breaking news
Peddapalli District Latest News
-
విద్యుత్ షాక్తో రైతు మృతి
మెట్పల్లిరూరల్: విద్యుత్షాక్తో ఓ రైతు మృతి చెందినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట గ్రామానికి చెందిన సబ్బని గణేశ్ రైతు. పంటకు అడవి పందుల బెడద ఉందని బుధవారం రాత్రి సమయంలో పొలం వద్దకు కాపలా కోసమని అదే గ్రామానికి చెందిన వినోద్, సురేశ్ను వెంటబెట్టుకుని వెళ్లాడు. ఆ ప్రాంతంలో చీకటి ఉందని సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ లైట్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో విద్యుత్ షాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని వెంట ఉన్న వినోద్, సురేశ్ మెట్పల్లిలోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ప్రమాదమని తెలిసినా.. గణేశ్కు సహకరించిన వినోద్, సురేశ్పై మృతుడి భార్య లహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. 12 రోజుల్లో ఇద్దరు..రుద్రంగి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో విషజ్వరాలు ప్రబలు తున్నాయి. 12 రోజుల్లో ఇద్దరు విషజ్వరంతో మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషజ్వరం, రక్తకణాలు తగ్గిపోయి బోయిని రాములు అనే వ్యక్తి జనవరి 25న మృతిచెందగా విషజ్వరం, రక్తకణాలు పడిపోయి, జాండీస్తో కట్కూరి సంజీవ్(48) గురువారం మృతిచెందారు. ప్రభుత్వ వైద్యాధికారులు పరీక్షలు చేసి మరణాలకు గల కారణాలను తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంజీవ్ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి కరీంనగర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. సంజీవ్కు తల్లి లక్ష్మి, భార్య మంజూల, కొడుకులు వంశీ(25), సన్ని(19), శ్రావణ్(16) ఉన్నారు. గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ శివారు గోదావరినదిలో గురువారం గుర్తుతెలియని లభించినట్లు ఎస్సై వెంకటస్వామి పేర్కొన్నారు. మృతుడికి సుమారు 40 ఏళ్ల వయసు ఉంటుందని, ఆకు పచ్చ రంగు ఫుల్ టీ షర్ట్, దానిలో తెలుపు రంగు, లేత ఆకుపచ్చ జీన్స్ ప్యాంట్, కుడి చేతికి 3 స్టార్ టాటూస్, ఎడమ చేతికి టీ, ఎం, ఎన్ ఇంగ్లిష్ అక్షరాలను టాటూ వేయించుకున్నాడు. ఆచూకీ తెలిసినవారు 87126 56527 నంబర్కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. ఈనెల 2న గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యం కాగా రెండురోజుల వ్యవధిలో మరో మృతదేహం లభ్యమవడం చర్చనీయాంశంగా మారింది. -
తైబజార్ లేని మున్సిపాలిటీ జగిత్యాల
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీకి ప్రత్యేకత ఉంది. ఏ మున్సిపాలిటీలోనైనా తైబజార్ వసూలు చేస్తుంటారు. ఇక్కడ మాత్రం తైబజార్ వసూలు చేయరు. కూరగాయల వ్యాపారులైనా.. తోపుడు బండ్ల వ్యాపారులైనా.. రోడ్లపై చిన్నచిన్న వస్తువులను ఎవరైనా అమ్ముకోవచ్చు. ఇలాంటి వారికి తైబజార్ లేకపోవడం ఎంతో వెలుసుబాటు కలిగిస్తోంది. పైగా వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ మున్సిపాలిటీలో అప్పటి పాలకవర్గం రూ.200కే నల్లా కనెక్షన్ అమలు చేశారు. అప్పటినుంచి అదే అమలువుతోంది. ఏ మున్సిపాలిటిలోనైనా నల్లా కనెక్షన్ తీసుకోవాలంటే కొంతమొత్తం వసూలు చేస్తుంటారు. ఇక్కడ కేవలం రూ.200కే కనెక్షన్ ఇస్తున్నారు. రైతులు, వ్యాపారులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కొనసాగుతున్న రూ.200కే నల్లా కనెక్షన్ -
● శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు శ్రీధర్బాబు, వివేక్
రామన్నకు అశ్రునివాళిమంథని: అనారోగ్యంతో బాధపడుతూ రెండురోజుల క్రితం హైదరాబాద్లో మృతి చెందిన మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి(రామన్న)కి పార్టీలకు అతీతంగా అశ్రునివాళి అర్పించారు. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి మంథనికి రాంరెడ్డి భౌతికకాయం తీసుకువచ్చారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో పాటు పలువురు నివాళి అర్పించారు. గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, కార్మిక, మైనింగ్శాఖ మంత్రి గడ్డం వివేక్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నివాళి అర్పించారు. అనంతరం మంథని నుంచి పెద్ద ఎత్తున అంతిమ యాత్ర సాగగా ముత్తారం మండలం సీతంపేటలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. మంథనిలో కూరగాయల మార్కెట్, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. -
ముగ్గురు ముఖ్యుల ఓట్లు 30వ డివిజన్లోనే..
రామగుండం: రామగుండం నగరంలోని 30వ డివిజన్పైనే అందరి దృష్టి నెలకొంది. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ డివిజన్లో ముగ్గురు ముఖ్యులు అయోధ్యనగర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి కాగా, ఇటీవల అంతర్గాం మండల పరిధిలోకి తన ఓటును బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. కాగా దీని పక్కనున్న 28వ డివిజన్ అబాది రామగుండంలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పీసీసీ ప్రోటోకాల్ చైర్మన్, ఏఐసీసీ ప్రతినిధి హర్కర వేణుగోపాల్రావు ఓటరుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 30వ డివిజన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములు ముగ్గురు ముఖ్యుల ఆధిపత్యాన్ని స్పష్టం చేయనుందనే చర్చ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వేణుగోపాల్రావుకోలేటి దామోదర్కౌశికహరిమక్కాన్సింగ్ రామగుండంలో సర్వత్రా ఆసక్తికర చర్చ -
అభివృద్ధితో ప్రత్యేక గుర్తింపు
● అర్ధంతరంగా నిలిచిన పనులపై దృష్టిపెట్టాం ● మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు ● ‘సాక్షి’తో రామగుండం బల్దియా మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కోల్సిటీ(రామగుండం): రామగుండం మొదటి మున్సిపల్ చైర్మన్గా పలు అభివృద్ధి పనులు, సంస్కరణలు చేపట్టి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సోమారపు సత్యనారాయణ. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా పని చేశారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గెస్ట్ ఫాకల్టీగా ఐఏఎస్ హోదా కలిగిన అధికారులకు పాఠాలు బోధించగల విజ్ఞానం ఆయన సొంతం. ఇంజినీరింగ్తోపాటు ఎంబీఏ చదివిన ఆయన తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, మేనేజ్మెంట్ నైపుణ్యంతో చేపట్టిన పనులు మున్సిపల్ చైర్మన్ పదవికే వన్నె తెచ్చాయి. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న సత్యనారాయణను మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ పలకరించగా నాటి అనుభవాలు, విశేషాలను ఇలా పంచుకున్నారు. సోమారపు సత్యనారాయణ రామగుండం మొదటి చైర్మన్గా ఎన్నికైనప్పు డు ఉన్న పరిస్థితుల్లో మీ అనుభవం? పాలకవర్గం లేకపోవడంతో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఉన్న కాలంలో చైర్మన్గా ఎన్నికయ్యాను. సింగరేణి నీటి సరఫరా తప్ప మున్సిపల్ నీళ్లు లేవు. అక్కడక్కడా ఉన్న బోర్వెల్ నీరే ఆధారం. డ్రైనేజీ వ్యవస్థ, సరైన రోడ్లు కూడా లేవు. సింగరేణి స్థలాల్లో కట్టుకున్న ఇళ్లకు ఇంటి పన్ను లేకపోవడంతో నిధులు చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లారు..? ముందుగా నిధుల కొరత అధిగమించే ప్రయత్నం చేశాను. సింగరేణి స్థలాల్లో కట్టుకున్న ఇళ్లకు నంబర్లు ఇచ్చి నామమాత్రపు పన్ను విధించాం. దగ్గరున్న బ్యాంకుల్లో కట్టుకోవడానికి వీలుగా చలానాలు పంపిణీ చేశాం. ఆ రశీదుల కారణంగానే తర్వాత కాలంలో వారికి సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నిధులు పొందడానికి రామగుండంకు అర్హత ఉండగా, నాటి సీఎంను ఒప్పించి ముందుగానే నిధులు రాబట్టి అభివృద్ధి పనులు చేపట్టాం. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? తాగునీటి సరఫరాపై ముందు దృష్టిపెట్టాను. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా అర్ధాంతరంగా నిలిచిన పనులపై దృష్టిపెట్టి, హెడ్ వర్క్స్, ట్యాంకులు నిర్మించడంతో మున్సిపల్ నీటి సరఫరా ప్రారంభమైంది. ఆ తర్వాత 24 గంటల నీటి సరఫరా చేసి దేశం దృష్టిని ఆకర్షించేలా చేయగలిగాను. ఆ తర్వాత దేనిపై దృష్టి పెట్టారు? పారిశుధ్యం దృష్టి పెట్టాను. శానిటేషన్తో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో దేశంలోనే మొదటిసారిగా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం జరిగింది. చెత్త ఏరుకొని జీవించే వారిని గుర్తించి, వారికి పరుగు పందెం నిర్వహించి శారీరక సామథ్యం ఉన్నవారికి ఉచితంగా రిక్షాలు ఇచ్చి ఇంటింటా చెత్త సేకరించడం జరిగింది. అలాగే ఎడ్ల బండ్లతో చెత్త సేకరించే పారిశుధ్య కార్మికులకు ఆటోలు ఇచ్చాం. స్వశక్తి సంఘాలకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించి ట్రాక్టర్లు కొనుగోలు చేయించాం. వాటికి మున్సిపల్ నుంచి అద్దె చెల్లించడం ద్వారా ఒకపక్క ఉపాధి పొందడంతోపాటు మరో పక్క రుణం తీరిపోయి, వారే ఆ వాహనాలకు యజమానులయ్యారు. రోడ్లు, కాలువలను ఎలా అభివృద్ధి చేశారు? మున్సిపాలిటీలో నిధుల్లేవు, పబ్లిక్, ప్రయివేట్ పార్టీసిపేషన్ అంటే నగరపాలక సంస్థ, ప్రజల భాగస్వామ్యంతో 80: 20 ప్రాతిపదికన ఎవరూ ముందుకొస్తే అక్కడ రోడ్లు, కాలువలు నిర్మించాం. నా చొరవతో నాటి ముఖ్యమంత్రి డీఎఫ్ఐడీ నిధులు రామగుండంకు మంజూరు చేయడంతో రోడ్లు, కాలువలు వంటి అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం దొరికింది. వినూత్నంగా ఆలోచించి చేపట్టిన పనులేవి? పట్టణానికి తగినట్టుగా దేశంలోనే మొదటిసారిగా బేబీ డ్రెయిన్లతో కాలువల నిర్మాణం చేపట్టాం. డ్రై వెదర్ డ్రెయిన్, ఫెర్రో సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణం నా హయాంలో చేపట్టడం జరిగింది. అత్యంత మన్నికతో వేసిన సీసీ రోడ్లు కొన్ని చోట్ల ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మీటర్లు ఏర్పాటు చేసి వాడిన నీటికే బిల్లు తీసుకున్నాం. జనన, మరణ ధ్రు వీకరణ పత్రాలు కొరియర్ ద్వారా ఇంటికే పంపాం. పైరవీలకు తావు లేకుండా జరిగింది. కొత్త వెలుగు కోసం ఏం చర్యలు తీసుకున్నారు? చాలా మంది రిటైర్డ్ కార్మికులు ఇక్కడ సరైన వసతులు లేవని ఇతర ప్రాంతాలు, సొంత ఊళ్లకు వెళ్తున్న తరుణంలో అందరికీ అందుబాటులో ఉండేలా మున్సిపల్ కార్యాలయ భవనం, వినూత్న డిజైన్తో కొత్త కూరగాయల మార్కెట్ నిర్మించాను. ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ భవనానికి నిధులు మంజూరు చేయించి పునాది వేశాను. తాగునీటి సరఫరా, సెంట్రల్ లైటింగ్, ఇంటి ముందుకే చెత్త బండి రావడం తదితర సౌకర్యాలు సమకూరడంతో ఇళ్ల నిర్మాణం పెరిగింది. స్వశక్తి మహిళలకు సీఆర్సీ భవనం నిర్మించి, వారితో సూపర్ మార్కెట్లు పెట్టించాం. నేపాల్ నుంచి నిపుణులను రప్పించి టోపీలు కుట్టించే శిక్షణ ఇప్పించాను. మలుపు అనే పథకం ద్వారా వందల మందికి చెప్పులు కుట్టే శిక్షణ ఇప్పించాను. ఇలా అనేక ఉపాధి అవకాశాలు కల్పించాను. మీ పనులు ప్రభావితం చేశాయా? చేశాయి. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది స్టడీ టూర్లో భాగంగా రామగుండం సందర్శించారు. మున్సిపల్ విద్యుత్ బిల్లుల్లో రామగుండంకు రూ.25లక్షలు నేను రికవరీ చేసిన విధానం నచ్చి, అలాగే చేయాలని అన్ని మున్సిపాలిటీలకు నాటి ముఖ్యమంత్రి సర్క్యులర్ జారీ చేయించారు. రాగ్పిక్కర్ విధానం, 24 గంటల నీటి సరఫరా తీరును అనేక మంది పరిశీలించి వెళ్లారు. చైర్మన్గా గొప్పగా భావించేది ఏది? మురికివాడలను అభివృద్ధి చేయడం అన్నింటి కంటే ఎక్కువగా చెప్పుకోతగ్గది. నాడు రామగుండంలో 45 నోటిఫైడ్ 47 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ ఉండేవి. నేను చేపట్టిన పనులతో అవి ఇప్పుడు స్లమ్స్లా కనబడతలేవు. గుర్తింపు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అవార్డులకు ఎప్పుడూ నామినేషన్ వేయలేదు. కానీ, చేంజ్ మేనేజ్మెంట్ ఫోరంలో దేశంలో కేవలం ఇద్దరు మున్సిపల్ చైర్మన్లను ఎంపిక చేయగా, అందులో నేను ఒక్కడిని కావడం నాకు ఇచ్చిన పెద్ద గుర్తింపుగా భావిస్తున్న. ఏమైనా సలహాలు ఇస్తారా? ఎవరి ఐడియాలజీ వారికి ఉంటుంది. ఆ ఐడియాలజీ ప్రకారం పని చేసుకుంటూ పోతారు. -
పంచిన మద్యం సీసాలు వైన్స్షాపుల్లోకి..
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని ఓ వార్డులో ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ప్రతిరోజూ సాయంత్రం ముగ్గురు అభ్యర్థులు అడిగినవారికి లేదనకుండా మందు పంపిణీ చేస్తున్నారు. అయితే ముగ్గురు ఇచ్చిన మందును ఒకేరోజూ తాగలేకపోతున్నారు. దీంతో వారు కొత్త ఐడియాకు తెరతీశారు. ఒక అభ్యర్థి ఇచ్చిన మందును ఆ రోజు తాగి.. మిగిలిన అభ్యర్థులు ఇచ్చిన మందు బాటిళ్లను వైన్స్షాపులకు తీసుకెళ్లి ఇచ్చి నగదు తీసుకుంటున్నారు. ఇలా సమకూరిన డబ్బులను తలాకొంత పంచుకుంటుండడం విశేషం. ప్రచారంలో భాగంగా వచ్చిన మద్యం బాటిళ్లను ఇచ్చి డబ్బులు తీసుకెళ్లడంతో వైన్స్షాపు నిర్వాహకులు నివ్వెరపోతున్నారు. కండువాలు మారుతున్నాయ్.. కొందరు కార్యకర్తలు ఉదయం ఒకపార్టీకి.. మధ్యాహ్నం మరోపార్టీకి.. సాయంత్రం ఇంకో పార్టీకి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎప్పడికప్పుడు కండువాలు మారుస్తూ.. పోటీలో ఉన్న అభ్యర్థులను కంగారుపెడుతున్నారు. మహిళాసంఘాల సభ్యులైతే ఎవరు ప్రచారానికి రమ్మంటే వారివెంట వెళ్తున్నారు. అభ్యర్థులు కూడా కార్నర్ మీటింగ్లకు మహిళాసంఘాల సభ్యులను తరలిస్తున్నారు. వీరికి ఆయా పార్టీల వారు రూ.200 నుంచి రూ.300 వరకు ఇస్తున్నట్లు సమాచారం. పొద్దంతా మూడు పూటల మూడు పార్టీల ప్రచారంలో పాల్గొంటే ఎంత తక్కువనుకున్నా రూ.వెయ్యి వరకు గిట్టుబాటు అవుతోంది. కొంతమంది మహిళా సంఘాల ప్రతినిధులు బరిలో ఉన్న అభ్యర్థులకు ఫోన్ చేసి ‘మీరేమీ అనుకోవద్దు.. మేం మీకే ఓటు వేయిస్తాం..’ కేవలం డబ్బుల కోసం ఓ పూట ప్రచారానికి వెళుతున్నామని చెబుతుండడం గమనార్హం. బాటిళ్లు ఇచ్చి నగదు తీసుకుంటున్న వైనం ఒక్కోరోజు ఒక్కో అభ్యర్థి పంచిన మద్యం సేవనం మిగిలిన వారు ఇచ్చిన బాటిళ్లకు వచ్చిన డబ్బులు తలాకొంత -
జనరలైనా.. తగ్గేదే లే..
● ఆసక్తికరంగా 63వ డివిజన్ పోరు కరీంనగర్ కార్పొరేషన్: మహిళా రిజర్వేషన్కే ఆ నాయకురాళ్లు పరిమితం కాలేదు. జనరల్ అంటే పురుషులకు కేటాయించినట్లు కాదంటూ, తాము బరిలోకి దిగి ఆ మహిళలు పోరుకు సై అన్నారు. నగరంలోని 63వ డివిజన్ పోరు ఆసక్తికరంగా మారింది. డివిజన్ రిజర్వేషన్ బీసీ జనరల్ అయినప్పటికి మూడు ప్రధాన పార్టీల నుంచి అతివలే బరిలోకి దిగారు. మాజీ కార్పొరేటర్ గందె మాధవి బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ కర్రె పావని, బీజేపీ నుంచి దేశ శిల్ప పోటీపడుతున్నారు. డివిజన్ నుంచి మొత్తం నలుగురు పోటీలో ఉండగా.. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీసీ ఉద్యమ నేత కేశిపెద్ది శ్రీధర్రాజు బరిలో నిలిచారు. -
ఆరుగురు బంగారం దొంగలు, వ్యాపారి అరెస్ట్
మెట్పల్లి: మెట్పల్లి ప్రాంతంలో పలు దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు నిందితులు.. వారు తెచ్చిన సొత్తును కొనుగోలు చేసిన వ్యాపారిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో మెట్పల్లి ప్రాంతంలో ఆరుచోట్ల దొంగతనాలు జరిగాయి. మెట్పల్లి శివారులో వన్నెల గంగుపై పట్టపగలే దాడి చేసి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. ఇలా వరుస దొంగతనాలు జరగడాన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు.. నిందితుల కోసం డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో సీఐ అనిల్కుమార్, ఎస్సైలు కిరణ్కుమార్, అనిల్, నవీన్తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మెట్పల్లి, నిజామాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్ట నిందితులను గుర్తించారు. అప్పటినుంచి వారి కోసం గాలిస్తుండగా గురువారం మెట్పల్లిలోని కొత్త బస్టాండ్ వద్ద పండుగ రమేశ్, పల్లెపు రమేశ్ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా వారు ఇచ్చిన సమాచారంతో మరో నలుగురు నిందితులు గుంజె గంగాధర్, గంగమణి, గైని కిరణ్, పెద్దూరు మల్లేశ్వరితోపాటు దొంగ సొత్తును కొనుగోలు చేస్తున్న వ్యాపారి ఇందూరి రాకేశ్ను అరెస్ట్ చేశారు. వీరందరి నుంచి 15 తులాల బంగారు, 32తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగవంతంగా చేధించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైతో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. నిందితులపై అనేక కేసులు అరెస్టయిన నిందితుల్లో నలుగురిపై గతంలో పలు స్టేషన్లలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కిరణ్పై 35, పండుగ రమేశ్పై 23, గంగాధర్పై 16, పల్లెపు రమేశ్పై 13 కేసులున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ అశోక్కుమార్ -
రూ.200 పుచ్చుకో... జెండా పట్టుకో !
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ, పొలిమేర గ్రామాల్లోని మహిళలకు ఉపాధి పుష్కలంగా లభిస్తుంది. నామినేషన్లపర్వం ముగిసిపోయి బుధవారం నుంచి ప్రచారం ప్రారంభమైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో తన వెంట ఎక్కువ మంది కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. స్థానిక మహిళలతోపాటు పొరుగున్న ఉన్న పల్లెల నుంచి రూ.200 చొప్పున కూలీ చెల్లించి తమ వెంట ప్రచారానికి తెచ్చుకుంటున్నారు. వారు జెండా పట్టుకొని అభ్యర్థులు వెనుక ఉంటూ.. ‘.. మన అన్నకే ఓటేయాలి’, ‘అన్న గెలుపుతోనే వార్డు అభివృద్ధి’ అంటూ నినాదాలు చేయా లి. వీరు వచ్చిపోయేందుకు ఆటోలు పెడుతున్నారు. ప్రచారానికి వచ్చిన వారికి అభ్యర్థి ఇంటి వద్ద లేదా తన వార్డు ఆఫీస్ వద్ద భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. పురుషులు ప్రచారానికి వస్తే అదనంగా మందు ఖర్చు చేస్తున్నారు. దీంతో పట్టణంలోని చికెన్, మటన్ సెంటర్ల వద్ద గిరాకీ పెరిగింది. సాధారణ రోజులతో పోల్చితే ఇప్పుడు బిర్యానీ ఆర్డర్లు రెట్టింపయ్యాయని బిర్యానీ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. -
ఇంటికొస్తున్నామని.. అంతలోనే దూరమై
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి ● ఎదురెదురుగా వాహనాలు ఢీకొని దుర్మరణం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరామని ఫోన్లో చెప్పిన ఇద్దరు యువకులు.. అంతలోనే ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లి– తారుపల్లి గ్రామాల మధ్యలో క్రాస్ రోడ్డు వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఓదెల మండల పొత్కపల్లికి చెందిన పచ్చిక నాగఫణీందర్రెడ్డి(28) పెద్దరాతుపల్లిలో సోలార్ ప్లాంట్లో టెక్నీషియన్గా పని చేస్తుండగా, పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన బొజ్జం సురేశ్(27)వ్యవసాయం చేస్తాడు. ఫణీందర్రెడ్డి విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తుండగా, సురేశ్ కాల్వశ్రీరాంపూర్ నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తూ ఇద్దరూ ఎదురెదురుగా ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు పేర్కొన్నారు. కాగా సురేశ్కు వివాహం జరిగి ఏడాది కూడా దాటలేదు. ఫణీందర్రెడ్డికి ఏడాదిన్నర క్రితం వివాహం అయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇద్దరు యువకుల మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నమ్మి మోసపోతే.. గోసపడక తప్పదు
మంథని: గత ప్రభుత్వంలో మంథనిలో జరిగిన అ భివృద్ధిని చూసి మరింత ప్రగతి సాధనకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నుకోవాలని మంథని మాజీ ఎ మ్మెల్యే పుట్ట మధు కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా గురువారం మున్సిపల్ పరిఽ దిలోని 2వ వార్డులో ఎరుకల గూడెం, ముత్యాలమ్మ వాడ, 3వ అంబేడ్కర్ నగర్లో ఆయన అభ్యర్థులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పట్టణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశామని, అలాగే మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా, ము న్సిపల్ చైర్పర్సన్గా పుట్ట శైలజ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
నువ్వక్కడ.. నేనిక్కడ!
● బల్దియా బరిలో భార్యాభర్తలు కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచేందుకు భార్యభర్తలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వేర్వేరు డివిజన్లలో భార్యాభర్తలు పోటీచేసి గెలుపొందిన సంఘటనలు గతంలో ఉండగా, ఈ సారి నగరంలో మూడు జంటలు బల్దియా పోరులో నిలిచాయి. బీఆర్ఎస్ నుంచి 47వ డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, ఆమె భర్త బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ 21వ డివిజన్ నుంచి పోటీచేస్తున్నారు. 58వ డివిజన్ నుంచి దుడ్డెల శ్రీధర్, 57వ డివిజన్ నుంచి ఆయన భార్య దుడ్డెల మంజుల పోటీకి దిగారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన వీరు, దక్కకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. 46వ డివిజన్ నుంచి మాజీ కౌన్సిలర్ వరాల నారాయణ, 13వ డివిజన్ నుంచి ఆయన భార్య వరాల అనసూయ స్వతంత్రులు పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికి, రాకపోవడంతో స్వతంత్రులుగా పోటీలో నిలిచారు. -
గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
రామగుండం/గోదావరిఖనిటౌన్: రాబోయే ఏడాదిలో నిర్వహించే గోదావరినది పుష్కరాలను పురస్కరించుకొని గురువారం అంతర్గాం మండలం గోలివాడ, గోదావరిఖని వద్ద నది ప్రాంతాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. పుష్కర సమయంలో 30వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారనే అంచనాతో పుష్కర ఘాట్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు నిర్ణయించారు. ఆర్డీవో బి.గంగయ్య, సురేశ్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, సర్పంచ్ కొలిపాక చంద్రారెడ్డి, జాతర కమిటీ చైర్మన్ గీట్ల శంకర్రెడ్డి తదితరులున్నారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించాలి పెద్దపల్లి: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లాలోని 90 అంగన్వాడీ కేంద్రాల మరమ్మతుకు రూ.2 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామని, వాటిని సద్వినియోగం చేయాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు వచ్చి ఒకపూట భోజనం తీసుకునేలా చూడాలన్నారు. కేంద్రం నుంచి అందించే ఆహారపదార్థాల నాణ్యతను రెగ్యులర్గా చెక్ చేయాలని పేర్కొన్నారు. ప్రతీవారం అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్ల పనితీరును పరిశీలిస్తానని తెలిపారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు పక్కా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో మా ట్లాడారు. గత పుష్కరాల్లో ఎదురైన అనుభవా లను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్నారు. అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవో గంగయ్య, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్రావు, సురేశ్, సీడీపీవోలు అలేఖ్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్ నివారణపై అవగాహన ఉండాలి
పెద్దపల్లి: క్యాన్సర్పై అవగాహన ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ సూచించిన క్యాన్సర్ నివారణ చర్యలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని, వాటిని ఆచరించి కుటుంబ సభ్యులకు కూడా తెలుపాలని సూచించారు. బాలికలు, మహిళలు ప్రతి నెల స్వయంగా బ్రెస్ట్ స్క్రీనింగ్ చేసుకోవాలని, ఏవైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలన్నారు. వ్యాయామం, యోగా సాధన నిత్యజీవితంలో భాగం చేసుకోవాలన్నారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ మాట్లాడుతూ, క్యాన్సర్కు ప్రధాన కారణాలైన పొగాకు ఉత్పత్తులు, మద్యం తాగడం మానుకోవాలన్నారు. సెల్ఫోన్ వినియోగం తగ్గించి, హెపటైటిస్–బి, హెచ్పీవీ టీకాలు వేయించుకోవాలని తెలిపారు. ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో మొదటిసారి కీమోథెరపీ చేయించుకున్న రోగులకు తదుపరి కీమోథెరపీ చికిత్స అందించేందుకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, రామగుండంలో 10 పడకలతో క్యాన్సర్ కేర్ వార్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అకస్మాత్తుగా బరువుతగ్గడం, ఎడతెగని దగ్గు, కంతులు పెరగడం, దగ్గినప్పుడు లేదా విసర్జన సమయంలో రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని సూచించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి, డాక్టర్లు రాజమౌళి, లక్ష్మీభవాని, ఎన్.శ్రీనివాస్, ఎం.బాలకృష్ణ, కె.సంకీర్తన, ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
గోదావరిఖని(రామగుండం): కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. గురువారం రాత్రి స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలో కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా 9, 10, 37, 38, 39, 47,48,49, 50 డివిజన్ల ప్రజలతో మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి ఈప్రాంతానికి మరిన్ని నిధులు తీసుకవచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ జెండా ఎగరాలి
సాక్షిప్రతినిధి, కరీంనగర్/చొప్పదండి: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని బల్దియాలపై కాంగ్రెస్ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతిబాట బహిరంగ సభకు హాజ రై కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహాన్ని నింపారు. ముందుగా రామడుగు మండలంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ), గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగు దత్తోజీపేటలో సోలార్ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజ లు పెద్ద ఎత్తున హాజరు కాగా.. ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్తేజన్ని నింపింది. పట్టం కట్టి.. పనులు చేయించుకోండి సభా వేదికపైకి వచ్చిన సీఎం రేవంత్ బీజేపీ– బీఆర్ఎస్ బంధంపై నిప్పులు చెరిగారు. రెండేళ్ల వ్యవధిలో తాము చేసిన అభివృద్ధిని వివరించా రు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కరీంనగర్ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు సుమారు రూ.2,778 కోట్లు ఇచ్చామన్నారు. రామగుండానికి రూ.586 కోట్లు, కరీంనగర్ కార్పొరేషన్కు రూ.1,489 కోట్లు, చొప్పదండి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు ఇచ్చామన్నా రు. ఇవన్ని పనులు జరగాల్సి ఉందని, కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టి, గెలిపించి పనులు పూర్తి చేయించుకోవాలని కోరారు. ఏప్రిల్లో రెండో విడు త ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ పట్టణంలోని యావర్ రోడ్డును విస్తరించాలని సీఎంను కోరారు. చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం రెండు పేజీల సమస్యలు ఇచ్చారని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ● మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. సుదీర్ఘంగా పట్టి పీడిస్తున్న రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపా రు. రాహుల్ గాంధీ, పార్టీ సూచనతో రాష్ట్రంలో కులగణన చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నా రు. మనల్ని చూసి కేంద్రం కులగణనకు తల వంచిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ పట్టం కట్టాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కేబుల్ బ్రిడ్జి, రింగురోడ్డు, రివర్ ఫ్రంట్, డ్రైనేజీ పనులు పూర్తి చేయిస్తామన్నారు. ● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పిల్లల్లో నైపుణ్యం పెంచాలని సీఎంను కోరడం ద్వారా ఏటీసీ మంజూరైందన్నారు. డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే సీఎం సహకారంతో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణాల్లోని బంధువులకు చెప్పి ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ● మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది సీట్లలో ప్రజలు గెలిపించారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న పవన్ కల్యాణ్తో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల మధ్యకు వస్తోందన్నారు. ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం, ధర్మపురి లక్ష్మి నృసింహస్వామి ఆలయాలను అభివద్ధి చేయాలని కోరారు. రాబోయే గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు సౌకర్యాలు కల్పించాలన్నారు. యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి నాయకత్వంలో తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందన్నారు. సీఎం కాగానే రూ.240 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేశారని, గంగాధరలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులతో పాటు, పోస్టులు మంజూరు చేశారన్నారు. కొండగట్టుకు ఇటీవలే టీటీడీ ద్వారా రూ.35 కోట్లు ఇచ్చారని, మన ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరారు. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రాజ్ఠాకూర్, విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు భరోసా
గోదావరిఖని(రామగుండం): మహిళల భద్రతకు భరోసాగా షీటీంలు నిలుస్తున్నాయని, నిర్భయంగా మహిళలు ఫిర్యాదు చేయవచ్చని రామగుండం సీపీ అంబర్కిషోర్ఝా కోరారు. వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జోన్లో ఒక షీ టీం పనిచేస్తోందని, 63039 23700 వాట్సాప్, 87126 59386 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని, డయల్ 100కు కాల్ చేయవచ్చన్నారు. జనవరిలో షీటీంలకు 56 ఫిర్యాదులు అందా యని, వాటిలో 13 ఫిర్యాదులపై ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, 8 పెట్టీ కేసులు, నలుగురికి కౌన్సెలింగ్ నిర్వహించామని పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుగోదావరిఖని(రామగుండం): సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి ఆదేశించారు. గురువారం రాత్రి గోదావరిఖని వన్టౌన్ పరిధిలోని పవర్హౌస్కాలనీ, సప్తగిరికాలనీ, గంగానగర్, జీఎంకాలనీ, విద్యానగర్, రాంనగర్, తదితర సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏసీపీ రమేశ్తో పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సీఐ ఇంద్రసేనారెడ్డి, తదితరులున్నారు. ఎన్నికల నియమావళిపై అవగాహనపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపాలిటీ వార్డు స్థానాలకు పోటీపడుతున్న అభ్యర్థులకు గురువారం ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. 36 వార్డులకు 157మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం అనుసరించాల్సిన పద్ధతులపై పరిశీలకులు పద్మజరాణి, సుజాత వివరించారు. కమిషనర్ వెంకటేశ్, టీపీవో నరేశ్, వినయ్కిరణ్, మాస్టర్ ట్రేనర్ కృష్ణారెడ్డి, ఏవో నాగవేణి తదితరులున్నారు. ఓటర్లకు స్లిప్పులు అందించాలిజ్యోతినగర్(రామగుండం): రామగుండం కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో ఓటర్లకు స్లిప్పులు అందించాలని కమిషనర్ జె. అరుణశ్రీ అన్నారు. గురువారం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లోని కాకతీయ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటరు స్లిప్పు పంపిణీ చేసినప్పుడు పోలింగ్ కేంద్రం చిరునామా తెలియజేయాలని సూచించారు. విధుల్లో ఉన్న సిబ్బంది మాత్రమే ఇళ్లకు వెళ్లి స్లిప్పులు పంపిణీ చేయాలని, ఇతరులకు ఇవ్వరాదని ఆదేశించారు. ఎన్నికల పరిశీలకులు పద్మజారాణి, సుజాత, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంఈవో మల్లేశం, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, ట్రైనర్లు పాల్గొన్నారు. డీఎల్పీవో విచారణపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం అప్పన్నపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై గురువారం డీఎల్పీవో దేవకీదేవి విచారణ జరిపారు. మాజీ ఉపసర్పంచ్ చీకటి పోచాలు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.6లక్షల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై మాజీ కార్యదర్శి శ్రీనివాస్, ప్రస్తుత కార్యదర్శి శ్రీలతతో పాటు పలువురిని డీఎల్పీవో విచారించారు. ఇరువర్గాల వాదనలు విన్న సంబందిత రికార్డులు తెప్పించాలన్నారు. అయితే విచారణ సమయంలో అవసరమైన రికార్డులు అందుబాటులో లేకపోవడంతో నాలుగురోజుల్లో సిద్ధంగా ఉంచాలని డీఎల్పీవో ఆదేశించారు. -
అభివృద్ధిని చూసి ఓటెయ్యండి
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడుతోందని, అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని 23,4వ వార్డులో తాడూరి శ్రీమాన్, కొమ్ము సుధాకర్, సుల్తానాబాద్లోని 4, 11,12,13,14,15వ వార్డుల్లో బిరుదు రాధాకృష్ణ, కల్వల అంజలి, దున్నపోతుల లలిత, సిద్ధ తిరుపతి, వేగోళం పద్మ, గాదాసు మంజులకు మద్దతుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కె ట్ కమిటీ చైర్మన్ ప్రకాష్రావు, ముడుసు సాంబిరెడ్డి, రమేశ్, సునిత, రాజేందర్ పాల్గొన్నారు. -
హామీలు అమలు చేస్తున్నాం
మంథని: ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. గురువారం మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్పేట, ముత్యాలమ్మ వీధి, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేయడం ఏంటని ప్రశ్నించారు. మంథని మున్సిపాలిటీ అభివృద్దికి రూ.40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు పలకాలని కో రారు. కార్యక్రమంలో వొడ్నాల శ్రీనివాస్, ముస్కుల సహేందర్రెడ్డి, పోలు శివ, సీపతి బానయ్య, నూకల కమల్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
గోదావరిఖని/ఫెర్టిలైజర్సిటీ: రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండంలోని 23,52,53,54, 55,41,35వ వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజలను ఆశపెట్టి గద్దెనెక్కిందన్నారు. ప్రజలు ఆశపడడం తప్పు కాదని, వారిని మోసం చేయడం కాంగ్రెస్ తప్పన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా ప్రజలకు చేసిందేమీ లేదని, రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రౌడీల పాలనకు చరమగీతం పాడాలని కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి పేరిట విధ్వంసం జరుగుతోందన్నారు. రాత్రి పూట దొంగల వలె మైసమ్మ ఆలయాలు, దుకాణాలు కూల్చడం ఇక్కడ నిత్యం జరుగుతుందన్నారు. రామగుండంలో నియంత పాలన పోవాలంటే బీఆర్ఎస్ గెలుపుతోనే సాధ్యమన్నారు. అభ్యర్థులను పోలీసులతో బెదిరిస్తూ విత్ర్ డ్రా చేయించారని, అబద్ధాలు, మోసాలకు కేరాఫ్గా కాంగ్రెస్ నిలిచిందన్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చే ఆ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో నాయకులు మూల విజయరెడ్డి, కౌశిక హరి, నడిపెల్లి మురళీధర్రావు, నారాయణదాసు మారుతి, అచ్చే వేణు తదితరులు పాల్గొన్నారు. -
గ్రౌండ్ను విస్తరించాలి
పట్టణవాసులు ఉదయం, సాయంత్రం ఇదే గ్రౌండ్కు వస్తున్నారు. పోలీస్, కేంద్ర పారామిలిటరీ ఉద్యోగాలు సాధించేందుకు శిక్షణ పొందుతున్న వారు ప్రాక్టిస్ చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్, జిమ్ ఏర్పాటు చేయాలి. – అవినాష్, అగ్నివీర్కు ఎంపికై న యువకుడుఅభివృద్ధికి కట్టుబడి ఉన్నాం నేను సర్పంచ్గా పనిచేసిన సమయంలో మానేరులో రెండు బావులు తవ్వించా. తాగునీటి సమస్య పరిష్కరించా. కానీ, గత పదేళ్ల ప్రభుత్వంలో పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడ్డారు. అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. – అంతటి అన్నయ్యగౌడ్, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ -
3 వార్డులు.. ముగ్గురు అన్నదమ్ములు
పెద్దపల్లిరూరల్: ఒకేకుటుంబంలోని ముగ్గు రు అన్నదమ్ములు మూడు వార్డుల్లో పోటీకి దిగారు. కాంగ్రెస్ నుంచి కొలిపాక శ్రీనివా స్, కొలిపాక చిరంజీవి ఉన్నారు. కాంగ్రెస్ తో విభేదించిన కొలిపాక శ్రీనివాస్ (15వ వార్డు) ఆల్ఇండియా ఫార్వర్డ్బ్లాక్ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తనకు మద్దతుగా 24 మందిని కూడా పోటీలో నిలిపారు. ఈ క్రమంలోనే తన సోదరులు కొలిపాక చిరంజీవి(17వ వార్డు), కొలిపాక సంపత్ (18వవార్డు) నుంచి పోటీకి దింపారు. ముగ్గురు అన్నదమ్ములు పోటీపడుతుండడం చర్చనీయాశంగా మారింది. బరిలో తోడికోడళ్లు ఫ్యామిలీ పాలిటిక్స్ -
ప్రవర్తనా నియమావళి పాటించాలి
జ్యోతినగర్(రామగుండం): అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనానియమావళిని పాటించాలని అదనపు కలె క్టర్, రామగుండం కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ కోరారు. ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సందేహాల నివృత్తి కోసం రిటర్నింగ్ అధికారులు, బల్దియా కార్యాలయంలోని ఎన్నికల సెల్ను సంప్రదించాలని సూచించారు. ప్రచార వాహనాలకు అనుమతి పొందాలని, అనుమతి పత్రాన్ని మా త్రమే అంటించాలని సూచించారు. ఎన్నికల వ్యయ పరిమితి రూ.1.50 లక్షలకు మించరాదని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రమేశ్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి అన్నారు. ట్రైనర్లు స్వరూప్ చంద్, శ్రీనివాస్.. అభ్యర్థులు అనురించాల్సిన ప్రవర్తనా నియమావళిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎన్నికల పరిశీలకురాలు పద్మజారాణి, వ్యయ పరిశీలకులు సుజాత, కృష్ణమోహన్, రవిబాబు, బల్దియా అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, శ్రీహరి, నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ -
కోతులను తరిమేయాలి
సాక్షి, పెద్దపల్లి/పెద్దపల్లి: కాలనీలు, గల్లీల్లో కోతులు, కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయని, ఎప్పుడు, ఎటువైపు నుంచి దాడి చేస్తాయో తెలియక భయాందోళనకు గురవుతున్నామని సుల్తానాబాద్ పట్టణవాసులు ఆవేదన చెందారు. మున్సిపల్ కొత్త పాలకవర్గం ఈ సమస్యపై దృష్టి సారించాలన్నారు. సుల్తానాబాద్లో బుధవారం ‘సాక్షి’ నిర్వహించిన చర్చావేదికలో పలువురు మాట్లాడారు. తీవ్రంగా వేధిస్తున్న కోతులు, కుక్కల బారినుంచి కాపాడే వారికే ఓటేస్తామన్నారు. ఇందుకోసం స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు. పట్టణం విస్తరిస్తోందని, ఇందుకు అనుగుణంగా వసతులు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే విజయరమణారావు.. సమస్యలను విన్నారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మరికొందరు మన్నారంటే.. కుక్కల బారినుంచి కాపాడాలి వాకింగ్ ట్రాక్, సీసీ రోడ్లు నిర్మించాలి పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి ‘సాక్షి’ చర్చావేదికలో సుల్తానాబాద్ మున్సిపల్ ప్రజల అభిప్రాయాలు సమస్యలు పరిష్కరిస్తాం ఎమ్మెల్యే విజయరమణారావు -
వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ నిర్మించాలి. గత పాలకవర్గం నిధులు మంజూరు అయ్యాయని చెప్పింది. కానీ, జీవో రాలేదు. పనులు జరగలేదు. కొత్త పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలి. – రాజేంద్రప్రసాద్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలి వార్డుల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలి. భవిష్యత్ తరాలకు ఇబ్బందులు కలుగకుండా ముందుకు వెళ్లాలి. రోడ్లపైకి మురుగునీరు రాకుండా చూసుకోవాలి. అప్పుడే స్వచ్ఛ సుల్తానాబాద్గా మారుతుంది. – స్వామి, ఉద్యోగి, 12వవార్డు -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
సాక్షి పెద్దపల్లి: పదేళ్ల పాలనలో పట్టణాలు, పల్లెలను గాలికొదిలేసిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ఐటీ పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రశ్నించారు. ఎన్నికలు వస్తే అడ్డగోలుగా మాట్లాడే పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధిచేప్పేలా, అధికార కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైనా.. కాంగ్రెస్ సర్కార్ గాడిలోపెట్టిందన్నారు. ఒక్కో హామీ అమలు చేస్తోందని తెలిపారు. పెద్దపల్లికి ఐటీ పార్క్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అరకొరగా కట్టి లబ్ధిదారులకు అందించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు క ల్పించి లబ్ధిదారులకు అందించిన ఘనత ఎమ్మెల్యే విజయరమణారావుకే దక్కిందన్నారు. ఐఎన్టీయూసీ నేత జనక్ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ గోపగాని సారయ్యగౌడ్, శశిభూషణ్ కాచే, శ్రీమాన్, తొట్ల తిరుపతియాదవ్ తదితరులు పాల్గొన్నారు. ● అధికారంలో ఉన్నవారిని గెలిపిస్తేనే మరింత అభివృద్ధి ● ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చర్యలు
పెద్దపల్లి: వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సో షల్ జస్టిస్ డేలో అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ఆ యన పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకు న్న 61మంది సర్వేయర్లకు లైసెన్స్లు అందజేసి మా ట్లాడారు. ప్రభుత్వం శాసీ్త్రయ పద్ధతిలో కుల సర్వే చేసిందన్నారు. భూ రికార్డులపై భరోసా కల్పించేలా లైసెన్స్డ్ సర్వేయర్లు పనిచేయాలని సూచించా రు. అధికారులు రవీందర్, వేణుగోపాల్, రంగారెడ్డి, ప్రకాశ్, సోమేశ్వర్, గంగయ్య పాల్గొన్నారు. చైన్మెన్ సస్పెన్షన్ మంథని ఆర్డీవో కార్యాలయంలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న చైన్మన్ ఇ.రఘును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. విధుల్లో ని ర్లక్ష్యం చేస్తున్నారని ఇప్పటికే అనేకసార్లు మెమోలు జారీ చేసినా మార్పు లేదని, గత జనవరి 13న సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యా రని మంథని ఆర్డీవో నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి.. కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను, నల్లాబిల్లులు రూ.4,26,850 నుంచి రూ.2,82,247 ప్రభుత్వ ఖజానాకు జమ చేయకపోవడంతో కాల్వశ్రీరాంపూర్ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. రాఘవాపూర్లో.. పెద్దపల్లిరూరల్: రాఘవాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రవిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీలో వసూలు చేసిన పన్నులు, బిల్లుల సొమ్మును సొంతానికి వాడుకున్న ట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్న ట్టు సమాచారం. ధర్మారంలో.. ధర్మారం(ధర్మపురి): ధర్మారం గ్రామ పంచాయతీ కార్యదర్శి రవిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన ఆస్తిపన్ను రూ.63,332 ట్రెజరీలో జమచేయకుండా సొంతానికి వాడుకోవడం, ఆస్తిపన్ను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వ హించడంతో ఎంపీడీవో నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో ఆయన వివరించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
క్రీడల్లో రాణించాలి
పెద్దపల్లి: క్రీడలకు పుట్టినిల్లు సుల్తానాబాద్ అ ని డీవైఎస్వో సురేశ్ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చేపట్టిన సీ ఎం కప్ క్రీడా పోటీలు బుధవారం ముగిశా యి. సురేశ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడల్లోనూ రాణించాలన్నారు. అనంతరం వి విధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి బ హుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఎంఈవో రాజ య్య, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్, ఎస్జీఎఫ్ మండల కార్యదర్శి ప్రణయ్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్, సంధ్య, శ్రీవాణి, వెంకటేశ్, ఆసియా బేగం, సత్యం, సతీశ్, సంపత్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిభకు పురస్కారం పెద్దపల్లి: విధి నిర్వహణలో ప్రతిభ చూపిన జి ల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ సా యిభవాని, ల్యాబ్ టెక్నీషియన్ అజయ్కు స్టా ర్ పెర్ఫార్మెన్స్ అవార్డు అందించినట్లు సూపరింటెండెంట్ శ్రీధర్ బుధవారం తెలిపారు. కలెక్టర్ సూచన మేరకు అన్ని కేటగిరీల సిబ్బందికి పనితీరు ఆధారంగా ప్రతినెలా పురస్కా రం అందిస్తున్నామన్నారు. కాగా, గాల్బ్లాడర్ లో స్టోన్తో బాధపడుతున్న గోదావరిఖనికి చెందిన ఇద్దరు మహిళలకు డాక్టర్లు అమరసింహారెడ్డి, సాయిప్రసాద్, రామం, భవాని బృందం ఆధునిక పద్ధతుల్లో శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేశారని శ్రీధర్ వివరించారు. వైద్యులను ఆయన అభినందించారు. ఆస్పత్రి లో అందిస్తున్న 2డీ ఇకో, లాప్రోస్కోపిక్, యూరాలజీ, రూట్కెనాల్ తదితర సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆర్ఎంవో విజయ్కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున పాల్గొన్నారు. ఆర్ఐఈ శిక్షణకు ఎంపిక సుల్తానాబాద్రూరల్: చిన్నబొంకూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ కిషన్ బెంగళూరులోని రీజినల్ ఇ నిస్టిట్యూట్ ఆఫ్ ఇంగి ఫ్లాష్ (ఆర్ఐఈ)లో 30 రోజుల పాటు చేపట్టే కోర్స్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్(సీఈఎల్డీ)శిక్షణకు ఎంపికయ్యారు. మనరాష్ట్రం నుంచి 50 మంది ఉపాధ్యాయులు ఎంపిక కాగా మనజిల్లా నుంచి అందులో కిషన్ ఉన్నా రు. ఆయనను పలువురు అభినందించారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పెద్దపల్లి: పురపాలక సంఘ పరిధిలోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ రమేశ్ బుధవా రం కోరారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారి చిరునామాలు సేకరించామని, పోస్టల్ బ్యాలెట్ ముద్రణ పూర్తయిన వెంటనే వారికి బ్యాలెట్ పేపర్లు పంపిస్తామని అన్నారు. ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ప్రశ్నించే గొంతుక అవసరంమంథని: హామీలను అమలు చేయడంతో విఫలమై కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల పేరిట మ రోమారు ప్రజలకు ముందుకు వస్తోందని, ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వ ర్ అన్నారు. స్థానిక గాంధీచౌక్లో బీఆర్ఎస్ అ భ్యర్థుల పరిచయ వేదిక పేరిట బుధవారం ని ర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభు త్వ విధానాలతో విసిగిపోయిన ప్రజలు ఆ పా ర్టీకి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందన్నా రు. బీఆర్ఎస్ అభ్యర్ఖులను ఆదిరించాలని కో రారు. మాజీఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడా రు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఎన్నికల సమన్వయకర్త శ్రీధర్రెడ్డి ఉన్నారు. -
సమ్మక్క హుండీ ఆదాయం రూ.9.51 లక్షలు
రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ సమ్మక్క – సారలమ్మ జాతర హుండీల ఆదా యాన్ని మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా రూ.9,51,287 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. వీటితో పాటు 206 గ్రాముల మిశ్రమ వెండి, 0.380 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం సమకూరిందని వారు వివరించారు. టికెట్లు, టెండర్ల ద్వారా సమకూరిన ఆదాయం ఇందులో పేర్కొనలేదు. దీనిపై ఈవో రాజ్కుమార్ను సంప్రదించేందుకు యత్నించగా స్పందించలేదు. జాతర కమిటీ చైర్మన్ గీట్ల శంకర్రెడ్డి, వైస్ చైర్మన్ నరేందర్, ప్రతినిధులు బాలసాని సత్తయ్య, ఆవుల గోపాల్యాదవ్, కోల రామ్మూర్తిగౌడ్, పల్లికొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి తప్పనిసరిగోదావరిఖని: రామగుండం పోలీసు కమిషనరేట్లో అ నుమతిలేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, స భలు, సమావేశాలునిర్వహించరాదని సీపీ అంబర్ కిశోర్ఝా స్పష్టం చేశారు. అత్యవసరమైతే ముందుగా పోలీస్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. బహి రంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలు కొనసాగుతాయని, అనుమతిలేకుండా డ్రోన్ లు, డీజే సౌండ్స్పై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కమిషనరేట్లో ఈనెల ఒకటినుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. ఆరేళ్ల సమస్యకు పరిష్కారం జూలపల్లి(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరేళ్లుగా కొనసాగుతున్న లో వోల్టేజీ సమస్యకు ట్రాన్స్కో అధికారులు పరిష్కారం చూపుతున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మ ర్ ఏర్పాటుకు రూ.2,34,892 విలువైన డీడీలు చెల్లించినా ట్రాన్స్కో కార్యాలయంలో నిర్లక్ష్యంగా వాటిని మూలన పడేశారు. స్థానికుడు, ధర్మారం ఏడీఈ విజయ్పాల్సింగ్ ఇటీవల ఇక్కడ పర్యటించగా.. డీడీల విషయం వెలుగుచూసింది. దీంతో ఆయన ట్రాన్స్ఫార్మర్, తీగలు, స్తంభాలు మంజూరు చేశారు. ఆయన సూచనలతో కళాశాలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మ ర్ ఏర్పాటుకు సిబ్బంది మంగళవారం పనులు ప్రారంభించారు. అధ్యాపకులు, గ్రామస్తులు, విద్యార్థులు ఏడీఈకి కృతజ్ఞతలు తెలిపారు. క్వింటాల్ పత్తి రూ.7,811 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో మంగళవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,811 ధర పలికింది. కని ష్టంగా రూ.6,016, సగటు రూ.7,512 గా ధర నమోదైందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్ర వీణ్రెడ్డి తెలిపారు. మొత్తం 529 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. కమిటీలు ఏర్పాటు చేయాలి పెద్దపల్లి: పది మంది, అంతకుమించి మహిళలు పనిచేస్తున్న ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్రావు సూచించారు. జిల్లాలోని ప్ర భుత్వ, ప్రైవేట్ రంగాల్లో కచ్చితంగా కమిటీ లు వేయాలన్నారు. ఈనెల 20వ తేదీలోగా http:// shebox.tgwdcw.in వెబ్సైట్లో వివరాలు న మోదు చేయాలని ఆయన సూచించారు. 4 వారాలు.. 28 రోజులు పెద్దపల్లిరూరల్: ఈఏడాది ఫిబ్రవరి నెలకు ప్ర త్యేకత ఉంది. ఈనెల పౌర్ణమి (ఫిబ్రవరి1)తో మొదలవుతోంది. అంతేకాదు.. ఈనెలలో వ చ్చే ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం.. ఇలా అన్నిరోజులూ సమానంగా.. నాలుగేసిచొప్పున ఉండడమే విశేషం. ఇలాంటి అద్భుతమైన మాసం 823 ఏళ్ల తర్వాత వచ్చిందని వేదపండితుడొకరు వివరించారు. -
అసంతృప్తుల జ్వాలలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో టికెట్లు ఆశించిన ఆశావహులకు నిరాశ ఎదురవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియడంతో బీఫారాలు అందుకున్న అభ్యర్థులు ప్రచార బరిలో దిగారు. ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కలేదన్న ఆగ్రహంతో పలువురు బహిరంగ నిరసనలకు దిగారు. పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆశావహులు రోడ్డెక్కారు. పార్టీ సభ్యత్వాలు, పదవులకు రాజీనామా చేయడం, నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేయడం, నేతల ఇళ్ల ముందు ఆందోళనలు నిర్వహించడం, పరస్పర వాగ్వాదాలకు దిగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పలువురు ఆశావహులు పార్టీ పెద్దల ఇళ్లముందు ఆందోళన చేపట్టారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తూ కొందరు స్వతంత్రులుగా.. మరికొందరు పార్టీ రెబల్స్గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ పార్టీలకు రాజీనామా చేసి ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ పరిణామాలు ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పిగా మారాయి. రెబల్స్ ప్రభావం ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగుతున్నప్పటికీ.. చాలాచోట్ల పరిస్థితి అదుపులోకి రావడం లేదు. టికెట్ల వ్యవహారం మరింత మంటలు రాజేస్తుండటంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ పోరు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. టికెట్లు దక్కలేదని నిరసనలు ప్రధాన పార్టీలకు తప్పని రెబల్స్ బెడద పార్టీలకు పలువురు రాజీనామా స్వతంత్రులుగా పోటీకి సిద్ధం కరీంనగర్లో రెండు బీ ఫామ్లు ఇచ్చి రచ్చకెక్కిన కాంగ్రెస్ నాయకులురెబల్స్ బెడద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు అందించే సమయంలో హైడ్రామా నెలకొంది. ఒకే డివిజన్కు రెండు బీఫామ్లు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. పీసీసీ ఆదేశాలకు వ్యతిరేకంగా స్థానిక నాయకులు బీఫామ్లు అందించడం కలకలం రేపింది. తొలుత 50వ డివిజన్ అభ్యర్థిగా కొత్త అనిల్ను హైకమాండ్ ప్రకటించింది. అదే సమయంలో పార్టీ కార్పొరేషన్ ఇన్చార్జి వైద్యుల అంజన్కుమార్ బీఫామ్ను చక్రధర్రావుకు అందించారు. ఈ విషయం తెలిసి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అవాక్కయ్యారు. అనిల్కు కాదని బీఫామ్ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎలాగైనా అనిల్కు న్యాయం చేయాలనే ఆలోచనతో హైకమాండ్ అప్పటికే 57వ డివిజన్ పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు కేటాయించిన బీఫామ్ అందించారు. ఒక విధంగా అటు నగర, అసెంబ్లీ ఇన్చార్జిలు పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్లు
గోదావరిఖని/రామగుండం: రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ మంగళవారం బీఫామ్లు అందజేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 60 డివిజన్ల నుంచి పోటీపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. తొలుత స్థానిక పవర్హౌస్కాలనీ శివాలయం, రామగుండం అంజనాద్రిగుట్టపై ఉన్న శ్రీధనుర్భానారామాంజనేయస్వామి ఆలయంలో బీఫామ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి శివుడు, ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. -
పోలీస్స్టేషన్కు పిలిపించి బెదిరింపులా?
గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పోలీస్స్టేషన్కు పిలిపించి బెదిరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ సేవకులుగా మారిపోయారని ఆయన మండిపడ్డారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన నియంతలా, దుర్మార్గంగా సా గుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచే దమ్ము, ధైర్యం లేనిఎమ్మెల్యే.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భయపెట్టి సంబరపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈఎన్నికల్లో తామంటే ఏమిటో చూపిస్తామని కోరుకంటి చందర్ సవాల్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని అన్నారు. నాయకులు నడిపెల్లి అభిషేక్రావు, గోపు అయిలయ్యయాదవ్, నడిపెల్లి మురళీధర్రావు, నారాయణదాసు మారుతి, చల్లా రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఇక సమరమే
సాక్షి పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. పోటీలో నిలిచిన వారిజాబితా ప్రకటన, గుర్తుల కేటాయింపు పూర్తికావడంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. కరపత్రాలు, వాల్పోస్టర్లతో పనులు ప్రారంభించారు. అన్నివార్డుల్లోనూ ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోటీఉంది. కొందరు తమకు కేటాయించిన గుర్తులతోపాటు తమ ఫొటోలు ఉండేలా పెద్ద బ్యానర్లు సిద్ధంచేసి వార్డుల్లోని ప్రధాన కూడ ళ్లు, కాలనీల్లో ఏర్పాటు చేస్తున్నారు. 124 వార్డులు/డివిజన్లు.. బరిలో 581 మంది రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్లకు 452 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఉపసంహర ణ అనంతరం315 మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి మున్సిపల్లో 36 వార్డులకు 194మంది నామినేషన్లు వేయగా, 37మంది విత్డ్రా చేసుకున్నారు. 157 మంది బరిలో నిలిచారు. సుల్తానాబాద్లో 15 వార్డులకు 75 మంది నామినేషన్లు వేయగా..14మంది విత్డ్రా అయ్యారు. 61మంది బరిలో ఉన్నా రు. మంథనిలో 13 వార్డులకు 107 మంది దరఖా స్తు చేయగా 55 మంది ఉపసంహరించుకున్నారు. 48 మంది పోటీలో మిగిలారు. పెద్దపల్లిలో 36 వార్డులకు బీజేపీ నుంచి 26 మంది, బీఆర్ఎస్ నుంచి 35 మంది బరిలో ఉండగా, మంథనిలో 13వా ర్డులకు బీజేపీ తరఫున 12మంది పోటీచేస్తున్నారు. గుర్తులతో ప్రచారంపై ఫోకస్ అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతోపాటు ఎన్నికల్లో తమను గెలిపిస్తే చేసే పనుల చిట్టాను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వార్డులు/డివిజన్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకుంటున్న వాట్సాప్ గ్రూప్లను ఇందుకు వేదికగా చేసుకుని ఆన్లైన్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. కొందరు రీల్స్ సైతం చేస్తూ కౌన్సిలర్, కార్పొరేటర్గా గెలుపు కోసం విభిన్న పంథాలు అనుసరిస్తున్నారు. దీంతో మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. ఇతర ప్రాంతాల్లోని తమవార్డు ఓటర్లకు వాట్సాప్ ద్వారా నే తమగుర్తు, హామీలను పంపుతూ ఓట్లు అభ్యరి స్తున్నారు. మరో ఆరురోజుల సమయమే మిగిలి ఉండడంతో తమ బంధుగణంతోపాటు స్నేహితులతో గెలుపు మంతనాలు చేస్తున్నారు. కులాలు, యూత్ అసోసియేషన్ల వారీగా హామీలు గుప్పిస్తున్నారు. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. టికెట్ ఖరారు.. ప్రచారం షురూ గల్లీల్లో హోరెత్తించేలా ప్రణాళిక 124 స్థానాల్లో 581 మంది అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా అసంతృప్తి నేతలు బరిలో నిలిచిన అభ్యర్థులు బల్దియా వార్డులు అభ్యర్థులు రామగుండం 60 315 పెద్దపల్లి 36 157 మంథని 13 48 సుల్తానాబాద్ 15 61 మొత్తం 124 581 -
గతపాలకులు భ్రష్టుపట్టించారు
పెద్దపల్లి: గత పాలకులు సుల్తానాబాద్ మున్సిపల్ను భ్రష్టు పట్టించారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ధ్వజమెత్తారు. సుల్తానాబాద్ రెండోవార్డు అభ్యర్థి గాజుల రాజమల్లయ్య, మూడోవార్డు అభ్యర్థి మహమ్మద్ నిషాద్కు మద్దతుగా ఎమ్మెల్యే మంగళవారం ప్రచారం చేశారు. మేజర్ పంచాయతీ నుంచి మున్సిపల్గా ఆవిర్భవించిన సుల్తానాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందాల్సిన ఉన్నా.. గతపాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలోనే రూ.20 కోట్లతో సుల్తానాబాద్ను అభివృద్ధి చేశామని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. నాయకులు అన్నయ్యగౌడ్, ప్రకాశరావు, మహేందర్, ఐల రమేశ్, శ్రీగిరి శ్రీనివాస్, బిరుదు కృష్ణ, అంతటి పుష్పలత, దుగ్యాల సంతోష్రావు, పెగడ పరుషరాములు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
ప్రభుత్వ లక్ష్య సాధనకు తోడ్పాటు అందించాలి
పెద్దపల్లి: బ్యాంకర్లు ప్రభుత్వ లక్ష్య సాధనలో తోడ్పాటు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవంతంగా సాగుతున్న ఇందిరా మహిళాశక్తి వ్యాపారాలకు మరిన్ని రుణాలు అందించేందుకు బ్యాంకులు ముందుకు రావాలని సూచించారు. 2025–26లో పంట రుణాలు రూ.1,916 కోట్లకు రూ.1,471 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.651 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. 5,111 స్వశక్తి సంఘాలకు రూ.361 కోట్ల 60 లక్షల బ్యాంక్ రుణాలు అందించామని తెలిపారు. మెప్మా నిర్దేశించిన లక్ష్యం కన్నా 494 సంఘాలకు రూ.63 కోట్ల 2 లక్షల రుణాలు అధికంగా పంపిణీ చేశామన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వా రా రూ.8 కోట్ల 57 లక్షల సబ్సిడీతో 119 యూనిట్లు, స్టాండ్అప్ ఇండియా ద్వారా రూ.5కో ట్ల 17 లక్షల రాయితీతో 57 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ముద్ర రుణాల ద్వారా 14,718 మందికి రూ.173 కోట్లు అందించామని అన్నారు. చిన్న ఆహార శుద్ధి కేంద్రాల కో సం వచ్చిన 74 దరఖాస్తులను ఆమోదించి రుణా లు పంపిణీ చేశామని, మరో 37 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పీఎం విశ్వకర్మ స్కీం ద్వారా 1,270 మందికి రూ.11 కోట్ల 43 లక్షల రుణాలు పంపిణీ చేశామన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష బ్యాంకర్లతో సమావేశం -
భార్యాభర్తలు.. వేర్వేరు డివిజన్లు
జ్యోతినగర్: రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో భార్యాభర్తలు వేర్వేరు డివిజన్లలో పోటీ చేస్తున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎన్టీపీసీ ప్రాంతంలోని 34వ డివిజన్లో భార్య పొన్నం సుమలత, రెండోడివిజన్లో భర్త పొన్నం విజయ్గౌడ్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన బరిలో నిలిచారు. దీంతో వారు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. యూరియా ఉత్పత్తిలో కీలకం ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): దేశీయంగా ఎరువుల ఉత్పత్తిలో ఆర్ఎఫ్సీఎల్ కీలకపాత్ర పోషిస్తోంది. ప్లాంట్ రోజూవారి సామర్థ్యం 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా. వార్షిక ఉత్పత్తి లక్ష్యం 12.7 లక్షల మెట్రిక్ టన్నులు. ప్రస్తుతం 90శాతం సామర్థ్యంతో ఉత్పత్తి సాగుతోంది. జనవరిలో 1,08,002.32 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో తెలంగాణకు 50.5 శాతం యూరియా కేటాయించారు. మిగతా యూరియాలో ఆంధ్రప్రదేశ్కు 23,165.82 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 19,506.78 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రకు 5,225.22 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 2,629.53 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు అధికారులు వివరించారు. -
బర్త్డే పార్టీలో యువకులపై దాడి
కరీంనగర్రూరల్: నడిరోడ్డుపై బర్త్ డే పార్టీ చేసుకోవడమే కాకుండా కారుపైకి ఎక్కి తల్వార్తో కేక్ కట్ చేసి హంగామా చేసి, ఇరువురిపై దాడి చేసి డబ్బులు,సెల్ఫోన్ తీసుకున్న తొమ్మిది మందిని మంగళవారం కరీంనగర్రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు.. తీగలగుట్టపల్లిలోని హన్మాన్నగర్లో గత నెల 31న అర్ధరాత్రి 12గంటలకు నడిరోడ్డుపై ఓ మైనర్ బర్త్ డే పార్టీని యువకులు నిర్వహించారు. కారుపైకి ఎక్కి తల్వార్తో కేక్ ట్ చేయడంతోపాటు టపాసులు కాల్చుతూ కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేశారు.ఈ సమయంలో టెంట్హౌజ్ సామగ్రిని వాహనం నుంచి దించుతున్న యుగంధర్, చరణ్పై కొందరు యువకులు కర్రలు, బండలతో దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ.2వేలతోపాటు సెల్ఫోన్ తీసుకుని పగులకొట్టారు. స్థానికులు వచ్చి యువకులను అక్కడి నుంచి వెళ్లగొట్టి బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. మరుసటిరోజు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. అజయ్, విఘ్నేష్, రంజిత్లు మేజర్లు కాగా మిగితా ఆరుగురు మైనర్లున్నారని సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. ముగ్గురిని కరీంనగర్జైలుకు, ఆరుగురు మైనర్లను వరంగల్ జువైనల్హోమ్కు తరలించినట్లు వివరించారు. తొమ్మిది మంది అరెస్టు -
ఆన్లైన్లో పెట్టుబడి పెట్టించిన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: ఆన్లైన్ యూబెట్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. మంగళవారం పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాలలోని అంగడిబజార్కు చెందిన కట్కం చంద్రశేఖర్ను పట్టణానికి చెందిన వేముల మల్లికార్జున్ మల్టీలెవల్ మార్కెటింగ్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని యూబిట్ ట్రేడింగ్ యాప్లో క్రిప్టో కరెన్సీ ద్వారా గొలుసుకట్టు వ్యాపారంలో రూ.20 లక్షలు పెట్టించాడు. మల్లికార్జున్తోపాటు, పిల్లి కిషన్, ధరూర్కు చెందిన శివగంగ, యూబెట్ కంపెనీ మేనేజర్ బ్రిజ్ మోహన్, సంజయ్ గుప్తా కంపెనీ నడిపిస్తున్నారని చెప్పారు. ఇటీవల కంపెనీ మూతపడటంతో తన డబ్బులు చెల్లించాలని చంద్రశేఖర్ అడగగా తప్పించుకుతిరుగుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జనవరి ఒకటోతేదీన కేసు నమోదు చేసి మల్లికార్జున్ను ధరూర్ క్యాంప్లోని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ కరుణాకర్ పాల్గొన్నారు. -
పక్కాప్రణాళిక.. ‘పరుగుల’ ప్రయాణం
● ఆస్తిపన్ను వసూలు కోసం అనేక ఒడిదొడుకులు ● రూ.60 లక్షల నుంచి రూ.17.75 కోట్లకు ఆదాయం ● చెత్త సేకరణకు ఎడ్లబండ్ల నుంచి.. ఆధునిక వాహనాలు ● వినూత్న ప్రయోగాలతో సత్ఫలితాలు ● రామగుండం కార్పొరేషన్ ప్రస్థానం కోల్సిటీ(రామగుండం): సుమారు 44 ఏళ్లక్రితం వరకు రామగుండం నోటిఫైడ్ ఏరియాగా ఉంది. అప్పటి ఆస్తిపన్ను డిమాండ్ రూ.60 లక్షలు. ఇప్పుడు కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. ఆస్తిపన్ను డిమాండ్ రూ.19.75 కోట్లకు చేరింది. భౌగోళికంగా విస్తరించడమే కాకుండా ఆదాయ వనరుల పెంపుకోసం బల్దియా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. అప్పుడు ఎడ్లబండ్లు.. ఇప్పుడు ఆటో ట్రాలీలు.. గతంలో ఎడ్లబండ్ల ద్వారా ఇంటింటా చెత్త సేకరించేవారు. ప్రస్తుతం ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లు, ఆధునిక వాహనాలు వినియోగిస్తున్నారు. నగర విస్తరణకు అనుగుణంగా కొత్తకాలనీలు, వాణిజ్య ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఆస్తిపన్ను పరిధీ విస్తరిస్తోంది. సదుపాయాల కల్పన, పారిశుధ్యం నిర్వహణ, వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించడంతోపాటు ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతోంది. కార్పొరేషన్ ప్రస్థానం ఇలా.. ● జనగామ పంచాయతీతోపాటు 11 గ్రామాలను విలీనం చేస్తూ 1982 జనవరి 19న రామగుండం నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించారు. అప్పట్నుంచి 1983 వరకు ఆర్డీవో ద్వారా ప్రత్యేక పాలన సాగింది. ● 1995 మే 15న ద్వితీయ శ్రేణి, 2001 ఆగస్టు 3న ప్రథమ శ్రేణి, 2003 నవంబర్ 3న ప్రత్యేక శ్రేణి పురపాలక సంఘంగా, 2010 ఫిబ్రవరి 25న నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది. ● 1998 జూన్ 6న పురపాలక సంఘం తొలి, 2004 జూన్ 22న రెండోసారి ఎన్నికలు జరిగాయి. ● 2014 మార్చి 30న నగరపాలక సంస్థకు తొలిసారి, 2020 జనవరి 22న రెండోసారి నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి. తొలిమున్సిపల్ చైర్మన్ ‘సోమారపు’ రామగుండం మున్సిపల్కు 1998 జూన్ 6న ప్రత్యక్ష పద్ధతిన ఎన్నికలు జరిగాయి. తొలిచైర్మన్గా సోమారపు సత్యనారాయణ ఎన్నికయ్యారు. 1998 జూన్ 6 నుంచి 2003 జూన్ వరకు ఆయన మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించారు. ఆస్తిపన్ను విప్లవానికి నాంది గుడిసెలు, పెంకుటిళ్లు, రేకుల షెడ్లు.. ఎక్కడోఓచోట కొన్ని భవనాలు రామగుండం తొలిపురపాలక సంఘం పరిధిలోని నివాసాలు. ఏడాదికి గరిష్ఠంగా రూ.60 లక్షల వరకే ఆస్తిపన్ను వసూలయ్యేది. మున్సిపల్ కమిషనర్ను మినహా ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, కార్మికుల వేతనాలు ఇందులోంచే చెల్లించాల్సి వచ్చేది. వాహనాల ఇంధనం, నిర్వహణ ఖర్చులు, ఇతర కార్యకలాపాలనూ నెట్టుకొచ్చేవారు. ఆదాయం తక్కువ, వ్యయం అధికం కావడంతో ఆర్థికపరిస్థితి సంక్లిష్టంగా మారింది. తొలిమున్సిపల్ చైర్మన్ సోమారపు సత్యనారాయణ.. వినూత్న ఆలోచనతో ఎన్టీపీసీ, సింగరేణి, ఎరువుల కర్మాగారం వంటి భారీ పరిశ్రమలకు చెందిన ఖాళీ స్థలాలపై ‘వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్’ విధించేందుకు సాహసం చేశారు. దీంతో ఆస్తిపన్ను ఏకంగా రూ.2 కోట్లకు చేరింది. బల్దియా ఆర్థికంగా బలోపేతమైంది. ఇలాంటి ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు, వినూత్న ఆలోచనలే బల్దియాను కార్పొరేషన్ స్థాయికి చేర్చాయి. పారిశుధ్య నిర్వహణ కీలకం.. రామగుండం నగరం నోటిఫైడ్ ఏరియా నుంచి కార్పొరేషన్ స్థాయికి చేరే ప్రయాణంలో పారిశుధ్యం నిర్వహణ కీలకంగా నిలిచింది. ఎడ్లబండ్లలో చెత్త తరలించే వారికే ఆటోట్రాలీలు కేటాయించింది. వీధుల్లో ప్లాస్టిక్ ఏరుకునే పేదలను గుర్తించి ఇంటింటా చెత్త సేకరించే పని కల్పించింది. చెత్త సేకరణలో వినూత్నతం ఇంటింటా చెత్త సేకరణ కోసం తొలుత 40 రిక్షాలు కొనుగోలు చేశారు. ర్యాగ్ పిక్కర్స్ పేరిట పేదలకు వాటిపై ఉపాధి కల్పించారు. ఈ విధానం విజయవంతం కావడంతో మరో 60 రిక్షాలు కొనుగోలు చేశారు. వీటిపై పని చేయడానికి కార్మికులు పోటీపడ్డారు. పరుగుపందెంతో నియామకం రిక్షా కార్మికులుగా ఉపాధి కల్పించేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి అవకాశం కల్పిస్తామని పురపాలక సంస్థ తొలిపాలక వర్గం నిబంధన విధించింది. ఇందుకోసం పరుగుపందెం నిర్వహించింది. తద్వారా ఆ కుటుంబానికి ఉపాధి లబించడంతోపాటు ఆర్థిస్థిరత్వం ఏర్పడింది. ఒక్కో ఇంటినుంచి చెత్త సేకరణ ఫీజుగా రూ.20 చొప్పున కార్మికులే వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. తద్వారా బల్దియాపై ఆర్థికభారం కూడా తగ్గింది. సేంద్రియ ఎరువు తయారీ చెత్తను వృథా చేయకుండా సేంద్రియ ఎరువుగా మార్చేవిధానాన్ని రామగుండం పురపాలక సంఘం విజయవంతంగా అమలు చేసింది. ఇలా ఆదాయం సాధించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ ముందంజ వేసింది. రామగుండం బల్దియా ప్రొఫైల్ డివిజన్లు 60 విస్తీర్ణం(చ.కి.మీ.) 100 స్లమ్ ఏరియాలు 50 జనాభా(అంచనా లక్షల్లో) 2.35 ఓటర్లు 1,83,049 అసెస్మెంట్లు 51,345 ఆస్తిపన్ను డిమాండ్(రూ.కోట్లలో) 19.75 రోజూ వెలువడే చెత్త(మె.టన్నుల్లో) 150 కాంట్రాక్టు కార్మికులు 448 రెగ్యులర్ కార్మికులు 43 -
చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
మెట్పల్లిరూరల్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మెట్పల్లి మండలం వేంపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్ మండలం ధర్మారంకుచెందిన దండె నర్సింహులు (46) కొన్నేళ్లుగా వేంపేటలో నివాసం ఉంటున్నాడు. పశువుల కాపరిగా ఉంటూ జీవనం సాగి స్తున్న నర్సింహులు.. సోమవారం సాయంత్రం గ్రామ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. విద్యుత్ తీగ సహాయంతో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు తీగ తగిలి మృతి చెందాడు. నర్సి ంహులు భార్య నర్సు ఫిర్యాదు మేర కు కేసు నమో దు చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం హ స్నాబాద్లో జనవరి 22న పెట్రోల్ పోసుకుని ఆ త్మహత్యాయత్నానికి పాల్పడిన అనగోని క్రాంతి కుమార్ (41) చికిత్స పొందుతూ మంగళవారం కరీంనగర్లో మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన క్రాంతికుమార్ హస్నాబాద్కు చెందిన మహిళను వి వాహం చేసుకున్నాడు. ఆర్నెళ్ల క్రితం అతని త మ్ముడు మృతిచెందడంతో అప్పటినుంచి మద్యానికి బానిసయ్యాడు. భార్య కోసమని గతనెల 22 న హస్నాబాద్ వచ్చాడు. భార్య లేకపోవడంతో తాగిన మైకంలో వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒ ంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమని ంచిన అత్తింటివారు వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ మృతిచెందాడు. క్రాంతికుమార్ సో దరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ హెడ్కానిస్టేబుల్ రవీందర్ తెలిపారు. ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జి ల్లా జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన సా త్తూరి సందీప్(31) బైక్ అదుపుతప్పి పంట పొలాల్లో పడి మృతిచెందాడు. ఎస్సై రమేశ్ కథ నం ప్రకారం.. పెద్దపల్లిలోని ఓ ఫైనాన్స్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్న సందీప్.. రోజూ బైక్పై వెళ్లి వస్తుంటాడు. సోమవారం కూడా బైక్పై వెళ్లి సా యంత్రం తిరిగి వస్తున్నాడు. కొలనూర్ శివారులో కి రాగా బైక్ అదుపుతప్పి పొలాల్లో పడి గాయాల కు గురై మృతి చెందాడు. మంగళవారం ఉ దయం రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు స మాచారం అందించారు. మృతుడి తండ్రి మొండయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపల్లి(కరీంనగర్): మండలంలో దొంగతనాల కు పాల్పడుతున్న ఐదుగురిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ బిల్లా కోటేశ్వర్ తెలి పారు. కమాన్పూర్ గ్రామానికి చెందిన గిర్ర దేవేందర్ కుటుంబసభ్యులతో కలిసి రామడుగు మండలం గోలిరామయ్యపల్లికి వెళ్లారు. గమనించిన దొంగలు ఈ నెల 24వ తేదీన రాత్రి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.89వేల విలువ గల బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుడిచ్చిన ఫిర్యాదుతో సీసీ కెమరాలు, టెక్నాలజీని ఉపయోగించి దొంగల ను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడ్డ క మాన్పూర్ వడ్డెపల్లికి చెందిన సూర సీతారాం, తపాలా స్వామికుమార్, బంజారా కార్తీక్, చింతకుంటకు చెందిన చందా రాజు, కమాన్పూర్ కు చెందిన బోనాల శివను మంగళవారం అరె స్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల ను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సైలు సాంబమూర్తి, తిరుపతిని సీఐ అభినందించారు. -
7న నవోదయ పరీక్ష
చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయంలో 9,11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈ నెల 7న జరుగుతుందని ఇన్చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్ల పంపిణీ ఆన్లైన్ ద్వారా చేశామని, డౌన్లోడ్ చేసుకోవాలని, ఇంకా హాల్ టికెట్ రానివారు ఈ నెల 4న చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఏవైనా సందేహాలుంటే 7989693572 నంబర్లో సంప్రదించాలని కోరారు. రూ.1.40 లక్షల నగదు సీజ్సిరిసిల్లక్రైం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సిరిసిల్ల మండలం తంగళ్ళపల్లి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్టులో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ 03బీ జెడ్ 9740 నంబర్ గల కారును తనిఖీ చేయగా, అనుమానాస్పద నగదు రూ.1.40 లక్షలను పోలీసులు గుర్తించారు. తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్కు చెందిన డ్రైవర్ నందగిరి నాగరాజు నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్కరీంనగర్క్రైం: ఓ మహిళ కరీంనగర్ బస్టాండ్ సమీపంలో తన బంగారు ఆభరణాలు కలిగిన పర్సు పోగొట్టుకోగా ఆటోడ్రైవర్కు దొరకడంతో వన్టౌన్ పోలీసుస్టేషన్లో అందచేసి నిజాయితీ చాటుకున్నాడు. రామడుగు మండలానికి చెందిన బొజ్జ లక్ష్మి మంగళవారం ఇల్లంతకుంట మండలం జవారీపేటకు వెళ్లేందుకు కరీంనగర్ వచ్చింది. బస్టాండు సమీపంలో 1.5 తులాల బంగారు రింగు, గుండ్లు, నగదు కలిగిన పర్సును పోగొట్టుకుంది. ఆ పర్సు భగత్నగర్కు చెందిన ఆటోడ్రైవర్ కోలపూరి జగన్కు దొరికింది. బస్టాండులోని పోలీసు అవుట్పోస్టు వద్దకు వచ్చి వన్టౌన్ ఎస్సై రాజన్న ఆధ్వర్యంలో లక్ష్మీకి పర్సు అందజేశాడు. ఆటోడ్రైవర్ జగన్ను పోలీసులు, స్థానికులు అభినందించారు. బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని తడగొండ గ్రామంలో రైతుల చేల వద్ద బావులు, బోరు మోటార్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన కనెక్టింగ్ కేబుల్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు పలువురు రైతులు తెలిపారు. సుమారు 20మంది రైతుల కేబుల్ వైర్లు సోమవారం రాత్రి అపహరణకు గురైనట్లు పేర్కొన్నారు. ఉదయం పొలాలకు వెళ్లిన పలువురు రైతులు వైర్లు కట్ చేసి ఉండటాన్ని గమనించారు. కేబుల్ వైర్లు కాల్చి అందులోని రాగిని తీసి అమ్ముకునేందుకు వైర్లు కట్చేసి తీసుకెళ్లి ఉంటారని గంగారెడ్డి తదితర రైతులు చెబుతున్నారు. ఇలా పలుసార్లు పొలాల వద్ద వైర్లు ఎత్తుకెళ్తున్నారని వాపోయారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణంమెట్పల్లి: పట్టణంలోని ఆరపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. సాయిరాంకాలనీకి చెందిన కేతావత్ ప్రవీణ్ బుల్లెట్ వాహనంపై స్నేహితుడు జలిగం వెంకటేశ్తో కలిసి సోమవారం రాత్రి సమయంలో కోరుట్లకు బయలుదేరాడు. మార్గంమధ్యలో ఆరపేట వద్దకు చేరుకోగానే.. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రవీణ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రవీణ్ భార్య సురేఖ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
క్షణాల్లో ఘోరం.. అంతులేని విషాదం
మల్లాపూర్: వారందరిదీ నిరుపేద కుటుంబాలు. రెక్కాడితేనే డొక్కాడుతుంది. అలాంటి కూలీలు ఉపాధి కోసం మండలంలోని మొగిలిపేటకు చెందిన ఎర్రంశెట్టి గంగాధర్ రైతు పొలంలో పసుపు ఏరడానికి ట్రాక్టర్లో వెళ్లారు. సుమారు 15 మంది కూలీలతో గంగాధర్ తన సొంత ట్రాక్టర్లో బయల్దేరాడు. తోటి కూలీలుతో సరదాగా మాట్లాడుకుంటూ అలసట మర్చిపోయి పొద్దంతా పనులు పూర్తి చేసుకున్నారు. సాయంత్రం సమయంలో గంగాధర్ ట్రాక్టర్లోనే ఇంటికి బయల్దేరారు. మరో 10 నిమిషాల్లో ఇళ్లు చేరేదే. అంతలోనే ట్రాక్టర్ను గంగాధర్ స్పీడ్గా నడపడంతో రోడ్డు పక్కనున్న నీటి గుంతలో పడిపోయింది. ఆ కూలీలను కానరాని లోకాలకు తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మంగళారపు లలిత (45), పెద్దిరెడ్డి గంగు(45), సంపంగి సాయమ్మ(38), రొడ్డ వైష్ణవి(13) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అంతా క్షణాల్లోనే జరగడంతో ఏం జరిగిందో కూడా కూలీలకు అర్థం కాలేదు. ఆర్తనాదాల మధ్య స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు, పోలీసులు క్షతగాత్రులను ప్రైవేటు వాహనాలు, 108లో మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన సంపంగి సాయమ్మది నిరుపేద కుటుంబం. భర్త ఎల్లయ్య ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. ఇద్దరు పిల్లలతో కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతోంది. పెద్దిరెడ్డి గంగు భర్త గంగాధర్ ఆర్థిక ఇబ్బందులతో ఐదేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. కూలీ పనులు చేసుకుంటూనే ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. రొడ్డ పోశయ్య, అనిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. రెండో కుమార్తె వైష్ణవి స్థానిక ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి చదువుకుంటూనే కుటుంబానికి అండగా నిలవాలని అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తోంది. మంగళారపు లలితకు భర్త ధర్మరాజు, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ధర్మరాజు నాయీబ్రాహ్మణ వృత్తి చేసుకుంటున్నాడు. పెద్ద కూతురుకు వివాహం జరిపించాడు. మిగిలిన కూతుళ్లు, కుమారుడిని చదివించేందుకు లలిత కూలీ పనులకు వెళ్తోంది. మృతదేహాలను ఆస్పత్రికి తరలించడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కుటుంబసభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, నాయకులు, అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్, కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు హామీ ఇచ్చారు. తహశీల్దార్ శ్రీనివాస్, సీఐ అనిల్కుమార్, ఎస్సైలు అనిల్, కిరణ్, నవీన్కుమార్ మృతదేహాలను పరిశీలించారు. పోలీసుల అదుపులో ట్రాక్టర్ యజమాని ప్రమాదానికి కారణమైన ఎర్రంశెట్టి గంగాధర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కూలీ పనులకు వెళ్లి విగతజీవులుగా ఇంటికి తిరిగొస్తూ.. కానరానిలోకాలకు.. నలుగురి మృతి.. మరో ఎనిమిదిమందికి గాయాలు మల్లాపూర్ మండలం మొగిలిపేటలో విషాదం -
సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా..
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన చంద్రుపట్ల రాంరెడ్డి 1970లోనే సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత ఎంపీపీగా పనిచేసి 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సర్పంచ్ మొదలు.. ఎమ్మెల్యే వరకు ఆయన అనేక ప్రజాసమస్యలపై పోరాటం చేశారు. ప్రజల్లో తన పేరును పదిలం చేసుకున్నారు. 1970లో రాజకీయాల్లోకి.. 1970లో రాజకీయాల్లోకి వచ్చిన రాంరెడ్డి.. సర్పంచ్గా కొనసాగుతూనే మండల ప్రెసిడెంట్ బాధ్యలు నిర్వహించారు. 1989లో ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావుపై విజయం సాధించారు. 1999లో శ్రీధర్బాబుపై ఓటమి చెందారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్లో చేరి చురుకుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా విషయంలో విద్యుత్ అధికారులపై దాడిచేసి గుర్తింపు పొందారు. పదవుల కన్నా ప్రజలే ముఖ్యమని భావించారు. రాంరెడ్డి కుమారుడు సునీల్రెడ్డి(బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు) కాగా, రెండోకుమారుడు అమెరికాలో స్థరపడ్డారు. గురువారం ముత్తారం మండలం సీతంపేటలోని వ్యవసాయ క్షేత్రంలో రాంరెడ్డి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామన్న మృతిపై స్వగ్రామంతోపాటు నియోజకవర్గంలోని అయన అభిమానులు, బీజేపీ తదితర పార్టీలు, కుటుంభ సభ్యుల్లో విషాదం నింపింది. పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రజాసేవలో రాంరెడ్డి ప్రత్యేక ముద్ర అనారోగ్యంతో మంథని మాజీ ఎమ్మెల్యే కన్నుమూత -
చాలాశ్రమించాం
నోటిఫైడ్ ఏరియా నుంచి పురపాలక సంఘంగా మారిన తర్వాత ఆస్తిపన్ను వసూలు చేయడం కష్టంగా ఉండేది. ఒక్కోఇంటికి వందలసార్లు తిరగాల్సి వచ్చేది. ఇంత శ్రమించినా ఏడాదికి రూ.60లక్షలకు మించి వసూలయ్యేదికాదు. తొలి మున్సిపల్ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రత్యేక చొరవతో ఆస్తిపన్ను క్రమంగా రూ.2 కోట్ల వరకు చేరింది. ఇందులోంచే మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు జీతాలు చెల్లించేవాళ్లం. ఆర్థిక క్రమశిక్షణ పాటించేవాళ్లం. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసేవాళ్లం. దీంతోనే రామగుండం కార్పొరేషన్ స్థాయికి చేరింది. దీనివెనుక అనేక ఆలోచనలు, అనేక ప్రయాణాలు ఉన్నాయి. – పిల్లి శివయ్య, అప్పటి ఆర్ఐ -
విధుల్లో పారదర్శకత ఉండాలి
జ్యోతినగర్(రామగుండం): పోలింగ్ విధులను పకడ్బందీగా నిర్వహించాలని కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ సూచించారు. ఎన్టీపీ సీ కాకతీయ ఆడిటోరియంలో సోమవారం ప్రి సైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆమె మాట్లా డుతూ, విధుల్లో పారదర్శకత ఉండాలన్నారు. ట్రైనర్స్ శ్రీనివాస్, రాజేందర్రెడ్డి, కృష్ణారెడ్డి, అంజన్కుమార్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు ప ద్మజారాణి శిక్షణ తరగతులను తనిఖీ చేశారు. బల్దియా కమిషనర్లు మనోహర్, వెంకటేశ్, రమేశ్, ఎస్ఈ గురువీర, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్వో ఆంజనేయులు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ సిబ్బంది కీలకం గోదావరిఖని: సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర కీలకమని ఆర్జీ –వ న్ జీఎం లలిత్కుమార్ అన్నారు. సెక్యూరిటీ సిబ్బందికి సోమవారం టార్చిలైట్లు, ఫైబర్ లా ఠీలు అందజేసి మాట్లాడారు. సెక్యూరిటీ అధి కారి వీరారెడ్డి, ఏఐటీయూసీ కార్యదర్శి రెడ్డి వెంకటస్వామి, జూనియర్ ఇన్స్పెక్టర్లు శ్రీని వా స్, మహ్మద్ అక్బర్అలీ, జమేదార్లు తిరుపతి, మురళికృష్ణ, ఓదెలు, శ్రీనివాస్, మొండ య్య, సదానందం, ఇంటలిజెన్స్ టీం రాధాకృష్ణ, మధు, తిరుపతి, రమేశ్ పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,831 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ లో సోమవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,831, కనిష్టంగా రూ.6,331, సగటు ధర రూ.7,531గా నమోదైందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. 416 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు వివరించారు. మజ్దూర్ యూనియన్ నిరసనరామగుండం: దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక రైల్వేస్టేషన్లో ఆందోళన చేశారు. 8వ వేతన సంఘం సిఫార్సులు వర్తింపజేయాలని, సేఫ్టీ కేటగిరీ సిబ్బందికి రిస్క్, హార్డ్షిప్ అలవెన్స్ చెల్లించాలనే తదితర డిమాండ్లతో నిరసన తెలిపారు. నేతలు మెట్ట రామారావు, ఓవై స్వామి, మోజెన్, ఆనంద్ రాథోడ్, అరవింద్, రాజ్కుమార్, రఘు, సతీశ్, గౌతమ్ ఉన్నారు. హుండీల ఆదాయం లెక్కింపు ఓదెల(పెద్దపల్లి): కొలనూర్ సమ్మక్క – సారలమ్మ జాతర హుండీల ద్వారా రూ.8,31,08 ఆదాయం సమకూరిందని జాతర కమిటీ చైర్మ న్ కొలిపాక మధునయ్య సోమవారం తెలిపా రు. సర్పంచ్ పల్లె కనుకయ్య, ఉపసర్పంచ్ పా కాల సంపత్రెడ్డి, ఓదెల మల్లన్న ఆలయ ఈవో సదయ్య, జూనియర్ అసిస్టెంట్ పాల్గొన్నారు. గుండారంలో.. కమాన్పూర్(మంథని): గుండారం సమ్మక్క– సారలమ్మ జాతర హుండీలను లెక్కించగా.. రూ.2,13,286 ఆదాయం సమకూరిందని కమిటీ చైర్మన్ పిడుగు శంకర్ తెలిపారు. సర్పంచ్ జంగిలి పోచాలు, ఉప సర్పంచ్ అంబీర్ రాజేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పకడ్బందీగా వ్యవహరించాలిగోదావరిఖని: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, సిబ్బంది నియామకంలో పకడ్బందీగా వ్యవహరించాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. గోదావరిఖని వన్టౌన్ పోలీస్స్టేషన్ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈనెల 11న పోలింగ్ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్, ప్రజాభద్రత తదితర అంశాలపై పో లీస్ అధికారులకు సూచనలు చేశారు. డీసీపీ వెంట ఏసీపీ రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు రమేశ్, మనోహర్, అనూష ఉన్నారు. -
నిబంధనల ప్రకారమే పాలన
పెద్దపల్లి: గ్రామాల్లో నిబంధనల ప్రకారమే పాలన సాగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గ్రా మ పంచాయతీల్లో ప్రభుత్వ పాలనపై కార్యదర్శులతో కలెక్టరేట్లో సోమవారం ఆయన సమీక్షించా రు. ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చే సిందని, వాటితో పారిశుధ్యం మెరుగుపర్చాలన్నా రు. ఈ ఏడాదిలో జీరో డెంగీ కేసులు లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉపాధిహామీ పనులు తదితర అంశాలపై సూచన లు చేశారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, హౌసింగ్ పీడీ రాజేశ్వర్ పాల్గొన్నారు. ప్రాథమిక సామర్థ్యాలు అవవసరం విద్యార్థులందరికీ ప్రాథమిక విద్యా సామర్థ్యాలు తప్పనిసరని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. విద్యా శాఖ అధికారులతో ఎఫ్ఎల్ఎన్ అమలుపై జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. మూడోతరగతి పూ ర్తయ్యే వరకు ప్రతీవిద్యార్థి ధారాళంగా చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక గణిత సామర్థ్యాలు సాధించేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈనెల ఒకటి నుంచి ఏడో తేదీ వరకు ఎంపికచేసిన 54 గ్రామాల్లో ని ర్వహించే ప్రత్యేక పశువైద్య శిబిరాలను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష పడిరైతులను కో రారు. డీఈవో శారద, అకడమిక్ మానిటరింగ్ అధి కారి షేక్, ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్ని కల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్కు కలెక్టర్తోపాటు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ హాజరయ్యారు. -
ఉద్యమిస్తేనే సమస్యల పరిష్కారం
పెద్దపల్లి: ఐక్యతతో ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రాణీరుద్రమ దేవి అన్నారు. సుల్తానాబాద్లో సోమవారం జరిగి న సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభు త్వ నిధులతోనే గ్రామాలు, పట్టణాలు, నగరాలు అ భివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ విషయం ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. టికెట్లు దక్కనివారు నిరుత్సాహానికి గురికాకుండా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. నాయకులు రాజమౌళిగౌడ్, మీస అర్జున్రావు, కర్రె సంజీవరెడ్డి, నల్లమనోహర్రెడ్డి, కడారి అశోక్రావు, సౌదరి మహేందర్ యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్ కు మార్, కామని రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, నాగరాజు, రాజన్న, రాజన్నపటేల్, మహేశ్ పాల్గొన్నారు. -
● చైర్పర్సన్ కుర్చీపై నజర్ ● ఆశలు పెంచుకున్న అధికార పార్టీ ● ఎలాగైనా ఓడిస్తామంటూ ఎంట్రీ ఇచ్చిన ‘సింహం’
పెద్దపల్లిరూరల్: మున్సిపల్ పీఠం తమదేనని అధికార కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీకి కు ర్చీ దక్కకుండా చేయాలని అసమ్మతివర్గం ఎత్తులు వేస్తోంది. దీంతో పెద్దపల్లి రాజకీయం వేడెక్కుతోంది. మొత్తం 36 వార్డులు ఉండగా, చైర్మన్ స్థానం బీసీ(జనరల్)కు కేటాయించారు. అన్నివార్డుల్లో పోటీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ 36 వార్డుల్లో అభ్యర్థులతో నామినేషన్లు వేయించాయి. బీజేపీ 27 వార్డుల్లోనే తమ అభ్యర్థులను బరిలో దింపింది. కాంగ్రెస్ను ఓడించడమే ధ్యేయంగా తెలంగాణ జా గృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహకారంతో ఏఐఎఫ్బీ(ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్) పార్టీ ‘సింహం’ గుర్తుతో ఎంట్రీ ఇచ్చిన మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్.. 26 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించారు. చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామ ంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన 9 వార్డుల్లో పోటీకి దిగింది. అభివృద్ధిపై కాంగ్రెస్ ఆశలు సీఎం రేవంత్రెడ్డి సహకారంతో పెద్దపల్లిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ చెబుతోంది. పెద్దపల్లి, సుల్తానాబాద్ పీఠాలు దక్కించుకుంటామనే ధీమాతో ఉంది. గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని, డీఎంఎఫ్టీ నిధులను ఇత ర ప్రాంతాలకు ఎత్తుకెళ్లారని ఆరోపిస్తోంది. ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేస్తున్నామని, 4 పోలీస్స్టేషన్లు ఒకేసారి ప్రారంభించామని, పదెకరాల్లో జిల్లా కోర్టు సముదాయాలు, బైపాస్రోడ్డు, పార్క్, హిందూ శ్మశానవాటిక తదితర పనులు చేపడతా మని ఎమ్మెల్యే విజయరమణారావు ప్రకటించారు. సర్వే చేయించి గెలిచే సత్తా ఉన్నవారినే పోటీలో నిలిపామని, తమకు ఎవరూ పోటీ ఇవ్వలేరంటున్నారు. బరిలో బీఆర్ఎస్, బీజేపీ.. బీఆర్ఎస్, బీజేపీలు కూడా తమ అభ్యర్థులను బరి లో నిలిపాయి. అయితే, ఆయా పార్టీలు, ప్రధాన నేతల నుంచి తమకు ఆశించిన మద్దతు లభించడం లేదని కొందరు భావిస్తున్నారు. బీజేపీలో గ్రూపు రా జకీయాలు అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చే స్తున్నాయి. మంగళవారం నామినేషన్ల ఉపసంహర ణ గడువు ముగిసి గుర్తులు కేటాయించిన తర్వాత ప్రచార పర్వంతో స్పష్టత వస్తుందని అంటున్నారు. ‘సింహం’ ఎంట్రీ.. మారిన రాజకీయం మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ చైర్మన్ పీఠంపై కన్నేశారు. కాంగ్రెస్లోని అసమ్మతివాదులు ఆయ నకు అండగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పో టీచేయాలని తొలుత భావించి రాష్ట్ర నాయకత్వాన్ని ఆశ్రయించినా స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ చ్చిందని, దీంతోనే ఆ వ్యవహారం ఫలించలేదనే చర్చసాగుతోంది. దీంతో కమలనాథులను కలిసి కాషాయ తీర్థం తీసుకునేందుకు ఇంకో ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఓ వర్గం పార్టీ రాష్ట్ర నాయ కత్వం వద్దకు తీసుకెళ్లి సానుకూలత లభించేలా చేసిన ప్రయత్నాలపై మరోవర్గం అభ్యంతరం వ్య క్తం చేయడంతో.. గ్రూపు రాజకీయాలతో వేగలేమని భావించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసినట్లు సమాచారం. పట్టుసాధించేందుకు ఇదో అవకాశమని.. పెద్దపల్లిలో పట్టు సాధించేందుకు మంచిఅవకాశమ ని భావించిన జాగృతి కవిత.. ఆశావహులకు ఆల్ఇండియా ఫార్వర్డ్బ్లాక్ పార్టీ బీఫామ్లు ఇప్పించిన ట్లు చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారంలోనూ ఆమె పాల్గొని సింహం గుర్తు అభ్యర్థుల విజయానికి ప్రయత్నిస్తారని సమాచారం. దీంతో కొలిపాక శ్రీని వాస్.. 26 మంది అభ్యర్థులను బరిలో నిలిపి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏదేమైనా ఈనె ల 13న జరిగే ఓట్ల లెక్కింపు, 16న నిర్వహించే చైర్మ న్ ఎన్నిక ఆశావహుల భవితవ్యం తేల్చుతాయి.మున్సిపల్ సమాచారం చైర్మన్ పీఠం బీసీ(జనరల్) పట్టణ విస్తీర్ణం(చ.కి.మీ.లలో) 35.19 ఓటర్లు 43,789 పురుషులు 21,660 మహిళలు 22,126 ఇతరులు 03 వార్డులు 36 ప్రధాన పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్ 36 బీఆర్ఎస్ 36 బీజేపీ 27 ఫార్వర్డ్ బ్లాక్ 26 జనసేన 09 -
సింహం ధైర్యం..!
ఏనుగు బలం..సాక్షిప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో టికెట్లు దక్కని ఆశావహులు ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఏఐఎఫ్బీ (సింహం గుర్తు), బీఎస్పీ (ఏనుగు గుర్తు) పార్టీలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. సింహం ధైర్యానికి, ఏనుగు బలానికి ప్రతీకగా భావించే ఈ గుర్తులు ఇప్పుడు రాజకీయంగా కూడా బలమైన ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో అంతర్గత అసంతృప్తి, రెబెల్స్ బెడద ఎక్కువగా ఉన్న వార్డులు, డివిజన్లలో ఈ గుర్తులు ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇస్తున్నాయి. ముందస్తు వ్యూహాలు టికెట్ రాకపోతే ప్రత్యామ్నాయంగా పోటీ చేసేందుకు ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకుంటున్న నేతలు ఏఐఎఫ్బీ, బీఎస్పీ నాయకత్వాలతో చర్చలు జరిపి, అవసరమైతే తమకు ఆ పార్టీ గుర్తు కేటాయించాలంటూ మాట తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రధాన పార్టీల తరఫున నామినేషన్ దాఖలు చేస్తూనే, ప్రత్యామ్నాయంగా ఏఐఎఫ్బీ, బీఎస్పీ పార్టీల పేర్లతో కూడా నామినేషన్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పరిధిలో ఉన్న రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా చివరి నిమిషాల్లో ‘ఆపద్బాంధవ’ పార్టీలుగా ఏఐఎఫ్బీ, బీఎస్పీలు మారుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలకు సవాల్ ఏఐఎఫ్బీ, బీఎస్పీ, జనసేనతో పాటు ఇతర చిన్న పార్టీల రంగప్రవేశం కూడా ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఓటు చీలిక, రెబెల్ ప్రభావం, గుర్తుల సెంటిమెంట్స్ కలసి ప్రధాన పార్టీలకు సవాళ్లను విసురుతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ కంటే గుర్తే బలం అన్న నమ్మకం బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సింహం, ఏనుగు గుర్తులపై పోటీ చేసే అభ్యర్థులు ఎంతవరకు ప్రధాన పార్టీలను దెబ్బతీస్తారో, ఎవరి లెక్కలు ఎవరి మీద పనిచేస్తాయో తేలాల్సి ఉంది. సెంటిమెంట్ ఏఐఎఫ్బీ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విస్తృతంగా పోటీ చేసి విజయాలు సాధించింది. ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 224 మంది అభ్యర్థులను బరిలో దింపగా, 102 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ ఘన విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 జెడ్పీటీసీ, 49 ఎంపీటీసీ స్థానాలను ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 17 స్థానాలను పార్టీ కై వసం చేసుకుంది. చొప్పదండిలో 1, పెద్దపల్లి 1, రామగుండం 9, కరీంనగర్ 3, జగిత్యాల 1, రాయికల్లో 2 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 230 మంది అభ్యర్థులు బరిలో దిగారు. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కరీంనగర్ జిల్లాలో 20 స్థానాల్లో పోటీ చేస్తుంది. కరీంనగర్ కార్పొరేషన్లో 10 స్థానాలు, జమ్మికుంట మున్సిపాలిటీలో 4, హుజురాబాద్లో 4, చొప్పదండిలో 2 సీట్లల్లో పోటీ చేస్తుంది. మొదటిసారిగా బీఎస్పీకి స్థానిక ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై పోటీ చేసేందుకు అనుమతి లభించింది. ఈసారి సత్తా చాటుతాం. – నల్లాల శ్రీనివాస్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడుప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుస్తాం. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఫార్వర్డ్ బ్లాక్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యం, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పన్నాగం రాబోయే ఎన్నికల్లో తేలిపోతుంది. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపి, అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ఫార్వర్డ్ బ్లాక్ పనిచేస్తుంది. ప్రజల మద్దతుతో ఫార్వర్డ్ బ్లాక్ను మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతాం – అంబటి జోజిరెడ్డి, ఏఐఎఫ్బీ రాష్ట్ర కన్వీనర్ -
జ్వరం.. ఒళ్లు నొప్పులు
‘జాతర వోయచ్చినం బిడ్డా.. లచ్చలమంది జనం.. నీళ్లు మారినయ్.. బాగ దూరం నడ్సినం.. దుమ్ము, ధూళి.. ఏమైందో గనీ.. ఒకటే దగ్గు, తుమ్ములు.. పెయ్యినొప్పులు.. జెరం.. వాంతులు, విరేచనాలు.. తగ్గుతనే లెవ్వు.. గందుకే గీ దవాఖానాకు అచ్చినం బిడ్డా’ అని సమాధానం ఇచ్చారు పలువురు పేషెంట్లు. మొన్నటి జాతరలకు వెళ్లినవారిలో కొందరు తీవ్రఅస్వస్థతకు గురై పీఎంపీలు, ఆర్ఎంపీల వద్ద చికిత్స తీసుకుంటున్నారు. చాలామంది సోమవారం పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రి కి తరలివచ్చారు. వారిరాకతో సర్కారు ఆస్పత్రి రద్దీగా మారింది. అవే ఈ దృశ్యాలు.. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
సుందరంగా తీర్చిదిద్దుతా
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రం హోదాకు తగిన వి ధంగా పెద్దపల్లిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మున్సిపల్ 12, 29, 31వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థు లు జగదీశ్, ఇల్లందుల రజని, మంథని నర్సింగ్కు మద్దతుగా సోమవారం పట్టణంలో ఎన్నికల ప్రచా రం చేశారు. అంతకుముందు ఎల్లమ్మ చెరువు హను మాన్ ఆలయంలో పూజలు చేశారు. ఈనెల 11న జ రగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటువేసి గెలిపించాలని కోరారు. సురేశ్గౌడ్, వ్యాపారవేత్త బాల్కిషన్ జాకొటియా, నాయకులు సత్యనారాయణరెడ్డి, రంగు శ్రీనివాస్ ఎడెల్లి శంకర్ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి ఎలిగేడు(పెద్దపల్లి): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. శివపల్లిలోని తన నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనాయకులతో మున్సిపల్ ఎన్ని కల ప్రచారంపై సమీక్షించారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోనిప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా సహకరించాలని కోరారు. ప్రతిభావంతులకు ప్రశంస పెద్దపల్లి: అమర్చందర్ కల్యాణ మండపంలో సో మవారం టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. జిల్లాస్థా యిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈకార్య క్రమంలో డీఈవో శారద, అధికారులు పీఎం షేక్, హనుమంతు, ఆగయ్య, పురుషోత్తం, లింగం శ్రీనివాస్, ముద్రబోయిన కుమారస్వామి, భాస్కర్ గడ్డం రాజనర్సు, కొండం శ్రీనివాసరెడ్డి, గుర్రం గంగారెడ్డి, మూల శ్రీనివాస్, రామచంద్రన్, పట్టెం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
దయచూపని నిర్మలమ్మ
సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఉమ్మడి జిల్లాకు దక్కని ప్రత్యేక హామీలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్రప్రభుత్వం ఆదివా రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27లో ఉమ్మడి జిల్లాకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు కేటాయింపులపై ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు రానప్పటికీ.. నేడో, రేపో వాటిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్దది. అలాంటి ప్రాజెక్టుకు కేటాయింపులపై ప్రకటన రాలేదు. అదే సమయంలో ప్రతిష్టాత్మక రాఘవాపురం–మణుగూరు, హసన్పర్తి – కరీంనగర్, నిజామాబాద్ – కరీంనగర్ – పెద్దపల్లి డబ్లింగ్, పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ వర్క్స్ కేటాయింపులపై ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. పింక్ బుక్ విడుదల ఈసారి లేకపోవడంతో నిధుల కేటాయింపుపై ఇప్పటివరకు తమకు సమాచారం లేదని, తాము కూడా కేంద్ర రైల్వేమంత్రి విలేకరుల సమావేశం కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి జోన్ల వారీగా నిధుల కేటాయింపులపై వివరాలు త్వరలోనే విడుదలవుతాయని పేర్కొన్నారు. గతేడాది ఉమ్మడి జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులకు రూ.435 కోట్లు కేటాయించగా.. ఈసారి ఎంత అనేది ఆసక్తిగా మారింది. -
అందుబాటులో ఉండాలి
కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజాసమస్యలను పరిష్కరించాలి. ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ 50 శాతం అభివృద్ధి పనులను పూర్తి చేశారు. – గడ్డం కృష్ణ, సింగరేణి ఉద్యోగి కోతుల నుంచి కాపాడాలి 36వ డివిజన్లో కోతుల బెడద అరికట్టాలి. సింగరేణి క్యార్టర్ల ప్రాంతం కావడంతో సింగరేణి, బల్దియా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సమన్వయంతో అభివృద్ధి చేయాలి. – దేవీ లక్ష్మీనరసయ్య, సామాజిక కార్యకర్త -
జనరంజక బడ్జెట్
పెద్దపల్లిరూరల్: అన్నివర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా జనరంజకమైన బడ్జెట్ను కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆదాయపు పన్ను మినహాయింపు, విద్య, వ్యవసాయం, రవాణా, పారిశ్రామిక రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. మహిళా సంక్షేమానికి నిధులు భారీగా కేటాయించారు. – మల్క కొమురయ్య, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇన్కంట్యాక్స్ ఊసేలేదు గోదావరిఖని: ఉపాధిహామీ నిధులు తగ్గించారు. కాంట్రాక్టు కార్మికుల ఊసేలేదు. సింగరేణి ఉద్యోగుల ఇన్కంట్యాక్స్ ప్రస్తావన లేదు. రైతులకు ఇచ్చిన హామీలు పట్టించుకోలేదు. బడాపారిశ్రామికవేత్తలు, వ్యాపారులకే బడ్జెట్ అనుకూలంగా ఉంది. – తుమ్మల రాజారెడ్డి, సీపీఎం నేత -
ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్యే
గోదావరిఖని: మాజీ సీఎం కేసీఆర్పై ప్రభుత్వం క క్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కో రుకంటి చందర్ ఆరోపించారు. కేసీఆర్కు సిట్ నో టీసుల నేపథ్యంలో స్థానిక ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ ఆదివారం నిరసన తెలిపింది. కౌశిక హరి, మిర్యాల రాజిరెడ్డి, గోపు అయిలయ్య యాదవ్, పర్లపల్లి రవి, మురళీధర్ రావు, గుంపుల లక్ష్మి, జక్కుల తిరుపతి, జడ్సన్, సట్టు శ్రీనివాస్, బుర్రి వెంకటేశ్, రామకృష్ణ, పద్మ పాల్గొన్నారు. టీబీజీకేఎస్ కార్యాలయంలో కర్క సుజాత, శ్రీనివాస్, గుండా కిషన్, జనగామ సదన్ కుమార్ బీఆర్ఎస్లో చేరారు. పెద్దపల్లి: మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆ ధ్వర్యంలో జిల్లాకేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించా రు. నేతలు దాసరి ప్రశాంత్రెడ్డి, రాజకుమార్, ల క్ష్మణ్, సతీశ్గౌడ్, మోబిన్, భిక్షపతి, శ్రీధర్ ఉన్నారు. ధర్మారంలో ఉద్రిక్తత ధర్మారం(ధర్మపురి): బీఆర్ఎస్ బలరాంరెడ్డి, నేత లు శ్రీధర్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నిచంగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మల్లేశ్నాయక్కు స్వల్పగాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చో టుచేసుకుంది. నాయకులు రాంబాబు, బుచ్చిరెడ్డి, మల్లారెడ్డి, చంద్రయ్య, రామారావు పాల్గొన్నారు.ధర్మారంలో ఆందోళనకారులు, పోలీసుల తోపులాట గోదావరిఖనిలో నిరసన ప్రదర్శన పెద్దపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల రాస్తారోకో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన -
పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి
రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి. పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి. దోమల బెడద నివారణకు చర్యలు చేపట్టాలి. గెలిచిన కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి. – దీటి శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు అభివృద్ధిపై నిర్లక్ష్యం గత పాలకవర్గాలు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయి. పరిశ్రమల నుంచి నిధులు రాబట్టలేదు. రాబోయే పాలకవర్గం వైద్యం, పరిసరాలు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. – పులి మోహన్, రిటైర్డ్ ఈఈ, సింగరేణి -
పైసలుంటేనే పోటీ
గోదావరిఖని: కార్పొరేటర్గా పోటీచేసే ఒక్కో అభ్యర్థి ఈసారి రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్కోడివిజన్లో 2,500 వరకు ఓట్లు ఉంటే.. ఒక్కొక్కరికి కనీసం రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేయాల్సి వస్తుందని, ఇంత సొమ్మ పంపిణీ చేసినా ఒకవేళ ఓడిపోతే ఎలా? అని ప్రధాన పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. సాధించేదేముంటుందని.. పోటీచేద్దామనే ఆశ ఉన్నా.. చేతిలో డబ్బులేని కొందరు నాయకులు పోటీకి దూరంగా ఉంటున్నారు. ఒకవేళ అంతగా ఖర్చుచేసి సంపాదించేదెలా? అని మదనపడుతున్నారు. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలతో చాలామంది సీనియర్లు వెనక్కి తగ్గుతున్నారు. ఈసారి నామినేషన్ల తీరు చూస్తే ఈ పరిస్థితి అర్థం అవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన పార్టీల్లోనూ ఇలాగే.. ప్రధాన పార్టీల్లోని కొందరు అభ్యర్థులు ఎన్నికల్లో ఆశించినంత వెచ్చించలేక, పోటీనుంచి వెనక్కి రాలేక సతమతమవుతున్నారు. ఒక్కోఓటుకు కనీసం రూ.వెయ్యి చొప్పున 2,500 ఓట్లకు లెక్కేసినా సుమారు రూ.25లక్షలు, ఎన్నికల ఖర్చులు మరో రూ.10లక్షలు.. ఇలా సుమారు రూ.35లక్షల వరకు వెచ్చించాల్సి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీ అనే తేడాలేకుండా అన్ని పార్టీల్లో ఆశావహుల్లో ఈమేరకు కొంత భయం పట్టుకుందని అంటున్నారు. మారిన ఓటరు వైఖరి.. ఒకప్పుడు ఓటు కోసం నాయకులు ఇళ్ల వద్దకు మద్యం మాంసం తదితర నజరానాలు పంపించేవారు. ఇప్పుడు ఓటర్లే డిమాండ్ చేసే పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. తెల్లవారితే పోలింగ్ ఉంటుందనగా.. కొందరు అర్ధరాత్రివరకూ మెలకువగా ఉండి నజరానాల కోసం నిరీక్షించినట్లు పేర్కొంటున్నారు. ఒకరిద్దరు అభ్యర్థుల నుంచే కాకుండా అన్ని పార్టీల అభ్యర్థుల నుంచి ఓటర్లు నజరానా తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో అభ్యర్థులు పెద్దమొత్తంగా వ్యయం చేయాల్సి వస్తోంది. గెలిచిన అభ్యర్థుల మాట అటుంచితే.. ఓడినవారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. మారిన ఓటరు తీరుతో చాలామంది అభ్యర్థులు ఈసారి బల్దియా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. మరికొంత మంది పోటీలో ఉంటున్నా.. ఆచీతూచి ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈనెల11న మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండగా.. అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఓటర్లు మాత్రం నజరానాల అంచనాల్లో తలమునకలై ఉన్నారు. ఖరీదైన బల్దియా ఎన్నికలు కనీసం రూ.35 లక్షల వరకు ఖర్చు బరిలో నిలిచేందుకు సీనియర్లు వెనుకంజ దూరంగా ఉంటున్న ప్రధాన పార్టీల్లోని ఆశావహులు -
కాలుష్యాన్ని తరిమికొట్టాలి
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో కాలుష్యం తీవ్రతరమవుతోంది. దుమ్ము, ధూళితోపాటు వాయు, నీటికాలుష్యం నగరవాసులకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఆదివారం డిబేట్ నిర్వహించారు. పలువురు స్థానికులు తమ అభిప్రాయాలు వెల్లడించా రు. ఎన్నికల వేళ హామీలకే పరిమితం కాకుండా, కాలుష్య నివారణపై స్పష్టమైన కార్యాచరణ చేపట్టాలని వారు కోరారు. స్వచ్ఛమైన గాలితోనే ఆరోగ్యం రామగుండం నగరవాసుల అభిప్రాయాలు ‘సాక్షి’ డిబెట్కు విశేష స్పందన -
ఎడ్యుకేషనల్ హబ్ అవసరం
రామగుండం ఎడ్యుకేషనల్ హబ్గా మారాలి. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శుద్ధిచేసిన తాగునీరు అందించాలి. – డాక్టర్ క్యాస శ్రీనివాస్, గోదావరిఖని నోటుకు ఓటు వద్దు కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులను చూసి ఓటు వేయాలి. వారు ఇచ్చే డబ్బులు, మద్యానికి ఓటు అమ్ముకోవద్దు. నిజాయతీని చూసి ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. – రాందాస్, 45వ డివిజన్ -
కుక్కల బెడద ఉంది
నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. వాటి బారినుంచి ప్రజల్ని కాపాడాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి. స్టేడియంలో నీళ్లు చల్లించాలి. – మగురం సుధాకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు పొల్యూషన్ ఉండొద్దు రామగుండం పొల్యూషన్ రహిత ప్రాంతంగా మారాలి. మున్సిపల్ కొత్త పాలకవర్గం ఈ దిశగా చర్యలు చేపట్టాలి. సింగరేణి స్టేడియంలో రోజూ నీళ్లు చల్లించాలి. – సలీం, సీనియర్ సిటిజన్ -
సదుపాయాలు కల్పించాలి
మా డివిజన్లో అనేక ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. సదుపాయాల కల్పనపై కొత్త పాలకవర్గం దృష్టి పెట్టాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి. – దాసరి రఘు, 49 డివిజన్ దుర్వాసన వస్తంది మా డివిజన్లో పెద్ద నాలా ఉంది. దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నాలాలో పూడిక తీస్తూ ఉండాలి. రాబోయే పాలకవర్గం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. – జక్కం శ్రీనివాస్, 39వ డివిజన్ -
సమ్మక్క హుండీ ఆదాయం రూ.57.74 లక్షలు
గోదావరిఖని: స్థానిక సమ్మక్క–సారలమ్మ జాతర హుండీ ఆదాయం రూ.57.74లక్షలు సమకూరినట్లు జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఈవో కాంతారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక బీ –గెస్ట్హౌస్ సారలమ్మ ఆలయ కా ర్యాలయం వద్ద హుండీ లెక్కించారు. హుండీ ద్వారా రూ.31.26లక్షలు, వేలం ద్వారా రూ. 19.89లక్షలు, టికెట్ల ద్వారా రూ.6,59లక్షలు సమకూరినట్లు వివరించారు. గతేడాదితో పోల్చితే ఈసారి రూ.8.86లక్షలు అదనంగా సమకూరాయని పేర్కొన్నారు. వీటితోపాటు 2.900 మిల్లి గ్రాముల బంగారం, 798 గ్రాముల వెండి సమకూరిందని అన్నారు. లెక్కింపులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎండోమెంట్ ఏసీ సుప్రియ, అధికారులు, ప్రతినిధుఉలు లక్ష్మి, శ్రీవెంకట అన్నమాచార్య, మమతారెడ్డి పాల్గొన్నారు. సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు చేపట్టారు. నేటి ప్రజావాణి రద్దు పెద్దపల్లి: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదివారం తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు బిజీగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. జిల్లావాసులో సహకరించాలని ఆయన కోరారు. అభివృద్ధిపై సీఎం మార్క్ పెద్దపల్లిరూరల్: సీఎం రేవంత్రెడ్డి ప్రోత్సాహంతోనే నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నానని, రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఒకేసారి నాలుగు పోలీస్స్టేషన్లను మంజూరు చేసిన ఘనత తనకే దక్కిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మున్సిపల్ అభ్యర్థులకు ఆయన బీ ఫామ్లు అందజేసి మాట్లాడారు. తనకు ఎలాంటి వ్యాపార వ్యవహారాలు లేవని, ప్రజాసేవ చేయాలన్న ధ్యాసే ఉందన్నారు. పెద్దపల్లిలో పదేళ్లపాటు కుటుంబపాలనే సాగిందని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన కోరారు. నాయకులు నూగిల్ల మల్లయ్య, సారయ్యగౌడ్ పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వంతోనే అభివృద్ధి గోదావరిఖని/జ్యోతినగర్: ప్రజాప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. స్థానిక ఆర్యవైశ్య భవన్లో ఆదివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీపీసీ 31, 33వ డివిజన్కు చెందిన పలువురు కూడా కాంగ్రెస్ పార్టీకండువా కప్పుకున్నారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ కారు వరుసగా పంక్చర్ అవుతోందని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఆ పార్టీ నాయకులు తమ పద్ధతులు మార్చుకోవాలని సూచించారు. పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమ్మెకు సన్నద్ధం కావాలి పెద్దపల్లి: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో సమ్మె ప్రచార పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యోగులు, కార్మికుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. దేశ సంపదను కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తూ, ప్రజలకు నష్టం కలిగిస్తోందని దుయ్యబట్టారు. దీనిని నిరసిస్తూ ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని ఆయన కోరారు. నాయకులు వేల్పుల కుమారస్వామి, ఎరవెల్లి ముత్యంరావు, భిక్షపతి, మెండె శ్రీనివాస్, సారయ్య, కుమార్, వినేయ్, అరవింద్, ఎండీ యాకుబ్, శ్రీనివాస్, భూమయ్య, సందీప్ పాల్గొన్నారు. -
అభివృద్ధిపై దృష్టి
కొత్త పాలకవర్గం నగరాభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రజలు కేన్సర్కు గురికాకుండా కాలుష్యాన్ని నివారించే చర్యలు చేపట్టాలి. విద్య, వైద్యాన్ని మెరుగుపర్చాలి. – తాళ్లపెళ్లి శంకర్, సెక్యూరిటీ గార్డు, సింగరేణి సమస్యలు పరిష్కరించాలి సీతానగర్, మల్లికార్జున్నగర్లో సమస్యలు పరిష్కరించాలి. ప్రధానంగా డ్రైనేజీ, వీధిలైట్ల సమస్య అధికంగా ఉంది. వర్షాకాలంలో డ్రైనేజీ రోడ్లపై పారుతంది. పరిష్కరించాలి. – శ్రీనివాస్, 38వ డివిజన్ -
ఉపాధికి మంగళం
పెద్దపల్లి : బడ్జెట్లో ఉపాధిహామీకి అరకొరగా నిధులు కేటాయించడంతో పథకానికి మంగళం పాడతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. యువతకు ప్రోత్సాహం అంతంత మాత్రమే ఉంది. – విజయరమణారావు, ఎమ్మెల్యే పెద్దపల్లి తెలంగాణను పట్టించుకోలే మంథని: బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణపై వివక్ష చూపుతోంది. ప్రస్తుత బడ్డెట్తో ఇది మరోసారి రుజువైంది. సీఎం రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో దోస్తీ చేసినా నిధులు తీసుకురాలేకపోయారు. – పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యే, మంథని గ్రీన్ఎనర్జీకి నిధులేవి? పెద్దపల్లిరూరల్: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గ్రీన్ఎనర్జీ పీఎం కుసుమ్ ద్వారా రైతులకు సోలార్ ప్రయోజనం అందించేందుకు రూ.17వేల కోట్లే కేటాయించడం విచారకరం. కనీసం రూ.40వేల కోట్లు కేటాయించాలి. వికసిత్ భారత్ అంటూ రూ.53.50లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపించారు. – ఈద శంకర్రెడ్డి, ఏడీసీ మాజీ చైర్మన్ -
అవినీతికి తావుండొద్దు
కార్పొరేషన్ కొత్త పాలకవర్గం అవినీతికి తావివ్వకుండా సేవలు అందించాలి. ప్రజలు హర్షించే అభివృద్ధి చేపట్టాలి. నగరంలో కాలు ష్యం మితిమీరుతోంది. ప్రజల్ని రక్షించాలి. – రఘుపతిగౌడ్, రిటైర్డ్ కార్మికుడు, సింగరేణి ప్రజలతో మమేకమవ్వాలి నాయకులు ప్రజలతో మమేకమై పనిచేయాలి. ముందు గా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి. డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. – ఎం.శ్రీలత, 42వ డివిజన్ -
పశువుల కోసం ప్రత్యేక శిబిరాలు
పెద్దపల్లి: పశువులు రోగాలబారిన పడకుండా శిబి రాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పశువుల వ్యాధులకు కారణాలు, చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 1 నుంచి 7 వరకు జిల్లావ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. దీనికిగాను 28 బృందాల్లో 140 మందితో పాటు స్థానికంగా వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. శిబిరాలు ఇలా.. ఈనెల 1న పెద్దపల్లి మండలం కాసులపల్లి, నిట్టూరు, మేరపల్లి, రాఘవపూర్, పెద్దబొంకూర్, గుర్రంపల్లి, సుల్తానాబాద్ మండలం మంచరామి, కదంబాపూర్ గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. 2న ధర్మారం, పెద్దపల్లి, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లోని మేడారం, ఖిలావనపర్తి, కొత్తపల్లి, చందపల్లి, లోకపేట, వెంకట్రావుపల్లి, కీచులాటపల్లి, 3న ఓదెల, శ్రీరాంపూర్, పాలకుర్తి మండలాల్లోని పిట్టలఎల్లయ్యపల్లి, హరిపురం, పెద్దంపేట, మొట్లపల్లి, పుట్నూరు, కుక్కలగూడూరు, కొత్తపల్లి, గుంటూరుపల్లి, 4న రామగిరి, మంథని, అంతర్గాం, సుల్తానాబాద్, కమాన్పూర్ మండలాల పరిధిలో పెంచికల్పేట, సుందిళ్ల, కాకరపల్లి, శ్రీరాంనగర్, పెద్దంపేట, ఆకినేపల్లి, గోలివాడ, ముర్మూర్, వాగొడ్డుపల్లి, 5న ఎలిగేడు సుల్తానాబాద్, శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో సుల్తాన్పూర్, ముప్పిరితోట, సుద్దాల, కందునూరిపల్లి, అంకంపల్లి, ఆశన్నపల్లి, కొమిరే, నాంసాన్పల్లె, 6న సుల్తానాబాద్, ధర్మారం, ముత్తారం, మంథని మండలాల్లోని అల్లిపూర్, రేగడిమద్దికుంట, కటికనపల్లి, రామయ్యపల్లి, సీతంపేట, శుక్రవారంపల్లి, చందనాపూర్, సిరిపురం, 7న శ్రీరాంపూర్, ఓదెల, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లోని కూనారం, పెగడపల్లి, గుంపుల, గూడెం, నర్సాపూర్, కాట్నపల్లిలో శిబిరాలు నిర్వహిస్తారు. కాగా, జిల్లా కలెక్టర్ చొరవతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో శిబిరాలకు రవాణా సౌకర్యంతో పాటు ఉచితంగా మందులు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అధికారుల బృందంతో పాటు స్థానిక సి బ్బందికి రోజువారీగా భోజనం ఏర్పాటుకు ఎమ్మె ల్యే విజయరమణారావు సహకారం అందించారు. ఏర్పాట్లు చేశాం వైద్య శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉచితంగా పందులు పంపిణీ చేసేందుకు కలెక్టర్ చొరవ తీసుకున్నారు. పశు వైద్య శిబిరాలు విద్యార్థులకు దోహదపడతాయి. – విజయభాస్కర్, జిల్లా వెటర్నరీ అధికారి పశువులు మొత్తం మగ ఆడ ఆవులు 38,660 15,041 23,619 గేదెలు 66,131 7,916 58,215 గొర్రెలు 3,45,558 38,561 3,06,997 మేకలు 78,899 14,217 64,682 ఈ నెల 1 నుంచి 7వరకు నిర్వహణ -
తమ్ముడు.. తప్పుకో..
‘అన్నా ఇవి చేతులు కాదే, కాళ్లనుకో. రాక రాక రిజర్వేషన్ కలిసొచ్చింది. ఈ ఒక్కసారి నేను కార్పొరేటర్ అయ్యేలా చూడన్నా. నువ్వొక్కడివి తప్పుకుంటే చాలే మంచి మెజార్టీతో గెలుస్తా. మిగతావారు అసలు నాకు పోటీయే కాదు. నీవు తప్పుకుంటే మిగతా వాళ్లు కూడా తప్పుకుంటారు’.. అంటూ రామగుండం కార్పొరేషన్లోని పలు వార్డుల్లో బరిలోని నిలిచిన అభ్యర్థుల వేడుకోలు.‘అరే తమ్మీ.. మీ ఇద్దరూ నాకిష్టమే. నా గెలుపు కోసం కష్టపడ్డారు. మన పార్టీ వాళ్లే ఇద్దరూ పోటీలో ఉంటే ఓట్లు చీలిపోతాయి. మీరు తీవ్రంగా నష్టపోతారు. మీకంటే ఎక్కువగా ప్రత్యర్థే లాభపడతాడు. ఈ సారికి మనోడికే సపోర్ట్ చెయ్. కచ్చితంగా గెలుస్తాడు. నువ్వే పెద్ద మనసు చేసుకుని నామినేషన్ విత్డ్రా చేసుకో’ అంటూ ఓ పార్టీకి చెందిన ముఖ్యనేత రెబల్ కౌన్సిలర్గా పోటీచేస్తున్న అభ్యర్థికి ఇస్తున్నా సలహా. సాక్షి పెద్దపల్లి: నామినేషన్ ఘట్టం ముగియగా, పోటాపోటీగా ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయడంతో అన్ని పార్టీల్లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. టికెట్ దక్కని ఆశావహుల ఆగ్రహం, రెబల్స్ బెడద ఇప్పుడు పార్టీలకు సవాల్గా మారింది. నామినేషన్ల దాఖలుతో ప్రతీ డివిజన్, వార్డులో పోటీ స్వరూపం స్పష్టమైంది. అయితే పార్టీలు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు రంగంలోకి దిగడంతో సమీకరణలు తారుమారయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్లో భారీగా రెబల్స్ నామినేషన్లు దాఖలు చేయడం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఒక్కో చోట పార్టీ అభ్యర్థితోపాటు రెబల్ అభ్యర్థి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఓట్ల విభజన తప్పదన్న ఆందోళన నాయకత్వాల్లో కనిపిస్తోంది. 3 వరకు గడువు సగటున ఒక వార్డులో ఐదు నుంచి పదిమంది చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో వీలైనంత మంది పోటీదారులను తప్పించేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 1,500లోపు ఓట్లున్న చోట కూడా ఐదారుగురు బరిలో ఉంటే గెలుపోటములు తారుమారు అవుతాయనే ఉద్దేశంతో బుజ్జగింపుల పర్వం ఊపందుకుంది. రెబల్స్ను అదుపులోకి తెచ్చేందుకు నేతలు రంగంలోకి దిగా రు. కొందరికి భవిష్యత్తులో పదవులు, హోదా లపై హామీలు ఇస్తుండగా, మరికొందరిని పార్టీ క్రమశిక్షణ పేరుతో వెనక్కి తగ్గమని కోరుతున్నారని తెలిసింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎక్కువ ఓట్లున్న వర్గానికి చెందిన అభ్యర్థి పోటీలో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. కొన్ని చోట్ల సీనియర్ నేతలు నేరుగా జోక్యం చేసుకొని రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా చాలా మంది ఆశావహులు వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరని సమాచారం. బంధువులు, సన్నిహితులతో చెప్పిస్తూ.. నామినేషన్లు వేసిన రెబల్స్ బరిలో నుంచి తప్పుకునేలా వారిని ఒప్పించేందుకు, వారెక్కడున్నారో ఎలాగోలా తెలుసుకుని ప్రధాన పోటీదారులు రహస్యంగా కలుస్తున్నారు. వారి బంధువులు, సన్నిహితుల నుంచి కూడా పోటీలో ఉండవద్దని చెప్పిస్తున్నారు. ప్రతి ఓటూ కీలకమైందని భావిస్తుండటంతో వీలైనంత వరకు ఎక్కువ మంది పోటీలో ఉండకుండా చూడాలని ప్రధాన పార్టీల మద్దతుదారులు చూస్తున్నారు. ఇందుకు కొందరు నామినేషన్ వేసిన వారి పలుకుబడిని తెలుసుకుని రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తూ పోటీ నుంచి విరమించేలా పకడ్బందీ వ్యూహాలు అమలు చేస్తున్నారు. కులం ఓట్లే ప్రామాణికం అభ్యర్థుల సామాజిక స్థితిగతులు, అతడి సామాజిక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి..? ఎంత ఖర్చు పెట్టగలుగుతారు..? తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాంటి వారిని గురించి తగిన హామీలిచ్చి, పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతివ్వాలని కోరుతున్నారు. కొన్ని వార్డుల్లో సామాజికవర్గం ఓట్లు దండిగా ఉన్న అభ్యర్థులు మెట్టుదిగేది లేదని, పోటీచేసి తీరుతామని భీష్మించుకూర్చున్నారు. ఇలాంటి వారి విషయంలో పార్టీ సీనియర్లు కూడా ఏమీ చేయలేని అయోమయంలో ఉన్నారు. రంగంలోకి సీనియర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీల నుంచి అధిక సంఖ్యలో పోటీ ఉండటం మంచిది కాదని భావించి.. మధ్యవర్తిత్వానికి జిల్లా నాయకులను పార్టీలు రంగంలోకి దించుతున్నాయి. ఈ మేరకు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలోపడ్డారు. రిజ ర్వుడ్ కంటే జనరల్ స్థానాల్లో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో బరిలో ఉన్నారు. ఇందులో అసలు అభ్యర్థిగా ఎవరు నిలుస్తారు..? ఎవరు రెబల్గా కొనసాగుతారు..? చివరకు ఎవరు వెనక్కి తగ్గుతారు..? అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బుజ్జగింపుల ప్రయత్నాలు ఫలి స్తాయా..? రెబల్స్ పోటీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందా..? అనేది వేచి చూడాల్సిందే. మున్సిపల్ పోరులో బుజ్జగింపుల పర్వం ఒకే పార్టీ నుంచి నలుగురైదుగురు బరిలో అభ్యర్థులకు తలనొప్పిగా మారిన రెబల్స్ మున్ముందు మంచి అవకాశాలంటూ హామీ -
ప్రశాంతంగా ఆర్టీసీ ప్రయాణం
ెపద్దపల్లి: మేడారం జాతర భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రశాంతంగా ప్రయాణం చేశారని జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల ఆర్టీసీ డిపోల మేనేజర్లు, జాతర ఇన్చార్జీలు కల్పన, మనోహర్, ప్రకాష్రావు తెలిపారు. శనివారం పెద్దపల్లి నుంచి మేడారం వెళ్లే బస్సులను నిలిపివేసినట్లు తెలిపారు. మేడారం నుంచి వచ్చే బస్సులు పెద్దపల్లిలో రిపోర్ట్ చేసి యథావిధిగా కరీంనగర్ రీజినల్ పరిధిలోని డిపోలకు పంపించినట్లు పేర్కొన్నారు. మొత్తం 671 ట్రిప్పులకు గాను 17,644 మంది ప్రయాణం చేసినట్లు వివరించారు. అధికారులు కవిత, స్రవంతి, అప్పారావు, రాజయ్య, రాములు, పాపారావు పాల్గొన్నారు. -
కార్పొరేషన్లో తగ్గిన నామినేషన్లు
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో ఈ ఎన్నికల్లో నామినేషన్లు తక్కువగా దాఖలు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 60 డివిజన్ల నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు మొత్తం 452 మంది 693 నామినేషన్లు దాఖలు చేశారు. 2020లో 50 డివిజన్లలో 815 నామినేషన్లను దాఖలు కాగా, 2014లో రాష్ట్రంలోనే రికార్డుస్థాయిలో 993 నామినేషన్లు దాఖలయ్యాయి. అప్పుడు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 512 మంది పోటీ చేశారు. 50 మంది గెలుపొందగా, 462 మంది ఓడిపోయారు. 363 మంది ఎన్నికల్లో ఖర్చు చేసిన లెక్కలు సమర్పించలేదనే కారణంతో వారిపై ఎన్నికల సంఘం మూడేళ్లపాటు అనర్హత వేటు వేసింది. దీంతో కొందరు హైకోర్టు నుంచి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకొని, 2020లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేశా రు. అప్పుడు 812 మంది నామినేషన్లను దాఖలు చేయగా, 355 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3న తుది జాబితా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో ఎంత మంది బరిలో ఉంటారనేది ఈనెల 3న తేలనుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై ఈనెల 1న సాయంత్రం 5 గంటల వరకు అప్పీళ్లు చేసుకోవడానికి గడువు ఉంది. సదరు అప్పీళ్లను 2న పరిష్కరించిన తర్వాత 3న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రచురిస్తారు. మొత్తం 693 దాఖలు 3న తేలనున్న అభ్యర్థుల తుది జాబితా -
ప్రేమతో వద్దు అని చెబుదాం!
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో ఇటీవల 12 ఏళ్ల బాలుడు ఫోన్ కొనివ్వమని అమ్మను అడిగాడు. జీతం వచ్చాక ఇప్పిస్తానని చెప్పినా.. వినలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లాకు చెందిన పదోతరగతి చదువుతున్న ఓ బాలుడు బైక్ కొనివ్వాలని నెలరోజులుగా తల్లితండ్రులతో గొడవపడుతున్నాడు. ఇది భరించలేని పేరెంట్స్ ఇటీవల రూ. 2 లక్షల విలువైన స్పోర్ట్స్’ బైక్ కొనిచ్చారు. గతనెల బైక్పై ఓవర్ స్పీడ్తో వెళ్తున్న బాలుడు రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీకొని మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ బాలిక ఫోన్కొనివ్వాలని తండ్రిని వేధించింది. పేదరికంలో కొనివ్వలేని పరిస్థితి ఉన్నా.. అప్పుచేసి రూ. 15 వేల ఫోన్ కొనిచ్చాడు. రీల్స్ చూడడం అలవాటు చేసుకున్న ఆ బాలిక పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ఓ వ్యక్తి వలలో పడింది. జీవితం ఛిన్నాభిన్నం చేసుకుంది. కరీంనగర్స్పోర్ట్స్/హుజూరాబాద్: చిన్నప్పటి నుంచి పిల్లలకు ఏది కావాలన్నా కాదనకుండా ఇవ్వాలి అనే భావన రోజురోజుకీ తల్లిదండ్రుల్లో పెరుగుతోంది. ఇది అతిగా మారితే పిల్లలు క్రమశిక్షణ కోల్పోవడమే కాకుండా, తల్లిదండ్రుల మాట విన కపోవడం, మారాం చేయడం, అడిగింది కొనివ్వ లేదని మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పిల్లలు అడిగారని అవసరం లేకపోయినా కొనివ్వడం, వారేం చేసినా వారించకపోవడం అతి గారాబంగా పరిగణించవచ్చు. దీనిని చిన్నప్పటి నుంచే కట్టడి చేయాలి. లేదంటే మానసిక ప్రవర్తనతో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల పాత్ర ఏమిటి..? అవసరం లేని విషయాలకు ‘కాదు’ అనడం నేర్పాలి. మొబైల్, టీవీ, గేమ్స్, ఖర్చులకు స్పష్టమైన నియమాలు పాటించాలి. చిన్న వయస్సు నుంచే ఇంట్లో పనులకు బాధ్యతలు అప్పగించాలి. పిల్లలతో మాట్లాడటానికి సమయం కేటాయించి వారి భావోద్వేగాలను అర్ధం చేసుకోవాలి. వారు అడిగిన దానికి ప్రత్యామ్నాయంగా వారికి ఉపయోగపడే వస్తువును కొనడం, ఆరోగ్య కరమైన జీవన శైలిని అలవాటు చేయాలి. అతి నిరాశ, ఒంటరితనం, మౌనం కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. జపాన్..: చిన్న వయస్సు నుంచే ఆత్మ నియంత్రణ, సామూహిక బాధ్యత నేర్పిస్తారు. యూరప్ దేశాలు..: పిల్లలకు స్వేచ్ఛతో పాటు చిన్నచిన్న పనుల్లో బాధ్యతలు అప్పగిస్తారు. అమెరికా..: పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెడతారు. స్కూళ్లలోనే కౌన్సెలింగ్ వ్యవస్థలు ఉన్నాయి.పిల్లలు అడిగిన ప్రతిదీ కొనివ్వడం మొదలుపెట్టాక వాళ్లకు అగడం అనే భావనే ఉండదు. ఒకటి దొరికితే ఇంకొకటి కావాలి అంటారు. చివరికి అవసరం ఏది, కోరిక ఏది అనే తేడా వాళ్లకు తెలియకుండా పోతుంది. ప్రతిసారి అడిగినదంతా కొనివ్వడం ప్రేమ కాదు అని నాకు అనిపిస్తుంది. – కోడూరి సత్యనారాయణ, డ్రాయింగ్ మాస్టర్, కరీంనగర్ ఏది పడితే అది కొనివ్వడం వల్ల పిల్లలు బాధ్యతలేని అలవాట్లు నేర్చుకుంటారు. డబ్బు విలువ తెలియదు. మొండిగా ప్రవర్తించడం అలవాటుగా మారుతుంది. ‘లేదు’ అనే మాటను కూడా అంగీకరించడం పిల్లలు నేర్చుకోవాలి. – బి.అనితరాణి, ప్రైవేటు టీచర్, కరీంనగర్ప్రస్తుతం చిన్నారులు అతి సున్నితమైన పెంపకంలో పెరుగుతున్నారు. వారికి కావాల్సినవి క్షణాల్లో దొరుకుతుండటంతో దాని విలువ తెలియకుండా పోతుంది. పిల్లలు అడిగిన వెంటనే తల్లిదండ్రులు ఆ వస్తువు తెలియజేయకుండా ఇస్తుండటంతో వారికి ఇస్తూ గారబం చేస్తున్నారు. పెద్దయ్యాక కూడా వారిలో అదే ప్రవర్తన జరుగుతుంది. క్రమశిక్షణ, మానసిక సైర్థ్యంతో పిల్లలను పెంచాలి. – వర్షి, మానసిక వైద్యనిపుణులు, హుజూరాబాద్ -
పోటెత్తిన భక్తులు
● మూడోరోజు సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు ● జనసంద్రమైన జాతర ప్రాంగణాలు ● నేడు అమ్మవారల వన ప్రవేశంభక్తుల కొంగుబంగారం సమ్మక్క– సారలమ్మను శుక్రవారం దర్శించుకునేందుకు జనం పోటెత్తారు. జిల్లాలోని గోదావరిఖని, గోలివాడ, ఓదెల మండలం కొలనూర్, సుల్తానా బాద్ మండలం నీరుకుల్ల తదితర ప్రాంతాల్లోని జాతరకు వేలాదిగా తరలివచ్చి అమ్మ వారలను దర్శించుకున్నారు. ఎత్తుబంగారం, తలనీలాలు, ఎదుర్కోళ్లు తదితర మొక్కులు చెల్లించుకున్నారు. చల్లగా చూడాలని వేడుకున్నారు. ధర్మారం మండలం నర్సింగపూర్లో సమ్మక్క–సారలమ్మను మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్ బంగారం మొక్కు చెల్లించుకున్నారు. రామగుండం ఇన్చార్జి కమిషనర్ అరుణశ్రీ కుటుంబ సమేతంగా గోలివాడలో పూజలు చేశారు. గోదావరిఖనిలో అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలివచ్చారు. – సాక్షి నెట్వర్క్,పెద్దపల్లి -
కుష్టు నిర్మూలన అందరి బాధ్యత
పెద్దపల్లి: కుష్టును నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లిలోని జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. కుష్టు నిర్మూలనలో భాగస్వాములు అవుదామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్పర్శ లేని రాగి, గోధుమరంగు మచ్చలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు బి.శ్రీరాములు, కె.రమేశ్, బి.దేవిసింగ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉమామహేశ్వర్, ఎంపీహెచ్ఈవో రాజేశ్, ప్రిన్సిపాల్ దీప్తి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నామినేషన్ సమర్పయామి!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో మొదటి ఘట్టం పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మునిసిపాలిటీల పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించిన ప్రతీ ఒక్కరు తమ నామినేషన్ను పార్టీ తరఫున, ఇండిపెండెంట్గా ఇలా రెండు సెట్లు దాఖలుచేసి ఎన్నికలు మేము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు. ఒక్కో వార్డు, డివిజన్లో ఒకే పార్టీకి చెందిన ముగ్గురు, నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది. వారిని బుజ్జగించేందుకు సీనియర్లు రంగంలోకి దిగారు. ఒకరికి అవకాశంఇచ్చి మిగతా వారు తప్పుకోవాలని చెబుతుండడంతో.. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రెబల్స్గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలలో అసంతృప్తి మంటలు రాజుకుంటున్నాయి. పార్టీల అధిష్టానాలు ప్రకటించిన అభ్యర్థులపై పోటీకి సిద్ధమవుతున్న పలువురు స్థానిక నాయకులు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా తగ్గేది లేదు, తప్పుకునేది లేదు.. అంటూ రెబల్స్ స్పష్టంగా చెబుతుండటంతో ఎన్నికల సమీకరణాలు మారే పరిస్థితి కనిపిస్తోంది. రంగంలోకి సీనియర్లు.. నామినేషన్ల ప్రక్రియపూర్తయిన నేపథ్యంలో శనివా రం నామినేషన్ల పరిశీలన జరగనుంది. పరిశీలనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని తిరస్కరిస్తారు. మిగతా నామినేషన్లు యాఽథావిధిగా ఉంటాయి. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఈ సమయం పార్టీలకు కీలకం. మూడు రోజుల గడువులో అసమ్మతి వర్గాలను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు నేతలతో చర్చలు జరిపి రెబల్స్ను వెనక్కి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు నాయకులు మాత్రం పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామంటూ పట్టుదలగా ఉండడం గమనార్హం. గెలుపు ఓటములపై రెబల్స్ ప్రభావం ఉమ్మడి జిల్లాలో రెబల్స్ ప్రభావం ఆయా మున్సిపాలిటీల్లో పార్టీల గెలుపుపై తీవ్రంగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకేపార్టీ ఓట్ల చీలిక జరిగితే ప్రత్యర్థులకు లాభం చేకూరే పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు. ఇక చివరిరోజు నామినేషన్లతో ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కింది. అభ్యర్థుల బలాబలాలు, రెబెల్స్ నిర్ణయాలే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాలను నిర్ణయించనున్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మెజారిటీ సీట్లు గెలుచుకొని మున్సిపాలిటీలను కై వసం చేసుకోవాలంటే అసమ్మతి నేతలు, రెబల్స్ బెడద లేకుండా ప్రధాన పార్టీల నేతలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కరీంనగర్లో అత్యధికం... రాయికల్లో అత్యల్పం... ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీలలో పాగా వేసేందుకు ఆయా పార్టీల నేతలతో పాటు ఇండిపెండెంట్ల నామినేషన్ల జోరు కొనసాగింది. కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉండగా, అత్యధికంగా 1,248 నామినేషన్లు దాఖలయ్యాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా, 100 నామినేషన్లు దాఖలయ్యాయి.కరీంనగర్ కార్పొరేషన్: డివిజన్లు: 66, నామినేషన్లు: 1,248 చొప్పదండి : వార్డులు : 14, నామినేషన్లు : 117 హుజూరాబాద్: వార్డులు:30, నామినేషన్లు : 304 జమ్మికుంట: వార్డులు :30, నామినేషన్లు : 341 జగిత్యాల: వార్డులు : 50, నామినేషన్లు : 530 కోరుట్ల : వార్డులు 33, నామినేషన్లు: 337 రాయికల్ : వార్డులు :12, నామినేషన్లు : 100 మెట్పల్లి : వార్డులు : 26, నామినేషన్లు : == ధర్మపురి : వార్డులు : 15, నామినేషన్లు : 113 సిరిసిల్ల: వార్డులు: 39, నామినేషన్లు : 429 వేములవాడ : వార్డులు : 28, నామినేషన్లు : 260 రామగుండం కార్పొరేషన్: డివిజన్లు: 60, నామినేషన్లు : 706 పెద్దపల్లి : వార్డులు : 36, నామినేషన్లు : 339 సుల్తానాబాద్: వార్డులు : 15, నామినేషన్లు : 139 మంథని : వార్డులు : 13, నామినేషన్లు : 158 -
గుట్టపై సాగుకు ప్రోత్సాహం
పెద్దపల్లిరూరల్: గుట్టపై సేద్యం చేయడం..గట్టుసింగారం గ్రామ ప్రత్యేకం. పెద్దపల్లి మండలం సబ్బితం శివారులోని జనరహిత రెవెన్యూ గ్రామంగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న గట్టుసింగారం గుట్టపై తనకున్న 32 ఎకరాల్లో ఆయిల్పాం పంట సాగుకు రైతు దుగ్గెంపూడి రవీందర్రెడ్డి ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని ఉద్యానవన అధికారి జగన్మోహన్రెడ్డి, రైతు రవీందర్రెడ్డి కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం గుట్టపై సాగును పరిశీలించేందుకు కలెక్టర్ వచ్చారు. గుట్టపైకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టర్పై కలెక్టర్, ఉద్యానవన అధికారి, సదరు రైతు చేరుకున్నారు. అక్కడి వాతావరణాన్ని కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఆయిల్పాం సాగుకు ముందుకొచ్చే రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. గుట్టపై సాగు చేసే రైతాంగానికి అవసరమైన విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు రూ.9లక్షలు కేటాయించి పనులు పూర్తి చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయండి మంథని: జిల్లాలో వచ్చే ఏడాదిలో జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరినదికి మహా పుష్కరాలు జరుగుతాయన్నారు. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లకు ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో సురేశ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
తిరస్కరిస్తే అప్పీల్కు అవకాశం
కోల్సిటీ(రామగుండం): తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీలు చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రామగుండం నగరంలోని ముబారక్నగర్, సప్తగిరికాలనీల్లోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను కమిషనర్ అరుణశ్రీతో కలిసి గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగుతోందన్నారు. రామగుండం నగరంలోని 60 డివిజన్ల పరిధిలో 8 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, శుక్రవారం వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు., ఈనెల 31న నామినేషన్ల పరిశీలన పూర్తిచేసి సరిగ్గా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు. తిరస్కరించిన నామినేషన్లపై ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటల వరకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించామని, 2న పరిష్కరిస్తామని, 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని ఆయన వివరించారు. -
నామినేషన్ల జోరు
● రెండోరోజూ కొనసాగిన అభ్యర్థుల రద్దీ ● నేటితో ముగియనున్న గడువు కోల్సిటీ(రామగుండం): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి జోరందుకుంది. మొత్తం 124 వార్డులు/డివిజన్లకు తొలిరోజు 102 నామినేషన్లు దాఖలుకాగా రెండోరోజూ గురువారం 338 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు, పార్టీ నేతలు, ఆశావహులు, మద్దతుదారులతో నామినేషన్ స్వీకరణ కేంద్రాలు కిటకిటలాడాయి. శుక్రవారం నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది. పార్టీల మధ్య పోటీ వివిధ రాజకీయ పార్టీల మధ్య పోటీతీవ్రంగా ఉంది. ఒక్కోవార్డుకు ఒకటికిమించి నామినేషన్లు దాఖలవుతున్నాయి. అధికార పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్షాలు, చిన్నపార్టీలు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో బరిలో దిగుతున్నారు. ఉదయం నుంచే నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు మద్దతుదారులతో సందడి చేశారు. మధ్యాహ్నానికి రద్దీ పెరిగింది. కొందరు అనుచరులతో కలిసి ర్యాలీలతో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామగుండం కార్పొరేషన్లోని 46వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మహంకాళి స్వామి గురువారం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్తో కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పోలీసుల ప్రత్యేక బందోబస్తు జిల్లాలోని రామగుండం కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాల్టీల్లోని నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. సజావుగా నామినేషన్ల స్వీకరణ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణను సజావుగా చేపట్టారు. అభ్యర్థులకు మార్గదర్శకాలు అందిస్తున్నారు. పత్రాలు సక్రమంగా ఉన్నాయా, అవసరమైన ధ్రువపత్రాలు జతచేశారా? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ శుక్రవారంతో గడువు ముగియనున్న నేపథ్యంలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆశావహులు కొందరు నో డ్యూ సర్టిఫికెట్ కోసం బల్దియా కార్యాలయాల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. శుక్రవారం గడువు ముగిసే వరకు నామినేషన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది. రెండోరోజు నామినేషన్లు రామగుండం 168 పెద్దపల్లి 77 మంథని 56 సుల్తానాబాద్ 37 -
ఉడ్తి పతంగ్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మజ్లిస్–ఎ–ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పలుమార్లు సత్తా చాటుకున్న పతంగ్పార్టీ మరోసారి విజయబావుటా ఎగరేసేందుకు సన్నద్ధమవుతోంది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తగినన్ని సీట్లు సంపాదించి పురపాలికల్లో కింగ్మేకర్ కావాలని ప్రణాళికలు రచిస్తోంది. తన సుదీర్ఘ రాజకీయ మిత్రపార్టీ అయిన కాంగ్రెస్తో మరోసారి జట్టు కట్టేందుకు లేదా అవగాహనతో ముందుకు వెళ్లేందుకు పావులు కదుపుతోంది. రెండు దశాబ్దాలుగా కరీంనగర్ కార్పొరేషన్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో చెప్పుకోదగ్గ స్థానాల్లో ఉనికి చాటుకుంటూ వస్తోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అసెంబ్లీ, బల్దియా ఎన్నికల్లో వీరి పొత్తు అనివార్యం అయ్యేలా చక్రం తిప్పడం ఆ పార్టీకే చెల్లింది. కరీంనగర్లో కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎంఐఎం పార్టీ 2005లో తొమ్మిది కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంది. 2014లో రెండు కార్పొరేటర్లకు పరిమితమైంది. 2020లో పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు స య్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో 10 సీ ట్లకు పోటీచేసి ఏడు సీట్లు గెలుచుకుంది. ఒక కో–ఆప్షన్ను బీఆర్ఎస్ పార్టీతో పొత్తులో భాగంగా కై వ సం చేసుకుంది. ఎంఐఎం అంటే ఒకప్పటిలా కేవలం ముస్లిం మైనార్టీలకే పరిమితం కాలేదు. హిందువులు మెజారిటీ ఉన్న చోట్ల వారినే నిలబెట్టి గెలిపించుకునేలా వ్యూహాలు రచించిచడం ఆ పార్టీకి కొత్తేమీకాదు. హైదరాబాద్లో విజయవంతమైన ఈ ఫా ర్ములా రాష్ట్రంలో అన్ని చోట్లా అమలు పరుస్తోంది. కరీంనగర్లో నలభై డివిజన్లలో కమిటీలను ఏర్పా టు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కలుపుకొని ఈసారి 20 చోట్ల పోటీ చేస్తోంది. ఇందులో కనీసం 15 స్థానాలు గెలుచుకొని కరీంనగర్ కార్పొరేషన్లో కింగ్ మేకర్ పాత్రను పోషిస్తూ.. మూడు లేదా నాలుగు కోఆప్షన్లను కై వసం చేసుకునేలా పావులు కదుపుతోంది. మొన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న ఎంఐ ఎం నిన్న మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 125 మంది కార్పొరేటర్లను గెలుచుకొని సత్తా చాటింది. అదే ఊపుతో తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, బోధన్లో పాగా వేసేందుకు కసరత్తు చేస్తోంది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో 2020లో జగిత్యాలలో రెండు, కోరుట్లలో రెండు చొప్పున కౌన్సిలర్ స్థానాలను ఎంఐఎం గెలుచుకుంది. మెట్పల్లిలో ఒకటి, పెద్దపల్లిలో రెండు కౌన్సిలర్ సీట్లను కై వసం చేసుకుంది. రామగుండంలో ఎంఐఎం పార్టీ మద్దతుతో పలువురు అభ్యర్థుల విజయం సాధించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒకరిద్దరు సిట్టింగ్ కార్పొరేటర్లకు అవినీతి బంధుప్రీతి పార్టీ నియమావళి ఉల్లంఘన తదితర కారణాల వల్ల టికెట్ల ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. ఒకప్పుడు ఎంఐఎం పార్టీ టికెట్ కోసం పెద్దగా పోటీ ఉండేది కాదు. కానీ ప్రస్తుతం రాజకీయ వలసలు, ముస్లిం దళిత సామాజిక వర్గాల్లో వచ్చిన స్పందనతో డిమాండ్ పెరిగిపోయింది. ఎంఐఎం అధినేత ఎంపీ అసద్ ఆదేశాల మేరకు అన్ని డివిజన్లలో మూడు రకాల సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి ఎలాగైనా 15 స్థానాల్లో గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధపడుతోంది. -
కాంగ్రెస్ను నిలదీయాలి
● మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని: అసెంబ్లీ ఎన్నికలో హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రె స్ నాయకులను కార్పొరేషన్ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వస్తే ని లదీయాలని మాజీ ఎమ్మెల్యే కో రుకంటి చందర్ కోరారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అబద్ధాలు, మొసాలకు కేరాఫ్ కాంగ్రెస్ అని మండిపడ్డారు. అభయహస్తంకార్డు ప్రతీఇంటికి అందిస్తామని నమ్మబలికి.. గెలిచాకా మొండిచెయ్యి చూపించారన్నారు. 420 హామీలు, ఆ రు గ్యారెంటీలు ఇచ్చి 100రోజుల్లో అమలు చేస్తామని చెప్పి వాటిఊసే ఎ త్తడం లేదన్నారు. మున్సిపల్ సిబ్బంది బీఆర్ఎస్ ఫ్లెక్సీలనే తొలగించింద ని, కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. మూల విజయారెడ్డి, నడిపెల్లి అభిషేక్రావు, అయిలయ్యయాదవ్, మారుతి ఉన్నారు. -
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
పెద్దపల్లిరూరల్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ను బల్దియా అధికారులు బుధవారం విడుదల చేశారు. కమిషనర్ వెంకటేశ్.. మాస్టర్ ట్రెయినర్ కృష్ణారెడ్డి, రిటర్నింగ్ అధికారులతో కలిసి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 30వ తేదీ వరకు 36 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తామని, 31న పరిశీలన ఉంటుందని, ఫిబ్రవరి 1న తిరస్కరణపై అప్పీలు చేసుకోవచ్చని, 2న పరిష్కారం ఉంటుందని, 3న మధ్యాహ్నం 3గంటల వరకు ఉపసంహరణ గడువు ఉంటుందని అధికారులు వివరించారు. అదేరోజూ పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని వారు వెల్లడించారు. యువతకు ఉచిత శిక్షణ పెద్దపల్లి: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కరీంనగర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నామని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంకింగ్, రైల్వే, స్టాఫ్ సెలక్షన్ తదితర ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వారికోసం ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు http://tsstudycircle. co.in వెబ్సైట్లో ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేయాలన్నారు. ఫిబ్రవరి 8న కరీంనగర్లో ప్రవేశ పరీక్ష నిర్వహిచి 100 మందిని ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు 98852 18053 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు. ఆధునికంగా తీర్చిదిద్దుతా గోదావరిఖని: గోదావరిఖని ప్రెస్క్లబ్ను రాష్ట్రంలోనే అన్నిహంగులతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని, దీనికోసం రూ.కోటి వెచ్చించేందుకై నా వెనుకాడేది లేదని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు. సోషల్ మీడియా రాతలు, విషప్రచారాన్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. ప్రజలు విశ్వసించేలా వార్తలు, కథనాలు ఉండాలని సూచించారు. ప్రెస్క్లబ్ అధ్యక్షుడు దేవరనేని మాధవరావు, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బొంతల రాజేశ్, క్లబ్ ఫౌండర్లు అల్లెంకి లచ్చయ్య, వేల్పుల నారాయణ, నాయకులు మాదాసి రాంమూర్తి, పూదరి కుమార్, కాల్వ చంద్రశేఖర్రెడ్డి, శ్యాంసుందర్, కేఎస్ వాసు, జక్కం సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలి జ్యోతినగర్(రామగుండం): కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలని సీపీఐ(ఎంల్) మాస్లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ లేబర్గేట్ వద్ద కేంద్ర బుధవారం నిరసన తెలిపారు. గుమ్మడి వెంకన్న, ఇసంపల్లి రాజేందర్తో కలిసి శ్రీనివాస్ మాట్లాడారు. కార్మికులకు హక్కులు, రక్షణ లేకుండా పోతోందన్నారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. కార్పొరేట్ల ప్రయోజనం కోసమే పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఆదివాసుల హక్కులు కాలరాస్తోందని మండిపడ్డారు. నాయకులు శంకర్, చంద్రన్న, భూషణం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీలో చోటు జూలపల్లి(పెద్దపల్లి): ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తెలుకుంట ఉపసర్పంచ్ దావు సంపత్రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పుల మహేశ్ బుధవారం నియామకపత్రం ఆందజేశారు. ఆయనను పలువురు అభినందించారు. -
అవకాశం వచ్చింది.. ఆలోచన చేయండి
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంథని: మంథని పరిరక్షణ, అభివృద్ధి కోసం మేధావులు ఆలోచించాలని మా జీ ఎమ్మెల్యే పుట్ట మధు కోరారు. స్థానిక రాజగృహలో బుధవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో పోచమ్మవాడలో 92, కూచిరాజ్పల్లిలో వందకుపైగా ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. పోచమ్మవాడలో నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయిస్తే ఆనాడు అనేక అడ్డంకులు పెట్టారని, స్థానికులు లేరంటూ ఫిర్యా దు చేశారని గుర్తుచేశారు. ఆగిపోయిన 17 ఇళ్లు 24నెలలు గడుస్తున్నా పేదలకు ఇవ్వకుండా ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు ఇస్తున్నారని అన్నారు. ఓట్లు వచ్చినప్పుడు ఆలోచన చేయాలని కేసీఆర్ చెప్పినట్లుగా.. ప్రజలకు మంచిఅవకాశం వచ్చిందని ఆయన అన్నారు. నాయకులు తరగం శంకర్లాల్, ఏగోళపు శంకర్గౌడ్, అరెపల్లి కుమార్, కాయిత సమ్మయ్య, ఆకుల రాజబాపు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది కేసీఆరే..
పెద్దపల్లి: రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది బీఆర్ఎస్ అధినేత కేసీఆరేనని పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. సుల్తానాబాద్లో బుధవారం జరిగిన పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ఆయన మాట్లాడా రు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు రూ.అరవై ఎనిమిది వేల కోట్ల అప్పులు ఉండగా, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని, వడ్డీ నెలకురూ. 6,000 కోట్లు కట్టాల్సి వస్తోందని అన్నారు. స్థానిక ఎన్నికల మాదిరిగానే పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయ మని ధీమా వ్యక్తం చేశా రు. సమర్థత ఉన్నా.. టికెట్ రాకుంటే పార్టీ పదవులు, లేదా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధా న్యం ఇస్తామని, కాదని పోటీచేస్తే చర్యలు తప్ప వని హెచ్చరించారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఒక్కోస్థానానికి పది మందికిపైగా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా.. సర్వే నివేదికల ప్రామాణికంగా టికెట్లు కేటాయిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడారు. నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్రావు, ఈర్ల స్వరూప, సారయ్యగౌడ్, సాయిరి మహేందర్, చీకట్ల మొండయ్య, శ్రీగిరి శ్రీనివాస్, వేగోళం అబ్బయ్యగౌడ్, బిరుదు సమత, ఊట్ల వరప్రసాద్, శ్రీనివాస్, తొర్రి కొండ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, రైస్మిల్లులకు విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని, వాటిని సవరించాలని రైస్ మిల్లర్స్ అసోసి యేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు మంత్రులకు వినతిపత్రం అందజేశారు. మంత్రులు శ్రీధర్, జూపల్లి కృష్ణారావు -
దారులన్నీ మేడారం వైపే..
మంథని: మహారాష్ట్రతోపాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మంథని మీదుగా వందలాది వాహనాలు మేడారం తరలివెళ్తున్నాయి. పెద్దపల్లి–కాటారం – గోదావరిఖని మధ్య రోడ్డు మరమ్మతు, కొత్త రహదారుల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగైంది. మహిళలకు ఉచిత ప్రయాణం వర్తింపజేస్తుండడంతో చాలామంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రమాదకరంగా మూలమలుపులు.. పెద్దపల్లి–కాటారం–గోదావరిఖని మధ్య అనేక ప్రమాదకర మూలమలుపులు, ఇరుకు వంతెనలు, కల్వర్టులు ఉన్నాయి. గత జాతర వేళ మంథని మండలం ఎక్లాస్పూర్ మూలములుపు వద్ద మేడారం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. కాటారం – గోదావరిఖని మధ్య కూడా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి మంథని నియోజకవర్గంలోని మహాముత్తారం మండలం కేశవాపూర్ మూలమలుపు వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. మూలమలుపుల వద్ద సూచికలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాల్సి ఉంది. -
వనదేవతల వైభవం
గోదావరిఖనిలో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్న భక్తులుగోదావరిఖనిలో సారలమ్మను గద్దెకు తీసుకొస్తున్న కోయపూజారులు‘ఖని’లో గద్దెకు వస్తున్న అమ్మవారుశివసత్తుల పూనకంగోదావరిఖని/పెద్దపల్లిరూరల్: ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క – సారలమ్మ మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శివసత్తుల పూనకాలు, కోయ పూజారుల ప్రత్యేక పూజ లు, భక్తుల మొక్కులు జాతర ప్రాంగణాలను మా ర్మోగించాయి. తొలిరోజు సారలమ్మ అమ్మవారు గద్దెకు చేరుకున్నారు. గురువారం సమ్మక్క గద్దెకు వస్తారు. శుక్రవారం అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం గిరిజనదేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. పోటెత్తిన గోదావరితీరం.. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ తన సతీమణి మనాలీ ఠాకూర్ కలిసి రామగుండం నగర శివారులోని గోదావరి తీరంలో సమ్మక్క – సారలమ్మ జాతర వద్ద ప్రత్యేక పూజలు చేసి వేడుకలు ప్రారంభించారు. కోయ పూజారులు గద్దెల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా నేతృత్వంగా ఏసీపీ రమేశ్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో పోలీసు బలగాలు భారీ బందోబస్తు చేపడుతున్నాయి. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల, గర్రెపల్లి, నారాయణపూర్, తొగర్రాయి సమ్మక్క–సారలమ్మ జాతరలూ వైభవంగా ప్రారంభమైంది. కోయ పూజారులు సారలమ్మను గద్దెకు తీసుకొచ్చారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరారు. గద్దెకు వచ్చిన సారలమ్మ నేడు సమ్మక్క తల్లి రాక గిరి‘జన’మహాజాతర ప్రారంభం కోయ పూజారులతో ప్రత్యేక పూజలు హాజరైన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోలివాడ, కొలనూర్, హన్మంతునిపేట, నీరుకుల్లలో పోటెత్తిన భక్తజనం -
బీ ఫామ్ టెన్షన్!
‘అన్న.. ఎటూ చెప్పడం లేదు.. చూస్తేనేమో టైం ఎక్కువ లేదు.. పార్టీ తరఫున ఒకటి, ఇండిపెండెంట్గా మరోనామినేషన్ ఎయ్యనా.. ముందే తొందరపడితే బీ – ఫామ్ రాకుండా పోతుందా.. ఏమీ సమజైతలే.. ఎవరికో ఒకరికి టికెట్ ఖరారు చేస్తే.. ఇది కాకపోతే సింహం గుర్తు అయినా తెచ్చుకుంటా.. కానీ, ఈసారి బరిలో నిల్చుండుడే.. మరోసారి రిజర్వేషన్ అనుకూలిస్తుందో లేదో.. అన్నను నమ్ముకొని ఉంటే బీ ఫామ్ రాకపోతే ఎట్లా?’ అని జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ సహా మూడు మున్సిపాలిటీల్లో ఇంకా టికెట్లు ఖరారు కాని ప్రధాన పార్టీలకు చెందిన పలువురు ఆశావహులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు.సాక్షి పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో బుధవారం రామగుండం కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. షెడ్యూల్ విడుదలైనా.. నామినేషన్ల స్వీకరణ మేడారం జాతర తర్వాత ఉంటుందనుకున్నా.. బుధవారం నుంచే నామినేషన్లు స్వీకరిస్తుండడంతో ఆశావహులు హైరానా పడుతున్నారు. కొందరు ఆస్తి తదితర పన్నులు చెల్లించి నోడ్యూ సర్టిఫికెట్లు తీసుకోవడం, కులం తదితర ధ్రువీకరణపత్రాలు, అఫిడవిట్లు తయారు చేసుకోవడంతోపాటు నామినేషన్ ఫామ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపారు. దీంతో తొలిరోజు జిల్లావ్యాప్తంగా నామినేషన్లు స్వల్పంగానే దాఖలయ్యాయి జిల్లాలో 102 నామినేషన్లు రామగుండం కార్పోరేషన్లో 60 వార్డులకు బీజేపీ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, స్వతంత్రులు ఒకరు.. మొత్తంగా 13 మంది తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మంథనిలో 13 వార్డులకు బీజేపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 13 మంది, సుల్తానాబాద్లో 15వార్డులకు బీజేపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి 11 మంది, బీఆర్ఎస్ నుంచి ఆరుగురు, చిన్నపార్టీల నుంచి ఇద్దరు, ఒక స్వతంత్ర అభ్యర్థితో కలిపి 24 మంది, పెద్దపల్లిలో 36 వార్డులకు 52 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 124 వార్డులకు 102 నామినేషన్పత్రాలు దాఖలయ్యాయి. గెలుపు గుర్రాల వేటలో పార్టీలు కార్పొరేషన్, మున్సిపల్ మేయర్, చైర్పర్సన్ పీఠాలే లక్ష్యంగా కాంగ్రెస్ గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తోంది. ప్రధానంగా సర్వే ఆధారంగా, భారీగా ఖర్చుచేసే సామర్థ్యం ఉన్నవారికే టికెట్లు ఇస్తోందంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు అన్నివార్డుల్లో అభ్యర్థులు లేక అధికార పార్టీ నుంచి టికెట్ రాని వారికి అవకాశం కల్పించేందుకు ఎదురుచూస్తున్నాయి. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరిరోజు కావడంతో అన్నిపార్టీల్లోనూ బీ ఫామ్లు దక్కించుకునే అదృష్టవంతులు ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సింహం గుర్తువైపు రెబెల్స్ చూపు పెద్దపల్లి: అధికార పార్టీలో టికెట్ దక్కనివారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎన్నికల గుర్తు సింహంపై దృష్టి సారించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం, మంథని బల్దియాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పోటీ చేసేందుకు సిద్ధమైన పలువురికి స్థానిక నాయకత్వం టికెట్లు నిరాకరించడంతో ఫార్వర్డ్ బ్లాక్ వైపు చూస్తున్నారు. తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత నాయకత్వంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై హక్కులు తీసుకోవడంతో ఆ పార్టీ నుంచి బరిలో దిగేందుకు వరుస కడుతున్నారు. ఇప్పటికే పలువార్డుల్లో కొందరు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అసమ్మతివాదుల సమావేశం పలు పార్టీల్లోని అసమ్మతి నాయకులు తెలంగాణ జాగృతి కార్యాలయ ఇన్చార్జి పొన్నమనేని బాలాజీరావు, జిల్లా కన్వీనర్ కోదాటి శ్రీనివాసరావుతో బుధవారం సుల్తానాబాద్లో సమావేశమయ్యారు. వార్డు/డివిజన్లలో పోటీచేసేవారు సింహం గుర్తును ఇష్టపడుతున్నారని నాయకులు తెలిపారు. మరోవైపు.. అన్ని మున్సిపల్ వార్డులు, డివిజన్లలో తమ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీలో నిలుపుతామని స్పష్టం చేశారు. ప్రారంభమైన నామినేషన్ల పర్వం తొలిరోజే 102 దాఖలు టికెట్ ఖరారు కానివారిలో తీవ్ర ఉత్కంఠ నామినేషన్ వేద్దామా? వద్దా? అనే డైలామాలో మరికొందరు ఆశావహులుతొలిరోజు దాఖలైన నామినేషన్లు రామగుండం 13 పెద్దపల్లి 52 సుల్తానాబాద్ 24 మంథని 13 -
మంథని.. అనేక ప్రత్యేకతలు
మంథని: ప్రాచీన చరిత్రకు నిలువుటద్దంగా నిలిచిన మంథని వేదాలకు పుట్టినిల్లు. వేయి ఏళ్లకుపైగా మహోన్నత చరిత్ర కలిగిన మంథని.. మంత్రపురిగానూ పేరుగాంచింది. దేశఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతోపాటు అనేకమందికి దేశ రాజకీయాల్లో గుర్తింపునిచ్చింది మంథని. వేదాలు, మేధావులకు నిలయంగా మారింది. ఆధ్యాత్మిక కేంద్రంగానూ గుర్తింపు పొందింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా వినాయకుని గుడి, దక్షిణ భారతదేశంలో ఏకై క పశ్చిమ ముఖ శివలింగం మంథనిలోనే దర్శనమిస్తాయి. అన్నిదేవతల ఆలయాలనూ పురాణకాలంలోనే నిర్మించారు. నియోజకవర్గ కేంద్రమైన మంథని గతంలో సమితిగా ఉండేది. ప్రస్తుతం పురపాలక సంఘం ఎన్నికలపై సర్వత్రా ఆసక్తినెలకొంది. -
నన్ను ఏకాకి చేశావా చెల్లె..
చందుర్తి(వేములవాడ): ‘ఇన్నాళ్లు మనకు ఎవరూ లేకున్నా.. ఒకరికొకరం తోడునీడగా ఉన్నాం.. కష్టసుఖాలను పంచుకున్నాం.. ఇప్పుడు నన్ను ఏకాకి చేసి వెళ్లిపోయావా చెల్లె.. నేను ఎవరి కోసం బతకాలె..’ అంటూ చెల్లె మృతదేహం వద్ద అక్క రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో విషాదం నింపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. బండపల్లికి చెందిన తోకల బుచ్చవ్వ– మల్లయ్య దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు సంతానం. పెద్ద కూతురు లచ్చవ్వ, రెండో కూతురు మల్లవ్వ(53)కు గతంలోనే పలువురితో పెళ్లి కాగా, విడాకులు తీసుకుని తల్లిగారింట్లో ఉంటుండగా, మరో ముగ్గురు వారివారి అత్తవారిళ్లలో ఉంటున్నారు. పెద్ద కూతురు, రెండో కూతురు కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచేవారు. తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే మృతిచెందగా, లచ్చవ్వ, మల్లవ్వ ఒకరికొకరు తోడునీడగా జీవనం సాగిస్తున్నారు. వీరికి వారసులు లేరు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో సోమవారం వరినాటు వేసి వచ్చిన మల్లవ్వ మంగళవారం వేకువజామున అస్వస్థతకు గురై అకస్మాత్తుగా మృతిచెందింది. చెల్లె మరణాన్ని తట్టుకోలేని అక్క గుండెలవిసేలా రోదించింది. అన్నీతానై కుటుంబాన్ని పోషించిన లచ్చవ్వ చివరకు చెల్లెకు తలకొరివి పెట్టేందుకు ఓ చేతిలో కుండ, మరో చేతిలో అగ్గి పట్టుకుని ముందు నడవడం చూసి గ్రామస్తులు కన్నీరుపెట్టారు. బాధితులది నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు విరాళాలు అందించారు. సర్పంచ్ కటకం మల్లేశం, మాజీ ఉపసర్పంచ్ గడ్డం శ్రీనివాస్రెడ్డి పాడే మోసి ప్రగాడ సంతాపం తెలిపారు. ఇన్నాళ్లు ఒకరికొకరు తోడునీడగా ఉన్న అక్కాచెల్లెలు అకస్మాత్తుగా చెల్లె మృతి చితికి నిప్పు పెట్టిన అక్క అంత్యక్రియలకు గ్రామస్తుల విరాళం బండపల్లిలో విషాదం -
మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల మహిళలలకు మంజూరైన దాదాపు 100 కుట్టు మిషన్లను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ మైనార్టీ మహిళాశక్తి రేవంతన్నక భరోసా’ కార్యక్రమం చేపట్టిందన్నారు. ముస్లిం మహిళలు కుట్టుమిషన్ల ద్వారా ఇంట్లోనే ఉపాధిపొందే అవకాశం ఉందన్నారు. త్వరలో మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, గంభీరావుపేటలో మైనార్టీల కోసం కమర్షియల్ కాంప్లెక్స్, మజీద్ అభివృద్ధి, అత్యాధునిక ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషిచేస్తానని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి కులమత, రాజకీయాలకతీతంగా సేవలందిస్తానన్నారు. సమష్టిగా పనిచేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుకుందామన్నారు. సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై పెద్దమ్మ బస్స్టేజీని ఎక్స్ప్రెస్ స్టాప్గా మార్చడానికి మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడడం జరిగిందని, త్వరలో ఉత్తర్వులు వస్తాయన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి భారతి, సర్పంచ్ మల్లుగారి పద్మ, ఉపసర్పంచ్ కమలాకర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ -
ఎల్లమ్మకు బోనం మొక్కులు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మీర్జంపేటలో మంగళవారం గౌడ కులస్తులు ఎల్లమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. తలపై బోనాలు, శివసత్తుల పూనకాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. అమ్మవారికి సారె, చీర, జాకెట్, గాజులు సమర్పించి ఒడిబియ్యం పోశారు. కల్లు, గుడాలు, బెల్లం పానకం నైవేద్యంగా సమర్పించారు. తమ పిల్లాపాపలను చల్లంగా చూడాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. సర్పంచ్ శైలజ, గౌడ సంఘం అధ్యక్షుడు ఉయ్యాల రవిందర్గౌడ్, జాతర కమటీ చైర్మన్ అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి● ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ ప్రభు త్వంతోనే అభివృద్ధి సాధ్యమని, తమ పార్టీ అభ్యర్థులనే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లాకేంద్రంతోపాటు సుల్తానాబాద్ శాసీ్త్రనగర్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరరం ఆయన మాట్లాడారు. వార్డుల్లో అభివృద్ధి కోసం స్థానిక నాయకులు తననే నేరుగా కలవాలని, ఇందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. సుల్తానాబాద్ 15వ వార్డు, బస్టాండ్ వెనకాల వీధిలో ఆయన పర్యటించి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. అభివృద్ధిని చూడండి సీఎం రేవంత్రెడ్డి పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును చూసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. పెద్దపల్లి మున్సిపల్ ఒకటోవార్డు(బంధంపల్లి)కి చెందిన పూరెళ్ల సుధాకర్, శైలజ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ ఈరబోయిన శ్రీనివాస్, మాదాసి రవి, తిరుపతి, కొలకాని రవి, నక్కశంకర్, మహేశ్ తదితరులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించాచి మాట్లాడారు. ప్రజాధనం వృథా గోదావరిఖని: రామగుండం నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని, ప్రజాధనం వృథా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. మంగళవారం ఆయన నగరంలో పర్యటించారు. కూల్చివేతలు కమీషన్ల కోసమేనని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ను వెంటనే పూర్తిచేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రతీడివిజన్లో డ్రైనేజీలు, రోడ్ల మరమ్మతులు, నల్లా కనెక్షన్ పనులు పూర్తిచేశామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మూల విజయారెడ్డి, కౌశిక హరి, నారాయణదాసు మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, ముద్దసాని సంధ్యారెడ్డి, సట్టు శ్రీనివాస్, అల్లం అయిలయ్య, ఆర్శనపల్లి శ్రీనివాస్, జిట్టవేని ప్రశాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘సురక్ష’తో సురక్షితం
క్యూ ఆర్కోడ్ ట్రాక్చేసే సురక్ష బ్యాండ్తో పిల్లల కదలికలను తెలుసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మేడారం జాతరకు వెళ్లే భక్తుల పిల్లలకు పెద్దపల్లి ఆర్టీసీ బస్టాండ్లో ఈ బ్యాండ్లు అందిస్తున్నారు. కోట్లాది మంది భక్తుల మధ్య పిల్లలు తప్పిపోయే అవకాశం ఉందని, వారిని ఎక్కడ ఉన్నా ఈజీగా కనిపెడతామని, ఇందుకు బ్యాండ్లు కట్టించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలు, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్నంబర్లు, ఊళ్ల చిరునామాలు రికార్డుల్లో నమోదు చేసి.. ఆ తర్వాత పిల్లలకు బ్యాండ్లు అందిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పోలీసు శాఖలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి
జ్యోతినగర్(రామగుండం): తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఎస్సీ రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీలో మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి పోలీసు విభాగం సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎస్సీల హక్కులు, రిజర్వేషన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. నియామకాలు, పదోన్నతులు, సేవా వ్యవహారాల్లో వివక్షత చూపొద్దని పోలీసు అధికారులకు సూచించారు. బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అన్నారు. ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సిఫారసు చేయడం ద్వారా ప్రమోషన్లలో కొంత ఉపషమనం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్బాబు, రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ, ఏజీపీ(లా అండ్ ఆర్డర్) రమణ, లీగల్ సెల్ అదనపు ఎస్పీ సతీశ్, సీఐడీ ఎస్పీ అనన్య, ఐఎస్డబ్ల్యూ ఎస్పీ శ్రీనివాస్రావు పాల్గొన్నారు. నేను దళిత మహిళను. కుమారస్వామి అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది. ఇప్పుడు ఇబ్బందులకు గురిచేసిండు. అన్యాయంగా నా ఇల్లును రిజిస్ట్రేషన్ చేసుకుని జైలుకు పంపించిండు. అప్పటి ఎస్సై ఉపేందర్ ఆయనకు సహకరించారు. కుమారస్వామి, ఎస్సై ఉపేందర్తోపాటు మరికొందరిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలి. – స్వరూప, నస్పూర్, మంచిర్యాల జిల్లా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ ఎన్టీపీసీలో పోలీసు అధికారులతో రాష్ట్రస్థాయి సమీక్ష -
కార్మికుల సమస్యలపై సుదీర్ఘ చర్చలు
జ్యోతినగర్(రామగుండం): సౌదీ అరేబియా రియాద్లో రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచస్థాయి గ్లోబల్ లేబర్ మార్కెట్ కాన్ఫరెన్స్లో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా తెలిపారు. మంగళవారం ప్రపంచ స్థాయి ముగింపు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఫోన్ ద్వారా పలు విషయాలను వెల్లడించారు. భారతదేశంలోని కార్మికులకు సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు సమానపనికి సమాన వేతనం చెల్లించడం అమలు కావడం లేదన్నారు. భారత ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్రఅన్యాయం జరుగుతోందని ఉదాహరణలతో సహా వివరించానని వెల్లడించారు. యువతకు చదువుతోపాటు తగిన వృత్తి నైపుణ్యాలను నేర్పించడం ద్వారా స్వయంగా జీవనం కొనసాగిస్తారని సూచించినట్లు స్పష్టం చేశారు. కార్మికుల హక్కులకు ఎలాంటి భంగం కలుగకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. -
ఓటుహక్కు వినియోగించుకోవాలి
ధర్మారం(ధర్మపురి): అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా డీవైవో వెంకటరాంబాబు కోరారు. జిల్లా యువజన వ్యవహారాల శాఖ, యువశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో మైభారత్, మై ఓటు అవగాహన ర్యాలీనిర్వహించారు. ఎంపీడీవో సుమలత, డీవైవో ర్యాలీ ప్రారంభించారు. వెంకటరాంబాబు మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో యువజన సంఘాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. యువజన సంఘాల నాయకులు దాగేటి ఉదయ్కుమార్, ఆర్ఐ వరలక్ష్మి, ప్రోగ్రాం ఆర్గనైజర్ రేషవేణి మహేశ్, యువశక్తి యూత్ వెల్పేర్ అధ్యక్షుడు సిదార్థ, కార్యదర్శి సోను, ఇర్ఫాన్, ధీరజ్, రిషిరాకేశ్, నితన్రాజు, రాహుల్ పాల్గొన్నారు. -
ఉత్పత్తిలో వెనక !
నూలు లేక..ఇదీ.. వేములవాడ వ్యవసాయ మార్కెట్ యార్డులోని నూలుడిపో. సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులకు అవసరమైన నూలును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లతో ఏర్పాటు చేసింది. పది శాతం డబ్బులు చెల్లించిన మధ్యతరగతి వస్త్రోత్పత్తిదారులకు నూలు ఇవ్వాలి. కానీ మూడు నెలలుగా నూలు లేక నేతన్నలకు ప్రభుత్వం ఇచ్చిన ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తిలో మధ్యతరగతి ఆసాములు వెనకబడ్డారు. ఒక్క జరీ నూలు మాత్రమే ఈ డిపోలో అందుబాటులో ఉంది. చీరల బట్ట ఉత్పత్తికి అవసరమైన వెప్ట్(అడ్డం పోగులు), వార్ప్(నిలువు పోగులు) నూలు అందుబాటులో లేదు. దీంతో చీరల ఉత్పత్తి ముందుకుసాగడం లేదు. ఆర్డర్లు : 1.71 కోట్ల మీటర్లు ఆర్డర్ల విలువ : రూ.60కోట్లు ఆర్డర్లు పొందిన మ్యాక్స్లు : 130 ఉత్పత్తి ప్రారంభించిన మ్యాక్స్లు : 15 సిరిసిల్లలోని సాంచాలు : 24,560 ఉత్పత్తి చేస్తున్న సాంచాలు : 6,950 ఇప్పటికే ఉత్పత్తి అయిన చీరల బట్ట : 25 లక్షల మీటర్లు చీరల బట్ట ఉత్పత్తి గడువు : 2026, జనవరి 31 -
ప్రతిభచూపిన ఎడ్లబండి
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దాపూర్ గ్రామానికి చెందిన అమ్ముల మహేశ్ ఎడ్లబండి రాష్ట్రస్థాయి పోటీల్లో రెండోస్థానంలో నిలిచింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపెల్లి గ్రామంలో నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీల్లో మహేశ్ ఎడ్లబండి అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. దీంతో నిర్వాహకులు రూ.20వేల నగదు, ప్రశంసాపత్రం అందజేశారు. విజేతను సర్పంచ్ తొగరు శ్రీనివాస్, పంచాయతీ పాలకవర్గం, కరాటే కోచ్ సంకెన్ల లక్ష్మణ్ అభినందించారు. మట్టి లారీల అడ్డగింత పాలకుర్తి(రామగుండం): జయ్యారం శివారు లోని గుట్టల నుంచి మట్టి తరలిస్తున్న లారీల ను సర్పంచ్ కాసర్ల కిరణ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మంగళవారం అడ్డుకున్నారు. మూడురోజులుగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని రెవెన్యూ, మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారని, దీంతో వే బిల్లులతో మట్టి తీసుకెళ్లేందుకు అనుమతించామని, అయినా, వే బిల్లులు లేకుండానే మట్టి తరలిస్తున్నారని సర్పంచ్ ఆరోపించారు. కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ సునీత ఘటనా స్థలానికి చే రుకున్నారు. మట్టి తరలించేందుకు వేబిల్లులు ఉండాలని నిర్వాహకులకు సూచించారు. బ్యాంకు ఉద్యోగుల నిరసన గోదావరిఖనిటౌన్/పెద్దపల్లి: వారంలో ఐదురోజుల పనిదినాల పద్ధతి అమలు చేయాలనే డిమాండ్తో గోదావరిఖని, పెద్దపల్లితోపాటు పలు ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగులు మంగళవారం ఆందోళనలు చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. నాయకులు నరేశ్, సతీశ్, ఉదయ్కుమార్, దిలీప్, సాగర్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జెండా చౌరస్తా నుంచి కమాన్ చౌరస్తా వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు సదానందం, శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు. ‘ఎల్లంపల్లి’ నీటి విడుదల రామగుండం: సమ్మక్క – సారలమ్మ జాతర నేపథ్యంలో భక్తుల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మంగళవారం గోదావరిలోకి నీటిని వి డుదల చేశారు. ఈనెల 28వతేదీ నుంచి మూ డు రోజుల పాటు సుమారు 0.3 టీఎంసీలు వి డుదల చేస్తామని నీటి పారుదల శాఖ అధికారి బుచ్చిబాబు తెలిపారు. భక్తుల పుణ్యస్నానా లు, ఇతర అవసరాలకు నీరు ఉపయోగపడుతుందన్నారు. నీటి ఉధృతి దృష్ట్యా పశువుల కాపరులు గోదావరినది దాటొద్దని, రాకపోకలు సాగించరాదని ఆయన సూచించారు. నియామకం పెద్దపల్లి: తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షు లుగా దుగ్యాల శ్రీనివాస్రావు, దామరపల్లి జయపాల్రెడ్డి, ఎలగం కనకయ్య, రాజేశ్వర్రావును నియమించారు. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా శ్రీనివాస్రావు, జయపాల్రెడ్డి హైదరాబాద్లో కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. క్వింటాల్ పత్తి రూ.8,011 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మంగళవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.8,011గా నమోదైంది. కనిష్టంగా రూ.6,088గా, సగటు రూ.7,661గా పలికిందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. -
బల్దియా నగారా!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన దరిమిలా కోడ్ అమల్లోకి వచ్చింది. 28వ తేదీ (నేటి) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 30వ తేదీ వరకు కొనసాగనుంది. 31న పరిశీలన, 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ, అదే తేదీన తుదిజాబితా ఖరారు కానుంది. ఫిబ్రవరి 11న ఉమ్మడి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. 12వ తేదీని రీపోలింగ్ కోసం ముందుజాగ్రత్తగా రిజర్వుచేసి ఉంచారు. ఇప్పటికే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వార్డుల పునర్విభజన, ఓటరు తుదిజాబితా, పోలింగ్ కేంద్రాలు, ఉద్యోగులకు శిక్షణ, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పూర్తిచేశారు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు మొత్తం 17 రోజులపాటు ఎన్నికల వాతావరణం ఏర్పడనుంది. నామినేషన్ కేంద్రాల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలోని 15 పురపాలికల్లో 5 చోట్ల బీసీలు, 4 చోట్ల ఎస్సీలు, 6 చోట్ల అన్రిజర్వ్డ్ (ఓసీ) వర్గాలకు అవకాశం కల్పించారు. కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్కు కేటాయించారు. కరీంనగర్లో జమ్మికుంట ఎస్సీ జనరల్కు, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీలను ఎస్సీ మహిళలకు కేటాయించారు. జగిత్యాలలో అత్యధికంగా ఓసీలకు అవకాశం కల్పించారు. జగిత్యాల మున్సిపాలిటీ బీసీ (మహిళ)లకు కేటాయించగా, కోరుట్ల, ధర్మపురి మున్సిపాలిటీలు ఓసీ (మహిళ)గా నిర్ణయించారు. ఇక రాయికల్, మెట్పల్లి మున్సిపాలిటీలు పూర్తి అన్రిజర్వ్డ్గా ప్రకటించారు. సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీ జనరల్ (మహిళ)కు కేటాయించగా, వేములవాడ మాత్రం బీసీ (జనరల్) అవకాశం ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్, పెద్దపల్లి, మంథని మున్సిపాలిటీలు బీసీ (జనలర్)కు కేటాయించగా, సుల్తానాబాద్ పూర్తిస్థాయిలో అన్రిజర్వ్డ్గా డిక్లేర్ చేశారు. కోర్టు దావాలపై ఉత్కంఠ.. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన దావాలపై ఉత్కంఠ నెలకొంది. పలు సామాజికవర్గాల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పాటించలేదని ఆరోపిస్తూ దాఖలైన ఆయా పిటిషన్లపై న్యాయస్థానాలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్నది ఉత్కంఠగా మారింది. తనిఖీలు ముమ్మరం.. కోడ్ అమల్లోకి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దరిమిలా కరీంనగర్, రామగుండం కమిషనరేట్ల సీపీలు, సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీలు తనిఖీలు ప్రారంభించారు. నగదు రవాణాపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచనలు పాటించాలని స్పష్టంచేస్తున్నారు. ఇటు మేడారం బందోబస్తు, అటు మున్సిపల్ ఎన్నికలను సమన్వయం చేసుకునేందుకు ఆయా జిల్లాల పోలీసులు ఇప్పటికే ప్రణాళికలు రచించారు. ఉదయం నుంచే అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల కౌంటర్లను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. డివిజన్లు: 60 నామినేషన్ కేంద్రాల సంఖ్య: 08 మేయర్ రిజర్వేషన్: ఎస్సీ (జనరల్) పెద్దపల్లి వార్డులు : 36 నామినేషన్ కేంద్రాల సంఖ్య :3 చైర్మన్ రిజర్వేషన్ : బీసీ జనరల్ మంథని మున్సిపాలిటీ వార్డులు :13 నామినేషన్ కేంద్రాలు :1(ఐదు కౌంటర్లు) చైర్మన్ రిజర్వేషన్ : బీసీ జనరల్సుల్తానాబాద్ వార్డులు : 15 నామినేషన్ కేంద్రాల సంఖ్య : 3 చైర్మన్ రిజర్వేషన్ : జనరల్ -
భక్తులకు నిరంతర సేవలు
● 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు ● కరీంనగర్ డిప్యూటీ ఆర్ఎం భూపాల్రెడ్డి పెద్దపల్లి: మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ 24 గంటలపాటు బస్సులు నడిపిస్తుందని కరీంనగర్ డిప్యూటీ ఆర్ఎం భూపాల్రెడ్డి తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మేడారం వెళ్లేందుకు అందుబాటులో ఉంచిన బస్సులను ఆయన మంగళవారం పరిశీలించారు. భక్తుల ఏర్పాట్లు, ఆర్టీసీ సిబ్బందికి కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్లతోపాటు హైదరాబాద్, నర్సాపూ ర్, రంగారెడ్డి, మెదక్ డిపోల నుంచి కూడా ఆర్టీసీ బస్సులను పెద్దపల్లి ప్రాంతానికి కేటాయించారని అన్నారు. శనివారం వరకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తామని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పదేళ్ల వయసులోపు పిల్లలు తప్పిపోకుండా వారికి క్యూఆర్ కోడ్ బ్యాండ్లను చేతికి కట్టి పంపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భక్తులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా.. సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని ఆయన కోరారు. అత్యవసర సేవలకు ఫోన్ నంబర్లు గోదావరిఖని: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు జరిగే సమ్మక్క – సారలమ్మ జాతరలో అత్యవసర సేవల కోసం పోలీసులు, వివిధ శాఖల అధికారులు ఫోన్నంబర్లు విడుదల చేశారు. ఎవరికైనా, ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తినా వెంటనే ఆయా ప్రాంతాల్లోని ఫోన్నంబర్లను సంప్రదించి సాయం పొందాలని అధికారులు సూచించారు. గోదావరిఖని : గోదావరిబ్రిడ్జి గోదావరిఖని ఏసీపీ : 87126–56515 గోదావరిఖని టూటౌన్ : 87126–56520 గోలివాడ జాతర: అంతర్గాం ఎస్హెచ్వో : 87126–56527 తక్కళ్లపల్లి జాతర: బసంత్నగర్ హెడ్కానిస్టేబుల్87125–80960 -
నగరమైన గ్రామం
● నోటిఫైడ్ ఏరియా నుంచి ప్రయాణం ● నేడు 60 డివిజన్లుగా రామగుండం కార్పొరేషన్ ఆవిర్భావం కోల్సిటీ(రామగుండం): జనగామ గ్రామ పంచాయతీగా మొదలైన రామగుండం ప్రయాణం నేడు నగరంగా విస్తరించింది. అప్పుడు 11 వార్డులకు పరిమితమైన ఊరు.. ఇప్పుడు 60 డివిజన్లకు విస్తరించి నగరపాలక సంస్థగా ఎదిగింది. నగరంగా ఎదిగిన బల్దియా జనగామ, మేడిపల్లి, మల్కాపూర్, జంగాలపల్లి, రామగుండం, లక్ష్మీపురం(ఎల్కలపల్లి హామ్లెట్), మారేడుపాక, అల్లూరు గ్రామాల విలీనంతో 1982 లో రామగుండం నోటిఫైడ్ ఏరియాగా ఏర్పడింది. అప్పటివరకు 11 వార్డులతో ఉన్న గ్రామ పంచా యతీ సర్పంచ్గా గీట్ల జనార్దన్రెడ్డి వ్యవహరించా రు. నోటిఫైడ్ కమిటీ తొలిచైర్మన్గా అప్పటి ఎమ్మె ల్యే మాతంగి నర్సయ్య, రెండోచైర్మన్గా అప్పటి ఎమ్మెల్యే మాలెం మల్లేశం వ్యవహరించారు. 1995 లో ద్వితీయ శ్రేణి, 2001లో ప్రథమ శ్రేణి, 2003లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అవతరించింది. 2010లో నగరపాలక సంస్థగా.. ద్వితీయ శ్రేణి పురపాలక సంఘంగా ఉన్నప్పుడు 1997లో ప్రత్యక్ష పద్ధతిన జరిగిన ఎన్నికల్లో సోమా రపు సత్యనారాయణ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2004లో బడికెల రాజలింగం చైర్మన్గా ఎన్నికయ్యా రు. సెక్షన్ గ్రేడ్ స్థాయి అవసరం లేకుండా ప్రత్యేక పరిస్థితుల్లో 34 వార్డులతో ఉన్న మున్సిపాలిటీని 50 డివిజన్లుగా 2010 ఫిబ్రవరి 25న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు. 2014 మార్చిలో జరిగిన పరోక్ష ఎన్నికల్లో కొంకటి లక్ష్మీనారాయణ మేయర్గా ఎన్నికయ్యారు. 2020లో డాక్టర్ బంగి అనిల్ కుమార్ గెలుపొందారు. 100 చ.కి.మీ. విస్తీర్ణం 93.87 చ.కి.మీ. వైశాల్యం కలిగిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఇప్పుడు 100 చ.కి.మీ.కు విస్తరించింది. 50 డివిజన్ల నుంచి 60 డివిజన్లకు పెరిగింది. గతేడాది జూన్లో సమీప లింగాపూర్, వెంకట్రావ్పల్లి, ఎల్కలపల్లిగేట్, అక్బర్నగర్ను విలీనం చేసి నగరాన్ని విస్తరించారు. -
రామగుండంలో 8 నామినేషన్ కేంద్రాలు
● ఏర్పాట్లు పూర్తిచేసిన బల్దియా అధికారులు కోల్సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్లో నామినేషన్ల స్వీకరణకు 8 నామినేషన్ కేంద్రాలను సిద్ధం చేశారు. బుధవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ నామినేషన్ స్వీకరణ కేంద్రాల వివరాలు ప్రకటించారు. ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారని ఆమె వెల్లడించారు. డివిజన్ల వారీగా నామినేషన్ కేంద్రాలు ● రామగుండం : ముబారక్నగర్ జెడ్పీ హైస్కూల్ : 25, 26, 27, 28 29, 30 ● టీటీఎస్ : జెడ్పీ హైస్కూల్ : 1, 33, 21, 22, 23, 24, 31, 32, 48, 49 ● సప్తగిరికాలనీ : ప్రభుత్వ డిగ్రీ కాలేజీ : 2, 34, 3, 35, 4, 7, 5, 6 ● అశోక్నగర్ : జెడ్పీ హైస్కూల్, ఉర్దూ మీడియం : 46, 47, 50, 51, 58, 60, 59 ● గాంధీనగర్ : సింగరేణి కమ్యూనిటీ హాల్: 8, 9, 10, 38, 36, 37, 39, 40 ● జవహర్నగర్ : సింగరేణి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ : 11, 12, 41, 54, 42, 43, 52, 53 ● తిలక్నగర్ : సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్: :13, 44, 45, 57, 55, 56 ● యైటింక్లయిన్కాలనీ : ఎన్సీవోఏ క్లబ్ : 14, 15, 16, 17, 18, 19, 20 పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలోనే.. పెద్దపల్లిరూరల్: మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉన్నాయి. ఇందుకోసం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోనే అధికారులు మూడు నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకటో నంబరు కేంద్రంలో 1 నుంచి 12వ వార్డు వరకు, రెండో నంబరులో 13 నుంచి 24వ వార్డు వరకు, మూడోనంబరు కేంద్రంలో 25వ వార్డు నుంచి 36వ వార్డుకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. అయితే, అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సాగర్ రోడ్డు నుంచే మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాలని సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై లక్ష్మణ్రావు సూచించారు. ఈమేరకు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. -
బోర్లెన్ని.. వ్యవసాయ బావులెన్ని?
మంథనిరూరల్: సాగు ప్రణాళిక రూపకల్పనకు దోహదపడేలా జిల్లావ్యాప్తంగా సాగునీటి వనరుల లెక్కింపునకు అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని బోర్లు, బావులు, చెరువులు, కుంటల లెక్క పక్కాగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో జీపీవోలు పర్యటించి సాగునీటి వనరులను లెక్కిస్తూ ప్రత్యేక యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లాలోని 204 రెవెన్యూ గ్రామాల్లో.. జిల్లావ్యాప్తంగా 212 రెవెన్యూ విలేజీలు ఉండగా 204 గ్రామాల్లో సాగునీటి వనరుల లెక్క ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. మిగతా రెవెన్యూ విలేజీలు సింగరేణి ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ) విస్తరణతోపాటు విలీనాలతో తగ్గిపోయాయి. జిల్లాలోని 109 మంది జీపీవోలు లెక్కింపు సర్వేలో పాలుపంచుకుంటున్నారు. మిగతా గ్రామాల్లో స్థానిక ఏఈవోలు, ఫీల్డ్ అసిస్టెంట్ల సాయంతో సాగునీటి వనరుల గణన కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా 44,541 సాగునీటి వనరులు ప్రతీ ఐదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం సాగునీటి వనరుల గణాంకాలు చేపడుతోంది. గతంలో చేసిన లెక్కల ప్రకారం జిల్లాలోని 212 రెవెన్యూ గ్రామాల్లో 44,541 సాగునీటి వనరులు ఉన్నట్లు తేలింది. ఇందులో చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు 1,402 ఉండగా, బోర్లు 6,800 ఉన్నాయని, మిగతావన్నీ సాగునీటి వనరులని అధికారులు చెబుతున్నారు. సాగునీటికి జియోట్యాగింగ్ గ్రామాల్లో సాగునీటి వనరుల లెక్కింపు చేపట్టిన జీపీవోలు వివరాలు నమోదు చేసుకుని ఫొటోలను ప్రత్యేకంగా రూపొందించిన డబ్ల్యూబీ సెన్సెన్ అనే యాప్లో అప్లోడ్ చేసి జియోట్యాగింగ్ చేస్తున్నారు. బోర్లు, బావులను నీటి అవసరాలకు వినియోగిస్తున్నారా? లేదా? నిర్వహణ తీరు ఎలా ఉంది? అనే అంశాలను పరిశీలిస్తూ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. సాగునీటి వనరుల ఆధారంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రాజెక్టులు అమలు చేస్తారని, సాగుకు అవసరమయ్యే ప్రణాళికలు రూపొందిస్తారని అధికారులు చెబుతున్నారు. భూగర్భజలాల లభ్యత అంచనా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయానికి ఎక్కువగా బోరుబావులను వినియోగిస్తుంటారు. దీంతో బోరుబావుల్లో భూగర్భజలాల లభ్యతను అంచనా వేస్తూ నమోదు చేసుకుంటున్నారు. రైతు ఎన్ని అడుగుల లోతులో బోరు వేశాడని, ఎన్నిగంటల సమయం నీరు పారుతుందనే వివరాలు తెలుసుకుని భూగర్భజలాల లభ్యతను అంచనా వేస్తున్నారు. అలాగే బావుల్లో వర్షాకాలం, వేసవి కాలాల్లో ఎంతమట్టంలో నీరు ఉంటుందనే వివరాలనూ నమోదు చేస్తున్నారు. పక్కాగా సాగునీటి వనరుల లెక్క జిల్లాలో ప్రారంభమైన గణన జియోట్యాగింగ్కు సర్కారు కసరత్తు పంటల సాగు ప్రణాళిక రూపకల్పనకు దోహదం త్వరలో లెక్కింపు పూర్తి జిల్లాలోని 204 రెవెన్యూ గ్రామాల్లో పారదర్శకంగా సాగునీటి వనరుల గణన కొనసాగుతోంది. జీపీవోలు లెక్కింపు చేస్తూ ప్రత్యేక యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నారు. జీపీవోలు లేనిగ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏఈవోలు లెక్కింపు చేస్తున్నారు. త్వరలోనే సాగునీటి వనరుల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేస్తాం. – రవీందర్, సీపీవో, పెద్దపల్లి -
టౌన్ మున్సిపాలిటీ నుంచి..
మంథని: సుమారు 56 ఏళ్లక్రితం టౌన్ మున్సిపాలిటీగా ఉన్న మంథని.. మేజర్ పంచాయతీగా, మున్సిపాలిటీగా అవతరించింది. 1953లో టౌన్ మున్సిపల్గా మారిన తర్వాత డిసెంబర్ 21న తొలిఅధ్యక్షుడిగా మోతేరాం రాజేశ్వర్రావు బాధ్యతలు స్వీకరించారు. 1964 ఫిబ్రవరి వరకు ఆయన పదవీకాలం కొనసాగింది. టౌన్ మున్సిపల్ చివరి అధ్యక్షుడిగా సువర్ణ చంటయ్య పనిచేశారు. 1956 సెప్టెంబర్ 16 నుంచి 30 నవంబర్ వరకు మాజీ ఎమ్మెల్యే గుల్కోట శ్రీరాములు ఇన్చార్జి అధ్యక్షుడిగా కొనసాగారు.1964లో మేజర్ పంచాయతీగా రూపాంతం చెందిన మంథని.. 2018 జూన్ 2 నుంచి మున్సిపల్గా మారింది. తొలిసారి 2020 జనవరిలొ జరిగిన ఎన్నికల్లో పుట్ట శైలజ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆమె 2024 వరకు కొనసాగారు. అవిశ్వాసంతో 2024 ఫిబ్రవరిలో పెండ్రు రమను చైర్ పర్సన్గా ఎన్నుకున్నారు. 2025 జూన్నుంచి ప్రత్యేక పాలన సాగుతోంది. అప్పుటి జనాభా పదివేలు.. టౌన్ మున్సిపల్ జనాభా పదివేలు ఉండేది. సమీప సూరయ్యపల్లి ఇందులో కలిసే ఉండేది. సమీప గ్రామాల నుంచి వచ్చిన చాలామంది మంథనిలోనే స్థిరపడ్డారు. గంగాపురి, కూచిరాజ్పల్లి, శ్రీరాంనగర్, బోయిన్పేట, గొల్లగూడెంలో కలిసిఉన్న మేజర్ పంచాయతీ యథావిధిగా మున్సిపల్గా మారింది. 15 వార్డులు ఉన్న మేజర్ పంచాయతీలో 2018లో పెరిగిన జనాభాకు అనుగుణంగా మూడు వార్డులను పెంచుతూ 18 వార్డులుగా చేశారు. ము న్సిపాలిటీగా మారిత తర్వాత విభజనతో 13 వార్డులకు మళ్లీ కుదించారు. ప్రస్తుత జనాభా సుమారు 19,500 ఉండగా, 14,414 మంది ఓటర్లు ఉన్నారు. -
పెద్దపల్లి ‘యాది’లో తొలిమున్సిపల్ చైర్మన్
● ప్రధాన కూడలికి అమర్నగర్గా నామకరణం పెద్దపల్లిరూరల్: నాడు పెద్దపల్లి టౌన్ మున్సిపల్కు తొలిచైర్మన్గా వ్యవహరించిన అమర్చంద్జైన్.. నీతి, నిజాయతీకి కట్టుబడి సేవలు అందించారు. దీంతో ఆయన ఇంకా ప్రజల యాదిలో ఉన్నారు. అమర్చంద్ మరణానంతరం ఆయన విగ్రహాన్ని కూడలిలో ఏర్పాటు చేసి అమర్నగర్గా నామకరణం చేశారు. జెండా చౌరస్తా ప్రాంతంలో రిక్రియేషన్ క్లబ్ నిర్మించిన కల్యాణ మండపానికి సైతం ఆయన పేరే పెట్టడం ఆయన మంచితనానికి నిదర్శనం. ప్రగతినగర్ ప్రాంతంలో బల్దియా నిర్మించిన ఎల్ఐజీ క్వార్టర్ల పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. -
అదనపు ఠాణాలు అవసరమే..!
గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతా నికి రాష్ట్రంలోనే ప్రత్యేకస్థానం ఉంది. వివిధ రాష్ట్రాల ప్రజల సమ్మేళనంతో ముడిపడి ఉంది. విలక్షణ జీవన విధానం ప్రత్యేకతగా ఉంది. శాంతిభద్రతల పరిరక్షణ కూడా అత్యంత కీలకంగా మారింది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలను అనుసంధానిస్తూ గోదావరిఖని కేంద్రంగా రామగుండం పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేశారు. అప్పటి డీజీపీ అనురాగ్శర్మ 2016 అక్టోబర్ 11న కమిషనరేట్ ప్రారంభించారు. తద్వారా రెండు జిల్లాల్లో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. పరిశ్రమలకు నిలయం.. రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించి పెట్టే సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, అల్రాటెక్ లాంటి పరిశ్రమలు రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఉన్నాయి. అయితే, పారిశ్రామిక విస్తరణ, జనాభా పెరుగుతలను దృష్టిలో ఉంచుకుని పోలీస్స్టేషన్ల వికేంద్రీకరణ చేపట్టలేదంటున్నారు. రామగుండం కార్పొరేషన్.. పెరగని ఠాణాల సంఖ్య రామగుండం నగరం 50 నుంచి 60 డివిజన్లకు పెరిగింది. 35 డివిజన్లు కేవలం గోదావరిఖనిలోనే ఉన్నాయి. ఇక్కడ ఒకేఠాణా ఉంది. నేరాల నియంత్రణ సాధ్యం కావడంలేదు. గోదావరి వంతెన, జనగామ, గంగానగర్, ఐబీకాలనీ, పవర్హౌస్ కాలనీ, సప్తగిరికాలనీ, జీఎం కార్యాలయం, జీఎం ఆఫీస్, డిగ్రీకళాశాల, మెడికల్ కాలేజీలు కలిపి మరోపోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. ప్రతిపాదనలోనే మహిళా పోలీస్స్టేషన్ రెండు లా అండ్ ఆర్డర్ ఠాణాలతోపాటు మహిళా పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఇంకా అమలుకు నోచుకోవడంలేదు. గోదావరిఖని వన్టౌన్ పాతభవనాన్ని మహిళా పోలీస్స్టేషన్కోసం కేటాయిస్తామని చెప్పినా సైబర్క్రైం పోలీస్స్టేషన్కు కేటాయించారు. మహిళా సమస్యలు, నేరాలపై సుమారు 30కి.మీ. దూరంలోని పెద్దపల్లికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గోదావరి తీరంలోనే నేరాలు.. రామగుండం నగర శివారులోని గోదావరితీరంలో నేరాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం, హైవేరోడ్డుపై ప్రమాదాలు చోటుచేసుకోవడం నిత్యకృత్యంగా మారాయి. ఈ ప్రాంతాన్ని గోదావరిఖని వన్టౌన్ ఠాణాలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఇప్పటివర కు కార్యరూపం దాల్చడంలేదు. ఎన్టీసీపీ సర్కిల్కు మోక్షం ఎప్పుడు? ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ విస్తరణ, పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎన్టీపీసీ సర్కిల్ టౌన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. దీనిపై ప్రతిపాదనలు పంపించినా అమలుకు నోచుకోవడంలేదు. -
అసెంబ్లీలో మాట్లాడుతా
రామగుండం పారిశ్రామికంగా విస్తరిస్తోంది. నగర జనాభా బాగా వృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పోలీస్ సర్కిల్స్, రూరల్ ఠాణాలు ఏర్పాటు చేయాలి. వీటిపై అసెంబ్లీలో మాట్లాడుతా. – మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం ప్రతిపాదనలో ఉంది పారిశ్రామికంగా విస్తరిస్తున్న రామగుండం ప్రాంత అవసరాలకు అనుగుణంగా కొత్త పోలీస్స్టేషన్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదించాం. పాలనాపరమైన అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం. – అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండం -
కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తాం
గోదావరిఖని: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీచేసేందుకు సీపీఐ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జాతీయ నేత చాడ వెంటకరెడ్డి అన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. స్థానిక భాస్కర్రావుభవన్లో సోమరవారం ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ సహకారంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక విధానాలను ఎండగట్టాలని ఆయన కోరారు. ఉపాధిహామీ పథకాన్ని పేరుమార్చి పేదలకు తీవ్రఅన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. సమావేశంలో నాయకులు కలవేణి శంకర్, గౌతం గోవర్ధన్, తాండ్ర సదానందం, కనకరాజ్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఇందిరా పార్క్ ఎదుట ధర్నా పెద్దపల్లి: రిటైర్డ్ ఎంప్లాయీస్పై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మంగళవారం ధర్నా చేస్తామని త పస్ జిల్లా అధ్యక్షుడు సునీల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండవేని జగన్ తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ఆర్నెల్లలో పీ ఆర్సీ అమలు చేస్తామనే ఎన్నికల హామీ అమలు చే యాలన్నారు. ఈ నేపథ్యంలో చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు. -
ఇంధన రంగంలో విశేష కృషి
జ్యోతినగర్(రామగుండం): దేశ ఇంధన రంగానికి ఎన్టీపీసీ గణనీయమైన కృషి చేస్తోందని రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత అన్నారు. మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో ఆయన జాతీయ పతాకం ఆవిష్కరించారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది, విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. ఉద్యోగుల అంకితభావం, నిబద్ధత ఎన్టీపీసీకి గర్వకారణమన్నా రు. ఉద్యోగుల అత్యుత్తమ కృషికి గుర్తింపుగా మెరిటోరియస్ అవార్డులను ప్రదానం చేశారు. సీఐఎస్ఎఫ్, విద్యార్థుల పరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ పోటీ తట్టుకోవాలి
గోదావరిఖని: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోటీమార్కెట్లో సింగరేణి తట్టుకునేందుకు ఉత్పత్తి లక్ష్యం సాధించాలని, ఇందులో అందరూ పాలుపంచుకోవాలని సింగరేని ఆర్జీ–2 జీఎం వెంకటయ్య కోరారు. యైటింక్లయిన్కాలనీ అబ్దుల్ కలాంస్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన మాట్లాడారు. సామాజిక బాధ్యత, సంక్షేమానికి సింగరేణి పెద్దపీట వేస్తోందన్నారు. ఒకే కుటుంబం, ఒకేలక్ష్యం, ఒకేగమ్యంగా ముందుకు సాగుతోందని అన్నారు. ప్రతినిధులు జిగురు రవీందర్, వనజ, రాముడు, అరవిందరావు, సంతోష్కుమార్, సుజన్మెహ్రా తదితరులు పాల్గొన్నారు. -
ఉత్పత్తి వ్యయం తగ్గాలి
గోదావరిఖని: సింగరేణిలో బొగ్గు ఉ త్పత్తి పెంచాలని, వ్యయం తగ్గించాల ని ఆర్జీ –వన్ జీఎం లలిత్కుమార్ సూ చించారు. స్థానిక జవహర్లాల్ నె హ్రూ స్టేడియంలో ఆయన జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. ఆర్జీ –వన్ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 49.40 లక్షల టన్నులకు 41.84లక్షల టన్నులు సాధించి 85 శాతం నమోదు చేశామన్నారు. పెరుగుతున్న బొగ్గు అవసరాలు, డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి పెంచాలన్నారు. ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, సీఎంవోఏఐ అధ్యక్షుడు బి.మల్లేశ్, ఎస్వోటూ జీఎం చంద్రశేఖర్, ఏరియా ఇంజినీర్ రాంమోహన్రావు, పర్స నల్ మేనేజర్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
చట్టంపై గౌరవం ఉండాలి
గోదావరిఖని: పోలీసులు చట్టాన్ని గౌరవిస్తూ విఽ దులు నిర్వర్తించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. పోలీస్ కమిషనరేట్లో జాతీయ జెండా ఎగురవేసి మా ట్లాడారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ పోలీస్ల ప్రధాన బాధ్యత అని గుర్తుచేశారు. మహనీయుల త్యాగాలతోనే స్వేచ్ఛ, స్వాతంత్య్రం లభించందని, వారిని స్మరించుకోవాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ఏసీపీలు రమేశ్, నా గేంద్రగౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక భవనం.. మూడు జెండాలు
జూలపల్లి(పెద్దపల్లి): స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం ఎదుట అధికారులు మూడు మువ్వన్నెల జెండాలు ఆవిష్కరించారు. ఇదే భవనంలో సహకార శాఖ కార్యాలయంతోపాటు, వ్యవసాయ శాఖ, గ్రంథాల య శాఖ ఆఫీసులు ఉన్నాయి. లైబ్రేరియన్ మౌళి, వ్యవసాయాధికారి ప్రత్యూష, సహకార శాఖ ఉద్యోగి కరుణాకర్ ముగ్గురు ఒకేసారి.. ఒకే సమయానికి జెండా ఆవిష్కరించారు. సేవలకు ప్రశంస ధర్మారం/గోదావరిఖనిటౌన్: విద్యుత్ పంపిణీ సంస్థలో మొదటి ర్యాంక్ సాధించిన ధర్మారం ఏడీఈ విజయ్గోపాల్సింగ్, ఖిలావనపర్తి ఏఏ ఈ మహిపాల్రెడ్డి ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి నుంచి సోమవారం ప్రశంసాపత్రం అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎన్పీడీసీఎల్లో నిర్వహించిన కార్య క్రమ నేపథ్యంలో విధి నిర్వహణలో అందంచిన సేవలకు గుర్తింపుగా వీటిని అందించారు. ఖిలావనపర్తి విద్యుత్ సబ్స్టేషన్లోని అన్మాండ్ మోర సాయికుమార్కు జిల్లాస్థాయిలో ఉత్త మ ఉద్యోగి అవార్డును పెద్దపల్లి సర్కిల్ ఎస్ఈ గంగాధర్ అందించారు. అదేవిధంగా వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గోదావరిఖని ఏడీఈ వెంకటేశ్వర్లుకు కూడా ప్రశంసాపత్రం అందజేశారు. జాతరకు వెళ్తున్నారా? పెద్దపల్లిరూరల్: ఇళ్లకు తాళం వేసి సమ్మక్క – సారలమ్మ జాతరకు వెళ్లేవారు సమీప పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఇవ్వాలని పోలీసులు పల్లెల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పట్టణంలోని పలువార్డుల్లోనూ ఆటోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇంటికి తాళం వేసిఉంటే దొంగలు పడే ప్రమాదముందని చెబుతున్నారు. సమాచారం అందిస్తే ఆయా ప్రాంతాల్లో పోలీసులు గస్తీ తిరుగుతారని పట్టణ ఎస్సై లక్ష్మణ్రావు, రూరల్ఎస్సై మల్లేశం తెలిపారు. పరేడ్ ఇన్చార్జి మనోడే రామగుండం/ఓదెల: సికింద్రాబాద్లో సోమ వారం నిర్వహించిన గణతంత్ర వేడుకల పరేడ్ కమాండర్గా రామగుండం రైల్వే ప్రొటెక్షన్ ఫో ర్స్(ఆర్పీఎఫ్) సీఐ కొదురుపాక రాజేంద్రప్ర సాద్ వ్యవహరించారు. సిబ్బంది కవాతుకు ఆ యన అధ్యక్షత వహించారు. ఓదెల మండలం కొలనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాజేంద్రప్రసాద్ హైస్కూల్ విద్య పూర్తిచేశారు. ఆయనను ఆర్పీఎఫ్ ఎస్సై క్రాంతికుమార్, ఏఎస్సై లు నాగరాజు, రామకృష్ణ అభినందించారు. ఢిల్లీ వేడుకల్లో అభిరామ్ ఎలిగేడు(పెద్దపల్లి): సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన అక్కినపల్లి అభిరామ్ ఢిల్లీలో సోమవా రం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఎన్సీసీ కేడెట్గా హాజరయ్యాడు. తొమ్మిదో బెటాలియన్ తెలంగాణ, కరీంనగర్ ఎన్సీసీకి చెందిన అభిరామ్.. కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఏకే జయంత్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే క్యాంపు(ఆర్డీసీ) విధుల్లో పాల్గొన్నాడు.కాంగ్రెస్ గెలుపే లక్ష్యంజ్యోతినగర్(రామగుండం): రామగుండం కా ర్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ ఓబీసీ సెల్ జి ల్లా అధ్యక్షుడు, ఎన్టీపీసీ పట్టణ ఎన్నికల ఇన్చార్జి పెండ్యాల మహేశ్ అన్నారు. ఎన్టీపీసీలోని ఓ ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఆసిఫ్పాషా ఆధ్వర్యంలో సోమవారం జరిగి న సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్కు కా ర్యకర్తలే అండ అని అన్నారు. ముచ్చకుర్తి రమే శ్, ఉరిమెట్ల రాజలింగం, కిరణ్గౌడ్ ఉన్నారు. -
నర్సింహునిపేటలో ఇసుక డంపు సీజ్
పెగడపల్లి: మండలంలోని నర్సింహునిపేట శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ను ఆర్ఐ శ్రీనివాస్ సోమవారం సీజ్ చేశారు. పక్కా సమాచారం మేరకు 8 ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇసుకను తరలించడానికి ప్రయత్నిస్తే వారిపై పీడీ యాక్ట్, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట రామడుగు మండలం కోరుటపల్లి, మోతె, రామడుగు వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని లబ్ధిదారులు చర్చించుకుంటున్నారు. -
ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ఎంపిక
ముస్తాబాద్(సిరిసిల్ల): ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన గండికోట రాజు ఎంపికయ్యాడు. శాతావాహన యూనివర్సిటీలో ఎంకాం సెకండియర్ చదువుతున్నాడు. శాతవాహన విశ్వవిద్యాలయం తరఫున నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటాడు. మైసూర్లో జరిగే సౌత్జోన్ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఎర్రనర్సుపల్లి పెద్దమ్మగుడిలో చోరీఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రహీంఖాన్పేట అనుబంధ గ్రామం ఎర్రనర్సుపల్లి పెద్దమ్మగుడిలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. అమ్మవారి పుస్తెమెట్టెలు రెండు జతలు ఎత్తుకెళ్లారని, హుండీ పగులగొట్టారని ముదిరాజ్ సంఘం గ్రామాధ్యక్షుడు రాగుల మహేందర్ తెలిపారు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ గుడి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. -
అమ్మ.. ఇప్పుడే వస్తా..
‘అమ్మ.. ఇప్పుడే వస్తా .. నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటా’ అని చె ప్పిన ఒక్కగానొక్క కొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో.. ‘నేను ఇపుడు ఎవరికి అన్నం తి నిపించాలి బిడ్డా’ అని అతడి తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మరో యువకుడి తల్లిదండ్రులు సైతం చేతికందిన కొడుకు ఇక లేడని గుండెలవిసేలా రోదించారు. కరీంనగర్క్రైం/వీణవంక: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌజింగ్బోర్డుకాలనీలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందగా, వారి తల్లిదండ్రుల రోదనలు మి న్నంటాయి. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. వీణవంక మండలం మామిడాలపల్లి గ్రా మానికి చెందిన మ్యాకల గణేశ్(22), అదే గ్రామానికి చెందిన మిరియాల సందీప్రెడ్డి(20)తో పాటు మరో స్నేహితుడు వేర్వేరు బైక్లపై గణేశ్ బైక్ స్పేర్ పార్ట్స్ కోసం మధ్యాహ్నం కరీంనగర్ వచ్చారు. అనంతరం గణేశ్, సందీప్రెడ్డి బైక్పై ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో హౌసింగ్బోర్డుకాలనీలో రోడ్డు క్రాస్ చేస్తున్న ప్రైవేట్ సూ్క్ల్ బస్సును ఢీకొని బైక్పై నుంచి ఎగిరిపడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించే క్రమంలో ఇద్దరూ మృతిచెందారు. మృతుడు గణేశ్ తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.తిరుమల్ తెలిపారు. మామిడాలపల్లిలో విషాదం కరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందడంతో స్వగ్రామం వీణవంకలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన మ్యాకల కొమురయ్య–పద్మ దంపతులకు గణేశ్తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గణేశ్ ఇంటర్లోనే చదువు మానేసి ఇంటి వద్దే వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. మిరియాల శ్రీనివాస్రెడ్డి–మమత దంపతులకు ఒక్కగానొక్క కొడుకు సందీప్రెడ్డి. ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొడుకు ఒక్కడే కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. చేతికొచ్చిన కొడుకులు మృతిచెందడంతో ఆ కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. సందీప్రెడ్డి (ఫైల్) గణేశ్ (ఫైల్) స్కూల్ బస్సును ఢీకొట్టిన బైక్ ఇద్దరు స్నేహితుల దుర్మరణం బైక్ పార్ట్స్ కోసం వచ్చి..కడుపుకోతను మిగిల్చి.. చేతికందిన కొడుకులను కోల్పోయి తల్ల్లడిల్లుతున్న తల్లిదండ్రులు -
శతాధిక వృద్ధురాలి మృతి
ధర్మపురి: మండలంలోని నాగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రూపు సత్తమ్మ అత్తగారైన రూపు గుండమ్మ (107) ఆదివారం మృతిచెందారు. ఆమెకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వారందరికీ మనుమలు, మనుమరాండ్లు ఉన్నారు. సోమవారం అంత్యక్రియలు చేయగా గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. ఐదు నెలల చిన్నారి..మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి ఐదు నెలల చిన్నారితో దంపతులు రాగా.. పసిపాప మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా వీరాపూర్ మండలానికి చెందిన దుర్గం శేఖర్ భార్య, ఇద్దరు కవలపిల్లలతో కలిసి సోమవారం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారి దర్శనానికి వచ్చారు. కోనేరులో పిల్లలకు స్నానం చేయించి, పిల్లలకు పాలు పట్టించారు. దర్శనం అనంతరం బయటకు రాగా.. ఆడశిశువులో కదలిక కనిపించలేదు. దీంతో చిన్నారిని వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కోనేరులో చన్నీటి స్నానం చేయించడంతోపాటు పాపకు చుట్టిన టవల్తో ఊపిరి ఆడక చనిపోయినట్లుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆరు విద్యుత్ మోటార్లు చోరీజగిత్యాలరూరల్: జగిత్యాలఅర్బన్ మండలం తిప్పన్నపేట, గోపాల్రావుపేటలో ఆరుగురు రైతుల వ్యవసాయ మోటార్లు, ఓ రైతు ట్రాక్టర్ బ్యాటరీని ఆదివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. తిప్పన్నపేట, గోపాల్రావుపేటకు చెందిన దావ శంకర్, కొల్లూరి రవి, అత్తినేని గంగాధర్, పున్నం ప్రసాద్ విద్యుత్ మోటార్లు, కొల్లూరి రాజేశ్కు చెందిన ట్రాక్టర్ బ్యాటరీని అపహరించారు. బాధితులు సోమవారం రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. మద్దులపల్లిలో గుడిసె దగ్ధంపెగడపల్లి: మండలంలోని మద్దులపల్లికి చెందిన గన్నెబోయిన శంకరమ్మ పూరి గుడిసె ప్రమాదవశాత్తు సోమవారం దగ్ధమైంది. శంకరమ్మ దీపం వెలిగించి కూలీ పనులకు వెళ్లగా మంటలు లేచి గుడిసెకు అంటుకున్నాయి. నిత్యావసర సరుకులతోపాటు వస్త్రాలు, రూ.5వేలు కాలిపోయినట్లు బాధితురాలు తెలిపింది. ఆర్ఐ జమున సంఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా చేశారు. స్థానిక సర్పంచ్ వెల్మ బలరాంరెడ్డి బాధితురాలిని పరామర్శించారు. బస్సు నుంచి జారిపడి తీవ్ర గాయాలువేములవాడఅర్బన్: వేములవాడ మండలం సంకెపల్లికి చెందిన రుక్కవ్వ ఆర్టీసీ బస్సు దిగే క్రమంలో కాలు జారి కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. రెండు కాళ్లు విరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే బాధితురాలిని 108లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. -
ఊరంతా ఒకేసారి జెండావిష్కరణ
మేడిపల్లి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగి త్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్లో ఒకే సమయానికి జెండా ఆవిష్కరించి ఆదర్శంగా నిలి చారు. ఉదయం 9 గంటలకు గ్రామంలోని అన్ని కు ల, యువజన సంఘాలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీ, వాణిజ్య సముదాయాల వారు ఒకేచోటకు చేరి వారివారి ఆధ్వర్యంలో ఒకే సమయానికి జండాను ఆవిష్కరించారు. సామూహికంగా జాతీయ గీతాలాపన చేశారు. గ్రామంలో సుమా రు నాలుగు వేల మంది జనాభా ఉంటారు. జెండావిష్కరణ సమయంలో కొందరు అతిగా ప్రవర్తిస్తుండడంతో సర్పంచ్ సంజన ఓ కొత్త విధానానికి శ్రీకా రం చుట్టారు. గ్రామమంతా ఒకే సమయానికి జెండా ఆవిష్కరించాలని తీర్మానించారు. ఆమె మాటకు కట్టుబడిన గ్రామస్తులందరూ సరే అని సరిగ్గా 9 గంటలకు ఒకేసారి జెండా ఆవిష్కరించారు. -
ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా?
వేములవాడరూరల్: ప్రమాదం జరిగితేనే విద్యుత్ అధికారులు స్పందిస్తారేమోనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల మీదుగా విద్యుత్ లూజ్ వైర్లు వేలాడుతున్నా సెస్ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి గ్రామ ప్రధాన రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా మారాయి. రైతులు పొలాలు దున్నే సమయంలో భయపడుతూనే సాగు పనులు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు పట్టించుకొని లూజ్వైర్లు, వంగిపోయిన స్తంభాలను సరిచేయాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. -
షార్ట్ సర్క్యూట్తో కిరాణంలో మంటలు
మల్యాల: మండలంలోని నూకపల్లి డబుల్బెడ్రూం కాలనీలోని కిరాణ దుకాణంలో షార్ట్ సర్క్యూట్లో మంటలు చెలరేగి సామగ్రి దగ్ధమైంది. కాలనీలోని పాలిక కమలాకర్ తన షాపును శనివారం రాత్రి మూసి ఇంటికెళ్లాడు. కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి కమలాకర్కు సమాచారం అందించారు. ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు రూ.2లక్షల విలువైన కిరాణ సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. -
సంఘటిత పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
పెద్దపల్లి/జూలపల్లి: ప్రజలు సంఘటిత పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని జనజీవన ప్రవంతిలో కలిసిన మావోయిస్టు కేంద్ర కమిటీ నేత పుల్లూరు ప్రసాదరావు ఉరఫ్ చంద్రన్న అన్నారు. ఇటీవల లొంగిపోయిన ఆయన.. తొలిసారి ఆయన ఆదివారం తన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ వచ్చారు. మిత్రులు, కుటుంబసభ్యులు, బంధువులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పునరావాసం కల్పించాలి.. ప్రసాదరావు మాట్లాడుతూ, మాజీలు ఇళ్లు లేక, పునరావాసం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం పునరావాసం కల్పించాలని కోరారు. తెలంగాణలో కరుడుగట్టిన భూస్వామ్య వ్యవస్థ ఉండేదని, దోపిడీలేని సమాజం కోసమే తాను మావోయిస్టు పార్టీలోకి వెళ్లానని తెలిపారు. ఆరోగ్యం సహకరించకనే జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు చెప్పారు. రాజకీయ పార్టీల్లో చేరను.. తనను వివిధ రాజకీయ పార్టీలు చేరాలని ఆహ్వానిస్తున్నాయని, తాను రాజకీయాలకు దూరంగా ఉంటూనే ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు చట్ట పరిధిలో కృషి చేస్తానని ప్రసాదరావు వివరించారు. అడిషనల్ కలెక్టర్గా పదోన్నతి పొందిన జగదీశ్వర్రావు, సర్పంచ్ పుల్లూరి ప్రశాంతి, సింగిల్విండో మాజీ చైర్మన్ వేణుగోపాలరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్సింగ్, మాజీ సర్పంచులు ఆడప లక్ష్మణ్, రాజయ్య, తిరుపతి, మిత్రులు చొక్కారెడ్డి, ఎర్రోల్ల రాములు, సంతోష్కుమార్, సాగర్రావు, రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. 45 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి.. పుల్లూరు ప్రసాదరావు దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం పెద్దపల్లిలో ఇంటర్ చదివారు. ఆ సమయంలోనే విప్లవ రాజకీయాలకు ఆకర్షితులై అడవిబాట పట్టారు. సుమారు 45ఏళ్ల తర్వాత స్వగ్రామానికి రావడం చారిత్రక ఘట్టం. ఇన్నేళ్లుగా వార్తలు, పోలీసు రికార్డుల్లో చూసి.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం గొప్ప అనుభూతి అని గ్రామస్తులు తెలిపారు. గుర్తుచేసుకున్న బాల్యస్మృతులు.. ప్రసాదరావు తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. గ్రామంలో కలియ తిరిగారు. తాను పుట్టి పెరిగిన ఇల్లు, ఆ గోడలు, వాకిలి చూసి భావోద్వేగానికి గురయ్యారు. స్నేహితులతో కలిసి ఆడుకున్న వీధులు, చెరువు గట్లు, చదువుకున్న బడి వంటి ప్రదేశాలు సందర్శించారు. కాలక్రమంలో మారిన ఊరును చూసి ఆశ్చర్యపోయారు. ఆత్మీయ పలకరింపులు సుదీర్ఘకాలం తర్వాత రక్తసంబంధీకులు, చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ఆ కుటుంబంలో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. వృద్ధులైన బంధువులు ఆయన్ని గుర్తుపట్టి కన్నీరు పర్యంతమయ్యారు. కొత్తతరం(వరుసకు మనుమలు, మనుమరాళ్లు) తమ కుటుంబంలోని ఒక ప్రముఖుడిని చూడటానికి ఉత్సాహం చూపారు. ఆయన రాజకీయ భావజాలం ఎలా ఉన్నా క్షేమంగా తిరిగి రావడంతో ఆత్మీయంగా సత్కరించారు. -
తేలనున్న వన్యప్రాణుల లెక్క
మంథనిరూరల్: వన్యప్రాణుల గణనకు అటవీశాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో విస్తరించి ఉన్న అడవుల్లో జంతువులు, వన్యప్రాణుల లెక్క తేల్చనున్నారు. ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లోని అడవుల్లో పర్యటిస్తున్న అధికారులు.. వాటి లెక్క తేల్చనున్నారు. తూర్పు అడవుల్లో ఇటీవల పెద్దపులులు సంచరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పులులు, జింకలు, దుప్పులు, కుందేళ్లు, తోడేళ్లలాంటి జంతువులు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయని లెక్కించనున్నారు. నాలుగేళ్లకోసారి లెక్కింపు 2006 నుంచి ప్రతీనాలుగేళ్ల కోసారి ఆల్ ఇండియా టైగర్స్ ఎస్టిమేషన్ పేరిట వన్యప్రాణుల గణన చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఐదుసార్లు ఇలా లెక్కింపు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. మరోసారి లెక్కించేందుకు కసరత్తు ప్రారంభించారు. గతంతో పోల్చితే వన్యప్రాణుల సంఖ్య పెరిగిందా? లేక తగ్గిందా? అని తేలనుంది. జిల్లావ్యాప్తంగా.. జిల్లాలో అటవీ విస్తీర్ణం అధికంగానే ఉంది. జిల్లావ్యాప్తంగా 31.100హెక్టార్ల అటవీ భూములు ఉండగా 14.80శాతం అడవులే ఉన్నాయి. రెండు రేంజ్ల పరిధిలో 11 సెక్షన్లు, 33 బీట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా మంథని, ముత్తారం, రామగిరి, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో అత్యధిక విస్తీర్ణం ఉన్నట్లు చెబుతున్నారు. జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శివయ్య పర్యవేక్షణలో వన్యప్రాణుల గణన కోసం బీట్, సెక్షన్ అధికారులు బృందాలుగా ఏర్పడి అటవీ ప్రాంతాల్లో పరిశీలనలు చేస్తున్నారు. జంతు కదలికల ఆధారంగా అడవుల్లో జంతు కదలికల ఆధారంగా వాటి జాతిని గుర్తిస్తారు. ముఖ్యంగా శాఖాహార, మాంసాహార జంతువులుగా విభజించి లెక్కింపు చేస్తారు. ప్రతీరెండు కిలోమీటర్ల చొప్పున జంతువుల లెక్కను పరిగణలోకి తీసుకుంటారు. పాదముద్రలు, చెట్లకు గాట్లు, అరుపులు, భూమిని తవ్వటం లాంటి ఆనవాళ్లతో అది ఏ జంతువులో గుర్తిస్తారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమగ్ర సమాచారాన్ని ఐదు రకాలుగా విభజించి ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ వన్యప్రాణుల లెక్కింపు సందర్భంగా అటవీశాఖ అధికారులకు సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అటవీప్రాంతంలో ముందుగా పరిసరాలను పరిశీలించిన తర్వాతనే వన్యప్రాణుల ఆనవాళ్లతో లెక్కిస్తారు. లెక్కింపు విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా అన్నిజాగ్రత్త చర్యలు తీసుకుంటారు. అటవీ ప్రాంతాల్లోని వన్యప్రాణుల గణన ఆరు రోజులు కొనసాగుతుంది. ఈనెల 20న మొదలై ఈ ప్రక్రియ ఈనెల 25వ తేదీతో ముగిసింది. తొలిమూడు రోజులు ప్రతీబీట్ పరిధిలోని 5 కి.మీ. మేర మాంసాహార జంతువుల గురించి పరిశీలన చేశాం. వాటి పాదముద్రలు, మలమూత్రాలు, కాలిగోర్ల గీతల ఆనవాళ్లను బట్టి మాంసాహార జంతువులను గుర్తించాం. అలాగే ప్రతీరోజు రెండు కి.మీ. మేర శాఖాహార జంతువుల సంచారం, వాటి ఆనవాళ్లను గుర్తించాం. సేకరించిన వివరాలను ప్రత్యేక యాప్లో నమోదుచేసి జాతీయ వన్యప్రాణి సంస్థకు పంపిస్తాం. – శివయ్య, జిల్లా అటవీశాఖ అధికారి అడవిలో పూర్తయిన జంతు సర్వే ఆనవాళ్లు గుర్తించిన అటవీ అధికారులు నాలుగేళ్లకోసారి వన్యప్రాణుల గణన ముగిసిన జంతు లెక్కింపు ప్రక్రియ -
మేడారం జాతరలో క్యూఆర్ కోడ్ బ్యాండ్స్
జ్యోతినగర్(రామగుండం): మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో తప్పిపోయిన చిన్నారులను సులభంగా గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక క్యూర్కోడ్ ఉన్న బ్యాండ్స్ రూపొందించింది. వీటిని చిన్నారుల చేతికి కట్టేలా ప్రత్యేక రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసింది. వివరాలిలు.. మేడారం మహాజాతర (జనవరి 28–31, 2026) సందర్భంగా చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాకింగ్ బ్యాండ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. ఎలా పనిచేస్తుందంటే.. పిల్లలు.. ప్రధానంగా 0–8 ఏళ్ల వయసు, వృద్ధుల కోసం పోలీస్ శాఖ క్యూఆర్ కోడ్లతో కూడిన రిస్ట్ బ్యాండ్లు అందిస్తోంది. ఈ క్యూఆర్ కోడ్లో ఆ వ్యక్తి లేదా తల్లిదండ్రులు/సంరక్షకులు వినియోగిస్తున్న మొబైల్ నంబర్, పేరు వంటి ముఖ్య సమాచారాన్ని ముందే నమోదు చేస్తారు. బ్యాండ్ ఎక్కడ పొందాలంటే.. క్యూఆర్ కోడ్ బ్యాండ్లను మేడారం జాతరలోని ప్రధాన ప్రవేశ మార్గాలు, బస్స్టాండ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది అందజేస్తుంది. ట్రాకింగ్ విధానం.. చిన్నారులు, వృద్ధులు తప్పిపోతే తల్లితండ్రులు లేదా సంరక్షకులు సెంటర్ పాయింట్కు వెళ్లడం ద్వారా పోలీస్లు ఆ డివైస్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు. స్కాన్ అయిన వెంటనే పూర్తినమోదు వివరాలు(పేర్లు, ఫోన్ నంబరు మొదలైనవి) స్క్రీన్పై కనిపిస్తాయి. పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని/పిల్లలను గుర్తించి కుటుంబానికి అప్పగిస్తారు. తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు కోసం పోలీస్ శాఖ యత్నం -
విషజ్వరంతో వ్యక్తి మృతి
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బోయిని రాములు(34) వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు. రాములు వారం రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతూ స్థానికంగా ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స పొందాడు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ప్లేట్లెట్స్ 25వేలకు పడిపోయినట్లు తెలిసింది. వారం రోజులుగా జ్వరం తగ్గక వ్యక్తి ప్రాణాలు పోవడంతో గ్రామస్తులు డెంగీ జ్వరం కావచ్చని భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై డీఐవో సంపత్కుమార్ను వివరణ కోరగా రుద్రంగిలో వ్యక్తి మృతికి గల కారణాలను తెలుసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశిస్తామన్నారు. ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్యముస్తాబాద్(సిరిసిల్ల): అప్పుల బాధ భరించలేక.. ఇంట్లో జరుగుతున్న గొడవలకు మనస్తాపం చెంది ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం కొండాపూర్కు చెందిన ఎక్కల్దేవి కుమార్(32) ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లివచ్చిన కుమార్ తండ్రి దేవయ్యతో కలిసి వ్యవసాయం పనులు చేస్తున్నాడు. ఇటీవల కొత్తింటిని నిర్మించేందుకు అప్పులు చేశారు. దీంతో కుమార్కు భార్య కావ్యకు మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా ఇద్దరి మధ్య గొడవలు జరగగా, ఆగ్రహానికి గురైన కుమార్ భార్య కావ్యపై చేయిచేసుకున్నాడు. అప్పుల బాధలు, భార్యను కొట్టిన అనే మనస్తాపానికి గురైన కుమార్ ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమార్ ఆత్మహత్యతో భార్య, కుమారుడు, కూతురు, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుని తండ్రి దేవయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికహుజూరాబాద్/చొప్పదండి: హుజూరాబాద్కు చెందిన నలుగురు విద్యార్థులు ఈ నెల 27 నుంచి 31 వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగే జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల వనపర్తిలో జరిగిన పోటీల్లో నిమ్మటూరి లవణీప్రియ, రిషి, అభినయ్, చరణ్లు ప్రతిభచాటి జాతీయ జట్టులో చోటు సంపాదించారు. అలాగే చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్కు చెందిన తొమ్మిదో తరుగతి విద్యార్థి చరణ్ సైతం జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యాడు. చరణ్ను పాఠశాల డైరెక్టర్ కల్నల్ రాజాదత్త, ప్రిన్సిపాల్ వి.లింగయ్య, ధర్మరాజు, శ్రీనివాస్, ప్రమోద్ రాజు తదితరులు అభినందించారు. -
కమ్యూనిస్ట్గానే జీవిస్తా.. కమ్యూనిస్ట్గానే మరణిస్తా
పెద్దపల్లి: పీడిత, తాడిత ప్రజల విముక్తి కోసం, సమసమాజ స్థాపన, సమానత్వం కోసం పనిచేస్తానని ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసి మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఉరఫ్ చంద్రన్న ఉరఫ్ ఆత్రం రామారావు అన్నారు. పెద్దపల్లిలో ఇంటర్ చదువుతుండగానే రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరానని అన్నారు. ఆ తర్వాత అప్పటి పీపుల్స్వారిలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని పేర్కొన్నారు. తాడిత, పీడితుల కోసం, భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ నాలుగున్న దశాబ్దాలపాటు ఉద్యమించానని, అనారోగ్య సమస్యలతో జన్జీవన స్రవంతిలో కలిశానని వెల్లడించారు. తన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి ఆదివారం ఆయన చేరుకున్నారు. ‘సాక్షి’ ఆయనను పలుకరించగా.. ఉద్యమ ప్రస్థానం, అనుభవాలు, అనారోగ్య కారణాల గురించి వివరించారు. ఆయన మాటల్లోనే.. ● కుటుంబసభ్యులు, రక్తసంబంధీకులు, గ్రామస్తులను కలవడాన్ని ఏమనుకుంటున్నారు? ప్రసాదరావు: చిన్ననాటి స్నేహితులను కలువడం సంతోషంగా ఉంది. అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్న. వారి ఆత్మీయత పలకరింపు ఎంతోతృప్తి ఇచ్చింది. మల్లోజుల కోటేశ్వరరావు, కంది లచ్చిరెడ్డి, బయ్యపు దేవేందర్రెడ్డి, దగ్గు రాజలింగును చూసి నేను పీపుల్స్వార్ పార్టీలోకి వెళ్లా. ● ఏఏ జిల్లాల్లో పనిచేశారు? ప్రసాదరావు: 1980లో సుమారు ఆరునెలల పాటు కరీంనగర్ జిల్లాలో పనిచేశా. 20 సంవత్సరాలపాటు ఖమ్మం, 25 సంవత్సరాలపాటు ఆదిలాబాద్, ఛత్తీస్గఢ్లో పనిచేశా. ‘పుట్టింది ఒకసారి.. చచ్చేది ఒకసారి’ అనే సిద్ధాంతంతోనే పార్టీలో చేరా. ● వ్యవస్థ ఎలా ఉంది? ప్రసాదరావు: రాజ్యాంగం అమలు చేస్తే మావోయిస్టు అనే పదమే ఉండదు. రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నక్సలైట్ ఉద్యమంతోనే గ్రామాల్లో ప్రశ్నించేతత్వం ఏర్పడింది. దోపిడీ, అణచివేత, నిరుద్యోగ సమస్య ఇప్పటికీ మారలేదు. ● ఉద్యమాలు ఎప్పుడు వస్తాయి? ప్రసాదరావు: అన్యాయాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీ, అణచివేత ఉన్నన్ని రోజులు ఉద్యమాలు ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. అది తుపాకీ ద్వారానే రావాలనే సిద్ధాంతమేమీలేదు.. ఏ రూపంలోనైనా రావచ్చు. ● ఆపరేషన్ కగార్తో నష్టం వాటిల్లుతుందా? ప్రసాదరావు: భారీగా నష్టం వాటిల్లుతుంది. అనారోగ్యం, పార్టీ సంక్షోభం తలెత్తుతుంది. నేను బయటకు వచ్చాక నా సహచరుడు సత్యనారాయణరెడ్డి ఎన్కౌంటర్లో చనిపోయారు. ● గిరిజన ప్రాంతాల్లో మీరుచేసిన సేవలు? ప్రసాదరావు: వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో గిరిజన, లంబాడీల్లో చైతన్యం రగిలించా. వందల ఎకరాల సాగుభూములు పంపిణీ చేశాం. పాలకులు మారినా వారిజీవితాలు మారలేదు. ● ఎక్కడ ఉంటున్నారు? ప్రసాదరావు: హైదరాబాద్, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల్లోని బంధువుల వద్ద ఉంటున్నా. అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. భవిష్యత్ నిర్ణయం తీసుకోలేదు. ● తెలంగాణపై కామెంట్? ప్రసాదరావు: సుమారు 1,200 మంది బలిదానాలు చేశారు. సబ్బండవర్ణం ఉద్యమిస్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగ సమస్య అలాగే ఉంది. ● కమ్యూనిజం నిర్మూలన సాధ్యమేనా? ప్రసాదరావు: కమ్యూనిజం నిర్మూలన సాధ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం కొనసాగుతూనే ఉంది. తుపాకీ పక్కన పెట్టొచ్చు కానీ.. అంతం ఉండదు. ఉద్యమంలో నష్టం ఉండొచ్చు. బతికినా, చచ్చిన కమ్యూనిస్టుగానే ఉంటా. ● పునరావాసం కల్పించిందా? లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావసం కల్పిస్తుంది. కానీ, ఎక్కువ మందికి ఉండేందుకు ఇళ్లులేవు. తినడానికి తిండి లేదు. కట్టుకోవడానికి బట్టలు లేవు. చాలాఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి. ఇళ్లస్థలాలు, వ్యవసాయ భూమి ఇవ్వాలి. -
పాలనపై అవగాహన
పెద్దపల్లిరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రథమ పౌరులుగా ఎన్నికైన సర్పంచులకు తమ బాధ్యతలు, హక్కులపై అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. దీంతోపాటు పల్లె పాలనలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్వహించే విధులపైనా తర్ఫీదు ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ఐదురోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈక్రమంలో జిల్లాలోని 263 పంచాయతీల సర్పంచులకు రెండు విడతల్లో శిక్షణ ఇచ్చేలా జిల్లా అధికారులు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు ఐదురోజులపాటు మాస్టర్ ట్రెయినర్లు సర్పంచులకు శిక్షణ పూర్తిచేశారు. మలివిడతలో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మరికొందరు సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. తొలివిడత శిక్షణ పొందిన పలువురు సర్పంచులు తమకు సులువుగా అర్థమయ్యేలా ట్రెయినర్లు ఎల్ఈడీ స్క్రీన్లు చూపిస్తూ వివిధ అంశాలు వివరించారని వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు పేర్కొన్నారు. వారిమాటల్లోనే.. పలు గ్రామ పంచాయతీ సర్పంచుల మనోగతం నిబంధనల గురించి తెలుసుకున్నాం ముగిసిన తొలివిడత ఐదురోజుల శిక్షణ తరగతులు -
కొలనూర్ జాతరకు 52 ఏళ్లు
సోమవారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2026వన జాతరకు సన్నద్ధం జిల్లాలోని సామ్మక్క – సారలమ్మ జాతరకు ఆయా కమిటీలు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. గోదావరిఖని, గోలివాడ, కొలనూర్, కొదురుపాక, నీరుకుల్లతోపాటు వివిధ ప్రాంతాల్లో జాతర నిర్వహిస్తారు. ఇందుకోసం అమ్మవార్ల గద్దెలు ముస్తాబు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. క్యూలైన్లు నిర్మించారు. భక్తులకు తాగునీరు, వసతి కల్పిస్తున్నారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు జాతర నిర్వహిస్తారు. జాతరకు వెళ్లే భక్తులు ముందుగానే తమ ఇళ్లలో సమ్మక్క – సారలమ్మకు ఎత్తు బంగారం(బెల్లం) సమర్పిస్తున్నారు. – గోదావరిఖని/సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి ఓదెల(పెద్దపల్లి): చుట్టూ గుట్టలు, పచ్చని పొలాల మధ్య కొలువుదీరారు కొలనూర్ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు. ఈఏడాదితో 52ఏళ్లు పూర్తవుతోంది. ఈనెల 28నుంచి 31వ తేదీ వరకు జాతర నిర్వహణ జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ , నిజామాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి నుంచి కూడా భక్తులు భారీసంఖ్యలో తరలివస్తారు. ఆర్టీసీ బస్సులతోపాటు రైలు సౌకర్యం కూడా ఉంది.వసతులు కల్పించాం – కొలిపాక మధునయ్య, చైర్మన్, జాతర కమిటీ కొలనూర్ అల్లీమాసాని చెరువు సమీప గుట్టల్లో సమ్మక్క – సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తిచేశాం. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా సుమారు రెండు లక్షల మందికిపైగా భక్తులు తరలివస్తారు. తాగునీరు, విద్యుత్, నీడ, రహదారి సౌకర్యాలు కల్పించాం. -
అజాగ్రత్తతో అపాయం
జిల్లాలో రోడ్డు ప్రమాదాల సమాచారం● సురక్షిత గమ్యస్థానమే లక్ష్యం ● అలైవ్ – అరైవ్పై పోలీసుల ప్రచారం ● ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే ● రోడ్డు ప్రమాదాల నియంత్రణపై దృష్టి గోదావరిఖని: అజాగ్రత్త, నిర్లక్ష్యం జీవితాంతం విషాదం మిగుల్చుతోంది. అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ప్రాణాలు తీస్తోంది. ప్రధానంగా తెల్లవారుజామున సాగే ప్రయాణాలు ప్రమాదాలకు అత్యధిక కారణాలవుతున్నాయి. ఈనేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రణ, ప్రయాణికులు, వాహనదారులు క్షేమంగా గమ్యం చేరాలనే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమిషరేట్ పరిధిలోని పోలీసుశాఖ ప్రజలను చైతన్యవంతం చేస్తోంది. రాష్ట్ర పోలీసుశాఖ ఆదేశాల మేరకు అలైవ్ – అరైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టింది. పాఠశాలలు, ప్రధాన కూడళ్లలో వాహనదారులు, ఆటోడ్రైవర్లు, ఉద్యోగులతో సమావేశమై తరచూ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. బ్లాక్స్పాట్ల పరిశీలన జిల్లాలో రాజీవ్ రహదారి విస్తరించిన ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఇటీవల బ్లాక్స్పాట్లను పరిశీలించారు. ప్రమాదాలకు గల కారణాలపై నివేదిక తెప్పించుకున్నారు. ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులకు ఆదేశాలు జారీచేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక దృష్టి మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై పోలీసు శాఖ దృష్టి సారించింది. ఈక్రమంలో వాహనాల తనిఖీ విస్తృతంగా చేపట్టింది. వాహన రిజిస్ట్రేషన్ పేపర్లు లేనివారితోపాటు మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తోంది. పట్టుబడి న వారిని కోర్టులో హాజరుపర్చి రూ.2వేల జరి మానా విధిస్తోంది. రెండోసారి మద్యం తాగి పట్టుబడితే కోర్టు రెండురోజుల జైలు శిక్ష విధిస్తోంది. ప్రధాన కారణాలివే స్వయం కృతాపరాధంతోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసుశాఖ గుర్తించింది. మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మె ట్, సీట్బెల్ట్ వాడకపోవడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్లో మాట్లాడడం ఇందులో ప్రధానమైనవిగా పేర్కొంది. తొందరగా గమ్యం చేరాలనే ఆరాటంతో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనతో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అవగాహన ర్యాలీలు రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల అమలుతోపాటు రోడ్డు భద్రత సూచనలు పాటించాలని, క్షేమంగా గమ్యం చేరుకోవాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కాలేజీలు, పాఠశాలల్లో రోడ్డు భద్రత గురించి వివరిస్తున్నారు. ఫ్లెక్సీలు, పోస్టర్ల ద్వారా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం ముమ్మరం చేశారు. ఏడాది మృతులు తీవ్రగాయాలు గాయాలు 2022 127 53 262 2023 113 65 300 2024 145 57 342 2025 137 38 388 -
మేడారానికి బస్సులు ప్రారంభం
పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం స్థానిక బస్స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సు సేవలను ఆదివారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈనెల 28 నుంచి మొదల య్యే జాతరకు భక్తులు తరలివెళ్లి మొక్కులు సమర్పించుకునేందుకు వీలుగా ఆర్టీసీ సేవల ను అందుబాటులోకి తెచ్చామని ఎమ్మెల్యే అన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. పెద్దపల్లి నుంచి 175 బస్సులను నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్లో తనిఖీలు రామగుండం: ఆర్పీఎఫ్ పోలీసులు ఆదివా రం స్థానిక రై ల్వేస్టేషన్లో తనిఖీలు చేశా రు. ప్లాట్ఫామ్స్తోపాటు రైళ్లలోనూ తని ఖీలు చేశారు. అనుమానితులను ప్రశ్నించి వది లేశారు. ఆర్పీఎఫ్ ఎస్సై క్రాంతికుమార్, ఏఎస్సైలు నాగరాజు, రామకృష్ణ, కానిస్టేబుల్ కవిత, పలువురు పోలీసులు పాల్గొన్నారు. కొత్త గనులు కేటాయించాలి గోదావరిఖని: సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు గనులు కేటాయించాలని, రాష్ట్రప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.47 వేల కోట్లు వెంటనే ఇ ప్పించాలని ఏఐటీయూసీ నాయకులు కోరా రు. కొత్తగూడెం పర్యటనకు వచ్చిన కేంద్ర బొ గ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డికి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ ఆదివారం ఒక వినతిపత్రం అందజేశారు. సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రెగ్యులర్ సీఎండీ లేక నిర్వహణ గాడిప్పుతోందని అన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు మిర్యాల రంగయ్య, సారయ్య, వైవీ రావు, మడ్డి ఎల్లా గౌడ్, వీరభద్రం, వంగ వెంకట్, రాంగోపాల్, రంగు శ్రీను, రమణమూర్తి పాల్గొన్నారు. ఓటు బలమైన ఆయుధం పెద్దపల్లి: ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధమని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య అన్నా రు. కలెక్టరేట్లో ఆదివారం ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ, ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. మనదేశ భవిష్యత్ ఓటరు చేతిలోనే ఉంటుందని, ఎన్నికల సమయంలో ఓటుహక్కు సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కొత్తగా ఓటుహక్కు పొందిన యువతను అభినందించారు. సీనియర్ ఓటర్లను సన్మానించారు. కలెక్టరేట్ ఏవో ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
నేనే మేయర్!
సాక్షి, పెద్దపల్లి: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ సహా మూడు మున్సిపాలిటీల్లో రాజకీయం వేడెక్కింది. మేయర్, చైర్పర్సన్ పదవులు అధిష్టించడమే లక్ష్యంగా నాయకులు పావులు కదుపుతున్నారు. రామగుండం మేయర్ కుర్చీపై కన్నేసిన పలువురు నేతలు.. తమకు రిజర్వేషన్ అనుకూలించిన డివిజన్లలో ‘నేనే మేయర్’ అభ్యర్థిని అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నా రు. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోయినా.. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఎవరికివారే మేయర్ అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నారు. తమ వర్గం నేతలకు టికెట్లు ఇప్పించి, వారిని గెలిపించుకునేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా మూడు మున్సిపాలిటీలు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. మేయర్ సీటిస్తే.. ఫైనాన్స్ హెల్ప్ తమకు మేయర్ స్థానం కేటాయిస్తే, అవసరమైతే పలువురు వార్డు/డివిజన్ అభ్యర్థులకు ఫైనాన్స్ సపోర్ట్ చేసి, వారిని గెలిపించుకుంటామని ఎమ్మెల్యే చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తూ ఎమ్మెల్యేకు విన్నవించుకుంటున్నారు. చైర్పర్సన్, మేయర్ పదవులపై కన్నేసిన పలువురు సీనియర్ నేతలు.. తామే చైర్పర్సన్, మేయర్ అభ్యర్థులమని వార్డులు/డివి జన్లలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే పలు వార్డుల్లో అభ్యర్థులు ఖరారు కాకముందే ప్రచారం విస్తృతంగా కొనసాగిస్తున్నారు. తమవర్గం నేతలకు టికెట్లు ఇప్పించుకోవాలని, వారిగెలుపు కోసం ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. రామగుండంలో పోటాపోటీ.. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థా నాన్ని ఎస్సీ జనరల్ కేటాయించారు. దీంతో పలువురు ఎస్సీ ఆశావహులు మేయర్ రేసులో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహంకాళి స్వామి, మాజీ మేయర్ డాక్టర్ అనిల్కుమార్తోపాటు, పలువురు నాయకులు తమకు అనుకూలమైన డివిజన్లలో పోటీచేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. మున్సిపాలిటీల్లో కొలిక్కి.. పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ కుర్చీ బీసీ జనరల్ కు కేటాయించారు. కాంగ్రెస్ సీనియర్ నేత నూగిళ్ల మల్లయ్యకు దాదాపుగా సీటు ఖరారు అయ్యింది. మంథని బీసీ జనరల్కు కేటాయించగా, అక్కడ సైతం కాంగ్రెస్ సీనియర్ నేత ఓడ్నాల శ్రీనివాస్ అభ్యర్థిత్వానికి మంత్రి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమా చారం. సుల్తానాబాద్లో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుమారుడు బిరుదు కృష్ణకు చైర్మన్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరికొందరు నేతలు సైతం చైర్పర్సన్ సీటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నేనే చైర్పర్సన్.. నేనే కార్పొరేటర్ బల్దియాల్లో ఆశావహుల విస్తృత ప్రచారం నోటిఫికేషన్ విడుదలకు ముందే రాజకీయ వేడి కొలిక్కి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా? రామగుండం మేయర్ అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ -
నిబంధనలు తెలుసుకున్నా
గ్రామసర్పంచ్గా ప్రజలకు సేవలు అందించేందుకు మాకున్న అధికారాలు, బాధ్యతలు ఏమిటో, చట్టం ఏంచెబుతుందనే విషయాలపై ట్రెయినర్లు వివరించారు. లేఅవుట్ నిబంధనలు పాటిస్తేనే ఇంటి అనుమతులు ఇవ్వాలని తెలుసుకున్న. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పాటించాల్సిన పద్ధతులపై అవగాహన వచ్చింది. – పెర్క రిబిక, కొత్తపల్లి చాలా తెలుసుకున్నాం ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో పంచాయతీ ఎన్నికల్లో పోటీపడి గెలిచాం. సర్పంచ్ అయిన తర్వాత ఏంచేయాలో, ప్రజలకు ఎలా సేవలు అందించాలో అనే విషయాలపై పంచాయతీరాజ్ చట్టం నిబంధనలను గురించి ట్రెయినర్లు వివరించారు. ప్రజలకు ఉపాధి పనులను కల్పించేందుకు అనుసరించాల్సిన పద్ధతుల గురించి ఇందులో తెలుసుకున్నా. – పెద్దపల్లి తిరుమల, పాలకుర్తి అవగాహన వచ్చింది నేను తొలిసారి మా ఊరుకు సర్పంచ్గా ఎన్నికయ్యా. పల్లెపాలనలో మా బాధ్య తలు ఏమిటో వివరించేందుకు చేపట్టిన శిక్షణ తరగతులు మాకు ఎంతో ఉపకరించాయి. మా బాధ్యతలు, విధులపై అవగాహన కలిగింది. ఎల్ఈడీ స్క్రీన్పై వివిధ అంశాలు చూపుతూ సులువుగా అర్థమయ్యేలా వివరించారు. – తాడిచెట్టి చామంతి, రాఘవాపూర్ సర్పంచులకు ఉపయోగం తొలిసారి ఎన్నికై న సర్పంచులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారందరికీ పంచాయతీ చట్టాలు, నిబంధనల అమలు తదితర అంశాలపై ఐదురోజులు శిక్షణ ఇచ్చాం. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నిఅంశాలపై పూర్తిగా అవగాహన కల్పించాం. పల్లె పాలనకు రూపొందించిన చట్టాలను అతిక్రమించొద్దని సూచించాం. – వీరబుచ్చయ్య, డీపీవో -
రాష్ట్రంలో అరాచకపాలన
● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గోదావరిఖని: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో మా జీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్రెడ్డి సర్కార్ కుంభకోణాలకు పాల్పడుతోందని, ఈక్రమంలోనే నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లను రద్దు చేశారని ధ్వజమెత్తారు. సింగరేణిలో సైట్ విజిట్ పేరిట కాంగ్రెస్ నా యకులకు అనుకూలంగా ఉన్నవారికి టెండర్లను క ట్టబెట్టి కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనస్కు టెండర్లు అప్పగిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం అదనంగా కోట్చేస్తూ సంస్థకు నష్టం తీసుకొస్తుందని ఆరోపించారు. సింగరేణిలో కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నాయకులు కౌశిక్ హరి, గోపు ఐలయ్యయాదవ్, పీటీ స్వామి పాల్గొన్నారు. -
‘శాతవాహన’లో క్రికెట్ టోర్నీ
గోదావరిఖనిటౌన్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక శాతవాహన యూ నివర్సిటీ పీజీ కళాశాలలో శనివారం న్యాయవాదులు, జ్యుడీషియల్ ఎంప్లాయీస్ స్టాఫ్ మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు మ్యాచ్ ప్రారంభించారు. కోర్ట్స్టాఫ్ జట్టు విజయం సాధించింది. సీనియ ర్ సివిల్ జడ్జి జీవన్సూరజ్సింగ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకట్సచిన్రెడ్డి, గోదావరిఖని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిరిగ సంజయ్కుమార్, కోశాధికారి ఎండీ ఉ మర్, ప్రతినిధులు ఎరుకల ప్రదీప్కుమార్, శో భారాణి, శాంతన్కుమార్, కొత్తకాపు సుధాకర్రెడ్డి, పెట్టం శ్రీనివాస్, చందాల శైలజ, పంగ శంకర్, రాజేందర్, రవీందర్ పాల్గొన్నారు. భక్తుల భద్రత ముఖ్యం గోదావరిఖని: సమ్మక్క – సారలమ్మ భక్తుల భద్రత ముఖ్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గోదావరి తీరంలోని సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంగణాన్ని శనివారం సీపీ పరిశీలించారు. తొలుత అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. భ క్తుల భద్రత, రక్షణ చర్యలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఏర్పాట్లు తదితర అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఏసీపీ రమేశ్, సీఐలు ప్రసాద్రావు, ఇంద్రాసేనారెడ్డి, రాజేశ్వర్రావు, భీమే శ్, జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డిఉన్నారు. కాగా, అమ్మవార్ల జాతర ప్రాంగణం రాత్రివేళ విద్యుత్ వెలుగుల్లో ఆకట్టుకుంది.బీఆర్ఎస్ సత్తా చాటాలి పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అ న్నారు. జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన బీ ఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయ న మాట్లాడారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ ము న్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళికలు సి ద్ధం చేసినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దాస రి మనోహర్రెడ్డి అధ్యక్షత జరిగిన సమావేశంలో నాయకులు రఘువీర్సింగ్, ఉప్పు రాజ్కుమార్, మోబిన్, గుణపతి, సందీప్రావు, సూర శ్యాం, పెంచాల శ్రీధర్, పూదరి చంద్రశేఖర్, పెద్ది వెంకటేశ్, రాజమల్లు, గోపి పాల్గొన్నారు. గణతంత్ర వేడుకలకు ఉజ్వల కోల్సిటీ (రామగుండం): దే శరాజధాని న్యూఢిల్లీలోని ఎ ర్రకోట వేదికపై గోదావరిఖ ని పేరు మరోసారి గర్వంగా మెరవనుంది. గోదావరిఖని నగరానికి చెందిన ప్రముఖ కూచిపూడి కళాకారిణి, ‘నాట్యఖని’ వ్యవస్థాపకురాలు గుమ్మడి ఉజ్వలకు గణతంత్ర దినోత్సవంలో నాట్యప్రదర్శన ఇచ్చే అరుదైన అవకాశం దక్కింది. ఏటా దేశవ్యాప్తంగా ఎంపికై న కళాకారులతో వివిధ రాష్ట్రాల సంస్కతి – సంప్రదాయాలను కళ్లకు కట్టేలా ప్రదర్శించే గణతంత్ర వేడుకల్లో ఈసారి ఉజ్వల కూచిపూడి నృత్యంతో ఆకట్టుకోనున్నారు. ఈనెల 26న ఎర్రకోట వద్ద నిర్వహించే వేడుకల్లో నాట్యప్రదర్శన ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 30 మంది కళాకా రులను ఎంపిక చేయగా, అందులో గోదావరిఖనికి చెందిన ఉజ్వల ఎంపిక కావడం విశేషం. ఆమెను పలువురు అభినందించారు. జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని మాస్టర్ ట్రైనర్స్ సదయ్య, చంద్రశేఖర్, ప్రసాద్, వెంకటేశ్వర్లు, కె.వెంకటేశ్వర్లు సూచించారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు కలెక్టరేట్లో శనివారం అవగాహన కల్పించారు. గో దావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని ఆర్వోలు, ఏఆర్వోలు హాజరయ్యారు. నామి నేషన్ల పరిశీలన, జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతుల గురించి వారు వివరించారు. లక్ష్యం మేరకు ఉపాధి పనులు జూలపల్లి/ఎలిగేడు(పెద్దపల్లి): నిర్దేశిత లక్ష్యం మేరకు ఉపాధిహామీ పనులు పూర్తిచేయాలని అదనపు డీఆర్డీవో ప్రవీణ్ కుమార్ సూచించా రు. ఎంపీడీవోలు పద్మజ, భాస్కర్రావు, ఏపీ వో సదానందం, ఎంపీవో కిరణ్తో కలిసి ఎఫ్ఏలు, పంచాయతీ కార్యదర్శులకు ఉపాధిపను లపై శనివారం అవగాహన కల్పించారు. కూలీల హాజరు శాతం పెంచాలని తెలిపారు. పశువుల పాకలను మార్చి 31లోపు పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. -
సజావుగా రహదారుల విస్తరణ
పెద్దపల్లి: రోడ్ల విస్తరణ సజావుగా చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సుల్తానాబాద్ పరి ధిలోని పూసాల ఎంపీపీఎస్, పల్లెదవాఖాన, బీసీ బాలుర గురుకులం, సుల్తానాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో చేపట్టిన వివిధ పనులను కలెక్టర్ శనివారం పరిశీలించి మాట్లాడారు. తహసీల్దార్ బషీరొద్దీన్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఎంపీవో సమ్మిరెడ్డి, ఆర్ అండ్ బీ డీఈ రవికిరణ్, ఏఈ గుణశేఖర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎంఈవో రాజయ్య ఉన్నారు. అవకాశాలను వినియోగించుకోవాలి సుల్తానాబాద్రూరల్: అవకాశాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. భూపతిపూర్ కేజీబీవీ, గర్రెపల్లి ఎస్సీ రెసిడెన్సియల్ కళాశాల, బీసీ బాలుర గురుకులాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఏఈ గుణశేఖర్, ప్రిన్సిపాల్స్ ఉన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
సింగరేణిని దోచుకున్నదెవరో తేల్చుకుందామా?
గోదావరిఖని: సింగరేణిని దోచుకున్నదెవరో తేల్చుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధం కావాలని, 2014 నుంచి విచారణ కమిషన్ వేసి నిజానిజాలు తేల్చుకుందామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూ ర్ సవాల్ చేశారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూగర్భ గనులను పాతర పెట్టి రామగుండం ఊరు మధ్య ఉపరితల గనులు తెరిచి బొందల గడ్డగా మార్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నా రని ఆరోపించారు. ఇప్పటికై నా పద్ధతి మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబు తారని హెచ్చరించారు. నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ కోరారు. పలువురు నాయకులు కాంగ్రెస్లో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల కలలు సాకారం చేసేలా కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ -
టుడే న్యూస్ పేపర్.. టుమారో బెస్ట్ పేపర్!
నేటి న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్ అంటారు.. కానీ, జగిత్యాలలోని గోవిందపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెద్ది శ్రీనివాస్ న్యూస్ పేపర్ కూడా టీచింగ్ టూల్ అని గట్టిగా నమ్ముతారు. జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లిలో పనిచేస్తున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో వచ్చే విజ్ఞానదాయకమైన సమాచారం, శీర్షికలను కత్తిరించి ల్యామినేషన్ చేసి పుస్తకాలుగా మలచి గ్రంథాలయంలో భద్రపరుస్తున్నారు. వాటిలోని అంశాలను విద్యార్థులకు బోధించి విజ్ఞానం పెంపొందింపజేస్తున్నారు. పాఠ్యపుస్తకాలకు తాజా సమాచారాన్ని జోడించి పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచేలా కృషి చేస్తున్నారు. – సాక్షి,కరీంనగర్ డెస్క్ 8లోu -
‘ఎల్లంపల్లి’ నీటి తరలింపు
ధర్మారం(ధర్మపురి): నందిమేడారం రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన ఎల్లంపల్లి విద్యుత్ మోటారును ఇంజినీరింగ్ అధికారులు శనివారం సాయంత్రం ప్రారంభించారు. రిజర్వాయర్ వద్ద పేజ్– 1వ విద్యుత్ మోటార్ను ఆన్ చేయగా.. పైప్లైన్ ద్వారా 247 క్యూసెక్కులు గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్లోకి తరలివెళ్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న వేంనూరు పంప్హౌస్ నుంచి రెండు రోజులపాటు నందిమేడారం రిజర్వాయర్లోకి నీటిని తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఓటుహక్కుపై అవగాహన పెద్దపల్లిరూరల్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు ఎంతో విలువైనదని, ఎన్నికల్లో బ్రహ్మస్త్రంగా ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆర్డీవో గంగయ్య అన్నారు. ఆర్డీవో ఆఫీసులో ఉద్యోగులు, సిబ్బంది తదితరులతో శనివారం ప్రతిజ్ఞ చేయించారు. ఓటరుగా నమోదై ఉన్నవారు.. తాము ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకుంటామని అన్నారు. -
రేపటి నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు
పెద్దపల్లి: మేడారం సమ్మక్క – సారలమ్మ జా తరకు ఈనెల 26వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సు లు నడిపిస్తామని కరీంనగర్ రీజినల్ మేనేజర్(ఆర్ఎం) రాజు తెలిపారు. ఇందుకోసం ముగ్గురు డీఎంలు, 30 మంది సూపర్వైజర్లు, మరో 500మంది డ్రైవర్లు, కండక్టర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. వీరందరినీ సమన్వయం చేస్తూ బస్సులు సురక్షితంగా గమ్యస్థానం చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 175 బస్సులను పెద్దపల్లి నుంచి మేడారానికి నడిపిస్తామని వివరించారు. భక్తులకు సౌకర్యాలు బస్సుల కోసం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బస్ డి పోకు కేటాయించిన స్థలాన్ని చదును చేయించారు. అక్కడే క్యూలైన్లు ఏర్పాటు చేశారు. చలువ పందిళ్లు, తాగునీటి వసతి కల్పించారు. విద్యుత్ దీపాలు అమర్చారు. తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఎమ్మెల్యే విజయరమణారావు ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. పెద్దలకు రూ.420, పిల్లలకు రూ.220 చార్జి ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే మేడారం జాతరకు బస్చార్జి పెద్దలకు రూ.420, పిల్లలకు రూ.220 చొప్పున నిర్ణయించామని ఆర్ఎం రాజు వివరించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తింపజేస్తున్నామని స్పష్టం చేశారు. పెద్దపల్లి నుంచి మంథని, కాటారం, భూపాలపల్లి, ములుగు మెయిన్ రోడ్డు, పస్రా మీదుగా బస్సులు ఎస్ఎస్ తాడ్వాయి చేరుకుంటాయని ఆయన పేర్కొన్నారు. ‘ఖని’లో నేటినుంచి ప్రత్యేక బస్సులు.. గోదావరిఖనిటౌన్: మేడారం సమ్మక – సారలమ్మ జాతరకు ఆదివారం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని డీఎం నాగభూషణం శనివారం తెలిపారు. గోదావరిఖని నుంచి రోజూ 24 గంటలపాటు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. జాతర కోసం 115 బస్సులు, 230 డ్రైవర్లు, 170 మంది ఇతర ఉద్యోగులను అందుబాటులో ఉంచామన్నారు. పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.230గా చార్జీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే గోలివాడ జాతరకు ఈనెల 27 నుంచి స్పెషల్ బస్సులు నడుపుతామన్నారు. వివరాలకు 94413 35701 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. అందుబాటులో ముగ్గురు డీఎంలు.. 500 మంది కండక్టర్లు, డ్రైవర్లు పెద్దపల్లిలో ఏర్పాట్లు పూర్తి -
ఓటే.. మన వజ్రాయుధం
కరీంనగర్ అర్బన్/సిరిసిల్ల కల్చరల్: ఓటు.. బ్రహ్మాస్త్రం.. ప్రభుత్వాలను కూల్చాలన్నా.. నియంతృత్వ విధానాలకు చరమగీతం పాడాలన్నా మీట నొక్కి వ్యవస్థను మార్చొచ్చు. ఏక్ దిన్కా సుల్తాన్ అన్నట్లు ఎన్నికల్లో ‘ఓటు’కున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఇంతటి మహత్తర శక్తిని పొందడంలో యువత ఆసక్తి చూపకపోవడం విచారకరం. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు ఉన్న శక్తి ఏపాటిదో స్పష్టౖమైన విషయం విదితమే. ఒక్క ఓటుతో గెలిచినవారుండగా సమాన ఓట్లతో టై కాగా టాస్తో విజేతను నిర్ణయించారు. అందుకే ప్రతి ఓటు విలువైనదే.. నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కథనం.. – వివరాలు 8లో..మల్యాల: ఈమె మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన బండారి దుబ్బరాజవ్వ(102). శతాధిక వృద్ధురాలైనా.. కళ్లు కనపడకపోయినా, నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ.. కుటుంబ సభ్యుల సహకారంతో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ‘ఎన్నిసార్లు ఓటు వేసిన్నో నాకు గుర్తు లేదు. బుద్ధి తెలిసినప్పటి నుంచి ఓటు ఏసేందుకు పని ఇడిసిపెట్టుకొని, పోయిన. మొన్నటి సర్పంచ్ ఓట్లలోనూ నాకు నడువరాకపోయినా ఓటు వేసిన. ఓటు వేయకపోతే జనాభా లెక్కలళ్ల మనం లేనట్టేని మావోళ్లు చెప్పిండ్రు’. అని దుబ్బరాజవ్వ ఓటు ప్రాముఖ్యతను చెప్పి.. నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.జిల్లా మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు కరీంనగర్ 10,64,129 5,23,898 5,40,175 56 రాజన్న సిరిసిల్ల 4,76,187 2,30,294 2,45,849 44 పెద్దపల్లి 7,24,608 3,56,740 3,67,815 53 జగిత్యాల 7,30,959 3,50,778 3,80,143 38 -
కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
పెద్దపల్లి: పెద్దపల్లి, సుల్తానాబాద్ బల్దియాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే విజయర మణారావు అన్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శనివా రం శంకుస్థాపన చేసి మాట్లాడుతూ, పెద్దపల్లి అభి వృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తానన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయండి అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వే యాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. సుల్తానాబాద్లో రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. త్వరలోనే ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, మున్సిపల్ ఆఫీస్లకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. ప్రతినిధులు అంతటి అన్నయ్యగౌడ్, వినుపాల ప్రకాశ్రావు, రమేశ్, శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, రాజమల్లు, రాములు, రాజలింగం, తిరుపతి, కుమార్ కిశోర్, రమ, వరప్రసాద్, అబ్బయ్యగౌడ్, బిరుదు సమత, కృష్ణ, వరప్రదీప్, సునీత, రాజు, శ్రీనివాస్, రాజయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
మర్యాదగా వ్యవహరించాలి
పాలకుర్తి(రామగుండం): పోలీస్స్టేషన్కు వచ్చే ఫి ర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి సూచించారు. బసంత్నగర్ ఠాణాను డీసీపీ ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలిచ్చారు. తొలుత అన్ని విభాగాల పనితీరు గురించి పోలీస్ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నా రు. రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అంతకుముందు స్థానిక పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్, బసంత్నగర్ ఎస్సై శ్రీధర్, పోలీస్సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా వైద్య సిబ్బంది క్రీడా సంబురం
కోల్సిటీ(రామగుండం): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) మహిళా వైద్య ఉద్యోగులకు శు క్రవారం క్రీడాపోటీలు నిర్వహించారు. పేషెంట్లకు నిత్యం వైద్య సేవలు అందించే సిబ్బంది.. క్రీడాపోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒత్తిడిని పక్కనపెట్టి క్రీడామైదానంలో సందడి చేశారు. నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ గ్రేడ్–2 టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రత్యేకంగా కబడ్డీ, చైర్ రేస్, స్పూన్–పింగ్ వంటి వినోదాత్మక క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన మహిళా సిబ్బందిని వైద్యాధికారులు అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి, విధుల్లో మరింత నిబద్ధతతో పనిచేయడానికి దోహదపడతాయని వారు తెలిపారు. విజేతలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా బహుమతులను అందజేయనునట్లు వైద్యాధికారులు తెలిపారు. -
విలువైనది ప్రాణం
జ్యోతినగర్(రామగుండం): ప్రతీప్రాణం విలు వైనదని, ప్రతీఒక్కరు బాధ్యతగా రోడ్డు ప్రయా ణం చేయాలని రామగుండం పోలీస్ కమిషన ర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత, పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేశ్ పర్యవేక్షణలో అరైవ్–అలైవ్ రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో శుక్రవారం జరిగింది. సీపీ మాట్లాడుతూ, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత మాట్లాడుతూ.. ఎన్టీపీసీ ఉద్యోగులు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు సేఫ్టీ పాటించేలా చర్యలు తీసుకుంటామన్నా రు. పోలీస్ అధికారులు శ్రీనివాస్, ప్రవీణ్ కు మార్, రాజేశ్వరరావు, అనిల్ కుమార్, ఉదయ్ కిరణ్, సంధ్యారాణి, వెంకట్స్వామి ఉన్నారు. ‘పుల్లూరి’ రాక వాయిదా జూలపల్లి(పెద్దపల్లి): ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత పుల్లూరి ప్రసాదరావు ఉరఫ్ చంద్రన్న తన స్వగ్రామం రాక ఒకరోజు వాయిదా పడింది. సుమారు 45 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత జనజీవనంలో కలిసిన ఆయన.. తొలుత శనివారం స్వగ్రామానికి వస్తారని ఆశించారు. కానీ, కొన్నికారణాలతో ఒకరోజు వాయిదా పడినట్లు ఆయన మిత్రులు తెలిపారు. ఆదివారం ఉదయమే తన చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారని, గ్రామంలో సమావేశం నిర్వహించి తన ఆనుభవాలను వెల్లడించనున్నట్లు సమాచారం.ప్రభుత్వ కాలేజీల్లోనే చదవాలి పెద్దపల్లి: ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన వి ద్య అందుతోందని, విద్యార్థులు ఇంటర్మీడియ ట్ను అందులోనే చదవాలని ఉమ్మడి కరీంన గర్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు స్పెషలాఫీసర్ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన పే రెంట్, లెక్చరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాలలోని ‘వాల్ ఆఫ్ ఫేమ్’లోనీ పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ఎ దగాలని సూచించారు. జిల్లా ఇంటర్ విద్య నో డల్ ఆఫీసర్ కల్పన మాట్లాడారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీధర్, వార్డెన్ అంజయ్య, లెక్చరర్లతోపాటు తల్లిదండ్రులు పద్మ, రాంచందర్, శ్రీనివాస్, యశోద, శ్యామల, భాగ్యలక్ష్మి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,953 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ. 7,953 ధర పలికిందని ఇన్చార్జి కార్యదర్శి ప్ర వీణ్రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.6,088గా, సగటు రూ.7,613గా ధర నమోదైందన్నారు. రైతుల నుంచి 416 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 27న యథావిధిగా కొనుగోళ్లు.. స్థానిక మార్కెట్లో మంగళవారం (ఈనెల 27 న ) పత్తి కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతా యని ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. సోమవారం రిపబ్లిక్ డే ఉన్నందున పత్తి కొ నుగోలు ఉండదని, ఈనెల 28 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీవరకు సమ్మక్క– సారలమ్మ జాతర ఉన్నందున మార్కెట్కు సెలవు ప్రకటించామన్నారు. ఫిబ్రవరి 2 నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. అంకితభావం ముఖ్యం ధర్మారం(ధర్మపురి): ప్రభుత్వ ఉపాధ్యాయు లు అంకితభావంతో పనిచేసి గ్రామీణ విద్యా ర్థులను విద్య, క్రీడా రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఎంపీడీవో సులోచన, జిల్లా మా నిటరింగ్ అధికారి పీఎం షేక్ అన్నారు. కటికెనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు న్యా య వాది ఈదుల విక్రంరెడ్డి అందించిన స్పోర్ట్స్ డ్రెస్లను శుక్రవారం ఎంపీడీవోతోపాటు జిల్లా మానిటరింగ్ అధికారి పంపిణీ చేశారు. కొత్తూ రులో ఎంఈవో ప్రభాకర్ కంప్యూటర్ ల్యాబ్ వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా ముందుకు సాగుతున్నాయన్నారు. సర్పంచులు భూక్య సంగీత, చేపూరి లచ్చయ్య, ప్రధానోపాధ్యాయులు మోతిలాల్ నాయక్, వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ బోనగిరి అజయ్, ఎంపీవో రమేశ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సరిత తదితరులు పాల్గొన్నారు. -
పర్యవేక్షిస్తున్నాం
శాశ్వత ఏర్పాట్లు జాతరకు రూ.5.61 కోట్లు సమ్మక్క – సారలమ్మ జాతరలో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.61 కోట్లు మంజూరు చేసింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, జాతర కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలి. జాతరను విజయవంతం చేయాలి. – విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లిగోదావరిఖని జాతర ప్రాంగణంలో చేపట్టిన శాశ్వత ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో పాతికేళ్ల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాం. అభివృద్ధికి సహకరించిన సింగరేణి, మున్సిపల్, ఎన్టీపీసీ యాజమాన్యాలకు కృతజ్ఞతలు. – ఎంఎస్ రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరి గే సమ్మక్క – సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాం. ఉన్నతాధికారులకు రోజువారీగా నివేదిక అందిస్తున్నాం. – శంకర్, ఈవో, దేవాదాయ, ధర్మాదాయ -
మినీ మేడారం.. జాతరకు సిద్ధం
గోదావరిఖని/పెద్దపల్లి: రామగుండం నగర శివారులోని గోదావరి నతీరంలో గల సమ్మక్క – సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు జాతర నిర్వహిస్తారు. మేడారం తర్వాత అత్యంత వైభవంగా జరిగే గోదావరిఖని జాతరకు లక్షల మంది భక్తులు తరలివస్తారు. పెద్దపల్లి, కరీంనగర్తోపాటు మంచి ర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి కూడా గిరిజను లు, గిరిజనేతరులు, ఆదివాసీలు, ఆదివాసేతరులు కూడా లక్షల్లో తరలివచ్చి సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను దర్శంచుకోవడం ఆనవాయితీ. ఆధునికీకరణకు రూ.4కోట్లు.. గోదావరిఖనిలోని సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంతం ఆధునికీకరణకు సింగరేణి సుమారు రూ.4కోట్లు వెచ్చించింది. గతంలో మాదిరిగా కాకుండా జాతర సమయంతో పాటు ఏడాదిపాటు భక్తులు సేదతీరేందుకు భారీషెడ్డు నిర్మించింది. ము న్సిపల్ ద్వారా ప్రహరీ నిర్మించి ఐరన్గ్రిల్స్ ఏర్పా టు చేశారు. విశాలమైన సీసీ రోడ్లు నిర్మించారు. కాగా, జాతర ఏర్పాట్లను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ శుక్రవా రం పరిశీలించారు. పలు సూచనలు చేశారు. ప్రధాన ద్వారం ముస్తాబు జాతర ప్రాంగణం ముందు సమ్మక్క–సారలమ్మ వి గ్రహాలు ఏర్పాటు చేశారు. ఎడమవైపు టికెట్ కౌంటర్లు, కుడివైపు క్యూలైన్లు నిర్మించారు. అమ్మవార్ల గద్దెలన్నీ ఒకేలైన్లో.. సమ్మక్క– సారలమ్మ, జంపన్న, పగిడిద్దరాజు గద్దెలు అన్నీ ఒకేలైన్లో నిర్మించారు. భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా గద్దెలకు రెండువైపులా ఐరన్గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోరింగ్ షాబాది బండ ఏర్పాటు చేశారు. గద్దెల ఎత్తుపెంచి చుట్టూ ఐరన్ పైపులు ఏర్పాటు చేశారు. పుష్కరఘాట్ ఆధునికీకరణ భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా సమీపంలోని గోదావరి నదీతీరంలో పుష్కరఘాట్ను ఆధునికీకరించారు. ప్రస్తుతం మెట్ల మార్గాన్ని మరమ్మతు చేస్తున్నారు. అలాగే జల్లు స్నానాల చేసేందుకు వీలుగా సింగరేణి యాజమాన్యం పైపులైన్లు ఏర్పాటు చేస్తోంది. కొమురవెల్లి.. వేములవాడ.. కొండగట్టు.. సమ్మక్క – సారలమ్మ జతరకు వెళ్లే భక్తులు తొలుత వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి, కొండగట్టు శ్రీఆంజనేయస్వామి, కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈక్రమంలోనే ఆయా ఆలయాలు ప్రస్తుతం భక్తులతో పోటెత్తుతున్నాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో.. ఓదెల మండలం కొలనూరు, సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల, కొదురుపాకలో అధికారికంగా గిరిజనదేవతల జాతర నిర్వహిస్తారు. అదేవిధంగా పెద్దపల్లి మండలం హనుమంతునిపేట, సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, తొగర్రాయి, ఓదెల మండలం మడక, కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి, మీర్జంపేట, ఎలిగేడు, జూలపల్లి మండలం వెంకట్రావుపల్లిలోనూ వేడుకలు నిర్వహిస్తారు. సమ్మక్క – సారలమ్మ జాతర ఇలా.. 28న సారలమ్మ గద్దెకు రావడం 29న సమ్మక్క గద్దెకు రావడం 30న భక్తులు మొక్కులు సమర్పించుకోవడం 31న అమ్మవార్లు వనప్రవేశం చేయడం ఏర్పాట్లు పరిశీలన పెద్దపల్లి నియోజకవర్గంలో సమ్మక్క – సారలమ్మ జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే విజయరమణారావుతోపాటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. తాగునీరు, విద్యుత్, రోడ్డు తదితర సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. -
పెరుగుతున్న హాజరుశాతం
మంథనిరూరల్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. విద్యార్ధులు, ఉపాధ్యాయుల బోగస్ హాజరుకు చెక్ పెట్టేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫేస్ రికగ్నిషన్ బేస్ట్ అటెన్డెన్స్ యాప్ను అమలులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీరోజు విద్యార్థుల ఫేస్ రికగ్నిషన్ హాజరును ఉపాధ్యాయులు నమోదు చేస్తున్నారు. గతంలో ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు సమయపాలన పాటించేవారు కాదనే ఆరోపణలు ఉండేవి. ఈ యాప్ అమలులోకి వచ్చిన తర్వాత ఠంచన్గా పాఠశాలకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో.. జిల్లాలోని 13మండలాల్లో గల 834 ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ను అమలు చేస్తున్నారు. ప్రతీరోజు ప్రార్థన తర్వాత క్లాస్రూంలోకి వెళ్లే ముందు ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. అలాగే సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో మళ్లీ హాజరు నమోదు చేస్తారు. దీంతో ప్రతీ రోజు తప్పనిసరిగా తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక సమస్యలతో.. ఎఫ్ఆర్ఎస్ నమోదులో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్, సిగ్నల్స్ సరిగ్గా రాకపోవడంతో ఒక్కోసారి విద్యార్థి హాజరైనా ఆన్లైన్లో గైర్హాజర్ అయినట్లు నమోదు అవుతుందని చెబుతున్నారు. అలాగే ప్రతీరోజు క్లాస్కు వెళ్లే సమయంలో ఎఫ్ఆర్ఎస్ నమోదు చేయడంతో సుమారు అర్ధగంట సమయం ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. మిడ్డే మీల్స్లో అక్రమాలకు చెక్.. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా ఈ ఎఫ్ఆర్ఎస్ ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. ప్రతీరోజు ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారనే నివేదిక ఆధారంగా వంట తయారు చేస్తారు. గతంలో క్లాస్లో ఉన్నవిద్యార్థుల సంఖ్య ఆధారంగా వంట చేయడంలో అక్రమాలకు పాల్పడేవారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎఫ్ఆర్ఎస్తో అలాంటి అక్రమాలకు తావు ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
ప్రజల మన్ననలు పొందాలి
పెద్దపల్లిరూరల్: పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడేలా సర్పంచులు పాటుపడి ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కొత్త సర్పంచులకు స్థానిక మదర్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాలలో ఐదురోజులుగా సాగుతున్న శిక్షణ తరగతులు శుక్రవార ముగిశాయి. ఎమ్మెల్యే విజయరమణారావుతో కలి సి కలెక్టర్ సర్పంచులకు ధ్రువీకరణపత్రాలను అందించారు. ఉపాధిహామీ ద్వారా చేపట్టే పనుల విషయంలో నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయని కలెక్టర్ అన్నారు. లేఅవుట్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పల్లెల అభివృద్ధి, ప్రజాసంక్షేమంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జెడ్పీ సీఈవో నరేందర్, డీఎల్పీవో దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు. గడవులోగా ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగఖ పెద్దపల్లి: జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ను గడువులోగా 100 శాతం పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులతో శుక్రవారం తన కార్యాలయంలో సమీక్షించారు. కలెక్టర్ మాట్లా డుతూ, పట్టణాల్లో 1,406, రూరల్ ప్రాంతాల్లో 967, జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,373 ఇళ్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈనెల 30వ తేదీవరకు ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోయాలని ఆయన సూచించారు. పనులు ప్రారంభించని వాటిని రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని అన్నారు. లబ్ధిదారులకు బిల్లుల త్వరితగతిన చెల్లింపులు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి నిర్వహించిన మరో సమావేశంలో కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, పరిపాలన అంశాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రతీశాఖలోని జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఖాళీల వివరాలను వెంటనే తనకు సమర్పించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. గణతంత్ర వేడుకల సందేశాన్ని క్లుప్తంగా తయారు చేయాలని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో హౌసింగ్ పీడీ రాజేశ్వర్రావు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో..
సాక్షి, పెద్దపల్లి: చదువు నేర్చుకోవాలంటే కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి కొందరు విద్యార్థులది. కొన్ని మార్గాల్లో సర్వీసులు లేకపోవడం, కొన్నింటిని రద్దు చేయడంతో విద్యాలయాలకు వెళ్లేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వ బడులు, కళాశాలల్లో చదివే పేద విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తే ఆర్థిక భారమవుతోందని నడుచుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా మండల, జిల్లా కేంద్రాలకు చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు బస్సు సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పక్క గ్రామాలకై తే నడుచుకుంటూ వెళ్తుండగా, మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేక ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తుండంతో వారి భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆదాయం లేదన్న సాకుతో.. జిల్లాలోని మంథని, గోఆవరిఖని డిపోల పరిధిలో 113 ఆర్టీసీ, 60 అద్దె బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం కిలోమీటరుకు(ఈపీకే) రూ.25 ఆదాయం వచ్చే రూట్లలో మాత్రమే ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. విద్యార్థులు అధికంగా వస్తున్న గ్రామాల మార్గాల్లో కిలోమీటరుకు (ఈపీకే) రూ.15 నుంచి రూ.18 వరకే ఆదాయం వస్తోంది. ఆదాయం లేని చోట బస్సులను తిప్పితే సంస్థ నష్టాల్లో వెళ్లే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు అద్దె బస్సులను గతంలో గ్రామాలకు తిప్పేది. ప్రస్తుతం వాటిని లాభాలు ఉన్న రూట్లల్లోనే పంపుతున్నారు. కొన్ని చోట్ల నడుస్తున్నప్పటికీ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయాల్లో కాకుండా ఇతర వేళల్లో తిప్పుతున్నారు. ప్రైవేట్ వాహనాల జోరు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేని గ్రామాల్లో ప్రయాణికులు ఆటోలు, జీపులు ఆశ్రయిస్తున్నారు. వారు ఇష్టమెచ్చినట్లు చార్జీలు వసూలు చేస్తున్నారు. పరిమితికి మించి ఎక్కించుకుని వెళ్తుండడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు భయపడుతున్నారు.జిల్లాలోని డిపోల పరిధిలో బస్సుల వివరాలుడిపోలు గోదావరిఖని మంథని మొత్తం బస్సులు 123 50 ఆర్టీసీవి 83 30 అద్దె బస్సులు 40 20 రోజూ తిరిగే కి.మీ 52,377 21,500 గమ్యస్థానం చేరేవారు 73,500 17,000 రోజువారీ ఆదాయం రూ.32 లక్షలు రూ.12లక్షలు బస్సుసౌకర్యంలేని గ్రామాలు 29 12 -
సోలార్ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి
మంథని/మంథనిరూరల్: జిల్లాలో సహకార సంస్థల ఆధ్వర్యంలో చేపడుతున్న పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని, ఫిబ్రవరి లోగా గ్రిడ్కు అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం మంథనిలోని ఇంటిగ్రేటెడ్ కార్యాలయ పనులు, జెడ్పీహెచ్ఎస్ బాలికలు, సంగీత కళాశాల, భట్టుపల్లిలోని ఆర్అండ్ఆర్ పనులు, మండలంలోని కన్నాల జెడ్పీ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాల, నాగారం ఎంపీపీఎస్, పీహహెచ్సీ సబ్సెంటర్, గుంజపడుగు గ్రామంలో నిర్మాణంలో ఉన్న పీహెచ్సీ భవనం, జెడ్పీహెచ్ఎస్ తదితర పనులు పరిశీలించారు. ఆయా పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో పాటు సమాంతరంగా ట్రాన్స్మిషన్ లైన్ పనులు కూడా మొదలు పెట్టాలని సూచించారు. ఈ పనులకు డిస్కం అధికారులు సహకరించాలన్నారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో పాటు, సమాంతరంగా విద్యుత్ రవాణా కోసం ట్రాన్స్ మిషన్ లైన్ నిర్మాణ పనులు కూడా రెండు రోజుల్లో మొదలు పెట్టాలని, దీనికి డిస్కం అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. రెడ్కో, విద్యుత్ శాఖలను మంచి సమన్వయం చేస్తున్నారని డీసీవోను అభినందించారు. డీసీవో శ్రీమాల, రెడ్కో జిల్లా మేనేజర్ దురిశెట్టి మనోహర్, కేడీసీసీ బ్యాంకు సీఈవో సత్యనారాయణరావు, ఎంపీడీవో శ్రీజ, తహసీల్దార్ అరీఫోద్దిన్, ఏడీఈ వెంకటనారాయణ పాల్గొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ పెద్దపల్లి: తెలంగాణ రెవెన్యూ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా శాఖ 2026 సంవత్సరం క్యాలెండర్ను గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు తూము రవీందర్, కార్యదర్శి లెంకల బ్రహ్మానందరెడ్డి, ఉపాధ్యక్షులు వై.కుమార్, ఎండీ సాజిద్అలీ, డాక్టర్ డి.రాజు, సంయుక్త కార్యదర్శులు గొడిశల శ్రీనివాస్, పల్లాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మంథని పీఠం ప్రతిష్టాత్మకం
మంథని: మంథనిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం మంథని కావడంతో మున్సిపల్ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు కావడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వార్డుల వారీగా సర్వేలు జిల్లాలో రామగుండం కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. రామగుండం ఎస్సీలకు రిజర్వు కాగా మంథని బీసీ జనరల్, పెద్దపల్లి బీసీ మహిళ, సుల్తానాబాద్ జనరల్కు రిజర్వు చేశారు. అయితే మూడు స్థానాల కంటే మంథనిపైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ క్రమంలోనే మంథని పీఠం కై వసం కోసం కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు కన్నేశాయి. ఆయా వార్డుల్లో ప్రజాధారణ ఉన్న అభ్యర్థులు ఎవరు.. గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయి.. పార్టీ బలబలాలు.. కుల, ఽఆర్థిక పరిస్థితులు, ఇతరత్రా అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమచారం. నివేదికల ఆధారంగానే టికెట్ల కేటాయింపు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఓటర్ల వద్దకు అశావహులు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకపోయినా, టికెట్లు ఖరారు కాకపోయినా అశావహులు మాత్రం అప్పడే ప్రచారం మొదలు పెట్టారు. తాము ఈ వార్డు నుంచి బరిలో ఉంటున్నామని, తమను ఆశీర్వదించాలని వేడుకుంటున్నారు. అవసరమైన హామీలు, వారి అవసరాలు తీర్చే పనిలో నిమగ్నమయ్యారు. కొంత మంది ఏకంగా తామే చైర్మన్ అభ్యర్థులమని అడుగు ముందుకు వేసి అతి ఉత్సాహం కనబర్చుతున్నారు. ఏ పార్టీ కూడా ఇప్ప టి వరకు టికెట్లను అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఆశావహులు మాత్రం టికెట్ తమకే వస్తుందనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. సొంత పార్టీలో టికెట్ రాకుంటే మరో పార్టీ నుంచి పోటీకి సై అని కొందరు ఆశావహులు అంటుండగా, ఇండిపెండెంట్గా బరిలో ఉండేందుకు మరికొందరు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ వార్డుల వారీగా సర్వేలు.. ప్రజాభిప్రాయ సేకరణ ఓటర్లకు వద్దకు ఆశావహులు.. వేడెక్కిన రాజకీయం -
పన్ను వసూళ్లలో లక్ష్యాన్ని సాధించాలి
కోల్సిటీ(రామగుండం): ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్నందున ఆస్తిపన్ను వసూళ్లలో వందశాతం లక్ష్యాన్ని సాధించాలని రామగుండం నగరపాలక కమిషనర్ జె.అరుణశ్రీ అన్నారు. గురువారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భారీ బకాయిలు ఉన్న వ్యక్తులు, సంస్థలపై మొదటగా దృష్టి సారించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల డేటా క్షేత్రస్థాయిలో సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో పోలింగ్కేంద్రాల్లో మరుగుదొడ్లు, నీటి సరఫరా, లైటింగ్, ర్యాంప్ తదితర వసతులు కల్పించాలని సూచించారు. అలాగే జిల్లా పద్మశాలీ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను కమిషనర్తో పాటు అధ్యక్షుడు కొలిపాక సారయ్య, పెద్దపల్లి ఆర్డీవో, టీపీయూఎస్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు బొద్దుల గంగయ్య ఆవిష్కరించారు. ఎస్ఈ గురువీర, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026
పెద్దపల్లి పట్టణం చందపల్లి డివిజన్లోని డీ–83 ఎస్సారెస్పీ కెనాల్పై నిర్మించిన దశాబ్దాల కాలం నాటి వంతెన శిథిలాస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. వంతెన ఇరువైపులా రక్షణ గోడలు విరిగిపోయాయి. సీసీ రోడ్డు గుంతలమయంగా మారింది. జిల్లాకేంద్రం నుంచి చందపల్లి మీదుగా తుర్కల మద్దికుంట, కాచాపూర్ గ్రామాల గుండా ధర్మారం, జూలపల్లి మండలాలకు వందలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరగక ముందే వంతెనకు మరమ్మతు చేయాలని కోరుతున్నారు. అలాగే సుల్తానాబాద్ మండలకేంద్రం నీరుకుళ్ల వెళ్లే దారిలో అయ్యప్పగుడి వద్ద వరిపొలాల్లో విద్యుత్ స్తంభం తీగలే ఆధారంగా వాలిపోయి ఉంది. విద్యుత్ అధికారులు స్పందించి సరిచేయాలని రైతులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి ప్రమాదకరం.. తీగలే ఆధారం.. -
సరిపడా లేక
సమయానికి రాక.. ● అరకొర బస్సులతో విద్యార్థులకు తప్పని నడక ● పలు గ్రామాల నుంచి పాఠశాలలకు వచ్చేందుకు ఇక్కట్లు ● మండల, జిల్లా కేంద్రాలకు ప్రైవేటు వాహనాలే దిక్కుఆటోలే దిక్కు..జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే వచ్చే విద్యార్థులు నిర్ణీత సమయానికి బస్సులు దొరక్క తప్పని పరిస్థితుత్లో ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనదారులు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని ప్రమాదకర స్థితిలో ప్రయాణిస్తున్నారు. -
క్యాథ్ల్యాబ్ సేవలు అందుబాటులోకి తేవాలి
గోదావరిఖని(రామగుండం): పారిశ్రామిక ప్రాంతంలో గుండెపోటు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో క్యాథ్ల్యాబ్ సేవలు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ కోరారు. గురువారం సింగరేణి ఏరియా హాస్పిటల్ను సందర్శించి క్యాథ్ల్యాబ్ సెంటర్ పనులను ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్తో కలిసి పరిశీలించారు. క్యాథ్ల్యాబ్ సేవలు ప్రారంభమైతే గుండె సంబంధిత చికిత్సల కోసం రామగుండం పరిసర ప్రాంతాల ప్రజలు కరీంనగర్, హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మెరుగైన వైద్యం పొందవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా హాస్పిటల్కు రెండు ప్రవేశ మార్గాలు ఉండాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. సింగరేణి శ్రీనివాస్, సివిల్ డీజీఎం వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


