గోదావరిఖని: అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ప్రజలకు అండగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఆయన జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, బలిదానాల ఫలి తంగానే మనం స్వేచ్ఛాయుతమైన, ప్రశాంతమైన జీవితా న్ని గడుపుతున్నామని అన్నారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్, సీసీ ఎస్, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్ ఏసీపీలు రమేశ్ నాగేంద్రగౌడ్, శ్రీనివాస్, రవీందర్, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్రావు, ఏవో శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.


