breaking news
Peddapalli District Latest News
-
మాతృ మరణాలపై అప్రమత్తం
పెద్దపల్లి: మాతృ మరణాలు సంభవించకుండా అ ప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన సమీక్షలో శ్రీహర్ష మాట్లాడారు. గర్భిణులకు ప్రతీనెల క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయాలని, హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి వైద్య సేవలు అందించాలని తెలిపారు. సీఎమ్మార్పై నిర్వహించిన స మీక్షలోనూ మాట్లాడుతూ, ఎఫ్సీఐ గోదాముల్లో రే క్ మూమెంట్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్వో పవిత్ర, డీసీహెచ్ఎస్ శ్రీధర్, డీసీఎస్వో శ్రీనాథ్, డీఎం శ్రీకాంత్, సివిల్ సప్లయ్ డీఎం రవికుమార్, రైస్మిల్లర్లు జయపాల్రెడ్డి, కేశవరావు, రాజన్న తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తిచేయాలి ఓదెల: అభివృద్ధి పనులు గడువులోగా పూర్తిచేయా లని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మండలంలో ఆ యన పర్యటించారు. ఈనెల 15లోగా ఇందిరమ్మ ఇ ళ్ల పెండింగు పనులను పూర్తిచేయాలన్నారు. సర్పంచులు పల్లె కనుకయ్య, కనికిరెడ్డి సతీశ్, తహసీల్దార్ వనజ, ఎంపీడీవో అనిల్రెడ్డి, డీఈఈ పద్మ, ఏఈఈ సచిన్, కార్యదర్శులు శంకర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆహార భద్రతపై రాజీలేవు కోల్సిటీ/పెద్దపల్లి: సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష స్పష్టం చేశారు. ఆహార పదార్థాల నిల్వ, తయారీ, పరిశుభ్రత, వ డ్డింపు వంటి అంశాల్లో నిబంధనలను పాటించా లన్నారు. తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వా టిని తాత్కాలికంగా మూసివేసి, లోపాలను సరిదిద్దిన తర్వాతే అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. మే 29న మంథని మార్కెట్ని శ్రీసాయి ఫ్యామిలీ రె స్టారెంట్ అండ్ మెస్, జూన్ 13న గోదావరిఖనిలోని డెస్టినేషన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘించినట్లు గుర్తించి మూసివేశారని, నిర్వాహకులు మార్పులు చేపట్టడంతో పునఃపరిశీలన అనంతరం శ్రీసాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ మెస్కు జూన్ 4న, డెస్టినేషన్ రెస్టారెంట్కు జూన్ 30న కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతులు జారీ చేసినట్లు వెల్లడించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
అర్హులందరి పేర్లు నమోదు చేయాలి
గోదావరిఖని: ఓటరు జాబితాలోని అర్హులైన వారందరి పేర్లు నమోదైయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు, బీఎల్ ఏ ఇన్చార్జిలు కృషి చేయాలని రామగుండం ఎమ్మె ల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎస్ఐఆర్ పురోగతి, బీఎల్ఏ లు చేపట్టాల్సిన బాధ్యతలు, ప్రజలకు అందించా ల్సిన సహకారంపై చర్చించారు. మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోల్సిటీ: రామగుండం గురుకుల పాఠశాల సమీపంలోని 27 ఎకరాల్లో సుమారు రూ.200 కోట్ల వ్య యంతో చేపట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ ప్రాజెక్టు నమూనాను తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏఈ నరేశ్, ఎంవీఆర్ కన్స్ట్రక్షన్ సీఈవో విజయ్కుమార్, ఇంజినీర్ మస్తాన్ ఎమ్మె ల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ను కలిశారు. ప్రాజెక్టు మ్యా ప్ చూపించారు. ఎమ్మెల్యే.. మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్లో అత్యాధునిక తరగతి గదు లు, విశాలమైన క్రీడా మైదానాలు, సీనియర్, జూని యర్ విద్యార్థులకు ప్రత్యేక హాస్టళ్లు, అధ్యాపకులు, సిబ్బందికి నివాసాలు, తల్లిదండ్రుల కోసం వెయిటింగ్ హాల్స్ తదితర వసతులు కల్పిస్తామన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తారాన్నరు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ -
ఆయిల్పామ్ సాగుపై అన్నదాతల ఆసక్తి
పెద్దపల్లి: వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, వరుసగా ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని పలువురు రైతులు ఆయిల్పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభు త్వం కూడా దీనిసాగు ప్రోత్సాహానికి రాయితీలూ వర్తింపజేస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 1,150 ఎకరాల్లో ఆయిల్పామ్ సా గు చేయాలని వ్యవసాయాధికారులు లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటివరకు సుమారు 200 ఎకరాల్లో మొక్కలు నాటారు. తద్వారా జిల్లాలో మొత్తం సా గు విస్తీర్ణం ఇప్పటివరకు సుమారు వెయ్యి ఎకరాలకు చేరినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. దిగుబడి అధికం.. ఆయిల్పామ్ ఎకరాకు సగటున 4 టన్నుల నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. తాజా గెల టన్ను ధర ప్రస్తుతం రూ.23,852 పలుకుతోంది. ఒక ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు సాగుకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. నాటిన మూడోసంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమై, దీర్ఘకాలం ఆదాయం వస్తుందని వివరిస్తున్నారు. అన్ని ఖర్చులు పోను ఎకరాపై రూ.1.5 లక్షల ఆదాయం వస్తుందని అంటున్నారు. అంతర్ పంటలతో అదనపు ఆదాయం ఆయిల్పామ్ మొక్కలు పూర్తిస్థాయిలో దిగుబడికి రావడానికి సుమారు మూడేళ్ల సమయం పడుతుంది. ఈలోగా అంతర్ పంటలు సాగుచేసి అదనపు ఆదాయం పొందే అవకాశమూ ఉంది. మొక్కలు నాటిన తర్వాత మొదటి సంవత్సరంలో అరటి, రెండో ఏడాది కూరగాయలు సాగు చేయాలి. వీటికి కూడా ఉద్యాన శాఖ ప్రోత్సాహం అందిస్తోంది. మొక్కల పెరుగుదల, ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణపై వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ, తోటను క్రమపద్ధతిలో సాగు చేయాలి. రాయితీలతో రైతులకు ప్రోత్సాహం ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు పలు రాయితీలు వర్తింపజేస్తోంది. డ్రిప్, ఎరువులు, మొక్కల సరఫరాకూ ఆర్థిక సాయం చేస్తోంది. ఉత్సాహవంతులు ఉద్యానవన అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చీడపీడల బెడద లేదు వరి వంటి సంప్రదాయ పంటలతో పోల్చితే.. ఆయిల్పామ్ సాగు చాలా సులభమని సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్రెడ్డి వివరిస్తున్నాడు. తను సాగు చేసిన తోటలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయంటున్నాడు. ముఖ్యంగా చీడపీడల బెడద చాలాతక్కువని, అడవిపందులు లేదా కోతుల వంటి వన్యప్రాణులు, ఇతర జంతువులతో నష్టం లేదని వివరించాడు. రైతులు భయం లేకుండా ఆయిల్పామ్ సాగు చేసుకోవచ్చని భరోసా ఇస్తున్నాడు. ఆయిల్పామ్తో అధిక ఆదాయంసుల్తానాబాద్రూరల్: ఆయిల్పామ్ సాగుతో అధిక లాభలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్యాంప్రసాద్ తెలిపారు. రేగడిమద్దికుంట గ్రామానికి చెందిన గోపిడి ప్రభాకర్రెడ్డి ఆయిల్పామ్ సాగు చేసి అద్భుత ఫలితాలు సాధించాడంటూ శుక్రవారం శ్యాంప్రసాద్ సన్మానించారు. రైతులు ఆయిల్పామ్ సాగుకు ముందుకు రావాలని కోరారు. సర్పంచ్ కొదాటి సాయికిరణ్, ఏఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పెరుగుతున్న విస్తీర్ణం జిల్లాలో వెయ్యి ఎకరాలకు చేరిన సాగు ఈ ఏడాది లక్ష్యం 1,150 ఎకరాలు ఇప్పటివరకు పంట వేసింది సుమారు 200 ఎకరాలు -
పూర్తిగా పండిన తర్వాతే కోత
ఆయిల్పామ్ మొక్కలు నాటిన తర్వాత సాధారణంగా మూడేళ్లకు దిగుబడి ప్రారంభమవుతుంది. అయితే, రైతులు పూర్తిగా పండిన గెలలు మాత్రమే కోయాలి. కోసిన 24 గంటల్లోగా ఫ్యాక్టరీకి తరలిస్తే నూనెశాతం అధికంగా లభిస్తుంది. ఈ దిశగా రైతులు సిద్ధంగా ఉండాలి. తద్వారా నాణ్యమైన పంట చేతికి వస్తుంది. – శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యాన అధికారి నేనూ సాగు చేస్తున్నా ఎలిగేడు మండలం శివపల్లిలోని నా సొంత రెండెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్పామ్ మొక్కలు ఇటీవల నాటించా. వరి వంటి అధిక నీటి అవసరం ఉన్న పంటల కన్నా ఆరుతడితోపాటు ఆయిల్పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి. మూడేళ్ల తర్వాత మంచి దిగుబడి వస్తుంది. ఈలోగా అంతర్ పంటలు వేసి అదనపు ఆదాయం పొందవచ్చు. – విజయరమణారావు, ప్రభుత్వ విప్ -
శనివారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2026
కల్యాణ్నగర్ – అడ్డగుంట మెయిన్ రోడ్డుపై మ్యాన్హోల్ మాతంగి కాంప్లెక్స్ సమీపంలో పైకప్పు పగిలిన మ్యాన్హోల్ గోదావరిఖని – శ్రీనివాస థియేటర్ మూలమలుపు సమీపంలో ..కోల్సిటీ: రామగుండం నగరంలోని రోడ్ల మధ్య మ్యాన్హోళ్లు ప్రమాదకరంగా మారాయి. మూతలు పగిలిపోవడం, కొన్నిచోట్ల పూర్తిగా తొలగిపోవడంతో నోళ్లు తెరిచి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో రహదారులపై వర్షపునీరు నిలిచి మ్యాన్హోళ్లు కనిపించకుండా పోతున్నాయి. వాహనదారులు, పాదచారులు వాటిలో పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రాణాలకే ముప్పు పొంచిఉందని నగవాసులు భయపడుతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.నోరు తెరిచిన మ్యాన్హోల్ -
సంరక్షణే సమస్య
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం నాటడం వరకే పరిమితమవుతోంద నే విమర్శలకు దారితీస్తోంది. ఏటా రూ.కోట్లు వెచ్చి స్తూ శాఖల వారీగా లక్ష్యం నిర్దేశిస్తున్నా ఆశించిన స్థాయిలో నెరవేరడంలేదు. ఈ ఏడాది 27.58 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా.. వర్షాలు ప్రారంభమైన తర్వాత కూడా నాటడం ఊపందుకోలేదు. ఇప్పటికే పదిరోజులుగా అనుకూల వర్షా లు కురుస్తున్నాయి. వివిధ శాఖలు సమన్వయంతో మొక్కల నాటడాన్ని వేగవంతం చేయాలని పర్యావరణవేత్తలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 5న వనమహోత్సవం ప్రారంభం జూన్ 5న కలెక్టర్ శ్రీహర్ష వనమహోత్సవం ప్రారంభించారు. వర్షాభావంతో నాటే ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా మారినా ప్రభుత్వ శాఖల్లో కదలిక క నిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈసారి 8 లక్షల మొక్కలను నివాసాల వద్ద నాటేలా పంపిణీ చేయనుండగా, మిగిలిన వాటిని 28 ప్రభుత్వ శాఖలకు కేటాయించారు. రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటే షన్, ప్రభుత్వ భూములు, అటవీ ప్రాంతాలు, కా ర్యాలయాలు, విద్యాసంస్థల్లో నాటేలా కార్యాచరణ రూపొందించారు. డీఆర్డీవోకు అత్యధికంగా 14.20 లక్షలు, మున్సిపల్కు 6.50 లక్షలు, పరిశ్రమల శాఖకు 4.50 లక్షలు, వ్యవసాయ శాఖకు లక్ష మొక్కల లక్ష్యం కేటాయించారు. 260 నర్సరీలు సిద్ధం.. మొక్కల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా 260 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేశా రు. డీఆర్డీవో ఉపాధిహామీ ద్వారా నిర్వహిస్తోంది. అటవీశాఖ పరిధిలో మరో 20కిపైగా ఉన్నాయి. నీడనిచ్చే వాటితోపాటు జామ, నిమ్మ, ఉసిరి, దానిమ్మ, చింత, అల్లనేరేడు వంటి పండ్ల మొక్కలు, గులాబీ, మందార, గన్నేరు వంటి పూలమొక్కలు పెంచుతున్నారు. ఉపాధిహామీ ద్వారా సుమారు 80 వేల గుంతలు తవ్వి మొక్కల నాటేందుకు ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. గీత కార్మికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈసారి 3వేల ఈత, 420 తాటిమొక్కలూ నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. బతికించడమే కీలకం మొక్కలు నాటడమేకాదు.. సంరక్షణకూ ప్రాధా న్యం ఇవ్వాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. గతంలో నాటినవాటిలో అత్యధికంగా ఎండిపోవ డం, సంరక్షణ లేక నష్టపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతీ మొక్కకు ట్రీగార్డు, ముళ్లకంచె ఏర్పా టు చేయడంతోపాటు, హరిత రక్షణ కమిటీలతో నిరంతర పర్యవేక్షించాలని కోరుతున్నారు. జిల్లాలో 27.58 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం వర్షాలు ఆరంభమైనా పుంజుకోని వనమహోత్సవం ఇప్పటికే నాటిన వాటి సంరక్షణపై తీవ్ర నిర్లక్ష్యం అధికారుల్లో కనిపించని ఆనాటి ఉత్సాహం ఎండిపోయిన ఈ మొక్కలు రామగుండం నగరంలోని శారదానగర్ వాటర్ట్యాంకు ఆవరణలోనివి. ఎండల తీవ్రతకు తోడు, సంరక్షణ చేపట్టక ఇలా నిర్జీవంగా మారిపోయాయి. -
స్పందించిన దాతలు
జ్యోతినగర్: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతు న్న మల్కాపూర్ గ్రామానికి చెందిన మానాల విరాట్ కు టుంబానికి రామగుండం స్వ చ్ఛంద సంస్థల ఐక్యవేదిక శ్రీ సీతారామ సేవా సమితి స భ్యులు శుక్రవారం రూ.10వేలు సాయం చేశా రు. ‘నా బిడ్డకు ప్రాణం పోయండి’ శీర్షికన గతనెల 20న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది, స్పందించిన ప్రతినిధులు.. బాధితుడి తల్లిదండ్రులు మానాల స్వప్న – తిరుమలేశ్కు ఈ సా యం చేశారు. సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేశ్, శ్రీభగవతీ హెల్పింగ్ క్లబ్ అధ్యక్షుడు కంకటీ రవిగౌడ్, లెనిన్, శ్రీనివాస్, కంది సుజాత, సరిత, లక్ష్మి, బిల్లా శ్రీదేవి, శారద, కొండు రమాదేవి, సుశీల పాల్గొన్నారు. అభ్యసన తీరు పరిశీలన మంథని: పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసన తీరును జిల్లా విద్యాశాఖాధికారి శా రద, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ షేక్ శుక్రవారం పరిశీలించారు. స్పాట్ అసెస్మెంట్ ని ర్వహించి విద్యార్థుల అభ్యాస స్థాయి అంచనా వేశారు. ప్రీ ప్రైమరీ విభాగాన్ని సందర్శించి అ భ్యాస వాతావరణం పరిశీలించారు. ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ లక్ష్య సాధనకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. మండల విద్యాధికారి దాసరి లక్ష్మి ఉన్నారు. జీవో 17ను రద్దు చేయాలి పెద్దపల్లి: జీవో నంబర్–17ను రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్ర హం వద్ద ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీ ఆర్ఎస్ శ్రేణులతో కలిసి శుక్రవారం నిరసన తెలిపారు. ఉష మాట్లాడుతూ, ప్రభుత్వ పా ఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా విద్యార్థులకు దుస్తులు, నోట్ బుక్కులు అందకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ ప్ర భుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న మా జీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆ రోపించారు. నాయకులు రవి, ని ఖిల్, అజీమ్, కన్నం శ్రావణ్, శంకర్, మహేశ్ పాల్గొన్నారు. ‘కో ఆప్షన్’ ఎంపిక ఎప్పుడు? సుల్తానాబాద్రూరల్: పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎంపికపై ఆసక్తి నెలకొంది. పంచా యతీరాజ్ చట్టం ప్రకారం.. పంచయతీ పాలకవర్గ కోలువదీరిన నెలరోజుల్లోగా కో ఆప్షన్ స భ్యులను ఎన్నుకోవాలని చెబుతోందని అధికారులు అంటున్నారు. ఒక్కో పంచాయతీలో ము గ్గురికి కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం దక్కతుంది. జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు ఉండగా, ముగ్గురు చొప్పున ఎన్నుకుంటే 789 మందికి పదువులు దక్కే అవకాశం ఉంటుంద ని భావిస్తున్నారు. ప్రభుత్వం కో ఆప్షన్ సభ్యు ల ఎంపికకు ఎప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తుందా? అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. బాధ్యతతో పనిచేయాలి పాలకుర్తి: వైద్య సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని డీఎంహెచ్వో పవిత్ర అన్నారు. బసంత్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవా రం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాతా, శివు ఆరోగ్య సేవలు మెరుగుపర్చి, గర్భిణులు, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు. వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చే యాలని సూచించారు. వైద్యురాలు శారళి, ఎంఎల్టిటీ మధు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 5న విరసం సదస్సు పెద్దపల్లి: హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 5న జరిగే ఆవిర్భావ సదస్సు ను విజయవంతం చేయాలని విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య, సీఎల్సీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కు మారస్వామి, ప్రతినిధి మార్వాడి సుదర్శన్ కో రారు. స్థానిక అమరవీరుల స్థూపం వద్ద ప్రజాసంఘాల నాయకులతో కలిసి శుక్రవారం ప్ర చార పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతినిధులు గాండ్ల మల్లేశం, దేవి సత్యం, ఐత బాపు, నంబయ్య, శ్రీపతి రాజగోపాల్, బండి శంకర్ గౌడ్, అయిందాల అంజన్న, బట్టారి ఆంజనేయస్వామి, గంగారాజ్, ఆజాద్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆదర్శం
పెద్దపల్లి: ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, తొలిదశలో ఇళ్ల నిర్మాణం పూర్తి చే సుకుని గృహ ప్రవేశం చేసిన కుటుంబాల్లో ఆనందం చూస్తున్నామని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇది గర్వకారణమన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాసీ్త్రనగర్, పూసాలలో ని ర్మాణం పూర్తిచేసుకొన్న లబ్ధిదారులు శుక్రవారం గృహ ప్రవేశాలు చేయగా.. విజయరమణారావు హాజరయ్యారు. ఈనెలలో రెండోదశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని తెలిపారు. ఎన్నికల మెనిఫెస్టో లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెలబెట్టుకుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అన్యా యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మా టలు చెప్పేది కాదని, చేతల్లో చూపెడుతోందని అ న్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పుష్పలత, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు -
డిజిటల్ విలేజ్ !
సాక్షి పెద్దపల్లి: జనాభా లెక్కలు అంటే కేవలం వ్యక్తులు, కుటుంబాల సంఖ్య నమోదు మాత్రమే కాదు.. ప్రతీ గ్రామం చరిత్ర, ప్రత్యేకతలు, మౌలిక వసతుల వివరాలు కూడా డిజిటల్ రూపంలో భద్రం కానున్నాయి. 2026 జనాభా లెక్కల్లో భాగంగా గ్రామాల సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియలో ప్రతీ గ్రామం ఎలా ఏర్పడింది? ఆ పేరుకు కారణం ఏమిటి? గతంలో ఏ పేరుతో పిలిచేవారు? గ్రామంలో ఉన్న చారిత్రక కట్టడాలు, ఆలయాలు, చెరువులు, విద్యా, వైద్య, ఇతర ప్రజా సౌకర్యాల వివరాలను నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని 263 గ్రామపంచాయతీల చరిత్ర, విశేషాలు ఇకపై డిజిటల్ రూపంలో భద్రం కానున్నాయి. గ్రామం ఎలా పుట్టింది? పేరు ఎలా వచ్చింది? ప్రతీ గ్రామం వెనుక ఉన్న చరిత్రను ప్రపంచానికి తెలిసేలా చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మీ ఊరు పేరు ఎలా వచ్చింది? పాత పేరు ఏమిటి? ఊరి ఆవిర్భావ కాలం, అక్కడ ఉన్న చారిత్రక కట్టడాలు, ఆలయాలు, స్థానికంగా ప్రచారంలో ఉన్న చారిత్రక విశేషాలు, చెరువులు, కోటలు, శాసనాలు, వారసత్వ కట్టడాలు వంటి అంశాలను నమోదు చేయనున్నారు. అలాగే గ్రామ పంచాయతీ పరిధి, రెవెన్యూ వివరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, బ్యాంకులు, తాగునీటి వసతి, రహదారులు, ఇతర మౌలిక వసతులు.. ఇలా ప్రతీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రత్యేక యాప్లో డిజిటల్ రూపంలో అధికారులు నమోదు చేయనున్నారు. అధికారులకు ప్రత్యేక శిక్షణ జిల్లాలోని 263 గ్రామపంచాయతీలకు సంబంధించిన చారిత్రక, పరిపాలన, సామాజిక, మౌలిక వసతుల వివరాలను ఈ ప్రక్రియలో ఏ సమాచారం ఎలా నమోదు చేయాలి, గ్రామ చరిత్రను ఏ విధంగా సేకరించాలి, మొబైల్ యాప్ వినియోగం ఎలా ఉండాలి అనే అంశాలపై ఈనెల 13వ తేదీ నుంచి ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పంచాయితీ కార్యదర్శులు, జీపీవోలను క్షేత్రస్థాయి సిబ్బందిగా, తహసీల్దార్లను పర్యవేక్షకులుగా నియమించారు. మున్సిపాలిటీల్లో కమిషనర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. శిక్షణ అనంతరం గ్రామాల వారీగా సమాచార సేకరణ ప్రారంభం కానుంది. చిన్న కుటుంబాలే ఎక్కువ జిల్లాలో ఇప్పటికే గృహగణన ప్రక్రియ పూర్తికాగా, సేకరించిన సమాచారాన్ని డిజిటలైజేషన్ చేశారు. 2026 జనాభా లెక్కల తొలిదశలో నిర్వహించిన గృహగణన ప్రకారం పెద్దపల్లి జిల్లాలో మొత్తం 2,21,504 గృహాలు నమోదైనట్లు తెలుస్తోంది. గత జనాభా లెక్కలతో పోలిస్తే ఉమ్మడి కుటుంబాల సంఖ్య తగ్గి, చిన్న కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒకే ఇంట్లో మూడు తరాలు కలిసి నివసించే కుటుంబాల కంటే భార్యాభర్తలు, పిల్లలతో కూడిన న్యూక్లియర్ ఫ్యామిలీస్ వైపు మొగ్గు చూపుతుండటంతో గృహాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. పట్టణీకరణ ప్రభావం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో గృహాలు, జనాభా పెరుగుదల నమోదైనట్లు గృహగణనలో తేలింది. ఉపాధి, విద్య, వ్యాపార అవకాశాల కోసం ప్రజలు పట్టణాల వైపు తరలివెళ్తుండటంతో పట్టణ జనాభా క్రమంగా పెరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. డిజిటలైజేషన్తో ప్రయోజనం గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర మౌలిక వసతుల వివరాలను డిజిటలైజ్ చేయడం వల్ల, ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి ప్రభుత్వానికి మరింత స్పష్టమైన డేటా అందుబాటులోకి వస్తుంది. ఈ డిజిటల్ నమోదు ద్వారా ప్రతీ ఊరి ప్రత్యేకత, చారిత్రక నేపథ్యం భవిష్యత్ తరాలకు డిజిటల్ రూపంలో సురక్షితంగా అందనుంది. ప్రతీ ఊరికి ఆన్లైన్లో ఒక చరిత్ర 2026 సెన్సెస్లో సరికొత్త అధ్యాయం జనాభా లెక్కల్లో భాగంగా ప్రతీ ఊరు సమగ్ర సమాచారం రికార్డు ఈనెల 13 నుంచి అధికారులకు శిక్షణ తరగతులు జిల్లాలో పెరిగిన చిన్న కుటుంబాల సంఖ్య, పట్టణీకరణ -
ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యాలు భేష్
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం సంస్థ ఉ ద్యోగుల సాంకేతిక నైపుణ్యాలు భేషుగ్గా ఉన్నాయని ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ముకుల్రాయ్ అన్నారు. గురువారం ప్రాజెక్టులో ఉద్యోగులు తయారు చేసిన రియల్ సైజ్ ఎల్టీ స్విచ్గేర్ శిక్షణ మాడ్యూల్ను ప్రారంభించారు. ఉద్యోగుల్లో ఆచరణాత్మక అభ్యాసాన్ని పెంపొందించడానికి, విద్యుత్ భద్రతపై అవగాహన బలో పేతం చేయడానికి, ప్రాజెక్టులోని ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఒక రియల్ సైజ్ ఎల్టి స్విచ్గేర్ను రూపొందించడం అభినందనీయమని అన్నారు. జీఎం అవిజిత్ దత్తా, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పీఎం ఇంటర్న్షిప్ను సద్వినియోగం చేసుకోవాలి పెద్దపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్ర ధాన మంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని నిరుద్యోగ మైనారిటీ యువతీ యువకులు సద్వి నియో గం చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పి.నరేశ్కుమార్ నాయకుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు 6–9 నెలల పాటు ఇంటర్న్షిప్ ఉంటుందని, ఒ కేసారి ఇచ్చే గ్రాంట్ నెలకు రూ.9,000 చొ ప్పున ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. 18–25 ఏళ్ల మధ్య ఉండి 10, 12వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొ మా, అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉండాలని, వార్షిక ఆదాయం రూ.2లక్షల లోపు ఉండాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఐటీఐలో ప్రవేశాలకు గడువు పెంపు పెద్దపల్లి: రామగుండం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ, ఏటీసీల్లో 2026–27 విద్యా సంవత్సర ప్రవేశాలకు ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ పి.శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోని విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం రామగుండం ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ పెద్దపల్లి: పాలకుర్తి మండలం జయ్యారం పంచాయతీ కార్యదర్శి ఎస్డీ అమ్జద్ పాషాను సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరాంపూర్ మండలం పందిల్ల, పెద్దపల్లి మండలం కాపులపల్లి జీపీల్లో విధులు నిర్వహించిన సమయంలో సంబంధిత జీపీల రికార్డులను ఇంతవరకు అప్పగించకపోవడంతోపాటు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు మండల పంచాయతీ అధికారులు నివేదించినట్లు తెలిపా రు. ఈవిషయమై పూర్తి రికార్డులు అప్పగించాలని ఆదేశించినా స్పందన లేదని, ఎలాంటి వివరణ లేదని పేర్కొన్నారు. దీంతో అమ్జద్ పాషాను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఖని నుంచి అయోధ్య, కాశీకి ప్రత్యేక ఆర్టీసీ బస్సు గోదావరిఖనిటౌన్: పుణ్యక్షేత్రాలైన అయోధ్య, కాశీకి ఈనెల 15న గోదావరిఖని నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు నడపనున్నట్టు ఖని డిపో మేనేజర్ కవిత తెలిపారు. 15న మధ్యాహ్నం ఒంటి గంటకు గోదావరిఖని నుంచి బయలుదేరి రాంటెక్ ప్రయాగరాజ్, అయోధ్య, కాశీ, గయా, బుద్ధ గయా, మైసూర్(శారదా శక్తిపీఠం) దర్శనం అనంతరం 7వ రోజు గోదావరిఖని చేరుకుంటుందని అన్నారు. ఒక్కరికి రూ.7100 చార్జి ఉంటుందని అన్నారు. భోజన, వసతులు ప్రయాణీకులే భరించాలని, మరిన్ని వివరాలకు సెల్.7013504982, 7382847596లలో సంప్రదించాలని తెలిపారు. -
అబద్ధాలాడందే హరీశ్కు నిద్రపట్టదు
కరీంనగర్ కార్పొరేషన్: ప్రతీరోజు వంద అబద్ధాలు ఆడందే బీఆర్ఎస్ నేత హరీశ్రావుకు నిద్రపట్టదని, తెలంగాణకు అసలైన ఎల్నినో ఆయనేనని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ధ్వజమెత్తారు. అబద్దాలల్లో పోటీపెడితే దేశంలోనే కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్లు మొదటి మూడు స్థానాల్లో ఉంటారని ఎద్దేవాచేశారు. గురువారం నగరంలోని ఆర్అండ్ బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మామ ఇంజినీర్, అల్లుడు సబ్ ఇంజినీర్ అయి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు రెండేళ్లు కూడా గడవక ముందే కుంగి పోయాయన్నారు. దీనికి కారకులెవరో హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారితీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, ఇప్పటికే కొన్ని మరమ్మతు పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. తెలంగాణకు అసలైన ఎల్నినో హరీష్రావేనని, వర్షాలు కురవద్దు ప్రాజెక్టులు నిండొద్దని కోరుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ద్వారా ఫస్ట్ ఫేజ్లోనే 5 లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరు అందిందని గుర్తుచేశారు. కానీ... కాళేశ్వరం పేరుతో కట్టిన లిఫ్టుల ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనీసం 50 వేల ఎకరాలకై నా నీళ్లిచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇక్కడి నీళ్లను మెదక్ జిల్లాలోని కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్లకు తరలించుకుపోయి సొంత భూములను తడుపుకున్నారని ఆరోపించారు. ఏకకాలంలో రూ.21 వేల కోట్లు కేటాయించి 25 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశామని, లబ్ధిపొందిన రైతులు మళ్లీ బ్యాంకులకు వెళ్లి కొత్త రుణాలు తెచ్చుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఇలా ఏకకాలంలో రుణమాఫీ జరిగి, మళ్లీ లోన్లు తెచ్చుకున్న ఒక్క రైతునైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూపించగలరా అని సవాల్ విసిరారు. ఇప్పటికే మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు రూ.4 వేల కోట్లకు పైగా రైతు భరోసా నిధులు విడుదల చేశామని అన్నారు. మరో వారం రోజుల్లో మిగతా రైతులందరికీ రూ. 9 వేల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబోతున్నామన్నారు. సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసయ్య, కాంగ్రెస్ నాయకులు, పడాల అజయ్ గౌడ్, మెతుకు కాంతయ్య, చెల్లొజ రాజు, చిలుక సతీష్ పాల్గొన్నారు. ఆయనే తెలంగాణకు అసలైన ఎల్నినో ప్రభుత్వ విప్ విజయరమణారావు -
పాపం.. సార్కు నిద్రొచ్చింది
పాఠాలు చెప్పి చెప్పి అలసిపోయినట్టున్నాడు పెద్ద సార్ అనుకుంటున్నారా.. లేక ఆలోచించి అలా సేదతీరుతూ నిద్రలోకి జారుకున్నాడు.. ఏదైనా అనుకోండి నిద్ర మాత్రం కప్పుకొచ్చింది సార్కి.. ఇదేం పద్ధతి సారు పాఠాలు చెప్పాల్సిన మీరే చదువుల ఆలయంలో కునుకు తీయడం ఏంటని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నదే 15మంది విద్యార్థులు. ఇద్దరు టీచర్లు. ఒకరు (ఉపాధ్యాయిని) పాఠాలు బోధిస్తుంటే ఇంకో సార్ తన చాంబర్లో తన కుర్చీలో నిద్రలోకి జారుకుని సాక్షి కెమెరాకు కనిపించాడు. – ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
విద్యార్థుల నమోదు లక్ష్యం సాధించాలి
పెద్దపల్లి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 34 వేల మంది విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జీరో నమోదు, 15లేదా అంతకంటే తక్కువ విద్యార్థుల నమోదు ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు పా ఠశాలల నుంచి వచ్చే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సర్టిఫి కెట్ (టీసీ) దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా క్లియర్ చేయాలని అన్నారు. నిబంధనలు పా టించని, సహకరించని ప్రైవేట్ పాఠశాలలకు వివరణ కోరుతూ చర్యలు ప్రారంభించాలని ఆదేశించా రు. ఈ సమావేశంలో సెక్టోరియల్ అధికారి మల్లేశ్గౌడ్, మండల విద్యాధికారులు, సంబంధిత ప్రభు త్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు కట్టుదిట్టంగా అమలు చేయాలి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్వహించిన జిల్లాస్థాయి ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు, ఇతర రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఫుడ్ సేఫ్టీ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాలిందిని, డీఎంహెచ్వో పవిత్ర, ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రవాణా శాఖ అధికారి కార్యాలయం తనిఖీ పెద్దపల్లిలోని ఆర్టీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయాల్లో అందుతున్న సేవలు, డైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, ఇతర సేవల ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అన్ని సేవలను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా అందించాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీలో సబ్ రిజిస్ట్రార్, ఆర్టీవో కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు. పనుల్లో పురోగతి సాధించాలి పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపాలిటీ 1వ వార్డులోని బందంపల్లి చెరువు కట్టను మినీటాంకుబండ్గా తీర్చిదిద్దేందుకు రూ.3.14 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం చెరువు కట్ట పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమి షనర్ వెంకటేశ్, కౌన్సిలర్ పూరెళ్ల శైలజసుధాకర్, ఏఈ సతీశ్ మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు. చేపల చెరువులతో నిరుద్యోగ యువతకు ఉపాధి గోదావరిఖని: సింగరేణి సంస్థ చేపల చెరువులు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం మేడిపల్లి ఓపెన్కాస్ట్ ప్రాజెక్టును సందర్శించి, ఓబీ డంప్ ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, చేపల చెరువులను ఆర్జీవన్ జీఎం లలిత్కుమార్తో కలిసి పరిశీలించారు. వృథాగా ఉన్న చెరువులను పునరుద్ధరించి చేపల పెంపకానికి వినియోగించాలని సూచించారు. సింగరేణి అధికారులు బానోతు కర్ణ తదితరులున్నారు. జీజీహెచ్ ఆస్పత్రి తనిఖీ కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని జీజీహెచ్ ఆస్పత్రిని కలెక్టర్ శ్రీహర్ష గురువారం తనిఖీచేశారు. క్రిటికల్ కేర్ సెంటర్, పలు వార్డులు, ఇన్పేషెంట్ (ఐపీ) విభాగం, ల్యాబ్, ఎక్స్రే విభాగంతోపాటు ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, పారిశుధ్య నిర్వహణ, సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతీరోజు నిర్వహిస్తున్న ఎక్స్రే పరీక్షల వివరాలను తప్పనిసరిగా కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పించాలని ఆదేశించారు.ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ హిమబిందు, ఆర్ఎంవో కృపాబాయి, వైద్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
‘సర్’ సమర్థవంతంగా పూర్తి చేయాలి
జ్యోతినగర్: భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. గురువారం ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్ టౌన్షిఫ్లోని కాకతీయ ఆడిటోరియంలో బీఎల్వోలు, బీఎల్ఏలు, కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అర్హుడైన ప్రతీ ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, ఇన్చార్జి కమిషనర్ అరుణశ్రీ, సంబంధిత అధికారులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలన రామగుండం కార్పొరేషన్ రెండో డివిజన్ జంగాలపల్లె శివారులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ గురువారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు తదితర మౌలిక సదుపాయాల పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంట మేయర్ స్వామి, కమిషనర్ అరుణశ్రీ, తహసీల్దార్ రవీందర్రావు, కార్పొరేటర్లు బాపు, రవి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీహరి తదితరులు ఉన్నారు. -
విద్యుత్ భద్రతపై అవగాహన
జ్యోతినగర్: జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా గురువారం ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్ టౌన్షిప్లో మహిళలకు విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించారు. ఏజీఎం సునీల్ అగర్వాల్, డీజీఎం విశ్వనాథ్లు పాల్గొని మాట్లాడుతూ గృహస్థాయిలో విద్యుత్ భద్రత ఎంతో ముఖ్యమని అన్నారు. విద్యుత్ ప్రమాదాలు నివారించడంలో, కుటుంబాలు, సమాజ శ్రేయస్సును నిర్ధారించడంలో సాధారణ భద్రత జాగ్రత్తలు దోహదపడుతాయని తెలిపారు. అనంతరం విద్యుత్ భద్రత అంశంపై క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి సభ్యురాళ్లు పాల్గొన్నారు. విద్యుత్ భద్రత నిరంతర బాధ్యత విద్యుత్ భద్రత నిరంతర బాధ్యత అని, అప్రమత్తతతో విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చని ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ముకుల్ రాయ్ అన్నారు. గురువారం ప్రాజక్టులోని హెచ్ఆర్ ఆడిటోరియంలో జాతీయ విద్యుత్ వారోత్సవాల ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యుత్ భద్రత కేవలం పవర్ ప్లాంట్ కార్యకలాపాలకే పరిమితం కాదని, టౌన్షిప్లు, కార్యాలయాలు, ఇళ్లలో కూడా ఇది అంతే ముఖ్యమని అన్నారు. ప్రాజెక్టులో వారం రోజుల పాటు జరిగిన భద్రతా అవగాహన, ఆచరణాత్మక ప్రదర్శనలు, క్విజ్ తతదితర పోటీల విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో జీఎంలు మనిష్ అగర్వాల్, అవిజిత్ దత్తా, బినోయ్ జోష్, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, దీప్తి మహిళా సమితి సభ్యురాళ్లతో పాటు వివిధ యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
యాచకులపై.. ఆపరేషన్ ముస్కాన్
ప్రధాన చౌరస్తాల్లో సిగ్నల్ పడితే చాలు పసిపాపలను చంకనెత్తుకుని చంటి పిల్ల ఆకలి తీర్చమని వేడుకుంటూ వాహనదారుల వెంట పడుతున్నారు. చిన్నారులను సైతం వెంట పెట్టుకుని తిప్పుతున్నారు. గురువారం పెద్దపల్లి బస్టాండ్ చౌరస్తాలో చిన్నారులు రాజీవ్రహదారి డివైడర్ ఎక్కి లారీ డ్రైవర్ను యాచించడం ‘సాక్షి’కి కనిపించింది. ప్రాణాలు పోతాయంటూ అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు వారించినా పెడ చెవిన పెట్టడంతో 1098కు సమాచారం అందించాడు. జిల్లా కేంద్రంలోని చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది బస్టాండ్ వద్దకు హుటాహుటిన చేరుకుని యాచిస్తున్న చిన్నారులను అదుపులోకి తీసుకుని చైల్డ్వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపర్చారు. ఖమ్మం జిల్లా మంగళగూడెంకు చెందిన వారిగా గుర్తించి అమ్మమ్మ సాయంతో అక్కాచెల్లెళ్లు యాచిస్తున్నారని, వారి పేరెంట్స్కు కౌన్సెలింగ్ ఇచ్చి స్వగ్రామం పంపించామని చైల్డ్లైన్ సిబ్బంది ‘సాక్షి’కి తెలిపారు. – ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
సమస్యలు పరిష్కరించాలి
గోదావరిఖని: ప్రభుత్వం జోక్యం చేసుకొని సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. గురువారం ఆర్జీ–1 జీఎం ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహిస్తున్న అధికారుల సంఘం నాయకులను కలుసుకొని సంఘీభావం తెలిపారు. పీఆర్పీ కోసం అధికారులు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రిలే దీక్షలకు దిగారన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట నాయకులు టీబీజీకేఎస్ నాయకులు మాదాసి రాంమూర్తి, పూదరి సత్యనారాయణ, అధికారుల సంఘం నేతలు పెరుమాళ్ల శ్రీనివాస్, కోల మల్లేశం, దామోదర్ తదితరులున్నారు. ఆర్జీ–2జీఎం ఆఫీస్ ఎదుట.. సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులు చేపట్టిన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. గురువారం ఆర్జీ–2 ఏరియా జీఎం ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. -
మత్తు వదిలించేలా..
గోదావరిఖని: డ్రగ్స్ విక్రయించడమే కాదు వినియోగించినా కటకటాలు లెక్కించాల్సిందే. గంజా యి రవాణా, విక్రయం, వినియోగం, డ్రగ్స్ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసుశాఖ.. గంజాయి పీల్చి తొలిసారి పట్టుబడితే డీ అడిక్షన్ సెంటర్కు తరలిస్తోంది. అయినా మార్పు రాకపోతే జైలుకు పంపిస్తోంది. విక్రయదారులపైనా ఉక్కు పాదం మోపుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా పో లీస్ ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేస్తోంది. స్పెషల్ డ్రైవ్ ద్వారా వ్యాపారుల జాడలు గుర్తిస్తోంది. కళాశాలల్లో ప్రత్యేక కమిటీలు డ్రగ్స్, గంజాయి సమూల నిర్మూలన కోసం యువతలో అవగాహన కల్పించేందుకు స్కూళ్లు, క ళాశాలు, విద్యాలయాల్లో ప్రత్యేక కమిటీలు ఏ ర్పాటు చేస్తున్నారు. మత్తు పదార్థాల వినియోగం, విక్రయాల ఆనవాళ్లపై తమకు సమాచారం అందించాలని పోలీస్ శాఖ కోరుతోంది. అంతేకాదు.. డ్రగ్స్తో కలిగే అనారోగ్య, కుటుంబ, ఆర్థిక, సామాజిక సమస్యల గురించి వివరిస్తోంది. విక్రయదారులపై ఉక్కుపాదం డ్రగ్స్ తయారీ, రవాణా, విక్రయ ముఠాలపై నిఘా పెట్టిన పోలీస్శాఖ.. తరచూ దాడులు చేస్తోంది. ఇతర రాష్ట్రాల సమన్వయంతో మాదకద్రవ్యాల రవాణా అరికడుతోంది. వ్యసనపరులు డీ– అడిక్షన్ సెంటర్కు.. డ్రగ్స్ బానిసలు నేరస్తులు కాదని, వ్యవసనం నుంచి దూరం చేసేందుకు చికిత్స అవసరమని పోలీసుశాఖ సూచిస్తోంది. అంతేకాదు.. వారికి చికిత్స అందించేందుకు వైద్యశాఖ సమన్వయంతో డీ–అడిక్షన్(వ్యసన విముక్తి) కేంద్రాలకు తరలిస్తోంది. వివిధ సందర్భాల్లో చేపట్టిన తనిఖీల్లో గంజాయి, డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన వారి మూత్రం శాంపిళ్లు సేకరిస్తోంది. పరీక్షల తర్వాత మత్తు తీసుకున్నారని నిర్ధారణ అయితే కేసు నమోదు చేసి 15రోజుల పాటు డీ అడిక్షన్ సెంటర్కు తరలిస్తోంది. ఇందు కోసం జిల్లాలో రెండు డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకటి, మార్కండేయకాలనీలో మరోటి ఉన్నాయి. వీటిలో సుమారు 25మందికి కౌన్సెలింగ్, వైద్య చికిత్స, కుటుంబ సభ్యుల సహకారంతో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఇందులోని వారు రెండోసారి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటోంది. డ్రగ్స్ విక్రయించినా, తాగుతూ రెండోసారి పట్టుబడినా.. వ్యసనపరులపై పోలీస్ శాఖ కఠిన చర్యలకు శ్రీకారం పాఠశాలలు, కళాశాలల్లో నియంత్రణకు ప్రత్యేక కమిటీలు -
ఆకట్టుకున్న మాక్డ్రిల్
జ్యోతినగర్: ఎన్టీపీసీలో అత్యవసర సేవల అధికారులు, సిబ్బంది బుధవారం మాక్డ్రిల్ నిర్వహించారు. బూడిద కట్ట వద్ద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జీఎంలు ముకుల్ రాయ్, సంజయ్కుమార్, ఎన్కేశర్మ, సీఐఎస్ఎఫ్, అగ్నిమాపక అధికారులు పర్యవేక్షించారు. సీఐఎస్ఎఫ్ అగ్నిమాపక, భద్రత, వైద్య, మానవ వనరులు, సివిల్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ తదితర విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. గుడిసెల బతుకులు మారలే పెద్దపల్లి: మార్పు తెస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా ప్రజల గుడిసెల బతుకులు మారలేదని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కలవేని శంకర్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందంతో కలిసి బుధవారం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో శంకర్ మాట్లాడారు. పేదలకు డబుల్బెడ్ రూ మ్ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. నాయకు లు గోశిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, కనకరా జ్, మార్కాపూర్ సూర్య, తాళ్లపల్లి లక్ష్మణ్, కో డం స్వామి, బాలాసాని లెనిన్, శేఖర్, ఎల్ల య్య, సాయి, తిరుమల, రమేశ్, నవీన్, రేణిగుంట్ల ప్రీతం, మనోజ్ కుమార్, రాజయ్య, మోహన్, రమేశ్, కరీం పాల్గొన్నారు. గనులపై జేఏసీ ధర్నా గోదావరిఖని: బొగ్గుగని కార్మికుల 12వ వేతన ఒప్పందం ప్రక్రియ ప్రారంభించాలనే డిమాండ్తో జాతీయ కార్మిక సంఘాల జేఏసీ బుధవా రం ఆర్జీ–వన్ ఏరియాలోని గనులపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపింది. వేతన ఒప్పందానికి అడ్డుగా ఉన్న నాలగు లేబర్కోడ్లను ర ద్దు చేయాలని డిమాండ్ చేసింది. నూతన వేత న కమిటీని 40శాతం ఫిట్మెంట్ బెనిఫిట్తో ఏర్పాటు చేసి ప్రక్రియ ప్రారంభించాలని డి మాండ్ చేసింది. జేఏసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, రంగు శ్రీను, మాదన మహేశ్, సంకె అశోక్, బోగ సతీశ్ బాబు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్లో ఎమ్మెల్యే గోదావరిఖనిటౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు, పార్కింగ్కు ఇబ్బందిగా ఉన్న చెట్ల తొలగింపు పనులను అధికారులు చేప ట్టారు. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ బుధవారం పనులు పరిశీలించారు. ప్రయాణికుల భద్రత, వాహనాల పార్కింక్ను దృష్టిలో ఉంచుకొని చెట్లను తొలగిస్తున్నామన్నారు. ఏడీఈగా శ్రీనివాస్ గోదావరిఖనిటౌన్: ఎన్పీడీసీఎల్ ఏడీఈగా జి.శ్రీనివాస్ తన కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏ ఈలు, విద్యుత్ సబ్బంది ఆయనకు పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
మొలకెత్తని ఆశలు
సాక్షి, పెద్దపల్లి: ఆరుద్ర కార్తె ప్రవేశించి వారంరోజులు కావొస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంలేదు. వానాకాలం సాగు ఆశించినస్థాయిలో ముందుకు సాగడంలేదు. సాధారణంగా జూన్ తొలివారంలోనే వర్షాలు విస్తారంగా కురిసి వివిధ పంటలతో పొలాలు పచ్చదనంతో కళకళలాడాల్సి ఉంది. ఈసారి ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడడం, వర్షాలు కురవక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తొలి జల్లులు పడగానే పత్తి విత్తనాలు వేసినా ఇంకా మొలకలు రాలేదు. మరోసారి విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. వరి నాట్లు వేయాల్సిన సమయం దాటిపోతుండగా పొలాలు నీళ్లులేక ఎండిపోవడంతో రైతులు తమ ఆశలన్నీ భారీవర్షాలపైనే పెట్టుకున్నారు. జిల్లాలో భూగర్భ జలాలు కూడా తగ్గిపోయాయి. ఎండల తీవ్రత, వర్షాల ఆలస్యంతో బావులు, బోర్లు నీరందించడం లేదు. చెరువులు, కుంటల్లో నీరులేక ఆయకట్టులోనూ సాగు ప్రారంభం కాలేదు. వర్షాధారం సాగుపైనే ఆధారపడే రైతులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పదిరోజులే వర్షం.. లోటు వర్షపాతం జూన్ ఒకటి నుంచి జూలై ఒకటో తేదీ వరకు జిల్లాలో కేవలం పదిరోజులే వర్షం నమోదైంది. జూన్ 5న చిరుజల్లులు ప్రారంభమైనా.. అన్ని మండలాలను తడపలేదు. ఇప్పటివరకు సాధారణంగా 168.5 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 164 మి.మీ. మాత్రమే నమోదై 3 మి.మీ. లోటు ఏర్పడింది. ఈసారి మోస్తరు కాకుండా చిరుజల్లులే కురవడంతో వ్యవసాయానికి పెద్దగా ఉపయోగపడలేదు. నేలలో తేమ నిలవడం లేదు. విత్తనాలు ఎండిపోవడం, నారుమడులు సిద్ధం కాకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో వారం రోజుల్లో భారీవర్షాలు కురవకపోతే వానాకాలం సాగు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఎదురైతే దిగుబడి తగ్గే ప్రమాదంతోపాటు పెట్టుబడి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 38 వేల ఎకరాల్లోనే.. జిల్లాలో ఈవానాకాలంలో 2,15,500 ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 38 వేల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. 52,094 ఎకరాల్లో పత్తి సాగు చేయాల్సి ఉండగా 19,970 ఎకరాల్లోనే విత్తనాలు వేశారు. వాటిలో కూడా అనేక ప్రాంతాల్లో మొలకలు రాక మళ్లీ విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. 886 ఎకరాల్లో మొక్కజొన్న సాగు లక్ష్యం ఉండగా ఇప్పటివరకు 79 ఎకరాల్లో, 38 ఎకరాల కంది లక్ష్యానికి 32 ఎకరాల్లోనే సాగు నమోదైంది. ఇప్పటివరకు 5,240 ఎకరాల్లో వరినారు పోయగా, అది 1,06,140 ఎకరాలకు సరిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం వర్షాల కోసం రైతుల ఎదురుచూపు ఇంకా ప్రారంభంకాని వరినాట్లు ఎక్కడా మొలకెత్తని పత్తి విత్తనాలు సగానికి పడిపోయిన సాగు విస్తీర్ణం పడిపోతున్న భూగర్భ జలాలు ఆందోళనలో అన్నదాతలు -
వినియోగంలోకి తీసుకురావాలి
రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా మానేరు గోదాం నిర్మించారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన దీనిని ఆరేళ్లుగా ఉపయోగించడంలేదు. ఏటా ఎరువులు పంపిస్తామని చెబుతున్నారే కానీ ఇప్పటివరకు సబ్సిడీ ఎరువులు రాలేదు. బయటి దుకాణాల్లో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. – మానెం రాజేందర్, రైతు, మల్లారం ఎరువులు పంపిస్తాం ఈ వానాకాలం సీజన్లో వెంకటాపూర్ మానేరు గో దాంలో ఎరువులు, విత్తనా లు అందుబాటులో ఉండే లా చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందిస్తాం. – మామిడాల అశోక్, సీఈవో, పీఏసీఎస్, మంథని -
పంట మార్పిడిపై దృష్టి పెట్టాలి
ఎలిగేడు: రైతులు పంట మార్పిడి పద్ధతిపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. శివపల్లిలోని తన సొంత మూడెకరాల్లో బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయిల్పామ్ మొక్కలు నాటారు. విప్ మాట్లాడుతూ, పంట మార్పిడి పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించేందుకు తానే స్వయంగా ఆయిల్పామ్ తోటల పెంపకం చేపట్టామన్నారు. కలెకక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, ఒంటరి మహిళలు, రెండ, మూడు ఎకరాలున్న మహిళలకు పూర్తిస్థాయి రాయితీతో ఆయిల్పామ్ మొక్కలు అందిస్తామన్నారు. సర్పంచ్ దుగ్యాల వాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, జిల్లా ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్, వ్యవసాయాధికారి శ్రీనివాస్, తిరుమల ఆయిల్ కంపనీ సీఈవో కేశుకల్యాణ్, ఉద్యాన అధికారులు మహేశ్, జ్యోతి, తహసీల్దార్ యాకన్న, ఎంపీడీవో భాస్కర్రావు, ఏవో ఉమాపతి, ఏఈవోలు సురేశ్, గణేశ్, శరణ్య తదితరులు పాల్గొన్నారు. దసరా వరకు బస్సుడిపో ప్రారంభం ఓదెల: దసరా పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సు డిపో ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. లంబాడితండా గ్రామపంచాయతీ భవనం ప్రారంభం, రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు నిమ్మనాయక్, ఉపసర్పంచ్ గుగులోతు లింగేశ్, నాయకులు సాగర్రెడ్డి, పిట్టల రవికుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
నిర్లక్ష్యం.. నిరుపయోగం
మంథనిరూరల్: రైతులకు రాయితీపై అందించే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో గత ప్రభుత్వం మంథని మండలం వెంకటాపూర్లో నిర్మించిన మానేరు గోదాం నిరుపయోగంగా మారిపోతోంది. తూర్పున ఉన్న ఏడు గ్రామపంచాయతీల పరిధిలోని అన్నదాతలకు ఉపయోగపడేలా గోదాం నిర్మించారు. వానాకాలం, యాసంగి సీజన్లలో ప్రభుత్వం సబ్సిడీపై అందించే ఎరువులు, విత్తనాలను ఇందులో తొలుత నిల్వ చేసేలా ఏర్పాట్లు చేశారు. గోదాం నిర్వహణపై పీఏసీఎస్ పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆరేళ్లుగా అలంకారప్రాయంగానే మిగిలిపోయింది. రూ.35లక్షల వ్యయంతో.. బీఆర్ఎస్ హయాంలో 2018లో రూ.35లక్షల వ్యయంతో పీఏసీఎస్ మానేరు గోదాం నిర్మించారు. అదేఏడాది రైతులకు అందుబాటులో ఉంచిన ఎరువులు, విత్తనాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత పీఏసీఎస్ పాలకులు, సహకార అధికారులు గోదాం నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇద్దరు ఉద్యోగుల నియామకం మానేరు గోదాం ప్రారంభించిన తర్వాత దాని నిర్వహణకు ఇద్దరు ఉద్యోగులను నియమించారు. రెండేళ్లపాటు సజావుగా నిర్వహించిన తర్వాత.. ఎరువు లు, విత్తనాల పంపిణీపై పీఏసీఎస్ పాలకులు పట్టించుకోలేదు. ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను మంథని పీఏసీఎస్కు బదిలీ చేశారు. వారు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. రైతులకు తీరని నష్టం ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుండగా.. గోదాం నిర్వహణ సరిగా లేక రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యూరియా, డీఏపీ, 20:20 లాంటి ఎరువులతోపాటు ఇతర విత్తనాల నూ ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. గోదాంకు ప్రతీసీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు తీసుకువచ్చి అందజేయాలి. లక్షలు వెచ్చించి.. లక్షణంగా వదిలేసి.. రైతులకు అందుబాటులోలేని గోదాం ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు ఆరేళ్లుగా అలంకారప్రాయంగా పీఏసీఎస్ గోదాం -
రేవంత్వి బురద రాజకీయాలు
కరీంనగర్టౌన్: సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేశారని, రెండున్నరేళ్లలో మరమ్మతు చేయకుండా వదిలిపెట్టి బురద రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం నిర్మించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని రెండు గే ట్లను మరమ్మతు చేసి ఉంటే హైదరాబాద్కు, రా ష్ట్రానికి తాగునీరు, 50వేల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే కన్నెపల్లి పంప్హౌ స్ మోటార్లు ఆన్చేసి మిడ్మానేరు, ఎల్ఎండీ, ఎ స్సారెస్పీ నింపి వరదకాలువల ద్వారా అనంతగిరి వరకు సాగు, తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు. మూడుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టినందు కు, బోనస్ ఇవ్వనందుకు, యూరియా కోసం గోస పెడుతున్నందుకు కాగడాలతో రైతులు తరుముతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఓటర్ల పేర్లను తొ లగించే అవకాశాలున్నందున బీఎల్వోలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు, ప్రతీడివిజన్లో హెల్ప్డెస్క్లు ఏ ర్పాటు చేసి సర్లో అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు చేయించాలన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎల్ఎండీ, మిడ్మానేరు ఎండిపోయాయని, సాగు, తా గునీటి కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, రాష్ట్ర నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సర్దార్ రవీందర్సింగ్, కొండూరు రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్రావు -
భద్రత కుదింపు సరికాదు
పెద్దపల్లి: ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత కుదించడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శేఖర్ ఆరోపించారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో బుధవారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజల ముందుంచుతున్నందుకే లక్ష్యంగా చేసుకుని భద్రతను కుదించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. నాయకులు కల్లూరి నర్సయ్య, అరికిళ్ల ప్రసాద్, రవీందర్, నిరంజన్, మొలుమూరి వంశీ, నిఖిల్, అసంపల్లి రాకేశ్, తిరుపతి, సదయ్య, సతీశ్, శ్రీకాంత్, రాజేశ్, పోచం, మురళి తదితరులు పాల్గొన్నారు. -
నారు పోయలేదు
రోహిణి కార్తెలోనే వరి మొలక చల్లేవాళ్లం. ఈసారి వానలు లేక బావుల్లో నీరు లేదు. అందుకే ఇప్పటివరకు నారుమడులు కూడా సిద్ధం చేయలే. ఏటా మూడెకరాలు సాగు చేసేవాడిని. ఈసారి ఎకరం కూడా సాగు చేసే పరిస్థితి లేదు. – సామంతుల కొమురయ్య, కటికెనపల్లి చెరువులో నీళ్లు లేవు పెద్దపూర్ చెరువులోకి నీళ్లు రాలేదు. వర్షాలు లేక నార్లు పోయలేదు. గతేడాది ఇదే సమయానికి నాట్లకు సిద్ధమయ్యాం. ఇప్పుడు కాలం దాటిపోతంది. ఎప్పుడెప్పుడు మేఘాలు కరుణిస్తాయా అని ఆత్రుతగా చూస్తున్నాం. – కంబళ్ల రాజమల్లు, అబ్బాపూర్ వర్షాలు లేవు వర్షాలు లేక వరినారు సరిగా పెరగలేదు. ఇంకా నాటు వేయలేదు. మూడెకరాల్లో సాగు పూర్తిగా నిలిచిపోయింది. కరెంట్ కూడా రాత్రిళ్లే వస్తంది. పగలు త్రీఫేజ్ పరిమితంగానే ఇస్తున్నారు. వర్షాలు లేక మా పరిస్థితి దయనీయంగా మారింది. – కొట్టిరెడ్డి రాజిరెడ్డి, ఓదెల -
పకడ్బందీగా ఎస్ఐఆర్ ప్రక్రియ
మంథని: ఎస్ఐఆర్ ప్రకియను పకడ్బందీగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంథనిలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియను బుధవారం ఆయన పరిశీలించా రు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, బీఎల్వోలు ప్రతీఓటరుకు ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేసి, సక్రమంగా పూరించేలా అవగాహన కల్పించా లన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ అరిఫోద్దిన్, మున్సిపల్ కమిషనర్ మనోహర్ పాల్గొన్నారు. పంపిణీ, సేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి పెద్దపల్లి/సుల్తానాబాద్రూరల్/ఎలిగేడు: ఎస్ఐఆర్కు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ, సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సుల్తానాబాద్ మున్సిపల్ రెండోవార్డు, రెబ్బల్దేవ్పల్లి, ఎలిగేడు మండలం శివపల్లిలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఆయా కార్యక్ర మాల్లో తహసీల్దార్లు యాకన్న, బషీరోద్దీన్, ము న్సిపల్ కమిషనర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభానికి సిద్ధంగా తహసీల్దార్ కార్యాలయం కమాన్పూర్: స్థానిక తహసీల్దార్ కార్యాలయ భవనం తుదిదశ పనులను కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు. ప్రారంభోత్సవానికి భవనాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ వాసంతి, ఆర్ఐ స్రవంతి, పీఆర్ఏఈ జగదీశ్ పాల్గొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య కలెక్టర్ కోయ శ్రీహర్ష -
వేతనం కోసం ఉద్యమం
పెద్దపల్లి: మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం చెల్లించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హెచ్చరించారు. మధ్యాహ్న భోజన కార్మికులు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి సునీల్, మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి పూసల రమేశ్తో కలిసి కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ, ఒక్కో కార్మికుడికి నెల కనీస గౌరవ వేతనం రూ.26,000 చెల్లించాలన్నారు. కార్యక్రమంలో కార్మికులు, నాయకులు లావణ్య పి.కళావతి, రాధమ్మ, పిడుగు గట్టయ్య, లంక విజయ, కనకలక్ష్మీ, మేకల యశోద, ఎండీ జుబేదార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఈవో శారదకు వినతిపత్రం అందజేశారు. సర్కారు బడుల్లో సౌకర్యాల్లేవ్ గోదావరిఖనిటౌన్: ప్రభుత్వ పాఠశాల్లో సౌకర్యాలు లేవని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య విమర్శించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలను మంగళవారం పరిశీలించారు. బడి పైకప్పు శిథిలమై ప్రమాదకంగా ఉందని, వర్షపునీరు ఉరుస్తోందని, ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదన్నారు. టాయిలెట్లు దుర్గంధం వెదజల్లుతున్నాయని తెలిపారు. వంటగదిలో సిమెంటు బస్తాలు నిల్వ చేశా రని, ఇలాంటి వాతావరణంలో విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చాం
గోదావరిఖని: హైదరాబాద్లోని సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 54 మంది మృతి చెందారని, ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించామని కార్మిక శాఖ మంత్రి జి.వివేక్వెంకటస్వామి అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ నేత హరీశ్రావు కావాలనే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. ఆయన మాటలను ఖండిస్తున్నామన్నారు. సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించా మని మంత్రి తెలిపారు. పరిశ్రమ సీఎండీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని గుర్తుచేశారు. కొండగట్టులో జరిగిన ప్రమాదంలో 66 మంది భక్తులు చనిపోతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టుకు ఎందుకు వెళ్లలేదని మంత్రి ప్రశ్నించారు. తాము రూ.50 లక్షల పరిహారం ఇప్పిస్తే.. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.5లక్షలే ఇచ్చారన్నారు. పేపర్ లికేజీలు జరిగితే కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదో హరీశరావు సమాధానం చెప్పాల న్నారు. నాయకులు మల్లికార్జున్, గుమ్మడి కుమారస్వామి, దుబాసి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి -
ఆన్లైన్ సేవలకు అంతరాయం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, నాన్ జ్యుడీషియల్ స్టాంపు వెండర్లు, మీసేవా కేంద్రాల్లో ఆన్లైన్ సేవలకు నాలుగు రోజులుగా అంతరాయం కలుగుతోంది. తమ అవసరాలు, పనుల నిమిత్తం మండల, జిల్లా కేంద్రానికి పల్లెవాసులు వచ్చినా అదే సమాధానం వస్తోంది. ఏమీచేయలేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. పోర్టల్లో సవరణ కోసం.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, ఈసీ(ఎంకబరెన్స్ సర్టిఫికెట్) తదితర సేవల కోసం పోర్టల్లో కొన్నిమార్పులు, చేర్పులు చేస్తున్నందున ఆన్లైన్ సమస్య తలెత్తిందని పలువురు భావిస్తున్నారు. భూక్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా మందగించింది. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ కోసం మీసేవ, ఆన్లైన్ కేంద్రాల వద్ద ప్రజలు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. స్టాంప్ పేపర్లకు ఇక్కట్లే.. స్టాంప్ పేపర్ల జారీ ప్రక్రియ గతంలో మాన్యువల్గానే ఉండేది. కొంతకాలం క్రితం దీనిని ఆన్లైన్కు మార్చేశారు. స్టాంప్ పేపర్ కావాలన్నా, ఫ్రాంక్లిన్ చేయించాలన్నా ఆన్లైన్ సర్వర్ను ఆశ్రయించాల్సిందే. ప్రస్తుతం ఇది మొరాయిస్తుండడంతో సేవలు పొందలేక పోతున్నామని ప్రజలు వాపోతున్నారు. మీసేవ కేంద్రాల్లోనూ మీసేవ కేంద్రాల్లోనూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సేవలకు ఆన్లైన్ మొరాయిస్తోంది. బ్యాంకుల్లో రుణాలు పొందేందుకు అవసరమైన ఈసీ, పహాణి, 1–బీ లాంటి సేవలు అందక రైతులూ అవస్థలు పడుతూ కనిపించారు. కొత్త రుణాలు, పాత వాటిని రెన్యూవల్ చేసేందుకు అవసరమైన డాకుమెంట్లను అన్నదాతలు పొందలేక పోతున్నారు.పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంమీసేవ కేంద్రం వద్ద వినియోగదారుల నిరీక్షణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్తంభించిన రిజిస్ట్రేషన్లు నాన్ జ్యుడీషియల్ బాండ్లకు తప్పని ఇబ్బందులు నాలుగు రోజులుగా నిలిచిన సేవలతో సర్వత్రా నిరసనలు -
అధికారుల రిలే దీక్షలు
గోదావరిఖని: సింగరేణి అధికారులు తమ కు రావాల్సిన పీఆర్పీతోపాటు సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం రెండోరోజూ కొనసాగాయి. ఆర్జీ– వన్ ఏరియాలో సీఎంవోఏఐ నాయకుడు దీటి చంద్రమౌళి తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఆర్జీ–2లో అధికారుల సంఘం అధ్యక్షుడు రాముడు దీక్షలు ప్రారంభించారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్అహ్మద్, సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, టీజీబీకేఎస్ నేత కెంగెర్ల మల్లయ్య దీక్ష శిబిరాలను సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. శిక్షణ ప్రారంభం గోదావరిఖనిటౌన్: అన్న–అక్క మెంటార్షిప్ రెండురోజుల శిక్షణను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ జై కిషన్ ఓజ మంగళవారం ప్రారంభించారు. బీఏ, బీకాం, బీఎ స్సీ ఐదో సెమిస్టర్, ఏఈడీపీ థర్డ్ సెమిస్టర్ విద్యార్థులకు టీచింగ్ ఇంటర్న్షిప్ ఆన్ ఏఐ, డిజిటల్ లర్నింగ్పై శిక్షణ ఉంటుందన్నారు. -
వసతుల కల్పనకు నిధులు
ధర్మారం: గురుకుల విద్యార్థులకు వసతుల కల్పన, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించేందుకు అవసరమైన నిధుల కేటాయంపునకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సంక్షేమశాఖ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయాన్ని మంత్రి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అల్పాహారం, భోజనం మెనూపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కిచెన్, డైనింగ్హాల్, స్టోర్ రూం, బియ్యం, కూరగాయలు పరిశీలించారు. వసతులపై ప్రిన్సిపాల్, సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. బియ్యంలో ఎక్కువశాతం నూక ఉన్నందున వెంటనే వెనక్కి పంపించాలని, సూపర్ఫైన్ బియాన్ని తిరిగి స్కూల్కు ఇప్పించాలని పౌర సరఫరాల అధికారికి ఆదేశాలు జారిజేశారు. గురుకులం విద్యాలయంలో మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.69 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు గందం మల్లయ్య, గందం మహిపాల్, ఎదుల్ల అంజయ్య, రామడుగు గంగారెడ్డి, బోనగిరి అజయ్ పాల్గొన్నారు. సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
పెద్దపల్లి: వర్షాకాలం దృష్ట్యా పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు సూచించారు. సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గంతో ఆయన సమావేశమయ్యారు. కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్చైర్ పర్సన్ అంతటి పుష్పలత, కమిషనర్ రమేశ్, కౌన్సిలర్లు ఈర్ల స్వరూప, గాజుల రాజమల్లయ్య, కందునూరి సమత, గరిగె శోభారాణి, బాకంసాయి కిరణ్, ఉట్ల వరప్రదీప్, చింతలరాజు, తొర్రికొండ ప్రభాకర్, కల్వల శంకరమ్మ, సిద్ధ తిరుపతి, వేగోళం పద్మ, గాదాసు మంజుల తదితరులు పాల్గొన్నారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయం జూలపల్లి: అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. అబ్బాపూర్, వడ్కాపూర్, తెలుకుంట రైతువేదికల్లో మంగళవారం వానకాలం పెట్టుబడి సాయం విడుదల చే సి మాట్లాడారు. సన్నవడ్లకు బోనస్, పెట్టుబడి సా యం పెంపు, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు, ఎరువులను అందుబాటులో ఉంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. డీఏవో శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి ప్రత్యూష, ఏఈ వో కిరణ్మయి, సర్పంచులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు -
అర్హుల వివరాలు నమోదు చేయాలి
గోదావరిఖని: అర్హులైన ప్రతీఓటరు వివరాలు జాబితాలో నమోదు చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో మంగళవారం సర్ ఇన్చార్జిలతో స మీక్షించారు. మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య పాల్గొన్నారు. కాగా, హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే అన్నారు. హోంగార్డులు తనను కలిసి సమస్యలు విన్నవించగా ఇలా స్పందించారు. ఓటు పౌరుడి హక్కు ఫెర్టిలైజర్సిటీ: ఓటుహక్కు ప్రతీపౌరుడి హక్కు అని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ అన్నారు. లక్ష్మీపూరంలో ఎ మ్మెల్యే సర్పై అవగాహన కల్పించారు. మేయర్ మ హంకాళి స్వామి, డిప్యూటీ మేయర్తోపాటు కార్పొరేటర్లు కందుల స్వరప, భాగ్యలక్ష్మీ పాల్గొన్నారు. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి యైటింక్లయిన్కాలనీ: సర్పై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ సూచించారు. అల్లూరు, అంబడి తండాలో చేపట్టిన సర్ సర్వేను మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే తనిఖీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు మారెల్లి సుశీల– రాజిరెడ్డి, శంకర్ నాయక్, కాంగ్రెస్ కాలనీ పట్టణ అద్యక్షుడు గుండేటి రాజేశ్ పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ -
రుణం కోసం వచ్చా
పంటలకు అవసరమైన లోన్ కోసమని బ్యాంకు వెళితే ఈసీ, పహాణి కావాలన్నరు. వాటికోసం మీసేవకు వచ్చా. సైట్ ఓపెన్ కావడం లేదంటున్నరు. మూడు రోజుల నుంచి ఇలాగే తిరుగుతున్న. – బియ్యాల కుమార్, వెన్నంపల్లి సర్వర్ సతాయిస్తంది మీసేవ కేంద్రానికి వివిధ సేవల కోసం వస్తున్నారు. సర్వర్ సతాయిస్తుండడం, పోర్టల్ ఓపెన్ కాక పోవడంతో ఇబ్బంది కలుగుతంది. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ సేవల సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. – మహేందర్, మీసేవ నిర్వాహకుడు రిజిస్ట్రేషన్ కాలేదు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని వచ్చాం. ఉదయం నుంచి కార్యాలయం వద్దే వేచిచూస్తున్నాం. సర్వర్ పనిచేయడం లేదని చెప్పడంతో పనికావదంలేదు. వెనుదిరగాల్సి వచ్చింది. సమయం, డబ్బు వృథా అయ్యాయి. – పురం ప్రసాద్, సుల్తానాబాద్ -
సర్పంచ్ పిల్లలు సర్కార్ బడికి
రామగిరి: నాగెపల్లి సర్పంచ్ కొండవేన దివ్య–సుధాకర్ దంపతుల కుమారుడు మాన్విక్(మూడోతరగతి), కుమార్తె రిశ్విత( రెండోతరగతి)ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మంగళవా రం చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపడుతుండటంతో అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మార్పు తమతోనే మొదలవ్వాలని వారు అంటున్నారు. సర్పంచ్ దంపతులను గ్రామస్తులు అభినందించారు. విప్ సహకారంతో అభివృద్ధి పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు సంపూర్ణ సహకారంతో పెద్దపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ మల్లయ్య అన్నారు. పట్టణంలోని 12వ వార్డులో మంగళవారం కౌన్సిలర్లు జగదీశ్, శ్రీకాంత్తో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. సీసీరోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఏఈ సతీశ్తో కలిసి పర్యవేక్షించారు. నాయకులు దేవరాజ్, శేఖర్ పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారిగా పవిత్ర పెద్దపల్లి: జిల్లా వైద్య, ఆ రోగ్య శాఖ(డీఎంహెచ్వో) గా పవిత్ర మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు డీఎంహె చ్వోగా పనిచేసిన ప్రమోద్ కుమార్ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో సిరిసిల్లలో పనిచేస్తున్న పవిత్ర కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పవిత్రను ఉద్యోగులు, సిబ్బంది కలిసి శుభాకాక్షలు తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన ప్రమోద్కుమార్ను పలువురు ఘనంగా సన్మానించారు. నేడు ఇంటర్వ్యూ పెద్దపల్లి: రామగుండం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని డీ –అడిక్షన్ సెంటర్లో ఖాళీగా ఉన్నఒక మెడికల్ ఆఫీసర్ పోస్టును కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నామని జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ హిమబిందు సింగ్ తెలిపారు. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. జీజీహెచ్లో జరిగే ఇంటర్వ్యూలకు విద్యార్హతలు, రిజిస్ట్రేషన్ ధ్రువీకరణపత్రం, ఇతర ఒరిజినల్ సర్టిఫెట్లతో హాజరు కావాలని సూచించారు. రీ సర్వేతో ప్రయోజనం పెద్దపల్లిరూరల్: పూర్వం నిర్ణయించిన గ్రామ సరిహద్దులు, సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలను మరోసారి సర్వేయర్లతో పాటు డిజిటల్గా రీ – సర్వే చేయించేందుకు ప్రభుత్వం భూభారతి చేపట్టిందని ఆర్డీవో గంగయ్య అన్నారు. నిమ్మనపల్లి గ్రామంలో మంగళవారం గ్రామస్తులకు ఆయన అవగాహన క ల్పించారు. రీ సర్వేకు అందరూ సహకరించాల ని కోరారు. తహసీల్దార్ రాజయ్య, డెప్యూటీ తహసీల్దార్ విజేందర్, సర్పంచ్ వేల్పుల రమేశ్, మాజీ సర్పంచ్ వేల్పుల మల్లికార్జున్రావు, కార్యదర్శి రాజ్కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఉచిత శిక్షణ పెద్దపల్లి: టాస్క్ ఆధ్వర్యంలో 3 నెలల పాటు నిర్వహించే ఉచిత శిక్షణ, ప్లేస్మెంట్ కోసం డిగ్రీ, బీటెక్, డిప్లొమా పూర్తిచేసిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపా రు. ఎంఎస్ ఎక్సెల్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, పవర్ బీఐ, బిజినెస్, పీఏ టూల్స్ సాఫ్ట్ స్కిల్స్ వంటి అంశా ల్లో శిక్షణ అందిస్తారని, వివరాల కోసం 90595 06807 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. అంతర పంటలు వేయాలి పెద్దపల్లి: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆయిల్పామ్ తోటల్లో అంతరపంటలు సాగు చేయడం ఎంతోమేలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి శ్యాంప్రసాద్ సూచించారు. కూరగాయలు తదితర పంటలు వేస్తే.. మల్చింగ్ షీట్లు, అరటి, బొప్పాయి, పసుపు వంటి ఉద్యాన పంటలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నేడు ఎన్టీపీసీకి ఆర్ఈడీ జ్యోతినగర్: ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్శర్మ బుధవారం రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు సందర్శిచనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన రామగుండం రానున్నారు. సోలార్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన క్రమంలో ప్రాజెక్టు సందర్శనతో పాటు ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. ఈమేరకు అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. -
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, కరీంనగర్●: భూ చిక్కు ముళ్లు విప్పేందుకు ప్రభుత్వం తొలి అడుగు వేస్తోంది. ప్రతీ గ్రామంలో హద్దుల వివాదాలు గరిష్టసంఖ్యలో ఉండగా ప్రభుత్వం సమగ్ర భూ రీ సర్వేకు చర్యలు చేపడుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం నుంచి డిజిటల్ సర్వే ప్రారంభం కానుంది. నిజాం కాలంలో చేపట్టిన భూసర్వే, నక్షా(మ్యాప్), నాటి రికార్డులే ఆధారంగా రెవెన్యూ కార్యకలాపాలు సాగుతున్నాయి. భూ కమతాలు పెరగటం, విస్తీర్ణాలు విభజనకు నోచుకోవటంతో హద్దులు మారిపోతున్నాయి. గ్రామాల్లో భూముల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి పరిష్కారానికి సర్వే చేయక తప్పదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఇప్పటికే లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించింది. రోవర్ పరికరాలపై శిక్షణ పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా తొలిసారి రెవెన్యూ రికార్డు అందుబాటులో లేని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో రీసర్వే జరిపి దస్త్రాలు తయారు చేస్తున్నారు. తాజాగా జిల్లాకు ఐదు నుంచి ఏడు మండలాలు ఎంపిక చేయగా, మండలానికో గ్రామంలో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా సర్వేయర్లకు కరీంనగర్ కలెక్టరేట్లో రోవర్ పరికరాలపై శిక్షణ ఇచ్చారు. వీలైనంత త్వరగా ఎంజాయ్మెంట్ సర్వే చేసి నక్షాను రూపొందించనున్నారు. ఒక్కోగ్రామంలో 1500 నుంచి 2500 ఎకరాలకు పైగా సాగుభూములున్నాయి. ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి కొత్తగా రికార్డులు తయారు చేయనుండగా సర్వే నంబర్వారీగా నక్షా రూపొందిస్తుంది. వీటన్నింటినీ ఆన్లైన్లో పొందుపరుస్తుంది. అనంతరం భూధార్ నంబర్లను రైతులకు అందిస్తుంది. లైసెన్స్డ్ సర్వేయర్లకు బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో వందలాది మంది లైసెన్స్డ్ సర్వేయర్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పరీక్షలో పాల్గొనగా వీరితోనే ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టనున్నారు. అధునాతన రోవర్ పరికరాలను ఉపయోగించి పక్షం రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నారు. భూ విస్తీర్ణాన్ని నెల రోజుల్లో సర్వే చేసేందుకు రూ.40వేలు, 2వేల ఎకరాలు మించితే రూ.60వేలను సంబంధిత లైసెన్స్డ్ సర్వేయర్లకు సర్కారు చెల్లించనుంది.భూ భారతిలో ప్రస్తావించిన ప్రతి రైతుకూ భూధార్ నంబరు ఇచ్చే ప్రక్రియను అమలు చేయనున్నారు. చట్టం ప్రకారం మొదట ప్రతి రైతు రికార్డులు పరిశీలించి.. సరిగ్గా ఉన్నాయని భావిస్తే టెంపరరీ భూధార్ నంబరు ఇవ్వనుండగా ఆ తర్వాత సరిహద్దులను గుర్తించి మ్యాప్ గీయనున్నారు. సర్వేయర్ అప్రూవ్ చేస్తే తహసీల్దార్ అమలు చేస్తారు. అప్పుడు అది సరిహద్దులు గల భూమిగా గుర్తింపు పొందుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే పర్మినెంట్ భూధార్ నంబరు ఇవ్వాలని ఆర్వోఆర్–2025 స్పష్టం చేస్తుంది. ఈ రెవెన్యూ రికార్డుల వెరిఫికేషన్ జీపీవోలు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లతోనే పూర్తవుతుంది. మోకాపై ఉన్న భూమినే కొలవనున్నారు. ఒక రైతుకు 2ఎకరాల భూమి ఉంటే ఎంత భూమి ఉందనేది కొలుస్తారే తప్పా రికార్డులో ఉన్న 2ఎకరాల భూమిని చూపించరు. రైతు అనుభవిస్తున్న భూమిని మాత్రమే కొలవనుండగా దీంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రస్తుతానికి ఎంజాయ్మెంట్ సర్వే చేస్తామని, తదుపరి ప్రభుత్వ ఆదేశాల క్రమంలో హద్దులు నిర్ణయిస్తామని కరీంనగర్ జిల్లా సర్వే లాండ్ ఏడీ కిషన్రావు చెబుతున్నారు. -
పగ పెంచుకుని.. హత్యచేసి
జమ్మికుంట: తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళపై అత్యాచారానికి యత్నించాడని, ఆపై ఇరు కుటుంబాల మధ్య దారితీసిన గొడవను మనుసులో పెట్టుకుని ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశామని హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. సోమవారం జమ్మికుంట టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ రామకృష్ణతో కలిసి వివరాలు వెల్లడించారు. మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన గంగారపు మహేశ్కు అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. సదరు మహిళపై అంకుషాపూర్ గ్రామానికి చెందిన పైతరి మొగిలి(52)లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఫిబ్రవరిలో మొగిలిపై కేసు నమోదైంది. జైలుకు వెళ్లివచ్చిన మొగిలి సదరు మహిళతో పాటు మహేశ్ కుటుంబాల్లో గొడవలకు కారణమయ్యాడు. దీంతో మొగిలిపై పగ పెంచుకున్న మహేశ్ అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 27న రాత్రి మడిపల్లి గ్రామంలోని పీరీల పండుగకు వచ్చిన మొగిలి తిరిగి ఇంటికి వెళ్తుండగా మడిపల్లి, అంకుషాపూర్ గ్రామాల మధ్య ఇనుపరాడ్తో దాడిచేసి హత్య చేశాడు. అనంతరం రాడ్ను మడిపల్లి శివారులోని తన వ్యవసాయ బావి వద్ద పడేసి ఇంటి వెళ్లిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, మహేశ్ను అదుపులోకి తీసుకున్నారు. మొగిలిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని, అతని నుంచి ఇనుప రాడ్, సెల్ఫోన్, బైక్ స్వాదీనం చేసుకుని, రిమాండ్ చేశామని ఏసీపీ తెలిపారు ఎస్సై రవి, కానిస్టేబుళ్లు జలేందర్, శ్రీకాంత్, యాకూబ్, రవి ఉన్నారు. మొగిలి హత్యకేసులో నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించిన ఏసీపీ మాధవి -
పాముకాటుతో మహిళ మృతి
జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన చిలువేరి నీరజ (45) పాముకాటుతో ఆది వారం రాత్రి మృతిచెందింది. నీరజ ఆదివారం సాయ ంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో నిద్రి స్తున్న సమయంలో నాగుపాము కాటువేసింది. వెంటనే కుటుంబ సభ్యులు జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. జమ్మికుంట: బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమిల్లపల్లి గ్రామానికి చెందిన తోట వినయ్, మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన నూకల వెంకటయ్య(70) బైక్ను గ్రామ శివారులో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటయ్య తలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. మృతుడి కొడుకు నూకల ప్రశాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి..గంగాధర: గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా నుంచి బోయినపల్లి వెళ్లే దారిలో ఆదివారం రాత్రి పిట్టలపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొని వెంకంపల్లి గ్రామానికి చెందిన గుండవేణి కొమురయ్య(45) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై వంశీకృష్ణ వివరాల ప్రకారం.. కొమురయ్య తన గొర్రెల మంద వద్దకు వెంకంపల్లి నుంచి పిట్టలపల్లి వైపు ఎక్సెల్పై వెళ్తున్నాడు. అదే సమయంలో బోయినపల్లి వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. కొమురయ్య అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో విలాసాగర్కు చెందిన కారు డ్రైవర్ పోలె మహేశ్పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సొంతూరిలో ఉపాధి లేక గల్ఫ్ వెళ్లిన వలసజీవి అక్కడే గుండెపోటుతో మృతిచెందగా.. 23 రోజులకు మృతదేహం స్వగ్రామానికి చేరింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన బత్తుల నర్సయ్య(42) విధుల్లో ఉండగానే గుండెపోటుతో ఈనెల 6న మృతిచెందాడు. సోమవారం మృతదేహం నారాయణపూర్కు చేరడంతో మృతుని భార్య రేణుక, కొడుకు రాకేశ్, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఇంటి వరకు మృతదేహాన్ని తెచ్చేందుకు వాహనాన్ని ఎమ్మెల్యే కేటీఆర్ సమకూర్చారు. అంతిమయాత్రలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఉపసర్పంచ్ మధుసూదన్రెడ్డి, అదనపు తహసీల్దార్లు బుర్క గోపాల్, ఎలుసాని ప్రవీణ్కుమార్, మాజీ ఎంపీటీసీ మజీద్ తదితరులు పాల్గొన్నారు. -
చేపల వేటకు విరామం
సిరిసిల్ల/బోయినపల్లి(చొప్పదండి): చేపల సంతతి అభివృద్ధికి మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో చేపల వేటను నిషేధించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా మిడ్మానేరు, అప్పర్మానేరు, అన్నపూర్ణ ప్రాజెక్టుల్లో రెండు నెలలపాటు చేపల వేట నిషేధించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం.సౌజన్య సోమవారం తెలిపారు. జూలై, ఆగస్టు నెలల్లో చేపల సంతతి పెరిగే కాలం కావడంతో చేపల వేట విరామానికి చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుల పరిసర గ్రామాల్లోని మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలకు చేపల వేటకు వెళ్లొద్దని నోటీసులు జారీ చేశారు. గ్రామాల్లో దండోరా వేయించాలని జీపీలకు తెలిపారు. ఉత్తర్వులు అతిక్రమిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో వేట నిషేధం చేపల సంతతి అభివృద్ధికి మత్స్యశాఖ నిర్ణయం -
బీసీలు రాజకీయంగా ఎదగాలి
పెద్దపల్లి: బీసీలు రాజకీయంగా ఎదగాలని.. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా స్గౌడ్ కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశానికి హాజరై మాట్లాడారు. బీసీ అభ్యర్థులను అసెంబ్లీకి పంపించడమే బీసీ ఉ ద్యమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఓటు అనే ఆయుధంతో అగ్రకులాల ఆధిపత్యాన్ని ఓడించాలని కోరారు. ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటున్నాయని మండిపడ్డా రు. బీసీలు బానిసలుగా కాకుండా బాద్షాలుగా ఎదగాల ని కోరారు. కులాలవారీగా చీలిపోకుండా.. ఎస్సీ, ఎస్టీ, మై నారిటీలతో కలిసి బీసీలు ఐక్యంగా పోరాడితేనే సమసమాజం సాధ్యమవుతుందన్నారు. బీసీ భవనం ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నామని బీసీ జేఏసీ జిల్లా చైర్పర్సన్ దాసరి ఉష స్పష్టం చేశారు. ఆత్మీయ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ విద్యార్థి జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్గౌడ్, మాజీ జెడ్పీటీసీ గంట రాములుయాదవ్, ఫిషరీస్ మాజీ చైర్మన్ చేతి ధర్మయ్య, బీసీ జేఏసీ జిల్లా వైస్చైర్మన్ కొండ సతీశ్, మహిళా కన్వీనర్ సిరవేణి స్వప్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు మండే లక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికే ఆదర్శం పెద్దపల్లి ఆస్పత్రి పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి రాష్ట్ర స్థాయిలో నాలుగు అవార్డులు సాధించడం జిల్లాకు గర్వకారణమని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డి.శ్రీధర్ను సన్మానించారు. అనంతరం ఆస్పత్రిలోని వార్డులను సందర్శించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ -
భార్యను చంపి.. ఉరేసుకుని భర్త ఆత్మహత్య
మల్యాల: మద్యం మత్తు ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. క్షణికావేశం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ప్రేమించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నప్పటికీ 24ఏళ్ల కాపురంలో తరచూ గొడవలే. చివరకు భార్యాభర్తల మధ్య గొడవ ఇద్దరి మృతికి దారి తీసింది. మద్యం మత్తులో భార్యను గొంతు నులిమి చంపిన భర్త లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మల్యాల మండలం నూకపల్లిలో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓలపు నాగరాజు(47), అదే గ్రామానికి చెందిన లక్ష్మి (43) ఇరవై నాలుగేళ్ల క్రితం ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. లక్ష్మి బీడీలు చుడుతుంది. నాగరాజు వ్యవసాయ పనులకు కూలీకి వెళ్తుంటాడు. సంతానం లేకపోవడంతో సమీప బంధువు నుంచి బాబు (6)ను దత్తత తీసుకున్నారు. నాగరాజు కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడుతున్నాడు. ఆదివారం కూడా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న భార్య గొంతు నులిపి చంపాడు. వెంటనే తన లుంగీతో ఇంట్లోని దూలానికి ఉరేసుకున్నాడు. వేకువజామున నిద్ర లేచిన కుమారుడు రియాన్ష్ భయపడి.. ఇంటి పక్కనున్న బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారి సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనాథగా మారిన ఆరేళ్ల కుమారుడు.. భార్యాభర్తలు ఇద్దరూ చనిపోవడంతో ఆరేళ్ల రియాన్ష్ అనాథగా మారాడు. తల్లిదండ్రులకు ఏమైందో తెలియని పసి వయసులో వారి మృతదేహాలను చూస్తూ ఉండిపోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. సీఐ రాజ్కుమార్, ఎస్సై సందీప్ క్లూస్ టీంతో ఇంట్లో తనిఖీ చేశారు. మద్యానికి బానిసై భార్యతో గొడవపడి నిద్రిస్తున్న లక్ష్మిని తువ్వాలతో గొంతు నులిపి చంపాడని మృతురాలి తల్లి గంగవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మద్యం మత్తులో ఘాతుకం అనాథగా మారిన ఆరేళ్ల బాలుడు నూకపల్లిలో విషాదం -
1న కలెక్టరేట్ల ముట్టడి
పెద్దపల్లి: రాష్ట్రవ్యాప్తంగా జూలై 1న నిర్వహించతలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడిని జయప్రదం చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లిలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చామని తెలిపారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మండల అధ్యక్షుడు రమేశ్ వినతిపత్రం ఇవ్వగా.. త్వరలోనే ఈ విషయమై మంత్రులతో చర్చించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి సునీల్, మార్కాపూర్ సూర్య, రమేష్, నవీన్, రవి, విఠల్ పాల్గొన్నారు. -
బల్దియా కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
జగిత్యాల: కొందరు వ్యక్తులు తన భూమిని ఆక్రమించుకుంటున్నారని పేర్కొంటూ జిల్లా కేంద్రానికి చెందిన రాపర్తి గంగాధర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్న సిబ్బంది ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ధరూర్ శివారులోని సర్వే నంబరు 49, 50, 67లోగల తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారంటూ మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు సాయంత్రం 5.30 గంటలకు కుమారులతో కలిసి వచ్చాడు. కమిషనర్ చాంబర్కు వెళ్లి మాట్లాడుతూనే కుర్చీలోనే పడిపోయాడు. కార్యాలయం బయట ఉన్న కుమారులు వచ్చి అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్రిటికల్ కేర్లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి బాగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. గంగాధర్ చీమలు, పురుగుల మందు తాగాడని నిర్ధారించారు. -
ఉపాధికి ఏజెన్సీ దెబ్బ
కోల్సిటీ: నగరంలో పారిశుధ్యం మెరుగుపర్చడం లక్ష్యంగా రామగుండం బల్దియా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పందుల పెంపకందారులకు పునరావాసం కల్పించే ఉద్దేశంతో హైదరాబాద్, వ రంగల్ వంటి మహానగరాల్లో అమలవుతున్న డ్రై వర్ కం ఆపరేటర్ విధానాన్ని రామగుండంలో ప్రవే శ పెట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా ఏడు డివిజన్లలో అ మలు చేస్తోంది. టెండరు ద్వారా ఎంపిక చేసిన ఏజెన్సీకి ఇంటింటా చెత్త సేకరణ బాధ్యత అప్పగించింది. సుమారు 20 రోజులుగా ఈ విధానం అమలు చేస్తోంది. దీనిని ర్యాగ్ పిక్కర్లు వ్యతిరేకిస్తున్నారు. బల్దియా కమిషనర్ అరుణశ్రీని వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా యత్నించగా స్పందించలేదు. ఏడు డివిజన్లలో పైలెట్ ప్రాజెక్ట్గా.. నగరంలోని 34, 40, 47, 49, 51, 52, 60వ డివిజన్లలో పైలెట్ ప్రాజెక్ట్గా ప్రైవేట్ ఏజెన్సీలతో ఇంటింటా చెత్త సేకరిస్తున్నారు. ఇందుకోసం కార్పొరేషన్ కు చెందిన ఏడు ఆటోట్రాలీలను ఏజెన్సీకి అప్పగించారు. ఒక్కోట్రాలీకి రూ.50 వేల చొప్పున డిపాజి ట్ సేకరించారు. ట్రాలీల నిర్వహణ, డ్రైవర్లు, కార్మికుల బాధ్యత ఏజెన్సీదే. ఏజెన్సీ ఇంటింటా చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. వ్యతిరేకిస్తున్న ర్యాగ్ పిక్కర్లు కొత్త విధానాన్ని ర్యాగ్ పిక్కర్లు వ్యతిరేకిస్తున్నారు. వీరికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూ సీ) మద్దతుగా నిలిచింది. 26 ఏళ్లుగా ఇంటింటా చె త్త సేకరిస్తూ బతుకుతున్న తమ ఉపాధికి కొత్త విధానంతో ముప్పు ఏర్పడిందంటున్నారు. అట్సోర్సింగ్ కార్మికులుగా అవకాశం కల్పిస్తారని ఆశపడితే తమను కాదని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం బల్దియా ఎదుట ధర్నా చేశారు. ర్యాగ్ పిక్కర్ల సర్దుబాటు పైలెట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్న ఏడు డివిజన్లలోని ట్రాలీ డ్రైవర్లను ఇతర వాహనాలు, డివిజన్లకు సర్దుబాటు చేశారు. ర్యాగ్ పిక్కర్లను కూడా ఇతర డివిజన్లకు కేటాయించారు. కొందరు ర్యాగ్ పిక్కర్లు కొత్త విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు బకాయిలు రావాల్సి ఉందని, వాటిని వసూలు చేసుకునేందుకు గడువు ఇవ్వాలని కోరుతుండగా, ఇంకొందరు తాము పనిచేసిన డివిజన్లనే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్పై పర్యవేక్షణ నగరంలో 60 డివిజన్లు ఉండగా, 40కుపైగా డివిజన్లలో పూర్తిస్థాయి, మరికొన్నింటిలో పాక్షికంగా బల్దియా పారిశుధ్య సేవలు అందిస్తోంది. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్ఎల్ టౌన్షిప్, సింగరేణి కాలనీల్లో యాజమాన్యాలే పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నాయి. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దశలవారీగా మిగిలిన డివిజన్లలోనూ డ్రైవర్ కం ఆపరేటర్ విధానాన్ని అమలు చేయాలని బల్దియా అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇంటింటా చెత్త సేకరణకు డ్రైవర్ కం ఆపరేటర్ పాలసీ పైలెట్ ప్రాజెక్టుగా నగరంలోని ఏడు డివిజన్లలో అమలు ఉపాధి దెబ్బతీస్తున్నారని వ్యతిరేకిస్తున్న ర్యాగ్ పిక్కర్లు రామగుంబం బల్దియా ఎదుట పెద్దఎత్తున కార్మికుల ఆందోళనపందుల పెంపకందారులకు పునరావాసం కల్పించాలనే లక్ష్యంతో.. పందుల పెంపకందారులకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తొలుత ఈ విధానం ప్రవేశపెట్టింది. నగరపాలకలపై ఆర్థికభారం తగ్గించడం, చెత్త సేకరణను వందశాతం పూర్తి చేయడం, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లకూ విస్తరించిందని అధికారులు చెబుతున్నారు. దీనినే రామగుండంలోనూ పైలెట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్నారని వివరించారు. -
ఏజెన్సీలను రద్దు చేయాలి
26 ఏళ్లుగా చెత్త సేకరిస్తున్న ర్యాగ్ పిక్కర్లను పక్కనపెట్టి ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించడం సరికాదు. ఏజెన్సీలను రద్దు చేయాలి. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ర్యాగ్ పిక్కర్లు, మహిళా గ్రూపులు, డ్వాక్రా, కార్మిక సంఘాలతో చర్చించాలి. ర్యాగ్ పిక్కర్లలో మాదిగ, మాల, వడ్డెర వంటి వెనుకబడిన వర్గాల వారే అధికం. వారి ఉపాధిని దెబ్బతీయొద్దు. కార్మికులపై వివక్ష చూపితే ఆందోళనలు ఉధృతం చేస్తాం. – మద్దెల దినేశ్, అధ్యక్షుడు, మున్సిపల్ వర్కర్స్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ -
రాజ్యాధికారమే లక్ష్యం
జ్యోతినగర్: రాజ్యాధికారమే మాదిగ మహాశక్తి లక్ష్యమని మహాశక్తి కోర్ కమిటీ సభ్యుడు అసంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీపీసీ శ్రీమయి ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన నియోజకవర్గ మాదిగల ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగ ప్రతినిధులు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసేందుకు అవకా శం కల్పించేందుకు ముందుకు సాగుదామని ఆయన అన్నారు. పెద్దపల్లి పార్లమెంటులో స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఆయన పేర్కొ న్నారు. అనంతరం ప్రముఖులను పలువురు సన్మానించారు. మడిపల్లి మల్లేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఇంజపురి పులేందర్, కర్రావుల డేవిడ్రాజ్, పెద్దెల్లి ప్రకాశ్, న్యాతరి రాయమల్లు, బూడిద మహేందర్, జూల లింగయ్య, విజయ్ కుమార్, పర్లపల్లి బాబు, పుట్ట సదానందం, రాజ్గోపాల్, భాగ్యలక్ష్మి, కనకం మహేందర్, కుక్క గంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మగౌరవం కోసం పోరు పెద్దపల్లి: బీసీల ఆత్మగౌరవమే లక్ష్యంగా పోరు సాగిస్తున్నామని, ఇందులో భాగంగానే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ సోమవారం జిల్లా కేంద్రంలో ప ర్యటిస్తారని బీసీ జేఏసీ జిల్లా చైర్ పర్సన్ దా సరి ఉష తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐక్యత, భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నట్లు వెల్లడించా రు. కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మ న్ కొండి సతీశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి శంకర్, నాయకులు బిక్షపతి, కె.రమేశ్, కలవేణి రవి, ఆసరి రాజయ్య, అబ్దుల్ మాలిక్, శ్రావణ్, అజీమ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. వివరాలు పూరిస్తేనే.. పెద్దపల్లి: జిల్లాలో ఎస్ఐఆర్(సర్) కార్యక్రమంచురుకుగా కొనసాగుతోంది. ఈనెల 25న ప్రా రంభమైన బీఎల్వోల ఇంటింటి సందర్శన ద్వారా ప్రజలను కలుస్తూ ఎన్యూమరేషన్ ఫా మ్స్ అందిస్తున్నారు. సందేహాల నివృత్తి కోసం తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్లో హెల్ప్ డేస్కు లు, టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. సామ్రాజ్యవాద విధానాన్ని వ్యతిరేకిద్దాం గోదావరిఖని: మాట వినడం లేదంటూ ప్రపంచ దేశాలపై దాడులకు తెగబడుతూ సామ్రాజ్యవాదం విస్తృతం చేస్తున్న అమెరికా వైఖరిని వ్యతిరేకిద్దామని సీపీఎం నేత తుమ్మల రాజారెడ్డి అన్నారు. స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలోని శ్రామికభవన్లో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. వెనుజులా, క్యూబా, ఇరాన్ తదితర దేశాలపై అమెరికా దాడులు శోచనీయమన్నారు. మనదేశంలో ప్రజలను మతాల వారీగా విభజిస్తూ ఘర్షణలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నాయకులు ఎ.ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఎ.మహేశ్వరి, బిక్షపతి, మెండే శ్రీనివాస్, కొమురయ్య, జ్యోతి, గణేశ్, శైలజ తదితరులు పాల్గొన్నారు. ‘ఎల్టా’ జిల్లా కార్యవర్గం పెద్దపల్లి: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోయేషన్(ఎ ల్టా) జిల్లా కార్యవర్గం ఆది వారం జిల్లా కేంద్రంలో ఎ న్నికైంది. అధ్యక్షుడిగా గ డ్డం జగదీశ్వర్(రామగుండం), ప్రధాన కార్యదర్శిగా డి.నాగరాజు (జూ లపల్లి), ఉపాధ్యక్షులుగా జె.శ్రీనివాస్, జి.రమే శ్, మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎస్.రజనీవందన, సంయుక్త కార్యదర్శులుగా వై.శ్రీనివాస్, శ్రీధర్రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి.శేషాద్రి, మహిళా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఇందిర, మీ డియా కో ఆర్డినేటర్గా ఎ.కనకయ్య, ఫైనాన్స్ కార్యదర్శిగా బి.లక్ష్మణ్ను ఎన్నుకున్నారు. సాధుల వెంకటేశ్వర్లు, కె.సత్యప్రకాశ్రావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ, ఇంగ్లిష్ భాషాభివృద్ధికి అందరూ తోడ్పడాలన్నారు. -
మంథనిలో మాస్టర్ ప్లాన్
మంథని: మున్సిపల్ పరిధిలో మాస్టర్ ప్లాన్ అమలుకు ముహూర్తం కుదిరింది. పట్టణంలోని ఆర్టీసీ బస్సు డిపో నుంచి పాత పెట్రోల్ బంక్ కూడలి వరకు వంద అడుగుల రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు అధికారులు ఎట్టకేలకు మార్కింగ్ చేశారు. సాంకేతిక సమస్య సాకుతో చాలాసంవత్సరాలుగా రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. ముప్పయి ఏళ్లకు మోక్షం.. సుమారు 30ఏళ్ల క్రితమే ఆర్టీసీ బస్సు డిపో నుంచి పాత పెట్రోల్ బంక్ వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు మార్కింగ్ చేశారు. డిపో ప్రహరీ కూల్చివేత ప్రారంభం కాగానే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఎరుకులగూడెం వాసులు.. పొక్లెయిన్తో బలవంతంగా కూల్చితే తీవ్రంగా నష్టపోతామనే ఉద్దేశంతో తమ ఇళ్లు వారే స్వచ్ఛందంగా కూల్చివేసుకున్నారు. పరిహారం చెల్లిస్తామని అప్పటి ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినా ఇప్పటివరకు పైసా పరిహారం రాలేదని నిర్వాసితులు తెలిపారు. కొందరు ఇళ్లు కూల్చకుండా కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినట్లు సమాచారం. అప్పటినుంచి రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు పెండింగ్ పడ్డాయి. పనులు స్తంభించడంతో కొంతమంది మళ్లీ నిర్మాణాలు చేపట్టారు. ఎట్టకేలకు అధికారులు గత బుధవారం మరోసారి వంద ఫీట్ల రోడ్డు విస్తరణకు మార్కింగ్ చేయడంతో పట్టణవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళికలు సిద్ధం మున్సిపల్లో మాస్టర్ ప్లాన్ అమలుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ క్ర మంలోనే పట్టణంలోని ప్రధాన కూడలిలో వంద ఫీట్ల రోడ్లు, అవసరమున్న చోట మురుగునీటి కాల్వలు, ప్రధాన చౌరస్తాల విస్తరణతోపాటు మరి న్ని అభివృద్ధి పనులు చేసేందుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. పట్టణ సుందరీకరణతోపాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటు న్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని ప్రధాన రహదారి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఒక వాహనం వెళ్తే మరో వాహనం వెళ్లడానికి వీలు లేకుండా ఇరుకుగా ఉండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. తరచూ ట్రాఫిక్ జామ్ అవుతూ ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రధాన చౌరస్తా, శ్రీపాదచౌక్, బొక్కలవాగు వంతెన వరకు వ్యాపార కూడలి కావడంతో సమస్య తీవ్రత అధికంగా ఉంది. విస్తరణ, అభివృద్ధి పను లకు ఇప్పుడైనా ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయా లేదా వేచిచూడాల్సిందే. మున్సిపల్లో అమలుకు ముహూర్తం బస్సు డిపో నుంచి పెట్రోక్ బంక్ కూడలి వరకు విస్తరణ వంద అడుగులకు రహదారి అభివృద్ధికి వేగంగా చర్యలు చాలాసంవత్సరాల తర్వాత మారనున్న పట్టణ రూపురేఖలు -
ఒకేచోట రెండు ఆరోగ్య కేంద్రాలు
జ్యోతినగర్: ఎన్టీపీసీ ప్రాంతంలోని వివిధ కాలనీ వాసులకు ప్రభుత్వ వైద్యసేవలు అందుబాటులేవు. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ), అ ర్బన్ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ) రెండూ రామగుండం ప్రాంతంలోనే ఉండడం ఇందుకు కారణమవుతోంది. సుమారు 20 కి.మీ. దూరంలోని రామగుండం వెళ్లి వైద్యసేవలు పొంది రావడం వ్యయప్రయాసలతో కూడుకుంటోంది. అర్బన్ హెల్త్ సెంట ర్ పట్టణ ప్రాంత ప్రజలకు చేరువలోకి తీసుకురావడంలో ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా.. ప్రైమ రీ హెల్త్ సెంటర్ ఉన్న ప్రాంతంలోనే కొనసాగించడం ద్వారా పేదలు ఎవరికీ ప్రయోజనం లేకుండాపోతోంది. అంతదూరం వెళ్లడం, మళ్లీ తమ ప్రాంతాలకు రావడం కోసం వృద్ధులు, గర్భిణులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలు ఆటో, ఇతర వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆరోగ్య కేంద్రాల పరిధిలో సేవలు పీహెచ్సీ పరిధిలో జంగాలపల్లె, శాలపల్లె, పోరట్పల్లి, కృష్ణానగర్, హెడ్ క్వార్టర్స్ ఏరియా, మల్కాపూర్ ఉన్నాయి. యూపీహెచ్సీ పరిధిలో రామగుండం, మల్యాలపల్లె, విలేజ్ రామగుండం, లింగాపూ ర్, మసీదు ఏరియా, న్యూపీకే రామయ్యకాలనీ, అ న్నపూర్ణకాలనీ, సుభాష్నగర్, కాకతీయనగర్, ఇందిరమ్మకాలనీలు ఉన్నాయి. హెల్త్ సెంటర్ తరలిస్తే రామగుండంలోని హెల్త్ సెంటర్ను ఎన్టీపీసీ ప్రాంతానికి తరలిస్తే.. ఇక్కడి జంగాలపల్లె, శాలపల్లె, పోరట్పల్లి, అన్నపూర్ణకాలనీ, న్యూపీకే రామయ్యకాలనీ, కృష్ణానగర్, సుభాష్నగర్, కాకతీయనగర్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వాసులకు అందుబాటులోకి వస్తాయని స్థానికులు అంటున్నారు.ఎన్టీపీసీకి మార్చాలి వైద్యం కోసం ప్రతీనెల రామగుండం వెళ్లడం ఇబ్బందిగా ఉంది. ఆశ వర్కర్లు రామగుండమే రావాలంటున్నరు. ఎన్టీపీసీకి మార్చాలె. కష్టాలు తీర్చాలే. అధికారులు చొరవ చూపాలె. – అఖిల, న్యూపీకే రామయ్యకాలనీ ఇబ్బందిగా ఉంది చిన్నఆరోగ్య సమస్యకై నా రామగుండం వెళ్లాల్సి వస్తంది. రవాణా ఖర్చు, సమయం వృథా అవుతంది. ఎన్టీపీసీ ప్రాంతానికి అర్బన్ హెల్త్ సెంటర్ తరలిస్తే వేలాది మందికి ఉపయోగపడుతుంది. – మౌనిక, ఇందిరమ్మకాలనీ ఎన్టీపీసీ ప్రజలకు వైద్యసేవలు దూరం -
పోలియో రహిత తెలంగాణే లక్ష్యం
పెద్దపల్లి: పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా అర్హులైన చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మెరుగైన వైద్యసేవలు అందిస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, వైస్ చైర్మన్ ముస్కాన్ నాజ్ నయ్యర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, కౌన్సిలర్ కొట్టే స్వరూప తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్లలోపు వారికి తప్పనిసరి కోల్సిటీ: ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పో లియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత ని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వైద్య, ఆ రోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక 51వ డివిజన్ అశోక్నగర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చే సిన పల్స్పోలియో కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్యతో కలిసి మేయర్ ప్రారంభించి మాట్లాడారు. రెండు రోజులపాటు కొనసాగే పల్స్పోలియోను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్పొరేటర్ ఆకారపు రేఖా– మ హేశ్, రామగుండం అర్బన్ పోలియో చుక్కల ప్రొ గ్రాం ఇన్చార్జి డాక్టర్ మణకేశ్వర్రెడ్డి, డాక్టర్ స్నేహలత, మెప్మా సీవో శ్వేత, ఆర్పీలు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు -
స్వల్పకాలికం.. సన్నరకం
మంథనిరూరల్/పెద్దపల్లి: ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ ఒకవైపు చెబుతుండగా.. దీనిని అధిగమించేందుకు స్వల్పకాలిక వరి విత్తనాలు ఉపయోగిస్తూ పంటలు వేయాలని వ్యవసాయాధికారులు మరోవైపు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ఏడు రకాల వరి విత్తనాలను రైతు ముంగిట్లోకి తీసుకువచ్చి విత్తన మేళా నిర్వహిస్తున్నారు. ప్రతీ క్లస్టర్లో.. జిల్లాలో 263 గ్రామపంచాయతీలు ఉండగా 54 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. వీటిలోని రైతువేదికల్లో ఈనెల 23, 24వ తేదీల్లో విత్తనమేళా నిర్వహించారు. ఈనెల 23న కొన్ని క్లస్టర్లలో, 24న మరికొన్నింటిలో ఏడు రకాల వరి వంగడాలతోపాటు పత్తి విత్తనాలు, నానో యూరియాను ప్రదర్శనగా పెట్టి రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం సాగు సమయం కావడంతో రైతులు అందుబాటులో లేకపోతే మరికొద్దిరోజులు కూడా విత్తన మేళా నిర్వహించే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఏడు రకాల వరి విత్తనాలు ఇవే.. ప్రస్తుతం తక్కువ నీరు, స్వల్పవ్యవధిలో దిగుబడి ఇచ్చే వరి విత్తనాలను ఎంచుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరాం, కేఎన్ఎం 7715, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 1638 వరి విత్తనాలతోపాటు పత్తి విత్తనాలను మేళాలో ప్రదర్శనగా పెడుతున్నారు. వీటితో ప్రయోజనాలు, దిగుబడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. చీడపీడలను తట్టుకునే శక్తి.. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల స్వల్పకాలిక వరి విత్తనాలకు అన్నింటినీ తట్టుకునే శక్తి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా 120 రోజుల నుంచి 140రోజుల వ్యవధిలోనే దిగుబడి వస్తుందని అవగాహన కల్పిస్తున్నారు.స్వల్పకాలిక పంటలే వేయాలి -
దూరంగా ఉంది
రామగుండంలోని ఆస్పత్రి కన్నా గోదావరిఖని ఆస్పత్రి కొంత దగ్గరగా ఉంది. కానీ గర్భిణులు వారికి కేటాయించిన హెల్త్సెంటర్లోనే పరీక్షలు చేయించుకోవాలి. అంతదూరం వెళ్లడం ఇబ్బందిగా ఉంది. సమస్యను ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ దృష్టికి తీసుకెళ్తా. – వెంగల బాపు, కార్పొరేటర్, రెండో డివిజన్ ప్రజాభిప్రాయాలు పరిశీలిస్తాం హెల్త్ సెంటర్ తరలింపుపై ప్రజాభిప్రాయాలు పరిశీలిస్తాం. ప్రజాప్రతినిధులు, స్థానికులు మాకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిచేందుకు చర్యలు తీసుకుంటాం. – ప్రమోద్కుమార్, డీహెచ్వో -
‘ఈత’కు వాత
పెంచిన రుసుం(రూ.లలో)గోదావరిఖని: కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సింగరేణి ఏరియాల్లో యాజమాన్యం స్విమ్మింగ్పూల్స్ నిర్మించింది. వీటిని వినియోగించుకునేందుకు నామమాత్రపు చార్జీలు వసూలు చేస్తోంది. ప్రస్తుతం నెలవారీ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కార్మికులు, వారిపిల్లలతో పాటు, రిటైర్డ్ కార్మికులు, కార్మికేతరులు, వారిపిల్లపై ఆర్థిక భారం పడుతోంది. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న యాజమాన్యం.. స్విమ్మింగ్పూల్లో ఉచిత సేవలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ పెరుగుతున్న ఈ క్రమంలో.. అనూహ్యంగా చార్జీలు పెంచుతూ సీఆర్పీ/పీఈఆర్/డబ్యూఈఎల్/స్పోర్ట్స్/2026/2275 పేరిట ఈనెల 24న ఉత్తర్వులు జారీచేసింది. రెట్టింపు చేసిన చార్జీలు జూలై ఒకటో తేదీనుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది. నెలవారీ చార్జీలు పెంచిన సింగరేణి కార్మికులు, కార్మికేతరులపై ‘స్విమ్మింగ్పూల్’ భారం ఉద్యోగులు గతం ప్రస్తుతం సింగరేణి ఉద్యోగులు 100 200 కుటుంబసభ్యులు(15ఏళ్లపైగా) 60 150 కుటుంబసభ్యులు(14ఏళ్లలోపు) 40 100 రిటైర్డ్ ఉద్యోగులు 200 300 కార్మికేతరులు(15ఏళ్లపైగా) 500 1,200 కార్మికేతరులు(15ఏళ్లలోపు) 400 1,000 -
పెంపు అన్యాయం
ప్రభుత్వానికి సింగరేణి రూ.వేల కోట్లు అప్పనంగా అప్పజెప్తోంది. ఉచితంగా అందించాల్సిన సౌకర్యాలపై చార్జీలు వసూలు చేస్తోంది. ఈ విషయంలో యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరించింది. కార్మిక కుటుంబాలకు ఉచితంగా సిమ్మింగ్పూల్ సౌకర్యం కల్పించాలి. యాజమాన్యం తీరుపై ప్రశ్నిస్తాం – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ చార్జీలు తగ్గించాలి పెంచిన స్విమ్మింగ్పూల్ చార్జీలను సింగరేణి యాజమాన్యం వెంటనే తగ్గించాలి. ప్రాతినిధ్య సంఘంతో చర్చించకుండా పెంపుపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నా రు. ఉచితంగా సిమ్మింగ్పూల్ సౌకర్యం కల్పించాలి. నెలవారీ రుసుం రెట్టింపు చేయడాన్ని ఖండిస్తున్నాం. యాజమాన్యంతో మాట్లాడుతాం. చార్జీలు తగ్గించాలని కోరుతాం. – జనక్ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షులు -
తడవని మడి
ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026● ఇలా పలకరించి.. అలా వెళ్తున్న ‘తొలకరి’ ● వానాకాలం సాగుపై ఎల్నినో ప్రభావం ● దుక్కులు దున్ని .. విత్తనం వేసిన రైతన్న ● వానదేవుని కోసం నిరీక్షిస్తున్న అన్నదాత దుక్కులు దున్ని.. విత్తనం వేసి కొద్దిరోజుల క్రితం భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు దుక్కులు దున్ని నేలను సాగుకు సిద్ధం చేశారు. సుమారు 90 వేల ఎకరాలకు సరిపడా వరినారు పోశారని వ్యవసాయాధికారులు తెలిపారు. 12వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసినట్టు అంచనాకు వచ్చారు. వరినారుకు అవసరమైన నీటిని బోర్లు, వ్యవసాయబావుల ద్వారా అందిస్తున్న రైతులు ఊరట చెందుతుండగా, కాలువ నీటిపై ఆధారపడ్డ వారు నిరాశలో ఉన్నారు. పెద్దపల్లి మండలంలో అక్కడక్కడా వరినా రు సైతం ఎండిపోతోందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పత్తి విత్తనాలు మొలకెత్తగా, నేలలో వేసిన విత్తనానికి మోతాదులో నీరందితేనే బతుకుందని, లేకుంటే పెట్టుబడి మునుగుడేనని రైతులు వాపోతున్నారు. సాగునీటికి తండ్లాట పత్తి విత్తనం వేసిన రైతులు దానిని కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పెద్దపల్లి మండలం హన్మంతునిపేటశివారులో రైతులు బండి లక్ష్మణ్, కనకయ్య తమ వ్యవసాయ బావిలోని నీటిని పైపుల ద్వారా అందించే ఏర్పాట్లలో కనిపించారు. సాగుపై ‘ఎల్నినో’.. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం, రుతుపవనాల బలహీనతతో ఈసారి సాగుడెలా? అని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరికొద్దిరోజుల్లో ఆశించినస్థాయిలో వర్షాలు కురవకపోతే సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేయాలని వారు సూచిస్తున్నారు. పెద్దపల్లిరూరల్: వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతన్నను ఎల్నినో ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని 14 మండలాలు, 263 గ్రామాల్లో ఈసారి సుమారు 2,15,000 ఎకరాల్లో వరి, 52 వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పండించాలని లక్ష్యంగా నిర్ణయించారు. కొద్ది రోజుల క్రితం కురిసిన తొలకరితో మురిసిన అన్నదాత.. దాదాపు 90 వేల ఎకరాలకు సరిపడా వరినారు పోశాడు. 12 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు చల్లాడు. వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు ఆశగా నిరీక్షిస్తున్నాడు. -
మెడికల్ బోర్డు ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వమే
● ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య గోదావరిఖని: మెడికల్ బోర్డును ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ విమర్శించారు. స్థానిక ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం, జీడీకే–11గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో వారు మా ట్లాడారు. బొగ్గు మాయమైందని బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అసత్యమని, దుర్మార్గమన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధనను పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు బాయిబాట పడుతూ దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 75 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారని, ఇప్పుడు అదే నాయకుడు బీఆర్ఎస్లో ఉన్నారని గుర్తు చేశారు. కార్మికుల డిమాండ్లపై నిర్లక్ష్యం చేస్తే అన్ని కార్మిక సంఘాలతో సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. 12వ వేజ్బోర్డు సాధన, కొత్త గనుల ఏర్పాటు కోసం ఏఐటీయూసీయు పోరాటం చేస్తుందని తెలిపారు. నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, వైవీ రావు, కె.వీరబద్రం, కె.స్వామి, రాజరత్నం, రాంచందర్, గౌతమ్గోవర్ధన్, రంగు శ్రీను, గంధం సాంబశివరావు, టి.రమేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంథని ఆర్డీవో కార్యాలయానికి నిధులు మంథని: రాష్ట్రంలోని 10 ఆర్డీవో, 107 తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈజాబితాలో మంథని రెవెన్యూ డివిజన్, కమాన్పూర్, పాలకుర్తి తహసీల్దార్ కార్యాలయాలకు చోటుదక్కింది. ఒక్కో భవనానికి రూ.2.25 కోట్లు మంజూరు చేసినట్లు ఉత్తర్వ్యూల్లో ప్రభుత్వం పేర్కొంది. -
దుర్గంధం మధ్య మాంసం విక్రయాలా?
కోల్సిటీ: ‘ఇది మార్కెటేనా? దుకాణాల ముందు అపరిశుభ్రతకు బాధ్యులెవరు? ఇంత దుర్వాసన వస్తుంటే ఎలా మాంసం విక్రయిస్తున్నారు? ఇలా చేస్తే లైసెన్స్లు రద్దు చేస్తాం.. మార్కెట్ నుంచి ఖాళీ చేయిస్తాం’అని మేయర్ మహంకాళి స్వామి మాంసం విక్రయదారులను హెచ్చరించారు. 39వ డివిజన్ శివాజీనగర్ కూరగాయల మార్కెట్లో ఆయన శనివారం వార్డుబాట నిర్వహించారు. డిప్యూటీ మే యర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ తిప్పారపు మానస హాజరయ్యారు. మాంసం దుకాణాల ఎదు ట అపరిశుభ్రత చూసి వ్యాపారులపై ఆగ్రహం వ్య క్తం చేశారు. పరిశుభ్రత పాటించాలని సూచించా రు. చెత్త, రాళ్లు, ప్లాస్టిక్ కవర్లు, శిథిలాలను తొలగింపజేశారు. మార్కెట్ సమీపంలో 40 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని మేయర్ సూచించారు. అల్పాహార సేవకు వెయ్యి రోజులు కోల్సిటీ/గోదావరిఖనిటౌన్: రామగుండం లయ న్స్ క్లబ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ (మీల్స్ ఆన్ వీల్స్) సేవ శనివారంతో వెయ్యి రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా గోదావరిఖని కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీ ప్రత్యేక కార్యక్రమానికి మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై అ ల్పాహారం పంపిణీ చేశారు. మీల్స్ ఆన్ వీల్స్ కో ఆర్డినేటర్ బంక రామస్వామి, రీజియన్ చైర్పర్సన్ కజాంపురం రాజేందర్ను శాలువాతో సన్మానించారు. లయన్స్ క్లబ్ సభ్యులు తానిపర్తి విజయలక్ష్మి , గోపాలరావు, తిలక్ చక్రవర్తి పాల్గొన్నారు. మేయర్ మహంకాళి స్వామి ఆగ్రహం -
జీవనాధారం పోతే బతికేదెట్లా?
ముత్తారం: ఇండస్ట్రియల్ పార్క్కు అవసరమైన భూ సేకరణ కోసం శనివారం ధర్యపూర్ వెళ్లిన తహసీల్దార్, అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. తమ జీవనాధారమైన భూములు లాక్కుంటే తా ము బతికేదెట్లా? అని ప్రశ్నించారు. కలెక్టర్ ఆదేశా ల మేరకు తహసీల్దార్ మధుసూదన్రెడ్డి తాజాగా అ వగాహన సదస్సు నిర్వహించారు. పరిహారం ఊసెత్తకుండా ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. తహసీల్దార్ మాట్లాడుతూ 80 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పా ర్క్ నిర్మాణానికి సర్వేచేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని వివరించారు. నిర్వాసితుల డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపా రు. ముత్తారం, రామగిరి ఎస్సైలు రవికుమార్, శ్రీనివాస్ బందోబస్తు నిర్వహించారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజాబాబు, కేశనపల్లి మాజీ సర్పంచ్ నూనె కుమార్, రైతులు పాల్గొన్నారు. ఏజెన్సీ రద్దు చేయాలని డిమాండ్కోల్సిటీ: చెత్త సేకరణకు అమలు చేస్తున్న పైలెట్ ప్రాజెక్ట్ ఏజెన్సీని రద్దు చేయాలనే డిమాండ్తో ము న్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో రామగుండం బల్దియా ఎదుట శనివారం ర్యాగ్ పిక్కర్లు ధర్నా చేశారు. యూనియన్ అధ్యక్షు డు మద్దెల దినేశ్, ప్రధాన కార్యదర్శి గౌస్ మా ట్లాడుతూ, 26 ఏళ్లుగా ర్యాగ్ పిక్కర్లు ఇంటింటా చె త్త సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారన్నారు. నెలకు రూ.250 మ్యాచింగ్ గ్రాంట్తో ప్రారంభమైన వీరిజీవితం ప్రస్తుతం రూ.4వేలకు చేరిందని, ఒక్కో ఇంటినుంచి రూ.50 చొప్పున వసూలయ్యే వినియోగ రుసుంతో కొనసాగుతోందన్నారు. ఇలాంటివారికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అవకాశం కల్పిస్తారని ఆశిస్తే, పైలెట్ ప్రాజెక్టు ఏజెన్సీలను తీసుకురావడం అన్యాయమన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేసిన నాయకులు.. అనంతరం కలెక్టర్కూ విన్నవించినట్లు వివరించారు. -
ఢిల్లీలో ‘గౌరవం’
ఎలిగేడు: డ్రగ్స్, అబ్యూస్, మత్తు పదార్థాల నిర్మూలన, యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ యువజన అవార్డు గ్రహీతల సంఘం ఈనెల 26న ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర తొలి జాతీ య యువజన అవారు గ్రహీత కొండ రవియాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ గౌరవ్ సమ్మన్ అవార్డు, సర్టిఫికెట్ను అతిథుల నుంచి అందుకున్నారు. ధూళికట్టకు చెందిన రవియాదవ్ 15ఏళ్లుగా సామాజిక గేయాలు పా డుతూ ప్రజలను చైతన్యపర్చుతున్నారు. ఆ యన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేశారు. ఆయనను స్థానిక ప్రజాప్రతినిధులు, ధూళికట్ట గ్రామస్తులు అభినందించారు. ‘సర్’పై అవగాహన రామగుండం: గ్రామీణ ఓటర్లకు ‘సర్’పై సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నామని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్ అన్నారు. ముర్మూరు, రాయదండి, బ్రాహ్మణపల్లి, అంతర్గాం తదితర గ్రామాల్లో ‘సర్’పై శనివారం ఆయన ఇంటింటా ప్రచారం చేశారు. ఓటుహక్కు తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికీ ఉండదన్నారు. మా జీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, ఓబీసీ సెల్ ప్రతినిధి సింగం కిరణ్కుమార్గౌడ్, సర్పంచ్ మగ్గిడి స్వరూప, నాయకులు గొర్రె చందు, మగ్గిడి రాకేశ్, అనుమల్ల రాకేశ్, జూల విజయ్, రవి, బానాల రవి, లంక మదనయ్య తదితరులున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ డివిజన్లలో సర్ పత్రాలు పంపిణీ చేశారు. బీఎల్ఓలు మాచర్ల నీరజ, కూకట్ల రమాదేవి, ఆరుముళ్ల సునీత, పల్లికొండ రేవతి, కాంగ్రెస్ శ్రేణులు సాదు రమేశ్, సాదుల శివ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో ‘ఆదర్శం’ జూలపల్లి: పెద్దాపూర్ ఆదర్శ విద్యాలయం విద్యార్థిని ఎస్.సిరివల్లి విద్యాశాఖ, సోషల్ ఫోరం ఇటీవల నిర్వహించిన తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్లో ప్రథమ బహుమతి సాధించింది. విద్యాశాఖ డైరెక్టర్ .నవీన్ నికోలస్ ఆమెకు ప్రశంసపత్రం అందజేశారు. బాలికతోపాటు తల్లిదండ్రులను డీఈవో శారద, ఎంఈవో సరస్వతి, ప్రిన్సిపాల్ సరిత, ఉపాధ్యాయులు శనివారం అభినందించారు. కూరగాయల విత్తనాలు పంపిణీ జ్యోతినగర్: మేడిపల్లి సెంటర్ లైఫ్ స్కిల్స్ ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత శనివారం రైతులకు కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. ప్రాజెక్టు ప్రభావిత, పునరావాస 20 గ్రామాలతోపాటు వివిధ డివిజన్లలోని 200 మంది రైతులకు సీఎస్సార్ ద్వారా రూ.10.30 లక్షల విలువైన కూరగాయల విత్తనాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్ఆర్) సాగర్ రంజన్ సాహూ, సీఎస్సార్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. 4న ఎమ్మెస్సీ ఎంట్రెన్స్ టెస్ట్ పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జువాలజీ ఎంట్రెన్స్ గ్రాండ్ టెస్ట్ను జూలై 4న ఆన్లైన్ పద్ధతిన నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య శనివారం తెలిపారు. ఈ టెస్ట్ ఏటా మాదిరిగానే ఈసారి కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గతేడాది ఓ విద్యార్థి రాష్ట్రస్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించా డని గుర్తుచేశారు. ఆసక్తి గలవిద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. వి ద్యార్థులకు అండగా నిలుస్తున్న జువాలజీ హె చ్వోడీ తిరుపతిని ఆయన అభినందించారు. -
ఎన్టీపీసీ, సుల్తానాబాద్ పాఠశాలల సందర్శన
సుల్తానాబాద్రూరల్/జ్యోతినగర్: బెస్ట్ అవైలేబుల్ స్కూళ్లలో విద్యార్థులపై వివక్ష చూపుతున్నారనే ఆరోపణలపై జిల్లా ఎ స్సీ డెవలప్మెంట్ అధికారి ర వీందర్, అధికారులు శనివా రం సుల్తానాబాద్లోని నేహా కాన్సెప్ట్ స్కూల్, ఎన్టీపీసీలోని విశ్వభారతి హైస్కూళ్లను సందర్శించారు. ‘బెస్ట్’ స్టూడెంట్లపై వివక్ష శీర్షికన ఈనెల 26న సాక్షిలోనూ ప్రచురితమైన కథనంపై స్పందించారు. విద్యార్థులు, యాజమాన్యాలతో మాట్లాడారు. విద్యార్థులందరికీ పుస్తకాలు అందించాలన్నారు. విశ్వభారతి స్కూల్ యాజమాన్యం బుక్స్, సామగ్రిని అందించనున్నట్లు తెలిపింది. -
3లోగా ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ
పెద్దపల్లి: వచ్చే జూలై 3వ తేదీలోగా జిల్లావ్యాప్తంగా ప్రతీఓటరుకు ఎన్యూమ్యూరేషన్ పత్రం అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్లో శనివారం చేపట్టిన ఎస్ఐఆర్ ఆన్లైన్ నమోదు ప్రక్రియను కలెక్టర్ ఆక స్మికంగా తనిఖీ చేశారు. బీఎల్వోలకు అందరూ సహకారం అందించాలన్నారు. తహసీల్దార్ రాజ య్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. స్థానిక వెంకట పద్మ ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లాస్థాయి సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు స్వతంత్రంగా చదవడం, మాట్లాడడం, నేర్చుకున్న అంశాలను సృజనాత్మకంగా వ్యక్తపరచడం లాంటివి చేయడం కోసం తీర్చిదిద్దాలని కోరారు. జిల్లాలోని 14 మండలాల నుంచి సుమారు 1,000 మంది ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు హాజరుకాగా, జెడ్పీ సీఈవో నరేందర్, అధికారులు పీఎం షేక్, మల్లేశ్, కవిత, అలోకిట్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు -
భవన నిర్మాణంలో వేగం పెంచాలి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో చేపట్టిన ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి భవన నిర్మాణంలో వేగం పెంచా లని ప్రభుత్వ విప్ సీహెచ్ విజయరమణారావు సూచించారు. శనివారం ఆయన భవనం పనులు పరిశీలించారు. పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు ఉన్నారు. పథకాల అమలులో ముందంజ జూలపల్లి: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. చీమలపేటలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల భవనం ప్రారంభించారు. వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. సీహెచ్ సుధాకర్రావు స్మారక క్రికెట్ టోర్నీలో విజేతలకు జ్ఞాపికలు, నగదు ప్రోత్సాహాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో విప్ మాట్లాడారు. తహసీల్దార్ దత్తుప్రసాదరావు, సర్పంచ్ లంక స్వామి, ఏఎంసీ చైర్మ న్ కొమ్మ పోచాలు, పీఏసీఎస్ చైర్మన్ వేణుగోపాలరావు, ఎంపీవో శేషయ్య సూరి, ఏపీవో సదానందం, సర్పంచులు సంపత్కుమార్, తొగరు శ్రీనివా స్, నాయకులు నర్సింహయాదవ్, జక్కని శంకర య్య, అంజయ్య, లోక జలపతిరెడ్డి, బండి స్వామి, కొమురయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు -
అర్హులందరికీ ఓటరు జాబితాలో చోటు
పెద్దపల్లిరూరల్: ఎన్నికల సంఘం ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను చేపట్టిందని, ఇందులో అర్హుల పేర్లు జాబితాలో ఉండేలా చూ డాల్సిన బాధ్యత బూత్స్థాయి ఏజెంట్, వార్డు నా యకులపై ఉందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. స్థానిక తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమావేశమై సూచనలు చేశారు. ఇంటింటికీ బీఎల్వోలు వస్తారని, వారికి ప్రజలు సహకరించాలని కోరారు. ఓటరు జాబితాపై కొన్ని రాష్ట్రాల్లో గందరగోళం సృష్టించి ఓట్లను తొలగించి రాజకీయ లబ్ధి పొందారని ఆయన ఆరోపించారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా అర్హులందరికీ ఓటుహక్కు ఉండేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్యతోపాటు కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు, బూతుస్థాయి ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. సీఎం పథకాలకు దేశంలోనే గుర్తింపు ఓదెల: సీఎం రేవంత్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలోనే మంచి గుర్తింపు పొందాయని విప్ విజయరమణారావు అన్నారు. జీలకుంట, ఓదెలలో మహిళా సమాఖ్య భవనం, కేజీబీవీ మూత్రశాలలు, హాళ్లు ప్రారంభించి మాట్లాడా రు. సర్పంచులు రాగిడి మంగ, కనికిరెడ్డి సతీశ్, పల్లె కనుకయ్య, పిట్టల రవికుమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బైరి రవిగౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రౌతు మనోజు క్రాంతివీర్, ఎస్వో జ్యోతి, ఏడీఏ రవీందర్ పాల్గొన్నారు. జీలకుంట సర్పంచ్ రాగిడి మంగ, వార్డుసభ్యురాలు బంగారి పద్మ విప్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు -
వన మహోత్సవానికి సిద్ధం
పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా ఈఏడాది 6,57,500 మొ క్కలు నాటాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధానపాత్ర పోషించనుంది. జిల్లాలో గల 263 నర్సరీల్లో ఇప్పటికే మొక్కల పెంపకం చేపట్టారు. వాటి సంరక్షణకు 3,421 పని దినాలు, ఈజీఎస్ కూలీలకు వేతనం, మెటీరియల్ కోసం రూ.1,24,604 ఖర్చు చేశారు. ప్రభుత్వ, అటవీ, ఖాళీ స్థలాలు, రోడ్డుకు ఇరువైపులా, చెరువుగట్లు, కుల సంఘాల స్థలాల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో గృహాలంకరణ, పూలు, పండ్ల మొక్కలు ఉన్నాయి. వీటిని నివాసాల్లో నాటేందుకు సరఫరా చేయనున్నారు. -
బోసిపోయిన మార్కెట్ ఏరియా
మంథని: నిత్యం రద్దీగా ఉండే మంథని కూరగాయల మార్కెట్ ఏరియా బోసిపోయి కనిపిస్తోంది. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయాల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో ప్రస్తుత కట్టడాలు తొలగించారు. ఇక్కడి నుంచి బొక్కలవాగు కట్టపైకి మార్కెట్ను తరలించారు. పడిపోయిన వ్యాపారం.. గదులు ఖాళీ మార్కెట్ ఏరియా పరిధి.. కేడీసీసీ బ్యాంకు రోడ్డు, రాంరెడ్డి కాంప్లెక్స్ ఏరియాతోపాటు చుట్టూ ఉన్న కూడలిలోని వ్యాపారులకు పదిరోజుల నుంచి వ్యా పారాలు సాగడంలేదు. వ్యాపారాలు లేక ఖాళీగా కూర్చుంటున్నారు. ఇటువైపు వచ్చేవారు లేక బిజినెస్ పడిపోయింది. కొందరు వ్యాపారులు తమ దుకాణాలను బొక్కలవాగు కట్ట సమీపంలోకి మార్చుతున్నారు. మరికొందరికి సమీపంలో గదు లు అందుబాటులో లేక ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. వ్యాపారం పడిపోవడంతో అనేకమంది దుకాణాలు ఖాళీ చేయడంతో సమీపంలో చాలాగదులకు టూ – లెట్ బోర్డులు తగిలించారు. మార్కె ట్ సమీపంలో పక్కాగా నిర్మాణాలు చేసుకున్న యజమానాలు మరోచోటికి మారే అవకాశం లేక అద్దెకు ఇచ్చిన గదులు ఖాళీ అవుతుండడంతో ఆందోళకు గురవుతున్నారు. బ్యాంకు రుణాలు పొంది రూ.లక్షలు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేసుకున్నామని, గదులు ఖాళీ అయితే ఈఎంఐలు ఎట్లా చెల్లించేదని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్ నిర్మాణం జరిగే వరకు ఎంతకాలం పడుతుందో, అప్పటివరకు తమ పరిస్థితి ఎలా అని ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ ఏరియాలో టూలెట్ బోర్డులో ఓ గది బోసిపోయిన మార్కెట్ ప్రాంతం గదులు ఖాళీ.. గిరాకీ లేదు పడిపోయిన వ్యాపారం ప్రత్యామ్నాయంలో వ్యాపారులు -
పకడ్బందీగా పల్స్పోలియో
పెద్దపల్లి: పల్స్పోలియోను విజయవంతం చే యాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఇందుకోసం ఈనెల 28న బూత్ డే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 29, 30వ తేదీల్లో ఇంటింటా సర్వే చేస్తారని, జిల్లావ్యాప్తంగా 62,902 మంది చిన్నారులకు పోలియోచుక్కలు వేయడం లక్ష్యంగా నిర్ణయించామని వివరించారు. చుక్కలమందు వేసే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. భద్రతతో విధులు జ్యోతినగర్: విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వామ్యులవుతున్న కాంట్రాక్టు కార్మికులు విధి నిర్వహణలో భద్రత చర్యలు పాటించాలని ఎన్టీపీసీ ఎ గ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత సూచించారు. తెలంగాణ ప్రాజెక్టు సర్వీసు బి ల్డింగ్లో జూలై 2వ తేదీ వరకు నిర్వహించే జా తీయ విద్యుత్ భద్రత వారోత్సవాలను శుక్ర వారం ప్రారంభించి మాట్లాడారు. జీఎంలు ముకుల్ రాయ్, అవిజిత్ దత్తా, బినోయ్ జోష్తోపాటు అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఉద్యమకారుల సమ్మేళనం పెద్దపల్లి/కమాన్పూర్: హైదరాబాద్లో ఈనెల 28న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ స మ్మేళనం నిర్వహిస్తామని ఆ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కావటి సతీశ్ యాదవ్ తెలిపారు. సమ్మేళనం ప్రచార పోస్టర్ను జిల్లా కేంద్రంతోపాటు కమాన్పూర్లో శుక్రవారం ఆ విష్కరించి మాట్లాడారు. ఎలిగేడు, ర్యాకల్దేవ్పల్లి స ర్పంచులు కప్పల ప్రవీణ్, మధ్యల సంపత్, నాయకులు జావేద్ఖాన్, ఖమ్మం సురేశ్, బోయిని సుమన్, శ్రవణ్ పాల్గొన్నారు. వ్యసనపరులు నేరస్తులు కాదు గోదావరిఖని: గంజాయి వ్యవసనపరులు నేరస్తులు కాదని, వారిని బాధితులుగానే చూడా లని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక రాజీవ్ రహదారిపై శుక్రవారం మానవహారం నిర్వహించారు. డీసీపీతోపాటు ఏసీపీ రమేశ్ పాల్గొని మాట్లాడారు. వ్యసనపరులను గుర్తించిన పోలీసులకు లేదా డయల్ 100, 1908 నంబర్లకు సమాచారం అందిస్తే ఆ స్పత్రులు, డీ అడిక్షన్ కేంద్రాలకు తరలించి వై ద్యచికిత్సలు, కౌన్సెలింగ్, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వన్టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, అఫ్జలుద్దీన్, ఎస్సైలు మనోహర్, అనూష పాల్గొన్నారు. కలెక్టర్ ఫొటోకు క్షీరాభిషేకం ముత్తారం: పోతారంలోని సర్వే నంబరు 59, మైదంబండలోని 113 సర్వే నంబరులోని అ క్రమ పట్టాలను రద్దు చేసిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష చిత్రపటానికి బాధిత రైతులు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. మంథని డివిజన్ దళిత నాయకుడు ఊట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, స్వాధీనం చేసుకున్న భూమిని 48 మంది పేదరైతులకు పంపిణీ చేయాలన్నారు. మడేలేశ్వరస్వామికి బోనాలు ఎలిగేడు: రజక సంఘం ఆధ్వర్యంలో శు క్రవారం మండల కేంద్రంలో మడేలేశ్వర స్వామి బోనాలు వైభవంగా నిర్వహించా రు. మహిళలు స్వామివారికి బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కు లు చెల్లించుకున్నారు. ఈకార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు ముంజంపల్లి సాయిలు, ముంజంపల్లి రాజేశం, వార్డుసభ్యులు కవిత, రాకేశ్, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. నిరుద్యోగ మహిళలకు వరం పెద్దపల్లి: జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టల భర్తీకి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. తద్వా రా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన నిరుద్యోగ మహిళలకు ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. జూలై 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 62 టీచర్, 252 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. -
పేదల సొంతింటి కల సాకారం
ధర్మారం: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నా రు. పెర్కపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి మంత్రి శుక్రవారం గృహప్రవేశం చేయించారు. ఇంటి యజమానులైన దంపతులకు నూతన వస్త్రాలు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ప్రజల ను మోసం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలకు తగిన న్యాయం జరుగుతోందని తెలిపారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాం, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి హయాంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహులు, సర్పంచ్ గొల్ల కృష్ణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నందాల సంగ రంజిత్ కుమార్, సర్పంచులు వేల్పుల నాగరాజు, చేపూరి లచ్చయ్య, మల్లేశం, నాయకులు మద్దుల గోపాల్రెడ్డి, చింతల ప్రదీప్రెడ్డి, ఓరం చిరంజీవి, జంగ మహేందర్, కాడే సూర్యనారాయణ, దేవి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మండల కేంద్రంలో జరిగిన మొహర్రం వేడుకల్లో మంత్రి లక్ష్మణ్కుమార్ పాల్గొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
ఎదురు చూస్తున్నాం
2024 నవంబర్లో అప్పటి సీఎండీ బలరాం పీఆర్పీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత సీఎండీని కూడా కలిసి సమస్య వివరించాం. సాధ్యమైనంత త్వరగా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. డిప్యూటీ సీఎం, కోల్బెల్ట్ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులనూ కలిశాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. అన్నికార్మిక సంఘాలు కూడా తమ డిమాండ్లు పరిష్కరించాలని యాజమాన్యానికి లేఖ అందజేశాయి. అయినా పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. పీఆర్పీ కోసం మేం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాం. – పొనుగోటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు, సీఎంవోఏఐ -
మారిన అలైన్మెంట్
సాక్షి,పెద్దపల్లి: జిల్లా ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణం వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా భావించిన ఈ ప్రాజెక్ట్లో అనూహ్యంగా అలైన్మెంట్ (రోడ్డు మార్గం) మారడం, భూసేకరణ పూర్తి కాకముందే పనులు ప్రారంభించడంపై రైతు లు తీవ్రఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన ప్రాంతం కాకుండా మరోప్రాంతం వైపు మళ్లించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శంకుస్థాపన చేసిన ప్రాంతం వద్ద రాజీవ్ రాహదారిని కలిపే ప్రాంతంలో ఒకేసారి 95 డిగ్రీలు టర్న్ చేయా ల్సిన పరిస్థితి నెలకొందని, అలా చేయడం ద్వారా ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, అందుకే కొత్తరూట్లో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించామని అధికారులు చెబుతున్నారు. నెలరోజుల్లోనే మారిపోయిన బైపాస్ మార్గం పెద్దపల్లి పట్టణ ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రూ.82 కోట్ల వ్యయంతో 12.1 కిలోమీటర్ల పొడవున బైపాస్ రోడ్డు నిర్మాణానికి మే 9న శంకుస్థాపన చేసింది. పెద్దకల్వల నుంచి నిట్టూరు, చందపల్లి మీదుగా అప్పన్నపేట వరకు డబుల్ లేన్ రోడ్డుతోపాటు సెంట్రల్ లైటింగ్ సిస్టంతో ప్రాజెక్ట్ ప్రతిపాదించారు. శంకుస్థాపన జరిగిన కొద్దిరోజులకే తొలుత ప్రకటించిన అలైన్మెంట్లో మార్పులు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మొదట ప్రజలకు చూపించిన మార్గం కాకుండా మరోదిశగా సర్వే పనులు సాగుతుండడంతో రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతుండడంతో బాధిత రైతులూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్ మార్పుతో కొందరు భూములు తప్పించుకోగా, కొత్తగా మరికొందరి వ్యవసాయ భూములు రోడ్డు పరిధిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభావిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెరవెనుక ఒత్తిళ్లపై ఆరోపణలు రూట్ మార్పు వెనుక భారీస్థాయిలో ఒత్తిళ్లు లేదా ఆర్థికలావాదేవీలు జరిగి ఉండవచ్చని స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికారికంగా ఎలాంటి వివరణ లేకపోవడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. తొలుత నిర్ణయించిన అలైన్మెంట్ను ఎందుకు మార్చారో అధికార యంత్రాంగం నుంచి స్పష్టత రాకపోవడంతో అన్నదాతలు నిరసనలు, ఆందోళనకు దిగుతున్నారు. భూసేకరణ చేయకుండానే పనులు గతంలో హైదరాబాద్ తాగునీటి పైప్లైన్ కోసం సేకరించిన 100 అడుగుల వెడల్పు కారిడార్లో ప్రస్తుతం 30 అడుగుల స్థలం ఖాళీగా ఉందని, దానిని బైపాస్ నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తిస్థాయి రహదారి నిర్మాణానికి మరో 70 అడుగులు అవసరం ఉంది. ఆ భూమి సేకరణ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోయినా పనులు ప్రారంభించడంపై స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన స్థలం నుంచి మళ్లిన బైపాస్ రోడ్డు డిజైన్ భూములు నష్టపోతున్నామని అన్నదాతల ఆందోళన భూసేకరణ, పరిహారం లేకుండానే పనులు చేస్తున్నారని ఆరోపణలు నిరసన వ్యక్తం చేస్తున్న పెద్దకల్వల, అప్పన్నపేట గ్రామాల రైతులు -
పీఆర్పీపై సింగరేణి పేచీ
గోదావరిఖని: సింగరేణి అధికారుల పీఆర్పీ(పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) చెల్లింపులపైనే ప్రధానంగా పేచీ కొనసాగుతోంది. మూడేళ్లలో అధికారులకు రావాల్సిన సుమారు రూ.394 కోట్ల కోసం వారు నాలు గు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తూనే ఉన్నారు. వాస్తవానికి ప్రతీఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించే లాభాల్లో వాటాను వచ్చే ఏడాది జూన్లో చెల్లిస్తారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం అధికారులకు రూ.117కోట్లు పీఆర్పీ ప్రకటించింది. వీటిని 2024 జూన్లోగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గడిచిన మూడేళ్లలో ఇదేవిధంగా పీఆర్పీ చెల్లించాల్సి ఉంది. కోలిండియా యాజమాన్యం రెండేళ్ల పీఆర్పీ సొమ్మును అధికారులకు చెల్లించింది. సింగరేణిలో మూడేళ్లుగా చెల్లింపులు నిలిచిపోవడంతో అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పీఆర్పీ అంటే.. కోలిండియా యాజమాన్యం తమ అధికారులకు లాభాల్లో వాటా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సింగరేణి యాజమాన్యం కూడా అధికారులకు పీఆర్పీ చెల్లించడం తప్పనిసరైంది. ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన బొగ్గు ఉత్పత్తి, విక్రయాల్లో వచ్చిన లాభాలపై 5శాతం అధికారులకు పీఆర్పీ చెల్లిస్తూ వస్తోంది. దీనినే ఆపరేషనల్ ఫ్రావిట్ అని కూడా అధికారులు పేర్కొంటున్నారు. మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఫెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్(పీఆర్పీ) అధికారు లకు అందాల్సి ఉంది. వీటిలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఆర్పీ కోలిండియా యాజమాన్యం కూడా అధికారులకు ఇంకా చెల్లించలేదు. అయినా.. జూన్లోనే చెల్లించాల్సి ఉంది. అధికారుల్లో అసంతృప్తి పీఆర్పీ చెల్లింపు నిలిచిపోవడంతో అధికారుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. సంస్థ వ్యాప్తంగా సుమారు 2,200మంది అధికారులు పనిచేస్తుండగా.. ఒక్కో అధికారికి సీనియార్టీ ప్రకారం ఒక్కో ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.6లక్షల వరకు పీఆర్పీ వస్తుందని అంచనా వేస్తున్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న తమను పీఆర్పీ చెల్లించకుండా యాజమాన్యం చిన్నచూపు చూస్తోందని అధికారులు వాపోతున్నారు. ఈ – వన్ గ్రేడ్ నుంచి ఈ–8 గ్రేడ్ వరకు పీఆర్పీ ఇవ్వాల్సి ఉంది. అధికారులకు అందాల్సిన సొమ్ముపై తీవ్ర నిర్లక్ష్యం మూడేళ్లుగా చెల్లించని బొగ్గు గనుల సంస్థ నాలుగు రోజులుగా కొనసాగుతున్న అధికారుల నిరసనపీఆర్పీ బకాయిలు(రూ.కోట్లలో) 2022–23 117 2023–24 127 2024–25 150 -
ఎన్యూమరేషన్ ఫామ్ నింపండి ఇలా..
సాక్షి పెద్దపల్లి: ప్రతీపౌరుడికి ఓటుహక్కు కల్పించడం, ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. ఈలక్ష్యంతో తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వో) మీ ఇంటికి వచ్చి తెలుగు, ఇంగ్లిష్లో ఉండే ‘ఎన్యూమరేషన్ ఫామ్’ అందిస్తారు. చాలామంది దీనిని నింపడానికి ఇబ్బంది పడుతుంటారు. సరైన సమాచారం అందిస్తేనే మీ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదవుతుంది. ఈ ఫామ్ను ఎలా నింపాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్యూమరేషన్ ఫామ్ అంటే ఏమిటి? మొత్తం మూడు భాగాలుగా.. ఓటర్లు అందించాల్సిన సరైన పత్రాలు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్పోర్టు, పదో తరగతి సర్టిఫికెట్, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, అటవీహక్కుల ధ్రువీకరణపత్రం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం, ఇంటి అద్దె రసీ దు లేదా కరెంటు బిల్లు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. సరైన వివరాలు అందించడం వల్ల భవిష్యత్లో ఓటరు కార్డులో పేరు గల్లంతు కాకుండా ఉంటుంది. అలాగే, ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడటం ద్వారా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. చేయాల్సినవి చేయకూడనివి ఫామ్ నింపేటప్పుడు గుర్తుంచు కోవాల్సిన ముఖ్య అంశాలు వివరాలు జాగ్రత్తగా తప్పులు లేకుండా నింపాలి కొత్త కలర్ ఫొటో అతికించండి రసీదు తీసుకోవడం మరవద్దు -
తొలిరోజు 7వేలు
సాక్షి పెద్దపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమం జిల్లాలో గురువారం అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్స్థాయి అధికారులు(బీఎల్వోలు) ఇంటింటీకి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ ప్రక్రి య చేపట్టారు. వచ్చేనెల 24వ తేదీ వరకు ఈ ప్ర క్రియ చేపట్టనున్నారు. తొలిరోజు బూత్స్థాయి అధికారులు ఇంటింటీకి వెళ్లి 7,412 ఎన్యూమరేషన్ ఫామ్స్ను ఓటర్లకు అందజేసి కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. వివరాలు నింపిన తర్వాత కొద్దిరోజుల వ్యవధిలో వాటిని తిరిగి బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి స్వీకరిస్తారు. 844 మంది బీఎల్వోల నియామకం జిల్లాలోని 7,11,408 మంది ఓటర్ల ఇళ్లకు ఈ ఫామ్స్ను సకాలంలో చేరవేయడానికి ఎన్నికల యంత్రాంగం జిల్లాలో 844మంది బీఎల్వోలను నియమించింది. పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించిన ఇళ్లకు బీఎల్వోలు స్వయంగా వెళ్తున్నారు. వీరితోపాటు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం సవరణ ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను పెంపొందించేందుకు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ లు) కూడా బీఎల్వోలతో కలిసి పర్యటిస్తున్నారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో ప్రతీపార్టీ తరఫున ఒక ప్రతినిధి పాల్గొంటూ, ఫామ్స్ పంపిణీ, వివరాల ధ్రువీకరణ, ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నారు. డిజిటల్ విధానానికీ స్పందన సంప్రదాయ పద్ధతితోపాటు డిజిటల్ విధానంలో కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించే అవకా శం కల్పించారు. తొలిరోజే జిల్లావ్యాప్తంగా 142 మంది ఓటర్లు ఆన్లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేశారు. ఇది పంపిణీ చేసిన ఫామ్స్తో పోల్చితే 1.92 శాతంగా నమోదైంది. అవగాహన కల్పించడమే సవాల్ ప్రతీఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫామ్–2ను పూర్తిచేసి బీఎల్వోలకు అందజేయాల్సి ఉండటంతో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ప్రారంభమవడంతో చాలామంది రైతులు ఉదయం వేళలకే పొలాలకు వెళ్లిపోతుండడం బీఎల్వోలకు సవాల్గా మారింది. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలతో బిజీగా ఉండే ఓటర్లను కలవడం కూడా సులభం కావడం లేదు. అయితే ఎన్నికల అధికారులు, బీఎల్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్లకు అవగాహన కల్పిస్తే ఈ ప్రక్రియ విజయవంతమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటుహక్కు భద్రంగా ఉండాలంటే ఓటర్లు సకాలంలో ఫామ్స్ పూర్తిచేసి సమర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రారంభమైన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఇంటింటికి బీఎల్వోలు.. పర్యవేక్షించిన అధికారులు తొలిరోజు 7,412 ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధుల భాగస్వామ్యం జిల్లాలో సర్ వివరాలు బీఎల్వోలు : 845 ఓటర్లు : 7,11,408 ప్రింట్చేసిన ఎన్యుమరేషన్ ఫామ్స్ 7,06,107 ఓటర్లకు పంపిణీ చేసినవి :7,412 ఫామ్స్ పంపిణీ చేసిన శాతం : 1.04 డిజిటల్లో ఫామ్స్ నింపినవారు :142 డిజిటల్లో ఫామ్స్ నింపిన వారిశాతం : 1.92 -
మత్తు విముక్తికి చర్యలు
కోల్సిటీ/గోదావరిఖనిటౌన్: గోదావరిఖని ప్ర భుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్ సెంటర్ ఏసీపీ రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి డీసీపీ రాండ్డి గురువారం సందర్శించారు. మత్తు పదార్థాలకు గు రై చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవలు, పురోగతిపై వైద్యులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆధ్వర్యంలో అందించి న క్యారమ్, చెస్ బోర్డులు తదితర ఆటవస్తువులను పంపిణీ చేశారు. మార్కండేయకాలనీ ఉ ప్పర సంఘం భవనంలో జూనియర్ కాలేజీల విద్యార్థులకూ అవగాహన కల్పించారు. మెడికల్ సూపరింటెండెంట్ హిమబింద్సింగ్, ఆర్ఎంఓవో కృపాభాయి పాల్గొన్నారు. భూములెలా లాక్కుంటారు? పెద్దపల్లిరూరల్: ప్రజావసరాల కోసమని బైపా స్ రోడ్డు నిర్మించేందుకు మా భూములను మా కు చెప్పకుండానే మీ ఇష్ట ప్రకారం లాక్కోవ డం ఏమిటని నిర్వాసితులు గురువారం పెద్దకల్వల వద్ద నిరసనకు దిగారు. గతంలో బైపాస్ రోడ్డు కోసం చేసిన సర్వేను పక్కన బెట్టి ఇప్పు డు సారవంతమైన భూముల్లో వ్యవసాయం చే సుకుంటున్న తమను ఇబ్బంది పెట్టేలా డిజైన్ మార్చడం సమంజ సంకాద న్నారు. తమకు అన్యాయం జరిగేలా చూడవద్దని వారు అధికారులను వేడుకున్నారు. శిశు మరణాలు తగ్గించాలి పెద్దపల్లి: నవజాత శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా సిబ్బంది, అధికారులు పనిచేయాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ సూచించా రు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో న వజాత శిశు మరణాలపై గురువారం సమీక్షించారు. గర్భిణులను ఎర్లీ రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు హైరిస్క్ ప్రెగ్నెన్సీ గుర్తించి తగిన ప ర్యవేక్షణ చేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్వోలు శ్రీరాములు, కిరణ్ కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్, ప్రోగ్రామ్ అధికారులు, ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్ట్లు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘మోడల్’ విద్యార్థి ప్రతిభ రామగుండం: తెలంగాణ మోడల్ యునైటె డ్ నేషన్స్ డెలిగేట్ విభాగంలో స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థి బి.అద్వైత్ రాష్ట్రస్థాయిలో ప్ర థమ బహుమతి సా ధించాడని ప్రిన్సిపల్ సదానందం యాదవ్ తెలిపారు. బహుమతి సాధించడంపై స్కూల్ ఎ డ్యుకేషన్ డైరెక్టర్ నికోలస్ అభినందించారు. మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారని ఆయన పేర్కొన్నారు. ‘పోలీసులు వేధిస్తున్నారు’ పెద్దపల్లి: వెండి, బంగారం వర్తక సంఘం స భ్యులను పోలీసులు వేధించకుండా కాపాడా లని స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వింజమూరి రాఘవచారి కోరారు. గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిసి వినతిపత్రం అంద జేశారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విన్నవించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేవూరి వెంకటస్వామితోపాటు రంగు శ్రీనివాస్, కట్ట రమే శ్, దేవరకొండ రాజు, కట్ట సతీశ్ పాల్గొన్నారు. టెన్త్లో 93శాతం ఉత్తీర్ణత పెద్దపల్లి: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయని డీఈవో శార ద తెలిపారు. 172 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, 160 మంది ఉత్తీర్ణులు అయ్యారన్నారు. జిల్లాలో ఉత్తీర్ణత 93.02 శాతంగా నమోదైందని వివరించారు. 27న మెగా జాబ్మేళా పెద్దపల్లి: ఈనెల 27న వరంగల్ కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్లో ఉదయం 8గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహిస్తారని జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపారు. యువత హాజరు కావాలన్నారు. -
స్పందించని సింగరేణి.. పోరుబాటే శరణ్యం
గోదావరిఖని: అధికారులు పోరుబాట పట్టారు. అయినా యాజమాన్యం స్పందించడంలేదు. దీంతో అధికారులు పోరాటాన్ని ఉధృతం చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే అన్నిఏరియాల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. సోమవారం నుంచి జీఎం కార్యాలయాల ఎదుట రిలేనిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం అన్ని ఏరియాల అధికారులకు ఆ సంఘం ఆదేశాలు జారీ చేసింది. రిలే నిరాహార దీక్షలు చేపట్టినా స్పందించక పోతే వర్క్టూ రూల్ ప్రారంభిస్తామని హెచ్చరిస్తోంది. సంస్థ వ్యాప్తంగా సుమారు 2,200మంది అధికారులు పనిచేస్తున్నారు. వీరందరికీ 2022–23, 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పీఆర్పీ చెల్లించాలని, వీటిలో రెండేళ్ల బకాయిలు సుమారు రూ.277కోట్లు రావాల్సి ఉందని అంటోంది. మరోఏడాది లెక్క తేలాల్సి ఉందంటున్నారు. సొంత సంస్థగా భావించి అభివృద్ధికోసం అహర్నిశలు శ్రమిస్తున్న తమను యాజమాన్యం పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో సింగరేణి అధికారులు ఉన్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. దశల వారీగా ఆందోళనలు సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళనకు అధికారులు పిలుపునిచ్చారు. తొలిదశలో కార్మికవాడల నుంచి జీఎం కార్యాలయాలవరకు ఆందోళన నిర్వహించారు. జీఎంలకు వినతిపత్రాలు అందజేశారు. రెండోశలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. అయినా యాజమాన్యం స్పందించక పోవడంతో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. రిలే నిరాహార దీక్షలకు స్పందించకపోతే ప్లేడేలు బాయికాట్ చేయడం, వర్క్ టూ రూల్ పాటించనున్నట్లు సింగరేణి అధికారుల సంఘం ప్రకటించింది. సంస్థ కోసం శ్రమిస్తున్నాం సింగరేణి కోసం ఇళ్లు వదిలి అహర్నిశలు శ్రమిస్తున్నాం. సకాలంలో పీఆర్పీ బకాయిలు చెల్లించకపోవడంతో అసంతృప్తి పెరిగింది. అనేక విధాలుగా ఆందోళన నిర్వహించాం. యాజమాన్యం స్పందించక పోవడం బాధగా ఉంది. అధికారులకు రావాల్సిన పీఆర్పీతో పాటు మిగతా సమస్యలు పరిష్కరించాలి. – పెద్ది నర్సింహులు, ప్రధాన కార్యదర్శి సీఎంవోఏఐ వర్క్టూ రూల్కు సిద్ధమైన అధికారులు -
‘సర్’ను విజయవంతం చేయాలి
జ్యోతినగర్: ప్రత్యేక సమగ్ర సవరణ–2026 విజ యవంతానికి బూత్ లెవల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని రామగుండం మేయర్ మ హంకాళి స్వామి కోరారు. ఎన్టీపీసీ మిలీనియం హా ల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు, ఓటర్లకు గణనపత్రాల పంపిణీ, పొరపాట్లు లేకుండా ఫామ్స్ పూరించడంపై బూత్స్థాయి అధికారులకు గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి మాట్లాడారు. ప్రతీ బీఎల్వో ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఫారాల పంపిణీ చేసి, వివరాలను సేకరించడంతోపాటు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మాట్లాడుతూ.. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసే విధానం, ఓటర్లతో పొరపాట్లు లేకుండా పూరించడం, అవసరమైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయడం వంటి అంశాలపై సూచనలు చేశారు. డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, తహసీల్దార్ రవీందర్రావుతోపాటు బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు. సమర్థవంతంగా సవరణ మంథని: ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని మంథని రెవె న్యూ డివిజనల్ అధికారి సురేశ్ సూచించారు. మంథని మున్సిపాలిటీలో ఓటరు జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ కార్యక్రమాన్ని మండల రెవెన్యూ అధికా రి అరిఫొద్దీన్, మున్సిపల్ కమిషనర్ మనోహర్తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలన్నారు. అర్హులైన ప్రతీఒక్కరికి ఓటుహక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కనీస వేతన జీవోను సవరించాలిజ్యోతినగర్: కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవో ను సవరించి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. గురువారం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్లోని కేంద్ర కార్మి క శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కమిషనర్ యూసుఫ్కు వినతిపత్రం అందించారు. ముత్యంరావు మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని వేలాది మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుమారస్వామి, నాయకులు బిక్షపతి, లక్ష్మారెడ్డి, యాసీన్, ఉపేందర్, యాకుబ్, రాఘవరెడ్డి పాల్గొన్నారు. -
ఫుట్పాత్ల ఆక్రమణ
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరవాసులు సురక్షితంగా నడిచేందుకు వీలుగా రూ.లక్షలు వెచ్చించి రోడ్ల వెంట నిర్మించిన ఫుట్పాత్లు క్రమంగా ఆక్రమణకు గురవుతున్నాయి. ముఖ్యంగా బల్దియా కార్యాలయం నుంచి గోదావరిఖని వన్టౌన్ పోలీస్స్టేషన్ వరకు మెయిన్రోడ్డు వెంట రూ.1.60 కోట్లతో నిర్మించిన ఫుట్పాత్లు వ్యాపారాలకు అడ్డాగా మారుతున్నాయి. చర్యలు చేపట్టాల్సిన బల్దియా అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్ట్రీట్ఫుడ్ కేంద్రాలకు అడ్డగా.. గోదావరిఖని గాంధీనగర్లోని ప్రధాన రహదారికి ఇరువైపులా, నగరంలోని ప్రధాన రహదారుల వెంటఉన్న ఫుట్పాత్లను ఆక్రమించుకుంటున్న వ్యా పారులు, వాటిపై ఫాస్ట్ఫుడ్, బిర్యానీ, టిఫిన్ సెంటర్లతోపాటు కూరగాయలు, ప్లాస్టిక్ వస్తువులు, రెడిమేడ్ దుస్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల వ్యాపారులు టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేసి ఫుట్పాత్లను పూర్తిగా ఆక్రమిస్తున్నారు. కాలినడకన వెళ్లేవారికి ఇబ్బందులు ఫుట్పాత్లు ఆక్రమణలకు గురికావడంతో పాదచారులు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాల రద్దీ మధ్య ప్రయాణించడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం వేళల్లో వ్యాపార కార్యకలాపాలు పెరగడంతో ట్రాఫిక్కు కూడా అంతరాయం కలుగుతోంది. మొక్కుబడిగా తొలగింపులు.. అధికారులు మొక్కుబడిగా అప్పుడప్పుడు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపడుతున్నప్పటికీ తాత్కాలికంగానే మిగులుతున్నాయి. అధికారులు వెళ్లిన వెంటనే మళ్లీ ఆక్రమణలు పునరావృతమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రజాధనంతో నిర్మించిన ఫుట్పాత్లు పాదచారులకు కాకుండా వ్యాపారాలకు ఉపయోగపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుట్పాత్లను ఆక్రమణల నుంచి విముక్తం చేసి పాదచారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. రూ.1.60 కోట్ల లక్షల ప్రజాధనం వృథా వ్యాపారులకు అడ్డాగా మారిన వైనం చోద్యం చూస్తున్న బల్దియా, పోలీస్ శాఖ -
అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు
పెద్దపల్లి: రామగుండం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని సహించబోమని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి రామగుండం అభివృద్ధిపై కలెక్టరేట్లో గురువారం ఆయన సమీక్షించారు. నిధులు సిద్ధంగా ఉన్నా శ్మశానవాటికలు, మహిళాశక్తి భవనాలు, విద్యాసంస్థల అభివృద్ధి, తాగునీరు, వసతుల పనుల్లో ఆశించినస్థాయిలో పురోగతి లేదన్నారు. ఏడాది గడిచినా పనులు పూర్తికాకపోవడం అధికారుల పనితీరును ప్రతిబింబిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితయ్యాయని, తక్షణం గ్రౌండింగ్ చేయాలని సూచించారు. కేజీబీవీల్లో విద్య నాణ్యత పెంచాలి కేజీబీవీల్లో విద్య నాణ్యత పెంపుపై దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కేజీబీవీల నిర్వహణపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడా రు. విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోతే దానికి ఉపాధ్యాయులు, విద్యాశాఖ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. సీసీడీవో కవిత, కేజీబీవీల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. పిల్లల హాజరు శాతం పెంచాలి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం పెంచడంతోపాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సీపీడీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లతో తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జూలై ఒకటిన అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిదండ్రుల సమక్షంలో సమావేశాలు నిర్వహించి, పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, హాజరు, విద్యాభివృద్ధిపై సూచనలు, సలహాలు స్వీకరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి కాళిందిని తదితరులు పాల్గొన్నారు. రామగుండం ప్రగతిపై కలెక్టర్ శ్రీహర్ష -
ధర్మపురిలో విద్యాభివృద్ధికి హెచ్ఏఎల్ చేయూత
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నత విద్యా అవకాశాల విస్తరణకు మరో కీలక అడుగుపడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద రూ.10 కోట్ల వ్యయంతో నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ముందుకు వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ ఫలితంగా బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో హెచ్ఏఎల్ ప్రతినిధులు, జగిత్యాల జిల్లా యంత్రాంగం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, హెచ్ఏఎల్ హైదరాబాద్ చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏవీ మురళీకృష్ణ, డీజీఎం (హెచ్ఆర్) సూర్యకాంత్ రౌత్, సీనియర్ మేనేజర్ (హెచ్ఆర్) ఎస్.సత్యనారాయణ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..విద్యాభివృద్ధే సమాజ అభ్యున్నతికి మూలాధారమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు అత్యున్నత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ధర్మపురి, వెల్గటూరు, పెగడపల్లి, గొల్లపల్లి తదితర మండలాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు ఈ డిగ్రీ కళాశాల వరంగా మారనుందని తెలిపారు. నూతన కళాశాల భవనం ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలతో నిర్మించబడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని సూచించారు. సీఎస్ఆర్ నిధులను సామాజికాభివృద్ధికి వినియోగిస్తూ విద్యారంగానికి హెచ్ఏఎల్ సంస్థ అందిస్తున్న సహకారానికి హెచ్ఏఎల్ యాజమాన్యానికి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల అదనపు కలెక్టర్ రాజాగౌడ్, మంత్రి ఓఎస్డీ వైజే విజయ్ కుమార్, జిల్లా అధికారులు, హెచ్ఏఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
భూములు ఆక్రమించొద్దు
పెద్దపల్లి: ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్ర మ పట్టాలు, భూ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటాని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. ముత్తారం మండలం పోతారం, మైదంబండలోని ప్రభుత్వ భూములపై అక్రమంగా సృష్టించిన పట్టాలపై విచారణ చేశామన్నారు. పోతారంలోని సర్వే నంబరు59లో 19.01 ఎకరాలు, మైదంబండలోని సర్వే నంబరు 113లో 11.02 ఎకరాలు ప్రభుత్వ భూములుగా నిర్ధారణ అయినట్లు, పట్టాలను రద్దు చేసి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీచేశామని కలెక్టర్ వివరించారు. వైభవంగా ఎల్లమ్మ పట్నాలు ఎలిగేడు: లాలపల్లి గౌడసంఘం బుధవారం ఎల్లమ్మ పట్నాలు వైభవంగా నిర్వహించింది. ప్రభుత్వ విప్ విజయరమణారావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్రెడ్డి, పెద్ది కుమార్, గౌడసంఘం నాయకులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలుకాల్వశ్రీరాంపూర్: రజకుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బుధవారం మడేలేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారికి రజకులు జలాభిషేకం చే శారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీలు వంగళ తిరుపతిరెడ్డి, లంక సద య్య, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. నేడు మార్కెట్ బంద్ పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని జెండాకూ డలి ప్రధాన కూరగాయల మార్కెట్ను గురువారం మూసి ఉంచుతున్నట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. కూరగాయల వ్యాపారి మరణించినందుకు సంతాప సూచకంగ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని వారు కోరారు. ‘ప్రయోజనం లేని మేళాలు’పెద్దపల్లిరూరల్: రాష్ట్రప్రభుత్వం రైతుసంక్షేమా న్ని పట్టించుకోవడం లేదని మాజీ వైస్ఎంపీపీ ముత్యాల రాజయ్య విమర్శించారు. రైతువేదికల్లో విత్తన మేళాలను ఎందుకు నిర్వహిస్తున్నా రని ప్రశ్నించారు. వ్యాపారులు, డీలర్లే విత్తనా లను నామమాత్రంగా ప్రదర్శించడం ద్వారా ఎవరికి ప్రయోజనం కలుగుతుందని నిలదీశా రు. కనీసం శాస్త్రవేత్తలను పిలిపించి సాగుపై అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. కేకేనగర్లో పీరీల ఊరేగింపుయైటింక్లయిన్కాలనీ: మొహర్రం వేడుకను పురస్కరించుకొని వెంకట్రావుపల్లి కేకేనగర్లో బుధవారం పీరీలను ఊరేగించారు. భక్తులు కుడుకలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. దరఖాస్తులు ఆహ్వానం పెద్దపల్లి: అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో మూడేళ్ల శిక్షణ కోసం షెడ్యూల్డ్ కులాలకు చెందిన అర్హత కలిగిన లా పట్టభద్రుల నుంచి ఆన్లైన్లో దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కు లాల అభివృద్ధి అధికారి రవీందర్ తెలిపారు. ఈనెల 20 నుంచి జూలై 31 వరకు ఈ పాస్ వె బ్సైట్లో దరఖాస్తు చేయాలని సూచించారు. వివరాలకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం, కలెక్టర్ కాంప్లెక్స్, మొ దటి అంతస్తు, గది నంబరు 232లో సంప్రదించాలని ఆయన సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం లక్ష్యం ధర్మారం: విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించా రు. స్థానిక మోడల్ స్కూల్లో బుధవారం మ త్తు పదార్థ్దాలతో తలెత్తే దుష్పరిణాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాడుపడా లని సూచించారు. సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై ప్రవీణ్కుమార్, ప్రిన్సిపాల్ రాజ్కుమార్ పాల్గొన్నారు. -
కరీంనగర్లో కారు సునామీ ఖాయం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ వైఫల్యాలపై కదం తొక్కాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ మొదటి నుంచి బీఆర్ఎస్కు కంచుకోటగా మారిందన్నారు. దురదృష్టవశాత్తు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు మోసాలతో కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల విఫల పరిపాలన తర్వాత ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు మరోసారి సునామీ సృష్టించబోతోందని తెలిపారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల నుంచి నియోజకవర్గాలవారీగా పార్టీ క్షేత్రస్థాయి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమాలను తెలుసుకున్నారు. సింగరేణిపై బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు, అవినీతిని కార్మికులకు తెలియజేయాలన్నారు. కరీంనగర్కు కాళేశ్వరం ప్రాజెక్టు అందించిన ప్రతిఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ నేతలంతా సామాజిక మాధ్యమాల శక్తిని అర్థం చేసుకొని, వాటి ద్వారా ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ మంత్రులు జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, సతీశ్బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చెల్మెడ లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు. -
సర్.. ఇంటికొస్తారు
సాక్షి పెద్దపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే జిల్లాలో శుక్రవారం ప్రారంభంకానుంది. అర్హత ఉన్న ప్రతీఒక్కరికి ఓటుహక్కు కల్పించడంతోపాటు అనర్హులను తొలగించడానికి సర్ చేపట్టారు. జూలై 24వ తేదీ వరకు బూత్స్థాయి అధికారులు(బీఎల్వో) ప్రతీఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు నమోదు చేసుకుంటారు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉన్న ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వడానికి, నింపినవాటిని తీసుకోవడానికి మూడుసార్లు ఇంటింటా పర్యటిస్తారు. బీఎల్వోలకు ఇప్పటికే దీనిపై శిక్షణ పూర్తిచేశారు. 2002 నాటి ఓటరు జాబితాను ప్రాతిపదికగా తీసుకుని ప్రస్తుత జాబితాను పరిశీలించి మ్యాపింగ్ చేశారు. జిల్లాలో 7,12,157 మంది ఓటర్లు ఉండగా, వారిలో 5,76,063మందికి (80.89శాతం) మ్యాపింగ్ పూర్తిచేశారు. ఓటరు జాబితాలో పేరున్నవారు ఎన్యూమరేషన్ ఫామ్తోపాటు, 2002 నాటి జాబితాలో వారి లేదా కుటుంబీకుల వివరాలు పొందుపరిచి ఇస్తే సరిపోతుంది. ఇతర పత్రాలేవీ అక్కర్లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కోసం బీఎల్వోలు ప్రతీ ఇంటికి కనీసం మూడుసార్లు వెళ్తారు. ఒక్కో ఓటరుకు రెండు పత్రాలు అందిస్తారు. వాటిని ఎలానింపాలో వివరిస్తారు. నింపిన రెండింటిలో ఒకటి బీఎల్వో తీసుకుని, రెండోదానిని రసీదుగా అందిస్తారు. ఒకవేళ బీఎల్వో ఇంటికి రాకపోయినా, ఎన్యూమరేషన్ పత్రం అందించకపోయినా, లేదా ఆ సమయంలో ఓటర్లు అందుబాటులో లేకపోయినా ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ నుంచి ఎన్యూమరేషన్ పత్రం నింపొచ్చు. ఈనెల 25 నుంచి బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఒకవేళ ఇంటికి తాళం వేసి ఉంటే కనీసం మూడుసార్లు సందర్శిస్తారు. అప్పటికీ వీలుకాకపోతే నోటీసు అందిస్తారు. ఓటర్లు తమ ఫారాలను నింపి నేరుగా బీఎల్వోకు ఇవ్వవచ్చు. లేదా ఓటర్స్.ఈసీఐ.గవ్.ఇన్ వెబ్పోర్టల్, ఈసీఐనెట్ మొబైల్ యాప్లో వివరాలు సమర్పించి రిజిష్టర్ చేసుకోవాలి. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్తో అనుసంధానం చేసి ఉన్న మొబైల్ నంబరుకు ఓటీపీతో ధ్రువీకరించడంతో డిజిటల్లో సర్ పక్రియ పూర్తవుతుంది. 2002 సంవత్సరం ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా? అని తెలుసుకోవడం కోసం పైన చెప్పిన పోర్టల్లోకి వెళ్లి సెర్చ్ బై ఎలక్టర్స్ డిటెయిల్స్ ఆప్షన్ నుంచి తెలుసుకోవచ్చు. వివిధ భాగాల వారీగా ఓటరు జాబితా పీడీఎఫ్ రూపంలోనూ అందుబాటులో ఉంటుంది. 2002 జాబితాలో పేరు లేకపోతే తల్లిదండ్రులు, లేదా వారి తల్లిదండ్రుల ఓటు వివరాలను సేకరించి ఎన్యూమరేషన్ పత్రంలోని సంబంధిత కాలమ్లో నింపాలి. వీటితోపాటు పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబరు, కొత్త కలర్ ఫొటోలు అతికించి బీఎల్వోలకు ఇవ్వాలి. ఎన్యూమరేషన్ ఫారాలు ఒకవేళ ఇవ్వకపోయినా, పత్రం తీసుకోకపోయినా ఓటరు జాబితాలో పేరు దాదాపు కోల్పోయినట్లే. 2026 అక్టోబర్ ఒకటిలోపు 18 ఏళ్ల వయసు నిండిన ప్రతీపౌరుడు ఓటరుగా జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలి. అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం అక్టోబర్ ఒకటిన ఓటరు తుదిజాబితా విడుదల చేస్తారు. అసెంబ్లీ ఓటర్లు మ్యాపింగ్ ఐనవి మ్యాపింగ్ కానివి శాతం తేడాలున్నవి రామగుండం 2,13,990 1,70,027 43,963 79.46 64,965 మంథని 2,38,765 1,95,826 42,939 82.02 61,370 పెద్దపల్లి 2,59,402 2,10,210 49,192 81.04 54,955 మొత్తం 7,12,157 5,76,063 1,36,094 80.89 1,81,290 జూన్ 25 నుంచి జూలై 24వరకు బీఎల్వోలు ప్రతీ ఇంటిని సందర్శించి ఓటరు వివరాలు సేకరిస్తారు జూలై 24లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ సెప్టెంబర్ 28లోగా అభ్యంతరాలు పూర్తిస్థాయిలో పరిష్కారం అక్టోబరు ఒకటిన తుది ఓటరు జాబితా విడుదల బీఎల్వోకు ఫారాలు అందజేసిన తర్వాత దానికి సంబంధించిన రసీదు కాపీని ఓటరు అడిగి తీసుకోవాలి. సర్వే పూర్తయిన ఇళ్లకు ఎన్యూమరేషన్ కంప్లీట్ అనే స్టిక్కర్ అంటిస్తారు. ఒకే వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు కలిగి ఉంటే ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్–31 ప్రకారం శిక్షార్హులవుతారు. ప్రతీఒక్కరు బీఎల్వోలకు సహకరించాలి. – కోయ శ్రీహర్ష, జిల్లా ఎన్నికల అధికారి -
29న విద్యుత్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా
పెద్దపల్లి: రైతు డిస్కంల ఏర్పాటును నిరసిస్తూ ఈనె ల 29న ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం ఎదుట ధ ర్నా చేస్తామని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక, రై తు సంఘాల నాయకులు ముత్యంరావు, బూడిద గణేశ్, పత్తి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రైతు డిస్కం ఏర్పాటు చే యాలనే ప్రభుత్వ నిర్ణయంతో విద్యుత్ రంగంలో సంస్కరణలు వేగవంతమవుతాయన్నారు. నాయకులు వేల్పుల కుమారస్వామి, మంద రాజేందర్, బిక్షపతి, రామాచారి, రమేశ్, శంకర్, జ్యోతి, వనజా రాణి, లక్ష్మారెడ్డి, యాకుబ్, శివరాంరెడ్డి ఉన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
కోల్సిటీ: గోదావరిఖని జవహర్నగర్లో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలుల ధాటికి చెట్టు కొ మ్మలు విరిగి ఇంటిపై పడింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వృద్ధురాలు, ఆమె ఇద్దరు బిడ్డ లు సురక్షితంగా బయటపడ్డారు. స్థానిక సింగరేణి స్టేడియం సమీపంలోని హోటల్ నిర్వహించే పారుపెల్లి ఈశ్వరమ్మ, ఆ హోటల్పైన ఇనుప రేకుల షె డ్డును ఏర్పాటు చేసుకుంది. తన బిడ్డలతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ తీగలపై చెట్టు కొమ్మలు విరిగి పడటంతో భారీశబ్దం వచ్చింది. భయంతో బయటకు వచ్చిన ఈశ్వరమ్మ.. హై దరాబాద్లో నివసిస్తున్న తన మనవడికి ఫోన్చేసి విషయం చెప్పింది. అతడు ఇంటి సమీపంలో ఉ న్న వ్యక్తికి సమాచారం అందించి అప్రమత్తం చేశాడు. సకాలంలో స్పందించిన స్థానికుడు సైతం విద్యుత్ శాఖ అధికారులను వెంటనే అప్రమత్తం అయ్యేలా సమాచారాన్ని చేరవేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది సరఫరాను నిలిపివేశారు. బుధవారం ఉదయం చెట్టు కొమ్మలను తొలగించారు. వర్షం వస్తే రహదారులు జలమయం నగరంలోని ప్రధాన రహదారులు వర్షాకాలంలో ప్రమాదకరంగా మారుతున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి గాంధీనగర్తోపాటు మార్కండేయకాలనీ ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్ల కు ఇరువైపులా అస్తవ్యస్తంగా నిర్మించిన డ్రైనేజీలతో నీరు గంటల తరబడి నిలిచిపోతోందని పేర్కొంటున్నారు. ప్రమాదాలు చోటుచేసుకోకముందే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి, నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. -
పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెంచుతాం
జూలపల్లి: పర్యావరణ పరిరక్షణతోపాటు భవిష్య త్ అవసరాలను తీర్చడంలో పునరుద్పాదక ఇంధన వనరులు కీలకపాత్ర పోషిస్తాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి అన్నారు. కాచాపూర్లో ని ర్మిస్తున్న 2.2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ఆయన పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, నిర్వహణ, గ్రిడ్కు అనుసంధానంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్ఈ గంగాధర్, డీఈ (ఆపరేషన్) రాజబ్రహ్మచారి పాల్గొన్నారు. 15లోగా ఎస్ఈ ఆఫీస్ భవనం పూర్తిచేయాలి పెద్దపల్లిరూరల్: ఎన్పీడీసీఎల్ పెద్దపల్లి సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణాన్ని జూలై 15లోగా పూర్తిచేయాలని సీఎండీ వరణ్రెడ్డి సూచించారు. రాఘవపూర్లో చేపట్టిన సర్కిల్ కార్యాలయ భవనాన్ని ఎస్ఈ గంగాధర్ తదితర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. కస్టమర్లతో మర్యాదగా వ్యహరించాలని చెప్పారు. -
‘నీట్’ నిర్వహణలో కేంద్రం విఫలం
గోదావరిఖని: నీట్ పరీక్షణ నిర్వహణలో కేంద్ర ప్ర భుత్వం విఫలమైందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకుంటున్న లోపాలు, విద్యార్థులపై మానసిక ఒత్తిడిపై ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష రాయలేకపోతున్నాననే ఆవేదన తో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమన్నారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి కు టుంబాలు నీట్ పరీక్షలపై అనేక ఆశలు పెట్టుకుంటున్నారని తెలిపారు. తల్లిదండ్రులు అప్పులు చేసి, పొలాలు అమ్ముకుని తమ పిల్లలను కార్పొరేట్ వి ద్యాసంస్థల్లో చదివిస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. విద్యార్థుల ను, వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడకు బస్సు ప్రారంభం గోదావరిఖనిటౌన్: గోదావరిఖని నుంచి కాకినాడకు నడిచే ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గోదావరిఖని నుంచి ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ బస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
99రోజుల కార్యాచరణపై పుస్తకం
పెద్దపల్లి: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమం ద్వారా సాధించిన విజయాలను ఆకర్షణీయమైన పుస్తకంగా రూపొందించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి 99 రోజుల కార్యక్రమం అమలుపై బుధవారం కలెక్టరేట్లో సమీక్షించారు. అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వెంకట్రెడ్డి, వివిధ శా ఖల అధికారులు హాజరయ్యారు. వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, ఎలక్ట్రానిక్ మీడియా కథనా లు, వార్తా క్లిప్పింగ్లను భద్రపరచాలని సూచించారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ మార్చి నుంచి ఈనెల 12వ తేదీ వరకు 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని అన్నారు. దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి రెవెన్యూ సంబంధిత దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని లోకేశ్కుమార్ ఆదేశించారు. భూభారతి, ప్రజావాణి ద్వారా అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. కులం, ఆదాయం, నివాసం తదితర సర్టిఫికెట్లను 30 రోజుల్లోగా మంజూరు చేయాలని అన్నారు. సాదాబైనామాలను జూలై ఐదో తేదీలోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజాసేవల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, కలెక్టర్ ఏవో ప్రకాశ్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. -
ప్రమాదాలు లేని సింగరేణిగా తీర్చిదిద్దాలి
గోదావరిఖని: ప్రమాదాల్లేని సింగరేణిగా తీర్చిదిద్దేందుకు ప్రతీఒక్కరు రక్షణతో పనిచేయాలని ఆ సంస్థ డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ కోరారు. బుధవారం ఆర్జీ–2 ఏరియాలోని ఎన్సీవోఏ క్లబ్లో ఏర్పాటు చేసిన రక్షణ త్రైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రతలో ఎక్కడా రాజీ పడకుండా, యంత్రాల పనిగంటలను పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలన్నారు. కోల్ ఇండియాతో పోల్చితే సింగరేణిలో బొగ్గు ధరలు ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో పోటీ పెరుగుతోందని చెప్పారు. యాజమాన్యం నిర్దేశించిన రక్షణ సూత్రాలను పాటిస్తూనే ఉత్పత్తి పెంచాలని సూచించారు. డీఎంఎస్ సాగేశ్కుమార్, అనిల్ టొప్పో, కౌశిక్సేన్గుప్తా, దీపక్కుమార్, ప్రభాకర్, కోమల్చౌదరి, ఆర్జీ–2 జీఎం వెంకటయ్య, కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు, రామగుండం రీజియన్ జీఎం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కాల్వశ్రీరాంపూర్: వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదా ల బారిన పడకుండా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రాపెల్లి రాముడు, ఎస్సై వెంకటేశ్, ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్ సూచించారు. ఆ యా ప్రదేశాల్లో రైతులు, ప్రజలు భద్రత కోసం గమనించి పనులు చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకు ప్రమాదం సంభవిస్తుందన్నారు. గృహిణులు ఇళ్ల వద్ద బట్టలు ఆరవేసే తీగలకు, సిటీ కేబుల్ వైర్లకు, సర్వీసు వైర్ల ద్వారా విద్యుత్ సరఫరా అయి షాక్కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండవద్దని తహసీల్దార్ హెచ్చరించారు. వరదలతోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
గని కార్మికుల వేతన చర్చలు ప్రారంభించాలి
గోదావరిఖని: బొగ్గు గని కార్మికుల 12వ వేతన ఒ ప్పందం చర్చలు ప్రారంభించాలని కార్మిక సంఘా ల జేఏసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ప్రసాద్, తుమ్మల రాజారెడ్డి, సారయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో జూలై 1న నిర్వహించనున్న కార్యాచరణపై కార్యాచరణ సమావేశం నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కె.స్వామి, రంగు శ్రీను, నరసింహారెడ్డి, ధర్మపురి, రాజమౌళి, అనిల్రెడ్డి, తొడుపునూరి రమేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రామగుండం అభివృద్ధికి సహకరించండి
కోల్సిటీ: రామగుండం అభివృద్ధికి సహకారం అందించాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. నే షనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ మంగళవారం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్లు, మే యర్ల ఓరియెంటేషన్ శిబిరంలో పురపాలక పరిపాలన శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ ఆమెను కలిసి నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఇందుకు శ్రీదేవి సానుకూలంగా స్పందించినట్లు మేయర్ వివరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి స్వాగతం జ్యోతినగర్: ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ కు మంగళవారం కాంగ్రెస్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఎండీ ఆసిఫ్పాషా ఆధ్వర్యంలో బీ–పవర్హౌస్ గడ్డ హనుమాన్ జంక్షన్ వద్ద ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి సన్మానించారు. -
జిల్లాకు మూడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు
● విద్యాశాఖ జేడీ ఉషారాణి పెద్దపల్లి: జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఉషారాణి తెలిపారు. స్థానిక అధికారులతో కలిసి స్కూళ్లకు అవసరమైన స్థలాల కోసం ఆమె మంగళరం స్థల పరిశీలన చేశారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన సుల్తానాబాద్ ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కళాశాల మైదానం, రామగుండం హైస్కూల్, జూనియర్ కళాశాల మైదానం, మంథని హైస్కూల్, జూనియర్ కళాశాల మైదానాన్ని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన, అధికారులు ఆంజనేయరావు, షఫీమియా, అశోక్, శారద, రామ్చందర్రెడ్డి, రాజయ్య, రత్నాకర్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఒక్కో స్కూల్కు రూ.15కోట్లు మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి జూనియర్ కళాశాల వరకు కార్పొరేట్ స్థాయిలో ఇందులో విద్యాబోధన ఉంటుందని వివరించారు. ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నీ అందులో విలీనం చేసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. 80 నుంచి 100 మంది ఉపాధ్యాయులు ఇందులో విద్యా బోధన చేసే అవకాశం ఉందని చెప్పారు. అధికారులు పాల్గొన్నారు. -
సన్నవడ్లు సాగు చేస్తే బోనస్
ధర్మారం: రైతుల సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ప్ర భుత్వం పనిచేస్తోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ అన్నారు. స్థానిక గ్రామపంచా యతీ కార్యాలయంలో మంగళవారం విత్తనమేళా ను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, యాసంగిలో ధా న్యం, మొక్కజొన్న దిగుబడులు అధికంగా వచ్చినా అధికారులు సమన్వయంతో రికార్డుస్థాయిలో కొనుగోలు చేశారన్నారు. కొనుగోలు చేసిన నాలుగు రో జుల్లోపే రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బు జమచేశారని తెలిపారు. వానాకాలంలో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి విత్తనాలు మాత్రమే సాగు చేసి బోనస్ పొందాలని మంత్రి సూచించా రు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాకు 25 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 21 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు వివరించారు. విద్యుత్ షాక్తో మరణించిన కుటుంబాలకు మంత్రి పరి హారం చెక్కులు అందించారు. మార్కెట్ కమిటీ చై ర్మన్ లావుడ్య రూప్లానాయక్, ఉపసర్పంచ్ మల్లేశం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరె డ్డి, నాయకులు ఓరం చిరంజీవి, కాడే సూర్యనారా యణ, పాలకుర్తి రాజేశంగౌడ్, బద్దం అజయ్పాల్రెడ్డి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్కుమార్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. -
అధికారిక కార్యక్రమంలో సర్పంచ్ కొడుకు!
విత్తన మేళాలో సర్పంచ్ దాగేటి రాజేశ్వరి కుమారుడు ఉదయ్కుమార్ వేదికపై కూర్చోవడం చ ర్చనీయాంశంగా మారింది. అధికారులు ప్రొటో కాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను ఆహ్వానించ గా వేదికపై ఆశీనులయ్యారు. అనంతరం వచ్చి న సర్పంచ్ కుమారుడు ఉదయ్కుమార్ను మంత్రి లక్ష్మణ్కుమార్ ఆహ్వానించడంతో ఆయన కూడా స్టేజీపై కూర్చున్నారు. ఇది అధికారిక కార్యక్రమం కావడంతో ఏ అధికారం లేనివ్యక్తి వేదికపై కూర్చోవడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించాలని, వేదికపై కూర్చునే వారి ఎంపికలో అధికారిక హోదాకు ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మంత్రి ఆహ్వానం మేరకే ఆయన వేదికపైకి వెళ్లారని, ఇందులో వివాదం ఏమీ లేదని మరికొందరు చెబుతున్నారు. -
ప్రభుత్వ భూములపై సర్వే
కాల్వశ్రీరాంపూర్: వివిధ గ్రామాల్లో పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూముల సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించా రు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, మండల పరిషత్ అధికారులతో కలెక్టర్ ప్రభుత్వ భూములపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎంపీడీవో దివ్వదర్శన్రావుకు సూ చించారు. ఈజీఎస్ ద్వారా చేపట్టిన రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని చెప్పారు. వేగవంతంగా ప్రభుత్వ భూముల సర్వే ముత్తారం: అర్హులైన పేదలకు భూపంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూముల సర్వేను వేగవంతం చే యాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఓడెడ్ పంచాయతీ వెంకటేశ్వరపల్లిలో సీలింగ్ భూములను కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్ మధుసూదన్రెడ్డి, ఆర్ఐ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. భూవివాదాల పరిష్కారానికి కార్యాచరణ పెద్దపల్లి: జిల్లాలో అటవీ, రెవెన్యూ భూముల వివాదాల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డితో కలిసి కలెక్టర్ మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లోని రీచ్ల నుంచి ఇసుక రవాణా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో గంగయ్య, ఇన్చార్జి డీఎఫ్వో నవీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి ధర్మారం: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతోపాటు వారి సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. నందిమేడారం సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. -
నిబంధనలు పాటించాలి
ప్రైవేట్ స్కూల్ ఆవరణలో పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మవద్దు. యాజమాన్యాలు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఫీజుల విషయంపై ఇప్పటికే యాజమాన్యాలకు సూచనలు చేశాం. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతీ స్కూల్లో పేరెంట్స్ కమిటీలు నియమించేలా చర్యలు తీసుకుంటాం. – శారద, డీఈవో చర్యలు తీసుకోవాలి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో బుక్స్టాళ్లను తలపించేలా స్టడీ మెటిరీయల్ విక్రయిస్తున్నారు. యజమాన్యాలు ధరలు నిర్ణయించి పైసా తగ్గించడంలేదు. వసతులు కల్పించకుండా ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినా అధికారులు చర్యలు చేపట్టకపోవడం విచారకరం. నిబంధనలు అతిక్రమించే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. – రాజశేఖర్, జిల్లా కన్వీనర్,ఏబీవీపీ -
జిల్లాలో మోస్తరు వాన
పెద్దపల్లి: జిల్లాలో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. సగటున 71.2 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. కమాన్పూర్ మండలంలో అత్యధికంగా 116.4 మి.మీ., జూలపల్లి మండలంలో అత్యల్పంగా 27.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వివరించారు. కమాన్పూర్: వివిధ గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు భారీవర్షం కురిసింది. పంట పొలాలు వరదనీటితో నిండిపోయాయి. దీంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాల్వశ్రీరాంపూర్: సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పత్తి విత్తనాలు వేసిన రైతులు ఎంతోఊరట చెందారు. దుక్కులు దున్నిన మరికొందరు మంగళవారం పత్తి విత్తనాలు వేశారు. రోహిణి కార్తెలో వరినారు పోసినవారు ట్రాక్టర్తో పొలం దున్నుతూ నాటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. విరిగి రోడ్డుపై పడిన చెట్లు.. రాకపోకలు బంద్ కాల్వశ్రీరాంపూర్ – సుల్తానాబాద్ మధ్య భారీ చెట్లు పడిపోయాయి. తారుపల్లి – మీర్జంపేట మధ్య చెట్లకొమ్మలు విరిగి పడ్డాయి. లక్ష్మీపురం – గంగారం తదితర గ్రామాల్లోనూ చెట్లు విరిగి పడడంతో రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది. అధికారులు, సర్పంచులు బంగారి రమేశ్, రేకుల జ్యోతి, గాజనవేన స్వరూప జేసీ సాయంతో రోడ్లపై చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. -
బడిలో బాదుడు
సాక్షి,పెద్దపల్లి: బడిలో చదువు సంగతి దేవుడెరుగు.. ఫీజుల బాదుడు తల్లిదండ్రుల జేబులు గుళ్లచేస్తోంది. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం, టై, బెల్ట్ల విక్రయాలతో బుక్స్టాల్స్, బట్టల దుకాణాలను మరిపిస్తున్నాయి. నర్సరీ నుంచి మొదలు.. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలే వినియోగించాలని నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదు. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన పుస్తకాలే కొనుగోలు చేయాలి. అంతేకాదు.. ఎంత ధర చెబితే అంతే చెల్లించాలి. జిల్లాలో 175కు పైగా ప్రైవేట్ బడులు ఉన్నాయి. అందులో సుమారు 60 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. ఫీజుల దోపిడీ తీరిది.. ఫీజు వసూళ్లలో ప్రైవేటు పాఠశాలల తీరేవేరు. నోటికి వచ్చినంత ఫీజు చెప్పడం, డిస్కౌంట్ పేరిట కొంత తగ్గించడం, అందినకాడికి వసూలు చేయడం పరిపాటిగా మారింది. పుస్తకాలు, భవన సముదాయం, సెస్, పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, దుస్తులు, కల్చరల్ యాక్టివిటీస్, బస్సులు, క్రీడల చార్జీలు అని తల్లిదండ్రులను బాదేస్తున్నారు. పాఠ్యపుస్తకాలకు అదనంగా నీట్, ఐఐటీ, ఒలింపియాడ్, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్, టెక్నో, ఈ– టెక్నో అని ఆకర్షణీయమైన పేర్లు, ప్రత్యేక శిక్షణ పేరిట అదనపు స్టడీమెటీరియల్, క్వశ్చన్ బ్యాంకుల పేరుతో బాదేస్తున్నారు. కానరాని ఫీజులు.. టీచర్ల అర్హత బోర్డులు ఏ ప్రైవేటు పాఠశాలలోనూ విద్యాహక్కు చట్టం నిబంధనలు అమలు కావడం లేదు. ఈ చట్టం ప్రకారం.. ప్రభుత్వం 12–సీ కింద 25శాతం సీట్లు పేదలకు ఉచితంగా కేటాయించాలి. స్కూళ్లలో సౌకర్యాలు, ఇతర అంశాల వారీగా స్టార్స్ కేటాయించి, ఏ తరగతికి ఎంతఫీజు తీసుకుంటున్నారనే వివరాలను యాజమాన్యాలు విద్యాశాఖాధికారులకు సమర్పించాలి. ఆ మేరకు స్కూల్ వద్ద ఫీజు వివరాలతో బోర్డు ఏర్పాటుచేయాలి. వీటిని ఏర్పాటు చేయకుండా, రెండురెట్లకు మించి ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రతీ పాఠశాలలో తల్లిదండ్రులు, టీచర్లు, ప్రిన్సిపాల్తో కూడిన కమిటీలు ఏర్పాటు చేసి, సభ్యుల వివరాలు, తీర్మానాలను ఎంఈవో అనుమతితో డీఈవోకు అందజేయాలి. కమిటీ సిఫారసులను నోటీసు బోర్డుపై అంటించాలి. ఈ సిఫారసు ఆధారంగా ఫీజు పెంచాలి. కానీ, ఇవెక్కడా కనిపించడంలేదు. టీచర్ల విద్యార్హతల కూడిన చార్ట్ నోటీసు బోర్డు కచ్చితంగా ఏర్పాటు చేయాలి. జిల్లాలో అలాంటి బోర్డులేవీ కనిపించడంలేదు. అర్హత ఉన్నవారిని నియమించుకోవాలంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో యాజమాన్యాలు అర్హతలేని వారితో పనిచేయించుకుంటున్నట్లు తెలుస్తోంది -
సన్నరకానికి ప్రాధాన్యం
సుల్తానాబాద్రూరల్: సన్నరకం వరి సాగు చే సేందుకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు సూచించారు. కాట్నపల్లి రైతువేదికలో మంగళవారం సన్నరకం వరి వి త్తన మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడా రు. ఏడు రకాల వరి విత్తనాలను నాటుకోవాల ని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏ ఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, సర్పంచులు ఓగు ల పూజ, తిరుమల్రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నమని రాజిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికా రి పైడితల్లి, ఏఈవో పద్మ పాల్గొన్నారు. విలువలు.. క్రమశిక్షణే ముఖ్యం సుల్తానాబాద్రూరల్: విద్యార్థుల్లో మంచి విలు వలు, క్రమశిక్షణ ఉండేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీర్చిదిద్దితే మత్తు పదార్థాల బా రిన పడరని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ అన్నారు. గర్రెపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో మంగళవారం జరిగిన అంతర్జాతీయ మాదకద్రవ్యా ల వ్యతిరేక దినోత్సవంలో సీపీ మాట్లాడారు. సీఐ రంజిత్రావు, నార్కోటిక్ టీం ఇన్స్పెక్టర్ రాజ్కుమార్, ఎస్సైలు చంద్రకుమార్, మల్లేశ్, ప్రిన్సిపాల్ మంజుల, హెచ్ఎం కవిత ఉన్నారు. పోలీస్ ఏఆర్ హెడ్క్వార్టర్స్ తనిఖీ గోదావరిఖని: పోలీస్ కమిషనరేట్లోని ఏఆర్ హెడ్క్వార్టర్స్ను సీపీ అంబర్ కిశోర్ ఝా తనిఖీ చేశారు. అధికారులతో మాట్లాడి సిబ్బంది వివరాలు, స్పెషల్ పార్టీ సిబ్బంది విధులు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు.ఆ భూముల్లో సేద్యం చేయొద్దు రామగిరి: మేడిపల్లి భూముల్లో సేద్యం చేయకూడదని మంథని ఆర్వీవో సురేశ్ సూచించా రు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ట్రాక్టర్ సంఘం నాయకులతో సమా వేశం నిర్వహించారు. మేడిపల్లి శివారులోని భూములు ఇండస్ట్రియల్ పార్క్ కోసం అప్పగించామని తెలిపారు. అందులో ట్రాక్టర్తో సేద్యం చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తహసీల్దార్ సుమన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహేశ్, జీపీవో వెంకటేశ్వర్లు, ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు నాడెం లింగయ్య, శ్రీనివాస్, రాజయ్య, సురేశ్ పాల్గొన్నారు. ప్రతీ విద్యార్థి సోల్జరే కమాన్పూర్(మంథని): డ్రగ్స్ నిర్మూలనలో ప్ర తీవిద్యార్థి యాంటి డ్రగ్స్ షోల్జర్స్గా ముందుకురావాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించా రు. డ్రగ్స్ నిర్మూలనపై స్థానిక జెడ్పీ హైస్కూల్ లో మంగళవారం అవగాహన కల్పించారు. వి ద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని కోరారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, టూటౌన్ సీఐ ప్రసాదరావు, కమాన్పూర్ ఎస్సై ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. న్యూఢిల్లీకి సామాజిక సేవకుడుఎలిగేడు: జాతీయ స్థాయి సామాజిక సేవకులు (ఆల్ ఇండియా యువజన అవా ర్డు గ్రహీతల సంఘం) ఈ నెల 26న న్యూ ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి హాజ రు కావాలని ధూళికట్టలోని కొండ రవియాదవ్కు ఆహ్వానం అందింది. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిజాతీయ యువజన అవార్డు అందుకున్న వ్యక్తి రవియాదవ్. కానిస్టిట్యూషన్ క్లబ్లో జరిగే సమావేశంలో ఆయనకు జాతీయ గౌరవ్ సమ్మాన్ సర్టిఫికెట్ అందిస్తారని ఆ సంఘం అధ్యక్షుడు జావేంద్ జమేదర్ వెల్లడించారు. ఈమేరకు ఆయన ఆహ్వానం పంపించారు. ప్రమాద రహిత ఉత్పత్తి లక్ష్యంగోదావరిఖని: ప్రమాద రహిత ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని సింగరేణి డైరెక్టర్ ఎల్వీ సూర్యనారాయణ సూచించారు. మంగళవారం స్థానిక ఇల్లెందు గెస్ట్హౌస్లో నిర్వహించిన ఏరియా 20వ లెవల్ రక్షణ త్రైపాక్షిక సమావేశంలో మాట్లాడారు. కస్టమర్లకు నాణ్యమైన బొ గ్గు అందించాలని చెప్పారు. గతే డాది జరిగిన ప్రమాదాలు, తీసుకున్న చర్యలు, భవిష్యత్ స వాళ్లు, తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. డీఎంఎస్ నగేశ్కుమార్, సేఫ్టీ జీఎం ఉన్నారు. -
బైపాస్ పనులకు సహకరించండి
పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో చేపట్టి న బైపాస్ రోడ్డు నిర్మాణంలో అడ్డుగా వచ్చే విద్యుత్ స్తంభాలను గుర్తించి తొలగించాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్, సహకారశాఖ అధికారులతో సోమవారం వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. కొత్తగా విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని ఎస్ఈ గంగాధర్కు ఆయన సూచించారు. వానాకాలంలో ఈదురుగాలులు వీచే ప్రమాదముందని, రైతులు, వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు. రైతులకు సేవలందించాలి సాగు సమయంలో రైతులకు అవసరమైన సేవలు అందించాలని జిల్లా సహకారశాఖ అధికారి శ్రీమా ల, సింగిల్విండోల సీఈవోలకు విజయరమణారా వు సూచించారు. ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ, కల్తీ విత్తనాలపై గట్టి నిఘా ఉంచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ రాజబ్రహ్మచారి, అధికారులు పాల్గొన్నారు. -
బాధితులు నిర్భయంగా రావొచ్చు
గోదావరిఖని: బాధితులు నిర్భయంగా కమిషనరేట్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన ప్రజావాణి కార్యమ్రం నిర్వహించారు. ఆపదలో ఉన్న వారికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని సీపీ తెలిపారు. ఫిర్యాదులపై స్పందించిన సీపీ.. సంబంధిత స్టేషన్హౌస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ ఫిర్యాదుపై విచారణ జరిపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్ర మంలో అదనపు డీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. వృత్తి సామర్థ్యం పెంపొందించుకోవాలి నైపుణ్యం, వృత్తి సామర్థ్యం మరింత పెంపొందించుకోవాలని సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. కమిషనరేట్లో నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్కు పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీసు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సీపీ అంబర్ కిశోర్ మాట్లాడుతూ, కంప్యూటర్, ఫోరెన్సిక్, సైన్స్, ఫింగర్ ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్స్క్వాడ్ ట్రాకింగ్, పేలుడు పదార్థాల గుర్తింపు, యాంటీ–సబోటేజ్ తనిఖీలు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో ప్రతిభ కనబర్చాలన్నారు. సత్తాచాటిన వారిని జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్కు అవకాశం కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేందర్, ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
పెద్దపల్లి: ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డీఆర్వో రాజేశ్వరితో కలిసి కలెక్టరేట్ సోమవారం ఆయన ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటకు చెందిన నోముల రాజేశ్వర్రెడ్డి.. తమ ఇంటిని ఇన్లైన్లో నమోదు చేసేందుకు దరఖాస్తు చేసుకోగా పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దరఖాస్తు చేశాడు. రామగుండం గౌతమినగర్కు చెందిన డి.కాశయ్య.. మల్కాపురంలోని సర్వే నంబర్ 125/3లో గల 20 ఎకరాలను ఎక్స్సర్వీస్మెన్ కోసం 1981లో కేటాయించారని, ఇందులో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అనుమతి ఇవ్వరాదని కోరారు. ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన వేముల నర్సమ్మ.. సర్వే నంబర్ 474/1లోని తన ఎకరం భూమిని కొందరు ఆక్రమించాలని చూస్తున్నారని వేడుకుంది. గోదావరిఖని సూర్యనగర్కు చెందిన ఆర్.రాధ.. తన కుమారుడికి ప్రభుత్వ విద్యాసంస్థలోని హాస్టల్లో సీటు ఇప్పించాలని కోరింది. తన పొలానికి వెళ్లేందుకు దారి కల్పించాలని ఓదెల మండలానికి చెందిన రైతు తాటికొండ రమేశ్ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులపై నియంత్రణ చట్టం అమలు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ల సందీప్, జిల్లాల ప్రశాంత్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అవినీతిని సహించేదిలేదు క్షేత్రస్థాయిలోని కొందరు సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని, అవినీతిని ఏమాత్రం సహించబోమని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. అదనపు కలెక్టర్లు అరుణ వెంకట్రెడ్డితో కలిసి వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. అధికారులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలన్నారు. కొన్నిశాఖల్లో ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరుగుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఉద్దేశపూర్వక జాప్యాన్ని వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ తదితర సిబ్బందికి వేతనాల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని అన్నారు. పారదర్శకత, జవాబుదారీతనంతో సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చే దరఖాస్తులకు నిర్ణీత సమయంలో సమాధానాలు అందించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలో మెడికోలు ఇటీవల ఆహారం వికటించి అస్వస్థతకు గురైన ఘటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలపై నిఘా పెట్టింది. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఫుడ్ సేఫ్టీ జిల్లా ఇన్చార్జి ఆఫీసర్ అంకిత్రెడ్డి ప్రత్యేక తనిఖీ చేపట్టారు. మొత్తం 10 రెస్టారెంట్లు, బేకరీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార భద్రతా నిబంధనల అమలు తీరు పరిశీలించారు. బాలాజీ వికాస్ స్వీట్ హౌస్, తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, దసరా దావత్ రెస్టారెంట్, ఎస్ఏ అన్ లిమిటెడ్ కేఫ్ అండ్ బేకర్స్, వాసంతి లైవ్ కిచెన్, ఏకే మల్టీబైట్స్ బేకర్స్, దియా ఫ్యామిలీ రెస్టారెంట్, జాయికా మండీ హౌస్, బేకర్స్ డిలైట్ ది లైవ్ కేక్ షాప్, డేనియల్స్ కేక్ షాప్లను తనిఖీ చేశారు. కొన్ని రెస్టారెంట్లలో ఆహార పదార్థాల తయారీలో అనుమతించని ఆహార రంగులను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పారవేయడంతోపాటు, వాటితో తయారైన ఆహార పదార్థాలను కూడా తొలగించారు. ఎస్ఏ అన్ లిమిటెడ్ కేఫ్ అండ్ బేకర్స్ వంటగది పూర్తిగా అపరిశుభ్రంగా, అనారోగ్యకర పరిస్థితుల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లోపాలను సరిదిద్దేందుకు యాజమాన్యానికి వారం రోజుల గడువు విధించారు. జాయికా మండీహౌస్లో వినియోగిస్తున్న మయోనైస్ ముడిగుడ్లతో తయారు చేసినదిగా అనుమానం వ్యక్తం కావడంతో నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అంకిత్రెడ్డి హెచ్చరించారు. బేకరీలు, రెస్టారెంట్లకు జరిమానా బల్దియా కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు రెస్టారెంట్లు, బేకరీలను తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన దసరా దావత్ కిచెన్, అన్ లిమిటెడ్, బేకర్స్ డిలైట్ షాపులకు రూ.2,000 చొప్పున జరిమానా విధించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సంపత్ కుమార్, నాగభూషణం, వార్డు ఆఫీసర్ రామకృష్ణ, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో తేలికపాటి వర్షం
పెద్దపల్లి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం తేలికపాటి వర్షం కురిసింది. సుల్తానాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల ధాటికి ఓ రైస్మిల్లు పైకప్పు కొట్లుకుపోయింది. ఆశించిన స్థాయిలో కురవని వానలు.. వానాకాలం సీజన్ ప్రారంభమైనా.. ఇప్పటివరకు ఆశించినస్థాయిలో వర్షాలు కురవలేదు. ఎండల తీ వ్రత తగ్గలేదు. రైతులు పంటలు వేసేందుకు నెల రోజులుగా వానదేవుని కోసం ఎదురుచూస్తున్నారు. నైరుతి రుతుపవనాలతో వర్షాలు కురుస్తాయని చెబుతున్నా.. వాటి రాక ఆలస్యమవుతోంది. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు ఉత్సాహంగా ఉన్నా.. సాగు చేయాలంటే నీటివనరులు అవసరం. కొందరు పంపుసెట్లు, బావుల ఆధారంగా వరినారు పోసినా.. చెరువులు, కుంటలు, ఎస్సారెస్పీ కాలువల ఆధారంగా సాగు చేసేవారు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. నేటినుంచి విత్తనమేళా పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రైతువేదికల్లో ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు విత్తనమేళా నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల వరి రకాలకే బోనస్ వర్తింపజేస్తారని పేర్కొన్నారు. రైతులు వరికి బదులుగా పెసర, మినుము, అలసంద, కంది, నువ్వులు, జొన్న, సజ్జలు వంటి ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. వీటికి సంబంధించిన విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. -
కార్మికుల హక్కుల సాధన లక్ష్యం
రామగిరి: సింగరేణి కార్మికుల హక్కుల సాధన ధ్యేయమని ఐఎన్టీయూసీ నేత, రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ బి.జనక్ప్రసాద్ అన్నారు. ఆర్జీ–3 ఓసీపీ–2లో ఏరియా ఉపాధ్యక్షుడు కోట రవీందర్రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. మెడికల్ బోర్డు వ్యవస్థను పునరుద్ధరించేందుకు యాజమాన్యంతో పాటు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించిన ఘనత ఐఎన్టీయూసీకే దక్కుతుందన్నారు. సింగరేణి భవిష్యత్, పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, సంక్షేమం కోసం ఐఎన్టీయూసీ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, నాయకులు ధర్మపురి, దాస్, గడ్డం తిరుపతి యాదవ్, రామారావు, ఉయ్యాల కుమారస్వామి, రామిడ్ల మనోహర్, కేఎన్ చారి, మడ్డి రాజ్కుమార్, సందెల కుమార్స్వామి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతు న్న పన్నూర్లోని ఐఎన్టీయూసీ నేత ఉడుత శంకర్ యాదవ్ తండ్రి ఉడుత రాయమల్లును జనక్ ప్రసా ద్ పరామర్శించారు. ఆయన వెంట నాయకులు ధర్మపురి, దాస్, కోట రవీందర్రెడ్డి, బండ కిరణ్రెడ్డి, మల్లూరి మల్లారెడ్డి, జాగరి రజిత ఉన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన జడ్జి
గోదావరిఖనిటౌన్: గోదావరిఖని అదనపు జి ల్లా న్యాయమూర్తిగా నియమితులైన కోట్ల లా వణ్య బాల్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఏసీపీ రమేశ్, గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్రావు, ప్రధానకార్యదర్శి సత్యనారాయణ జడ్జికి పుష్పగుచ్ఛం శుభాకాంక్షలు తెలిపారు. ఏజీపీ శాంతన్కుమార్, న్యాయవాదులు కుడిది వెంకటేశ్, ముచ్ఛకుర్తి కుమార్, చెలికల పద్మజ, రవీందర్, జాగిరి రాజయ్య, ప్రసన్న, అంజలి, షానవాజ్, తిలక్, రమేశ్ పాల్గొన్నారు. మొహర్రం వేడుకలకు ఏర్పాట్లుపెద్దపల్లి: మొహర్రం వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకునేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులు, క మిటీ సభ్యులతో సమీక్షించారు. భక్తులకు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా మినీహెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మసీదుల పరిసరాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఆర్డీవో గంగయ్య, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నరేశ్కుమార్నాయుడు, వైద్యాధికారి ప్రమోద్కుమార్, మున్సిపల్ కమిషనర్లు, వెంకటేష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సేవలు ఆదర్శం జ్యోతినగర్: లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని శతాబ్ది సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ హనుమాండ్ల రాజిరెడ్డి అన్నారు. ఎన్టీపీసీ సింధూర కళాశాల రోడ్డులోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని శతాబ్ది (డిస్ట్రిక్ట్ 320– జీ) 2026–27 సంవత్సరానికి నూతన కార్యవ ర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతన లయన్స్ క్లబ్ ఆ ఫ్ గోదావరిఖని శతాబ్ది అధ్యక్షుడిగా మహేందర్గౌడ్ మాచిడి, కార్యదర్శిగా పైడ సాయికుమా ర్, ట్రెజరర్గా శ్రీకాంత్గౌడ్ కొండాతోపాటు కార్యవర్గ సభ్యులతో ప్రమాణం స్వీకారం చే యించారు. ఇన్స్టాలేషన్ అధికారిగా ఆర్.విజయ, ఇండక్షన్ అధికారిగా మేడిశెట్టి గంగాధర్ వ్యవహరించారు. కజాపురం జయప్రద – రాజేందర్, మాచిడి రాజుగౌడ్, జిల్లా క్యాబినెట్ కార్యదర్శి ఒల్లాల కృష్ణహరి, క్యాబినెట్ ట్రెజరర్ కొల్లూరి ఆనందం, రీజియన్ చైర్పర్సన్ సోమారపు లావణ్య, జోన్ చైర్పర్సన్ విజయలక్ష్మి తానిపర్తి తదితరులు పాల్గొన్నారు. ఎప్సెట్ సర్టిఫికెట్ల పరిశీలన గోదావరిఖనిటౌన్: స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఈఏపీసీఈటి–2026 అభ్యర్థుల స ర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రశాంతంగా సాగుతోంద ని ప్రిన్సిపాల్ మనోహర్ తెలిపారు. వెరిఫికేష న్కు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్, ర్యాంక్ కార్డుతోపాటు అన్ని ధ్రువీకరఫ పత్రాలు వెంట తీసుకు రావాలని సూచించారు. వెరిఫికేషన్ అధికారులు ప్రసాద్, రవి, సుధ, రఘుపతి, శ్యాంప్రసాద్, జ్యోతి పాల్గొన్నారు. మత్తుకు బానిసలు కావొద్దు పెద్దపల్లిరూరల్: ఉన్నత విద్య అభ్యసించే యు వత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుపదార్థాల కు బానిసలుగా మారి భవిష్యత్ను పాడు చే సుకోవద్దని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించా రు. పెద్దకల్వలలోని నోబెల్ హైస్కూల్, గా యత్రీ కాలేజీలో విద్యార్థులకు సోమవారం ఏ సీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు మధుకర్, నరేశ్, రూరల్ ఎస్సై శ్వేతతో కలిసి మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కాలేజీల్లో చదివే యువతకు కొందరు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు అంటగట్టేందుకు యత్నిస్తారని తెలిపా రు. గంజాయి విక్రయదారుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని, వివరాలను గో ప్యంగా ఉంచుతామన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సహించాలని డీసీపీ సూచించారు. -
కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి
పెద్దపల్లి: మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.26 వే ల కనీస వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా గౌ రవ అధ్యక్షుడు ఎరవెల్లి ముత్యంరావు కోరారు. తె లంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ముత్యంరావు మాట్లా డారు. నాయకులు తాండ్ర అంజయ్య, సావనపల్లి వెంకటస్వామి, బొంకూరి సాగర్, ఆరేపల్లి సురేశ్, శ్రీనివాస్, లక్ష్మీ, చందు, సురేశ్, సింగారపు గట్టయ్య, భారతి, అన్వేష్, సుద్దాల సతీశ్, బొంకూరి శంకర్, మరియా, లక్ష్మి, సుశీల పాల్గొన్నారు. -
బొగ్గు దుమారం
గోదావరిఖని: సింగరేణిలో బొగ్గు దుమారం లేస్తోంది. ఉత్పత్తి చేసిన బొగ్గు, గనులపై ఉన్న నిల్వలపై భారీవ్యత్యాసం ఉంటోందని రాజకీయ పార్టీలు ఆరోపిస్తుండగా.. ప్రతీబొగ్గుపెళ్లకు లెక్కుంటుందని, రవాణా అత్యంత పారదర్శకంగా కొనసాగుతోందని సింగరేణి చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి విచారణ జరిపి వాస్తవాలు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాయల్టీ, లాభాల చెల్లింపులపై? గత ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసినట్లు చూపించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దఎత్తున రాయల్టీ, లాభాల్లో వాటా పంచి సంస్థకు పెద్ద మొత్తంలో నష్టం చేశారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలోనే సింగరేణికి భారీగా లాభాలు వచ్చాయని చూపించి మెప్పు పొందేందుకే రాయల్టీ, లాభాలా వాటా పంపిణీ చేశారని ఆయా పార్టీల నేతలు తూర్పారబడుతున్నారు. ఇదేవిషయంపై కేంద్ర బొగ్గుగనుల మంత్రి కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం సమస్యను మరింత జటిలం చేసిందంటున్నారు. బొగ్గు ఉత్పత్తి నుంచి మొదలు.. రవాణా వరకు అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని సింగరేణి సీ ఎండీ ప్రకటిస్తున్నారు. అయితే బొగ్గు నిల్వలు త ప్పుగా చూపిస్తున్నారా? లేక బొగ్గు పక్కదారి పడుతోందా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో కార్మికవర్గం తలగోక్కుంటోంది. లేనిబొగ్గు నిల్వలతో సంస్థకు ప్రమాదం లేనిబొగ్గు నిల్వలు ఉన్నట్లు చూపిస్తూ సింగరేణికి భారీగా లాభాలొచ్చాయని, అందులో కార్మిక వర్గానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ప్రకటించడంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇలా చేస్తే సీఎస్ఆర్ నిధులు కూడా ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి అనుగుణంగా లెక్కలు చెబితే సంస్థకు లాభాలు వస్తాయని, లేనిబొగ్గు నిల్వలు చూపిస్తూ సంస్థను నష్టాల్లో తోయడం సరికాదని బీఆర్ఎస్ అనుంబంధ టీబీజీకేఎస్ ఆరోపిస్తోంది. సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్ అధినేత హరీశ్రావు ఇటీవల పర్యటిస్తూ సింగరేణి తీరు తెన్నులు, బొగ్గు నిల్వల్లో జరిగిన కుంభకోణంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ద్వారా వివరించడం కార్మిక వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్పత్తి ఎంత.. వినియోగం ఎంత? సింగరేణిలో వాస్తవానికి బొగ్గు ఉత్పత్తి ఎంత, వినియోగదారులకు ఎంత సరఫరా చేస్తున్నారు? తదితర అంశాలపై వాస్తవాలు ప్రకటించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి కిషన్రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతేకాదు.. ఉత్పత్తి, నిల్వలు, విక్రయాలపై ఆరా తీస్తుండడంతో సింగరేణి ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని ఏరియాల్లో ఉత్పత్తి చేస్తున్న, రవాణా చేస్తున్న, వినియోగదారులకు విక్రయించిన బొగ్గుపై పూర్తి వివరాలపై యాజమాన్యం సీరియస్గా వ్యవహరిస్తోంది. మరోవైపు.. లేనిబొగ్గు ఉత్పత్తిని చూపించి సంస్థకు నష్టం తెచ్చిన అధికారులపై చర్య తీసుకోవాల్సిందేనని డిమాండ్ పెరుగుతోంది. -
యోగాతో మానసిక ప్రశాంతత
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: మన దేశం యోగాకు పుట్టినిల్లు.. యోగా వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం ప్రాప్తిస్తుందని, ప్రతీ మనిషి తమ జీవితంలో యోగాభ్యాసనాలను ఓ భాగంగా చేసుకోవడం మేలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఆదివారం ఆయుష్ ఆధ్వర్యంలో యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే అంశంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్యతో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు యోగాసనాలు చేశారు. యోగసనాలు వేయడం వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుందన్నారు. ఇది వ్యాయామంగానే కాకుండా మానసికస్థైర్యాన్ని పెంపొందిస్తుందన్నారు. డీఎంహెచ్ఓ ప్రమోద్కుమార్, డీసీపీ రాంరెడ్డి, ఆయుష్ అధికారి అరుణ, మారుతి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. యోగా నిత్యజీవితంలో భాగం కావాలి గోదావరిఖని: యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ ఝా అరు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో మాట్లాడారు. యోగా ఒకరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతిఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాల్సిన ఆరోగ్య సాధనమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్రగౌడ్, గోదావరిఖని వన్టౌన్ రెండో సీఐ అఫ్జలోద్దీన్, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, శేఖర్, రమేశ్, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ యోగా శిక్షకురాలు రాధిక పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ అఽథారిటీ ఎండీ పర్యటన
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1లో ఆదివారం ఐఎఫ్ఎస్ అధికారి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలదేవి పర్యటించారు. సింగరేణి సంస్థ సీఅండ్ఎండీ బుద్ద ప్రకాశ్జ్యోతి సతీమణి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ అయిన సోనిబాలదేవి గోదావరిఖనిలోని జవహర్లాల్నెహ్రూ స్టేడియాన్ని సందర్శించి అభివృద్ధిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్ ఇతర అధికారులున్నారు. పెద్దపల్లిలో డాగ్స్క్వాడ్ తనిఖీలుపెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలో గంజాయి రవా ణా, క్రయవిక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు నిరంతర నిఘాను ముమ్మరం చేశారు. పెద్దపల్లిలోని బస్టాండ్ ప్రాంతంలో గల పాన్షాపులు, కిరాణా దుకాణాల్లో ఆదివారం పోలీసు అధికారులు, సిబ్బంది డాగ్స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఈ తనిఖీలను నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఆచార్య జయశంకర్ను ఆదర్శంగా తీసుకోవాలిమంథని: తెలంగాణ ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య జయశంకర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని టీపీసీ సీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నా రు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆదివా రం మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ని వాళి అర్పించారు. రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి, సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జ రిగిన సమావేశంలో ఎస్ఐఆర్పై బీఎల్వోలకు అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజంట్లకు పలు విషయాలను వివరించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాద వ్, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, ఆర్టీఏ సభ్యుడు మంథని సురేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మడకలో బడిబాట ఓదెల: మండలంలోని మడకలో ఆదివారం బడిబాట నిర్వహించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పొత్కపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ కోరారు. జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో పొత్కపల్లి విద్యార్థులు టాపర్గా నిలిచారన్నారు సర్పంచ్ ఆవాల ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమృతకిషోర్, రమేశ్ పాల్గొన్నారు. -
షోగ్గాళ్లు!
జిల్లాలో జోరుగా పేకాట సాక్షి పెద్దపల్లి: ‘శత కోటి దరిద్రాలకు, అనంత కోటి ఉపాయాలన్నట్టు’ పెరిగిన సాంకేతికతను పేకాటరాయుళ్లు వినియోగించుకుంటూ.. డిజిటల్ పేమెంట్స్తో కొందరు, మరికొందరు ఆన్లైన్లో జూదం ఆడి జీవితాలను ఛిద్రం చేసుకుంటూ, బతుకులను అంధకారంలోకి జార్చుకుంటున్నారు. ఆఫ్లైన్లో ఆడేవారు దాడి చేసిన నగదు దొరకకుండా, జేబులో రూపాయి లేకుండా జోరుగా ఆడేస్తుండగా, మరికొందరు ఆన్లైన్లో నకిలీ జీపీఎస్లతో మూడుముక్కలు ఆడుతున్నారు. గతంలో పోలీసులు ఉక్కుపాదం మోపడంతో మూతపడ్డ శిబిరాలన్నీ, ఇప్పుడు కొత్తకొత్త స్థావరాల్లో సాగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో జూదం నిషేధించడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ఐపీ కోడ్లను ఉపయోగించి మోబైల్లో యాప్లను డౌన్లోడ్ చేస్తున్నారు. దీనికోసం నకిలీ జీపీఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. దాని ద్వారా రమ్మీ, మూడు ముక్కల ఆటకు సంబంధించిన జూదం యాప్లను డౌన్లోడ్ చేసుకోని రూ.100 నుంచి రూ.లక్షల్లో డబ్బుపెట్టి ఆట ఆడుతున్నారు. మొదట డబ్బులు పెడితే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వస్తాయి. ఆ తర్వాత క్రమంగా పోతూనే ఉంటాయి. పోయిన చోటే డబ్బులు రాబట్టుకోవాలనే ఆశతో రూ.లక్షల్లో అప్పులు చేస్తున్నారు. అంతా నగదు రహితమే.. జిల్లాలో నగదు రహిత జూదం విచ్చలవిడిగా సాగుతోంది. పలువురు రాజకీయ నాయకులు, వైద్యులు, అధికారులు, టీచర్లు ఈ జూదం ఆడుతున్నట్టు తెలుస్తోంది. జూదం నిర్వహకులంతా కరెంట్ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉన్నవారే. కొందరు ఈ అకౌంట్ల ఆధారంగా స్వైప్ మిషన్లతో చెల్లింపులు చేస్తే.. మరికొందరు సెల్ఫోన్లలో యాప్స్ ద్వారా నగదును బదిలీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. గతం కంటే సేఫ్గా పేకాడుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డాయని, ఎవరితోనూ ఇబ్బందులు లేవని, కేసులయ్యే అవకాశాలు తగ్గిపోయాయని జూదరులు అంటున్నారు. దీనికోసం సాధారణ గృహాల మధ్య ఉన్న ఇండ్లలో ఎవరికీ అనుమానం రాకుండా ప్లాట్స్, ఇళ్లు అద్దెకు తీసుకుని పేకాట సాగిస్తున్నారు. పేకాట ఆడేవారికి నిర్వాహకులు సౌకర్యాలు కల్పిస్తూ.. ఒక్కో ఆటకు వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. పేకాట కేంద్రాల నిర్వాహకులు నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇవే కాకుండా పేకాట ఆడేవారికి మద్యం, భోజనం, సిగరెట్లు సమకూరుస్తూ అందుకు అదనంగా వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాకేంద్రంలో అధికార పార్టీ సర్పంచ్ జూదరులను పిలిచి తన ఇంట్లో పేకాట కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఆస్తులు కోల్పోయి ఆత్మహత్యలు జూదం వ్యసనంగా మారిన కొందరు నిత్యం పేకాట ఆడుతూ తమ ఆస్తులను కోల్పోతున్నారు. గతంలో పేకాటతో ఆర్థికంగా దివాలా తీసి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. పలువురు మధ్య తరగతికి చెందిన వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు కూడా పేకాట వ్యసనపరులుగా మారి ఆస్తులను తెగనమ్ముకుంటూ దివాలా తీస్తున్నారు. పేకాట వ్యసనం నుంచి దూరం చేసేందుకు పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహించాలని, పట్టుబడిన సందర్భాల్లో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.జిల్లాలో మూడేళ్లలో కేసుల వివరాలు ఇయర్ కేసులు నిందితులు సీజ్చేసిన అమౌంట్ 2024 132 854 42,08,7612025 198 1,166 27,53,4852026 57 374 12,65,455పేకాటపై ప్రత్యేక నిఘాజిల్లాలో పేకాటను అరికట్టేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ప్రజలకు ఎక్కడైనా పేకాట ఆడినట్లు సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలి. చర్యలు తీసుకుంటాం. సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – అంబర్కిషోర్ ఝా, సీపీ, రామగుండం -
సింగరేణిలో పొలిటికల్ హీట్
గోదావరిఖని: సింగరేణి కేవలం బొగ్గు గనుల సంస్థ మాత్రమే కాదు.. తెలంగాణ రాజకీయాల దిశను ప్రభావితం చేసే శక్తివంతమైన ప్రాంతం. కార్మికుల సంక్షేమం, ఉద్యోగాల భర్తీ, కారుణ్య నియామకాలు, గనుల భవిష్యత్ వంటి అంశాలపై స్పష్టమైన హామీలు ఇచ్చే పార్టీకి రాబోయే రోజుల్లో రాజకీయంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సింగరేణి వైపు అడుగులు వేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడు జిల్లాలు, 13 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో పొలిటికల్ హీట్ పెరిగింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉంది. రామగుండం, మంథని, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇల్లందు, కొత్తగూడెం, పినపాక, భూపాలపల్లి, ములుగు, వైరా, పాల్వంచ తదితర ప్రాంతాల్లో సింగరేణి గనులున్నాయి. వీటిలో సుమారు 40వేల మంది పర్మినెంట్ కార్మికులు, మరో 30వేల మంది కాంట్రాక్టు కార్మికులు, పరోక్షంగా మరో 20వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. అంతే కాకుండా ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, అల్ట్రాటెక్, రైల్వే, జెన్కో, ట్రాన్స్కో సంస్థలు కూడా సింగరేణితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్నాయి. ఈప్రాంతంలో పట్టు సాధిస్తే సుమారు లక్ష కుటుంబాల్లో పట్టు సాధించవచ్చనే ఆలోచనతో ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. గనులు తగ్గిపోతుండటం, పర్మినెంట్ కార్మికులు తగ్గి రావాల్సిన హక్కులు అందకపోవడం.. ఇలా అనేక సమస్యలతో సింగరేణీయులు ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలో అన్ని పార్టీలు తమ దృష్టిని కోల్బెల్ట్పై మరల్చాయి. పాగా కోసం ప్రయత్నాలు సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు సమీపించడం, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈప్రాంతంలో పాగా వేయడం కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రతిపక్ష, అధికార పక్ష పార్టీలతో పాటు టీబీజీకేఏస్ గౌరవాధ్యక్షురాలిగా ఉండి కార్మిక క్షేత్రానికి పరిచయం ఉన్న టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత కూడా బాయిబాట పట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇప్పటికే పర్యటించగా, బీజేపీ కూడా పట్టుకు సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో పర్యటన పూర్తి చేసింది. అనేక సమస్యలతో సతమతమవుతున్న కార్మికులకు ప్రధానంగా కారుణ్య నియామకాలు నిలిచిపోవడం, అధికార కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఇచ్చిన హామీలు పూర్తి చేయకపోవడంతో ఈ ప్రాంతంలో పట్టుకు పోరాట బాట పట్టాయి. తమ అనుబంద సంఘాల బలోపేతంపై దృష్టి సారించాయి. అయితే తామెప్పుడు కార్మికుల పక్షమేనని అధికార కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్మిక క్షేత్రంలో పర్యటించి కారుణ్యనియామక పత్రాలు అందజేశారు. అయితే భవిష్యత్ కారుణ్య నియామకాలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును కార్మికుల్లోకి తీసుకెళ్లి ఎండగట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కార్మికులు సమస్యలతో సతమతమవుతుండగా, రాజకీయ పార్టీలు అండగా నిలిచే ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికార పార్టీపైనే ఉందని కార్మిక లోకం గళం విప్పుతోంది. -
డిజిటల్గా.. మీ ‘సేవ’లు
పెద్దపల్లిరూరల్: కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్.. ఇతర రెవెన్యూ సేవలు పొందేందుకు మీసేవ కేంద్రాలకు వెళ్లే దరఖాస్తుదారులకు ఇక నుంచి డిజిటల్గా సేవలందుతాయి. వారు చేసుకున్న దరఖాస్తుకు సంబంధించి రశీదు ఇవ్వరు. ప్రభుత్వం పేపర్లెస్ వర్క్ను అమల్లోకి తేవాలని నిర్ణయించిన విషయం విదితమే. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, వాటికి అనుసంధానంగా ఉన్న మీసేవ లాంటి కేంద్రాల్లోనూ డిజిటల్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఎస్ఎంఎస్ రూపంలో డిజిటల్ రశీదు తమకు అవసరమున్న సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాల్లో చేసుకున్న దరఖాస్తుకు సంబంధించిన డిజిటల్ రశీదు లింక్ ద్వారా ఆ దరఖాస్తులో నమోదు చేసిన మొబైల్ నంబర్కు చేరుతుంది. ఎస్ఎంఎస్ పొరపాటున డిలీట్ అయితే మీసేవ కేంద్రానికి వెళ్లి మళ్లీ పొందే అవకాశాన్ని కల్పించారు. అక్రమాలకు చెక్ మీసేవ నిర్వాహకుల్లో కొందరు సర్టిఫికెట్లకు సంబంధించి అదనపు వసూళ్లు చేసి అక్రమార్జనకు పాల్పడే అవకాశముండేది. దరఖాస్తుదారుడి సెల్ నంబర్ కాకుండా ఏదో ఓ నెంబరు రాసి సర్టిఫికెట్లను జారీ చేసి వారి నుంచి ఎక్కువ మొత్తాన్ని వసూలు చేశారనే ఫిర్యాదులున్నాయి. కానీ ఇప్పుడు ఖచ్చితంగా దరఖాస్తు దారుడు తన మొబైల్ నంబర్నే రాయాల్సి ఉంటుంది. ఆ మొబైల్లో ఇంటర్నెట్ బ్యాలెన్సు ను కూడా మెయింటెన్ చేయాల్సిన అవసరముంటుంది. స్కాన్ సరిగ్గా చేయాలి మీసేవ ఆపరేటర్లు తమ వద్దకు వచ్చిన వారి దరఖాస్తులను స్కాన్ సరిగ్గా సంబంధిత శాఖ అధికారులకు కనిపించేలా చేయాలని అధికారులు సూచించారు. ఆ దరఖాస్తులను సంబంధిత ఆఫీసుల్లో అప్పగించాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలకు సులువుగా వేగంగా సేవలు అందించాలనే ఆలోచనతోనే ఇప్పటిదాకా ఉన్న పేపర్ రశీదును ఇక నుంచి ఇవ్వకుండా పేపర్లెస్ పద్ధతిని పాటించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని మీసేవ ఆపరేటర్లు ప్రజల్లో అవగాహన పెంచేలా చొరవ చూపాలన్నారు. -
అత్యంత పారదర్శకంగా బొగ్గు రవాణా
గోదావరిఖని: అత్యంత పారదర్శకంగా బొగ్గురవాణా సాగుతోందని, ప్రతీ టన్ను బొగ్గుపై పటిష్ట పర్యవేక్షణ ఉంటుందని ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్ అన్నారు. ఆదివారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సంస్థగా దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలుస్తోందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పారి శ్రామిక వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తూ జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటీవల సింగరేణిలో బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో బొగ్గు చోరీలు జరి గాయని చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. బొ గ్గు ఉత్పత్తి అయిన క్షణం నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతీ దశలో డిజిటల్ పర్యవేక్షణ, భద్రతా తనిఖీలు, ఆన్లైన్ రికార్డింగ్ వ్యవస్థలు అమల్లో ఉంటాయని, బొగ్గు మాయమవడం, చోరీ జరగడానికి అస్కారం లేదన్నారు. ఈవిషయంలో వాస్తవాలు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. సంస్థను, సంస్థలో పనిచేసే ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసేలా వాఖ్యలు ఉండవద్దన్నారు. -
అన్ని రకాల సన్న వడ్లు కొనుగోలు చేయాలి
మంథని: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించినట్లుగా 33 రకాల సన్న ర రకం వరి వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. ఆదివారం మంథనిలోని రాజగృహలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ రైతులు అన్నమో రామచంద్రా.. ఏందీ మా బతుకులు అనే దుస్థితికి వచ్చారని వాపోయారు. పంటకు బీమా కడుతానని చెప్పి ఉన్న రైతుబీమాను తీసివేశాడని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 7600 మంది రైతులు చనిపోతే ఆ కుటుంబాలకు రైతుబీమా రాకుండా ఆగిపోయందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి కళ్లు తెరువాలన్నారు. నాయకులు ఏగోళపు శంకర్గౌడ్, జంజర్ల శేఖర్, తరగం శంకర్లాల్, పుప్పాల తిరుపతి, కనవేన శ్రీనివాస్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. -
మాస్టర్ ప్లాన్తో మంథని
మంథని: మాస్టర్ ప్లాన్తో మంథని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. శనివారం మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. పేదవాడి అభివృద్ధి ఏమాత్రం పట్టించుకొని ప్రతిపక్ష పార్టీలు.. నేడు అభివృద్ధి, సంక్షేమం ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న తమపై దురద జల్లుతున్నాయన్నారు. మంథనిలో మహిళల ఉపాధికి కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశామని, 400 మందికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మంథనిలో 2 కంపెనీలు నెలకొల్పనున్నట్లు చెప్పారు. మంథని పట్టణం నుంచి పుట్టపాక వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులు త్వరలో మొదలవుతాయని, నిర్మాణాలు కోల్పోతున్న వారు సహకరించాలని కోరారు. ఆర్డీవో సురేశ్, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, నాయకులు శశిభూషణ్ కాచే, ఐలి ప్రసాద్ తదితరులున్నారు. ‘నీట్’ కోసం ఉచితంగా బస్సువిద్యానగర్(కరీంనగర్): ఆదివారం జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు శనివారం తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించి, తమ ఇళ్ల నుంచి పరీక్ష కేంద్రాలకు, తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఏసీ బస్సులు మినహా మిగితా అన్ని బస్సుల్లో ఉచితంగా రాకపోకలు సాగించవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు. 24న ఇంటర్వ్యూపెద్దపల్లి: పెద్దపల్లి ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఈనెల 24న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ కె.శ్రీధర్ తెలిపారు. ఆసక్తి గల వైద్యులు విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో హాజరు కావాలన్నారు. సివిల్ అసిస్టెంట్ స ర్జన్కు వేతనం రూ.52,351 ఉంటుందని, ఇత ర వివరాలకు 94924 57809, 84990 61999 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రతి చిన్నారి ఆరోగ్య భద్రతే లక్ష్యంపెద్దపల్లి: జిల్లాలోని ప్రతి చిన్నారికి ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం, పల్స్ పోలియో, పెద్దపల్లి, గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై శనివారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఈనెల 28న పల్స్ పోలియో బూత్ డే నిర్వహించి, 29,30వ తేదీల్లో ఇంటింటా సందర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 0 నుంచి ఐదేళ్ల లోపు 62,902 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే జూలై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 2,27,251 మంది పిల్లలకు అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, గోదావరిఖని ఆస్పత్రి సూపరింటెండెంట్ హిమబిందుసింగ్, తదితరులు పాల్గొన్నారు. ఇసుక తరలిస్తే ఊరుకోంసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామ పరిధి మానేరువాగు నుంచి ఇసుక తరలిస్తే ఉరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు అన్నారు. శనివారం ఇసుక లారీలను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. మానకొండూర్ మండల పరిధిలోని మానేరువాగు వైపు ఏటీఎస్ఎండీసీ ద్వారా ఇసుక తరలించేందుకు అనుమతి ఉండగా తమ గ్రామ పరిధిలోకి వచ్చి ఇసుక తోడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పరిధిలోకి వస్తే అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దీంతో ఇసుక లారీలు వెనక్కి వెళ్లిపోయాయి. -
పెండింగ్ కేసుల్లో రాజీపడడమే మేలు
పెద్దపల్లిరూరల్: పెండింగ్ కేసుల్లో ఇరువర్గాలు రాజీపడడమే మేలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జరిగిన లోక్అదాలత్లో అడిషనల్ జిల్లా జడ్జి భవాని, జూనియర్ జడ్జి మంజుల, డీసీపీ రాంరెడ్డితో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్ల ద్వారా 1,984 కేసులు పరిష్కరించినట్టు చెప్పారు. పెద్దపల్లి, నందిమేడారం కోర్టులకు సంబంధించి 725, సుల్తానాబాద్లో 543, గోదావరిఖనిలో 519, మంథనిలో 196 కేసులు పరిష్కారం అయ్యాయని వివరించారు. మోటారు వాహన ప్రమాదబీమా కేసులలో రూ.1,14,25,000 చెక్కులను పరిహారంగా అందించినట్టు వివరించారు. పీపీ డొంకెన రవీందర్, బార్ అసోసియేషన్ అధక్ష, ప్రధానకార్యదర్శులు మేకల మల్లేశం, రాచూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. లోక్ అదాలత్తో సమ న్యాయం పెద్దపల్లి: లోక్ అదాలత్తో ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్లో మాట్లాడారు. కక్షిదారులు వ్యయ ప్రయాసలకు గురికాకుండా రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వోడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి అవునూరి సత్యనారాయణ, ఏజీపీ దూడం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాజీయే రాజమార్గం ధర్మారం(ధర్మపురి): రాజీయే రాజమార్గమని జడ్జి మట్ట సరిత అన్నారు. ధర్మారం మండలం నందిమేడారం కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్లో మాట్లాడారు. కక్షిదారులు తమ వివాదాలను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం, శ్రమ ఆదా చేసుకోవచ్చన్నారు. అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి, ప్రధానకార్యదర్శి లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
నా విజయం.. నాన్నకు అంకితం
జ్యోతినగర్(రామగుండం): నేను ఈ స్థాయికి రావడానికి నాన్న ఉమామహేశ్వర్ చూపిన క్రమశిక్షణే కారణం. ఆయన ప్రోత్సాహంతో ఇటీవల యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో ఆల్ ఇండియా 78వ ర్యాంకు సాధించా. నాన్న పర్యావరణవేత్త, రైతు. అమ్మ న్యాయవాది. అన్నయ్య ఆదిత్య హైదరాబాద్లో ఓ సంస్థలో పని చేస్తున్నారు. వదిన పూజా చెబ్రోలు అమెరికాలోని వెయిల్ కార్నెల్ మెడిసిన్లో, వైద్య ప్రపంచ ఆరోగ్య విభాగంలో సహాయ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కుటుంబం అండతో ఈ స్థాయికి ఎదిగాను. చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి, సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వాన్ని నాన్న నేర్పించారు. యూపీఎస్సీ వంటి క్లిష్టమైన పరీక్షలో విజయం సాధించడానికి కుటుంబ ప్రోత్సాహం ఎంతో కీలకం. నా విజయం నాన్నకు అంకితం. యువత పట్టుదలతో ముందుకు సాగితే గుర్తింపు సాధించవచ్చు. – శశాంక్ దహెగాం, ఎన్టీపీసీ, రామగుండం -
మానవత్వంతో సేవలందించాలి
కోల్సిటీ(రామగుండం): మహిళలు, చిన్నారులపై హింస, వేధింపులు, దుర్వినియోగానికి గురైన బాధితులకు సమగ్ర రక్షణ, పునరావాస సేవలు సమర్థవంతంగా అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. బాధితులకు ఒకే వేదికపై కౌన్సెలింగ్, తదితర సేవలు అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతీ ఫిర్యాదుపై తక్షణ స్పందన అవసరమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నతాధికారులను, అవసరమైతే పోలీస్ కమిషనర్ను నేరుగా సంప్రదించాలని సూచించారు. బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, పెద్దపల్లి, మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు రమేశ్బాబు, సత్యనారాయణ, షీటీం ఎస్సైలు హైమా, ఉషారాణి, శైలజ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కమిషనర్ గ్రీవెన్స్ రామగుండం కమిషనరేట్కు చెందిన అధికారులు, సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి సీపీ అంబర్ కిషోర్ ఝా శనివారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బదిలీలు, తదితర అంశాలకు సంబంధించి సిబ్బంది నుంచి అందిన వినతిపత్రాలను పరిశీలించారు. చట్టపరిధిలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కమిషనరేట్ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని కమిషనర్ తెలిపారు. -
జిల్లాకు మరిన్ని పురస్కారాలు తేవాలి
పెద్దపల్లి: విద్యా ప్రమాణాల పెంపులో జిల్లా అగ్రగా మిగా నిలిచినందుకు ఆనందంగా ఉందని, జిల్లాకు మరిన్ని పురస్కారాలు తెచ్చేలా యంత్రాంగం పని చేయాలని విప్ చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్షను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా ప్రమాణాల పెంపులో జిల్లా అగ్రగామిగా నిలిచినందుకు హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగా కలెక్టర్, డీఈవో అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. యూరియా సరఫరాలో దేశానికే ఆదర్శంయూరియా సరఫరాకు యాప్ ఆధారిత విధానాన్ని అమలు చేయడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డితో కలిసి యూరియా బుకింగ్ యాప్ వినియోగంపై ఎరువుల డీలర్లు, వ్యవసాయ అధికారులు, రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించగా వారు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ పొందాలంటే రైతులు బీపీటీ, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, తెలంగాణ సోనా, వరంగల్–44, 1638, 7715 అనే సన్న వరి రకాలను సాగు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాలు సిద్ధంగా ఉంచామని, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు, డీలర్లను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉండగా, వారం రోజుల్లో మరో 4 వేల మెట్రిక్ టన్నులు రైల్వే ద్వారా చేరనున్నాయని, ఆర్ఎఫ్సీఎల్ నుంచి మరో 2 వేల మెట్రిక్ టన్నుల సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులకు అవసరానికి మించి యూరియా వాడొద్దని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి శ్రీమాల తదితరులు పాల్గొన్నారు. -
G°² MýSÚët-ÌŸ-_a¯é ˘ భరించారు
వేములవాడ: మా నాన్న గుండ్లూరి ఆంజనేయులు. ఎన్ని కష్టాలొచ్చినా భరించేవారు. హైదరాబాద్ శివారులో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాళ్లం. కేవలం నా చదువుల కోసం హైదరాబాద్కు షిఫ్ట్ అయి సివిల్ కాంట్రాక్టర్ వద్ద సూపర్వైజర్గా పని చేశారు. నేను నిద్ర లేవకముందే ఇంటి నుంచి వెళ్లి, నేను పడుకున్నాక ఇంటికి వచ్చిన రోజులు కోకొల్లలు. అప్పట్లో మాకు చెల్లించే స్కూల్ ఫీజులతో ప్లాట్లు వచ్చేవని నాన్న ఫ్రెండ్స్ అనేవారు. వారి మాటలను లెక్కచేయకుండా పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించారు. అలా చదవడం వల్లే నేను ఉద్యోగం సాధించి వేములవాడ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నా. నాన్నే నాకు స్ఫూర్తి. -
నాన్న స్ఫూర్తితో కంపెనీ
రామగుండం: తండ్రి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఎవల్ఫినిటీ టెక్నాలజీస్ పేరుతో కంపెనీ స్థాపించాడు గద్దె శ్రీచరణ్. రామగుండానికి చెందిన గద్దె శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అవార్డులు కై వసం చేసుకున్నారు. శ్రీచరణ్ అదే బాటలో నడుస్తూ మరిన్ని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాడు. 2016లో ఎల్పీయూ యూనివర్సిటీలో సీఎస్ఈ ఇంజినీరింగ్ పూర్తి చేసే క్రమంలో సొంతంగా సాఫ్ట్వేర్ అప్లికేషన్లు రూపొందించాడు. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి జల్ జీవన్ మిషన్కు సంబంధించి కమ్యూనికేషన్ అవసరాల నిమిత్తం సోషల్ ఆడిట్ మోబైల్ అప్లికేషన్ రూపొందించాడు. ఈ కంపెనీ ప్రస్తుతం 500 క్లయింట్లకు సేవలందించడంతో పాటు 1,050 ప్రాజెక్టులను డెలివరీ చేసి, ఒక మిలియన్ డాలర్ రెవెన్యూ మైలు రా యికి చేరుకుంది. నాన్న ప్రోత్సాహమే ఇందుకు కారణం అంటున్నాడు. -
నాన్నే మొదటి గురువు
జగిత్యాలజోన్: మా నాన్నే.. నా మొదటి గురువు. నేను జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నానంటే అంతా మా నాన్న భిక్షే. మాది రాజమండ్రి. నాన్న చిత్తూరి లక్ష్మణ్రావు(లచ్చారావు) న్యాయవాది. నా రోల్ మోడల్, నా ఇన్స్పిరేషన్ అంతా నాన్నే. అమ్మాయిలంటే ఇంటి పని, వంట పని కాదని, ఉన్నత స్థాయికి ఎదిగి, నీవే పది మందికి ఆదర్శంగా మారాలని ఎప్పుడు చెపుతుండేవారు. నాది సైన్స్ గ్రూపు అయినా నాన్నను ఆదర్శంగా తీసుకుని ఎల్ఎల్బీ పూర్తి చేశా. నాన్న నాపై చూపెడుతున్న ప్రేమ, అనురాగాలతో యూనివర్శిటీ స్థాయిలో నాలుగు గోల్డ్మెడల్ సాధించేవరకు తీసుకవచ్చాయి. తర్వాత నాన్న వద్దే అడ్వకేట్గా శిష్యరికం తీసుకున్నా. నాన్న జ్యూడిషియల్ వ్యవస్థలో ఉన్న మంచి చెడులు చెపుతుండడం, పది మందికి న్యాయం చేస్తే మనకు కలిగే మనశ్శాంతి, అనుభూతుల గురించి వివరించేవారు. దీంతో, అడ్వకేట్గా కేసులు వాదించే స్థాయి నుంచి జడ్జిగా కేసుల్లో తీర్పులు ఇచ్చే స్థాయికి ఎదిగానంటే అంతా మా నాన్న చలవే. అందుకే జీవితాంతం నాన్నకు రుణపడి ఉంటాను. చిన్నప్పుడు నాన్నతో ఉన్న జ్ఞాపకాలు రోజూ గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ కొన్ని బరువైన జ్ఞాపకాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. నాన్నను తలచుకోని రోజు ఉండదు. నాన్నతో పాటు అమ్మ ప్రేమలత, పెంచిన అమ్మ అన్నపూర్ణమ్మ, తమ్ముడు శ్రీనివాస్లు కూడా నా పురోభివృద్ధికి కారణం. – సి.రత్నపద్మావతి, జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి -
సర్వం నాన్నే!
నాన్న.. రెండక్షరాల ఈ పదం ప్రతీ వ్యక్తికి గుండె ధైర్యం.. ప్రపంచాన్ని జయించేంత మనో నిబ్బరం.. అమ్మ లోకానికి పరిచయం చేస్తే.. నాన్న ప్రపంచాన్ని చూపిస్తాడు. మనం భూమిపై పుట్టాక పరిచయమయ్యే తొలి స్నేహితుడు నాన్న.. జీవిత పాఠాలు బోధించే తొలి గురువు నాన్న.. బుడిబుడి అడుగులు వేసే సమయంలో ఎక్కడ పడిపోతామోనని భయపడుతూ.. వెన్నంటే ఆయన వేసే అడుగులు మనం లైఫ్లో స్థిరపడే వరకూ ముందుండి నడిపిస్తాయి. నాన్న ఎన్నో కష్టాలు పడుతూ.. పిల్లల సంతోషం కోసం అన్నీ త్యాగం చేస్తాడు. పిల్లలు జీవితంలో ఎక్కే ప్రతీ మెట్టులో నీడలా వెన్నంటే ఉంటాడు. కుటుంబ సంతోషం కోసం ఎన్ని కష్టాలైనా ఒంటెద్దు బండిలా లాగుతూ.. పిల్లల ముఖంలో నిత్యం చిరునవ్వులు చూస్తూ సంతోషించే వ్యక్తి నాన్న.. నాన్న అంటే భయపడే రోజు నుంచి స్నేహితుడిగా అన్నీ పంచుకునే కాలంలో చాలా మంది ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనాలు..!!తల్లిదండ్రులతో శశాంక్గద్దె శ్రీచరణ్, ఎవల్ఫినిటీ టెక్నాలజీస్ కంపెనీ వ్యవస్థాపకుడు -
ఇరుకై న వీధులను విస్తరిస్తాం
రామగుండం: ఇరుకై న వీధులను కనీసం ఇరవై అడుగులకు విస్తరించి అంబులెన్స్ రాకపోకలు సాగించేలా తీర్చిదిద్దుతామని నగర మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. శనివారం నగరంలోని 30వ డివిజన్ పరిధి ఖాదర్కాలనీ, ఇందిరానగర్, రహ్మత్నగర్, భీమయ్యకాలనీ తదితర ఏరియాల్లో పర్యటించారు. వీధుల విస్తరణకు కాలనీవాసులు సహకరించి త్వరగా అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తే రహదారి పనులు చేపడతామన్నారు. కాగా, ఇదే డివిజన్లో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ స్వగృహం ఉండడం గమనార్హం. కాలనీలోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగు, పిచ్చి మొక్కల తొలగింపు పనులను దగ్గరుండి పూర్తి చేయించారు. ఎమ్మెల్యే ప్రత్యేక నిధి రూ.20 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల్లో భాగంగా చివరి ఇంటి వరకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయోధ్యసింగ్ఠాకూర్, పట్టణ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్, కార్పొరేటర్లు ఇసంపెల్లి అంజులు, సిరిశెట్టి సతీశ్గౌడ్, నిమ్మరాజుల రజిని తదితరులున్నారు. పనులు త్వరగా పూర్తి చేయండిఓదెల(పెద్దపల్లి): మండల కేంద్రంలో తహసీల్దార్ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ కొప్పుల వెంకటరెడ్డి పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను శనివారం పరిశీలించారు. పనుల పురోగతిపై అదనపు కలెక్టర్కు తహసీల్దార్ వనజ వివరించారు. ఆర్ఐ గౌతం, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆమె తలలో బుల్లెట్టు?
కోరుట్ల/మెట్పల్లి: వారం క్రితం ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ.. ఈ గొడవలో కర్ర తగిలి ఓ మహిళకు తలపై తీవ్ర గాయాలతో రక్తస్రావమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును యధాలాపంగా తీసుకున్న మెట్పల్లి పోలీసులు ఎప్పటిలాగే హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపారు. ఆ తరువాత సదరు మహిళను ఆసుపత్రికి పంపించారు. 2 రోజులు గడిచినా మహిళ తల నుంచి రక్తస్రావం ఆగలేదు. వైద్యులకు అనుమానం వచ్చి స్కానింగ్ చేయించారు. చివరికి ఆమె తలలో ఇను ప ముక్క కనిపించడంతో నివ్వెరపోయారు. కర్రతో చేసిన గాయం అయితే ఇనుప ముక్క ఎక్కడిదన్న విషయం అంతుచిక్కని ప్రశ్నగా మారి కలకలం రేపుతోంది. వారం క్రితం గొడవ మెట్పల్లి పట్టణంలోని మఠంవాడలో గొనెల రాజం–లక్ష్మి దంపతులు, ఆ పక్కనే అతడి తమ్ముడు గొనెల శంకర్, అతడి సమీప బంధువు ముత్తన్న నివాసముంటున్నారు. అన్నదమ్ములకు కొన్ని రోజులుగా ఓ భూపంచాయితీ విషయంలో గొడవలు జరుగుతుండగా.. ఈనెల 15న అర్ధరాత్రి దాటిన తరువాత గొనెల రాజం–లక్ష్మి దంపతులు, గొనెల శంకర్కు మళ్లీ గొడవ జరిగింది. ఈ గొడవలో గొనెల శంకర్, ముత్తన్న కలిసి గొనెల రాజం–లక్ష్మి దంపతులపై దాడికి పాల్పడ్డారు. లక్ష్మి తలకు తీవ్ర గాయాలు కావడంతో.. తనను కర్రతో కొట్టి చంపే యత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెట్పల్లి పోలీసులు గొనెల శంకర్, ముత్తన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. లక్ష్మి తల నుంచి రక్తస్రావం ఆగకపోవడంతో.. ఈనెల 17న హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి స్కానింగ్ తీయగా.. ఆమె తలలో బుల్లెట్టు వంటి ఇనుప ముక్క ఉందని గుర్తించి దాన్ని వెలికితీశారు. బుల్లెట్టా.. ఇనుప ముక్కా? లక్ష్మి తలపై కర్రతో దాడి చేస్తే ఆమె కంటి కింది భాగంలో బుల్లెట్టు వంటి ఇనుప ముక్క ఎందుకు దిగబడి ఉందన్న విషయంలో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అర్ధరాత్రి తరువాత చీకటిలో జరిగిన గొడవలో లక్ష్మి తనపై దాడికి కర్రను ఉపయోగించారా లేదా అన్న విషయాన్ని స్పష్టంగా గమనించి ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఇనుప ముక్క తపంచా నుంచి వెలువడిన బుల్లెట్టు ముక్క కావచ్చన్న అనుమానాలున్నాయి. ఇనుప ముక్క బుల్లెట్టు అయితే తపంచా ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంలో సందేహాలున్నాయి. గొనెల శంకర్ వద్ద పని చేసే జేసీబీ డ్రైవర్లు కొందరు బిహార్, ఒడిశా ప్రాంతానికి చెందినవారు కావడంతో.. అక్కడి నుంచి తపంచా కొనుగోలు చేసి తెచ్చుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఏదైనా ఇనుప ముక్క అయితే తలలో కంటి కిందుగా లోతుకు ఎలా వెళ్లిందన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై మెట్పల్లి సీఐ సురేశ్బాబు మాట్లాడుతూ.. తలలో నుంచి బయటపడిన ఇనుప ముక్కను ఫోరెన్సిక్ నిపుణుల వద్దకు పంపామని, ఆ తరువాత స్పష్టత వస్తుందని చెప్పారు. ఇనుప ముక్క కావచ్చంటున్న పోలీసులు వారం రోజులుగా అంతుచిక్కని వైనం యఽథాలాపంగా పోలీసుల దర్యాప్తు ఆస్తి గొడవలో తపంచాతో కాల్చారా? -
వడ్ల గోదాముకే కన్నం
ఆరుగురి అరెస్ట్.. పరారీలో ఒకరుసిరిసిల్ల: సులభంగా డబ్బు సంపాదించాలనే దురా శకు వెళ్లిన ఇంటిదొంగలు కటకటాలపాలయ్యారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఆరుగురిని జిల్లా పోలీసులు శనివారం అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. జిల్లాలో రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడులు రావడంతో రెండు నెలలుగా కొనుగోళ్లు నిరాటంకంగా సాగుతున్నాయి. ఈక్రమంలోనే అక్రమార్కులు వడ్ల గోదాముకే కన్నం వేశారు. 13 లారీల వడ్లను పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో గతంలోనూ జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఏం జరిగిందంటే.. సిరిసిల్లకు చెందిన ఓ లారీ యజమాని, అతని తమ్ముడు, మరో ఇద్దరు కూలీలతో కలిసి గత సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటకు పెద్దూరు అపెరల్ పార్క్లోని ఓ గోదాములోకి లారీతో వెళ్లారు. సుమారు 150 నుంచి 200 బస్తాలను లారీలో ఎక్కించుకొని నేరుగా కోనరావుపేట మండలం మల్కపేట ఐకేపీ సెంటర్కు తరలించారు. అక్కడ ఆ వడ్లను కొనుగోలు చేసినట్లు ట్రక్షీట్ తయారు చేసి మళ్లీ అపెరల్ పార్క్లోని గోదాముకే తరలించేందుకు సిద్ధమయ్యారు. తీగ లాగితే కదిలిన డొంక అపెరల్పార్క్ గోదాములోని వడ్లను దొంగిలించిన ఘటనలో గోదాము మేనేజర్ ఉత్కం విజయ్ ఫిర్యాదుతో సిరిసిల్ల పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలోనే 13 లారీల వడ్లను అమ్మిన అక్రమాలు వెలుగుచూశాయి. 86 బస్తాలను దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేసిన గోదాం మేనేజర్ విజయ్ అక్రమ ట్రక్షీట్లకు, 13 లారీల వడ్లను దారి మళ్లించడానికి కారణకుడని తేలింది. విజయ్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా.. రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు కలిసి రూ.91 లక్షల విలువైన 13 లారీల వడ్లను అమ్మేసినట్లు తేలింది. కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన ఐకేపీ సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్, మరో సింగిల్విండో చైర్మన్ కలిసి నకిలీ ట్రక్షీట్తో లారీ వడ్లను రైస్మిల్లులో దింపకుండానే దింపినట్లు రికార్డులు సృష్టించి వడ్ల సొమ్మును పంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. ధాన్యం నిల్వలపై అనుమానాలు జిల్లాలోని 36 రైస్మిల్లులకు ధాన్యం అందించారు. మరోవైపు అపెరల్ పార్క్లోని 22 గోదాముల్లో వడ్ల ను నిల్వచేశారు. జగిత్యాల జిల్లాకు 14 గోదాములు కేటాయించగా.. రెండు గోదాముల్లో వడ్లను, మరో 12 గోదాముల్లో మక్కలు నిల్వచేశారు. 2024–2025 యాసంగి సీజన్లోనూ అపెరల్ పార్క్లో నిల్వ చేసిన ధాన్యానికి, తిరిగి రైస్మిల్లులకు కేటాయించిన ధాన్యానికి మధ్య 10వేల టన్నులు తేడా వచ్చింది. తాజాగా 13 లారీల వడ్లు పక్కదారి పట్టిన ఘటన చర్చనీయాంశమైంది. గుమ్మికి ‘ఇంటి దొంగల’ ఎసరు 13 లారీల వడ్లు పక్క దారి నకిలీ ట్రస్షీట్లతో అక్రమాలు ఆరుగురి అరెస్ట్.. పరారీలో రుద్రంగి ఐకేపీ సెంటర్ ఇన్చార్జి అధికార పార్టీ నేతలను ఆశ్రయించిన అక్రమార్కులుఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపిన వివరాలు. జూన్ 15న అర్ధరాత్రి సిరిసిల్ల శివారులోని అపెరల్ పార్క్ గోదాములోని 86 బస్తాల ధాన్యాన్ని లారీలో అక్రమంగా తరలిస్తున్నారని స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్కు చెందిన గోదాము మేనేజర్ ఉత్కం విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా గోదామ్ మేనేజరే మరికొందరితో కలిసి నకిలీ ట్రక్షీట్లతో 13 లారీల వడ్లను పక్కదారి పట్టించి సిద్దిపేటలో విక్రయించినట్లు తేలింది. అందరూ ఇంటిదొంగలే.. గోదాం మేనేజర్, కరీంనగర్కు చెందిన ఉత్కం విజయ్, వేములవాడరూరల్ మండలం అచ్చన్నపల్లికి చెందిన వాసాల గణేశ్ కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్షీట్లు తయారు చేశారు. రుద్రంగి ఐకేపీ ఇన్చార్జి గడ్డం స్వామి రెండు ట్రక్షీట్లు జారీ చేయగా.. గోదాం మేనేజర్ విజయ్ ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దీంతో రైతుల పేరిట వచ్చిన ఆ రెండు లారీల ధాన్యం డబ్బులను ముగ్గురు కలిసి పంచుకున్నారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఆఫీస్లో పనిచేసే కుమ్మరి రాజశేఖర్, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పీఏసీఎస్(సింగిల్ విండో) కొనుగోలు కేంద్రం ఇన్చార్జి గాజుల నవీన్తో కలిసి ఒక్క లారీకి నకిలీ ట్రక్షీట్ తయారు చేసి గోదాం మేనేజర్ విజయ్కి అందించారు. వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో రాజశేఖర్ ఆ నకిలీ ట్రక్షీట్కు ఆమోదం తెలిపారు. రైతుల పేరిట వచ్చిన డబ్బులను ముగ్గురు పంచుకున్నారు. పది లారీల వడ్లను దారి మళ్లించారు అపెరల్ పార్క్ గోదాముకు వచ్చిన 10 లారీల వడ్లను అక్కడ దించకుండానే దించినట్లుగా ఆన్లైన్లో నమోదు చేశారు. ఆ వడ్లను వేములవాడకు చెందిన రైస్మిల్లర్ చేపూరి మధుకర్ ద్వారా సిద్దిపేటకు చెందిన కమీషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్కు అమ్మేశారు. ఆయన ఆ లారీలను వివిధ రైస్మిల్లులకు మళ్లించాడు. పది లారీల వడ్లను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను నిందితులు పంచుకున్నారు. ఇలా మొత్తం 13 లారీల వడ్లను అమ్మేశారు. ఈ ఘటనలపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహ ఫిర్యాదుతో సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి.. ఉత్కం విజయ్, వాసాల గణేశ్, కమ్మరి రాజశేఖర్, గాజుల నవీన్, చేపూరి మధుకర్, చిటుకుల శ్రీకాంత్లను అరెస్ట్ చేశారు. రుద్రంగి ఐకేపీ ఇన్చార్జి గడ్డం స్వామి పరారీలో ఉన్నారు. రూ.14.16 లక్షలు స్వాధీనం.. రూ.46.21 లక్షలు ఫ్రీజ్ ఆరుగురి వద్ద రూ.14.16 లక్షలు, సెల్ఫోన్లు, బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లోని రూ.46.21 లక్షలను ఫ్రీజ్ చేశామని ఎస్పీ మహేశ్ బీ గీతే వివరించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను చేధించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు నాగరాజు, గణేశ్, హెడ్కానిస్టేబుల్ పుల్కం శ్రీనివాస్, కానిస్టేబుళ్లు రవి, నాగరాజులను ఎస్పీ అభినందించారు. -
దాహం.. దాహం
వానాకాలమొచ్చినా వరుణుడు కన్నెత్తి చూడడం లేదు. భానుడు ఇంకా భగభగమంటూ తన ప్రచండ తాపాన్ని చూపుతున్నాడు. మండే ఎండలకు వానర మూకలు దప్పికతో అల్లాడుతున్నాయి. పెద్దపల్లి రైల్వేస్టేషన్లో కులాయి వద్ద నీరు తాగేందుకు యత్నించి భంగపడ్డ ఓ వానరం, పక్కనే ఓ పాసింజర్ బ్యాగులో కనిపించిన వాటర్బాటిల్ను ఇలా లాక్కొని, దాని కింది భాగాన్ని కొరికి దప్పిక తీర్చుకుంది. రైల్వేస్టేషన్లోని ప్రయాణికులు ఇదంతా ఆసక్తిగా గమనించారు. – పెద్దపల్లిరూరల్ 23న బంద్ విజయవంతం చేయండి సిరిసిల్ల అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్వహించే రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పెండ్యాల శివ కోరారు. సిరిసిల్లలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని కోరారు. బావిలో పడి బాలుడి మృతికొత్తపల్లి: కరీంనగర్ పరిధిలోని రేకుర్తిలోని బతుకమ్మ చెరువు బావిలో పడి బాలుడు మృతిచెందాడు. కొత్తపల్లి సీఐ బిల్ల కోటేశ్వర్ వివరాల ప్రకారం.. రేకుర్తిలోని స్వామికాలనీకి చెందిన షకీర్ఖాన్ అలియాస్ ఇర్ఫాన్ ఖాన్ (16) తన స్నేహితులు షేక్ అఫ్రోజ్, యాకుబ్ అలీ, షకీర్ఖాన్లతో కలిసి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాలనీ సమీపంలోని బతుకమ్మ చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. చెరువు సమీపంలోని ఓ బావి వద్ద ఆడుకుంటుండగా షకీర్ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. తనతో ఉన్న స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే వారు షకీర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బటయకు తీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఇంటిపనిలో ‘యోగ’ం
కరీంనగర్స్పోర్ట్స్: ఒకప్పుడు మన ఇళ్లలోనే యోగం ఉండేది. వాకిట్లో ముగ్గు, వంటింట్లో వంట, ఇంటి శుభ్రత, బట్టల ఉతుకుడు ఇవి కేవలం పనులు కాదు, ఆరోగ్యాన్ని కాపాడే యోగా వ్యాయామాలు. కాలక్రమేణా వాటిని సాధారణ పనులుగా భావించి, ఆరోగ్యం కోసం బయట వెతకడం ప్రారంభించాం. కానీ మన అవ్వలు, అమ్మలు చేసిన ప్రతి ఇంటి పని శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, కుటుంబానికి ప్రేమను అందించే ఇంటి యోగం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేటి ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యం కోసం యోగా కేంద్రాలు, జిమ్లు, ఫిట్నెస్ కార్యక్రమాలకు ప్రజలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వేకువజాము నుంచే మొదలు వేకువజామున నిద్రలేచి ముగ్గు వేయడం ద్వారా మోకాళ్లు, వెన్నెముకకు వ్యాయామం లభించేది. బట్టలు ఉతకడం, ఆరేయడం వంటి పనులు చేతులు, భుజాలు, నడుంకు బలాన్ని ఇచ్చేవి. ఇల్లు ఊడ్చడం, గిన్నెలు తోమడం వంటి పనులు రక్తప్రసరణను మెరుగుపరచడంతో ఉపయోగపడేవి. ఇక నేటి తరంలో యంత్రాలపై ఆధారపడటం పెరిగింది. ఇంటి పనులు తగ్గి ఆరోగ్య సమస్యలు మాత్రం పెరుగుతున్నాయి. గంటల తరబడి కూర్చుని పనిచేసే జీవనశైలిలో మెడనొప్పి, నడుమునొప్పి, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు సాధారణమయ్యాయి. ఇంటి పనులపై సమాజం చేసిన ప్రధాన తప్పు ఇంటి పనులను తక్కువగా చూడటమే. యోగాసనం పేరుతో చేస్తే గౌరవం, ఇంట్లో చేస్తే సాధారణ పని అనే భావన ఏర్పడింది. ఇంటి పనుల వెనుక ఉన్న ప్రేమ, సేవ, బాధ్యత, కుటుంబ సంక్షేమం వంటి విలువలను మనం మరిచిపోయాం. నిజానికి వంట చేయడం అంటే కేవలం ఆకలి తీర్చడం కాదు. కుటుంబానికి ఆరోగ్యం, ప్రేమ అందించడం. ఇల్లు శుభ్రం చేయడం అంటే కేవలం దుమ్ము తొలగించడం కాదు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడమని అర్థం. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం -
యోగాసనమే శ్వాసగా..
కరీంనగర్స్పోర్ట్స్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన యోగా క్రీడాకారిణి జాపతి ఆమని యోగాను జీవిత విధానంగా మార్చుకుని జాతీయస్థాయికి ఎదిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వసతులు, శిక్షణ దొరకడం కష్టమైనప్పటికీ, పట్టుదల, కఠిన సాధనతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగిన యోగా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కేరళలో జరిగిన జాతీయస్థాయి సీనియర్స్లో సత్తా చాటి 5వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు మూడుసార్లు జాతీయస్థాయితో పాటు నేపాల్లో జరిగిన పోటీల్లో పతకాలు సొంతం చేసుకుంది. -
ట్రాక్టర్ పైనుంచి పడి యువకుడి మృతి
● కుమారుడి కళ్లు దానం చేసిన తండ్రి వెల్గటూర్: ట్రాక్టర్ పైనుంచి పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎండపల్లికి చెందిన తొట్ల మధూకర్ (26) తన పొలానికి పశువుల ఎరువు తీసుకెళ్లేందుకు ట్రాక్టర్ కిరాయి మాట్లాడుకున్నాడు. డ్రైవర్ అతివేగంగా.. అజాగ్రతగా నడపడంతో మధూకర్ అదుపు తప్పి కింద పడ్డాడు. ఘటనలో తల, చాతిపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కొడుకు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. కన్నుమూసినా ఇద్దరికి చూపు మధూకర్ మృతిచెందినా మరో ఇద్దరికి చూపునిచ్చాడు. మధూకర్ అవయవాలను దానం చేయాలని తండ్రి లచ్చయ్య నిర్ణయించుకుని ఎస్సై ఉదయ్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మారం జలంధర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సిబ్బంది మధూకర్ నేత్రాలను సేకరించారు. చికిత్స పొందుతూ యువకుడు..మల్లాపూర్: మండలంలోని హుస్సేన్నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన షేక్ ఖాసీం (19) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖాసీం తన బైక్పై రోడ్డుపై వెళ్తుండగా ఖానాపూర్ నుంచి మెట్పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఖాసీం తలకు తీవ్రగాయడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఖాసీం తండ్రి షేక్ నన్నేసాబ్ ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్ గుగ్లావత్ గోపిచంద్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. యువకుడి ఆత్మహత్యకరీంనగర్క్రైం: తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ తన కుమారుడు మహ్మద్ అహ్మద్(19)తో కలిసి ఉపాధి నిమిత్తం కరీంనగర్ వచ్చారు. నగరంలోని చికెన్ సెంటర్లో పనిచేస్తున్నారు. అక్కడే ఓ గదిలో ఉంటున్నారు. ఇటీవల అహ్మద్ చికెన్సెంటర్కు రాకుండా బయట తిరుగుతుండడంతో శనివారం ఇర్ఫాన్ మందలించాడు. మనస్తాపానికి గురైన అహ్మద్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. ఇర్ఫాన్ గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. ఇర్ఫాన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. తాగుడు వద్దన్నందుకు.. ఉరేసుకుని ఆత్మహత్యఇబ్రహీంపట్నం: తాగుడు మానేయాలని భార్య మందలించినందుకు భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై నవీన్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జంగిలి పెద్దొళ్ల చిన్న నర్సయ్య(43) మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు మధ్యం తాగి వచ్చి భార్య కవితతో గొడవ పడుతున్నాడు. ఇలాగైతే ఎలా అని కవిత మందలించగా.. మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. నర్సయ్యకు ఇద్దరు కూతుళ్లు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నేత్రాలు దానం
కోల్సిటీ: వేర్వేరు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఇద్దరి నేత్రాలను దానం చేసి రెంటు కుటంంబాలు ఆదర్శంగా నిలిచాయి. గోదావరిఖని కాకతీయనగర్కు చెందిన డి.రఘు (46) శుక్రవారం చెట్టుపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు గాయాలుకావడంతో వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన సింగరేణి ఉద్యోగి రాజు (29) శనివారం తెల్లవారుజామున గోదావరిఖనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం కరీంనగర్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ప్రాణాలు దక్కలేదు. మృతుల కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ ఇద్దరి నేత్రాలను సేకరించి హైదరాబాద్కు తరలించారు. ఈ నేత్రాల ద్వారా నలుగురు దృష్టి లోపం ఉన్న వారికి చూపు అందనుంది. విషాద సమయంలోనూ నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేశ్, మారెల్లి రాజిరెడ్డి, లగిశెట్టి చంద్రమౌళి, భీష్మాచారి, కేఎస్ వాసు, వెల్ది కవిత అనంతరాములు, తడబోయిన రాములు, దేవి లక్ష్మీ నరసయ్య తదితరులు అభినందించారు. సిరిసిల్లటౌన్: మెడికల్ కాలేజీ, ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ నాయకులు కోరారు. ఈమేరకు జిల్లా ప్రభుత్వాస్పత్రి, మెడికల్ కాలేజీలో శనివారం వినతిపత్రాలు అందించి మాట్లాడారు. పీఎఫ్, ఈఎస్ఐ నిబంధనలు అమలు చేయాలని, యజమాని వాటాను ప్రభుత్వమే చెల్లించాలని, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈనెల 22న కలెక్టరేట్ వద్ద ధర్నా, 25, 26 తేదీల్లో జిల్లా ఆస్పత్రి వద్ద రిలే నిరసన దీక్షలు, 30న ప్రగతి భవన్ ముట్టడించనున్నట్లు తెలిపారు. యూనియన్ ప్రతినిధులు మారవేణి మహేశ్, బండారి హరీశ్కుమార్, సుంకపాక మౌనిక, రాధ, పులి శారద, రూప, స్రవంతి పాల్గొన్నారు. -
కోల్బెల్ట్ లీడర్ల ఇసుక దందా
పెద్దపల్లి: కోల్బెల్ట్లోని లీడర్లు, ప్రజాప్రతినిధులు ఇసుక, మట్టి, బూడిద దందా చేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరిఖని, రామగిరి, పె ద్దపల్లిలో ఆమె శుక్రవారం పర్యటించారు. కవిత మాట్లాడుతూ, అన్నదాతలకు రైతుభరోసా ఇవ్వ డంలో, యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్రప్ర భుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అన్నిరకాల ధాన్యానికి బోనస్ చెల్లిస్తామన్న సర్కారు.. ఇప్పుడు ఏడు రకాల సన్నరరకం వడ్లకే ఇస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పినా.. పెద్దపల్లి ఎమ్మెల్యే దీనికోసం కనీసం సీఎంను అడగడవం లేదన్నారు. భూపాలపల్లి వద్ద కాళేశ్వరం బ్యాక్వాటర్తో పంటలు నష్టపోయే రైతులకు పరిహారం చెల్లించాలని, రామగుండంలోని గోదావరినీళ్లు తాగితే క్యాన్సర్ సోకే ప్ర మాదం ఉందని అంటున్నారని, దీనిపై మంత్రి దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సీఎం తాను హి ట్లర్నని చెబుతున్నారని, కానీ, ఇక్కడి మంత్రి హి ట్లర్ కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం ప్రిపేరవుతోందని, 5 వేల ఉద్యో గాలు హైదరాబాద్కు కూడా సరిపోవని, నిరుద్యోగ సమస్యను బట్టి కనీసం 20 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీచేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లిలోని ఓ స్వీట్హౌస్ను సందర్శించి మిఠాయి తయారీ విధానం పరిశీలించారు. మహిళలతో కలిసి మిఠాయి రుచిచూశారు. సింగరేణిపై రాజకీయాలు వద్దు రామగిరి: సింగరేణిపై రాజకీయాలు చేయొద్దని కవిత అన్నారు. అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో నిర్వహించిన బాయిబాటలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఆహ్మద్తో కలిసి మాట్లాడారు. సింగరేణిలో నాణ్యమైన యంత్రాలు లేవని, కార్మికుల భద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డిని హరీశ్రావే కాపాడుతున్నారని, సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తుంటే మంత్రి శ్రీదర్బాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం సెంటినరీ కాలనీలోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ జెండాలను కవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడాల మనోజగౌడ్, బోడ జనార్దన్, ఖాజాఇస్మాయిల్, గోశిక అశోక్, కొమ్ము మధునయ్య, శాంతిస్వరూప్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నృసింహుని సన్నిధిలో కవిత పూజలు యైటింక్లయిన్కాలనీ: రామగిరి మండలం సుందిళ్ల శ్రీలక్ష్మీనృ సింహస్వామిని టీఆర్ఎస్ అధినేత కవిత దర్శించుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మట్టి, బూడిదనూ కొల్లగొడుతున్నారు తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత -
అందుబాటులో యూరియా నిల్వలు
పెద్దపల్లిరూరల్: వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన సమయాల్లో ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు కూడా అందుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయాధికారులతో శుక్రవారం వానాకాలం సాగుపై విప్ సమీక్షించారు. ఎలినినో ప్రభావంతో వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం కనిపిస్తోందన్నారు. వాతావరణ పరిస్థితులతో రైతులు నష్టపోకుండా అవసరమైన సలహా లు, సూచనలు ఇవ్వాలని సూచించారు. జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నుల వరకు యూరియా నిల్వ లు ఉన్నాయని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవస రం లేదని తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విప్ చొరవతోనే కొనుగోళ్లు విజయవంతం పెద్దపల్లి: ప్రభుత్వ విప్ విజయరమణారావు చొ రవతోనే యాసంగి ధాన్యం కొనుగోళ్లు విజయవంతమయ్యాయని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసి పూలమొక్క అందజేసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా ముగియడం వెనుక ప్రభుత్వ విప్ నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక చొరవ ఉందని తెలిపారు. సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కేశెట్టి విక్రమ్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మెట్టు మదన్ మోహన్, ప్రచార కార్యదర్శి బూరుగు సంతోష్ కుమార్, డైరెక్టర్ వల్ల కొండ రమేశ్, సీఈవోలు సురేశ్, రవీందర్రెడ్డి, సతీశ్, నహియుద్దీన్, దేవేందర్, తిరుపతి పాల్గొన్నారు. కాంగ్రెస్లో చేరికలు ఎలిగేడు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజాపాలనకు ఆకర్షితులై జూలపల్లి మండలానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్లకు చెందిన పలువురు నాయకులు శివపల్లిలోని విప్ విజయరమణారావు నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి విప్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాగా, సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయడం కోసం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు విప్ను కలిసి విన్నవించా రు. వసతుల కల్పన, పరిశుభ్రత, తాగునీరు, లైటింగ్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చొప్పరి సుమన్, ప్రధానకార్యదర్శిఽ నిట్టూరి శ్రీనివాస్, కోశాధికారి కామని శ్రీకాంత్, గౌరవ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజలింగం, ఉపాధ్యక్షుడు పల్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు. వరి సాగుపై ఎల్నినో ప్రభావం ప్రభుత్వ విప్ విజయరమణారావు -
కుటుంబ సభ్యులుగా భావించాలి
పెద్దపల్లి: వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులను తమ కుటుంబసభ్యులుగా భావించి సత్వర సేవలు అదించాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. పెద్దపల్లి జోన్ మహిళా పోలీస్స్టేషన్ను డీసీపీ శుక్రవారం తనిఖీ చేశారు. ఇన్స్పెక్టర్ రమేశ్బాబు ఆయనకు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. బాధితులతో వ్యవహరించే తీ రు, సమస్యల పరిశీలన, ఫిర్యాదుల నమోదు, పరిష్కార మార్గలపై సిబ్బందిని అడిగి వివరాలు తె లుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా కేసుల్లో దర్యా ప్తు పూర్తిచేసి నిందితులను కోరుట్లో హాజరుపర్చాల ని అన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ పరస్పరం అర్థం చేసుకుంటే జీవితం సుఖమయంగా ఉంటుందని, సమస్యలతో వచ్చే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సమస్య లు పరిష్కరించాలని సూచించారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ,, ఎస్సై రాజమణి, సిబ్బంది పాల్గొన్నారు. బాధితులకు సత్వర సేవలు అందించాలి పోలీసులకు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచన -
● రోజురోజుకు పడిపోతున్న నీటిమట్టం ● కనిష్టస్థాయిలో ఎగువ, లోయర్, మిడ్మానేరు డ్యాంలు ● ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ తగ్గుతున్న నీరు ● ఈసారి ఉమ్మడి జిల్లాలో సాగునీటికి చిక్కులే
ఉమ్మడి జిల్లా వ్యవసాయానికి గోదావరి, మానేరు నదులు ప్రాణాధారం. రెండు నదులపై నిర్మించిన ప్రాజెక్టులే ఇటు ఉమ్మడి జిల్లాకు, అటు ఇతర జిల్లాలకు సాగు, తాగునీరు అందిస్తున్నాయి. అలాంటి ఈ రెండు నదులు ఈ వేసవిలో దాదాపుగా ఎండిపోతున్నాయి. ఈ పరిణామం రైతులను, వ్యవసాయాధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. అప్పర్ మానేరు 1 టీఎంసీ పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 19 అడుగులకు చేరుకుంది. ఇక 27 టీఎంసీల సామర్థ్యమున్న మిడ్మానేరు డ్యామ్ (ఎంఎండీ)లో ప్రస్తుతం 7.4 టీంఎసీలకే పరిమితమైంది. లోయర్మానేర్ డ్యాం (ఎల్ఎండీ) 24 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 6 టీఎంసీలే నమోదు చేసింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దరిమిలా జలాశయాల్లో నీటి ఆవిరి ఇంకా కొనసాగుతుందని నీటిపారుదల అధికారులు వాపోతున్నారు. ఇక జగిత్యాల జిల్లా పంటలకు కీలకమైన ఎస్సారెస్పీ వరద కాలువలో సాధారణంగా ఆరు మీటర్ల వరకు ఉంటే నీరు ప్రస్తుతం రెండు మీటర్లకు పరిమితమైంది. దీని ఆధారంగా జిల్లాలో 30వేల ఎకరాల పంటలు సాగవుతాయి. -
విద్యా ప్రమాణాలకు పురస్కారం
పెద్దపల్లి: విద్యా ప్రమాణాల పెంపులో అత్యంత ప్రతిభ చాటి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపినందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా విద్యాశాఖాధికారి శారదకు విశిష్ట గౌరవం లభించింది. శుక్ర వారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నుంచి కలెక్టర్, డీఈవో పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని సీఎం సన్మానించి ప్రశంసపత్రం అందజేశారు. జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపినందుకు ఈ గుర్తింపు లభించిందని కలెక్టర్, డీఈవో తెలిపారు. జిల్లా విద్యా రంగాభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయడంతోనే ఈ అరుదైన గౌరవం దక్కిందని, భవిష్యత్లో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. చెంచుల సంక్షేమానికి ప్రాధాన్యం ముత్తారం: చెంచుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పారుపల్లిలో కలెక్టర్ శుక్రవారం పర్యటించారు. గ్రామంలో 15 చెంచు కుటుంబా ఉండగా.. కూలీపని చేసుకొంటున్న చెంచుల్లో కొందరు గుడిసెలు, మరికొందరు అసంపూర్తి రేకులషెడ్లలో నివసిస్తున్నారని గుర్తించి అర్హులైన వారికి కలెక్టర్ ప్రత్యేక నిధులతో ఇళ్లు పూర్తిచేయిస్తామన్నారు. సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. వారి జీవన ప్రమాణాల మరింత మెరుగుపర్చుతామని అన్నా రు. చెంచు కుటుంబాల పిల్లలు సర్కారు బడికి వచ్చేలా చూడాలని హెచ్ఎం వేగోలపు సదానందంను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పలువురు పిల్లలకు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రవేశాలు కల్పించారు. జూలై 31 వరకు తరగతి గదుల నిర్మాణం పూర్తిచేయా ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ భవనం పనుల పురోగతి పరిశీలించారు. ధర్యపూర్ మోడల్ స్కూల్ సందర్శించారు. సర్పంచ్ చొప్పరి సంపత్, తహసీల్దార్ మఽధుసూదన్రెడ్డి, ఎంపీడీవో సురేశ్, ప్రిన్సిపాల్ సదానందంగౌడ్, మాజీ జెడ్పీటీసీ చోప్పరి సదానందం పాల్గొన్నారు. జిల్లాకు దక్కిన రాష్ట్రస్థాయి గుర్తింపు అవార్డు అందుకున్న కలెక్టర్ శ్రీహర్ష -
రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దగల గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా జరిపారు. పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కేక్ కట్చేసి స్వీట్లను పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సురేశ్గౌడ్తోపాటు కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. వార్డుల్లో శానిటేషన్ డ్రైవ్ పెద్దపల్లిరూరల్: మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో శుక్రవారం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్థానిక రెండోవార్డులో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్ పస్తం లక్ష్మి– జంపయ్యతో కలిసి పారిశుధ్య పనులను పరిశీలించారు. 12వ వార్డులో కమిషనర్ వెంకటేశ్, కౌన్సిలర్ జగదీశ్తో కలిసి మురుగునీటి కాలువలు శుభ్రం చేసే పనులను పర్యవేక్షించారు. వార్డు ప్రజలకు పలు సూచనలు చేశారు. స్వచ్ఛ రామగుండం లక్ష్యం యైటింక్లయిన్కాలనీ: స్వచ్ఛ రామగుండం లక్ష్యంగా ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పనిచేస్తున్నారని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. నగరంలోని 19వ డివిజన్లో కార్పొరేటర్ మారెల్లి సుశీల–రాజిరెడ్డితో కలిసి మే యర్ శుక్రవారం పర్యటించారు. సింగరేణి ఆర్జీ –2, మున్సిపల్ అధికారులు ప్రధాన డ్రైనేజీల్లో పూడిక తీయించగా.. మేయర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మారెల్లి రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి పెద్దపల్లి: మున్సిపల్ కార్మికుల సమస్యలను త క్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా గౌ రవ అధ్యక్షుడు ఎర్రవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. సుల్తానాబాద్లో మున్సిపల్ కార్మికులు శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని, కనీస వేతనం నెలకు రూ.26 వేలు నిర్ణయిస్తామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ హామీలు విస్మరించిందని ఆయన విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనలు చేపడతామని, అయినా, పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఆయన కార్మికులను కోరారు. నాయకులు పాక మహేశ్, తాండ్ర అంజయ్య, న్యాతరి రమేశ్, ఆరేల్లి సురేశ్, మాతంగి రాజమల్లు, మహంకాళి మల్లేశ్, శ్రీనివాస్, చిలుముల రామ్మూర్తి, న్యాతరి లక్ష్మి, లత, ఓదెలు, మధు, నర్సింగం పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాల బస్సుల అడ్డగింత పాలకుర్తి: కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల బస్సులను స్థానికులు అడ్డగించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, దీనిదృష్ట్యా బడిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పంచాయతీ పాలకవర్గం విజ్ఞప్తి చేసింది. కాగా, మూడురోజులపాటు ఈసాలతక్కళ్లపల్లి గ్రామస్తులు చేసిన పోరాటం ఫలితంగా 26మంది విద్యార్థులు ఒకేరోజు సర్కారు బడిలో చేరడం విశేషం. -
ఆక్రమణల ముప్పు..!
సాక్షి, పెద్దపల్లి: అంతర్గాం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నా యి. రూ.కోట్ల విలువైన వందలాది ఎకరాలు అక్రమార్కుల చెరలో చిక్కుకున్నాయి. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం నామమాత్రంగా నోటీసులు జారీచేయడం వంటి చర్యలకే పరిమితమవుతోంది. శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో అక్రమార్కు లు వాటిపైనే మళ్లీమళ్లీ కన్నేస్తున్నారు. భవిష్యత్లో ప్రజాప్రయోజన కార్యక్రమాలు, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే ఈభూములు ఆక్రమణలకు గురైతే మళ్లీ స్వాధీనం చేసుకోవడం కష్టతరమవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మొక్కలు నాటడంతోనే సరి ప్రభుత్వ భూములను కాపాడాలనే ఉద్దేశంతో గతంలో ‘హరితహారం’ ద్వారా వేలాది మొక్కలు నాటా రు. ఉపాధిహామీ ద్వారా గతేడాది డిసెంబర్ 3న పెద్దసంఖ్యలో మొక్కలు నాటారు. కానీ, వాటి సంరక్షణపై అధికారులు నిర్లక్ష్యం వహించారు. పర్యవేక్షణ లేక మొక్కలు ఎండిపోయి భూమి ఖాళీగా మా రింది. దీనిని అదనుగా భావించిన అక్రమార్కులు.. భూములపై కన్నేసి, దున్నడం ద్వారా సాగులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. తద్వారా హక్కులు సాధించే లక్ష్యంతో తమ అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూ.కోట్ల విలువైన భూములపై కన్ను అంతర్గాం మండలంలోని ఆకెనపల్లి, ఎగ్లాస్పూర్, సోమనపల్లి, విసంపేట, పొట్యాల, మద్దిర్యాల శివారుల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమార్కులు చెరబడుతున్నారు. పొట్యాల శివా రులోని సర్వే నంబర్ 365, 369లో సుమారు 250 ఎకరాలు ఉంది. మిగతా గ్రామాల్లో మరో 300 ఎక రాలకు పైచిలుకు ఉంది. 2023లో సర్వే నంబర్లు 363, 369 పరిధిలోని సుమారు 60 ఎకరాల ప్రభు త్వ భూమిలో సాగు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో రెవెన్యూ అధికారులు వాటిని స్వాధీ నం చేసుకుని, బాధ్యులపై చర్యలు తీ సుకుంటామని ప్రకటించారు. ఆ తర్వాత ఆ విషయాన్ని వి స్మరించారు. దీంతో కొందరు సాగుకు సిద్ధం చేస్తున్నట్లు స మాచారం. గతంలో తవ్వించిన కందకాల ఆనవాళ్లు ఉ న్నా.. లెక్కచేయకుండా ఆక్రమణకు యత్నిస్తున్నారు. శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూపులు ప్రతీసారి స్వాధీనం, హెచ్చరికలతోనే సరిపెట్టకుండా ప్ర భుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటేనే రక్షణ ల భిస్తుందని పలువురు గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆస్తిగా ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఈ విషయమై అంతర్గాం తహసీల్దార్ పడాల ప్రసాద్రావును సంప్రదించగా..‘ఈ వ్యవహారం మా దృష్టికి వచ్చింది.. క్షేత్రస్థాయిలో మా సిబ్బందిని పంపించి అక్రమార్కుల వివరాలు సేకరిస్తున్నాం. ఎవరైనా ప్రభుత్వ భూముల్లో ట్రాక్టర్లు పెట్టి సాగు చేస్తే సీజ్ చేస్తాం. అలాగే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం’ అని వివరించారు. అంతర్గాంలో 200 ఎకరాల ప్రభుత్వ భూములకు ఎసరు హెచ్చరికలు, నోటీసులతోనే సరిపెడుతున్న యంత్రాంగం అక్రమార్కులకు అడ్డుకట్ట పడేది ఎప్పుడంటున్న స్థానికులు కలెక్టర్ చొరవతో శాశ్వత పరిష్కారం కలెక్టర్ చొరవే తీసుకుంటేనేఇటీవల ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామశివారులో 72.03 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి విముక్తి చేయడంలో కలెక్టర్ కీలకపాత్ర పోషించారు. అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో అక్రమంగా తవ్వించిన 22 చెరువులను పూడ్చివేసి సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ నేపథ్యంలో అంతర్గాం మండలంలోని ప్రభుత్వ భూముల పరిరక్షణపైనా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇందుకోసం సమగ్ర సర్వే నిర్వహించి సరిహద్దులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన్ పర్యవేక్షణ, నిరంతర తనిఖీలు చేపట్టి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
డ్రైనేజీల్లో చెత్త వేయొద్దు
● మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ ● కౌన్సిలర్లతో కలిసి పారిశుధ్య పనుల పరిశీలనపెద్దపల్లిరూరల్: మురుగునీటి కాలువల్లో చెత్తాచెదా రం పడవేయొద్దని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ వెంకటేశ్ కౌన్సిలర్లతో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా సిబ్బంది చేపట్టిన పారిశుధ్య పనులను వారు పర్యవేక్షించారు. పట్టణంలోని మున్సిప ల్ 14వ వార్డులోగల డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోవడాన్ని వారు గుర్తించారు. తక్షణమే పారిశు ధ్య సిబ్బందితో చెత్తాచెదారం తొలగించారు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం వేయడం ద్వారా మురుగునీటి సరఫరా నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని, డ్రైనేజీల్లో చెత్త వేయొద్దని వారు సూచించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
పడిపోతున్న నీటినిల్వలు
రామగుండం: ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. ఈతరుణంలో ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టులో నీటినిల్వలు గణనీయంగా తగ్గుతున్నా యి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు ఉండగా, గురువారం 7.87 టీఎంసీలకు పడిపోయిందని అధికారు లు తెలిపారు. గతేడాది ఇదేరోజు 8.71 టీఎంసీలు ఉందని పేర్కొన్నారు. ఇన్ఫ్లో 257 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 609 క్యూసెక్కులు ఉందని వివరించారు. ఎన్టీపీసీకి 121 క్యూసెక్కు లు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 276 క్యూసెక్కులు, భగీరథ నీటి పథకానికి 58 క్యూసెక్కులు సరఫరా చేస్తుండగా, ఎండల తీవ్రతకు 131 క్యూసెక్కులు ఆవిరి అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ‘సర్ౖ’పె ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ జ్యోతినగర్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 25వ తేదీ నుంచి చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై అదనపు కలెక్టర్, రామగుండం కా ర్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ గురువారం సి బ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎన్టీపీసీ కాకతీయ క ల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో స హాయక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, బూ త్ లెవల్ సూపర్వైజర్లు, ఇన్చార్జీలు, బీఎల్ఏ లతో ‘సర్’ విధి విధానాలపై అవగాహన కల్పించారు. అంతర్గాం, రామగుండం తహసీ ల్దార్లు ప్రసాద్రావు, రవీందర్రావు, నాయబ్ తహసీల్దార్ అనిల్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు బొంతల రాజేశ్, ఆసిఫ్పాషా, బీఎస్పీ ప్రతినిధి జనగామ లింగయ్య, సీపీఐ తరపున గోవర్ధన్ తదితరులు శిక్షణకు హాజరయ్యారు. బొంపల్లిలో అధికారుల సర్వే పెద్దపల్లిరూరల్: బొంపల్లిలో గురువారం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చేశారు. గణాంక శా ఖ ఆధ్వర్యంలో గ్రామీణుల జీవన స్థితిగతు లు, ఉపాధి అవకాశాల తీరుపై వివరాలు సేకరిస్తున్నట్లు అధికారి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సాధారణ వివరాలను సేకరించిన అనంతరం ట్యాబ్ ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లో మూడు నెలలకోసారి సర్వే నిర్వహించి వివరాలను న మోదు చేస్తామని వివరించారు. సర్పంచ్ దాడి మౌనిక – సంతోష్, ఉపసర్పంచ్ పంబాల రాజుతోపాటు వార్డు సభ్యులు, అంగన్వాడీటీచర్ కడారి కనకలక్ష్మి, ఏఎన్ఎం రాజేశ్వరి, ఆశవర్కర్ లలిత తదితరులు పాల్గొన్నారు. కాలనీలో పోలీసుల తనిఖీలు యైటింక్లయిన్కాలనీ: గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి యైయెటింక్లయిన్కాలనీలో నార్కోటిక్స్ డాగ్తో పోలీసులు గురువారం విస్త్రతంగా తనిఖీలు చేశారు. స్థానిక షిర్కెబస్స్టాప్ చౌరస్తా, తెలంగాణ చౌరస్తా, షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలు, ప్రధాన కూడళ్లు, దుకాణాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో సీఐ ప్రసాద్రావు తన సిబ్బందితో కలిసి విస్తృతంగా సోదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థా లు విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో టూటౌన్ పోలీస్ సిబ్బందితోపాటు నార్కోటిక్స్ విభాగం పోలీసులు పాల్గొన్నారు. 21న యోగా దినోత్సవం పెద్దపల్లి: జిల్లాలో ఈనెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్లు కలె క్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఆయుష్ ఆధ్వర్యంలో ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’ అంశంపై స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో యోగా శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యువత, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు విజయవంతం చేయాలని కోరారు. -
నర్సరీలు.. నాణ్యమైన మొక్కలు
పెద్దపల్లిరూరల్: కూరగాయల పెంపకంపై పలువురిలో ఆసక్తి పెరిగింది. పెద్దపల్లి ప్రాంతంలోని హన్మంతునిపేట, పెద్దకల్వల, పెద్దబొంకూర్, కొత్తపల్లి, గౌరెడ్డిపేట, ముత్తారం తదితర గ్రామాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తుండగా.. పెద్దపల్లి శివారు బందంపల్లికి చెందిన వృద్ధ దంపతులు ఆకుకూరలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెద్దకల్వలలో కొందరు నర్సరీలు ఏర్పాటు చేసి పూలు, కూరగాయల మొక్కలు సిద్ధంచేసి అన్నదాతలకు విక్రయిస్తున్నారు. మేలు రకం మొక్కలతో మంచి దిగుబడి నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను నాణ్యమైన వాటిగా గుర్తించాకే కొనుగోలు చేయాలని ఉద్యానవన అధికారులు సూచిస్తున్నారు. మేలురకం మొక్కల సాగుతోనే మంచి దిగుబడి సాధించవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. కూరగాయల పండించే రైతులు మంచిదిగుబడితో నిత్యం ఆదాయం పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నర్సరీల్లో మొక్కలు పెంచే నిర్వాహకులు ఆరోగ్యవంతమైన నారునే (చీడ,పీడలు, తెగుళ్లను తట్టుకునేలా)అందించాలంటున్నారు. పెరటితోటల పెంపకంపై ఆసక్తి కొందరు తమ ఇంటి ఆవరణలోని కొద్దిపాటి ఖాళీస్థలంలో కూరగాయల మొక్కలను పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. టమాట, వంకాయ, చిక్కుడు, దొండ, కాకర, బీర లాంటి కూరగాయల మొక్కలను నాటి ఇంటి అవసరాలను తీర్చుకునేలా ప్రణాళిక చేసుకుంటున్నారు. స్థల లభ్యతను బట్టి మొక్కల సంఖ్యను నిర్ధారించుకుంటున్నారు. దీంతో ఇంట్లోనే తాజా కూరగాయలను పొందేందుకు అవకాశముంటుందని పేర్కొంటున్నారు. నర్సరీ నిర్వహణకు లైసెన్స్ తప్పనిసరి నర్సరీలను నిర్వహించే వారు తప్పనిసరిగా అధికారుల నుంచి లైసెన్స్ తప్పనిసరిగా పొందాలి. ఏటా రెన్యూవల్ చేసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే నిర్వాహకులపై తెలంగాణ నర్సరీల నమోదు చట్టం – 2017 ప్రకారం నిబంధనలు పాటించాలని, ఉల్లంఘించినట్టు గుర్తిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వివరాలు నమోదు చేయాలి నర్సరీల్లో మొక్కల పెంపకానికి అవసరమైన విత్తన కొనుగోలు, నారు ఉత్పత్తి, నిల్వలు, విక్రయాలు తదితర వివరాలను తప్పనిసరిగా రిజిష్టర్లలో నమోదు చేయాలి. రైతులకు విక్రయించే సమయంలో రసీదు ఇవ్వాలి. నర్సరీల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఉండాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్వాహకు లను అధికారులు హెచ్చరిస్తున్నారు. కూరగాయల మొక్కలకు భలే గిరాకీ పెరటితోటల పెంపకంపై ఆసక్తి -
హెచ్ఎంఎస్కు మద్దతు ఇవ్వండి
యైటింక్లయిన్కాలనీ: సింగరేణి కార్మికుల హక్కుల సాధన, సౌకర్యాల కల్పనకు హెచ్ఎంఎస్కు సంపూ ర్ణ మద్దతు ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత కోరారు. బా యిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం సిగరేని ఆర్జీ–2ఏరియా ఓసీపీ–3 బేస్ వర్క్షాప్లో హెచ్ఎంఎస్ నాయకులతో కలిసి కార్మికులతో స మావేశమయ్యాడారు. కవిత మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో ప్రస్తుతం యువకార్మికుల సంఖ్య అ త్యధికంగా ఉందన్నారు. వారిపిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు యాజమాన్యం సీబీఎస్ఈ పాఠశాలలను సంస్థ వ్యాప్తంగా ప్రారంభించాలని కోరారు. ఇందులో శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని అన్నారు. ఈకార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్, టీఆర్ఎస్ నాయ కులు తదితరులు పాల్గొన్నారు. నేడు పెద్దపల్లి నియోజకవర్గంలో పర్యటన పెద్దపల్లి: తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం నియోజవర్గంలో పర్యటిస్తారని, ఈసందర్భంగా జెండా పండుగ నిర్వహిస్తారని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి సలేంద్ర కొ మరయ్య యాదవ్ తెలిపారు. తొలుత జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తారని, అనంతరం వ్యాపారులతో సమావేశమవుతారని, జెండా చౌరస్తాలో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించి మాట్లాడుతారన్నారు. అక్కడి నుంచి పెద్దకల్వల బస్టాండ్ చౌరస్తాకు చేరుకుని జెండా ఆవిష్కరించాక ధూళికట్టకు బయలుదేరి వెళ్తారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ నేత కవిత -
జీజీహెచ్ అభివృద్ధికి సహకారం
కోల్సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) అభివృద్ధికి సహకరించడంతోపాటు స మస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రామగుండం మేయర్ మహం కాళి స్వామి హామీ ఇచ్చారు. గురువారం జీజీహెచ్ను సందర్శించారు. మెడికల్ సూపరింటెండెంట్ హిమబిందుసింగ్, ఆర్ఎంవో కృపాబాయి స్వాగతం పలికి నోటు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. తరచూ విద్యుత్ సమస్య తలెత్తుతుందని వైద్యాధికారులు మేయర్ దృష్టికి తీసుకురాగా, ఎన్పీడీసీఎల్ అధికారులతో ఫోన్లో మాట్లాడి చర్య తీసుకోవాలన్నారు. శారదానగర్ వాటర్ట్యాంక్ నుంచి సరఫరా చేస్తున్న తాగునీటి పైప్లైన్ వాల్వ్ ను జీజీహెచ్లో ఏర్పాటు చేయాలని కోరగా, ఇంజినీర్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇ చ్చారు. ఎమర్జెన్సీలోని వైద్యులు, సిబ్బంది ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరుకార్పొరేటర్ల భర్తలను ఆస్పత్రికి తీసుకొచ్చిన సందర్భంలో, వైద్యులు అప్రమత్తంగా లేకపోవడాన్ని గమనించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధుల విషయంలోనే ఇలాంటి నిర్లక్ష్యా న్ని వ్యవహరిస్తున్న వైద్యులు, సామాన్య పేదప్రజల విషయంలో ఇంకెత నిర్లక్ష్యం వహిస్తున్నారోనని ఆ వేదన వ్యక్తం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న కార్పొరేటర్ కంకణాల మౌనిక భర్త రాజును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ గట్ల రమేశ్, యుగంధర్, డాక్టర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటువ్యాధులపై అప్రమత్తం ప్రజలు అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండా లని మేయర్ మహంకాళి స్వామి సూచించారు. 46 వ డివిజన్ సంజయ్గాంధీనగర్లో వార్డుసందర్శన చేపట్టారు. మేయర్ మాట్లాడుతూ, వర్షాకాలం ప్రా రంభమైన నేపథ్యంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు, ఈగలు వృద్ధి చెందిని అంటువ్యాధులు విజృంభించే అవకాశం ఉందన్నారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధుల బారినపడి ఆస్పత్రుల చుట్టూ తిరగవలసి వస్తుందని అన్నారు. బహిరంగ ప్రదేశాలు, కాలువల్లో చెత్త వేయకుండా నగరపాలక సంస్థ వాహనాలకు అందించాలని కోరారు. శానిటేషన్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్తో రోడ్డుకు ఇరువైపులా పొదలు, చెట్లకొమ్మలు, రాళ్లు తొలగించారు. నాలా శుభ్రం చేశారు. కార్పొరేటర్లు, అధికారులు నవీన్, మీర్, శ్రీనివాస్, సంపత్, చంద్రారెడ్డి, మెప్మా సీవో ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రి సమస్యలు పరిష్కరిస్తాం రామగుండం నగర మేయర్ స్వామి -
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెంచాలి
యైటింక్లయిన్కాలనీ: ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు కార్మికులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆర్జీ–3 జీఎం మధుసూదన్ సూచించారు. ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్(ఓసీపీ)–1 బేస్ వర్క్షాప్లో గురువారం సింగరేణి అధికారులతో కలిసి జీఎం ఐదు ఎస్కార్ట్ యంత్రాలు ప్రారంభించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. ఉత్పాదకతపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇందుకు యంత్రాలు కూడా ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. గతంలో ఓసీపీ –వన్కు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించిన మంచి పేరు ఉందని గుర్తుచేశారు. దీనిని ఇలాగే కొనసాగించాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సింగరేణి ఏరియా ఇంజినీర్లు ఉదయ్, భాస్కర్, ఆర్పీరెడ్డి, ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్, గని మేనేజర్ పాపయ్య, అధికారులు రవీందర్రెడ్డి, యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆర్జీ–3 జీఎం మధుసూదన్ -
ఓపీ సేవల్లో రద్దీ నియంత్రించాలి
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆస్పత్రి లో ని పిల్లల ఓపీ సేవల్లో రద్దీ నియంత్రించి, మెరుగైన వైద్యసేవలు అందిచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆ దేశించారు. స్థానిక మాతా శిశు ఆస్పత్రి, బండారికుంట ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో పలు అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, పేషెంట్ల రద్దీకి అ నుగుణంగా వైద్యసేవలు విస్తృతం చేయాలన్నారు. విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా చూడాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందజేయాలని అన్నారు. మరోవైపు.. కలెక్టర్ తని ఖీ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖలోని డాక్టర్లు మొదలుకొని సిబ్బంది వరకూ ఎవరూ ఆఫ్రాన్ ధరించక పోవడం విస్మయాన్ని కలిగించింది. నాణ్యంగా అభివృద్ధి పనులు.. జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. పెండింగ్ బిల్లులపై సమగ్ర నివేదిక అందజేయాలనియ ఆయన సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ సందర్భంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రచార పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. మాదకద్రవ్యాల వ్యసనానికి గుౖ రెన వారికి సాయం అందించేందుకు 14446 నేష నల్ డీ అడిక్షన్ హెల్ప్లైన్ సేవలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డీసీహెచ్ఎస్ శ్రీధర్, ఆర్ఎంవో విజయ్, ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, పంచాయతీరాజ్ ఈ ఈ శంకరయ్య, ఆర్ అండ్ బీ ఈఈ భావ్సింగ్, కలెక్టరేట్ ఏవో ప్రకాశ్, జిల్లా సంక్షేమ అధికారి కాళిందిని, డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్, సూపరింటెండెంట్ రాజయ్య, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత, డీహెచ్ఈడబ్ల్యూ డీఎంసీ అరుణ, బ్లాక్ కోఆర్డినేటర్ హసీబ్, డీ అడిక్షన్ సెంటర్ కో ఆర్డినేటర్ శ్యామల, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
రయ్.. రయ్
సాక్షి పెద్దపల్లి : జిల్లాలో పాఠశాలలు, కళాశాలు ప్రారంభమయ్యాయి. స్కూల్ బస్సులు భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. కొన్ని యాజమాన్యాలు ఫిట్నెస్లేని బస్సులను రోడ్కెక్కిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల సమాచారం ప్రకారం జిల్లాలో మరో 57 బస్సులు సామర్థ్య పరీక్షలు పూర్తిచేయాల్సి ఉంది. ఈ విషయంలో కొన్నివిద్యాసంస్థలు ఆసక్తి చూపడంలేదనే విమర్శలు ఉన్నాయి. తాజా నిబంధనల ప్రకారం ఫిట్నెస్లేని వాహనం రోడ్డెక్కితే రోజూ రూ.50 చొప్పున అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయినా విద్యాసంస్థల్లో చలనం కనిపించడంలేదు. తనిఖీలు అంతంతే.. ఇతర వాహనాలకు సామర్థ్య పరీక్షలు ఏడాదిపాటు చెల్లుబాటువుతాయి. స్కూల్ బస్సుల విషయంలో ఎప్పుడు ఫిట్నెస్ టెస్ట్ చేయించినా.. ఏటా మే 25వ తేదీతోనే వాటి గడువు ముగుస్తుంది. అయినా చాలా విద్యా సంస్థల యాజమాన్యాలు పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయి. మరోపక్క విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే రవాణా, పోలీసు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టాలి. కానీ చాలా వరకు ఇది అమలుకావడం లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు.. జిల్లా సమాచారం ప్రైవేట్ పాఠశాలలు 173 ఫిట్నెస్ పూర్తయినవి 204 ఇంకా చేయాల్సినవి 57ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులను కుక్కితీసుకెళ్తున్న ఆటో ఇది. ఆర్టీసీ బస్సు సౌకర్యంలేని చాలాప్రైవేట్, ప్రభుత్వ మోడల్ స్కూళ్ల విద్యార్థులను పల్లెటూళ్ల నుంచి తరలించేందుకు ఆటోలే దిక్కు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు ఆటోడ్రైవర్లు పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్తోపాటు విద్యార్థులను ఇలా కుక్కితీసుకెళ్తున్న ఆటోలపైనా పోలీస్, రవాణా శాఖల అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. -
నన్నెందుకు అడ్డుకుంటున్నారు?
● సింగరేణి కార్మికులను కలుసుకునేందుకు వస్తే నిర్బంధమా? ● బాయిబాట కార్యక్రమంలో టీఆర్ఎస్ అధినేత కవిత కోల్సిటీ: సింగరేణి కార్మికులను కలిసేందుకు వస్తే గేట్లు మూసివేసి పోలీసులతో అడ్డుకోవడం దురదృష్టకరమని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధినేత కవిత విమర్శించారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం జీడీకే –11, సింగరేణి ఏరియా ఆస్పత్రిలో పర్యటించిన ఆమె.. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడు తూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు కూడా కార్మికులతో సమావేశాలు నిర్వహించలేదా అని ప్రశ్నించారు. గ్లౌస్లు, షూస్, యంత్రాలు, భద్రత సామగ్రి, తాగునీరు, గాలి వంటి కనీస సౌకర్యాలు కూడా అందించడం లేదని ఆరోపించారు. 20ఏళ్లుగా కార్మికుల కోసం పనిచేస్తున్నా తాను 20 ఏళ్లుగా సింగరేణి కార్మికులతో కలిసి పనిచేస్తున్నానని కవిత అన్నారు. డిపెండెంట్ ఉద్యోగా ల కోసం పోరాడి 19 వేల ఉద్యోగాలు రావడానికి కృషి చేశానని, మహిళలకు కూడా ఉద్యోగ అవకాశా లు కల్పించామని తెలిపారు. కార్మికుల హక్కుల కో సం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ పోరాటం చేస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి మరిన్ని బొగ్గు బ్లాకులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఓపెన్కాస్ట్ల కంటే అండర్గ్రౌండ్ మైనింగ్ వల్ల పర్యావరణ పరిరక్షణతోపాటు వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. సింగరేణి ఏరియా ఆస్పత్రిలో గాంధీ, ఉస్మానియా స్థాయి వైద్య సదుపాయాలు ఉండాలని కవిత అన్నారు. సింగరేణి కాలనీల్లో డ్రైనేజీ నీరు తాగునీటిలో కలుస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని కవిత ఆరోపించారు. రూ.20 కోట్లతో చేపట్టిన ర్యాపిడ్ ఫిల్టర్ బెడ్ పనులను కవిత పరిశీలించారు. ఆటోలో ప్రయాణం గోదావరిఖనిటౌన్: టీఆర్ఎస్ అధినేత కవిత ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ ఆటోలో సింగరేణి ఆస్పత్రి నుంచి హెచ్ఎంఎస్ కార్యాల యం వరకు ప్రయాణించారు. ఆటోడ్రైవర్ల సమస్యల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. -
గురువులకు వందనం
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026విద్యార్థులను బైక్పై తీసుకెళ్తున్న ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ఇల్లంతకుంట(మానకొండూర్): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం తంగళ్లపల్లి శ్రీనివాస్ కృషి ఫలించి.. 35 మంది ఉన్న స్కూల్ ప్రస్తుతం సంఖ్య 70కి చేరింది. 2024 నుంచి సిరికొండలో హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ పాఠశాలకు హాజరుకాని విద్యార్థులకు ఇళ్లకు వెళ్లి మరీ తన బైక్పై తీసుకొస్తున్నారు. ప్రస్తుతం స్కూల్లో హెచ్ఎంతోపాటు డిప్యూటేషన్పై ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు, ఒక ఎస్జీటీ పనిచేస్తున్నారు. వంద శాతం హాజరు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలకు రాని విద్యార్థుల లిస్ట్ తీసుకొని ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి తన బైక్పై స్కూల్కు తీసుకొస్తారు. గ్రామస్తుల సహకారంతో ఇద్దరు విద్యావలంటీర్లను ఏర్పాటు చేసుకున్నారు. దాతల సహాయంతో తాగునీటి వసతి, సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నారు. సమీపంలోని తెనుగువారిపల్లి, మేళ్లచెరువు గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలకు వస్తుంటారు.విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో పయణించేలా మార్గదర్శనం చేసే గురువులకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది. బోధనను ఉద్యోగంగా కాకుండా సేవగా గుర్తించి ముందుకెళ్తున్నారు జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు. కొందరు నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు కొనిచ్చి ఇస్తుంటే.. మరికొందరు ఇంటింటికి వెళ్లి తమ బైక్, ఆటోలపై పిల్లలను స్కూల్కు తరలిస్తున్నారు. గ్రామస్తుల పిల్లలనే కాదు తమ పిల్లలను కూడా సర్కారు బడిలోనే చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వారు మరికొందరు. ఇలా ప్రభుత్వ బడి బాగుపడడంలో తమవంతు పాత్ర పోషిస్తున్న గురువులపై ప్రత్యేక కథనం. -
ఆశల విత్తనం
రోహిణి కార్తె ప్రవేశంతోనే వానాకాలం సీజన్ ఆరంభమైనట్లు రైతులు భావిస్తారు. ప్రస్తుతం మృగశిర కార్తెలో సగం కాలం గడిచిపోయింది. ఈ రెండు కార్తెల్లో అడపాదడపా కురిసిన మోస్తరు వర్షాలతో నేల కాస్త తడిచినా.. ఎండల తీవ్రతతో ఎప్పటిలాగే పొడిగా మారిపోయింది. అయినా, అన్నదాతలు వానదేవుడిని నమ్ముకుని చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు, బోర్ల ఆధారంగా పత్తి విత్తనాలు చల్లుతున్నారు. కొందరు వరినారు పోస్తున్నారు. పలు గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో పనులు చేస్తున్న రైతుల దృశ్యాలు ఇవి.. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
బహింగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా
● రామగుండం మేయర్ మహంకాళి స్వామి కోల్సిటీ: బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, కాలువల్లో చెత్త వేస్తే భారీ జరిమానా విధిస్తామని రామగుండం మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. 46వ డివిజన్ ఇందిరానగర్లో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కమిషనర్ అరుణశ్రీతో కలిసి బుధవారం ఆయన వార్డుపర్యటన చేపట్టారు. ఆర్ఎఫ్సీఎల్ నుంచి వెలువడే నీరు స్థానికుల ఇళ్లలోకి చేరుతోందని, వర్షాకాలంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుందని, దీని నివారణకు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. స్థానిక ఒక మద్యం దుకాణం ఎదుట రోడ్డుపై నిర్మించిన ఆక్రమణలను తొలగించారు. ఖాళీ సీసాలను కాలువలో పడవేసిన దుకాణ యజమానికి జరిమానా విధిస్తూ నోటీసు జారీ చే యాలని కమిషనర్ ఆదేశించారు. కార్పొరేటర్లు దా సరి సాంబమూర్తి, చిదురాల నాగరాజు, వడ్లూరి రవి, టీపీఎస్ నవీన్, ఏఈ మనోజ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, మెప్మా సీవో ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీబాట ఫెర్టిలైజర్సిటీ: చిన్నారుల ఉజ్వల భవిష్యత్కు అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. 23వ డివిజన్ చైతన్యపురికాలనీలో అంగన్వాడీ బడిబాట నిర్వహించారు. కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేటర్ కన్నూరి భాగ్యలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త శైలజ పాల్గొన్నారు. -
త్రిలింగేశ్వరస్వామి దర్శనం
గోదావరిఖనిటౌన్: జనగామ త్రిలింగేశ్వరస్వా మిని సమాచార హక్కు కమిషన్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, కమిషనర్లు బుధవారం దర్శించుకున్నారు. కార్పొరేటర్ తోకల శ్యామని, కమిష నర్లు పర్వీన్, కుమార్, భూపాల్, పీవీ శ్రీనివాసరావు, అయోధ్యరెడ్డి తదితరులు ఉన్నారు. సింగరేణి అధికారుల నిరసనకోల్సిటీ: తమ సమస్యలు పరిష్కరించాలనే డి మాండ్తో సింగరేణి అధికారులు బుధవారం ెగోదావరిఖనిలో భారీనిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్జీ–1, 2, 3, భూపాలపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్ డివిజన్ల అధికారులు హాజరయ్యారు. అఖిల భారత బొగ్గు గనుల అ ధికారుల సంఘం(సీఎంవోఏఐ) నాయకులు తాళ్లపల్లి లక్ష్మీపతిగౌడ్, పెద్ది నర్సింహులు, పొ నుగోటి శ్రీనివాస్ మాట్లాడుతూ, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే(పీఆర్పీ)ని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)లో మాదిరిగా సింగరేణి సంస్థలోనూ అమలు చేయాలన్నారు. కార్మికుల సమస్యలపై సమీక్ష జ్యోతినగర్: ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై బుధవారం స్థానిక పరిపాలన భవనంలో కాంట్రాక్టర్లు, ఎన్టీపీసీ హెచ్ఆర్ అధికారులతో కార్మిక సంఘం జాతీయ నేత బాబర్సలీంపాషా చర్చలు జరిపారు. వివిధ యూనియన్ల నాయకులు భూమల్ల చందర్, లక్ష్మారెడ్డి, ఇజ్జగిరి భూమయ్య, రాజమల్లు, బుచ్చన్న, ఆలేటి శ్రీనివాస్, చింతల సత్యం, అలుగొండ అనిల్, లక్ష్మణ్ హాజరయ్యారు. రామయ్య చిరస్మరణీయులు మంథని: కవిత్వం, సాహిత్యం ద్వారా ప్రజల ను చైతన్యపరిచిన ప్రజాకవి రావికంటి రామ య్యగుప్తా కీర్తి అజరామరమని మున్సిపల్ చై ర్మన్ వొడ్నాల శ్రీనివాస్ అన్నారు. మంత్రకూట వేమన, ప్రజాకవి రావికంటి రామయ్యగుప్తా జయంతిని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బు ధవారం నిర్వహించారు. రామయ్య కుమారు డు రావికంటి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మ న్ ముస్కుల సహేందర్రెడ్డి, మంథని విద్యార్ధి యువత అధ్యక్షుడు కొండెల మారుతి, నాయ కులు రామడుగు మారుతి, శశిభూషన్కాచే, వి జయ్కుమార్, ఎల్లంకి వంశీధర్ పాల్గొన్నారు. సరిపడా యూరియా నిల్వలు పెద్దపల్లి: వానాకాలం సీజన్కు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ కో య శ్రీహర్ష తెలిపారు. యాప్ ద్వారా బుక్చేసుకునే రైతులకు 18,750 మెట్రిక్ టన్నుల యూ రియా పంపిణీకి సిద్ధం చేశామన్నారు. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో యూరియా బుకింగ్ యాప్ను తాత్కాలికంగా నిలిపివేశామని, మరోరెండు లేదా మూడురోజుల్లో పునరుద్ధరిస్తామన్నారు. బాలసదన్లో ప్రవేశాలు పెద్దపల్లి: మహిళా, శిశు సంక్షేమ శాఖ సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలో నిర్వహిస్తున్న బాలసదన్ చిల్డ్రెన్ హోమ్ ఫర్ బాలికలులో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ ఇన్చార్జి అధికారి కాళిందిని తెలిపారు. వివరాల కోసం 63003 98362 నంబరులో సంప్రదించాలని కాళిందిని కోరారు. రూ.5.25 కోట్లతో అభివృద్ధి మంథని: నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రూ.5.25 కోట్లు మంజూరైనట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ప్రకటించింది. మంథనికి రూ.2.55 కోట్లు, ముత్తారానికి రూ.80లక్షలు, రామగిరికి రూ.90లక్షలు, కమాన్పూర్కు రూ.60లక్షలు, పాలకుర్తికి రూ.20లక్షలు మంజూరైనట్లు కార్యాలయ ప్రకటన వివరించింది. ‘సర్’పై బీఎల్వోలకు శిక్షణ పెద్దపల్లిరూరల్: స్థానిక అమర్చంద్ కల్యాణమండపంలో బుధవారం పోలింగ్బూత్స్థాయి అధికారులు, సూపర్వైజర్లకు ‘సర్ౖ’పె అవగాహ కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి హాజరై సర్పై అనుసరించాల్సిన పద్ధతుల గురించి వివరించారు. ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ రాజయ్య, ఆర్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


