జర్మనీలోని ప్రవాస భారతీయులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 16న, బెర్లిన్లోని చారిత్రాత్మక బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద భారత్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రవాస భారతీయులు బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద సమావేశమై, దేశభక్తి, ఐక్యత మరియు సఖ్యతతో కూడిన అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించారు.
ఈ వేడుకలో జర్మనీ నలుమూల నుంచి భారతీయ సంఘాలు, కమ్యూనిటీ సభ్యులు పాల్గొనడమే గాక, జర్మనీలోని భారత రాయబారి,అజిత్ గుప్తా, ఆయన సతీమణి, అలాగే భారత్ మిషన్కు చెందిన కాన్సులర్ స్టాలిన్ బాబు చీకట్ల, పర్సనల్మంత్రి డాక్టర్ మన్దీప్ సింగ్ తూలీ వంటి ప్రముఖ అధికారులు, ఇతర విశిష్ట అతిథులు విచ్చేశారు.
అంతేగాదు శాంతి, స్నేహం, ఐక్యత , సంఘీభావం అనే శక్తివంతమైన సందేశాన్ని మోసుకెళ్తూ, బ్రాండెన్బర్గ్ గేట్ నుంచి శాంతి స్థూపం వరకు జరిగిన చిరస్మరణీయమైన ఐక్యతా యాత్రతో ఈ వేడుకలు ముగిశాయి. నిజంగా ఇది జర్మనీలోని భారతీయ సమాజానికి గర్వించదగిన చిరస్మరణీయ సందర్భం.
(చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం)


