Peddapalli District Latest News
-
పీసీసీలో మనోళ్లకు చోటు
● పీఏసీ కమిటీలో దుద్దిళ్ల, పొన్నం, ఆది ● కేబినెట్లో చోటు కోసం ఉమ్మడి నేతల ఆరాటంసాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన వివిధ పీసీసీ కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రికి చోటు దక్కింది. పీసీసీ కమిటీల్లో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్లను నియమించారు. కాగా.. ఇటీవల కొంతకాలంగా పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డికి సలహా కమిటీలో అవకాశం కల్పించారు. అదేవిధంగా డీలిమిటేషన్ కమిటీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలను సభ్యులుగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలవగా, అందులో నలుగురికి పీసీసీ కమిటీల్లో అవకాశం లభించింది. మంత్రి వర్గంలో ఆది.. మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు మరో బెర్తు ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు. మున్నూరు కాపు సామాజికవర్గం కోణంలో ఆయనకు బెర్తు ఖాయమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. మాదిగ సామాజిక వర్గం తరఫున తమకు కూడా కేబినెట్ లో చోటు కల్పించాలని మరో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు కోరుతున్నారు. మరోవైపు తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఇటీవల రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరిన విషయం విధితమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటికే దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు కేబినెట్లో ఉన్నారు. వీరికి తోడుగా మరో ఒక్క బెర్తు మాత్రమే ఖరారయ్యే అవకాశాలు ఉండటంతో ఈ ఒక్క మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. -
మహిళల ఆర్థికాభివృద్ధికి కుట్టు శిక్షణ దోహదం
రామగిరి(మంథని): మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఉచిత కుట్టు శిక్షణ దోహదపడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు అన్నారు. మండలంలోని కల్వచర్ల గ్రామంలో రేండ్ల శారద కుమార్స్వామి దంపతులు సుమారు 300 మందికి ఉచిత కుట్టు శిక్షణ అందించి న్యాక్ ఆధ్వర్యంలో శుక్రవారం పరీక్షలు నిర్వహించారు. సదరు మహిళలకు డీఎంహెచ్వో అన్నప్రసన్న కుమారి, డీపీవో వీరబుచ్చయ్యతో కలిసి సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం రేవతిరావు మాట్లాడుతూ, గ్రామంలోని మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఉచిత కుట్టు శిక్షణతో పాటు పరికరాలు అందజేయడం, న్యాక్ ద్వారా ప్రతి మహిళకు రుసుము చెల్లించి పరీక్షలు నిర్వహించడంతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తున్న శారదకుమార్స్వామి దంపతుల సేవలు భేష్ అని కొనియాడారు. కార్యక్రమంలో రేండ్ల కొమురయ్య, బూస బాపు, కస్ప కవిత, మహేందర్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జెండా పండుగ అతిథులు వీరే
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ పండుగకు జిల్లా కేంద్రాల్లో జరిగే ఉత్సవాలకు అతిథులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, జగిత్యాలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, పెద్దపల్లికి రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, రాజన్న సిరిసిల్లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లు జెండా ఆవిష్కరించనున్నారు. -
పొగాకు ఉత్పత్తులు హానికరం
పెద్దపల్లిరూరల్: ప్రతి ఒక్కరూ పోషక విలువలున్న ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, హానికారకమైన పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని జిల్లా అడిషనల్ జడ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జూనియర్ సివిల్జడ్జి మంజులతో కలిసి పాల్గొన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకును, వాటితో తయారయ్యే వస్తువులకు దూరంగా ఉండాలన్నారు. పొగాకు వల్ల కలిగే దుష్ఫలితాలపై వివరిస్తూ ప్రజల్లో చైతన్యం పెంచాలన్నారు. నిరంతరం పెట్రోలింగ్ చేయాలిఓదెల(పెద్దపల్లి): పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ చేయాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం పొత్కపల్లి పోలీస్స్టేషన్ను డీసీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఠాణాకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి సమస్యలు పరిష్కరించాలన్నారు. స్టేషన్ పరిధిలో సమస్యాత్మక గ్రామాలపై నిత్యం నిఘా పెట్టాలని సూచించారు. మత్తు పదార్థాలు రవాణా చేసే వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలన్నారు. ఎస్సై రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. సమ్మర్ క్యాంపు తనిఖీపెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమ్మర్క్యాంపులను నిర్వహిస్తున్న తీరును పర్యవేక్షించేందుకు విద్యాశాఖ ప్రత్యేకాధికారి దుర్గాప్రసాద్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని అమర్నగర్ ప్రైమరీ స్కూల్ను డీఈవో మాధవితో కలిసి సందర్శించారు. వేసవిలో విద్యార్థులు ఆటపాటలతో తమ మేధస్సును పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం సమ్మర్క్యాంపులను నిర్వహిస్తోందన్నారు. ఉద యం 8.30 నుంచి 11గంటల వరకు అందుబా టులో ఉంటూ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. సీఆర్పీ బాలసాని వెంకటేశం తదితరులున్నారు. అభ్యసన సామర్థ్యాలు వెలికితీయాలిసుల్తానాబాద్రూరల్: శిక్షణ కాలంలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేసి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను వెలికి తీయాలని జిల్లా విద్యాధికారి మాధవి అన్నా రు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల కెపాసిటి బిల్డింగ్పై శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా అబ్జర్వర్ దుర్గాప్రసాద్, డీఈవో శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. కోర్స్ డైరెక్టర్ కవిత, రిసోర్స్ పర్సన్స్ నరేశ్, కుమార్, సాధన, ప్రత్యక్ష, సీఆర్సీలు కిరణ్కుమార్, మంజుల తదితరులున్నారు. యాజమాన్య పద్ధతులు పాటించాలికమాన్పూర్(మంథని): పంటల సాగులో రైతులు తప్పనిసరిగా యాజమాన్య పద్ధతులు పాటించాలని శాస్త్రవేత్తలు అన్నారు. మండలంలోని గుండారం, నాగారం, సిద్దిపల్లె గ్రామాల్లో ఖరీఫ్ పంటల సాగు విధానాలపై శుక్రవారం రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ఖరీఫ్ సాగుకు రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. అధిక దిగుబడులు ఇచ్చే, చీడపీడలను తట్టుకునే విత్తనాలను విత్తుకోవాలని సూచించారు. మంథని ఏడీఏ అంజని, శాస్త్రవేత్తలు వెంకన్న, కిరణ్, సురేశ్, బాబ్జీ, పాల్యాదవ్, గిరీశ్, ఏవో రామకృష్ణ, జ్యోతి, అనూష, శ్వేత పాల్గొన్నారు. -
పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: భూ సంబంధిత సమస్యలను భూభారతి చట్టం ద్వారా పారదర్శకంగా పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ఎలిగేడు మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో భూసమస్యలపై స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సేత్వార్కు సంబంధించిన సమస్యలే ఎక్కువగా వచ్చాయని వివరించారు. 2020 సంవత్సరం వరకు సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకున్న సమస్యలనే పరిష్కరించాలని కొత్తగా సాదాబైనామా దరఖాస్తులు తీసుకోవద్దన్నారు. జూన్ 3నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తిరస్కరించే దరఖాస్తులకు కారణాలను స్పష్టంగా చెప్పాలన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు దృష్టికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, సర్వే ల్యాండ్రికాడ్స్ఏడీ శ్రీనివాసులు తదితరులున్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఎలిగేడు/జూలపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం ఎలిగేడు మండలం లాలపల్లి, ఎలిగేడు, ర్యాకల్దేవుపల్లి, రాములపల్లి, జూలపల్లి మండలం నాగులపల్లె, చీమలపేట, తేలుకుంటలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి డబుల్బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఒక్క ఇల్లు ఇవ్వకుండా పేదలను మోసం చేసిందన్నారు. ఎలిగేడు నుంచి లాలపల్లి వరకు రూ.3కోట్లతో రోడ్డు నిర్మాణం జరుగుతుందని, త్వరలోనే మండల కేంద్రంలో మంత్రి చేతులమీదుగా పోలీస్స్టేషన్ను ప్రారంభించుకుంటామని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తడిసిన, రంగుమారిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వివరించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ యాకన్న, ఎంపీడీవోలు భాస్కర్రావు, పద్మజ, ఎంపీవో అనిల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వేణుగోపాలరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గండు సంజీవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్రెడ్డి, దుగ్యాల సంతోష్రావు, బాలుసాని పరుశరాములుగౌడ్, రాజేశ్వర్రెడ్డి, వెంకట్రెడ్డి, కోరుకంటి వెంకటేశ్వర్రావు, పల్లెర్ల వెంకటేశ్గౌడ్, బూర్ల వెంకటసత్యం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు -
అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయించాలని.. అనర్హులకు ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు వానాకాలం పంటలసాగు సన్నద్ధతపై కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు.‘ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఖరీఫ్ సీజన్లో ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను భాగస్వామ్యం చేస్తాం. ఎస్సారెస్పీ సామర్థ్యం సిల్ట్ కారణంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం ఎస్సారెస్పీ రిజర్వాయర్ పూడికతీత, డీసిల్టేషన్ ఆధునిక పద్ధతుల్లో పూర్తిచేసి పూర్వపు సామర్థ్యం తీసుకొస్తాం. కడెం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో సిల్ట్ తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులను వినియోగిస్తాం. కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తాం.. ఇందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహకారంతో ముందుకు వెళ్తాం. సింగరేణి భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. బండ్ల వాగు ఎత్తిపోతల పథకాన్ని వారం రోజులలో ప్రారంభిస్తాం. పాలకుర్తి ఎత్తిపోతల పథకం, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది’ అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.● రోళ్లవాగు ప్రాజెక్టు అటవీ అనుమతులు వచ్చేలా ఉన్నతాధికారులతో జగిత్యాల కలెక్టర్ నిరంతరం సంప్రదింపులు చేయాలని మంత్రి సూచించారు. నారాయణపురం రిజర్వాయర్, కొండగట్టు ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలుచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్లు మరోవారం పాటు కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అవసరమైనమేర ధాన్యం రవాణా కోసం వాహనాలు సిద్ధం చేసుకోవాలని.. లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు వాడాలని అన్నారు. దేశంలో మొదటిసారిగా తెలంగాణలోని 84 శాతం జనాభాకు ఉచితంగా ఆరుకిలోల సన్నబియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది విప్లవాత్మక పథకమని.. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకై క రాష్ట్రం మనదే అని తెలిపారు.ఇండ్ల స్థలాలపై ఆందోళన వద్దు..మీడియా మిత్రులకు ఎస్సారెస్పీ సమీపంలో అందుబాటులో ఉన్న భూములు పంపిణీకి ఉన్న సమస్యలు పరిష్కరించి త్వరలోనే ఇంటి పట్టాలు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కరీంనగర్ మీడియా మిత్రులు ఇండ్ల పట్టాల పంపిణీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో చర్చించి త్వరలో పట్టాలు అందించే కార్యక్రమం చేపడుతామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగిందన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.51 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలతో రైతుల నష్టపోకుండా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. భూ భారతి చట్టంతో పట్టాదారులకు ఎటువంటి నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.● మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో రైస్ మిల్లులవద్ద తూకం పేరుతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడా ఇబ్బంది లేదన్నారు. మలకపేట, సూరమ్మ, మోతే నారాయణపూర్, గౌరవెల్లి, దేవాదుల వంటి ప్రాజెక్టుల పనులు స్పీడప్ చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలు వస్తాయని.. ఆయా జిల్లాల కలెక్టర్లను సైతం సమీక్ష సమావేశాలకు ఆహ్వానించాలని అధికారులను మంత్రి కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, చింతకుంట విజయరమణారావు, డాక్టర్ సంజయ్కుమార్, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా, సత్యప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ జె.అరుణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
● పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి పెద్దపల్లిరూరల్: ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠ శాలలను బలోపేతం చేయాలని పట్టభద్రుల ఎ మ్మెల్సీ అంజిరెడ్డి కోరారు. స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో చేపట్టిన ఉపాధ్యాయుల శిక్షణ శిబిరానికి బుధవారం ఆయన హాజరై మాట్లాడా రు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివా నని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డీఈవో మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షు డు సంజీవరెడ్డి, నాయకులు శివంగారి సతీశ్, మంథెన కృష్ణ, కాసనగొట్టు విజయ్, సందీప్, రామగిరి అఖిల్, రవీందర్ తదితరులు ఉన్నారు. మానవ అక్రమరవాణా నిర్మూలిద్దాం మానవ అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని డీఈవో మాధవి, ప్రజ్వ ల సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ బలరామకృష్ణ అన్నారు. విద్యాపరిశోధన శిక్షణ సంస్థ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రెండురోజుల శిక్షణ శిబిరం బుధవారం ప్రారంభమైంది. ఆర్థిక, సామాజిక కారణాలతో ట్రాఫికెర్స్ టార్గెట్ చేసి మాయామాటలతో నమ్మించి వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి పెద్దపల్లిరూరల్: సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అనుసరించాల్సిన పద్ధతులపై పంచాయతీ, వైద్య, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్లో బుధవారం ఆమె సమావేశమై పలు సూచనలు చేశా రు. ఇంటి ఆవరణను శుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. దేశంలో కరోనా ప్రబలుతోందని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ చూపాలని ఆమె సూచించా రు. సమావేశంలో జిల్లా అధికారులు వీరబుచ్చ య్య, శ్రీనివాస్, శ్రీరాములు, రాజమౌళి, సుధాకర్రెడ్డి, కిరణ్తోపాటు మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్ మృతదేహాలను ఎందుకివ్వరు?
పెద్దపల్లిరూరల్: ఎన్కౌంటర్ పేరిట మావోయిస్టులు నంబాల కేశవరావు సహా 27మందిని హ తమార్చిన పాలకులు మృతదేహాలను వారి కు టుంబసభ్యులకు ఎందుకు ఇవ్వరని ప్రజా, పౌరహక్కుల సంఘాల నేతలు ప్రశ్నించారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన తెలిపారు. నారాయణపూర్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల అప్పగింతపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదన్నారు. ఛత్తీస్గఢ్ పో లీసులు ఎన్కౌంటర్ మృతదేహాలకు అంత్యక్రియలు జరపడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కుమారస్వామి, లక్ష్మణ్, రవి, కొమురయ్య, ర వీందర్, రాజయ్య, సుదర్శన్, అశోక్, శ్రావణ్, ఆంజనేయశర్మ, సుచరిత, పర్వతాలు, సత్యనారాయణ, మల్లేశం, సుధాకర్, జగన్ ఉన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● కేంద్ర పర్యావరణ డైరెక్టర్ తరుణ్ కుమార్ గోదావరిఖని/రామగిరి(మంథని): పర్యావరణా న్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ హైదరాబాద్ రీజియన్ డైరెక్టర్ కె.తరుణ్కుమార్ అన్నారు. ప్లాస్టిక్ను వినియోగించవద్దన్నారు. బుధవారం ఆయన ఆర్జీ– 2, 3, ఏపీఏలో పర్యటించారు. తొలుత ఉద్యోగులకు జూట్ బ్యాగులు అందజేశారు. ప్రతీఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం వకీల్ప ల్లిగని, పెంచికల్పేట, న్యూపెద్దంపేట, మారేడు పాక, ఓిసీపీ–1, జూలపల్లి, ముల్కలపల్లి, పన్నూ ర్, రత్నాపూర్, నాగేపల్లి గ్రామాల్లో పర్యటించా రు. ఓసీపీ–1పై రెమిడేషన్ ప్లాన్లో భాగంగా చేపట్టిన పనుల వివరాల గురించి జీఎం నాగేశ్వరరా వు ఆయనకు వివరించారు. కార్పొరేషన్ ఎన్విరాన్మెంట్ విభాగం జీఎం సైదులు, ఎస్వో టు జీ ఎం రామ్మోహన్, ఏరియా ఇంజినీర్ శేఖర్బాబు, ఫైనాన్స్ ఏజీఎం శ్రీనివాసులు పాల్గొన్నారు. -
లక్ష్మీపూర్లో మున్నాభాయ్ ఎంబీబీఎస్!
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాగా నకిలీ వైద్యుడి లీలలు బుధవారం వెలుగు చూశాయి. గ్రామంలో వంగరి గోవర్దన్ అనే వ్యక్తి ఒక ఇంటిని అద్ధెకు తీసుకుని మెడికల్ ప్రాక్టీషనర్ పేరుతో క్లినిక్ను ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా తన కొడుకు పేరుతో ఎంబీబీఎస్ లెటర్ హెడ్తో వైద్యం ప్రారంభించాడు. పేషంట్లకు ఇంజక్షన్లు, సైలెన్లు పెట్టడం, ఎంబీబీఎస్ లెటర్ హెడ్పై మందులు వ్రాయడం మొదలెట్టాడు. వస్తున్న కాసులు సరిపోవడం లేదని అనుకున్నాడో ఎమో తెలియదు కానీ ఏకంగా మహిళలకు సంతానం కలిగిస్తానంటూ కొత్త వైద్యం ప్రారంభించాడు. సాధారణంగా గైనకాలజీ డాక్టర్లు మహిళలకు సంతానోత్పత్తి కొరకు హెచ్సీజీ ఇంజక్షన్లను అన్ని వైద్య పరీక్షల అనంతరం అవసమైతేనే ఇస్తుంటారు. ప్రథమ చికిత్సలకు పరిమితం కావాల్సిన మెడికల్ ప్రాక్టీషనర్లు ఏకంగా అర్హతగల డాక్టర్ల మాదిరిగా చికిత్సలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. నకిలీ వైద్యుడి వైద్యంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజితను ‘సాక్షి’ వివరణ కోరగా వారం రోజుల క్రితమే అతడికి నోటీసులు ఇచ్చామని, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొడుకు పేరుతో తండ్రి వైద్యం అద్దె ఇంటిలోనే పేషంట్లకు సైలెన్లు, ఇంజక్షన్లు ఇస్తున్న వైనం -
కోర్టు ఆవరణలో ఆటో దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కోర్టు ఆవరణలో పార్కింగ్ చేసిన ఆటోను దొంగిలించిన నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని గౌతమినగర్కు చెందిన జిలకర ప్రసాద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం బుట్టపూర్కు చెందిన మగ్గిడి కృష్ణ ఈనెల 26న జగిత్యాల కోర్టు ఆవరణలో ఆటోను పార్కింగ్ చేశాడు. దానిని ప్రసాద్ చాకచక్యంగా దొంగిలించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఈనెల 27న పట్టణ ఎస్సై గీత జిల్లాకేంద్రంలోని గాంధీనగర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ప్రసాద్ ఆటోలో వస్తూ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిన ఉంచి ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, కానిస్టేబుళ్లు జీవన్, అనిల్, వంశీ పాల్గొన్నారు. ఉద్యమకారులను ఆదుకోవాలి పెద్దపల్లిరూరల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి అన్నివిధాలా ఆదుకోవాలని ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఐలయ్య కోరారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద బుధవారం ఉద్యమకారులతో కలిసి నివాళి అర్పించారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత తమకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశపడితే అప్పటి సీఎం ఉద్యమకారులను విస్మరించారని విమర్శించారు. కేవలం తమ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు మేలు కలిగేలా చూడాలని కోరారు. ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సారయ్య, నల్ల మనోహర్రెడ్డి, రాజేశం, జ్యోతి, చంద్రకళ, సురేందర్రెడ్డి, భాస్కర్, సదాశివ, రాజిరెడ్డి, రాజు, కృష్ణ, సదయ్య తదితరులు ఉన్నారు. ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి ఆనవాళ్లువేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈవిషయంపై వేములవాడ ఎఫ్ఆర్వో కలీలొద్దీన్ను వివరణ కోరగా వేములవాడ, కొడిమ్యాల, చందుర్తి ఫారెస్ట్ ప్రాంతంలో పులి తిరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజుకు పులి 35 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, అది ఫారెస్టు ప్రాంతంలో అనుకూలమైన ప్రాంతానికి వెళ్తుందని తెలిపారు. -
ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి
రామగిరి(మంథని): భర్త అనారోగ్యం.. ఆర్థికలేమి.. ముగ్గురు పిల్లలు పోషణ.. కూలీ పనులతో కుటుంబాన్ని నెట్టుకు రావడం ఆ గృహిణికి తలకుమించిన భారంగా మారింది. దాతలు సాయం చేస్తే భర్తకు మంచి వైద్యచికిత్స అందిస్తామని, పిల్లల పోషణ చూసుకుంటానని అంటోంది ఆ గృహిణి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన దుబ్బాక కుమార్ – విజయ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం కిరణ్, మహేందర్, చెర్రీ ఉన్నారు. అనారోగ్యానికి గురైన కుమార్.. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. అయినా నయం కాలేదు. తనకున్న స్థోమత వరకు ఖర్చుచేశాడు. చేతిలో ఉన్న సొమ్మంతా ఖర్చు కావడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లడానికి చిల్లిగవ్వకూడా లేకుండాపోయింది. కనీసం ప్రయాణానికి కూడా డబ్బులు లేని దీనస్థితిలో ఆ కుటుంబం ఉంది. విజయ కూలీ పనులకు వెళ్లి అంతోఇంతో సంపాదిస్తున్నా కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదు. దాతలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని విజయ కోరుతోంది. రెండు కిడ్నీలు పనిచేయక యువకుడి నరకయాతన -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
రాయికల్: మండలంలోని అల్లీపూర్కు చెందిన సిరిపురం శ్రీహరి (47) అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. శ్రీహరి బీడీ ప్యాకర్గా పనిచేస్తున్నాడు. కుటుంబపోషణకు కొంత అప్పు చేశాడు. ఇటీవలే కూతురు పెళ్లి చేశాడు. మొత్తం రూ.8లక్షల వరకు అప్పు ఉందని, దానిని ఎలా తీర్చలోనని నిత్యం మనస్తాపం చెందుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. శ్రీహరి భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పరారైన ఖైదీ కోసం లుక్ ఆఫ్ నోటీస్జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోర్టు నుంచి మంగళవారం సాయంత్రం పరారైన జున్ను ప్రసాద్ కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్ను పట్టుకునేందుకు పోలీసు శాఖ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు విదేశాలకు పారిపోకుండా బుధవారం ఉదయమే దేశంలోని అన్ని ఎయిర్పోర్టులకు లుక్ ఆఫ్ నోటీసు జారీ చేశారు. సిరిసిల్లలో కోవిడ్ పాజిటివ్ కేసులు?● ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్ధారించని వైద్యులు సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జ్వరంతో బాధపడుతున్న ఓ దంపతులు బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లారు. కోవిడ్ పరీక్షలు చేయడం లేదని ల్యాబ్ నిర్వాహకులు వెనక్కి పంపించినట్లు సమాచారం. సదరు దంపతులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. నోరు రుచి, ముక్కు వాసన పోవడంతో మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ దంపతులు కోవిడ్గా అనుమానించి ప్రభుత్వ ఆస్పత్రికి రాగా.. పరీక్షలు చేయకపోవడం గమనార్హం. -
డీఈవో వ్యాఖ్యలు.. ఆరని మంటలు!
● మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన కరీంనగర్వాసి ● చర్యలు తీసుకోవాలని మరిన్ని ఫిర్యాదులు ● క్రమంగా వెలుగులోకి జనార్దన్రావు వ్యవహారాలు ● ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లుగా కరీంనగర్లో విధులు ● కలెక్టర్ కార్యాలయం తీరుపైనా విమర్శలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్రావు వ్యవహారం మరింత ముదిరింది. ‘భర్తలకు వంట రాకపోతే.. భార్యలు లేచిపోతారు.. తాను రెండు సంసారాలు ఈదుతున్నా’ అంటూ తలతిక్క వ్యాఖ్యలతో శిక్షణ శిబిరాల్లో టీచర్లను బెంబేలెత్తించిన డీఈవోపై విమర్శలు, ఆరోపణలు ఆగడం లే దు. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ.. కలెక్ట ర్ పమేల సత్పతి మంగళవారం రాత్రి ఆదేశాలిచ్చి నా.. టీచర్లు శాంతించడం లేదు. ఆయన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయని తోటి ఉద్యోగులు మండిపడుతుండగా.. సామాజిక ఉద్యమకారుడు షాబుద్దీన్ డీఈవోపై చర్యలు తీసుకోవా లని కోరుతూ.. మహిళా కమిషన్కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. డెమొక్రాటిక్ టీచర్ ఫెడరేషన్ (డీటీఎఫ్) నాయకులు జనార్దన్రావుపై హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) కూడా అతనిపై చర్యలకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవా రం కూడా సోషల్ మీడియాలో, మెయిన్స్ట్రీమ్ మీ డియాలో విషయం ప్రాధాన్యం సంతరించుకోవడంతో ఇదే వ్యవహారంపై చర్చ నడుస్తోంది. డీఈ వో జనార్దన్రావు సిరిసిల్లకు కూడా డీఈవోగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో కామారెడ్డి డీఈవో ఎస్.రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు కరీంనగర్ డైట్ ప్రిన్సిపాల్ మొండయ్య నూతన డీఈవోగా బుధవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. దండిగా పెద్దల దన్ను.. జనార్దన్రావుకు ప్రభుత్వ పెద్దల నుంచి దండిగా స హకారాలు ఉన్నాయని సమాచారం. కరోనా నుంచి డీఈవోగా కొనసాగుతున్న ఈయనపై ఎన్ని విమర్శలు వచ్చినా చర్యలు తీసుకోవడంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నాయన్న వి మర్శలు ఉన్నాయి. ● టీచర్లకు అకారణంగా, అత్యధికంగా మెమోలు ఇచ్చిన డీఈవో అన్న ఆరోపణలు ఉన్నాయి. యూనియన్ నాయకులకు ఇంక్రిమెంట్లలో కోత విధించారన్న విమర్శలు తెలిసిందే. ● వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో పనిచేసిన ప్రతీ ఉన్నతాధికారి ఎన్నికల నియమావళి ప్రకారం.. బదిలీపై వెళ్లారు. కానీ, ఈయనను కదపలేదు. ● హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్, ఇటీవల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయినా ఇతని బదిలీ జరగకపోవడం అతని పలుకబడికి నిదర్శనం. ● ఇవన్నీ తెలిసీ.. కలెక్టర్ కార్యాలయం కూడా ఆయన బదిలీ విషయంలో అలసత్వం వహించి విమర్శలను మూటగట్టుకుంది. ● 317 జీవో సమయంలోనూ పలువురు టీచర్లు ప్రొడ్యూస్ చేసిన మెడికల్ సర్టిఫికెట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ● హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయలో అప్పటి సీఎం సభను విజయవంతం చేయాలని ఆదేశాలివ్వడం, రూటు బాధ్యతలను టీచర్లకు అప్పగించడం తీవ్ర దుమారం రేపింది. ● ఇపుడు కూడా తన స్వయంకృపరాదంతో వేటు పడిందే.. ఆయన్ను ఇక్కడ నుంచి ఎవరూ కదపలేకపోవడం గమనార్హం. -
పట్టణాభివృద్ధికి కృషి చేయాలి
పెద్దపల్లిరూరల్: పట్టణాన్ని అభివృద్ధి చేయడంపై అధికారులు శ్రద్ధ చూపాలని బీజేపీ నాయకులు పల్లె సదానందం, శివంగారి సతీశ్ కోరా రు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవా రం పార్టీశ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన ని ర్వహించారు. అంతర్గత రోడ్లను అభివృద్ధి చే యాలని, ఇప్పటికే చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, మండి బిర్యానీ సెంటర్లలో శుభ్రత లోపించిందనిఆరోపించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకు లు భాస్కర్, రాజు, సాయికృష్ణ, శ్రీనివాస్, నరే శ్, రాజేశం, క్రాంతి, మనోహర్, విజయ్, కృష్ణ, అభి, అఖిల్, సందీప్, వెంకటేశ్, సోడాబాబు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.బాలికల భవిష్యత్కు చేయూత జ్యోతినగర్(రామగుండం): బాలికల ఉజ్వల భవిష్యత్కు ఎన్టీపీసీ చేయూతనిస్తోందని ఆ సంస్థ సంయుక్త మహిళా సమితి సీనియర్ స భ్యురాలు సునీత జైకుమార్ శ్రీనివాసన్, దక్షిణ దీపాంజలి మహిళా సమితి అధ్యక్షురాలు రంజ నా దువా అన్నారు. సీఎస్సార్ ఆధ్వర్యంలో బా లికలకు నెలరోజులపాటు అందించే రెసిడెన్షియల్ శిక్షణ శిబిరాన్ని వారు బుధవారం సందర్శించి మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఇంటికి వెళ్లిన తర్వాత పాటించాలని సూచించారు. అనంతరం బాలికలు ప్రదర్శించిన నృత్యాలు, కరాటే పోటీలు, స్కిట్లు ఆక ట్టుకున్నాయి. ఎన్టీపీసీ దీప్తి మహిళా సమితి అ ధ్యక్షురాలు రాఖీ సామంత, ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, అధికారులు పాల్గొన్నారు. రజకులకు ప్రాధాన్యం ఇవ్వాలి పెద్దపల్లిరూరల్: సంక్షేమ పథకాల్లో రజకులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇనివ్వాలని ఆ సంఘం జి ల్లా అధ్యక్షుడు రమేశ్, అధికార ప్రతినిధి అలువాల రాజేందర్ డిమాండ్ చేశారు. రజక సంఘం జిల్లా ప్రచార కార్యదర్శిగా ప్రణయ్, ని యోజకవర్గ ఇన్చార్జిగా వెంకటేశ్ను నియమించగా.. బుధవారం వారికి జిల్లా కేంద్రంలో ని యామక పత్రాలు అందించారు. అంతకుముందు పట్టణంలో చేపట్టే మడేలయ్య బోనాల జా తరకు హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే దా సరి మనోహర్రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించా రు. మల్లేశ్, ఉప్పలయ్య, రామ్మూర్తి, సురేశ్, రమేశ్, నవీన్, కుమారస్వామి పాల్గొన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలుసుల్తానాబాద్రూరల్: ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పకడ్బందీగా చర్యలు చేపట్టామని ట్రాఫిక్ ఏ సీపీ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక అంబేడ్కర్ చౌ రస్తా, పూసాల రోడ్డు, బస్టాండ్ ఏరియాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఏసీపీ మా ట్లాడుతూ రాజీవ్ రహదారిపై వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు నియంత్రణ చర్యలు తీ సుకుంటున్నామన్నారు. అవసరమైనచోట ట్రా ఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపా రు. సీఐలు అనిల్, సుబ్బారెడ్డి ఉన్నారు. పంట పరిహారం విడుదల సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో యాసంగి సాగు సమయంలో అకాల వర్షం, వడగళ్ల వానతో పంట లు నష్టపోయిన రైతులకు బుధవారం ప్రభు త్వం నిధులు విడుదల చేసింది. మార్చి, ఏప్రిల్లో కురిసిన అకాలవర్షాలతో నష్టపోయిన పంట పొలాలను సర్వే చేసిన వ్యవసాయ శా ఖ.. జిల్లాలో 3,556 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దానికి సంబంధించిన 3,297మంది రైతులకు సుమారు రూ.3.567 కోట్ల పరిహారం విడుదల చేయడంతో నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. మే నెలలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పరిహారాన్ని త్వరలో విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సీపీఐని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లండి
కరీంనగర్: జిల్లాలో సీపీఐకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా మహాసభలు రెండోరోజు కొనసాగాయి. నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మూడేళ్లలో జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీపీఐకి జిల్లాలో ఘనమైన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ దశాదిశా నిర్దేశించేలా క్రియాశీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆర్ఎన్ఎన్ శక్తుల విజృంభన కొనసాగిస్తూ బీజేపీ ప్రమాదకరంగా మారిందన్నారు. రాష్ట్రంలో పెన్షన్, రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మఇళ్లు పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, మర్రి వెంకటస్వామి, పొనగంటి కేదారి, బోయిని అశోక్, కొయ్యడ సృజన్కుమార్, అందె స్వామి, బత్తుల బాబు, గూడెం లక్ష్మి పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి -
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
సిరిసిల్ల: జిల్లాలో యాసంగి(రబీ) సీజన్లో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా బుధవారం తెలిపారు. 242 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 37,223 మంది రైతుల వద్ద రూ.578 కోట్ల విలువైన 2,49,372మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. వీటిలో 2,16,258 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు ఆన్లైన్ చేశామని, 34,479 మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.447 కోట్లు జమ అయ్యాయని వివరించారు. మిగతా రైతులకు త్వరలో డబ్బులు జమ అవుతాయని ప్రకటించారు. జిల్లాలో ధాన్యం సేకరణ తుది దశకు వచ్చిందని, ఇప్పటికే 133 కొనుగోలు కేంద్రాలను మూసివేశామన్నారు. ఇంకా 109 కేంద్రాల్లో కొద్దిగా ధాన్యం ఉందన్నారు. జిల్లాలో చివరి గింజ వరకు దాన్యం సేకరిస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం సైతం సేకరిస్తామని రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మూడేళ్లలో ధాన్యం సేకరణ తీరిదీ జిల్లాలో రబీ(యాసంగి) సీజన్లో మూడేళ్ల ధాన్యం సేకరణ తీరును కలెక్టర్ గణాంకాలతో వెల్లడించారు. 2022–2023లో మే 28వ తేదీ నాటికి 1,64,044 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, అదే 2023–2024 రబీ సీజన్లో ఇదే రోజు నాటికి 2,49,514 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మే 28వ తేదీ నాటికి 2,49,372 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని అన్నారు. జిల్లాలో కొనుగోళ్లు పూర్తి అయ్యేనాటికి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు నమోదు అవుతాయని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పటికే 2,49,372 మెట్రిక్ టన్నుల సేకరణ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
దళిత యువకుడిని చితకబాదిన పోలీసులు
సైదాపూర్: డ్రంకెన్డ్రైవ్లో సహకరించడం లేదని ఓ దళిత యువకుడిని 20 రోజుల క్రితం చితకబాదిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. జరిగిన ఘటనపై దళిత సంఘాలు వివిధ రూపాల్లో బాధితుడికి న్యాయం చేయాలని ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బాధితుడు కరీంనగర్ సీపీ, మానవ హక్కుల కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపూర్లో ట్రైనీ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న అగస్త్య భార్గవ్గౌడ్ తోటి సిబ్బందితో కలిసి మండలంలోని లస్మన్నపల్లి శివారులో డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తున్నాడు. పోలీసులు ఆపారు. టెస్టు చేసి చలాను వేసిన తర్వాత అతడి వివరాలు రాసుకున్నారు. ఇంతలో మహేందర్కు ఇంటి వద్ద నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న బాధితున్ని సహకరించడం లేదని ఫోన్ తీసుకొని ఎస్ఐ అగస్త్య భార్గవ్గౌడ్తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే చితకబాదారు. చెవి కర్ణభేరి దెబ్బతిని చెవి నుంచి రక్తం కారుతున్నా వదల్లేదని, తర్వాత పోలీస్ స్టేషన్కు పిలిచి తనతో క్షమాపణ పత్రం రాయించుకున్నారని మహేందర్ కమిషన్లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై విచారించాలని కరీంనగర్ సీపీ హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ను ఆదేశించారు. బాధితుడి వాగ్మూలం తీసుకున్న మర్నాడే ఏసీపీ శ్రీనివాస్ బదిలీ కావడంతో పోలీసుల విచారణలో జాప్యం జరుగుతోందని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్ మాత్రం అడిషనల్ డీజీపీ, కరీంనగర్ సీపీకి విచారణ నివేదికను 20 రోజుల్లో అందజేయాలని నోటీసులు జారీ చేసింది. తాను పీజీ బీఈడీ చేసి, నిరుద్యోగిగా కూల్డ్రింకులు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, అకారణంగా చితకబాదడంతో అవమానంతో మానసికంగా భరించలేకపోతున్నాని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మహేందర్ అప్పటికే వేరే సంఘటనలో ఇతరులతో తగాదా పడి దెబ్బలు తిని వస్తున్నాడని, డ్రంకెన్డ్రైవ్ టెస్టులో సహకరించకుండా పోలీసులలో దుర్భాషలాడారని, అందుకు క్షమాపణ పత్రం రాసి ఇచ్చాడని పోలీసులు పేర్కొంటున్నారు. వాస్తవాలు ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. దెబ్బతిన్న బాధితుడి చెవి కర్ణభేరి హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు విచారించి నివేదిక ఇవ్వాలని అడిషనల్ డీజీపీ, సీపీకి నోటీసులు -
సంఘం స్థలం స్వాహాకు యత్నం?
వేములవాడ: పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ స్థలం విషయంలో వివాదం ఏర్పడి పంచాయితీ ఎస్పీ వద్దకు చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 1800 సభ్యుల సంకల్పంతో 2011లో సర్వే నం.977లో 968 గజాల స్థలం కొనుగోలు చేశారు. సంఘం అధ్యక్షుడు, కార్యవర్గం పేరుపై ఉండాల్సిన భూమిని 12 మంది ప్రముఖులు ఓ ట్రస్టుగా ఏర్పడి తమ పేరుతో రిజిస్త్రేషన్ చేయించుకోవడంతో వివాదం చెలరేగింది. సంఘ సభ్యుల హితాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్లో సేవా కార్యక్రమాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొన్న ఈ స్థలంలో 12 మంది ప్రముఖులు తామే యజమానులమని గత డిసెంబర్లో తమ పేతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెలుగు చూసింది. దీంతో సంఘ సభ్యులంతా తీవ్ర ఆగ్రహానికి లోనై ఇది కేవలం ఆస్తిపై మాత్రమే కాదు మన ఆర్యవైశ్యుల ఆత్మగౌరవంపై దాడి అంటూ పట్టణానికి చెందిన 1800 మంది సభ్యుల నమ్మకాన్ని, ఆశలను తాకట్టు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ అంశంతో ఆర్యవైశ్య ప్రముఖులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్దారులు కాంప్రమైజ్ అవుతామనీ, తమపై ఉన్న రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుని తిరిగి సంఘానికి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదం బుధవారం వేములవాడలో సామాజికంగా కీలకమైన అంశంగా మారింది. వైశ్య సంఘం న్యాయబద్ధంగా తమ హక్కులను తిరిగి పొందుతుందా? లేక ఈ ప్రయత్నం వ్యర్థమవుతుందా? అన్న చర్చ కొనసాగింది. వేములవాడలో ఆర్య వైశ్య సంఘ భూవివాదం ఎస్పీ వద్దకు చేరిన పంచాయితీ -
బియ్యం పంపిణీకి ఏర్పాట్లు
● మూడు నెలల స్టాక్ ఒకేసారి ● గోదాముల నుంచి గ్రామాలకు.. ● సరఫరా చేస్తున్న అధికారులు ● జూన్ మొదటివారంలో పంపిణీ సుల్తానాబాద్(పెద్దపల్లి): కేంద్రప్రభుత్వం ఆదేశానుసారం లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు జిల్లా పౌర సరఫరాల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలంలో రవాణా వ్యవస్థ స్తంభిస్తే పేదలకు బియ్యం అందకుండా పోతాయని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా జూన్, జూలై, ఆగస్టు కోటాను జూన్లో ఒకేసారి ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీకి పౌర సరఫరాల అధికారులు శ్రీకారం చుట్టారు. డీఎస్వో పర్యవేక్షణలో.. మూడు నెలల స్టాక్తోపాటు వాహనాలు, బియ్యం సరఫరా ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా పౌర సరఫరాల అధికారి(డీఎస్వో) రాజేందర్కు బాధ్యతలు అప్పగించారు. గతంలో పంపిణీ చేసిన దొడ్డుబియ్యం నాసిరకంగా ఉండడంతో చాలామంది లబ్ధిదారులు తినడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో పేదలు అందరూ తీసుకెళ్తున్నారు. తద్వారా వారిపై నిత్యావసరాల భారం తగ్గుతోంది. జిల్లాలో 413 రేషన్ దుకాణాలు.. జిల్లావ్యాప్తంగా మొత్తం 413 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటికి పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ లోని గోదాముల నుంచి బియ్యం సరఫరా చేస్తున్నా రు. జిల్లాలోని లబ్ధిదారులకు ప్రతీనెల సుమారు 3 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కోటా విడుదల చేస్తారు. ఈలెక్కన ఈసారి మూడు నెలలకు సుమా రు 12వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని అధికారులు అంచనా వేశారు. అయితే, రేషన్ డీలర్ల వద్ద మూడు నెలల స్టాక్ నిల్వ చేసేందుకు సౌకర్యం ఉందా? లేదా? అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. సౌకర్యాలు లేనివారు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. జూన్ మొదటివారంలో పంపిణీ.. రాష్ట్రప్రభుత్వం రెండు నెలల నుంచి కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. మే నెల కోటా పంపిణీ పూర్తయ్యింది. దీంతో జూన్, జూలై, ఆగస్టు కోటాను జూన్ మొదటి వారంలో ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు.. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జిల్లాకు మంజూరైన మరో 4,467 కొత్త రేషన్ కార్డులు లబ్ధిదా రులకు అందజేస్తారు. వీటిపై కూడా బియ్యం పంపిణీ చేసేందుకు కోటా విడుదల చేస్తున్నారు. ఏర్పాట్లు చేయాలి లబ్ధిదారులకు మూడునెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు బయోమెట్రిక్ తప్పనిసరి అవసరం. అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలి. బయోమెట్రిక్లో ఆటంకాలు ఎదురైతే లబ్ధిదారులతో గొడవలు జరిగే ప్రమాదం ఉంది. – కొమురయ్య, డీలర్, సుల్తానాబాద్ సరిపడా సరఫరా మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని డీలర్లకు సరఫరా చేస్తున్నాం. లబ్ధిదారులకు సరిపడా బియ్యం నిల్వలు అందుబాటులోనే ఉన్నాయి. గ్రామాల వారీగా రేషన్ షాపులకు సరఫరా చేస్తున్నాం. బయోమెట్రిక్లో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తాం. – రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి -
సింగరేణి స్టేడియానికి ఆధునిక హంగులు
● రూ.2కోట్లు ప్రకటించిన సీఎండీ బలరామ్ ● ప్రత్యేక సంస్థతో ప్రతిపాదనల రూపకల్పన ● త్వరలో తుదిరూపం వచ్చే అవకాశం ● సింథటిక్ ట్రాక్తోపాటు స్టేడియం విస్తరణకు చర్యలు ● కొన్ని సంగరేణి క్వార్టర్లను కూడా తొలగించే అవకాశంగోదావరిఖని: క్రీడాకారులకు అనుగుణంగా సింగరేణి స్టేడియాన్ని ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని యాజమాన్యం నిర్ణయించింది. సింథటిక్ వాకింగ్ట్రాక్తో పాటు క్రికెట్ ప్లే గ్రౌండ్, వాలీబాల్ కోర్టు, ట్రాక్ విస్తరణ కోసం మైదాన్ని విస్తరించాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం సీఎండీ బలరాం ఇటీవల రూ.2కోట్లు ప్రకటించారు. దీంతో రాబోయే తరానికి ఉపయోగపడేలా సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం స్టేడియంలోని కట్టడాలు, రాబోయే రోజుల్లో విస్తరిస్తే ఎలా మార్చాల్సి ఉంటుందనే అంశంపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు స్పోర్ట్స్ అథారిటీ కంపెనీ ప్రతినిధులు మంగళవారం స్టేడియాన్ని పరిశీలించారు. సింథటిక్ ట్రాక్పైనే దృష్టి.. ప్రధానంగా సింథటిక్ వాకింగ్ ట్రాక్పై యాజమాన్యం దృష్టి సారించింది. 400 మీటర్ల వాకింగ్ ట్రాక్ లేదా 800మీటర్ల వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మైదానం చుట్టూ సింథటిక్ వాకింగ్ట్రాక్, మధ్యలో క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్వార్టర్ల తొలగింపుపై ఆలోచన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం విస్తరణలో భాగంగా మైదానాన్ని ఆనుకుని ఉన్న సీఈఆర్క్లబ్ ఎదుట గల సింగరేణి క్వార్టర్లను తొలగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే స్టేడియం వెనకాల ఉన్న కొన్ని క్వార్టర్లను కూడా తొలగించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అభివృద్ధి కోసం రూ.2కోట్లు కేటాయిస్తారు. ఈప్రాంత క్రీడాకారులతోపాటు సింగరేణి ఉద్యోగులకు అనుకూలంగా స్టేడియంలో అన్నిఏర్పాట్లు చేస్తాం. సింథటిక్ వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎమ్మెల్యే సూచనల మేరకు ఈప్రాంత క్రీడాకారుల కోసం స్టేడియం విస్తరణ పనులు శరవేగంగా సాగుతాయి. – లలిత్కుమార్, ఆర్జీ–1 జీఎం -
రైతుల కష్టం వరదపాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అధికారుల నిర్లక్ష్యం మూలంగా వరదపాలైంది. అకాల వర్షాలు దండికొట్టడంతో 45రోజులుగా తూకం వేయకుండా కేంద్రాల్లోనే ఉన్న ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తింది. దీంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ఐకేపీ అధికారులు, నిర్వహకుల నిర్లక్ష్యం వల్ల మాయిచ్చర్ వచ్చి 45 అయినప్పటికీ రైతులు కేంద్రాలకు తెచ్చిన వడ్లను తూకం వేయలేదు. కేంద్రాల్లో హమాలీలు లేక, నిర్వహకులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. తడిసి మొలకెత్తిన ధాన్యం -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్య
పెద్దపల్లిరూరల్: మీసేవ కేంద్రాల నిర్వాహకు లు నిబంధనల మేరకు పనిచేయాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ వేణు హెచ్చరించారు. కలెక్టరేట్లో మంగళవారం మీ సేవ కేంద్రాల నిర్వహణపై సమీక్షించారు. సేవ లు, ఫీజులను అందరికీ తెలిసేలా బోర్డులు ఏ ర్పాటు చేయాలన్నారు. ధ్రువీకరణపత్రాల జా రీపై ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవన్నా రు. నిబంధనల మేరకే ఫీజు వసూలు చేయా లని పేర్కొన్నారు. ఈడీఎం కవిత, జిల్లా మేనేజర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అన్యాయం చేశారని ఆందోళన పాలకుర్తి(రామగుండం): ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని ఆ రోపిస్తూ స్థానికులు మంగళవారం మండల ప రిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. దూట సతీశ్, నంది శ్రీకాంత్, దారవేణి ఓదెమ్మ, పాటాకుల సూర్య ప్లకార్డులు పట్టుకుని బైఠాయించారు. భూములు, ఆస్తులు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని, అద్దెఇళ్లలో ఉంటున్నవారికి, నిరుపేదలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు మరోసారి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. పోలీసుల జో క్యంతో వారు శాంతించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. ఉపాధి కూలీల నిరసన జూలపల్లి(పెద్దపల్లి): ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకర్ తమను పరుష పదజాలంతో దూ షించారని ఆరోపిస్తూ మహిళా కూలీలు మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదు ట నిరసన తెలిపారు. దాదాపు వంద మంది కూలీలు ఎస్సారెస్పీ డీ– 83 మెయిన్ కాలువ లో పూడిక తొలగించే పనులను ఫీల్డ్ అసిస్టెంట్ నర్సయ్య చేయిస్తున్నారని, పరిశీలనకు వచ్చిన శ్రీకర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. ఈ విషయమై టీఏ శ్రీకర్ను సంప్రదించగా, తాను ఎవరినీ దూషించలేదన్నారు.31 వరకు గడువు కోల్సిటీ(రామగుండం): లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారానికి ఈనెల 31వ తేదీ వరకు గడువును పొడి గించినట్లు రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. 2020లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే బల్దియా కార్యాలయంలోని టౌ న్ప్లానింగ్ విభాగంలో సంప్రదించాలన్నారు. నిర్ణీత రుసుం, డాక్యుమెంట్లు సమర్పించి స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని, 25 శాతం రాయితీ వర్తిస్తుందని ఆమె వివరించారు.కొనసాగుతున్న మరమ్మతులు ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఎ రువుల కర్మాగారంలో వార్షిక మరమ్మతుల కో సం ఈనెల 6న కర్మాగారాన్ని షట్డౌన్ చేశారు. దీంతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. 21 రోజులుగా వార్షిక మరమ్మతులు సాగుతు న్నాయి. పనులు పూర్తికావడానికి మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. జూన్ రెండోవారంలో యూరియా ఉత్పత్తి ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ‘డబుల్’ ఇళ్లు పంపిణీ చేస్తాంపెద్దపల్లిరూరల్: పేదల కోసం నిర్మించిన డ బుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీని 15 రోజుల్లోగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. చందపల్లి, కూనారం రైల్వేగేట్ స మీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎ మ్మెల్యే పరిశీలించారు. జూన్ 10లోగా లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని సూచించారు. అవతరణ వేడుకలకు ఏర్పాట్లుపెద్దపల్లిరూరల్: రాష్ట్రావతరణ వేడుకల నిర్వ హణకు ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. స్వశక్తి సంఘాలు, ప్రతినిధులు హాజరు కావాలన్నారు. డీసీపీ కరుణాక ర్, ఏసీపీ కృష్ణ, ఆర్డీవో గంగయ్య ఉన్నారు. -
ముందస్తు సాగుదాం
● వరి నాట్లలో ప్రకృతి వైపరీత్యాల నుంచి గట్టెక్కే అవకాశం ● జూన్ 15లోగా నాట్లు పూర్తిచేసేలా అధికారుల సూచనలు ● రైతులకు అవగాహన కల్పిస్తేనే సత్ఫలితాలు వచ్చే అవకాశంసాక్షి, పెద్దపల్లి: రైతులు ఆరుగాలం కష్టపడి పంట లు పండిస్తుండగా, పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నారు. రూ.లక్షల్లో పెట్టుబడి పెడుతున్నా చివరిక్షణంలో అకాలవర్షాలు దెబ్బతీస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను తప్పించలేం కానీ పంట కాలాన్ని ముందుకు జరుపుకోవడం మన చేతిలో పని అని, తద్వారా పంటలను కాపాడుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పంటల సీజన్ను నెల రోజులు ముందుకు జరిపేలా జిల్లా అధికార యంత్రాంగం రైతులకు అవగహన కల్పిస్తూ చైతన్యం తెస్తోంది. కొన్నేళ్లుగా ఏటా కురుస్తున్న అకాల వర్షాల తీరును పరిశీలిస్తే నవంబర్లో వచ్చే తుపాన్లు, ఏప్రిల్లో కురిసే అకాల వర్షాలతో చేతికొచ్చే పంటలు దెబ్బతిని అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. రోహిణి కార్తెలో తొలకరి.. ఈఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడంతో రోహిణి కార్తెలోనే తొలకరి పలకరించింది. ముందస్తు సాగుకు సన్నద్ధం చేసేందుకు ఇదేమంచి అవకాశమని, పొలంబాట పట్టాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఇప్పటికే జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తూ, విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇలా చేస్తే మేలు.. ● వానాకాలం వరి సాగును ముందస్తుగా చేపట్టడం ద్వారా పంటను అక్టోబర్ మూడోవారం నుంచి నవంబర్ మొదటివారం లోపు కోసుకోవచ్చు. యాసంగి వరి నారును నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు సిద్ధం చేసుకుంటే, పంటను మార్చి మూడోవారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు కోసుకోవచ్చు. ● 140 రోజులు అంతకన్నా ఎక్కువ దీర్ఘకాలిక పంటలకు మే 25 నుంచి జూన్ 10 మధ్య, 135 రోజుల పంటకాలం కలిగిన మధ్యకాలిక పంట లకు జూన్ 15 నుంచి జూన్ 30 వరకు, 120 రోజుల పంటకాలం కలిగిన పంటలకు జూలై 15 వరకు నార్లు పోసుకుంటే మేలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ● వానాకాలంలో దీర్ఘకాలిక రకాలను సాగు చేయాలనుకునే రైతులు రోహిణి కార్తెలో నారుపోస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని, జూన్ 2వ వారం పూర్తయిన తర్వాత నారుపోస్తే పూత సమయంలో చలితో గొలుసు పూర్తిగా బయటకు రాక గింజ నల్లపడడం, వర్షాలతో దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఈవానాకాలంలో సాగు సమాచారం(ఎకరాల్లో) మొత్తం సాగు 2,76,076 వరి 2,12,500 పత్తి 52,500 మొక్కజొన్న 705 ఉద్యాన 10,086 ఇతర 285 అవసరమైన విత్తనాలు 1,84,457 (క్వింటాళ్లలో) అవసరమైన ఎరువులు 70,731 (మెట్రిక్ టన్నుల్లో) అవగాహన కల్పిస్తున్నాం ప్రకృతి వైపరీత్యాలను అధిగమించేందుకు రైతులు ముందస్తు పంటలను సాగు చేసేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వానాకాలం సీజన్ను ఒక నెల ముందుకు జరిపితే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం సాగునీరు ఇవ్వడానికి, విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. రైతులు వెంటనే వ్యవసాయ పనులను ప్రారంభించుకోవాలి. – ఆదిరెడ్డి, డీఏవో ముందస్తు ప్రణాళికతో మేలు తొలకరిలో దున్నితే నేలలోకి నీరు బాగా ఇంకి బాగా గుల్లబారుతుంది. తర్వాత వేసే పంటలకు ఉపయోగపడుతుంది. మొక్కల వేర్లు లోనికిపోయి తేమ, పోషకాలను ఎక్కువశాతం అందుకుంటుంది. దిగుబడి, నాణ్యత పెరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాలను అధిగమించవచ్చు. వేసవి దుక్కులు, నేల చదును, విత్తనాల ఎంపిక, శుద్ధి, ఎరువుల వినియోగం, పంటకు అనుగుణంగా నేలను సిద్ధం చేయడం వంటి ప్రణాళిక చేపడితే అధిక దిగుబడి సాధించవచ్చు. – పిల్లి కిరణ్, కేవీకే శాస్త్రవేత్త దుక్కులు దున్నడం.. దుక్కులు దున్నితే తొలకరితో నేల నీటిని పీల్చుకొని పొలంలో తేమశాతం వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. వాలుకు అడ్డుగా లోతు దుక్కులు దున్నడంతో వర్షపునీరు వృథా కాకుండా, నేల కోతకు గురికాదు. తోటల్లో దుక్కులతో మొండిజాతి కలుపు మొక్కలు, దుంపలు వేళ్లతో సహా బయటకు వచ్చి పిచ్చిమొక్కల కలుపు నివారణ జరుగుతుంది. నిద్రావస్థలోని కీటకాలు నశిస్తాయి. సేంద్రియ ఎరువులైన పేడ, వర్మికంపోస్ట్ను దుక్కుల్లో వేసుకోవచ్చు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకముందు రైతులు పత్తి విత్తనాలు విత్తితే ఎండవేడికి భూమిలో మాడిపోయే ప్రమాదం ఉందని, సరైన వర్షం కురిసిన తర్వాతే విత్తనాలు విత్తాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. -
ఓసీపీల్లో అధికారులు అప్రమత్తం
● మాన్సూన్కు ముందస్తు ఏర్పాట్లు ● బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా చర్యలు ● రుతుపవనాల రాకతో అప్రమత్తం ఏర్పాట్లు పూర్తిచేశాం వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేశాం. డంపర్లు నడిచే హాలేజీ రోడ్ల వెంట నీరు, బురద నిలవకుండా సైడ్ డ్రైన్లు నిర్మించాం. వర్షం తగ్గిన వెంటనే బొగ్గు వెలికి తీసేలా అధికారులను సన్నద్ధం చేశాం. ఓబీ, కోల్బెంచ్ల్లో భారీ విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేశాం. మరిన్ని అందుబాటులో ఉంచాం. భారీ యంత్రాలు వరదలో మునిగిపోవకుండా పైబెంచ్లో పార్కింగ్ చేసేలా ఆదేశాలిచ్చాం. – వెంకటయ్య, ఆర్జీ–2 జీఎం గోదావరిఖని: నైరుతి రుతుపవనాల రాకతో వర్షా లు మొదలయ్యాయి. వర్షాలతో ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ)ల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడకుండా సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. భారీవర్షాలు కురిశా బొగ్గు వెలికి తీసేలా ప్రణాళిక రూపొందించింది. రామగుండం రీజియన్లోని ఆర్జీ–1 ఏరియా జీడీకే–5 ఓసీపీ, ఆర్జీ–2 ఏరియాలోని ఓసీపీ–3, ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ–1, 2లో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి సాధించాలని సీఎండీ బలరాం ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఉత్పత్తిలో కీలకం.. సింగరేణి సంస్థకు బొగ్గు ఉత్పత్తిలో ఓసీపీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఓసీపీల్లోంచి 80 శాతం బొగ్గు ఉత్పత్తి వస్తోంది. మిగతా 20శాతం భూ గర్భగనుల ద్వారా వస్తోంది. అయితే, రానున్న మూడు నెలల్లో వర్షాలతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గితే ఈ ప్రభావం ఆర్థిక సంవత్సరంపై పడుతుంది. ఈక్రమంలో యాజమాన్యం ఈసారి వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుకుండా అన్ని ఏరియాల్లోని అధికారులను అప్రమత్తం చేసింది. వరదతో బురద.. వర్షాలతో ఓసీపీల్లోని హాలేజీ రోడ్లు బురదగా మా రుతున్నాయి. క్వారీల్లోని ఓబీ, కోల్బెంచ్ల్లో నీటిమ ట్టం పెరుగుతోంది. తద్వారా బెంచ్ల్లోని భారీయంత్రాలు నీట మునుగుతున్నాయి. ఇప్పుడు అలాంటి సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా భారీ యంత్రాలు నిత్యం నడిచే క్వారీ హాలేజీ(ప్రధాన) రోడ్లపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. భారీ వ ర్షాలు కురిసినా రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా సైడ్ డ్రైన్లు నిర్మిస్తోంది. రోడ్లపై బురద ఎప్పటికప్పుడు తొలగించేందుకు గ్రేడర్లను సిద్ధం చేస్తోంది. వర్షం తగ్గిన వెంటనే రహదారులపై నీరు, బురద తొలగిస్తూ, సైడ్డ్రైన్లు నిర్మిస్తోంది. యంత్రాలు నీటమునగకుండా.. భారీవర్షాలు కురిసి ఓసీపీ క్వారీల్లోకి వరద వచ్చి చేరుతోంది. దీంతో భారీయంత్రాలు నీటమునిగే పరిస్థితులు గతంలో ఉండేవి. కొన్నిభారీ యంత్రాలు నీట మునిగిన ఘటనలూ ఉన్నాయి. ఈక్రమంలో ఓసీపీల్లో నీటి నిల్వలు పెరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధిక సామర్థ్యంగల విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. క్వారీలోని నీటిని ఎప్పటికప్పుడు తోడేసేలా 350 హెచ్పీ విద్యుత్ మోటార్లను అమర్చుతున్నారు. అలాగే సబ్ మెర్సిబుల్ పంపుల ద్వారా నీటిని తోడేలా చూస్తున్నారు. క్వారీలోని సంపుల్లో నీటిని బయటకు పంపించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. పాంటూన్ ప్లాట్ఫామ్లు ఏర్పాటు.. భారీవర్షాలతో ఓసీపీ క్వారీలోకి నీరుచేరి అందులో పంపులు మునిగిపోకుండా పాంటూన్ ప్లాట్ఫామ్ (నీటిపై తేలియాడే) ఏర్పాట్లు చేశారు. నీటినిల్వలు పెరిగినా నీటిపై తేలియాడే పాంటూన్ ప్లాట్ఫామ్పై మోటార్లు ఏర్పాటు చేశారు. నీటిని ఎప్పటికప్పుడు తోడేసేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే ఓసీపీల పక్కనే ఉన్న వాగులు, కాల్వలు ఉండటంతో వాటినుంచి వరద ఓసీపీల్లోకి రాకుండా కార్యాచరణ సిద్ధం చేశారు. వాగులు, కాల్వల్లో పూడి కను ఇప్పటికే తొలగించడం వేగవంతం చేశారు. -
క్రీడాప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తాం
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోదావరిఖని: సింగరేణి జవహర్లా ల్ నెహ్రూ క్రీడాప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని రామగుండం ఎ మ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నా రు. మంగళవారం ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్తో కలిసి స్థానిక స్టేడియాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. సింథటిక్ వాకింగ్ ట్రాక్, మైదానం విస్తరణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు క్రీడల్లో ప్రోత్సాహం అందించే దిశగా స్టేడియాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామన్నారు. క్రీడాకారుల కు అంతర్జాతీయ స్థాయి ప్రాక్టీస్ సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, మారెల్లి రాజిరెడ్డి, బాలరాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా నెహ్రూ వర్ధంతి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఎమ్మె ల్యే క్యాంపు ఆఫీస్లో నెహ్రూ చిత్రపటానికి ఎమ్మె ల్యే మక్కానసింగ్ రాజ్ఠాకూర్ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా తిరంగా యాత్ర
గోదావరిఖనిటౌన్: విశ్వహిందూ పరిషత్ మాతృశక్తి దుర్గావాహిణి ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ వి జయవంతంపై నగరంలో మంగళవారం తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ మ హిళా విభాగం బాధ్యులు సూర్యదేవ జ్యోతి, కోట తిరుమల, ఆరెల్లి మమత మాట్లాడారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో పహగాల్గాంలో అమయక పర్యాటకులు మృతి చెందారని అన్నారు. ఉగ్రవాదులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నగర కార్యదర్శి మ్యాడగోని రవీందర్, నాయకులు దీప్తి, ఇందిర, ప్రమీళ, మల్లేశ్వరి, వర్షిత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వరద వచ్చినా సిద్ధం
● ముందస్తు రుతుపవనాలతో ఇరిగేషన్శాఖ అప్రమత్తం ● మిడ్మానేరు ప్రాజెక్టు, ఎల్లంపల్లి గేట్ల నిర్వహణ షురూ ● పనుల కోసం టెండర్లు పిలిచిన అధికారులు ● ఎల్ఎండీలో మొదలైన పనులు, ఎంఎండీ, ఎల్లంపల్లివి జూన్లో ● వరదకు ముందే అప్రమత్తంగా ఉండేలా చర్యలుప్రాజెక్టు సామర్థ్యం గేట్లు ఎల్ఎండీ 24 టీఎంసీ 20 ఎంఎండీ 27.5 టీఎంసీ 25 ఎల్లంపల్లి 20 టీఎంసీ 62 సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలో తొలకరి పలకరిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా ఈసారి అసాధారణరీతిలో దాదాపు రెండువారాల ముందే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నీటిపారుదలశాఖ వానాకాలానికి ముందస్తుగానే గేట్ల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రుతుపవనాలు ముందుగా రావడంతో ఈ పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే లోయర్ మానేరు డ్యాం అధికారులు గేట్ల నిర్వహణ పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు టెండర్లు ఖరారవగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టు గేట్ల నిర్వహణ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ల కాలంలో గేట్ల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా ఏం చేస్తారు? సాధారణంగా ఏటా వర్షాకాలానికి ముందే.. నీటిపారుదలశాఖ అధికారులు గేట్ల నిర్వహణకు పూనుకుంటారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారం ప్రతీ డ్యాం వద్ద వర్షాకాలానికి ముందు (ప్రీ మాన్సూన్), వర్షాకాలానికి తరువాత (పోస్ట్ మాన్సూన్) గేట్ల లూబ్రికేషన్ ప్రక్రియను చేపడతారు. వరద సమయంలో గేట్లు సులువుగా పైకి లేచేందుకు లూబ్రికేషన్ దోహదపడుతుంది. ఇందులో భాగంగా వాల్వ్ గేర్బాక్స్లకు కూడా గ్రీస్ పూయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వీలుగా జనరేటర్ల పని తీరును సమీక్షిస్తారు. వీటిని ప్రతీ ఐదు రోజులకు ఒకసారి దాదాపు ఐదు నిమిషాలపాటు అనివార్యంగా పనిచేయిస్తారు. ఇలాంటి భారీ జనరేట్లు ప్రతీ ప్రాజెక్టు వద్ద రెండు వరకు ఉంటాయి. వీటితోపాటు లిఫ్ట్లు, మెకానిక్ టూల్స్, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులను కూడా నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఎల్ఎండీ అధికారులు రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు టెండర్లు పిలవగా.. ప్రస్తుతం పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లికి సంబంధించి రూ.38లక్షలకు టెండరు ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరుకు సంబంధించి దాదాపు రూ.26 లక్షలతో తాజాగా టెండరు పిలిచారు. ఈ రెండు ప్రాజెక్టుల పనులు జూన్లో మొదలు కానున్నాయి. వరద అవకాశాలు అంతంతే.. సాధారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు ఉన్న సమయంలో ప్రాజెక్టుల్లో నీరు చెప్పుకోదగ్గస్థాయిలో ఉండేది. వీటికి వర్షాలు తోడైనపుడు ప్రాజెక్టులు వేగంగా నిండి గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేది. దాదాపుగా ఏడాదిన్నరగా ఎత్తిపోతలు నిలిచిపోయిన దరిమిలా మునుపటి తరహాలో ప్రాజెక్టులలో నీటిమట్టాలు లేవనే చెప్పాలి. ఒకవేళ భారీగా కుండపోత వర్షాలు కురిసి, ఎగువనున్న మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరదలు వస్తేనే మన ప్రాజెక్టులు నిండి, గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నీటిపారుదల శాఖ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. -
జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు
పెద్దపల్లిరూరల్: రైతుల నుంచి జిన్నింగుమిల్లుల్లో పత్తి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్యార్డుకు ఆశించిన మేర పత్తి నిల్వలు రాకపోవడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారు లు రావడంలేదు. మిగిలి ఉన్న పత్తి నిల్వలను అమ్ముకునేందుకు వచ్చే రైతుల నుంచి జిన్నింగుమిల్లుల్లో కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం రూ.7,400 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు రాఘవాపూర్ జిన్నింగుమిల్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లాకు చెందిన వారే కాకుండా పొరుగున ఉన్న ఆసిఫాబాద్, వేములవాడ, జమ్మికుంట తదితర ప్రాంతాలకు చెందిన రైతులు సైతం వ్యాన్లలో పత్తిని తీసుకొచ్చి పెద్దపల్లిలోని జిన్నింగ్ మిల్లుల్లో విక్రయిస్తున్నారు. -
వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ సీపీఐ
● కమ్యూనిస్టులకు దూరమై బీఆర్ఎస్ అధికారాన్ని పోగొట్టుకుంది ● కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకరీంనగర్: దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సీ పీఐ ఒక్కటేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ కరీంనగర్ జిల్లా 23వ మహాసభలు నగరంలోని మధుగార్డెన్లో మంగళవారం ప్రారంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకుడు వే ముల వెంకట్రాజం ఆవిష్కరించారు. అమరవీరుల స్మారకస్తూపం చిహ్నాన్ని శ్రీరాముల రామచంద్రం ప్రారంభించారు. సాంబశివరావు మాట్లాడుతూ క మ్యూనిస్టులను దూరం చేసుకుని అధికారాన్ని పో గొట్టుకున్నామనే బాధలో బీఆర్ఎస్ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సీపీఐ ఎంత కృషి చేసిందో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులందరూ నాలుగు లేబర్కోడ్లను వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్కుమార్, బోయిని అశోక్, అందెస్వామి, టేకుమల్ల సమ్మయ్య, కసిరెడ్డి సురేందర్రెడ్డి పాల్గొన్నారు. -
రైల్వే సేవలన్నీ ఒకే యాప్లో..
రామగుండం: ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ఒకేయాప్లో అన్నిసేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దానిని సూపర్ యాప్ ‘స్వరైల్’గా నామకరణం చేసింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్ఫామ్ మొబైళ్లు వినియోగించే వారు ఈ సేవలు పొందే వీలుంది. యాప్లో ఇకనుంచి ఐఆర్సీటీసీ, యూటీస్, రేల్ మదాద్, ఫుడ్ ఆన్ ట్రాక్ వంటి వేర్వేరు సేవలను ‘స్వరైల్’ యాప్ ద్వారా పొందవచ్చు. ప్రయాణికులకు అందే సేవలు.. ● రిజర్వేషన్ టికెట్లు, టికెట్ బుకింగ్ ● నాన్ రిజర్వ్, జనరల్ టికెట్లు (అన్ రిజర్వుడ్ టికెట్ సిస్టం– యూటీఎస్ టికెట్లు) ● ప్లాట్ఫారం టికెట్లు (స్టేషన్లో ప్రవేశించడానికి) ● లైవ్ రన్నింగ్ స్టేటస్, షెడ్యూల్ సమాచారం ● క్యాటరింగ్, రైల్వేస్టేషన్లలో ఫుడ్ ఆర్డర్ అండ్ డెలివరీ ● రైల్ మద్దత్ (ఫిర్యాదుల పరిష్కారం, సపోర్ట్ సిస్టమ్) ● రిజర్వేషన్ చరిత్ర, ప్రయాణ విశ్లేషణ, డిజిటల్ వ్యాలెట్, పేమెంట్ గేట్వేలు సాంకేతిక సామర్థ్యం, రికార్డులు ● ప్రతీనిమిషానికి సగటున పది వేల టికెట్లు బుక్ చేసే సామర్థ్యం ● రోజూ 15 లక్షల టికెట్ల వరకు ప్రాసెస్ సౌకర్యం ● ఇతర యాప్ల కంటే రెండువేల రేట్లు వేగవంతమైన యూజర్ ఇంటర్ఫేస్ ● ఏఐ ఆధారిత సిఫార్సులు, గత ప్రయాణాల ఆధారంగా రూట్లు, ట్రైన్లు సూచించడం ● మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా పలు భాషల్లో యాప్ అందుబాటులో ఉంది. ● ఈ యాప్ ఇండియాలో అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్ఫామ్ యాప్ వినియోగించడం ఇలా.. ● గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ ఓపెన్ చేయాలి ● ‘స్వరైల్ బై ఐఆర్సీటీసీ’ అని సెర్చ్ చేయాలి ● డౌన్లోడ్ చేసుకొని లాగిన్ చేసుకొని వినియోగించడమే తరువాయి. -
కర్బూజ రైతు నష్టాలపాలు
● అకాల వర్షాలతో ఆగం ● రూ.లక్షలు వస్తాయనుకుంటే.. ఖర్చులు కూడా రాలేదంటున్న వైనం ● పురుగు పట్టి పనికి రాకుండా పోయిన కాయలు జగిత్యాలఅగ్రికల్చర్: కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను అతులాకుతలం చేశాయి. ముఖ్యంగా వేసవిలో కర్బూజ, తర్బూజ వంటి ఉ ద్యాన పంటలను సాగు చేసిన రైతులను కోలుకోకుండా చేశాయి. జిల్లాలో యువ రైతులు వినూత్నంగా సాగు చేసిన కర్బూజ(పుచ్చకాయ) పంటను మరో వారం రోజుల్లో మార్కెట్కు తీసుకెళ్లే తరుణంలో కురిసిన వర్షాలు దెబ్బతీశాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 100 ఎకరాల్లో సాగు.. జిల్లాలో వేసవిలో చల్లదనాన్నిచ్చే కర్బూజ, తర్బూజ, జన్నత్ వంటి పండ్ల తోటలను దాదాపు 100 ఎకరాలకు పైగా సాగు చేశారు. రెండు, మూడేళ్లుగా యువ రైతులు సాగు చేస్తూ.. నేరుగా మార్కెటింగ్ చేస్తూ మంచి అదాయాన్ని పొందుతున్నారు. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన బండారి వెంకటేశ్, మల్లాపూర్ మండలం సిర్పూర్కు చెందిన నరేశ్, రాయికల్ మండలం అలూరుకు చెందిన మెక్కొండ రాంరెడ్డి, రాజు, మల్లారెడ్డి, ధర్మారంకు చెందిన రాజు, రాజిరెడ్డి అనే యువ రైతులు 25 ఎకరాల వరకు సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. తమ పంటను జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో నేరుగా విక్రయిస్తుండడంతోపాటు హైదరాబాద్లోని పలు కార్పొరేట్ సంస్థలతో కూడా ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్లో వర్షాలు కురవడం, రాష్ట్రమంతా చల్లదనంగా ఉండటంతో కాయలు తెంపేందుకు వేచి చూస్తున్న తరుణంలో ఒక వర్షం తర్వాత మరో వర్షం కురవడంతో పంట పూర్తిగా ధ్వంసమైంది. విత్తన ఖర్చే రూ.35 వేలు కర్బూజ(వాటర్ మిలన్), తర్బూజ(మస్క్మిలన్), జన్నత్(సూపర్ మార్కెట్ వైరెటీ) పండ్ల తోటలను సాగు చేశారు. మార్కెట్లో ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియదు కాబట్టి.. సగటున ధర గిట్టుబాటయ్యేందుకు ప్రతి పంటను మూడు దఫాలుగా సాగు చేశారు. ఫిబ్రవరి నెలలో సాగు చేసిన పంట.. మండు వేసవిలో మే నెలలో చేతికందుతున్న తరుణంలోనే పూర్తిగా దెబ్బతింది. వీటికి సంబంధించిన 50 గ్రాముల విత్తనాలకే దాదాపు రూ.1,600 నుంచి 1,800 వరకు ధర ఉంటుంది. ఎకరాకు దాదాపు రూ.35వేలు ఖర్చు పెట్టి హైదరాబాద్, బెంగళూర్ నుంచి విత్తనాలు తెప్పించారు. పంట పూర్తిగా నాశనం.. రైతులు సాగు చేసిన కర్బూజ కాయలు అమ్మకానికి వచ్చాయి. కాయలు తెంపే సమయంలోనే భారీ వర్షాలతో భూమిలో నీళ్లు ఆగాయి. వేరు వ్యవస్థ దెబ్బతిని కర్బూజ మొక్కలు వాడిపోయాయి. దీనికితోడు పూత రాలిపోయింది. అప్పటికే కాచిన కాయ లు కుచించుకుపోయాయి. పక్వానికి వచ్చిన కాయ ల్లో పురుగు చేరింది. దీనికితోడు రాళ్ల వానతో కాయ లు ఎక్కడికక్కడే పగిలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కో ఎకరానికి రూ.3లక్షల నుంచి 4లక్షలు వస్తాయనుకుంటే.. కనీసం విత్తనాలకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని కన్నీళ్లపర్యంతమవుతున్నారు. అకాల వర్షాలతో కర్బూజ వంటి కొత్త పంటలు పెట్టాలంటేనే రైతులు భయపడే పరిస్థితి నెలకొంది. -
కొత్త పింఛన్దారులకు 3.0 పింఛన్
జ్యోతినగర్(రామగుండం): ప్రయాస్ పథకాల కింత కొత్త పింఛన్దారులకు 3.0 పింఛన్ చెల్లింపు ఉత్తర్వులు విడుదలయ్యాయని ఈపీఎఫ్వో కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్, నోడల్ అధికారి పరశురాం తెలిపారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో మంగళవారం నిధి పే నిక్కత్ 2.0లో భాగంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ, భవిష్యనిధి ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కార్మికులు తమ వివరాలను ఈపీఎఫ్ సేవల వెబ్సైట్లో తెలుసుకోవచ్చని అన్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, ప్రయాస్ పథకం, వాటాదారులకు అవగాహన కల్పించారు. ఫీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు పీఎఫ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈమేరకు ఈఫీఎఫ్వో ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్, నోడల్ అధికారి పరశురాంకు వినతిపత్రం అందించారు. పుట్టిన తేదీల్లో పొరపాట్లు, కాంట్రాక్టర్లు ఫీఎఫ్ జమచేయకపోవడం, యజమాని మారినప్పుడు, ప్రస్తుత నంబరుపై కాకుండా పాత నంబర్పై డబ్బులు జమచేయడం, 58 ఏళ్లవయసు పూర్తిచేసిన కార్మికులకు పింఛన్ రాకపోవడం, మాన్యువల్ పద్ధతిలోని పీఎఫ్ డబ్బులు ప్రస్తుత ిపీఎఫ్ నంబర్లోకి జమకాకపోవడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. సర్వీస్ సర్టిఫికెట్లలో ఇంటిపేరు పూర్తిగా లేకపోవడంతో నిధులు ట్రాన్సఫర్ కావడం లేదన్నారు. ఈ సమస్యలపై కరీంనగర్ భవిష్యనిధి కార్యాలయానికి వెళ్లే కార్మికులకు సిబ్బంది సహకరించకుండా, ఇబ్బందులకు గురిచేసే విధానం మానుకోవాలని హెచ్చరించారు. ఐన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, సీఐటీయూ నాయకులు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఐఎఫ్టీయూ నాయకులు చిలుక శంకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ఈపీఎఫ్వో ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్ -
భూసారం తెలుసుకోవడం తప్పనిసరి
● భూసార పరీక్షతో సుస్థిర వ్యవసాయం సాధ్యం ● రామగిరిఖిల్లాలో ఉచితంగా భూసార పరీక్షలు రామగిరి(మంథని): నైరుతి రుతుపవనాల ప్రవేశం తర్వాత రైతులు వ్యవసాయానికి సిద్ధమవుతున్నారు. అంతకంటే ముందే నేలలో మట్టి పరీక్షలు చేయించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. భూసార పరీక్షలకు ఇదేసరైన సమయమంటున్నారు. పొలాల్లోని మట్టి నమునాలను సేకరించి పరీక్షలు చేయించుకుంటే భూసారం తెలియడంతో పాటు ఆ నేలల్లో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎంతమేర ఎరువులను వినియోగించాలనే విషయాలు రైతులు తెలుసుకోవచ్చు. రైతులు పంట పండించేందుకు మూడు పెట్టుబడులు అవసరం. అవి భూమి, విత్తనం, నీరు. వీటన్నింటికన్నా నేల ముఖ్యమైన పెట్టుబడి. అందుకే భూమిగుణగణాలు తెలిస్తే ఎలాంటి పంటలు పండుతాయో అవగాహన వస్తుంది. అందుకోసం మట్టి పరీక్షలు చేయించాలి. తద్వారా పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలో తెలియడంతో ఖర్చు తగ్గించుకోవచ్చు. చాలామంది రైతులు మట్టిపరీక్షలు జరిపించకుండా ఎరువులు అధిక మోతాదులో వేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి వ్యయం పెరగడంతోపాటు పంటల్లో పురుగుల ఉధృతి కూడా ఎక్కువవుతుంది. పొలాల్లో ఎరువుల మోతాదు తెలుసుకునేందుకు కచ్చితంగా మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష కేంద్రాలకు పంపించాలి. దీనికోసం సాగుభూమి నుంచి మట్టిని ఇలా సేకరించాలి. మట్టి నమూనా సేకరించ కూడని ప్రదేశాలు ● పొలం వరాలు, చెట్టు నీడ, బోరుబావులు, నీరు పొసేచోటు, బండరాళ్లు ఉన్న చోటు, మందులు కలుపుకునే చోటు. మట్టి నమూనా సేకరించే విధానం ● భూసార పరీక్ష ఫలితాలు సేకరించే మట్టి నమూనాలపై ఆధారపడి ఉంటాయి. కనుక మట్టి నమూనాలను ఒక ఎకరం విస్తీర్ణంలో ఒకచోటు నుంచే కాకుండా 10 నుంచి 15 ప్రదేశాల్లో తీయాలి. ● ఎంపిక చేసిన పొలంలో జిగ్జాగ్(ఎగుడు దిగుడు) పద్ధతిలో 10 నుంచి 15 చోట్ల గుర్తులు పెట్టాలి. ● గుర్తులు పెట్టిన చోట చెత్తాచెదారం తొలిగించి శుభ్రపరచాలి. శుభ్రపర్చిన చోట గుంతలు తీయాలి. ● ఆ గుంతల్లో ఒక అంగుళం(2.5 సెం.మీ.) మట్టిని సేకరించాలి. ● పొలంలో 10 నుంచి 15 చోట్ల సేకరించిన మట్టిని ఒకకుప్పగా పోసి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపిన మట్టిని గుండ్రంగా చేసి నాలుగు భాగాలుగా విభజించాలి. పైరెండు భాగాలను(ఏ, సీ)లుగా, కింది రెండు భాగాలను(బీ,డీ) భాగాలుగా గుర్తించాలి. వీటిలో రెండు ఎదురెదురుగా ఉన్న భాగాలను (బీ,డీ) కలిపి మిగిలిన రెండు భాగాలను(ఏ, సీ) తొలిగించాలి. ఇప్పుడు మిగిలిన (బీ,డీ) భాగాలను బాగా కలిపి మళ్లీ గుండ్రంగా చేసుకోవాలి. ఈ విధంగా గుండ్రంగా చేసుకున్న మట్టిని మళ్లీ ముందుగా విభజించినట్లుగా నాలుగు భాగాలుగా చేసి ఎదురెరుగా ఉన్న భాగాలను(ఏ,సీ) కలిపి మిగిలిన రెండు భాగాలను(బీ,డీ)లను తొలిగించాలి. ఈ విధంగా 10–15 చోట్ల నుంచి సేకరించిన మట్టిని అర్ధకిలో మట్టి నమూనా వచ్చే వరకు చేసుకోవాలి. తర్వాత ఈ నమూనాను నీడలో ఆరబెట్టి పరిశుభ్రమైన, గుడ్డసంచిలో నింపి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఇవ్వాలి. అన్నదాతలకు ఉచితంగా భూసార పరీక్షలు రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాం. కార్డులు కూడా ఉచితంగా ఇస్తాం. భూసారాన్ని బట్టి ఏ పంటకు ఎలాంటి ఎరువులు వాడాలో కూడా రైతులకు సూచిస్తున్నాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.– డాక్టర్ పిల్లి కిరణ్, మృత్తిక శాస్త్రవేత్త, కేవీకే, రామగిరి ఖిల్లా -
రిమాండ్ ఖైదీ పరార్
● గాలిస్తున్న పోలీసులు జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న క్రమంలో రిమాండ్ ఖైదీ పోలీసుల కన్నుగప్పి పరారైన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్కు చెందిన జున్ను ప్రసాద్ నిరుద్యోగులను గల్ఫ్ పంపిస్తానని, డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. దీంతో బాధితులు పెగడపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈనెల 17న కేసు నమోదు చేసి జున్ను ప్రసాద్ను జగిత్యాల జైలుకు తరలించారు. అతడిపై కొడిమ్యాల పోలీస్స్టేషన్లో కూడా గల్ఫ్ మోసంపై కేసు నమోదైంది. దీంతో కొడిమ్యాల పోలీసులు పీటీ వారెంట్ ద్వారా ప్రసాద్ను జైలు నుంచి తీసుకొచ్చి.. జగిత్యాల కోర్టులో మంగళవారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. తిరిగి రిమాండ్కు తరలిస్తున్న క్రమంలో పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరి పట్టివేతమెట్పల్లి: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. పట్టణ శివారులో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా..అబ్దుల్ సోహైల్, ఓ మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై అక్కడకు వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీ చేయగా.. వారి వద్ద 120 గ్రాముల గంజాయి దొరికింది. వారిపై కేసు నమోదు చేసి బైక్, రెండు సెల్ఫోన్లు సీజ్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ప్రపంచ అర్చరీ పోటీలకు చికిత
కరీంనగర్స్పోర్ట్స్: ప్రపంచ అర్చరీ క్రీడాకారిణి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన తానిపర్తి చికిత జూన్లో సింగపూర్లో, ఆగస్టులో కెనడాలో జరగబోయే ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొనే భారత మహిళల కంపౌండ్ క్రీడాకారుల జట్టులో చోటు సంపాదించింది. మహిళల కంపౌండ్ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్లో 71వ స్థానంలో కొనసాగుతోంది. ఏషియా కప్స్టేజ్ 2 పోటీలు సింగపూర్లో జూన్ 14 నుంచి 21 వరకు, వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ పోటీలు ఆగస్టు 16 నుంచి 25వరకు కెనడాలోని విన్నిపెగ్లో జరుగనున్నాయి. పూణెలో జరిగిన ఇండియన్ టీంసెలక్షన్ ట్రయల్స్లో చికిత అద్భుతంగా రాణించి చోటు దక్కించుకుంది. ఏషియా, వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ పోటీలకు తానిపర్తి చికిత ఎంపికకావడంపై ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్దారెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, మహ్మద్ కరీం, పెద్దపల్లి డీవైఎస్వో సురేశ్, బేస్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఉమ్మడి జిల్లా అర్చరీ సంఘం కార్యదర్శి కొమురాజు శ్రీనివాస్, కొమురాజు కృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
మీ సేవలో ‘ఆధార్’ సేవలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని మీసేవ కేంద్రాల్లో ‘ఆధార్’ సెంటర్లు పనిచేసేలా చర్య లు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించా రు. ‘ఆధార్ అవస్థలు’ శీర్షిక న ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించా రు. ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు ఆధార్ కేంద్రాలను అందుబాటులోకి తేవాలన్నారు. జూన్ 3న ఆధార్కార్డు అప్డేట్ కోసం కలెక్టరేట్లో మెగా క్యాంపు ఏర్పాటు చేయా లని ఆదేశించారు. 5 నుంచి 15ఏళ్లలోపు పిల్లల వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయించాలన్నారు. మండల కేంద్రాల్లోనూ ఆధార్ అప్డేట్కు ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. తప్పుడు చిరునామాల తో వెనక్కి వచ్చిన ఆధార్కార్డుల వివరాలను తపాలా కార్యాలయాల నుంచి తెప్పించాలని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక శిబి రాలు నిర్వహించాలని సూచించారు. యూఐడీఏఐ ప్రాజెక్టు మేనేజర్ నరేశ్చంద్ర, జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్ ఉన్నారు. -
ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
● రాజీవ్ రహదారి వెంట సర్వీస్ రోడ్లు ● రూ.25 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు తయారీగోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని రాజీవ్ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్ల వి స్తరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు అవరోధంగా మారిన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ భవనం, 20 దుకాణాలను ఇటీవల తొలగించిన అధికారులు.. మిగతాచోట్ల పనులు చేపట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. రామగుండం నుంచి గంగానగర్ వరకు.. రామగుండం తహసీల్దార్ కార్యాలయం నుంచి గంగానగర్ ఫ్లైఓవర్ వరకు రాజీవ్ రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. నిత్యం ఏదోఓచోట ప్ర మాదం జరుగుతూనే ఉంది. ఇప్పటిరకు ఇలా జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో వాహనదారు లు, పాదచారులు, ప్రయాణికులు మృతిచెందారు. అనేకమంది గాయాలపాలయ్యారు. భారీ వాహనా లు అతివేగంగా వెళ్లడం, అదేసమయంలో రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండడంతో ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆ ర్ఎఫ్సీఎల్ పరిశ్రమలు విస్తరించాయి. దీంతో రో డ్లు నిత్యం బిజీగా మారాయి. పెరుగుత్ను జనాలు, వాహనాల రద్దీకి అనుగుణంగా హెచ్కేఆర్ సంస్థ రోడ్లు విస్తరించడం లేదని, తద్వారా ప్రమాదాల సంఖ్య పెరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. బీగెస్ట్ హౌస్ మూలమలుపు వద్ద సర్కిల్.. సింగరేణి బీ – గెస్ట్హౌస్ మూలమలుపు వద్ద రాజీ వ్ రహదారిపై తరచూ చోటుచేసుకునే ప్రమాదాలను నియంత్రించేందుకు సర్కిల్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇక్కడ రోడ్డు విస్తరిస్తే.. మంచిర్యాల వైపు వెళ్లే, మంచిర్యాల నుంచి గోదావరిఖని వైపు వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఉండదని అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. రాజీవ్ హైవేపై బ్లాక్ స్పాట్లు.. రాజీవ్ హైవేపై బీ– పవర్హౌస్ గడ్డ నుంచి గంగానగర్ ఫ్లైఓవర్ వరకు ప్రమాదాలు అధికంగా జరు గుతున్నాయి. దీంతో పోలీసుశాఖ రంగంలోకి దిగింది. ఎన్టీపీసీ లేబర్గేట్, ఆర్ఎఫ్సీఎల్ క్రాసింగ్, మున్సిపల్ తీన్రస్తా, బస్టాండ్, జీఎం ఆఫీస్ మూలమలుపు, మిలీనియం క్వార్టర్స్ రోడ్డు క్రాసింగ్, గంగానగర్ ఫ్లైఓవర్ వరకు బ్లాక్స్పాట్లు గుర్తించింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక.. ఎన్టీపీసీ లేబర్గేట్ వద్ద కార్మికులు రాజీవ్ రహదారి దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని మరణిస్తున్నారు. చాలామంది గాయాలపాలవుతున్నారు. ప్రమాదాలను నియంత్రణకు ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. మేడిపల్లి చౌరస్తా కూడా అత్యంత ప్రమాదకరంగా మారింది. ఫుట్బ్రిడ్జి కోసం రూ.5 కోట్లు.. మున్సిపల్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు ఆర్ అండ్ బీ మంత్రిని ఎమ్మెల్యే కలిశారు. మెడికల్ కాలేజీ నుంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వరకు నేరుగా వెళ్లేందుకు రాజీవ్ హైవేపై ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని విన్నవించగా, రూ.5 కోట్లు మంజూరయ్యాయి. దీంతో మెడికల్, పీజీ, డిగ్రీ కళాశాలలకు వెళ్లివచ్చే వారికి సౌకర్యంగా ఉంటుంది. అసంపూర్తిగా సర్వీస్రోడ్లు కవిత థియేటర్ నుంచి ఇల్లెందు గెస్ట్హౌస్ వరకు సర్వీస్ రోడ్డు ఇంకా పూర్తికాలేదు. సాయిలీలా హోటల్ నుంచి పోలీసు కమిషనరేట్, ఎస్బీఐ నుంచి మేడిపల్లి సెంటర్ వరకు, బీ – పవర్హౌస్ గడ్డ నుంచి కుడివైపు సర్వీస్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. సర్వీస్ రోడ్ల పరిశీలన రాజీవ్ హైవే వెంట సర్వీస్ రోడ్ల విస్తరణపై రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్, ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, హెచ్కేఆర్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, ఇంజినీర్లు, నిపుణులు సోమ వారం పరిశీలన చేశారు. సర్వీస్ రోడ్ల విస్తరణకు సుమారు రూ.25కోట్లతో అంచనాలు ప్రతిపాదించారు. నగర రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జీఎం ఆఫీస్ మూలమలుపు వద్ద ప్రమాదాల నియంత్రణకు పటిష్ట ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. -
లోకో పైలెట్కు పురస్కారం
రామగుండం: సీనియర్ లోకో పైలెట్ సీహెచ్ రవి రైల్వే సంరక్ష పురస్కార్ అవార్డు–2025 అందుకున్నారు. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం) భరతేశ్ కుమార్ జైన్ నుంచి ఆయన సోమవారం సికింద్రాబాద్లో అవా ర్డు స్వీకరించారు. కరీంనగర్ రైల్వేస్టేషన్లో లారీ రైల్వే పట్టాలపై నిలిచిపోగా, సకాలంలో దానిని గుర్తించిన లోకో పైలెట్ రవి.. ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును నిలపడంతో ఐదుగురి ప్రాణాలు కాపాడినట్లయ్యిందని డీఆర్ఎం వివరించారు. డివిజనల్ స్థాయిలో ముగ్గురు లోకో పైలెట్లకు ఈ అవార్డులు రాగా అందులో రామగుండం పైలెట్ ఉన్నారని పేర్కొన్నారు. రవిని పలువురు లోకో పైలెట్లు అభినందించారు. అభ్యసన సామర్థ్యం పెంపొందించాలి సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): విద్యార్థుల్లో అ భ్యసన సామర్థ్యం మెరుగుపరిచేలా ఉపాధ్యా యులకు శిక్షణ ఇస్తున్నామని డీఈవో మాధవి తెలిపారు. గర్రెపల్లి జెడ్పీ హైస్కూల్లో జీవశాస్త్రం ఉపాధ్యాయులకు సామర్థ్య నిర్మాణంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. డీఈవో సోమవారం శిబిరాన్ని పరిశీలించి మాట్లాడా రు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాలలో అమలు చేయాలన్నారు. విద్యార్థులు అన్నిసామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ వి.కవిత, రిసోర్స్ పర్సన్స్ నరేశ్, కుమార్, సాధన, ప్రత్యక్ష, సీఆర్సీలు కిరణ్కుమార్, రజియా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ‘రోహిణి’లో ఆరుద్ర ప్రత్యక్షం జ్యోతినగర్(రామగుండం): వానాకాలం సీజన్ ఈనెల 25న(రోహిణి కార్తె ప్రవేశంతో) ప్రారంభమైంది. ఈమేరకు రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొన్నిచోట్ల వ ర్షాలు కురవగా.. అన్నదాతలు దుక్కిదున్నడంలో నిమగ్నమయ్యారు. అయితే, రోహిణి కా ర్తెలో ఆరుద్ర పురుగులు కనిపించడంతో రైతు లు తమకు శుభ సంకేతమని భావిస్తున్నారు. సాధారణంగా ఈ పురుగులు ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. సో మవారం పట్టణంలో వాకింగ్కు వెళ్లిన వారికి ఈ పురుగులు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. పీపీ గది తొలగింపు సుల్తానాబాద్(పెద్దపల్లి): నిజాం కాలంలో ని ర్మించిన పట్టణంలోని మున్సిఫ్ కోర్టులో గల పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) గది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియక కక్షిదారులు, కోర్టు ఉద్యోగులు, సిబ్బంది భయంతో వణుకుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరగకముందే దీనిని కూల్చివేయాలని సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. హైకోర్టు ఇందుకు అనుమతి ఇచ్చిందని అసోసియేషన్ కార్యదర్శి భూమయ్య, న్యాయవాదులు తెలిపారు. ఈమేరకు జేసీబీ సాయంతో సోమవారం పీపీ గది తొలగించారు. కాగా, మున్సిఫ్ కోర్టు కార్యకలాపాలను కొత్త భవనంలోకి తరలించగా, పాత భవనం ఖాళీగానే ఉంటోంది. జీవో నంబరు 44ను అమలు చేయాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రాథమిక సహకార సంఘాల కోసం జారీచేసిన జీవో నంబరు 44లో పొందుపరిచిన అంశాలను సక్రమంగా అమలు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగోని శంకర్ కోరారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో ప్రకారం బదిలీలకు వ్యతిరేకం కాదని, బ్యాంకు ఉద్యోగుల మాదిరిగా ప్రతీనెల ఒకటో తేదీన పాలకవర్గాలకు సంబంధం లేకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. సంఘం అభివృద్ధి కోసం కష్టపడే వారిని ప్రభుత్వం గుర్తించాలని విన్నవించారు. -
రోజుకు ఉమ్మడి జిల్లా నుంచి 50 నుంచి 60 వేల ఆర్డర్లు ● రూ.కోట్లలో వ్యాపారం
షాపింగ్.. ఒకప్పుడు ఒకరిద్దరిని తోడుగా తీసుకొని వెళ్లి.. నచ్చింది చూసి.. ధర ఆరా తీసి.. బేరం చేసి తెచ్చుకునేవాళ్లం. నేడు అంతా మారిపోయింది. ఏది కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో గుమ్మంలోకి వచ్చి చేరుతోంది. జీవితం ఉరుకుల..పరుగులమయం కావడంతో ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ ఆప్షన్గా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి రోజుకు సుమారు 50 నుంచి 60 వేల ఆర్డర్లు వెళ్తుండగా, కోట్లలో వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. ఈ ఆన్లైన్ షాపింగ్ డెలివరీబాయ్స్కు ఉపాధినిస్తుండగా.. ప్రజలకు ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే శ్రమ లేకుండా పోతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం.. బీపీ.. గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జీవితమే టైమ్ మెషిన్లా మారిన నేటి కాలంలో ఆన్లైన్ షాపింగ్.. పరిణామాలపై స్పెషల్ స్టోరీ..– వివరాలు 8లోu -
కబ్జాదారుల్లో గుబులు
రామగుండం: అంతర్గాం మండల కేంద్రంలోని టెక్స్టైల్, కుర్సికం, ప్రభుత్వ భూముల్లో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ అథారిటీ అధికారులు ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించి ఎయిర్పోర్టు ఏర్పాటుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో ఆ భూములపై వివాదాలు తలెత్తకుండా, ఇప్పటికే సమస్యలు ఉంటే ముందే పరిష్కరించి విమానాశ్రయం లేదా భారీ పరిశ్రమను స్థాపించాలని నిర్ణయించినట్లు తెలిసింది. పరిహారం చెల్లింపుల్లో కదలిక.. సుమారు నాలుగు దశాబ్దాల క్రితంనాటి అంతర్గాం స్పిన్నింగ్, వీవింగ్ మిల్లు కార్మికుల భూ సమస్య, పరిహారం చెల్లింపులపై ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో కదలిక మొదలైంది. భూ పరిపాలన శాఖ అధికారి (సీసీఎల్ఏ)తో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ ఇటీవల సుదీర్ఘంగా చర్చించారు. ఆ త ర్వాత బర్మా, శ్రీలంక, కాందీశీకుల కుటుంబాలతో టెక్స్టైల్, రెవెన్యూ అధికారుల నుంచి సమగ్ర స మాచారం సేకరించాలని సీసీఎల్ఏ నుంచి ఆదేశా లు జారీచేశారు. ఇంతలోనే బర్మా, కాందీశీకులతో కలెక్టర్ కోయ శ్రీహర్ష అత్యవసరంగా సమావేశమయ్యారు. వారి డిమాండ్ల గురించి తెలుసుకున్నారు. బతుకు దెరువు కోసం వచ్చి.. బర్మా, శ్రీలంక, కాందీశీకులు బతుకు దెరువు కోసం అంతర్గాం వలస వచ్చారు. వారికి ఉపాధి కల్పించేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1964లో అంతర్గాం ప్రాంతాన్ని ఎంపిక చేసింది. రీ హాబిలిటేషన్ హౌసింగ్ లోన్ కింద వెయ్యి మంది కా ర్మిక కుటుంబాలకు రూ.41 లక్షలు వెచ్చించి క్వార్ట ర్లు నిర్మించింది. ఇందుకోసం సొసైటీ నిధులతో 96.09 ఎకరాల పట్టా భూములు సేకరించింది. ఆ జామాబాద్ ఇండస్ట్రియల్ పేరిట ఉన్న మరోచోట 71.30 ఎకరాలు, ప్రభుత్వ భూములు 334.10 ఎకరాలను పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో స్వాధీనం చే సుకుంది. ఇందులోనే కార్మికుల నివాసాలు, స్పి న్నింగ్, వీవింగ్ మిల్లు నిర్మించింది. ఒక్కో కుటుంబానికి పది గుంటల విస్తీర్ణంలో క్వార్టర్, మిగతా స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకోవాలని సూచించింది. గత 50ఏళ్లలో సుమారు 800 క్వార్టర్లు కుప్పకూలి నామరూల్లేకుండాపోయాయి. 107.34 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మిగతా క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. నవంబర్ 1991లో మూతపడే నాటికి స్పిన్నింగ్ మిల్లు వర్కర్లు 434 మంది, జూన్ 1985లో మూతపడే నాటికి వీవింగ్ సొసైటీ కార్మికులు 197 మంది ఉన్నారు. అందులో ఇప్పటివరకు 260 మంది మృతి చెందారు. ప్రస్తుతం వారి వారసులు మిగిలారు. కార్మికుల డిమాండ్లు ఇవే.. ● పది గుంటల విస్తీర్ణంలో నివాసం, మిగతా స్థలానికి ప్రహరీ నిర్మించి పట్టాలు ఇవ్వాలి ● వీవింగ్ సొసైటీ కార్మికుల వేతన బకాయిలు రూ.1.05 కోట్లు చెల్లించాలి ● వీఆర్ఎస్లో నష్టపోయిన స్పిన్నింగ్ మిల్లు కార్మికులకు రూ.5.50 కోట్ల పెండింగ్ పరిహారం విడుదల చేయాలి ● కబ్జాదారుల నుంచి మిల్లులకు చెందిన 200 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలి. అంతర్గాం టెక్స్టైల్ భూముల స్వాధీనానికి చర్యలు భూ సమస్యపై ఉన్నతాధికారుల సమీక్ష ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రస్తావనతో కదలిక స్వాధీనం చేసుకుంటాం స్పిన్నింగ్, వీవింగ్ మిల్లులు స్థాపించేందుకు 50 ఏళ్ల క్రితం భూములు కేటాయించారు. వాటిని సర్వే నంబర్ల ఆధారంగా గుర్తించి ఇప్పుడు స్వాధీనం చేసుకుంటాం. – మక్కాన్సింగ్ ఎమ్మెల్యే, రామగుండం -
వర్షాకాలం.. అప్రమత్తత అవసరం
● విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలి ● ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ మాధవరావు జ్యోతినగర్(రామగుండం): వర్షాకా లం ప్రారంభమైంది. ఈ కాలంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా విద్యత్ ప్రమాదాలు జరుగుతాయి. అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ సర్కిల్ సూపరింటెండెంట్ కె.మాధవరావు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు, రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన సూచనలు ఇవీ.. ● వినియోగదారులు విద్యుత్ సంబంధిత పనులు సొంతంగా చేసుకోవద్దు. ● తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా ఉన్న, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు. వీటిని గమనించిన వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1912 ద్వారా విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. ● ఇళ్లలో బట్టలు ఆరవేసే జీఐ దండెం/వైర్లకు ఇన్సులేషన్ సరిగ్గా లేకుంటే విద్యుత్ సరఫరా అయ్యి షాక్ గురయ్యే ప్రమాదం ఉంది. వీటికోసం ప్లాస్టిక్ దండేలు ఉపయోగించాలి. ● స్తంభం నుంచి విద్యుత్ సరఫరా అయ్యే తీగలను ఇంటి ఎదుట రేకులకు తాకకుండా చూడాలి. ● విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల వద్దకు పశువులు వెళ్లకుండా కాపరులు అప్రమత్తంగా ఉండాలి. కిందపడిన కరెంట్ వైర్లను గమనించాలి. ● ఇంటి వైరింగ్కు ఎర్తింగ్ చేయాలి. నాణ్యమైన ప్లగ్గులు, సెల్ఫోన్ చార్జర్లు ఉపయోగించాలి. ● సెల్ఫోన్ చార్జింగ్ పెట్టి తడిచేతులతో తాకరాదు. ● కరెంట్ షాక్ సంభవిస్తే సమీపంలోని వ్యక్తులు రక్షించే సమయంలో నేరుగా ముట్టుకోరాదు. కర్ర, ప్లాస్టిక్ వస్తువులతో తీగ నుంచి బాధితుడిని వేరుచేయాలి. ● రైతులు నాణ్యతమైన వ్యవసాయ పంపుపెట్లు వినియోగించాలి. ● వ్యవసాయ పంపుసెట్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్ కచ్చితంగా ఉండేలా చూడాలి. పంపుసెట్లను, స్టార్టర్లను ఎర్త్ చేయాలి. ఎర్త్ చేయనివి తాకితే ప్రమాదం బారినపడతారు. ● విద్యుత్ సంబంధిత పనులన్నీ స్వయంగా కాకుండా ఎలక్ట్రీషియన్తోనే చేయించాలి. ● విద్యుత్ కంచెలతో రైతులు ప్రమాదాలకు గురవుతున్నారు. ● వీటిని ఏర్పాటు చేస్తే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ● విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజులు మార్చడం, రిపేరు చేయడం, ఏబీ స్విచ్లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం. ఇవి కేవలం విద్యుత్ సిబ్బంది మాత్రమే చేస్తారు. ఇతరులెవరూ చేయరాదు. ● గ్రామీణ వినియోగదారులు లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇంజినీర్, సెక్షన్ అధికారులను సంప్రదించి విద్యుత్ సేవలు పొందాలి. -
బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి
రామగిరి(మంథని): జనాభా ప్రాతిపదికన రాజకీయ, విద్య, ఉద్యో గ రంగాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాల ని బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీ య అధ్యక్షుడు జక్కని సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ మేలుకొలుపు రథయాత్ర ఆదివారం సెంటినరీకాలనీకి చేరింది. ఈసందర్భంగా మార్కెట్ చౌరస్తాలోని అంబేడ్కర్, పూలే, రాణీరుద్రమదేవి స్టేడియం ఎదుట గల తెలంగాణ అమరవీరుల స్తూపం వ ద్ద నివాళి అర్పించారు. అసెంబ్లీలో తీర్మానించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ బి ల్లు అమలు చేయాలన్నారు. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంథనిలో బీసీల అణచివేతకు మంత్రి కుటుంబం ప్రధాన కారణ మని ఆరోపించారు. అనేకమంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, మంత్రి సతీమణి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చేనేత శాఖలో రూ.వేల కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకేశీ రవీందర్, నాయకులు కుమార్ యాదవ్, శంకర్లాల్, గౌతం శంకరయ్య, రాజసంపత్, ఆసం తిరుపతి, సైండ్ల సత్యనారాయణ, గద్దల శంకర్, మల్యాల మోహన్, కొండవేన ప్రభాకర్, నూనె రాజేశం, బొంకూరి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆధార్’ అవస్థలు
● అధికారుల తప్పిదంతోనే తిప్పలు ● సవరించుకునేందుకు వ్యయ‘ప్రయాస’లు ● అందుబాటులో నమోదు కేంద్రాలు లేక ఇబ్బందులు పెద్దపల్లిరూరల్: ఆధార్ కార్డు అన్నింటికీ ఆధారమైంది. బర్త్, డెత్ సర్టిఫికెట్ కావాలన్నా, బ్యాంకు ఖాతా అవసరం ఉన్నా, స్కూల్లో ప్రవేశం కల్పించాలన్నా, కులం, ఆదాయం, నివాసం ధ్రువీకరణపత్రాలు కావాలన్నా, సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. తొలుత మీసేవ కేంద్రాల నిర్వాహకులకు సైతం ఆధార్ కార్డు సర్వీసు బాధ్యతలు ఇచ్చినా.. వారు అక్రమాలకు పాల్పడుతున్నారని అనుమానించి వా రి బాధ్యతలను తొలగించారు.అయితే, ప్రభుత్వ కా ర్యాలయాల ఆవరణలోనే ఏర్పాటు చేయాలని ఉ న్నతాధికారులు తీసుకున్న నిర్ణయం ఎక్కడా అమ లు కావడం లేదు. దీంతో జిల్లాలోని పలు మండలా లు, గ్రామాల ప్రజలు ఆధార్కార్డులో దొర్లిన పొరపాట్లను సవరించుకునేందుకు, పుట్టిన పాపాయికి కార్డు కోసం సుదూర ప్రాంతాలకు తిరుగుతూ అనేక వ్యయ, ప్రయాసలకు గురవుతున్నారు. పనిచేసేవి నాలుగే.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆఫీసుల ఆవరణలో పనిచేసేందుకు ఏడు ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినా అందులో 4 సెంటర్లే పనిచేస్తున్నాయి. వాటిలో ఒక్క కేంద్రమే జెండా ప్రాంతంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో అందరికీ అనువుగా ఉంది. కలెక్టరేట్ ఆవరణలో ఉండాల్సిన ఆధార్ కేంద్రాన్ని అమర్నగర్ ప్రాంతంలోని ఓ గల్లీలో ఏర్పాటు చేశారు. దాని చిరునామా తెలుసుకోవడం ఇబ్బందిగా మారింది. కొందరు ఎలాగోలా తెలుసుకుని అక్కడకు చేరుకునేందుకు నానాతంటాలు పడాల్సి వస్తోంది. మరోరెండు కేంద్రాలను బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసినా అక్కడ ప్రజలకు సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి. ఆధార్ సెంటర్ల తీరుపై సరైనరీతిన అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించి ఆధార్ అవస్థలను దూరం చేసి సేవలను దగ్గర చేయాలని కోరుతున్నారు. ఆపరేటర్లకు వసతి కల్పించరా? ఆధార్ సెంటర్ కలిగియున్న మీసేవ ఆపరేటర్లు ప్రభుత్వకార్యాలయాల ఆవరణలోనే ఆధార్ సేవలను అందించాలని ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలుకు నోచడం లేదు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి కలెక్టరేట్తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీసుల్లో ఏర్పాటు చేసుకునేందుకు సంబంధిత ఆపరేటర్లు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ వసతి కల్పించలేదు. దీంతో ఆ కేంద్రాలు పనిచేయడం లేదు. ఓదెల మండలం పొత్కపల్లికి చెందిన పంజాల మాధవి కుటుంబం ఇది. వారి బాబు ఆధార్కార్డులో దొర్లిన పొరపాటును సవరించుకునేందుకు జిల్లా కేంద్రంలోని ఆధార్ కేంద్రానికి ఇటీవల వచ్చింది. పొరపాటు సవరణకు అవసరమైన ఆధారాలు లేవని ఆధార్ కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇతడి పేరు రాజు. పెద్దపల్లి మండలం కుర్మపల్లి స్వగ్రామం. తన కుమారడి ఆధార్కార్డు కోసం కేంద్రానికి వచ్చాడు. తహసీల్దార్ కార్యాలయం జారీచేసిన బర్త్ సర్టిఫికెట్లో పిన్కోడ్ లేదని ఆధార్ కార్డు ఇచ్చేందుకు నిర్వాహకులు తిరస్కరిస్తున్నారని వాపోయాడు. ఇబ్బంది రావొద్దు కలెక్టరేట్తోపాటు అన్నిమండల కేంద్రా ల్లోని ప్రభుత్వ ఆఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సర్కారు ఆఫీసుల్లో ఆధార్ సెంటర్లు ఉంటే ఏ సమస్య వచ్చినా అధికారులు అప్పటికప్పుడే పరిష్కరించే అవకాశముంటుంది. కలెక్టర్ చొరవ చూపి వీలైనంత త్వరగా ఏర్పాటు చేయించాలి. – కందుల శ్రీనివాస్, సుల్తానాబాద్ ఆదేశాలు ఉన్నాయి మీసేవ కేంద్రాలు, ఇతర భవనాల్లో ఏర్పాటు చేసుకున్న ఆధార్ సెంటర్లను ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోకి మార్చాలనే ఆదేశాలున్నాయి. వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – గంగయ్య, ఆర్డీవో, పెద్దపల్లి -
విస్తరణకు అడుగులు
● జోరుగా భవనాలు, షాపుల కూల్చివేత ● రామగుండం నగరంలో తెరుచుకుంటున్న కొత్తదారులు ● దశాబ్దాల తర్వాత వేగంగా రహదారుల అభివృద్ధి ● ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్లకూ అంకురార్పణ ● మరో 50ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ప్రగతి పనులు ● హైవేపై ప్రమాదాల నియంత్రణకు సర్వీస్ రోడ్ల నిర్మాణంగోదావరిఖని: జిల్లాలోనే ఏకై క నగరం రామగుండం. పారిశ్రామిక ప్రాంతంగా ప్రఖ్యాతిగాంచిన నగరంలో గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, రామగుండం పట్టణాలు ఉన్నాయి. అయితే, ప్రధాన ప్రాంతా ల్లో ఇరుకైన రోడ్లు నగరవాసులకు చుక్కలు చూపెడుతున్నాయి. వాటి విస్తరణకు పలుపర్యాయాలు ప్రయత్నాలు జరిగినా.. భవనాలు, నివాసాలు అవరోధం కలిగిస్తూ వస్తున్నాయి. వాటిని తొలగించేందుకు యత్నిస్తే రాజకీయ ఒత్తిళ్లు ఆటంకం కలిగిస్తున్నాయి. వీటన్నింటినీ అధిగమించడం అధికారులకు సవాల్గా మారుతోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం, సింగరేణితోపాటు ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ తదితర పరిశ్రమలు సహకరించడంతో నగరం ఆధునికత సంతరించుకుంటోంది. సినిమా టాకీస్ కూల్చివేతతో శ్రీకారం.. నగరం నడిబొడ్డున ఉన్న ఓ సినిమా టాకీస్ కూల్చివేతతో రోడ్ల విస్తరణకు తొలిఅడుగు పడింది. ప్రస్తుతం బీ – పవర్హౌస్గడ్డ నుంచి గోదావరి నది సమీపంలోని గంగానగర్ ప్లైఓవర్ వరకు సర్వీస్ రోడ్ల విస్తరణపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే రాజీవ్ రహదారి వెంట సర్వీ సు రోడ్ల నిర్మాణం వేగవంతమైంది. వీటికి అడ్డుగా ఉన్న భవనాల కూల్చివేతలకు తొలుత వ్యతిరేకత ఎదురైనా.. అదేస్థాయిలో రోడ్ల విస్తరణ, ఆధునిక వ్యాపార సముదాయాల నిర్మాణం, నగర అభివృద్ధికి అడుగులు పడుతుండడంతో ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. ప్రమాదాలకు నిలయం.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రాజీవ్ రహదారి పక్కనే ఉన్న భవనం సర్వీసు రోడ్డు విస్తరణకు అవరోధంగా మారింది. అంతేకాదు.. రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బస్టాండ్లోకి వెళ్లడం, ఆటోలు కూడా చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. సర్వీసు రోడ్ల విస్తరణపై దృష్టి సారించిన ఎమ్మెల్యే రాజ్ఠాకూర్.. బస్టాండ్ సమీపంలో కూడా రోడ్డు విస్తరించాలని సూచించారు. దీంతో ఆ భవనాన్ని ఇటీవల కూల్చివేశారు. అదే విధంగా వ్యాపార కేంద్రమైన కల్యాణ్నగర్లోనూ రోడ్ల విస్తరణ జోరందుకుంది. మార్కండేయకాలనీలో రోడ్డు విస్తరణకు అవరోధంగా ఉన్న రాజేశ్ థియేటర్ వెనకాల ఉన్న ఓ భవనాన్ని కూడా శనివారం బల్దియా అధికారులు కూల్చివేశారు. ఈభవనం కూల్చివేతతో రోడ్డు విస్తరణ వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు.50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా పనులు మరో 50 ఏళ్లవరకు అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా రోడ్లు విస్తరించాలి. ఆధునిక భవనాలు, షాపింగ్కాంప్లెక్స్ నిర్మించాలి. అందుకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. ఈ పనులతో కొందరికి ఇబ్బందులు ఎదురైనా చాలామందికి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇందు కోసం రాజీలేకుండా ముందుకు సాగుతాం. – ఎంఎస్ రాజ్ఠాకూర్, రామగుండం ఎమ్మెల్యే -
సహకార సంఘాల్లో బదిలీల జాతర
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్)ల్లో బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కార్యదర్శు(సీఈవో)లతోపాటు ఉద్యోగులను బదిలీ చేయాలని ఇటీవల ఉత్తర్వులను జారీచేసింది. దీర్ఘకాలంగా ఒకే సింగల్విండోలో పనిచేయడంతో రైతులను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదుల మేరకు ఉద్యోగుల బదిలీకి శ్రీకారం చుట్టింది. త్వరలో బదిలీలు ఉంటాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించడం గమనార్హం. తొలిసారి బదిలీలు.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శాఖల పరిధిలోని ప్రాథమిక సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఈమేరకు గతనెల 20న ఉద్యోగుల వివరాలు నమోదు చేసింది. ఒకేప్రాంతంలో మూడు నుంచి ఐదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, సిబ్బందిని కచ్చితంగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, వందేళ్ల చరిత్ర కలిగిన సహకార సంఘాల్లో బదిలీలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషమని అంటున్నారు. జిల్లాలో కార్యదర్శులు 20 మంది ఉండగా సిబ్బంది 92 ఉన్నారని అంచనా. ఏళ్ల తరబడి ఒకేచోట.. సహకార సంఘాల ఉద్యోగులు, సిబ్బంది ఏళ్ల కొద్దీ ఒకే సంఘంలో పనిచేయడంతో సోమరిపోతుల్లాగా మారారని, తాము చెప్పిందే నడుస్తుందనే భావనతో రైతులు, పాలకవర్గ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. చాలామంది ఉద్యోగులు, సిబ్బంది 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకుపైగా ఒకేచోట పనిచేస్తుండడంతో సమస్యలు వస్తున్నాయని, సంఘాల అధ్యక్షులను గుప్పిట్లో పెట్టుకొని పెత్తనం చెల్లాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. రిటైర్మెంట్కు దగ్గర ఉన్నవారిని బదిలీ చే యవద్దని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. ● దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారికి స్థానచలనం జిల్లా పరిధిలోనే బదిలీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీచేసిన 44 జీవోను సవరిస్తూ కొత్తగా 82 జీవోగా మార్చింది. బదిలీ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఉమ్మడి జిల్లా పరిధిలో కాకుండా జిల్లా పరిధిలోనే బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రిటైర్మెంట్కు దగ్గర ఉన్నవారిని బదిలీ చేయవద్దు. – బొంగోని శంకర్గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రాథమిక సహకార సంఘాల అసోసియేషన్ -
ముగిసిన డీఈఈసెట్
రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో ఆదివారం చేపట్టిన డీఈఈసెట్ ఆన్లైన్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం సెషన్లో జరిగిన పరీక్షకు 137 మంది అభ్యర్థులకు 100 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 144 మందికి 103 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ బి.విష్ణువర్ధన్ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. శాంతిచర్చలు జరపాలి జ్యోతినగర్(రామగుండం): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్)మాస్లైన్ ప్రజా పంథా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలోని రాజీవ్ రహదారిపై ఆదివారం నల్లజెండాలతో నిరసన చేపట్టారు. శ్రీనివాస్ మాట్లాడుతూ, కేశవరావు సహా 27 మంది మావో యిస్టులను ఎన్కౌంటర్లో హతమార్చడం దుర్మార్గమన్నారు. మావోయిస్టులతో కేంద్రప్రభుత్వం శాంతిచర్చలు జరపాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రప్రభుత్వం పెడచెవిన పెట్టడం శోచనీయమన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని ఆయన కోరారు. నాయకులు తోకల రమేశ్, గొల్లపల్లి చంద్రయ్య, గూడూరు వైకుంఠం, మార్త రాములు, రాయమల్లు, సురేశ్, సునీత, మల్లేశ్, రవి, రాములు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలిగోదావరిఖని: మావోయిస్టు పార్టీ కేంద్ర క మిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.శ్రీనివాస్ డిమాండ్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్ లో నిర్వహించిన జిల్లాస్థాయి సదస్సులో ఆ యన మాట్లాడారు. పహల్గామ్ హత్యలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, ఆపరేషన్ సిందూర్లో దాగిఉన్న అంశాల్లో అన్నికోణాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పహల్గాంలో దాడి చేసిన వారిని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పట్టుకోలేదని, ఆపరేషన్ సిందూర్లో యుద్ధం అర్ధ్ధంతరంగా ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంపు ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నాయకులు ఐ.కృష్ణ, నరేశ్, వెంకన్న, చిలుక శంకర్, రామకృష్ణ, రాజేశం, మేరుగు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అరుణోదయ కళాకారుల పాటలు ఉత్తేజపర్చాయి. ప్రశాంతంగా గ్రామపాలన అధికారుల పరీక్ష పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వడిగ్రీ కాలేజీలో ఆదివారం గ్రామపాలన అధికారుల పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు 90మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 82మంది హాజరయ్యారని పరీక్షల సూపరింటెండెంట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ వేణు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేడు మంత్రి పర్యటన మంథని: నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్బాబు సోమవారం పలు అభివృద్ధి పనులను ప్రా రంభించనున్నారు. గుంజపడుగులో రూ.2.90 కోట్లతో ఏర్పాటు చేసే సోలార్ ప్రాజెక్ట్ అనుమ తి పత్రాలను మంత్రి అందజేస్తారు. మంథని బస్ డిపో సమీపంలో డ్రీమ్, స్టార్ట్ – రైజ్ ఇన్నో వేషన్ నెట్వర్క్లో భాగంగా గ్రామీణ ప్రొటోటైపింగ్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభిస్తారు. మల్హర్ మండలం కొయ్యూరు సరస్వతీ పుష్కరాలకు వెళ్లేవారికి అన్నదానం ప్రారంభిస్తారు. -
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఠాకూర్ సమీక్ష
గోదావరిఖని : రామ గుండం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై ఎమ్మె ల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఆదివారం సింగరేణి అధికారులతో స మీక్షించారు. ప్రధాన చౌ రస్తాలో షాపింగ్ కాంప్లెక్స్, ఇంటర్నల్ రోడ్లు, తాగునీటి కోసం ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్, జనగామ, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణాలు, విద్యుత్ దీపాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. మురుగునీటిని శుభ్రం చేసే ఎిస్టీపీపీల నిర్మాణం పురోగతిపై ఆరా తీశారు. ఖబ్రస్తాన్ పనుల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, సివిల్ డీజీఎం వరప్రసాద్, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సభకు హాజరు గోదావరిఖనిటౌన్: టీపీసీసీ కార్యదర్శి పెద్దెల్లి ప్రకాశ్ తల్లి మధునమ్మ వర్ధంతి సభ ఆదివారం నగరంలో జరిగింది. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఈ సభకు హాజరయ్యారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్సీ సంతోష్కుమార్, ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, ప్రతినిధులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, దీటి బాలరాజు, ముస్తఫా, గట్ల రమేశ్, తిప్పారపు శ్రీనివాస్, అమరేందర్, సతీశ్, వరలక్ష్మి, పద్మజ, చంద్రశేఖర్, గొర్రె రమేశ్, మోహన్రావు, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పాతభవనం కూల్చివేత
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని మార్కండే యకాలనీ మెయిన్రోడ్డు రాజేశ్ థియేటర్ పక్కను న్న మూడంతస్తుల పాత భవనాన్ని మున్సిపల్ కా ర్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం జేసీ బీ సాయంతో కూల్చివేశారు. బల్దియా సీనియర్ సి విల్ కాంట్రాక్టర్ డి.రాజమల్లుకు చెందన ఈ భవనం.. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉందని, దానిని తొ లగించాలని అధికారులు చాలా ఏళ్లుగా నోటీసులు జారీచేస్తూ వస్తున్నారు. అయితే, తనకు పరిహారం కావాలని 2002లో రాజమల్లు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటినుంచి ఈ వివాదం ఎటూ తేలలేదు. ప్రస్తుతం వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉండడంతో కూల్చివేసేందుకు టౌన్ ప్లానింగ్ అధికారు లు నిర్ణయించారు. ఇదే విషయాన్ని భవన యజమానికి తెలియజేశారని తెలిసింది. శనివారం టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్, సిబ్బంది జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. హఠాత్తుగా కూలిన భవనం.. జేసీబీలకు అమర్చిన బ్రేకర్తో పిల్లర్లను కూల్చివేస్తుండగా భవనం భారీ శబ్దంతో కుప్పకూలింది. ఏంజరిగిందో తెలుసుకునేలోపే జేసీబీపై శిథిలాలు పడ్డాయి. స్వల్పగాయాలతో డ్రైవర్ కిందకు దూకి పరుగులుపెట్టాడు. విద్యుత్ స్తంభాలపై కూడా శిథిలాలు పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భవనం వెనకాలే ఉన్న ఓ ఫాస్టఫుడ్ సెంటర్ బాత్రూంలు, సామగ్రి ధ్వంసమయ్యాయి. అయితే, ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మరో రెండురోజుల వరకు ఈ ప్రాంతంలో రాకపోకలను నిలిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తమకు పరిహారం ఇవ్వకుండా భవనం కూల్చివేయడం సరికాదని యజమాని కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు.● జేసీబీపై శిథిలాలు .. డ్రైవర్కు స్వల్ప గాయాలు -
అమ్మకు ఆరోగ్యం.. పిల్లలకు చదువు..
కలెక్టర్లు సాధారణంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం, పైళ్లు క్లియర్ చే యడం, విజిట్స్, ఇతర కార్యకలాపాలతో బిజీగా గడుపుతారు. కానీ.. కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన పమేలా సత్పతి మాత్రం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా, చిన్నారుల మానసిక వికాసం కోసం ‘ఏ టూ జెడ్ నాణ్యమైన రైమ్’ పేరిట రైమ్ రాసి పిల్లల కోసం పాడారు. ప్రతీ అక్షరం ప్రాముఖ్యతను తెలిపేలా.. ఏ ఫర్ ఆక్టివ్, బీ ఫర్ బ్రైట్.. అంటు జెడ్ వరకూ అన్ని అక్షరాలను ఉపయోగించి రైమ్ విడుదల చేశారు. అలాగే ‘శుక్రవారం సభ’ పేరుతో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పోషణలోపం గల చిన్నారులు, రక్తహీనత ఉన్న మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకున్నారు. ఉచిత పరీక్షల ద్వారా మహిళలకు ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా భరోసా ఇస్తూ చేపట్టిన కార్యక్రమం అద్భుత ఫలితాలను సాధించింది. అలాగే జిల్లాలో ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల కుటుంబాల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించి సుమారు 500 మంది వలసకార్మికుల పిల్లలకు బోధన అందించి తనదైన తల్లి పాలనతో ఆకట్టుకుంటున్నారు. -
హడలెత్తిస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ..
పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్ష 2024 జూన్ 16న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూనే, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పాలనను పరుగులు పెట్టించారు. స్కూళ్లు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, కార్పొరేషన్, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శిస్తూ, స్థానిక సిబ్బంది సూచనలు స్వీకరిస్తూనే అధికారులుగా వారేం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నారు. విధులకు డుమ్మాకొట్టిన వారు, అలసత్వం వహించేవారు, అవినీతికి పాల్పడే అధికారులను సుమారు ఆరుగురిని సస్పెండ్ చేశారు. ముఖ్యంగా జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీలతో గాడినపెట్టారు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో తన సతీమణి విజయకు ప్రతి నెలా పరీక్షలు చేయిస్తూ, డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచారు. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలను ప్రజలందరూ ఉచితంగా వినియోగించుకోవాలనే బలమైన సందేశాన్ని ఇచ్చారు. వృద్ధాప్య దశలో ఉన్న ఓ తండ్రిని పట్టించుకోని కొడుక్కి కలెక్టర్ ఝలక్ ఇచ్చారు. కొడుకు పేరిట తండ్రి చేసిన ఆస్తి గిఫ్ట్ డీడ్ను తిరిగి తండ్రి పేరుపైకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తాజాగా తబిత ఆశ్రమంలో మానస అనే అనాథ యువతికి పెళ్లిపెద్దగా వ్యవహరించి, అధికారులను సమన్వయం చేస్తూ అంగరంగా వైభవంగా వివాహం జరిపించడం ద్వారా జిల్లావాసుల మన్ననలు పొందారు. -
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్, రాఘవపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఏఎంసీలో ఇప్పటివరకు 13,500క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రాఘవపూర్లో అదనంగా హమాలీలను నియమించి రెండుమూడ్రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. కాగా, జూన్ 25న చేపట్టే గ్రామపాలన అధికారి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని వేణు సూ చించారు. సకాలంలో ప్రశ్నాపత్రాలు పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని తె లిపారు. ఉదయం 10 గంటలకు గేటు మూసివేశాక అభ్యర్థులను లోనికి అనుమతించవద్దని అన్నారు. ఆర్డీవో గంగయ్య, కలెక్టరేట్ సీ– వి భాగం సూపరింటెండెంట్ ప్రకాశ్ పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రిలో పేషెంట్ల రద్దీ పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ, మాతా శిశుకేంద్రం ఆస్పత్రుల్లో శనివారం పేషెంట్లు బారులు తీరారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందేందుకు వచ్చేవారు వెంట తెచ్చుకున్న ఆధార్కార్డును చూపి ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఇలా బారులు దీరారు. ప్రతీరోజు సుమారు 800మందికిపైగా ఓపీ రిజిస్ట్రేషన్ అవుతోందని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. ఐటీఐ కోర్సుల్లో ఉచిత శిక్షణ రామగుండం: పట్టణంలోని ఐటీఐలో ఉచిత షార్ట్టర్మ్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సురేందర్, శిక్షణ అధికారి విద్యాసాగర్రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన(పీఎంఎస్జీఎంబీ) పథకంలో భాగంగా వారంరోజులపా టు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. శిక్షణ విజయ వంతంగా పూర్తిచేశాక పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి స్కిల్ డెవలప్మెంట్ ధ్రువీకరణపత్రం అందజేయనున్నామని వారు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు రెండురోజుల్లోగా తమ వివరాలను నేరుగా ఐటీఐకి వచ్చి నమోదు చేసుకోవాలని వారు సూచించారు. కొత్త పద్ధతులు అవలంబించాలి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించేలా కొత్త పద్ధతులు పాటించాలని ఏడీఏ శ్రీనాథ్, కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీధర్ రైతులకు సూచించారు. తారుపల్లి గ్రామంలో శనివారం రైతు ముంగిట వ్యవసాయ శాస్త్ర వేత్తలు కార్యాక్రమం నిర్వహహించారు. విత్తన ఎంపిక, కొనుగోలు, శుద్ధి, శాసీ్త్రయ సాగు పద్ధతులు, ఎరువులు, సాగునీటి యాజమాన్యం, నేల, మట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలపై అవగాహన కల్పించారు. పచ్చిరొట్ట సాగు, సేంద్రియ ఎరువుల వినియోగం, సస్యరక్షణ పద్ధతులు, హైబ్రిడ్ విత్తనాల సాగు, పత్తి, వరి, మిరప, అపరాల సాగు. అంతరపంటల సాగు ఏ కార్తెలో ఏ పంటలు వేయాలనే అంశాలపై వారు సమగ్రంగా వివరించారు. ఏవో నాగార్జున, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, ఏఈవో స్పందన, రైతులు తదితరులు పాల్గొన్నారు. 30లోగా ఆస్తిపన్ను చెల్లించండి కోల్సిటీ(రామగుండం): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ఆస్తిపన్నుపై అపరాధ రుసుం వసూలు చేయడం లేదని, ఈ అవకాశం జూన్ 30 వరకే ఉందని రామగుండం బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ తెలిపారు. ఈమేరకు ఇంటింటికీ ఆస్తిపన్నుల డిమాండ్ నోటీసులు జారీచేస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ మరో మూడురోజుల్లో పూర్తిచేస్తా మని పేర్కొన్నారు. డిమాండ్ నోటీస్ రాకున్నా.. ఆన్లైన్లో లేదా నగరపాలక సంస్థ కా ర్యాలయం, మీ సేవా కేంద్రాలు, ఇంటివద్దకు వచ్చే వార్డు అధికారులకు ఆస్తిపన్ను చెల్లించాలని ఆమె సూచించారు. గడువు ముగిశాక రెండుశాతం పెనాల్టీ విధిస్తామన్నారు. నగరంపరిధిలో ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆస్తులు 51,014 ఉండగా 15,176 ఆస్తుల ఆస్తిపన్ను ఇప్పటివరకు చెల్లించారని తెలిపారు. మిగిలినవారు వెంటనే ఆస్తిపన్ను చెల్లించి నగరాభిద్ధివృకి సహకరించాలని కమిషనర్ కోరారు. -
‘నకిలీ’ గండం గట్టెక్కేనా?
సాక్షి, పెద్దపల్లి: ఈనెల 25 న(ఆదివారం) రోహిణి కా ర్తె ప్రవేశిస్తుండడంతో వా నాకాలం సీజన్ ప్రారంభమవుతుంది. ఇదే అదను గా విత్తన మాయగాళ్లు పల్లె బాటపట్టి అన్నదాతలను బురడీ కొట్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఏటా నకిలీ, అ నుమతి లేనివిత్తనాల విక్రయం పరిపాటిగా మారింది. కొన్ని కంపెనీలు తమ విత్తనాలకు బాగా డి మాండ్ ఉండాలనే లాభాపేక్షతో క్షేత్రస్థాయి ప్రదర్శ న ఏర్పాటు చేసి రైతులను పిలిచి బిర్యాణిలు పెట్టి బాగా పండిన పత్తి పంటను చూపించి తమ విత్తనంతోనే ఇంతలా దిగుబడి వచ్చిందనే భ్రమలు కల్పిస్తున్నాయి. దీంతో రైతులు ఆ విత్తనమే కావాలంటూ డీలర్లను కోరడంతో దళారులు అధిక ధరలకు విక్రయించడం, ఏదా కల్తీవి అంటగట్టడం సా ధారణంగా మారుతోంది. ఉన్న వాటిని బ్లాక్ మా ర్కెట్కు తరలించి ధరలు పెంచి విక్రయిస్తున్నారు. మోసాలను అరికట్టేందుకు.. విత్తనాల విషయంలో దళారుల మోసాలను అరిక ట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వ్య వసాయశాఖతోపాటు పోలీసు అధికారులతో టా స్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. కానీ, నకిలీ విత్తనా ల సరఫరా, విక్రయాలను ఆశించిన స్థాయిలో టాస్క్ఫోర్స్ తగిన చర్యలు తీసుకోవడం లేదనే వి మర్శలున్నాయి. నకిలీ విత్తనాలు మార్కెట్లో ప్రవేశించి.. రైతులకు విక్రయించాక గానీ దాడులు చేయడంలేదు. వానకాలంలో విత్తనాలు విక్రయిస్తారని తెలిసినా.. ముందస్తు సమాచారంంతో దాడులు చేస్తే నకిలీ విత్తనాలను నిల్వచేసిన గోదాములను గుర్తించే వీలుంది. ప్యాకింగ్, విత్తన సేకరణ వంటి వాటిపైనా దృష్టి సారిస్తే నకిలీ విత్తనాలు మార్కెట్లోకి విడుదలకు, విక్రయాలకు ముందే అరికట్టే ఆస్కారముందని అన్నదాతలు చెబుతున్నారు. కమీషన్లకు ఆశపడి ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 2,76, 076 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు పండిస్తార ని అఽధికారులు అంచనాలు సిద్ధం చేశారు. వీటిలో 2,12,500 ఎకరాల్లో వరి, 52,500 ఎకరాల్లో పత్తి సాగుచేయనున్నారు. ఇందుకోసం 1,84,487 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని భావిస్తున్నారు. జిల్లాలో సుమారు 540 ఫెర్టిలైజర్ షాపులుండగా, అందులోని కొందరు వ్యాపారులు కమీషన్కు ఆశపడి దళారులతో చేతులు కలుపుతున్నారు. కొత్త వంగడమని చెబుతూ నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలను జిల్లాకు దిగుమతి చేసి రైతులకు అంటగడుతున్నారు. ప్రతీ వానాకాలం మాదిరిగానే ఈ సీజన్లోనూ లూస్ పత్తి సీడ్స్ విక్రయిస్తున్న తెలుస్తోంది. కొన్ని రకాల విత్తనాలు ఆకర్షణీయమైన రంగుల ప్యాకెట్లలో ప్యాక్చేసి విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఫిర్యాదు చేయండి.. దళారుల గురించి ఎవరికి, ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ వ్యాపారాలను అడ్డుకునేందుకు రైతులు ముందుకు రావాలి. అండగా టాస్క్ఫోర్స్ బృందాలు ఉన్నాయి. నకిలీ విత్తనాల విషయం తెలిసిన వెంటనే టాస్క్ఫోర్స్ అధికారులకు ఫోన్చేసి సమాచారం అందించాలి. మిగతా విషయాలు వారు చూసుకుంటారు. నకిలీ విత్తనాలు, అధిక ధరలకు విక్రయించడం వంటివి చోటుచేసుకుంటే రైతులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ● గ్రామాల్లో తిరుగుతూ తక్కువ ధరకు విత్తనాలు విక్రయిస్తామని ఎవరైనా చెబితే నమ్మకూడదు. లూస్ విత్తనాలు కొనుగోలు చేయొద్దు ● అనుమతి పొందిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలి ● విధిగా రసీదు తీసుకోలి. విత్తనసంచుల లాట్ నంబరు సరిచూసుకోవాలి ● సంచులపై క్యూఆర్కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి పూర్తివివరాలు తెలుసుకోవచ్చు. ● పంటకాలం పూర్తయ్యే వరకూ బిల్లులు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి ● నకిలీవని తేలితే కొనుగోలు చేసిన బిల్లులను వ్యవసాయశాఖ అధికారులకు చూపి సంబంధిత వ్యాపారి ద్వారా పరిహారం పొందవచ్చు. తనిఖీలు చేస్తున్నాం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశాం. జిల్లా, మండలస్థాయిల్లో దుకాణాలు, గోదాములను తనిఖీ చేస్తున్నాం. వ్యాపారులు నకిలీ, బీటీ విత్తనాలను విక్రయిస్తే చర్యలు తప్పవు. రైతులు కూడా విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి. ప్రతీకొనుగోలుకు బిల్లులో విత్తనం బ్యాచ్ నంబర్, కంపెనీ పేరు, తయారీ, ఎక్స్పైరీ తేదీలు, డీలర్ సంతకం ఉండేలా చూసుకోవాలి. – ఆదిరెడ్డి, డీఏవో ఏటా అన్నదాతకు తప్పని తిప్పలు నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ఫోర్స్ అధికారుల ముందస్తు తనిఖీలు అవగాహనతోనే నకిలీలకు అడ్డుకట్ట -
న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా అదనపు సెషన్స్ జడ్జి శ్రీనివాసరావు కోల్సిటీ(రామగుండం): ఉచిత న్యాయ సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జిల్లా అదనపు సెషన్స్ జడ్జి శ్రీనివాసరావు సూచించారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడారు. వరకట్న దురాచారం రూపుమాపడానికి, భ్రూణ హత్య లు అరికట్టడానికి, అవినీతి నిర్మూలించడానికి ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. క్షణికావేశంలోనే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని అ న్నారు. వాటి నియంత్రణకు ప్రతీఒక్కరు తమ భావోద్వేగాలను, ఆవేశాలను నియంత్రించుకోవాలని కోరారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న కే సులను త్వరగా పరిష్కరించేందుకు తాను లీ వులు ఎక్కువగా వినియోగించడం లేదని తెలిపారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మున్సిప ల్ కార్మికులు అందించిన సేవలను ప్రశంసించారు. న్యాయవాది జీవన్ గ్లోరీ మాట్లాడారు. నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, న్యాయవాదులు గుడికందుల భూమ య్య, గోలి తిరుపతిరావు, ఆర్వో ఆంజనేయు లు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా సీవోలు, ఆర్పీలు పాల్గొన్నారు. పాలిసెట్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ ధర్మారం(ధర్మపురి): పాలిసెట్ ఫలితాల్లో నందిమేడా రం గ్రామానికి చెందిన పి. సాత్విక రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు సాధించింది. ఓ ప్రైవేట్ హైస్కూల్లో టెన్త్ చదివిన సాత్విక టీజీఆర్జేసీలోనూ 2వ ర్యాంకు సాధించినట్లు కేవీఆర్ తెలిపారు. సాత్విక ను కరస్పాండెంట్ జైన సురేశ్కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ రమాదేవి అభినందించారు. -
ప్రత్యేకం!
పాలన..పనితీరు..ఉత్తీర్ణత పెంచుతూ.. ఉపాధి కల్పిస్తూ..ఒక్కో కలెక్టర్ది.. ఒక్కో ప్రత్యేకతపాలనలో తమదైన ముద్ర వేస్తున్న ఐఏఎస్లు ప్రజల్లో మమేకమవుతూ.. ముందుకెళ్తున్న జిల్లా బాస్లుచదువు ఒక్కటే సమాజాన్ని ఉన్నత స్థితికి తీ సుకెళ్తుందని గుర్తించిన జగిత్యాల కలెక్టర్గా స త్యప్రసాద్ 2024 జూన్ 16న బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జిల్లాపై తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లాగా ఏర్పడిన అనంతరం హ్యాట్రిక్గా నిలిచింది. అనంతరం కరోనాతో అట్టడుగు స్థానానికి వెళ్లింది. రాష్ట్రస్థాయిలో మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో విద్యార్థులతో ముఖాముఖీ, ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేయడంతో పాటు, ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. దీంతో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో నాల్గో స్థానంలో జగిత్యాల మళ్లీ నిలిచింది. ఎస్సీ స్టడీ సర్కిల్లో 200 మందికి ఉచితంగా కోచింగ్ ఇప్పించగా 60 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆరుగురు గ్రూప్–1 జాబ్లు సాధించారు. అవసరమైన పిల్లలకు ఉచితంగా ల్యాప్టాప్స్ అందజేశారు. కొండగట్టు జయంతోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఎండ, వాన లెక్కచేయకుండా స్వామివారి సన్నిధిలో ఉంటూ రాత్రంతా భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేస్తూ పాలనలో తనదైన మార్క్ చూపెడుతున్నారు. -
అంజన్న ఆదాయ రూ.1.51కోట్లు
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 20 నుంచి 22వరకు హనుమాన్ పెద్ద జయంతి ఉ త్సవాలు అన్ని శాఖల సమన్వయం, సహకారంతో విజయవంతమయ్యాయని ఆలయ ఈఓ శ్రీకాంత్రావు తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాలతో మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించామని పేర్కొన్నారు. స్వామివారికి లడ్డూ ప్రసాదం ద్వారా రూ.79,14,200, పులిహోర ద్వారా రూ.10,45,920, దీక్ష విరమణల ద్వారా రూ.30,56,100, కేశ ఖండనం ద్వారా రూ.8,51,450, శీఘ్ర దర్శనం ద్వారా రూ.23,04,800 మొత్తం రూ.1,51,72,470 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. సౌదీలో తెలుగు సంఘం ఏర్పాటుజగిత్యాలరూరల్: సౌదీ అరేబి యాలో తెలుగు అసోసియేషన్ ఫౌండర్ మల్లేశ్ ఆధ్వర్యంలో సాటా రియాద్ చాప్టర్ కోర్ టీంను శనివారం ప్రకటించా రు. అధ్యక్షుడిగా మచ్చ శ్రీనివా స్, వైస్ ప్రెసిడెంట్గా నూర్ మ హమ్మద్, ఇంజినీరింగ్ ప్రెసిడెంట్గా సింగు నరేష్ కుమార్, బిజినెస్ ప్రెసిడెంట్గా వీరవెల్లి యోగేశ్వరారావు, టీచర్స్ ప్రెసిడెంట్గా మురళిని ఎన్నుకున్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ కులం, మతం బేధం లేకుండా అందరం కలిసి కష్టాల్లో ఉన్నా తెలుగువారికి అన్ని విధాలా సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. కొత్తగా ఎన్నికై న కోర్ టీమ్ శహబాజ్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, నయీమ్, అయాజ్, ముజామిలోద్దీన్, ఇలియాస్, కోకిల, మంజూష మహేశ్కు అభినందనలు తెలిపారు. మల్లేశ్ మాట్లాడుతూ.. నాయకత్వం, అంకితభావంతో పనిచేస్తామని వెల్లడించారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి ● సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్రెడ్డి గోదావరిఖని: ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గదర్శి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక భాస్కర్రావుభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్ట్ నేతలను ఎన్కౌంటర్ పేరిట చంపుతూ పైచాచిక ఆనందం పొందుతోందన్నారు. మావోయిస్ట్ పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుతామని ఆ యుధాలను పక్కన పెట్టి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా.. నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం చేపట్టడం హేయమైన చర్య అన్నారు. ఇప్పటికై నా ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతిచర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆపరేషన్ కగార్ను చేపట్టిందని ధ్వజమె త్తారు. సీపీఐ జాతీయ మహాసభలు సెప్టెంబర్లో చండీగఢ్లో, తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆగస్టు లో మేడ్చల్ జిల్లాలో జరుగన్నాయని తెలిపారు. ఈలోగా పట్టణ, మండల, జిల్లా మహాసభలు పూర్తి చేయాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు శంకరన్న, తాండ్ర సదానందం, గోసిక మోహన్, గోవర్ధన్, కె.కనకరాజ్, తాళ్లపెల్లి మల్లయ్య, కొడం స్వామి తదితరులు పాల్గొన్నారు. -
మచ్చలేని నాయకుడిపై నిందలా?
పెద్దపల్లిరూరల్: మచ్చలేని నాయకుడిగా, నీతి, నిజాయతీతో రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుపై చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కుటుంబం నిందలు వేయడం మానుకోవాలని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం హితువు పలికారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సరస్వతీ పుష్కరాల ప్రచారంలో ఫ్లెక్సీపై ఎంపీ వంశీకృష్ణ ఫొటో ఏర్పాటు చేయలేదని శ్రీధర్బాబుపై అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. 30 ఏళ్ల యువకుడికి ఎంపీ టికెట్ ఇప్పించి గెలిపించిన నాయకుడిని ఎలా విమర్శిస్తారని మండిపడ్డారు. వివేక్ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించవద్దని, ఇప్పటికైనా కుల రాజకీయాలు మానుకోవాలని ఆయన హితువు పలికారు. వివేక్ పార్టీలు మారడంలో దిట్ట అని, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును ఎక్కడ కలిశావో తనకు తెలుసుని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఇష్టం ఉంటే పార్టీ కోసం పనిచేయాలని, లేకుంటే తనకు నచ్చిన పార్టీలోకి వెళ్లాలని సూచించారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మల్యాల తిరుపతి, మంథని సత్యం, కర్ణ కృష్ణ, తోకల మల్లేశ్, ఇరుగురాల మహేందర్, బూడిద శంకర్, అక్కపాక సంపత్, సాట్ల అమరజ్యోతి, పులిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశపూర్వకంగానే మంత్రి శ్రీధర్బాబుపై అక్కసు ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం విమర్శ -
క్వార్టర్ల కేటాయింపుపై సింగరేణి విజి‘లెన్స్’
● ఆర్జీ–1 ఏరియాలో కూపీలాగుతున్న అధికారులు ● పైరవీలతోనే అలాట్ చేశారని ఆరోపణలు గోదావరిఖని: సింగరేణిలో సీనియర్లకు కాకుండా అనర్హులకు క్వార్టర్లు కేటాయించారనే ఫిర్యాదులపై విజి‘లెన్స్’ ఆరా తీస్తోంది. అర్హులైన కార్మికులకు క్వార్టర్లు దక్కకుండా పైరవీకారుల సూచనలతో అనర్హులకు కేటాయించారనే ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సింగరేణి విజిలెన్స్ అధికారులు.. విచారణ వేగవంతం చేశారు. ఇటీవల ఎన్నిక్వార్టర్లు కేటాయించారు? ఎంత మందికి కౌన్సెలింగ్ ద్వారా కేటాయించారు? ఎన్నిక్వార్టర్లు పైరవీలతో కేటాయించారు? అనే అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈమేరకు శుక్రవారం ఏరియా క్వార్టర్ల కేటాయింపు ముఖ్య అధికారి చాంబర్లో విజిలెన్స్ అధికారులు సుమారు గంటపాటు కూపీలాగినట్లు తెలుస్తోంది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల పైరవీ లెటర్లతోపాటు స్థానిక కార్పొరేటర్ల ఒత్తిడి మేరకు ఏరియాలో భారీగా క్వార్టర్లు కేటాయిచారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై విజిలెన్స్కు ఫిర్యాదులు అందడంతో రహస్యంగా విచారణ చేపట్టినట్లు చర్చ జరుగుతోంది. అయితే అధికారి పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు లొంగి తాము ఇబ్బంది పడుతున్నామని అధికారులు వాపోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు నేరుగా ఎన్ని క్వార్టర్లు కేటాయించారు? దానికి పైరవీ లెటర్లు, పూర్తి వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం క్వార్టర్ల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లను వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సీనియర్లకు మొండిచేయి.. సింగరేణిలో సీనియారిటీ ప్రాతిపదికన క్వార్టర్లు కేటాయిస్తున్నారు. ప్రతీనెల లేకుంటే మూడు నెలలకోసారి కౌన్సెలింగ్ నిర్వహించి క్వార్టర్లు కేటాయిస్తున్నా రు. అయితే సీనియర్ కార్మికులు తమకు నచ్చిన క్వార్టర్ ఎంపిక చేసుకుంటే ఆ క్వార్టర్ కౌన్సెలింగ్కు రాకుండానే కేటాయిస్తున్నారని అంటున్నారు. చాలా క్వార్లర్లు ఇలాగూ కేటాయిస్తుండడంతో కార్మికులు అసంతృప్తికి లోనవుతున్నారు. విజిలెన్స్కు కూడా ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాలి కరీంనగర్: దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించి, మతసామరస్యాన్ని కాపాడాలని, ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సుగుణాకర్రావు భవన్లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వారోత్సలు నిర్వహించార. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి, అనంతర పరిణామాలు అంశంపై సీపీఎం జి ల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి అధ్యక్షతన సెమినార్ జరిగింది. వీరయ్య మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి దిగ్భ్రాంతికి గురిచేసిందని, అయితే, ఒక మతానికి వ్యతిరేకంగా మోదీ పరివారం సోషల్ మీడియాలో ప్రచారం చేసిందని, ఇది దేశ ఐక్యతను దెబ్బతీస్తుందన్నారు. కశ్మీర్ ముస్లింలే పర్యాటకులను కా పాడారని, రైల్వే, ఎయిర్పోర్టులకు ఉచితంగా పర్యాటకులను చేరవేశారన్నా రు. అదే కార్పొరేట్ శక్తులు ఎయిర్లైన్స్లో రూ.6 వేలు ఉన్న టిక్కెట్కు రూ.60 వేలకు పెంచారన్నారు. ఈ ఉగ్రదాడిలో ఒకముస్లిం హార్స్ రైడర్ చనిపోయారన్నారు. తామంతా ఒకటిగా ఉన్నామని అక్కడి ముస్లింలు నినదించిన విషయా న్ని మర్చిపోకూడదన్నారు. యుద్ధంతో ఉగ్రవాదాన్ని అణచివేసిన ఉదంతాలు ప్రపంచంలోనే లేవన్నారు. కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ వైఖరిపై మోదీ నోరు మెదపలేదన్నారు. ఉగ్రవాదుల అంతు తేల్చామని ఒకవైపు ప్రధాని చెబుతున్నారని, నేటికీ ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోలేదన్నారు. కాల్పుల విరమణ తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదని, ఉగ్రదాడి అనంతర పరిణామాలపై పార్లమెంట్లో ఎందుకు చర్చించలేదన్నారు. -
తిరుపతి ఎట్లున్నడో?
కోరుట్ల: మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ నేపథ్యంలో సెంట్రల్ మిలీషియా కమిషన్ మెంబర్.. మావోల కీలక దాడుల్లో వ్యూహకర్త.. మావోయిస్టు పార్టీలో సెకండ్ క్యాడర్లో ఉన్న కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి ఉరఫ్ దేవ్జీ ఎట్లున్నడో.. అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న క్రమంలో ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులు మృతి చెందుతున్న విషయం తెల్సిందే. అయితే ఏ ఎన్కౌంటర్లో తిప్పిరి తిరుపతి ఎక్కడన్నా ఉన్నాడోనని స్థానికులు కలవరపడుతున్నారు. ఆర్ఎస్యూ నేపథ్యమే.. కోరుట్లలోని అంబేడ్కర్నగర్కు చెందిన తిరుపతి 1983లో డిగ్రీ చదువుతున్న క్రమంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో ఏబీవీపీ, ఆర్ఎస్యూ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు సాధారణంగా జరుగుతున్న క్రమంలో పోలీసు కేసులు నమోదు అయ్యాయి. 1983 చివరలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్గా పనిచేసి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్గా, మిలీషియా దాడుల్లో వ్యూహకర్తగా సెకండ్ క్యాడర్ హోదాలో పనిచేస్తున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో తిప్పిరి తిరుపతిని దేవ్జీగా పిలుచుకుంటారు. మిలీషియా దాడులు జరిపి నిమిషాల్లో అక్కడి నుంచి తప్పించుకోవడం తిరుపతికి వెన్నతో పెట్టిన విద్యగా చెబుతారు. తిరుపతి సమీపంలోని అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి ఘటనలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 2010లో దంతెవాడ సమీపంలో సెంట్రల్ రిజర్వ్ జవాన్లపై దాడి జరిపి 74 మంది మృతి చెందిన ఘటనకు సారథ్యం వహించింది ఇతడేనని పోలీసు వర్గాలు చెబుతాయి. ఆయన తలకు ఎన్ఐఏ రూ. కోటి రివార్డు ప్రకటించినట్లు సమాచారం. ఎక్కడున్నడో ఏమో? ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో మావో యిస్టు పార్టీ రిక్రూట్మెంట్లో కీలకంగా వ్యవహరించడంతోపాటు మిలటరీ శిక్షణ కేంద్రం నిర్వహణలోనూ తిరుపతి పాలుపంచుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తిరుపతి తన స్థావరాలు మార్చుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల కొంత మంది మావోయిస్టు కీలక నేతలు పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లోకి వెళ్లి షెల్టర్ తీసుకుంటున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ భావిస్తోంది. వీరిలో తిప్పిరి తిరుపతి కూడా ఉంటాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ మూడు నెలల వ్యవధిలో వందలాది మంది మావోయిస్టులు మృతి చెందుతున్న క్రమంలో తిరుపతి ప్రస్తావన రావడం గమనార్హం. ఇటీవల మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు కోరుట్లలోని తిరుపతి ఇంటికి వెళ్లి అజ్ఞాతంలో ఉన్న అతడిని లొంగిపోయేలా చూడాలని ఆయన బంధువులను కోరడం గమనార్హం సీనియర్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ సారథి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తల వెల రూ.కోటి పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో మకాం? వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో కలవరం -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
పాలకుర్తి(రామగుండం): పుట్నూర్ గ్రామంలో టా టామ్యాజిక్ ఆటో ఢీకొని శ్రీరాముల మల్లయ్య(60) మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన టాటామ్యాజిక్ వాహనం బసంత్నగర్ వైపు వస్తుండగా మార్గమధ్యంలో పుట్నూర్ గ్రామశివారులోని గాంధీనగర్ వద్ద రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న మల్లయ్యను వెనుకనుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో మల్లయ్య తలకు తీవ్రగాయాలు కాగా వెంటనే పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సూచన మేరకు కరీంనగర్లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని సుల్తానాబాద్లో మల్లయ్య మృతిచెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు బసంత్నగర్ పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డిపేటలో గుర్తుతెలియని మహిళ..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటా పూర్ శివారులో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని మహిళను స్కూటీ బలంగా ఢీకొట్టడంతో మృతిచెందింది. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాలు.. వెంకటాపూర్లోని సిరిసిల్ల–కామారెడ్డి రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని మహిళను ఎల్లారెడ్డిపేట నుంచి సిరిసిల్లకు వెళ్లున్న స్కూటీ శుక్రవారం రాత్రి ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ మహిళను అదే గ్రామానికి చెందిన వాటర్పంపు మెకానిక్ మల్లాపురం వెంకటేశ్, అతని స్నేహితుడు మేకల మల్లయ్య సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆ మహిళ మృతి చెందింది. ఈ సంఘటనపై వెంకటేశ్, మల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ వివరించారు. బైక్ ఢీకొని వృద్ధుడు..సిరిసిల్లక్రైం: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్లో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో నర్ర బుచ్చయ్య(60) అనే వృద్ధుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి అతివేగంగా వెళ్తూ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎక్సెల్పై ప్రయాణిస్తున్న వృద్ధుడు బుచ్చయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తీసుకెళ్లగా మృతిచెందాడు. మృతికి కారణమైన పీసీ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపినట్లు స్థానికులు తెలిపారు. -
సౌరశక్తి.. అనాసక్తి
సాక్షి, పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి ఉమ్మడి జిల్లాలో స్పందన అంతంత మాత్రమే ఉంది. సౌరశక్తి ద్వారా విద్యుదుత్పత్తిని ప్రభుత్వం ప్రో త్సహించి, గృహాలు, ఆఫీస్లు, ఇతరత్రా సంస్థలు, అర్హులందరికీ రాయితీ కల్పిస్తున్నారు. అయినా ఆ యా వర్గాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రా వడం లేదు. దీనిపై సంబంధిత సంస్థల నుంచి కొరవడిన ప్రచారంతో ప్రజల్లో సరైన అవగాహన ఉండడం లేదు. అణు, థర్మల్ విద్యుదుత్పత్తితో పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. దీనిని నియంత్రించడంతోపాటు భవిష్యత్ డిమాండ్ నేపథ్యంలో సౌర విద్యుత్కు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. గృహ వినియోగదారులకు అవసరమయ్యే విద్యుత్ను వారి ఇంటిపై సౌర ఫలకలు(సోలార్ ప్యానళ్లు) ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుంటే దీర్ఘకాలికంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితం కానరావడం లేదు. 465 దరఖాస్తులకు.. ఉమ్మడి జిల్లాలో ఏప్రిల్ 30వ తేదీ నాటికి 589.4 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 465 దరఖాస్తులు రాగా, అందులో కేవలం 131మంది మాత్రమే డబ్బులు చెల్లించారు. వీరిలో 109 మంది 134.7 మెగావాట్ల రూఫ్టాప్ సోలార్ యూనిట్లను ఇళ్లపై ఏర్పాటు చేశారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాక ‘రోజుకు ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది?, ఎంత వినియోగం ఉంటుంది?, గ్రిడ్కు ఎంత వెళుతుంది?’ అనే సమాచారాన్ని ‘నెట్మీటర్’ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా మరమ్మతులు వస్తే కంపె నీ ప్రతినిధులు వచ్చి చేస్తారు. కేవలం గృహ అవసరాలకు మాత్రమే సోలార్ ప్లాంట్లు మంజూరు చేస్తారు. టీఎస్ రెడ్కో వీటిని ఏర్పాటు చేస్తుంది. రూ.కోటి నజరానా పీఎం సూర్యఘర్, ముఫ్త్, పీఎం కుసుమ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాయితీ ద్వారా సోలార్ ప్యానెళ్లను అమర్చుకునేలా ఆయా గ్రామాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రతీ జిల్లాలో 5వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన గ్రామాలను ప్రాథమికంగా ఎంపిక చేసి, ఆయా గ్రామాల్లో ఎక్కువ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా పోటీని ప్రారంభించి ఆరునెలలపాటు కొనసాగిస్తోంది. అత్యధికంగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునే గ్రామాన్ని జిల్లాస్థాయి కమిటీ ‘మోడల్ సోలార్ విలేజ్గా’ గుర్తించి రూ.కో టి ప్రోత్సాహం అందిస్తుంది. ఇందులో భాగంగా పెద్దపల్లిలో 21, జగిత్యాలలో 23 గ్రామాను ఎంపిక చేయగా, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతోంది.ఉమ్మడి జిల్లాలో సౌరశక్తి యూనిట్ల దరఖాస్తులు జిల్లా దరఖాస్తులు ఈఎండీ కెపాసిటీ (మెగావాట్లలో) జగిత్యాల 117 31 33.7 కరీంనగర్ 178 56 52.2 పెద్దపల్లి 90 13 16.8 సిరిసిల్ల 80 31 32 మొత్తం 465 131 134.7 సూర్యఘర్ పథకంపై జిల్లావాసుల్లో నిరాసక్తత రాయితీ వర్తిస్తున్నా పట్టించుకోని వైనం ఉమ్మడి జిల్లాలో 465 దరఖాస్తులకు డబ్బు చెల్లించింది 131 మందే అపోహలు వద్దు సోలార్ పవర్తో విద్యుత్ బిల్లు భారీగా తగ్గుతుంది. తొలుత పెట్టుబడి ఎక్కువగా అనిపించినా.. భవిష్యత్లో ఊహించని ప్రయోజనం చేకూరుతుంది. సోలార్ రూఫ్టాప్ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదు. – అజేయ్, డీఎం, రెడ్కో -
జిల్లాకు భారీ వర్షసూచన
పెద్దపల్లిరూరల్: రానున్న నాలుగు రోజుల్లో జిల్లా లో అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశముందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, అధికారులు అప్రమ త్తంగా ఉండాలని కోరారు. వాతావరణ శాఖ సూచనల మేరకు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండంతో జిల్లాలో ఈనెల 27వ తేదీ వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు, రైస్మిల్లుల్లో ధాన్యం నిల్వలు వర్షానికి తడవకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి ● మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి ● సీపీఐ(ఎం ఎల్) న్యూడెమోక్రసీ సహాయ కార్యదర్శి ఇ.నరేశ్ గోదావరిఖని: ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇ.నరేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్లో దాగివున్న నిజాలతో అన్నికోణాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పహల్గాం హత్యలపై పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు. ఈనెల 25న గోదావరిఖని ప్రెస్క్లబ్లో జరిగే జిల్లా సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు ఐ.కృష్ణ, ఐ.రాజేశం, గుండేటి మల్లేశం, రామకృష్ణ, ఎం.దుర్గయ్య, ఎస్.రాజన్న, కాంపెల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
● రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అవినాష్రెడ్డి, కలెక్టర్ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: పంటలకు అవసరమైన విత్తనాల కోసం వచ్చే రైతులకు నకిలీ, కల్తీ విత్తనాలను అంటగట్టేందుకు యత్నించే వ్యాపారులపై కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అవినాష్రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్లో శుక్రవారం విత్తన డీలర్లకు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ కరుణాకర్తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని, డీలర్లు సహకరించాలని ఆయన కోరారు. జిల్లాలో కనీసం 10 వేల క్వింటాళ్ల ప్రభుత్వ రంగ విత్తనాలు విక్రయించాలని ఆయన సూచించారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. ఎరువుల కొరత ఉందంటూ దుష్ప్రచారం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని, డీలర్లు స్టాక్ వివరాలను ఎప్పటికపుడు అప్డేట్ చేయాలన్నారు. సాగును రైతులు ముందస్తుగా చేపట్టాలని ఆయన సూచించారు. విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్ విష్ణువర్ధన్రెడ్డి, డీఏవో ఆదిరెడ్డి, వ్యవసాయాధికారులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు. -
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
కోల్సిటీ(రామగుండం): ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, ఇందుకోసం గర్భిణులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గోదావరిఖనిలోని సిమ్స్లో వైద్యసేవలపై శుక్రవారం కలెక్టర్ వైద్యా ధికారులతో సమీక్షించారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న గోదావరిఖని ప్రభుత్వ బోధన ఆస్పత్రిలో గర్భిణులకు మెరుగైన వైద్యసేవలందించాలని అన్నారు. తొలికాన్పులో సిజేరియన్ ఆపరేషన్లను వీలైనంత వరకు తగ్గించాలన్నారు. గర్భిణు ల ఏఎన్సీ రిజిస్ట్రేషన్ 100 శాతం పూర్తిచేయాలని ఆదేశించారు. జీజీహెచ్లో సీనియర్ వైద్యులు అందుబాటులో ఉన్నారని, కాంప్లికేటెడ్ కేసులకు సై తం మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందన్నారు. అంతర్గాం, పుట్నూరు, గోదావరిఖని, రామగుండం పరిసరాల్లో ఆశ వర్కర్ల ద్వారా జ నరల్ శాస్పత్రిలోని వసతులపై ప్రజలకు అవగా హన కల్పిస్తూ ప్రసవాలు అధికంగా జరిగేలా చూడాలని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి డబ్బులు వృథా చేసుకోకుండా అధికారు లు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి, హెచ్వోడీలు అరుణ, శ్రీదేవి, ఆర్ఎంవో రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎల్బీనగర్లో చేపట్టిన ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణాన్ని కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు. గడువులోగా భవన నిర్మాణాలు పూర్తి చేయాలనీ ఆదేశించారు. అనంతరం శారదానగర్లోని తాత్కాలికంగా చేపట్టిన ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు.సకాలంలో అన్లోడ్ చేయాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): రైస్ మిల్లుల్లో సకాలంలో ధాన్యం అన్లోడ్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పూసాల మిథీలా రైస్ మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. మిల్లుల్లో లారీలు అత్యధిక సమయం ఉండకుండా వెంటనే అన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, డీటీసీఎస్లు మహేశ్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
విజిలెన్స్ స్లో!
● శాతవాహన సిబ్బందికి మరోసారి నోటీసులు ● ఖర్చు బాధ్యులకు తాజాగా తాఖీదులు ఇవ్వనున్న విజిలెన్స్ ● గతంలో నోటీసులకు పెద్దగా స్పందించని వర్సిటీ అధికారులు ● వీసీ, సిబ్బంది మారడంతో తొలి నుంచి విచారణ ● విచారణకు ఆటంకంగా మారిన విజిలెన్స్లో సిబ్బంది కొరతసాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయంటూ గతేడాది మొదలైన విజిలెన్స్ విచారణ నత్తనడకన సాగుతోంది. ఇటీవల యూనివర్సిటీ వీసీ మారడం, కొందరు సిబ్బంది బదిలీ కావడం, పదవీ విరమణ పొందడం అదే సమయంలో విజిలెన్స్కు కూడా కొత్త ఎస్పీ రావడంతో విచారణ తిరిగి మొదటి నుంచి ప్రారంభించనున్నారని సమాచారం. వాస్తవానికి శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అభివృద్ధి పనులపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ నిధులను మంచినీళ్లలా ఖర్చు చేశారని పలువురు ఫ్రొఫెసర్లు బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో గతేడాది జూన్ 18వ తేదీన హైదరాబాద్లోని విజిలెన్స్ ప్రధాన కార్యాలయంలో కొందరు ఫిర్యాదు చేశారు. సరిగ్గా నెలరోజుల తరువాత ఈ ఫిర్యాదు కరీంనగర్ విజిలెన్స్ కార్యాలయానికి చేరింది. దాదాపు 160 పేజీలు ఉన్న ఆ ఫిర్యాదును అధ్యయనం చేసిన జిల్లా విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించినా అనుకున్న మేరకు అది సాగలేదు. వర్సిటీ అధికారులు సహకరించకపోవడం ప్రధాన కారణం అయితే, విజిలెన్స్లో స్టాఫ్ కొరత మరో ముఖ్య కారణంగా తెలుస్తోంది. మళ్లీ నోటీసులు దాదాపుగా ఏడాది కావొస్తున్నా.. విచారణలో పెద్దగా పురోగతి లేకపోవడంతో దీనిపై మరోసారి విజిలెన్స్ దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో వర్సిటీలో జరిగిన అధిక ఖర్చులపై విజిలెన్స్ చిట్టా రూపొందించింది. ముఖ్యంగా వర్సిటీ భవనాల్లో భారీగా (రూ.50 కోట్లకుపైగా) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ సమయంలో ఎవరు ఆ నిర్మాణాలకు బాధ్యలుగా ఉన్నారో గుర్తించారు. ఈ నిర్మాణాల్లోనే చాలా మట్టుకు టెండర్లలో గోల్మాల్ జరిగిందన్న విమర్శలున్నాయి. వారికి తిరిగి కొత్తగా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. కొత్తగా వచ్చిన వీసీకి కూడా జరిగిన విషయాన్ని విజిలెన్స్ అధికారులు వివరించి విచారణకు సహకరించాలని కోరారు. అదే సమయంలో విజిలెన్స్ ఎస్పీగా ఎం.శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టడంతో ఆయనకూ వివరించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ కేసు విచారణ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.వేధిస్తున్న సిబ్బంది కొరతవాస్తవానికి విజిలెన్స్ విభాగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. డాక్యుమెంటేషన్ ప్రక్రియ కోసం డీటీపీ ఆపరేటర్లనూ రిక్రూట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఇన్స్పెక్టర్ ర్యాంకుల్లో ఉన్న అధికారులే విచారణతోపాటు కేసు వివరాలను స్వయంగా డీటీపీ చేసుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి కరీంనగర్లో గతంలో గొర్రెల స్కాం, పత్తి స్కాం, ఆసరా పింఛన్ల స్కాం, సదరం సర్టిఫికెట్ల స్కాం, బల్దియాలో పనులతో పాటు ఉమ్మడి జిల్లాలో అనేక కేసులు పరిమితి సిబ్బందితో విచారణ చేయాలంటే వీరికి తలకుమించిన భారంగా మారింది. పైగా పని ఒత్తిడితో సిబ్బంది సతమతమవుతున్నారు. ఈ క్రమంలో శాతవాహన వర్సిటీ అధికారులు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విచారణ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. -
జెన్కో సీఈవో హరీశ్తో ఎమ్మెల్యే ఠాకూర్ భేటీ
గోదావరిఖని: తెలంగాణ జెన్కో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన హరీశ్ను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ శుక్రవారం హైదరాబాద్లో కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతోపాటు వివిధ అంశాలపై చర్చించారు. ప్రాజెక్టు ఏర్పాటుపై చర్యలను వేగవంతంగా పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చవచ్చని, స్థానిక అభివృద్ధికి తోడ్ప డేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ వివరించారు. విద్యార్థుల భవిష్యత్ను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి పెద్దపల్లిరూరల్/జ్యోతినగర్/సుల్తానాబాద్రూరల్: విద్యార్థుల భవిష్యత్కు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య సూచించారు. పెద్దపల్లి జెడ్పీహై స్కూల్, ఎన్టీపీసీ జెడ్పీహై స్కూల్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, తెలుగు భాషా పండితులు, సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మోడ ల్ స్కూల్లో ఆంగ్లం, ప్రధానోపాధ్యాయులు, ఎస్జీటీల శిక్షణ శిబిరాలను శుక్రవారం ఆయ న సందర్శించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం గుణాత్మక విద్య అందించాలని ఆయన ఉపా ధ్యాయులకు సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగం శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కేజీబీవి ప్రత్యేకాధికారులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్తోపాటు కోర్సు డైరెక్టర్ జయరాజు, ఎంఈవో చంద్రయ్య, రిసోర్స్పర్సన్స్ ఆగయ్య, రాగమణి, భవాని, పురుషోత్తం, టెక్నికల్ పర్సన్ దినేశ్తోపాటు సుల్తానాబాద్ ఎంఈవో రాజయ్య, ప్రోగ్రాం అబ్జర్వర్ ప్రద్యుమ్నకుమార్, రిసోర్స్ పర్సన్స్ జగదీశ్వర్, శ్రీనివాస్, నాగరాజు, అనిల్ తదితరులు ఉన్నారు. శిక్షణలో నేర్చుకున్నది అమలు చేయాలి సుల్తానాబాద్రూరల్: శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయడం ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం మెరుగుపడు తుందని స్టేట్ రిసోర్స్ పర్సన్ ప్రవీణ్ అన్నారు. గర్రెపల్లి జెడ్పీ హెచ్ఎస్లో శుక్రవారం జీవశాస్త్రం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. స్టేట్ రిసోర్స్ పర్సన్ హాజరై శిక్షణ తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వి ద్యార్థుల సామర్థ్యాలను బట్టి ఉపాధ్యాయులు విద్యా బోధన చేయాలని, తద్వారా విద్యార్థు ల్లో ఆసక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ కవిత, రిసోర్స్ పర్సన్స్ నరేశ్, కుమార్, సాధన, ప్రత్యక్ష, సీఆర్పీలు లక్ష్మీనారాయణ, కిరణ్కుమార్, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.ధ్యానంతో ఏకాగ్రత జ్యోతినగర్(రామగుండం): ధ్యానంతో ఏకాగ్రత లభిస్తుందని హార్ట్పుల్నెస్ మెడిటేషన్ సంస్థ ఇన్చార్జి అహ్మద్ పాషా, ట్రైనర్స్ స్వామి, శ్రీనివాస్, నరసింహారెడ్డి అన్నారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ధ్యానం సాధన ద్వారా మానసిక ప్రవాంతత చేకూరుతుందని తెలిపారు. వలంటీర్టు మహర్షి, రవి, మల్లయ్య, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
జై జవాన్.. జై భారత్.. త్రివర్ణశోభితం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రం శుక్రవారం త్రివర్ణశోభితమైంది. సిటిజన్ ఫర్ నేషన్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో జరిగిన తిరంగా ర్యాలీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గు జ్జుల రామకృష్ణారెడ్డి, కాశిపేట లింగయ్యతోపాటు వ్యాపార, వాణిజ్యవేత్తలు, అధికారులు, అన్నివర్గాల ప్రజలు పాల్గొన్నారు. పహల్గాం దాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు గట్టిబుద్ధి చెప్పిన వీరజవాన్లకు మద్దతునిస్తున్నామని ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద మొదలైన తిరంగా ర్యాలీ పలు ప్రధాన ప్రాంతాల్లో కొనసాగింది. అతిథులు జాతీయ జెండాలను చేతబూని భారత్ మాతాకీ జై.. జై జవాన్.. జై కిసాన్ అని నినాదాలు చేశారు. కశ్మీర్లో ఉగ్రవాద దాడికి తెగబడ్డ పాకిస్తాన్కు భారత జవాన్లు గట్టి గుణపాఠం చెప్పారని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు రా మకృష్ణారెడ్డి, లింగయ్య, నాయకులు కందుల సంధ్యారాణి, ఠాకూర్ రాంసింగ్, కన్నం అంజయ్య, వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాజేందర్, సదానందం, సమ్మ య్య, జంగ చక్రధర్రెడ్డి, క్రాంతికుమార్, శివంగారి సతీశ్, దిలీప్, మంథెన కృష్ణ, తూడి రవి, మిట్టపల్లి వెంకటేశం, సంతోష్, శ్రీకాంత్, నరేశ్ తదితరులు ఉన్నారు. జిల్లా కేంద్రంలో తిరంగా యాత్ర హాజరైన ఎమ్మెల్సీ మల్క కొమురయ్య -
వైఎస్సార్ స్ఫూర్తితోనే సహకార సంఘాలు బలోపేతం
● కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు సుల్తానాబాద్(పెద్దపల్లి): దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితోనే సహకార సంఘాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని కేడీసీసీబీ, టెస్కా బ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం కేడీసీసీబీ బ్రాంచ్ను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో కొండూరు మాట్లాడారు. వైఎస్సార్ హయాంలో నష్టాల్లోని సహకార సంఘాలను ఆదుకునేందుకు రూ.15వేల కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 33 బ్రాంచ్లు కొనసాగుతున్నాయని, 2025లో రూ.75 వేల కోట్ల వ్యాపారం సాగుతోందని, ఇది దేశంలో అగ్రస్థానమని ఆయన అన్నారు. రైతులే యజమానులుగా ఉన్న ఏకై క సంఘం కేడీసీసీబీ అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే విజరమణారావు మాట్లాడుతూ, రైతుల బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బు లు జమచేయడంలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సూచనతో అప్పటి మంత్రి శ్రీధర్బాబు కరీంనగర్ జిల్లాలో సింగిల్విండోలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అప్పగించారని, ఇందుకోసం రూ.2 కోట్ల 50 లక్షలు కేటాయించారని అన్నారు. తద్వారా రైతుల కష్టాలు గట్టెక్కి ధాన్యాన్ని అమ్ముకోవడం సులభతరమైందని అన్నారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పాలన కొనసాగించడంతోనే ప్రజల మన్ననలు పొందవచ్చని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మోహన్రెడ్డి, ప్రతినిధులు పింగిలి రమేశ్, శ్రీగిరి శ్రీనివాస్, సత్యనారాయణరావు, మొహమ్మద్ నియాజ్, అంతటి అన్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్రావు, దేవరానేని మోహన్రావు, గోపాల్రావు, శ్రీమాల, జూపల్లి సందీప్రావు, కోట వీణ, గడ్డం మహిపాల్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, బ్రహ్మానందంరావు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించండి
గోదావరిఖని(రామగుండం): సింగరేణి గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలని గురువారం హైదరాబాద్లో సంస్థ సీఎండీ ఎన్.బలరాంకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ వినతిపత్రం అందజేశారు. బెల్లంపల్లి, రామగుండం రీజియన్లోని కార్మిక కుటుంబాలకు ఏరియా ఆస్పత్రి కీలకంగా మారిందన్నారు. ఈనేపథ్యంలో సూపర్స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారని వివరించారు. శాశ్వత ప్రతిపాదికన న్యూరో ఫిజిషియన్, పిడియాట్రిషియన్, ఈఎన్టీ స్పెషలిస్ట్, ఆప్తామాలజిస్ట్, అదనపు ఫిజీషియన్ను నియమించాలన్నారు. అలాగే టూడీ ఈకో, టీఎంటీ టెక్నీషియన్, ఆపరేటర్ నియమించాలని, డయాలసిస్ యూనిట్ విస్తరించాలని కోరారు. ఇందుకు సీఎండీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
భాగ్యరెడ్డివర్మ సేవలు చిరస్మరణీయం
● రామగుండం సీపీ అంబర్కిషోర్ఝా గోదావరిఖని(రామగుండం): భాగ్యరెడ్డివర్మ సేవలు చిరస్మరణీయమని రామగుండం సీపీ అంబర్కిషోర్ఝా అన్నారు. గురువారం భాగ్యరెడ్డివర్మ జయంతిని కమిషనరేట్ మీటింగ్హాల్లో నిర్వహించారు. ఈసందర్భంగా వర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ, భాగ్యరెడ్డివర్మ హైదరాబాద్ సంస్థానంలో సంఘ సంస్కరణకు కృషి చేసిన మహానీయుడన్నారు. ఆంధ్రసభ స్థాపకుడిగా హైదరాబాద్లో దళిత పాఠశాలను ప్రారంభించి, దళితుల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. అడిషనల్ డీసీపీ రాజు, స్పెషల్బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షం.. తడిసిన ధాన్యం
పెద్దపల్లిరూరల్/మంథని/జూలపల్లి/సుల్తానాబాద్/రామగుండం/పాలకుర్తి/యైటింక్లయిన్కాలనీ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. జిల్లాకేంద్రంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. మంథనిలోని లోతట్టు ప్రాంతాల రోడ్ల వెంట వరద పారింది. జూలపల్లి మండలంలోని పలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. రామగుండం పట్టణంలోని పలు కాలనీల్లోకి నీరు చేరింది. పాలకుర్తి మండలం బసంత్నగర్ పంచాయతీ భవనం పక్కన చెట్టు ఈదురుగాలులకు నేలకూలింది. రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీలో రోడ్లు జలమయమయ్యాయి. -
అప్రమత్తతతోనే కరోనా దూరం
● పౌష్టికాహారం తీసుకోవాలి ● తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి ● రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం మేలు ● ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో డీఎంహెచ్వో అన్నప్రసన్నకుమారి పెద్దపల్లిరూరల్: ‘రాష్ట్రంలో ఇప్పటివరకు ‘కరోనా’ వైరస్ లక్షణాలు కనిపించకపోయినా.. పొరుగున ఉన్న మహారాష్ట్రతో ముప్పు పొంచి ఉంది. అందుకే జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ రోగనిరోధకశక్తిని పెంచే పోషక విలువలున్న ఆహారపదార్థాలను తీసుకోవాలి’ అని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్నప్రసన్నకుమారి అన్నారు. చైనా, హాంకాంగ్, బర్మా, టిబెట్ తదితర దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. మన దేశంలోని కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందుతోందని డీఎంహెచ్వో పేర్కొన్నారు. గురువారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా ప్రజల సందేహాలకు సమాధానాలిచ్చారు. -
పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలి
సుల్తానాబాద్రూరల్/ఓదెల: ఎస్సారెస్పీ కాలువలో పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. గురువారం సుల్తానాబాద్ మండలం సుద్దాల, ఓదెల మండల శివారులో ఉపాధి హామీలో చేపట్టిన కాలువల పూడికతీత పనులను పరిశీలించారు. వానాకాలంలోగా మెయిన్, డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు పూర్తి చేయాలని సూచించారు. అంతకుముందు ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. డీఆర్డీఏ పీడీ కాళిందిని, ఎంపీడీవోలు దివ్యదర్శన్రావు, తిరుపతి, ఎంపీవో షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలుపెద్దపల్లిరూరల్: జిల్లాలో గురువారం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని నోడల్ అధికారి కల్పన తెలిపారు. పరీక్షలకు 1,124 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 1,063 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 61మంది హాజరుకాలేదని వివరించారు. ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తిగోదావరిఖని(రామగుండం): జిల్లాలో బుధవారం రాత్రి నుంచి కురిసిన వర్షాలతో రామగుండం రీజియన్లోని ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–5 ఓసీపీ, ఆర్జీ–2 ఏరియాలోని ఓసీపీ–3, ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ–1,2లో ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ‘ఎల్లంపల్లి’కి స్వల్ప ఇన్ఫ్లోరామగుండం: రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్ఫ్లో ప్రారంభమైంది. గురువారం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.98 టీఎంసీలు ఉండగా, గతేడాది ఇదే రోజు కేవలం 5.52 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 1,114 క్యూసెక్కులు కాగా, హైదరాబాద్ మెట్రో 331, పెద్దపల్లి–రామగుండం మిషన్ భగీరథ 58, మంచిర్యాల 23, ఆవిరయ్యే నీరు 174 మొత్తం 586 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉంది. గతేడాది ఈ సమయంలో ఏలాంటి ఔట్ఫ్లో లేదు. ఆయిల్పాం సాగుతో అధిక లాభాలుముత్తారం: ఆయిల్పాం సాగుతో రైతులకు అధిక దిగుబడులు వస్తాయని ఐఐఓపీఆర్ ప్రధాన శాస్త్రవేత డాక్టర్ రామచంద్రుడు పేర్కొన్నారు. గురువారం ముత్తారం రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. దేశంలో ఆయిల్పాం కంటే ఏ ఇతర పంటలకు డిమాండ్ లేదని తెలిపారు. అంతర పంటలుగా బొప్పాయి, మునగ, అల్లం తదితర వాటితో లాభాలు పొందవచ్చన్నారు. ఆయిల్పాం చెట్టు నుంచి వచ్చే వ్యర్థాలు మళ్లీ పంటలకు ఉపయోగపడుతాయని వివరించారు. నీటాఫామ్ డీజీఎం సుబ్బారావు మాట్లాడుతూ, ఆయిల్పాం సాగులో బిందుసేద్యంతో నీటి ఆదా అవుతుందనన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఈ ఏడాదికి 2,500 ఎకరాల్లో ఆయిల్పాం సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అనంతరం ముత్తారంలోని ఆయిల్పామ్ పంటలను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పీఏసీఎస్ చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, కృషి విజ్ఞానిక కేంద్రం రామగిరి శాస్త్రవేత్త భాస్కర్రావు, ఉద్యానశాఖ అధికారి ఎ.జ్యోతి, ఏడీఏ అంజని, ఏవో అనూష, తిరుమల ఆయిల్పాం కంపెనీ సీఈవో కళ్యాణ్కర్, ఫీల్డ్ ఆఫీసర్ అజయ్, రంజిత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మార్పులకనుగుణంగా బోధించాలి
జ్యోతినగర్(రామగుండం): విద్యా విధానంలో వస్తున్న నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు విద్యా బోధన చేయాలని స్టేట్ అబ్జర్వర్ ఎన్వీ దుర్గాప్రసాద్ అన్నారు. ఎన్టీపీసీ రామగుండం టీటీఎస్ జెడ్పీ హైస్కూల్లో మూడు రోజులుగా జిల్లాలోని 14 మండలాలకు చెందిన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని గురువారం సందర్శించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. శిక్షణలో హెచ్ఎంలు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, కోర్సు డైరెక్టర్ జయరాజు, ఎంఈవో చంద్రయ్య, రిసోర్స్పర్సన్స్ ఆగయ్య, రాగమణి, భవాని, పురుషోత్తం, టెక్నికల్ పర్సన్ దినేశ్, సీఆర్పీలు వెంకటేశ్, రామ్కుమార్ పాల్గొన్నారు. అభ్యసన సామర్థ్యాలను వెలికి తీయాలిసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): శిక్షణ నైపుణ్యంతో ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని అభ్యసన సామర్థ్యాలను వెలికి తీయాలని రాష్ట్ర పరిశీలకుడు దుర్గాప్రసాద్ అన్నారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జెడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం జరుగుతుండగా గురువారం జిల్లా సెక్టోరల్ అధికారి కవితతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు. రిసోర్స్ పర్సన్స్ నరేశ్, కుమార్, సాధన, ప్రత్యక్ష ఉన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలిపాలకుర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని రాష్ట్ర పరిశీలకుడు దుర్గాప్రసాద్ సూచించారు. పాలకుర్తి మండలం బసంత్నగర్ జెడ్పీ పాఠశాలలో వేసవి శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. -
ఉత్తమ ర్యాంక్ వచ్చేనా
● స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల ప్రకటనపై ఉత్కంఠ ● రామగుండం బల్దియాలో ఇప్పటికే పూర్తయిన క్యూసీఐ బృందం పరిశీలనకోల్సిటీ(రామగుండం): కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశంలోని ప ట్టణాలు, నగరాలు, మహానగరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం కోసం ఏటా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక క్యూసీఐ బృందం పోటీ చేస్తున్న పట్టణాలు, నగరాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆన్లైన్లో మార్కులు వేస్తా రు. ఈ మార్కుల ఆధారంగానే దేశంలోని మున్సి పాలిటీలకు కేంద్రం స్వచ్ఛత ర్యాంకులను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా బల్దియా కూడా ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2024’ పోటీలో నిలబడింది. ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన క్యూ సీఐ బృందం ప్రతినిధులు క్షేత్రస్థాయిలో రామగుండంలో స్వచ్ఛతపై పరిశీలన పూర్తి చేశారు. రామగుండంకు ఈసారి మెరుగైన ర్యాంక్ వస్తుందనే ఆశతో అధికారులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కా గా, త్వరలోనే స్వచ్ఛత ర్యాంకులను ప్రకటించడాని కి కేంద్రం జాబితాను రూపొందిస్తుందని సమాచారం. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్.. రామగుండం నగరపాలక సంస్థకు ప్రస్తుతం ఓడీఎఫ్ ప్లస్ (బహిరంగ మలవిసర్జన రహితం) గుర్తింపు మాత్రమే ఉంది. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ గుర్తింపు కోసం ఇటీవల కేంద్రానికి బల్దియా అధికారులు దరఖాస్తు చేశారు. రామగుండంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) పూర్తయినా వినియోగంలోకి రాలేదు. అయితే స్థానిక మల్కాపూర్ శివారులో నిర్మించిన ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (మానవ వ్యర్థాల నిర్వహణ కేంద్రం– ఎఫ్ఎస్టీపీ) వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో ఓడీఎఫ్ ప్లస్ప్లస్ గుర్తింపు వస్తుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. మొక్కుబడిగా తడి, పొడి.. రామగుండం బల్దియాలో ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం మొక్కుబడిగా సాగుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సేంద్రియ ఎరువుల తయారీ ప్రక్రియ కూడా నామమాత్రంగా జరుగుతోంది. కాగా, పారిశుధ్యాన్ని గాడిలో పెట్టడానికి ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్తోపాటు బల్దియా స్పెషలాఫీసర్గా కలెక్టర్ కోయ శ్రీహర్ష, కమిషనర్గా వ్యవహరిస్తున్న అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలతోనైనా రామగుండంకు మంచి ర్యాంకు వస్తుందా అనేదానిపై ఉత్కంఠ ఏర్పడింది. కార్పొరేషన్ ప్రొఫైల్.. మొత్తం డివిజన్లు: 50 విస్తీర్ణం: 93.87 చదరపు కిలోమీటర్లు జనాభా(2011 లెక్కల ప్రకారం) : 2,29,644 మురికివాడలు: 71 అసెస్మెంట్ల ప్రకారం గృహాలు: 50,956 శానిటేషన్ కార్మికులు: 448 రోజూ వెలువడే చెత్త: 120 మెట్రిక్ టన్నులుస్వచ్ఛ సర్వేక్షణ్లో వచ్చిన ర్యాంక్లు ఏడాది ర్యాంకు 2023 1752022 1362021 92 2020 211 2019 192 2018 194 2017 191 -
సిటిజన్ ఫీడ్ బ్యాక్లో ‘రామగుండం’ ప్రతిభ
గోదావరిఖని/రామగుండం: క్యూఆర్ కోడ్ సిటిజన్ ఫీడ్ బ్యాక్లో రామగుండం పోలీస్కమిషనరేట్ రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. ప్రజలు, బాధితులు, ఫిర్యాదు దారులకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్స్టేషన్లలోని సి బ్బంది గురించి ప్రజలేమనుకుంటున్నారు? పోలీస్స్టేషన్లలో సరైన ఆదరణ, సేవలు లభిస్తున్నాయా? ఫిర్యాదుదారులతో సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నా రు? తదితర విషయాలు తెలుసుకోవడం కోసం క్యూఆర్ కోడ్ను రూపొందించారు. క్యూఆర్కోడ్ అండ్ సీఎఫ్సీద్వారా పోలీసు సేవలపై ప్రజల నుంచి వచ్చిన మొత్తం అభిప్రాయాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 యూనిట్లను ఎంపిక చేశారు. దీనిలో రామగుండం పోలీస్కమిషనరేట్ మూడోస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కమిషనరేట్ తరఫున మంచిర్యాల డీసీపీ భాస్కర్, అంతర్గాం ఠాణా ఎస్సై బోయ వెంకటస్వామి బుధవారం డీజీపీ జితేందర్ నుంచి ప్రశంసాపత్రాలు అందుకున్నారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పోలీసులను అభినందించారు. పోలీసుల పనితీరుపై క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు అందజేయాలని సీపీ కోరారు. -
‘కరోనా’ వైరస్ కట్టడి ఎలా?
● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి తో ‘సాక్షి’ ఫోన్ఇన్ పెద్దపల్లిరూరల్: కరోనా వైరస్ మళ్లీ పొరుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తోందనే సమాచారంతో జిల్లా ప్రజలు కలవరపడుతున్నారు. అయితే, కరోనా వైరస్ను కట్టడి చేసేలా పాటించాల్సిన పద్ధతులు తెలుసుకునేందుకు వీలుగా ‘సాక్షి’ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారితో గురువారం ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లావాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. సంప్రదించాల్సిన ఫోన్నంబరు : 99635 85515 తేదీ: 22–05–2025 (గురువారం) సమయం : ఉదయం 10.00 గంటల నుంచి ఉదయం : 11గంటల వరకు -
మురుగునీటి కాలువలు శుభ్రం
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగుండం కా ర్పొరేషన్ 19వ డివిజన్ న్యూమారేడుపాకలో డ్రెయి నేజీల్లోని పూడికను బుధవా రం బల్దియా సిబ్బంది తొలగించారు. సైడ్ డ్రెయినేజీలు లేక, బురద, వర్షపు, మురుగునీరు నిలిచి దు ర్వాసన వస్తోందనే స్థానికుల ఆవేదనపై ‘కంపుకొడుతున్న కాలువలు’ శీర్షికన ఈనెల 20న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో బల్దియా అధికారులు స్పందించారు. సూపర్వైజర్ సార య్య ఆధ్వర్యంలో సిబ్బంది కాలువలు శుభ్రం చేశారు. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాట్నపల్లి గ్రామంలో సర్వే సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): జాతీయ గు ణాంక కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) ఆధ్వ ర్యంలోని కరీంనగర్ సర్వే బృందం కాట్నపల్లిలో బుధవారం సర్వే చేసింది. ఆరోగ్యం, అక్షరాస్యత, సాంఘిక, ఆర్థిక అంశాలపై సభ్యులు ఇంటింటా తిరిగి వివరాలు సేకరించారు. గ్రా మాలు, పట్టణాల్లో ప్రజల ఆరోగ్యం, విద్య సా మజిక, ఆర్థిక పరిస్థితులను తెలుకోవడమే సర్వే ముఖ్య ఉద్దేశమని సభ్యులు తెలిపారు. బృందంలోని సభ్యులు బ్రిజేందరసింగ్, శ్రీని వాసరావు, సుధాకర్, శ్రీనాథ్ పాల్గొన్నారు. బడుల బలోపేతానికి కృషి జ్యోతినగర్(రామగుండం): ప్రభుత్వ పాఠశాల ల బలోపేతానికి కృషి చేయాలని జిల్లా విద్యాధికారి మాధవి సూచించారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో జిల్లాలోని 14 మండలాల ఉన్న త పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేకాధికారులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపా ల్స్తో ‘పాఠశాలల నిర్వహణ, నాయకత్వ లక్ష ణాలు’ అంశంపై చేపట్టిన శిక్షణకు బుధవారం ఆమె హాజరై మాట్లాడారు. పాఠశాలల నిర్వహణ, నైపుణ్యాలను అలవార్చుకోవాలని సూ చించారు. విద్యార్థులు సబ్జెక్టుల్లో అభ్యాసన ఫ లితాలు సాధించేలా, విద్యావ్యవస్థలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా బోధన జరిగేలా ప్రధానోపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. కోర్సు డైరెక్టర్ జి.జయరాజు, రిసోర్స్ పర్సన్లు ఆగయ్య, రాగమయి, భవాని, పురుషోత్తం, టెక్నికల్ పర్సన్ దినేశ్, సీఆర్పీ వెంకటేశ్, రామ్కుమార్, హెచ్ఎంలు పాల్గొన్నారు. బొడ్రాయి వార్షికోత్సవం కమాన్పూర్: భూదేవి, శ్రీదేవి సహిత బోడ్రా యి విగ్రహ ప్రతిష్ఠాపన చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఘనంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రత్యక పూజలు చేశారు. 23న తిరంగా యాత్ర సుల్తానాబాద్(పెద్దపల్లి): బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 23న జిల్లా కేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా ప్రధాన కా ర్యదర్శి కడారి అశోక్రావు తెలిపారు. హిందువులనే టార్గెట్గా చేసి ఉగ్రవాదులు కిరాతక చర్యలకు పాల్పడడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన పేర్కొన్నారు. వసతులు మెరుగుపర్చాలి పెద్దపల్లిరూర ల్: ప్రభుత్వ పా ఠశాలల్లో వసతులు మె రుగు పర్చే లా చర్యలు తీసుకోవాలని జార్జిరెడ్డి పీడీఎస్యూ జిల్లా అ ధ్యక్షుడు నరేశ్ కోరారు. బుధవారం డీఈవో ఆ ఫీసులో వినతిపత్రం అందజేశారు. శివ, రాకేశ్, సాయికుమార్, విష్ణు, సంజయ్ పాల్గొన్నారు. -
పెద్దపల్లి
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 20257‘కొత్తపల్లికి చెందిన ఓ విద్యార్థికి ఆర్ట్స్ గ్రూపు అంటే ఇష్టం. చిన్నతనం నుంచే సోషల్ సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించాడు. గ్రూప్స్ రాయాలనేది అతని కోరిక. పది పూర్తయ్యాక ఆర్ట్స్ గ్రూపులో చేరాలనుకున్నాడు. ఇంట్లో పెద్దల బలవంతంతో ఎంపీసీలో చేరాడు. అతను చదువలేక ఫెయిలయ్యాడు.’ ‘లింగన్నపేటకు చెందిన మరో విద్యార్థికి సీఏ చేయాలన్నది కోరిక. పది పూర్తయ్యాక ఎంఈసీలో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులేమో కొడుకును ఇంజినీర్గా చూడాలనుకున్నారు. బలవంతంగా ఎంపీసీలో చేర్పించారు. అయిష్టంతో చదివిన అతను పాస్మార్కులతో గట్టెక్కాడు. ఇంజినీరింగ్లో సీటు రాకపోవడంతో డిగ్రీలో ఆర్ట్స్ చదువుతున్నాడు.నా కొడుకును ఇంజినీర్గా చూడాలి.. డాక్టర్ను చేయాలి.. సీఏ చదివించి బాగా సంపాదించాలి... ఇలా తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దుతున్నారే తప్ప.. పిల్లల ఇష్టాలు.. అభీష్టాలు ఏంటి.. అని ఆలోచించే వారు కరువయ్యారు. సాఫ్ట్వేర్గా.. డాక్టర్గా బోలెడంతా డబ్బు సంపాదించాలనే ధ్యాసతోనే పదోతరగతి పాసైన తమ పిల్లలను ఎంపీసీ, బైపీసీలో చేర్పిస్తున్న తల్లిదండ్రులే ఎక్కువ ఉన్నారు. అసలు వారికి ఏ సబ్జెక్టుపై మక్కువ ఉందో తెలుసుకోవడం లేదు. తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో చేరి.. సబ్జెక్టులు అర్థంకాక.. కార్పొరేట్ కాలేజీల్లో ఒత్తిడి భరించలేక చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు ఇంటర్ ఫెయిల్ అయి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారు. ప్రస్తుతం పదో తరగతి ఫలితాలు వెలువడడంతో ఇంటర్లో ప్రవేశాలు తీసుకుంటున్నారు. అసలు పిల్లలకు ఏ సబ్జెక్టులు అంటే ఇష్టమో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఏ గ్రూప్లో చేరాలో నిర్ణయం తీసుకోవాల్సిన స్వేచ్ఛ ఇస్తేనే వారు ఎంచుకున్న సబ్జెక్టులో ఉత్తమ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు ఇష్టమైన సబ్జెక్టులను బలవంతంగా రుద్దడం కాకుండా.. వారికి ఇష్టమున్న సబ్జెక్టులను చదివేలా చూడాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. – వివరాలు 8లోuన్యూస్రీల్ -
టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్దే
● ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్/పెద్దపల్లిరూరల్(పెద్దపల్లి): టెక్నాలజీ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్గాంధీకే దక్కిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలుక సతీశ్, పట్టణ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ పట్ట ణ అధ్యక్షుడు బి.సురేశ్గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాజీవ్గాంధీ వర్ధంతి కార్యక్రమంలో నాయకులు బొంకూరి అవినాష్, ఈర్ల స్వరూప, మల్లయ్య, సంపత్, శ్రీకాంత్, అమ్రేశ్, సుభాష్రావు, అక్బర్అలీ, మస్రత్, శ్రీనివాస్, శ్యాంసుందర్, దేవరాజ్ పాల్గొన్నారు. ప్రజల సౌకర్యం కోసమే మార్కెట్ పెద్దపల్లిరూరల్/జూలపల్లి: పట్టణంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ను రూ.4కోట్ల 20లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. జెండా కూడలిలోని కూరగాయల మార్కెట్ను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ సతీశ్తో కలిసి ఆయన పరిశీలించారు. అదేవిధంగా జూలపల్లి హుస్సేన్మియావాగుపై చేపట్టిన హైలెవల్ వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. -
మావోళ్లు ఎలా ఉన్నరో?
● దండకారణ్యంలో జిల్లావాసులే కీలకం ● పెరిగిన నిర్బంధం.. జోరందుకున్న ‘కగార్’ ఆపరేషన్ ● వరుస ఎన్కౌంటర్లతో నక్సల్స్ ఉక్కిరిబిక్కిరి ● తమవారి క్షేమ సమాచారంపై కుటుంబసభ్యుల్లో ఆందోళనసాక్షి, పెద్దపల్లి: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వారికి కంచుకోట అయి న ఛత్తీస్గఢ్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో నెత్తురోడుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో కేంద్ర బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకుంటున్న ఎదురుకాల్పుల్లో సుమారు 300మందికి పైగా మా వోయిస్టులు మృతిచెందారు. ప్రభుత్వ దూకుడు, పె రుగుతున్న నిర్బంధం, వరుస ఎన్కౌంటర్లతో ఎ ప్పుడు ఏం జరుగుతుందోనని అజ్ఞాత మావోయి స్టు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తాజా గా మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతిచెందడంతో జిల్లా నేతల క్షేమసమాచారంపై బంధువుల్లో ఆందోళన నెలకొంది. భయపెడుతున్న ఘటనలు మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ఛత్తీస్గఢ్లో దూ సుకుపోతున్న భద్రతాదళాలకు మనజిల్లాకు చెంది న నేతలు కొరకరాని కొయ్యలా మారారు. కేంద్ర కమిటీతోపాటు వివిధ కీలక స్థానాల్లో మన జిల్లావా సులు దండాకారణ్యంలో కార్యకలాపాలు కొనసాగి స్తున్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా జనతన స ర్కార్ను స్థాపించారు. అయితే, మావోయిస్టుల విస్తరణకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో 2009తో ఆపరేషన్ గ్రీన్హంట్ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. అప్పటినుంచి దేశవ్యాప్తంగా ముమ్మరంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ సాగిస్తోంది. తాజాగా ప్రభు త్వం ఆపరేషన్ కగార్ను ప్రారంభించింది. సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్జీ, సీ–60, ఎస్వోజీ, స్పెషల్ టాస్క్ఫోర్స్ పేరుతో అడవులను జల్లెడ పడుతున్నా యి. దీంతో ఏడాదిన్నర కాలంలోనే 300 మందికిపైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతిచెందా రు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు ఉన్నట్లు ప్రచారం జరిగినా త్రుటిలో తప్పించుకుంటున్నారు. ఇటీవల జూలపల్లికి చెందిన పుల్లూరి ప్రసాద్రావు ఉరఫ్ చంద్రన్న మృతిచెందారని ప్రచారం జరిగినా ఇంకా నిర్ధారణ కాలేదు. జిల్లావాసులే కీలకం పెద్దపల్లి జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి, జాలపల్లి మండలం వడ్కా పూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాద్రావు ఉరఫ్ చంద్రన్న, పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాలరావు ఉరఫ్ భూపతి, జూలపల్లి మండలం వెంకట్రాపుపల్లికి చెందిన దీకొండ శంకర్, పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన గంకిడి సత్యనారాయణరెడ్డి ఉరఫ్ విజయ్, పాలితం గ్రానికి చెందిన అలేటి రామలచ్చులు, రామగుండం మండలానికి చెందిన అప్పాసి నారాయణ ఉరఫ్ రమేశ్, గోపయ్యపల్లికి చెందిన దళ కమాండర్ దాతు ఐలయ్య, సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన జువ్వాడి వెంకటేశ్వర్రావు, మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన మల్ల రాజిరెడ్డి ఉరఫ్ మీసాల రాజన్న తదితరులు ఉన్నారు. ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి ఎన్కౌంటర్ జరిగినా ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంటోంది. -
ఉపాధిహామీని సద్వినియోగం చేసుకోండి
● అర్హులకే రాజీవ్ యువవికాసం యూనిట్లు ● కాలువలో పూడికతీత పనులు చేపట్టాలి ● అధికారులకు కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలు పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఉపాధిహామీ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో బుధ వారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. జాబ్కార్డులు పొందిన కూలీలకు పనులు కల్పించాలన్నారు. జిల్లాలో ని సాగునీటి కాలువలు, నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని అన్నారు. చెత్త, పిచ్చిమొక్కలను తొలగించాలని పేర్కొన్నారు. రాజీవ్ యువవికాసం పథకం కింద స్వయం ఉపాధి యూనిట్లను జూన్ 2 నాటికి అందిస్తామని ఆయన తెలిపారు. అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతో తుదిజాబితా సిద్ధం చేయాలని అన్నారు. డీఆర్డీవో కాళిందిని, సీఈవో నరేందర్ తదితరులు పాల్గొన్నారు. వైద్యులకు కలెక్టర్ అభినందన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తున్న వైద్యబృందంతోపాటు సూపరింటెండెంట్ శ్రీధర్ను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. గర్భసంచిలోని గడ్డను శస్త్రచికిత్స ద్వారా వైద్యులు ఇటీవల తొలగించారు. ఇలా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కష్టతరమైన వైద్యసేవలను అందించడంతోపాటు శస్త్రచికిత్సలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
పేదల చుట్టం భూ భారతి
పెద్దల చట్టం ధరణి.. ● మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● ముప్పిరితోటలో భూ భారతి చట్టంపై సదస్సు సాక్షి, పెద్దపల్లి: పెద్దల చట్టం ధరణి అయితే.. పేదల చుట్టంగా భూ భారతి పోర్టల్ను తీసుకోచ్చామని, కోర్టులో లేనిప్రతీ భూసమస్యను పరిష్కరించడమే భూ భారతి ముఖ్య ఉద్దేశమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఎలిగేడు మండలం ముప్పిరితోట లో మంగళవారం భూ భారతి చట్టం – 2025పై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పొంగులేటి పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలోని పెద్దలు నాలుగు గోడల మధ్య ధరణి చట్టం తయారు చేశారన్నారు. తమ ప్రభుత్వం 18 రాష్ట్రాల్లోని 20 చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వేలమంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని భూ భారతి తయారు చేసిందన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ, వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థలను కుప్పకూల్చిందని, ప్రజాప్రభుత్వంలో గ్రామానికో రెవెన్యూ అధికా రిని జూన్ 2వ తేదీ నాటికి నియమిస్తామన్నారు. కర్ణాటక విధానాలను అనుసరిస్తూ మండల కేంద్రాల్లో 6వేల లైసెన్స్డ్ ప్రైవేటు సర్వేయర్లను నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ధరణిలో సమస్య వస్తే కోర్టుకు వెళ్లాల్సి ఉండేదని, ప్రస్తుతం ఆ అవసరం లేకుండా తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ వరకు ఐదంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీఎల్ఏ స్థాయిలో న్యాయం జరగకపోతే ప్రజలు కొత్తగా ఏర్పడిన ట్రిబ్యునల్ను సంప్రదించ వచ్చని, రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ట్రిబ్యునల్లను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. భారతదేశ సరిహద్దుల అంశంలో రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు అందిస్తామని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. గతంలో ఇందిరాగాంధీ అమెరికా నాయకత్వాన్ని ఎదిరించి పాకిస్థాన్ను యుద్ధంలో చిత్తుచేసి ప్రత్యేకంగా బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేశారని, నేడు అమెరికా ఒత్తిడికి తలొగ్గి ప్రధానమంత్రి మోదీ రాజీపడటం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. హామీలన్నీ అమలు చేస్తున్నాం ఎలిగేడు(పెద్దపల్లి): ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమ లు చేస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ముప్పిరితోటలో ఆయన మాట్లాడు తూ, కోతల్లేకుండా, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు సోషల్ మీడియా వేదికగా అసత్యప్రచారం చేస్తూ ప్రజల ను తప్పుదోవపట్టిస్తున్నాయని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వాటికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిచారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మాట్లాడుతూ అంత ర్గాం కాందీశీకుల భూసమస్యలను పరిష్కరించా లని మంత్రులు శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబుకు వి న్నవించారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తొలిబిల్లు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ వేణు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు, ఆర్డీవో గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్పర్సన్లు ప్రకాశ్రావు, గండు సంజీవ్, స్వరూప, సింగిల్విండో చైర్మన్లు వేణుగోపాల్రావు, విజయభాస్కర్రెడ్డి, తహసీల్దార్ బషీరొద్దీన్, ఎంపీడీవో భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రెక్కలు?
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025భూముల ధరలకుసాక్షిప్రతినిధి,కరీంనగర్: భూముల మార్కెట్ విలువ పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూముల ధరలు ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖను ఆదేశించింది. అన్ని జిల్లా ల రిజిస్ట్రార్లకు ఆదేశాలు పంపించింది. ప్రస్తుతం ఉన్న భూముల వివరాలు, మార్కెట్ విలువ? దా న్ని ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలువు శాఖల అధికారులతో కూడిన కమిటీలను కూడా సిద్ధం చేసింది. వీరు భూముల విలువపై అంచనాకు వచ్చి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నివేదికలోని సూచనలు అమలైతే దాదాపు 50 నుంచి 100 శాతం వరకు మార్కెట్ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయి. కమిటీలు ఇలా.. భూముల ధరల పెంపులో ప్రభుత్వం అర్బన్, రూరల్ రెండు ప్రాంతాలుగా విభజించింది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు అందులో ఇటీవల విలీనమైన గ్రామాలకు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో అడిషనల్ కలెక్టర్ (లోకల్బాడీస్) చైర్మన్గా ఉంటారు. సభ్యులుగా మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్చైర్మన్, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. కన్వీనర్గా సబ్రిజిస్ట్రార్ వ్యవహరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చైర్మన్గా ఆర్డీవో వ్యవహరిస్తారు. సభ్యులుగా తహసీల్దార్, ఎంపీడీవో ఉంటారు. కన్వీనర్ బాధ్యతలను సబ్ రిజిస్ట్రార్ నిర్వహిస్తారు. భవన నిర్మాణాల ధరల నిర్ధారణకు జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ చైర్మన్గా ఉండగా.. ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ సభ్యుడిగా ఉంటారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలన్నీ వ్యవసాయ, రియల్ ఎస్టేట్, భూములతోపాటు అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, బహుళ అంతస్తుల భవనాల మార్కెట్ విలువను నిర్ధారిస్తాయి. ఈనెలాఖరుకు నివేదిక ప్రభుత్వ ఆదేశాల మేరకు రూపుదిద్దుకున్న కమిటీలు తమ పరిధిలో ఉన్న భూముల మార్కెట్ విలువపై సర్వే ప్రారంభించాయి. దాదాపుగా ఈ సర్వే కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకు నివేదికను ప్రభుత్వానికి అంజేయనున్నాయి. ఈ నివేదిక ప్రకారం.. 50 నుంచి 100శాతం వరకు మార్కెట్ విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా మొత్తం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా), సిరిసిల్ల జిల్లా మొత్తం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)లుగా అవతరించడంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు ముఖ్యంగా రెక్కలు రానున్నాయి.న్యూస్రీల్ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు, ఆదాయ వివరాలు (రూ.కోట్లలో)ఏడాది డాక్యుమెంట్లు ఆదాయం 2024 88,762 231.98 2025 32,383 86.25 మరోసారి మార్కెట్ విలువ పెంపు 50 నుంచి 100శాతం పెంచేలా కసరత్తు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వ ఆదేశం మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనానికి కమిటీలు నివేదిక పంపేందుకు మే నెలాఖరు వరకు సమయం భూ విలువలపై అధ్యయనం ప్రారంభించిన అధికారులు -
ఓటమిని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం
● రాచరిక పాలనకు అలవాటుపడిన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ● పోలీసులతో భయభ్రాంతులకు చేసింది నిజం కాదా? ● 15 నెలల కాంగ్రెస్ పాలనపై అక్కసు ఎందుకు? ● నిలదీసిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ ధర్మారం(ధర్మపురి): ఎమ్మెల్యేగా, మంత్రిగా సు మారు రెండు దశాబ్దాల పాటు రాచరిక, రాక్షస పా లన సాగించిన కొప్పుల ఈశ్వర్.. ఇప్పుడు ఓటమి ని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్ ధ్వజమెత్తారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా కొనసాగిన సమయంలో ఈశ్వర్ తనకు నచ్చని, ఎదురుతిరిగిన వారిపై పోలీసులను అడ్డుపెట్టుకొని తప్పుడు కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతగా తనపై ఈశ్వర్ అనేక కేసులు పెట్టించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసి, కేసులు నమోదు చేయించిన ఘనత ఉన్న ఈశ్వర్ నీతులు మాట్లాడడం విడ్డూరమన్నారు. 2003 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగి ఏం అభివృద్ధి చేశావో బహిరంగ చర్చకు రావాలని లక్ష్మణ్కుమార్ సవాల్ విసిరారు. రాష్ట్రమంత్రిగా కొనసాగిన హరీశ్రావు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ధర్మపురి నియోజకవర్గంలో మంత్రిగా కొనసాగిన ఈశ్వర్ చేసిన అభివృద్ధి పనుల్లో తేడాను చూసేందుకు ముందుకు వస్తే ఇరుపార్టీల వారిని తీసుకెళ్తానని, ఇందుకు కోసం తానే స్వయంగా బస్సులు సమకూర్చుతానని అన్నారు. నందిమేడారం రిజర్వాయర్ నుంచి నీటిని సిద్దిపేట, గజ్వేల్ తరలిస్తుంటే కనీసం ప్రశ్నించలేని ఈశ్వర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. అప్పటి మంత్రులుగా హరీశ్రావు, కేటీఆర్ వారి ప్రాంతాల అభివృద్ధికి పాటుపడితే ఈశ్వర్ అభివృద్ధిని విస్మరించి జల్సాల కోసం సమయాన్ని కేటాయించారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లాకు కేటాయించిన రూ.వేల కోట్ల డీఎంఎఫ్టీ నిధులు సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు కేటాయిస్తే ఏ ప్రయోజనం కోసం మౌనంగా ఉన్నారని ఈశ్వర్ను నిలదీ శారు. నాయకులు లావుడ్య రూప్లానాయక్, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, అసోద అజయ్, సోగాల తిరుపతి, కొడారి అంజన్న, కొత్త నర్సింహులు, కాడే సూర్యనారాయణ, దేవి జనార్దన్, ఓరం చిరంజీవి, అష్ష్యు, కాంసాని ఎల్లయ్య పాల్గొన్నారు. -
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఊరట
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కాస్త ఊరట లభించింది. బిల్లులు విడుదలకాక ఇబ్బంది పడుతున్న వారికి అధికారులు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ప్రభుత్వం సూచించిన 600 చదరపు అడుగులకు మించి ఇల్లు నిర్మించబోమని అంగీకారపత్రం అందజేస్తే బిల్లు మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. తద్వారా జిల్లాలో ఇళ్ల నిర్మాణం వేగవంతమవుతుందని భావిస్తున్నారు. తొలివిడతలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికోసం ప్రభుత్వం రూ.5లక్షల వరకు సాయం చేస్తామని ప్రకటించింది. ఈక్రమంలో 400 చ.అ. నుంచి 600 చ.అ. విస్తీర్ణంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు అందరికీ తొలివిడతలో రూ.లక్ష చొప్పున వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో అధికారులు ఇటీవల జమచేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం ఆకృతిని తమకు నచ్చిన విధంగా మార్పు చేసుకోవచ్చని ప్రభుత్వం వివరించింది. అయితే, విస్తీర్ణం మాత్రం పెంచకూడదనే నిబంధన విధించింది. లబ్ధిదారురుకు ఐదు విడతల్లో రూ.లక్ష చొప్పున మొత్తం రూ.5 లక్షలు సాయం చేస్తుంది. ఇంటి విస్తీర్ణం పెంచితే ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా ప్రకటిస్తామని సర్కారు హెచ్చరించింది. జిల్లాలో మరో 38 మంది లబ్ధిదారులు జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన అధికారులు.. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 138 ఇళ్లు పూర్తికాగా.. బేస్మెంట్స్థాయి వరకు నిర్మించిన మ రో 100 ఇళ్లకు రూ.లక్ష చొప్పున విడుదల చేశారు. మరో 38 మంది 600 చదరపు అడుగులు దాటి బే స్మెంట్ కట్టారు. వీరి కోసం బిల్లులు మంజూరు చే యాలంటూ గతనెల 24న కలెక్టర్ కోయ శ్రీహర్ష.. హౌసింగ్ పీడీ రాజేశ్వర్ ద్వారా నివేదిక తెప్పించుకొని రాష్ట్రప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం వారికి రూ.38 లక్షలు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇకనుంచి లబ్ధిదారులు 400 చ.అ. నుంచి 600 చ.అ. విస్తీర్ణం లోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. -
‘డిజిటల్’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. కలెక్టరేట్లో మంగళవారం డీఈఈటీ పనితీరుపై పరిశ్రమలు, వివిధ వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు. నిరుద్యోగుల కు వారథిగా పనిచేసేందుకే ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో ఇప్పటిరకు 1,810 మంది యువత ఉపాధిఅవకాశాల కో సం తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పే ర్కొన్నారు. ఆసక్తిగల నిరుద్యోగులు తమ పేర్ల ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధిత అధికారులు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. దీనిద్వారా యువతకు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. వారి నైపుణ్యాల ఆధారంగా అర్హతగల ఉద్యోగాలను పొందవచ్చన్నారు. సమావేశంలో పరిశ్రమల జిల్లా అధికారి కీర్తికాంత్, డీఆర్డీవో కాళిందిని తదితరులు పాల్గొన్నారు.క్రీడలతో మానసికోల్లాసం జ్యోతినగర్(రామగుండం): క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. స్థానిక మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో ఎన్టీపీసీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రెండువారాల పాటు నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. చదువుతో విజ్ఞానం, క్రీడలతో ఆరోగ్యం చేకూరుతాయన్నారు. వేసవి శిక్షణ శిబిరంలో చిన్నారులు ప్రావీణ్యం సాధించా లని ఆయన సూచించారు. స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు అలొక్ కుమార్ త్రిపాఠి, జీఎంలు ముఖుల్ రాయ్, కేసీ సింఘరాయ్, ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, అధికారుల సంఘం అధ్యక్షుడు మహేంద్రకుమార్, ఉద్యోగ గుర్తింపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణయ్య, ప్రధానకార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్, స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి గణేశ్వర్ జడ్డీ, క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్లకార్డులతో నిరసన రామగుండం: కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్థానిక రైల్వే ఆర్వోహెచ్ షెడ్డు ప్రాంగణంలో రైల్వేకాంట్రాక్టు కార్మికులు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. సమ్మెహక్కు హరిస్తూ, పని గంటలు పెంచుతూ, కనీస వేతనాలు, చట్టాలు అమలు చేయకపోవడం శోచనీయమని కార్మికులు అన్నారు. సర్కారు విధానాలతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని అన్నారు. కనీస వేతనం రూ.26వేలు, నాలుగు లేబర్ కోడ్ల రద్దు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎం.రామాచారి, నాయకులు భిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి, రైల్వే కాంట్రాక్టు కార్మికులు కలవేణి తిరుపతి, మురళి, రాజమౌళి, సతీశ్, శివనాయక్, రాజు, ఇఫ్తాకార్, లాలూనాయక్ తదితరులు ఉన్నారు. రెడ్క్రాస్ సొసైటీని విస్తరిద్దాం పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సేవలను విస్తరించేందుకు మండలాల వారీగా సభ్యుల సంఖ్య పెంచుదామని రెడ్క్రా స్ సొసైటీ జిల్లా కన్వీనర్ కావేటి రాజ్గోపాల్ అన్నారు. పెద్దపల్లిలో మంగళవారం జరిగిన జి ల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడా రు. రత్నాపూర్లో పేదకుటుం చేపట్టిన ఇంటి పనులకు సభ్యులు సాయం అందించాలని సూ చించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశు ధ్య అవసరాల కోసం ఫినాయిల్ మాప్స్, డస్ట్బిన్, చీపుర్లు, గ్లౌసెస్ను సూపరింటెండెంట్ శ్రీధర్కు అందించారు. ప్రతినిధులు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్ ఉన్నారు. -
కూడళ్ల విస్తరణే పరిష్కారం
● కలెక్టర్ ఆదేశాలతో అధికారుల్లో కదలిక ● పనులు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులుజిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలి. ట్రాఫిక్, పోలీసు, ఆర్ అండ్ బీ, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి. – కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలుపెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై వాహనాల రద్దీ బాగా పెరుగుతోంది. ప్రధానంగా కలెక్టరేట్, రంగంపల్లి, చీకురాయిక్రాస్ రోడ్డు, కమాన్, కూనారం క్రాస్రోడ్డు, ప్రగతినగర్, బస్టాండ్ జంక్షన్ల వద్ద తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. వీటి పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కమాన్ వద్ద వాహనాల రాకపోకలకు చాలాఇబ్బందిగా మారడంతో వీలైనంత వరకు రోడ్డును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చెట్లు, స్తంభాలను తొలగించి వాహనాల రాకపోకలు సులువుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదాల బస్టాండ్ కూడలి.. బస్టాండ్ కూడలి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నా.. వాహనదారుల్లో అవగాహన లేక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బస్టాండ్ క్రాస్రోడ్డు వద్ద రహదారిని దాటేందుకు యత్నించిన పట్టణానికి చెందిన వ్యాపారి యాద రమణయ్య, కాంట్రాక్టర్ గంట నర్సయ్య తమ ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. ఇంకొందరు త్రుటిలో ప్రమాదాల నుంచి సురక్షితంగా బయ టపడ్డ సంఘటనలు అనేకంగా ఉన్నాయి. కష్టాల కూడలి ‘కమాన్’ పట్టణంలోని ప్రధాన కూడలి కమాన్. దీనివద్ద అవసరమైనంత స్థలం లేదు. వాహనదారులు, పాదచారులు రోడ్డు దాటేందుకు నానాకష్టాలు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నా.. వాహనాలను కట్టడి చేసేందుకు నానాతంటాలు పడాల్సి వస్తోంది. తాత్కాలిక డివైడర్లను ఏర్పాటు చేసి ఇబ్బందులు దూరం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన యత్నాలు సత్పలితాలు ఇవ్వడంలేదు. కొద్దిరోజుల క్రితం ఓ లారీ వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టింది. అంతేకాకుండా కమాన్ నుంచి వచ్చే వారు, యూటర్న్ తీసుకునే వాహనదారులు, నేరుగా గోదావరిఖని నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనదారుల మధ్య సమన్వయం కుదరక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాటిని నియంత్రించేందుకు పోలీసులు వీలైనంత వరకు విస్తరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అఽధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో వేచిచూడాల్సిందే. -
క్రికెట్ జిల్లా జట్టుకు ఎంపిక
గోదావరిఖనిటౌన్: అండర్–25 క్రికెట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించే జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా ఇన్చార్జి డి.కిరణ్కుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం(కేడీసీఏ) ఆధ్వర్యంలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులతో ఈనెల 17న స్థానిక జీఎంకాలనీ గ్రౌండ్లో అండర్ –25 క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లాకు ఒక జట్టుగా ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. కోచ్ ఎం. సుదేశ్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడాకారులు జి.సత్యతేజ, ఎండీ జునైద్, డి.శరత్చంద్ర, ఆర్.నిఖిలేంద్ర, అఫ్ఫాన్, జి.సాయివినయ్, ఎండీ ఫైజాన్, ఆర్.నితిన్, ఖాజా ముఖారుద్దీన్, జి.మనిరత్నమ్, లోధ్ నిఖిల్, రాహుల్, వేణు, శివ గణేశ్, శరణ్ను జిల్లా జట్టుకు ఎంపికై నట్లు ఆయన వివరించారు. కరాటే విద్యార్థులకు అభినందన పెద్దపల్లిరూరల్: జిల్లాలోని జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులు ఉత్తరాఖండ్ హరిద్వార్లో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. కరాటే పో టీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టరేట్లో మంగళవారం అభినందించా రు. అండర్ –14 కట్ఆఫ్ కుమితి విభాగంలో పలువురు కరాటే విద్యార్థులు 2 బంగారు పతకాలు, 3 వెండి, 3 కాంస్య పతకాలు సాధించారు. విద్యార్థు లు భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలని కలె క్టర్ ఆకాక్షించారు. మాస్టర్ వెంకటేశ్, ప్రిన్సిపాల్ మణిదీప్తి, ఇన్స్స్ట్రక్టర్ అలేఖ్య పాల్గొన్నారు. -
అక్రమాలపై విచారణ జరపాలి
పెద్దపల్లి కమాన్చౌరస్తాలో ఇల్లు లేకున్నా మున్సిపల్ అధికారులు ఇంటి నంబరు కేటాయించారు. దానికి ఆస్తిపన్ను వసూలు చేస్తున్నట్లు రసీదులు ఇస్తున్నారు. ఈ విషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – బొంకూరి సుభాష్, కమాన్రోడ్డు పెద్దపల్లిఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి పెద్దపల్లిలోని ఉదయ్నగర్లో అద్దె ఇంట్లో ఉంటున్న. ఆలయాల వద్ద భిక్షాటన చేస్తూ దాతలు ఇచ్చిన సొమ్ముతో జీవనం సాగిస్తున్న. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని చెప్పిన సార్లు .. ఇప్పుడే కాదు.. తర్వాత ఇస్తమంటున్నరు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – కర్రెవుల నర్సమ్మ, దివ్యాంగురాలు, పెద్దపల్లి -
మధు.. స్థాయి దిగజార్చుకోవద్దు
పెద్దపల్లిరూరల్: ‘ఎమ్మెల్యేగా.. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్గా సేవలు అందించినవ్.. ఇప్పుడు అధికారం పోయిందన్న బాధతో అడ్డగోలు విమర్శలు చేసి నీ స్థాయి దిగజార్చుకోవద్దు’ అని డీసీసీ అధ్యక్షుడు ఠాకూర్ మక్కాన్సింగ్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో దగాపడ్డదే దళితులు అనే సంగతిని ప్రజలు గుర్తుంచుకున్నారని, ఇప్పుడు మొసలికన్నీరు కార్చుతూ మాట్లాడడం బురద చల్లే ప్రయత్నమేనన్నారు. తెలంగాణకు తొలి సీఎంగా దళితుడేనని ప్రకటించి మోసం చేసింది మొదలు.. అనేక హామీలు ఇచ్చి నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా వంశీకృష్ణను తాము గెలి పించుకుంటే తమ పార్టీ అంతర్గత వ్యవహరంలో నీ జోక్యం ఎందుకుని వారు ప్రశ్నించారు. ఘనంగా పుష్కర ఏర్పాట్లు మంథని సెగ్మెంట్ పరిధిలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తుంటే ఓర్వలేక పుట్ట మధు నిందారోపణలకు దిగుతున్నారని ఠాకూర్, విజయరమణరావు అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారందరికీ ఆహ్వానాలు అందిస్తారని, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు కూడా సమాచారం ఉందని అన్నారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న మంత్రిశ్రీధర్బాబు సతీమణి శైలజారామయ్యర్పై పుట్ట మధు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు ఈర్ల స్వరూప, ప్రకాశ్రావు, నాయకులు బండారి రామ్మూర్తి, అవినాష్, మల్లయ్య, సుభాష్రావు, సంపత్, శ్రీనివాస్, మస్రత్ పాల్గొన్నారు. దళితులపై మొసలికన్నీరు కార్చితే ఎవరూ నమ్మరు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దగా పడ్డదే దళితులు డీసీసీ అధ్యక్షుడు మక్కాన్సింగ్, ఎమ్మెల్యే విజయరమణారావు -
ట్రాఫిక్ ఏసీపీగా శ్రీనివాస్
గోదావరిఖని: రామగుండం ట్రాఫిక్ ఏసీపీగా సీహెచ్ శ్రీనివాస్ను నియమిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ జానీ నర్సింహులును డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాస్ను రామగుండం బదిలీ చేశారు. కాగా గతంలో ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, ట్రాఫిక్ ఏసీపీ మధ్య ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. ఈక్రమంలో ఏసీపీ వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. త్వరలోనే ఏసీపీ బదిలీ ఉంటుందని ప్రచారం జరిగినా ఎట్టకేలకు ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్బీ ఏసీపీ ఎస్వీ రాఘవేంద్రరావును హైదరాబాద్ ఎస్ఆర్నగర్ ఏసీపీగా బదిలీ చేశారు. సీసీఎస్ ఏసీపీ ఎన్.వెంకటస్వామిని ఎస్డీగా జగిత్యాలకు బదిలీ చేశారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
దారి ఆక్రమించారు సుల్తానాబాద్ మండలం కొదురుపాక చెరువుకట్ట నుంచి పొలాలకు వెళ్లే దారిని కొందరు ఆక్రమించారు. కనీసం కాలినడకన వెళ్లకుండా అడ్డుగా బండరాళ్లు పెట్టారు. ఆ దారిని ఆక్రమించుకుంటున్నారు. ఈ విషయమై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి. – కొదురుపాక గ్రామ రైతులు ఉపాధి చూపండి కుటుంబపోషణ కష్టంగా మారింది. ఇద్దరు పిల్లలను పెంచేందుకు ఆర్థికంగా కష్టాలు పడాల్సి వస్తోంది. టెన్త్ చదివిన నాకు ఏదైనా ఉపాధి మార్గం చూపించి ఆదుకోవాలి. – షహీదాబేగం, పెద్దపల్లి విచారణ జరిపించండి మా గ్రామంలోని సర్వే నంబరు 48లోగల 27 గుంటల భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. ఈ వ్యవహారంపై తగిన విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలి. – ప్రతాప్, గుండారం, కమాన్పూర్ మండలం ● అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి ● అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు ప్రజావాణి ద్వారా అందించిన అర్జీలపై ప్రత్యేక దృష్టిసారించి సత్వర పరిష్కార మార్గాన్ని చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి అభాగ్యుల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి వివిధ విభాగాల అధికారులకు సిఫారసు చేశారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
ధర్మారం(ధర్మపురి): ప్రజా సంక్షేమమే ధ్వే యమని ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్ అన్నా రు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం 106 మందికి రూ.36 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడే వారికి చికిత్స కోసం ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ అమలు చేస్తోందని అన్నారు. అనంతరం ఇటీవల మృత్యువాతపడిన గొర్రెలకు పరిహారం మంజూరు చేయాలని ప్రతిపాదించిన లేఖను బొమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొర్రెలపెంపకందారులకు విప్ లక్ష్మణ్కుమార్ అందించారు. ఆ లేఖను కలెక్టర్కు అందించాలని ఆయన సూచించారు. వారంరోజుల్లోగా బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకుడు కాంపెల్లి రాజేశం, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఎంపీవో రమేశ్ పాల్గొన్నారు. నాగలింగేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు పెద్దపల్లిరూరల్: రాగినేడు గ్రామంలోని స్వ యంభూ నాగలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రెండో వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చులాపురం ప్రాంతానికి చెందిన అవధాని దుద్దిళ్ల మనోహరశర్మ ఆధ్యర్వంలో ప్రధాన అర్చకుడు రాజేశ్వరశర్మ తదితరులు గణపతిహోమం, రుద్రహోమం, నవగ్రహపూజాకార్యక్రమాలు నిర్వహించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, ఆలయక మిటీ చైర్మన్ భూమయ్య, అవినాష్, కోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎంపిక కోసం దరఖాస్తులు పెద్దపల్లిరూరల్: జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూ ల్(రెసిడెన్షియల్, నాన్రెసిడెన్షియల్) ఉత్తమ పాఠశాలల ఎంపిక కోసం ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ అధికారి వినోద్కుమార్ తెలిపా రు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ రెసిడెన్షియల్ప థకం కింద విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్ వ సతి, భోజనంతోపాటు రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాల కోసం రూ.42 వేలు, నాన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు (హాస్టల్ భోజన వసతి మినహాయింపు) ప్రతీ విద్యార్థికి రూ.28 వేల చొప్పున చెల్లిస్తారని పే ర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 24లోగా త మ కార్యాలయంలో అందించాలని, ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.13 పరీక్ష కేంద్రాలు .. 4,230మంది విద్యార్థులు పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఈనెల 22 నుంచి 28 వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ అ డ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం ఇంటర్ నోడల్ అధికారి కల్పన, డీ ఈవో మాధవితో కలిసి ఏర్పాట్లపై సమీక్షించా రు. ఈ సంద్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ, జిల్లావ్యాప్తంగా 4,230 మంది విద్యార్థు లు (2,538 మంది ఫస్టియర్, 1,692 మంది సెకండియర్) విద్యార్థుల కోసం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా జిల్లా పరీక్షల కమిటీ ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించిందన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల కు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో పరీక్షలు జరపాలని అన్నారు. బీసీ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కంపుకొడుతున్న కాలువలు
● డ్రెయినేజీల్లోనే పూడిక ● తొలగించడంలో నిర్లక్ష్యం ● మురుగునీటి పారకానికి ఆటంకం ● దుర్గంధం వెదజల్లుతున్న కాలనీలు యైటింక్లయిన్కాలనీ(రామగుండం): సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పూడిక నిండిపోయి మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దోమలు, ఈగలు ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుని స్థానికులపై దాడులు చేస్తున్నాయి. ఫలితంగా కాలనీవాసులు వ్యాధులకు గురవుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. అస్తవ్యస్తంగా డ్రైనేజీలు.. రామగుండం కార్పొరేషన్ 19వ డివిజన్ న్యూమారేడుపాక గ్రామంలో సీసీ రోడ్లకు ఇరువైపులా నిర్మించిన సైడ్ డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. శ్రీనాగుల మల్లికార్జునస్వామి ఆలయానికి వెళ్లే మెయిన్ రోడ్డుకు ఇరువైపులా మురుగునీటి కాలువలు నిర్మించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఆయా నివాసాల్లోంచి వెలువడే మురుగునీరు ఇళ్లోకి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు నిర్మించినా.. కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించిన బల్దియా అధికారులు.. వాటికి సైడ్ డ్రెయినేజీలు నిర్మించడం విస్మరించారు. న్యూమారేడుపాక బీసీకాలనీలో రోడ్లు నిర్మించినా అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించలేదు. దీంతో ప్రతీ వర్షకాలంలో వర్షపు నీరు, బురదనీరు, మురుగునీరు సమీప ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. ఆ దుర్గంధం కాలనీ వాసులు భరించలేకపోతున్నారు. పందులకు ఆవాసాలు.. రోడ్లు, నివాసాల మధ్య వర్షపునీరు, మురుగునీరు నిలవడంతో పెద్దగుంతలుగా తయారవుతున్నాయి. వాటిని పందులు తమ ఆవాసాలుగా చేసుకుంటున్నాయి. ఇళ్లలోకి దుర్వాస వస్తోంది. దోమలు, ఈగలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని కాలనీవాసులు అంటున్నారు. ఇప్పటికై నా ఆర్జీ–2సింగరేణి అధికారులు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి వర్షకాలం రాకముందే అండర్గ్రౌండ్ డ్రెయినేజీతోపాటు రహదారులకు ఇరువైపులా సైడ్ డ్రెయినేజీలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.అధికారుల దృష్టికి తీసుకెళ్తా న్యూమారేడుపాక గ్రామంలోని కొన్ని ఏరియాల్లో సీసీ రోడ్లతోపాటు డ్రెయినేజీల నిర్మాణం విషయాన్ని ఆర్జీ–2ఏరియా సీంగరేణి యజ మాన్యం దృష్టికి తీసుకెళ్తాం. అసంపూర్తిగా మిగిలిన సీసీ రోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటాం. – తాళ్ల అమృత, 19వ డివిజన్ మాజీ కార్పొరేటర్ -
విపత్తుల సమయంలో రెస్క్యూ సేవలు
● సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడి ● ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి రెస్క్యూ శిక్షణగోదావరిఖని: విపత్తుల సమయంలో రెస్క్యూ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. సింగరేణి మెయిన్ రెస్క్యూస్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని డైరెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 36 రోజుల్లో 1,200 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కి శిక్షణ ఇస్తామన్నారు. విపత్తుల నిర్వహణ తీరు పై శిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సి న తీరుపై ప్రాక్టికల్గా వివరించనున్నామని తెలిపారు. వంద మంది చొప్పున ఒక్కొక్క బ్యాచ్కి 3 రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందన్నారు. అధునాతన రెస్క్యూ పద్ధతుల తీరు, రెస్క్యూ, రికవరీ విధానాలు, అత్యవసర గాయాల చికిత్స పద్ధతులను వివరించారు. అగ్నిప్రమాదం, భవ నం కూలిపోవడం, గని విపత్తు రక్షణ, ప్రథమ చికిత్స విధానాలను కవర్ చేస్తూ శిక్షణ కొనసాగుతుందని ఆయన వివరించారు. తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గుడిపేట 13వ బెటాలియ న్ కమాండెంట్ వెంకట్రాములు, రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి, క్వాలిటీ జీఎం భైద్యా, రెస్క్యూ సూ పరింటెండెంట్ మాధవరావు, సెక్యూరిటీ అధికా రి షరీఫ్మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
పరిహారంపై పేచీ
● ఆర్బిట్రేషన్ చెల్లింపులకు నిర్వాసితుల ఎదురుచూపులు ● పెండింగ్ సమస్యలకు పరిష్కారమెప్పుడో? ● జాతీయ రహదారి భూసేకరణలో కొనసాగుతున్న వివాదంమంథని: నాగ్పూర్ –విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా మంచిర్యాల – వరంగల్ మద్య ప్యాకేజీ–1లో చేపట్టిన జాతీయ రహదారి పనులు ప్రారంభమై ఆరు నెలలు కావిస్తున్నా నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారం అందలేదు. 2021 మార్చిలో కేంద్రప్రభుత్వం గెజిట్(3) విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోదీ గతేడాది జూలైలో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో పనులకు శంకుస్థాపన చేశారు. అయినా రహదారి నిర్మాణంలో నెలకొన్న చిక్కులు పరిష్కారం కావడంలేదు. పరిహారంపై తెగని పంచాయితీ ప్యాకేజీ–7 కింద మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల నుంచి ప్రారంభమయ్యే నాలుగు లేన్ల జాతీయ రహదారి.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గోదావరి సమీపం నుంచి పోతారం, విలోచవరం, నాగారం, కన్నాల, పందుపపల్లి, పుట్టపాక, రామగిరి మండలం ఆదివారంపేట, బేగంపేట, నవాబ్పేట, ముత్తారం మండలం లక్కారం, కేశనపల్లి, ముత్తారం, అడవి శ్రీరాంపూర్, ఓడేడు మీదుగా వరంగల్ వెళ్తుంది. మూడు మండలాల మీదుగా వెళ్లే 16 గ్రామాలు 40 కి.మీ. పొడవైన రోడ్డు కోసం 199.7358 హెక్టార్ల(సుమారు 500 ఎకరాలు) భూమి అవసరమవుతుందని హైవే అథారిటీ సూచించింది. జాతీయ రహదారిలో కోల్పోతున్న భూములకు ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల మార్కెట్ ధర పలుకుతోంది. కానీ, అధికారులు రూ.4.50 లక్షల నుంచి రూ.6 లక్షల వరకే పరిహారం చెల్లించారు. జిల్లా పరిధిలో 1,400 మంది రైతులకు పరిహారం కింద రూ.25 కోట్లు మంజూరయ్యాయి. అదనపు పరిహారం కోసం అర్బిట్రేషన్ ద్వారా రూ.20 లక్షల వరకు చెల్లింపులకు నిర్ణయం జరిగింది. కానీ, కొందరు నిర్వాసితులకే డబ్బులు వారి బ్యాంకుల్లో జమయ్యాయి. ఇంకా పరిహారం పొందాల్సిన రైతులు ఉన్నారు. భూములతోపాటు బోరుబావులు, పైపులైన్లు, ఇతర వాటికి పరిహారం చెల్లించాల్సి ఉంది. అధికారులు కేవలం భూములకే పరిహారం చెల్లించి మిగతా వాటిని విస్మరించారు. అంతేగాకుండా భూసేకరణలో అనేక తప్పులు దొర్లినట్లు రైతులు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. సర్వే నంబర్లలో పొరపాట్లు, ఒకరికి బదులు మరొకరు, ఆయకట్టు తక్కువ.. ఇలా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ప్యాకేజీ–1లో నార్వ నుంచి పుట్టపాక వరకు.. గ్రీన్ఫీల్డ్ హైవే తరహాలో పట్టణాలు, జనవాసాలకు దూరంగా మైదాన ప్రాంతాల గుండా సాగే జాతీయ రహదారి నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు నిర్మిస్తారు. ప్యాకేజీ–7 కింద చేపట్టే ఎక్స్ప్రెస్ రోడ్డును మూడు ప్యాకేజీల్లో భాగంగా మంచిర్యాల సమీపంలోని జైపూర్ మండలం నార్వ నుంచి పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక వరకు 31.466 కి.మీ. తొలివిడతలో తీసుకున్నారు. నాలుగు వరుసల రహదారి నిర్మాణాన్ని 2027 వరకు పూర్తి చేసేలా డీపీఆర్లో పొందుపరిచారు. కలెక్టర్పై భరోసా జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి అర్హతల ఆధారంగా పరిహారం అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్శ ఆదేశించారు. ఈనెల 10న పుట్టపాకలో నిర్వాసితులతో సమావేశమైన ఆయన.. వారి సమస్యలను విన్నారు. భూముల్లోని బావులు, మోటార్లు, పైపులైన్లు, పండ్లు, అటవీచెట్లు, ఇతర నిర్మాణాలకు పరిహారం అందలేదని నిర్వాసితులు కలెక్టర్కు దరఖాస్తు చేశారు. ప్రతీదరఖాస్తును పరిశీలించి, అర్హత ఆధారంగా నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారుచేసి అందజేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించడంతో నిర్వాసితుకు భరోసా కలిగింది. ఈ క్రమంలో పూర్తిస్థాయి పరిహారం అందుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు కోరుతున్నారు. -
ఉద్యోగులపై కొనసాగుతున్న దాడుల పరంపర
రామగిరి(మంథని): సింగరేణి సంస్థ ఆర్జీ–3 డివిజన్లో కొద్దిరోజులుగా అధికారులు, ఉద్యోగులపై దాడుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల చేప ట్టిన కాలువ మళ్లింపు పనుల్లో చోటుచేసుకున్న బ్లా స్టింగ్ల్లో నాగెపల్లిలోని నివాసాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ధ్వంసమైన విషయం విదితమే. అయితే, ని వాసాలు మరమ్మత్తు చేస్తున్న క్రమంలో గ్రామస్తు లు, సింగరేణి ఉద్యోగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం సింగరేణి సివిల్ ట్రైనీ ఉద్యోగి శ్రీనివాస్పై కొందరు దాడి చేశారు. సివిల్ సూపర్వైజర్ సాయికృష్ణ బైక్ లాక్కున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. మరోవైపు.. అధి కారులు తమతో దురుసుగా ప్రవర్తించారని గ్రామ స్తులు చెబుతున్నారు. ఈ విషయంలో ఇరువర్గాలు పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సింగరేణి ఉద్యోగులు, గ్రామస్తుల మధ్య రాజీకి నాయకులు అధికారులతో చర్చలు జరుపుతున్నారని, మళ్లీ దాడిలు జరగనివ్వబోమని హామీ ఇచ్చా రని తెలిసింది. ఇప్పటికే రాజాపూర్లో ఓసీపీ–2 భూ సేకరణకు వెళ్లిన అడిషనల్ మేనేజర్ శ్రీనివాస్పై దాడి జరగ్గా.. పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆర్జీ–3లో సింగరేణి ఉద్యోగం చేయలాంటే భయం భయంగా బతకాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆహ్లాదం.. ఆరోగ్యం
● సిమ్మింగ్పై ఆసక్తి ● అందుబాటులో ఈతకొలనులు యైటింక్లయిన్కాలనీ(రామగుండం): సింగరేణి కార్మిక, ఉద్యోగుల పిల్లలతోపాటు ప్రభావిత గ్రామాల విద్యార్థులు, ప్రజల కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన స్విమ్మింగ్పూళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్జీ–2 ఏరియా సింగరేణి యాజమాన్యం సుమారు పదేళ్లక్రితం వీటికి రూపకల్పన చేసింది. స్థానిక సీఈఆర్ క్లబ్ ఆవరణలో నిర్మించిన రెండు ఈతకొలనులకు స్విమ్మర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. బేబీ ఈతకొలను ఐదేళ్ల నుంచి పనిచేస్తోంది. ఇది 10ఏళ్ల వయసు లోపు చిన్నారుల కోసం, రెండోది 10 ఏళ్ల నుంచి 40ఏళ్ల వయసు వారికోసం కేటాయించారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడతో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఈతకొలనుల దారిపట్టారు. రోజూ స్విమ్మింగ్ చేస్తున్నవారు కొందరైతే.. ఈత నేర్చుకుంటున్నవారు మరికొందరు. వీరిరాకతో స్విమ్మింగ్పూల్స్ సందడిగా మారాయి. సింగరేణి యాజమాన్యం ప్రత్యేకంగా స్విమ్మింగ్ కోచ్ను నియమించి ఈత నేర్పిస్తోంది. ఇక్కడ మెలకువలు నేర్చుకున్న చాలామంది స్విమ్మర్లు వివిధ విభాగాల్లో జిల్లా, రాష్ట్రస్థాయి ఈతపోటీల్లో ప్రతిభ చూపారు. మెడల్స్ సాధించారు. సంతోషంగా ఉంది నాకు ఈత అంటే ఇష్టం. ఈత నేర్చుకునేందుకు సీఈఆర్ క్లబ్లో ఈతకొలను అందుబాటులో ఉంది. కోచ్ సురేశ్ ఈతలో మెలకువలు నేర్పిస్తున్నారు. నేను ఇప్పటికే రాష్ట్రస్థాయి బ్యాక్ స్ట్రాక్ విభాగంలో మెడల్ సాధించడం సంతోషంగా ఉంది. – ఎం.రవితేజ, బీటెక్, యైటింక్లయిన్కాలనీ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న సింగరేణి ఆర్జీ–2ఏరియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈతకొలనులో నేను సుమారు ఐదేళ్ల నుంచి ఈత ప్రాక్టీస్ చేస్తున్న. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి ఈతపోటీల్లో పాల్గొన్న బటర్ఫ్లై విభాగంలో మెడల్ సాధించడం ఆనందంగా ఉంది. – సుప్రతీక్, తొమ్మిదో తరగతి, యైటింక్లయిన్కాలనీ సీఈఆర్ క్లబ్లోని ఈతకొలను -
నాన్న..
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025అమ్మా..కన్నా..పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ జంటకు పదేళ్లక్రితం వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో హైదరాబాద్లో స్థిరపడ్డారు. తొలుత ఇప్పుడే పిల్లల ఆలోచన వద్దని నిర్ణయించుకున్నారు. ఐదేళ్లు గడిచిపోయాయి. ఇద్దరి వయసు ముప్పై ఏళ్లు దాటిపోయింది. జీవితంలో స్థిరపడ్డాం కదా అని.. తీరా సంతానం కోసం వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు, మూడేళ్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఎవరైనా పిల్లలను దత్తత తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారు.న్యూస్రీల్ -
పీఆర్పీ సాధనకు ఆందోళనలు
గోదావరిఖని: ఫెర్ఫార్మెన్స్ రి లేటెడ్ పేమెంట్(పీఆర్పీ) చే యాలని కోరుతూ సింగరేణి వ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు నిర్వహించేందుకు తీర్మానించినట్లు కోల్మైన్స్ ఆ ఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంవోఏఐ) ప్రధాన కార్యదర్శి నర్సింహులు, ఉపాధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవా రం రాత్రి స్థానిక బీ గెస్ట్హౌస్లోని సీఎంవోఏఐ కా ర్యాలయంలో రీజియన్స్థాయి సమావేశం నిర్వహించారు. వేతనాల్లో భాగమైన 2022–23 పీఆర్పీ, 2017–2014 బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఇందుకోసం రోజుకో ఏరియాలో నల్లబ్యాడ్జీలతో ని రసన తెలపాలని నిర్ణయించారు. అలాగే వర్క్టూరూల్స్ కొనసాగించాలి, జీఎం కార్యాలయాల్లో ప్రతీరోజు సాయంత్రం నిరసన తెలపాలని తీర్మానించారు. సెంట్రల్ కమిటీకి ఈ ప్రతిపాదనలు చేసి వెంటనే కార్యాచరణ ప్రకటించాలని రామగుండం రీజియన్ కోరింది. సమావేశంలో నాయకులు కోల మల్లేశ్, విష్ణు, పెరుమాళ్ల శ్రీనివాస్, దామోదర్, కట్ట శ్రీధర్, మధు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మేము ‘ఆగం’
● జరిమానా చెల్లిస్తాం.. కానీ నిబంధనలు పాటించం ● ఇద్దరికి మించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణం ● మైనర్ల చేతిలో బండి.. రయ్ రయ్ మంటూ డ్రైవింగ్ ● అతివేగం, అజాగ్రత్తలతో పట్టు తప్పి ప్రమాదాలుబైక్పై రయ్.. రయ్మంటూ దూసుకెళ్తున్న మైనర్లు వీరు. జిల్లా కేంద్రంలో గత మంగళవారం పాలిసెట్ రాసి ఇళ్లకు వెళ్తున్నారు. అసలే వేసవి సెలవులు.. ఫ్రెండ్స్తో ఎంజాయ్చేసే సమయం.. ఇంట్లో ఉండలేని మైనర్లు పరిమితికి మించి ఇలా బైక్లపై రైడింగ్ చేస్తున్నారు. రోడ్లపై దూసుకుపోతున్నారు. వాహనాలు ఇచ్చినవారిపై చర్యలు మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధం. వారికి వాహనాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లలకు తరచూ వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తాం. నంబరు ప్లేట్లు, నంబర్లు తొలగించినా క్రిమినల్ కేసులు తప్పవు. – జానీ నర్సింహులు, ట్రాఫిక్ ఏసీపీ సాక్షి, పెద్దపల్లి: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడంలేదు. కేసులు నమోదైనా సరే.. అవసరమైతే ఫైన్ చెల్లిస్తామని, రూల్స్ మాత్రం పాటించేదిలేదన్నట్లు చాలామంది యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. తమతోపాటు ఎదుటివారికి ప్రమాదమని తెలిసినా రయ్..రయ్మంటూ రోడ్లపై దూసుకుపోతున్నారు. అప్పుడు తనిఖీలు.. గతంలో పోలీసులు ప్రధాన కూడళ్లతోపాటు రహదారులపై నిత్యం తనిఖీలు చేసి జరిమానా విధించేవారు. ఈ చలానా పద్ధతి అందుబాటులోకి వచ్చాక ఉల్లంఘనలను కెమెరాలతో క్లిక్మనిపిస్తున్నారు. అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. అయినా, కొందరు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంనేందుకు అడ్డదారిలో వెళ్లి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ఏడాది 101 ప్రమాదాలు.. జిల్లాలో ఈఏడాది 101 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని రికార్డులు చెబుతున్నాయి. అందు లో 39మంది మృతిచెందారు. 108మంది గాయాలపాలయ్యారు. జిల్లాలో ప్రధానంగా 26 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఈ చలానా, నేరుగా జరిమానా విధిస్తున్నారు గత జనవరి నుంచి ఇప్పటివరకు 1.45లక్షల కేసులు నమోదుకాగా, రూ.4.12కోట్ల వరకు జరిమానా విధించినా.. వాహనదారుల్లో మార్పు కానరావడం లేదు. తప్పించుకునేలా ఎత్తులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిని పోలీసులు కెమెరాలతో ఫొటోలు తీస్తున్నారు. దీంతో కొందరు నంబరు ప్లేట్లో అంకెలు కనిపించకుండా చేస్తున్నారు. కొన్నింటిపై రంగులు పూస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారు అడ్డదారిని ఎంచుకుంటున్నారు. ఇలాంటివారే అధికంగా ఉంటున్నారు. ప్రమాదమని తెలిసినా.. ముందుకు వెళ్లి వాహనం వెనక్కి తిప్పుకొచ్చే అవకాశం ఉన్నా.. పట్టించుకోవడం లేదు. దర్జాగా వాహనాలకు ఎదురుగా వెళ్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారు. జైలు శిక్షలు ఉన్నా.. 18 ఏళ్ల వయసు నిండిన తర్వాతే గేర్ వాహనాలు నడిపేందుకు అర్హులని అధికారులు చెబుతున్నారు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 199ఏ ప్రకారం మైనర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేనివ్యక్తికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు, వాహన యజమానికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధించే అవకాశం ఉంది. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనలేని తల్లిదండ్రులు తమ పిల్లలకు బైక్లు ఇచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నారు.జిల్లాలో ఈఏడాది ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ 1,931 అతివేగం 6,731 ట్రిపుల్ రైడింగ్ 2,473 డ్రైవింగ్ లైసెన్స్ లేనివి 5,266 డ్రంక్ అండ్ డ్రైవ్ 3,813 సీట్బెల్ట్ ధరించనివి 138 మైనర్ రైడింగ్ 10 మొత్తం ట్రాఫిక్ కేసులు 1,45,673 జరిమానాలు(రూ.లలో) 4,12,99,615 జరిమానా చెల్లించినవారు 17,518 చెల్లించిన సొమ్ము(రూ.లలో) 50,00,035 -
నేడు సింగరేణి మెగా జాబ్మేళా
గోదావరిఖని: స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం నిర్వహించే మెగా జాబ్ మేళాకు సింగరేణి యాజమాన్యం అన్నిఏర్పాట్లు పూర్తిచేసింది. సుమారు వందకుపైగా కంపెనీలు హాజరై అర్హతలను బట్టి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. సింగరేణి యాజమాన్యం, నోబెల్ ఎన్ఫర్మెంట్ సొసైటీ ఫౌండర్ సురేశ్కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 8గంటల నుంచి జాబ్మేళా నిర్వహిస్తారు. విద్యార్హతలు, అనుభవం తదితర అంశాల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. సుమారు 3వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నిరుద్యోగులకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఎండదెబ్బకు గురికాకుండా కూలర్లు, మంచినీరు, మజ్జిగ, భోజన వసతులు కల్పించారు. -
ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన రూ.50.50 లక్షల వ్యంతో చేపట్టిన పార్క్ల అభి వృద్ధి పనులకు బల్దియా కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఎమ్మెల్యే శనివారం రాత్రి 26వ డివిజన్ దు ర్గానగర్లో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ, రామగుండాన్ని తెలంగాణలో ముఖ్యనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నా రు. ఏడాదిలోనే సుమారు రూ.59 కోట్ల అభివృద్ధి పనులు పూర్తికాగా, మరో రూ.100 కోట్ల పనులు వివిధ దశల్లో కొనసాగతున్నాయని తెలిపారు. ని ర్లక్ష్యానికి గురైన నగరాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ఏ ఒక్క నగరవాసి ఈ ప్రాంతం విడిచి వలస వెళ్లిపోకూడదనే లక్ష్యంతో పునర్నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ మాట్లాడుతూ, ప్రజల మానసికోల్లాసం, ఆహ్లాదం కోసం దుర్గానగర్తోపాటు ఏడు పార్క్ల్లో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డీఈ షాబాజ్, ఏ ఈ తేజస్విని, శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వా మి, మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, దాసరి ఉమాదేవి, దుర్గానగర్కా లనీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజేశ్వర్రావు, నారా యణ, కాలనీవాసులు బుచ్చిరెడ్డి, రవీందర్రెడ్డి, దామోదరాచార్యులు, పి.శ్రీనివా స్, స్వామిగౌడ్, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో పూజలు రామగుండం: శ్రీరామునిగుండాల కొండపై స్వ యంభూ వెలిసిన శ్రీధనుర్భానాంజనేయస్వామి దేవాలయంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ ప్రత్యేక పూజలు చేశారు. పూజారి శ్రీరాంపల్లి మురళీధర్శర్మ వేదమంత్రోచ్ఛారణాల మధ్య పూజలు చేయించారు. ఎమ్మెల్యే ము ఖ్య అనుచరులు దీటి బాలరాజు, కాంతాల శ్రీనివాస్రెడ్డి, కోల లక్ష్మణ్గౌడ్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ -
ఆన్లైన్ నమోదులో వేగం పెంచండి
కోల్సిటీ(రామగుండం): ఇందిరమ్మ ఇళ్లు పీఎంఏ వై, రేషన్కార్డు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని రా మగుండం నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం వార్డు అధికారులతో ఆయా ద రఖాస్తుల పరిశీలన ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. దారిద్య్రరేఖకు దిగువనవున్న వారికే పథకా ల లబ్ధిచేకూరేలా క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నా రు. వచ్చే వర్షాకాలం దృష్ట్యా పూడికతో నిండిన కా లువల వివరాలు, మొక్కలు నాటడానికి అనువైన స్థలాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రామన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హన్మంతరావు నాయక్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. -
సీపీని కలిసిన ఎమ్మెల్యే ఠాకూర్
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుస్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ నాయకులను సీపీకి పరిచయం చేశారు. నాయకులు మహంకాళి స్వామి, ముస్తాఫా, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు పెద్దపల్లిరూరల్: పశువులను కబేళాకు తరలించాలని, నాణ్యమైన మాంసం విక్రయించేందుకు పశువైద్యాధికారి అనుమతి పొందాలని ఏసీపీ కృష్ణ సూచించారు. బక్రీద్ నేపథ్యంలో సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై లక్ష్మణ్రావుతో కలిసి శుక్రవారం కబేళా నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనుమతి మేరకే వాహనాల్లో పశువులను తరలించాలన్నారు. పరిసర ప్రాంతవాసులకు ఇబ్బంది కలిగించేలా పశుమాంస విక్రయాలు చేయవద్దని అన్నారు. స్వచ్ఛత అందరి బాధ్యత జ్యోతినగర్(రామగుండం): స్వచ్ఛత అందరి బాధ్యతని ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. పర్మినెంట్ టౌన్షిప్ ప్రధాన దుకాణ సముదాయంలో శుక్రవారం స్వచ్ఛత పక్షోత్సవాలు నిర్వహించారు. పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతీఒక్కరు పాలుపంచుకోవాలని ఆయన కోరారు. తెలుగు, హిందీ భాషల్లో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా, దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఉన్నతాధికారి సింఘారాయ్, యూనియన్ నాయకులు, ఉద్యోగులు కుటుంబసభ్యులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. దుకాణాల్లో తనిఖీలు సుల్తానాబాద్(పెద్దపల్లి): పట్టణంలోని పలు వ్యాపార, వాణిజ్య దుకాణాలను తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు షాపుల్లో షాంపిళ్లు సేకరించారు. తక్కువ పరిమాణంలో సరుకులు లభించిన 8 దుకాణ యజమానులపై కేసులు నమోదు చేశారు. రూ.24వేల జరిమానా విధించారు. తూకంలో వినియోగదారులను మోసం చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. దోమల నియంత్రణతోనే డెంగీ దూరం పెద్దపల్లిరూరల్: దోమల నియంత్రణతోనే డెంగీ నియంత్రణ సాధ్యమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి అన్నారు. స్థానిక జిల్లా ఆస్పత్రి వద్ద శుక్రవారం డెంగీ అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ప్రగతినగర్ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. వచ్చే వానాకాలంలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని, ఈనేపథ్యంలో ఇళ్లలోని వ్యర్థాలు తొలగించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు శ్రీరాములు, రాజమౌళి, సుధాకర్రెడ్డి, వెంకటేశ్వర్లు, రమేశ్, రాజేశం, రవీందర్, అంజయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యం పెంచుకుంటేనే మెరుగైన బోధన
● ఉపాధ్యాయ శిక్షణకు పటిష్ట కార్యాచరణ ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధన నైపుణ్యం పెంపొందించుకుంటూ నాణ్యమైన విద్యాబోధన చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. స్థానిక జెడ్పీ బాలుర, బాలికల హైస్కూళ్లలో ఉపాధ్యాయుల వేసవి శిక్షణ శిబిరాలను డీఈవో మాధవితో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవ మైనదని, ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం వారికే ఉందన్నారు. ఈనెలాఖరు వరకు డిజిటల్ ఎడ్యుకేషన్, ఏఐ, స్కిల్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ లాంటి అంశాల తో పాటు గణిత, సోషల్, మండల రిసోర్స్ పర్సన్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, ఐఆర్పీలకు శిక్షణ అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పచ్చిరొట్ట విత్తనాలతో భూసారం పెంపు జీలుగ, జనుము లాంటి పచ్చిరొట్ట పైర్లను నేలలో కలియ దున్నడం ద్వారా భూసారం పెంపొందించుకోవచ్చని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక డీసీఎంఎస్ పాయింట్ వద్ద కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి రైతులకు 50శాతం రాయితీపై విత్త నాలను పంపిణీ చేశారు. జిల్లాలోని 51 కేంద్రాల ద్వారా రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 6వేల క్వింటాళ్ల జీలుగ, 600 క్వింటాళ్ల జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, డీఏవో ఆదిరెడ్డి, శ్రీనాథ్, అలివేణి, మల్లారెడ్డి, సురేశ్గౌడ్ పాల్గొన్నారు. -
పారదర్శకంగా ‘ఉపాధి’
● ఈజీఎస్ పనులపై నిఘా ● అన్ని గ్రామాల్లోనూ ఏర్పాట్లు రామగిరి(మంథని): గ్రామీణ కూలీలకు చేతినిండా పనులు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఉపాధిహామీ పథకం అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పనుల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేలా ప్రణా ళిక రూపొందించాయి. పథకాన్ని పకడ్బందీగా అ మలు చేసేందుకు గ్రామస్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభు త్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఉండగా తొలిసారి గ్రామ కమిటీల ఏర్పాటు కు కలెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. తరచూ తనిఖీలు.. సామాజిక తనిఖీ నివేదికలపై తరచూ సమీక్షించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు గ్రామ కమిటీలు ఉపాధి పనులు పర్యవేక్షిస్తాయి. అంతేకాదు.. ఏటా జరిగే సామాజిక తనిఖీ సభల్లో అవినీతిని గుర్తిస్తాయి. అవినీతి సొమ్మును రికవరీ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. జిల్లాలో మొత్తం జాబ్ కార్డులు 1,18,945 ఉండగా, ఇందులో 70,797 కారులు యాక్టివ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు సభ్యులతో కమిటీ.. ప్రతీ గ్రామ పంచాయతీలో ఐదుగురు సభ్యులతో కూడిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘం సభ్యులు, యూత్ సభ్యులు, ఆశ వర్కర్లు ఉంటారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు కమిటీలను ప్రతిపాధించి జిల్లా అధికారులకు నివేదిస్తారు. వారానికోసారి పరిశీలన కమిటీలు వారానికోకసారి ఉపాధి పనులు పరిశీలిస్తాయి. పనుల తీరు, మంజూరు, కూలీల హాజరు, చెల్లింపులు తదితర వివరాలు సేకరించి మండల పరిషత్ అధికారులకు నివేదిస్తాయి. వారు జిల్లా అధికారులకు అందజేస్తారు. ఇకనుంచి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతీనెల మొదటివారంలో తనిఖీలు చేయాలని, ఆ తర్వాత వివరాలను అందజేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. తనిఖీల్లో వెల్లడైన రికవరీ నిధులను తాత్సారం చేయకుండా రాబట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. జాబ్కార్డుల వివరాలు మండలం మొత్తం యాక్టివ్లోనివి పెద్దపల్లి 14,561 9,804 మంథని 12,545 8,121 సుల్తానాబాద్ 11,648 6,580 కాల్వశ్రీరాంపూర్ 8,536 5,586 ఓదెల 11,511 7,045 ముత్తారం 7,452 4,803 జూలపల్లి 7,486 3451 ఎలిగేడు 4,587 2,297 ధర్మారం 12,278 7,179 కమాన్పూర్ 5,920 2,951 అంతర్గాం 5,878 3,751 పాలకుర్తి 9,201 5,311 రామగిరి 7,342 3,918 జవాబుదారీగా ఉంటుంది ఉపాధిహామీ పథకంలో గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా సత్ఫలితాలు వస్తాయి. ఉపాధి పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది. ఆదిలోనే అవినీతికి అడ్డుకట్ట పడుతుంది. త్వరలోనే అన్ని గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలకు ఆదేశాలు జారీచేశాం. – కాళిందిని, డీఆర్డీవో -
కోతలు లేకుండానే కొనుగోళ్లు
పెద్దపల్లిరూరల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులను కోతల పేరిట రైస్మిల్లు యజమానులు ఇబ్బందులకు గురిచేయకుండా చర్యలు తీసుకున్నామని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం పనులు సాఫీగా సాగుతున్నాయన్నారు. ధాన్యం డ బ్బులు రైతు బ్యాంకు ఖాతాల్లో 48గంటల్లో జమ చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 319 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 35వేల మంది రైతుల నుంచి రూ.592కోట్ల 78 లక్షల విలువైన 2లక్షల 56 వేల 810 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో డీఎస్వో రాజేందర్, డీఎం శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్రిక్తతల మధ్య వైన్స్ భవనం కూల్చివేత
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ఆర్టీసీ బ స్టాండ్ సమీపంలోని వైన్స్షాప్ భవనాన్ని పోలీస్ బందోబస్తు మధ్య రామగుండం బల్దియా అధికారు లు శుక్రవారం కూల్చివేత ప్రారంభించారు. ఫోర్లే న్ సర్వీస్ రోడ్డు విస్తరణలో భాగంగా ఇటీవల సు మారు 25 దుకాణాలను కూల్చివేసిన అధికారులు.. చివరగా రోడ్డు సమీపంలోని మద్యం దుకాణ భవనాన్ని కూడా కూల్చివేతకు చర్యలు తీసుకున్నారు. రాజీవ్ రహదారి పక్కనే భవనం ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వన్టౌన్, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు. కూల్చివేతను అడ్డుకున్న భవన యజమాని గాజుల రాజమల్లుతోపాటు ఆయన కుమారుడిని పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 21వ తేదీ వరకు స్టేటస్కో ఉండగా ఎలా కూల్చివేస్తున్నారని ఆయన బల్దియా అధికారులను ప్రశ్నించారు. -
మారుపేర్ల డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలి
గోదావరిఖని: సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ వి చారణ పేరుతో పెండింగ్లో ఉన్న డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగాలివ్వాలని మారుపేర్ల బాధితులు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ ఇందిరా పార్క్వద్ద ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడు తూ వెయ్యి మంది నిరుద్యోగులను మారుపేర్లు, వి జిలెన్స్ విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. మారుపేర్ల బాధితుల సంఘం అధ్యక్షుడు లక్క శ్రావణ్గౌడ్, ప్రతినిధులు తిరుమల శ్రీనివా స్, ఈర్ల రాజయ్య, డిష్బాబు, రంజిత్, సందీప్, సత్యం, సంతోష్, రాజేందర్, శ్రావణ్, ఓంప్రకాశ్, సుధాకర్, నరేశ్, రంజిత్కుమార్ పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాలకు పెద్దపీట!
● అదనపు లైన్లు, రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు ద.మ.రై. నిధులు ● ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు విడుదల ● కొత్తపల్లి– మనోహరాబాద్కు రూ.205 కోట్లు ● పెద్దపల్లి బైపాస్కు రూ.36 కోట్లు, నిజామాబాద్–పెద్దపల్లికి రూ.13 కోట్లు ● కొలనూరు ఆర్వోబీకి రూ.29 కోట్లు, రాఘవాపురం ఆర్వోబీకి రూ.36 కోట్లు ● ఉమ్మడి జిల్లాకు రూ.435 కోట్లకుపైగా నిధులు ● ఆలస్యంగా దక్షిణ మధ్య రైల్వే పింక్బుక్కరీంనగర్క్రైం: వివాహితలపై వేధింపులు పెరగడం ప్రస్తుత సమాజాన్ని కలవరపెడుతోంది. గృహహింస, ఆత్మహత్యలు, హత్యలు, మిస్సింగ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరిగాయని అధికారక గణాంకాలు చెబుతున్నాయి. ఇల్లాలిపై భర్త, అత్తింటివారి వేధింపులు పెరుగుతుండడం, భర్తల రాక్షసత్వానికి వివాహితలు బలికావడం జరుగుతోంది. కాగా, మద్యానికి బానిసవడం, వివాహేతర సంబంధాలు, తదితర కారణాలు ఇల్లాలిపై దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇంటికి దీపం ఇల్లాలు.. అలాంటి ఆమైపె పెరుగుతున్న దాడులు ఆరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎట్టకేలకు దక్షిణమధ్య రైల్వే బడ్జెట్ 2025–26 వెలుగుచూసింది. వాస్తవానికి ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు లేదా మూడు రోజుల తర్వాత స్థానిక రైల్వే విభా గాల కేటాయింపులను పింక్ బుక్ పేరిట విడుదల చేస్తారు. కానీ.. దాదాపు నాలుగు నెలల తరువాత బడ్జెట్ వెలుగుచూడడం ఇదేతొలిసారి. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల మార్గాల్లో నెలకొన్న ఈ బడ్జెట్లో రైల్వే పనుల కోసం దాదాపు రూ.435 కోట్లకుగాపై నిధులు కేటాయించింది. ఇవే కాకుండా పలు అభివృద్ధి పనులకు మిగిలిన జిల్లాల్లోని స్టేషన్లతోకలిపి మరికొన్ని రూ.కోట్లు కేటాయించడం గమనార్హం. ఈసారి స్టేషన్ల ఆధునీకరణ, స్టేషన్లలో లైప్లైన్ల ఏర్పాటు, గూడ్స్ షెడ్ల నిర్మాణం, స్టేషన్లలో అదనపు మెయిన్ లైన్ల ఏర్పాటుకు ఈ నిధులు కేటాయించింది. కొత్తపల్లి మనోహరాబాద్కు రూ.205 కోట్లు అత్యంత కీలకదశలో ఉన్న కొత్తపల్లి–మనోహరా బాద్ (151 కి.మీ.) మార్గానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.205 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సిద్దిపేట (సుమారు 77 కి.మీ.) వరకు లైన్ పూర్తయి సర్వీసు కూడా నడుస్తోంది. సిరిసిల్ల–సిద్ధిపేట మ ధ్య లైన్పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్లలో భూసేకరణ వేగంగా సాగుతోంది. 2026 వరకు ట్రాక్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మిడ్మానేరులో బ్రిడ్జి పనులు స వాలుగా మారనున్నాయి. ఫలితంగా 2027లో పూర్తి అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ సర్వేలకు.. ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు లైన్లకు ఫైనల్ లొకేషన్ సర్వేలకు నిధులు కేటాయించింది. కరీంనగర్–హసన్పర్తి రూ.1.55 కోట్లు, పెద్దపల్లి బైపాస్ లైన్ ఎఫ్ఎల్ఎస్ సర్వే రూ.2 లక్షలు, పెద్దపల్లి–నిజామాబాద్ డబ్లింగ్ లైన్ ఎఫ్ ఎస్ఎల్ సర్వే కోసం రూ.3.56 కోట్లు ఇచ్చింది. మెయిన్లైన్కు ● నిజామాబాద్– కరీంనగర్–పెద్దపల్లి లైన్ కోసం రూ.13.86 కోట్లు ● పెద్దపల్లి బైపాస్ లైన్ (2.169 కి.మీ.) ను బల్హార్షా – కాజీపేట మెయిన్ లైన్కోసం రూ.36.99 కోట్లు కేటాయించింది. రైల్వేస్టేషన్ల కోసం.. ● నూకపల్లి– మల్యాల నూకపల్లి మల్యాల హాల్ట్ స్టేషన్ను బ్లాక్ స్టేషన్గా మార్చేందుకు రూ.15.85 కోట్లు. ● కరీంనగర్లో అదనంగా రెండు లూప్లైన్ల నిర్మాణం, రైల్వేస్టేషన్ కోసం రూ.27.50 కోట్లు. ● నిజామాబాద్–పెద్దపల్లి సెక్షన్లో లింగపేట–జగిత్యాల స్టేషన్లోలూప్లైన్ కోసం రూ.19.89 కోట్లు. ● మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లిలో ప్లాట్ఫారాల అభివృద్ధికి రూ.4.54 కోట్లు ● పెద్దపల్లిలో గూడ్స్ షెడ్ అభివృద్ధి కోసం రూ.9.99 కోట్లు. ● పెద్దపల్లి–నిజామాబాద్ మార్గంలో న్యూ క్రాసింగ్ స్టేషన్ పూడురు (నూకపల్లి మల్యాల–గంగాధర స్టేషన్ మధ్యలో) రూ.23.59 కోట్లు. ● సుల్తానాబాద్–ఎస్టీబీడీ యార్డ్ విస్తరణ, అప్గ్రేడేషన్ కోసం రూ.రూ.36.80 కోట్లు ● మణుగూరు–రామగుండం (రాఘవాపురం) 200 కి.మీ లైన్కు ఈసారి నామమాత్రపు నిధులు కేటాయించారు. రైలు వంతెనల కోసం.. ● కొలనూరు–పెద్దపల్లి ఆర్వోబీకిరూ.29.33కోట్లు ● పెద్దపల్లి–రాఘవాపురం ఆర్వోబీ కోసం రూ.36.83 కోట్లు. ● కొలనూరు–పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఆర్యూబీ రూ.7.41 కోట్లు కేటాయించారు.– 8లోu -
యువత కోసమే జాబ్మేళా
గోదావరిఖని: యువత భవిష్యత్ బలోపేతమే లక్ష్యంగా మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని నిరుద్యోగుల కోసం ఈనెల 18న స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తారన్నారు. నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయిమెంట్ అసోసియేషన్, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్మేళాలో వందకుపైగా ప్రఖ్యాత సంస్థలు పా ల్గొంటాయన్నారు. వివరాల కోసం 94911 44252, 99483 77353లో సంప్రదించాలని సూచించారు. ఏసీపీ రమేశ్, జీఎంలు లలిత్కుమార్, వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం జాబ్మేళా ఏర్పాట్ల ను ఏసీపీ రమేశ్, జీఎం లలిత్కుమార్ పరిశీలించారు. వన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, పర్సనల్ డీజీఎం కిరణ్బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం పెద్దపల్లిరూరల్: ప్రజాసంక్షేమం, పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి, మినీట్యాంక్ బండ్ వద్ద పబ్లిక్టాయిలెట్లు, ప్రభుత్వ ఐటీఐలో ప్రహరీ తదితర పనులను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించి మాట్లాడా రు. వాకర్స్ అసోసియేషన్ వినతిమేరకు ట్రాక్ చుట్టూ విద్యుత్దీపాలు ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. సిటిజన్హాల్ సందర్శన రామగుండం: కార్పొరేషన్ 22వ డివిజన్ ఇందిరమ్మకాలనీలోని సీనియర్ సిటిజన్హాల్ను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ గు రువారం సందర్శించారు. ప్రభుత్వ అవసరాల కోసం భవనం వినియోగించాలని అన్నారు. భవనంలో మహిళలకు కుట్టు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని మాజీ కార్పొరేటర్ నస్రీన్బేగం విన్నవించారు. మహిళా కాంగ్రెస్ అంత ర్గాం మండల అధ్యక్షురాలు నాజియాసుల్తానా, నాయకులు మహ్మద్ ఉస్మాన్ షరీఫ్, ఇంజినీర్ రామన్ తదితరులు పాల్గొన్నారు.మెకానిక్ కార్మికుల ‘టూల్ డౌన్’ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): ఆర్ఎఫ్సీఎల్ క ర్మాగారంలో మెకానిక్ కార్మికులు గురువారం టూల్డౌన్ సమ్మె చేశారు. రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఒక్కరోజు టూల్ డౌన్ నిర్వహించారు. ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేశ్ మాట్లాడుతూ, మెకానిక్ కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. యాజమా న్యం స్పందించకుంటే ఆర్ఎఫ్సీఎల్ గేట్ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.1.40కోట్లను కలెక్టర్ కోయ శ్రీహర్ష మంజూరు చేశారని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని హైస్కూల్లో అదనపు గదుల నిర్మాణానికి ఈ నిధులు వెచ్చిస్తారని ఆయన పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో విదార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. -
రూ.58.43 కోట్లతో అభివృద్ధి పనులు
● రామగుండం బల్దియా ప్రత్యేకాధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్షకోల్సిటీ(రామగుండం): నగరంలో రూ.58.43 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.9 కోట్ల 64 లక్షలు, ఎల్ఆర్ఎస్ ఇంట్రెస్ట్ ఫండ్స్ కింద రూ.84 లక్షలు, 14వ ఆర్థిక సంఘం కింద రూ.50 లక్షలు, టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.45 కోట్లతోపాటు ప్ర త్యేక అభివృద్ధి కింద రూ.కోటి 84 లక్షలు, వరద స హాయ నిధుల కింద రూ.65 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేసినట్లు ఆయన వివరించారు. ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరుగుపడాలి పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ, ఆయుర్వేద, హోమియో, మాతాశిశు ఆస్పత్రుల్లో వైద్యసేవలు మరింత మెరుగుపడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు దాని ఆవరణలోని పలు విభాగాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు వైద్య సేవలు అందించడంతోపాటు వారి సహాయకులకు సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేసి టెలివిజన్లను అమర్చాలని సూచించారు. డయగ్నొస్టిక్ కేంద్రం ద్వారా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, ఆర్ఎంవో విజయ్ తదితరులు ఉన్నారు. ఆయిల్పాం సాగును ప్రోత్సహించాలి జిల్లాలో ఆయిల్పాం సాగు వైపు రైతులను మళ్లించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించా రు. కలెక్టరేట్లో సాగు ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఆయిల్పాంకు కోతులబెడద ఉండదని, నాలుగేళ్ల దాకా అంతర పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందవచ్చని అన్నారు. ఆ తర్వాత అధికంగా ఆదాయం సమకూరుతుందనే విషయాలను రైతులకు వివరించాలని సూచించారు. సెప్టెంబర్ వరకు 1,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఉద్యానవన అధికారి జగన్మోహన్రెడ్డి, డీఏవో ఆదిరెడ్డి, సీఈవో శేషు తదితరులు ఉన్నారు. -
దుకాణాల కూల్చివేత
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ఆర్టీసీ బ స్టాండ్ సమీపంలోని సుమారు 25 దుకాణాలను బల్దియా అధికారులు బుధవారం కూల్చివేశారు. సర్వీస్ రోడ్డు విస్తరణలో భాగంగా 25 నుంచి 30 షాపులను తొలగించాలని అధికారులు ఇటీవల షాపుల నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. దీంతో షాపుల నిర్వాహకులు ఆందోళనకు గుయ్యారు. జేసీబీ సాయంతో అధికారులు దుకాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ ప్రక్రియను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్వయంగా కూల్చివేతల తీరును పరిశీలించారు. వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురిచేసి, దుకాణాలను కూల్చివేయడం సరికాదని ఆయన అన్నారు. అయితే కూల్చివేసిన దుకాణాల వెనుక సర్వీస్ రోడ్డుకు ఆటంకం లేకుండా తిరిగి దుకాణాలు కట్టుకోవడానికి సింగరేణి సంస్థ అంగీకారం తెలిపిందని సమాచారం. -
పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో ‘పారిశుధ్య కార్మికుల భద్రత.. రక్షణ.. గౌరవం’ అంశంపై కలెక్టరేట్లో బుధవారం ఎంపీడీవోలకు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. పల్లెప్రజల ఆరోగ్యం కోసం వీధులను పరిశుభ్రంగా ఉంచేలా శ్రమిస్తున్న కార్మికులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పంచాయతీ నిధుల నుంచి ప్రతీ కార్మికుడికి ప్రమాద బీమా ప్రీమియం చెల్లించాలని ఆదేశించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను డిసెంబర్ వరకు నియంత్రించేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను కలెక్టర్ సన్మానించారు. యూనిసెప్ ట్రెయినర్ కిషన్స్వామి, ఫణీంద్ర, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో కాళిందిని, జెడ్పీ సీఈవో నరేందర్, స్వచ్చభారత్ మేనేజర్ రాఘవులు తదితరులు పాల్గొన్నారు. సాగునీటి కాలువలకు మరమ్మతు చేయాలి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని సరఫరా చేసే కాలువలకు మరమ్మతు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఇందుకోసం ఉపాధిహామీ ద్వారా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారిని ఎంపిక చేయాలని అన్నారు. లీడ్బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి తదితరులు ఉన్నారు. -
వారం కింద తెచ్చిన
వారం క్రితం ధాన్యం మార్కెట్కు తెచ్చా. నాలుగైదు రోజుల వ్యవధిలో రెండు సార్లు వానలు పడ్డాయి. రెండుసార్లు వడ్లు తడిసినయి. కొంత నీటిలో కొట్టుకు పోయింది. జాప్యం లేకుండా ధాన్యం కొనేలా చర్యలు తీసుకోవాలి. – సొల్లూరి మణికంఠ, రైతు, పెద్దపల్లి పరిహారం చెల్లిస్తాం అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తాం. తడిసిన ప్రతీతిధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం. రైతులు ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వానిదే. – శ్రీధర్బాబు, రాష్ట్రమంత్రి ఎక్కువ కొనుగోలు చేశాం ధాన్యం తూకంలో జాప్యమేమీలేదు. గతేడాది మే 13నాటికి 2,11,449 మెట్రిక్ టన్నుల ధాన్యం తూకం వేస్తే, ప్రస్తుతం 2,18,392 మెట్రిక్ టన్నులు తూకం వేశాం. 82శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమచేశాం. – శ్రీహర్ష, కలెక్టర్ ఆందోళన వద్దు ధాన్యం పండించిన రైతులు ఆందోళన పడొద్దు. అనుకోకుండా కురిసిన వానలకు తడిసిన ధాన్యంపై ఉప్పు కలిపిన నీళ్లు చల్లండి. రంగు మారకుండా ఉంటుంది. చివరిగింజ వరకూ కొనేలా బాధ్యత తీసుకుంటాం. – విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి -
జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి
గోదావరిఖని: సింగరేణి చేపట్టిన మెగా జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా కోరారు. తన కార్యాలయంలో బుధవారం ఆ ర్జీ–1 జీఎం లలిత్కుమార్తో కలిసి జాబ్మేళా ప్రచార వాల్పోస్టర్ విడుదల చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నిరుద్యోగ యువతీయువకుల కోసం మేళా చేట్టారన్నారు. దాదాపుగా 100పైగా కంపెనీలు మేళాలో పాలుపంచుకుంటాయన్నారు. సుమారు 3వేలకు పైచిలుకు ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు. ఈనెల 18న ఉదయం 8గంటలకు ప్రారంభమైయ్యే మేళా గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వివరించారు. ఏసీపీ రమేశ్, అడ్మిన్ డీసీపీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్రావు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైభవంగా రథోత్సవం ఎలిగేడు(పెద్దపల్లి): ముప్పిరితోటలోని శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం, జాతర బుధవారం వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు రామిడి వెంకటరాంరెడ్డి. శ్రీనివాసరెడ్డి, కొండల్రెడ్డి, నిరంజన్రెడ్డి, సుదర్శన్రెడ్డి, అర్చకులు కొండపాక రామాచార్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా పెద్దపల్లిరూరల్: మున్సిపల్ పరిధిలో రోడ్లను ఆక్రమించి సామగ్రిని నిల్వ చేసినా, చెత్తాచెదారం పడేసినా జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ హెచ్చరించారు. స్థానిక బస్టాండ్ ప్రాంతంలోని స్క్రాప్ దుకాణం ఎదుట ఇనుప సామగ్రి నిల్వ ఉంచగా రూ.20వేల జరిమానా విధించి బుధవారం ఆ సొమ్ము వసూలు చేశారు. స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దడంలో ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఇంటి వద్దకు వచ్చే పారిశుధ్య సిబ్బందికి తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబరు 6303127484కు సమాచారం అందిస్తే పరిష్కరిస్తామని అన్నారు. వార్డు ఆఫీసర్లు అనిల్, ప్రదీప్, సాగర్, సురేశ్నాయక్ పాల్గొన్నారు. పడిపోతున్న నీటిమట్టం రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. నీటిపారుదలశాఖ అధికారులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో లేదు. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు 331 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. మెరిసిన ‘కరాటే’ హాసిని మంథని: మలేషియాలోని హైపోసిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ హాల్లో ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో పట్టణానికి చెంది న జపాన్ షిటోరియా కరా టే అకాడమీ విద్యార్థిని మె ట్టు హాసిని పతకాలు సాధించినట్లు ఇన్స్ట్రక్టర్ కావేటి సమ్మయ్య తెలిపారు. 66 కేజీల విభాగాల్లో బంగారు, వెండి పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. బాలికను కరాటే జాతీయ ఉపాధ్యక్షుడు పాపయ్య, రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు సమ్మయ్య అభినందించారు. -
స్కూళ్లను అభివృద్ధి చేయాలి
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): ప్రభుత్వ పాఠశాల ల అభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడాలని డీఈవో మాధవి సూచించారు. గర్రెపల్లి మోడల్ స్కూల్ లో ఆంగ్లం పాఠ్యాంశం ఉపాధ్యాయులకు ‘కెపాసి టీ బిల్డింగ్’ అంశంపై శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నా రు. డీఈవో బుధవారం తనిఖీ చేశారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా బోధనలో మెలకువలు నేర్చుకుని అభ్యసన సామర్థ్యాలు పెంపొందేలా వి ద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఆంగ్లంలో వెనుకబడిన వారిని గ్రూపులుగా విభజించి భాషపై పట్టు సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కరీంనగర్ విద్యా కళాశాల ప్రిన్సిపాల్ మొండయ్య, సెంటర్ అబ్జర్వర్ ప్రద్యుమ్నకుమార్, ఎంఈవో రాజ య్య, ప్రిన్సిపాల్ బల్బీర్కౌర్, రిసోర్స్ పర్సన్లు జగదీశ్వర్, శ్రీనివాస్, నాగరాజు, కిరణ్ పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరణ రామగుండం: స్థానిక బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజినీర్గా దాసరి శంకరయ్య బు ధవారం ఉద్యోగ బా ధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్ఈగా కొనసాగిన విజేందర్ వైటీపీపీకి బదిలీపై వెళ్లారు. 11 నె లల క్రితమే రామగుండం బీ– థర్మల్ కేంద్రం మూ తపడింది. సాంకేతిక అవసరాల కోసం విద్యుత్సౌ ధ కొందరు ఇంజినీర్లను ఇక్కడే కొనసాగిస్తోంది. కాగా, శంకరయ్యను ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శేఖర్, కరణ్కుమార్, అరుణ్, దుర్గయ్య, పి.శంకర్శాలువాతో సత్కరించారు. -
నిర్మాణం పూర్తయ్యాకే కూల్చివేత
● ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్(పెద్దపల్లి): కొత్త షాపింగ్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణం పూర్తయ్యాకే పాత కాంప్లెక్స్ భవనాల కూల్చివేతలు ఉంటాయని, అప్పటివరకు వ్యాపారం కొనసాగించవచ్చని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రూ.42లక్షల అంచ నా వ్యయంతో స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం ఎదుట చేపట్టిన కాంప్లెక్స్ పనులను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సుల్తానాబాద్ అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, ఇందుకోసం అందరూ సహకరించాలని ఆయన అన్నారు. కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గాజుల లక్ష్మి, నాయకులు గాజుల రాజమల్లు, సాయిరి మహేందర్, అబ్బయ్య, చిలుక సతీశ్, బిరుదు కృష్ణ, రఫీ పాల్గొన్నారు. -
రైతుకంట క‘న్నీళ్లు’
ఇతడు కౌలురైతు అల్లెపు సారయ్య. పెద్దపల్లిలోని జ్యోతినగర్ స్వస్థలం. పదెకరాల్లో వరి పండించాడు. ఇటీవల వరి కోసి వ్యవసాయ మార్కెట్కు వడ్లు తీసుకొచ్చాడు. తూకం వేయడంలో జాప్యమైంది. నాలుగు రోజు వ్యవధిలో రెండుసార్లు కురిసిన అకాలవర్షంలో వడ్లు కొట్టుకుపోయాయి. ధాన్యం తడవకుండా కప్పిన కవర్పై వర్షపునీరు ఎత్తిపోస్తున్న పెద్దపల్లిలోని సుభాష్నగర్కు చెందిన తూముల కై లాసం ఇతడు. 15 రోజులుగా మార్కెట్లో ధాన్యం కుప్పగా పోసి బార్దాన్ కోసం నిరీక్షిస్తున్నాడు. అకాల వానకు ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. -
ఓసీపీ–1.. సింగరేణిలో నంబర్–1
గోదావరిఖని: అత్యుత్తమ పనితీరు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.. ప్రమాదాల నియంత్రణ.. పర్యావరణ పరిరక్షణ.. వెరసి రెండోసారి ఫైవ్స్టార్ రేటింగ్ సాధించింది సింగరేణి ఓసీపీ–1 గని. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు అందుకుంది. అన్నింటా అగ్రగామిగా నిలిచి రెండోసారి ఫైవ్స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఈమేరకు కోల్మినిస్ట్రీ నుంచి బుధవారం సమాచారం అందింది. స్వీయ మూల్యాకనం.. బొగ్గు, లిగ్నైట్ గనుల పనితీరును స్వీయ మూల్యాంకనం చేయడం, కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ద్వారా స్టార్ రేటింగ్ విధానం 2019 ఏప్రిల్ 1 నుంచి కొనసాగుతోంది. అత్యుత్తమ విధివిధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉత్తమ రక్షణ తీరు అవలంబిస్తున్న ఓసీపీ–1కు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈఫైవ్స్టార్ రేటింగ్ ఇస్తోంది. ప్రాజెక్టు ఆర్ధిక పనితీరు, ఉద్యోగి సంక్షేమం, రక్షణ, ఉద్యోగ భద్రత వంటి ప్రమాణాల్లో ప్రాజెక్టు రెండోసారి ఉత్తమ పనితీరు కనబరిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కోల్కంట్రోలర్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్, కోల్మినిస్ట్రీ కార్యాలయం ప్రకటించిన జాబితాలో ప్రాజెక్టుకు చోటు లభించింది. సింగరేణిలోని అన్ని గనులు, ఓసీపీల్లో ఓసీపీ–వన్ 92పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది కూడా 91పాయింట్లు సాధించి ఫైవ్స్టార్ రేటింగ్ పొందింది. త్వరలో కేంద్ర బొగ్గుగనుల శాఖ ద్వారా ఈ అవార్డు అందుకోనుంది. ఫైవ్స్టార్ రేటింగ్ సాధనలో కృషి చేసిన ఓసీపీ–1 ఉద్యోగులు, అధికారులను ఆర్జీ–3 జీఎం సుధాకర్రావు అభినందించారు. పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానంలో భేష్ ఉపరితల గనికి వరుసగా రెండోసారి ఫైవ్స్టార్ రేటింగ్ ఇదేస్ఫూర్తి ప్రదర్శించాలి సింగరేణిలోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రెండోసారి ఫైవ్స్టార్ రేటింగ్ రావడం సంతోషంగా ఉంది. సమష్టి కృషి ఫలితంగానే బహుమతి అందుకోబోతున్నాం. భవిష్యత్లోనూ ఇదేస్ఫూర్తితో ముందుకు సాగాలి. కంపెనీకి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడంలో ప్రతీఒక్కరు కృషి చేయాలి. – రాజశేఖర్, ప్రాజెక్టు అధికారి -
నిద్ర.. గురుక.. గుండెపోటు!
నగరవాసుల్లో ఎక్కువగా.. నగరవాసుల్లో చాలామందిని గురక సమస్య వేధిస్తోంది. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, ఊబకాయం, మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (వోఎస్ఏ) అనేది గురకకు కారణమవుతోంది. కండరాలతో నిర్మాణం అయిన ఊపిరి గొట్టంలో నిద్రపోయే సమయంలో కలిగే ఆటంకంతో ఆ శబ్దం వస్తుంది. ఇలా వచ్చే శబ్దాన్నే గురక అంటారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి గురక రాదు. గురక ఉన్నవారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో తరచూ నిద్రలోంచి మేల్కొంటారు. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటే గుండె కొట్టుకునే వేగం పెరిగి.. నిద్రలోనే హార్ట్ ఎటాక్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పాలిసొమ్నోగ్రఫీతో పరీక్ష స్లీప్ అప్నీయాతో బాధపడే వారికి స్లీప్ స్టడీస్ (పాలిసొమ్నోగ్రఫీ) పరీక్ష అవసరమవుతుంది. గురకతో బాధపడుతున్న వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో అతని శరీర వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో ప్రత్యేక పరికరాలతో పరిశీలించి రికార్డు చేస్తారు. ఇందులో మెదడు పనితీరు తెలుసుకునేందుకు ఎలక్ట్రోఎన్సెపలోగ్రఫీ (ఈఈజీ), గుండె పనితీరు కోసం ఎలక్ట్రోకార్డియోగ్రఫీ (ఈసీజీ) కండరాల కదలికల కోసం ఎలక్ట్రోమియోగ్రామ్ తదితర పరికరాలను శరీరానికి అనుసంధానించి ఏ మేరకు నాణ్యమైన నిద్రపోతున్నారో లేదో అని పరీక్షిస్తారు. జనాభాలో 10 శాతం మందికి గురక సమస్యతో ఉమ్మడి జిల్లా జనాభాలో 10 శాతం మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ప్రతీరోజు 150మందికి పైగా అంటే నెలకు సుమారు 5,000 మంది గురక సమస్యతో ఆసుపత్రులకు వచ్చి చికిత్స పొందుతున్నారు. ఇందులో 200 మందికి పైగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా పరీక్ష చేయించుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ దీర్ఘకాలిక సమస్యగా బాధపడే వారు 2,000 మంది వరకు ఉంటారని వైద్యుల అంచనా.కరీంనగర్టౌన్: పొద్దంతా కష్టపడి పనిచేసి, రాత్రిపూట కడుపు నిండా భుజించి ప్రశాంతంగా నిద్రపోతే.. అర్ధరాత్రి ఎక్కడో గుర్ర్..గుర్ర్మంటూ వస్తోన్న శబ్దం చికాకు తెప్పిస్తుంది. గాఢనిద్రలో ఉన్నవారిని ఉలిక్కి పడేలా చేస్తుంది. పక్కన పడుకుంటే చెవుల్లో సప్తస్వరాలు మోగినట్లు వినిపించే గురక శబ్దం మంచి నిద్రను దూరం చేస్తుంది. గురకపెట్టేవారి పక్కన పడుకునే వారి కష్టాలు ఇవైతే.. గుర్ర్.. గుర్ర్మంటూ సోయిలేకుండా పడుకునేవారు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నారు. అకస్మాత్తుగా హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్కు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లా జనాభాలో 10 శాతం మంది రాత్రిపూట గురక పెట్టేవారు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.లక్షణాలు ఇవీ నిద్రలో ఐదుకన్నా ఎక్కువసార్లు శ్వాస ఆగిపోయినట్లు అనిపించి మెలకువ రావడం నిద్రపోయినా ఉదయం లేవగానే నిద్రలేమి ఉన్నట్లు అనిపించడం రాత్రి పూట ఛాతీలో నొప్పి.. నిద్రలేవగానే గొంతులో నొప్పి నిద్రలేవగానే తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలతో బాధపడే వారిని గురక బాధితులుగా గుర్తిస్తారు. జాగ్రత్తలు ఊబకాయంతో బాధపడుతుండే వారి బరువును తగ్గించుకోవడం ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లను మానుకోవడం బీపీ, షుగర్, థైరాయిండ్ నార్మల్గా ఉంచుకోవడం ప్రతీరోజు వాకింగ్, వ్యాయామం వంటివి చేయాలి.జీవనశైలిలో మార్పులతో.. గురకను తగ్గించుకోవాలంటే చికిత్సతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం, మద్య, ధూమపానాల వాడకాన్ని తగ్గించుకోవడం. షుగర్, బీపీ, థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం వల్ల గురక సమస్యకు మెరుగైన ఫలితం ఉంటుంది. నిద్రతో మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రలో వచ్చే చిన్నచిన్న సమస్యలకూ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యం చేయించుకోవాలి. – వినయ్కుమార్, పల్మనాలజిస్టు -
రాజన్న హుండీ ఆదాయం రూ.1.65 కోట్లు
హుండీ ఆదాయం లెక్కిస్తున్న ఆలయ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామికి హుండీలలో భక్తులు వేసిన కానుకల ద్వారా రూ.1,65,84,607 నగదు సమకూరింది. దాదాపు 20 రోజుల తర్వాత హుండీలను లెక్కించగా రూ.1.65 కోట్లతోపాటు 204 గ్రాముల బంగారం, 13.200 కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో కొప్పుల వినోద్రెడ్డి తెలిపారు. గుడి ఓపెన్స్లాబ్లో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య బుధవారం హుండీని లెక్కించారు. కరీంనగర్ సహాయ కమిషనర్ కార్యాలయ అధికారి సత్యనారాయణ, శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
అటు పుష్కరాలు.. ఇటు పనులు
మంథని: పన్నెండేళ్లకోసా నిర్వహించే సరస్వతీ పుష్కరాలు గురువారం ప్రారంభం కానున్నాయి. మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణాహిత నదులు కలుస్తుండంతో ఇక్కడ అంతర్వాహిణిగా ప్రవహించే సరస్వతీ నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. 12రోజుల పాటు జరిగే పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరివస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారికి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది కానీ.. అఽధికారుల ముందుచూపు లేమి, కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో భక్తులకు అవస్థలు తప్పేలాలేవు. ఇప్పుడే వంతెన మరమ్మతులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా(ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లోని మంథని మండలం) అడవిసోమన్పల్లి వంతెన అప్పటిసీఎం పీవీ నరసంహారావు హయాంలో నిర్మించారు. దాని సామర్థ్యాన్ని మించి వాహనాలు రాకపోకలు సాగించడం, పురాత వంతెన కావడంతో శిథిలావస్థకు చేరింది. దాని మరమ్మతులకు ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. సుమారు నెలరోజులుగా మరమ్మతులు కొనసా..గుతున్నాయి. దానిపై పగుళ్లు చూపాయి. పెద్దగుంతలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతంతోపాటు పాత నిర్మాణాన్ని తొలగించి సిమెంట్, కాంక్రీట్తో పనులు చేస్తున్నారు. ఒకవైపు వాహనాలకు అనుమతి ఇచ్చి మరోవైపు పనులు చేస్తున్నారు. పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వంతెన మీదుగా వాహనాలు నడుస్తున్నాయి. అంతేగాకుండా బొగ్గు లారీలు, ఇతర భారీ వాహనాలు సైతం పెద్దఎత్తున రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్కు తీవ్రఅంతరాయం ఏర్పడుతోంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇరువైపులా ఉన్న మానేరుతో ప్రమాదం ఏర్పడుతుంది. వాహనాలకు అంతరాయం ఒకేవైపు వాహనాల రాకపోకలతో భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. సాధారణ రోజుల్లో ఈపరిస్థితి ఉంటే.. పుష్కరాల సందర్భంగా 12 రోజులపాటు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్కు తీవ్రమైన అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. రోడ్డు విస్తరణ.. అభివృద్ధి మల్హర్ మండలం కొయ్యూర్ నుంచి కాటారం మండలం దన్వాడ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. సరస్వతీ పుష్కరాల తేదీలు ఏడాది ముందుగానే ప్రకటించారు. మంథని– కాటారం మధ్య విస్తరణ, అభివృద్ధి, సరిహద్దు వంతెన మరమ్మతులు ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా నత్తనడకన సాగుతుండడంతో పుష్కరాల వేళ భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. సరస్వతీ పుష్కరాల వేళ.. అధికారుల ముందుచూపు లేమి మంథని–కాటారం మధ్య సాగుతున్న అభివృద్ధి పనులు రెండు జిల్లాల సరిహద్దు వంతెనకు మరమ్మతులు ట్రాఫిక్కు అంతరాయం.. అసౌకర్యానికి గురవుతున్న వాహనదారులు అసౌకర్యం కలగకుండా చర్యలు మంథని మండలం అడవిసోమన్పల్లి వంతెనపై చేపట్టిన మరమ్మతు పనులతో వాహనదారులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటాం. పనులను పర్యవేక్షిస్తూ వర్క్ ఇన్స్పెక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. వాహనదారులు సహకరించాలి. –జఫార్, డీఈఈ, ఆర్ అండ్ బీ, మంథని -
తాత ఉన్నాడా.. అంటూ బంగారం చోరీ
జమ్మికుంట: తాత ఉన్నాడా అంటూ మాటలు కలిపిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ చేసిన సంఘటన బుధవారం జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. టౌన్ సీఐ రవి తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన ఇంజమూరి వెంకటలక్ష్మి ఇంటిముందుకు బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి వచ్చి తాతా ఉన్నాడా అంటూ ఆమె మెడలోని తులం బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి కొడుకు వెంకటసత్యనారాయణస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ వివరించారు. వివాహిత ఆత్మహత్యకోనరావుపేట(వేములవాడ): మండలంలోని మంగళ్లపల్లికి చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మంగళ్లపల్లికి చెందిన సాసాల లక్ష్మి(50)కి ఇటీవల రెండు సార్లు కిడ్నీలో రాళ్ల కోసం ఆపరేషన్లు జరిగాయి. బుధవారం చిన్న కోడలు సీమంతం గంభీరావుపేటలో జరుగగా కుటుంబసభ్యులు వెళ్లారు. లక్ష్మి మల్లారం శివారులోని ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతురాలికి భర్త అంజయ్య, కుమారులు మహేశ్, బ్రహ్మానందం, కూతురు జ్యోతి ఉన్నారు. వేములవాడ ఎస్సై మారుతి కేసు విచారణ చేపడుతున్నారు. పుష్కరాల్లో ఆర్టీసీ సిబ్బంది కోసం వైద్య శిబిరంవిద్యానగర్(కరీంనగర్): సరస్వతీ పుష్కరాల విధినిర్వహణలో ఉండే ఆర్టీసీ సిబ్బంది కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ జోనల్ హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏవీ గిరిసింహారావు తెలిపారు. కాళేశ్వరంలోని ప్రత్యేక ప్రయాణ ప్రాంగణంలో ఈవైద్య శిబిరం ఈనెల 15 నుంచి 26 వరకు కొనసాగుతుందని వివరించారు. ఆర్థికసాయం శంకరపట్నం: మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన వేముల చంద్రబాగ ఇటీవల మృతిచెందారు. బుధవారం ఆమె కుమారుడు శ్రీనివాస్కు 2004–05 ఎస్సెస్సీ స్నేహితులు వెంకటేశ్, సద్దాం, సంతోష్ రూ.11వేలు అందించారు. -
మావోయిస్టు పార్టీతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి
కరీంనగర్క్రైం: మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిల్మ్ భవన్లో పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా 5వ మహాసభలు అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈసందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ, సింగరేణి ఓపెన్ కాస్ట్ల విధ్వంసానికి, ఇటుక బట్టీలలో ఒరిస్సా కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉమ్మడి పౌరహక్కుల సంఘం జిల్లా కమిటీ పోరాటాలు నిర్వహించిందన్నారు. సంఘం నాయకులు కామ్రేడ్ గోపి రాజన్న, జాపా లక్ష్మారెడ్డి, అజాం ఆలీ, డాక్టర్ రామనాథం, నర్రా ప్రభాకర్ అక్రమ హత్యలు మొదలు జగిత్యాల జిల్లా రేచపల్లికి చెందిన పోగుల రాజేశంను అక్రమంగా అరెస్ట్ చేసిందని, అతడి కూతురును అల్లుడు హత్య చేస్తే కూతురు చివరి చూపునకు నోచుకోకుండా హింసించిందని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ, కగార్ పేరుతో ఆదివాసీలను, వారికి మద్దతుగా ఉన్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని, ఛత్తీస్గఢ్లో సైనిక క్యాంపులను ఎత్తివేయాలని తదితర అంవాలపై తీర్మాణాలు చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్చందర్, ప్రధాన కార్యదర్శి పాణి, ముడిమడుగుల మల్లన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడిగా బొంకూరి లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా పుల్ల సుచరిత, నారా వినోద్, కార్యదర్శిగా బొడ్డుపల్లి రవి, సహాయ కార్యదర్శులుగా గడ్డం సంజీవ్, రెడ్డిరాజుల సంపత్, కోశాధికారిగా మాదవనేని పర్వతాలును ఎన్నుకున్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్క నారాయణరావు -
ప్రశాంతంగా పాలిసెట్
పెద్దపల్లిరూరల్: జిల్లాలో మంగళవారం చేపట్టిన పాలిసెట్ ప్రశాంతంగా జరిగింది. 95 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని కో ఆర్డినేటర్ లక్ష్మీనర్సయ్య తెలిపారు. మొత్తం 2,488 మంది(1,336 మంది బాలురు, 1,152మంది బాలికలు) పరీక్షల కు హాజరుకావాల్సి ఉండగా 2,366 మంది (1,275మంది బాలురు, 1,091మంది బాలికలు) హాజరయ్యారన్నారు. పెద్దపల్లిలో ఏ ర్పాటు చేసిన ఆరు పరీక్ష కేంద్రాల వద్ద పో లీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పుష్కరాలకు ప్రత్యేక బస్సులుపెద్దపల్లిరూరల్: కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతీ పు ష్కరాలకు కరీంనగర్ రీజియన్లోని కరీంనగర్, గోదావరిఖని, మంథని నుంచి 50 ప్ర త్యేక బస్సులను నడపనున్నట్లు రీజినల్ మే నేజర్ రాజు తెలిపారు. కరీంనగర్ నుంచి 30 బస్సులు, గోదావరిఖని, మంథని నుంచి 10 బస్సుల చొప్పున నడుపుతున్నట్లు పే ర్కొన్నారు. గోదావరిఖని నుంచి పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.80 చార్జీ వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మంథని నుంచి పెద్దలకు రూ.140, పిల్లలకు రూ.70, కరీంనగర్ నుంచి పెద్దలకు రూ.280, పిల్లలకు రూ.140 వసూలు చేయనున్నట్లు వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ‘కేంద్రీయ’లో ప్రవేశాలు జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీలోని కేంద్రీయ విద్యాలయంలో 11వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శోభన్బాబు తెలిపారు. ఈనెల 16 నుంచి స్వీకరిస్తామన్నారు. సైన్స్, కామ ర్స్ గ్రూపుల కోసం ఈనెల 24వ తేదీలోగా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. -
నిరంతరం తాగునీరు
● రామగుండం నగరంలో ప్రతీరోజు తాగునీరు అందిస్తున్నాం ● జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో రోజువిడిచి రోజు సరఫరా చేస్తున్నాం ● మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోల్సిటీ(రామగుండం): జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అరుణశ్రీ తెలిపారు. వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా లీకేజీలు, నీటివనరుల లభ్యత, సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. -
లగ్గం.. షరతుల పగ్గం!
హుజూరాబాద్: గతంలో 25, 26 ఏళ్లు వచ్చేసరికి అబ్బాయిల్లో దాదాపు 80 శాతం మందికి పెళ్లిళ్లు అయిపోయేవి. కొన్నాళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండుమూడేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నా పెళ్లిళ్లు కావడం లేదు. 30ఏళ్లు దాటినా పెళ్లికాని ప్రసాద్ల సంఖ్య పెరిగిపోతోంది. అబ్బాయికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒక పెద్ద యజ్ఞమే చేయాల్సి వస్తోంది. గతంలో తల్లిదండ్రులు ఏదైనా సంబంధం చూస్తే అమ్మాయిలు మాట్లాడకుండా చేసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అమ్మాయిల ఇష్టాయిష్టాలను కాదనలేని పరిస్థితి. అమ్మాయి ఓకే అంటే తప్ప పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అమ్మాయిలు పూర్తి స్వేచ్ఛగా ఉంటున్నారు. మంచి వేతనం, సొంత ఇల్లు.. వంటివి ఉన్నవారి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి సంబంధాలను వెతకమని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. విదేశీ సంబంధాలు అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. పట్టింపులతో సమస్య.. అబ్బాయిల తల్లిదండ్రుల వ్యవహారశైలి కూడా కొంతవరకూ ఈ సమస్యకు కారణమని చెప్పవచ్చు. మంచి కట్నకానుకలు ఆశించడం, అమ్మాయి అందంగా ఉండాలని, అణకువగా ఉండాలని కోరుకుంటూ మొదట్లో వచ్చిన సంబంధాలను కాదనుకుంటున్నారు. తర్వాత వయసు దాటిపోతున్నా అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు. భిన్నమైన పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అబ్బాయిలను కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్లి చేస్తే అమ్మాయికి జీవితాంతం ఇబ్బంది ఉండదన్న భావన తల్లిదండ్రుల్లో ఉంటోంది. అదే పట్టణ ప్రాంతాల్లోని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్వేర్ సంబంధాలపై మొగ్గుచూపిస్తున్నారు. విదేశాల్లో ఉన్నారంటే కట్నం ఎంతయినా ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. దీంతో చిరుద్యోగాలు చేసుకునే అబ్బాయిలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేవారికి 35 ఏళ్లు దాటినా సంబంధాలు దొరకడం లేదు. మానసిక సమస్యలు పెళ్లికాకపోవడం వల్ల యువకులతోపాటు వారి తల్లిదండ్రులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడం వల్ల అబ్బాయిల్లో అసహనం, నిరుత్సాహం వంటివి పెరిగిపోతున్నట్టు మానసిక వైద్యులు చెబుతున్నారు. -
పారమిత విద్యార్థుల ప్రతిభ
ఎన్టీపీసీ కేవీలో వందశాతం ఉత్తీర్ణత ‘సీబీఎస్ఈ’ ఫలితాల్లో అల్ఫోర్స్ ప్రభంజనంమానేరు విజయకేతనం జ్యోతినగర్(రామగుండం): సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(సీబీఎస్ఈ)లో ఎన్టీపీసీ రామగుండం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు విజయదుందుబి మోగించారు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో పదో తరగతి, 12వ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో టాపర్గా నిలిచారు. పదో తరగతిలో 67 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 67 మంది ఉత్తీర్ణత సాధించారు. ఓం సాహూ(484/500), 12వ తరగతిలో 18 మంది విద్యార్థులు పరీక్షలకు హా జరుకాగా 18 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యా రు. సైన్స్ విభాగంలో పెండ్యాల ఆగస్త్యశర్మ (398/500), కుడితేటి ప్రద్యుమ్నరావు (396/ 500), కామర్స్ విభాగంలో హ్రిశికేశ్ (44 1/500) మార్కులు సాధించారు. దీంతో విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు, ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత, నామిని చైర్మన్ బిజయ్కుమార్ సిగ్దర్, ప్రిన్సిపాల్ ఓరుగంటి శోభన్బాబు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. చొప్పదండి నవోదయ ప్రభంజనం చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయం 2024–25 పదోతరగతి, పన్నెండో తరగతి సీబీ ఎస్ఈ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించింది. పన్నెండో తరగతిలో 500మార్కులకు 483మార్కులు సాధించి పి.రుత్విక్రెడ్డి మొదటి ర్యాంకు సాధించారు. పదోతరగతిలో వి.వశిష్ట యాదవ్ 500 మార్కులకు 480 మార్కులు సాధించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ మంగతాయారు అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్లోని అల్ఫోర్స్ సీబీఎస్ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రభంజనం సృష్టించినట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్రెడ్డి తెలిపారు. పదో తరగతిలో 500మార్కులకు గాను మహమ్మద్ షాజ్నీన్ తబాసుమ్ జాతీయస్థాయిలో 99.4శాతంతో 497మార్కులతో జిల్లాస్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఎం.సుచీత్రెడ్డి 493 మార్కులు, జె.సుప్రభ 492, ఆర్.వేదిక, టి.హర్షిణి 491, డి.హర్షిత్489, బి.ఆకృతి, సీహెచ్.అనీశ్కుమార్, రయానుద్దీన్ 488, ఏ.నక్షత్ర, పి.శ్రీవర్షిత, కె.నక్షత్రరెడ్డి 486మార్కులు సాధించారని పేర్కొన్నారు. 12వ తరగతిలో 500 మార్కులకు గాను వి.సంజీతరెడ్డి 482మార్కులు, ఎన్.అనిరుద్ సాయి 482, వి.శశాంక్రెడ్డి 478, జె.వమీకా 473 మార్కులు సాధించారని తెలిపారు. 10వ తరగతిలో అత్యధికసంఖ్యలో విద్యార్థులు 90శాతం మార్కులు సాధించారని, 12వ తరగతిలో 13మంది 90శాతం మార్కులు సాధించారని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో పారమిత హెరిటే జ్, వరల్డ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీకర్, పి.గోపికృష్ణ తెలిపారు. 500మార్కులకు గాను ఆకుల శ్రీరామచంద్ర 488 మార్కులు, రూపనిగమ, మనోజ్ఞలు 487, స్ఫూర్తి 481, బి.వర్షిణి480మార్కులు సాధించినట్లు తెలిపా రు. పాఠశాలకు చెందిన 62మంది 90శాతం పైన మార్కులు సాధించగా 80 నుంచి 100శా తం సాధించిన విద్యార్థులు 160మంది ఉన్నారని అన్నారు. విద్యార్థులను పారమిత పాఠశాలల అధినేత ఈ.ప్రసాద్రావు, డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రశ్మిత, రాకేశ్, ప్రాచీ, వినోద్రావు, వీయూఎం.ప్రసాద్, టీఎస్వీ.రమణ, హన్మంతరావు, రవీంద్ర పాత్రో, నాగరాజు అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో కరీంనగర్ పద్మనగర్లోని మానేరు సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి తెలిపారు. పాఠశాల నుంచి మొత్తం 98మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు తెలిపారు. పలువురు విద్యార్థులు తెలుగులో 100 మార్కులు, ఇంగ్లిష్లో 98మార్కులు, హిందీలో 97మార్కులు, సైన్స్, సోషల్లో 96మార్కులు, గణితంలో 95 మార్కులు సాధించారని అన్నారు. 500 మార్కులకు పాఠశాలకు చెందిన ఏ.ఆత్రేయ 471మార్కులు, మస్రా మహావీన్ 461, ఏ.అరవింద్రెడ్డి 458, ఏ.శరత్ చంద్ర 456మార్కులు సాధించి టాపర్లుగా నిలిచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను మానేరు విద్యాసంస్థల డైరెక్టర్లు కడారి సునీతరెడ్డి, కడారి కృష్ణారెడ్డి, కడారి శ్వేతారెడ్డి అభినందించారు. పది, పన్నెండో తరగతి విద్యార్థుల సత్తా -
మధుకర్ను స్వదేశానికి రప్పించండి
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి ఇతరులకు బ్యాంక్ ఖాతా ఇచ్చి ట్రావెల్ బ్యాన్ అయిన మల్లాపూర్ మధుకర్ను స్వదేశానికి రప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. జిల్లాలోని పెగడపెల్లి మండలం ఎల్లాపూర్కు చెందిన మల్లారపు మధుకర్ (27) ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తన బ్యాంక్ ఖాతా ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు లావాదేవీలు జరిపారు. దీంతో అజ్మాన్లోని కోర్టు అతనిపై ప్రయాణ నిషేధం (ట్రావెల్ బ్యాన్) విధించింది. విషయం తెలుసుకున్న మధుకర్ తల్లిదండ్రులు మల్లవ్వ, అంజయ్య ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డితో కలిసి హైదరాబాద్లోని ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. సీఎంవో ద్వారా సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని ప్రజావాణి ఇన్చార్జి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు. -
5 లోగా దరఖాస్తు చేసుకోవాలి
పెద్దపల్లిరూరల్: ఒడిశా రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఫస్టియర్ డిప్లొమా కోర్సులో చేరేందుకు ఆసక్తి, అర్హత గలవారు జూన్ 5లోగా దరఖాస్తు చేసు కోవాలని చేనేత, జౌళిశాఖ డెప్యూటీ డైరెక్టర్ విద్యాసాగర్ కోరారు. తెలంగాణ రాష్ట్రానికి 9 సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. మూడేళ్ల డిప్లొమా కోర్సులో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి 17 నుంచి 25 ఏళ్లలోపు వ యసు గలవారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత గలవారు కరీంనగర్లోని చేనేత, జౌళిశాఖ ఆఫీసులో దరఖాస్తు సమర్పించాలని కోరారు. సరస్వతీ పుష్కరాల ఉత్సవ కమిటీ నియామకంమంథని: త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతీ పుష్కరాలకు దేవాదాయ శాఖ 14 మంది స భ్యులతో ఉత్సవ కమిటీని మంగళవారం నియమించింది. కమిటీలో మంథనికి చెందిన మో హన్శర్మ అవధాని, సీతారాంశర్మతోపాటు 14 మందిని నియమించింది. కాగా ఉత్సవ కమిటీ చైర్మన్గా మోహన్శర్మ పేరు దాదాపుగా ఖరా రైంది. సభ్యులంతా మోహన్శర్మను ప్రకటించడమే మిగిలింది. కాగా 2015లో జరిగిన గోదా వరి పుష్కరాల్లో సైతం మోహన్శర్మ ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్గా సేవలందించారు. గోదావరి పుష్కరాల సమయంలో సమర్థవంతంగా సేవలందించినందుకు గాను మరోమారు సరస్వతీ పుష్కరాలకు ఉత్సవ కమిటీ చైర్మన్గా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూ మృతి గోదావరిఖని: ఒంటిపై పెట్రోల్పోసుకొని సోమవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ముత్తునూరి శ్రీనివాస్(38) మంగళవారం మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి 60శాతం కాలిన గాయాలతో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. ఈక్రమంలో శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. పేపర్ప్లేట్ల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం పెద్దపల్లిరూరల్: పట్టణంలోని ఎన్ఎస్ పేపర్ప్లేట్ల తయారీ కేంద్రంలో మంగళవారం ప్రమాదవశాత్తు షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా మంటలు వ్యా పించడంతో అప్రమత్తమై స్థానికులతో కలిసి మంటలను అదుపు చేస్తూనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై ల క్ష్మణ్రావుతో పాటు పోలీసు సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. డ్రైవర్, క్లీనర్కు గాయాలుధర్మపురి: ప్రమాదవశాత్తు లారీ బోల్తాపడి డ్రై వర్, క్లీనర్కు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని ఆకసాయిపల్లిలో మంగళవారం జరి గింది. నిజామాబాద్ నుంచి మంచిర్యాల వైపు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీ ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. -
ఒకరికొకరు అర్థం చేసుకోవాలి
తమ కూతురుకు పెళ్లి చేస్తే పరిస్థితి ఎలా ఉండాలో అమ్మాయి తల్లిదండ్రులు ముందే ఒక ఆలోచనకు వస్తున్నారు. పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను నిర్ణయించేది. అమ్మాయికి అర్థం చేసుకునే గుణం, అబ్బాయికి ఓపిక అనేది ఉన్నాయో లేవో గమనించి వివాహం చేస్తే ఆ బంధం నిలబడుతుంది. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది. – డాక్టర్ ప్రవీణ్కుమార్, హుజూరాబాద్ ఆలోచనల్లో మార్పు రావాలి అమ్మాయిల తల్లిదండ్రుల ధోరణి ప్రస్తుతం పూర్తిగా మారింది. గత 20 ఏళ్లలో అమ్మాయిల ఆలోచన సైతం మారింది. పెళ్లి చేసుకునే అబ్బాయి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అడుగులు ముందుకు పడుతున్నాయి. అర్థం చేసుకునే గుణం, కష్టపడేతత్వం, తెలివితేటలతో ఎదిగే యువకుడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది. – ఆడెపు రవీందర్, మ్యారేజ్ బ్యూరో, హుజూరాబాద్ మానసిక ఒత్తిడిలో తల్లిదండ్రులు అబ్బాయికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడాన్ని తల్లిదండ్రులు సమాజంలో నామోషీగా భావిస్తున్నారు. అబ్బాయిల్లో నిరుత్సాహం, పెళ్లి పట్ల విరక్తి భావం పెరుగుతోంది. కొందరిలో ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇప్పించడం చాలా అవసరం. పెళ్లి అన్న దాన్ని పరువుగా భావించడం వల్లే అబ్బాయిలు, వారి తల్లిదండ్రుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.– డాక్టర్ ఎల్.వర్షి, మానసిక నిపుణుడు, హుజూరాబాద్ -
ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని హనుమాన్వాడలో ద్విచక్రవాహనంపై వస్తున్న పాదం మల్లేశం, వితన్విల మృతికి కారణమైన నస్పూరి మణిదీప్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. మల్లేశం, ఆయన సోదరుడి కూతురు వితన్వి సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై వస్తుండగా మణిదీప్ అతిగా మద్యం సేవించి అతివేగంగా కారు నడిపి ఢీకొట్టాడు. ఈ ఘటనలో మల్లేశం, వితన్వి మృతిచెందారు. మల్లేశం సోదరుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు మణిదీప్పై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, ఏఎస్ఐ మోహన్, కానిస్టేబుల్ జీవన్ పాల్గొన్నారు. వడదెబ్బతో ఒకరి మృతివెల్గటూర్: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని జగదేవుపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సయ్య (46) రెండురోజులు ఎండలో వ్యవసాయ పనులకు వెళ్లాడు. వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. నర్సయ్యకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
ప్రాణాలు కాపాడేదెలా?
సాక్షి, పెద్దపల్లి: రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే అత్యవసర వైద్యసేవలు అందించి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉద్దేశించిన ట్రామాకేర్ కేంద్రాలు ప్రతిపాదనదశ వీడడం లేదు. కేంద్రప్రభుత్వం 2012లో ట్రామాకేర్ వైద్యసేవలు ప్రారంభించినా.. జిల్లాలో రాజీవ్ రహదారి విస్తరించి ఉన్నా ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. నిత్యం ఏదోఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉండడంతో గాయపడినవారిని సమీపంలోని జిల్లా ఆస్పత్రులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. చాలా సందర్భాల్లో సత్వర వైద్య సేవలు అందక గాయపడినవారు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదం జరిగిన తొలిగంట(గోల్డెన్ అవర్)లో సరైన వైద్యం అందిస్తే ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తి బతికే అవకాశాలు ఉన్నాయి. తాజా గా రాష్ట్రప్రభుత్వం 90 వరకు ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుకు అడుగులు వేస్తున్న తరుణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనూ వాటిని అందుబాటులోకి తీసుకు రావాలని స్థానికులు కోరుతున్నారు. ట్రామా వస్తే.. ఎంతోమేలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, రహదారులపై ప్రమాదాలు జరిగినా, ఇంట్లో జారీపడినా, భవనాలు కూలీ తీవ్రంగా గాయపడినా బాధితులకు సత్వరమే అత్యవసర వైద్య చికిత్సలు అందించడానికి ట్రామాకేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. బాధితుల ప్రాణాలు రక్షించడమే ధ్యేయంగా రహదారుల చెంతనే వీటిని ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్దేశించింది. ట్రామాకేర్ సెంటర్ల ద్వారా ఆర్థో, న్యూరో, జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్, అనెస్తీషియా, ఎంబీబీఎస్, ఎక్స్రే, అంబులెన్స్, డ్రైవర్, సహాయకులు మందులు, అత్యవసర ఆపరేషన్ ఽథియేటర్, ఐసీయూ తదితర అన్నిరకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా రెఫరల్ కేసుల సంఖ్య బాగా తగ్గుతుంది. చొరవ తీసుకుంటే జిల్లాలో ట్రాామా సెంటర్ ఏర్పాటు చేయాలని మూడేళ్లుగా డిమాండ్ వస్తోంది. జిల్లాలో ట్రామా సెంటర్ ఏర్పాటు కోసం జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు చొరవ చూపితే స్థానికంగా ఎంతోమందికి అత్యవసర వైద్యం అందుబాటులోకి వచ్చి ప్రాణాలు దక్కుతాయి. జిల్లాలో ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు ప్రతిపాదనలు దాటని ట్రామాకేర్ సెంటర్ సత్వర వైద్యం అందక పోతున్న ప్రాణాలు స్థానిక నేతలు చొరవ చూపాలని డిమాండ్ ప్రతిపాదన దశల్లోనే.. జిల్లాలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలనే అంశం ప్రతిపాదన దశలోనే ఉంది. ఇప్పటివరకు ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు రాలేదు. ప్రభత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. సెంటర్ ఏర్పాటు అయితే, రహదారి ప్రమాద బాధితులకు ఎంతో మేలు చేకూరుతుంది. – శ్రీధర్, డీసీహెచ్వో -
ఆధునిక నర్సింగ్ మార్గదర్శకురాలు నైటింగేల్
జ్యోతినగర్(రామగుండం): ఆధునిక నర్సింగ్ మార్గదర్శకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ అని ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత అన్నారు. సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పర్మినెంట్ టౌన్షిప్లోని ధన్వంతరి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నైటింగేల్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సులు ఏ ఆసుపత్రికై నా వెన్నెముక అని, వైద్యులు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు రోగిని పరిశీలిస్తారని, కానీ నర్సులు రోగి చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు శ్రద్ధ తీసుకుంటారని వారి సేవలను కొనియాడారు. అనంతరం నర్సులను సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఎన్టీపీసీ ప్రాజెక్టు ఉన్నతాధికారులు, ఆస్పత్రి డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు. -
సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలి
జూలపల్లి(పెద్దపల్లి): సమాజంలో శాంతి, స్నేహభావం పెంచేందుకు మనకు వారసత్వంగా వస్తున్న సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని చిన్మయ మిషన్ స్వామిజీ శ్రీ సాక్షిరూపానందస్వామి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి విచ్చేసిన ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుమ్మరికుంట శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అనంతరం జూలపల్లిలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి భక్తులకు భగవద్గీత ప్రవచనాలు వినిపించారు. భగవద్గీత ప్రవచనం వారం రోజులు సాయంత్రం వేళ ఉంటుందని ఆలయ పునర్నిర్మాణ దాత నల్ల మనోహర్రెడ్డి వివరించారు. అనంతరం అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు పోట్టాల మల్లేశం, కొప్పుల మహేశ్, వెంకటరమణ, ప్రదీప్కుమార్, మెండె మల్లేశం, నొముల గోపాల్రెడ్డి, మోహన్రెడ్డి, అర్చకులు ఉద్దండ నవీన్, భక్తులు పాల్గొన్నారు. -
బుద్ధుని బోధనలు అనుసరణీయం
ఎలిగేడు/జూలపల్లి: గౌతమ బుద్ధుని బోధనలు మానవాళికి అనుసరణీయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సోమవారం బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని ఎలిగేడు మండలం ధూళికట్ట, జూలపల్లి మండలం వడుకాపూర్ గ్రామాల పరిధిలోని బౌద్ధ స్తూపం వద్ద బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పంచశీల జెండా ఎగురవేసి మాట్లాడారు. మనిషి తన కోరికలను తగ్గిస్తేనే శాంతి, సౌభ్రాతృత్వం, ప్రకృతి, మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు. బుద్ధుని పంచశీలాలు, అష్టాంగామార్గాలు, దశపారమితలు ఆచరిస్తేనే ప్రపంచశాంతి ఉంటుందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు. ధూళికట్ట, వడుకాపూర్ నుంచి బౌద్ధ స్తూపం వద్దకు వచ్చేందుకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, బుద్ధ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దేవ శ్రీనివాస్ తన మరణానంతరం సదాశయ ఫౌండేషన్ ద్వారా అవయవదానం చేసేందుకు అంగీకార పత్రాన్ని ఎమ్మెల్యే సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు బాలుసాని పరుశరాములుగౌడ్, మొగురం రమేశ్, నాగభూమి బుద్ధ విహార్ గౌరవ సలహాదారు పుల్లయ్య కాంబ్లే, విండో డైరెక్టర్ పోల్సాని పుల్లారావు, అర్షనపల్లి వెంకటేశ్వర్రావు, సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు భీష్మాచారి, ఆకుల మహేందర్, కోండ్ర సంతూ, పాటకుల భూమయ్య, మానుమండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే విజయరమణారావు -
సమస్యలు సత్వరం పరిష్కరించండి
● ప్రజావాణిలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: ‘పెద్దపల్లి శివారు చందపల్లిలో ప్రభుత్వం కేటాయించిన వందగజాల స్థలంలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందించాలని శాంతినగర్కు చెందిన రాజమణి కలెక్టర్ను వేడుకుంది..’ ఇలా.. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలనుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ వేణుకు వినతులు అందించి పరిష్కారం చూపాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో సమస్యలపై స్వీకరించిన వినతులను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. -
ఇంధనం కరువు
● జనవరి నుంచి పెట్రోల్, డీజిల్ బిల్లులు పెండింగ్ ● పోలీసు వాహనాలకు డీజిల్ కరువు ● కరీంనగర్ కమిషనరేట్లో రూ.కోటికిపైగా బిల్లులు ● సిరిసిల్ల, రామగుండంలో రూ.40 లక్షల చొప్పున బాకీ ● వాహన మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడంలేదు ● మూడు నెలలుగా రాని స్టేషన్ నిర్వహణ బడ్జెట్సాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణ పోలీసులు సాంకేతికత, కేసుల దర్యాప్తు విషయంలో దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తున్నారు. ఈ విషయం ఇటీవల మరోసారి రుజువైంది. కానీ, కొన్నినెలలుగా పోలీసులకు సమయానికి నిధులు అందడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసు వాహనాలకు పెట్రోల్, డీజిల్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ పెట్రోల్ బిల్లులతోపాటు వాహనాల మరమ్మతులకు సంబంఽధించి మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడం లేదని వాపోతున్నారు. స్టేషన్ మెయింటెనెన్స్కు సంబంధించి అర్బన్, రూరల్ ఏరియాల్లో నెలనెలా కొంత మొత్తం అందజేస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పలువురు ఎస్హెచ్వోలు వాపోతున్నారు. గరిష్టంగా కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్జిల్లాలో కరీంనగర్, రామగుండం కమిషనరేట్లు, సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. కరీంనగర్ కమిషనరేట్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. ప్రతీ నె లా రూ.25 లక్షలకుపైగా నిధులు కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన కరీంనగర్ కమిషనరేట్లోనే దాదాపు రూ.కోటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సిరిసిల్ల లోనూ గత నాలుగు నెలలుగా బిల్లులు రావడం లేదని సమాచారం. అక్కడా దాదాపు రూ.40 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని సిబ్బంది వాపోతున్నారు. రామగుండంలో ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.40 లక్షలు మాత్రమే బిల్లులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. జగిత్యాలలో ఎలాంటి సమస్య లేదని స్పష్టంచేశారు. అంతా బానే ఉందని పైకి చెబుతున్న యూనిట్లలోనూ వాస్తవాలు వేరే ఉన్నాయని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. వాహనాల మరమ్మతుల డబ్బులు సకాలంలో విడుదల కాకపోవడంతో మెయింటెనెన్స్కు ఇబ్బందిగా ఉంటుందని పలువురు పోలీసు అధి కారులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమైన సందర్భాల్లో తమ చేతుల నుంచి డీజిల్ పోయించుకుంటున్నామని వాపోతున్నారు. మెయింటెనెన్స్కు తిప్పలే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు కమిషనరేట్లు, రెండు ఎస్పీ కార్యాలయాల్లో స్టేషన్ మెయింటెనెన్స్ డబ్బులు మూడు నెలలుగా రావడం లేదని సమాచారం. ప్రాంతాన్ని బట్టి అర్బన్, రూరల్ ఏరియాలకు ప్రతీ నెలా స్టేషనరీ, తదితర మెమెంటెనెన్స్కు కొంతమొత్తం రావాల్సి ఉంటుంది. వీటిని స్టేషనరీతోపాటు వచ్చిన వారికి టీ, కాఫీల కోసం వినియోగిస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పోలీసు అధికారులు వాపోతున్నారు. దీంతో పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. చాలాసార్లు తామే తొలుత చేతి నుంచి ఖర్చు చేసి, బిల్లులు వచ్చాక సర్దుబాటు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.యూనిట్ వాహనాలు కరీంనగర్ 380 రామగుండం 168 జగిత్యాల 242 సిరిసిల్ల 211 (నోట్: వాహనాల సంఖ్యలో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చు) -
ఎల్ఐజీ క్వార్టర్లు స్వాధీనం చేసుకోవాలి
పెద్దపల్లి పట్టణంలోని ప్రగతినగర్లో మున్సిపాలిటీకి చెందిన ఎల్ఐజీ 9 క్వార్టర్లు ప్రభుత్వానివే అని లోకాయుక్త నిర్ధారించింది. వాటిని స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినా ముందుకు రావడం లేదు. చొరవచూపి ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలి. – ఠాకూర్ హన్మాన్సింగ్, న్యాయవాది, పెద్దపల్లిరైతులను ఆదుకోవాలి అకాల వర్షాలతో నష్టపోయి న రైతులకు ప్రభుత్వం పరి హారం అందించి ఆదుకోవాలి. అలాగే కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. – సీపీఎం నాయకులు, పెద్దపల్లి మండలం -
నర్సింగ్ సేవలు వెలకట్టలేనివి
కోల్సిటీ(రామగుండం): నర్సింగ్ ఆఫీసర్లు అందించే సేవలు వెలకట్టలేనివని రామగుండం సిమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబింద్సింగ్ కొనియాడారు. సోమవారం గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో అంతర్జాతీయ నర్సింగ్ ఆఫీసర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫ్లోరెన్స్ నైటింగెల్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఫ్లోరెన్స్ నైటింగెల్ స్ఫూర్తితో సేవలను మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. అనంతరం నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఆఫీసర్లను సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. కేక్ను కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కాగా, గోదావరిఖని శారదానగర్లోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ ఆఫీసర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థినుల ఆ టాపాటలు ఆకట్టుకున్నాయి. ఫ్లోరెన్స్ నైటింగెల్ చిత్రపటానికి వైస్ ప్రిన్సిపాల్ సుశీల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడా పోటీలు, ఉపన్యాసం, సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. -
ఇంకెప్పుడు మారును
మా బతుకులుగోదావరిఖని(రామగుండం): ‘మారుపేర్ల వారసుల నియామకాలకు ఓకే.. దీనిపై కమిటీ వేసి వాస్తవాలు పరిశీలించి సమస్యను పరిష్కరించుకుందాం. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేద్దాం’ అని స్వయంగా సింగరేణి సీఎండీ హామీ ఇచ్చారు. కాగా, హామీ ఇచ్చి రెండునెలలు గడిచింది. ఉద్యోగాల కోసం పోరాడిన వారిలో ఇద్దరు యువకులు జీవితానికి దూరమయ్యారు. ఇంకా ఎంత మంది పోయాక ఉద్యోగాలొస్తాయని మారుపేర్ల వారసులు ఆవేదన చెందుతున్నారు. విజిలెన్స్ విచారణ, వయస్సు సరిగా లేదని తదితర కారణాలతో పెండింగ్లో పెట్టిన మారుపేర్ల వారసులకు ఇప్పటికీ ఉద్యోగాలు లభించలేదు. సంస్థ వ్యాప్తంగా సుమారు 1,200 మంది బాధితులు ఉన్నారు. యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు సమస్యను పరిష్కరించాల్సి ఉండగా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. సంస్థ సీఎండీ ఈఅంశంపై దృష్టి సారించి త్వరగా ఉద్యోగాలివ్వాలని వేడుకుంటున్నారు. విజిలెన్స్ విచారణ పేరిట.. నాలుగు దశాబ్దాల పాటు సింగరేణిలో పని చేయించుకున్న యాజమాన్యం అప్పుడు లేని సమస్యను వారి పిల్లలకు ఉద్యోగాలివ్వడంలో మాత్రం చూపిస్తోందని బాధితులు వాపోతున్నారు. ఊర్లో ఒకపేరు, పని వద్ద మరో పేరు ఉందనే సాకుతో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టింది. దీంతో చాలామంది కార్మికుల పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని పార్టీలు, యూనియన్ల నాయకులను కలిసి వినతిపత్రాలు అందజేసి వేడుకున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. విజిలెన్స్ విచారణ పేరుతో చాలా మంది డిపెండెంట్ల ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం, గుర్తింపు, ప్రాతినిధ్య, జాతీయ సంఘాలు సానుకూల ధోరణితో వ్యవహరించి తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. డిపెండెంట్లకు వయోపరిమితి 40 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో అందరికీ అవకాశం కల్పించాలంటున్నారు. ఈనెల 16న ధర్నా మారుపేర్ల వారసుల పిల్లలకు ఉద్యోగాలివ్వాలని కోరుతూ ఈనెల 16న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు మారుపేర్ల డిపెండెంట్ల సంఘం నాయకుడు శ్రావణ్ పేర్కొన్నారు. ధర్నా తర్వాత యాజమాన్యం తీరులో మార్పు రాకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. సింగరేణిలో కార్యరూపం దాల్చని మారుపేర్ల వారసుల సమస్య కమిటీల పేరుతో కాలయాపన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ముందుకుసాగని వైనంఫొటోలోని వ్యక్తి వేముల ప్రదీప్. ఊరు హుజూరాబాద్ మండలం ఆముదాలపల్లి. ఇతడి తండ్రి వేముల మల్లయ్య రామగుండం రీజియన్ జీడీకే 10ఏ గనిలో పనిచేసి 2016లో మెడికల్ అన్ఫిట్ అయ్యాడు. దీంతో ప్రదీప్ పదేళ్లుగా తండ్రి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో అతడి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. ప్రస్తుతం గోదావరిఖనిలో కూలీ పనులకు వెళ్తున్నాడు. యాజమాన్యం స్పందించి ఇప్పటికై నా ఉద్యోగం ఇచ్చి తన బతుకును నిలబెట్టాలని కోరుతున్నాడుశ్రీ.. ఇలా ఇతనొక్కడే కాదు.. సింగరేణి వ్యాప్తంగా చాలా మంది కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తున్నారు. -
ప్రతి గింజను కొంటాం
● ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లిరూరల్: అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని రైతులు ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి గింజను కొంటామని ఎమ్మెల్యే విజయరమణారావు భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో ధాన్యం కొట్టుకుపోయిందని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదివారం మార్కెట్యార్డును చైర్పర్సన్ ఈర్ల స్వరూప, మాజీ చైర్మన్ జడల సురేందర్, వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి తదితర నేతలతో సదర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యం రంగుమారకుండా, గింజ విరగకుండా ఉండేందుకు వీలుగా ఉప్పు నీరు చల్లాలని రైతులకు సూచించారు. ఉప్పు తెప్పించి నీళ్లలో కలిపి చల్లించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వంలో గింజ కోత లేకుండా కొనుగోలు చేస్తున్నారా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రైతుల కోట్లాది రూపాయల శ్రమను దోచుకున్నారని ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సన్నరకం ధాన్యానికి రూ.500బోనస్ చెల్లించి అండగా నిలిచిందన్నారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. నాయకులు నూగిల్ల మల్లయ్య, ఎడ్ల మహేందర్, ఉప్పురాజు, మసూద్ తదితరులున్నారు. -
డిప్యూటీ సీఎంను కలుస్తాం
విజిలెన్స్ అధికారులను కలిశాం. సంస్థ సీఎండీతో చర్చించాం. యాజమాన్యం సానుకూలంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా డిప్యూటీ సీఎంను కలిసి విజిలెన్స్ పెండింగ్ కేసులన్నీ క్లియర్ చేసేలా చూస్తాం. నెలరోజుల్లో పరిష్కారం లభించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. – జనక్ప్రసాద్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ అడ్వకేట్ జనరల్కు పంపాం మారుపేర్ల సమస్యపై న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్కు పంపాం. న్యాయ ప్రక్రియ క్లియరెన్స్ తర్వాత మారుపేర్ల ఉద్యోగాలకు ముందుకెళ్తాం. ఈనెల 20న సమ్మె తర్వాత మారుపేర్ల ఉద్యోగ ప్రక్రియ వేగవంతం చేసేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తాం. – కొరివి రాజ్కుమార్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి దశలవారీగా పరిష్కారం మార్చి చివరి వారంలో జరిగిన సమావేశంలో విజిలెన్స్ పెండింగ్ కేసులపై కమిటీ వేసి పరిష్కరించుకునేందుకు నిర్ణయానికి వచ్చాం. దశలవారీగా సమస్యలను బట్టి ఉద్యోగాలిచ్చే ప్రక్రియ ప్రారంభిస్తాం. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతో భేటి అయి సమస్యను పరిష్కరిస్తాం. – ఎన్.బలరాం, సంస్థ సీఎండీ -
ఏఎన్ఎం నుంచి వైస్ ప్రిన్సిపాల్ వరకు
సేవామూర్తులుఅనారోగ్యం పాలైనప్పుడు రక్తసంబంధీకులే దరిచేరని రోజులివీ. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకూ మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ. అచేతన స్థితిలో ఉన్నవారికి ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో దేవదూతల్లా నర్సింగ్ ఆఫీసర్లు సకల సేవలందిస్తున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా అనారోగ్యం బారినపడి ఆసుపత్రుల్లో చేరిన వారిని అమ్మ కన్నా మిన్నగా నర్సులు చూసుకుంటున్నారు. తెల్లని దుస్తుల్లో మిలమిలా మెరుస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. వారు అందించే సేవలు నిరుపమానం. రోగి అవసరం ఏదైనా చిటికెలో తీర్చడమో, తీర్చేందుకు ప్రయత్నించడమో చేస్తూ పేషెంట్లకు భరోసా కల్పిస్తారు. పైకి గంభీరంగా కనిపించినా పేషెంట్ ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తూ రోగుల పాలిట దైవాలుగా నిలుస్తున్నారు నర్సులు. నేడు నర్సింగ్ డే సందర్భంగా కథనం. – కరీంనగర్టౌన్/కోల్సిటీ మదర్ థెరిసాను రోల్డ్ మోడల్గా తీసుకున్నా. వైద్య సేవలపై ఆసక్తితో ఏఎన్ఎం స్థాయి నుంచి నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ హోదా వరకు చేరుకున్నాను. ఇంటర్ చదివే వయసులోనే ఏఎన్ఎమ్గా ఉద్యోగం వచ్చింది. ఇదే స్ఫూర్తితో జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ తోపాటు సైకాలజీ, పీడియాట్రిక్, ఏంఎస్డబ్ల్యూ కోర్సులు చదివాను. పేషెంట్లకు ఎదురుపడిన నర్సింగ్ ఆఫీసర్లు చక్కని చిరునవ్వుతో పలకరించి వైద్యం అందించాలని దృక్పథం నాలో బలంగా నాటుకుంది. అందుకే 2013 నుంచి 2022 వరకు స్టాఫ్నర్స్గా పని చేస్తున్నకాలంలో డిప్యూటేషన్పై కరీంనగర్ నర్సింగ్ స్కూల్లో ట్యూటర్గా పాఠాలు బోధించాను. 2022లో పదోన్నతిపై సిరిసిల్ల నర్సింగ్ కళాశాలలో లెక్చరర్గా పనిచేశా. గతేడాది అక్టోబర్ 30న రామగుండం నర్సింగ్ కళాశాలకు వైస్ ప్రిన్సిపాల్గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రోగులకు వైద్యం అందించడంలో నర్సింగ్ ఆఫీసర్ల సేవలు కీలకమైనవి. – సుశీల, వైస్ ప్రిన్సిపాల్, నర్సింగ్ కళాశాల, గోదావరిఖని – వివరాలు 8లో -
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి భా రీ ఈదురుగాలులతో పాటు కురిసిన వర్షం కష్టాలను తెచ్చి పెట్టింది. మార్కెట్ యార్డు ఆవరణ, పలు ప్రాంతాల్లో చెట్లు నేలవాలాయి. వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలోనే దాదాపు 20 చెట్లు నేల వాలాయని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప తెలిపారు. కాగా, నేలవాలిన చెట్లను తొలగించే పనులు ఆదివారం చేపట్టారు. నీడపట్టున ఉంటుందనుకుంటే.. పెద్దపల్లి మార్కెట్ యార్డులో పత్తి వ్యాపారి బంధువుకు చెందిన కారును నీడ పట్టున ఉంటుందని భావించి శనివారం మధ్యాహ్నం పార్కింగ్ చేశాడు. రాత్రి ఈదురుగాలులకు చెట్టు కారుపై పడగా, ధ్వంసమైంది. పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతంలోనూ కారుపై చెట్టు పడి కారు దెబ్బ తింది. భారీ వానకు మార్కెట్లో ధాన్యం తడిసింది. ధాన్యం ఆరబెట్టేందుకు రైతులు తంటాలుపడ్డారు. గాలివాన వచ్చి.. కష్టాలను తెచ్చి..