Nizamabad
-
రీజియన్ పరిధిలో 82 ఓపీఆర్ఎస్ సర్వీసులు
నిజామాబాద్ రూరల్: రీజియన్ పరిధిలోని ఆయా డిపోల నుంచి 82 ఓపీఆరీఎస్(ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం) ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్ఎసం జ్యోత్స్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆయా డిపోల నుంచి రాష్ట్రంలోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఎయిర్పోర్టు(హైదరాబాద్), తిరుపతి, విజయవాడ, భద్రాచ లం తదితర ప్రాంతాలకు రాజధాని, సూ పర్లగ్జరీ, ఈ – సూపర్ లగ్జరీ, లహరి ఏసీ, లహరి నాన్ ఏసీ వంటి సేవలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ప్ర యాణికులు ముందస్తుగా టికెట్ బుకింగ్ కోసం ఆర్టీసీ వెబ్సైట్ www.tgsrtcbus. in, మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. డిప్యూటీ సీఎంను కలిసిన డీఎఫ్వో డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా అటవీశాఖ అధి కారి (డీఎఫ్వో) సిద్ధార్థ్ విక్రమ్సింగ్ ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్కను మంగళవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లాలో అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వ విత్తనాలనే వినియోగించాలి సిరికొండ: తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాణ్యమైన రాయితీ విత్తనాలనే వినియోగించాలని తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్రెడ్డి రైతులకు సూచించారు. సీడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించే విత్తనాలపై మండలంలోని కొండూర్లో రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. సంస్థ ద్వారా బీపీటీ 5204, కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048 రకం వరి విత్తనాలు అందుబాటులో ఉన్నా యని అన్వేష్రెడ్డి తెలిపారు. ప్రైవేట్ సంస్థల విత్తనాల వాడకాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన పంటలను సాగు చేయకుండా పంట మార్పి విధానాన్ని పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఆయిల్ పామ్, పప్పు దినుసుల సాగు చేపడితే లాభాలు ఉంటాయన్నారు. పీఏసీఎస్ చైర్మన్ చెల్లెం గంగాధర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బా కారం రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎర్ర న్న, టీఎస్ సీడ్స్ డీఎం రఘు, సర్పంచ్ నర్మల లతాభాస్కర్రెడ్డి, మండల వ్యవసాయాధికారి నర్సయ్య, రైతులు పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఇందల్వాయి: పశువులు అక్రమ రవాణా కాకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన అంతర్జిల్లా చెక్పోస్టును ఆయన మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అనుమానాస్పద వాహనాలను తప్పకుండా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. తనీఖీల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పశువుల అక్రమ రవాణా సమాచారం తెలిసే పోలీసులకు అందించాలని ప్రజలకు సూచించారు. ఆయనవెంట డిచ్పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి ఎస్సై సందీప్ ఉన్నారు. -
ధాన్యం తరలింపును వేగవంతం చేయాలి
పెర్కిట్(ఆర్మూర్): కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అకాల వర్షం కురిస్తే ధాన్యం తడిసి పోయే అవకాశం ఉంటుందని, తరలింపును వేగవంతం చేయాలని సూచించారు. టార్పాలిన్లను అందుబాటులో ఉంచాల న్నారు. అలాగే రైస్ మిల్లుల్లో వెంటవెంటనే ధాన్యం అన్లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పౌరసర ఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సకాలంలో బిల్లుల చెల్లింపు పూర్తయ్యేలా ట్యాబ్లో ఎంట్రీని వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఆర్డీవో సాయన్న, డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం ప్రవీణ్, డీసీవో ఎన్ శ్రీనివాస్రావు, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
ధాన్యం కొనుగోలుకు ఆటంకాలు కలిగిస్తే చర్యలు
● ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ పై కేసు నమోదు ● మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశంనిజామాబాద్ అర్బన్: వరి ధాన్యం కొనుగోలు ప్ర క్రియకు ఆటంకాలు కలిగేలా వ్యవహరిస్తున్న వారి ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ధాన్యం రవాణాకు లారీలు సమ కూర్చని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం రైస్ మిల్ల ర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో ప్రభుత్వ సలహాదారు, కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పలు చోట్ల రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. బాల్కొండ సెక్టార్ లో కొనుగోలు కేంద్రాలకు వాహనాలను సమకూర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తీరును తీవ్రంగా పరిగణిస్తూ, సదరు కాంట్రాక్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ కు లిఖిత పూర్వకంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశా రు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా రైస్ మిల్లర్లు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. కడ్తా, తరుగు పేరుతో ఎవరైనా రైతులను నష్టపరిచే చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. అవసరమైతే నిజామాబాద్ మా ర్కెట్ యార్డులో పని చేస్తున్న హమాలీ కార్మికుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రైతులు శుభ్రపరచిన ధాన్యాన్ని తేవాలి కొనుగోలు కేంద్రాలకు రైతులు శుభ్రపరచిన ధా న్యాన్ని తరలించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కోరారు. ఈసారి రబీలో ఆశించిన దానికంటే ఎక్కువగా మొక్కజొన్న, వరి ధాన్యం దిగుబడులు వచ్చాయన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేస్తున్నామన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవ హరిస్తున్నారని సుదర్శన్ రెడ్డి దుయ్యబట్టారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మ న్ ముప్ప గంగారెడ్డి, డీఎస్వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీవో శ్రీనివాస్, వ్యవసా య అధికారి వీరస్వామి, అధికారులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు
● పంట సాగు అంచనా నివేదిక విడుదల చేసిన వ్యవసాయ శాఖ ● జిల్లా వ్యాప్తంగా 5.30 లక్షల ఎకరాల్లో సాగవనున్న పంటలు డొంకేశ్వర్(ఆర్మూర్): 2026–వానకాలం (ఖరీ ఫ్) సీజన్కు సంబంధించిన పంట ప్రణాళిక ఖా రైంది. జిల్లా వ్యాప్తంగా 5.30లక్షల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగవుతాయని వ్యవసా య శాఖ అంచనా వేసింది. అత్యధికంగా 4.38 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరి సాగయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే, గతేడాది ఖరీఫ్తో పోలిస్తే ఈసారి కొంతమేర సాగు విస్తీర్ణం పెరగనుంది. తొల కరి చినుకులు కురవగానే రైతులు జూన్ మొదటి, రెండో వారం నుంచి సాగు పనుల ను ప్రారంభించనున్నారు. వరి తర్వాత మొక్కజొన్న, సోయాబీన్, పసుపు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపే అవకాశముంది. ఎరువులు, విత్తనాలు! ఖరీఫ్ పంటలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులకు కూడా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. వరికి 1.10 లక్షల క్వింటాళ్లు, మొక్కజొన్నకు 4,400 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా వేసింది. అలాగే సోయాబీన్కు 10,268 క్వింటాళ్లు, కందికి 40 క్వింటాళ్లు, పత్తికి 8 క్వింటాళ్లు అవసరం అవుతాయని ప్రతిపాదనలు తయారు చేసింది. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి డిమాండ్ను బట్టి ఖరీఫ్ పంటల అంచనా ప్రతిపాదనలు రూపొందించాం. విత్తనాలు, ఎరువులలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. పంటలు సాగు చేసేముందు రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని. సలహాలు, సూచనల కోసం స్థానికంగా ఏఈవోలను సంప్రదించాలి. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి ఎరువుల అంచనా (మెట్రిక్ టన్నులు) -
ధాన్యం సేకరణలో రాష్ట్రంలో మొదటి స్థానం
● మొక్కజొన్న కొనుగోళ్లు 88 శాతం పూర్తి ● వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డికి కలెక్టర్ ఇలా త్రిపాఠి నివేదికనిజామాబాద్ అర్బన్: ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని, మొక్కజొన్న కొనుగోళ్లు 88 శాతం పూర్తయ్యిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకొతెచ్చా రు. కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరిస్తున్నామన్నా రు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లు, వరి ధాన్యంపై ముఖ్యమంత్రి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్, జూపల్లి కష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు తదితర ఉన్నతాధికా రు లు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని ప్ర భుత్వం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధా న్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాల ని ఆదేశించారు. ధాన్యం రవాణాకు అవసరమైన లారీలను ఒప్పందం మేరకు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గోదాముల కొరత ఉన్న ప్రాంతాల్లో రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లను తాత్కాలిక నిల్వ కేంద్రాలుగా వినియోగించాలన్నారు. అకాల వర్షాలకు ధా న్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా రైతులను ముందస్తుగానే అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియ మించాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించాలని, ప్రతి రైస్ మిల్లు వద్ద ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, పౌర సరఫరాల శాఖ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం క్రాంతి, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగుబాయి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, రవాణా శాఖ డీటీసీ దుర్గా ప్రమీల, ఎంవీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఇబ్బంది పడుతున్నాం..
నీట్ పరీక్ష రద్దుతో ఇబ్బందులు పడుతున్నాం. నీట్ కోసం ప్రిపేర్ అయి మంచిగా పరీక్ష రాశాం. ఈ పరీక్షలో మంచి ర్యాంకు వస్తుందని భావిస్తున్నాం. మళ్లీ నీట్ పరీక్ష కోసం చదవాల్సి వస్తుంది. పరీక్షల పూర్తి తర్వాత రిలాక్స్ ఆవుతామని భావిస్తే, మళ్లీ పరీక్ష కోసం సిద్ధం కావాల్సి వస్తుంది. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనతో విద్యార్థుల ఆశలు నిరాశ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల లీక్ చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. – హిమాన్షి, నిజామాబాద్ -
బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నం చేయ డం శోచనీయమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేము ల ప్రశాంత్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ మధ్య ఫెవికాల్ బంధం ఉందన్నారు. సిట్ విచారణ పేరిట సంజయ్ కొడుకు భగీరథ్ను కాపాడేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్నా రు. కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మైనర్ బాలికకు డ్రగ్స్, మద్యం ఇచ్చి అఘాయిత్యం చేసినట్లు ఆరోపణలు ఉంటే పోలీసులు మూడు నెలల పాటు ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందన్నారు. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత గత్యంతరం లేక పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక చెప్పేదే కీలకమన్నారు. ఇలాంటి కేసులో బాధితురాలికి రక్షణ కల్పించాల్సింది పోయి, నిందితుడు ఆమైపెనే తిరిగి ’హనీ ట్రాప్’ పేరిట కేసు పెట్టడం దారుణమన్నారు. మైనర్ బాలిక హనీ ట్రాప్ చేస్తుందా అన్నారు. బాధితురాలిపైనే రివర్స్ కేసులు పెట్టడం చూస్తుంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకటేనని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఇద్దరూ కలిసి వ్యాపారాలు, భూమి కుంభకోణాలు చేస్తున్నా రు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు సైతం దీనిపై స్పందించకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటన్నారు. ప్రతిరోజూ కేసీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ మీద, హరీశ్రావు మీద విషం చిమ్మే బండి సంజయ్ తన కొడుకు చేసిన నేరంపై ఏం సమాధానం చెబుతారన్నారు. సంజయ్ తన కొడుకుపై వచ్చిన ఈ పోక్సో కేసుపై నైతిక బాధ్యత వహించాలన్నారు. భగీరథ్ను అరెస్ట్ చేసి నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు. బాధిత మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ మధ్య ఫెవికాల్ బంధం సిట్ విచారణ పేరిట నిందితుడిని కాపాడే ప్రయత్నం బాలికపై అఘాయిత్యం జరిగితే మూడు నెలలపాటు ఫిర్యాదు తీసుకోలేదెందుకు? బాధితురాలిపైనే ఎదురు కేసులు పెట్టడం దుర్మార్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
ప్రైవేట్ ఆస్పత్రిలో బాలుడి మృతి
నిజామాబాద్ రూరల్: నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. జక్రాన్పల్లి మండలం పడకల్ తండాకు చెందిన బదావత్ లత, నరేశ్ దంపతులు తమ కుమారుడు నిక్షిత్(16 నెలలు) ఆరోగ్యం బాగా లేకపోవడంతో సోమవారం ఉదయం ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యుడు మందులు రాసిచ్చి ఇంటికి పంపించారు. పరిస్థితి మెరుగుకాకపోవడంతో రాత్రి వేళ మళ్లీ బాబును ఆస్పత్రికి తీసుకురాగా, ఆస్పత్రి సిబ్బంది అడ్మిట్ చేసుకున్నారు. చికిత్స ప్రారంభించి సైలెన్లు పెట్టారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మంగళవారం ఉదయం స్కానింగ్కు రిఫర్ చేశారు. స్కానింగ్ చేయించి బాబును ఆస్పత్రికి తీసుకు వచ్చిన కొద్దిసేపటికి మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడని తల్లిదండ్రులతోపాటు వారి బంధువులు ఆందోళనకు దిగారు. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి సిబ్బందితో కలిసి ఆస్పత్రికి చేరుకుని వారిని సముదాయించారు. ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ ● ఆస్పత్రి ఎదుట ఆందోళన -
సంస్కృతికి పెద్దపీట
తెలంగాణ సామెతలు మోర్తాడ్(బాల్కొండ): వేసవి సెలవులంటే కాలక్షేపం కోసం కాదు.. ఏదో ఒక కళలో ప్రావీణ్యం పొందేందుకు సద్వినియోగం చేసుకోవాలని నిరూపిస్తున్నారు ఈ చిన్నారులు. ఆ చిన్నారులను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు మోర్తాడ్కు చెందిన సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ శ్రీహర్షిణి. చిన్నారులకు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజెప్పేందుకు కూచిపూడి నృత్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని స్థానిక చిన్నారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎంసీఏ చదివిన శ్రీహర్షిణి నాంది ఫౌండేషన్, మహేంద్ర ప్రైడ్ సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్లో ట్రైనర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరోవైపు నృత్యశిక్షకురాలిగా రాణిస్తున్నారు. తాను నేర్చుకున్న విద్యను పదిమందికి నేర్పాలనే ఉద్దేశంతో మోర్తాడ్లో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు. ఈనెలాఖరు వరకూ శిక్షణ తరగతులను కొనసాగిస్తానని శ్రీహర్షిణి తెలిపారు. ఒక అబ్బాయికి క్లాసికల్ డ్యాన్స్లో ఒక గంట పాటు ప్రత్యేక శిక్షణ కొనసాగిస్తుండటం గమనార్హం. సెలవులను కాలక్షేపం కోసం కాకుండా నృత్య శిక్షణతో సద్వినియోగం చేసుకుంటున్న ఈ చిన్నారులు ఎంతో మందికి స్పూర్తి అని చెప్పొచ్చు. ● మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయినట్లు (ఎక్కువ మంది జోక్యం చేసుకుంటే పని సరైన దారిలో సాగకుండా గందరగోళంగా మారుతుంది.) ● సిగ్గులేదా జీడి గింజా అంటే.. నల్లగున్నా నాకేమి సిగ్గు అనిందట. (తన తప్పును లేదా లోపాన్ని సమర్థించుకుంటూ, ఏమాత్రం సిగ్గు పడకుండా ఎదురు సమాధానం చెప్పడం) వేసవి సెలవులను వృథా కానివ్వడం లేదు. నృత్యంలో శిక్షణ పొందడానికి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా తల్లితండ్రులు, మా శిక్షకురాలు ఇచ్చే ప్రోత్సాహంతో ముందుకు సాగుతాం. – హన్విక, దొన్కల్ మోర్తాడ్లో మేము పొందుతున్న నృత్య శిక్షణ ఎంతో బాగుంది. వేసవి సెలవులను ఎలా గడపా లని ఆలోచించాం. మోర్తాడ్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలియగానే మా తల్లిదండ్రులు శిక్షణ తరగతులకు పంపిస్తున్నారు. – విహాన్షి, రామన్నపేట్ కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందుతున్న చిన్నారులు కళలో ప్రావీణ్యానికి సెలవులు సద్వినియోగం సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా రాణిస్తూనే నృత్య శిక్షణ ఇస్తున్న శ్రీహర్షిణి మోర్తాడ్లో ప్రతిరోజూ వేసవి శిక్షణ తరగతులు -
సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలి
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని శంకర్ భవన్ పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించిన కలెక్టర్.. వారి అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని, డాన్స్, సింగింగ్, ఇండోర్ గేమ్స్ వంటి వాటిలో మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు పలు అంశాలపై ప్రశ్నలు వేశారు. సమాధానాలు ఇచ్చిన చిన్నారులకు కలెక్టర్ బహుమతులు, చాక్లెట్లు అందజేశారు. కలెక్టర్ వెంట డీఈవో పి అశోక్, ఎంఈవోలు సాయిరెడ్డి, అరవింద్గౌడ్, హెచ్ఎం సాయన్న తదితరులు ఉన్నారు. రుద్రూర్: తమకు అవసరం లేకున్నా నానో యూరియాను ఎరువులతోపాటు బలవంతంగా అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పొతంగల్ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్డొలిలో ఎరువుల విక్రయ కేంద్రానికి రైతులు మంగళవారం తాళం వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గతంలో తీసుకున్న నానో యూరియా లిక్విడ్ ఇంకా మిగిలి ఉండగానే మళ్లీ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మూడు సంచుల ఎరువులు తీసుకుంటే ఒక లిక్విడ్ బాటిల్ తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధన విధించడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో అదనపు భారం మోపడం తగదన్నారు. వ్యవసాయాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నందిపేట్(ఆర్మూర్): మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలోకి హిజ్రాల రాకను నిషేధిస్తూ గ్రామాభివృద్ధి కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల సమయంలో హిజ్రాలు వచ్చి వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వారి అంగీకారం మేరకు హిజ్రాల ఆగడాలను శాశ్వతంగా అరికట్టేందుకు గ్రామాభివృద్ధి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హిజ్రాలను గ్రామంలోకి రానివ్వొద్దని తీర్మానించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని సుభా ష్నగర్లో ఉన్న బాలసదనం నుంచి ముగ్గురు బాలికలు మంగళవారం అదృశ్యమయ్యారు. వార్డెన్కు చెప్పకుండా బాలికలు బయటికి వెళ్లిపోయారు. సదనం ఇన్చార్జి సౌందర్య మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇద్దరు బాలికలను గుర్తించి బాలసదనంలో అప్పగించారు. మరో తొమ్మిదేళ్ల బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
క్రైం కార్నర్
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి జక్రాన్పల్లి/నిజామాబాద్ రూరల్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్కు గ్రామానికి చెందిన జైడి పెద్దోళ్ల నర్సయ్య (70) మంగళవారం 44వ నంబర్ జాతీయ రహదారి దాటుతుండగా.. కామారెడ్డి వైపు నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. గాయాలపాలైన నర్సయ్యను చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో తాపిమేస్త్రి.. నిజామబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గూపన్పల్లి క్రాసింగ్ వద్ద బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో తాపిమేస్త్రి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నగరంలోని హస్మీ కాలనీకి చెందిన షేక్ షాకీర్(28) మాక్లూర్ మండల బోర్గాం(కే)లో మేస్త్రి పని చేస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం పని పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఎప్పటిలాగే మంగళవారం ఉదయం బోర్గాం(కే) గ్రామంలో మేస్త్రి పని పూర్తయిన అనంతరం మధ్యాహ్నం తిరిగి వస్తుండగా గూపన్పల్లి క్రాసింగ్ బైక్ను లారీ ఢీకొట్టగా షాకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి షబ్బీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. కామారెడ్డి క్రైం: భార్యతో గొడవల కారణంగా మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. మహ్మద్ హుస్సేన్ (35) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ప్రతి రోజూ భార్యతో గొడవలు జరిగేవి. కొద్ది రోజుల క్రితం అతడి భార్య గౌసియా బేగం పిల్లలతో కలిసి హైదారాబాద్లోని తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. కామారెడ్డికి రావాలని హుస్సేన్ పలుమార్లు అడిగినా ఆమె రాకపోవడంతో మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్వో నరహరి తెలిపారు. ఆర్మూర్టౌన్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను ఆర్మూర్, మోర్తాడ్లో చీత ఫోర్స్ మెరుపుదాడులు నిర్వహించి మంగళవారం పట్టుకుంది. సీపీ సాయిచైతన్య అదేశాల మేరకు సీసీఎస్ ఇన్చార్జి ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీత ఫోర్స్ సిబ్బంది ప్రత్యేక నిఘా సారించి ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు భారీ లారీలను సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. -
పశువుల అక్రమ రవాణా నిరోధానికి చర్యలు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య ● జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై సమన్వయ కమిటీ సమావేశం నిజామాబాద్ అర్బన్: పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. బక్రీద్ నేపథ్యంలో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. పశువు ల అక్రమ రవాణా నిరోధం, జంతు సంక్షేమ నియమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, సీపీ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అధికారులు సమన్వయంతో పని చే యాలని, జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలను ఉల్లంఘించకుండా చూడాలని అన్నారు. గోవ ధపై నిషేధం ఉందని, అలాగే మన రాష్ట్రంలో ఒంటెలను సైతం వధించకుండా నిషేధం అమలులో ఉందని తెలిపారు. పశువులను తరలించడానికి, వాటిని వధించడానికి ముందు తప్పనిసరిగా పశు వైద్యాధికారి నుంచి ధ్రువీకరణ పొందాలని స్పష్టం చేశారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోని కందకుర్తి, సాలూర, పొతంగల్, ఖండ్గావ్ వద్ద అంతర్ర్రాష్ట్ర చెక్ పోస్టులతోపాటు సాటాపూర్, యంచ, ఇందల్వాయి, ఉమ్మెడ, జన్నేపల్లి, మామిడిపల్లి తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏ ర్పాటు చేస్తున్నామని సీపీ తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, నిజామాబాద్, ఆర్మూర్ ఏసీపీలు ప్రకాశ్యాదవ్, వెంకటేశ్వర్రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల, ఎంవీఐ లు శ్రీనివాస్, కిరణ్, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గంగాధరయ్య, పోలీస్, రెవెన్యూ, పశు సంవర్ధక, పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రూ.1.56 కోట్లతో భవిత కేంద్రాల అభివృద్ధి
● నేడు మాక్లూర్, నిజామాబాద్ నార్త్లో నూతన భవనాల ప్రారంభోత్సవం ఆర్మూర్: ప్రత్యేక అవసరాలు గల పిల్లల (దివ్యాంగుల)కు నాణ్యమైన విద్య, థెరపీ, పునరావాస సేవలు అందించేందుకు సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం జిల్లాలోని భవిత కేంద్రాలను బలోపేతం చేస్తోంది. కొత్త భవనాల నిర్మాణం, మరమ్మతులు, రెనొవేషన్ పనుల కోసం జిల్లాలో మొత్తం రూ.1,55,64,000 ఖర్చు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సోమవారం మాక్లూర్, నిజామాబాద్ నార్త్ మండలాల్లో నిర్మించిన భవిత కేంద్రాలను ప్రారంభించనున్నారు. కొత్త భవనాలకు రూ.64.74 లక్షలు జిల్లాలో ఆరు కొత్త్త భవనాల నిర్మాణాలకు రూ. 64.74 లక్షలు కేటాయించారు. ఒక్కో కేంద్రానికి రూ.10.79 లక్షల చొప్పున మాక్లూర్ (మాదాపూర్), నిజామాబాద్ నార్త్, మోపాల్, రుద్రూర్, భీమ్గల్, నవీపేట్ మండలాల్లో నూతన భవిత కేంద్రాలను నిర్మిస్తున్నారు. మాక్లూర్, నిజామాబాద్ నార్త్ భవనాల నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.41.55 లక్షలతో మరమ్మతు పనులు జిల్లాలో ఇప్పటికే పక్కా భవనాలు ఉన్న ఏడు మండల కేంద్రాల్లో మరమ్మతుల కోసం రూ.41.55 లక్షలు మంజూరు చేశారు. ఆర్మూర్, బోధన్, మోర్తాడ్, నందిపేట్, నిజామాబాద్ సౌత్, సిరికొండ, ఎడపల్లి మండలాల్లో పనులు పూర్తయ్యాయి. 15 కేంద్రాల్లో రెనోవేషన్ పనులు పక్కా భవనాలు లేని మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక గదిని కేటాయించారు. 15 కేంద్రాల్లో ఒక్కోదానికి రూ.3.29 లక్షల చొప్పున మొత్తం రూ.49.35 లక్షలు మంజూరు చేశారు. బాల్కొండ, చందూర్, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, కమ్మర్పల్లి, కోటగిరి, మెండోరా, మోస్రా, ముప్కాల్, రెంజల్, వేల్పూర్, వర్ని, ఏర్గట్ల మండలాల్లో రెనోవేషన్ పనులు పూర్తయ్యాయి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 4,857 పాఠశాలల్లో చేరిన పిల్లలు 4,707 స్పెసిఫిక్ లర్నింగ్ డిజేబిలిటీ 1,782 లో విజన్ 1,333 ఎర్లీ ఇంటర్వెన్షన్ 150 ఫిజియోథెరపీ 426 ఐఈఆర్పీలు 29 ఫిజియోథెరపిస్టులు 19 -
ఖాళీ స్థలంలో చెలరేగిన మంటలు
డిచ్పల్లి : డిచ్పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని సుద్దపల్లి రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం సాయంత్రం నిప్పు పెట్టారు. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఎండిపోయిన గడ్డి, పిచ్చి మొక్క లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించా యి. సమీపంలో ఇళ్లు ఉండటం, మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు ఫైర్ స్టే షన్కు సమాచారం అందించారు. ఘటనా స్థ లానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అరగంటపా టు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చా రు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. -
దివ్యాంగ విద్యార్థులకు చేయూత
ఆర్మూర్: జిల్లాలో ఉన్న దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు అవసరమైన ఉపకరణాల పంపిణీ శిబిరాన్ని తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 11న నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి దివ్యాంగ విద్యార్థులను పరీక్షించారు. గుర్తించిన వారిలో 393 మంది చిన్నారులకు 565 సహాయ పరికరాలు మంజూరయ్యాయి. ఒక్కో చి న్నారికి అవసరాన్ని బట్టి ఒకటి లేదా అంతకంటే ఎ క్కువ ఉపకరణాలు అందిస్తున్నారు. ఈ పరికరాల కొనుగోలు ఖర్చు రూ.34 లక్షల 70 వేల 247 కాగా 60 శాతం ఏడీఐపీ పథకం ద్వారా, 40 శాతం స మగ్ర శిక్ష ద్వారా భరించనున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు డీఈవో అశోక్, సహిత విద్యా విభాగం జిల్లా కోఆర్డినేటర్ పడకంటి శ్రీని వాస్రావు పర్యవేక్షణలో ఆర్టిఫీషియల్ లింబ్స్ మా న్యూఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్కో) సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శారీరక వైకల్యం, మానసిక వైకల్యం, వినికిడి లోపం, అంధత్వంతో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన వీల్ చైర్స్, చంక కర్రలు, ట్రై సైకిళ్లు, రొలేటర్స్, హియరింగ్ ఎయిడ్స్, బ్రెయిలీ కిట్, బ్రెయిలీ ప్లేట్స్, బ్రెయిలీ కిట్, ఎమ్మార్ కిట్లతో పాటు కృత్రిమ అవయవాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్బోర్డు కాలనీలో గల ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పంపిణీ శిబిరాన్ని నిర్వహించనున్నారు. శిబిరానికి వచ్చే దివ్యాంగ విద్యార్థులకు ట్రావెలింగ్ అలవెన్స్, భోజన సదుపాయాన్ని అధికారులు కల్పించనున్నారు. ఎంపికై న లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, యూఐడీ నంబర్, వైట్ రేషన్ కార్డు లేదా ఇన్కం సర్టిఫికెట్ జిరాక్స్లతో పాటు రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు తీసుకొని శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుంది. శిబిరం వేదిక : ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్, బైపాస్ రోడ్డు, న్యూ హౌజింగ్బోర్డు కాలనీ, నిజామాబాద్ సమయం : ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లబ్ధిదారులైన దివ్యాంగ విద్యార్థులు : 393 మంది మంజూరైన మొత్తం ఉపకరణాలు : 565 మొత్తం వ్యయం : రూ.34.70 లక్షలు లబ్ధిదారులకు ఉచితంగా ఉపకరణాలు ప్రత్యేక క్యాంపుల్లో గుర్తించిన ప్రతి చిన్నారికి అవసరమైన పరికరం అందేలా చర్యలు తీసుకున్నాం. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వైకల్యాలతో బాధపడుతున్న పిల్లలకు ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. – పడకంటి శ్రీనివాస్ రావు, సహిత విద్యావిభాగం జిల్లా కోఆర్డినేటర్, నిజామాబాద్ విద్యతోపాటు జీవన నైపుణ్యాలు అందిస్తాం దివ్యాంగులైన పిల్లలకు విద్యతో పాటు జీవన నైపుణ్యాలు అందించడమే మా లక్ష్యం. ఈ ఉపకరణాలు వారి రోజువారీ జీవితాన్ని, చదువును సులభతరం చేస్తాయి. ఎంపిక చేసిన దివ్యాంగులు ఈ పరికరాలను తీసుకొని సద్వినియోగం చేసుకోవాలి. – అశోక్, జిల్లా విద్యాధికారి, నిజామాబాద్ నేడు జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో శిబిరం నిర్వహణ పరికరాలు ఉచితంగా అందించనున్న సమగ్ర శిక్ష, అలిమ్కో ప్రతినిధులు -
చిత్రకళతో సృజనాత్మకత
● బోధన్లో మూడేళ్లుగా వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరం బోధన్: చిత్రలేఖనమంటే బొమ్మలు గీయడ మే మాత్రమే కాదు.. మనస్సుతో మాట్లాడే భా ష అని చిత్రకారులంటున్నారు. తమ ఊహాశక్తితో పౌరాణిక, జానపద, ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరిస్తారు. చిత్రలేఖనం పిల్ల ల్లో ఏకాగ్రతను పెంపొందించడంతోపాటు సృజనాత్మకతకు పదును పెడుతుంది. సాలూర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు లింబూరు లక్ష్మణ్ తేజ క్రియేటివ్ కిడ్స్ డ్రాయింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మూడేళ్లుగా బోధన్ పట్టణంలో వేసవి చిత్రలేఖన ప్ర త్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో ఈ ఏడాదీ శిబిరం ప్రారంభమైంది. ప్రస్తుతం శిబిరంలో 15 మందికి పైగా విద్యార్థులు చిత్రలేఖనంలో మెలకువలు నేర్చుకుంటూ అద్భుత ప్రతిభ చాటుతున్నారు. పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారిణి ఎర్రొల్ల అవంతి విద్యార్థులకు బోధిస్తున్నారు. పెన్సిల్ డ్రాయింగ్, షేడింగ్స్, కలర్ పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. కామారెడ్డి అర్బన్: హరేరామ హరేకృష్ణ ఇస్కాన్ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 24 వరకు సంస్కృతి వేసవి శిబిరం నిర్వహిస్తున్నట్టు ఇస్కాన్ కామారెడ్డి కేంద్రం ప్రతినిధి వెంకటదాసు ప్రభు ఒక ప్రకటనలో తెలిపారు. భగవద్గీత శ్లోకాలు, తబలా, చిత్రలేఖనం, నైతిక, పౌరాణిక, నీతి కథలు, ధ్యానం, కీర్తనలు, నృత్యం, రుచికర సహజ వంటల తయారీ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల 5 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులు రామారెడ్డి రోడ్డు లోని మెడికల్ అసోసియేషన్ భవనంలోని ఇస్కాన్ కేంద్రంలో లేదా 99129 16108, 99596 02551 నంబర్లకు సంప్రదించవచ్చన్నారు. మేము గీసిన చిత్రాలు ఇంటి కోడికి ఒకటే కాలు.. పొరుగు కోడికి మూడు కాళ్లు ( మన దగ్గర ఉన్నదాని కన్నా పక్కవాడికి ఉన్నదే గొప్పగా భ్రమపడటం) గాడిద సోపతి తన్నులకే.. ( చెడ్డవాళ్లతో, మూర్ఖులతో స్నేహం చేస్తే మంచి కాకుండా నష్టం, అవమానం, ఇబ్బందులు వస్తాయి.) నాకు బొమ్మలు గీయడమంటే ఎంతో ఇష్టం. మూ డో తరగతి నుంచి బొమ్మ లు గీయడంపై ఆసక్తి పెంచుకున్నాను. ఇంటి వద్దనే బొమ్మలు గీసేదానిని. బోధన్లో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటైనట్లు తెలుసుకొని నేను, తమ్ముడు చేరాం. ప్రతి రోజు వచ్చి డ్రాయింగ్ నేర్చుకుంటున్నాం. – భవ్య, 7వ తరగతి విద్యార్థిని, బోధన్ డ్రాయింగ్ నేర్చుకునేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతున్నారు. బొమ్మలు గీయడం ఎంతో సులభమో విద్యార్థులకు మెలకువలు నేర్పుతున్నాం. రంగులపై అవగాహన కల్పిస్తూ, విద్యార్థులు సొంతంగా బొమ్మలు గీసేలా ప్రొత్సహిస్తున్నాం. – ఎర్రొల్ల అవంతి, ప్రముఖ చిత్రకారిణి -
పేలిన ట్రాక్టర్ టైర్
● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు ఆర్మూర్టౌన్: ట్రాక్టర్ టైర్ పేలి డ్రైవర్ మృతి చెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై రజినికాంత్ తెలిపిన వివరాల ప్రకారం..కత్తి బాలకృష్ణ(40) అనే వ్యక్తి ఆర్మూర్ మండలం మగ్గిడిలోని ఇటుక బట్టిలో పనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం అంకాపూర్ గ్రామంలో ట్రాక్టర్ ఇటుకలోడ్ను దించి తిరిగి మగ్గిడికి వెళ్తుండగా ఆర్మూర్ బృందావన్ టాకీస్ వద్ద టైర్ పేలిపోవడంతో ముందున్న డివైడర్ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ బాలకృష్ణ టైర్ కిందపడగా, మరో ఇద్దరు రోడ్డుపై పడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణ ఆస్పత్రిలో మృతిచెందగా, మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య పెంచులమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
క్రైం కార్నర్
పాముకాటుతో మహిళ మృతి నవీపేట : మండలంలోని ధర్మారం(ఎ) గ్రామానికి చెందిన పల్లపు నర్సమ్మ(57) పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి కుటుంబసభ్యులతో భోజనం చేశాక ఆరుబయట పడుకుందని పేర్కొన్నారు. రాత్రి సమయంలో కట్లపాము కాటువేయగా 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారని తెలిపారు. మృతురాలి సోదరి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని కొల్లూర్ గ్రామానికి చెందిన బండారి సాయిలు(48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట మొరందుబ్బ ప్రాంతంలో సాయిలు ఉరేసుకొని మృతి చెందాడనే సమాచారం మేరకు పోలీసులు పరిశీలించారు. రెండు రోజుల క్రితమే చనిపోయినట్లు గుర్తించారు. మృతుడి భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొన్న బైక్ ● ఒకరి మృతి ఆర్మూర్టౌన్: చెట్టును ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం గోవింద్పేట్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై యాసిర్ ఆర్ఫాత్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట్ గ్రామానికి చెందిన సీతానగర్ దాకయ్య(50) గోవింద్పేట్ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పనుల నిమిత్తం గోవింద్పేట్ గ్రామం నుంచి ఆర్మూర్కు వస్తుండగా గ్రామ శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో దాకయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
శ్రీనగర్లో దొంగల బీభత్సం
● మూడు ఇళ్లలో చోరీ వర్ని: మండలంలోని శ్రీనగర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన వజ్రమ్మ, రమణ, శ్రీనివాసరావు ఇళ్లలో చొరబడిన దుండగులు నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మూడు ఇళ్లలో కలిపి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల నగదు అపహరణకు గురైనట్లు ఎస్సై తెలిపారు. మరో నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా తీసుకొని దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాసరావు, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ పరిశీలించారు. వేసవికాలంలో డాబాల మీద పడుకున్న, ఇతర ప్రాంతాలకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. -
నీటి ఎద్దడి లేకుండా చర్యలు
● పెద్ద పోచమ్మ గుడి వద్ద వాటర్ లీకేజీ అవుతోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. – ప్రభాకర్రెడ్డి – 44వ డివిజన్, రమేశ్–25వ డివిజన్, రాజశేఖర్ – ఐదో డివిజన్మేయర్ : నగరంలో లీకేజీలను అరిట్టేందుకు ఇంజినీరింగ్ విభాగం ప్రత్యేక దృష్టిసారించింది. పెద్ద పోచమ్మ గుడి వద్ద లీకేజీ సమస్య నా దృష్టిలో కూ డా ఉంది. లీకేజీ ఏర్పడిన ఏరియాలో నీరు తక్కువగా వస్తున్నట్లు తెలిసింది. నగరంలో ఎక్కడైనా పైప్లైన్ లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించా. ● నాగారం ప్రాంతంలో పైపులైన్ వేసి కనెక్షన్ ఇవ్వలేదు – షేక్ అలీముద్దీన్, 10వ డివిజన్● నీటి సరఫరా లేని ఏరియాల్లో నల్లా కనెక్షన్ ఇచ్చి సరఫరా చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాం. సమస్యను ఇంజినీరింగ్ విభాగం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. నీటి కనెక్షన్, సరఫరా చేయకపోవడానికి కారణాలు అడిగి తెలుసుకుంటా. ● మా కాలనీలకు ఒక్కోసారి కలుషిత నీరు సరఫరా అవుతోంది. అధికారులకు తెలిపినప్పుడు మంచిగా వస్తున్నాయి. – ప్రశాంత్ – పోచమ్మగల్లి, నవీన్ – దుబ్బ, రవీందర్ – పెద్దబజార్● కొన్ని డివిజన్లలో కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాం. మురుగుకాల్వలకు దగ్గరగా ఉన్న పైప్లైన్లను మార్చాలని ఆదేశించాం. నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని అధికారులకు సూచించాను. ● తాగునీటి ఎద్దడి, పైప్లైన్ల లీకేజీలతోపాటు 24వ డివిజన్ పద్మానగర్లో చెత్తను ఎప్పటికప్పుడు తీసేయడం లేదని, 17వ డివిజన్లో విద్యుత్దీపాలు లేవని, నాగారంలో రాజీవ్ స్వగృహ, ఇతర కాలనీల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని, స్తంభాలు లేక తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఆయా కాలనీల నుంచి స్థానికులు సాక్షి ‘ఫోన్ ఇన్’ ద్వారా మేయర్ దృష్టికి సమస్యలను తెచ్చారు. చెత్తను తొలగించేలా సంబంధిత అధికారులను ఆదేశిస్తామని ఫిర్యాదుదారుడితో మేయర్ అన్నారు. అలాగే అన్ని డివిజన్ల విద్యుత్ దీపాలకు సంబంధించి పాత టెండర్ ముగిసిందని, కొత్త టెండర్లను ఆహ్వానించామని, టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత విద్యుత్ బల్బులు బిగిస్తారని సమాధానమిచ్చారు. రాజీవ్ స్వగృహ, కాలనీల్లో విద్యుత్ సరఫరా గురించి ఎన్పీడీసీఎల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని మేయర్ తెలిపారు. నగరవాసుల సమస్యలు తెలుసుకుంటున్న మేయర్ ఉమారాణివేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. సుమారు రెండు నెలలకు అవసరమైన నీటి నిల్వలు అలీసాగర్, మాసాని, మంచిప్ప చెరువులో ఉన్నాయి. అప్పుడప్పుడు ఏర్పడుతున్న పైప్లైన్ లీకేజీల కారణంగా కొంతవరకు సమస్య ఉన్నట్లు నా దృష్టిలో ఉంది. లీకేజీలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టిసారించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాం. అమృత్ 2.0 పనులు పూర్తయితే నగరానికి 365 రోజులు ఎలాంటి కొ రత లేకుండా నీటిని పుష్కలంగా సరఫరా చేయొచ్చు. నాణ్యత పా టిస్తూ వేగవంతంగా పనులు చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించా’ అని నగర మేయర్ కూరగాయల ఉమారాణి తెలిపారు. నగర మేయ ర్తో ‘సాక్షి’ ఆదివారం ఫోన్ ఇన్ నిర్వహించింది. – సుభాష్నగర్ నగరవాసుల అవసరానికి సరిపడా నీటి నిల్వలు లీకేజీలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి అమృత్ 2.0 పూర్తయితే పుష్కలంగా నీటి సరఫరా ‘సాక్షి’ ఫోన్ ఇన్లో నగర మేయర్ కూరగాయల ఉమారాణి -
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): ఉచితంగా వీసాలు, విమాన టికెట్లు అందిస్తూ యూఏఈలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఏడీఎన్హెచ్, జీటీఎం సంస్థలు మరోసారి వలస కార్మికులకు బంపర్ ఆఫర్ను ప్రకటించాయి. ఈనెల 14న సిరిసిల్ల, జగిత్యాల, సికింద్రాబాద్, 15న సికింద్రాబాద్, నిజామాబాద్, ఆర్మూర్లలో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. క్లీనింగ్ విభాగంలో ఉపాధి విస్తరణతోపాటు హెవీ, లైట్ వెహికిల్ డ్రైవర్లకు అవకాశం కల్పిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉపాధి కల్పించేందుకు అనేకమార్లు ఉచితంగా వీసాలు జారీ చేసి విమాన చార్జీలను సైతం ఏడీఎన్హెచ్ సంస్థనే భరించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు సికింద్రాబాద్ కార్యాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా విభాగాల పరిధిలో.. క్లీనింగ్ విభాగంలో పని చేసేవారికి నెలకు రూ. 24 వేల వేతనం(ఇండియన్ కరెన్సీ), ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించనున్నారు. హెవీ డ్రైవర్లకు రూ. 62 వేలు, లైట్ డ్రైవర్లకు రూ. 45 వేల వేతనం అందించనున్నారు. డ్రైవింగ్ విభాగంలో పని చేయాలనుకునేవారు యూఏఈ లైసెన్స్ను కలిగి ఉండాలి. క్లీనింగ్ సెక్షన్లో పని చేయాలనుకునేవారు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు. బేసిక్ ఇంగ్లిష్ వచ్చి ఉండడంతోపాటు ఈసీఎన్ఆర్ పాస్పోర్టు కలిగి ఉండాలి. ఇతర వివరాలకు సికింద్రాబాద్ – 83320 52299, నిజామాబాద్ – 86868 60999, ఆర్మూర్ – 83320 62299, జగిత్యాల – 83320 42299, సిరిసిల్ల – 93916 61522 నంబర్లలో సంప్రదించాలని జీటీఎం సంస్థ చైర్మన్ సతీశ్రావు ‘సాక్షి’తో తెలిపారు. ఉచిత వీసాలు ఇచ్చే సంస్థ ఏడీఎన్హెచ్ ఒక్కటేనని, ఈ అవకాశాన్ని వలస వెళ్లాలనుకునే వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీసా, విమాన టికెట్లు ఉచితం ఏడీఎన్హెచ్, జీటీఎంల ఆధ్వర్యంలో మరోసారి ఇంటర్వ్యూ మేళా ఉచిత వీసాల జారీకి ముందుకు వచ్చిన సంస్థలు -
నేటి నుంచి జనగణన
● జూన్ 9 వరకు కొనసాగనున్న ప్రక్రియ నిజామాబాద్అర్బన్: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి జనగణన ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులకు శిక్షణ పూర్తయ్యింది. జూన్ 9 తేదీ వరకు జనగణన ప్రక్రియ కొనసాగనుంది. మొదటి మూడు రోజులు ఎన్యుమరేటర్లు గృహాలను గుర్తిస్తారు. జనాభా లెక్కింపునకు ముందు అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలు, పట్టణాల్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయని గుర్తించి మార్కింగ్ చేసి మ్యాపింగ్ తయారు చేస్తారు. అనంతరం జనాభాను లెక్కిస్తారు. ఒక్కో ఎన్యుమరేటర్ 300 ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా జనగణన కోసం 33 మండలాల్లో 2,588 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. అలాగే మూడు మున్సిపాలిటీల్లో 680 మంది ఎన్యుమరేటర్లు, 110 మంది సూపర్వైజర్లు జనగణన విధులను నిర్వర్తించనున్నారు. 13 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం కామారెడ్డి అర్బన్:/కామారెడ్డి టౌన్ : కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) ఆధ్వర్యంలో ఈనెల 13న ఉచిత వేసవి క్రికెట్ శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మోజామ్ అలీఖాన్, కార్యదర్శి ముప్పారపు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హైదరాబాద్, నిజామాబాద్ క్రికేట్ అసోసియేషన్ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు. రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు బాల, బాలికలు, యువతీయువకులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 13న నేరుగా స్టేడియానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో పతకాల పంట కామారెడ్డి అర్బన్: హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లె టిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. మహిళల విభాగంలో కే.మేఘన జా వెలిన్ త్రోలో బంగారు పతకం, షాట్పుట్ లో కాంస్య పతకం సాధించగా, వై.శిరీష జా వెలిన్ త్రోలో కాంస్య పతకం పొందారు. అండర్–20 బాలుర విభాగంలో లాంగ్ జంప్ లో నందు, రాకేష్ వెండి పతకాలు, పవన్ క ళ్యాణ్ కాంస్య పతకం సాధించారు. అండర్–18 బాలికల విభాగం 400 మీటర్ల ప రుగులో కె.నందిని వెండి పతకం పొందారు. విజేతలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్ అభినందించారు. -
బైపాస్లో హనీట్రాప్
● భార్యాభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు ● రిమాండ్కు తరలింపునిజామాబాద్ రూరల్: ద్విచక్ర వాహనదారులను హనీట్రాప్ చేసి డబ్బులు గుంజుతున్న భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు మాధవనగర్ ప్రాంతంలో ఉంటున్నారు. ఈజీగా డబ్బుల సంపాదించాలనే ఆలోచనతో హనీట్రాప్ పతకాన్ని అమలు చేశారు. మాధవనగర్ బైపాస్ రోడ్డులో భార్య నిల్చుని ద్విచక్ర వాహనదారులను ఆకర్షిస్తూ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్తే వెనకాలే భర్త వచ్చి బెదిరిస్తాడు. వాహనదారుల వద్ద ఉన్న డబ్బులను లాక్కుని ఎవరికై నా చెబితే రేప్ కేసు పెడతామని బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి సైతం ఓ వాహనదారుడిని ట్రాప్ చేయగా గూపన్పల్లి శివారులో భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆర్మూర్ బైపాస్ రోడ్డులో సైతం పలువురిని భార్యాభర్తలు బెదిరించినట్లు తెలిసింది. జానపద కళోత్సవ్ను విజయవంతం చేయాలి నిజామాబాద్ రూరల్: జిల్లాకేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో ఈనెల 24 నిర్వహించనున్న జానపద కళోత్సవ్ – 2026ను విజయవంతం చేయాలని ప్రజానాట్య మండలి జిల్లా కన్వీనర్ సిర్ప లింగం కోరారు. నగరంలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ కార్యాలయంలో సాహితీ సాంస్కృతిక సంస్థల నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కళాకారుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జానపద కళోత్సవ్పై, కళారూపాల ప్రదర్శనలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రచ్చ నరేశ్, రాధ కిషన్, రాజు, క్రాంతి, శ్రీనివాస్, విజయమల, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది
● రైస్మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు ● ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు నిరసన ● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్: నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గత మూడు రోజులుగా తాను స్వయంగా సందర్శించానని, సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలోని క్యాంపుకార్యాలయంలో ఆదివారం సా యంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ధా న్యం కొనుగోలు చేస్తామని ప్రకటించి సెంటర్లు తెరి చే సరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వా రం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్టుగా 20 రోజులపాటు కావాలనే ప్రభుత్వం జాప్యం చేసిందని విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ప్రైవే ట్ వ్యాపారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయిస్తూ క్వింటాల్కు రూ.500 నష్టపోతున్నారన్నా రు. రైస్మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరు గు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. రెతు సమస్యలపై మాట్లాడేందుకు కలెక్టర్కు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా వారికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మోర్తాడ్లో సోమవారం నిరసన తెలుపనున్నామని, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. -
ఆ ఐదుగురు ఎవరో..
సుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కో ఆప్షన్ పదవులు దక్కే ఆ ఐదుగురు ఎవరనే అంశంపై జోరుగా చర్చసాగుతోంది. నగరంలోని 60 డివిజన్ల నుంచి 59 మంది దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. కాగా ఐదు పదవులను అధికార పార్టీ కాంగ్రెస్, ఎంఐఎం కలిసి దక్కించుకుంటాయని రాజకీయ వర్గాల్లో టాక్. కౌన్సిల్లో బలాబలాలు కౌన్సిల్లో 60 మంది కార్పొరేటర్లు, ఐదుగురు ఎక్స్ అఫిషియో మెంబర్లు ఓటుహక్కును కలిగి ఉన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్తో పాటు ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిపి 34 సంఖ్యాబలం ఉంది. అదేవిధంగా బీజేపీకి 28 మంది కార్పొరేటర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు కలిపి 31 బలం ఉంది. కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం? కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కార్పొరేటర్లతో ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు, ఎ మ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అవసరమైతే ఈ సమావేశంలోనే కా ర్పొరేటర్లకు అవగాహన నిమిత్తం మాక్పోల్ జరపనున్నట్లు తెలిసింది. 59 మంది దరఖాస్తులు చేసుకోవడంతో.. ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అధికార కాంగ్రెస్, ఎంఐఎంకు తలనొప్పిగా మారింది. అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి. ఎన్నిక ప్రక్రియ సాగనుందిలా.. మొత్తం ఐదు కో ఆప్షన్ పదవులకు గాను, రెండు మైనార్టీ (మెన్, ఉమెన్ ఒక్కోటి), మూడు జనరల్ కేటగిరిలో (రెండు మెన్, ఒకటి ఉమెన్) ఎన్నుకోవాల్సి ఉంటుంది. గతంలో కౌన్సిల్ మెంబర్, ఎన్జీవో, రిటైర్డ్ ఎంప్లాయీ అయి ఉండాలి. మెజార్టీ సభ్యుల ఓట్లు వచ్చిన వారు కో ఆప్షన్ సభ్యుడు/సభ్యురాలిగా ఎన్నికవుతారు. అయితే ఐదు పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్, ఎంఐఎం మధ్య స్పష్టమైన ఒప్పందం కుదిరినట్లు చర్చ జరుగుతోంది. ఎంఐఎం 2, కాంగ్రెస్ 3 పదవులు పంచుకున్నట్లు సమాచారం. నేడు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ‘కో ఆప్షన్’ ఎన్నిక దరఖాస్తులు 59.. అదృష్టం ఎవరిని వరించేనో.. అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ఎంపిక కార్పొరేటర్లతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ సమావేశం? -
బడి బాగుకు కసరత్తు
‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యా వారోత్సవాలకు ఎంతో ప్రాధాన్యత చేకూరింది. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో బడి బాగుకు కృషి చేయనున్నారు. ప్రతిరోజూ వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఖలీల్వాడి: విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు లక్ష్యంగా నేటి (సోమవారం) నుంచి ఈనెల 17వ తేదీ వరకు విద్యాశాఖ విద్యా వారోత్సవాలను నిర్వహించనుంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించింది. సర్పంచ్లతో చర్చలు 13వ తేదీన నియోజకవర్గ స్థాయిలో సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించనున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, బడిబాట తదితర అంశాలపై చర్చించనున్నారు. బడిబాటలో భాగంగా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి నోట్ప్యాడ్, పెన్, బ్యాగ్లతో కూడిన కిట్, భోజన వసతి ఏర్పాటు చేయనున్నారు. ప్రతిభావంతులకు బహుమతులు 17వ తేదీన విద్యా విజయోత్సవం నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, క్రీడల్లో జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.10వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. ‘విద్యలో అత్యుత్తమ ప్రతిభను వేడుకగా జరుపుకోవడం’ అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. శిథిలావస్థ భవనాలపై ప్రత్యేక చర్యలు జిల్లాలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను గుర్తించనున్నారు. వాటిని తక్షణమే సీజ్ చేసి విద్యా కార్యకలాపాలకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోనున్నారు. నిబంధనల ప్రకారం వాటిని కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటారు. బడిబాటతో చైతన్యం 14వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గ్రామాలు, వార్డుల్లో ర్యాలీలు చేపట్టి విద్యపై అవగాహన కల్పించనున్నారు. తల్లిదండ్రులతో సమావేశాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నారు. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు వంట పోటీలు నిర్వహిస్తారు. ఉత్తమ హాజరు ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి చేయనున్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతపై.. 15వ తేదీన గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ‘గ్రంథాలయాలు–జ్ఞాన హదయం’ అనే నినాదంతో పుస్తక ప్రదర్శనలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా డిజిటల్ కేటలాగ్ ప్రారంభం, ఉత్తమ పాఠకులకు గుర్తింపు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రాథమిక 769 ప్రాథమికోన్నత 132 ఉన్నత 255 మొత్తం విద్యార్థులు సుమారు లక్షా 50వేలు నేటి నుంచి విద్యా వారోత్సవాలుజిల్లాలో పాఠశాలలు 17వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణ విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి విద్యార్థుల ప్రతిభావికాసం, పాఠశాలల అభివృద్ధే లక్ష్యం -
అలుపెరగని ప్రేమ అమ్మ
‘ఉదయం 5 గంటలకు లేచి వంట, ఇంటిపని ముగించుకొని స్కూల్కు వెళ్తాను. సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ పిల్లల హోంవర్క్, వంట. అలసట ఉన్నా పిల్లల నవ్వు చూస్తే అదంతా మాయమవుతుంది’ అంటున్నారు ఆర్మూర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న లక్ష్మి. ఇది ఒక్క లక్ష్మి కథే కాదు.. లక్షలాది మంది తల్లుల త్యాగానికి ప్రతిరూపం. ఆర్మూర్/మోర్తాడ్: అలుపెరగని ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ. తన కడుపు మాడ్చుకొని బిడ్డల కడుపు నింపే త్యాగమూర్తి ఆమె. నడక నేర్పి, నాగరికత నేర్పి, జీవితాన్ని నడిపించే దారి దీపం. ఆధునిక యుగంలో ఉద్యోగం, వ్యాపారం అంటూ తల్లి కూడా బయటికి వచ్చింది. ఇంటిని చక్కదిద్దుతూనే, ఆఫీసులో రాణిస్తూ, పిల్లల భవితకు బంగారు బాటలు వేస్తోంది. తెల్లవారి లేచింది మొదలు అర్ధరాత్రి వరకు కుటుంబం కోసం యంత్రంలా పనిచేసే అమ్మ విశ్రాంతి అనే పదాన్ని మరిచింది! కష్టాలను ఓర్చుకుంటూ కన్నీళ్లను దిగమింగుకుంటూ తల్లిగా తన పిల్లలను లాలిస్తుంది. ఉద్యోగ, వ్యాపార బాధ్యతలలో తలమునకలైనా తన పిల్లలకు ఎలాంటి లోటు రానీయకుండా కాపాడుకుంటుంది. అమ్మ రుణం తీర్చుకోవడానికి ఒక్క రోజు సరిపోదు. ప్రతి రోజూ మదర్స్ డేనే. ఆమెను ప్రేమగా చూసుకోవడం, ఆమె మాట వినడం, వృద్ధాప్యంలో తోడు గా నిలవడమే మనం ఆమెకు ఇచ్చే నిజమైన బ హుమతి. అమ్మ చూపే అనురాగాన్ని, ఆమె త్యా గాన్ని స్మరించుకుంటూ నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ‘మదర్స్ డే’ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. -
కాగితాల్లోనే ‘ఎకో టూరిజం’!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఎకో టూరిజం పనులు గమ్యం చేరని చందంగా తయారయ్యాయి. ముఖ్యంగా డొంకేశ్వర్ మండలం గాదేపల్లి (చిన్నయానం) వద్ద ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటక కేంద్రం ఏర్పాటుకు అన్ని అడ్డంకులు తొలగినా, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ప్రాజెక్టును ప్రకటించి మూడేళ్లవుతున్నా ఇంకా కాగితాల్లోనే ఉంది. డిజైన్ల ఆమోదంలో అధికారుల వద్ద జరుగుతున్న జాప్యం కారణంగా పర్యాటక ప్రేమికులను నిరాశకు గురి చేస్తోంది. 2023 జూలైలో ప్రభుత్వం టూరిజం ప్రకటన చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర అటవీ ఉన్నతాధికారులు ఎన్నోసార్లు వచ్చి స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. చివరి సారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పీసీసీఎఫ్ సువర్ణ, ఎఫ్డీసీ డైరెక్టర్ రంజిత్నాయక్లు వచ్చి సైట్ విజిట్ చేశారు. మార్చి లేదా ఏప్రిల్లో పనులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతాయని వెల్లడించారు. అయితే మే నెల కూడా పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ ఈ ప్రాజెక్టు వర్క్ పేపర్ స్థాయిలోనే ఉండిపోయింది. కేవలం డిజైన్ అప్రూవల్స్ కోసమే నెలల తరబడి సమయం వృథా కావడంతో ఈ ఏడాది కూడా పనులు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త డీఎఫ్వోపైనే ఆశలు! జిల్లా అటవీ శాఖ అధికారిగా ఇటీవల సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈయన 2018 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన అధికారి కాగా, మొన్నటి వరకు ఖమ్మం జిల్లా డీఎఫ్వోగా పని చేశారు. ఈయన పర్యాటకం, అడవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారని అటవీ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. గాదేపల్లి ఎకో టూరిజం పనులపై దృష్టి పెట్టి గట్టెక్కిస్తారనే ఆశాభావం వ్యక్తం అవుతోంది.అన్ని అడ్డంకులు తొలగినా..ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వద్ద అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉంది. వేసవిలో పచ్చని నేలలు బయటకు తేలడంతో విదేశీ పక్షులు, కృష్ణ జింకలు సందడి చేస్తాయి. ఇక్కడ బోటింగ్, కాటేజీలు, వ్యూ పాయింట్లు ఏర్పాటు చేస్తే జిల్లాకు మంచి గుర్తింపు వస్తుంది. దీనికి సంబంధించి 18 ఎకరాల స్థలం సేకరణ పూర్తి కావడం, సఫారీ వాహనాలు కొనుగోలు చేయడం, నిధుల పరంగా లైన్ క్లియర్ అవ్వడంతో పనులు వేగవంతం అవుతాయని అంతా భావించారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం, డిజైన్ల ఖరారులో జరుగుతున్న ఆలస్యం ప్రాజెక్టును నీరుగారుస్తోంది. అలాగే టూరిస్టు గైడ్లుగా స్థానిక గాదేపల్లి, చిన్నయానం, జీజీ నడ్కుడ గ్రామాలకు చెందిన యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఎలాంటి కదలిక లేదు. డిజైన్ల ఆమోదంలో తీవ్ర జాప్యం ఈ ఏడాది ఏప్రిల్లోనే మొదలు కావాల్సిన పనులు ఇప్పటి వరకు కదలిక లేని వైనం అధికారుల్లో కరువైన ఉత్సాహం -
ఆందోళనకు సిద్ధం
● 24గంటల్లో ధాన్యం సేకరణ సమస్యలను పరిష్కరించండి ● అధికారులను హెచ్చరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి మోర్తాడ్: రైతుల సమస్యలను 24 గంటల్లో పరిష్కరించకపోతే తాను ఆందోళనకు సిద్ధమవుతానని, రోడ్డెక్కుతానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. తరుగు పేరుతో రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆ రోపించారు. బాల్కొండ మండలం కిసాన్నగర్, మోర్తాడ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయ న శనివారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. అక్కడి నుంచి జిల్లా అడిషనల్ కలెక్టర్, పౌర సరఫ రాల శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడారు. అరగంట నుంచి ప్రయత్నిస్తున్నా కలెక్టర్ తన కాల్స్కు స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ధా న్యం సేకరణలో లోపాలు చోటు చేసుకుంటున్నా యని ఆరోపించారు. తరుగు పేరుతో సతాయించే మిల్లుల జాబితాను సిద్ధం చేసి వాటిని సీజ్ చేస్తే రైస్మిల్లర్లు ఎందుకు ధాన్యాన్ని అన్లోడింగ్ చేసుకోరని ఆయన ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూశామన్నారు. క్వింటాల్కు 10 కిలోల తరుగు తీస్తామని చెబుతున్న మిల్లర్ల భరతం పట్టాలని అధికారులకు సూచించారు. -
నిజామాబాద్
వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా వివిధ నైపుణ్యాలను పెంపొందించే దిశగా జిల్లాలోని బాలభవన్ వేసవి ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తోంది. చిన్నారుల్లో సృజనకు పదును పెట్టేందుకు అద్భుత వేదికగా మారుతోంది. చిత్రలేఖనం, యోగా, కర్రసాము, భరతనాట్యం, లలిత సంగీతం, శ్లోకాలు, కథలు, మ్యాజిక్, స్కేటింగ్ తదితర వాటిల్లో చిన్నారులు సాధన చేస్తూ ప్రతిభకు పదును పెడుతున్నారు. వాతావరణం ఉదయం ఆహ్లాదకరమైన గాలులు వీస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి నిర్మలంగా ఉంటుంది. ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026కంటికి రెప్పలా..మోర్తాడ్(బాల్కొండ): ఒకరి సాయం అవసరమైన 88 ఏళ్ల వయస్సులో సాయమ్మ తన ఇద్దరు పిల్లలకు తానే సాయమవుతోంది. పేదరికం వెక్కిరిస్తున్నా.. మధ్య వయస్సుకు చేరిన పిల్లలు చంటి పిల్లల్లా తనపైనే ఆధారపడినా ఆ తల్లి ఎక్కడా ధైర్యాన్ని కోల్పోలేదు. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన కమటం సాయమ్మ, రాములు దంపతులకు ఇద్దరు సంతానం రూప, భరత్. మానసిక ఎదుగుదల లేకపోవడంతో ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. సాయమ్మ వయస్సు ప్రస్తుతం 88 ఏళ్లు. భర్త 34 ఏళ్ల కిందటే మరణించాడు. భర్తను కోల్పోయిన సాయమ్మ పేదరికాన్ని ఎదిరిస్తూనే తన పిల్లలను సాకుతోంది. ప్రస్తుతం కూతురు రూపకు 56 ఏళ్లు, కొడుకు భరత్కు 54 ఏళ్లు. విధి ఆడిన వింత నాటకంలో పావుగా మారిన సాయమ్మ ఏ రోజూ తనకు జరిగిన నష్టం, అన్యాయంపై బాధపడలేదు. ఉపాధి కోసం బీడీలు చుడుతున్న సాయమ్మ వేకువ జామున లేచి కూతురు, కొడుకులను తయారు చేయడం, వారికి వంట చేసి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా తన రెక్కల కష్టాన్ని నమ్ముకున్న సాయమ్మ రోజుకు వెయ్యి బీడీల వరకు చుడుతుంది. సాయమ్మ జీవితాన్ని దగ్గర నుంచి చూసిన వారేవరైనా ఆమెకు రోజు శిరస్సు వంచి నమస్కరించాల్సిందే! ముప్పై ఏళ్లుగా.. కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన సూరం సంతోష, వెంకటేశ్లది రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబం. వారికి 33 ఏళ్ల కూతురు అశ్విని, 31 ఏళ్ల కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. ఇద్దరూ మాట్లాడలేరు.. నడవలేరు. కనీసం నిలబడలేరు. 2010లో భర్త వెంకటేశ్ చనిపోవడంతో పిల్లల పూర్తి బాధ్యత సంతోషపైనే పడింది. పిల్లలే లోకంగా బతుకుతున్న సంతోష.. వారికి సేవలు చేస్తూ, ఇంట్లోనే బట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. రోజూ పొద్దున్నే పిల్లలు బ్రష్, స్నానం చేయించి, ఏదైనా తినిపించి కూర్చోబెట్టాల్సిందే. కాలకృత్యాలకు తీసుకెళ్లి శుభ్రం చేయాలి. పిల్లలను వదిలి ఎటూ వెళ్లలేని పరిస్థితి. పిల్లలను కూర్చోబెట్టి బయట డోర్ లాక్ చేసి మార్కెట్కు వెళ్లొస్తుంటానని చెబుతోంది. పిల్లలకు సేవ చేస్తూ, వారిని చూసుకుంటూ బతుకుతున్నానని తెలిపింది. కూతురికి అన్నీ తానై.. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామాని కి చెందిన బోరంచ లక్ష్మి, దుర్గయ్య దంపతుల కు కూతురు రేణుక ఉంది. ఆమెకు పుట్టుకతోనే మతిస్థిమితం లేదు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబమైనా.. కన్న కూతురును 19 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటోంది అమ్మ. కూలినాలి చేసుకుంటూ బిడ్డకు అన్ని సపర్యలు చేస్తూ కాపాడుకుంటోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిఇప్పటికీ పసి పాపే.. కామారెడ్డి పట్టణంలోని అశోక్నగర్లో నివసించే బూక్య రజిత, రాజునాయక్లకు కూతురు, కొడుకు ఉన్నారు. బిడ్డ బూక్య లక్కీకి పుట్టుకతోనే ఆరోగ్య సమస్య ఉంది. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. కదిలే స్థితిలోలేని బిడ్డను కంటిపాపలా చూసుకుంటున్నారు. రజితకు భర్త రాజునాయక్ ఆసరా అవుతారు. 16 ఏళ్లుగా సేవలు చేస్తున్నా ఏనాడూ భారంగా అనిపించలేదని చెబుతోంది రజిత. లక్కీని అందరూ ఎంతో ప్రేమగా చూస్తారని తెలిపింది. బిడ్డను చూసుకుంటూనే రజిత లా చదువుతోంది. – 8లో.. -
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి
● సమష్టిగా విద్యా వారోత్సవాలను నిర్వహించాలి ● జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధా న్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ధాన్యం కొనుగో లు, ఫార్మర్ రిజిస్ట్రీ, జనాభా గణన, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్షించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ అన్ని జిల్లాలలో వంద శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ కు ఒక్క రోజే మిగిలి ఉండడంతో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో పది లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వీరంతా స్వీ య గణన చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11 నుంచి నిర్వహించే విద్యా వా రోత్సవాలను విజయవంతం చేయాలని సీఎస్ దిశా నిర్దేశం చేశారు. వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు కీలక సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటే వెంటనే తూ కం జరిపించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం లోడింగ్ అన్లోడింగ్ లో జాప్యం జరగకుండా సరిపడా సంఖ్యలో హమాలీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వారికి భోజన సౌకర్యం కల్పించాలని కలెక్టర్ సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ పరిస్థితుల గురించి రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. జనాభా గణన ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న స్వీయ నమోదును అన్ని వర్గాల వారు స్వీయ గణన చేసుకునేలా కషి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ, ఆశా వర్కర్లను కూడా భాగస్వాములు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న విద్యా వారోత్సవాలను షె డ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, వి ద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై ఆసక్తిని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ జిల్లాలో వంద శాతం పూర్తయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ప్రవీణ్, డీఆర్డీవో సాయన్న, డీఏవో వీరస్వామి, డీఈవో అశోక్, డీసీవో శ్రీనివాస్, ఏఎస్వో అరవింద్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పసుపు విత్తనోత్పత్తికి ప్రోత్సాహమేదీ..!
● ప్రత్యామ్నాయ మార్గం లేక రైతులపైనే సేకరణ భారం ● పండించిన పంటలో కొంత విత్తనానికి దాచుకుంటున్న రైతులు మోర్తాడ్(బాల్కొండ): వాణిజ్య పంటల సాగులో ముందంజలో ఉన్న ఈ ప్రాంత రైతులకు పసుపు విత్తనం కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆహార ధాన్యాలు, పసుపు మినహా ఇతర వాణిజ్య పంటల సాగుకు అవసరమైన విత్తనాలు మార్కెట్లో లభిస్తున్నా పసుపు విత్తనం మాత్రం రైతులే సొంతంగా సమకూర్చుకోవాల్సి వస్తోంది. తాము పండించిన పంటలోనే కొంత భాగాన్ని విత్తనంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా ఆదాయం తగ్గిపోయి పసుపు విత్తనం ధర భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరానికి నాలుగు క్వింటాళ్ల పసుపు విత్తనం వినియోగించాల్సి వస్తుంది. మార్కెట్లో ఉన్న ధర ప్రకారం పసుపు విత్తనం ఒక ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. జాతీయ పసుపు బోర్డు మన జిల్లాలోనే ఏర్పాటు కాగా పసుపు పరిశోధన కేంద్రం సైతం కమ్మర్పల్లిలో కొనసాగుతోంది. ఈ రెండు సంస్థలు ఉన్నా పసుపు విత్తనోత్పత్తికి మార్గం చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పసుపు పరిశోధన కేంద్రంలో విత్తనం పసుపు కోసం సాగు చేస్తున్నా ఏటా తక్కువ మొత్తంలోనే రైతులకు విత్తనం అందిస్తున్నారు. వచ్చే వర్షాకాలం సీజనుకు ఈసారి కేవలం 35 క్వింటాళ్ల పసుపు విత్తనం పంపిణీ చేశారు. ఒక క్వింటాలు విత్తనానికి ధరను రూ.3 వేలుగా నిర్ణయించారు. ఇక్కడ పంపిణీ చేసిన పసుపు విత్తనం కేవలం 8 నుంచి 9 ఎకరాలకు మాత్రమే సరిపోతుంది. అంటే పసుపు విత్తనోత్పత్తి నామమాత్రంగానే సాగవుతోందని స్పష్టమైతుంది. పసుపు బోర్డు ఏర్పడి ఏడాది కావస్తున్నా విధివిధానాలు ఖరారు కాకపోవడంతో రైతులకు ప్రోత్సాహం అందడం లేదనే వాదన వినిపిస్తోంది. పసుపు విత్తనం తక్కువ ధరకు మార్కెట్లో లభించే ఏర్పాట్లు చేస్తే రైతులకు భారం తప్పడంతో పాటు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని పలువురు వెల్లడిస్తున్నారు. వచ్చే వర్షాకాలం సీజనులో పసుపు సాగు చేయడానికి సన్నద్ధం అవుతున్న రైతులు పసుపు విత్తనాన్ని శుద్ధి చేసుకునే పనిలో ఉన్నారు. మునుముందు సీజనుల కోసమైనా పసుపు విత్తనోత్పత్తిపై దృష్టిసారించాలని పలువురు సూచిస్తున్నారు. -
ఇక టీజీఎస్ఈబీ ?
ఖలీల్వాడి: పదో తరగతి విద్య తరువాత చాలా మంది బాలికలతోపాటు బాలురు ఇంటర్ విద్యకు వెళ్లడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు బీడీ లు చుట్టడం, టైలరింగ్ వంటి పనుల వైపు వెళ్తుండగా, వ్యవసాయ నేపథ్యం ఉన్న బాలురు అటువైపు వెళ్తుండగా.. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనివారు ఇదో ఒక పనికి వెళ్తూ పైచదువులకు దూరవుతున్నారు. అలాగే ఇంటర్ కళాశాలలు దూర ప్రాంతాల్లో ఉండడంతో వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్య తర్వాత విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు పాఠశాల విద్య(8 నుంచి 10వ తరగతి), ఇంటర్మీడియెట్ను విలీనం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలు ఉండవనే చర్చ విద్యాశాఖలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ రెండు ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ప్రకారం 10+2 విద్యను బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వచ్చేవి. ఇంటర్మీడియట్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల కోర్సులు ఇంటర్మీడియెట్ బోర్డు పరిధిలో ఉండేవి. పరీక్షల విధానంలో మార్పులు 8 నుంచి 10వ తరగతి, ఇంటర్ విలీనమైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలు ఉండే అవకాశాలు లేవు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు స్కూల్ బోర్డు పరిధిలో, అలాగే 8 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులు నూతన బోర్డు పరిధిలో వార్షిక పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. వాయిదా పడిన ఇంటర్ అడ్మిషన్లు ఇంటర్ అడ్మిషన్లకు నాలుగు రోజుల క్రితం నోటి ఫికేషన్ రాగా.. మరుసటి రోజే ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు. విద్యార్థులు జూనియర్ కళాశాలల్లో చేరేందుకు వెళ్తే ఎంపిక చేసిన పాఠశాల్లో ప్లస్ టు అమలు చేయడం కష్టంగా మారుతుందనే అడ్మిషన్లను వాయిదా వేసినట్లు ఓ అధికారి ఒకరు తెలిపారు. నూతన బోర్డు.. ఇంటర్మీడియెట్ను పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డులు కాకుండా తెలంగా ణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (టీజీఎస్ఈబీ) ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. విలీ న ప్రతిపాదనల నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపించారు. జిల్లాలో పాఠశాలలు, కళాశాలలుప్రతిపాదనలు పంపాం జిల్లాలోని జూనియర్ కాలేజీల వివరాలను ఇంటర్మీ డియెట్ బోర్డుకు అందించాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు విలీనం అవుతుంది. మాకు ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. – రవికుమార్, డీఐఈవో, నిజామాబాద్ పాఠశాల విద్యాశాఖలో ఇంటర్బోర్డు విలీనానికి రంగం సిద్ధం రెండు శాఖల నుంచి ప్రతిపాదనలు వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలులోకి! -
మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యత
● పింఛన్ అందించేందుకు కృషి ● మత్స్య ప్రగతి, ప్రణాళిక సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి డొంకేశ్వర్(ఆర్మూర్): గంగపుత్రుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి అన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాకేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి మత్స్య ప్రగతి, ప్రణాళిక సమావేశం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కాంగ్రెస్ పార్టీ ఫిషరీష్ జిల్లా అధ్యక్షుడు బోర్గాం శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. మత్స్యకారులకు అనువుగా జిల్లాలో పుష్కలంగా జల వనరులు, చెరువులు ఉన్నాయని ఇక్కడి నుండే చేప పిల్లల పెంపకం చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానన్నారు. మత్స్యకారులకే కాకుండా ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కింద రూ.5 లక్షలు ప్రమాదవశాత్తు చనిపోతే ఇస్తున్నామని, అందుకు సంబంధించి ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్లోనే నిధులు కూడా కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. మత్స్యకారులకు పింఛన్ అందించేలా ప్రభుత్వాన్ని కోరతానన్నారు. అర్సపల్లిలో మత్స్యకారుల కోసం కేటాయించిన భూమి గతంలో కబ్జాకు గురైందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని కాపాడామని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. అర్సపల్లిలో మత్స్య శాఖ స్థలం కబ్జాకు గురి కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయించి, సీసీ కెమెరాలు పెట్టిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన మత్స్య కార్మిక సంఘాల సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. మత్స్య శాఖ ఏడీ ఆంజనేయస్వామి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయారెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి, నాయకులు ఉమ్మాజీ నరేశ్, కిరణ్, అగ్గు భోజన్న తదితరులు పాల్గొన్నారు. -
నవోదయ క్యాంపస్ పనుల పురోగతిపై సమీక్ష
నిజామాబాద్అర్బన్: జక్రాన్పల్లి మండలం కలిగోట్లో ఏర్పాటు చేయనున్న జవహార్ నవోదయ విద్యాలయ కొత్త క్యాంపస్ భవన నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఇలా త్రి పాఠి శుక్రవారం సమీక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఇ ప్పటివరకు చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో వేగంగా చేపట్టాలని, విద్యార్థులకు అ న్ని వసతులు అందుబాటులో ఉండేలా చూ డాలని అధికారులను ఆదేశించారు. సమా వేశంలో జవహార్ నవోదయ ఇన్చారి్జ్ ప్రి న్సిపాల్ పి జోజిబాబు, డీఈవో అశోక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఐటీ చట్టం– 2025పై అవగాహన నిజామాబాద్అర్బన్: ఆదాయపు పన్ను చట్టం – 2025పై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాఖ సీనియర్ అధికారులు సురేశ్, శుభంసింగ్, ఐశ్వర్య తదితరులు హాజరై వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. సరళీకృత ఆదాయపు పన్ను చట్టం–2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభ్ –2026 పేరుతో ఇక్కడ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఐటీఐ, ఏటీసీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఖలీల్వాడి: తెలంగాణ ప్రభుత్వ ఉపాధి కల్పన, శిక్షణ పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో (ఐటీఐ), అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లలో ఉచిత అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ (బాలుర) ప్రిన్సిపాల్ జి.యాదగిరి, బాలికల కళాశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్రెడ్డి శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. 2026 సంవత్సరానికి ఈనెల 14 నుంచి జూన్ 8వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఐదు ప్రభుత్వ ఐటీఐలు, ఐదు ఏటీసీలు, మూడు ప్రైవేట్ ఐటీఐలలో విద్యార్థులు అ డ్మిషన్లు పొందవచ్చని కన్వీనర్ యాదగిరి తెలిపారు. నోటిఫికేషన్, కోర్సులు, విద్యార్హతల వివరాల కోసం website: https://iti. telangana.gov.in చూడాలని సూచించారు. దరఖాస్తు చేసే సమయంలో ఉపయోగించిన మొబైల్ (సెల్) నంబర్, ఈ మెయిల్లను ఐటీఐ కోర్సు పూర్తి అయ్యేవరకు మార్చొద్దని సూచించారు. మరిన్ని వివరాలకు 85004 67091, 85006 09532 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. అలాగే బాలికల ఐటీఐలో అడ్మిషన్ల వివరాల కోసం 89192 62418, 94417 07536, 99630 91233 నంబర్లను సంప్రదించాలని విద్యాసాగర్రెడ్డి సూచించారు. -
మీ సేవలో మాయ
నిజామాబాద్అర్బన్: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాల్సిన ‘మీ సేవ’ సెంటర్లు అవినీతి అక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. డబ్బులకు అలవాటు పడి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను పూర్తిగా అవినీతి మయం చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొన్ని సెంటర్లలో వెలుగు చూసిన ఘటనలో అధికారులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఏసీబీ అధికారులు సైతం ఇటీవల జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో ఉన్న మీ సేవ కేంద్రంపై దాడి చేసి తనిఖీలు చేయగా అనేక అక్రమాలకు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. సెంటర్లను పర్యవేక్షించాల్సిన అధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో ఉన్నారనే విమర్శలున్నాయి. అధికారులకు, మీ సేవ సెంటర్ల మధ్య మీ సేవ సెంటర్ల సంఘం నాయకుడు ఒకరు మధ్యవర్తిత్వం వహిస్తూ డబ్బులు చేతులు మారుస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లాలో వెలుగు చూసిన ఘటనలు కొన్ని.. ● జిల్లా కేంద్రంలోని ఆరోటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ ప్రాంతంలోని మీసేవ సెంటర్ నిర్వాహకులు మైనర్ అమ్మాయిని మేజర్గా చూపుతూ ఆధార్ కార్డులో మార్పులు చేయగా కేసు నమోదైంది. తప్పుడు సర్టిఫికెట్ను చూపి సదరు అమ్మాయిని ఓ ఖాజీకి ఇచ్చి వివాహం చేసినట్లు తెలిసింది. ఇదే మీ సేవ కేంద్రంలో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, భూముల వ్యవహారాలకు సంబంధించి సర్టిఫికెట్ల జారీలో రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం కాకుండా రెండింతల డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ● నిజామాబాద్ రూరల్ మండలంలోని పాల్దా గ్రామంలో ఓ మీసేవ సెంటర్ నిర్వాకుడు బీహార్ రాష్ట్రానికి చెందిన కొందరి ఆధార్ కార్డుల్లో మార్పులు చేస్తూ స్థానికంగా ఉంటున్నట్లు తప్పుడు అడ్రస్ను సృష్టించాడు. ఒకరు ఆర్మీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయగా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో వ్యవహారం వెలుగలోకి రాగా, ప్రస్తుతం విచారణ సాగుతోంది. ● నిజామాబాద్ నగరంలోని రైల్వే గేట్ సమీపంలోని మీ సెంటర్ నిర్వాకుడు మున్సిపల్ అధికారులకు దగ్గరగా ఉంటూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. కులం, ఆదాయ, జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయించడంలో ఇతగాడు ఆరితేరాడు. ఎటువంటి లోపాలున్నా సరిచేస్తామంటూ వేలా రూపాయలు వసూలు చేస్తున్నాడు. దరఖాస్తుదారులు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే లలితా మహాల్ థియేటర్ సమీపంలోని మీ సేవ సెంటర్కు వెళ్లాలని సూచిస్తుండడం గమనార్హం. ● శివాజీనగర్లోని ఓ మీ సేవ సెంటర్పై ఏసీబీ అధికారులు దాడులు చేసి సర్టిఫికెట్ల జారీకి డబ్బులు వసూలు చేయడంతోపాటు అధికారులకూ పంపుతున్నట్లు గుర్తించారు. ఈ సెంటర్లో అనేక అక్రమాలు ఉన్నట్లు తెలిసింది.డబ్బుందా..? సర్టిఫికెట్ ఏదైనా ఇట్టే తెచ్చేస్తామంటున్నారు కొన్ని మీసేవ కేంద్రాల నిర్వాహకులు. దరఖాస్తుదారుల అవసరం, అమాయకత్వమే ఆసరగా దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఆన్లైన్లోనే ఒక్క ‘క్లిక్’తో పూడ్చిపెడుతున్నారు. అవినీతి నిరోధకశాఖ మీ సేవ కేంద్రాలపై నిఘా సారించి తనిఖీలు నిర్వహించిన ఘటనలే ‘మీ సేవలో మాయ’ ఏ స్థాయిలో ఉందో చెబుతున్నాయి. సర్టిఫికెట్ ఏదైనా డబ్బులు ఇస్తే చాలు.. అధికారులతో సెంటర్ల నిర్వాహకుల కుమ్మక్కు ఏసీబీ నిఘా సారించినా కనిపించని మార్పు ఇప్పటికే పలు సెంటర్లపై చర్యలు -
నగరంలో లీకేజీ తిప్పలు
నిజామాబాద్వేర్వేరు చోట్ల చోరీలు ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి, దోమకొండ, నిజామాబాద్లో దుండగులు చోరీలకు పాల్పడి నగదు, వెండి ఎత్తుకెళ్లారు.శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026– 8లో uసుభాష్నగర్: నిజామాబాద్ నగరంలో వేసవి నీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. అయి నప్పటికీ పలు ప్రాంతాల ప్రజలకు తిప్పలు తప్ప డం లేదు. నగరం వేగంగా విస్తరిస్తున్నా నల్లా కనెక్ష న్ల సంఖ్య మాత్రం అంతంగానే ఉంది. శివా రు కాలనీల్లో ప్రజలు బోర్లు తవ్వించి ము న్సిపాలిటీ నల్లాలపై ఆధారపడటం లేదు. అ యితే ఉన్న కనెక్షన్లకూ పలు ప్రాంతాల కు నీటి సరఫరాలో ఇబ్బందు లు తప్ప డం లేదు. రోజూ ఏదో ఒక ప్రాంతంలో పైన్లైన్లకు లీకేజీలు ఏర్పడు తూనే ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల కు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ ఎడపల్లి మండలం అలీసాగర్, మంచిప్ప ఫిల్టర్బెడ్ ద్వారా సుమారు 80 ఎంఎల్డీ (80 లక్షల లీటర్లు) నీరు సరఫరా అవుతోంది. పెద్దబజార్, తిలక్గార్డెన్, నామ్దేవ్వాడ, గంగస్థాన్, వినాయక్నగర్, కంఠేశ్వర్, సుభాష్నగర్, గోల్ హను మాన్, రేడియోస్టేషన్, 33 క్వార్టర్స్, కోటగల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద నీటి ట్యాంకులు ఉన్నాయి. లీకేజీ ఏరియాలు.. ముఖ్యంగా గాయత్రినగర్, హైమద్పురా కాలనీ, ఎల్లమ్మగుట్ట, పెద్దబజార్, గోల్హనుమాన్, గాజుల్పేట్, అర్సపల్లి తదితర ప్రాంతాల్లో తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. మున్సిపల్ అధికారు లు పైప్లైన్ లీకేజీలకు మరమ్మతులు చేయిస్తూనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరాచేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో తాత్కాలికంగా నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలకు సైతం ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ నగరంలో నీటి ఎద్దడి నివారణకు వేసవిలో ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రూపొందించాం. లీకేజీలు ఏర్పడకుండా, నీరు వృథా పోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాం. లీకేజీలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తున్నాం. లీకేజీలు ఏర్పడిన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. – దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్, నిజామాబాద్ వేసవి యాక్షన్ ప్లాన్ ఉన్నా.. తప్పని పాట్లు లీకేజీలు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సప్లయ్ నిజామాబాద్ నగరంలో ప్రతిరోజూ 80లక్షల లీటర్లు సరఫరా -
ఇంటర్ సప్లిమెంటరీకి పకడ్బందీ ఏర్పాట్లు
● 17,789 మంది విద్యార్థులు.. 39 సెంటర్లు ● ప్రైవేట్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి ● కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్అర్బన్: ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో మొత్తం 17,789 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. ఫస్టియర్ విద్యార్థులు 11,425, సెకండియర్ విద్యార్థులు 6364 మంది ఉన్నారన్నారు. మొత్తం 39 సెంటర్లను ఏర్పాటు చేశామని, ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యా హ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ము ఖ్యంగా ప్రైవేట్ సెంటర్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎక్కడ కూడా కాపీయింగ్కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ, పోస్టల్, మెడికల్ అండ్ హెల్త్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. విద్యార్థులు ఆందోనళకు గురి కాకుండా ప్ర శాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ అధికా రి రవికుమార్, నిజామాబాద్ ఏసీపీ బి ప్రకాశ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రేపు సీఎస్, డీవోల సమావేశంఖలీల్వాడి: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఖిల్లా బా లుర జూనియర్ కళాశాలలో ఆదివారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు డీఐఈవో రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, 39 సెంటర్ల సీఎస్లు, డీవోలు హాజరుకావాలని సూచించారు. అలా గే అన్ని పోలీస్ స్టేషన్ల కస్టోడియన్లు సైతం సమావేశానికి హాజరు కావాలని కోరారు. -
వేర్వేరు చోట్ల చోరీలు
మద్యం దుకాణంలో రూ.లక్ష కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్లో ఉన్న ఓ లిక్కర్ మార్ట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. నిర్వాహకులు గురువారం రాత్రి దుకాణం మూసేసి ఇళ్లకు వెళ్లగా, అర్ధరాత్రి తర్వాత అద్దాలు, కిటికీలు పగులగొట్టి దుకాణంలోకి చొరబడిన ఇద్దరు దుండగులు చోరీ చేశారు. కౌంటర్లో దాచి ఉంచిన నగదు ఎత్తుకెళ్లినుట్ల సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రూ.లక్ష చోరీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు. క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. పట్ణణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాళం వేసిన ఇంట్లో.. దోమకొండ: దోమకొండ గ్రామానికి చెందిన సామల నరేశ్ ఇంటికి తాళం వేసి కామారెడ్డిలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వృత్తి రీత్యా నరేశ్ రెండు నెలలుగా కామారెడ్డిలో ఉంటున్నారు. శుక్రవారం పని నిమిత్తం దోమకొండకు రాగా ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువాలోని రూ. 7,000 అపహరణకు గురైనట్లు బాధితుడు పేర్కొన్నారు. సుభాష్నగర్ అపార్ట్మెంట్లో.. నిజామాబాద్అర్బన్: నగరంలోని సుభాష్నగర్ అపార్ట్మెంట్లో చోరీ జరిగినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్ వేణుగోపాలరావు సుభాష్నగర్లోని అక్షయ రెసిడెన్సీలో నివాసముంటున్నారు. ఆయన ఊరికి వెళ్లగా గురువారం రాత్రి దొంగలు చొరబడి కిలో వెండి ఆభరణాలు దొంగిలించినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఘటనా స్థలాన్ని ఏసీపీ ప్రకాశ్ పరిశీలించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు చేతివాటం ప్రదర్శించారు. కామారెడ్డి, దోమకొండ, నిజామాబాద్లోని సుభాష్నగర్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. -
హామీల అమలుపై ఎప్పుడైనా చర్చకు సిద్ధం
● రాష్ట్ర కో ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి వేల్పూర్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ఎప్పుడైనా, ఎలాంటి చర్చకై నా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వే ల్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యా లయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కాంగ్రెస్ హామీల అమలుపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు విసిరిన సవాళ్లను తాము స్వీకరిస్తున్నామని, చర్చించడానికి టైమ్ ఫిక్స్ చే యాలని సూచించారు. ప్రశాంత్రెడ్డి విసిరిన సవాళ్లకు బదులివ్వడానికి పీసీసీ అధ్యక్షుడి వరకు ఎందుకని, తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచి త కరెంటు, రైతులకు రూ.21 కోట్ల రుణమాఫీ, ఖరీఫ్లో గత రెండు సీజన్ల వారీగా బోనస్ ఇస్తున్న మా ట అవాస్తవమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు నిబ ద్ధత ఉంటే కేసీఆర్ ఇచ్చిన హామీలలో పదేళ్లలో డ బుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని, అప్పుడే రాజకీయ సన్యాసం తీసుకోవాలని పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హామీలు అమలు చేయకపోవడంతోనే ప్రజలు పక్కన పెట్టారని అన్నారు. సమావేశంలో వేల్పూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, నాయకులు పన్నాల రాజేశ్వర్, రాజేందర్, గౌరాయి నరేందర్, దామోదర్గౌడ్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభకు పదును.. భవితకు దన్ను
మోపాల్(నిజామాబాద్రూరల్): చిన్నారులను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలనే ఉద్ధేశంతోపా టు వారు ఆయా అంశాల్లో నైపుణ్యం సాధించేలా మహాత్మాజ్యోతీ బాపూలే బీసీ బాలుర గురుకుల సొసైటీ వేసవిలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. సొసైటీ కార్యదర్శి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలు కలిగిన పాఠశాలల్లో వేసవి శిబిరాలు నిర్వహించింది. నిజామాబాద్ జిల్లాలో ని మోపాల్ మండలం కంజర శివారులో ఉన్న మహాత్మాజ్యోతీ బాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్లోని 11, ఉమ్మడి ఆదిలాబాద్లోని 13 పాఠశాలల నుంచి సుమారు 400 మంది విద్యార్థులకు 15 రోజులపాటు వేసవికాల శిబిరాన్ని ఏర్పాటుచేసింది. శిక్షణా శిబిరం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని పాఠశాలలో ని ర్వహించగా, నిజామాబాద్ ఆర్సీవో సత్యనాథ్రె డ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేసవి సెల వుల్లో గ్రామాల్లో, ఇళ్లల్లో విద్యార్థులు చేయాల్సిన, చేయకూడని పనులను క్షుణ్ణంగా వివరించడంతోపాటు కీలక సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మురళీ, వైస్ ప్రిన్సిపాల్ సుదం, సిబ్బంది కత్తుల శంకర్, రాజేందర్, పీఈటీలు, పీడీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణనిచ్చిన అంశాలు విద్యార్థులకు 15 రోజులపాటు వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లిష్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, కంప్యూటర్, కరాటే, డ్యాన్స్, హ్యాండ్ రైటింగ్, పేపర్ కటింగ్స్తోపాటు టేబుల్ టెన్నిస్, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, వివిధ క్రీడల్లో తర్ఫీదు ఇచ్చారు. ఇందుకోసం సుమారు 25 మంది వరకు నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించారు. ముగింపు సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. వేసవి శిక్షణాశిబిరంలో అనేక విషయాలు నేర్చుకున్నాను. స్పోకెన్ ఇంగ్లి ష్, వేదిక్ మ్యాథ్స్, కంప్యూటర్ వంటి వాటిపై చాలా అవగాహన వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని అంశాలపై శిక్షణనిచ్చారు. క్రీడల్లోనూ పాల్గొనడంతో శారీరకంగా ఉల్లాసంగా అనిపించింది. – దత్తాద్రి, ఏడోతరగతి, బీర్కూర్, కామారెడ్డి వేదిక్ మ్యాథ్స్ ద్వారా చాలా విషయాలు తె లిశాయి. గణితమంటే భయపడకుండా సులభపద్ధతిలో వేదిక్ మ్యా థ్స్లో మెలకువలు నేర్చుకున్నాను. దీంతోపాటు డ్యాన్స్, సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాం. వివిధ జిల్లాల విద్యార్థులందరం ఒక దగ్గర శిక్షణ పొంది స్నేహితులుగా మా రడమే కాకుండా ఎన్నో అంశాలు నేర్చుకున్నాం. – సాయి భానుతేజ, ఏడోతరగతి, తాండూరు, ఆదిలాబాద్ విద్యార్థులకు చదువుతోపా టు క్రీడలు, ఇతర అన్నిరంగా ల్లో రాణించాలి. సెల్ఫోన్లు, టీవీలకు ఆకర్షితులై చదువు ను మర్చిపోతున్నారు. బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో యేటా వేసవిలో శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. శిబిరం విజయవంతంగా ముగిసేందుకు సహకరించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, పీఈటీలు, పీడీలకు ప్రత్యేక కృతజ్ఞతలు. – సత్యనాథ్రెడ్డి, ఆర్సీవో, ఉమ్మడి నిజామాబాద్ విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణ మోపాల్ బీసీ బాలుర గురుకులంలో ముగిసిన వేసవి శిబిరం పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులు -
రోడ్డు ప్రమాదంలో శిశువు మృతి
వర్ని: మోస్రా గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు నెలల శిశువు మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం రాత్రి మల్లారం గ్రామానికి చెందిన జర్పుల దశరథ్ భార్య నిరోషా, మూడు నెలల శిశువుతో నిజామాబాద్ నుంచి స్వగ్రామమైన మల్లారానికి కారులో వస్తోంది. మోస్రా శివారులో అడవి పందులు అడ్డం రావడంతో వాటిని తప్పించే ప్రయత్నంలో కారు పొలాల్లో దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ప్రమాదంలో మూడు నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందగా, నిరోష తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భర్తను చంపిన భార్య ● హత్యకు సహకరించిన కొడుకు నందిపేట్(ఆర్మూర్): కట్టుకున్న భర్తను కొడుకు సహాయంతో హత్య చేసిన ఘటన నందిపేట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ రూరల్ సీఐ జానారెడ్డి, నందిపేట ఎస్సై శ్యామ్రాజ్ శుక్ర వారం తెలిపారు. నందిపేట మండలం మాయాపూర్ గ్రామానికి చెందిన పుంటికూర ముత్యం(44) ఈ నెల 6న మృతి చెందాడు. మద్యం మత్తులో మంచంపై నుంచి కిందపడి చనిపోయాడని మృతుడి భార్య లలిత చెప్పడంతో కుటుంబసభ్యులకు అనుమానం కలిగింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని భార్య, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా తామే హత్య చేసినట్లు ఒప్పకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోపాటు ముత్యంకు ఉన్న వివా హేతర సంబంధం కారణంగా ఇంట్లో తరుచూ గొ డవలు జగుతుండేవని మృతుడి భార్య లలిత తెలిపింది.ఎంత చెప్పినా అతనిలో మార్పు రాకపోవడంతో ఈ నెల 5న రాత్రి మద్యం తాగి ఇంట్లో ని ద్రిస్తున్న సమయంలో ముత్యం మెడకు చీర అంచుతో బిగించగా కొడుకు కాళ్లు కదలకుండా పట్టుకొని సహకరించాడని, దీంతో తన భర్త మృతి చెందాడని పోలీసుల విచారణలో నేరం ఒప్పుకుంది. శుక్రవారం నిందితులు లలిత, ఆమె కుమారుడిని కోర్టులో హాజరుపరచినట్లు సీఐ జానారెడ్డి వెల్లడించారు. -
ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన
తెయూ(డిచ్పల్లి): దోస్త్ ద్వారా డిగ్రీ కళాశాలల మొదటి విడత ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించారు. ఎన్సీసీ, స్పోర్ట్స్ విభాగాలలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ధ్రువపత్రాలను తెయూ అకడమిక్ ఆడిట్ సెల్ కార్యాలయంలో అడ్మిషన్స్ డైరెక్టర్, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ నేతృత్వంలో సంబంధిత అధికారులు పరిశీలించారు. వర్సిటీ పరిధిలో ఎన్సీసీ కేటగిరీలో 20 మంది, స్పోర్ట్స్ కేటగిరీలో 14 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ రామస్వామి, తెయూ ఫిజికల్ డైరెక్టర్ బీఆర్ నేతతోపాటు సిబ్బంది నరేశ్, రవీందర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ టు నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్లలో ఢిల్లీ ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కొంతమంది పాత నేరస్తులతో కలిసి వరుస గొలుసు చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ ముఠాలో ముంబైకి చెందిన పలువురు యువకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైళ్ల ద్వారా జిల్లాకు వస్తున్న ముఠా సభ్యులు మొదట పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి బైక్ చోరీకి పాల్పడతారు. ఆ బైక్ల ద్వారానే గొలుసు చోరీలు చేస్తున్నారు. గతేడాది ఆగస్టు వరకు చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా నమోదు కాగా, పోలీసుల విస్తృత తనిఖీలతో తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర విపరీతంగా పెరగడంతో ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన దొంగలు చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మాటల్లో పెట్టి.. నగరంలోని గాయత్రీనగర్లో ఇటీవల ఉదయం 5 గంటలకు బైక్పై వచ్చిన దుండగులు మహిళ మెడలో నుంచి గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. మహిళ ప్రతిఘటించడం, సమీపంలో ఉన్న కుక్క దుండగులపై దాడికి యత్నించడంతో సగం చైన్ మాత్రమే లాక్కెళ్లారు. అనంతరం మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బ ఏరియాలో మరో మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. అయితే, ఈ ఘటనలకు పాల్పడింది ఢిల్లీకి చెందిన దొంగలుగా పోలీసులు భావిస్తున్నారు. ఇందులో ఇద్దరు ముంబైకి చెందిన యువకులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరు చోరీ చేసిన బైక్లపై వచ్చి చైన్ స్నాచింగ్లకు పాల్పడతారు. అనంతరం బైక్లను వదిలేసి రైళ్లలో ముంబై, ఢిల్లీకి పారిపోతున్నారు. వీరు నిజామాబాద్తోపాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గత డిసెంబర్ నెలలో కూడా మహారాష్ట్రకు చెందిన ముఠా వినాయకనగర్లోని ఓ మహిళను అడ్రస్ అడిగి రెండున్నర తులాల బంగారాన్ని లాక్కెళ్లరు. కసాబ్గల్లీలో మరో మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ చేశారు. ఆ తర్వాత నాలుగు రోజులకే సుభాష్నగర్లోని పూలు తెంపుతున్న వృద్ధురాలి మెడలోని రెండు తులాల బంగారు చైన్ లాక్కెళ్లారు. చైన్స్నాచింగ్ల వివరాలు సంవత్సరం చోరీలు ఛేదించినవి 2022 26 13 2023 40 18 2024 37 7 2025 17 13 2026 9 01మాక్లూర్: జిల్లా కేంద్రంలోని గూపన్పల్లికి చెందిన భోజమ్మ తన భర్తతో కలిసి శుక్రవారం బైక్పై తొర్లికొండలో జరిగిన శుభకార్యానికి వె ళ్లారు. సాయంత్రం 6 గంటల సమయంలో తిరి గి వస్తుండగా ఆలూర్ మండలం రాంచంద్రపల్లి కమాన్ వద్ద వెనకాలే బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు భోజమ్మ మెడలోని తులంన్నర పుస్తెలతాడును అపహరించారు. బాధితురాలి ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. నగరంలో వరుస చైన్ స్నాచింగ్లు ఢిల్లీ ముఠా పనిగా పోలీసుల అనుమానం పాత నేరస్తులతో కలిసి చోరీలు ప్రత్యేక బృందాలతో గాలింపు చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఢిల్లీ ముఠాగా అనుమానం ఉంది. హైదరాబాద్లోని మేడ్చల్, పేట్ బషీర్బాగ్ ప్రాంతాల్లోనూ వీరు చోరికి పాల్పడ్డారు. అక్కడి పోలీసులతో కలిసి విచారణ చేస్తున్నం. అతి త్వరలోనే పట్టుకుంటాం. మహిళలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – ప్రకాశ్, ఏసీపీ నిజామాబాద్ డివిజన్ -
రైతులతో కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ● వడ్ల కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం ● కమ్మర్పల్లి, భీమ్గల్లో కొనుగోలు కేంద్రాల పరిశీలన కమ్మర్పల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లోనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిందని, దీంతో రైతులు కన్నీరు పెడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కమ్మర్పల్లి మండలం బషీరాబాద్, భీమ్గల్ మండలం బడా భీమ్గల్, చేంగల్ గ్రామా ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. 125 లారీలకు సరిపడా ధాన్యం నిల్వ, కొనుగోళ్లు మాత్రం నత్తనడకన జరుగుతున్నాయన్నారు. వర్షాలు పడుతున్నప్పటికీ ప్రభుత్వం లారీలు, హమాలీలు, టార్పాలిన్ల వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మిల్లర్ల ‘తరుగు’ దోపిడీపై ఆగ్రహం ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తా తీ సుకోవాల్సి ఉండగా, రైస్మిల్లర్లు 43 నుంచి 44 కి లోల వరకు అడుగుతున్నారని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. క్వింటాల్కు సుమారు 10 కిలోల వరకు ‘తరుగు’ పేరుతో ధా న్యం దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నేరుగా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫోన్ ద్వారా వివరించారు. వెంటనే డీఎం, డీసీవో, డీఎస్వో అధికారులు, రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. క్షేత్రస్థాయి పరిస్థితులు వేరు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని, సీఎం వెంటనే ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ‘తమ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజూ కొనుగోళ్లపై సమీక్ష ఉండేది. ఇప్పుడు మాత్రం రైతులను పూర్తిగా గాలికొదిలేశారు’ అని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘తాలు తీస్తే తోలు తీస్తా’ అన్న సీఎం.. ఇప్పుడు రైతుల వద్ద నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నా మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు తన వంతు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రేగుంట దేవేందర్, నాయకులు బద్దం చిన్నారెడ్డి, బైకానీ మహేశ్, భూమేశ్వర్ తదితరులు ఉన్నారు. -
స్నేహితుడి వివాహానికి వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిఎల్లారెడ్డిరూరల్: స్నేహితుడి వివాహానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ గ్రామానికి చెందిన దండు నాగరాజు (25) హైదరాబాద్లో క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నస్రుల్లాబాద్లో స్నేహితుడి వివాహం ఉండడంతో గురువారం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరాడు. తిమ్మారెడ్డి గ్రామశివారులో ఎల్లారెడ్డి–బాన్సువాడ ప్రధాన రహదారిపై ఉన్న చెట్టును కారు బలంగా ఢీకొనడంతో ఘటన స్థలంలోనే నాగరాజు మృతి చెందాడు. మృతుడికి ఆరు నెలల క్రితం వివాహమైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి
నిజామాబాద్ అర్బన్: యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. టాస్క్ సౌజన్యంతో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్స్లో జాబ్మేళా నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జాబ్మేళాను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని అన్నారు. అందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. నిజామాబాద్లో మెగా జాబ్మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉద్యోగాలు సాధించిన యువత భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కాగా, జాబ్మేళాకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 71 కంపెనీల ద్వారా సుమారు 2000 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతకు ముందు ఉద్యోగాలకు ఎంపికై న వారికి కలెక్టర్, ఎమ్మెల్యే నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీవైఎస్వో పవన్ కుమార్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేశ్ కుమార్, ఎన్ఐసీ అధికారి మధు, ఈ–డీఎం కార్తిక్, వంశీధర్ రెడ్డి, టాస్క్ అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. యువతికి జాబ్ ఆఫర్ లెటర్ అందజేస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి జాబ్మేళాను ప్రారంభిస్తున్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి,తాహెర్ తదితరులు అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి పిలుపు మెగా జాబ్మేళాకు విశేష స్పందన -
అనాథలకు పెద్ద దిక్కు.. ఇందూరు యువత
● నగరంలో నిత్యాన్నదానం ● గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ ● మతిస్థిమితం లేనివారికి సపర్యలునిజామాబాద్ రూరల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములనే కొందరు పట్టించుకోవడం లేదు. అలాంటి సమాజంలో విధి వంచితులను అక్కున చేర్చుకుంటూ ఆకలిదప్పికలను తీరుస్తోందీ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి. గతం మరిచి, పెరిగిన జుట్టు, గడ్డం, మసిబరిన బట్టలతో మండుటెండల్లో రోడ్లపై నిస్సహాయ స్థితిలో ఉన్న అనామకులను చేరదీస్తోంది. సపర్యలు చేస్తూ మానవత్వానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. నలుగురితో మొదలై.. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థను 2011లో జిల్లాలోని ధర్మారం(బీ) గ్రామానికి చెందిన మద్దుకూరి సాయిబాబు ప్రారంభించారు. మొదటగా నలుగురితో ప్రారంభమైన సంస్థలో ప్రస్తుతం 100 మంది వరకు సేవలందిస్తున్నారు. జిల్లాలోని 10 మండలాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు జిల్లా కేంద్రంలో 100 మందికి అన్నదాన కార్యక్రమం చేపడుతోంది. మతిస్థితిమితం లేని వారిని అక్కున చేర్చుకొని శుభ్రపరిచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల సహకారంతో సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంది. ఇదే కాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి, వారి అస్తికలను కాశీలోని గంగలో కలుపుతున్నారు. శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేస్తున్నారు. మానవ సేవే.. మాధవ సేవా అనుకుంటూ ఇందూరు యువ త స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వ ర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. విధివంచితుల వివరాలు తెలిసిన వెంటనే స్పందిస్తాను. సమాజ సేవ కోసమే జీవితాన్ని అంకితం చేస్తూ పెళ్లి కూడా చేసుకోదలుచుకోనలేదు. – ఎం సాయిబాబు, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు -
పెళ్లి సంబంధాలు కుదరడం లేదని..
● ఉరేసుకొని యువతి ఆత్మహత్య మాక్లూర్: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో చోటు చేసుకుంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. కల్లెడికి చెందిన కునాల హన్మాండ్లుకు ఇద్దరు కుమార్తె, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, రెండో కుమార్తె శివాని(31) టీటీసీ పూర్తి చేసింది. గతంలో శివానీకి పెళ్లి సంబంధం కుదిరి ఏర్పాట్లు జరుగుతుండగానే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అప్పటి నుంచి శివానికి పెళ్లి సంబంధాలు రావటం లేదు. వచ్చినా విషయం తెలిసి పెళ్లి చేసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో శివాని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి భోజన అనంతరం గదిలోకి వెళ్లిన శివాని గురువారం ఉదయం 10 గంటలు దాటినా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి తలుపుతట్టాడు. ఉలుకుపలుకు లేకపోవటంతో గోడ దూకి చూడగా శివాని ఉరేసుకొని మృతి చెందింది. తండ్రి హన్మాండ్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. -
బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు
ఇందల్వాయి: మండలంలోని మేఘ్యనాయక్ తండాలో గురువారం రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు తహసీల్దార్ బాలయ్య తెలిపారు. పెళ్లి నిలిపివేసి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లలోపు అమ్మా యిలకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఎంపీడీవో అనంత్ రావు, సర్పంచ్ బంతిలాల్ నాయక్, ఎస్సై సందీప్, ఐసీడీఎస్ సూపర్వైజర్ శోభ తదితర సిబ్బంది ఉన్నారు. నిజామాబాద్ రూరల్: మండలంలోని మల్లారం మేఘన డెంటల్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక చెక్పోస్టును ఏసీపీ ప్రకాశ్ యాదవ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల ధృవపత్రాలను పరిశీలించాలని రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్, పోలీస్ సిబ్బందికి సూచించారు. ఫ్లెక్సీల తొలగింపు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సీపీ ఆదేశాల మేరకు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తొలగించారు. వాహనదారులకు, రోడ్డుకు అడ్డంగా ఉండి ఇబ్బందికరంగా ఉన్న ఫ్లెక్సీలను తీసివేశారు. నిజామాబాద్ రూరల్: బీడీ పరిశ్రమలోని వివిధ కేటగిరీలకు చెందిన కార్మికుల నూతన వేతన ఒప్పందంపై నిర్వహించిన చర్చలు సఫలమైనట్లు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ తెలిపారు.హైదరాబాద్లోని స్వాగత్ గ్రాండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో బీడీ పరిశ్రమ యా జమాన్యాలకు, బీడీ కార్మిక సంఘాలకు మధ్య గురువారం చర్చలు జరిగాయి. బీడీ ప్యాకర్లకు రూ.4,500, ఇతర నెలసరి వేతన ఉద్యోగులకు రూ.2,200, బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు రూ.6 పెంపుదలకు యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చర్చల్లో బీడీ యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు హితేంద్రకుమార్, ధర్మేంద్రగాంధీ, కార్మిక సంఘాల ప్రతినిధులు మామిడ్యాల వెంకటి, రాజేశ్వర్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ రంగాల్లో ప్రతిభచాటిన, సేవలందించిన వారిని సత్కరించనున్నట్లు హైదరాబాద్కు చెందిన ‘ఆల్ దిబెస్ట్ ఆర్ట్స్ అకాడమీ’ అధ్యక్షుడు ఈఎస్ఎస్ నారాయణ మాస్టారు ఒక ప్రకటనలో తెలిపారు. కవులు, రచయిత లు, సంగీత, నృత్య, కళాకారుల, ఉపాధ్యాయు ల, విద్యావంతులు, వైద్యుల, సమాజ సేవకులు తదితర రంగాల్లోని ప్రతిభావంతులు ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్స్ జిరాక్స్ కాపీలతో ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 9652347207 నెంబర్లో సంప్రదించాలని కోరారు. -
నగరంలో న్యాయవాదుల నిరసన
నిజామాబాద్ లీగల్: నగరంలోని జిల్లా కోర్టు ఎదుట గురువారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టు జస్టిస్ రాజశేఖర్ రావు ఒక యువ న్యాయవాదిని జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వడం న్యాయవాదులకు అవమానకరమని అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నీలకంఠరావు, సుభాష్రెడ్డి, సీనియర్ న్యా యవాదులు గణపతి, రాజేందర్ రెడ్డి, భాస్కర్, విఘ్నేష్, రాజు, నరేందర్ రెడ్డి, భాగీచరణ్, రవీందర్, అన్సారీ, జగన్మోహన్ గౌడ్ పాల్గొన్నారు. -
‘ఎస్ఐఆర్ మ్యాపింగ్’ పక్కగా నిర్వహించాలి
● నిర్లక్ష్యం వహిస్తే సిబ్బంది వేతనాలు నిలిపేస్తాం ● కలెక్టర్ ఇలా త్రిపాఠిసుభాష్నగర్ : ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సన్నాహక ప్రక్రియ ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈ ప్ర క్రియ పట్ల నిర్లక్ష్యం వహిస్తే వేతనాలు నిలిపేస్తా మని హెచ్చరించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ అమలు తీరుపై కలెక్టర్ గురువారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో ఏఈఆర్వోలు, బీఎల్వో సూపర్వైజర్లతో సమీక్షించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీ గా ఎస్ఐఆర్ మ్యాపింగ్ అమలును పరిశీలిస్తూ, పనితీరులో వెనుకంజలో ఉన్న ఏఈఆర్వోలు, బీఎల్వో సూపర్వైజర్లను కారణాలు అడిగి తెలుసుకున్నారు. అర్బన్లో మ్యాపింగ్ ప్రక్రియ మందకొడిగా సాగడం వల్ల జిల్లా సగటుపై ప్రభావం చూపుతోందని కలెక్టర్ అన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా బీఎల్వోలతో మ్యాపింగ్ను పక్కాగా జరిపించాలని, రోజువారీగా నిశితంగా పర్యవేక్షించా లని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనితీరు సక్రమంగా లేని ఇద్దరు ఆర్పీలకు షోకాజ్ నోటీసులు అందించి విధుల నుంచి తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తన అనుమతి లేకుండా బీఎల్వోల మార్పులు, చేర్పులు చేయకూడదని సూచించారు. ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక సమగ్ర సవరణను ఎన్నికల సంఘం చేపట్టిందన్నారు. రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకునేలా చూడాలని, మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి కోసం వారి సహకారం తీసుకోవాలని సూచించారు. డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిపోయిన, రెండు ఓట్లు ఉన్నవాళ్ల ఓట్లు మాత్రమే తొలగిస్తారని పేర్కొన్నారు. ఎవరూ అపోహలకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ తరువాత ఎవరైనా ఓటుహక్కు రాని వారు ఉంటే ఆక్షేపణ చేయవచ్చని అన్నారు. సమీక్షలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
పాఠశాలలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్ : వచ్చే విద్య సంవత్సరం నుంచి వీలైనంత ఎక్కువ పాఠశాలలను తనిఖీ చేసే విధంగా ప్రణాళిక చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. గురువారం తన చాంబర్లో ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల తనిఖీ బృందాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను 10 బృందాల సభ్యులు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నారు. ఈ తనిఖీలు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుండే చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల పనితీరుపై తనిఖీ బృంద సభ్యులతో వివిధ అంశాలపై సమీక్షించారు. సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, తనిఖీ బృందాల నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. బ్యాంకు లింకేజీలోనూ రాష్ట్రంలో మొదటి స్థానం డొంకేశ్వర్(ఆర్మూర్) : ఇటీవల సీ్త్ర నిధి రుణా ల పంపిణీలో స్టేట్ ఫస్ట్ అవార్డు అందుకున్న నిజామాబాద్ జిల్లా, తాజాగా బ్యాంకు లింకే జీ రుణాల్లో కూడా ముందు వరుసలో నిలిచింది. 2025–26 సంవత్సరంలో రూ. 1,228 కోట్లకు గాను లక్ష్యానికి మించి రూ. 1,260 కోట్ల రుణాలను 16 వేల మహిళ సంఘాలకు అందజేశారు. ఇది స్టేట్లోనే హై యెస్ట్ కాగా, గురువారం హైదరాబాద్లో మంత్రి సీతక్క , సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ల చేతుల మీదుగా డీఆర్డీవో సాయన్న అ వార్డు అందుకున్నారు. ఏపీడీ మధుసూదన్, డీపీఏం సంధ్యారాణి పాల్గొన్నారు. ఫాగింగ్ మిస్ట్ యంత్రాలు ప్రారంభించిన సీపీ నిజామాబాద్ అర్బన్ : వేసవికాలంలో తీవ్ర ఎండల ప్రభావంతో ట్రాఫిక్ సిబ్బంది ఇ బ్బందులు పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఐలాండ్ వద్ద ఫాగింగ్ మిస్ట్ యంత్రాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం ప్రారంభించారు. నగరంలోని ప్రధాన కూ డళ్ల వద్ద ఈ యంత్రాలను ఏర్పాటు చేశారు. కోర్టు సర్కిల్ వద్ద సీపీ యంత్రాలను ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ ఈ యంత్రా లను ఏర్పాటు చేస్తే మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు అని తెలిపారు. వేసవి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందన్నారు. ఈ యంత్రాలను ఏర్పాటు చేయడానికి సహకరించిన వాసవి క్లబ్ వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సీఐ , సిబ్బంది పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
కరెంట్ షాక్తో ఒకరి మృతి వర్ని: మండలంలోని చలకతండాలో గురువారం విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. కేతావత్ కిశోర్ (29) సౌండ్ బాక్స్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడన్నారు. మృతుడి అన్న గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డివైడర్ను ఢీకొన్న బైక్ ● ముగ్గురికి గాయాలుమద్నూర్(జుక్కల్): బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన ఘటన మండల కేంద్రానికి సమీపంలోని 161 జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. స్థానికుల, అంబులెన్స్ టెక్నిషియన్ సంజయ్ కథనం ప్రకారం.. డోంగ్లీకి చెందిన తుకారాం, అతడి అక్క పూజ, ఇద్దరు పిల్లలు ఆరాధ్య, సువాన్షు గురువారం మధ్యాహ్నం మద్నూర్ నుంచి మేనూర్ వైపు బైక్పై వెళ్తుండగా డివైడర్ను ఢీకొన్నారు. ప్రమాదంలో తుకారాం, పూజలకు స్వల్పగాయాలు కాగా ఆరాధ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, ఆరాధ్యను దేగ్లూర్ ఆస్పత్రికి తరలించారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. గురువారం ఆరుగురిని ఆర్మూర్ కోర్టులో పోలీసులు హాజరుపర్చగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. -
నియామకపత్రాల అందజేత
నిజామాబాద్ రూరల్: రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్గా బాడ్సి శేఖర్గౌడ్, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ సభ్యుడిగా వేణుగోపాల్ యాదవ్ నియామకపత్రాలు అందుకున్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఇద్దరికీ గురువారం నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్గౌడ్, వేణుగోపాల్ యాదవ్ కృతజ్ఞతలు తెలుపుతూ మహేశ్కుమార్ గౌడ్ను సన్మానించారు. శేఖర్గౌడ్, వేణుగోపాల్యాదవ్కు నియామకపత్రం అందజేస్తున్న పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ -
ప్రకృతి విపత్తులపై అవగాహనకు మాక్డ్రిల్
నిజామాబాద్ అర్బన్: ప్రకృతి విపత్తులు, వరదలు సంభవించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 18న జిల్లాస్థాయిలో మాక్ ఎక్సర్సైజ్ను పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మాక్డ్రిల్ నిర్వహణకు నిర్ణీత ప్రణాళిక, ఆయా శాఖల బాధ్యతలు, అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే చేపట్టాల్సిన తక్షణ చర్యలు, సమన్వయం, సమాచార వ్యవస్థ, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మాక్ డ్రిల్ను ఈ నెల 18న నిర్వహించాలని సూ చించారు. కాగా, మాక్ఎక్సర్ౖ సెజ్ను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తామని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. వీసీలో ఆర్డీవో రాజేంద్రకుమా ర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పేదలకు మేలు.. రైతులకు దన్ను
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వ్యవసాయ జిల్లాగా పేరున్న నిజామాబాద్లో పంటల మార్పిడికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం దక్కే అవకాశాలు నెలకొంటున్నాయి. జూన్ 2 నుంచి రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా జొన్న, మొక్కజొన్నలను తక్కువ ధరకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తద్వారా పేదలకు తక్కువ ధరకే పౌష్టికాహారం, రైతులకు దళారుల సమస్య లేకుండా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో జిల్లాలోని జొన్న, మొక్కజొన్న రైతులకు ఉపయోగం కానుంది. ఽఇప్పటివరకు ధాన్యం మాదిరిగా పూర్తిస్థాయిలో మొక్కజొన్న, జొన్నలను కొనుగోలు చేయకపోతుండడంతో దళారులు, మధ్యవర్తులే ఎక్కువగా లాభపడుతున్నారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మేలు కలుగుతుండడంతో పాటు పంటల మార్పిడికి మార్గం సుగమమవుతుంది. ఈ పంటలను ప్రభుత్వమే పూర్తిగా సేకరించడంతో రైతులకు మద్దతు దక్కడంతో పాటు, మరోవైపు రేషన్ డీలర్లకు సైతం ఉపయోగం కలుగనుంది. కేవలం బియ్యం నుంచి వచ్చే కమీషన్తో మాత్రమే డీలర్లు సరిపెట్టుకుంటున్నారు. నిత్యావసరాల సంఖ్య పెంచితే డీలర్లకు సైతం కమీషన్ పెరగనుంది. మంత్రివర్గ ఉప సంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ● జిల్లాలో రైతులు వానాకాలం, యాసంగి సీజన్లలో వరి తర్వాత జొన్నలు, మక్క పంటలనే అధికంగా సాగు చేస్తున్నారు. ప్రతి సీజన్లో 40 వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగవుతుండగా, ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. అలాగే జొన్నల సాగు కూడా క్రమంగా పెరుగుతుండగా ఎకరానికి 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈ పంటలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో సేకరించడం లేదు. దీంతో కొందరు రైతులు మాత్రమే మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. మిగిలిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దళారుల ప్రమేయానికి చెక్ పెట్టి మొత్తం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు తక్కువ ధరకు అందించాలని నిర్ణయించింది. విద్యార్థులకు సైతం బలవర్ధకమైన ఆహారం అదించేందుకు జొన్న, మక్కలను ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు, గురుకులాలకు సరఫరా చేయాలని ఆలోచన చేస్తోంది. పౌల్ట్రీ రైతులకు కూడా మార్కెట్ ధర కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ఆలోచన చేస్తోంది. ఈ ప్రక్రియ అమలైతే జిల్లాలోని జొన్న, మొక్కజొన్న రైతులకు మరింత మేలు జరుగుతుంది. పంటలను అమ్ముకునేందుకు ఇబ్బందులు తప్పుతాయి. నేరుగా రైతులకే మద్ధతు ధర లభిస్తుంది. తద్వారా జిల్లాలో ఈ రెండు పంటలను సాగు చేయడానికి మరింత మంది రైతులు ముందుకు వచ్చేందుకు అవకాశముంది. రేషన్ దుకాణాల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలు సరఫరా చేస్తే రైతులకు, పేదలకు, విద్యార్థులకు, రేషన్ డీలర్లకు సైతం మే లు కలుగుతుంది. మధ్య దళారులు లేకుండా చేయవచ్చు. ఇదే రీతిలో రా నున్న రోజుల్లో మరిన్ని నిత్యావసర వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – గడుగు గంగాధర్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు జూన్ 2 నుంచి రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకు జొన్న, మొక్కజొన్న సరఫరా! వ్యవసాయ జిల్లా కావడంతో పంటల మార్పిడికి మరింత ప్రోత్సాహం -
జిల్లాలో గాలివానకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరబోసిన పంటలను కాపాడుకోడానికి పరుగులు తీశారు. గాలి తీవ్రతకు ధాన్యంపై కప్పిన టార్పలిన్లు ఎగిరిపోయాయి. వర్షం నీరు చేరి కల్లాలు చెరువులను తలపించాయి. కొనుగోళ్లు వేగవంతంగా జరగకపోవడంతో కల్లాల్లోనే పంట నిల్వ ఉంద
● ఎగిరిపోయిన టర్పాలిన్లు, కల్లాల్లోకి చేరిన నీరు ● తడిసి ముద్దయిన ఆరబోసిన ధాన్యం, తూకం వేసిన బస్తాలు ● దిక్కుతోచని స్థితిలో రైతాంగంమోర్తాడ్ మండలం గాండ్లపేట్లో తడిసిన ధాన్యాన్ని దిగాలుగా చూస్తున్న రైతుతడిసిన ధాన్యం, పసుపు కొమ్ములుధాన్యం కుప్పల వద్ద నీటిని తొలగిస్తున్న రైతుగాలివాన బీభత్సండొంకేశ్వర్(ఆర్మూర్) : అకాల వర్షంతో జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం సాయంత్రం మేఘావృతమై గాలివాన బీభత్సం సృష్టించింది. కల్లాల్లో పంట కుప్పలపై కప్పి ఉంచిన టర్పాలిన్లు సైతం బల మైన గాలులకు ఎగిరిపోయాయి. ఆరబోసిన పంటలను కాపాడుకోడానికి రైతులు పరుగులు తీశారు. ఇటు భారీ వర్షానికి కల్లాల్లోకి నీరు చేరి చెరువులను తలపించాయి. టర్పాలిన్లు లేని రైతులు కళ్ల ముందే ధాన్యం తడిసి కొట్టుకుపోతుంటే ఏమి చేయలేక నిస్సాహాయ స్థితిలో ఉండిపోయారు. తూకం వేసి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన వడ్ల బస్తాలు సైతం తడవడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. డొంకేశ్వర్ మండలంలో 2 సెంటీ మీర్లకు పైగా వర్షం కుసింది. అత్యధికంగా భీమ్గల్లో నాలుగు సెంటీ మీటర్లు, కమ్మర్పల్లిలో మూడు, డిచ్పల్లిలో రెండు సెంటీ మీటర్లు నమోదైంది. ఆలూరు, బాల్కొండ, మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, మోర్తాడ్, సిరికొండ, చందూర్, వర్ని, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లో కూడా ఈదురు గాలివానకు పంటలు తడిశాయి. కోతకు వచ్చిన మామిడి కూడా నేలరాలింది. కల్లాల నుంచి ధాన్యం కదలకపోవడంతో.. కోసిన పంటంతా ప్రస్తుతం కల్లాల్లోనే ఉంది. కొనుగోళ్లు వేగవంతంగా జరగకపోవడంతో కల్లాలు ఖాళీ కావడం లేదు. లారీల కొరత కూడా ప్రధాన కారణం. దీంతో కురిసిన అకాల వర్షానికి పెద్ద మొత్తంలో పంట తడిసిపోయింది. దీంతో రైతులు మళ్లీ ధాన్యం ఆరబోసేందుకు శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ధాన్యం రంగు మారుతుందని ఆందోళన చెందుతున్నారు. మక్క కొనుగోళ్లు కూడా నెమ్మదిగా జరగడంతో పంటను కాపాడుకోవడానికి రైతులు తంటాలు పడుతున్నారు. వడ్లు తడిసి కొట్టుకుపోవడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని, ఎలాంటి మెలిక లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.వర్షానికి తడిసిన వడ్ల బస్తాలు -
మోదీ సభను విజయవంతం చేయాలి
● తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి సాధ్యం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి సుభాష్నగర్: ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారని, ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే మోదీ బహిరంగ సభకు జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి కోరారు. ఈమేరకు గురువారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి తరహాలోనే తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నప్పుడే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటికి రూ.2.20 లక్షలు అందిస్తోందని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నేరుగా సర్పంచుల ఖాతాల్లో జమ చేస్తున్నా.. రాష్ట్రం తన ఖజానా ఖాళీ కావడంతో అక్రమంగా ఫ్రీజ్ చేసి నిధులు మళ్లిస్తోందని ఆరోపించారు. చారిత్రాత్మక మోదీ బహిరంగ సభకు జిల్లా నుంచి ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆధ్వర్యంలో సుమారు 15 వేల మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ప్రమోద్కుమార్, నాయిడి రాజన్న, బద్దం కిషన్, పుట్ట వీరేందర్, బిలోజీ నాయక్, అనంత్రెడ్డి, పడాల భూపతి, ఇప్పకాయల కిశోర్, యాదాల నరేశ్, ఆమంద్ విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రైతాంగానికి ఎన్పీడీసీఎల్ పెద్దపీట
● అన్నదాతలకు సబ్సిడీపై సౌర విద్యుత్ ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావుమోపాల్ : జిల్లాలోని రైతాంగానికి ఎన్పీడీసీఎల్ పె ద్దపీట వేస్తోందని, వివిధ కార్యక్రమాలతో మరింత చేరువ కావడంతోపాటు రైతు వారోత్సవాల్లో సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నామని నిజామాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) పీవీ రాజేశ్వర్రావు పేర్కొన్నా రు. విద్యుత్శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన – ప్రగ తి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ రైతు వారోత్సవాల్లో భాగంగా గురువారం వ్యవసాయ క్షేత్రాలు – సౌర విద్యుత్ కేంద్రాలు (పీఎం కుసుమ్) అనే అంశంపై మోపాల్ రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ అందిస్తున్న గృహజ్యోతి, పొలంబాట/ప్రజాబాట, విద్యు త్ భద్రతల గురించి దృశ్య రూపకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. పీవీ రాజేశ్వర్రావు మాట్లాడుతూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నామని, రైతులకు ఆర్థికభారం తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నామని తెలిపారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక శ క్తి జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సౌర, ప వన, జల, భూఉష్ణ, బయోమాస్, గ్రీన్ హైడ్రోజన్ ప్ర గతిలో తెలంగాణ సత్తా చాటాలని లక్ష్యమన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్ టాప్ను ప్రోత్సహిస్తున్నామని ఎస్ఈ తెలిపారు. పీ ఎం కుసుమ్–ఏ పథకం కింద రైతులు తమ వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా మిగిలిన విద్యుత్ను డిస్కంకు వి క్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. పీఎం కుసుమ్–సీ పథకం కింద 7.5 కి లోవాట్ల సోలార్ ద్వారా నడిచే పంపు సెట్ను లైవ్ డెమో ద్వారా రైతులకు వివరించారు. ఈ పంపుసె ట్ వల్ల వాడనప్పుడు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రైతులు రాయితీలతో కూడి న సోలార్ పథకాలను సద్వినియోగం చేసుకోవాల ని సూచించారు. విద్యుత్ భద్రత వారోత్సవాలు విజయవంతం.. జిల్లాలో మే 1 నుంచి 7 వరకు వారం రోజులపాటు సర్కిల్ పరిధిలో నిర్వహించిన విద్యుత్ భద్రత వా రోత్సవాలు విజయవంతమైనట్లు ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జీరోస్థా యికి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమన్నారు. వి ద్యుత్ వినియోగంలో నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలస త్వం కారణంగా అనేక ప్రమాదాలు సంభవిస్తున్నా యని, స్వీయ నియంత్రణ ముఖ్యమని పేర్కొన్నా రు. నిర్లక్ష్యంగా విద్యుత్ పరికరాల వినియోగం, పాడైన నాసిరకం, అతుకుల వైర్ల వినియోగం, ఎ ర్తింగ్ లేకపోవడం, తడిసిన చేతులతో విద్యుత్ పరికరాలు ముట్టుకోవడంతో ప్రమాదాలు జరుగుతాయ ని చెప్పారు. కార్యక్రమంలో డీఈ హరిచంద్ నాయ క్, ఏడీఈ బాలేష్కుమార్, ఇన్చార్జి ఏవో హీరా జా దవ్, సర్పంచ్ ద్యాప రవికుమార్, ఏఈవోలు శరత్, రంజిత్, భావన, ఎన్పీడీసీఎల్ ఏఈలు, లైన్ ఇన్ స్పెక్టర్లు, లైన్మెన్లు, రైతులు పాల్గొన్నారు. -
రైతు డిక్లరేషన్ హామీలన్నీ అమలు చేస్తున్నాం
నందిపేట్ (ఆర్మూర్): ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేష్ రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియను తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతోందని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నగేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పరితపిస్తుందన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ, రైతు భరోసాతోపాటు మరెన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు డిక్లరేషన్ హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, గత ప్రభుత్వ పాలనలో హామీలు తప్ప పేదలకు ఇళ్ల నిర్మాణాలు జరగలేదన్నారు. ఆయన వెంట ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి, సర్పంచ్ సిలిండర్ లింగం, సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద మహిపాల్ తదితరులు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి -
ఆలూర్లో లారీ బీభత్సం
● విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఢీకొన్న లారీ ఆర్మూర్టౌన్: ఆలూర్ మండల కేంద్ర సమీపంలో లారీ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఢీకొని బీభత్సం సృష్టించింది. నల్లమట్టిని తీసుకువచ్చేందుకు ఆలూర్ నుంచి వెల్మల్ మీదుగా నందిపేట్ వైపు వెళ్తున్న లారీ అతివేగంతో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. అడ్డం వచ్చిన చెట్లు, ఆరు విద్యుత్ స్తంభాలు, రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఢీకొట్టింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. లారీ డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటన సమయంలో పొలాల్లో రైతులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కాగా, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు పూర్తిగా ధ్వంసం కావడంతో సమీపంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏడీఈ కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి మరమ్మతులు చేస్తామని తెలిపారు. -
42 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రుద్రూర్: మండల కేంద్రంలోని జవహర్నగర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సి విల్ సప్లయ్ అధికారులు గురువారం స్వాధీనం చే సుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో అధికారులు శర్ఫుద్దీన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.42 క్వింటాళ్ల రేషన్బి య్యాన్ని స్వాధీనం చేసుకొని,కేసు నమోదు చేశారు. లింగంపేట(ఎల్లారెడ్డి):మండలంలోని సజ్జన్పల్లి చౌ రస్తా వద్ద గురువారం ధాన్యం బస్తాల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడినట్లు రైతులు తెలిపారు. శెట్పల్లిసంగారెడ్డి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధా న్యం బస్తాలు లోడ్ చేసుకొని కామారెడ్డికి వెళ్తుండగా మార్గమధ్యంలో సజ్జన్పల్లి చౌరస్తా వద్ద లారీ బో ల్తాపడింది. ఘటనలో డ్రైవర్తోపాటు ఎవరికి గా యాలు కాలేదని తెలిపారు. ధాన్యం బస్తాలను మ రో లారీలో లోడ్ చేసి పంపినట్లు రైతులు తెలిపారు. ● ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు దోమకొండ: ఆస్తి వివాదాల నేపథ్యంలో అత్తను ఇద్దరు కోడళ్లు హత్య చేసేందుకు యత్నించిన ఘటన దోమకొండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కట్ట లక్ష్మిపై ఆమె కోడళ్లు కట్ట లహరిక, కట్ట పవిత్ర బుధవారం రాత్రి దాడి చేశారు. చీర పల్లుతో మెడబిగించి హత్యకు యత్నించగా, లక్ష్మి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. బాధితురాలు గురువారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్సై తెలిపారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, వారు నేరాన్ని ఒప్పుకున్నారని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై వివరించారు. -
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల బీట్ బజార్ వద్ద గంటపాటు కురిసిన భారీ వర్షంతో మక్కలు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. 20 రోజుల క్రితం తీసుకొచ్చిన మొక్కలు ఇప్పటికీ కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడ్డారు. జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ఆందోళనతో భారీగా స్తంభించింది ట్రాఫిక్. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది.నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. బాల్కొండ, మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూరు, ఆర్మూర్,ధర్పల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోరుట్ల నియోజకవర్గంతో పాటు కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. మెట్ పల్లి మార్కెట్ యార్డులో భారీ వర్షంతో మొక్కజొన్న, ధాన్యం తడిచింది. పలు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం, మొక్కజొన్నలోకి నీరు చేరింది. పలు ప్రాంతాల్లో మామిడి నేలరాలింది.కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి శివారులో భారీ ఈదురు గాలులతో వెంకటేశ్వర రైసు మిల్ యంత్ర భాగాలు కూలడంతో భారీ నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాలలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. భైంసా మండలం మాటేగాం గ్రామం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న కొనుగోలులో జాప్యంతో అకాల వర్షం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిరసన తెలిపారు.కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని కంచుమహల్, కొండాపూర్, ముంబాజీపేట్, భవానీపేట్, జల్దిపల్లి, రాంపూర్ భారీ వర్షం కురిసింది. గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో.. ఆరబోసిన ధాన్యం నీటిలో తడిసి ముద్దయింది.ఏపీకి వర్ష సూచనఆంధ్రప్రదేశ్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విదర్భ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి వానలు పడుతున్నాయి. దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. వచ్చే వారం బంగాలాఖతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేసింది. -
నిబంధనలు ఉల్లంఘిస్తే స్కానింగ్ సెంటర్లపై చర్యలు
● డీఎంఅండ్హెచ్వో డాక్టర్ రాజశ్రీ సుభాష్నగర్: స్కానింగ్ సెంటర్లు నిబంధనలు ఉ ల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎం అండ్ హెచ్వో డాక్టర్ బి రాజశ్రీ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లాస్థాయి సలహా సంఘం సమావేశం ఆమె అధ్యక్షతన నిర్వహించారు. డీఎంఅండ్హెచ్వో మాట్లాడుతూ ప్రతి స్కానింగ్ కేంద్రం రిజి స్ట్రేషన్ చేయించాలని, రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులు, కార్డియాలజిస్ట్, ఆప్తమాలజిస్ట్ స్కానింగ్ చేసేందుకు అర్హులన్నారు. పీసీపీఎన్డీటీ చట్టం ద్వా రా నమోదైన వైద్యులు మాత్రమే స్కానింగ్ మిషన్లను వాడాలన్నారు. స్కానింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలనుకునే వైద్యులు వైద్యాధికారి కార్యాల యం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో వైద్యుల సమయపాలనను చార్ట్ ద్వారా ప్రదర్శించాలన్నారు. జిల్లాలోని 131 స్కానింగ్ కేంద్రాలకుగాను మూడు నెలల్లో 96 కేంద్రాలను తనిఖీ చేశామని పేర్కొన్నారు. స్కానింగ్ కేంద్రాలను కేంద్ర తనిఖీ బృందాలు ముందస్తు సమాచారం లేకుండా తనిఖీ చేసే అధికారాన్ని కలి గి ఉంటాయన్నారు. ప్రతి స్కానింగ్కు డాక్టర్ సిఫారసు ధ్రువపత్రం తప్పకుండా అవసరమన్నారు. నాలుగు ఆస్పత్రులను స్కానింగ్ కేంద్రాలకు అను మతి కోసం కలెక్టర్ నివేదించామని తెలిపారు. కా ర్యక్రమంలో జీజీహెచ్ రేడి యాలజిస్ట్ డాక్టర్ నిశిత, గైనకాలజిస్ట్ డాక్టర్ నిషాత్, వైద్యులు శరత్చంద్ర, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుప్రియ, డాక్టర్ శిఖర, డాక్టర్ శ్వేత, డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. సలహా సంఘ సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్వో డాక్టర్ బి రాజశ్రీ -
జిల్లాలో మరో రెండు ఆర్వోబీలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి వద్ద, జానకంపేట గూడ్స్ షెడ్ వద్ద ఆర్వో బీలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 5న భారత ప్రభుత్వం ఆర్వోబీల కోసం భూసేకరణ చేసేందుకు ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేసింది. వీటిని స్పెషల్ ప్రాజెక్టులుగా గుర్తించి కేంద్రం గెజిట్ విడుదల చేయడం గమనార్హం. ‘స్పెషల్ రైల్వే ప్రాజెక్టు’ కింద సికింద్రాబాద్–ముథ్కేడ్ సెక్షన్ పరిధిలోని ఈ రెండు చోట్ల ఆర్వోబీల నిర్మాణాలు చేయనున్నారు. ఇందుకోసం రైల్వే చట్టం–1989లోని సెక్షన్ 2, క్లాజ్ (37ఏ) ప్రకారం ఉన్న అధికారాలను వినియోగిస్తూ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టులను జాతీయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం గెజిట్లో పేర్కొనడం విశేషం. ఈ ఆర్వోబీల నిర్మాణాల కోసం ఎంపీ ధర్మపురి అర్వింద్ పలుసార్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను, రైల్వే ఉన్నతాధికారులను కలిసి అనేక విజ్ఞప్తులు చేశారు. కాగా ఆర్వోబీలతో ఈ ప్రాంతాల్లో ప్రయాణికుల సమస్యలు తీరనున్నాయి. ఏళ్లతరబడి ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఫుల్స్టాప్ పడడంపై ఈ ప్రాంతాల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. పార్లమెంట్ పరిధిలో 10 ఆర్వోబీలు లక్ష్యం : ఎంపీ అర్వింద్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 10 ఆర్వోబీలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం నిరంతరం కృషి చేస్తున్నాం. వీటితో ప్రాంతాల మధ్య మరింత కనెక్టివిటీ పెరుగుతుంది. తద్వారా మరింత అభివృద్ధికి ఊతం ఇస్తుంది. ప్రజల ప్రాణానికి రక్షణ, ట్రాఫిక్ సమస్యలు తొలగుతాయి. ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని లెవెల్ క్రాసింగ్ల వద్ద ఆర్వోబీలు నిర్మాణం చేయించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నాం. ఇక అమృత్ భారత్ కింద రూ.53 కోట్లతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ఆధునిక మౌలిక వసతులు అందించే లక్ష్యంతో ముందుకెళుతున్నాం. కాగా నిజామాబాద్ మీదుగా నడిచే పలు రైళ్లను స్పెషల్ రైళ్ల నుంచి రెగ్యులర్ రైళ్లుగా మార్చడంతో ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగింది. జిల్లాకు రవాణా పరంగా మరింత బలం చేకూరింది. ప్రజల అవసరాలను గుర్తించి ఈ ప్రాజెక్టులను ‘స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్’ కింద చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు ధన్యవాదాలు. తాజా గెజిట్తో తక్షణమే భూసేకరణ చేపట్టే అవకాశం కలిగింది. పరిపాలన అనుమతులు వేగంగా లభిస్తాయి. టెండర్ల ప్రక్రియ, కేంద్ర నిధుల సమీకరణ సులభమవుతుంది. ముఖ్యంగా ప్రజల భద్రత పెరిగి రైలు–వాహన ప్రమాదాలు తగ్గుతాయి. ఇందల్వాయి, జానకంపేట గూడ్స్ షెడ్ వద్ద నిర్మించనున్న రైల్వే శాఖ భూసేకరణ కోసం గెజిట్ విడుదల చేసిన భారత ప్రభుత్వం ఇప్పటికే రూ.53 కోట్లతో నిజామాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు -
ఇంటర్ అడ్మిషన్లు ఇప్పుడే వద్దు
ఖలీల్వాడి: ఇంటర్మీ డియట్ బోర్డు ఇటీవ ల ప్రకటించిన అడ్మిషన్ షెడ్యూలు రద్దు చేసినందున ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, రెసిడెన్షియల్, ఇతర గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ ప్రకటించారు. కొత్త షెడ్యూలు వచ్చిన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించా లన్నారు. ఇంటర్ కళాశాలల్లో ఇప్పుడే చేరరాదని, ప్రైవేట్ కళాశాలల్లో ఎవరూ ఫీజులు చెల్లించవద్దని స్పష్టం చేశారు. అడ్మిషన్లను ని ర్వహించినట్టు తమ దృష్టికి వస్తే కళాశాల లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు నిర్వహించటానికి వీలులేదన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలిక మృతి ● రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు నిజామాబాద్ రూరల్: రోడ్డు దాటుతున్న ఆరేళ్ల బాలికను అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్రధర్నగర్ తండా సమీపంలో బు ధవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో బా లిక మృతి చెందినట్లు ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. బాట్లోత్ పరమేశ్వర్ కుమార్తె కీర్తన(6) కిరాణా షాప్కి వెళ్లి రోడు దాటుతుండగా మేఘన డెంటల్ కళాశాల విద్యార్థి డ్రైవ్ చేస్తున్న కారు అతివేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన బాలికను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. నేడు, రేపు దోస్త్ ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తెయూ(డిచ్పల్లి): దోస్త్ – యూజీ కోర్సులలో స్పెషల్ కేటగిరి కింద అడ్మిషన్ పొందిన విద్యార్థులు పీహెచ్సీ/ సీఏపీ ఈ నెల 7న, ఎన్సీసీ/స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విద్యార్థులు ఈ నెల 8న సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని తెయూ అడ్మిషన్స్ డైరెక్టర్ వాసం చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెయూ పరిపాలనా భవనంలోని అకడమిక్ ఆడిట్ సెల్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సర్టిఫికెషన్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని 38 వార్డుతో పాటు 36, 40 వార్డుల బ్యాలెట్ బాక్స్లు, వోటర్ లిస్టులు, వోట్ కౌంటర్ ఫైల్స్ ఇతర సామగ్రిని మున్సిపల్ అధికారులు కోర్టుకు చేర్చారు. మున్సిపల్ ఎ న్నికలలో అవకతవకలు జరిగాయంటూ 38వ వార్డులో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గ్రామీణ ఓటర్లు, ఇతర వార్డుల ఓట ర్లు 38వ వార్డులో ఓటేయడంతో తాను ఓడి పోవాల్సి వచ్చిందని ఆ అభ్యర్థి ఆవేదన వ్య క్తం చేశారు. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేర కు మున్సిపల్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్లు, వోటర్ లిస్టులు, వోట్ కౌంటర్ ఫైల్స్ ఇతర సామగ్రిని కోర్టుకు అందించారు. -
నిధులు లేక నిలిచిన సాయం
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన ఈర్గల్ల గంగాధర్ మార్చి 2025లో యూఏఈలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఎక్స్గ్రేషియా కోసం అతని భార్య లక్ష్మి అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఏడాది గడచినా ఇప్పటి వరకూ రూ.5 లక్షల సాయం అందలేదు. ప్రభుత్వం ఎక్స్గ్రేషియాను విడుదల చేస్తే ఆ సొమ్ముతో తమ బాధలు తీరుతాయని లక్ష్మి భావించింది. ఏడాది కాలంగా సాయం కోసం ఆమె నిరీక్షిస్తూనే ఉంది. ఇది ఒక్క లక్ష్మికి ఎదురైన సమస్యే కాదు. ఎంతో మంది వలస కార్మికులు గల్ఫ్ దేశాల్లో మరణించగా వారి కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం కోసం నిరీక్షిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలను స్వీకరించిన తరువాత గల్ఫ్ వలస కార్మికుల అంశంపై స్వయంగా పరిశీలన చేశారు. కారణం ఏదైనప్పటికీ గల్ఫ్ దేశాల్లో మరణించిన తెలంగాణ వలస కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. 2023 డిసెంబర్ తరువాత మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 225 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించారు. ఏడాది కాలంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 130 మంది మరణించగా వారికి ఇప్పటి వరకూ సాయం అందలేదు. బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని గల్ఫ్ కార్మికుల సంఘాలు ప్రభుత్వాన్ని వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. వలస కార్మికులు గల్ఫ్ దేశాల్లో మరణిస్తే కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తును అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ నిజామాబాద్ జిల్లాలో 17 కుటుంబాలకు, జగిత్యాల్ జిల్లాకు చెందిన 50 కుటుంబాలకు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు చెందిన మరో 63 కుటుంబాలకు సాయం అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తే గల్ఫ్ మృతుల కుటుంబాలకు సాయం అందేది. ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో బాధిత కుటుంబాలకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రభుత్వానికి విన్నవించాం.. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన వలస కుటుంబాలకు సా యం కోసం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి విన్నవించాం. బడ్జెట్లో ప్ర త్యేకంగా నిధులను కేటా యించాలని కోరాం. ఎన్నో బాధిత కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతేనే సాయం సొమ్ము ఖాతాల్లో జమ చేస్తారు. – స్వదేశ్ పరికిపండ్ల, ఎన్నారై అడ్వయిజరీ బోర్డు సభ్యుడు గల్ఫ్ దేశాల్లో మరణించిన వారికి రూ. 5లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించిన ప్రభుత్వం గతంలో 225 మందికి పంపిణీ నిధులు లేక ఏడాది కాలంగా సాయం కోసం 130 కుటుంబాల నిరీక్షణ బడ్జెట్లో గల్ఫ్ సంక్షేమానికి నిధులు కోరినా పెడచెవిన పెట్టిన ప్రభుత్వం -
రెవెన్యూ ఉద్యోగుల స్వీయగణన నమోదు
● అభినందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠినిజామాబాద్ అర్బన్: జనాభా గణన–2027లో భాగంగా బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులు స్వీయ నమోదు చేసుకున్నారు. ఉద్యోగులు ఎవరికి వారు తమ కుటుంబ సభ్యుల వివరాలను పోర్టల్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిని అభినందించారు. మిగతా శాఖల ఉద్యోగులు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని స్వీయ గణన చేసుకోవాలని సూచించారు. ఈసారి జనాభా గణన–2027 డిజిటల్ విధానంలో నిర్వహించబడుతోందన్నారు. ఈ నెల 10 వరకు పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకోవచ్చని సూచించారు. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ ద్వారా https://se.census.gov.in వెబ్సైట్లోకి వెళ్లి స్వీయ గణన చేసుకోవచ్చన్నారు. నమోదు అనంతరం ప్రతి వ్యక్తికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐఈ) వస్తుందని, దానిని భద్రపరచి ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్కు అందజేయాలని సూచించారు. అన్ని శాఖల ఉద్యోగులు, జిల్లా ప్రజలందరూ మే 10లోపు స్వీయ గణన పూర్తి చేసి జిల్లా అభివద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలు పునిచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, శ్రీనివాస్ రావు, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
తీరనున్న గేట్ కష్టాలు
ఇందల్వాయి: ఇందల్వాయి, సిర్నాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఇందల్వాయి మండల కేంద్రంలోని రైల్వే గేటుపై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం నిర్ణయించడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భీంగల్, సిరికొండ, ధర్పల్లి, ఇండల్వాయి మండలాలకు చెందిన వేలాది మంది నిత్యం నిజామాబాద్తో పాటు హైదరాబాద్ వెళుతుంటారు. 44 నెంబర్ జాతీయ రహదారి మీదుగా వెళ్లే ఈ ప్రాంతాలను చేరుకోవాలంటే ఇందల్వాయి రైల్వే గేటు దాటాల్సిందే. ఈ రైల్వే మార్గం గుండా నిత్యం 50 పైగా ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు వెళుతుంటాయి. ఈ క్రమంలో రోజుకు కనీసం 50 సార్లు గేటుని మూసేస్తారు. గేటు పడ్డ ప్రతిసారి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ అవుతుంది. రెండు పక్కల వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జాప్యం లేకుండా నిర్మించాలి రైల్వే ఓవర్ బ్రిడ్జి కో సం త్వరగా భూ సేకరణ పూర్తి చేసి, పను లు వేగంగా పూర్తి చే యాలి. మాధవ నగర్ ఆర్వోబీ లాగా పనులు ఆలస్యంగా జరిగితే ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అలా జరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. – ఎం శ్రీనివాస్, ఇందల్వాయి ఆదేశాలు రాగానే భూసేకరణ ఆర్వోబీ నిర్మాణం కోసం పైఅధికారుల నుంచి ఆదేశాలు రాగానే సంబంధిత అధికారులతో కలిసి భూమి సర్వే భూసేకరణ పనులు ప్రారంభిస్తాం. – బాలయ్య, తహసీల్దార్ ఇందల్వాయి -
పంట మార్పిడితో సుస్థిర ఆదాయం
డిచ్పల్లి: పంట మార్పిడి విధానం పాటించడం ద్వారా రైతులు సుస్థిర ఆదాయం సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రుద్రూర్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త వైఎస్ పరమేశ్వరి సూచించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మండలంలోని మండలం మెంట్రాజ్పల్లిలో మంగళవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు వైఎస్ పరమేశ్వరి, డాక్టర్ రమేశ్ మాట్లాడుతూ.. ఒకే పంటను వరుసగా సాగు చేయడం వల్ల నేలసారం తగ్గుతుందని, పంట మార్పిడి విధానం అనుసరించడం ద్వారా నేలలో పోషకాల సమతుల్యత నిలబడుతుందన్నారు. ఎరువుల వినియోగం తగ్గి పంట దిగుబడి పెరుగుతుందన్నారు. తమ భూమి పరిస్థితులు, నీటి లభ్యత, మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరైన పంట మార్పిడి పద్ధతిని అనుసరించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రమేశ్, ఏఈవో వంశీకృష్ణ, రైతులు పాల్గొన్నారు. -
ఆదాయవనరుల పెంపుపై దృష్టి సారించాలి
● స్థానికంగా ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి ● ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్యనిజామాబాద్ అర్బన్: స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్హాల్లో మంగళవారం ఉత్తర తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని, సభ్యుడు ఎస్.సుధీర్రెడ్డితో కలిసి చైర్మన్ రాజయ్య సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఉత్తర తెలంగాణా జిల్లాల నుంచి వచ్చిన అదనపు కలెక్టర్లు తమ జిల్లాల్లో స్థానిక సంస్థల పనితీరును వివరించారు. ప్రజాప్రతినిధులు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, స్థానిక సంస్థల బలోపేతంపై దృష్టి సారించాలని రాజయ్య సూచించారు. స్థానిక సంస్థల్లో ఆదాయ వనరులను పెంపొందించుకునే అవకాశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సలహాలు స్వీకరించారు. ప్రభుత్వానికి నివేదిస్తామని అందిస్తామని తెలిపారు. నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సౌర విద్యుత్ ఉత్పత్తి
జక్రాన్పల్లిలో సోలార్ పవర్ ప్లాంట్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి దిశగా ఎన్పీడీసీఎల్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జక్రాన్పల్లిలో సోలార్ పవర్ ప్లాంట్ను సంస్థ సీఎండీ వరుణ్రెడ్డి మంగళవారం ప్రారంభించగా, కోస్లిలో ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో విద్యుత్ సమస్యను పూర్తిస్థాయిలో అధిగమించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్లాంట్ల నిర్మాణానికి అన్ని జిల్లాల్లో రంగం సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే ఆయా విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొదటిసారి జక్రాన్పల్లి విద్యుత్ ఉప కేంద్రం వద్ద సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించారు. 3.5 ఎకరాల స్థలంలో 0.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్ధ్యంతో దీని నిర్మాణం చేపట్టారు. పైలట్ ప్రాజెక్టు కింద మొదటగా ఇక్కడ ప్లాంట్ను నిర్మాణం చేశారు. అయితే జిల్లాలోని నవీపేట మండలం కోస్లి విద్యుత్ ఉపకేంద్రం వద్ద సైతం మరో సోలార్ ప్లాంట్ను నిర్మాణం చేసేందుకు గాను అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. కోస్లి వద్ద రెడ్కో ఆధ్వర్యంలో నిర్మాణం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు ఎకరాల స్థలంలో ఒక మెగావాట్ విద్యుదుత్పత్తి సామర్ధ్యంతో నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్లో జిల్లాలోని మరిన్ని సబ్ స్టేషన్ల వద్ద సోలార్ ప్లాంట్లను నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. 1మెగావాట్ సామర్ధ్యంతో సోలార్ ప్లాంట్ నిర్మించేందుకు 4 నుంచి 5 ఎకరాల మేర స్థలం అవసరం ఉంది. అయితే స్థలం సరిపడా లేని సబ్ స్టేషన్ల వద్ద ప్రభుత్వం స్థలం కేటాయించేందుకు ఆలోచన చేస్తోంది. జిల్లాలో మొత్తం 273 విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఎక్కడెక్కడ సోలార్ ప్లాంట్లకు సరిపడా స్థలం ఉంది, ఇంకా ఎంత కావాలి అనే విషయమై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సబ్ స్టేషన్లకు దూరంగా ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం స్థలం కేటాయిస్తే అందుకు తగినవిధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అయితే రెడ్కో ఆధ్వర్యంలో ఎక్కువ సోలార్ ప్లాంట్లు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్లో 200 గజాల స్థలంలో రెడ్కో ఆధ్వర్యంలో ఈవీ చార్జింగ్ స్టేషన్ను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు ‘సాక్షి’కి తెలిపారు.రాష్ట్రంలోనే తొలి ప్లాంట్ పర్యావరణ పరిరక్షణకు ఇది ముందడుగు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జిల్లాలోని సబ్స్టేషన్లలో సోలార్ ప్లాంట్లు జక్రాన్పల్లిలో ప్రారంభం.. కోస్లిలో ఏర్పాటుకు ప్రతిపాదనలు పెర్కిట్లో ఈవీ స్టేషన్ నిర్మాణానికి సైతం -
ఆ 8 రకాలకే బోనస్
మోర్తాడ్ (బాల్కొండ): వానకాలంలో సాగు చేసే స న్న రకాల వరిలో తాము సూచించే ఎనిమిది రకా లనే సాగు చేయండి.. బోనస్ పొందండి అంటూ వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం చేపట్టింది. సన్నాలలో ఎన్నో రకాలు ఉండగా కేవలం 8 రకాలనే ప్రమోషన్ చేస్తూ ప్రచారం చేస్తుండటంతో రై తుల్లో గందరగోళం నెలకొంది. సన్న రకాలను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్గా చెల్లిస్తున్న విషయం విదితమే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వాన కాలం సీజన్లో కొనుగోలు చేసిన సన్న రకాల కు బోనస్ను అందించారు. మొదట్లో సన్నాల్లో ఏ రకం సాగు చేసి విక్ర యించినా తేడా చూపకుండానే ప్రభుత్వం బోనస్ ను అందించింది. 2026 వా నకాలం సీజన్కు సంబంధించి మాత్రం 8 రకాలనే ప్రమోషన్ చేయాలని నిర్ణయించడం రైతులను అయోమయానికి గురి చే స్తోంది. ఒక వేళ ప్రభుత్వం సూచించిన 8 రకాలనే సాగు చేయాలంటే వి త్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయా అనే సంశయం నెలకొంది. సన్నాలలో ఎన్నో రకాలు ఉండగా రోగాల బారిన పడని, తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చేవి, కలుపు ఇబ్బందులు లేని రకాలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సూ చించిన రకాలలో కొన్నింటికి దిగుబడి ఆశించినంతగా రాదని రైతులు చెబుతున్నారు. అలాగే రోగాల బారిన పడే రకాలు ఉన్నాయని తెలిపారు. ప్రమోష న్ చేయాలని సూచించిన 8 రకాల కంటే ఎంతో నాణ్యమైన విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని రైతు లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సన్న రకాలకు బోనస్ అనే హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని అంతేకాని తాము సూచించిన 8 రకాలకే బోనస్ వర్తిస్తుందనే ప్రకటనను ఉపసంహరించుకోవాలని రైతులు సూచిస్తున్నారు. వానకాలం సాగు కు అవసరమైన వరి విత్తనం సేకరణలో బిజీగా ఉన్న రైతులకు వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రచారం అయోమయంలోకి నెట్టిందని దీనిపై ప్రభుత్వం పునపరిశీలన చేయాలని పలువురు కోరుతున్నారు. వరి వంగడాల పేర్లు సూచిస్తూ వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం వానకాలం 2026 సాగు ప్రమోషన్ పేరిట కరపత్రాల ముద్రణ కొన్ని రకాలనే సూచించడంతో రైతన్న అయోమయం -
ఉద్యాన పంటలతో ఆర్థిక పరిపుష్టి
పెర్కిట్(ఆర్మూర్): సాంప్రదాయ పంటలకు భిన్నంగా ఉద్యాన పంటలను సాగు చేయ డం ద్వారా లాభాలు ఆర్జించవచ్చని పసుపు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్లో మంగళవారం ఉ ద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహ న సదస్సు నిర్వహించారు. గంగారెడ్డి ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రైతులు తమకున్న సాగు భూమిలో అర ఎకరాలో కూరగాయలు చేయడం ద్వారా అదనపు ఆ దాయం పొందవచ్చన్నారు. అనంతరం రైతు వారోత్సవాల పరిశీలకురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ అందజేస్తుందన్నారు. ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గంలో 620 మంది రైతులు 1,343 ఎకరాల్లో ఆ యిల్పామ్ పంటను సాగు చేస్తున్నట్లు తెలి పారు. దీంతో పాటు రైతులు కూరగాయలు, పండ్లు, పూలను సాగు చేసి అదనపు ఆదాయం పొందాలన్నారు. ఆర్మూర్ ఉద్యానవన శాఖ అధికారిణి సంధ్యారాణి, రైతులు పాల్గొన్నారు. డీఆర్వోగా గీత నిజామాబాద్ అర్బన్: జిల్లా రెవెన్యూ అధికారిణిగా బి గీతను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీలో డిప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తున్న గీత నిజామాబాద్ డీఆర్వోగా రానున్నారు. బోధన్ ఆర్డీవోగా విజయకుమారి బోధన్: అడిషనల్ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హై దరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సేవరేజ్ బోర్డులో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్ ఎం విజయకుమారి బోధన్ ఆర్డీవోగా నియమితులయ్యారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో కొత్తగా డిప్యూటీకలెక్టర్ను ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంట మార్పిడిపై సీఎంకు నివేదిక నిజామాబాద్ రూరల్: పంట మార్పిడి విధానాలపై సీఎం రేవంత్రెడ్డికి హైదరాబాద్లోని ఆయన నివాసంలో మంగళవారం నివేదికను అందజేసినట్లు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తెలిపారు. చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో సీఎంతో తాము సమావేశమై వివిధ అంశాలపై చర్చించామన్నారు. పంట మార్పిడిపైన ప్రభుత్వం సమగ్ర చర్చ జరపాలని భావిస్తోందని సీఎం పేర్కొన్నట్లు గడుగు తెలిపారు. మరింత అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలతో ఖరీఫ్ పంటపై తాము ముందుకు వస్తామన్నారు. -
టిఫిన్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి మృతి
నిజాంపేట(మెదక్): టిఫిన్ చేస్తూ కుప్పకూలిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా నిజాంపేటలో ఘటన చోటు చేసుకోగా, మృతుడు కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాలాపూర్కి చెందిన చాకలి రాజు(42) మంగళవారం ఉదయం నందిగామకు బయలుదేరాడు. మార్గమధ్యలో నిజాంపేటలోని ఒక హోటల్కు టిఫిన్ చేసేందుకు వచ్చాడు. టిఫిన్ చేస్తున్న క్రమంలో అతడికి ఫిట్స్ వచ్చి ఆహారం ఊపిరితిత్తులోకి వెళ్లడంతో కింద పడిపోయాడు. వెంటనే హోటల్ యాజమాన్యం 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి పరిశీలించగా అతడు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బావిలో పడి వృద్ధురాలు.. ఇందల్వాయి: మండలంలోని డొన్కల్ గ్రామంలో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందింది. వివరాలు ఇలా.. డొన్కల్ గ్రామా నికి చెందిన గొల్ల మల్లవ్వ (60) అనే వృద్ధురాలు సమీపంలోని అడవిలో నిత్యం తునికాకు సేకరణకు వెళ్తుండేది. ఈక్రమంలో మంగళవారం ఉదయం తునికాకు సేకరణకు వెళ్లి ప్రమాదవశాత్తు తమ వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. మృతురాలి కొడుకు రమేష్ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు.. నవీపేట: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని ఫకీరాబాద్ గ్రామానికి చెందిన వంకదారిగోపి(25) కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం ఈనెల 1న ఆస్పత్రికి వెళ్లి మందులు తీసుకున్నాడు. అయినా వ్యాధి నయం కాకపోవడంతో అతడు జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో ఈ నెల 2న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలి
తెయూ(డిచ్పల్లి): జిల్లాలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ ఆ కళాశాలను తెలంగాణ యూనివర్సిటీ భూముల్లో కాకుండా జిల్లాలో ఎక్కడైనా ఏర్పాటు చేయాలని ఏబీవీపీ నాయకులు అన్నారు. తెయూ సెంట్రల్ లైబ్రరీ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏబీవీపీ కార్యదర్శి సమీర్ మాట్లాడారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, తెయూ వీసీ, రిజిస్ట్రార్ వెంటనే స్పందించి యూనివర్సిటీ భూములను కాపాడా లని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. నాయకులు సంజీవ్, సతీష్, కృష్ణ, శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పున:సమీక్షించాలి తెయూ(డిచ్పల్లి): యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ప్రభుత్వ వ్యవసాయ కళాశాల ఏర్పాటు నిర్ణయాన్ని పున:సమీక్షించాలని విద్యార్థి సంఘాల నా యకులు కోరారు. ఈమేరకు వారు మంగళవారం రిజిస్ట్రార్ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం వల్ల తెయూలో నూతన కోర్సులు, భవనాలు ఏర్పాటు చేయడానికి భవిష్యత్తులో పెద్ద అడ్డంకిగా మారుతుందన్నారు. అలాగే ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను సారవంతమైన నేల, భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న జిల్లాలోని మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఏఐఎస్ఎఫ్, ఏఐపీఎస్యూ, పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ప్రతినిధు లు కొమిరె శ్రీశైలం, దీపిక, గణేష్, విగ్నేష్, రఘురాం, నవీన్కుమార్, విజయ్, గోపాల్ ఉన్నారు. -
16 ఏళ్లుగా 100 శాతం ఉత్తీర్ణత
● ఎస్సెస్సీ ఫలితాల్లో హాసాకొత్తూర్ జెడ్పీహెచ్ఎస్ ఘనత ● ప్రత్యేక తరగతులు, వెనుకబడిన విద్యార్థులపై టీచర్ల ప్రత్యేక శ్రద్ధ మోర్తాడ్: కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు 16 ఏళ్లుగా వందశాతం ఉత్తీర్ణత సాధిస్తూ రికార్డును సృష్టించారు. 2010–2011 విద్యా సంవత్సరంలో మొ దలైన వంద శాతం ఉత్తీర్ణత నమోదు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. 2025–26 విద్యా సంత వ్సరానికి గాను వంద శాతం ఉత్తీర్ణతను విద్యార్థు లు సాధించడంతో అందరి దృష్టి ఈ పాఠశాలపై ని లిచింది. ఈసారి 19 మంది విద్యార్థులు పరీక్షలు రా యగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఎక్కు వ మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించడం విశేషం. సకాలంలో సిలబస్ను పూర్తి చేయడంతో పాటు ప్రత్యేక తరగతుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టిసారించడంతో వంద శాతం ఫలితాలు సాధ్యమయ్యాని ఉపాధ్యాయులువెల్లడించారు. ఇదే స్ఫూ ర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగుతామన్నారు. మరిన్ని పాఠశాలల్లో... కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్, బషీరాబాద్, చౌట్పల్లి, అమీర్నగర్ పాఠశాలల్లోను వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన పాఠశాలల్లో ఒకరిద్ద రు విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులలో తప్పడంతో వంద శాతం ఫలితాలు సాధ్యం కాలేదు. ప్రభుత్వ బడు ల్లోని విద్యార్థులు ప్రైవేటు బడుల విద్యార్థుల కంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో ఈసారి అడ్మిష న్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పదో తరగతి పరీక్షల్లో మా విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ఉ పాధ్యాయుల కృషి, గ్రామ స్తు లు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకారం అందించడంతో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం. –తిరునగిరి అరుణశ్రీ, హెచ్ఎం, హాసాకొత్తూర్ -
త్వరలోనే సమస్యలు పరిష్కారం
మోపాల్: రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరు మోహన్రెడ్డి అన్నారు. జన గణన శిక్షణ కేంద్రంలో ఉద్యోగులకు అన్ని సదుపాయాలు కల్పించినందుకు కలెక్టర్ ఇలా త్రిపాఠికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మోపాల్ మండల కేంద్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న జనగణన శిక్షణా కేంద్రాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా మోహన్రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తారని, ఉద్యోగులకు హెల్త్కార్డులు అందజేస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. అనంతరం అధికారి సాయికృష్ణ, మాస్టర్ ట్రైనర్స్ దయానంద్, శేఖర్ను మోహన్రెడ్డి సన్మానించారు. తహసీల్దార్ రేఖ, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ గోపిడి రవీందర్రెడ్డి, ఎంఈవో అమ్దాపూర్ సాయిలు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కొట్టూరు దేవీదాస్, రాష్ట్ర బాధ్యులు శ్రీనివాస్, ఎండల మహేందర్, మండల అసోసియేట్ అధ్యక్షులు కడావత్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రవాణా రంగంలోకి మహిళా సంఘాలు
● ఆర్టీసీలో మండల సమాఖ్యల పెట్టుబడి ● జిల్లాకు చేరిన 18 బస్సులు ● అద్దె రూపంలో ఎంఎస్లకు ఏడేళ్లపాటు ఆదాయం డొంకేశ్వర్(ఆర్మూర్): రుణాలు పొందుతూ వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా సంఘాలు ఇప్పుడు రవాణా రంగంలోకి కూడా అడుగు పెట్టాయి. ప్రభుత్వ చేయూతకు వారి సొంత నిధులను జోడించి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇస్తున్నాయి. ఒక్కో బస్సుకు రూ.36 లక్షలు వెచ్చించడానికి జిల్లాలో 28 మండల సమాఖ్యలు ముందుకు వచ్చాయి. ఇప్పటి వరకు రెండు విడతల్లో 18 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించారు. మిగతా 10బస్సులను కూడా జక్రాన్పల్లి, మెండోరా, ఏర్గట్ల, ముప్కాల్, మోర్తాడ్, నవీపేట్, మాక్లూర్, మోపాల్, బోధన్, నందిపేట్ మండల సమాఖ్యలు కొనుగోలు చేసే పనిలో ఉన్నాయి. అయితే ఆదాయ మార్గాల కోసం వెతుక్కుంటూ ధైర్యంగా పెద్ద పెట్టుబడులు పెట్టడం నారీ శక్తికి నిదర్శనమనే చెప్పొచ్చు. ఏడేళ్ల పాటు నిలకడైన ఆదాయం జిల్లాలో ప్రతి మండల సమాఖ్య ఒక బస్సును కొనుగోలు చేస్తోంది. ఒక బస్సుకు రూ.36 లక్షల ఖర్చు అవుతుండగా మండల సమాఖ్యలు తమ వద్ద ఉన్న సొంత నిధుల్లో రూ.6 లక్షలు వినియోగిస్తున్నాయి. మిగిలిన రూ.30 లక్షలను ప్రభుత్వం కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సీఐఎఫ్) కింద మంజూరు చేస్తోంది. ఈ పెట్టుబడి ద్వారా మండల సమాఖ్యలకు నిలకడైన ఆదాయం లభించనుంది. ఒప్పందంలో భాగంగా ఒక్కో బస్సుకు ప్రతి నెలా రూ.69,486 చొప్పున ఆర్టీసీ అద్దె చెల్లించనున్నది. ఈ ఆదాయం ఏడేళ్ల పాటు మండల సమాఖ్యలకు అందుతుంది. తద్వారా ఎంఎస్లు మరింత బలోపేత కావడంతోపాటు మహిళల్లో వ్యాపార నైపుణ్యాలు పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్ని, చందూర్, మోస్రా,రుద్రూర్, కోటగిరి, ఎ డపల్లి,ఆర్మూర్,బాల్కొండ, వేల్పూర్, రెంజల్, భీమ్గల్, ధర్పల్లి, బోధన్, ఇందల్వాయి, నిజామాబాద్రూరల్, డిచ్పల్లి, సిరికొండ, కమ్మర్పల్లి మండల సమాఖ్యలు పెట్టుబడి పెట్టి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వడం చాలా గర్వకారణం. ఇది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు మ హిళా శక్తికి నిదర్శనం. ఆ ర్టీసీ నుంచి వచ్చే ఆదాయంతో మండల సమాఖ్య లు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నాం. – సాయన్న, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి -
నామినేటెడ్ పదవుల కోసం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ నడుస్తుందన్న నేపథ్యంలో అవకాశాలు దక్కించుకునేందుకు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమ ప్రయత్నాలను మరోసారి ముమ్మరం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మకాం వేసి కీలక నేతలను కలుస్తూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు కచ్చితంగా అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. రెండున్నరేళ్లుగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకులు ఇప్పుడు సాధించకపోతే తరువాత సాధించడం కష్టమని భావిస్తున్నారు. దీంతో నామినేటెడ్ చాన్స్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, ఉమ్మడి జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్రెడ్డి ఆ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులతో కలిసి 15 కార్లలో హైదరాబాద్ వెళ్లి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డిని కలిసి నామినేటెడ్ పదవి అవకాశం కల్పించాలని కోరారు. మార చంద్రమోహన్ వెంట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి, అన్ని మండలాల్లోని సర్పంచ్లు, మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్చైర్మన్లు, డైరక్టర్లు, బ్లాక్, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర సీనియర్ నాయకులు ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో తనకు కచ్చితంగా రాష్ట్ర కార్పొరేషన్ పదవి వస్తుందనే ధీమాతో చంద్రమోహన్రెడ్డి ఉన్నారు. ● నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత బాడ్సి శేఖర్గౌడ్కు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఖాయమైనట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం సైతం బీసీ కోటాలో శేఖర్గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. తరువాత డాక్టర్ భూపతిరెడ్డికి మద్దతుగా ఆయన గెలుపు కోసం కృషి చేశారు. శేఖర్గౌడ్కు రాష్ట్ర కార్పొరేషన్ పదవి కేటాయించే విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్తో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సైతం పూర్తి దన్నుగా నలవడం గమనార్హం. దీంతో శేఖర్గౌడ్ పదవికి సంబంధించి రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలుస్తోంది. బాడ్సి శేఖర్గౌడ్ ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్న అధికార పార్టీ సీనియర్లు బాడ్సి శేఖర్గౌడ్కు రాష్ట్ర కార్పొరేషన్ పదవి! మార చంద్రమోహన్రెడ్డికి సైతం కార్పొరేషన్ చాన్స్! -
బంగారు దుకాణాదారులు అప్రమత్తంగా ఉండాలి
● ఏసీపీ శ్రీనివాస్బోధన్టౌన్(బోధన్): పట్టణ పరిఽధిలోని బంగా రు దుకాణాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. పట్ట ణ పోలీస్ స్టేషన్లో జ్యువెలరీ దుకాణాల యజమానులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కరీంనగర్లోని జ్యువెలరీ దుకాణంలో జరిగిన చోరీ తీరును వివరించారు. ఎవరైన కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానితులుగా అ నిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇ వ్వాలన్నారు. దుకాణాల లోపల, బయట సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, అలారం సిస్టమ్తోపాటు రాత్రివేళలో వాచ్మన్ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో పట్టణ సీఐ వెంకటనారాయణ, ఎస్సై భాస్కర్ చారీ పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడ మిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జి ల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 29 పరీక్షా కేంద్రా ల్లో 2,286 మంది విద్యార్థులకుగాను 2,154 మంది విద్యార్థులు హాజరు కాగా 132 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఉదయం నిర్వహించి న ఆరో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షకు 2,143 మంది విద్యార్థులకు గాను 2,031 మంది హా జరు కాగా 112 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే మ ధ్యాహ్నం నిర్వహించిన మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 143 మంది విద్యార్థులకుగాను 123 మంది హాజరు కాగా 20 మంది గైర్హాజరైనట్లు చంద్రశేఖర్ వివరించారు. దోమకొండ: ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు లింగుపల్లి గ్రామాల్లో కొనుగొలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.నిర్వాహకులకు సూచనలు ఇచ్చా రు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదు పాయాలు కల్పించాలని, సేకరించిన వడ్లను వెంటవెంటనే రైస్మిల్లులకు తరలించి ట్యాబ్ ఎంట్రీ పూర్తిచేయలని సూచించారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, ఆర్ఐ కిష్టయ్య, సొసైటీ కార్యదర్శి బాల్రెడ్డి తదితరులున్నారు. -
కూరగాయలతో కాలభైరవుడికి అలంకారం
రామారెడ్డి (ఎల్లారెడ్డి): ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి(రామారెడ్డి) శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో వై శాఖ మాసం మూడో మంగళవారం పురస్కరించుకు ని పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని 108 రకాల కూరగాయలతో అత్యంత రమణీయంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారికి జలాభిషేకాలు, సింధూర పూజలు నిర్వహించారు. మధ్యా హ్నం భజన కార్యక్రమాల అనంతరం, కూరగాయలతో అలంకరించిన స్వామివారికి ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. -
తెయూ భూములను రక్షించుకుంటాం
● సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల స్ఫూర్తితో ఐక్యంగా ఉద్యమిద్దాం ● జిల్లాకేంద్రంలో వామపక్ష సంఘాల రౌండ్టేబుల్ సమావేశం ఖలీల్వాడి: తెలంగాణ యూనివర్సిటీ భూములను రక్షించుకుంటామని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నా యకులు అన్నారు. సెలవు రోజుల్లో విద్యార్థులు లే ని సమయంలో యూనివర్సిటీ భూములను బదిలీ చేయడం కుట్రగా కనిపిస్తుందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముకోవాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు, ప్రజలు ఉద్య మాలతో బుద్ధి చెప్పారన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. నగరంలోని ఆ ర్ఆండ్బీ గెస్ట్హౌస్లో మంగళవారం పీడీఎస్యూ, టీయూసీఐ, పీఓడబ్ల్యూ, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ అధ్యక్షత వహించారు. సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాలకు పైగా భూ మిని మరో యూనివర్సిటీకి చెందిన కాలేజీకి ఇవ్వ డం సరైన నిర్ణయం కాదన్నారు. ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ భూములు తరచూ కబ్జాలకు గురవుతున్నాయన్నారు. యూనివర్సిటీ భూముల పై సర్వే నిర్వహించి, రక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ కాలేజీ కోసం అన్ని రకాల సౌకర్యాలతో జక్రాన్పల్లి మండలంలో భూములు ఉన్నాయన్నారు. అక్కడ ఏర్పాటు చేస్తే జిల్లా రైతాంగానికి, విద్యార్థులకు ఉపయోగకరమన్నారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ యూనివర్సిటీని సాధించుకున్నామని, యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం మరోసారి ఐక్య పోరాటాలకు సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. ఆయా సంఘాల ప్ర తినిధులు గణేష్, అనిల్ కుమార్, విగ్నేష్, శ్రీశైలం, గోపాల్, శ్రీధర్, సుజాత, శివరాజ్ పాల్గొన్నారు. -
జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు
● పాఠశాలల పున:ప్రారంభం రోజే పంపిణీ ● ఈనెల 15 నుంచి బడులకు సరఫరాజిల్లాలోని పాఠశాలలు 1193 వచ్చిన పాఠ్యపుస్తకాలు 6,05,950 రావాల్సినవి.. 86,700 నేరుగా పాఠశాలలకే..ఖలీల్వాడి: ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బడుల్లో మౌలిక వసతులపై దృష్టి సారించింది. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్లను బడుల ప్రారంభం రోజు విద్యార్థులకు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే 80 శాతం పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోదాముకు చేరాయి. ఈనెల 15 నుంచి జిల్లాలోని మండల పాయింట్లకు చేర్చేలా అధికారులు చర్య లు చేపడుతున్నారు. అయితే పుస్తకాలను మండల పాయింట్కు రవాణా చేసేందుకు నిధులు లేకపోవడంతో అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. జిల్లాలో 769 ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు 132, జిల్లా, మండల పరిషత్ స్కూళ్లు 255, కేజీబీవీలు 27, మోడల్ స్కూళ్లు 10 ఉన్నాయి. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్లు ఉచితంగా పంపిణీ చేస్తారు. 6 లక్షల 92 వేల 650 పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటి వరకు 6 లక్షల 5 వేల 950 పుస్తకాలు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది పాఠ్య పుస్తకాల పంపిణీలో కొంత ఆలస్యమైంది. గతేడాది మాదిరిగా కాకుండా ముందుగానే జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాగా పుస్తకాల పంపిణీకి గడువు సమీపిస్తుండటంతో పూర్తిస్థాయిలో సరఫరా అవుతా యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న మండలాల ఎంఈవోలు గోదాం నుంచి పుస్తకాలను తీసుకెళ్తుండగా, దూర ప్రాంతాల మండలాలకు సకాలంలో సరఫరా చేస్తే విద్యార్థులకు మొదటి రోజే పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. ప్రాథమిక స్థాయి పుస్తకాలు ఇంకా పూరిస్థాయిలో సరఫరా కాలేదు. సకాలంలో పుస్తకాలు పాఠశాలలకు చేరుకుంటే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇబ్బందులు కలగకుండా.. పాఠశాలల పున:ప్రారంభానికి ముందే పు స్తకాలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాకు విడతల వారీగా చేరుకున్నా యి. ఇప్పటి వరకు 6 లక్షల 5 వేల 950 పుస్తకాలు వచ్చాయి. మిగతావి వచ్చిన వెంటనే యూడైస్ ప్ర కారం మండలాల వారీగా పంపుతాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం. పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్జిల్లాకు తెలుగు, ఉర్దూ మీడియం పార్ట్–1 పుస్తకాలు చేరగా.. మొదటి విడతగా జూన్లో పంపిణీ చేయనున్నారు. నాలుగైదు నెలల తర్వాత పార్ట్– 2 పుస్తకాలు రానున్నాయి. తెలుగు, ఉర్దూ ఒకవైపు ఉండగా, ఇంగ్లిష్ మరోవైపు ముద్రించి ఉంటుంది. ఆంగ్ల మాధ్యమం చదివే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కొన్నేళ్లుగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి పుస్తకాలు ఒకేసారి సరఫ రా అవుతాయి. నోట్బుక్లు నేరుగా పాఠశాలలకే సరఫరా కానున్నాయి. -
లెక్క రాలేదు.. సైన్స్ ఎక్కలేదు!
ఖలీల్వాడి: విద్యార్థి జీవితంలో మొదటి టర్నింగ్ పాయింట్గా భావించే పదో తరగతిలో చాలా మంది విద్యార్థులు మ్యాథ్స్లో ఫెయిల్ కావడం చర్చనీయాంశమైంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 24,365 మంది పరీక్షలు రాశారు. 22,961 మంది పాస్ కాగా, 1404 మంది ఫెయిల్ అయ్యారు. అత్యధికంగా మ్యాథ్స్లో 619 మంది, సైన్స్లో 605 మంది అనుత్తీర్ణులు కాగా, తెలుగులో 143 మంది, హిందీలో 13, ఇంగ్లిష్లో 461, సోషల్లో 97 మంది తడబడ్డారు. మాతృభాష తెలుగు కాగా, ఇంగ్లిష్ మీడియంలో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అయినప్పటికీ తెలుగు, ఇంగ్లిష్లో సైతం విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. 11 స్థానాలు కిందకు.. గతేడాదితో పోలిస్తే జిల్లాలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. మూడేళ్లపాటు మెరుగైన స్థానంలో నిలిచినప్పటికీ.. ఈసారి ఫలితాల్లో మాత్రం 11 స్థానాలు కిందకు పడిపోయి రాష్ట్రస్థాయిలో 27వ స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలనే సంకల్పంతో డీఈవో పార్శి అశోక్ ఆధ్వర్యంలో విద్యాశాఖ స్పెషల్ క్లాస్లు ఏర్పాటు చేసి పాఠశాలలను నిరంతరం పర్యవేక్షించింది. హెచ్ఎంలు, ఎంఈవోలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. డిసెంబర్లో సిలబస్ పూర్తి చేయించారు. దీంతో ముందుగానే రివిజన్ మొదలు పెట్టేందుకు అవకాశం ఏర్పడింది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు విద్యార్థుల హాజరు, సబ్జెక్టుల వారీగా రిపోర్టులు పరిశీలిస్తూ వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఈ పాఠశాలల నుంచి 1345 మంది పరీక్షలు రాయగా.. 982 మంది, ఎయిడెడ్ స్కూళ్ల నుంచి 503 మందికిగాను 457 మంది, జిల్లా పరిషత్ పాఠశాలల నుంచి 8,130 మందికి గాను 7521 మంది, ఆశ్రమ పాఠశాలల నుంచి 71 మందికి గాను 69 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే బీసీ వెల్ఫేర్ నుంచి 801 మందికి గాను 801, కేజీబీవీల నుంచి 1040 మందికి గాను 1018 మంది, మోడల్ స్కూళ్ల నుంచి 856 మందికి గాను 832 మంది, రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి 216 మందికి గాను 216 మంది, మైనార్టీ రెన్సిడెన్షియల్ నుంచి 659 మందికి గాను 646 మంది, సోషల్వేల్పేర్ రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి 624 మందికి గాను 610 మంది, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ నుంచి 113 మందికి గాను 113 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వంద శాతం ఉత్తీర్ణత జిల్లాలో 15 కేజీబీవీలు, 13 బీసీ వేల్పేర్ పాఠశాలలు(జిల్లాలో ఉన్నవి), ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల, మోడల్ స్కూళ్లు ఒక్కొక్కటి చొప్పున, 97 ప్రయివేట్ స్కూళ్లు, మూడు రెసిడెన్షియల్ స్కూళ్లు, 10 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, 6 సోషల్వేల్పేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, రెండు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్, 108 జిల్లా పరిషత్ హైస్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. పది ఫలితాల్లో విద్యార్థుల పరిస్థితి జిల్లాలో 1404 మంది ఫెయిల్ అత్యధికంగా మ్యాథ్స్లో 619 మంది.. సైన్స్లో 605 మంది అనుత్తీర్ణత మండలాల్లో మెరుగుపడిన రిజల్ట్ -
బీజేపీ శ్రేణుల్లో జోష్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీ ఘనవిజయం సాధించడంతో జిల్లాలోని ఆ పార్టీ శ్రేణులు జోష్లో ఉన్నారు. గతంలో భారతీయ జనసంఘ్గా ఉన్న బీజేపీ సిద్ధాంత కర్త అయి న డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం బెంగాల్లో ఇంతటి భారీ విజయం సాధించడంపై పార్టీ నాయకులు, కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. మొదటిసారి బెంగాల్లో ఘనవిజయం సాధించడం, అసోంలో తిరిగి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం, పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంతో జిల్లా కేంద్రంలోని నిఖిల్సాయి చౌరస్తాలో పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. క్లిష్టమైన బెంగాల్లోనే ప్రభుత్వం సాధించిన తమకు తెలంగాణను గెలుచుకోవడం తేలికేనని నాయకులు చెబుతుండడం గమనార్హం. ఈ ఎన్నికలు పూర్తి కావడంతోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10న హైదరాబాద్లోని పరేడ్గ్రౌండ్లో రాష్ట్రప్రభుత్వ అసమర్థత విషయమై భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీన్నిబట్టే ఇక తెలంగాణపై పార్టీ అగ్రనాయకత్వం కచ్చితమైన ఫోకస్ చేసినట్లు నాయకులు చెబుతున్నారు. తెలంగాణలోనూ బెంగాల్ మాదిరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పేర్కొంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్.. ఎంపీ ధర్మపురి అర్వింద్2028లో జరుగనున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా మా పార్టీ ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి మోదీ ఈ నెల 10న హైదరాబాద్లో పరేడ్గ్రౌండ్లో బహిరంగ సభకు రానున్నారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పునాది వేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ వస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ప్రధాని ఇక్కడకు అడుగుపెడుతుండడం అంటేనే పక్కా రాజకీయ యాత్రనే. కేసీఆర్ది ముగిసిన కథ. రేవంత్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. రాష్ట్రంలో వచ్చేది మా ప్రభుత్వమే. పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిల్లో విజయంతో ఉత్సాహం ఇక తెలంగాణే లక్ష్యం అంటున్న ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్ ఈ నెల 10న హైదరాబాద్లో బహిరంగ సభపై ఫోకస్ -
ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి
● కొనుగోలు కేంద్రాల నుంచి బస్తాలను తరలించాలి ● ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం ● వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు నిజామాబాద్ అర్బన్: ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు జిల్లా యంత్రాంగానికి సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ధాన్యం సేకరణ అంశంపై మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాబోయే ఐదు రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సేకరించిన ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలను తక్షణమే కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులు, గోదాములకు తరలించాలని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తగిన సంఖ్యలో టార్పాలినన్లు అందుబాటులో ఉంచాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా కొనుగోలు కేంద్రాల బాధ్యులు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. అకాల వర్షాల సమయంలో పీపీసీల వద్ద 24 గంటలు పర్యవేక్షణ కొనసాగించాలని, అత్యవసర తరలింపుల కోసం తగిన సిబ్బంది, వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజనూ కొనేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. వీసీలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయన్న, డీసీవో శ్రీనివాస్, డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం ప్రవీణ్, డీసీవో శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ అధికారి గంగవ్వ తదితరులు పాల్గొన్నారు. -
బెంగాల్లో అరాచక పాలనకు ముగింపు
● ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణబెంగాల్లో మమతా బెనర్జీ అరాచక పాలనకు ప్రజలు ముగింపు పలికారు. అసోం, పుదుచ్చేరిలోనూ బీజేపీ గెలవడం మంచి పరిణామం. బెంగాల్లో మాత్రం బీజేపీ చరిత్ర సృష్టించింది. ఊహించిన దానికంటే భారీ మెజారిటీ దక్కించుకోవడం సంతోషకరం. బెంగాల్ ప్రజలు భయం, అవినీతి, అశాంతి పై తిరుగుబాటు చేసి.. అభివృద్ధి, పారదర్శకత, భద్రతను కోరుకున్నారు. ఈ తీర్పుతో దేశ రాజకీయాల్లో సరికొత్త దిశ మొదలైంది. రాను న్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. ప్రస్తుత ఫలితాలు ప్రజల ఆలోచన విధానా న్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లోనూ ఉనికి కోల్పోయింది. అసోంలో మరోసారి అభివృద్ధికి పట్టం కట్టారు. -
నేల ఆరోగ్య రక్షణతో సాగు లాభదాయకం
బోధన్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతు వారోత్సవాలు’ సోమ వారం ప్రారంభమయ్యాయి. ఎడపల్లిలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. ఆ ర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ఇచ్చిన వాగ్ధానాల మేరకు రాష్ట్ర ప్రభు త్వం రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు పంటల సాగు విధానాలను అవలంబించాలని, నేల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇ వ్వాలని సూచించారు. రైతు సంక్షేమానికి ప్ర భుత్వం కట్టుబడి ఉందన్నారు. సాలూర మండలంలోని హున్సాలో నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారిణి శ్వేత మాట్లాడారు. నేల ఆరోగ్య రక్షణ, సమగ్ర ఎరువుల యాజమాన్యం పద్ధతు లను వివరిస్తూ నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుతామని రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. సాలూర మండల కేంద్రంలో, జాడిజమాల్పూర్ రైతు వేదిక భవనంలో రైతు వారోత్సవాలను నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్లు, ఏఈవోలు, నాయకులు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ జిల్లాలో రైతు వారోత్సవాలు ప్రారంభం -
చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం
● రైతులు ఆందోళన చెందవద్దు ● డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్): కాంగ్రెస్ రైతు ప్రభుత్వమని, జిల్లాలో యాసంగి సీజన్లో పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్స్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తూ మోసం చేస్తున్నాయని, వారి మాయమాటలను రైతులు నమ్మవద్దని సూచించారు. జిల్లాలో సన్నరకం వడ్లతోపాటు దొడ్డు రకం వడ్లను సాగు చేశారని, కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడంతోనే దొడ్డు వడ్ల కొనుగోళ్లలో ఆలస్యం జరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డిలు కలెక్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 4.35 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, 737 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బోధన్ ప్రాంతాల్లో 32 మొక్కజొన్న కేంద్రాలనూ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే రైతుల వద్దకే కాంగ్రెస్ నాయకులు వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారని తెలిపారు. రైతులకు ధాన్యం డబ్బులు రోజూ సుమారు రూ.70 కోట్ల వరకు ఖాతాల్లో జమచేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం వేగవంతంగా పనిచేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం మానుకోవాలని నగేష్ రెడ్డి హితవు పలికారు. సమావేశంలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, డీసీసీ ఉపాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిన్నోల్ల నర్సయ్య, కార్యదర్శి డాక్టర్ షాదుల్లా, సర్పంచుల ఫోరం రూరల్ అధ్యక్షుడు గొట్టిపాటి వాసుబాబు, నాయకులు న్యాస రాజేశ్వర్, సాయిలు, రాజారాం, దాసు, వేణు తదితరులు పాల్గొన్నారు. -
పశువుల పాకలోకి దూసుకెళ్లిన కారు
● మూడు గేదెలు మృతి, ఆరుగురికి గాయాలు ● ఉప్పల్వాయిలో ఘటన రామారెడ్డి: కారు అదుపుతప్పి పశువుల పాకలోకి దూసుకెళ్లిన ఘటన మండల పరిధిలోని ఉప్పల్వాయి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రామారెడ్డి ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలంలోని సోమారంపేట నుంచి కారులో గంగవత్ సుభాష్తోపాటు మరో ఐదుగురు వ్యక్తులు గాంధారి వైపు వెళ్తున్నారు. ఉప్పల్వాయి గ్రామంలోకి రాగానే కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పశువుల పాకలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఘటనలో మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకటి తీవ్రంగా గాయపడింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి. బాధితుడు జింగిటి రాజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలి
● వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి ● డీఎంహెచ్వో రాజశ్రీ సుభాష్నగర్: వైద్య, ఆరోగ్యశాఖలోని అధికారులు సమయపాలన పాటిస్తూ, క్షేత్రస్థాయిలో సిబ్బంది, ఉద్యోగులు సైతం పాటించేలా చూడాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం అధికారులు, ఇతర అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఆమె సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ ఆరోగ్య ఉప కేంద్రాలు, పీహెచ్సీ స్థాయిల్లో రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగే జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్వోలు హాజరుకావాలన్నారు. ఆరోగ్య ఉపకేంద్రాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. హెచ్పీవీ వ్యాక్సినేషన్ ఇంకా ప్రారంభించని మాలపల్లి, సాలూర, పెగడాపల్లి, రాకాసిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అర్హులైన బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి టీకాలు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో 13 మీజిల్స్ రూబెల్లా కేసులు కొత్తగా నమోదయ్యాయని, సర్వే నిర్వహించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. కిశోర బాలికలకు జూన్ 10 వరకు స్నేహ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సహాయంతో చేపట్టే వేసవికాల శిబిరాల్లో భాగంగా ఆరోగ్య అవగాహన, చికిత్స కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. లక్ష్యాలు చేరని, విధులపై నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్కు తరలివచ్చిన ఫిర్యాదుదారులు
సుభాష్నగర్/ నిజామాబాద్ అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. భూమి బదలాయింపుని వెనక్కి తీసుకోవాలి తెలంగాణ యూనివర్సిటీలో వ్యవసాయ కళాశాలకు కేటాయించిన 100 ఎకరాల భూమి బద్దలాయింపును వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఎం మాస్లైన్, పీడీఎస్యూ, టీయూసీఐ, పీవోడబ్ల్యూ, పీవైఎల్ సంఘాలు డిమాండ్ చేశాయి. వ్యవసాయ కళాశాలకు ఇతర ప్రభుత్వ భూమిని కేటాయించాలని ప్రజావాణిలో కలెక్టర్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు నరేందర్, వెంకన్న, రాజేశ్వర్, రాజన్న, భూమేశ్వర్, సుధాకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పురుగుల మందు డబ్బాతో.. ఆలూరు మండలం డీకంపల్లి గ్రామానికి చెందిన బాధితులు ప్రజావాణికి పురుగుల మందు డబ్బాతో వచ్చారు. డీకంపల్లి గ్రామానికి చెందిన చిన్మల నల్ల కుటుంబాన్ని 2022లో గ్రామస్తులు బహిష్కరించారని, అప్పటి నుంచి తమకు గ్రామంలో ఎవరూ సహకరించడం లేదని బాధితురాలు పేర్కొంది. అవమానంతో తన బావ కూడా చనిపోయినట్లు తెలిపారు. ఈ విషయమై మాక్లూర్ పోలీస్స్టేషన్తోపాటు కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. అయినా తమకు న్యాయం జరగడం లేదని తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే ఉన్న పోలీసులు ఆమె చేతిలోని పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడించి అక్కడి నుంచి పంపించి వేశారు. -
‘వ్యవసాయ కళాశాల జక్రాన్పల్లిలో ఏర్పాటు చేయండి’
సుభాష్నగర్: జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వ్యవ సాయ కళాశాలను జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ముస్కు సాయిరెడ్డి (మునిపల్లి) కోరారు. ఈ మేరకు జక్రాన్పల్లి మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ.. జక్రాన్పల్లిలో 800 ఎకరాల సారవంతమైన ఎర్ర నేల, భూగ ర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. జాతీయ రహదారికి అతి సమీపంలో ప్రభుత్వ భూమి ఉందని, కళాశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్నారు. వాణిజ్య పంటలైన పసుపు, ఎర్రజొన్నలు, సజ్జలు, వరి, మొక్కజొన్న, ఇతర అంతర పంటలు కూడా పండిస్తూ మండలం దేశ వ్యవసాయ చరిత్రలోనే ఎంతో పేరుగాంచిందని తెలిపారు. వ్యవసాయ కళాశాలను జక్రాన్పల్లిలోనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. -
ఉద్యాన పంటలతో ఆర్థిక పరిపుష్టి
నేడు అంకాపూర్లో..ఆర్మూర్: సాంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా ఉద్యాన పంటలను పండించడం ద్వారా రైతులు శ్రమను తగ్గించుకొని ఆర్థిక పరిపుష్టి పొందవచ్చని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతమైన జిల్లాలో రైతులను ఉద్యాన పంటలవైపు ప్రోత్సహిస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ఉద్యాన శాఖ తోడ్పాటును అందిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వర్షా కాలంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 800 ఎకరాల్లో, ఎండా కాలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో కూరగాయల పంటలను రైతులు పండిస్తున్నారు. అందులో భాగంగా తీగ బీర (బీర, కాకర, దొండ, పొట్లకాయ, సొరకాయ) వంటి కూరగాయల పెంపకం కోసం పందిరి సాగు చేసుకోవాలనుకొనే రైతులకు 50 శాతం రాయితీని అందిస్తున్నారు. ఒక్క రైతు కనీసం అర ఎకరం సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అర ఎకరానికి ఉద్యాన శాఖ గరిష్టంగా రూ.50 వేలకు మించకుండా రాయితీని అందజేస్తుంది. అదేవిధంగా టమాట, వంగ, మిరప నారును జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్ట్సెన్స్ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేస్తున్నారు. ఎకరానికి ఎనిమిది వేల మొక్కలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కో రైతు రెండున్నర ఎకరాల్లో కూరగాయ పంటను సాగు చేసేందుకు నారు తీసుకోవచ్చు. అదేవిధంగా ఉద్యాన పంటలో వేసుకొనే మల్చింగ్ (కప్పు) కోసం 50 శాతం రాయితీ అంటే ఎకరానికి రూ.6400 రాయితీని రైతులకు అందిస్తున్నారు. ఒక్కో రైతు ఐదు ఎకరాల్లో పంట పైన కప్పు కోసం రాయితీ తీసుకోవచ్చు. ఇక మామిడి, జామ, సీతాఫలం, పపాయ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్ల తోటలు, బంతి, చామంతి, గల్లార్డియా వంటి ఇతర పూల తోటల సాగును ప్రోత్సహించడానికి ఉద్యాన శాఖ 40 శాతం రాయితీని అందజేస్తుంది. ఒక్కో రైతు గరిష్టంగా ఐదు ఎకరాల్లో పంట పండించడానికి రాయితీని పొందవచ్చు. ఆయిల్ పామ్ సాగుతో లాభాల బాట జిల్లాలో ఇప్పటి వరకు 6,206 ఎకరాల్లో ఆయిల్ పామ్ను సాగు చేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోనే 620 మంది రైతులు 1,343 ఎకరాల్లో ఆయిల్ పామ్ను సాగు చేస్తున్నారు. సంప్రదాయ పంటలతోపాటు అదనపు ఆదాయాన్ని పొందాలనుకొనే రైతులు కూరగాయలు, పండ్లు, పూల తోటలను సైతం పెంచడానికి ఉద్యాన శాఖ తోడ్పాటును అందిస్తోంది. ఆసక్తి గల రైతులు అదనపు సమాచారం కోసం 89777 13980 నంబర్ను సంప్రదించాలి. – సంధ్యారాణి, హార్టికల్చర్ ఆఫీసర్, ఆర్మూర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికా రులు రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఆర్మూర్ మండలం అంకాపూర్లోని గురడిరెడ్డి రైతు సంఘంలో ఉద యం 8 గంటలకు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్, కూరగాయలు, పండ్లు, పూల తోటలు పండించే రైతులకు ఉద్యాన శాఖ (హార్టికల్చర్) అధికారులు అందించే రాయితీలను గురించి వివరించనున్నారు. పందిరి నిర్మాణానికి రాయితీలు సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు నేడు అంకాపూర్లో రైతులకు అవగాహన సదస్సు -
రోడ్డెక్కిన రైతులు
● లారీలు రావడం లేదని డిచ్పల్లి మండలం ధర్మారం(బీ)లో.. ● దొడ్డు ధాన్యం తీసుకోవడం లేదని మోర్తాడ్లో రాస్తారోకోడిచ్పల్లి/మోర్తాడ్: ధాన్యం తరలించేందుకు లారీ లు రావడం లేదని, దొడ్డు ధాన్యం కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు రోడ్లెక్కారు. ధాన్యం కాంటా చేసి వారం రోజులవుతున్నా లారీలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని డిచ్పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామ రైతులు డిచ్పల్లి – నిజామాబాద్ రోడ్డుపై, దొడ్డు ధాన్యం కొనుగోలు చేయడం లేదని మోర్తాడ్ రైతులు మోర్తాడ్ – గాండ్లపేట్ మధ్య జాతీయ రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో రెండు ప్రాంతాల్లో హైవేలపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్లు సతీష్రెడ్డి, కృష్ణ, ఎస్సైలు ఆరీఫ్, రాము రైతుల వద్దకు చేరుకుని వారి మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్లు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. మోర్తాడ్లో సర్పంచ్ భోగ ఆనంద్, వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు గోపిడి సత్యనారాయణ, రఘుపతిరెడ్డి, కొప్పుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరి మృతి బాన్సువాడ రూరల్: మండలంలోని ఇబ్రాహింపేట్ గ్రామానికి చెందిన జెల్ల హన్మాండ్లు (30) ఆదివారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు భార్య సుమలత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువులో చేపలు పడుతుండగా వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటమునిగి ఊపిరాడక మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొ న్నారని సీఐ తుల శ్రీధర్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తంప్రభుత్వఏరియాఆస్పత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ ఒకరు..గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన ఉప్పు సాయిలు(55) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. కుటుంబ కలహాలతో సాయిలు గత నెల 26న తన వ్యవసాయ క్షేత్రం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఈ నెల 2న హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ సాయిలు సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన రాజాహ్మద్ సోమవారం ట్రాక్టర్పై నుంచి పడిపోవడంతో కాలువిరిగినట్లు అంబులెన్సు సిబ్బంది తెలిపారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాత ఇంటికి కూల్చివేస్తూ ఆ మట్టిని ట్రాక్టర్ ద్వారా గ్రామశివారులోని ఓ కుంటలోకి తరలిస్తున్నారు. అయితే, ట్రాక్టర్పై వెళ్లిన రాజాహ్మద్ ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తుల సమాచారం మేరకు క్షతగాత్రుడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
గోశాలలో అగ్ని ప్రమాదం
● 3 వేల గడ్డి కట్టలు దగ్ధం మాక్లూర్ : మండలంలోని వేణుకిసాన్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గాలిబ్నగర్ వద్ద గల శ్రీమన్నారాయణ గోశాలలో సోమవారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పశువుల మేత కోసం ఉంచిన సుమారు 3000 గడ్డి కట్టలు దగ్ధమయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే గోశాలలో ఉన్న గడ్డి కట్టలన్నీ కాలిపోయాయి. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ గోశాల నిర్వాహకుడు మాట్లాడుతూ రైతులు తమకు తోచిన విధంగా గడ్డి కట్టలు దానం చేయాలని కోరారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్ గ్రామంలో వరి కోస్తున్న హార్వెస్టర్కు విద్యుత్ తీగలు తగలడంతో దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. హార్వెస్టర్కు విద్యుత్ తీగలు తగలడంతో గమనించిన డ్రైవర్ చాకచక్యంతో వెంటనే మిషన్ పైనుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, విద్యుత్ తీగలు చేతికందేలా వేలాడుతున్నాయని గతంలో విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వేలాడుతున్న తీగలను వెంటనే సరి చేయాలని కోరుతున్నారు. సిరికొండ: మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఒక బాబుపై జరిగిన దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. సోమవారం ఇద్దరు హిజ్రాలు ఆటోలో వచ్చి తన బాబును గోడకేసి కొట్టినట్లు తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మోపాల్: మండలంలోని మంచిప్పలో ఇటీవల జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై జాడె సుస్మిత సోమవారం తెలిపారు. కోవూరి పద్మ తన ఇంట్లో చోరీ జరిగిందని గత నెల 26న ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన అలకుంట శంకర్ను అనుమానితుడిగా భావించి అదుపులోకి తీసుకొని విచారించారు. తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు, పల్సర్ బైక్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. -
రైతులకు ఇబ్బందులు కలగొద్దు
మోర్తాడ్(బాల్కొండ): రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులను కలెక్ట ర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మోర్తాడ్, దోన్ పాల్లలోని కొనుగోలు కేంద్రాలను సోమవా రం ఆమె పరిశీలించారు. దొడ్డు ధాన్యంలో నూక శాతం ఎక్కువగా వస్తుండడంతో తా ము నష్టపోతున్నామని రైస్ మిల్లర్లు అంటున్నారని, నూకశాతం రాని రకాలు సాగు చేస్తే బాగుంటుందని కలెక్టర్ అక్కడ ఉన్న రైతులతో అన్నారు. వచ్చే సీజన్ నుంచి ఏ రకం సాగు చేయాలో సూచించి రైతులను చైతన్యపరుస్తామన్నారు. దొడ్డు రకాల విషయంలో కొంత సమస్య ఉందని.. పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. తరుగు ఎక్కువ తీస్తున్నారని, లారీల డ్రైవర్లకు ఒక్కో సంచికి రూ.4 చెల్లిస్తున్నామని రైతులు కలెక్టర్కు వివరించగా.. ఆధారాలు చూపితే కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్, సబ్ కలెక్టర్ మాల్వియా తదితరులున్నారు. -
అపోహలు నమ్మొద్దు
● సీపీ సాయిచైతన్య నిజామాబాద్ అర్బన్: పండుగ సమయాల్లో ఎలాంటి అపోహలు నమ్మొద్దని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పేర్కొన్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో సోమవారం తన కార్యాలయంలో మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బక్రీద్ వంటి ముఖ్యమైన పండుగలను పరస్పర గౌరవంతో జరుపుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. ప్రార్థన స్థలాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు, ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో సోమవారం ఒక విద్యార్థి డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 29 పరీక్ష కేంద్రాలలో 7,294 మంది విద్యార్థులకు 6,902 మంది విద్యార్థులు హాజరుకాగా 392 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. కామారెడ్డిలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు తెలిపారు. ఉ దయం జరిగిన నాల్గో సెమిస్టర్ రెగ్యులర్, ఐ దో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 5,340 మంది విద్యార్థులకు 5,070 మంది హాజరుకాగా 270 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన రెండో సెమిస్టర్ రెగ్యులర్, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 1,954 మంది విద్యార్థులకు 1,831 మంది హాజరుకాగా 122 మంది గైర్హాజరయ్యారని చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ జిల్లా కోర్టు పరిపాలనాధికారిగా ఆర్.గోవింద్ రావును నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు పని చేసిన పరిపాలనాధికారి ఎస్.చంద్రమోహన్ను నిర్మల్ జిల్లాకు బదిలీ చేశారు. నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏవోగా ఉన్న గోవింద్ రావు స్థానంలో ఎల్బీ నగర్ నుంచి నరేందర్ బదిలీపై రానున్నారు. మహిళా కోర్టు ఏవోను మేడ్చల్ మల్కాజిగిరికి బదిలీ చేయగా, ఆ స్థానంలో కామారెడ్డి ఏవో మంత్యనాయక్ రానున్నారు. ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వరరావు సుభాష్నగర్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. వర్షం కురుస్తున్నప్పుడు, ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు స్విచ్లు, ప్లగ్లు, ఎలక్ట్రికల్ పరికరాలు ముట్టుకోవద్దని తెలిపారు. నేలపై తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిన స్తంభాలు తాకొద్దని, వెంటనే సమీపంలోని విద్యుత్ సిబ్బందికి, 1912 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. ఇంట్లో లీకేజీ కరెంట్ రాకుండా ఎర్తింగ్, ఈఎల్ఈబీ, ఎంసీబీ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. రైతులు పొలాల్లో మోటార్లకు కేబుల్ జాయింట్లు లేకుండా, సరైన స్టార్టర్లు వాడాలని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లను పశువులను కట్టడానికి ఉపయోగించవద్దని పేర్కొన్నారు. -
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండల కేంద్రానికి చెందిన కార్లం సతీశ్(38) గత కొంత కాలంగా కుటుంబ సమస్యలతోపాటు అనారోగ్యంతో మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. సతీశ్ ఇద్దరు పిల్లలు చిన్న వయస్సులోనే మరణించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆదివారం ఇంట్లోని బెడ్రూమ్లో ఉరేసుకోగా, చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సతీశ్ మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. మృతుడి భార్య రోజా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కడుపునొప్పితో మరొకరు.. మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన నిమ్మలబోయిన భూమయ్య(66) కొన్ని సంవత్సరాలుగా కడుపునొప్పి, అల్సర్తో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చూయించుకున్నా ఆరోగ్యం కుదుటపడలేదు. ఆదివారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న రేకుల షెడ్డులో ఉరేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీర్ఘకాలిక అనారోగ్యం, తీవ్ర నొప్పుల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. మృతుడి కుమారుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అడవుల రక్షణపై ఫోకస్
● ఎకో టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ● నూతన డీఎఫ్వో సిద్ధార్థ్ విక్రమ్సింగ్ డొంకేశ్వర్(ఆర్మూర్): అడవుల రక్షణతోపా టు భూములు ఆక్రమణకు గురికాకుండా స్పెషల్ ఫోకస్ పెడతానని నూతన జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్వో) సిద్ధార్థ్ విక్రమ్సింగ్ అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయానికి వచ్చిన ఆయన బాధ్యతలు చేపట్టారు. సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో అడవుల పరిస్థి తి గురించి విక్రమ్సింగ్ తెలుసుకున్నారు. అడవుల రక్షణకు క్షేత్ర స్థాయిలో నిఘా పెంచుతామన్నారు. ఎస్సారెస్సీ బ్యాక్ వాటర్లో ఎకో టూరిజం, మల్లారం పార్క్ వంటి పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్యను మర్యాద పూర్వకంగా కలిశారు. 2018 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన విక్రమ్సింగ్ ఖమ్మం నుంచి ఇక్కడకు బదిలీపై రాగా, ఇక్కడ డీఎఫ్వోగా పని చేసిన వికాస్మీనా ములుగు జిల్లాకు బదిలీ అయ్యారు.ప్రజావాణికి 103 ఫిర్యాదులు నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 103 ఫి ర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, డీఆర్డీవో సాయన్న, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్కు విన్నవిస్తూ అర్జీలు అందజేశారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాగా, సబ్ కలెక్టర్, ఆర్డీవోల నేతత్వంలో డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీస్ ప్రజావాణికి 38 ఫిర్యాదులు నిజామాబాద్ అర్బన్: పోలీస్ ప్రజావాణిలో భాగంగా సీపీ సాయిచైతన్య ప్రజల నుంచి సోమవారం ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 38 మంది సీపీని కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సీపీ వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాలని ఆదేశించారు. -
రాజకీయమంటే వ్యాపారం కాదు.. పోరాటం
● తెలంగాణ జన సమితి ప్లీనరీని విజయవంతం చేయాలి ● టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సుభాష్నగర్ : రాజకీయ వేదిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటమని, అది డబ్బుతో కొనుగోలు చేసే వ్యాపారం కాదని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ జన సమితి ప్లీనరీ సన్నాహక సమావేశాన్ని జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన కోదండరాంను జిల్లా కమిటీ ఘనంగా స్వాగతం పలికి సన్మానించింది. ఈ సందర్భంగా జిల్లాలో తెలంగాణ జన సమితిని క్షేత్రస్థాయి నుంచి ఎలా బలోపేతం చేయాలనే అంశంపై కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో తెలంగాణ జన సమితి కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. మే 12న తెలంగాణ జన సమితి ప్లీనరీ జరగనుందని, భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం టీజేఎస్ జిల్లా అధ్యక్షుడిగా మహ్మద్ జాఫర్, ప్రధాన కార్యదర్శిగా మర్రి కిరణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
ఆదాయ మార్గాలను అన్వేషించండి..
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీలు ఆర్థి కంగా పటిష్టం కావాలంటే సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషించుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచించింది. పన్ను, పన్నుయేతర ఆదాయం వల్ల పంచాయతీలకు ఆశించినంతగా లబ్ధి జరగకపోవడంతో కొత్త మార్గాల ఎంపికపై దృష్టి సారించేలా సర్పంచ్లు, కార్యదర్శులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(ఎన్ఐఆర్డీ)లో ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల సర్పంచ్లు, కార్యదర్శులకు ఒక రోజు వర్క్షాప్ను శనివారం నిర్వహించారు. జిల్లా నుంచి సర్పంచ్లు భోగ ఆనంద్(మోర్తాడ్), కనకదుర్గ(వర్ని), రేఖ(నవీపేట్), లింగం(నందిపేట్), గాండ్ల రాజేశ్(బాల్కొండ)తోపాటు ఆయా జీపీల కార్యదర్శులు పాల్గొన్నారు. సాధారణంగా పంచాయతీల కు పన్ను, నాన్ట్యాక్స్లతోనే ఆదాయం లభిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కంపోస్టు ఎరువుల తయారీకి ప్రత్యేక షెడ్లను నిర్వహించారు. పంచాయతీ సిబ్బంది తడి, పొడి చెత్తను వేరుగా సేకరించి వర్మి కంపోస్టును ఉత్పత్తి చేసేవారు. కంపోస్టు ఎరువు విక్రయంతో ఆదాయం లభించినప్పటికీ ఆశించిన లక్ష్యం నెరవేరలేదనే అభిప్రాయం ఉంది. గ్రామ పంచాయతీలకు ఉన్న భూములను లీజుకు ఇవ్వడం, అవసరం ఉన్న చోట కాంప్లెక్స్లను నిర్మించి అద్దెకు ఇవ్వడం, వ్యాపార సంస్థలు ప్రచారం కోసం ఏర్పాటు చేసే హోర్డింగ్లకు ట్యాక్స్ వసూలు, ప్లాస్టిక్ రీసైక్లింగ్, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి తదితర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై ఉన్నతాధికారులు అవగాహన కల్పించినట్లు సర్పంచ్లు తెలిపారు. ఒక రోజు నిర్వహించిన వర్క్షాప్లో చర్చించిన అంశాలపై దృష్టి సారిస్తాం. పంచాయతీలకు ఆదాయం పెరిగితే ప్రజలకు ఎన్నో రకాల సౌకర్యాలను మెరుగుపర్చవచ్చు. అనేక పంచాయతీలు ఆదాయ మార్గాల లేక ఇబ్బందులు పడుతున్నాయి. ఆదాయమార్గాలను చూసుకుంటేనే మంచింది. – భోగ ఆనంద్, సర్పంచ్, మోర్తాడ్ గ్రామ పంచాయతీలకు కేంద్ర పంచాయతీరాజ్ సూచన పన్నుతోపాటు ఇతర మార్గాలను ఆదాయం కోసం ఎంచుకోవాలి ఎన్ఆర్డీలో ఆత్మనిర్భర్ పంచాయత్ వర్క్షాప్ పాల్గొన్న ఐదు గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులు -
మున్నూరుకాపు సంఘ అభివృద్ధికి కృషి
సుభాష్నగర్: పంచముఖి మున్నూరుకాపు సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని 6వ డివిజన్ కార్పొరేటర్ గోపిడి స్రవంతిరెడ్డి అన్నారు. నగరంలోని వినాయక్నగర్ పంచముఖి మున్నూరు కాపు సంఘం భవనంలో సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ స్రవంతిరెడ్డితోపాటు పదోన్నతి పొందిన సంఘ సభ్యులు చిట్టి నారాయణరెడ్డి, స్వర్ణలతను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్రవంతిరెడ్డి మాట్లాడు తూ.. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. డివిజన్ అభివృద్ధితోపాటు ఎన్నికల్లో సహకరించిన సంఘాలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఎంపీ అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో మాట్లాడి నిధులు అందేలా చూస్తామన్నారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిద్దె రవికుమార్, పోతన్న, కోశాధికారి రమేష్, గౌరవాధ్యక్షుడు ఆకుల శ్రీశైలం, ముఖ్య సలహాదారుడు చిట్టి నారాయణరెడ్డి, పెద్ద కాపులు ధర్మేందర్, జగదీష్, ముత్యం, సహాయ కార్యదర్శులు పాల్గొన్నారు. -
వృద్ధురాలి హత్య కేసులో నిందితుల అరెస్టు
భిక్కనూరు: వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు భిక్కనూరు సీఐ సంపత్ కుమార్ ఆదివారం తెలిపారు. మెదక్ జిల్లా బచ్చురాజుపల్లి గ్రామానికి చెందిన తొత్తల సుశీల (83)ఏప్రిల్ 29న కాచాపూర్ నుంచి కామారెడ్డికి వెళ్తానని చెప్పి అదృశ్యమైన విషయమై భిక్కనూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అయితే, సుశీల రాజంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడిని కలిసి చికిత్స చేయించుకునేందుకు వెళ్లింది. ఆస్పత్రి వద్ద సుశీలకు షేర్ శంకర్ తండాకు చెందిన బోక్య బోలి అనే మహిళతో పరిచయమైంది. ఇద్దరూ కలిసి కల్లు దుకాణంలోకి వెళ్లి కల్లు సేవించారు. అదే సమయంలో రాజంపేటకు చెందిన బస్వయ్య అక్కడికి వచ్చి వీరితో మాట్లాడారు. అనంతరం ముగ్గురు కలిసి సమీపంలోని వ్యవసాయబావి వద్దకు వెళ్లి అక్కడ సైతం మద్యం సేవించారు. ఆ తర్వాత సుశీల చేతులకు ఉన్న రెండు వెండి కడియాలు, మూడు వెండి గాజులు లాక్కొని ఆమెను బావిలోకి తోశారు. రాజంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రి, వైన్షాపుల వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా సుశీలతో బోక్యబోలి, బసవయ్య ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తామే బావిలో పడేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు బావి వద్దకు వెళ్లి సుశీల మృతదేహాన్ని బయటికి తీశారు. నిందితుల నుంచి మూడు వెండి గాజులు, రెండు వెండి కడియాలు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సంపత్కుమార్ తెలిపారు. ఆయన వెంట ఎస్సైలు ఆంజనేయులు, రాజు ఉన్నారు. కామారెడ్డి క్రైం: ఆర్థిక సమస్యలు వెన్నాడటంతో మనస్తాపానికి గురైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీ పాత ఎస్పీఆర్ పాఠశాల సమీపంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాస్(43) అనే వ్యక్తి గాంధారి మండలం పేట్ సంగెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధు లు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే మూ డు రోజుల క్రితం తన భార్య, ఇద్దరు పిల్లలను పోచంపాడ్లోని అత్తగారింటికి పంపించి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నా రు. శనివారం సాయంత్రం శ్రీ నివాస్ ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో గమనించిన స్థానికులు దేవునిపల్లి పోలీసులకు స మాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని తలుపులు తెరిచి చూడగా, శ్రీనివాస్ ఇంట్లో ఉరేసుకొని విగతజీవిగా కనిపించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో రెండు, మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గాంధారిలో యువకుడి .. గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్ర శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకొని గుర్జాల్ గ్రామానికి చెందిన మంగళారం శ్రీకాంత్(24) మృతి చెందినట్లు గ్రామస్తు లు తెలిపారు. యువకుడి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఎస్సై మహేందర్ను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని దేమికలాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేమికలాన్ ఉన్నత పాఠశాలలో 2006–2007 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు 19 సంవత్సరాల అనంతరం కలుసుకున్నారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని, ప్రస్తుతం ఏం చేస్తున్నారో ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. తాండూర్లో.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని తాండూర్ హైస్కూల్లో ఆదివారం 2011–12 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 14 సంవత్సరాల తర్వాత కలుకున్న మిత్రులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. -
కొలువు నిలిచేది!
విద్యా సంవత్సరం అంతా పాఠాలు చెబుతూ అలసిపోయిన ప్రైవేట్ టీచర్లు మండుటెండలను లెక్క చేయకుండా రోడ్లెక్కారు. యాజమాన్యాలు అడ్మిషన్లు తీసుకురావాల్సిందేనని టార్గెట్లు పెట్టడంతో ఉద్యోగభద్రత కోసం నానాపాట్లు పడుతున్నారు. కరపత్రాలు చేతుల్లో పట్టుకుని ప్రతి ఇంటి గుమ్మాన్ని తడుతున్నారు. ఖలీల్వాడి : వేసవి సెలవులంటే స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ టీచర్లకు పండగే. కానీ ప్రైవేట్ స్కూల్ టీచర్లకు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. స్కూల్ ప్రారంభం నుంచి విద్యార్థులకు మంచి మార్కులు, ర్యాంకులు తెప్పించేందుకు నానాతంటాలు పడిన ప్రైవేట్ టీచర్లలకు యాజమాన్యాలు కొత్త టార్గెట్లు ఫిక్స్ చేశాయి. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల బాధ్యత ఇప్పటి నుంచే టీచర్లకు అప్పగించారు. కొన్ని విద్యాసంస్థలైతే కావాల్సిన అడ్మిషన్లు తీసుకురాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కరాఖండీగా చెబుతున్నట్లు తెలిసింది. దీంతో ప్రైవేటు టీచర్లు మండుటెండల్లో కరప త్రాలను పట్టుకొని వీధుల వెంట, విద్యార్థుల ఇంటింటికి అడ్మిషన్ల కోసం తంటాలు పడుతున్నారు. ఏడాదిలో 10 నెలల జీతమే.. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 6,500 పైగా మంది ఉపాధ్యాయులు పని చేస్తుంటే, వీరిలో 70 శాతం మహిళలే ఉన్నారు. అయితే, ప్రభుత్వ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా ప్రైవే టు పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. తక్కువ వేతనాలకే అధిక పనిగంటలతోపాటు సమయానికి జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయనే విమర్శలున్నాయి. తల్లిదండ్రుల వద్ద 12 నెలల ఫీజులు వసూలు చేసి, ఉపాధ్యాయులకు కేవలం 10 నెలల జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు. మరోవైపు ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, ఈపీఎఫ్ లాంటి సౌకర్యాలేమీ కల్పించడం లేదనే విమర్శలున్నాయి. రంగంలోకి విద్యార్థి సంఘాలు ఒక్కో ప్రైవేటు టీచర్కు 5 నుంచి 10 అడ్మిషన్లను యాజమాన్యాలు టార్గెట్ విధిస్తున్నాయని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. టార్గెట్ పూర్తి చేయని టీచర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. కార్పొరేట్ వ్యాపారంగా బోధన రంగం మారుతుందని, టీచర్లపై టార్గెట్ విధించే వారిపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని వి ద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.జిల్లాలో మొత్తం 293 ప్రైవేటు పాఠశాలున్నాయి. ఇందులో సుమారు 1.50 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. నగరంలో కార్పొరేట్ స్కూల్స్ సంఖ్య ప్రతి విద్యా సంవత్సరం పెరుగుతోంది. అయితే, ఇందులో పనిచేసే వారు ఎక్కువగా నార్త్ నుంచి వస్తున్నారు. ప్రిన్సిపాల్తోపాటు వివిధ ఉన్నతస్థాయి పోస్టులను నార్త్ వాళ్లకే ఇస్తున్నారని, కొన్ని పోస్టులు మాత్రమే స్థానికులకు ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో అర్హత ఉన్న స్థానిక అభ్యర్థులు చివరకు ప్రైవేటు స్కూళ్లలో టీచింగ్ చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో కూడా స్థానికులకే అవకాశం ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. -
కేసీఆర్ శకం ముగిసింది
● కాంగ్రెస్ను ఓడించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు.. ● మీడియాతో ఎంపీ అర్వింద్ ధర్మపురిసుభాష్నగర్: మాజీ సీఎం కేసీఆర్ శకం ముగిసిందని, ప్రజలు ఆయన గురించి ఆలోచించడం మా నేశారని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం, కుటుంబం అవినీతి ఊబిలో కూరుకుపోయాయని, ఆయన అవినీతిపై కల్వకుంట్ల కవిత ను అడిగితే చాలా బాగా చెబుతారని ఎద్దేవా చేశా రు. ఈనెల 10న హైదరాబాద్కు మోదీ రానున్న నే పథ్యంలో మండల అధ్యక్షులు, నాయకులతో సన్నా హక సమావేశాన్ని నగరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రభారీ, మా జీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతమ్రావు, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పా ల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారుల లాగే జీవన్రెడ్డి కూడా అధోగ తి పాలుకావాల్సిందేనని ఎద్దేవా చేశారు. సంజయ్ ను కేసీఆర్ ఒక్క మాట కూడా అనడం లేదని, జగిత్యాల ప్రజలు అయోమయంలో ఉన్నారన్నారు. రేవంత్రెడ్డి పార్టీని ఓడించాలని ప్రజలు డిసైడ య్యారని, ఆయనకు పాలనపై పట్టు లేదని విమర్శించారు. పాలనను అస్తవ్యస్తం చేసి ఎన్నికల హా మీలు, గ్యారెంటీలను తుంగలో తొక్కారని విమర్శించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నిజామాబాద్ రూరల్ ఎ మ్మెల్యే అన్ పాపులర్ ఎమ్మెల్యే అయ్యారని ఆరోపించారు. ధాన్యం సేకరణలో జాప్యంపై ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని, ధా న్యం త్వరగా సేకరించాలని డిమాండ్ చేశారు. పసుపు రైతులకు నాలుగేళ్లుగా సగటున రూ. 14వేల ధర వస్తుందంటే కారణం మోదీ అని, సన్నబియ్యం ఇస్తుంది కూడా ఆయనే అని పేర్కొన్నారు. రూ.7800 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. జిల్లా ప్రభారీ శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజ లు విశ్వసిస్తున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, కార్యవర్గసభ్యులు మేడపాటి ప్రకాశ్రెడ్డి, మో హన్రెడ్డి, కంచెట్టి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. -
ఏకచక్రేశ్వర గోశాలలో అగ్ని ప్రమాదం
● 10 వేలకు పైగా ఎండు గడ్డికట్టలు దగ్ధం ● రూ. 8 లక్షల వరకు నష్టం బోధన్రూరల్: పట్టణంలోని ఏకచక్రేశ్వర గోశాలలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో సుమారు 10 వేలకు పైగా ఎండు గడ్డికట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. స్థానికులు, బోధన్ మున్సిపాలిటీ, పోలీసు సిబ్బంది సైతం సహాయక చర్యల్లో పాల్గొని మంటలను ఆర్పేందుకు కృషి చేశారు. గోశాలలోని పశువులను బయటికి తరలించారు. ప్రమాదంతో సుమారు రూ.6 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు నష్టం వాట్లినట్లు ఏకచక్రేశ్వర గోశాల కమిటీ అధ్యక్షుడు నేపాల్ సింగ్ తెలిపారు. ప్రమాదంపై గోశాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇక రాష్ట్రవ్యాప్తం!
కామారెడ్డి ‘సీపీవో’..వచ్చే విద్యాసంవత్సరంనుంచే..రాష్ట్రంలో 4,704 ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లు, 495 కేజీబీవీలు, 194 మోడల్ స్కూళ్లు, 35 సొసైటీ గురుకులాలు, 33 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, 250 ఎయిడెడ్ స్కూళ్లలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను నియమిస్తారు. విద్యార్థుల భద్రత, సంక్షేమం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. విద్యార్థినులు వేధింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది. ఏదైనా సమస్య తలెత్తినపుడు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ విభాగానికి సమాచారం అందించి వారితో కలిసి సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురికాకుండా చూడాల్సి ఉంటుంది. ఎవరైనా ఇబ్బందిపెట్టినట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతో దీన్ని అమలు చేయనున్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పాఠశాలల్లో విద్యార్థులు ముఖ్యంగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారికి రక్షణ కల్పించేందుకు కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అమలు చేసిన చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్(సీపీవో) విధానం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ మోడల్ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని 5,711 ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా నియమించనున్నారు. విద్యార్థులకు సంబంధించిన అన్ని విషయాల్లో సీపీవో ఎలా వ్యవహరించాలన్న దానిపై శిక్షణ ఇవ్వనున్నారు. సీపీవోలకు మరిన్ని బాధ్యతలు.. కామారెడ్డి జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు గత విద్యాసంవత్సరంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఆయా పాఠశాలల్లో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు వివిధ దశల్లో శిక్షణ ఇచ్చారు. జిల్లాలో నాలుగు వందలకుపైగా పాఠశాలల్లో సీపీవోలను నియమించారు. ఇది సత్ఫలితాలు ఇచ్చి బాలికలపై వేధింపులు తగ్గాయి. కామారెడ్డి జిల్లాలో అమలు చేసిన ఈ విధానానికి మరింత మెరుగులుదిద్ది రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సీపీవోకు వివిధ బాధ్యతలు అప్పగించనున్నారు. బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, బాలల హక్కులపై అవగాహన కల్పించడం, లీగల్ లిటరసీ, చైల్డ్ రైట్స్ క్లబ్ల ఏర్పాటు, విద్యార్థులకు న్యాయ సహాయం, కౌన్సిలింగ్ సేవలు, డ్రాపవుట్ పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం వంటి చర్యలు తీసుకుంటారు. విద్యార్థుల రక్షణ కోసం జిల్లాలో గతేడాది ఏర్పాటు సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ మోడల్ను అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు చర్యలు 5,711 హైస్కూళ్లలో టీచర్లకు బాధ్యతలు ఇవ్వనున్న ప్రభుత్వం -
వడదెబ్బతో గుర్తుతెలియని వృద్ధుడు మృతి
డిచ్పల్లి: మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురైన గుర్తుతెలియని వృద్ధుడు(70) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు డిచ్పల్లి ఎస్సై మహమ్మద్ ఆరీఫ్ తెలిపారు. ఏడో బెటాలియన్ సమీపంలోని విక్టరీ హైస్కూల్ దగ్గర వృద్ధుడు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు డిచ్పల్లి ఎస్సై 8712659852, సీఐ 8712659851 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామ శివారులో ఉన్న పెద్దవాగు నుంచి శనివారం అర్ధరాత్రి అక్రమంగా ఇసు క తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. శనివారం రాత్రి పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి పెద్దవాగులో ఆకస్మికంగా తనిఖీలు చేయగా అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. ఇసుక లేదా మొరం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్– 4 ఆధ్వర్యంలో ఆదివారం నీట్ విద్యార్థుల కోసం క్యాంపస్ ఆవరణలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సయ్య మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం, వనరులు అందితే వారు కూడా ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారని తెలిపారు. నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు అవసరమైన సహకారం అందించారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు అనిల్, సమీర్, రాజేందర్, కృష్ణ, ఆకాష్ పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ బంగారు దుకాణంలో దుండగుల కాల్పుల కలకలం నేపథ్యంలో ఆదివారం రూర ల్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అలాగే హోటళ్లను సైతం విస్తృతంగా తనిఖీ చేశారు. వాహనదారుల వివరాలతోపాటు, హోటళ్లలో ఉంటున్న వారి వివరాలు సేకరించారు. ఎస్హెచ్వో శ్రీనివాస్, ఎస్సై షరీఫ్తోపాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి నుంచి దేవాయిపల్లి మీదుగా బ్రాహ్మణపల్లి వరకు ఉన్న రోడ్డు అధ్వాననంగా తయారైంది. ప్రతి రోజూ ఈరోడ్డుపై వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గంలో నిర్మించిన కల్వర్టు కూడా పూర్తిగా ధ్వంసమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరువ తీసుకొని ఈ రోడ్డును బాగు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. -
క్రైం కార్నర్
బీబీపేట: నిర్మాణంలో ఉన్న ఇంటి గోడలకు నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆ ముదాల కిష్టయ్య (73) ఇంట్లోని కొత్త గోడకు మోటార్తో నీళ్లు పట్టి అదే చేతితో ప్లగ్ తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి పడిపోయాడు. కుటుంబ స భ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే కిష్టయ్య మృతి చెందాడు. భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎర్రకుంట తండాకు చెందిన మలావత్ పత్యా(48) ఆదివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పత్యా గత నెల 23న ఆత్మకూర్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీ వ్రంగా గాయపడ్డాడు. మొదట చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమారు 10 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన పత్యా ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. -
బడాపహాడ్ శివారులో లారీ బోల్తా
త్రుటిలో తప్పిన ప్రమాదం వర్ని: మండలంలోని బడాపహాడ్ అటవీ ప్రాంతంలో మక్కల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆదివారం చింతలపేట్లోని కొనుగోలు కేంద్రం నుంచి మక్కలను లోడ్ చేసుకొని జాకోరా సొసైటీకి తరలిస్తుండగా బడాపహాడ్ శివారులో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి లారీ లోయలో పడినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో రోడ్డు పక్కకు లారీని తీసుకువెళ్లడంతో బస్పై పడలేదని, బస్సుపై పడి ఉంటే పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందేవారని పేర్కొన్నారు. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్పగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీలో సుమారు 400 క్వింటాళ్ల వరకు మక్కలు ఉన్నట్లు జాకోర సొసైటీ సీఈవో రామకృష్ణ తెలిపారు. -
ప్రశాంతంగా నీట్
● 107 మంది అభ్యర్థుల గైర్హాజరు ● సెంటర్లను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్, సీపీ ఖలీల్వాడి: జిల్లాలో నీట్(నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులను ఆదివారం ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు సెంటర్లలోకి అనుమతించగా, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగింది. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైనన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కళాశాలలతోపాటు నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల యూజీ బ్లాక్ లోని ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ బ్లాక్, కంఠేశ్వర్లోని పాలిటెక్నిక్ కాలేజీ, బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మాక్లూర్లోని జెడ్పీ హైస్కూల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ వెంట అడ్మిట్ కార్డు, ఐడి ప్రూఫ్, లేటెస్ట్ పాస్పోర్టు సైజ్ ఫోటో తమ వెంట తెచ్చుకుంటేనే లోనికి అనుమతించారు. అనంతరం బయోమెట్రిక్ నమోదు చేశారు. దీంతో వెంట ఫొటోలు తీసుకురాని వారు సమీపంలోని స్టూడియోలకు వెళ్లి ఫొటోలు తీసుకువచ్చారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు పకడ్బందీ నిఘా మధ్య నీట్ కొనసాగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. 3,334 మంది అభ్యర్థులకు గాను 3,227 మంది హాజరుకాగా, 107 మంది గైర్హాజరయ్యారు. గిరిరాజ్ కళాశాల సెంటర్ను సీపీ సాయిచైతన్య, మాక్లూర్లోని సెంటర్ను అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ తనిఖీ చేశారు. టీజీఆర్జేసీ సెట్కు 6,312 మంది..ఖలీల్వాడి: జిల్లాలో టీజీఆర్జేసీ సెట్–2026 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కో ఆర్డినేటర్ ఎన్. గంగాశంకర్ ఆదివారం తెలిపారు. మొత్తం 7,997 మంది అభ్యర్థులకు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 6,312 మంది హాజరయ్యారని, 1,685 మంది గైర్హాజరయ్యారని వివరించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు సమకూర్చి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామన్నారు. జిల్లా ఉన్నతాధికారులు, పోలీసుశాఖ సమన్వయంతో పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసిందని పేర్కొన్నారు. -
భారీ అగ్ని ప్రమాదం
అగ్ని ప్రమాదంలో కాలిపోతున్న దుకాణాలుకామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఆదివారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. 16 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రధాన రహదారి వెంట రేకుల షెడ్డులతో కూడిన దుకాణాలున్నాయి. వాటిలో పూలు, పండ్ల దుకాణాలు, పాన్ షాపులు, టీ పాయింట్లు, సెల్ఫోన్ రిపేర్ లాంటి మొత్తం 16 దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం వేకువజామున దుకాణాల వెనక భాగంలో మంటలు చెలరేగి అక్కడే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు అంటుకున్నాయి. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఆ వరుసలోనే టీ పాయింట్, ఇతర దుకాణాల్లోని మొత్తం 3 సిలిండర్లు పేలిపోయాయి. దీంతో మంటల ఉధృతి పెరిగి మొత్తం దుకాణాలు కాలిబూడి దయ్యాయి. ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. ట్రాన్స్ఫార్మర్ వద్దనున్న చెత్తకు నిప్పంటుకుని గానీ, ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్సర్క్యూట్తో గానీ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. ఆర్డీవో గిరి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. రూ.కోటి వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం లేదు కామారెడ్డి అర్బన్: ఇందిరా చౌక్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి రూ. 15 లక్షల నష్టం జరిగిందని ఎస్ఈ సాలియా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యం, సాంకేతిక లోపం కారణం కాదని పేర్కొన్నారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతవరకు ప్రత్యామ్నాయ లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. కామారెడ్డిలో 16 దుకాణాలు అగ్నికి ఆహుతి.. రూ. కోటి వరకు ఆస్తినష్టం జరిగిందంటున్న బాధితులు రైల్వే స్టేషన్ ఎదురుగా ఘటన -
ఏఎంసీకి కరెంట్ కట్
● రూ.16 లక్షల బకాయిలు.. ● నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్కు విద్యుత్ సరఫరా నిలిపివేత ● ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పునరుద్ధరణసుభాష్నగర్ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎన్పీడీసీఎల్ అధికారులు ఆదివారం వి ద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఆరు నెలలుగా రూ. 16 లక్షల వరకు పేరుకుపోయి బకాయిలను చెల్లించాలని మార్కెట్ కమిటీపై పలుమార్లు ఒత్తిడి తీసుకురావడంతోపాటు నెల రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. దీంతో మార్కెట్ కమిటీ అధికారులు చె క్కులు అందజేసినప్పటికీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పాస్ కాకపోవడంతో బకాయిలు పేరుకుపోయా యి. ఇటు విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిపేసిన విషయాన్ని మార్కెట్ సిబ్బంది చైర్మన్ ముప్ప గంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన మార్కెటింగ్శాఖ డైరెక్టర్కు సమాచారమిచ్చారు. వారు కలెక్టర్తో చర్చించడంతో చైర్మన్ గ్యారెంటీ మీద ఐదు గంటల్లో పునరుద్ధరించారు. ఎన్పీడీసీఎల్ అధికారులు సూచించిన విధంగా చైర్మన్ సోమవారం గ్యారెంటీ లెటర్ ఇవ్వనున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీల్లో ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ను అమల్లోకి తెచ్చింది. దీంతో ఆర్థిక కార్యకలాపాలైనా ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎంట్రీ చేసి ప్రభుత్వం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పంపించాల్సి వస్తోందని, ఈ విధానం కారణంగా తీవ్ర జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చెక్కులు పాస్ కావడంలేదంటున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎల్వోసీ విధానం అమల్లో ఉండగా, ఆర్థికశాఖలో చెక్కులు వెంట వెంటనే క్లియర్ అయ్యేవాని, ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ను కొనసాగించడం వల్లే మార్కెట్ కమిటీల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏఎంసీ చైర్మన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.గంజ్లో ప్రస్తుతం పసుపు,ఆమ్చూర్, ధాన్యం, ఇతర పంట దిగుబడుల క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. మార్కెట్కు మూడు గేట్లు, ప్ర హరీ, 70 వరకు సీసీ కెమెరాలు ఉన్నా.. పలుమార్లు చోరీ ఘటనలు చోటుచేసుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిపేయడంతో సీసీ కెమెరాలు కూడా నిలిచిపోయాయి. -
అగ్గి రేగుతోంది.. బుగ్గి చేస్తోంది
రెంజల్(బోధన్): ఉమ్మడి జిల్లాలో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యుత్ సంబంధిత సమస్యలు, ప్రజల్లో అవగాహన లేమి ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. రైతులు వరి కొయ్యలకు నిప్పంటిస్తుండటంతో మంటలు విస్తరించి చెట్లు, చుట్టు పక్కల పంటలు బూడిదవుతున్నాయి. బీడీ, సిగరేట్ తాగేవారి నిర్లక్ష్యంతో అటవీ ప్రాంతాలు, చెరువు కట్టలు కాలిపోతున్నాయి. తాజాగా ఆదివారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెంజల్ శివారులో ఆదివారం వరి కొయ్యలు కాలుతూ రోడ్డు పక్కన ఆరబెట్టిన ధాన్యం కుప్పకు అంటుకున్నాయి. రైతులు అప్రమత్తం కావడంతో ధాన్యం కుప్పపై కప్పిన బార్దాన్ దగ్ధమవ్వగా, ధాన్యం కాలిపోకుండా మంటలను ఆర్పివేశారు. లారీ గ్యారేజీలో.. బాన్సువాడ: పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఉన్న లారీ బాడీ బిల్డింగ్ గ్యారేజీలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యారేజీలో ఉన్న లారీ బాడీ కట్టెలకు మొదట మంటలు అంటుకొని క్షణాల్లో గ్యారేజీ మొత్తం వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావడంతో స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. పంట ఉత్పత్తులు తరలించిన మరునాడే.. బాన్సువాడ రూరల్: మండలంలోని కోనాపూర్ గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. రైతులు శనివారం తమ పంట ఉత్పత్తులను తరలించగా ఆదివారం మొక్కజొన్న చేన్లకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి మంటలు విస్తరించకుండా ఆర్పివేశారు. స్థానికంగా ఉన్న కోళ్లఫారం వరకు మంటలు విస్తరించడంతో భయాందోళనకు గురైనట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. అవాల్గావ్ చెరువు కట్టకు.. మద్నూర్: మండలంలోని అవాల్గావ్ గ్రామంలోని చెరువు కట్టకు ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. కట్ట గ్రామానికి సమీపంలో ఉండటంతో మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో సర్పంచ్ మన్యాబాయి గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్తో మంటలను ఆర్పివేయించారు. గుర్తు తెలియని వ్యక్తులు పొగ తాగడం ద్వారా ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్తో బట్టల షాపు దగ్ధం ఎల్లారెడ్డి: షార్ట్ సర్క్యూట్తో పట్టణంలోని కనెక్ట్ మెన్స్వేర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యజమాని ఆదివారం దుకాణం తెరిచే సరికి పొగలు రావడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. -
సాగులో శాసీ్త్రయ పద్ధతులను అవలంబించాలి
● యూరియా వాడకం తగ్గించాలి ● శాస్త్రవేత్త సమత పరమేశ్వరి డిచ్పల్లి: వ్యవసాయంలో లాభదాయకత పెంచేందుకు రైతులు శాసీ్త్రయ పద్ధతులను అనుసరించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ వై.సమత పరమేశ్వరి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం డిచ్పల్లి మండలం బర్ధిపూర్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేశ్వరి మాట్లాడుతూ.. యూరియా వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించాలని సూచించారు. అవసరానికి మించి యూరియా వాడటం వల్ల నేలలోని సహజ పోషకాలు దెబ్బతిని, పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అవగాహన కల్పించారు. సమతుల్య ఎరువుల వినియోగం ద్వారా సాగు ఖర్చులను తగ్గించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించాలన్నారు. అనంతరం కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. సర్పంచ్ కోట్ల భాస్కర్, ఉప సర్పంచ్ తోట మహేష్, వ్యవసాయ విస్తరణాధికారి అశ్రితరాజ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు, ప్రభుత్వానికి అధికారులు వారధిగా నిలవాలి
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సుభాష్నగర్: ప్రజలకు, ప్రభుత్వానికి ప్రభుత్వ ఉ ద్యోగులు వారధిగా నిలిచి ప్రజాభివృద్ధికి కృషి చే యాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని శ్రీరామ గార్డెన్లో శనివారం అర్బన్ నియోజకవర్గ స్థాయి ప్ర జాపాలన –ప్రగతి ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా చర్య లు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ అన్నారు. అనంతరం మేయర్, మున్సిపల్ కమిషనర్తో కలిసి ఎమ్మెల్యే స్టాళ్లను సందర్శించారు. నుడా చైర్మన్ కేశవేణు, అడిషనల్ కమిషనర్ రవీందర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇన్చార్జి పీపీల నియామకం
నిజామాబాద్ లీగల్: పోక్సో కోర్టు, మహిళా కోర్టు ఇ న్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నిజామాబాద్ మొద టి అదనపు జిల్లా కోర్టు పీపీ నర్సింహారెడ్డిని నియా మిస్తూ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం నియమించిన పీపీలను తొ లగిస్తూ వారి స్థానంలో ఇన్చార్జీ పీపీలను నియ మించారు. ప్రస్తుతం మహిళా కోర్టు పీపీగా ఉన్న బంటు వసంతు, పోక్సో కోర్టు పీపీగా ఉన్న ఎం.రాజారెడ్డి, ఆర్మూర్ పీపీగా ఉన్న ఖాందేశ్ శ్రీనివాస్ తొ లగించారు. ఆర్మూర్ ఇన్ చార్జి పీపీగా నిజామాబాద్ సీనియర్ సివిల్ కోర్టు పీపీ ఆర్ఎస్ఎల్ గౌడ్ను నియమించారు. కొత్తగా పీపీలు నియామకం అయ్యే వర కు వీరు ఇన్చార్జీలుగా వ్య వహరించనున్నారు. న ర్సింహారెడ్డి, ఆర్ఎస్ఎల్ గౌడ్ నియామకంపై బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మామిళ్లసాయిరెడ్డి, రెంజర్ల సురేశ్, రాజు, గణేశ్ హర్షం వ్యక్తంచేశారు. -
కాంగ్రెస్ కరప్షన్.. కమీషన్ పార్టీ
● బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఇందూరు పునాది కావాలి ● మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా ఇన్చార్జి శానంపూడి సైదిరెడ్డిసుభాష్నగర్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కరప్షన్, కమీషన్ల పార్టీ అని హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా ఇన్చార్జి శానంపూడి సైదిరెడ్డి ఆరోపించారు. ఈనెల 10వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశాన్ని శనివారం రాత్రి నగరంలోని కోటగల్లిలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన సైదిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండున్నరేళ్లలో కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదని, కాంట్రాక్టర్లు పనులు చేయడానికి భయపడుతున్నారని విమర్శించారు. పనులు చేసిన వారి నుంచి 30శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీకి మహిళలంటే ప్రత్యే క గౌరవం ఉంటుందని, వారికి అధికారం అప్పజెబితే దేశం బాగుపడుతుందని బలంగా విశ్వసిస్తార ని పేర్కొన్నారు. అందుకే బీజేపీ మహిళా బిల్లును ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇవ్వకుండా వీగిపోయేలా చేశాయన్నారు. ఇందూరు బీజేపీకి ప్రతి ఎన్నికల్లో అండగా నిలబడుతుందని, ఇక్కడ మొదలు పెట్టిన జైత్రయాత్ర రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేవరకూ కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఇందూరులో వేసిన పునాదితోనే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. మోసం కాంగ్రెస్ నైజం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మహిళలను మోసం చేస్తూనే ఉందని ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలతోపాటు అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పునాది వేయడానికి ఈనెల 10వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్కు వస్తున్నారని, సభకు మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి
● డీఎంహెచ్వో రాజశ్రీ ● గుండారం పల్లె దవాఖానా తనిఖీ నిజామాబాద్ రూరల్: అర్హులైన కిశోర బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలని డీఎంహెచ్వో రాజశ్రీ అధికారులను ఆదేశించారు. ముదక్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుండారం పల్లె దవాఖానను శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న సేవలను, హాజరు, స్టాకు రిజిస్టర్లను పరిశీలించారు. ఈడీడీ క్యాలెండర్, గర్భిణుల నమోదు, అత్యంత ప్రమాద లక్షణాలు గల గర్భిణుల గుర్తింపు, జీవనశైలి వ్యాధులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా క్షయరహిత గ్రామం కోసం కృషి చేయాలన్నారు. ఆమె వెంట ఆస్పత్రి ఎంఎల్హెచ్పీ డాక్టర్ కవిత, ఆరోగ్య కార్యకర్త రఘు, ఆశాకార్యకర్తలు ఉన్నారు. రెంజల్ ఆస్పత్రి.. రెంజల్(బోధన్): రెంజల్ ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం డీఎంహెచ్వో రాజశ్రీ తనిఖీ చేశారు. ఆస్పత్రి వచ్చే రోగులకు ఇబ్బందులు రానీయకుండా వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని ఆమె సూచించారు. -
‘మొబైల్ బ్యాంకింగ్’తో సేవలు సులభం
అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ సుభాష్నగర్: మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ద్వారా ఎప్పుడైనా,ఎక్కడైనా సురక్షితమైన బ్యాంకింగ్ సేవ లు సులభంగా, వేగంగా పొందవచ్చని అదనపు క లెక్టర్ కిరణ్కుమార్ సూచించారు. నగరంలోని జి ల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్డీసీసీబీ) ప్రధాన కార్యాలయంలో మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ను శనివారం అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతికయుగంలో రైతులు,ఖాతాదారులు సులభంగా విని యోగించుకునేలా ఈ మొబైల్ అప్లికేషన్ ను రూ పొందించారని తెలిపారు. త్వరలోనే యూ పీఐ సే వలు కూడా అందుబాటులోకి రానున్నాయన్నారు. ఆర్థిక సంవత్సరం 2025–26లో ఉత్తమ ఫలి తాల ను సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్న నేపథ్యంలో బ్యాంకు సిబ్బందిని అదనపు కలెక్టర్ అభినందించారు.ఇదే స్ఫూర్తిని ము న్ముందు కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. బ్యాంకు సీఈవో నాగభూషణం వందే మాట్లాడు తూ మొ బైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందన్నారు.ఖాతాదారులు వి నియోగించుకోవచ్చని,మరిన్ని వివరాలకు సమీప శాఖాధికారిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస్రావు, బ్యాంకు ఉన్నతాధికారులు లింబాద్రి, సుమమాల, గజానంద్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆమ్చూర్@రూ.27,800
ఆమ్చూర్ క్రయవిక్రయాలకు పేరొందిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పంట దిగుబడి వచ్చింది. మార్కెట్లో శనివారం క్వింటాల్ ధర రూ.27,800 పలికింది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లోనే ఆమ్చూర్ కొనుగోళ్లు జరుగుతాయి. మహబూబ్నగర్, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ నుంచి మొత్తం 267 క్వింటాళ్ల ఆమ్చూర్ నిజామాబాద్ మార్కెట్కు వచ్చింది. పుష్కలమైన విటమిన్లు ఉండే ఆమ్చూర్ను ఎక్కువగా ఉత్తరభారతీయులు వాడుతారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
పెర్కిట్(ఆర్మూర్): వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన వరి ధా న్యం కొనుగోలు కేంద్రంలో వారు ఆందోళనకు ది గారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ధాన్యం ఎక్కడికక్క డ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే తరుగు తీయకుండా కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. పెర్కిట్ సొసైటీ మాజీ చైర్మన్ నచ్చు చి న్నా రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపు రాజు, నాయకులు అల్లూరి గంగారెడ్డి, రైతులు ఎన్నారు. దొడ్డురకం కొనుగోలు చేయాలంటూ.. మోపాల్: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డురకం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం మోపాల్ మండలకేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య, మోపాల్ సర్పంచ్ ద్యాప రవి, అగ్గు చిన్నయ్య మాట్లాడుతూ.. మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులు కుమ్మకై ్క రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేయాలని, లేకపోతే రైతులతో కలిసి చలో కలెక్టరేట్కు చేపడుతామని వారు పేర్కొన్నారు. -
డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేయాలి
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని తిమ్మరాజుపల్లి గ్రామంలోని రైతు వేదికలో శనివారం ‘ప్రగతి ప్ర ణాళిక’లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగా ణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈసందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త రమ్య రా థోడ్ మాట్లాడుతూ..మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతులు లాభదాయకమైన వ్యవసాయం చేయవచ్చని తెలిపారు. ఏ వో రాంబాబు,సర్పంచ్ లావణ్యమురళి,ఉప సర్పంచ్ నరేందర్, ఏఈవో విజయ్, రైతులు పాల్గొన్నారు. -
దొడ్డు వడ్ల సంగతేంటి?
మోర్తాడ్/డొంకేశ్వర్: జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాల వడ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సన్న రకాలను మాత్రమే సేకరిస్తూ దొడ్దు రకం ధాన్యాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత కోసిన పంట కల్లాల్లో పోసి రెండు, మూడు వారాలవుతున్నా తూకం వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కల్లాల్లోనే రోజులు గడుపుతున్నామని వాపోతున్నారు. వర్షం కురిస్తే ధాన్యం తడిసిపోతుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులను అడిగినా ఎలాంటి సమాధానం చెప్పడం లేదని ఇటీవల జిల్లాలో సిరికొండ, ఇందల్వాయి, మాక్లూర్ ఇతర ప్రాంతాల్లో రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేశారు. దొడ్డు రకాలను విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. దొడ్డు రకాలకు ఏ గ్రేడ్ ధరనే వర్తింప చేస్తుండటంతో కచ్చితంగా అన్లోడింగ్ చేసుకోవాలని కలెక్టర్, జిల్లా పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు రైస్మిల్లర్లను ఆదేశించినా ప్రయోజనం లేకపోయింది. గతంలో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలు అలాగే ఉన్నాయని దొడ్డు రకాలను ఇప్పుడు తీసుకుంటే నిలువ చేసుకునే పరిస్థితి లేదని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. మోర్తాడ్ కమ్మర్పల్లి, ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా, బాల్కొండ, భీమ్గల్ మండలాల్లో దాదాపు 50వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. లోడింగ్కు వస్తామని ముందు ఒప్పుకుంటున్న లారీల డ్రైవర్లు.. దొడ్డు రకం అనగానే ఫోన్ కట్ చేసి మళ్లీ లిఫ్ట్ చేయడం లేదని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. దొడ్డు రకాలను మిల్లులకు తరలిస్తే అక్కడ అన్లోడింగ్ చేసుకోకుండా రోజుల తరబడి నిలపి ఉంచుతుండటంతో తమ లారీలకు గిరాకీ లేకుండా పోతుందని యజమానులు, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజనులో 1.71లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకాలను సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ 30 శాతం కూడా సేకరించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలను మిల్లరు పెడచెవిన పెడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని రైతులు వాపోతున్నారు. అన్లోడింగ్కు రైస్మిల్లర్ల విముఖత కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయని అధికారులు అధికారుల ఆదేశాలు బేఖాతర్ ఆందోళనలో అన్నదాతలు -
క్రైం కార్నర్
మాక్లూర్: అప్పుల బాధ భరించలేక మండలంలోని చిక్లి గ్రామానికి చెందిన బోదాసు నాగరాజు (31) శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగించే నాగరాజు కుటుంబ అవసరాల నిమి త్తం అప్పు చేశాడు. దానిని తీర్చలేని పరిస్థితిలో కొన్నిరోజులుగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ క్రమంలో భార్యా పిల్లలు, తల్లితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లటంతో ఇదే అవకాశంగా భావించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని ఎస్సై తెలిపారు. భార్య వైష్ణవి అలియాస్ భువనేశ్వరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. నాగరాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మనస్తాపానికి గురై ప్రియుడి.. నవీపేట: మండలంలోని రాంపూర్ గ్రామశివారులో బిహార్ రాష్ట్రంలోని బన్సారీ గ్రామానికి చెందిన యువకుడు నితీశ్ కుమార్(20) శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఉపాధి నిమిత్తం కూలీ పనులు చేసుకునేందుకు అన్న రాజేశ్ కుటుంబసభ్యులతో కలిసి నితీష్ కుమార్ కొన్ని రోజుల క్రితం రాంపూర్కు వచ్చాడు. కూలీ పనులు చేసుకుంటున్న తరుణంలో వరుసకు మరదలైన శివానీతో ప్రేమలో పడ్డాడు. ఇరువురు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమై యువతి తల్లిదండ్రులను సంప్రదించారు. పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నితీశ్ కుమార్ శనివారం ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి డిచ్పల్లి/నిజామాబాద్రూరల్:ఇందిరమ్మ రాజ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రా ష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ ఫలా లు అందుతున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్లో శనివారం ‘ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. గ్రామ సంఘాలకు, మహిళా సమాఖ్య మార్కెటింగ్ కమిషన్కు రూ.2,59,98,556 విలువ చేసే చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీఎల్పీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే ప్రగతి సాధ్యం
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● బోధన్లో నియోజకవర్గస్థాయి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ సమావేశం బోధన్: ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములైనప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పట్టణంలోని ఆచన్పల్లి ప్రాంతంలోగల ఏఆర్ గార్డెన్లో శనివారం నియోజకవర్గస్థాయి ప్ర జాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయలనే సంకల్పంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి అన్నారు. వరి ధాన్యం కేంద్రాల నిర్వహణ ద్వారా కమీషన్ రూపంలో సమకూరిన రూ.3కోట్ల 80 లక్షల చెక్కును మహిళా సంఘాల సభ్యులకు కలెక్టర్ అందించారు. అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు, పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణి చేశారు. అధికారులు, టీపీసీసీ డెలిగెట్ గంగాశంకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
● ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాము లు కావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి పి లుపునిచ్చారు. పట్టణ శివారులోని సప్తగిరి ఫంక్షన్ హాల్లో శనివారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గస్థా యి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎ మ్మెల్యే రాకేష్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. నియోజవర్గంలో పలు అభివృద్ధి పనులను మంజూరు చేయాలంటూ సీఎం రేవంత్రెడ్డిని కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. అధికారులు ప్రజలకు అన్ని విధాల సహకరించాలంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసి పెట్టాలన్నారు. సర్పంచ్లు తమ గ్రామాల్లోని పాఠశాలల్లో మరమ్మతులతో పాటు, అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. అనంతరం పలువురు ల బ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల ను అందజేశారు. సభాస్థలిలో ఏర్పాటు చేసిన వివిధ పథకాల స్టాళ్లను పరిశీలించారు. సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు, తహసీల్దార్ సత్యనారాయణ, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంవీఐ రాహుల్ కుమార్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. -
ఆర్మూర్ విద్యుత్ కార్మికులకు అవార్డు
ఆర్మూర్టౌన్:హైదరాబాద్లోని గాంధీభవన్లో రా ష్ట్ర విద్యుత్ కార్మిక యూనియన్ ఐఎన్టీయూసీ– 327 ఆధ్వర్యంలో నిర్వహించిన మే డే వేడుకల్లో ఆ ర్మూర్ డివిజన్ అధ్యక్ష సల్ల శ్రీనివాస్ యాదవ్, కా ర్యదర్శి గ్యాదరి ప్రభాకర్లకు‘శ్రమశక్తి’ అవార్డు ల భించింది.జిల్లాకు 6కార్మికశక్తి అవార్డులు వచ్చాయి. డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో పట్టాలేని భూముల్లో సాగైన వడ్లను కొనుగోలు చేయాలని డొంకేశ్వర్ సొసైటీ చైర్మన్ భరత్రాజ్ రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్కుమార్ను హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందజేశారు. నందిపేట్(ఆర్మూర్):హైదరాబాద్లో శనివారం జరిగిన ఆత్మనిర్భర్ పంచాయత్ రాజ్ వర్క్షాప్లో నందిపేట్ సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లింగం పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామీ ణ అభివృద్ధి, స్థానిక స్వయంపాలన బలోపేతం, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ఈ వర్క్షాప్ కీలకంగా నిలిచిందన్నారు. పంచాయత్ రాజ్ వ్యవస్థను మరింత ఆత్మనిర్భర్గా తీర్చిదిద్దడానికి అవసరమైన అంశాలపై చర్చలు జరిపారు. వర్ని: చందూర్లో రే ణుక ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం రాత్రి గ్రామస్తు లు ఘనంగా నిర్వ హించారు.అనంత రం ఆలయం వద్ద ప్రత్యేకంగా తయారు చేసిన రథంపై పూజారిని కూర్చోబెట్టి ఆలయం చుట్టూ తిప్పి ఉత్సవాలు నిర్వహించారు. శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. బెల్ట్షాపుల కట్టడికి చర్యలు నిజామాబాద్ అర్బన్: జిల్లాలో బెల్ట్షాపుల కట్టడికి కృషి చేస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అక్రమంగా మద్యం విక్రయాలు, అనధికారిక మద్యం దుకాణా ల నిర్వాహనను కట్టడి చేస్తున్నామన్నారు. ఈ ఏడా దిలో ఇప్పటి వరకు మొత్తం 64 కేసులు నమోదు చేసి 62 మందిని అరెస్టు చేశామని తెలిపారు. -
స్టీలుకే సై!
మార్పు మొదలైంది... పర్యావరణ పరిరక్షణతోపాటు ఆరోగ్యాన్ని కాపాడు కునేందుకు ప్రజలు ప్లాస్టిక్కు గుడ్బై చెప్పి, స్టీల్ వైపు అడుగులు వేస్తున్నారు. శుభకార్యాలు, విందు వినోదాల సమయంలో విచ్చలవిడిగా వాడే ప్లాస్టిక్ విస్తార్లు, గ్లాసుల స్థానంలోకి మళ్లీ సంప్రదాయ స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వచ్చి చేరుతున్నాయి. పల్లెల నుంచే మార్పు దిశగా అడుగులు పడుతుండడం శుభపరిణామమని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. స్టీల్ ప్లేట్లలో భోజనం చేస్తున్న డొంకేశ్వర్ గ్రామస్తులుమోర్తాడ్/డొంకేశ్వర్: ప్లాస్టిక్ భూతాన్ని పారదోలే దిశగా పల్లెలు అడుగులు వేస్తున్నాయి. ప్లాస్టిక్ వినియోగం వల్ల తలెత్తే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. పర్యావరణ ప్రేమికులూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలు, విందులు కొనసాగే చోట్ల ప్లాస్టిక్తో తయారు చేసిన ప్లేట్లు, గ్లాసులు కనిపించేవి. ప్రస్తుతం కొన్ని చోట్ల అవి కనుమరుగవుతుండడం విశేషం. స్టీల్ ప్లేట్లు, గ్లాస్లను క్రమంగా వినియోగంలోకి తీసుకువస్తున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పాటి హనుమాన్ మందిరం భక్తుల ఆధ్వర్యంలో దాతల నుంచి 2వేల వరకు స్టీల్ ప్లేట్లను సేకరించారు. కమ్మర్పల్లిలో ఎక్కడ శుభకార్యాలు జరిగినా, అన్నదానాలు నిర్వహించినా ఈ స్టీల్ ప్లేట్లు, గ్లాస్లను వినియోగిస్తున్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ ప్లాస్టిక్పై నిషేధం తీర్మానం చేయగా గౌడ సంఘం పెద్ద మనుషులు స్పందించారు. రేణుకాఎల్లమ్మ ఉత్సవాల సందర్భంగా అన్నదానం నిర్వహించగా స్టీల్ ప్లేట్లు, గ్లాస్లను కొనుగోలు చేసి వాటినే వినియోగించారు. చౌట్పల్లిలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, శ్రీలక్ష్మి నారాయణ స్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ పల్లాలను, గ్లాసులను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచారు. ఎవరు శుభకార్యాలను నిర్వహించినా భోజనాల కోసం ఉచితంగానే పల్లాలు, గ్లాసులను సరఫరా చేయనున్నారు. మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో స్టీల్ సామగ్రి వాడకాన్ని ప్రోత్సహించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ప్లాస్టిక్ కారణంగా తలెత్తే అనార్థాలపై నందిపేటలోని పలుగుట్ట వ్యవస్థాకులు కేదారానంద మహారాజ్ ఇటీవల జిల్లాలో నిర్వహించిన హిందూ సమ్మేళనాల్లో అవగాహన కల్పించారు. అలాగే ఆశ్రమం నుంచి శుభకార్యాలు, పెళ్లిళ్లకు ఉచితంగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందజేసి తిరిగి తీసుకుంటున్నారు. మండలంలోని నూత్పల్లి గ్రామ పంచాయతీ ఇటీవల ప్లాస్టిక్ను నిషేధించింది. 600 స్టీల్ ప్లేట్లు, 400 గ్లాసులను కొనుగోలు చేసి ఊరి ప్రజలు ఉచితంగా వినియోగించుకునేందుఉ జీపీలో అందుబాటులో ఉంచింది. వీలైనంత తొందరలోనే అన్ని గ్రామాలు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. ఇటీవల నృసింహస్వామి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. కమ్మర్పల్లి, డొంకేశ్వర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో స్టీల్ ప్లేట్లు, గ్లాస్లను వినియోగించారు. డొంకేశ్వర్లోని ఆలయానికి బార్ల శ్యామ్రెడ్డి, నాగరాజ్రెడ్డి, నవీన్రెడ్డిలు కలిసి 200 స్టీల్ ప్లేట్లు, 200గ్లాసులు కొనుగోలు చేసి ఇచ్చారు.కమ్మర్పల్లి హనుమాన్ మందిరంలో స్టీల్ ప్లేట్లు ప్లాస్టిక్ వినియోగానికి క్రమంగా దూరమవుతున్న పల్లెలు పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు అన్నదానాలు, ఫంక్షన్లలో స్టీల్ ప్లేట్లు, గ్లాస్ల వినియోగం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న పర్యావరణ ప్రేమికులుకమ్మర్పల్లిని ప్లాస్టిక్ ర హిత గ్రామంగా తీర్చిది ద్దుతాం. ఇందుకోసం గ్రామాభివృద్ధి కమిటీ కృతనిశ్చయంతో ఉంది. ఇక్కడ ఉన్న స్టీల్ బ్యాంకును చూసి అనేక గ్రా మాలలో స్టీల్ పల్లాలు, గ్లాస్లను కొనుగోలు చే యడం సంతోషంగా ఉంది. అన్ని గ్రామాల్లో మార్పు రావాలి. – మైలారం సుధాకర్, కమ్మర్పల్లి వీడీసీ సభ్యుడు ప్రజలు ప్లాస్టిక్ను తగ్గించి స్టీల్ వస్తువులను ఉపయోగించడం మంచి ప రిణామం. నేడు మనం వాడే ఒక్క స్టీల్ ప్లేట్, గ్లాసు రేపటి తరాన్ని వేల ప్లాస్టిక్ వ్యర్థాలనుంచి కాపాడుతాయి. వచ్చిన చైతన్యం ఇలాగే కొనసా గితే భవిష్యత్లో పర్యావరణ ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఉండవు. – గున్నాల నరేశ్, పూజారి, డొంకేశ్వర్ -
తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: తెలంగాణలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం (మే 2) ఈ సీజన్లోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్లో గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల ప్రభావంతో మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయట తిరగలేకపోతున్నారు. ఉదయం వేళల నుంచే ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉంటున్నాయి. వేడి గాలులు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. -
కలెక్టరేట్లో దత్తత హెల్ప్డెస్క్ ప్రారంభం
నిజామాబాద్అర్బన్: జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం దత్తత సహాయ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మిషన్ వాత్సల్య పోర్టల్ ద్వారా పిల్లల అడాప్షన్ ప్రక్రియ ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు. అక్రమంగా దత్తత తీసుకున్న వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోకి వచ్చే ప్ర జలకు హెల్ప్ డెస్క్ ద్వారా దత్తత ప్రక్రి యకు కావాల్సిన పత్రాలను, ప్రభుత్వ మా ర్గదర్శకాలను అందజేయాలని సూచించారు. అనంతరం హైదరాబాద్కు చెందిన దంపతులకు బాలుడిని దత్తత ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకు మార్ కార్యాలయం సిబ్బంది అనిత, అనిల్, స్రవంతి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. ముందస్తుగా పన్ను చెల్లించిన ఎమ్మెల్యే సుభాష్నగర్: ఆస్తి పన్ను చెల్లింపుపై ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీ రిబేట్ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సద్వినియోగం చేసుకున్నారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను శుక్రవారం ముందస్తుగా చెల్లించారు. ఇంటిపన్నుతోపాటు వ్యాపార సంస్థలకు సంబంధించిన పన్ను మొత్తం రూ.11.75 లక్షలు చెల్లించారు. మున్సిపల్ శాఖ కల్పిస్తున్న అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. సీసీ కెమెరాలకు కేఆర్ సురేశ్ రెడ్డి నిధులు ● రైల్వే బోర్డు డైరెక్టర్ బొడ్డు గంగాధర్ ఆర్మూర్: రాజ్యసభ మాజీ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 25 లక్షలు సొంత డబ్బులు ఇచ్చారని రైల్వే బోర్డు డైరెక్టర్ బొడ్డు గంగాధ ర్ వెల్లడించారు. పట్టణంలో శుక్ర వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేయడంతో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, ఘర్షణలు జరిగినప్పుడు పోలీసులకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. మహిళలకు రక్షణగా ఉంటుందన్నా రు. ఆర్మూర్, పెర్కిట్, మామిడిపల్లిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పర్యటించిన రైల్వే డీఆర్ఎం నిజామాబాద్అర్బన్: జిల్లాలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ గోపాలకృష్ణన్ శుక్రవారం పర్యటించారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్కు చేరుకొని అక్కడ నుంచి మామిడిపల్లి, ఆర్మూర్ మీదుగా పెద్దపల్లికి వెళ్లారు. ఈ నెల 10న ప్రధాని నరేంద్రమోదీ మాక్లూర్ మండలం మామిడిపల్లి రైల్వేస్టేషన్ను వర్చువల్గా ప్రారంభించనున్న నేపథ్యంలో పరిశీలించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా, డీఆర్ఎం జిల్లాలోని ఏ రైల్వేస్టేషన్లో కూడా ఆగకుండా నేరుగా పెద్దపల్లికి వెళ్లిపోయారు. ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి నిజామాబాద్అర్బన్: ప్రభుత్వం కార్మికులకు అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్కుమా ర్ సూచించారు. శుక్రవారం మే డే (కార్మిక దినోత్సవం) సందర్భంగా కలెక్టరేట్లో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పిల్లల వివాహానికి కార్మిక శాఖ ద్వారా గరిష్టంగా రూ.30,000, ప్రసూతికి రూ. 30,000 అందిస్తున్నట్లు తెలిపారు. భవననిర్మాణ కార్మికులు మరణిస్తే రూ.2 లక్షల బీమా సదుపాయం ఉంటుందన్నారు. ఐటీ ఐ ప్రిన్సిపాల్ యాదగిరి, ఈఎస్ఐ డాక్టర్ అల్కా పటేల్, కార్మాగారాల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మికుమారి, డీసీ యాదయ్య పాల్గొన్నారు. -
మంజీరలో ‘మహా’ ఇసుక తవ్వకాలపై అప్రమత్తం
● హున్సా శివారులో సర్వే చేసిన రెవెన్యూ శాఖ బోధన్:తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు మధ్య ప్ర వహిస్తున్న మంజీర నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దు వి వాదం ఏళ్లు గడిచినా అపరిష్కృతంగానే మిగిలిపో యింది. బోధన్ రెవెన్యూ డివిజన్ సాలూర మండలంలోని మందర్న, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గేల్లి గ్రామాల శివారులో విస్తరించి ఉన్న మంజీర నదిలో ఏటా సరిహద్దు వివాదం తలెత్తుతోంది. తా జాగా మంజీర నదికి అవతలి ఒడ్డున ఉన్న మహా రాష్ట్ర ప్రాంతంలోని బిలోలి తాలూకా బోలేగాం శివారులో ఆ రాష్ట్ర అనుమతి పొందిన కాంట్రాక్టర్లు కొంతకాలంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. బోలేగాం ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు హున్సా గ్రామ శివారులోకి తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు శుక్రవారం తహసీల్దార్కు సమాచారం అందించారు. దీంతో తహసీల్దార్ నవాజ్, ఆర్ఐ ఆనంద్, సర్వేయర్ శ్రావణ్, సిబ్బంది, పోలీసు బందోబస్తుతో మధ్య మంజీర నదిని సందర్శించి సర్వే చేపట్టారు. మహారాష్ట్ర ఇసుక క్వారీ నిర్వాహకులు మన హద్దుల అంచువరకు వచ్చారని, హద్దు దాటి రాలేదని తహసీల్దార్ వివరించారు. మంజీర నది మధ్య వరకు తవ్వకాలు చేపట్టకూడదని క్వారీ నిర్వాహకులను ఆదేశించామని తెలిపారు. రెవెన్యూ అధికారుల వెంట బోధన్ రూరల్ సీఐ విజయ్బాబు, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
మల్కాపూర్లో ‘యంగ్ ఇండియా’ స్కూల్
నిజామాబాద్ రూరల్: మండలంలోని మల్కాపూర్ (ఏ) గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రూ. 200 కోట్లతో నిర్మించనున్న పాఠశాలకు సంబంధించిన ప్రణాళికను శుక్రవారం సంబంధిత ఈడబ్ల్యూడీసీ అధికారులు ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసి వివరించారు. పాఠశాల నిర్మాణానికి సంబంధించిన ప్లాన్, మ్యాపు తదితర వాటిపై అధికారులు చర్చించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఈఈఐడీసీ రవీందర్, డీఈలు రాందాస్,రవి, ఏఈ తుకారాం ఉన్నారు. ● త్వరలో నిర్మాణానికి భూమి పూజ ● ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన అధికారులు -
చెక్ పడేనా
రెండో ఓటుకు జిల్లాలో గణనీయమైన సంఖ్యలో ఇతర రాష్ట్రాల వలస ఓటర్లు ఆర్మూర్: జిల్లాలో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చి స్థిరపడిన వారు గణనీయంగా ఉన్నారు. వీరికి వారి రాష్ట్రాలతో పాటు ఇక్కడ ఓటు హక్కు ఉన్న విషయం గమనార్హం. స్థానిక రాజకీయ నాయకులే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ఓటరు కార్డులను ఇప్పిస్తున్నారన్నది బహిరంగ సహస్యం. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో ఇలాంటి వారు ఎందరు బయట పడతారో అన్నది చర్చనీయాంశంగా మారింది. ● ఆంధ్ర ప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి భవన కార్మికులుగా, మేసీ్త్రలు గా ఉపాధి కల్పించుకున్న వారు వేల సంఖ్యలో ఉంటారు. అదే విధంగా బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి బంగారం నగల తయారీ పరిశ్రమలో ఉపాధి కోసం వేల సంఖ్యలో వలస వచ్చారు. ఒక్క ఆర్మూర్ పట్టణంలోనే వీరి సంఖ్య రెండు వేలకు పైగా ఉంటుంది. ఇక రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి టైల్స్ వ్యాపారంతో పాటు రాందేవ్ ప్లాస్టిక్స్, సూపర్ మార్కెట్లు, పలు హోల్ సేల్ వ్యాపారాలు చేసే వారు వలస వచ్చారు. ఇక గ్రామాల్లో టబ్బులు, రెడీమేడ్ మంచాలు, పరుపులు అమ్మే వ్యక్తులు వందల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఉన్నారు. వీరందరికీ ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు నకిలీ ఆధార్ కార్డులు ఇప్పించి ఓటు హక్కును సైతం కల్పించారు. కాగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన సమయంలో వీరంతా తమ రాష్ట్రాల్లో ఓటు వేయడానికి మూకుమ్మడిగా వెళ్లడం కనిపిస్తుంది. వీరే స్థానిక ఎన్నికల్లో సైతం ఓట్లు వేస్తున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న వారు ఎస్ఐఆర్ సర్వేలో పట్టుబడే అవకాశం ఉంది. 2002 నాటి ఓటర్ లిస్టును ఏఐ పరిజ్ఞానంతో పోల్చి చూస్తూ డబుల్ ఓటు ఉన్న వారిని గుర్తించే అవకాశం ఉండటంతో ఆర్మూర్ పట్టణంతో పాలు, జిల్లాలో ఎస్ఐఆర్ గురించి ప్రాధానంగా చర్చ జరుగుతోంది. నకిలీ ఓటర్లను గుర్తించే అవకాశం ఉండటంతో సదరు వలసదారులు తమకు ఓటు హక్కు ఇప్పించిన రాజకీయ పార్టీల నాయకులను కలిసి తమ ఓటు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు. బంగ్లాదేశ్ వాసులు కూడా!ఆర్మూర్ పట్టణానికి పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చి బంగారు వ్యాపారి వద్ద కార్మికుడిగా పని చేస్తున్న ఓ యువకుడు తాజాగా పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అంతవరకు సమస్య లేదు.. కానీ ఇదే వ్యక్తి ఇటీవల ఆర్మూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇదేట్లా జరిగిందని ఆరా తీయగా.. సదరు పశ్చిమ బెంగాల్కు చెందిన బంగారు నగల కార్మికుడికి రెండు రాష్ట్రాల్లో ఓటరు కార్డులు మంజూరు అయి ఉన్నాయి. స్థానిక రాజకీయ నాయకులు అతనికి ఓటరు కార్డును ఇప్పించడమే ఇందుకు కారణం. ఓటరు జాబితా వెరిఫికేషన్ చేస్తున్నాం.. ఓటరు జాబితాలో వెరిఫికేషన్, అప్డేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. 2002 ఓటర్ లిస్టులో ఉన్న ఓటరును ప్రస్తుతం ఉన్న 2025 ఓటర్ లిస్ట్ తో మ్యాపింగ్ చేస్తారు. 2025లో ఉన్న వారి వారసులను 2002 ఓటర్ లిస్టులో ఉన్న వారి తల్లిదండ్రులకు మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఓటరు వ్యక్తిగత బాధ్యతతో స్వతహాగా ముందుకు వచ్చి తమ తమ ఓటర్ వివరాలను పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన బీఎల్వో ద్వారా నమోదు చేయించుకోవాలి. – నడిమెట్ల సత్యనారాయణ, తహసీల్దార్ ఆర్మూర్పశ్చిమ బెంగాల్ నుంచి ఆర్మూర్ ప్రాంతానికి వలస వచ్చిన వారిలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ వారు కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వలసదారుల వివరాలు సేకరించే సరైన వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేకపోవడంతో వలస కార్మికులు ఎక్కడివారో గుర్తించే పరిస్థితులు ఇక్కడ లేవు. పలు సందర్భాల్లో బంగారు వ్యాపారుల వద్ద కార్మికుడిగా పని చేస్తూ పెద్ద మొత్తంలో బంగారం, డబ్బులు ఎత్తుకొని పారి పోయిన ఘటనలు పదుల సంఖ్యలో ఉన్నాయి. వీరిని తిరిగి పట్టుకోవడం వ్యాపారులకు కష్టంగా ఉండటమే కాదు పోలీస్ వ్యవస్థ సైతం విఫలం అవుతుండటంతో అక్రమార్కులు ఏ దేశం వారో అనే ఆందోళన నెలకొని ఉంది. ఇటీవల ఓ రాష్ట్రానికి ఓటేసేందుకు ఆర్మూర్ నుంచి మూకుమ్మడిగా వెళ్లిన వైనం బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారెందరో.. ఎస్ఐఆర్ తో డబుల్ ఓటర్లకు గుబులు -
కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్ర శేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు మొత్తం 5,016 మందికి గాను 4,789 మంది హాజరుకాగా 227 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. మధ్యాహ్నం రెండో సెమిస్టర్ రెగ్యులర్, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 6,894 మందికి 6,507 మంది హాజరు కాగా 387 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రంలో సోమవారం నుంచి పసుపు విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు శాస్త్రవేత్త జి. విద్య ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రంలో దుగ్గిరాల ఎరుపు, సేలం, రాజాపురి తదితర రకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒక్కో రైతుకు 100 కిలోల వరకు విత్తనాలు అందజేస్తామన్నారు. క్వింటాలుకు రూ. 3000 చెల్లించాలని అన్నారు. పసుపు విత్తనం అవసరం ఉన్న రైతులు పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్తోపాటు సంచులు తీసుకొని రావాలని సూచించారు. లిఫ్ట్లో చిక్కుకున్న చిన్నారులు ఆర్మూర్టౌన్: పట్టణంలోని జీవన్రెడ్డి మాల్ లిఫ్ట్లో ఇద్దరు చిన్నారులు చిక్కుకుపోయిన ఘ టన కలకలం రేపింది. షాపింగ్ కోసం తల్లిదండ్రులతోపాటు వచ్చిన పిల్లలు సరదాగా లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ పైకి వెళ్తుండగా సాంకేతిక లోపంతో మధ్యలోనే ఆగిపోవడంతో చిన్నారులు చిక్కుకుపోయారు. సుమారు గంటపాటు లిఫ్ట్లోనే ఉండిపోవడంతో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మాల్ యాజమాన్యం వెంటనే స్పందించి లిఫ్ట్ను తెరిచి చిన్నారులను సురక్షితంగా బయటకు తీయడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడి అరెస్ట్ ఎల్లారెడ్డి: బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని ఎల్లారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని న్యూ ఆబాదీ కాలనీకి చెందిన మహమ్మద్ అహ్మద్ సులభంగా డబ్బు సంపాదించాలని కొంతకాలంగా బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. నకిలీ తాళాలతో బైక్లను చోరీ చేసి వాటి నెంబర్ ప్లేట్లు మార్చి అమ్ముకుంటున్నాడు. గత నెల 26న ఎల్లారెడ్డి సంతలో పార్కింగ్ చేసిన ఒక టీవీఎస్ మోపెడ్ వాహనాన్ని దొంగిలించాడు. ఈ కేసు విషయంలో విచారణ చేసిన పోలీసులు స్టేషన్ పరిధిలో జరిగిన పలు బైక్ చోరీలకు నిందితుడిగా అహ్మద్ను గుర్తించారు. విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం ఉదయం నిందితుడిని అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. చోరీ చేసిన ఐదు బైక్లను స్వాధీనం చేసుకొని, రిమాండ్కు తరలించినట్లు సీఐ రాజిరెడ్డి తెలిపారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై మహేశ్, ఎస్సై–2 సుబ్రహ్మణ్య చారి, ఏఎస్సై దేవాగౌడ్ను అభినందించారు. -
ధాన్యం బుగ్గిపాలు
డిచ్పల్లి: రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం రైస్మిల్లుకు వెళుతుందో లేదో గ్యారెంటీ లేకుండా పోయింది. తూకం వేసి బస్తాల్లో నింపి లారీలో లోడింగ్ సిద్ధంగా ఉన్న ధా న్యం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమైన ఘటన శుక్రవారం డిచ్పల్లి మండలంలో చోటు చే సుకుంది. బాధిత కౌలు రైతు వారాల సురేశ్, రెవె న్యూ, వ్యవసాయాధికారులు తెలిపిన వివరాలు ఇ లా ఉన్నాయి. డిచ్పల్లి గ్రామానికి చెందిన రైతు సురేశ్ తనకున్న ఎకరం పొలంతోపాటు అదే గ్రా మానికి చెందిన అవుసుల వినోద్కు చెందిన 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి ధాన్యం పండించాడు. మొత్తం 209 బస్తాల ధాన్యం వచ్చింది. ఘన్పూర్ నుంచి డిచ్పల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు పక్క న ధాన్యం ఆరబోశాడు. డిచ్పల్లి సొసైటీ ఆధ్వర్యంలో పది రోజుల క్రితం ధాన్యం తూకం వేసి బస్తాల్లో నింపి, లారీలో లోడ్ చేసి రైస్మిల్లుకు పంపించేందుకు సిద్ధంగా ఉంచారు. అయితే, లారీలు రాక ఆ లస్యం కావడంతో బస్తాలు రోడ్డు పక్కన అలాగే ఉ న్నాయి. మధ్యాహ్నం సమయంలో భోజనం చేయ డానికి సురేష్ ఇంటికి వెళ్లాడు. ఇంతలోనే రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో ఉన్న ఎండిపోయిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలకు నిప్పంటుకుంది. గాలులకు ఆ మంటలు ధాన్యం సంచులను అంటుకున్నాయి. రోడ్డుపై వెళ్లే వాహనదారులు గమనించి వెంటనే సురేశ్కు, ఫైరింజన్కు సమాచారం ఇచ్చారు. మరికొందరు రైతులతో కలిసి అక్కడికి చేరుకున్న సురేశ్ మంటలను ఆర్పివేసేందుకు యత్నించారు. ఇంతలోనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే 105 సంచులలో ధాన్యం కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్ష వరకు నష్టం జరిగినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని మండల వ్యవసాయాధికారి ఆంజనేయులు, ఆర్ఐ సంతోష్, పోలీసు సిబ్బంది సందర్శించారు. పంచనామా నిర్వహించి వివరాలు నమోదు చేసుకున్నా రు. ఎవరైనా సిగరెట్ తాగి పడేశారా లేక ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా తెలియడం లేదని రైతులు పేర్కొన్నారు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. లారీల సమస్య పరిష్కరించి త్వరగా కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. నిప్పంటుకొని తగలబడిన వడ్ల బస్తాలు సుమారు రూ.లక్ష నష్టం లారీల రాక ఆలస్యంతో పది రోజులుగా రోడ్డు పక్కనే బస్తాలు ప్రభుత్వం ఆదుకోవాలని కౌలు రైతు వేడుకోలు -
‘బాల భరోసా’ను సద్వినియోగం చేసుకోవాలి
● డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీసుభాష్నగర్: ఐదేళ్లలోపు పిల్లల అభివృద్ధిలో లోపా లు, నాడీ సంబంధిత సమస్యలు, శారీరక వైకల్యా న్ని ముందుగానే గుర్తించడానికి ఉద్దేశించిన బాల భరోసా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీ ఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. కార్యక్రమం వి జయవంతం చేసేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ, ఆరోగ్యశాఖ సమన్వయంతో పని చేయాలని పే ర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నగరంలోని జీజీహెచ్ కాన్ఫరెన్స్ హాల్లో ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవజాత శిశువు నుంచి 18 ఏళ్ల పిల్లలందరికీ రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమంలో భాగంగా మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా హెల్త్ స్క్రీనింగ్ చేయించాలన్నా రు. ఏమైనా సమస్యలున్న విద్యార్థులను జీజీహె చ్లోని జిల్లా ఎర్లీ ఇంటర్వేన్షన్ కేంద్రంలో స్పీచ్, ఫిజియోథెరపీలు, చికిత్సలు ఉచితంగా అందిస్తా మని తెలిపారు. పుట్టుకతో వచ్చే లోపాలు, దంత, కంటి సమస్యలు, అనీమియా, పోషకాహార లో పాలు, గుండె సంబంధిత వ్యాధులు, అన్నిరకాల శస్త్ర చికిత్సలు, చర్మ తదితర వ్యాధులకు చికిత్సలు చేయిస్తామని పేర్కొన్నారు. పిల్లలకు చికిత్స అందించేందుకు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి పూర్తి సహకారం ఉంటుందని సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్రావు తెలిపారు. పాఠశాలలు తెరిచిన తర్వాత ఆర్బీఎస్కే టీములు స్క్రీనింగ్ చే యడానికి అంగన్వాడీ టీచర్లు సహకరించాలని డి స్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారిణి పద్మ, సీడీపీవోలు, సూపర్వైజర్లు, మెడికల్ హెల్త్ టీమ్లు, ఆర్బీఎస్కే సిబ్బంది పాల్గొన్నారు. -
విత్తనోత్పత్తిలో ప్రైవేటు ఫస్ట్
మోర్తాడ్(బాల్కొండ): ప్రభుత్వరంగ సంస్థల కన్నా ప్రైవేటు కంపెనీలు విత్తనోత్పత్తిలో ముందంజలో ఉన్నాయి. యాసంగి సీజన్లో వరి సీడ్ రకాన్ని రైతులతో సాగు చేయించిన పలు కంపెనీలు ఎలాంటి తరుగు లేకుండానే తీసుకెళ్తున్నాయి. అయితే, ప్రభు త్వ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలను తూకం వేసేందుకు కొర్రీలు పెట్టడంతోపాటు సన్నరకాల కొనుగోళ్లలో తరుగు తప్పటం లేదు. ఈ పరిస్థితు ల్లో సీడ్ రకం సాగు చేసిన రైతులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ధాన్యం తరలిపోతుండటం విశేషం. 10 వేల ఎకరాల్లో సాగు.. మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్గల్, వేల్పూర్, ఏర్గట్ల, మెండోరా, ముప్కాల్, బాల్కొండ తదితర మండలాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లను సీడ్ కంపెనీల ద్వారానే రైతులు సాగు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు కఠినంగా ఉండటం, టొకెన్ల జారీలో తీవ్ర జాప్యంతో సమయం వృథా అవుతుందని భావించి ముందుగానే అనేక మంది రైతులు సీడ్ కంపెనీలతో ఒప్పందాలను చేసుకున్నారు. దొడ్డు రకం సాగు చేసిన రైతులకు ఎకరానికి 35–38 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, సన్నరకంలో మాత్రం 28 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తోంది. దీంతో దొడ్డు రకం విత్తనోత్పత్తికి రైతులు మొగ్గు చూపుతున్నారు. కాగా, కొనుగోళ్లు కేంద్రాల్లో ఏ గ్రేడ్ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2,389 ధర ఉండగా, విత్తనోత్పత్తి కోసం సాగు చేసిన ధాన్యానికి రూ.61 అదనంగా అంటే రూ.2,450 సీడ్ కంపెనీలు చెల్లిస్తున్నాయి. ధాన్యం తరలించిన 15 రోజులలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని సీడ్ కంపెనీల యజమానులు హామీ ఇచ్చారు. ఇప్పటికే మొదట్లో తరలించిన ధాన్యానికి సంబంధించి డబ్బులు జమ చేయగా మిగతా వారికి గడువు ముగిసేలోపు జమ చేస్తామని చెప్తున్నారు. సీడ్ కంపెనీల కోసం దొడ్డు రకం వరి సాగు తరుగు లేకుండా తీసుకెళ్తున్న కంపెనీలు ఏ గ్రేడ్ ధాన్యం ధర కన్నా రూ.61 అదనం బైబ్యాక్ ఒప్పందంతో సాగు పూర్తి చేసిన రైతన్నలుఏడేళ్లుగా సాగు చేస్తున్నాం.. ఏడేళ్లుగా యాసంగిలో సీడ్ రకం సాగు చేస్తున్నాం. నాతోపాటు మా గ్రామంలో 30 శాతం మంది రైతు లు సీడ్ రకం సాగుచేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో విత్తనోత్పత్తి దిశగా రైతులను ప్రోత్సహించాలి. – మామిడి రాజు, గాండ్లపేట్ -
ధాన్యం కొనుగోళ్లపై రైతుల నిరసన
● ఎల్లారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం ఇందల్వాయి: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఎల్లారెడ్డిపల్లె గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కోత లు పూర్తయి నెలరోజులు గడుస్తున్నా ధాన్యం కొను గోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధా న్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ఎల్లారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ మఠంల శేఖర్ ఒంటిపై పెట్రోల్ పో సుకొని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 200 మంది రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది. రైతులకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలు తీర్చాలని పట్టుబట్టారు. తహసీల్దార్ బాలయ్య రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. -
క్రైం కార్నర్
రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన అక్కపల్లి గంగాధర్(54) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. గురువారం రాత్రి గంగాధర్ కాలకృత్యాల కోసం పెద్ద చెరువు వద్దకు వెళ్లగా కాలుజారి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతుని భార్య శోభ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. వర్ని: ఇటీవల కొడుకు దాడి చేయడంతో గాయపడిన తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.రుద్రూర్ సీఐ కృష్ణ తెలిపిన వివరాలు ఇలా..మోస్రా మండలం చింతకుంట గ్రామానికి చెందిన కర్మంగళి శ్రీనివాస్ (51) తరచూ మద్యం సేవించి భార్య, కొడుకుతో ఘర్షణ పడేవాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం భార్య, కొడుకుతో అతడు గొడవ పడ గా కొడుకు బండరాయితో తండ్రి తలపై కొట్టాడు. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాస్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.శుక్రవారం ఉ దయం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సీఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్నగర్ మండలం తుంకిపల్లి గ్రామ శ్మశానం నుంచి దహనం చేసిన మృతదేహం పుర్రె, ఎముకలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన సిర్నపల్లి పోచవ్వ (70) గత నెల 28న అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో కుటుంబీకులు గ్రామశివారులో దహన సంస్కారాలు చేశారు. అయితే, రెండు రోజులకే మృతదేహానికి సంబంధించిన పుర్రె, ఎముకలు, ఇతర భాగాలు అపహరణకు గురయ్యాయి. దీంతో గ్రామస్తులు భయాందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధురాలు అదృశ్యం భిక్కనూరు: మండలంలోని కాచాపూర్ గ్రామంలో మెదక్ జిల్లా బచ్చురాజుపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు అదృశ్యమైనట్లు ఎస్సై ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. బచ్చురాజు పల్లి గ్రామానికి చెందిన తొత్తల సుశీల(85) కాచాపూర్ గ్రామంలో ఉంటున్న సోదరి పద్మ ఇంటికి నెల రోజుల క్రితం వచ్చింది. ఏప్రిల్ 29న పద్మ తన అక్క సుశీలను కాచాపూర్ వద్ద కామారెడ్డి వెళ్లే బస్సు ఎక్కించింది. అప్పటి నుంచి సుశీల ఆచూకీ లేదు. సుశీల కొడుకు తొత్తల మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
నియోజకవర్గ స్థాయి సమావేశాలకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 2న నియోజకవర్గ స్థాయి సమావేశాలను అట్టహాసంగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అన్నివర్గాల ప్రజలు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక, నీట్ ప్రవేశ పరీక్ష, ధాన్యం సేకరణ, డివిజనల్ స్థాయిలో ప్రజావాణి నిర్వహణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో సమావేశమయ్యారు. శనివారం నాటి నియోజకవర్గస్థాయి సభల విజయవంతంగా నిర్వహించాలన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయం వేళలోనే సభలు నిర్వహించాలని సూచించారు. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా కొనసాగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీలు, రవాణా, గోనె సంచుల సరఫరా, హార్వెస్టర్ యంత్రాల వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీవోల నేతత్వంలో ప్రతి సోమవారం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 3న జరగనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు జరగనున్న స్వీయ గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నమోదు చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ రావు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
సాగు ఖర్చులను తగ్గించుకోవాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఉత్తునూర్ రైతు వేదిక కార్యాలయంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు–అన్నదాతలు అనే కార్యక్రమంపై అవగాహన సద్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిరిసిల్లా వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ అశ్విని పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పంటలు సాగు చేసే టప్పుడు యూరియా వాడకాన్ని పూర్తిగా తగ్గించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అవసరం ఉన్న మేరకే రసాయనాలను వినియోగించి ప్రకృతిని రక్షించుకోవాలన్నా రు. ప్రతిరైతు పంటమార్పిడి చేయాలన్నారు. మా ర్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలను ఎంచుకొని సాగు వేసుకోవాలని సూచించారు. ఏవో ప్రజాపతి, ఏఈ వోలు ప్రణతి, కవిత, శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
తగ్గని పాతాళగంగ!
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎండలు భగభగ మండిపోతున్నా జిల్లాలో భూగర్భ జలాలు నిలకడగా ఉన్నా యి. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో వ్యవసాయ బోరు బావుల ద్వారా విపరీతంగా నీటిని తోడడంతో నీటి మట్టం పడిపోతుంది. అయితే ఈ ఏడాది యాసంగి పంటలు త్వరగా కోతకు రావడం వల్ల బోర్ల వినియోగం తగ్గి భూమికి ఊరటనిచ్చింది. జిల్లా భూగర్భజల శాఖ అధికారులు ఏప్రిల్ మా సానికి సంబంధించిన గణాంకాలను శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో సగటు నీటి మట్టం 11.88 మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఇది మార్చి నెలతో (11.67మీటర్లు) పోలిస్తే కేవలం 0.21 మీటర్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. 46 డిగ్రీలతో ఎండలు మండిపోతున్నా కూడా జిల్లాలో ఆరోగ్యకమైన భూగర్భ జలాలు ఉండటం విశేషం. జిల్లాలో 82 పరిశీలక బోరు బావులు... ప్రతి నెలా భూగర్భ జలాల లెక్కలను తీసేందుకు జిల్లాలో 82 పరిశీలక బోరు బావులను (ఫీజో మీటర్లు) ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నెల గణాంకాలు వాటి ఆధారంగా చూస్తే... 30 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. అలాగే 43 ఫీజో మీటర్లలో 10 నుంచి 20 మీటర్ల లోపు భూ గర్భ జలాలున్నాయి. అదే విధంగా తొమ్మిది ఫీజో మీటర్లలో 20 మీటర్ల పైన లోతులో ఉన్నాయి. ఎండలు మండుతున్నా.. ఏప్రిల్ నెలలో అదుపులోనే ఉన్న భూగర్భ జలాలు తగ్గిన వ్యవసాయ బోర్ల వినియోగం ప్రస్తుతం జిల్లాలో నీటి మట్టం 11.88 మీటర్లు అదుపులోనే ఉన్నాయి.. జిల్లాలో భూగర్భ జలాలు అ దుపులో ఉండడం విశేషం. మార్చిలోనే పంటలు చేతికి రావడంతో బోర్ల వాడకం నిలిచిపోయింది. దీంతో సా ధారణంగా వేసవిలో ఉండే ఒత్తిడి భూగర్భ జలాలపై తగ్గింది. రైతులు ఆరుతడి పంటలు వస్తే మరింత నీటి ఖర్చు తగ్గుతుంది. – శ్రీనివాస్బాబు, జిల్లా భూగర్భజల శాఖ అధికారి -
సంకల్పంతో కృషి చేయాలి
ఖలీల్వాడి: సమయాన్ని వృథా చేయకుండా, సంకల్పంతో కృషి చేస్తే ఉద్యోగం సాధించవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉద్బోధించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఏకాగ్రతతో చదవాలని కర్తవ్యబోధ చేశారు. జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడ ఎస్సీ వసతి గృహంలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసిన ఉచిత ఫౌండేషన్ కోర్సును కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మా ట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాల అభ్యు న్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమ లు చేస్తోందని గుర్తుచేశారు. పోటీ పరీక్షలలో ప్రతి భ కనబర్చి ఉద్యోగాలు సాధించేలా స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ఉచితంగా శిక్షణ అందిస్తోందని అన్నారు. ఈ అవకాశాన్ని సరైన విధంగా వినియోగించుకుంటే ప్రభుత్వ కొలువు దక్కించుకోవచ్చని, భవిష్యత్తు ఎంతో బాగుంటుందని హితవు పలికారు. ఆంగ్లంలో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు. నోటిఫికేషన్లు విడుదల కాకముందు నుంచే ఉద్యోగ పోటీ పరీ క్షలకు సన్నద్ధం కావాలని మార్గనిర్దేశం చేశారు. ఇప్పటి వరకు 10 బ్యాచ్లలో 800 మందికి శిక్షణ అందించగా, 199 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కలెక్టర్కు వివరించారు. ప్రస్తుతం 11వ బ్యాచ్లో 93 మందికి ఐదు నెలలపాటు ఉచిత భోజన వసతి సదుపాయాలతో నాణ్యమైన శిక్షణ అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి రజిత, సహాయ అధికారి రాజగంగారాం, స్టడీ సర్కిల్ డైరెక్టర్ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. వసతిగృహాల పరిశీలన నగరంలోని నాందేవ్వాడ ఎస్సీ(బాలుర), సుభాష్నగర్ గర్స్ల్ వసతిగృహాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. కోచింగ్ సెంటర్ నుంచి గర్స్ల్ హాస్టల్కు దూరమవుతుందని, మరో భవనం చూడాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్, జిల్లా సహాయ సాంఘిక సంక్షేమ అధికారి రాజగంగారాంను ఆదేశించారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిస్తే ఉద్యోగం ఉచిత కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి


