు చీకటిపడగానే క్వార్టర్ బాటిల్ అప్పగిస్తున్నారు. రోజుకో కులసంఘం పెద్దతో దావత్ ఏర్పాటు చేయించి చల్లబరుస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటినుంచి మద్యం ఏరులైపారుతుండడంతో పల్లెలు మద్యం కిక్కులో తూలుతున్నాయి. రోజూ ఛీప్ లిక్కర్ తాగేవాళ్లు కూడా ఎన్నిక ల సందర్భంగా బ్రాండ్ మార్చుతున్నారు. దీంతో అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడవుతోంది. సాక్షి పెద్దపల్లి: పల్లెల్లో ఎక్కడచూసినా ఓట్ల పండుగ సంద డి చేస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా జిల్లాలో బెల్ట్షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న పల్లె, పట్నం అనే తేడా లేకుండా బెల్ట్షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే బెల్ట్షాపులపై అధికారులు ఉక్కుపాదం మోపుతారు. కానీ, కోడ్ అమలులోకి వచ్చి పదిరోజులు గడిచినా సంబంధిత శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నా యి. యువతకు కాటన్ల కొద్దీ బీర్లు, వృద్ధులు, పె ద్దమనుషులకు మండువాల్లో తెల్లకల్లు పంపిణీ చేస్తున్నారు. రాత్రివేళ కులసంఘాల పెద్దలతో దావత్లు జోరుగా సాగిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడడంలేదు.. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారం కన్నా ప్రలోభాలపైనే ఆసక్తి చూపుతున్నారు. ప్రచారానికి ఖర్చు చేయడంకన్నా ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు ఎంతవరకై నా ఖర్చు చేయడానికి వెనుకా డడంలేదు. గతంలో ఎన్నికలకు ఒకరోజు ముందు క్వార్టర్ లేదా హాఫ్ బాటిల్ లిక్కర్ను ఓటర్ల ఇళ్లకు పంపించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపో యింది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఊరురా మందు పార్టీలు మొదలయ్యాయి. ఎలగైనా గెలవాలనే కసితో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చే సుకునేందుకు పోటాపోటీగా లిక్కర్ కొనుగోలుచేసి పంచుతున్నారు. దీనికితోడు ప్రచారంలో పాల్గొన్న వారందరికీ చుక్క, ముక్కతో విందులు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం పంపిణీకి గ్రామంలోని బెల్ట్షాపుల వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. మ రికొందరు నేరుగా వైన్స్ నుంచి పెద్దమొత్తంలో కొ నుగోలు చేసి లిక్కర్ను తమ అనుచరుల వద్ద స్టాక్ పెట్టించి రాత్రిపూట పంపిణీ చేయిస్తున్నారు. బహిరంగంగానే తరలింపు రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తూ నగదు, తదితరాలను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తే సీజ్చేసే అధికార యంత్రాంగం.. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా అవుతున్నా.. ఎందుకు ఫోకస్ చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పరిమితంగానే మద్యం తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ల నుంచి మద్యం, బీర్లు బహిరంగంగానే మారుమూల ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు తరలిస్తూ 24గంటలు మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. అయినా.. అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏరులై పారుతున్న మద్యం పెద్దమనుషులకు దావత్లు అనుచరులకు విస్కీ క్వార్టర్లు గ్రామాల్లో యథేచ్ఛగా బెల్ట్దందా కోడ్ అమలులో ఉన్నా అతిక్రమణ -
పకడ్బందీగా ఎన్నికల విధులు
పెద్దపల్లి: రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వర్తించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు నర్సింహారెడ్డితో కలిసి తన కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సోమవారం రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 9న రెండోవిడత, 12న మూడోవిడత ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. పోలింగ్ రోజే ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ముగిసేలా చర్యలు తీ సుకోవాలని సూచించారు. 50శాతం కన్నా ఎక్కువ వార్డుసభ్యులు అందుబాటులో ఉండేలా సమాచారం అందించాలని ఆయన అన్నారు. కార్యక్ర మంలో జెడ్పీసీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, డీఈవో శారద తదితరులు పాల్గొన్నారు. 9న ఎన్నికల సిబ్బందికి శిక్షణ పాలకుర్తి/జూలపల్లి: పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఈనెల 9న నిర్వహించే శిక్షణకు ఎన్నికల సిబ్బంది సకాలంలో హాజరు కావాలని, ఎన్నికల వి ధులపై అధికారులు సంపూర్ణ అవగాహన కల్పించా లన్నారు. పాలకుర్తి, జూలపల్లి ఎంపీడీవో కార్యాలయాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలిచ్చారు. కార్య క్రమంలో ఎంపీడీవోలు శశికళ, పద్మజ, ఎంపీవోలు శేషయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. సిబ్బందికి కలెక్టర్ శ్రీహర్ష సూచన -
రక్షణే ప్రథమం.. తర్వాతే ఉత్పత్తి లక్ష్యం
గోదావరిఖని: సింగరేణిలో 56వ రక్షణ పక్షోత్సవాలు ప్రారంభమయ్యాయి. భూగర్భగనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లు, సీహెచ్పీల్లో వేర్వేరుగా పోటాపోటీగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒ క్కోగనిపై అన్ని అంశాలను కమిటీలు క్షుణ్ణంగా తని ఖీ చేస్తున్నాయి. నెలరోజులుగా ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నారు. తొలుత ఆర్జీ–1 ఏరియాలోని జీ డీకే–5 ఓసీపీలో రక్షణ పక్షోత్సవాలు నిర్వహించా రు. ముఖ్య అతిథిగా కన్వీనర్ లక్ష్మీపతిగౌడ్, ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, రీజియన్ సేఫ్టీ జీఎం మధు సూదన్ హాజరై రక్షణ జెండా ఆవిష్కరించారు. ఉద్యోగులతో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతీఒక్కరు రక్షణలో ముందుండాలన్నారు. నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తేనే సంస్థకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు. ప్రతీఉద్యోగి జీరో యాక్సిడెంట్ కోసం కృషి చేయాలన్నారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేశ్, మేనేజర్ రమేశ్బాబు, అనిల్గబాలే, పొనుగోటి శ్రీనివాస్ పాల్గొన్నారు. రక్షణ కమిటీ తనిఖీ జీడీకే–1,3 గనిని కమిటీ కన్వీనర్ ఆర్.విజయప్రసాద్ బృందం సోమవారం తనిఖీ చేసింది. రక్షణ చర్యలను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కార్మికులకు వివరించారు. భూగర్భగనిలోని పని స్థలాలకు వెళ్లి రక్షణ జాగ్రత్తలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సాయిప్రసాద్, గని ఏజెంట్ రమేశ్, డీజీఎం బి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో ప్రారంభమైన రక్షణ పక్షోత్సవాలు -
ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకోవాలి
కోల్సిటీ(రామగుండం): స్వశక్తి మహిళలు అమృత్ మిత్రలుగా పనిచేసి ఆర్థికస్థితి మెరుగు పర్చుకోవా లని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అ రుణశ్రీ సూచించార. అమృత్ మిత్రలతో వివిధ అంశాలపై తన కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. ఆసక్తి ఉన్నవారిని గుర్తించి నీటి నాణ్యత ప రీక్ష, ఉద్యాన వనాల నిర్వహణ తదితర పనులు అప్పగించి, పనిగంటల ఆధారంగా వేతనం చెల్లిస్తామన్నారు. సుమారు రూ.1.20 లక్షల విలువైన పనులను అమృత్ మిత్రల ద్వారా చేపడతామని తెలిపారు. అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, కార్యదర్శి ఉమామహేశ్వర్రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షాభాజ్, అసిస్టెంట్ ఇంజినీర్ తేజస్విని, సూపరింటెండెంట్ శ్రీనివాస్, మెప్మా టీఎంసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ -
చెరువంతా తామర
తామరతీగ చెరువును ముంచెత్తింది. నిత్యం జలకళతో సందర్శకులను ఆకట్టుకునే ఎల్లమ్మ చెరువు(మినీ ట్యాంక్ బండ్) తామరతీగతో నిండిపోయింది. సూర్యోదయం, సూర్యాస్తమయం సందర్భంగా సందర్శకులు పెద్దసంఖ్యలో చెరువు వాతావరణం ఆస్వాదించేందుకు వ స్తుంటారు. వీరిని దృష్టిలో పెట్టుకున్న పర్యాటక శాఖ అధికారులు బో ట్లు తీసుకొచ్చి బోటింగ్ సౌకర్యం కల్పించారు. కొద్దిరోజులు బాగానే సాగినా.. ఆ తర్వాత తామర అవరోధంగా మారింది. స్పందించిన అధికారులు.. ఇటీవల తీగలు తొలగించేందుకు యత్నించారు. కొన్నిబోట్లను చెరువులోకి పంపించారు. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ.. తామరతీగ అలాగే ఉండిపోయింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
రామగుండంలో విజిలెన్స్ దాడులు
కోల్సిటీ(రామగుండం): విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం రామగుండం నగర పాలక కార్యాలయంపై ఆకస్మికంగా దాడులు చేశారు. నలుగురు అధికారులు ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ తదితర విభాగాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అధికారులు, సిబ్బంది హాజరు హాజరు పట్టికను పరిశీలించి జిరాక్స్ తీసుకున్నారు. అనధికార నిర్మాణాలపై అనుమతులు, ఆస్తిపన్ను, కొలత పుస్తకాలు, టెండర్ ప్రక్రియలో లోపాలు, శానిటేషన్లో డీజిల్ వినియోగం నిర్వహ ణ తదితర అంశాలపై ఆరా తీశారు. నిధులు, బిల్లు లు, టెండర్లు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, పనుల్లో నాణ్యత వంటి అంశాలను పరిశీలించారు. బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించారు. నిర్వహణ తీరు పై అధికారును ప్రశ్నించి సమాధానాలు తెలుసుకున్నారు. డివిజన్లలో పనిచేస్తున్న కార్మికులు, డ్రైవర్లతో నేరుగా మాట్లాడారు. విజిలెన్స్ దాడులతో అధికారులు, ఉద్యోగులు హడలెత్తిపోయారు. రికార్డుల జిరాక్స్ స్వాధీనం హడలెత్తిన బల్దియా ఉద్యోగులు -
తగ్గిన ధాన్యం దిగుబడి
ఈ రైతుపేరు ఎల్లయ్యగౌడ్. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి. తనకున్న ఎకరంలో వరి వేసిండు. ఏటా 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈసారి పది క్వింటాళ్లు కూడా రాలేదు. సమయానుకూలంగా లేని అధిక వర్షాలకు తోడు దోమపోటుతో పంట సరిగా ఎదగలేదు. చివరకు చైన్మిషన్తో వరి కోయడంతో ఖర్చు మరింత పెరిగింది. ఇది ఈ ఒక్క రైతుకు ఎదురైన సమస్యేకాదు.. జిల్లాలో చాలామంది అన్నదాతలదీ.. పెద్దపల్లి: జిల్లాలో ఈసారి ధాన్యం దిగుబడి గణ నీయంగా తగ్గిందని అన్నదాతలు వాపోతున్నారు. ఒక్కో రైతుకు విస్తీర్ణాన్ని బట్టి ఎనిమిది నుంచి కనీసం పది క్వింటాళ్ల వరకు ధాన్యం తగ్గిందని అంటున్నారు. పంట ప్రారంభంలో ఆశించిన స్థాయిలో కురవని వానలు.. పంట చేతికి వచ్చే సమయంలో ఏకధాటిగా, అధిక వర్షాలు కురవడంతో పంట దెబ్బతిన్నదంటున్నారు. వర్షాలతో పంటకు దోమపోటు ఆశించగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. పెరిగిన వరికోత యంత్రం అద్దె.. వరి పొలాలు తడిగా ఉండడంతో సాధారణ వరికోత యంత్రం పనిచేయడం లేదు. కేవలం చైన్హార్వెసర్లతోనే వరిపైరు కోయాల్సి వస్తోంది. సాధారణ హార్వెస్టర్ గంటకు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు అద్దె ఉంటే.. చైన్హార్వెస్టర్కు ఎకరాకు రూ.4,000 – రూ.4,500 వరకు చెల్లించా ల్సి వస్తోంది. ఇది రైతులకు భారంగా మారుతోంది. ధాన్యాన్ని మార్కెట్ లేదా, ఇళ్లకు చేరవేసేయడానికి ట్రాక్టర్ అద్దె రూ.500 చెల్లించాల్సి వస్తోంది. -
ముక్కిపోతున్న దొడ్డుబియ్యం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పౌరసరఫరా గోదాములు, రేషన్ డీలర్ల వద్ద దాదాపుగా 3వేల క్వింటాళ్ల మేర దొడ్డుబియ్యం నిల్వలున్నాయి. ఏడాది కాలంగా వాటిని వెనక్కి తీసుకోని కారణంగా బియ్యం తుట్టెలు కట్టి.. పురుగులు పట్టాయి. జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని సివిల్ సప్లయి గోదాముల్లో దాదాపుగా వెయ్యి క్వింటాళ్ల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉండొచ్చని అంచనా. అలాగే జిల్లాలోని 14 మండలాల్లో ఉన్న 413 రేషన్ దుకాణాల్లో మరో 2వేల క్వింటాళ్ల మేర నిల్వలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈఏడాది ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ తెల్లరంగు రేషన్కార్డులున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో అప్పటికే గోదాములు, డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డుబియ్యం అలాగే నిల్వ ఉన్నాయి. ఆ దొడ్డురకం బియ్యం ముక్కపట్టి పాడవుతున్నాయి.రేషన్ దుకాణంలో ముక్కి తుట్టె పట్టిన దొడ్డు రకం రేషన్ బియ్యంఈనెలాఖరుకల్లా తరలిస్తాం దొడ్డురకం బియ్యం నిల్వలతో ఇబ్బందులున్న మాట వాస్తవమే. తుట్టెకట్టి పురుగుపడుతున్నట్టు డీలర్లు మా దృష్టికి తెచ్చారు. వాటిని తరలించేందుకు టెండర్లు నిర్వహించాం. ఈలోగా పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచింది. ఎన్నికలు పూర్తికాగానే దొడ్డుబియ్యం తరలించేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీకాంత్రెడ్డి, సివిల్సప్లయ్ మేనేజర్, పెద్దపల్లి -
రామగుండంలో రూ.కోటితో అంబేడ్కర్ పార్క్
గోదావరిఖని: గోదావరిఖని పట్టణ సుందరీకరణ కోసం రూ.కోటితో అంబేడ్కర్ పార్క్ను ని ర్మిస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రా జ్ఠాకూర్ అన్నారు. ఆదివారం డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మించబోతున్న అంబేడ్కర్ పార్క్ స్థలాన్ని ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్తో పరి శీలించారు. పార్క్ సుందరీకరణ, అందాల అభివృద్ధి, ల్యాండ్స్కేప్, లైటింగ్, పాదదారులు వంటి కీలక పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో రామగుండంలో అత్యద్భుతంగా రూపుదిద్దుకోబోతోందన్నారు. ఎమ్మె ల్యే వెంట సింగరేణి శ్రీనన్న, నాయకులు దీటి బాలరాజు, మహంకాళి స్వామి, ఎండీ ముస్తఫా, కోదండరామాలయం చైర్మన్ గట్ల రమేశ్, జిల్లా అధికార ప్రతినిధి సన్నీ, సోషల్ మీడియా నాయకులు ధూళికట్ట సతీశ్ తదితరులున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం పెద్దపల్లి: క్రీడాకారులను ప్రోత్సహించడమే బీజేపీ లక్ష్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న క్రికెట్ పోటీల ముగింపు ఉత్సవాలకు ఆదివా రం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పెద్దపల్లి–గోదావరిఖని జట్ల మధ్య జరిగిన టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరగా సాగింది. పెద్దపల్లి జట్టు విజేతగా నిలిచింది. విజేత జట్టుకు రూ.50వేలు, రన్నరప్ జట్టుకు రూ.25 వేల నగ దు పారితోషకంతో పాటు ట్రోఫీ అందించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్రెడ్డి, మిట్టపల్లి ప్రవీన్కుమార్, మహేందర్, దిలీప్, శివంగారి సతీశ్, సతీశ్సింగ్, గౌస్ పాషా, శివంగారి రాజేశ్, దేవనంది శ్రావన్, సందీప్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆరు రైళ్లు.. నలభై నిమిషాలుఓదెల: కాజీపేట్–బల్లార్షా సెక్షన్ల మధ్యలో కొలనూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని లెవల్ క్రాసింగ్ గేట్ మీదుగా ఆదివారం ఆరు రైళ్లు అప్ అండ్ డౌన్ వైపు వరుసగా వెళ్లడంతో 40 నిమిషాల పాటు వాహనాలు ఎక్కడికక్కడే కిలోమీటర్ వరకు నిలిచిపోయాయి. సుల్తానాబాద్, ఓదెల, కా ల్వశ్రీరాంపూర్లకు వెళ్లే ప్రయాణికులు నరకయాతనపడ్డారు. రైల్వే శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
చలి.. గుండె అలజడి
కరీంనగర్: జిల్లాను చలి వణికిస్తోంది. గజగజ వణికే చలితో శ్వాసకోశ, చర్మవ్యాధులతో పాటు హార్ట్ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్లు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అధిక చలితో రక్తనాళాలు కుచించుకుపోయి రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడడంతో హార్ట్ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మారిన జీవనశైలిలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. షుగర్, బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు, కేన్సర్, టీబీ తదితర వ్యాధులతో బాధపడే వారు మరింత జాగ్రత్త తీసుకోవాలంటున్నారు. గుండెపోటుకు చలి ఒక కారణమైనప్పటికీ ఇతర కారణాలు ఉన్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్, హైబీపీ, అదుపులో లేని షుగర్, చిన్నప్పటి నుంచే గుండె సంబంధ సమస్యలు ఉండే వారు హార్ట్ఎటాక్కు గురవుతారు. మామూలు రోజుల్లో కన్నా చలికాలంలో హార్ట్ ఎటాక్లు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో గుండె సమస్యలు చలి ఎక్కువగా ఉన్నప్పుడు రక్త నాళాలు కుచించుకుంటాయి. దీంతో బీపీ పెరుగుతుంది. గుండె మరింత శక్తిగా పనిచేయాల్సి వస్తుంది. ఇది గుండె వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. చలిలో రక్తం కొంచెం మందంగా మారి రక్త గడ్డలు (క్లాట్స్) ఏర్పడే అవకాశం పెరుగుతుంది. దీంతో హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. చలితో శరీరం వేడిగా ఉంచేందుకు ఎక్కువ కేలరీలు, ఎక్కువ ఆక్సిజన్ అవసరం పడుతుంది. దీంతో గుండైపె భారం పెరుగుతుంది. జలుబు, ఫ్లూ, శ్వాస సమస్యలు పెరిగి గుండె సంబంధిత సమస్యల్ని మరింత తీవ్రతరం చేస్తాయి. చలికాలంలో వ్యాయామం తగ్గిపోవడం, బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చలికాలంలో రక్తపోటు సాధారణంగా పెరుగుతుంది. హై బీపీతో హార్ట్ ఎటాక్ ప్రమాదం ఉంటుంది. గుండెపోటు ఇలా గుండెకు ప్రధానంగా మూడు దమనుల ద్వారా రక్తసరఫరా జరుగుతుంది. వీటిలో ఏ రక్తనాళం మూసుకుపోయినా గుండె కండరాలకు అందాల్సిన రక్తం అందక గుండె పోటు వస్తుంది. ఇలాంటప్పుడు సమయానికి హాస్పిటల్కు తీసుకెళ్తే బాధితులను బతికించేందుకు అవకాశముంటుంది. కార్డియాక్ అరెస్ట్ జరిగిన తర్వాత హాస్పిటల్కు తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో... సీపీఆర్ ప్రక్రియపై అవగాహన ఉన్నవారు సీపీఆర్ చేయడం కూడా అంతే ముఖ్యం. ‘చొప్పదండి ప్రాంతానికి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి ఈనెల 3న వేకువజామున హఠాత్తుగా గుండెల్లో నొప్పి వచ్చింది. కు టుంబసభ్యులు హుటాహుటిన కరీంనగర్లో ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలు నిలిచాయి.’ ‘నగరంలోని కిసాన్నగర్కు చెందిన 42 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి అర్ధరాత్రి ఎడమచేయి లాగ డం, చాతిలో నుంచి వీపులోకి నొప్పి రావడంతో కుటుంబసభ్యులు మొదటి ప్రభుత్వాసుపత్రికి, ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో కోలుకున్నాడు.’ -
మంథనిపైనే అందరి దృష్టి
మంథని: ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన మంథనిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఏ ఎన్నికలు జరిగినా ఇక్కడ ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలో మొదటి విడతలో మంథని డివిజన్లో జరుగుతున్న ప్రచారతీరు.. ప్రజాస్పందనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ కావడంతో ఎన్నికలు ప్రతిష్టాత్మకమయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పట్టుగా ఉండడంతో ఇక్కడి గెలుపును ఇరుపార్టీలు చాలెంజ్గా తీసుకున్నాయి. పార్టీలతో సంబంధం లేని ఎన్నికలు అయినప్పటికీ ప్రచార తీరులో వ్యూహాలు ఎంచుకుంటున్నారు. ఎవరికి వారే ఓటర్లను ఆకర్షించేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. సాధారణ ఎన్నికల్లో అవలంభించిన విధంగా కాంగ్రెస్ గెలుపుకోసం వ్యూహత్మకంగా ముందుకు పోతోంది. ప్రత్యర్థి ఎత్తులను ఈసారి చిత్తు చేసే రీతిలో బీఅర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థులు తమదైన శైలిలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరి నుంచి ఎనిమిది మంది బరిలో.. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు ఏకగ్రీవం కావాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినా అలా కు దరలేదు. డివిజన్లోని మంథనిలో మూడు, రామగిరి మండలం నుంచి ఒక్కరు మొత్తం నాలుగు సర్పంచ్ స్థానాలే ఏకగ్రీవమయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ నుంచి ఈసారి పో టీలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రతీసారి ఒక్క పార్టీ నుంచి ఒక్కరు మాత్రమే పోటీలో ఉండగా అక్కడక్కడా రెబల్స్ దర్శమిచ్చేవారు. ఉదాహరణకు మంథని మండలంలో 35 పంచాయతీలుండగా 130 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి కాంగ్రెస్ మద్దతుదారులు 2–8, బీఆర్ఎస్ నుంచి కూడా ఇద్దరికి మించి పోటీలో ఉన్నారు. ఫలించని చర్చలతో ప్రయోజనం ఎవరికో.. ఒకే పార్టీ నుంచి ఒక్కరే ఉండాలని, ఎక్కువ స్థానా లు గెలుపొందాలని కాంగ్రెస్, బీఆర్ఎస్కి చెందిన నాయకులు అభ్యర్థులతో చర్చలు జరిపినా చాలా చోట్ల ఫలించలేదు. దీంతో రెండు పార్టీల నుంచి అసమ్మతులు ఎక్కువగానే ఉన్నారు. ఈ పర్యావసానం ఎవరికి లాభం.. మరెవరికి నష్టం కలిగిస్తుందోననే ఆందోళన ఇరు పార్టీల్లో వ్యక్తమవుతోంది. -
యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ
మంథని: ట్రాఫిక్ క్రమబద్ధీకరణ.. ప్రమాదాల నియంత్రణకు పట్టణంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను వాహనదారులెవరూ పట్టించుకోవడం లేదు. వాహనదారుల రక్షణ, సౌకర్యం కోసం అధికారులు అత్యాధునిక పద్ధతుల్లో సిగ్నల్స్ను అందుబాటులోకి తీసుకొచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లాలోని ప్రధాన పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు పటిష్టంగా అమలవుతున్నాయి. కానీ, మంథనిలో అందుకు భిన్నంగా ట్రాఫిక్ సిగ్నల్స్ను వాహనదారులు జంప్ చేస్తున్నారు. మంథని పాత పెట్రోల్ బంక్ కూడలిలో ఇటీవల కొత్తగా సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. వాటిని ఎవరూ పట్టించుకునన్న పాపానపోవడంలేదు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంలో మరికొందరు, తమకు అడ్డెరంటూ ఇంకొందరు దర్జాగా సిగ్నల్స్ జంప్చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. మూడు నెలల క్రితం ఏర్పాటు పెద్దపల్లి – కాటారం – గోదావరిఖని మధ్య ప్రధాన రహదారులపై సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. మంథని పాత పెట్రోల్ బంక్ కూడలిలో రూ.6.71 కోట్లతో ఆగస్టు 2న ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించారు. మంథని పురపాలక సంఘం పరిధిలోని పోచమ్మవాడ ఎక్స్రోడ్డు వరకు, కాటారం రోడ్డులో శ్రీరాంనగర్ నుంచి మాతాశిశు ఆస్పత్రి వరకు సెంట్రల్ లైటింగ్తోపాటు పోచమ్మవాడ నుంచి గోదావరిఖని క్రాస్రోడ్డు, లైన్గడ్డ, కూచిరాజ్పల్లితోపాటు ఇతర ప్రధాన కూడలిలో హైమాస్ట్లైట్లు ఏర్పాటు చేశారు. ఇదేక్రమంలో ట్రాఫిక్ సిగ్నల్స్కు శ్రీకారం చుట్టారు. మరుసటిరోజు నుంచే ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయినా, వాటిని వాహనదారులు పట్టించుకోవడం లేదు. జరిమానా విధిస్తే సరి.. సింగల్స్ జంప్ చేసిన వాహనదారుల మొబైల్ ఫోన్లకు పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు జరిమానా మెసేజ్ పంపిస్తున్నారు. మంథనిలో పోలీసులు అలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే, తాము ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాల రాకపోకలను గమనిస్తూ జరిమానా విధిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జరిమానా విధిస్తే వాహనదారులు దర్జాగా నిబంధనలు అతిక్రమిస్తూ ఎందుకు ముందుకు వెళ్తారనే ప్రశ్నలూ తలెత్తతున్నాయి. సిగ్నల్ జంప్ చేసిన వారికి జరిమానా విధిస్తే మరొసారి నిబంధనలు అతిక్రమించరనే వాదన ఉంది. ప్రమాదాల నియంత్రణకు.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు పాతపెట్రోల్ బంక్ కూడలి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రధాన చౌరస్తా కావడంతోనే పోలీసులు తొలుత ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి నిత్యం రద్దీగానే ఉంటుంది. లారీలు, ఇతర వాహనాల రాకపోకలు సాగుతూనే ఉంటాయి. గతంలో ఇదేప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. అయితే ప్రమాదాల నియంత్రణకు రెండువైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. అయినా, తరచూ ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసుల పర్యవేక్షణ లేక వాహనదారులు ఇష్టారీతిలో సిగ్నల్స్ జంప్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించాలి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాల నియంత్రణకు మంథని పాత పెట్రోల్ బంక్ కూడలిలో సిగ్నల్స్ ఏర్పాటు చేశాం. వాటిని సక్రమంగా వినియోగించుకోవాలి. సిగ్నల్ జంప్ చేసి వెళ్తే సీసీ కెమెరాల ఆధారంగా జరిమానా విధిస్తాం. చలి కాలం కావడంతో ఉదయం వేళ దారులను మంచు కమ్మేస్తుంది. ఈ సమయంలో ఉదయం వేళ ప్రయాణాలు చేయకపోవడం మంచిది. – డేగ రమేశ్, ఎస్సై, మంథని -
ప్రయాణికులు.. అవస్థలు
జిల్లా కేంద్రంలోని అయ్యప్పగుడి, కమాన్, కోర్టు చౌరస్తాల్లో బస్సులు ఆగేందుకు బస్షెల్టర్లు లేవు. వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, చలికి గజగజ వణుకుతూ ప్రయాణికులు బస్సుల కోసం అవస్థలు పడుతూనే ఉన్నారు. పిల్లాపాపలతో గంటల కొద్దీ నిరీక్షిస్తున్నా.. వీరి బాధలు పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడు. పెద్దపల్లి కమాన్చౌరస్తా వద్ద బస్సుల కోసం నిరీక్షించి.. అప్పుడే బస్సు రావడంతో పరుగులు పెడుతున్న ప్రయాణికులు ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ఎన్నికలు.. తనిఖీలు
జిల్లాలోని రాజీవ్ రహదారిపై చెక్పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు నిత్యం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, పంచాయతీ ఎన్నికల్లో మద్యం, నగదు, విలువైన వస్తుసామగ్రి తరలించకుండా రాత్రింబవళ్లు వచ్చిపోయే వాహనాల్లో సోదాలు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా అభ్యర్థులను కట్టడి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా సరిహద్దుల్లోని మొగ్దుంపూర్ రాజీవ్ రహదారిపై వాహనం తనిఖీ చేస్తున్న పోలీసులు ‘సాక్షి’కి ఇలా కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
శాంతిభద్రతలు పరిరక్షించాలి
గోదావరిఖని: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. 63వ హోంగార్డు రైజింగ్డే సందర్భంగా శనివారం కమిషనరేట్లో పరేడ్ నిర్వహించారు. ట్రాఫిక్, క్రైం నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్, విపత్తు నిర్వహణ వంటి అంశాల్లో హోంగార్డులు చూపే అంకితభావం, ప్రతి భ ప్రశంసనీయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ ఏసీపీలు నాగేంద్రగౌడ్, ప్రతాప్, స్పెషల్ బ్రాంచ్ సీఐ భీమేశ్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, సంపత్ పాల్గొన్నారు. ఎన్నికలకు పటిష్ట బందోబస్తు సుల్తానాబాద్రూరల్: ఎన్నికలకు పటిష్ట భద్రత ఏ ర్పాటు చేస్తున్నట్లు సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. దుబ్బపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టును సీపీ తనిఖీ చేశారు. సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ తదితరులు ఉన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు పెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని, అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లపై నిఘా ఉంచాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా.. ఎస్సై మల్లేశ్, సిబ్బందికి సూచించారు. రూరల్ పోలీస్స్టేషన్ను సీపీ సందర్శించారు. పలు సూచనలిచ్చారు. -
అన్నీ అసౌకర్యాలే..
పెద్దపల్లిరూరల్: సుమారు ఐదు దశాబ్దాల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవలు అందించిన పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని ఆర్టీసీ బస్డిపోకు కేటాయించారు. కార్యకలాపాలను దాదాపు ఏడాదిగా అద్దెభవనంలో అరకొర వసతుల మధ్య కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి బస్స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్ వెళ్లే రోడ్డులోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇరుకైన గదుల్లో సిబ్బంది అతికష్టంపై పనులు నెట్టుకొస్తున్నారు. సమావేశాలు ఉంటే రైతువేదికలకే.. పంచాయతీ కార్యదర్శులు, ఇతర సమావేశాల నిర్వహణకు రాఘవాపూర్ లేదా బ్రాహ్మణపల్లిలోని రైతువేదికలను ఆశ్రయించాల్సిందే. ఉన్నతాధికారుల సూచనల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో డీపీవో, డీఎల్పీవో, ఎంపీడీవో తదితర అధికారులు తరచూ సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటారు. సమావేశాల కోసం ఆయా గ్రామాలకు వెళ్లిరావడం కష్టంగా మారిందని అధికారులు, సి బ్బంది, సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటికి, రెంటికీ తిప్పలే... పనుల నిమిత్తం వెళ్లే సందర్శకులే కాదు.. కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బందికి సైతం మల, మూత్ర విసర్జనకు ఇబ్బందులు పడాల్సిన ప రిస్థితులున్నాయి. వ్యాపార అవసరాల కోసం నిర్మించిన భవనంలో ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో అవస్థలు మరీ ఎక్కువగా ఉన్నాయని పలువురు వాపోతున్నారు. కొత్తగా సర్పంచులు వస్తే ఇంకా తిప్పలే.. ఈనెల 17వ తేదీ వరకు పంచాయతీ ఎన్నికలు మూడుదశల్లో నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికయ్యే స ర్పంచులు, ఆ తర్వాత ఎంపీటీసీ సభ్యులకై తే ఆఫీ సులో అడుగు పెట్టేందుకు కూడా అవకాశం ఉండ దు. ఇక మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశా లు నిర్వహించుకోవాలంటే పల్లెల్లోని రైతువేదికల వద్దకు పరుగెత్తాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి.పనులు సాగుతున్నాయి -
కులం సర్టిఫికెట్ జారీపై నిరసన
పెద్దపల్లి: కులం సర్టిఫికెట్ జారీపై సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలోని బీసీలు శనివారం ఆందోళనకు దిగారు. కొందరు జేఏసీగా ఏర్పడి సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. ఓ మహిళ కులం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయగా.. విచారణ జరిపిన రెవెన్యూ అ ధికారులు.. బీసీ–సీ సర్టిఫికెట్ జారీచేశారని, దీంతో బీసీ మహిళకు కేటాయించిన ఆ గ్రామ సర్పంచ్ స్థానం నుంచి ఆమె పోటీలో నిలిచారని తెలిపారు. అధికార పార్టీ కుట్ర, స్థానిక ప్రజాప్రతినిధి ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్ జారీచేశార ని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. ఈ విషయంపై ఇన్చార్జి తహసీల్దార్ గిరిని సంప్రదించగా.. మత మార్పిడికి రా జ్యాంగం అనుమతిచ్చిందని, నిబంధనల ప్రకారం సదరు మహిళకు కులం సర్టిఫికెట్ జారీచేశామన్నా రు. అంతకుముందున్న ఎస్సీ కులం సర్టిఫికెట్ రద్దు కు సిఫారసే చేసినట్లు తెలిపారు. మాజీ సర్పంచులు శంకర్రెడ్డి, కాదాసీ చంద్రమౌళి, గుండ ము రళి, మాజీ వైస్ ఎంపీపీ ఉట్కూరి శ్రీనివాస్గౌడ్, శంకరయ్య, తిరుపతిగౌడ్, మహిళలు పాల్గొన్నారు. -
కోర్టు స్థలం పరిశీలన
పెద్దపల్లిరూరల్: జిల్లా కోర్టు భవన సముదా యం నిర్మాణం కోసం రాఘవాపూర్లో కేటాయించిన పదెకరాలను జిల్లా పోర్ట్ఫోలియో జ డ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి శనివారం పరిశీలించారు. భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా రాఘవాపూర్లో నిర్మించొద్దని, పెద్దపల్లి పట్టణంలోనే స్థలం కేటాయించాలని పెద్దపల్లి బార్ అసోసియేషన్లోని కొందరు సభ్యులు హైకోర్టు జడ్జిల దృష్టికి గతంలో తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్థల పరిశీలన కోసం వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీనారాయ ణ.. అక్కడ సమాధులు ఉన్నాయా?అని ఆరా తీశారు. సర్వే నంబరు 1072లో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, ఆర్డీవో గంగయ్య, డీసీపీ భూక్యా రాంరెడ్డి, ఏజీపీ ఉప్పు రాజు, ఏసీపీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఓటెయ్యాలి మంథనిరూరల్: స్థానిక ఎన్నికల్లో ఓటర్లు అందరూ స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకో వాలని, ఇందుకోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఏసీపీ రమేశ్ తెలిపారు. అడవి సో మన్పల్లి, పోతారం, విలోచవరం, పుట్టపాక పోలింగ్ కేంద్రాలను ఆయన శనివారం సందర్శించారు. ఎన్నికల కోడ్పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రజలు సహకరించాలని కోరారు. సీఐ రాజు, ఎస్సైలు రమేశ్, సాగర్, సిబ్బంది పాల్గొన్నారు. గొప్ప సంస్కర్త అంబేడ్కర్ జ్యోతినగర్(రామగుండం): భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ గొప్ప సంస్కర్త, అని కుల వివక్షను రూపుమాపేందుకు తన జీవితం అంకితం చేశారని ఎన్టీపీసీ రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీపీసీ వికాస కేంద్రంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈడీ మాట్లాడుతూ, ఆలోచనాపరుడు, సమానత్వం కోసం వాదించడంలో నేర్పరని అన్నారు. జనరల్ మేనేజర్లు ముకుల్ రాయ్, అవిజిత్ దత్తా, మానవ వనరుల విభాగాధిపతి బిజోయ్ కుమార్ సిక్దార్ తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్లో తనిఖీలు రామగుండం: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే, సివిల్ పోలీసులు స్థానిక రైల్వేస్టేషన్లో శనివారం తనిఖీలు చేశారు. ప్రయాణికుల వివరాలు సేకరించారు. వస్తుసామగ్రి తనిఖీ చేశా రు. ప్రధానంగా బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే రైళ్ల జనరల్ బోగీలను జాగిలంతో శోధించారు. అనుమానితుల ను ప్రశ్నించి వదిలేశారు. ఆర్పీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్, ఏఎస్సై నాగరాజు, రామగుండం సివిల్ ఎస్సై సంధ్యారాణి, జీఆర్పీ ఇన్చార్జి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.అభివృద్ధి పనుల పరిశీలన గోదావరిఖని: గోదావరి తీరంలోని సమ్మక్క – సారలమ్మ గద్దెల అభివృద్ధి పనులను రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ శనివారం పరిశీలించారు. పనుల పురోగతి పరిశీలించి, నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేశ్, మారెల్లి రాజిరెడ్డి, గుండేటి రాజేశ్, కాంట్రాక్లర్లు తదితరులు ఉన్నారు. -
కారుణ్య నియామకాల రద్దుకు కుట్ర
గోదావరిఖని: బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వ్యయప్రయాసలకోర్చి సాధించిన సింగరేణి కారుణ్య ని యామకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం కుట్ర చేస్తోందని మాజీమంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సింగరేణి మెడికల్ బోర్డు వైఖరిని నిరసిస్తూ స్థానిక ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట శనివారం ఒక రోజు నిరసన దీక్ష చేట్టారు. ఈశ్వర్ మాట్లాడుతూ, 9నెలల నుంచి మెడికల్ బోర్డు పెట్టలేదని, మొక్కుబడిగా రెండు నిర్వహించినా.. బోర్డు ఉన్నదని చూపించుకోడానికే పరిమితమైందన్నారు. గుండె, పక్షవాతం, మూత్రపిండం తదితర దీర్ఘకాలిక వ్యా ధులతో బాధపడుతూ 15నెలలకు పైగా అన్ఫిట్లో ఉన్న కార్మికులను గత నవంబర్లో బోర్డుకు పిలిచిన సింగరేణి యాజమాన్యం.. 23 మందినే అన్ఫిట్ చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. మెడికల్బోర్డును వెంటనే పునరుద్ధరించాలని ఆ యన డిమాండ్చేశారు. మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధూకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు వ్యాళ్ల హరీశ్రెడ్డి, కౌశిక హరి, సురేందర్రెడ్డి, కాపు కృష్ణ, మాదాసు రామమూర్తి, నూనె కొమురయ్య, పర్లపెల్లి రవి, వడ్డెపల్లి శంకర్, నాగెల్లి సాంబయ్య, బడికెల సంపత్, మేడిపల్లి సంపత్, బండి రమేశ్, ఐలి శ్రీనివాస్, నాగెల్లి సాంబయ్య, చెల్పూరి సతీశ్, సంపత్రెడ్డి, జాహిద్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
ఓటేసి పోండి
బాబాయ్ నమస్తే.. అంతా కుశలమేనా.. సర్పంచ్గా పోటీచేస్తున్న.. 11న మన ఊరిలో పోలింగ్ ఉంది. పిన్ని, చిన్నోడు, నువ్వు బుధవారం సాయంత్రంలోగా ఊ రికి వచ్చేలా ప్లాన్ చేసుకో. ఏం ఫికర్ పడకు. రానుపోను చార్జీలతోపాటు పైఖర్చులు కూడా చూసుకుంట. ఈ నంబరుకు ఫోన్ పే ఉందికదా? రవాణా చార్జీలు పంపుత.. లేదా.. మన ఊరోళ్లు మీ కాలనీలో ఎవరైనా ఉంటే ఓ కారు మాట్లాడుకోని అందరూ రండి.. కిరాయి నేనేఇస్త. నామీద ఒట్టే.. నువ్వు తప్పకుండా రావాలి. నాకు ఓటెయ్యాలి. – వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న పాట్లకు ఇది నిదర్శనం. సాక్షి పెద్దపల్లి: గ్రామం యూనిట్గా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. స్వల్ప తేడా ఓట్లతోనే ఫలితం తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. స్థానిక ఎన్నికలను అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతీ ఓటరుపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ‘నువ్వా.. నేనా’ అన్నట్లు ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ వార్డుల వారీగా అనుకూల ఓటర్లపై ఆరా తీస్తూ వారిని ఎలా కలువాలి? ఎలా తమవైపు తిప్పుకోవాలనేదానిపై ప్లాన్ చేస్తున్నారు. ఉపాధి కోసం వెళ్లినవారిపై ఫోకస్.. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన గ్రామ ఓటర్లపై అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఎంతమంది, ఎక్కడెక్కడ ఉన్నారని ఆ రా తీస్తున్నారు. అభ్యర్థుల కుటుంబసభ్యులు, బూ త్ కన్వీనర్లు, ఏజెంట్ల ద్వారా ఇంటింటికీ తిరిగి ఓ టర్ల వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు 100 నుంచి 200 మందివరకు వలస ఓ టర్లు ఉన్నట్లు అంచనా వేసుకుంటూ ప్రత్యేకంగా బృందాలనూ రంగంలోకి దింపారు. వలస వెళ్లిన వారికి ఫోన్లపై ఫోన్లు చేయిస్తున్నారు. ఎక్కడ ఉన్నా పోలింగ్కు ఒకరోజు ముందుగానే స్వగ్రామాలకు రప్పించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. వారి ఫోన్ నంబర్లు సేకరిస్తూ, వాట్సప్ గ్రూప్లు క్రియేట్ చేస్తూ వారితో టచ్లో ఉంటున్నారు.ప్రత్యేక వాహనాల ఏర్పాటు.. ఓటరు జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల లెక్కలు తీస్తున్నారు. ఒకేచోట ఎక్కువమంది ఉంటే ప్రైవేట్ వాహనం అద్దెకు తీసుకుని రావాలని, లేనిపక్షంలో ఇక్కడి నుంచి పంపిస్తామని హామీ ఇస్తున్నారు. ఎంతమంది ఓటర్లు గ్రామాలకు వస్తున్నారనేది తెలుసుకుని అందుకు సరిపడా డబ్బులు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసేందుకు బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్పే, గూగుల పే వివరాలు సేకరిస్తున్నారు. రవాణా ఖర్చులకు తోడు పైఖర్చులను సైతం చెల్లింస్తామంటూ ఆఫర్స్ ఇస్తున్నారు. ముందస్తు చెల్లింపులు కూడా.. ముందుగానే డబ్బులు పంపిస్తే ఓటర్లు తమకు ఓట్లు వేస్తారని, లేకపోతే వేయకపోవచ్చని భావించి కొందరు అభ్యర్థులు ముందుగానే డబ్బులు ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా ఒక్కో ఓటరుకు రాకపోకలకయ్యే ఖర్చుతోపాటు అదనంగా ఓటుకు రూ.500 వరకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. జీవనోపాధి కోసం గ్రామాల నుంచి దూరప్రాంతాలకు వెళ్లిన వారు గ్రామాల్లో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చినవారు తమకు వచ్చే కూలి డబ్బులు నష్టపోకుండా చెల్లింపులు చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. -
చదవాలి.. రాయాలి.. రాణించాలి
పెద్దపల్లి: చదువులో వెనుకబడిన విద్యార్థులు కూడా ఉన్నతంగా రాణించేలా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం వారితోనే నాలుగు క్లబ్లు ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. వీటికి రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లూ హౌస్లుగా నామకరణం చేశారు. వీటిద్వారా ఆటాపాటలు, విద్యలోనూ వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తారు. చదవడం రాయడం, విద్యలో రాణించడం, ఉజ్వలమైన భవిష్యత్ అందించడం లక్ష్యంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకోవాలని అధికారులు సూచించారు. క్రమశిక్షణ, ఉత్తమ భవిష్యత్ నిర్మాణం, నాయకత్వ లక్షణ పెంపు లక్ష్యంగా తీర్చిదిద్దాలన్నారు. వారంలో ఒకరోజు (సోమవారం) మినహా ఐదురోజులపాటు ఒక్కో కార్యక్రమం నిర్వహించాలని ప్రణాళిక తయారు చేశారు. మంగళవారం : మొక్కలు నాటి.. నీళ్లుపోసి.. ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లో మొక్కలు నాటి సంరక్షించడం, పోషక విలువలు కలిగిన తోట నిర్వహణ, విద్యుత్, నీటి సంరక్షణ బాధ్యతలు చేపడతారు. విద్యార్థులు ప్రజలను చైతన్యవంతం చేసి పర్యావరణాన్ని పరిరక్షిస్తారు. ఈ ప్రక్రియను ఎకోక్లబ్ అని కూడా వ్యవహరిస్తారు. బుధవారం : పుస్తక పఠనం విద్యార్థులు నిత్యం పుస్తక పఠనం, భాషపై పట్టు సాధించడం, సృజనాత్మక పెంపొందించేలా కార్యక్రమాల నిర్వహణ. గ్రంథాలయాలు, రోజువారీ స్టడీతోపాటు కవితలు చదవడం, రాయడం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. గురువారం : డ్రగ్స్కు దూరం.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా టీనేజ్లో విద్యార్థులు వ్యసనాల బారినపడే ప్రమాదం ఉంది. వ్యసనం ద్వారా కలిగే నష్టాలు, ఉజ్వల భవిష్యత్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యవంతం చేస్తారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించడం, సామాజిక బాధ్యతలు, సంప్రదాయాలు, విలువలు, జీవన విధానంపై ఉదయం, సాయంత్రం ప్రార్థన సమయంలో వివరిస్తారు. శుక్రవారం : ఫిర్యాదులు బాలికలు, మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. డయల్ 100, 1098, 15100 హెల్ప్లైన్ నంబర్ల గురించి వివరిస్తారు. గుడ్, బ్యాడ్టచ్లపైనా అవగాహన కల్పి స్తారు. ప్రతీపాఠశాలలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేస్తారు. ఇబ్బందులు, సమస్యల కోసం ఫిర్యాదు పెట్టెను వినియోగించాలి. పరస్పర సహకారం, భావోద్వేగాల నియంత్రణ, ఐక్యత, స్నేహపూర్వక వాతావరణం క్లబ్ల ధ్యేయం. శనివారం : ఆటాపాటలు ఆటాపాటలతోపాటు యోగా సాధన ద్వారా కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. వాటిపై తర్ఫీదు ఇస్తారు. నైపుణ్యం పెంపొందిస్తారు. ఉన్నతంగా రాణించేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుంటారు. పాఠశాలల సమాచారం ఉన్నత 104 కేజీబీవీలు 10 మోడల్ 7 విద్యార్థులు 37,108 -
Peddapalli District: రైలు పట్టాలపై కారు తెరుచుకోని గేటు..
-
● ఆరు వారాలపాటు అవగాహన ● రంగంలోకి దిగిన సైబర్ సెక్యూరిటీ వింగ్
గోదావరిఖని: సైబర్ నేరాలపై పోలీసుశాఖ డేగకన్ను వేసింది. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఆరువారాల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. సామాన్యుల నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వరకు అందరూ బాధితులే.. సామాన్యుల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగుల వరకూ సైబర్నేరగాళ్ల ఉచ్చులోపడి రూ.కోట్లు కోల్పోతున్నారు. మొబైల్ ఫోన్ల ఆధారంగా లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్లు నిత్యం వారిబారినడుతున్నాయి. అయితే, ప్రజల్లో అవగాహన పెంచడం, నేరాల్ని అరికట్టడం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమని పోలీస్ శాఖ భావిస్తోంది. ఈక్రమంలో స్కూళ్లు, కాలేజీల్లో సైబర్ సేఫ్టీ వర్క్షాప్లు నిర్వహిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద అవగాహన పోస్టర్లు అంటించనుంది. సోషల్ మీడియా ద్వారా హెచ్చరిక చేయాలని నిర్ణయించింది. ఫిషింగ్, ఓటీపీ మోసాలు, ఫేక్లింక్ల గురించి వివరించనుంది. తరచూ చేసే చిన్నతప్పిదాలతో పెద్దనష్టాలకు దారితీసే నేపథ్యంలో అజ్ఞానం – అతిపెద్ద ప్రమాదం నినాదంతో ఇంటింటా సైబర్ భద్రతను తీసుకెళ్లనుంది. ఆధునిక సాంకేతికత.. సైబర్నేరాలను ఎదుర్కొనేందుకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. డిజిటల్ ట్రాకింగ్, ఫోన్, సోషల్ మీడియా విశ్లేషణ, నేరతీవ్రత, డీప్ మానిటరింగ్, ప్రత్యేక సైబర్ ఇంటలిజెన్స్ టీంలను ఏర్పాటు చేస్తోంది. ఇలాంటి పద్ధతుల్లో సైబర్నేరస్తులను పట్టుకునేలా వ్యవస్థను బలోపేతం చేస్తోంది. సైబర్మోసం జరిగినా వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేసి ఫిర్యాదు అందించాలని సూచిస్తోంది. భద్రత కూడా అత్యాధునిక టెక్నాలజీ చేతిలో ఉన్నా.. భద్రత కూ డా అవసరమని పోలీసులు చెబుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు. మారుతున్న సైబర్ నేరాల తీరుకు అనుగుణంగా ప్రజలూ మారాలని, జాగ్రత్తలు తీసుకుంటూ అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలంటున్నారు. -
‘గుర్తు’ంచుకో..
సాక్షి పెద్దపల్లి: ‘గుర్తు.. గుర్తుంచుకో.. అమ్మా.. గుర్తువొచ్చింది.. మా గుర్తు గుర్తుంచుకో’ అని పల్లెల్లో అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలో మూడు విడతల్లో జరిగే పంచా యతీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నా మినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఇప్పటి కే తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ ప్ర క్రియ కూడా ముగియడంతో అభ్యర్థులకు గు ర్తులు కేటాయించారు. రెండోవిడత నామినే షన్లు ఉపసంహరణ గడువు శనివారం ముగియనుంది. మూడు విడతల్లో నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు శుక్రవారంతో నామినేషన్ల స్వీకర ణ ప్రక్రియ పూర్తయింది. ఆఖరురోజైన శుక్రవా రం సర్పంచ్ అభ్యర్థులు భారీగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. గుర్తులు కేటాయించిన అభ్యర్థులు ఇప్పటికే ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘గుర్తు.. గుర్తు ఉంచుకో’ అంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమకు వచ్చిన సింబల్ (బ్యాట్, ఉంగరం తదదితర) పెద్దఎత్తున కొనుగోలు చేసి ఇంటింటికీ పంచిపెడుతున్నారు. తమ గుర్తు మరిచిపోవద్దు అంటూ ఓటర్లను అభ్యర్థులు వేడుకుంటున్నారు. తొలివిడత బరిలో 376మంది జిల్లాలోని మంథని, కమాన్పూర్, రామగిరి, కా ల్వశ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లో తొలివిడత ఎన్నికలు జరుగుతాయి. ఇందులోని 99 స ర్పంచ్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించగా.. 4 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 95 స్థానాల కోసం 376 మంది పోటీపడుతున్నారు. అలాగే 896 వార్డు స్థానాల్లో 211 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 685 వార్డులకు 1,880 మంది పోటీలో ఉన్నారు. మంథని మండలంలోని మైదంపల్లి, తోటగోపయ్యపల్లి, నా గారం పంచాయతీలతోపాటు, రామగిరి మండలంలోని చందనాపూర్ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన వాటిలో ఉన్నాయి. రెండో విడతలో.. రెండోవిడతలో అంతర్గాం, ధర్మారం, జూలప ల్లి, పాలకుర్తి మండలాల్లోని 73 సర్పంచ్ స్థానాలకు 377మంది, 684 వార్డు స్థానాలకు 1,641 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశా రు. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు నా మినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. త దు పరి అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించి పోటీ లో ఉన్నవారికి గుర్తులు కేటాయించనున్నారు. ముగిసిన మూడోవిడత నామినేషన్లు.. మూడోవిడతలో ఎలిగేడు, ఓదెల, పెద్దపల్లి, సు ల్తానాబాద్ మండలాల్లోని 91 పంచాయతీలకు 458 నామినేషన్లు, 852 వార్డుస్థానాలకు 1,234 నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం మ ధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు గడువు ఉంది. అదేరోజు పో టీలో మిగిలిన అభ్యర్థుల జాబితా అధికారులు ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. సైబర్నేరాలపై డేగకన్ను -
శాంతియుతంగా స్థానిక ఎన్నికలు
పెద్దపల్లి: నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై రి టర్నింగ్ అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం ని ర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 6న పీవోలు, ఏపీవోలకు ఎన్నికల విధులపై శిక్షణ ఇస్తామన్నారు. తొలివిడతలో 4 సర్పంచ్, 210 వార్డులు ఏకగ్రీవమయ్యాయని, 95 పంచాయతీలు, 670 వా ర్డులకు ఈనెల 11న పోలింగ్ జరుగుతుందని వి వరించారు. తొలివిడత ఎన్నికల సిబ్బంది ఈనెల 6న పోస్టల్ బ్యాలెట్లో ఓటుహక్కు వినియోగించు కోవాలని కోరారు. ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు ప్రతీనెల స్కూళ్లను తనిఖీ చేయాలని సూచించారు. జెడ్పీ సీఈవో నరేందర్ పాల్గొన్నారు. కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. మంథని/కమాన్పూర్/రామగిరి/ముత్తారం/కాల్వశ్రీరాంపూర్: కమాన్పూర్, రామగిరి, మంథని, ము త్తారం, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాలను కలెక్టర్ శ్రీహర్ష ఆకస్మికంగా తని ఖీ చేశారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పంపిణీ ని బంధనల ప్రకారం చేట్టాలన్నారు. తర్వాత శ్రీపాద మార్గ్ ఫోలేన్ రోడ్డు విస్తరణ పనులు పరిశీలించారు. -
21న లోక్ అదాలత్
గోదావరిఖనిటౌన్: ఈనెల 13న నిర్వహించాల్సిన జాతీ య లోక్ అదాలత్ను ఈనెల 21న నిర్వహిస్తున్నామని గో దావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరా వు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కక్షిదారులు ఈనెల 21న ని ర్వహించే లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి కోరారు. విద్యార్థినికి అభినందన జూలపల్లి(పెద్దపల్లి): ఎన్టీపీసీలో జరిగిన జిల్లాస్థాయి వైజ్ఞానిక సదస్సులో ప్రతిభచూపి రాష్ట్రస్థాయికి ఎంపికైన జూపిటర్ విద్యాలయం బా లిక సమన్వితను జిల్లా విద్యాధికారి శారద శుక్రవారం అభినందించి జ్ఞాపిక అందజేశారు. గ్రీన్ఎనర్జీ అంశంలో ప్రాజెక్టు ప్రదర్శించింది. కరస్పాండెంట్ ఆందె కుమారస్వామి, ఉపా ధ్యాయులు, విద్యార్థినిని అభినందించారు. 81 మందికి ఉద్యోగాలు పెద్దపల్లి: కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించి న జాబ్మేళాలలో 81మందికి ఉద్యోగాలు ల భించాయి జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖ ర్ తెలిపారు. స్థానిక టాస్క్ సెంటర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మెగాజా బ్మేళా నిర్వహించా రు. 16 ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరు కాగా, 931 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూ కు వచ్చారన్నారు. నైపుణ్యం, విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేశారని వివరించారు. ఎంపికై న వారికి కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్ నియామక పత్రాలు అందజేశారు. టాస్క్ సెంటర్ ఇన్చార్జికౌసల్య, అధికారులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించాలి యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ఎన్నికల నిబంధనలు అదరూ పాటించాలని పెద్దపల్లి డీ సీపీ రాంరెడ్డి సూచించారు. సుందిళ్ల, సింగిరెడ్డిపల్లి, ముస్త్యాల, పెద్దంపేట, జల్లారం గ్రామా ల్లో శుక్రవారం నిర్వహించిన సదస్సులో గో దావరిఖని ఏసీపీ రమేశ్తో కలిసి ఆయన మా ట్లాడారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. టూటౌన్ సీఐ ప్రసాద్రావు, ఏఎస్సై లు తిరుపతిరెడ్డి, కృష్ణ, సిబ్బంది కనుకయ్య, క ల్యాణ్, విశ్వనాథ్, అఫ్రోజ్, కిరణ్ ఉన్నారు. విదేశీ విద్యపై అవగాహన పెద్దపల్లి: విదేశాల్లో ఉన్నత విద్య, స్కాలర్షిప్ ల కోసం అవగాహన కల్పిస్తున్నామని స్టడీ స ర్కిల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి, ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 21వ తేదీవరకు టీజీ బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ www. tg bcstudycircle. cgg.gov.inద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం 040– 24071178, 0878– 22686 86 నంబర్లలో ఆఫీసు వేళల్లో సంప్రదించాలని కోరారు. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థిరామగిరి(మంథని): పెద్దంపేట సర్పంచ్ స్థా నానికి నామినేషన్ దాఖలు చేసిన చింతపట్ల సుహాసిని హైకోర్టును ఆశ్రయించారు. ఓటరు లిస్ట్లో ఆమె పేరు లేదని అధికారులు తిరస్క రించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటుహక్కు వినియోగించుకున్నానని, అయినా, జా బితాలో తనపేరు లేదనడం సరికాదని, ఎన్నికలు వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఆ ర్వో సత్యనారాయణను సంప్రదించగా.. సుహా సిని నామినేషన్ పరిశీలించాక ఓటరు జాబితాలో తనిఖీ చేయగా.. ఆమె పేరు లేదని, అందుకే తిరస్కరించామన్నారు. కాగా, సుహాసిని నామినేషన్ పత్రాలను అనుమతించాలని హై కోర్టు నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు రాలే దని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. పట్టాల మధ్య నిలిచిన కారుపెద్దపల్లి: కూనారం – పెద్దపల్లి మధ్యగల రైల్వేలెవల్ క్రాసింగ్ గేట్ మధ్య శుక్రవారం సాయంత్రం ఓ కారు పట్టాలపైనే నిలిచిపోయింది. రై లు వస్తుందనే సమాచారంతో గేట్మ్యాన్ గేట్ వేస్తుండగా.. రాంపల్లి వైపు నుంచి పెద్దపల్లి వైపు వస్తున్న ఓ వ్యక్తి తన కారును వేగంగా పట్టాలపైకి తీసుకొచ్చాడు. ఈలోగా రెండోగేట్ పడిపోవడంతో కారు పట్టాలపైనే నిలిచిపోయింది. అప్పటికే రైలు కూత వినిపించడంతో వాహనదారు కారు అక్కడే వదిలేసి పారిపోయాడు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది గేటును తెరవడానికి విఫలయత్నం చేశారు. ఆ వెంటనే రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో రెండు వైపులా రైళ్లను గంటకుపైగా నిలిపివేశారు. అనంతరం రైల్వేగేటు తెరిచి కారును బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత రైళ్ల రాకపోకల్ని అధికారులు పునరుద్ధరించారు. -
అప్పుడే సర్పంచ్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇల్లు అలకగానే పండగ కాదు.. నామినేషన్ వేయగానే సర్పంచ్ అయిపోరు.. రాజకీయ రణరంగంలోకి దిగగానే సరిపోదు.. తెరవెనక ఎంతో శ్రమించాల్సి ఉంటుంది అనేది సత్యం. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో పరిస్థితులు ఒకప్పటిలా లేవు. ఊరికి ఏదో చేయాలని పోటీ చేసేందుకు వస్తున్న వారంతా రూ.లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. మార్కెట్లో నగదు చలామణి తగ్గిపోయింది. సర్పంచ్ పదవి కోసం బరిలోకి దిగుతున్న వారికి ఇదో సవాల్గా మారింది. నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకు వారం రోజుల సమయం ఉంది. నిత్యం ప్రచారానికి రూ.వేలల్లో ఖర్చవుతుంది. ఫ్లెక్సీలు, టీవీలు, పేపర్లలో ప్రచారానికి రూ.లక్షల్లో ఖర్చు పెట్టాలి. ఇదికాక నిత్యం అనుచరులకు మందు, విందు సరేసరి. వీటన్నింటికీ నగదు కావాలి. అందుకోసం అభ్యర్థులు అప్పుల వేటలో పడ్డారు. ‘అప్పు’డే సర్పంచ్ కాగలరు అన్న ఆశయంతో ఖర్చు కోసం వెనకాడకపోవడం గమనార్హం. గెలవకపోతే అప్పుల ఊబిలో.. వాస్తవానికి అప్పులు చేసి పోటీచేస్తున్న అభ్యర్థులలో నూటికి 90 శాతం మంది సాహసం చేస్తున్నారు. రూ.లక్షల్లో ఖర్చు పెడుతూ.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. బరిలో ఉన్న వారు గెలుస్తారన్న గ్యారెంటీ లేకపోయినా నామినేషన్ వేశాక ఇవేమీ ఆలోచించే పరిస్థితిలో లేరు. గెలుస్తారన్న నమ్మకంతో ఖర్చు చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు ఏకగ్రీవం కోసం ఇప్పటికే రూ.లక్షలు పెట్టినవారు, పెట్టబోతున్న వారికి అప్పుల ముప్పు పొంచి ఉంది. గెలిచినా, గెలవకపోయినా.. ఖర్చు మాత్రం పెట్టక తప్పని పరిస్థితి. అందుకే, ఈ యువ నాయకులు తమ డాబు, దర్పం ప్రదర్శించుకోవడానికి భూములు, నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. గెలిచినా, గెలవకపోయినా రుణం తీర్చడం మాత్రం అనివార్యం. ఈ నేపథ్యంలో వీరంతా ఈ అప్పులను ఎలా తీరుస్తారో చూడాలి మరి!కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇంకా రెండో, మూడో విడతల్లో పలు గ్రామాలు ఏకగ్రీవానికి మొగ్గుచూపుతున్నాయి. అయితే ఏకగ్రీవాలు అనుకున్నంత సులువుగా కొలిక్కి రావడం లేదు. దాని వెనక చాలా తతంగం నడుస్తోంది. చిన్నగ్రామాలు, వెయ్యి లోపు ఓట్లు ఉన్న గ్రామాల్లోనే పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. ఇక 3వేలు.. ఆపై ఓట్లు ఉన్న గ్రామాల్లో పరిస్థితి హోరాహోరీగా సాగుతోంది. ఏకగ్రీవమవుతున్న గ్రామాల్లో ముందు నామినేషన్లు వేసే వారిని, వేసిన వారిని నయానో, భయానో దారికి తెచ్చుకుంటున్నారు. దీనికి నామినేషన్ వేసిన అభ్యర్థులకు చాలా ఖర్చు చేస్తున్నారు. ఇక ఊరికి ఏం చేస్తారో? ఆ పనికి అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఎంతలేదన్నా.. ఓ మోస్తరు గ్రామ పంచాయతీల్లో రూ.30లక్షల నుంచి రూ.50 లక్షల వరకు భరించాల్సిన పరిస్థితి. ఇంత నగదు కోసం అభ్యర్థులు అప్పులబాట పడుతున్నారు. తాము సంపాదించుకున్న ఆస్తులు, ఇంట్లో ఆడవాళ్ల నగలు తీసుకుని తాకట్టుపెట్టి మరీ నగదు తెస్తున్నారు. వీటిని తమను నమ్మేలా నామినేషన్ వేసిన వారికి, ఊర్లో పెద్ద మనుషులకు సమర్పిస్తేనే విత్డ్రాయల్స్ సజావుగా సాగుతున్నాయి.జిల్లా పంచాయతీలు అభ్యర్థులు కరీంనగర్ 89 388 జగిత్యాల 118 461 పెద్దపల్లి 95 376 రాజన్నసిరిసిల్ల 76 295 -
మెరుగైన సేవలందించాలి
పెద్దపల్లి: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గైనకాలజిస్ట్ ఔట్ పేషెంట్ వద్ద సీటింగ్ సామర్థ్యం పెంచాలని, గర్భిణులు నిలబడాల్సిన అవసరం రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్ఎంవో డాక్టర్ విజయ్, అధికారులు పాల్గొన్నారు. మహనీయుల జీవితం ఆదర్శం మహనీయుల జీవితం అందరికీ ఆదర్శమని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన మాజీ సీఎం రోశయ్య వర్ధంతి కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
పరిశీలించి.. ఆరా తీసి
● అంతర్గాం ఎయిర్పోర్టు ఏర్పాటుపై ఏఏఐ బృందం పరిశీలన ● వివిధశాఖల ఉన్నతాధికారులతో సూక్ష్మ సమాచార సేకరణ ● సాంకేతికపరమైన అంశాలపై అధికారులు క్షేత్రస్థాయి పర్యటన ● రోడ్డు, రైల్వే కనెక్టివిటీపై ఆరా ● ప్రాజెక్టు, పంపుహౌజ్, రైల్వేస్టేషన్, గోదావరితీరం సందర్శనఉత్తర తెలంగాణకు ఎయిర్ కనెక్టివీటిచేసే అంతార్గం ఎయిర్పోర్టు ఏర్పాటుకు గురువారం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు క్షేత్ర పరిశీలన చేపట్టారు. ఎయిర్పోర్టుకు ఉన్న అనుకూలతలు, అడ్డంకులను పరిశీలిస్తూ, వివిధ అంశాలపై ఆరా తీశారు. పాలకుర్తిలో ఎయిర్పోర్టు నిర్మాణం ఏర్పాటుకు పలుసాంకేతిక సమస్యలు ఏర్పడడంతో.. ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఎయిర్పోర్టు నిర్మించాలని భావించింది. ఇప్పటికే ప్రీఫిజిబిలిటీ సర్వే కోసం రూ.50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విమానాశ్రయ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సర్వే నిర్వహించేందుకు ఏఏఐ అధికారలు బృందం రాగా, వారికి వివిధశాఖల జిల్లాస్థాయి అధికారుల బృందం సాంకేతికపరమైన అంశాలను వివరించారు. ఎయిర్పోర్టు ప్రతిపాదిత ప్రభుత్వస్థలం, గోలివాడ గోదావరినది తీరం, పెద్దంపేట రైల్వేస్టేషన్, గోలివాడ పంపుహౌజ్, ఎల్లంపల్లి ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో ఏఏఐ బృందం క్షేత్ర పరిశీలన చేశారు. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు
ముత్తారం/రామగిరి: పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్టపరంగ కఠిన చర్యలు ఉంటాయని పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి పేర్కొన్నా రు. గురువారం ముత్తారం మండలం ఖమ్మంపల్లి, అడవిశ్రీరాంపూర్, ఓడెడ్, కేశనపల్లి, రామగిరి మండలం కల్వచర్ల, పన్నూర్, రత్నాపూర్, నాగెపల్లి, బేగంపేట్, రాజాపూర్, బుధవారంపేట గ్రామాల్లో ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. పెద్దపల్లి జోన్ పరిధిలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారం ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడాల ని చూస్తే సహించేది లేదన్నారు. ఏదైనా సమస్య ఎ దురైతే 100కు డయల్ చేయాలని లేదా స్థానిక పో లీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంథని సీఐ రాజు, ఎస్సై లు రవికుమార్, శ్రీనివాస్, దివ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ.. పెరిగిన చికెన్ ధర
పెద్దపల్లి: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి జోరు అందుకుంది. గురువారం నుంచి మొదటి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బరిలో ఉన్న అభ్యర్థులు విందు వినోదాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈనేపథ్యంలో మటన్ కిలో రూ.800 నుంచి 1,000 ధర పలుకుతుండడంతో చికెన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. స్కిన్లెస్ కిలో రూ.240 తండాలు మొదలుకొని గ్రామపంచాయతీల్లో ఒక్కో గ్రామంలో రెండు నుంచి ఐదు చికెన్ సెంటర్లు ఉన్నాయి. వేకువజాము మొదలుకొని రాత్రి 11 గంటల వరకు చికెన్ ఎప్పుడు కావాలన్నా దొరకుతుంది. దీంతో విందులో చికెన్ పకోడి మొదలుకొని పలు రకాల చికెన్ వంటకాలు వండి పెడుతున్నారు. కిలో కోడి రూ.160, కిలో చికెన్ రూ.220, స్కిన్లెస్ కిలో రూ.220 ధర పలుకుతున్నట్లు అభ్యర్థులు చెప్తున్నారు. కిలో చికెన్ దాబాలు, హోటళ్లలో వండినందుకు రూ.100 చొప్పున తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈనెల 14న మొదటి విడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇంటింటా కిలో చొప్పున చికెన్ పంపిణీ చేసేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే చికెన్ సెంటర్ల నిర్వాహకులకు అడ్వాన్సు రూపకంగా కొంత డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. సాధారణ సమయంలో రోజూ 20 కిలోల చికెన్ విక్రయించగా, ప్రస్తుతం 40 నుంచి 50 కిలోలు అమ్ముతున్నట్లు చికెన్ సెంటర్ల నిర్వాహాకులు చెబుతున్నారు. -
కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం
పెద్దపల్లిరూరల్: సీఎం రేవంతన్న సారథ్యంలోని ప్ర జాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ లకు దిక్కుతోచడం లేదని ఎమ్మెల్యే విజయరమణా రావు అన్నారు. పెద్దపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం హన్మంతునిపేటకు చెందిన మ్యాడగోని శ్రీనివాస్గౌడ్, డాక్టర్ సత్యం తో పాటు పలు వురు నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పారీ ్టలోకి ఆహ్వానించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళాసంక్షేమానికి ప్రాధాన్యతని చ్చారన్నారు. యువతకు ఉద్యోగాలకల్పన తదితర కార్యక్రమాలతో పాటు పెద్దపల్లిలో ట్రాఫిక్, మహిళా, రూరల్ పోలీస్స్టేషన్ల ఏర్పాటు, బైపాస్రోడ్డు, బస్డిపో తదితర అనేక పనులను ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెజార్టీ సర్పంచు పదవులను కాంగ్రెస్ కై వసం చేసుకోవడం ఖాయమన్నారు. నాయకులు రమేశ్, భూమయ్య, సతీశ్, సదయ్య, తిరుపతి, రాజేశం, కనకయ్య, ఆనంద్ తదితరులున్నారు. సీసీఐ కేంద్రాల్లోనే మద్దతు ధర రైతులు పండించిన పత్తి దిగుబడులను సీసీఐ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అమ్ముకోవాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలోని జిన్నింగ్మిల్లులో గురువారం సీసీఐ సెంటర్ను ప్రారంభించి మాట్లాడారు. నాణ్యమైన పత్తికి క్వింటాల్ఽకు రూ.8,110 మద్దతు ధర లభిస్తుందన్నారు. వరిపంట కోసిన తర్వాత చాలామంది కొయ్యలను నిప్పుతో కాలుస్తున్నారని, అది మంచిపద్ధతి కాదన్నారు. భూసారం పెంచుకునేందుకు సేంద్రియ ఎరువుల వినియోగం మేలన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు -
ప్రయాణికుల పడిగాపులు
రామగిరి(మంథణి): మంథని డి పోకు చెందిన బస్సులు సమయానికి రాకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళ రెండు గంటలపాటు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఒక్క బస్సు రాకపోవడంతో బస్టాండ్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆటోలు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉండడం లేదు. విద్యార్థులు పాఠశాలకు, ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా చేరుకుంటున్నారు. రోజూ ఇదే పరిస్థితి ఉంటుందని, బస్సులు సమయానికి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని బస్సుల రాకపోకలను సక్రమంగా అనుసరించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆర్భాటం లేదు
హంగు లేదు..గత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే రోజున ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ ర్యాలీ తీసి, డప్పుచప్పుళ్లతో, జనసమీకరణ చేసి నామినేషన్ దాఖలు చేసేవారు. అదే సందడి పోలింగ్ ముగిసేవరకు కొనసాగించేవారు. కానీ, ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులు కేవలం ప్రతిపాదిత సభ్యుడు, ఇద్దరు సాక్షులతో ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేయడం, గుట్టచప్పుడు కాకుండా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎంత హడావుడి చేసినా, పోలింగ్ ముందు రోజు ఓటరును కలిస్తేనే ఫలితం ఉంటుందని అభ్యర్థులు భావించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే ప్రచారం కోసం ఖర్చు చేయడం కంటే ఓటరును ప్రసన్నం చేసుకోవడానికే ఖర్చు చేయాలని అభ్యర్థులు భావిస్తుండడంతో గ్రామాల్లో గత ఎన్నికల్లో కనిపించిన జోరు కనిపించడం లేదని పల్లెవాసులు ముచ్చటించుకుంటున్నారు.సాక్షి పెద్దపల్లి: సర్పంచ్ ఎన్నికలు అంటే పల్లెల్లో షెడ్యూల్ విడుదల నుంచి ఫలితాల వెల్లడి వరుకు సందడి నెలకొంటుంది. కానీ, ప్రస్తుత ఎన్నికల్లో గ్రామాల్లో ఎన్నికల ప్రచార జోరు గత ఎన్నికలతో పోలిస్తే హడావుడి లేదనే భావన కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఓటర్లు పేర్కొంటున్నారు. నామినేషన దాఖలు మొదలు, నియోజకవర్గ స్థాయి నేతల ప్రచారంతో గల్లీలో ప్రచారం హోరెత్తించే అభ్యర్థులు, నేడు కేవలం ప్రచారం కంటే ఓటరు ప్రసన్నం చేసుకోవడంపైనే ఫోకస్ చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియా వేదికగా వాట్సప్ గ్రూప్లు ఏర్పాటు చేయడం, స్టేటస్లతో ప్రచారం హోరెత్తిస్తూనే, ఆయా గ్రామాలకు చెందిన కుల, యువజన సంఘాల వారితో రాత్రివేళల విందులు ఏర్పాటు చేస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. ఇంటింటి ప్రచారానికి మాత్రమే పరిమితమవుతున్నారు. పెద్దమనుషుల ప్రసన్నం కోసం పాట్లు భారీ ర్యాలీ, ప్రచారం కంటే గ్రామాల్లో మెజార్టీగా ఉన్న వివిధ కుల సంఘాలు, యువజన సంఘాలతో మమేకం అయ్యేందుకే అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. ఆయా కులసంఘాల పెద్దమనుషులను ప్రసన్నం చేసుకుంటే సగం విజయం సాధించినట్లేనని అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో ఆయా కుల సంఘాల పెద్దమనుషులను దావత్కు పిలిచి తమకు మద్దతు ఇవ్వలంటూ వారికి పార్టీలు ఇస్తున్నారు. గెలిస్తే కుల సంఘానికి సంబంధించిన గుడి కట్టిస్తాం అని తదితర హామీలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం గ్రామాల్లోని ఓటర్ల ఫోన్నంబర్లు సేకరిస్తూ, వారందరితో ఓ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అందులోనే వివరిస్తూ, తమ గుర్తును ఓటర్లకు తెలిసేలా తమ అనుచరులతో స్టేటస్లతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేయించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ, గ్రామం నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి పంపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల రోజు రావాలని, రానుపోను ఖర్చులు భరిస్తామంటూ అభ్యర్థిస్తున్నారు. గతంలో వలె పల్లెల్లో కానరాని ప్రచార సందడి సాదాసీదాగానే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేరుగా ఓటరును ప్రసన్నం చేసుకునేందుకే ఆసక్తి సోషల్మీడియానే ప్రధాన ప్రచార అస్త్రంగా వినియోగిస్తున్న అభ్యర్థులు -
చిరునవ్వుతో సమాధానమిస్తాం
గోదావరిఖని(రామగుండం): ప్రేమించే వారిని ప్రేమిస్తూ.. ద్వేషించే వారికి చిరునవ్వుతో సమాధానం చెప్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ స్పష్టం చేశారు. గురువారం రాత్రి స్థానిక ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విపక్షాలు విమర్శించే కొద్ది అభివృద్ధి పెంచుకుంటూ పోతామన్నారు. అంతర్గాంలో 977ఎకరాల్లో ఎయిర్పోర్టు రాబోతుందని పేర్కొన్నారు. గోదావరితీరంలో సమ్మక్క– సారలక్క, రాముని గుండాలపై ఆంజనేయస్వామి విగ్రహం, మున్సిపల్ ఆఫీస్ ముందు టీజంక్షన్ వద్ద భారీ గణపతి విగ్రహంతో పలు ప్రాంతాల్లో అందమైన ఆలయాలు ఏర్పాటు చేసి టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఇప్పటివరకు రూ.వెయ్యికోట్లతో అభివృద్ధి చేశామన్నారు. 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్, 500 మెగావాట్ల పంప్డు స్టోరేజ్ ప్లాంట్లకు రాష్ట్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇక్కడి రైతులకు 3 పంటలకు సాగునీటితో పాటు తాగునీరు అందించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కట్టించిన మేడిగడ్డ, కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు పంటల సాగుకు పనికిరాకుండా పోయాయన్నారు. పాలకుర్తిలో రూ.450 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలో చేపడతామని పేర్కొన్నారు. అభివృద్ధిని ఓర్వలేక బీఆర్ఎస్ శ్రేణులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. నాయకులు మహంకాళిస్వామి, బొంతల రాజేశ్, మారెల్లి రాజిరెడ్డి, ముస్తాఫా, తిప్పారపు శ్రీనివాస్, సింగరేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజ్ఠాకూర్ -
ఆన్లైన్లో వాటర్ ట్యాక్స్
కోల్సిటీ(రామగుండం): వాటర్ ట్యాక్స్ చెల్లింపులు ఇప్పుడు సులభతరమయ్యింది. మాన్యువల్ పద్ధతికి చెక్ పెట్టారు. ఎట్టకేలకు ఆన్లైన్లో నల్లా బిల్లు చెల్లించే సౌలభ్యాన్ని రామగుండం నగరపాలక సంస్థ అధికారులు అమల్లోకి తీసుకొచ్చారు. గురువారం కార్యాలయంలో కమిషనర్ జె.అరుణశ్రీ హ్యాండ్ హెల్డ్ మిషన్ ద్వారా నల్లా బిల్లు స్వీకరించి మొదటి రశీదు వినియోగదారుకు అందజేశారు. మాన్యువల్తో ఇబ్బందులు నల్లా కనెక్షన్ వినియోగదారులు ఇప్పటివరకు నగరపాలక కార్యాలయం కౌంటర్లో, బిల్కలెక్టర్కు నగదు చెల్లించి మాన్యువల్ ద్వారా రశీదు పొందేవారు. మరోసారి బిల్లు చెల్లించేటప్పుడు నల్లా కనెక్షన్ జారీ చేసిన సందర్భంగా ఇచ్చిన పాస్బుక్, పాత రశీదు అవసరమై ఉండేది. దీంతో పాత రశీదులు దొరక్కపోవడంతో వినియోగదారులు బిల్లులు చెల్లించినా బకాయి ఉన్నట్లు కొన్నిసార్లు రికార్డుల్లో సకాలంలో వివరాలు నమోదు కాక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆన్లైన్ సదుపాయం అందుబాటులోకి రావడంతో కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, సీడీఎంఏ వెబ్సైట్ ద్వారా ఎక్కడి నుంచైనా నగదురహితంగా బిల్లు చెల్లించవచ్చు. వార్డు అధికారి వద్ద హ్యాండ్ హెల్డ్ మిషన్ ద్వారా చెల్లించి ఆన్లైన్ రశీదు పొందవచ్చు. కాగా నగరపాలక పరిధిలో 40,244 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, సీనియర్ అసిస్టెంట్ సాగర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్రావు, మెప్మా టీఎంసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించిన బల్దియా కమిషనర్ మాన్యువల్ బిల్లులకు చెక్ -
కనీస పెన్షన్ రూ.10వేలు ఇవ్వాలి
గోదావరిఖని(రామగుండం): సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. గురువారం పార్లమెంట్లో ఈసమస్యను లేవనెత్తారు. రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పథకం రివైజ్ కావడం లేదన్నారు. ఇప్పటికీ పెన్షన్ రూ.500 నుంచి వెయ్యి మధ్య ఉండడం తీవ్రమైన అన్యాయమన్నారు. కనీస పెన్షన్ రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సరైన న్యాయం చేయాలని, సీఎంపీఎఫ్ ట్రస్ట్పై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పీకర్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రోశయ్య వర్ధంతిగోదావరిఖని: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య వర్ధంతిని గురువారం రామగుండం పోలీస్కమిషనరేట్లో ఘనంగా నిర్వహించారు. సీపీ అంబర్కిషోర్ఝా ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించాలిపెద్దపల్లి: ఉద్యోగులు, సిబ్బంది పనితీరును సూపర్వైజర్లు పర్యవేక్షించాలని డీఎంహెచ్వో వాణిశ్రీ సూచించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా యోగా, ఇతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. జ్వరాల సర్వే, డ్రై డే, ఫ్రై డే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, పిల్లలకు వందశాతం టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రోగ్రాం అధికారులు ఆర్.రాజమౌళి, బి. శ్రీరాములు, కేవీ సుధాకర్రెడ్డి, బి.కిరణ్కుమార్, పీహెచ్సీల వైద్యాధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. విద్యార్థుల ఆలోచనలు భేష్జ్యోతినగర్(రామగుండం): విద్యార్థుల శాసీ్త్రయ ఆలోచనలు భేషుగ్గా ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద అన్నారు. గురువారం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్లోని జెడ్పీహైస్కూల్లో జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనల ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. వివిధ అంశాలపై విద్యార్థులు 218 ప్రదర్శనలను రూపొందించారని తెలిపారు. సీనియర్స్లో ఏడు, జూనియర్స్లో ఏడు ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో ఎంపికై నవారు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు ప్రశంసాపత్రాలు అందించారు. జిల్లా సైన్సు అధికారి వి.హనుమంతు, ఎంఈవో మల్లేశం, సురేంద్రకుమార్, హరిప్రసాద్, విమల, కొమురయ్య, హెచ్ఎంలు స్వర్ణలత, ఆగయ్య, రాంరెడ్డి, ఓదెలు, మల్లారెడ్డి, చంద్రయ్య, జగదీశ్వర్, శ్రీనివాచారి పాల్గొన్నారు. పారిశుధ్య సిబ్బంది పని వేళల్లో మార్పులుకోల్సిటీ(రామగుండం): వార్డు అధికారులు త మ దైనందిన విధుల్లో భాగంగా డివిజన్లలో పారిశుధ్య నిర్వహణ తీరుపై మరింత సమర్థవంతంగా పర్యవేక్షణ చేయాలని రామగుండం బల్దియా కమిషనర్ జె.అరుణశ్రీ అన్నారు. గు రువారం వార్డు అధికారులతో నిర్వహించిన స మావేశంలో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మే రకు చలి తీవ్రతను దష్టిలో ఉంచుకొని పారి శుధ్య సేవల పని వేళలను సవరించినట్లు తెలి పారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండో షిఫ్టులో సిబ్బంది సేవలందిస్తారన్నారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో సరైన పారిశుధ్య నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఫలించని ఏకగ్రీవ ‘పంచాయతీ’
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కూనారం సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్కు కేటాయించారు. ఆ కుర్చీ కోసం ఎనిమిది మంది ఆశావహులు నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్గా ఒకరే పోటీలో ఉండేలా మిగతావారు పోటీనుంచి తప్పుకునేందుకు సమావేశం కావాలని నిర్ణయించారు. బుధవారం స్థానిక హనుమాన్ ఆలయ పరిసరాల్లో సమావేశం నిర్వహిస్తామని, గ్రామస్తులు అందరూ హాజరు కావాలని ఊళ్లో దండోరా వేయించారు. అనుకున్నట్లే అందరూ సమావేశమయ్యారు. సర్పంచ్ పదవి కోసం ఎనిమిది మంది పోటీపడుతున్నారని, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఒక్కరే పోటీలో ఉండి, మిగతా వారంతా నామినేషన్లు ఉపసంహరించుకోవాలని గ్రామస్తులు కోరారు. ప్రచారం కోసం వృథాగా ఖర్చు చేయకుండా, ఎవరోఒకరే ఉంటే ఏకగ్రీవమవుతుందని ప్రతి పాదించారు. దీనిని అభ్యర్థులు తిరస్కరించారు. ఇన్నాళ్లూ బీసీ మహిళ, బీసీ జనరల్, జనరల్ స్థానాలకు ఏకగ్రీవం ప్రతిపాదన ఎందుకు చేయలేదని, ఎస్సీ జనరల్ స్థానానికి కేటాయించగానే ఏకగ్రీవం ప్రతిపాదన చేయడంలో ఆంతర్యం ఏమిటని కొందరు గ్రామస్తులు, అభ్యర్థులు ప్రస్తావించారు. ఎవరూ ఖర్చులపాలు కావొద్దని తామీప్రతిపాదన చేశామని గ్రామస్తులు అన్నారు. గడువులోగా ఒక్కరు తప్ప మిగతా అందరూ పోటీనుంచి తప్పుకోవాలని కోరారు. దీంతో ఎనిమిది మందిలో ఐదుగురు నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకున్నా రు. ముగ్గురు అభ్యర్థులు మాత్రం పోటీలోనే ఉన్నా రు. కవ్వంపెల్లి శ్రీకాంత్, గూల్ల తిరుపతి, బొట్కు రవీందర్, బందెల శంకర్, జూపాక ప్రవీణ్ పోటీ నుంచి తప్పుకున్నారు. జంజర్ల సుందర్రాజు, మంథెన రాజయ్య, మార తేజ పోటీపడుతున్నారు. గ్రా మస్తుల ఏకగ్రీవ ప్రతిపాదన ఫలించకపోవడంతో పోటీ అనివార్యమైందనే చర్చ సాగుతోంది. కూనారం సర్పంచ్ బరిలో ముగ్గురు -
ఎన్నికలకు బందోబస్తు
పెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని డీ సీపీ భూక్యా రాంరెడ్డి కోరారు. అప్పన్నపేటలో బు ధవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్కుమార్తో కలిసి డీసీపీ పరిశీలించా రు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పో లీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ముసుగులో ఇబ్బందులు సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. బసంత్నగర్ ఠాణా తనిఖీ పాలకుర్తి(రామగుండం): బసంత్నగర్ ఠాణాను డీసీపీ భూక్యా రాంరెడ్డి తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై శ్రీధర్ ఉన్నారు. -
మఫ్టీలో షీటీం బృందాల నిఘా
గోదావరిఖని: మహిళల రక్షణ కోసం షీటీం బృందాలు ప్రత్యేకంగా నిఘా కొనసాగిస్తున్నాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. మహిళలు ప్రధానంగా సామాజిక మాధ్యమాలతో జాగ్రత్తగా ఉండాలని కమిషనర్ సూచించారు. ప్రజల్లోనే.. ప్రజల మాదిరిగానే.. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల పనివేళ లు ముగిసే సమయానికి ప్రజల మధ్య సాధారణ జనాల్లాగా షీటీంలు మఫ్టీలో నిఘా ఉంటాయని సీపీ తెలిపారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో కేసు, గుడ్టచ్, బ్యాడ్ టచ్, ఆత్మహత్యలు, డ్రగ్స్, బాల్యవివాహాలు, మహిళా చట్టాల పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సమస్య తలెత్తిన వెంటనే డయల్ 100కు ఫోన్చేస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. టీ సేఫ్ యాప్, మహిళల భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహ న కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. షీటీం సభ్యులు నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తారని, ఆన్లైన్ క్యూఆర్ కోడ్, వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ షీటీం 63039 23700, పెద్దపల్లి జోన్ షీ టీం 87126 59386, మంచిర్యాల జోన్ షీటీం 87126 59386 నంబర్లకు ఫోన్కాల్చేసి సందేశం పంపించాలని ఆయన సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా -
బైపాస్ రోడ్డు కోసం భూసేకరణ
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం బైపాస్ రోడ్డు మంజూరు చేసిందని, అందుకు అవసరమైన భూమి కోసం అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహిస్తారని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామ శివారు ప్రాంతంలో బైపాస్రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన భూమిని కలెక్టర్ శ్రీహర్ష బుధవారం పరిశీలించారు. రైతులకు పరిహారం అందించిన తర్వాతే భూసేకరణ చేపడతామని ఆయన అన్నారు. భూసేకరణపై రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించిన తర్వాతే భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగుతుందని తెలిపారు. ఎవ రూ అనవసరంగా ఆందోళన పడొద్దని కలెక్టర్ సూ చించారు. ఆయన వెంట ఆర్డీవో గంగయ్య, ఆర్ అండ్ బీ ఈఈ భావ్సింగ్, ఇన్చార్జి తహసీల్దార్ వి జేందర్, సర్వేయర్లు, అధికారులు పాల్గొన్నారు. మా భూములు లాక్కుంటారా? తమకున్న కొద్దిపాటి భూమిలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పైప్లైన్ కోసం ఇప్పటికే కొంత ఇచ్చామని, ఇప్పు డు చెప్పాపెట్టకుండా బైపాస్ రోడ్డు కోసమని తమ భూముల్లో హద్దులు ఏర్పాటు చేయడం సరికాదని అప్పన్నపేట గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమెల్యే విజయరమణారావు, కలెక్టర్ కో య శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లి తమకు అన్యాయం చేయవద్దని వేడుకున్నామని బాధిత రైతులు మందల రాజిరెడ్డి, పిడుగు రాయలింగు, శ్రీనివాస్, కటకం రాజయ్య, పోలం లక్ష్మయ్య, బోయిని రాజేశం, దాడి రాజయ్య, బాలకృష్ణ, ఆలేటి రాజు, మెండె జక్కులు తదితరులు తెలిపారు. క్రమం తప్పకుండా హాజరవ్వాలి దివ్యాంగులు భవిత కేంద్రానికి క్రమం తప్పకుండా హాజరవ్వాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లోని కొత్త భవిత కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వారంలో రెండుసార్లు దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ చేస్తారని అన్నారు. ఇందులో చదువుకునే వారికి రూ.5 వేల స్కాలర్షిప్ను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, డీఈవో శారద, ఎంఈవో సురేందర్కుమార్, ఎస్వో కవిత, ఐఆర్పీలు సంధ్యారాణి, రజని పాల్గొన్నారు. అభ్యంతరాలు పరిష్కరిస్తాం కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి అప్పన్నపేట శివారులో స్థల పరిశీలన -
కాంగ్రెస్లో జోష్!
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షిప్రతినిధి,కరీంనగర్: హుస్నాబాద్లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ బలపరుస్తున్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో ఉత్సాహం నింపింది. పల్లెల్లో పట్టు సాధిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని సీఎం రేవంత్రెడ్డి అభ్యర్థుల్లో నింపే ప్రయత్నం చేశారు. ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చామంటూ సీఎం సభలో చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్త్రెడ్డి మొదట హుస్నాబాద్కు మంజూరైన ఇంజినీర్ కళాశాలకు రూ.45 కోట్లు మంజూరు చేస్తూ పనులకు శంకుస్థాపన చేశారు. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేశ్ కుమార్ ఇటీవల అమెరికాలో పర్యటించగా, అక్కడ ఓ ఎన్నారై అందించిన 70 సైకిళ్లను సీఎం చేతిలో మీదుగా ఇంజినీరింగ్ విద్యార్థినులకు అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. గత పదేళ్లు పాలించిన పార్టీ లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే కూలేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మాణం చేసిన ఎస్సారెస్పీతోనే కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగునీరందుతుందని తెలిపారు. సిద్దిపేట, మెదక్, గజ్వేల్లను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వం హుస్నాబాద్ను నిర్లక్ష్యం చేసిందన్నారు. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన గౌరవెళ్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాగా.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఎలాంటి వరాలు ఇవ్వకుండా సీఎం నిరాశపరిచారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మన్కుమార్, గడ్డం వివేక్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పాల్గొన్నారు. -
కుళ్లిన ఆహారం.. జరభద్రం
రోజుల తరబడి నిల్వచేసిన పదార్థాలు.. కుళ్లిన ఆహారం.. ఆపై కల్తీచేస్తున్న భోజనం.. నిబంధనలు అతిక్రమించి విక్రయం.. జిల్లాలోని కొన్ని రెస్టారెంట్, హోటల్ నిర్వాహకుల నిర్వాకం ఇది. బాధితులు చేసిన ఫిర్యాదులతోనే ఇవి వెలుగులోకి రాలేదు. సంబంధిత శాఖ అధికారుల తనిఖీల్లోనూ బట్టబయలైన వాస్తవం ఇది.కోల్సిటీ (రామగుండం): ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ, ప్రస్తుతం కల్తీ, కుళ్లిన ఆహార పదార్థాలు తిని జిల్లావాసులు చాలామంది అనారోగ్యానికి గురవు తున్నారు. పేరుగాంచిన రెస్టారెంట్లలో నిల్వచేసిన మాంసం, ఇతర ఆహార పదార్థాలు తినేందుకు వెళ్లేవారికి వడ్డించి వ్యాధులు అంటగడుతున్నారు కొందరు రెస్టారెంట్, హోటళ్ల నిర్వాహకులు. రోజుల తరబడి నిల్వ రామగుండం నగరంలోని పలు రెస్టారెంట్లలో ఇటీవల తనిఖీలు చేసిన అధికారులు.. అక్కడి పరి స్థితులు చూసి కంగుతున్నారు. వంటశాలల్లో పరిశుభ్రత లోపించడాన్ని గుర్తించారు. ఫ్రిజ్లలో రోజుల తరబడి నిల్వచేసిన ఆహార పదార్థాలను వారు గమనించారు. అసలే వ్యాధుల కాలం. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆహార పదార్థాలు తింటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నా రు. కేవలం లాభార్జనే ధ్యేయంగా ఆయా రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారనే ఆగ్రహం జిల్లావాసుల్లో వ్యక్తమవుతోంది. పేరుగాంచిన హోటళ్లలోనూ.. జిల్లాలోని రామగుండం నగరంతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల పరిధిలో సుమారు వెయ్యికిపైగా హోటళ్లు ఉన్నాయి. పేరుకే పెద్దహోటళ్లు. ధరలు కూడా అదేస్థాయిలో ఉంటా యి. కానీ.. ఆహారం విషయానికి వస్తే అంతా కల్తీ యే. రెస్టారెంట్లు, హోటళ్లలోని ఆహారం తింటే వ్యాధుల బారిన పడి ఆస్పత్రులకు పరుగులు తీ యాల్సిందేనని పలువురు ఆందోళన చెందుతున్నా రు. చాలారెస్టారెంట్ల నిర్వాహకులు.. నిల్వచేసిన ఆహారాన్నే మళ్లీ వండి వడ్డిస్తున్నారు. ఫ్రిజ్లలో రో జుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, మటన్, రసాయనాలతో కూడిన కుళ్లిన ఫుడ్ను వండి కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు సమాచారం. ఫ్రిజ్లో నిల్వచేస్తున్న ఆహార పదార్థాలు దుర్వాసన రాకుండా వాటిలో రసాయనాలు కలుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అపరిశుభ్రంగా వంటగదులు.. జిల్లాల్లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, బార్ల కిచెన్లు అపరిశుభ్ర వాతావరణంలో ఉంటున్నాయి. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన కిచె న్, నిల్వ ఉంచిన మాంసం, కూరగాయలు వండి వ డ్డిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల పలు హో టళ్లలో భోజనంలో బొద్దింకలు సైతం వచ్చిన ఘటనలు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఫుడ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కా రణమని విమర్శలు వస్తున్నాయి. నిత్యం తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదర్థాల తనిఖీపై వివరాలు తెలుసుకోవడానికి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ను ఫోన్లో సంప్రదించగా.. సమాధానం ఇవ్వలేదు. రెస్టారెంట్లు, హోటళ్లలో నిల్వచేసిన పదార్థాలు ఎక్కడా కానరాని ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు బల్దియా అధికారుల మొక్కుబడి సోదాలు అనారోగ్యం పాలవుతున్న జిల్లావాసులు -
పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడి తొలగింపు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు లకిడి భాస్కర్ను ఆ బాధ్యతల నుంచి తొ లగించారు. దీంతోపాటు కౌన్సిల్ సభ్యత్వాన్ని ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఈమేరకు పెద్దపల్లి బార్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించిందని అసోసియేషన్ ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నిర్వహించిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధ్యక్షుడి హోదాలో భాస్కర్ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఠాకూర్ అజయ్ క్రాంతిసింగ్ను అధ్యక్షుడిగా నియమించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాది సి.సత్యనారాయణరెడ్డితో పాటు దాసరి వెంకటరమణారెడ్డి, రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. తీర్మానించిన కౌన్సిల్ కార్యవర్గం -
నేడు ఏఏఐ బృందం పర్యటన
రామగుండం: అంతర్గాం ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అవసరమైన ప్రీ ఫిజిబిలిటీపై అధ్యయనం కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ప్రతినిధులు బృందం గురువారం పర్యటిస్తుంది. ఉదయం 9 గంటలకు ప్రతినిధులు అంతర్గాం చేరుకుంటారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సైబర్ నేరాలపై అప్రమత్తం జ్యోతినగర్(రామగుండం): సైబర్ నేరాలపై అ ధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దక్షిణ ప్రాంత సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)ఎస్ఆర్ శరవణన్ సూచించారు. మల్కాపూర్ రోడ్డులోని సీఐఎస్ఎఫ్ బ్యారక్స్లో బుధవారం ఏర్పాటు చేసిన సైనిక సమ్మేళనంలో ఆ యన మాట్లాడారు. వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణ పెంచుకుని అంకితభావంతో పనిచేయాలన్నా రు. అనంతరం ఎన్టీపీసీ ప్రాజెక్టులోని డ్యూటీ పోస్టులు సందర్శించారు. భద్రతా ఏర్పాట్లు బా గున్నాయని సీఐఎస్ఎఫ్ సిబ్బందిని అభినందించారు. సీఐఎస్ఎఫ్ యూనిట్ సీనియర్ క మాండెంట్ అరవింద్కుమార్ పాల్గొన్నారు. పనితీరుకు పురస్కారం పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: జిల్లా ప్రభుత్వ ఆస్ప త్రిలోని సిబ్బందికి పనితీరు ఆధారంగా స్టార్ పెర్పార్మర్ అవార్డు అందిస్తున్నామని సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. ఇందులో విజ్జుభా య్ అనే స్టాఫ్ నర్స్ మెరుగైన పనితీరు ప్రదర్శించడంతో బుధవారం అవార్డు అందించిన ట్లు పేర్కొన్నారు. ఆర్ఎంవో విజయ్కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున ఉన్నారు. విద్యార్థుల సృజన అద్భుతం జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ జెడ్పీ హై స్కూల్లో రెండోరోజు బుధవారం చేపట్టిన సై న్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ పాఠశాలల విద్యార్థులు తాము తయారు చేసిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన న్యాయ ని ర్ణేతలు.. ఆ తర్వాత మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకత, సైన్స్ ఆవిష్కరణలు బాగున్నా యన్నారు. డీసీఈబీ కార్యదర్శి హనుమంతు, రామగుండం, ముత్తారం, పాలకుర్తి, పెద్దపల్లి ఎంఈవోలు మల్లేశం, హరిప్రసాద్, విమల, సురేంద్రకుమార్, హెచ్ఎంలు స్వర్ణలత, ఆగ య్య, ఓదెలు, మల్లారెడ్డి పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,231 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,231 ధర పలికింది. కనిష్టంగా రూ. 6,011, సగటు రూ.7,011గా ధర నమోదైందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు తీసుకొచ్చిన 612 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సుగోదావరిఖనిటౌన్: కర్ణాటకలోని వివిధ పుణ్యక్షేత్రాలకు గోదావరిఖని నుంచి ఆర్టీసీ బస్సు న డిపిస్తామని డిపోమేనేజర్ నామభూషణం తెలిపారు. ఈనెల 6న సూపర్ లగ్జరీ బయలు దేరుతుందన్నారు. యాత్రలో హంపి, గోకర్ణ, ము రుడేశ్వర, ఉడిపి, శృంగేరి, ధర్మస్థల, కుక్కేసుబ్రహ్మణ్య, మంత్రాలయం దర్శనం ఉంటుంద న్నారు. పెద్దలకు రూ.6,600, పిల్లలకు రూ. 5,000 చార్జీ నిర్ణయించినట్లు వివరించారు. అలాగే 15న అరుణాచలం యాత్రలో భాగంగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశంభో, మధురై, రామేశ్వరం, విష్ణుకంచి, శివకంచి, జోగులాంబ దర్శనం ఉంటుందన్నారు. పెద్దలకు రూ.8,000, పిల్లలకు రూ. 6,000 చార్జీ నిర్ణయించినట్లు వివరించారు. అమరుల ఆశయాలు సాధించాలిపెద్దపల్లి: తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి ఆశయాలు సాధించాలని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్ కోరారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద అమరుడు శ్రీకాంతచారి వర్ధంతిని బుధవారం నిర్వహించారు. శ్రీమన్నారాయణ, సంపత్ ఉన్నారు. -
అయ్యప్పా.. ఒకటే ట్రిప్పా?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లా అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రై లు విషయంలో తీవ్ర నిరాశ ఎదురవుతోంది. నాందేడ్ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైలు ఒక ట్రి ప్ అది కూడా దిగువమార్గంలో వయా కరీంనగర్– పెద్దపల్లి మార్గంలో ఏటా నడిపిస్తున్నారు. ఈ రైలు ఉమ్మడి జిల్లాలోని అయ్యప్ప స్వాములకు, భక్తుల కు సరిపోవడం లేదు. ముఖ్యంగా మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట నుంచి శబరిమల వెళ్లే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం ఈనెల మొత్తం, వచ్చేనెల 15 (సంక్రాంతి ) మకరజ్యోతి వరకు శబరిమల సన్నిధానం తెరచి ఉంటుంది. ఈ మాసంలో ఉమ్మడి జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు, అయ్యప్ప మాలధారులు శబరిమల దర్శనానికి వెళ్తుంటారు. వీరికి అందుబాటులో ఉండేది రైలుమార్గమే. ఇందుకు తగినన్ని రైళ్లు ఉమ్మడిజిల్లా నుంచిలేవు. రామగుండంలో ప్ర తీరోజు నిలిచే 12626 కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రెండు నెలల ముందు రిజర్వేషన్ చేసుకున్న కూడా కన్ఫర్మ్ కానీ పరిస్థితి. ఇది దేశంలో అత్యంత దూ రం నడిచే రైళ్లలో ఒకటి. 16318 హిమసాగర్ వీక్లీ ఎ క్స్ ప్రెస్, 22647 కోర్బా బైవీక్లీ సూపర్ ఫాస్ట్ రైళ్లలో నూ ఇదే పరిస్థితి. ఈ సమయంలో దక్షిణ మధ్య రై ల్వే జోన్ తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రాల నుంచి కొల్లాం లేక కొట్టాయం వరకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. ఇవి ఏపీలోని కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, విశాఖపట్నం, చర్లపల్లి, కాజీ పేట, వికారాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ మా ర్గాల్లో 10 ట్రిప్పులు ఎగువ, దిగువ మార్గాల్లో నడిపిస్తుంటే, కరీంనగర్ నుంచి ఏటా తూతూ మంత్రంగా ఒకట్రిప్ వేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. సిర్పూర్కాగజ్నగర్ నుంచి ఒక ట్రిప్ కూ డా వెళ్లడం లేదు. ఈ నిర్లక్ష్య వైఖరిపై శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు ఎంపీలు చొరవ తీసుకోవాలి ఏటా వేలాదిమంది భక్తులు ఉమ్మడి జిల్లా నుంచి శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో నాందేడ్ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైలులో దిగువ మార్గంలోనే అవకాశం కల్పించడంపై భక్తులు మండిపడుతున్నారు. తక్షణమే కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజా మాబాద్ ఎంపీ అరవింద్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవ తీసుకొని నాందేడ్ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైళ్ల సర్వీసులను కనీసం ఎగువతోపాటు దిగువ మార్గాల్లో మొత్తంగా 8 ట్రిప్పులు నడపాలని ఈ ప్రాంత భక్తులు కోరుతున్నారు. నాందేడ్ – కొల్లాం ప్రత్యేక రైలు దిగువకే హాల్టింగ్ ప్రత్యేక రైలులోనూ ఇంటికి వచ్చేందుకే అవకాశం శబరిమల వెళ్లేందుకు కేరళ ఎక్స్ప్రెస్లో దొరకని సీట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయ్యప్ప భక్తుల తీవ్ర అసహనం ముగ్గురు ఎంపీలు జోక్యం చేసుకోవాలని వినతి -
పారుపల్లి పెద్దచెరువు పరిరక్షణకు చర్యలు
ముత్తారం(మంథని): పారుపల్లి పెద్దచెరువును జిల్లా వెట్ల్యాండ్ కమిటీ సభ్యులు, అదనపు కలెక్టర్ వేణు, జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య బుధవా రం పరిశీలించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు చెరువుల పరిరక్షణ, నీటి సామర్థ్యం పెంపుతో అటవీ జంతువులు, పక్షుల దాహం తీర్చడం లక్ష్యంగా పారుపల్లి పెద్దచెరువు పరిశీలిస్తున్నామని అదనపు కలెక్టర్ తెలిపారు. చెరువు విస్తీర్ణం, ఆయకట్టు సాగుపై స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చెరువు పరిశీలనను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి చేస్తారని ఆయన అన్నా రు. ఈమేరకు తాము రూపొందించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. చెరువు పరిరక్షణ కోసం స్థానికులతో కమిటీ ఏర్పా టు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ బలరామ్, డీఈఈ రాజేంద్రనాథ్, తహసీల్దార్ మధూసూదన్రెడ్డి, స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లా వెట్ల్యాండ్ కమిటీ వెల్లడి -
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కొందరికి నష్టం.. అయినా, చాలామందికి సౌకర్యం.. అందుకే రామగుండం నగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు రూ.29 కోట్ల వ్యయంతో రహదారులు, డెకోరేటెడ్ లైటింగ్ సిస్టం, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అధునాతన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రబిందువైన లక్ష్మీనగర్ను అందంగా రూపొందిస్తున్నారు. గతంలో ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని ఇరుకై న లక్ష్మీ నగర్, మేదరిబస్తీ, కల్యాణ్నగర్, మేకలమార్కెట్ ఏరియాలు సుందరంగా తయారవుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యే గా మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ గెలిచాక నగరం రూపురేఖలు మారుతున్నాయని స్థానికులు కితాబివ్వడం గమనార్హం. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి ‘ప్రగతి’లో పనులు -
గెలుపే ధ్యేయంగా..
సాక్షి పెద్దపల్లి: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రా జకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నా యి. పార్టీ రహితమైనా.. తమ పార్టీ మద్దతుతో అ భ్యర్థులను గెలిపించుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. ప్రత్యర్థులను తట్టుకొనే వారికోసం అన్వేషి స్తున్నాయి. బలాలు, బలహీనతలు, సామాజికవర్గా ల మద్దతు తదితర కోణాల్లో ఆరా తీస్తున్నాయి. నేడు తొలివిడత నామినేషన్ల ఉపసంహరణకు గడువు తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ గడవు బుధ వారం ముగియనుంది. మంగళవారం రెండోవిడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మూడో విడత నామినేషన్లు స్వీకరణ బుధవారం ప్రారంభంకానుంది. పల్లెలో ఎన్నికల హడావుడి పెరిగింది. పార్టీల మద్దతుతో పోటీచేసే వారు తమ నేతల తో ప్రచారం హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు. జనరల్ స్థానాల్లో పోటీతీవ్రం.. రిజర్వేషన్ స్థానాలతో పోల్చితే.. జనరల్ స్థానాల్లో పోటీ అధికంగా ఉంది. మూడుప్రధాన పార్టీల్లో జనరల్ స్థానాల నుంచి ముఖ్యనేతలు బరిలో దిగేందు కు సిద్ధంగా ఉన్నారు. అయితే, జనరల్ స్థానాల్లో అ భ్యర్థుల ఎంపిక పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. పార్టీ పరంగా 42శాతం బీసీలకు కేటాయిస్తామ న్న కాంగ్రెస్లో.. జనరల్ స్థానంలో అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేలకు సవాల్గా మారింది. హస్తం పార్టీలో ఎమ్మెల్యేలపైనే భారం స్థానిక ఎన్నికల్లో 80 శాతం కాంగ్రెస్ మద్దతుదారు లే విజయం సాధించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ఎమ్మెల్యేలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన పట్టుతో పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం ఎత్తు లు వేస్తున్నారు. సర్పంచ్ తర్వాత జెడ్పీ, మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎలాగైనా మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు చేరికలను ప్రో త్సహిస్తూ బుజ్జగింపులకు దిగుతున్నారు. సాధ్యమైనన్ని సీట్లు గెలవాలని .. ఎంపీ ఎన్నికల్లో సాధించిన ఓట్లను స్ధిరమైన ఓటు షేర్గా మార్చుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నా రు. అధికార పార్టీకి ధీటుగా తమ మద్దతుదారుల ను అన్నిస్థానాల్లో నిలిపేలా కార్యాచరణ చేపట్టింది. మాజీఎమ్మెల్యే గుజ్జుల రామకృస్ణారెడ్డి ముఖ్యకార్యకర్తల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ముఖ్యకార్యకర్తల సమ్మతితోనే అభ్యర్థిని బరిలో దించేలా కమళదళం సమయాత్తమవుతోంది. గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతోనే పల్లెల్లో అభివృద్ధి కుంటుపడిందని, కేంద్ర ప్రభుత్వంతో పల్లెలకు వచ్చిన పథకాలు, ప్ర యోజనాలను వివరిస్తూ ముందుకెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతోపాటు గ్రామస్థాయి ప్రజా సమస్యలను లేవనెత్తి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు చూపించి విజ యం సాఽధించేలా బీఆర్ఎస్ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే దీక్షాదివస్తో పేరిట పార్టీ శ్రేణులకు పంచాయతీ ఎన్నికల్లో దిశానిర్దేశం చేసింది. పంచాయతీల వారీగా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన అ సంతృప్తి శ్రేణులను తమ పార్టీలో చేర్చుకోవడంపై ప్రత్యేక దృషి సారించింది. గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల ప్రణాళిక 80 శాతం స్థానాలు దక్కించు కునేలా కాంగ్రెస్ కసరత్తు సాధ్యమైనన్ని సీట్లలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహం ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ బీఆర్ఎస్ రంగంలోకి.. పల్లెల్లో ఊపందుకున్న స్థానిక ఎన్నికల ప్రచార పర్వం -
పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు
పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికలకు పగడ్బందీ ఏర్పా ట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పంచాయతీ ఎ న్నికల నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్లో స మీక్షించారు. రిటర్నింగ్, పోలింగ్ అధికారులు, సి బ్బందికి ఎన్నికలపై శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికల సిబ్బందికి రెండోదశ సిబ్బంది ర్యాండమైజేషన్ పూ ర్తయ్యాక పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించాలని తెలిపారు. నిబంధనల ప్రకారం అభ్యర్థుల ప్రకట న, గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ ముద్రణ కు పక్కాగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూ చించారు. తొలివిడత పోలింగ్ గ్రామాలకు బ్యాలెట్ బాక్స్లు తరలించాలని చెప్పారు. 21 మందికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీచేసేందుకు నామినేషన్లు వేస్తే తమకు సమాచారం అందించాలని అ న్నారు. డీపీవో వీరబుచ్చయ్య, జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, డీసీవో శ్రీమాల ఉన్నారు. బోధనా పద్ధతుల్లో మార్పులు అవసరం ప్రభుత్వ పాఠశాలల్లో నెలరోజుల్లోగా బోధనా పద్ధతుల్లో మార్పులు రావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అకడమిక్ ప్యానెల్ బృందాల స్కూళ్ల పరిశీలనపై తన కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. తొలివిడతలో 30 ప్రభుత్వ పాఠశాలలు తనిఖీ చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 16 హైస్కూళను తనిఖీ చేశామన్నారు. ప్రతీ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలపై కనీసం 80శాతం అ వగాహన కలిగి ఉండాలని సూచించారు. అకడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం షేక్ పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
నేటినుంచి తుదివిడత నామినేషన్లు
పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: మూడోవిడత పంచాయ తీ ఎన్నికల కోసం బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే తొలి, మలివిడతల్లో నామినే షన్లు స్వీకరించారు. తుదిదశలో నాలుగు మండలా ల్లోని 91 సర్పంచ్, 852 వార్డు స్థానాలకు నామి నేషన్లు స్వీకరిస్తారు. పెద్దపల్లి మండలంలోని 30 సర్పంచ్, 294 వార్డు స్థానాల కోసం 12 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓదెల మండలంలోని 22 సర్పంచ్, 198 వార్డుస్థానాలు, సుల్తానాబాద్ మండలంలోని 27 సర్పంచ్, 246 వార్డుస్థానాలు, ఎలిగేడులోని 12 సర్పంచ్, 114 వార్డుస్థానాల కోసం ఆశావహుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు అన్నిఏర్పాట్టు పూర్తిచేశారు. నోటరీ అవసరం లేదు నామినేషన్లు దాఖలు చేస్తున్న వారు ఆ సమయంలో స్వీయప్రకటన పత్రం పూర్తిగా నింపి దాఖలు చేయాలని సుల్తానాబాద్ ఎంపీడీవో దివ్యదర్శన్రావు తెలిపారు. నామినేషన్ పత్రాలతో నోటరీ జతచేయాల్సిన అవసరం లేదన్నారు. వివరాలకు క్లస్టర్లోని హెల్ప్డెస్క్, లేదా ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. కాగా, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల మండలాల్లోని 28 నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఏసీపీ కృష్ణ తెలిపారు. ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం -
5న జాబ్మేళా
పెద్దపల్లి: టాస్క్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఈ నెల 5న జాబ్ మేళా నిర్వహిస్తామని కలెక్టర్ కో య శ్రీహర్ష తెలిపారు. ఐటీ, ఐటీయేతర రంగా లకు చెందిన 15 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. డిగ్రీ, బీటెక్, పీజీ, ఐటీఐ, డి ప్లొమా కోర్సులు పూర్తిచేసి, 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు 3 నుంచి 4 సెట్ల రెజ్యూమె కాపీలతో హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. జాప్యం లేకుండా సేవలు రామగిరి(మంథని): కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సేవలు జాప్యం లేకుండా అందిస్తున్నా మని సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్లు హరిపచౌరీ, గోవర్ధన్ అన్నారు. సింగరేణి ఆర్జీ–3 జీఎం కార్యాలయంలో మంగళవారం ప్రయాస్ కార్యక్రమంపై వారు అవగాహన కల్పించారు. తొ లుత ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగుల రివైజ్డ్ పింఛన్ పేమెంట్ 515 పీపీవో ఆర్డర్స్కాపీలను పర్సనల్ విభాగాధిపతి సుదర్శనంకు అందజే శా రు. సీనియర్ పీవోలు రాజేశం, రవిచంద్ర, ఫై నాన్స్ అధికారి భరత్, సిబ్బంది అనిత, మనోహర్, ప్రదీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లోకోపైలెట్ల ఉపవాసదీక్ష రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్లో లోకోపైలె ట్లు మంగళవారం ఉపవాస దీక్ష చేపట్టారు. వా రాంతపు విశ్రాంతి, కిలోమీటరుపై అలవెన్స్, పదోన్నతులు కల్పించాలని, రైలింజన్లలో ఏసీ లు బిగించాలని డిమాండ్ చేవారు. లోకోపైలె ట్లు సీహెచ్ రవి, సచిన్, వినయ్, వినోద్, రుద్ర చారి, శ్రవణ్, సుదీర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్చరీ పోటీలకు ఎంపిక కమాన్పూర్(మంథని): రంగారెడ్డి జిల్లా కొల్లాపూర్లో ఈనెల 7న జరి గే సీనియర్ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు మట్ట రమేశ్, మచ్చ సహస్ర ఎంపికయ్యారు. రామగిరి మండలం సెంటనరీకాలనీలోని రాణిరుద్రమదేవి మైదానంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో వీరు ప్రతిభ కనమర్చినట్లు కోచ్ రవి, ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్ తెలిపారు.ఎన్టీపీసీ ప్రాజెక్టు సందర్శన జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ప్రాజెక్టు ను సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)ఎస్ఆర్ శరవణన్ మంగళవారం సందర్శించారు. రామగుండం యూనిట్ సీనియర్ కమాండెంట్ అరవింద్కుమార్ ఆయనకు పూలమొక్క అందించారు. రెండు రోజుల ఐజీ ఇక్కడ పర్యటిస్తారు. సీఐఎస్ఎఫ్ అధికారులు, సిబ్బందితో భద్రత, రక్షణ చర్యలపై సమీక్షిస్తారు. 6న స్టేట్ సైన్స్ మీట్ రామగుండం: వికసిత్, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈనెల 6న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మోడల్ స్కూల్ విద్యార్థులకు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈమేరకు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీచేసింది. రా ష్ట్రంలోని 194 స్కూళ్ల నుంచి 776 మంది విద్యార్థులు 388 ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రీన్ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నా లజీ స్, రిక్రియేషనల్ మ్యాథమెటికల్ మోడలింగ్, హెల్త్, హైజెనిక్, వాటర్ కన్జర్వేషన్, మేనేజ్మెంట్ తదితర అంశాలపై ఆధునిక వైజ్ఞానిక ప్రదర్శనలు చేపట్టాలని పేర్కొన్నారు. విజ్ఞానం.. సాంకేతికం జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ జెడ్పీ హై స్కూల్లో మంగళవారం జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని జెడ్పీ సీఈవో నరేందర్, డీఈవో శారద ప్రారంభించారు. వి ద్యార్థులు సైన్స్, టెక్నాలజీలో ముందుండాలని వారు సూచించారు. ఇక్కడ ప్రతిభ చూపిన ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని వివరించారు. జిల్లా అకడమిక్ అధికారి పీఎం షేక్, జిల్లా సైన్స్ అధికారి హనుమంతు, సెక్టోరియల్ ఆఫీసర్లు కవిత, మల్లేశ్, అజీమ్, ఎంఈ వోలు మల్లేశం, సురేంద్రకుమార్, హరిప్ర సా ద్, విమల, హెచ్ఎం రాంరెడ్డి పాల్గొన్నారు. -
జోష్ పెరిగేనా?
హస్తంలోసాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘పల్లెల్లో’ పాగా వేసేందుకు ‘పట్టణం’లో పెట్టిన సీఎం సభపై కాంగ్రెస్ పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. మూడు దశల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీస్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచేందుకు, తద్వారా రాష్ట్రంలో పార్టీకి ఢోకా లేదని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పాత కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్లో జరిగే సీఎంసభను ప్రచార అస్త్రంగా భావిస్తున్నారు. పల్లెలను ప్రభావితం చేసేలా పెడుతున్న పట్టణ సభద్వారా మరింత జోష్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. కానీ.. ఉమ్మడి జిల్లా మంత్రుల నడుమ ఆధిపత్యపోరు, కరీంనగర్ కేంద్రంగా పార్టీ అనాథలా మారడం, నేతల మధ్య సమన్వయ లోపం, గ్రూప్పోరు.. శ్రేణులను కలవరపరుస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి సభతో ముగ్గురు మంత్రులు, విప్లు, అంతా ఏకమై సభ విజయవంతానికి తమ వంతుగా పనిచేసుకుంటూ పోతుండటం పార్టీలో పెరిగిన సహకారానికి నిదర్శనమని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం ప్రసంగంలో ఉమ్మడి జిల్లాకు ప్రకటించే వరాల జల్లుతో స్థానికసంస్థల్లో మెజారిటీ స్థానాలు హస్తగతం చేసుకునేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. మూడు ముక్కలాటకు సీఎం సభతో చెక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల నడుమ అంతర్గత ఆధిపత్యపోరు తారాస్థాయిలో ఉంది. ముఖ్యంగా హుస్నాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్కు మరో ఇద్దరు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ నడుమ ఏ విషయంలోనూ పొసగదనేది బహిరంగరహస్యమే. నామినేటెడ్ పదవుల్లో శ్రీధర్బాబుది పైచేయి కావడం, కరీంనగర్కు సంబంధించిన నియామకాల్లోనూ ఆయనే కీలకం కావడంపై అప్పట్లో పొన్నం కినుక వహించారు. ఒక దశలో సుడా చైర్మన్ నియామకాన్ని అంగీకరించేది లేదని భీష్మించుకొని ఉన్నా, ఇటీవల కాస్త మెత్తపడి, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డిని చేరువ చేసుకున్నారు. ఇక అడ్లూరి లక్ష్మణ్కుమార్పై చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు పెనుదుమారం లేపడం తెలిసిందే. పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల విషయంలో ముగ్గురి నడుమ అధికారులు నలిగిపోతూనే ఉన్నారు. సీఎంసభ నేపథ్యంలో విభేదాలన్నీ పక్కనబెట్టి అంతా కలిసి పనిచేస్తుండటం శుభసూచకం. ఈ మైత్రి మునుముందు కూడా కొనసాగి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని క్యాడర్ ఆశాజనకంగా ఉంది.అడ్లూరి లక్ష్మణ్కుమార్పొన్నం ప్రభాకర్ఉమ్మడి జిల్లా ‘హెడ్’ క్వార్టర్ అయిన కరీంనగర్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనాథలా మారింది. ఇటీవల డీసీసీ, కార్పొరేషన్ అధ్యక్షుల నియామకంతో కాసింత గాడినపడినట్టుగా కనిపిస్తున్నా, ఇప్పటికీ కరీంనగర్ ఎవరిదనే సమస్య కొనసాగుతోంది. కరీంనగర్కు చెందిన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి పోటీచేసి గెలుపొందడం, శ్రీధర్బాబు పెద్దపల్లి, లక్ష్మణ్కుమార్ జగిత్యాల జిల్లాలకు ప్రాతినిథ్యం వహించడంతో కరీంనగర్లో పార్టీకి పెద్ద దిక్కులేకుండా పోయింది. పైగా కరీంనగర్ ప్రతిపక్ష పార్టీ చేతిలో ఉండడంతో, ఆ స్థాయిలో కాంగ్రెస్కు నాయకుడు కనిపించడం లేదు. తాను కరీంనగర్ వాసినని పొన్నం ప్రభాకర్ అప్పుడప్పుడు జోక్యం చేసుకొంటున్నా, పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో పార్టీ నాయకులు ఎవరికి వారే అన్న తీరుగా మారారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్కుమార్ను నియమించిన తరువాత పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఖాళీగానే ఉంది. దీంతో నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు ఎవరికీ లేకుండా పోయాయి. ఉమ్మడి జిల్లాలో పార్టీ అసంపూర్తి సంస్థాగత నిర్మాణం సమస్యగా మారుతోంది. పూర్తిస్థాయిలో డీసీసీ, సిటీ, మండల కమిటీలను నియమిస్తే పార్టీలో కొత్త జోష్కు అవకాశముంది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికలతో పాటు, పార్టీ గుర్తులపై త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే పార్టీలో సమన్వయం ముఖ్యం. ప్రస్తుతం కాంగ్రెస్లో అదే కరువైంది. -
విమానం ఎగురాను వచ్చు..!
గోదావరిఖని: మారుమూల అంతర్గాం ప్రాంతంలో విమానం ఎగురాను వచ్చు.. పల్లెవాసులు ఫ్లైట్లో పట్టణాలు, నగరాలు, మహానగరాలే కాదు.. దేశవిదేశాలు చుట్టిరానూ వచ్చు. ఇందుకు ప్రభుత్వం మార్గం సుగమమం చేయడంలో నిమగ్నమైంది. ప్రీ ఫిజిబిలిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.50 లక్షలు కేటాయించగా.. పెద్దపల్లి ఎంపీ చొరవతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ప్రతినిధులు బుధ లేదా గురువారాల్లో అంతర్గాం ప్రాంతంలో పర్యటించనున్నారు. దీంతో జిల్లావాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. అంతర్గాంలో ఎయిర్పోర్టు ఏర్పాటు బసంత్నగర్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా అంతర్గాం మండల కేంద్రం సమీపంలో ఉన్న 591ఎకరాల భూమిలో కొత్తగ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఈక్రమంలో ఏఏఐ అధికారులు సర్వేకోసం వచ్చేందుకు రెండునెలల కిందటే సుమారు రూ.50 లక్షలు ఎయిర్పోర్టు అ థారిటీ ఆఫ్ఇండియాకు ప్రీ ఫిజిబులిటీ స్టడీ కోసం నిధులు చెల్లించింది. దీనిద్వారా కొత్త ఎయిర్పోర్టుకు ఏర్పాటుకు ముందడుగు పడినట్లయ్యింది. బసంత్నగర్లో మినీ విమానాశ్రయం.. బసంత్నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో చిన్నవిమానాల రాకపోకల కోసం యాజమాన్యం సొంతంగా మినీ ఎయిర్పోర్ట్ నిర్మించుకుంది. ఆ తర్వాత 1980లో ఎయిర్స్ట్రిప్ ద్వారా వాయుదూత్ సంస్థ కొన్ని విమాన సర్వీసులు నడిపించచింది. కారణా లు తెలియదుకానీ.. ఆ సంస్థ సేవలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మరోవైపు.. కొత్తగా విమానా శ్రయం ఏర్పాటు కోసం గతంలో అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. గుట్టలు, ల్యాండింగ్, టేకాఫ్ సందర్భంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉండడం, ఇండియర్ ఎయిర్ఫోర్స్ రిస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్ ఉండడంతో బసంత్నగర్లో ఎయిర్పోర్ట్ ఏ ర్పాటు సాధ్యంకాదని స్పష్టం చేశారు. వీటిపై అధ్యయనం.. అంతర్గాం ప్రాంతంలో పర్యటించే ఏఏఐ బృందం.. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అనుకూల, ప్రతికూల పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. ప్రధానంగా అవసరమైన భూమి, రన్వే, టెర్మినల్ నిర్మాణం, భౌగోళిక పరిస్థితులు, రవాణా, కనెక్టివిటీ, భవిష్యత్ అవసరా లు తదితర అంశాలు క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అయితే.. బసంత్నగర్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు సాధ్యం కాదని ఏఏఐ టెక్(టెక్నో ఎకనామీ ఫిజిబులిటీ రిపోర్టు) నివేదిక వెల్లడించిన నేపథ్యంలో.. కొత్త ప్రాజెక్ట్పై ‘ఫిజిబులిటీ రిపోర్ట్’ సానుకూలంగా వస్తుందా, ప్రతికూలంగా ఉంటుందా? అనేదానిపై పారిశ్రామిక ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. గంటల్లోనే విదేశాలకు.. అంతర్గాం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటైతే.. హైదరాబాద్, ఢిల్లీతోపాటు దేశ, విదేశాలకూ గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. కరీంనగర్, మంచిర్యా ల, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, ఆ సిఫాబాద్ తదితర జిల్లాలవాసులకు విమాన ప్ర యాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సీఎల్, కేశోరాం ఉద్యో గులు, అధికారుల రాకపోకలు సులభతరమవుతా యని భావిస్తున్నారు. రోడ్డు మార్గంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి. పెట్టుబడులు తరలివచ్చి పరిశ్రమలు, పరిశోధనలు, హౌసింగ్, వాణి జ్యం వంటి రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఎయిర్పోర్టు ఏర్పాటుకు మరోముందడుగు నేడు లేదా రేపు అంతర్గాంకు ఏఏఐ ప్రతినిధులు ప్రీ ఫిజిబిలిటీ కోసం రూ.50 లక్షలు విడుదల అభివృద్ధికి అవకాశం పారిశ్రామిక హబ్ రామగుండం. ఇక్కడ ఎయిర్పో ర్టు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. మంగళ, లేదా బుధ వారాల్లో ఏఏఐ ప్రతినిధులు స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి ఇక్కడ పర్యటించి ఫిజిబులిటీ నివేదిక ఇస్తారు. – రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం ఎయిర్పోర్టు సాధిస్తాం అంతర్గాంలో ఎయిర్పోర్టు ఏర్పాటు అయ్యేంత వరకూ పోరాటం చేస్తా. ఇప్పటికే పౌరవిమానయాన మంత్రి రాంమోహన్నాయుడికి విజ్ఞ ప్తి చేశాం. ఈక్రమంలో ఏఏఐ ప్రతినిధుల రాక ప్రాధాన్యతను సంతరించుకుంది.– వంశీకృష్ణ, ఎంపీ, పెద్దపల్లి -
ఎయిర్పోర్టుకు ముందడుగు
గోదావరిఖని: అంతర్గాంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు మ రో ముందడుగు పడినట్లు పె ద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్నాయుడుకు చేసిన విన్నపం మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఈనెల 3న, లే దా 4వ తేదీన అంతర్గాం ప్రాంతంలో భూ స ర్వే చేస్తుందని పేర్కొన్నారు. ప్రీ–ఫిజిబిలిటీ స్ట డీ పూర్తయ్యాక భూసేకరణ, తుది నిర్ణయాలకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎయిర్పోర్ట్ స్థాపనతో రామగుండం, సింగరేణి ప్రాంతం, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా లు, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయ ని ఆయన వివరించారు. కలెక్టరేట్ ఏవోగా ప్రకాశ్ పెద్దపల్లి: కలెక్టరేట్ పరిపాలన అధికారి(ఏ వో) గా బండి ప్రకాశ్ సోమవారం బాధ్యతలు స్వీక రించారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీహర్షను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. మద్యపానంపై నిషేధాజ్ఞలు గోదావరిఖని: బహిరంగ ప్రదేశాల్లో మద్య పానంపై నిషేదాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు రామగుండం పోలీ స్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. మహిళలు, పౌరుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ఈ నెలాఖరు వరకు ఆంక్షలు ఉంటాయన్నారు. డీజేలకూ అనుమతిలేదన్నారు. ధర్నాలు, ర్యా లీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు ని ర్వహించకూడదని, అత్యవసరమైతే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. లైఫ్సైన్సెస్ మాక్టెస్ట్ పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో సోమవారం టీఎస్ సెట్ (స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్) లైఫ్సైన్సెస్ పరీక్ష మాక్ ప్రాక్టీస్ టెస్ట్ను ఆన్లైన్లో నిర్వహించిందని ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య తెలిపారు. ప్రభుత్వం త్వరలో టెట్ ని ర్వహిస్తుందని, విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు మాక్టెస్ట్ నిర్వహించినట్లు వివరించారు. టెస్ట్లో ఉత్తీర్ణులైతే డిగ్రీ కాలేజీల్లో అ ధ్యాపక, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెస ర్ ఉద్యోగాలకు అర్హత సాధిస్తారని పేర్కొన్నా రు. టెస్ట్ నిర్వహించిన అధ్యాపకుడు తిరుపతిను ప్రిన్సిపాల్ తదితరులు అభినందించారు. ఎయిడ్స్పై అవగాహన ఉండాలిపెద్దపల్లి: ఎయిడ్స్పై అందరికీ అవగాహన ఉండాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ అన్నారు. ఎ యిడ్స్ అవగాహన దినోత్సవ ర్యాలీని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సోమవారం ప్రారంభించారు. సిరి ఫంక్షన్హాల్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. యువత డ్రగ్స్కు బానిసలు కావొద్దన్నారు. అనంతరం హెచ్ఐవీ నియంత్రణలో అత్యుత్తమ సేవలు అందించిన పలువురి కి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రోగ్రాం అధికారులు సుధాకర్రెడ్డి, రాజమౌళి, నీలిమ, ప్రతినిధులు సత్యనారాయణ, రాంకిషన్, రాజగోపాల్, బిక్షపతి, లావణ్య, శ్రీనివాస్, శ్రీనివాస్, శంకర్, రవి, సత్యానందం పాల్గొన్నారు. నేటినుంచి వైజ్ఞానిక ప్రదర్శనలుజ్యోతినగర్(రామగుండం): జిల్లాస్థాయి బాల ల, బాలికల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ అవార్డు– మనాక్ ఎగ్జిబిషన్లు మంగళవారం ప్రారంభిస్తామని డీఈవో శారద తెలిపారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో మూడురోజుల పాటు ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. పాఠశాలలో చేపట్టిన ఏర్పాట్లను సోమవారం ఆమె పరిశీలించారు. గత విద్యాసంవత్సరంలో ఎంపికై న 106 ఇన్స్పైర్ అవార్డ్స్ మనాక్ ప్రాజెక్టుల విద్యార్థులు సైతం ఇందులో పాల్గొంటారన్నారు. జిల్లా సైన్స్ఫేర్కు హాజరుకావాలని ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంతను ఆమె ఆహ్వానించారు. డీసీఈబీ కార్యదర్శి హన్మంతు, ఎంఈవోలు మల్లేశం, సురేందర్, విమల తదితరులు పాల్గొన్నారు. -
పనితీరు మెచ్చి కాంగ్రెస్లోకి..
పెద్దపల్లిరూరల్/ఎలిగేడు/ఓదెల: సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలనతీరు మెచ్చి పలు పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నార ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాసులపల్లికి చెందిన సింగిల్విండో మాజీ వైస్చైర్మన్ అలువాల దామోదర్రెడ్డి, వేల్పుల మనోహర్, భూంరెడ్డి, రాజిరెడ్డి, శంకర్, మల్లేశం, అంజయ్య, మహేందర్, సతీశ్ తదితర నాయకులు సోమవా రం కాంగ్రెస్లో చేరగా.. ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎలిగేడు మండలం శివపల్లి, ఓదెల మండలం రూపునారాయణపేటలో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించేందుకు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. పెద్దపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూరమల్లారెడ్డి, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, నాయకులు చిలుక సతీశ్, మూల ప్రేంసాగర్రెడ్డి, ఆళ్ల సుమన్రెడ్డి, బైరి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
దిగుబడి తగ్గింది.. ధర పెరిగింది
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఈసారి పత్తి సాగు చేసిన అన్నదాతలు.. ఆశించిన దిగుబడి రాలేదని దిగులు పడుతున్నారు. ప్రతీసీజన్లో నాలుగుసార్లు పత్తి ఏరి విక్రయించేవారు. ఈసారి రెండుపర్యాయాలు కూడా ఏరడం కష్టంగా మారిందని వాపోతున్నారు. అదికూడా అంతంత మాత్రమే. జిల్లా వ్యాప్తంగా 48,215 ఎకరాల విస్తీర్ణంలో పత్తి పండించారు. 5,78,580 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కానీ, ఆ స్థాయిలో దిగుబడి వచ్చే పరిస్థితిలేదు. వాతావరణ ప్రభావమే.. పత్తి పంటపై ఈసారి వాతావరణ పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉందని వ్యవసాయాధికారులు తెలిపారు. అధిక వర్షాలు, సమయం మించిన తర్వాత ఏకధాటిగా కురిసిన వానలతో గులాబీ తెగులు లాంటివి పంటను ఆశించాయి. ఎకరాకి 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తే.. 3 క్వింటాళ్ల నుంచి 4 క్వింటాళ్లకు మించి చేతికి రాలేదని రైతులు వాపోతున్నారు. ఆకు రంగు మారి కాయసైజ్ పెరగలేదని, ఆశించిన దూది రాలేదని అన్నదాతలు చెబుతున్నారు. కొనుగోళ్లు సగమే.. జిల్లాలో పత్తి దిగుబడి సగానికి పడిపోయిందా? అంటే.. అయి ఉండొచ్చని పత్తి కొనుగోళ్ల తీరును బట్టి చూస్తే తెలుస్తోంది. జిల్లాలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల ద్వారా గతేడాది (2024 నవంబర్ 30వ తేదీ) వరకు 30,318 క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోలు చేశారు. ఈ ఏడాది నవంబర్ 30 వరకు 16,106 క్వింటాళ్ల వరకే కొనుగోలు చేశారు. లైసెన్స్డ్ వ్యాపారులు గతేడాది 45 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా.. ఈసారి 18,211 క్వింటాళ్లే కొనుగోలు చేశారని మార్కెటింగ్ శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. సోమవారం కొనుగోళ్లు ఇలా.. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వివిధ గ్రామాలకు చెందిన 140 మంది రైతులు తెచ్చిన 518 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,261 ధర పలుకగా.. కనిష్టంగా రూ.6,011, సగటు రూ. 7,011గా నమోదై ఉందని ఆయన వివరించారు. జిల్లా సమాచారం సాగు విస్తీర్ణం(ఎకరాల్లో) 48,215 దిగుబడి అంచనా(క్వింటాళ్లలో) 5,78,580 నవంబర్ 30 వరకు పత్తి కొనుగోళ్లు సీసీఐ(క్వింటాళ్లలో) 16,106 విక్రయించిన రైతులు 951 అడ్తిదారులు(క్వింటాళ్లలో) 18,211 విక్రయించిన రైతులు 5,298 2024 నవంబర్లో కొనుగోళ్లు సీసీఐ(క్వింటాళ్లలో) 30,318 అడ్తిదారులు(మెట్రిక్ టన్నుల్లో) 45,000 -
6లోగా దరఖాస్తు చేయాలి
పెద్దపల్లి: వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన జిల్లాలోని క్రైస్తవులు ఉత్తమ సేవకుల అవార్డుల కోసం ఈనెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసు కోవాలని జిల్లా ఇన్చార్జి మైనారిటీ సంక్షేమ అధికారి నరేశ్ కుమార్ సోమవారం తెలిపారు. సామాజిక, విద్య, వైద్యం, సాహిత్యం, కళ, క్రీడా తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారు అర్హులన్నారు. దరఖాస్తులను www.tsc mfc.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, పూరించాక జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, పెద్దపల్లిలోని కార్యాలయంలో సమర్పించాల న్నారు. వివరాలకు 040–23391067 నంబరు లో సంప్రదించాలని ఆయన సూచించారు. -
తమ్ముడూ.. తప్పుకో!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: తొలిదశ నామినేషన్లకు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఒకటే టెన్షన్ పట్టుకుంది. అదేంటంటే.. ప్రతీ పార్టీ నుంచి నలుగురైదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామ స్థాయి కార్యకర్తలు ఏళ్లుగా స్థానిక సంస్థల్లో పోటీ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా ఆ అవకాశం రాగానే ఎగిరి గంతేసి బరిలోకి దూకారు. స్వతంత్ర అభ్యర్థులతో ఎలాంటి ఇబ్బందులు లేవుగానీ, తీరా పార్టీ అభ్యర్థులతోనే చిక్కులన్నీ. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలన్నీ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. అన్ని పార్టీల నుంచి అధిక సంఖ్యలో పోటీ ఉండడం మంచిది కాదని తలచి.. మధ్యవర్తిత్వానికి జిల్లా నాయకులను పార్టీలు రంగంలోకి దించుతున్నాయి. ఈ మేరకు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. రిజర్వ్డ్ స్థానాల కంటే జనరల్ స్థానాల్లో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో బరిలో ఉన్నారు. ఈనెల 3వ తేదీతో తొలిదశ నామినేషన్ల పర్వం ముగుస్తున్న నేపథ్యంలో సీనియర్లు బుజ్జగింపుల పర్వాన్ని ముమ్మరం చేశారు. కులం ఓట్లే ప్రామాణికం ప్రతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరికి వారు పోటీలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బుజ్జగింపుల పర్వంలోకి దిగిన సీనియర్లు అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తున్నారు. అయితే, అభ్యర్థుల సామాజిక స్థితిగతులు, అతని సామాజికవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంత ఖర్చు పెట్టగలుగుతారు? తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాంటి వారిని గుర్తించి తగిన హామీలు ఇచ్చి, పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతివ్వాలని కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో సామాజికవర్గం ఓట్లు దండిగా ఉన్న అభ్యర్థులు మెట్టుదిగేది లేదని, పోటీ చేసి తీరుతామని భీష్మించుకుంటున్నారు. ఇలాంటి వారి విషయంలో పార్టీ సీనియర్లు కూడా ఏమీ చేయలేని అయోమయంలో ఉన్నారు. అందుకే, గెలిచిన వాడే మనవాడు అవుతాడని, అప్పటి వరకూ వేచి చూసే ధోరణి అవలంబించేందుకు మొగ్గుచూపుతున్నారు.దాదాపు రెండేళ్లుగా జాప్యమైన స్థానిక ఎన్నికలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలై.. ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న వేళ.. ఆశావహులంతా నామినేషన్లు వేసి ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇదే అన్ని రాజకీయ పార్టీలకు మింగుడు పడని అంశంగా మారింది. అందుకే, సీనియర్లను రంగంలోకి దింపారు. దీంతో వారంతా నామినేషన్ వేసిన వారితో భేటీ అవుతున్నారు. పార్టీలో పదవుల పరంగా ప్రాధాన్యం కల్పిస్తామంటూ, భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కుతాయని హామీలిస్తున్నారు. అంతేకాకుండా త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం పార్టీలో పదవులు, స్థానిక సంస్థల్లో టికెట్ల అవకాశంతో పాటు అధికార పార్టీ మరో అడుగు ముందుకు వేస్తోంది. స్థానికంగా జరిగే వర్క్స్, టెండర్లలోనూ ప్రాధాన్యం కల్పిస్తామంటూ వారిలో నమ్మకం కలిగించే ప్రయత్నాలు ప్రారంభించారు. -
అప్పుడలా.. ఇప్పు‘డీలా’..
పెద్దపల్లిరూరల్: పల్లెను పాలించాలనే ఆశతోనో.. నాయకుడిగా గుర్తింపు పొందాలనే తపనతోనో యువకులు, రాజకీయ పార్టీల నేతలు పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టం పరీక్షించుకుంటుంటారు. ప్రత్యర్థులపై విజయం సాధించాలనే కసితో ప్రచారం కోసం, ఓటర్లను తమవైపు తిప్పు కోవడం కోసం రూ.లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. ప్రచార పర్వంలో వెంట తిరిగిన చోటామోట నేతలు, పోలింగ్, ఓట్లలెక్కింపు సందర్భంగా ఏజెంట్లు తదితర ముఖ్యుల కోసం విందులు, వినోదాల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. ఆశపెట్టి.. జారిపాయే.. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఫలితాలు వెలువడగా.. కొద్దిఓట్ల తేడాతో పరాజయం పాలై.. కోలుకోలేని వారు కొందరుంటారు. చేతిచమురు వదిలినా.. చేతికి పదవి దక్కలేదన్న బాధను దిగమింగుకుని ఐదేళ్లపాటు నిరీక్షిస్తారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో గత పరాజయం సానుభూతితో ఎన్నిక ల్లో గట్టెకొచ్చనే ఆశలో ఉన్న పరాజితులకు ఈసారి రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. ఈసారి పంచాయతీ స ర్పంచ్గా అవకాశం దక్కితే గతఎన్నికల్లో పరాజయం పాలై కూడగట్టుకున్న సానుభూతి కలిసొచ్చి విజ యం సాధించే అవకాశాలు ఉండే వని మదనపడుతున్నారు. ఉపసర్పంచ్ పదవిపై గురి.. గ్రామ ప్రథమ పౌరులుగా ఉండాల నే ఆలోచన ఉన్నా.. రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో కొందరు వార్డు సభ్యులుగా పోటీపడి గెలుపొంది మిగతా వార్డు సభ్యుల సహకారంతో ఉపసర్పంచ్ పదవి దక్కించుకునేందుకు సిద్ధపడుతున్నారు. గతఎన్నికల్లో పెద్దపల్లి మండ లం అందుగులపల్లి పంచాయతీ నుంచి వార్డు స భ్యులుగా పోటీకి దిగిన దంపతులు పొలవేన కు మార్, కేతమ్మ విజయం సాధించారు. ఈసారి ఓ వార్డులో రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో ఒకవా ర్డు నుంచే పోటీ చేస్తున్నానని కుమార్ తెలిపారు. ఇదే పంచాయతీ ఉపసర్పంచ్గా వ్యవహరించిన తలారి స్వప్న, ఆమెభర్త సాగర్ ప్రస్తుత వార్డు సభ్యులుగా పోటీకి దిగుతున్నట్లు పేర్కొన్నారు.కార్యదర్శులపైనే ‘పంచాయతీ’ భారంపెద్దపల్లి: పంచాయతీ ఎన్నికల వ్యయం కార్యదర్శులపైనే పడుతోంది. పంచాయతీ ఖజానాల్లో ని ధులు నిండుకున్నాయి. పాలకవర్గాలూ లేవు. దీంతో పల్లెలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈనేపథ్యంలోనే స్థానిక ఎన్నికలు జోరందుకోవడంతో నిధులు అవసరమయ్యాయి. జిల్లాలో మూ డు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈనేపథ్యంలోనే నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. మూడు విడతల్లో పోలింగ్ జిల్లాలోని 13 మండలాల్లో 263 గ్రామపంచాయతీలు, 2,432 వార్డులు ఉన్నాయి. వీటిలో నామినేషన్ల స్వీకరణకు 85 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి పరిశీలన, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు, పోలింగ్, ఫలితాలు వెల్లడి వరకు ఇలా.. వారంపాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో పాలుపంచుకునే అధికారులు, సిబ్బందికి భోజనం, అల్పాహారం, టీ అందించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం పంచాయతీ కార్యదర్శులకు తలకుమించిన భారమవుతోంది. ఇప్పటికే రెండేళ్లుగా పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ ఎన్నికల ఖర్చును జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తుందని పలువురు కార్యదర్శులు వాపోతున్నారు. ఈ విషయమై డీపీవో వీరబుచ్చయ్యను సంప్రదించగా.. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారికి టీఏ, డీఏ అందిస్తున్నామన్నారు. మానవీయ కోణంలోనే భోజనం ఏర్పాటు చేయాలని కార్యదర్శులకు సూచించామని ఆయన వివరించారు. పకడ్బందీగా ‘స్థానిక’ ఎన్నికలు పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహ ర్ష ఆదేశించారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన పంచా యతీ పోలింగ్ కేంద్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ ను సోమవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడు తూ, నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది విధు లు నిర్వర్తించాలన్నారు. నామినేషన్ వివరాలు టీ యాప్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నా రు. మండల కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్లు త్వరితగతిన పంపించాలని ఆయన సూచించారు. శ్రీపా ద ఎస్డీఆర్, జాతీయ రహదారి భూసేకరణపై ని ర్వహించి సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, పెండింగ్ భూసేకరణను వారంలో పూర్తిచేయాలన్నారు. మంచిర్యాల– వరంగల్ మధ్య నాలుగులేన్ల గ్రీ న్ఫీల్డ్ హైవే, మంథనిలోని శ్రీపాద ఎస్డీఆర్ నిర్మా ణానికి భూసేకరణ పూర్తిచేయాలని సూచించారు. డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు. -
తాగునీటికి ఇబ్బంది రానీయొద్దు
పెద్దపల్లిరూరల్: పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బదులు పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సోమవారం ఆయన వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు. పాత వాటర్ ట్యాంక్ను కూల్చివేసి కొత్తది నిర్మించే వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, మార్చి చివరినాటికి ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్, రెన్యూవల్ తదితర పన్నులు నూరుశాతం వసూలు చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని ఆయన సూచించారు. హౌస్ల విభజనతో విద్యార్థులకు మేలు పెద్దపల్లి: పాఠశాల విద్యార్థులను రెడ్హౌస్(అ బ్దు ల్ కలాం), గ్రీన్హౌస్(శకుంతలదేవి), బ్లూహౌస్ (సీవీ రామన్), ఎల్లోహౌస్(రవీంద్రనాథ్ ఠాగూర్)లుగా విభజించి విద్యాబోధన చేస్తే విద్యార్థులకు ఎంతోమేలు చేకూరుతుందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర హైస్కూల్, జిల్లా గ్రంథాలయం, ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్ట ర్ సందర్శించి పలు సూచనలు చేశారు. జెడ్పీహెచ్ఎస్లో నాలుగు హౌస్లు ఏర్పాటు చేసిన హెడ్మాస్టర్, ఉపాధ్యాయులను అభినందించారు. ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఎంఈవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై సమీక్షిస్తున్న కలెక్టర్ శ్రీహర్ష -
దిగుబడి రాలె
ఈసారి ఆశించినంత పత్తి దిగుబడి రాలె. ఆకు రంగు మారింది. పూత, కాయ వచ్చినా.. దూదిగా మారలె. వానలతో వ్యాధు లు వచ్చి దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకి మూడు, నాలుగు క్వింటాళ్లు వచ్చుడు కూడా కష్టమే. మాకు ఈసారి నష్టమే. – కల్వల తిరుపతమ్మ, కనగర్తి, పెద్దపల్లి ఎకరంలో పండించిన మాకు ఉన్న ఎకరంలో పత్తి సాగుచేసిన. ఇప్పుడే మొదటిసారి పత్తి తెచ్చిన. ఎప్పు డు ఏరినా నాలుగైదు బ స్తాల పత్తి వచ్చేది. ఈసారి బస్తన్నర కూడా రాలె. కానీ ఈసారి క్వింటాల్కు రూ.7,123 ధర పలికింది. ధర మంచిగున్నపుడు దిగుబడి రాలె. – మానుపాటి తిరుపతమ్మ, రొంపికుంట తగ్గిన కొనుగోలు జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఈసారి మందగించాయి. గతేడాదితో పోల్చితే సగం కూడా సాగలేదు. దిగుబడిపై వాతావరణ ప్రభావం పడి ఉండొచ్చని అంటు న్నారు. మార్కెట్లో సోమవారం క్వింటాల్కు అత్యధికంగా రూ.7,261 ధర పలికింది. – ప్రవీణ్రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి -
పోస్టాఫీస్ ఖాతాలే..
బోయినపల్లి సబ్ పోస్టాఫీస్ వద్ద ఖాతాలు తీసుకుంటున్న పలువురు బోయినపల్లి(చొప్పదండి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఖర్చు నిర్వహణకు జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాలనే నిబంధనను ఎన్నికల కమిషన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పలువురు అభ్యర్థులు జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు వెళ్లగా.. వారు జీరో ఖాతాలు ఇవ్వడం లేదు. దీంతో పలువురు పోస్టాఫీస్లో ఖాతాలు తెరుస్తున్నారు. సోమవారం ఒక్క రోజే బోయినపల్లి సబ్ పోస్టాఫీస్లో 60 వరకు కొత్త ఖాతాలు తెరిచినట్లు పోస్టల్ అధికారులు తెలిపారు. ఇంకా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ మంగళవారం ఇస్తామని చెప్పారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్కు చెందిన గుండ బీమలింగం (59) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. బీమలింగం మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానలేకపోతున్నాననే మానసిక వేధనతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లింగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ● రైలు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి కరీంనగర్రూరల్: గుజరాత్ రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందడంతో స్వగ్రామం బొమ్మకల్లో విషాదం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం.. బొమ్మకల్కు చెందిన గన్ను రాజిరెడ్డి–సునీత దంపతుల కుమారుడు సాయి వర్ధన్రెడ్డి(20) గుజరాత్లోని రాజ్కోట్లో గల మార్వాడి యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం తోటి విద్యార్థులతో కలిసి అవుటింగ్లో భాగంగా హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 2గంటలకు తిరిగి హాస్టల్కు వస్తుండగా పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొట్టింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కరీంనగర్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు రాజ్కోట్లోని లయన్స్క్లబ్ను సంప్రదించగా సాయివర్ధన్రెడ్డి మృతదేహానికి సోమవారం పోస్ట్మార్టం చేయించి అంబులెన్స్లో బొమ్మకల్కు పంపించారు. మంగళవారం అంత్యక్రియలను నిర్వహిస్తారని కుటుంబసభ్యులు తెలిపారు. -
102 వాహనం లేక బాలింత అవస్థలు
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్ ఆస్పత్రిలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన సరోజ వారం క్రితం డెలివరీ కోసం వచ్చింది. సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే బాలింతను ఇంటి వద్ద దింపేందుకు 102వాహనం అందుబాటులో లేకపోవడంతో సుమారు రెండు గంటల పాటు వేచిచూసింది. వాస్తవానికి తల్లీబిడ్డను క్షేమంగా 102లో వారి సొంత గ్రామంలో ఇంటి వద్ద దింపి రావాలి. సమాచారం ఇచ్చినా సిబ్బంది మాత్రం రాకపోవడంతో ఏమీ చేయలేక చివరికి అద్దె వాహనంలో ఉట్నూరు వెళ్లారు. ఈ విషయంపై డీఎంహెచ్వోను వివరణ కోరగా.. ఇతర జిల్లాకు వెళ్లాల్సి ఉన్నందున సమయం పడుతుందని.. అదే సమయంలో 102 సిబ్బంది సమీపంలోని ఓ బాలింతను తీసుకెళ్లిందని, అందుకే కొంత ఆలస్యమైందని తెలిపారు. -
ప్రత్యేక నిధులు విడుదల చేయాలి
కరీంనగర్టౌన్: ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం 2024 మార్చి నుంచి ఇప్పటివరకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని రేవా రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశం సోమవారం కరీంనగర్ ఫిలింభవన్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావాల్సిన బకాయిలు అందక పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని, చాలామంది అనారోగ్యం పాలవుతూ చనిపోతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై పెన్షనర్ సంఘాలు గత నెల 17న హైదరాబాదులో ధర్నా చేపట్టగా, స్పందించిన ప్రభుత్వం రూ.707.30 కోట్లు రిలీజ్ చేయగా, కేవలం పదవిలో ఉన్నవారి పెండింగ్ బకాయిలకే సరిపోయాయని, పెన్షనర్లకు ఎలాంటి లాభం లేదన్నారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్రావు, గద్దె జగదీశ్వర చారి, కనపర్తి దివాకరు, జగి త్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రామ్రెడ్డి, సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు. -
వారిది ఆరాటం.. వీరిది ఆపేయత్నం
● పీఎల్జీఏ వారోత్సవాలపై ఉత్కంఠ ● అమరులకు నివాళి అనుమానమే? ● కొయ్యూర్ ఎన్కౌంటర్కు 26 ఏళ్లు మంథని: 1999 డిసెంబర్ 2వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రస్తుత మావోయిస్టు(అప్పటి పీపుల్స్వార్) పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్రెడ్డి, ఉత్తర తెలంగాణ కార్యదర్శి శీలం నరేశ్ నేలకొరిగారు. వీరిజ్ఞాపకార్థం 2000 డిసెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు పీఎల్జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలను మావోయిస్టు పార్టీ ఏటా నిర్వహనిర్వహిస్తూ వస్తోంది. అమరవీరుల జ్ఞాపకార్థం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో 2004 నవంబర్ 13న మావోయిస్ట స్మారక స్తూపం నిర్మించింది. దానిని మృతుల కుటుంబ సభ్యులతో ఆవిష్కరింపజేసింది. కొయ్యూరు ఎన్కౌంటర్ జరిగి మంగళవారానికి 26ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవడంతో పీఎల్జీఏ వారోత్సవాలపై నీలినీడలు అలుముకున్నాయి. ఉనికి కనుమరుగు చేసేందుకు.. మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేసి అమరులైన ప్రతీఒక్కరికి ప్రజాక్షేత్రంలో నివాళి అర్పించేందుకు ఏటికేడు నక్సల్స్ యత్నిస్తున్నారు. వారి ఉనికిని కనుమరుగు చేసేందుకు పోలీసులు కట్టడికి యత్నిస్తూనే ఉన్నారు. రెండు దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గానికి అవతలి వైపు మహారాష్ట్ర, ఛత్తీష్గఢ్ రాష్ట్రాలు ఉండడం, ఆ రాష్ట్రాల పరిధిలోని గోదావరి, ప్రాణహిత తీర ప్రాంతాల్లో మావోయిస్ట్లు రెండు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండడం సాధారణమే. పాతికేళ్లకుపైగా కరీంనగర్ తూర్పు డివిజన్లో మావోల ప్రభావం పెద్దగా లేకున్నా తరచూ కదలికలు ఉన్నట్లు సమాచారం. అగ్రనేతలు మరణించి 26ఏళ్లు అవుతున్న క్రమంలో అమరులను స్మరిస్తూ వారోత్సవాలు నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులు లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. తొలితరం అగ్రనేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్తో పాటు సుమారు 60 మందితో గత అక్టోబర్లో లొంగిపోయారు. ఆ తర్వాత మరో అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ కావడం, మిగతా మావోయిస్ట్లు సైతం లొంగిపోతామని ప్రకటించడం లాంటి చర్యలు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయంటున్నారు. అటవీ గ్రామాలపై పోలీస్ నిఘా కరీంనగర్ తూర్పు డివిజన్లో మావోయిస్ట్ల ప్రభావం లేకున్నా వివిధ రాష్ట్రాల్లోని ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా పోలీసులు నిఘాను తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. మావోయిస్ట్లు నదులను దాటి రాకపోకలు సాగించే అవకాశాలు ఉండడంతో ఆ ప్రాంతాలపై డేగ కన్నేసి ఉంచుతారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ఊపందుకోవడంతో పోలీసులు సహజంగానే అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. -
గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలి
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టె క్నో స్కూల్లో మూడురోజులుగా నిర్వహించిన జి ల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025–26, ఇన్స్పైర్ అవార్డ్స్ మనాక్ ప్రదర్శన సోమవారం ము గిసింది. జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 807 నమూనాలు, 126 ఇన్స్సైర్ అవార్డ్స్ మనాక్ నమూనాలను ప్రదర్శించగా దాదాపు 176 పాఠశాలల నుంచి మొదటి రోజు 1,600 మంది, రెండో రోజు 2,652 మంది, చివరి రోజు 5,357 మంది విద్యార్థులు సందర్శించారు. ఇందులో 13 నమూనాలు రాష్ట్రాస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ మనాక్కు ఎంపికయ్యాయి. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 7 సబ్థీమ్స్లో మొదటి స్థానం పొందిన నమూనాను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈసందర్భంగా డీఈవో శ్రీరాంమొండయ్య మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిలో ఒక శాస్త్రవేత్త దాగి ఉన్నాడ ని, పట్టుదలతో పనిచేసి మానవాళి సంక్షేమానికి కొ త్త ఆవిష్కరణలు తీసుకురావాలని సూచించారు. అల్ఫోర్స్ చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థి దశనుంచే నూతన ఆవిష్కరణల దిశగా ఆ లోచనలు సాగాలని, గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగా లని పిలుపునిచ్చారు. జిల్లా సైన్స్ అధికారి చాడ జ యపాల్రెడ్డి, ఎస్.భగవంతయ్య, కర్ర అశోక్రెడ్డి, ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, కృపారాణి, ఎంఈవోలు ఆనందం, ప్రభాకర్రెడ్డి, రవీంద్రాచా రి, రామయ్య, రవీందర్, గంగాధర్, అనంతాచార్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
విలేజ్ వాయిస్
నెరవేరని బీటీ రోడ్డు కలఊరి మధ్యలో మత్తడి.. పరిష్కారమేది? మంథనిరూరల్: ఎన్నికలు.. ఓట్లు రాగానే ఊళ్లో సమస్యలు తీరుస్తామని అభ్యర్థులు హామీలు ఇవ్వడం సర్వసాధారణమే. ఎన్నికలు ముగిశాక మళ్లీ ఆ సమస్యను పట్టించుకోకపోవడం సర్వసాధారణమే. ఇలాంటి సమస్యే పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారంలో ప్రజల్ని పట్టిపీడిస్తోంది. మట్టి రోడ్డు బీటి రోడ్డుగా ఎప్పుడు మారుతుందోనని దశాబ్దాలుగా ఎదురుచూపులు తప్ప రైతుల కల నెరవేరడం లేదు. నాగారం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ పక్కనుంచి ఉప్పట్ల వరకు గతంలో మట్టిరోడ్డు ఉండేది. దీనిపరిధిలో సుమారు 300 ఎకరాల నుంచి 400ఎకరాల వరకు భూములు ఉన్నాయి. ఏటా సాగు పనులకు ఈ రోడ్డు ద్వారానే వెళ్తుంటారు. వర్షాకాలంలో రోడ్డు బురదమయం కావడంతో రైతుల కష్టాలు అంతాఇంతా కాదు. సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తన బస్తాలు తీసుకురావడానికి నానాతంటాలు పడుతుంటారు. వర్షం పడితే కాలినడకే శరణ్యం. గత ఎన్నికల సమయంలో ఈ రోడ్డు బాగు చేయిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని వాపోతున్నారు. మానకొండూర్: మండలంలోని ఈదులగట్టెపల్లిలో ఊరి మధ్యలో ఉన్న మత్తడి ఏళ్ల తరబడిగా గ్రామస్తులను వేధిస్తోంది. మత్తడి పొంగిన సమయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన పాలకుల హామీలు నీటిమూటలే అవుతున్నాయి. గ్రామ తలాపునే ఊర చెరువు ఏటా వర్షాకాలంలో నిండి మత్తడి పొంగుతోంది. మత్తడి నీరు ఊరు మధ్య నుంచే వెళ్లడంతో గ్రామం రెండుగా చీలిపోతుంది. మత్తడి తగ్గే వరకూ గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో మత్తడి ప్రాంతాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. కొన్ని నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సైతం ఈదులగట్టెపల్లి స్టేజీ నుంచి అన్నారం వరకు తారు రోడ్డు మంజూరు చేసి, మత్తడి ప్రాంతంలో కల్వర్టు వేసి సమస్య పరిష్కరించాలని సూచించారు. కానీ, గ్రామంలోని రాజకీయ నాయకుల మధ్య సయోధ్య లేక ఆ పనులు కూడా నిలిచినట్లు గ్రామస్తులు వాపోతున్నారు. ఎన్నికలయ్యే వరకు నీకు నాకు కటీఫ్..రాయికల్: పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని నిన్నటివరకు మిత్రులుగా ఉన్నవారు దూరందూరంగా ఉంటున్నారు. పొద్దంతా ఒకే వాహనంపై తిరుగుతూ సరదాగా గడిపిన వారు ఇప్పుడు ఎవరిదారిన వారు వెళ్లిపోతున్నారు. సర్పంచ్గా పోటీచేసే ఆశావహులు తన మిత్రులు ఇతరవ్యక్తులకు నచ్చకపోతే ఎక్కడ ఓట్లు పడవోనని భావించి.. శత్రువును చూసినట్లు చూస్తున్నారు. దీంతో ఓటర్లంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొన్నటి వరకు తన స్నేహితుడు అని చెప్పుకుని ఎన్నికల వేళ తనకు శత్రువు అంటే ఎవరు నమ్ముతారంటూ ఓటర్లు చర్చించుకుంటున్నారు. పోలింగ్ వరకు ఇలాంటి నాటకీయ పరిణామాలు ఎన్ని చూడాల్సి వస్తుందోనని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఎన్నికల బరిలో రేషన్ డీలర్లు.. ఆర్ఎంపీలు జగిత్యాలజోన్: సర్పంచ్గా పోటీ చేసేందుకు రేషన్ డీలర్లు, ఆర్ఎంపీలు కూడా సై అంటున్నా రు. రేషన్ సరుకుల కోసం వచ్చిన వారితో సత్సంబంధాలు ఉండటంతో రేషన్ డీలర్లు.. అనారో గ్యం బారినపడిన వారికి వైద్యం అందించేందుకు ఇళ్లిళ్లూ తిరిగే ఆర్ఎంపీలు ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గెలిస్తే సర్పంచ్.. లేదంటే మళ్లీ అదే పని చేసుకోవచ్చు.. అంటూ వారిని బంధువులు, తెలిసిన వారు ఊదరగొ డుతున్నారు. అభ్యర్థులు ఖర్చు జోలికి వెళ్లకుండా నే రుగా ఓటర్లను కలిసి తమను గెలిపిస్తే అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూపులే ఓట్ల్లేస్తే రోడ్డస్తదనే ఆశలు మొదలు రైతులకు తప్పని బురదరోడ్డు కష్టాలుపది ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తా. వర్షాలు పడితే పొలం కాడికి పోవడం కష్టమైతాంది. రోడ్డంతా బురదమయమై నడవలేని పరిస్థితి ఉంటది. ఈరోడ్డు బీటీ రోడ్డు అయితే మా కష్టాలన్నీ తీరిపోతయ్. ఈసారైనా రోడ్డు బాగు చేయిస్తే రుణపడి ఉంటం. – గోపు శ్రీకాంత్, రైతు, నాగారం మా తాత ముత్తాతల నుంచే చెరువు మత్తడి నీరు గ్రామ మధ్య నుంచి వెళ్తోంది. ఎనకట మత్తడి పోతంది అంటే మేము గొర్లను మంద పెట్టుకుని గుట్టలకే ఉండేటోళ్లం. మత్తడి నీరు వెళ్తున్నప్పుడు అటోళ్లు ఇటు, ఇటోళ్లు అటు వెళ్లడానికి ఇబ్బందులుంటాయి. ఎన్నికలప్పుడు ప్రతి ఒక్కరు మత్తడి నీరు వెళ్లకుండా చూద్దామని అంటర్రు తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు. – దానవేని రాయమల్లు, ఈదులగట్టెపల్లి -
కాసుల కష్టాలు
హుజూరాబాద్: సర్పంచ్గా పోటీ చేయాలని ఆశ.. కానీ, ఖర్చులు భరించేందుకు పైసలు ఎట్లా అనే మీమాంస.. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసి వచ్చి పోటీకి ఉత్సాహం ఉన్నా.. చేతిలో చిల్లిగవ్వలేక ఆశావహుల్లో నిరాశ. తాజామాజీ సర్పంచ్లకు చేసిన పనులకు బిల్లులే రాక ఇంకా అవస్థలు పడుతున్న తీరు పోటీదారులకు అప్పు పుట్టకుండా చేస్తోంది. ప్రధాన పార్టీల మద్దతు కావాలన్నా.. ‘నీ చేతిలో ఎంత ఉందో ముందు చెప్పు’ అంటూ ఎదురు ప్రశ్నలు. దీనికి తోడు రియల్ భూమ్ లేకపోవడం, పంటల ఆదాయం అంతంతే ఉండటంతో అభ్యర్థులను కాసుల కష్టాలు వెంటాడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తెలిసినోళ్లందరినీ కలిసి ‘నీ దగ్గర ఏమైనా ఉంటే సర్దుబాటు చేయ్’ అంటూ పాట్లు పడుతున్నారు. పోటీ సరే.. పెసలెట్లా..? అసెంబ్లీ, పార్లమెంట్, సర్పంచ్.. ఏ ఎన్నికై నా కాసులతో ముడిపడిపోయింది. ప్రచారంలో ప్రత్యర్థులకు దీటుగా రంగంలో ఉండాల్సిందే. ఖర్చులో తగ్గేదేలే అంటేనే క్యాడర్ అభ్యర్థి వెనుక నిలబడుతుంది. లేదంటే వారి దారి వారిదే అనే భయం. దీంతో పోటీకి సిద్ధమైన అభ్యర్థులకు ఖర్చుల టెన్షన్ పట్టుకుంది. ఎన్నికల్లో బ్యానర్లు, వాల్ పోస్టర్లు, ప్రచార వాహనాలు, రోజువారి క్యాడర్ ఖర్చు, పోల్ మేనేజ్మెంట్ వీటన్నింటికి తోడు మందు, మాంసం లెక్కలు వేరే అనే టాక్ ఉంది. వెయ్యి ఓట్ల లోపు గ్రామమైతే తక్కువలో తక్కువగా రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందనే అంచనాల్లో ఉన్నారు. రెండువేల లోపు జీపీల్లో ఒక్కో అభ్యర్థికి రూ.20 లక్షల పైమాటే అనే టాక్ ఉంది. ఇక 2వేలకు పైగా ఓటర్లు ఉంటే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు.. ఆపైన కూడా ఖర్చు పెరుగుతుందనే చర్చ ఉంది. ఖర్చులే కాకుండా సొంత పార్టీ నుంచి పోటీకి దిగుతున్నవారిని తప్పించేందుకు రూ.లక్షల్లో చేతిలో పెట్టాల్సిందే. అయితే మరోవైపు ఏకగీవ్రం ఆశావహులను ఊరిస్తోంది. ఎవరితో పోటీ, ప్రచార లొల్లి, ఖర్చుల బాధ లేకుండా సర్పంచ్ సీటులో కూర్చోవచ్చునని ఉవ్విళ్లూరుతున్నవారు కూడా ఉన్నారు. అయితే ఏకగ్రీవం పేరుతో గ్రామ అభివృద్ధికి, పోటీ నుంచి తప్పుకునేవారికి, చివరికి ఓటర్లకు దావత్.. ఇలా ఖర్చుల మీద ఖర్చులు తప్పవనే ప్రచారం ఉంది. దీంతో చేతిలో చిల్లీ గవ్వ లేకున్నా మద్దతుదారుల ప్రోత్సాహంలో సర్పంచ్ బరిలో దిగుతున్న అభ్యర్థులను కాసుల కష్టాలు కలవరపెడుతున్నాయి. సర్దుబాటుకు తంటాలు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నాననే ఆనందం ఒకవైపు, ఖర్చులకు అప్పు ఎట్లా అనే ఆందోళన మరో వైపు అభ్యర్థులను కలవర పరుస్తోంది. తెలిసినోళ్లందరికీ ఫోన్ చేసి అప్పు కోసం బతిమిలాడాల్సి వస్తోంది. అభ్యర్థులు వడ్డీ వ్యాపారులను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే తాజా మాజీ సర్పంచుల అనుభవాలను చూసిన వ్యాపారులు, పెట్టుబడిదారులు కూడా ఎన్నికల కోసం అప్పు ఇచ్చేందుకు ససేమేరా అంటున్నారు. మాజీ సర్పంచులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అప్పు ఇచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. దీంతో కొందరు తమ భూములను తాకట్టు పెట్టే పనిలో ఉండగా, మరికొందరు భార్య, పిల్లలు, తల్లికి సంబంధించిన బంగారు ఆభరణాలను తాకట్టు పెడుతున్నారు. కాగా, లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పోటీ చేస్తే మిగిలేది ఏమిటనే ఆలోచనలో మరి కొందరు ఉన్నారు. తాజా మాజీ సర్పంచుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని, వృథా ఖర్చులు లేకుండా పోటీ చేయాలని అభ్యర్థుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. పదవిపై మోజుతో బరిలోకి పలువురు ఎన్నికల ఖర్చుకు సరిపడా డబ్బుల్లేక వెతలు పోటీదారులకు అప్పు ఇచ్చేందుకు ఆసక్తి చూపని వడ్డీవ్యాపారులు మాజీ సర్పంచ్లకే చేసిన పనులకు బిల్లులు పెండింగ్ గెలిచినా ఖర్చుపెట్టింది సంపాదించేదెప్పుడో అనే అనుమానం డబ్బు సర్దుబాటుకు అభ్యర్థుల పాట్లు చేతిలో చిల్లిగవ్వ లేకున్నా పోటీకి సై -
రోడ్డు దాటితే ఊరు మారుడే..
మంథనిరూరల్: గీత దాటితే వేటు తప్పదు అనే మాటలు వింటూనే ఉంటాం.. కానీ ఇక్కడ రోడ్డు దాటితే ఊరు మారుతుంది. సాధారణంగా ఒక ఊరు నుంచి మరోఊరుకు కనీసం కిలోమీటరో రెండు కిలోమీటర్ల దూరమో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రోడ్డు మారితేనే మరో ఊరు ఉంటుంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం ప్రధాన రహదారికి ఒకవైపు నాగారం ఉంటే మరోవైపు కన్నాల గ్రామపంచాయతీలోని పందులపల్లి ఉంటుంది. ఒకేచోట రెండు గ్రామపంచాయతీలకు చెందిన వారు ఉన్నా ఒక్క ఊరువాళ్లలాగే కలిసిమెలిసి ఉంటారు. కానీ ఎన్నికల సమయం వస్తే మాత్రమే రెండు గ్రామపంచాయతీలని తెలుస్తుంది. అయితే సర్పంచ్ ఎన్నికలు వస్తే మాత్రం రోడ్డు ఇవతలివైపు వాళ్లు అవతలివైపు వాళ్లు బరిలో నిల్చుంటారు. ఎన్నికలు ముగిసే వరకు ఆ రహదారి పూర్తిగా హడావుడిగా ఉంటుంది. మళ్లీ ఎన్నికల తర్వాత ఒక ఊరులాగే కన్పించడం కొసమెరుపు. ఒకే గ్రామం.. రెండు పంచాయతీలు -
బిల్లులు రాక ఇబ్బందిపడుతున్న
సర్పంచ్గా పనిచేసిన హయాంలో రూ.20 లక్షల నిధులు రావాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేసిన. పెండింగ్ బిల్లులు ఇప్పటికీ క్లియర్ కాలేదు. సర్పంచ్ల బిల్లులను క్లియర్ చేయడంలో గత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. – నేరేళ్ల మహేందర్గౌడ్, మాజీ సర్పంచ్, చెల్పూర్ గ్రామంలో సర్పంచ్గా పనిచేసిన సమయంలో అప్పు చేసి అభివృద్ధి పనులు చేసిన. రూ.13 లక్షలకు సంబంధించిన చెక్కులు మంజూరైనా గ్రామపంచాయతీ ఖాతాల్లో నిధులు లేకపోవడంతో చెక్కులు నిలిచిపోయాయి. మొత్తం రూ.17 లక్షల నిధులు రావాల్సి ఉంది. – బింగి కరుణాకర్, మాజీ సర్పంచ్, రంగాపూర్ -
నిర్లక్ష్యపు తుప్పు
సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ వాహనాలకు మరమ్మతు కరువైంది. జిల్లా ఆవిర్భావం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కొత్త జిల్లాలకు పంపించిన వాహనాలు ఎక్కడా తిరగలేదు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని చెట్లకింద ఇలా ఓ మూలనపడేశారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని ఆర్టీసీ బస్సు డిపోకు కేటాయించిన విషయం తెలిసిందే. అయినా సంబంధిత శాఖల అధికారులు ఆ వాహనాలను ఎక్కడికై నా తరలించడమో, లేదా ఉన్నతాధికారుల అనుమతితో తుక్కుగా మార్చి విక్రయించడమో చేయకుండా ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారు. -
2 నుంచి ‘సింగరేణి పోరుగర్జన ’
● కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు గోదావరిఖని: సింగరేణి పరిరక్షణ లక్ష్యంగా వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు సింగరేణి పోరుగర్జన కార్యక్రమం నిర్వహిస్తామని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు రియాజ్అహ్మద్, ఐ. కృష్ణ, కామర గట్టయ్య తెలిపారు. నగరంలోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఐక్యవేదిక స మావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై ఇందు లో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నా లుగు లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు ఉద్యమించాలన్నారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బాకులను సంస్థకే చెందేటట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వంతో చర్చించాలని కోరారు. బొగ్గు బ్లాక్ల వే లంలో సింగరేణి పాల్గొనద్దని, సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డును యథావిధిగా కొనసాగించాలని, మారుపేరు కార్మికుల వా రసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. గోలేటి నుంచి సత్తుపల్లి వరకు పోరుగర్జన కొనసాగుతుందని వెల్లడించారు. నాయకులు జి.రాములు, ఏడుకొండలు, రాజయ్య, కుమారస్వామి, దావు రమేశ్, రవి, చింతల శేఖర్, కొండి శ్రీనివాస్, బేగ్ రాజపోశం తదితరులు పాల్గొన్నారు. -
గతేడాది స్టేట్ అవార్డు
ఎయిడ్స్ నిర్మూలనకు విస్తృతంగా చేపడుతున్న కార్యక్రమాలతో కరీంనగర్ జిల్లా ప్రథమస్థానంలో నిలవడంతో గతేడాది స్టేట్ అవార్డు వచ్చింది. వ్యాధి నియంత్రణకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలను గుర్తించి అవార్డు అందజేశారు. హెచ్ఐవీ బాధితులకు ఏఆర్టీ సెంటర్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. వారికి కావాల్సిన మందులు ఇవ్వడంతో పాటు సీడీ–4, వైరల్ లోడ్పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నాం. హెచ్ఐవీ నియంత్రణ మన చేతుల్లోనే ఉంది. ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. – ఎం.సదానందచారి, ఐసీటీసీ కౌన్సెలర్, కరీంనగర్ -
కాంగ్రెస్ నేతలతో సమావేశం
ఎలిగేడు(పెద్దపల్లి): పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తన స్వగ్రామం శివపల్లిలోని తన నివాసంలో ఆదివారం కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ఎలా సాధించాలనే అంశంపై సుదీర్ఘంగా సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించుకునేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఎలిగేడు మండలంలోని 12 గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచు లను గెలిపించుకోవడం లక్ష్యంగా ముందుకు సాగా లని సూచించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు దుగ్యాల సంతోష్రావు తదితరులు పాల్గొన్నారు. -
అవగాహనే ఔషధం
పెద్దపల్లిరూరల్/కరీంనగర్: ఎయిడ్స్ అంటే భయం. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు శరీరాన్ని వదిలివెళ్లదు. మందులు వాడితే నియంత్రణలో ఉంటుంది గానీ ఆదమరిస్తే తిరగబెట్టి కబళించేస్తుంది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరిగి క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటుచేసింది. ఫలితంగా జిల్లాలో కొన్నేళ్లుగా ఎయిడ్స్ తగ్గుముఖం పడుతూ వస్తోంది. గతంలో కన్నా ప్రస్తుతం కేసులు తక్కువగా కనిపిస్తున్నా.. జిల్లాలో అధికారికంగానే ప్రతినెల 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా చాలా మంది వ్యాధిబారిన పడుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. నెలనెలా పరీక్షలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ విభాగం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో బాధితుల సంఖ్య తగ్గుతోంది. జిల్లాలో ప్రస్తుతం 1,774 మంది హెచ్ఐవీ పాజిటివ్తో బాధపడుతున్నారు. ఈ ఏడాది 13,773 మందికి పరీక్షలు చేయగా 51 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లాలో హెచ్ఐవీ పాజిటివ్ రేటు 0.74గా కొనసాగుతోంది. అవగాహన ముఖ్యం హెచ్ఐవీ అని తెలియగానే సీడీ–4 కణాల సంఖ్య తగ్గేంత వరకూ అశ్రద్ధ చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో ఆధునిక వైద్యసేవలు పొందితే 75 ఏళ్ల వరకూ ఆరోగ్యంగా జీవనం సాగించొచ్చు. ఎయిడ్స్ రోగులూ మధుమేహం, బీపీ, ఆస్తమా రోగుల మాదిరిగానే ఔషధాల వాడకం ద్వారా మంచి ఆరోగ్యం పొందొచ్చు. హెచ్ఐవీ ఉన్న దంపతులు తగిన సమయంలో ఏఆర్టీ మందులు వాడి ఆ రోగం లేని పిల్లలకు జన్మనివ్వొచ్చు. వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాలి హెచ్ఐవీ బాధితులు ఉదయం 3 కిలోమీటర్లు నడి చి, 15 నిమిషాల పాటు ధాన్యం చేయాలి. గ్లాస్ పా లు, బ్రెడ్, ఉడికించిన గుడ్డు తీసుకోవాలి. రోజూ రాగి జావా, అంబలి తాగాలి. మధ్యాహ్నం భోజ నంలో తాజా కూరగాయలు, ఆలు దుంపలు, ఆకు కూరలు, పప్పు దినుసులు, నాన్వెజ్ తీసుకోవాలి. సాయంత్రం ఆపిల్, దానిమ్మ, అంగూర, అరటి, ఫైనాపిల్, సపోట తినాలి. గోధుమ రవ్వ పాలలో కలిపి ఉడికించి ఆరగించాలి. రాత్రి భోజనంలో తాజా కూరగాయలు, రెండు చపాతీలు, నిద్రించే సమయంలో వేడి చేసి చల్లార్చిన నీరు తాగిలి. ఎయిడ్స్ బారిన యువత... హెఐవీ కేసుల్లో యువత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే 70 శాతం వరకు హెఐవీ వ్యాధి బారినపడుతున్నారని అధికారుల అంచనా. మద్యానికి బానిస కావడం, మత్తు పదార్థాలు సేవించడం, సురక్షితం లేని శృంగారంలో పాల్గొనడం, తగు జాగ్రత్తలు పాటించకపోవడవమని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో హైరిస్క్ ప్రవర్తన కలిగిన వ్యక్తులు, ఫీమేల్ సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్ల తరఫున స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ వారి ప్రవర్తనలో మార్పునకు యత్నిస్తున్నాయి. మంచి మందులు అందుబాటులో ఉండడంతో మరణాల సంఖ్య తగ్గింది. -
అవార్డు గ్రహీతకు సన్మానం
ధర్మారం(ధర్మపురి): పూలే జాతీయ అవార్జు గ్రహీత బొల్లి స్వామిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆదివారం సన్మానించారు. స్వామి చేస్తున్న సామాజిక సేవలను గుర్తించిన న్యూఢిల్లీలోని ఏపీ అంబేడ్కర్ భవన్లో జాతీయ అంబేడ్కర్, పూలే ఫౌండేషన్ అవార్డు అందించి గౌ రవించింది. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో స్వామిని మంత్రి అడ్లూరి సన్మానించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతి, నాయకులు కరాటే వేణు, పాలకుర్తి రాజేశంగౌడ్ పాల్గొన్నారు. ఏకగ్రీవమైన వారికి సత్కారం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వివిధ గ్రామాల్లో వార్డుస్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికై న వారిని మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం శాలువాలు కప్పి సన్మానించారు. సారయ్యగౌడ్ మాట్లాడుతూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తే ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకుంటారన్నారు. మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మాజీ సర్పంచులు సాదానందం, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్కు చెందిన విద్యార్థి చాణక్య రాష్ట్రస్థాయి గీతా పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచా డు. విజేత చాణక్యకు నిర్వాహకులు ఆదివారం జ్ఞాపిక, షీల్డ్ అందజేసి అభినందించారు. కబడ్డీ పోటీల్లో సత్తా గోదావరిఖని: కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్లో ఈనెల 28, 29, 30వ తేదీల్లో జరిగిన కోల్ఇండియా స్థాయి కబడ్డీ పోటీటీల్లో సింగరేణి జట్టు రన్నర్గా నిలిచింది. ఆదివారం జరిగిన పోటీల్లో సింగరేణి, డబ్ల్యూసీఎల్, ఎన్సీఎల్, ఎంసీఎల్, ఎస్ఈసీఎల్, ఈసీఎల్, సీసీఎల్, బీసీసీఎల్ జట్లు పాల్గొన్నాయి. హోరాహోరిగా సాగిన ఫైనల్ పోటీల్లో మహారా ష్ట్రలోని నాగ్పూర్కు చెందిన డబ్లుసీఎల్ జట్టు విన్నర్గా నిలవగా, సింగరేణి జట్టు రన్నర్గా నిలిచింది. మూడోస్థానంలో ఎస్ఈసీఎల్ జట్టు నిలిచింది. ఈపోటీలకు ముఖ్య అతిథిగా సంస్థ సీఎండీ బలరాం హాజరయ్యారు. -
పారదర్శకంగా ఎన్నికలు
పెద్దపల్లి: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు అనుగు నర్సింహారెడ్డి సూచించారు. క లెక్టరేట్లో ఆదివారం కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. న ర్సింహారెడ్డి మాట్లాడుతూ, విధి నిర్వహణలో నిర్ల క్ష్యం వహించొద్దన్నారు. ఎన్నికల వ్యయ వివరాల ను పకడ్బందీగా అభ్యర్థి ఖాతాలో నమోదు చేయా లని అన్నారు. అభ్యర్థులు వినూత్న రీతిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తారని, దీనిని నిరోధించేందుకు నిఘా పెట్టాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని స్పష్టం చేశారు. అనంతరం ఎన్నికల సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ పేపర్, ప్రింటింగ్ మెటీరియల్, బ్యాలెట్ బాక్స్, రవాణా వాహనాలు, గుర్తుల కేటాయింపు తదితర అంశాలపై ఆరా తీశారు. కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ, తొలివిడత ఈనెల 11న జిల్లా లోని 99 గ్రామాలు, 896 వార్డుల్లో ఎన్నికల నిర్వహిస్తామన్నారు. రెండోవిడత 14న జిల్లాలోని 73 గ్రా మాలు, 684 వార్డులు, మూడోవిడతలో ఈనెల 17 వ తేదీన 91 గ్రామాలు, 852 వార్డు స్థానాల్లో ఎన్నికల నిర్వహిస్తామని వివరించారు. రౌడీషీటర్లు, గత ఎన్నికల్లో సమస్యలు సృష్టించిన వారిని బైండోవర్ చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, ఏసీపీ రమేశ్, జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో కాళిందిని తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ కలిసి రాలేదా?
● ఉపసర్పంచ్కు పోటీచెయ్.. పెద్దపల్లి: స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించని నాయకులు, ఆశావహులు తమ వ్యూహం మార్చుకున్నారు. సర్పంచ్గా పదవి దక్కించుకునేందుకు యత్నించి.. కనీసం వార్డుసభ్యుడిగానైనా ఎన్నికై ఆ తర్వాత ఉపసర్పంచ్ పదవి దక్కించుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. కొందరు వార్డు సభ్యుడిగా ఎన్నికై నా పర్వాలేదంటున్నారు. ఆర్థికంగా.. రాజకీయంగా అండ ఉంటేనే.. వార్డు, సర్పంచ్ స్థానాలు గెలుచుకోవాలన్నా.. అనుయాయులను గెలిపించుకోవాలన్నా డబ్బులే కీల కం మారుతున్నాయంటున్నారు. ఇందులోనూ గ్రా మం, సామాజికవర్గాల వారీగానూ హెచ్చుతగ్గులుంటాయి. పట్టణానికి, జిల్లా కేంద్రానికి, డివిజన్ కేంద్రానికి, మండల కేంద్రానికి, రహదారుల సమీపంలోని గ్రామాల్లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేస్తేనే సర్పంచ్, ఉప సర్పంచ్గా ఎన్నికయ్యే అవకాశం ఉందనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. మారుమూల ప్రాంతాలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ పంచాయతీల్లో ఎంతలేదన్నా రూ.10 లక్షల వరకు వ్యయం చేయాల్సిందేనని పేర్కొంటున్నారు. ఆర్థికంగా లేనివారికి ప్రధాన పార్టీల నేతలు ఖర్చు భరించడంతోపాటు ఎలాగైనా గెలిపించుకునేలా యత్నిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. వార్డుల ఎంపికలో కీలకం.. ఉప సర్పంచ్పై కన్నేసినవారు తమ మద్దతుదారులను వార్డుస్థానాల్లో నిలుపుతున్నారు. ఇందుకోసం అభ్యర్థులను వారే ఎంపిక చేసుకుంటున్నారు. ఉప సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు వార్డుసభ్యుల మద్దతు ఉండాల్సిందే. దీంతోనే తమమాట వినే అనుచరులనే రంగంలోకి దించుతున్నారు. వారికి అవసరమైన నామినేషన్పత్రాలతోపాటు అన్ని పనులనూ దగ్గరుండి మరీ చక్కబెడుతున్నారు.అధికార పార్టీకి చెందిన ఓ ప్రధాన నాయకుడు తన గ్రామంలో సర్పంచ్ స్థానానికి పోటీ చేద్దామని భావించి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. మారిన రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో కనీసం ఉప సర్పంచ్గానైనా విజయం సాధించాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం వార్డు స్థానాలకు పోటీ చేసేవారితోపాటు తమ పార్టీ పెద్దలను ఒప్పించేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. -
విజయమే లక్ష్యం
కఠోర శిక్షణ విజయంవైపు నడిపిస్తుంది. తొలిసారి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాం. విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. మొదట్లో శిక్షణ సందర్భంగా ఇబ్బంది పడ్డాం. అయినా ధైర్యం, విశ్వాసం వచ్చింది. – వి.కృష్ణవేణి, క్యాప్టెన్, పీవీకే–5, మేనేజ్మెంట్ ట్రెయినీ ప్రతిభ చూపుతాం మెయిన్ రెస్క్యూ స్టేషన్లో ఇచ్చిన శిక్షణ మాలో మంచి విశ్వాసం నింపింది. హిందుస్థాన్ జింక్ సంస్థలో పనిచేసిన సమయంలో శిక్షణ పొంది రెస్క్యూ పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉంది. కఠోరసాథన విజయం వైపు తీసుకెళ్తుంది. – అంబటి మౌనిక, మెనేజ్మెంట్ ట్రెయినీ, పీవీకే–5 మేమే చాంపియన్ జాతీయస్థాయి రెస్క్యూ పోటీలకు ముందు సింగరేణిస్థాయి జోనల్ రెస్క్యూ పోటీల్లో పాల్గొన్నాం. అంతర్జాతీ య రెస్క్యూ పోటీలకు సింగరేణి నుంచి వెళ్లిన అనుభవంతో శిక్షణ ఇచ్చారు. రేపటి నుంచి జరిగే పోటీల్లో సత్తా చాటుతాం. – బి.చందనజువేరి, మేనేజ్మెంట్ ట్రెయినీ, పీవీకే–5 సంతోషంగా ఉంది కోలిండియా రెస్క్యూ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఓవరాల్ చాంపియన్ సాధిస్తామనే ధీమా ఉంది. రెసిడెన్షియల్ శిక్షణ బాగుంది. సింగరేణి నుంచి తొలి మహిళా రెస్క్యూ మాదే కావడం గర్వంగా ఉంది. – బదావత్ కల్యాణి, మేనేజ్మెంట్ ట్రెయియినీ, వకీల్పల్లి -
రైల్వేట్రాక్కు రక్షణ గోడలు
ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వేలోని కాజీపేట – బల్హార్షా మధ్య పట్టాలకు రక్షణ గోడులు నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. రైలు పట్టాల నుంచి హద్దురాళ్ల వరకు వీటిని నిర్మించాలని ప్రణాళిక రూ పొందించారు. ఇందుకోసం ఇటీవల అధికారులు రూ.3,200 కోట్లు మంజూరు చేశారు. మూడోట్రాక్ ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకుంది. ప్రస్తుతం రెండు పట్టాలపై ఒకేవైపు రెండురైళ్లు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్లతోపాటు అత్యవంతవేగవంతమైన వందేభారత్ కూడా ఈ మార్గంలోని పట్టాలపై పరుగులు పెడుతోంది. వన్యప్రాణులు, పశువులతో ప్రమాదాలు.. రైల్వేట్రాక్కు ఇరువైపులా రైల్వేస్టేషన్ తర్వాత పశువులు, వన్యప్రాణులు, జీవాలు హఠాత్తుగా ట్రాక్లపైకి వస్తున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారు ల సమావేశంలో లోకోపైలెట్లు ఈ విషయాన్ని ప్ర స్తావించినట్లు సమాచారం. పశువులు, వన్యప్రాణు లు, జీవాలు ట్రాక్లపైకి రావడంతో ప్రమాదాలు చోటుచేసుకోవడం, రైళ్లవేగం తగ్గడంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరలేక పోతున్నామని విన్నవించారు. దీంతో రైల్వేశాఖ పట్టాల వరకు గోడలు నిర్మించాలని నిర్ణయించింది. ప్రమాదాల నియంత్రణే కాదు.. స్థలాలు అన్యాక్రాంతం కాకుండా రక్షణ గోడలు దోహదపడతాయని భావిస్తున్నారు. ముమ్మరంగా గోడల నిర్మాణం కాజీపేట – బల్హార్షా మధ్య ప్రస్తుతం మూడో రైల్వేట్రాక్ నిర్మాణం పూర్తయ్యింది. రోజూ పదుల సంఖ్యలో రైళ్లు పరుగెత్తే సౌకర్యం అందుబాటులోకి వ చ్చింది. అయితే, రక్షణ గోడలు నిర్మిస్తే రైళ్ల సంఖ్య పెరిటితే సకాలంలో గమ్యస్థానం చేరుతా యని భావిస్తున్నారు. గోడల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో ఇటీవల పనులు ప్రారంభించారు. ఇవి వేగవంతంగా సాగుతున్నాయి. -
కఠోరశ్రమ.. క్రమశిక్షణ
గోదావరిఖని: దాదాపు 70రోజుల పాటు కఠోరంగా శ్రమించారు.. అత్యున్నత ప్రమాణాలతో రెసిడెన్షియల్ పద్ధతిన శిక్షణ పొందారు.. జాతీయస్థాయిలో అవార్డు సాధించడం లక్ష్యంగా బరిలో దిగబోతున్నా రు సింగరేణిలోని మహిళా రెస్క్యూ ప్రతినిధులు. ఈమేరకు ఆదివారం మహారాష్ట్రకు చేరుకున్నారు. రేపటి నుంచి పోటీలు.. ఈనెల 2 నుంచి 7 వరకు మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీప మన్సార్ మైన్స్లో జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తారు. మాంగనీస్ ఓవర్సీస్(ఎంవోఐఎల్) ఆధ్వర్యంలో వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(డబ్ల్యూసీఎ ల్) మెయిన్ రెస్క్యూస్టేషన్లో పోటీలు నిర్వహిస్తా రు. సింగరేణి సంస్థ నుంచి ఒక మహిళా, రెండు పురుషుల జట్లు పాల్గొంటున్నాయి. మన్సార్మైన్లో రెస్క్యూ రికవరీ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సింగరేణి నుంచి మహిళా రెస్క్యూ జట్టు జాతీయస్థాయిలో పోటీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సింగరేణిది ప్రత్యేకస్థానం.. అంతర్జాతీయ స్థాయి రెస్క్యూ పోటీల్లో సింగరేణి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కోలిండియాలోని అ నేక సంస్థలకు సింగరేణి శిక్షణ ఇచ్చింది. తాజా పో టీల్లో పాల్గొనే 8 మంది సభ్యులకు కూడా తర్ఫీదు ఇచ్చింది. రెస్క్యూ, రికవరీ, థియరీ, ఫస్ట్ఎయిడ్, స్టాట్యుటరీ తదితర విభాగాల్లో ఆర్జీ–2 ఏరియా లోని సింగరేణి మెయిన్ రెస్క్యూ స్టేషన్లో శిక్షణ ఇచ్చారు. అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన తీరుపై ప్రతినిధులను సుశిక్షితులను చేశారు. -
చెక్డ్యాంను ధ్వంసం చేసిందెవరు?
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని మానేరులో ప్రజాధనంతో నిర్మించిన చెక్డ్యాంను విధ్వంసం చేశారా? నాసిరకంతో కుంగిందా? అనే అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, దోషులపై చర్యలు తీసుకోవాలని మానేరు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు అంబటి కరుణాకర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గొట్టిముక్కుల సురేశ్రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకం పనులు చేపట్టడడంతోనే గుంపుల చెక్డ్యాం ధ్వంసమైందని ఎమ్మెల్యే విజయరమణారావు అంటున్నారని, పేల్చివేతతోనే కుంగిందని అధికారులు, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, దీనికి కారకులెవరో తేల్చాల్సి ఉందని వారు అన్నారు. మానేరులో ఇసుక దోపిడీపై నేషనల్ గ్రీన్ట్రిబ్యునల్ను ఆశ్రయించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్కు రూ.50కోట్ల జరిమానా విధించిందని వారు గుర్తు చేశారు. ఈ కేసు సుప్రీంకోర్టులో ఉందన్నారు. వృథాగా పోతున్న నీటిని పంటలకు అందించేలా అధికారులు, పాలకులు చర్య లు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చెక్డ్యాంలను కూల్చివేసినా.. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దోషులను గుర్తించి చర్యలు తీ సుకోకపోవడంపై సందేహాలు ఉన్నాయని, దీనిపై కలెక్టర్కు విన్నవించామని వారు వివరించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి మానేరు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు అంబటి కరుణాకర్రెడ్డి, బీజేపీ నేత సురేశ్రెడ్డి -
రాష్ట్రం వద్దన్నవారే రాజభోగాలు అనుభవిస్తున్నారు
పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రం వద్దన్నవారే ఇప్పుడు రాజభోగాలు అనుభవిస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అధ్యక్షతన శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన దీక్ష దివస్లో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, పుట్ట మధుకర్తో కలిసి ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి, ఎంపీ అర్వింద్, రాష్ట్రమంత్రి శ్రీధర్బాబు ఏనాడూ తెలంగాణపై ఒక్కమాట మాట్లాడిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. యావత్ ప్రజల ఆకాంక్షే ధ్యేయంగా తెలంగాణను కదిలించిన కేసీఆర్.. సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రం సాధించారని అన్నారు. అమరవీరుల త్యాగం, కేసీఆర్ పోరాటం, రేవంత్రెడ్డి ద్రోహాన్ని తెలంగాణ చరిత్ర లో ఎవరూ మర్చిపోరని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు రఘువీర్ సింగ్, వంగల తిరుపతిరెడ్డి, గంట రాములు యాదవ్, స్రవంతి, మోహన్ రావు, సంపత్, సందీప్రావు, మూల విజయారెడ్డి, కౌశికహరి, దాసరి ఉష, ముత్యాల బలరాంరెడ్డి, ఉప్పు రాజకుమార్, మార్కు లక్ష్మణ్, ఐరెడ్డి వెంకట్రెడ్డి, కొయ్యడ సతీశ్గౌడ్, బోయిని రాజమల్లయ్య, సూర శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం -
పోటీకే సై..
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి పెద్దపల్లి: సర్పంచ్ ఎన్నికలు అంటేనే గ్రామా ల్లో ఎంతో కోలాహలం, పోటాపోటీ ఉంటుంది. అ యితే, ఏకగీవ్రంగా ఎన్నికయ్యే పంచాయతీలకు రూ.10లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తామని గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించడంతో 2019 స్థానిక ఎన్నికల్లో అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవ మయ్యాయి. గ్రామాభివృద్ధి కోసం పార్టీలకతీతంగా నాయకులు పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యేలా కృషి చేశారు. కానీ, నజారానాను చెల్లించకపోవడంతోపాటు, ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వం నుంచి ఎ లాంటి అధికార ప్రకటన రాకపోవడం, పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు పోటీకిసై అంటుండటం తదితర కారణాలతో పల్లెలు ఏకగ్రీవం వైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఏకగ్రీవాల కన్నా పోటీలో నిలిచేందుకే ఆసక్తి చూపుతున్నారు. గతంలో 107 ఏకగ్రీవం గత స్థానిక సంస్థల్లో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీకి ప్రభుత్వం నుంచి రూ.10లక్షలు, స్థాని క ఎమ్మెల్యే మరో రూ.10లక్షలు నజరానా ఇస్తామని ప్ర కటించారు. దీంతో రూ.20 లక్షలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనే అభిప్రా యంతో ఉమ్మడి జిల్లావ్యా ప్తంగా 107గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటికి సంబంధించి ఏకగ్రీవ నజారానా కింద రూ.21.20 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ప్రోత్సాహక నిధు లు వస్తాయనే ఆశతో ఎంతోమంది సర్పంచులు అప్పులు తెచ్చి మరీ అభివృద్ధి పనులు చేసి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీల వైపు గ్రామస్తులు, నేతలు పెద్దగా ఫోకస్ చేయడం లేదు. ముగిసిన తొలివిడత నామినేషన్ల ప్రక్రియ తొలివిడత నోటిఫికేషన్ విడుదలతో గురు, శుక్ర, శ నివారాల్లో నామినేషన్లు స్వీకరించారు. చివరిరోజైన శనివారం కొన్ని పంచాయతీల్లో రాత్రివరకూ కేంద్రాల్లో అభ్యర్థులు బారులు తీరి నామినేషన్లు దాఖ లు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 398 పంచాయతీల్లో సర్పంచ్, 3,702 వార్డులకు శనివారం అర్ధరాత్రి వరకూ నామి నేషన్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తొలివిడతలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ పంచాయతీ, చొప్పదండి మండలం దేశాయిపేట పంచాయతీ, రుద్రంగి మండ లం గైదిగుట్టతండా పంచాయతీలకు ఒక్కో నా మినేషన దాఖలయ్యాయి. దీంతో ఈమూడు పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. నేటినుంచి రెండోవిడత నామినేషన్ల స్వీకరణ ఉమ్మడి జిల్లాలో ఆదివారం నుంచి రెండోవిడత నా మినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీ కరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.పంచాయతీల ఏకగ్రీవానికి నై నజరానా లేక ఆశావహుల నారాజ్ గత ఎన్నికల్లో 106 జీపీలు ఏకగ్రీవం ముగిసిన తొలివిడత నామినేషన్ల ప్రక్రియ రాత్రి వరకూ నామినేషన్ల ప్రక్రియకాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మంగపేట, పెగడపల్లి క్లస్టర్లో శనివారం చివరిరోజు నామినేషన్ ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగింది. ఆశావహులు చలిని సైతం లెక్క చేయకుండా బారులు తీరి ఉన్నారు. మంగపేట క్లస్టర్లో మంగపేట, జాఫర్ఖాన్పేట, కూనారం, వెన్నంపల్లి గ్రామాలు ఉన్నాయి. పెగడపల్లి క్లస్టర్లో మడిపెల్లి, మడిపెల్లి కాలనీ, ఆశన్నపల్లె, అంకంపల్లె, పెగడపల్లి గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు స్థానాల కోసం ఆశావహులు భారీసంఖ్యలో తరలివచ్చారు. ముత్తారం మండలంలో.. ముత్తారం(మంథని): ఖమ్మంపల్లి, ముత్తారం, కేశనపల్లిలో రాత్రి తొమ్మిది గంటలు దాటినా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. 5గంటల లోపు కేంద్రానికి వచ్చి న వారికి టోకెన్లు ఇచ్చి క్యూలో ఉంచారు. మైదంబండలో 1, 2, 3, 4, 5 వార్డుస్థానాలు ఏకగ్రీవమైనట్లు కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలివిడత నామినేషన్లు జిల్లా సర్పంచ్లు నామినేషన్లు వార్డులు నామినేషన్లు ఏకగ్రీవం (గతంలో) కరీంనగర్ 92 – 886 – 16 పెద్దపల్లి 99 421 896 638 13 జగిత్యాల 122 297 1,172 456 37 సిరిసిల్ల 85 572 748 1,767 41 -
కోల్కారిడార్కు గ్రీన్సిగ్నల్
సాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మధ్య రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ లభించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల అభివృద్ధికి ఇది అత్యంత కీలకంగా మా రనుంది. కొత్త రైలు మార్గాన్ని కోల్కారిడార్ పేరిట పిలవాలని నిర్ణయించారు. రామగుండం, మంథని, భూపాలపల్లి, మేడారం నుంచి రైల్వేలైన్ నిర్మిస్తారు. దూర భారం తగ్గడంతోపాటు సింగరేణి బొగ్గు రవాణాకు సులభతరమైన మార్గం అందుబాటులోకి వస్తుంది. 1999లో తొలిసారి సర్వే ప్రారంభించారు. 2013–14లో ఆధునికీకరణకు ఆమోదం తెలిపారు. కేంద్రప్రభుత్వానికి డీపీఆర్.. రామగుండం– మణుగూరు రైల్వే ప్రాజెక్టు డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) కేంద్రప్రభుత్వానికి సమర్పించారు. 2024 మేలో భూ సేకరణ కోసం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక స్పెషల్ రైల్వే ప్రాజెక్టుగా ప్రకటించింది. ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది. ఇవే ప్రయోజనాలు.. కోల్కారిడార్ రైల్వే ప్రాజెక్టు ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. సింగరేణి బొగ్గు రవాణా సులభతరం కానుంది. ఆదివాసీ, గ్రామీణ ప్రాంతాలు, పల్లెటూళ్లకు మెరుగైన రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. పర్యాటక, కార్మిక, ధార్మిక రంగాల్లో ప్రగతి సాధిస్తాయి. తగ్గనున్న దూరభారం.. రైల్వే ప్రాజెక్టు పొడవు 207 కి.మీ. ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఇదే గమ్యానికి చేరుకునేందుకు 286 కి.మీ.కుపైగా ప్రయాణించాల్సి వస్తోంది. దీనిద్వారా సుమారు 70 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా సులభమవుతుందని భావిస్తున్నారు. మణుగూరు – రామగుండం మధ్య కొత్తగా లింక్ ఏర్పడితే భద్రాద్రి – కొత్తగూడెం ప్రాంతాలకు ప్రయాణం మరింత మెరుగవుతుంది. మంథని, మేడారం జాతర ప్రాంతానికి తక్కువ దూరంతో చేరుకునే వీలుంది. ఖనిజ, వాణిజ్య సామగ్రి రవాణాలో కూడా కీలకం కానుంది. భూసేకరణకు ముందున్న సవాళ్లు భూసేకరణ ప్రక్రియ దీనికి సవాల్గా మారనుంది. భూసేకరణ చివరివరకు పారదర్శకంగా చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ పూర్తి అయ్యే వరకు, ఫండింగ్, ట్రాక్ట్ లేఅవుట్, భూ విలువ, భూ నిర్లిప్తత వంటి మార్గాలు స్థిరంగా ఉండాల్సి ఉంటుంది. సమయ పట్టిక ఇంకా స్పష్టంగా ప్రకటించలేదు. ట్రెయిన్ల కనెక్టవిటీ ఎప్పటివరకు ప్రారంభం అవుతుందనేదానిపైనా ఇంకా స్పష్టత లేదు. 9 రైల్వేస్టేషన్లు.. కొత్త మార్గంలో 9 రైల్వేస్టేషన్లు నిర్మించాలని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం దీనికి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో భూసేకరణ ఇటీవల ప్రారంభమైంది. రైల్వేమార్గం సాంకేతిక వివరాలు -
నిత్యాన్నదానం ప్రారంభం
పెద్దపల్లి: సుల్తానాబాద్ శాసీ్త్రనగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే విజరమణారావు శనివారం నిత్యాన్నదానం ప్రక్రియను ప్రారంభించారు. ట్రస్ట్ చైర్మన్ సాయిరి పద్మ–మహేందర్తోపాటు వేద పండితులు రమేశ్శర్మ, గురుస్వామి మిట్టపల్లి మురళీధర్, కాంగ్రెస్ నాయకులు ముస్త్యాల రవీందర్, జైపాల్రెడ్డి, నగునూరి అశోక్ కుమార్, కందునూరి ప్రకాశ్, ఉస్తేం గణేశ్, అమిరిశెట్టి తిరుపతి, కుమార్ కిశోర్, తిరుపతిరావు, ఎల్లె రాజు, శెట్టి శీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక మంథని: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి జిల్లాస్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్లో స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇంగ్లిష్ మీడియం విభాగంలో మంథని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపి మొదటి స్థానంలో నిలిచారు. డిసెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటారు. పోటీలకు ఎంపికైన వారిలో విక్రాంత్, మణిచరణ్, సుశ్రుత ఉన్నారు. ఖోఖో పోటీల్లో ప్రతిభపెద్దపల్లిరూరల్: నిట్టూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు బాలసాని సిరి, బుషణవేన వినయ్, సాగల సంజయ్, ఎండీ టీనా ఖోఖో పోటీల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక య్యా రు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరుగుతు న్న పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని ఉపా ధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులను హెచ్ఎం లక్ష్మయ్య, పీఈటీ భాస్కర్, సీఆర్పీ సుధాకర్, ఉపాధ్యాయలు అభినందించారు. ఎన్టీపీసీ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయం జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో విధులు నిర్వహించి ఉ ద్యోగ విరమణ పొందుతున్న వారి సేవలు ప్ర శంసనీయమని ఈడీ చందన్కుమార్ సామంత అన్నారు. శనివారం ఎన్టీపీసీ పీటీఎస్లోని పార్క్లో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఎన్టీపీ సీ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్, పెండ్రు గోపాల్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటిన అనంత రం ఆయన మాట్లాడారు. ఉద్యోగులు విద్యుత్ ఉత్పత్తిలో అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కష్ణయ్య, ప్రతినిధులు ఆరెపల్లి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నేషనల్ కాన్ఫడరేషన్లో నేతలు జ్యోతినగర్(రామగుండం): న్యూఢిల్లీలోని స్మృతి వనంలో శనివారం బీఎంఎస్ ఆధ్వర్యంలో పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ నేషనల్ కాన్ఫడరేషన్ సమావేశం జరిగింది. రామగుండం ఎన్టీపీసీకి చెందిన నాయకులు హాజరయ్యారు. లేబర్ కోడ్స్, ఐఎల్వోలో బీఎంఎస్, పబ్లిక్ సెక్టార్ల ప్రాముఖ్యం గురించి చర్చించారు. కార్యక్రమంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్, ఆలిండియా బీఎంఎస్ ప్రెసిడెంట్ హిరణ్మయి పాండే, ప్రతినిధులు సుంకారి మల్లేశం, రామ్నాథ్ గణేశ్, వెంగళరావు, పవన్ కుమార్, సాగర్ రాజు, భాస్కర్రెడ్డి, చల సత్యనారాయణరెడ్డి, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చారిత్రక పరిణామం
రామగుండం – మణుగూరు రైల్వేలైన్ సింగరేణి కార్మికులు, సింగరేణి ప్రాంత ప్రజలు, బొగ్గు రవాణాకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుంది. మేడారం, రామప్ప తదితర పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. ప్రాజెక్ట్ డీపీఆర్ ఇప్పటికే సిద్ధమైంది. సుమారు రూ.4వేల కోట్ల వ్యయంతో కొత్త రైల్వే మార్గాన్ని త్వరలో ప్రారంభించేందుకు రైల్వే శాఖ ముందుకు రావడం చరిత్రాత్మక పరిణామం. –గడ్డం వంశీకృష్ణ, ఎంపీ, పెద్దపల్లి -
చిరు వ్యాపారం.. దృఢ సంకల్పం
కోల్సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని అల్లూరు ప్రాంతానికి చెందిన సామాన్య గృహిణి, చిన్న కిరాణంతో జీవనం మొదలుపెట్టింది బాలసాని నిర్మల. ఆమె దృఢసంకల్పానికి అబ్బురపడిన కేంద్రప్రభుత్వం ఆమెకు అరుదైన గౌరవం ఇచ్చింది. వచ్చేఏడాది జనవరి 26న న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానం పంపించింది. ఈ వేడుకల్లో నిర్మల తన భర్త బాలసాని రవికుమార్గౌడ్తో కలిసి పాల్గొనడానికి ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తూ మెప్మా, మిషన్ డైరెక్టర్ అధికారికంగా సమాచారం అందించారు. అభినందించిన బల్దియా కమిషనర్ చిరు వ్యాపారి బాలసాని నిర్మలకు ప్రభుత్వం తరఫున ఆహ్వానం రావడంపై రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జల్దా అరుణశ్రీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు శనివారం తన చాంబర్కు నిర్మలను పిలిపించుకుని శాలువా కప్పి అభినందనలు తెలిపారు. చిరువ్యాపారులు కష్టపడితే ఎలాంటి శిఖరాన్నైనా అధిరోహించవచ్చని నిర్మల నిరూపించారని కమిషనర్ ప్రశంసించారు. స్వనిధి రుణంతో నవచైతన్యం.. నిర్మల నవచైతన్యం –2020లో పీఎం స్వనిధి పథకంలో మొదలయ్యింది. తొలి విడతగా రూ.10వేలు రుణం పొందిన నిర్మల.. ఇంట్లో కిరాణం ప్రారంభించారు. క్రమశిక్షణగా రుణ వాయిదాలు చెల్లించడంతో ప్రభుత్వం రెండోవిడతగా రూ.20వేలు మంజూరు చేయగా, కిరాణంతోపాటు చీరల వ్యా పారం కూడా ప్రారంభించి సక్సెస్ అయ్యారు. వ్యా పారం విజయవంతంగా సాగడంతో ఇటీవల మూ డోవిడతగా రూ.50వేల రుణం కూడా పొందారు. చిన్న వ్యాపారిగా పట్టుదలతో ముందుకు సాగిన నిర్మల, నగరపాలక సంస్థలో ఆదర్శంగా నిలిచారు. క్యాష్లెస్ లావాదేవీల్లో రికార్డు.. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న డిజిటల్ చెల్లింపులపై నిర్మల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన వీధి వ్యాపారులకు ప్రభుత్వం అందించిన క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాన్ని కూడా ని ర్మల సద్వినియోగం చేసుకుంటున్నారు. అత్యధికంగా రూ.5,340 క్యాష్ బ్యాక్ సంపాదించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. న్యూఢిల్లీ నుంచి ఆహ్వానం.. కుటుంబానికి గర్వకారణం నిర్మల ప్రయాణం, పట్టుదల, వ్యాపార వృద్ధిని పరిగణనలోకి తీసుకున్న మెప్మా, మిషన్ డైరెక్టర్.. న్యూఢిల్లో వచ్చే జనవరిలో జరిగే గణతంత్ర వేడుకలకు నిర్మల దంపతులకు ఆహ్వానం పంపచిన్నవ్యాపారికి కేంద్రస్థాయి గుర్తింపు దక్కడంపై స్థానిక ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. అల్లూరు గ్రామం నుంచి న్యూఢిల్లీ రాజ్పథ్ వరకూ నిర్మల చేసిన చిరువ్యాపార ప్రయాణం ఎన్నో చిరు వ్యాపారులకు స్ఫూర్తి నింపుతోంది. -
పాతబ్లాక్ రెనోవేషన్
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని పాతబ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో చేపట్టిన రెనోవేషన్ పనులను కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో కలిసి శనివారం పరిశీలించా రు. డిసెంబర్ 31లోగా పనులు పూర్తిచేయాలని టీఎస్ఎంఐడీసీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్, బ్లడ్ బ్యాంక్, సదరం బ్లాక్ పరిశీలించారు. కార్యక్రమంలో రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్ఎంవోలు కృపాబాయ్, రాజు, అధికారులు పాల్గొన్నారు. హైస్కూల్ సందర్శన రామగుండం: మల్యాలపల్లి జెడ్పీ హైస్కూల్ను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళల సమస్యలపై ఆరా తీశారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కట్టుదిట్టంగా యూరియా విక్రయాలు పెద్దపల్లిరూరల్: పంటలకు అవసరమైన మేరకే యూరియా విక్రయించాలని, ఇందుకోసం రూపొందించిన యాప్లో వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష డీలర్లను ఆదేశించారు. బ్రా హ్మణపల్లి రైతువేదికలో యూరియా డీలర్లకు యా ప్పై కలెక్టర్ అవగాహన కల్పించారు. గతేడాది క న్నా ఈసారి 8వేల మెట్రిక్ టన్నుల యూరియా అ ధికంగా అందించినా కొరత ఏర్పడిందని, అధికారు లు జరిపిన తనిఖీల్లో అవకతవకలకు పాల్పడ్డ నలు గురు డీలర్ల దుకాణాలను సీజ్ చేశామని తెలిపారు. సాగు విస్తీర్ణం, అవసరమైన యూరియా, ఇప్పటివరకు వినియోగించింది తదితర వివరాలు యాప్లో నమోదై ఉంటాయని అన్నారు. రైతులు ఎక్కువ కావాలన్నా..ఆ అవకాశమే ఉండదన్నారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, ఏడీఏ అంజని, ఏఓ అలివేణి, డీలర్లు తదితరులు ఉన్నారు. పనులు పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష -
పార్ట్టైం జాబ్ పేరిట సైబర్ మోసం
జగిత్యాలక్రైం: సైబర్ నేరగాళ్లు పార్ట్టైం జాబ్ పేరుతో ఓ నిరుద్యోగిని నమ్మించి మోసానికి పాల్పడ్డారు. జగిత్యాల పట్టణానికి చెందిన మహ్మద్ అయూబ్కు ఈనెల 21న టెలిగ్రామ్లో పార్ట్టైం జాబ్లున్నాయని మెసేజ్ వచ్చింది. దీంతో అతను లింక్ ఓపెన్ చేయగా సైబర్ నేరగాళ్లు రిజిస్ట్రేషన్ కోసం రూ.10 వేలు చెల్లించాలని కోరారు. దీంతో మహ్మద్ అయూబ్ రూ.10 వేలు చెల్లించాడు. అనంతరం అయూబ్ ఐసీఐసీఐ ఖాతాకు రూ.16 వేల వేతనం వేశారు. దీంతో నమ్మిన అతను సైబర్ నేరగాళ్లు ఇచ్చిన టాస్క్లను పూర్తి చేసి అడిగిన విధంగా దశల వారీగా రూ.1,14,032 వారి ఖాతాలో జమచేశాడు. లింక్ క్లోజ్ కావడంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ పోలీసులు తక్షణమే స్పందించి సైబర్ నేరగాళ్ల ఖాతాలో ఉన్న రూ.25 వేలు ఫ్రీజింగ్ చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కుమారస్వామి తెలిపారు. జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో బంగారు ఉంగరం మాయం చేసి నకిలీ ఉంగరాన్ని వదిలి వెళ్లిన ఘటన జరిగింది. టవర్సర్కిల్ ప్రాంతంలోని ఓ బంగారం దుకాణానికి శనివారం మధ్యాహ్నం ఓ వ్యక్తి వచ్చి బంగారు ఉంగరం సెలక్షన్ చేసుకున్నాడు. అదే తరుణంలో మరో కస్టమర్ రావడంతో మాటల్లో దింపి ఓ ఉంగరాన్ని తూకం వేయాలని కోరగా తూకం వేసి యజమాని ఉంగరాన్ని టేబుల్పై పెట్టగానే 2 గ్రాముల బంగారు ఉంగరాన్ని కాజేసి నకిలీ ఉంగరాన్ని పెట్టి అక్కడి నుంచి జారుకున్నాడు. సీసీపుటేజీల ఆధారంగా చోరీకి పాల్పడ్డట్లు గుర్తించి పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశాడు. -
కులపోళ్ల ఓట్లే కీలకం
కరీంనగర్టౌన్: పల్లె సంగ్రామంలో భాగంగా శనివారం మొదటి విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఆదివారం రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలు పర్వం షూరు కానుంది. ఈనేపథ్యంలో సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు పల్లెల్లో తమకు మద్దతు ఇవ్వాలని పగలు ప్రచారం చేస్తూనే..రాత్రి మంతనాలలో ముగినితేలుతున్నారు. గెలుపే లక్ష్యంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. తమ అనుచరుల్లోని ముఖ్యులను రంగంలోకి దింపి ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు కుస్తీ పడుతున్నారు. కుల పెద్దలను రహస్యంగా సంప్రదిస్తున్నారు. పోలింగ్ బూత్ల వారీగా ఉన్న ఓట్లను సామాజిక వర్గాల వారీగా గుర్తించి ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని సామాజికవర్గాల మద్దతు లభిస్తే విజయం సునాయాసమన్న భావనలో అభ్యర్థులున్నారు. ఎత్తుకు పై ఎత్తులు గ్రామాల్లో వార్డుల వారీగా మొత్తం ఓట్లలో ఎక్కువ ప్రాబల్యం కలిగిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటున్న అభ్యర్థులు ఆయా సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. గెలుపోటములను నిర్ధారించే పోలింగ్ బూత్లపై దృష్టి సారిస్తూ, ప్రత్యేకంగా ఒక టీమ్ తయారు చేసుకొని తీసివేతలు, కూడికలు మొదలుపెట్టారు. గెలుపుబాటలో పయనించాలంటే తీసుకోవాల్సిన చర్యలపై మంతనాలు ముమ్మరం చేశారు. ఆయా కుల సంఘాల్లో జిల్లా స్థాయి పదువుల్లో ఉన్నవారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కులపెద్దలతో మంతనాలు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కులాలు, మతాల వారీగా ఓటర్లను గుర్తించి ఆయా వర్గాలకు చెందిన పెద్దలతో అనుచరగణం సాయంతో మంతనాలు చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఫోన్లలో వారిని ఆప్యాయంగా పలుకరించి గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. స్థానిక సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారితో ప్రస్తావించి గెలిచిన వెనువెంటనే తొలిప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు భిన్న రూపం దాల్చడంతో ఎన్నికల సమయంలోనే సమస్యల పరిష్కారానికి పునాది రాయి పడాలనే ముందుచూపుతో అన్ని సామాజిక వర్గాలు వ్యవహరిస్తున్నాయి. రెండు వైపులా వారే.. పోటీలో ఉండే అభ్యర్థులకు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదయం ఓ అభ్యర్థికి మద్దతుగా కనిపిస్తున్న వ్య క్తులు చీకటి కాగానే మరో అభ్యర్థికి మద్దతుగా వాడలలో కలియతిరుగుతున్నారు. తమ కే ఓట్లు వేయిస్తామని నమ్మబలుకుతున్నారు. మందు, విందు పార్టీల్లో మునిగి తేలుతున్నారు. ఒక్కరుగా కాకుండా కొంత మందిని పోగేసుకుని వెళ్తున్నారు. వీరిని బుజ్జగించడానికి ఆశావహులు తంటాలు పడుతున్నారు. దీంతో పంచాయతీ సమరం రాను రాను రసకందాయంగా మారనుంది. పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు వీటిపై అన్ని పార్టీల దృష్టి గంపగుత్తగా వేసుకునేందుకు ప్రణాళికలు సామాజికవర్గాల వారీగా మంతనాలు కుల పెద్దలను సంప్రదిస్తున్న నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు ముందస్తు హామీలు.. నజరానా -
సర్పంచ్ బరిలో విద్యావంతుడు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం సర్పంచ్ స్థానంలో పోటీ చేసేందుకు విద్యావంతుడు, న్యాయ వాది మార తేజ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తేజ తండ్రి బమార కిశోర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయవాది. తేజ ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివారు. తండ్రి మార కిశోర్ మాజీ ఎంపిటిసిగా కూనారంలో సేవ లు అందించారు. తేజ వయసు 26 ఏళ్లు. చిన్నవయసులో సర్పంచ్ స్థానాని కి నామినేషన్ వేసిన వ్యక్తిగా గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు పేర్కొన్నారు. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
జమ్మికుంట: ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని కేశవపూర్ చెందిన పాతకాల విజయరాణి(35) కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగింది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమెకు భర్త కిరణ్, ముగ్గురు కొడుకులున్నారు. గంగారపు చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. దేశరాజ్పల్లి వాసి..రామడుగు: దేశరాజ్పల్లి గ్రామానికి చెందిన కొత్త రేణుక(38) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రేణుక కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. భర్త రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నట్లు గ్రామస్తులు తెలిపారు. తాళం వేసిన ఇళ్లలో చోరీకోరుట్ల: కోరుట్ల పట్టణంలో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాలు.. పట్టణంలోని రవీంద్రారోడ్లో ఇల్లుటపు భూమయ్య ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని బంగారు గొలుసు, ఉంగరం, వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. జూనియర్ కళాశాల గ్రౌండ్ వద్ద కటుకం రాజారాం ఇంటి తాళాలు పగులగొట్టి కబ్బోర్డ్లోని ఐదు బంగారు ఉంగరాలు, ఒక జత చెవి కమ్మలు, కాళ్ల కడియాలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. వీణవంక: బేతిగల్, కనపర్తి, వల్భాపూర్ గ్రామాల రైతులకు చె ందిన వ్యవసాయ బా వుల సర్వీస్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రైతు ల వివరాల ప్రకారం.. సుమారు పది మంది రైతుల వ్యవసాయ బా వుల వద్ద స్టార్టర్ నుంచి విద్యుత్ మోటార్ వరకు వెళ్లే సర్వీస్ వైర్లు చోరీకి గురయ్యాయి. శనివారం ఉదయం రై తులు గమనించి డయ ల్ 100కు ఫోన్ చేశా రు. బేతిగల్కు చెందిన ఓ రైతు బోరు మెటార్ వైరు రూ.3వేల విలువ ఉంటుందని, మరో రైతు వైరు రూ.1,500 ఉంటుందని వాపోయారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు. -
ఇదీ పల్లె.. పంచాయతీ కథ
సిరిసిల్ల: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అని పాలకులు పదే పదే చెబుతుంటారు. ఇప్పుడు పల్లెల్లోనే ఎన్నికల సందడి మొదలైంది. అసలు గ్రామపంచాయతీ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది.. ఆ చరిత్ర ఏమిటో..? ఇప్పటి తరానికి తెలియదు. పల్లెల్లో పాలన ఆరు దశాబ్దాల కిందటే మొదలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్థానిక పాలన ఉండాలని భావించిన అప్పటి పాలకులు పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు 1957లో భారత ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మూడు అంచెల స్థానిక సంస్థల వ్యవస్థ ఉండాలని భావించింది. ఈమేరకు గ్రామపంచాయతీ, పంచాయతీ సమితి(తాలూకా), జిల్లా పరిషత్ మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని బల్వంతరాయ్ కమిటీ సిపార్సు చేసింది. ఈమేరకు జాతీయ అభివృద్ధి సంస్థ 1958లో ఆమోదించడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ సంస్థల చట్టం ఏర్పాటు చేసింది. ఈ చట్టాన్ని తొలిసారి రాజస్థాన్ అమలు చేసింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1959 అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా అమలు చేశారు. అప్పటి నుంచి అనేక మార్పులతో పంచాయతీరాజ్ చట్టం రూపాంతరం చెందింది. పరోక్ష పద్ధతిలో ఎన్నిక ఆంధ్రప్రదేశ్లో 1964లో సమగ్ర గ్రామపంచాయతీల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం 500లకు పైగా జనాభా ఉన్న గ్రామాలను గుర్తించి గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. జనాభా ప్రాతిపదికన ఒక్కో గ్రామపంచాయతీలో ఐదు నుంచి 17 వరకు వార్డు సభ్యులు ఉండవచ్చని నిర్ధేశించారు. 1964లో జరిగిన ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. ఎన్నికల్లో వార్డు సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటే.. ఎన్నికై న వార్డు సభ్యుల్లో ఒక్కరిని మెజార్టీ సభ్యుల ఆమోదంతో సర్పంచ్గా ఎన్నుకునేవారు. ఇలా ఎన్నికై న గ్రామ సర్పంచ్లు అందరూ కలిసి సమితి ప్రెసిడెంట్ను ఎన్నుకునే వారు. ఎన్నికై న సమితి ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునే పరోక్ష విధానం ఉండేది. 1976 వరకు అంటే 12 ఏళ్ల పాటు ఇదే విధానం కొనసాగింది. ప్రత్యక్ష పద్ధతికి 1978లో శ్రీకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. గ్రామసర్పంచ్ ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనే అంశంపై అధ్యయనం చేసింది. నరసింహం కమిటీ ప్రత్యక్ష పద్ధతిలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సిపార్సు చేయడంతో అప్పటి నుంచి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మండల వ్యవస్థతో సమూల మార్పులు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి సీఎం ఎన్టీఆర్ తాలూకాలను రద్దు చేశారు. 1987లో మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టి ఎన్నికలు నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ఓటర్లు ఓట్లు వేసి ఎన్నుకునే విధానాన్ని అమలు చేశారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ల్లో ఒక్కరిని మెజారీ సభ్యుల ఆమోదంతో ఎన్నుకునే విధానం అమలు చేశారు. ఎంపీపీలుగా ఎన్నికై న వారు జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకునేవారు. 1994లో ఏపీ పంచాయతీరాజ్ చట్టం అమలు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 ద్వారా అదే ఏడాది నుంచి గ్రామాల్లో గ్రామపంచాయతీ సర్పంచ్లతోపాటు మండల పరిషత్ సభ్యులు(ఎంపీటీసీ), జిల్లా పరిషత్(జెడ్పీటీసీ) సభ్యుల ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ఎంపీటీసీ సభ్యులు మెజార్టీ ఆమోదంతో ఎంపీపీల ఎన్నిక, జెడ్పీటీసీ సభ్యుల మెజార్టీ ఆమోదంతో జెడ్పీ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి. 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. గ్రామపంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లను నియమించడం, ప్రతీ ఊరిలోనూ వైకుంఠధామాలు, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతివనాలు, ట్రాక్టర్లు, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ, క్రీడా ప్రాంగణాలు, డంపింగ్యార్డుల ఏర్పాటు వంటి సమూలమైన మార్పులకు 2018 చట్టం శ్రీకారం చుట్టింది. గ్రామపంచాయతీలకు విశేష అధికారాలు కల్పిస్తూ చట్టం రూపుదిద్దుకుంది. ఈ చట్టం ప్రకారమే ఇప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరు దశాబ్దాల గ్రామ‘పంచాయతీ’ తొలిసారి 1964లో ఎన్నికలు పంచాయతీరాజ్ చట్టాల రూపకల్పన


