సాక్షి, హైదరాబాద్: నగరంలోని హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై హోంగార్డ్ దాడి చేసిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా హోంగార్డ్ ఆనంద్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించిన అనంతరం రిమాండ్కు తరలించినట్లు వీడియోను రిలీజ్ చేశారు.
వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మహిళపై సదరు హోంగార్డు విచక్షణారహితంగా దాడి చేశాడు. తనతో వాగ్వాదానికి దిగడంతో మహిళపై హోంగార్డు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా, అతడు హఫీజ్పేట్ రైల్వే స్టేషన్లో డిప్యూటేషన్పై అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటన అనంతరం హోంగార్డును తిరిగి తెలంగాణ పోలీస్ శాఖకు రైల్వే అధికారులు పంపించేశారు. అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సైతం తెలిపారు.
https://t.co/NEZsAOdnPg pic.twitter.com/iIuyboVgfB
— CV Anand IPS (@CVAnandIPS) September 19, 2026
డీజీపీ సీరియస్..
మరోవైపు ఈ ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. వెంటనే హోంగార్డ్ ఆనంద్పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది ఏ స్థాయి వారైనా.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఇలాంటి ప్రవర్తనను క్షమించలేమన్నారు. ఇది శిక్షణ, ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. మహిళ పట్ల హోంగార్డు ప్రవర్తన ఖండించదగినదని డీజీపీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు.. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండ్ కేటీఆర్ కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా కేటీఆర్.. పోలీసుల ప్రవర్తన అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డారు. డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వీడియోను కూడా కేటీఆర్ షేర్ చేశారు.
This is atrocious behaviour by Telangana police
Hope you will act @TelanganaDGP https://t.co/CFA6SWxDUe— KTR (@KTRBRS) September 19, 2026


