breaking news
Nizamabad
-
ఇకనైనా తీరుమారేనా..?
● ఎకై ్సజ్ శాఖలో ఏసీబీ గుబులు ● సిబ్బంది నుంచి అధికారుల వరకు వసూళ్లు నిజామాబాద్ అర్బన్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఏసీబీ అరెస్టు యుమడం ఆ శాఖలో గుబులు రేపింది. నెలవారీ మామూళ్లు వసూలు చేసే కొందరు వణికిపోతున్నారు. అయి తే ఈఎస్ అరెస్టుతో శాఖలో మార్పు వస్తుందా? లేదా? అనే చర్చ సాగుతోంది. జిల్లాలోని వైన్షాపులు, బార్లు, కల్లు సొసైటీల నుంచి శాఖ సిబ్బంది, అధికారులకు మామూళ్లు అందతున్నాయనే ఆరోపణలకు ఏసీబీ సోదాలు బలాన్ని చేకూర్చాయి. జిల్లాలో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్, మోర్తాడ్ ప్రాంతాల్లో ఎకై ్సజ్ స్టేషన్లు ఉన్నాయి. నెలవారీ మామూళ్లలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు 60 శాతం తీసుకుని మిగతా 40శాతాన్ని కానిస్టేబుళ్లు, ఎస్సైలు, ఎస్హెచ్వోలకు వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి. కొందరు కిందిస్థాయి ఉద్యోగులే ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం. బట్టీల్లో విక్రయించే కల్లును ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే తయారు చేయాలి. కానీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఒక సెంటర్లో కృత్రిమ కల్లు తయారుచేసి బట్టీలకు సరఫరా చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఎకై ్స జ్ సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. బార్లలో తనిఖీలు లేవు జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి బార్లు నడిపిస్తుండగా, అతడికి చెందిన బార్లలో ఎకై ్సజ్ అధికారులు ఏనాడూ తనిఖీలు చేపట్టలేదని పలువురు ఆరోపిస్తున్నాయి. అనుమతుల సమయంలోనే ఎకై ్సజ్ అధికారికి రూ.5 లక్షలు అందించి ప్రతి నెల రూ.80 వేల వరకు ముట్టజెప్పుతుండడమే ఇందుకు కారణమంటున్నారు. గంజాయి కేసుల్లో.. ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ గంజాయి రవాణా చేస్తున్న వారిని, విక్రయిస్తున్న వారిని పట్టుకుని కొన్ని రోజుల వరకు నిందితుల అరెస్టు చూపడం లేదనే విమర్శలు జిల్లా ఎకై ్సజ్శాఖపై ఉన్నాయి. పలు కేసుల్లో పట్టుబడిన గంజాయిలో నుంచి సగానికి పైగా తీసివేసి కేసు తీవ్రతను తగ్గించేందుకు భారీ మొత్తం డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని అంతర్ జిల్లా గంజాయి ముఠా నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. దాడులు మరిచారు.. నవీపేట మండల కేంద్రానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఒకరు నవీపేట చుట్టు పక్కల 14 గ్రామాలకు కల్లును సరఫరా చేస్తున్నారు. నిషేధిత అల్ఫ్రాజోలాన్ని ఆరు మండలాలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఎకై ్సజ్శాఖ ఒక్కసారి కూడా దాడి చేయకపోవడం గమనార్హం. మూడు నెలల క్రితం బోధన్ డివిజన్లోని ఇద్దరు ఎకై ్సజ్ కానిస్టేబుళ్లకు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యింది. అయితే వారిద్దరు బదిలీ అవుతున్నామని వారం రోజుల ముందే నెలవారీ మామూళ్లను వసూలు చేసుకున్నారు. బదిలీపై వెళ్లిన మరో ఇద్దరు ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు అదే ప్రాంతానికి వెళ్లి మామూళ్లు అడుగగా వివాదం ఏర్పడింది. ఉన్నతాధికారులు సైతం ఈ విషయాన్ని బయటికి రానివ్వలేదు. జిల్లా కేంద్రంలోని ఓ కల్లు డిపో తీవ్ర వివాదంలో కురుకుపోయింది. విచారణ పేరుతో ఓ ఉన్నతాధికారి సంబంధిత డిపో నుంచి భారీ ఎత్తున మామూళ్లు తీసుకొని అనుమతి పునరుద్ధరించారనే విమర్శలున్నాయి. -
బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఓంసింగ్
సుభాష్నగర్: భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన నేనావత్ ఓంసింగ్ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆదేశాల మేరకు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రిటైర్డ్ ఉద్యోగి అయిన ఓంసింగ్.. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. తన నియామకానికి కృషి చేసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి ఓంసింగ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూరల్కే అధిక ప్రాధాన్యత.. బీజేపీ జిల్లా అధ్యక్షుడి సహా వివిధ మోర్చాల అధ్యక్షుల నియామకంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికే రాష్ట్ర నాయకత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా దినేష్ పటేల్ కులాచారితోపాటు యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పానుగంటి సతీష్రెడ్డి (డిచ్పల్లి), కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పాట్కూరి తిరుపతిరెడ్డి (జక్రాన్పల్లి) ఇప్పటికే కొనసాగుతున్నారు. తాజాగా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నేనావత్ ఓంసింగ్ (మోపాల్)ను నియమితులయ్యారు. -
కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా
● అసత్య ప్రచారాన్ని తిప్పికొడతా ● బాన్సువాడ సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డిరుద్రూర్ : బాన్సువాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడతానని బాన్సువాడ సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, ఎస్ఐఆర్ అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. నస్రుల్లాబాద్లో త్వరలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. పార్టీలోకి వచ్చిన వలస నేతలను చూసి ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సీనియర్ కార్యకర్తల సేవలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపుతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హులైన కార్యకర్తలకు పార్టీ బీ–ఫారాలు అందేలా ప్రయత్నిస్తానని తెలిపారు. అనంతరం ఎస్ఐఆర్ కార్యక్రమంపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. పార్టీకి సంబంధించిన ప్రతి ఓటు నమోదయ్యేలా బీఎల్ఏలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్, సీనియర్ నాయకులు గంగాధర్ దేశాయ్, కిషోర్ యాదవ్, సతీష్, కొత్తకొండ భాస్కర్, మేక వీర్రాజు, వెంకటగౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కేవీఆర్పై మూడు కేసుల కొట్టివేత
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై గతంలో నమోదైన మూడు క్రిమినల్ కేసులను హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. వెంకటరమణారెడ్డి న్యాయవాదులు ఎల్.ప్రభాకర్రెడ్డి, వై.రాము లు, టి.ఉదయ్ రాజ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపల్ పట్టణ ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా 2023లో స్థానిక రైతు లు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రజల ఆస్తులు, రైతుల భూములు, హక్కుల పరిరక్షణ కోసం చేపట్టి న ఆందోళనల్లో కేవీఆర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఆయనపై మూడు కేసు లు నమోదయ్యాయి. వాటిని సమగ్రంగా పరిశీలించిన న్యాయస్థానం అభియోగాలను కొనసాగించేందుకు తగిన ఆధారాలు లేవంటూ వాటిని కొట్టివేసిందని న్యాయవాదులు తెలిపారు. -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి..
నందిపేట్(ఆర్మూర్): పూజ చేసిన పూలను నిమజ్జనం చేసేందుకు వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందింది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని రామ్నగర్ కాలనీకి చెందిన పిస్క గంగాచరణ్ భార్య సుజాత బుధవారం ఉదయం 11 గంటలకు పూజ అనంతరం తీసేసిన పూలను నీటిలో వేసేందుకు రఘునాథ చెరువుకు వెళ్లింది. వైన్షాపులో పని చేసే గంగాచరణ్ మధ్యాహ్నం వేళ భోజనానికి ఇంటికి రాగా భార్య కనిపించలేదు. చుట్టు పక్కల వెతకగా చెరువులో మృతదేహం కనిపించింది. పూలను నీటిలో వేస్తుండగా కాలుజారి పడిపోయి ఉంటుందని గంగాచరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈత రాక ఒకరు.. ఆర్మూర్టౌన్: చెరువులో స్నానానికి వెళ్లిన ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన గణేశ్ (39) నీట మునిగి మృతిచెందినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ బుధవారం తెలిపారు. మచ్చర్ల గ్రామంలో గణేశ్ గొర్రెలను మేపుతూ చెరువు వద్దకు వెళ్లాడు. స్నానానికి దిగిన గణేశ్ ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తన భర్త మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని గణేశ్ భార్య చంద్రకళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ట్రాక్టర్ ఢీకొని మరొకరు..బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన షేక్ సల్మాన్(30) అనే వ్యక్తి ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. సల్మాన్ కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద నిలబడి ఉండగా అటు వైపు అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ గుంతలో పడి పక్కనే ఉన్న సల్మాన్ను ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన అతడిని స్థానికి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాములు తెలిపారు. -
సాగు బాట
డొంకేశ్వర్ మండలం తొండాకూర్ శివారులో ఎడ్లతో అరక దున్నుతున్న రైతుమరో పక్క సోయా విత్తనాలు వేస్తున్న మహిళలు వర్షం జల్లులు కురవడంతో రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. నేల తడవడంతో భూములను దున్ని సోయా, మక్క విత్తనాలు వేస్తున్నారు. డొంకేశ్వర్ మండలం తొండాకూర్ శివారులో ఓ రైతు ఎడ్లను అద్దెకు తీసుకుని నాగలితో దున్నుతుండగా మరోవైపు మహిళలు సోయా, పసుపు విత్తనాలు విత్తుతున్న దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్మనిపించింది. – డొంకేశ్వర్ (ఆర్మూర్) -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● ప్రతి ఒక్కరూ యాంటి డ్రగ్స్ సోల్జర్గా మారాలి ● పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బోధన్టౌన్(బోధన్): మాదక ద్రవ్య రహిత సమా జాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పిలుపునిచ్చారు. ‘మనబడి– మన భద్రత’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఇందూర్ మోడల్ హై స్కూల్లో బుధవారం మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్స్ వ్యసనానికి బానిసలవుతున్న వారు తమ బంగారు భవిష్యత్ను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్, అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. లేని పక్షంలో డయల్ ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫోన్ చేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మ ద్యం సేవించి వాహనాలు నడిపే వారు చేసిన తప్పునకు ఎదుటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతోపాటు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నా యన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ యాంటి డ్రగ్స్ సోల్జర్గా మారి సమాజంలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం యాంటి డ్రగ్స్ సోల్జర్ సెల్ఫీపాయింట్ను ప్రారంభించారు. డ్రాయింగ్, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఏసీపీ శ్రీనివాస్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, ఇందూర్ మోడల్ హైస్కూల్ కరస్పాండెంట్ కోడాలి కిశోర్కుమార్, సీఐలు వెంకటనారాయణ, విజయ్బాబు, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు హరికృష్ణ పాల్గొన్నారు. -
గంజ్లో రూ.6.56 కోట్లతో అభివృద్ధి పనులు
● 27న ఇన్చార్జి మంత్రి సీతక్కతో శంకుస్థాపన ● నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సుభాష్నగర్: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్, గాంధీగంజ్లో రూ.6.56 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తెలిపారు. బుధవారం మార్కెట్ యార్డులో గంగారెడ్డి అధ్యక్షతన పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గంజ్లలో అభివృద్ధి పనులకు ఈనెల 27న జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క శంకుస్థాపన చేస్తారన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగిటి రాంచందర్, ఇన్చార్జి సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ విజయ్ కిషోర్, డైరెక్టర్లు రాజలింగం, మారుతీ మల్లేష్, గంగారెడ్డి, బాగారెడ్డి, నరేందర్, మహ్మద్ ఈసా, రామకృష్ణ, కౌడపు రఘువీర్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి ఇంటింటి సర్వే ● 1560 మంది బీఎల్వోల నియామకం నిజామాబాద్ అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఇందులో భాగంగా బీఎల్వోలు ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నారు. బూత్స్థాయి అధికారులు ప్రస్తుతం ఉన్న ఓటర్లకు రెండు ఎ న్యూమరేషన్ ఫారాలను అందిస్తారు. ఓట రు సంబంధిత ఫారాలను నింపాలి. బూత్ స్థాయి అధికారులు వచ్చి ఒక ఫామ్ను తీసుకుంటారు. ఫామ్లను ఆన్లైన్లోనూ అప్లోడ్ చేయవచ్చు. కొత్త ఓటర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. డిక్లరేషన్ ఫారాంతో పాటు ఫామ్–6ను కూడా అందిస్తారు. జూలై 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జూలై 31న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 28 వరకు నోటీసులు, ఎన్యూమరేషన్ ఫారాలపై అభ్యంతరాల పరిష్కారం చేపడుతారు. అక్టోబర్ ఒకటిన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. అలాగే 2002 ఓటర్ జాబితాలో పేర్లు లేనివా రు తమ కుటుంబ సభ్యుల ఓటర్ ఐడీ వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపాలి. ఇప్పటికే నియోజక వర్గాల వారిగా ఓటర్ మ్యాపింగ్ను పూర్తి చేశారు. బీఎల్వోలకు శిక్షణ కూడా పూర్తి చేశారు. వీరు ఫారాలను అందించి వివరాలను సేకరిస్తారు. జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఖలీల్వాడి: జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు కేంద్ర విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోందని డీఈవో పార్శి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యారంగంలో నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర కమిటీల వడపోత అనంతరం జాతీయ స్థాయి తుది జాబితాను ప్రకటిస్తారన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈనెల 15 నుంచి జూలై10 వరకు https://nationalawardsto teachers.education.gov.in/ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మద్నూర్: అవాల్గావ్ సర్పంచ్ కీసర్వార్ మాన్యబాయి ఉమెన్ ఎంపవర్మెంట్ తెలు గు అసోసియేషన్ (వెటా) ఇండియా కోఆర్డినేటర్గా నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆమెను అభినందించారు. మహిళ సాధికారత కోసం చేసిన సేవలకు గుర్తింపుగా తనకు ఈ గౌర వం దక్కిందని మాన్యబాయి పేర్కొన్నారు. -
విత్తనాలు, ఎరువులపై సలహాలు
వాతావరణం, వర్షపాతం ఆధారంగా ఏ సమయంలో ఏ విత్తనాలు వేయాలి, ఏ ఎరువులు వాడాలి, పంటలను ఎలా రక్షించుకోవాలనే అంశంపై నిపుణుల సలహాలు కూడా అందజేస్తారు. తాజా వాతావరణ పరిస్థితులతో పాటు సలహాల కోసం స్థానిక వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఐఎండీ సూచనలను తెలుసు కోవడానికి మెట్ సెంటర్ హైదరాబాద్ అండ్ ఐఎండీ ( Metcentre Hyderabad & IMD) ను సందర్శించే అవకాశం కల్పించారు. రాబోయే ఎల్నినో వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు తట్టుకుని పంట నష్టాలను తగ్గించుకునేలా రైతులకు ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ ఖచ్చిత మైన సమాచారాన్ని అందించనుంది. -
4 నుంచి డిగ్రీ వన్టైం బ్యాక్లాగ్ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో బ్యాక్లాగ్పరీక్షలు జులై 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ కే సంపత్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2016, 2017, 2018, 2019, 2020 బ్యాచ్ల డిగ్రీ విద్యార్థులకు చివరి అవకాశంగా ఇస్తున్న బ్యాక్ లాగ్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ www. telanganauniversity. ac. in లో పొందుపర్చినట్లు తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప రిధిలోని బీఈడీ, బీపెడ్ నాల్గో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సి టీ వెబ్సైట్ www.telanganauniversity. ac.inను సంప్రదించాలని సూచించారు. కమ్మర్పల్లి: ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా మండలంలోని ఆయా పాఠశాలలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ డీఏలు మంజూరు చేయడంతోపాటు పీఆర్సీ, రిపోర్టులు, ఈహెచ్ఎస్ కార్డులను పంపిణీ చేయాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేయడంతోపాటు, ఓపీఎస్ను అమలు చేయాలని కోరారు. పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని తపస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. తపస్ జిల్లా అధ్యక్షుడు కిషన్రెడ్డి, మండలాధ్యక్షుడు సల్లూరి కిషన్గౌడ్, డివిజన్ ప్రతినిధులు శంకర్గౌడ్, వేణు, రవి, ప్రసాద్, స్వర్ణలత పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని మహ్మదీయకాలనీకి చెందిన బాలుడు షోయబ్(16) అదృశ్యమైనట్లు రెండో టౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై యాదగిరిగౌడ్ బుధవారం తెలిపారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన షోయబ్ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లింగంపేట(ఎల్లారెడ్డి): భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహారాజుల మురళి(59) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మురళి క్రియాశీల రాజకీయాల్లో గత 30 ఏళ్లుగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, కరసేవకుడిగా పనిచేశారు. మురళి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా, రాష్ట్ర నాయకులు, ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యక ర్తలు, స్నేహితులు, బంధువులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. వేల్పూర్: మండలంలోని మోతె గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ను దుండగులు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ ఎత్తుకెళ్లినట్లు రైతులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేయడంతో పొలాలకు నీటి సరఫరా నిలిచిపోయిందని, వరి నారుమడులు తడి ఆరిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు త్వరగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి సరఫరాను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఖిల్లా చౌరస్తాలో ఉన్న బాల్యరక్ష భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి పలు ఫైళ్లను తగలబెట్టినట్లు ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై సునీల్ తెలిపారు. బుధవారం రాత్రి బాల్యరక్ష భవనంలోకి చొరబడిన దుండగులు బీరువాలోని ఫైళ్లను తగులబెట్టారని చైల్డ్ హెల్త్లైన్ సూపర్వైజర్ కేతావత్ భీక్సింగ్ ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
బస్సు సౌకర్యం లేదు.. టీసీలు ఇవ్వండి
● మోడల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల వినతి డిచ్పల్లి: ‘మీ పాఠశాలకు బస్సు సౌకర్యం లేదు.. పిల్లలకు టీసీలు ఇస్తే మా ఊరిలోనే చదివించుకుంటాం’ అని డిచ్పల్లి మండలంలోని తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం డిచ్పల్లి మోడల్ స్కూల్లో సుమారు 500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత డిచ్పల్లి మండలంలోని ఆర్మూర్ రూట్లో ఉన్న గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని వచ్చి పాఠశాల ప్రిన్సిపాల్ను టీసీల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 40 మందికి పైగా టీసీల కోసం వినతిపత్రాలు ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఆర్మూర్ నుంచి ఇందల్వాయికి రెగ్యులర్గా బస్సు సౌకర్యం ఉండేది. ఈ బస్సులో పలు గ్రామాల విద్యార్థులు మోడల్ స్కూల్కు రాకపోకలు సాగించేవారు. ఇటీవల బస్సు సర్వీసును రద్దు చేయడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో టీసీల కోసం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దశరథ్ మాట్లాడుతూ.. కొన్ని గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు టీసీలు అడుగుతున్న మాట వాస్తవమేనని, పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. -
యథావిధిగా ప్రైవేట్ స్కూళ్ల దందా
ఆర్మూర్: ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను నియంత్రిస్తూ ప్రభుత్వాలు తీసుకొస్తున్న నిబంధనలు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదు. విద్యాలయాల ముసుగులో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల అమ్మకాలను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. తల్లిదండ్రులకు ఎంపిక స్వేచ్ఛ ఉండాలన్న నిబంధనను ఉల్లంఘిస్తూ పాఠశాల ఆవరణలోనే బుక్ స్టాల్స్, యూనిఫామ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా సంస్థల ధన దాహానికి విద్యాశాఖ అధికారుల మౌనం తోడు కావడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని మోయాల్సిన దుస్థితి నెలకొంది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్గల్, కామారెడ్డి పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో నెలకొల్పిన ప్రధాన కార్పొరేట్ పాఠశాలల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన మూడు రోజుల నుంచే పాఠశాలల స్టోర్ల వద్ద తల్లిదండ్రులు బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితిని ఎండగడుతూ పలు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాలు, ఫిర్యాదులు చేసినా సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా ఇస్తున్న పాఠ్య పుస్తకాల కోసం ప్రైవేట్ స్కూళ్లలో రూ.5,000 రూ.12,000 వరకు ఖర్చవుతోంది. నిబంధనలు కఠినంగా అమలు చేయకపోతే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు పిల్లల చదువు భారమేనని విద్యా హక్కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనిపించని పర్యవేక్షణ పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పుస్తకాలు, యూనిఫామ్ వ్యాపారం చేయొద్దని జీవో నంబర్ 01 (01 – 01 – 1994) స్పష్టం చేస్తోంది. పుస్తకాలు, యూనిఫామ్ ఎక్కడ కొనాలో నిర్ణయించుకునే హక్కు పిల్లల తల్లిదండ్రులకే ఉంటుందని 2017లో హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఫలితం శూన్యం. గత విద్యా సంవత్సరంలో అధిక ఫీజులు, పుస్తకాల అమ్మకంపై డీఈవో కార్యాలయానికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందగా, రెండు, మూడు పాఠశాలలకు మాత్రమే నోటీసులు ఇచ్చారు. సీజ్, గుర్తింపు రద్దు వంటి కఠిన చర్యలు ఇప్పటివరకు లేవు. తల్లిదండ్రులు చెబుతున్న సమస్యలు ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ సిలబస్కు అదనంగా ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలు, వర్క్బుక్స్ కొనాలని ఒత్తిడి పెట్టడంతో ఒకటో తరగతి చదివే ఒక్కో విద్యార్థిపై రూ.5,000 నుంచి రూ.7,500 అదనపు భారం పడుతోంది. పాఠశాల సూచించిన షాపులోనే యూనిఫాం, షూ, టై, బెల్ట్, బ్యాగ్ కొనాలని నిబంధనను అమలు చేస్తున్నారు. అయితే ఇక్కడ బయట మార్కెట్ కన్నా 30 నుంచి 40 శాతం ధరలు అధికంగా ఉంటున్నాయి. డిజిటల్ లెర్నింగ్ యాప్, స్టడీ మెటీరియల్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బ్యాచ్ల పేరుతో ర్యాంకర్స్ బ్యాచ్, ఒలంపియాడ్, ఐఐటీ ఫౌండేషన్ పేరుతో సాధారణ ఫీజుకు రెండు నుంచి మూడు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు. కాగితాలకే పరిమితమైన నిబంధనలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు విద్యావ్యాపారాన్ని నియంత్రించాలని విద్యార్థి సంఘాల డిమాండ్ ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చాయి. నియంత్రణ లేని అధిక ఫీజులను వసూలు చేయడమే కాకుండా వారి వద్దనే నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు కొనుగోలు చేయాలనడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. – గటాడి రాజు, హుస్నాబాద్ కాలనీ, ఆర్మూర్ ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న వ్యాపారాన్ని నియంత్రించడానికి నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది. కానీ వారు ఫిర్యాదులు వచ్చినపుడే స్పందించి తరువాత తమకు పట్టనట్లుగా వ్యవహరించడం తగదు. – నరేందర్, జిల్లా అధ్యక్షుడు, పీడీఎస్యూ, నిజామాబాద్ప్రైవేట్ విద్యా సంస్థల్లో వ్యాపారం నిర్వహించడంపై ఫిర్యాదులు వచ్చినపుడల్లా ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా శాఖా పరమైన చర్యలు తీసుకుంటున్నాం. తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడాన్ని అధికారులు సహించరు. – అశోక్, జిల్లా విద్యాధికారి, నిజామాబాద్ -
క్రైం కార్నర్
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రం శివారులో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేయడానికి పది రోజుల క్రితం కేరళ నుంచి వచ్చిన టీచర్ తాను నివాసం ఉంటున్న క్వార్టర్స్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నరసన్నపల్లి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేయడానికి కేరళకు చెందిన దేవిక విల్లా(30) పది రోజుల క్రితం వచ్చింది. బుధవారం సాయంత్రం తన గదిలో దేవిక ఉరేసుకొన్నట్లు గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. మనస్తాపంతో యువకుడు..గాంధారి(ఎల్లారెడ్డి): తండ్రి మందలించాడని మనస్తా పంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు.. పత్తి రాము(22) అనే యువకుడు వింతగా ప్రవ ర్తిస్తూ అమ్మాయిల మాదిరిగా డ్రెస్సులు వేసుకునే వాడు. ఏ పని చేయకుండా తిరుగుతుండడంతో ఏదైనా పని చేసుకోవాలని తండ్రి కాశీరాం మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాము మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మధ్యాహ్నం పెళ్లి.. రాత్రికి రోడ్డు ప్రమాదం
● ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిన నూతన వరుడు ● పెళ్లి కూతురి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు మధ్యాహ్నం అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. అదే సంతోషంలో ఇంటికి వెళ్తున్న నవ వధూవరుల కారుకు ప్రమాదం జరిగింది. వరుడి రెండు కాళ్లు విరిగిపోగా, పెళ్లి కూతురి తల్లిదండ్రులకు తీవ్రగాయాలయ్యాయి. ఆర్మూర్ మండలం అంకాపూర్ వద్ద బుధవారం రాత్రి 7.40 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. – నిజామాబాద్ అర్బన్/ఆర్మూర్ టౌన్ – వివరాలు మెయిన్ 5లో.. -
ఎలా ఉందంటే..
నేటి వాతావరణం డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వంతో పాటు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్నదాతలకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమా చారం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారిత ‘తెలంగాణ వాతావరణ సమాచారం’ కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. వాతావరణ శాఖ సహకారంతో తొలిదశలో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ జాబితాలో నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్, జయ శంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. తొలి దశలో.. రైతు భరోసా పోర్టల్ ఆధారంగా 17 జిల్లాలకు చెందిన సుమారు 15 లక్షల మందికి తొలిదశలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసా సాయం అందుతున్న 2,20,264 మంది రైతుల సెల్ఫోన్ నంబర్లను అనుసంధానం చేశారు. ఆయా రైతులకు ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఏఐ ఆధారిత వాతావరణ వివరాలు అందుతున్నాయి. అయితే, ఇందులో నమోదుకాని రైతులు వ్యవసాయశాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించే అవకాశాన్ని కల్పించారు. వాతావరణ మార్పుల గురించి నేరుగా రైతుల సెల్ఫోన్ వాట్సాప్కు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత సలహాలు అందనున్నాయి. వాతావరణం, వర్షపాతం ఆధారంగా ఏ సమయంలో ఏ విత్తనాలు వేయాలి, ఏ ఎరువులు వాడాలి, పంటలను ఎలా రక్షించుకోవాలనే అంశంపై నిపుణులు సలహాలు ఇస్తారు. ఈమేరకు జిల్లాలో రైతు భరోసా సాయం అందుతున్న 2,20,264 మంది రైతుల సెల్ ఫోన్ నంబర్లను అనుసంధానం చేశారు. రైతులకు విస్తృత అవకాశం కల్పించాలి వర్షాలు, ఉష్ణోగ్రతలు, వడగాలులే కాక రాబో యే వాతావరణ మార్పుల ముందస్తు అంచనాలను రైతులకు అందించనున్నారు. వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని నేరుగా రైతుల సెల్ఫోన్ వాట్సాప్ కు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారిత సలహాలను చేరవేస్తారు. ఏఐ, డిజిటల్ సాంకేతిక డేటాల అనుసంధానంతో శాటిలైట్ ఆధారిత వాతావరణ అంచనాలతో రూపొందించిన సమాచారం అందుతుంది. ఈ కార్యక్రమం అమలుకు డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్(డీఐఎల్), ఇండియా ఎవిడెన్స్ యాక్షన్ సంస్థలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సేవలపై వ్యవసాయాధికారులు రైతులకు విస్తృత అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాలు, ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ముందస్తు సమాచారం రైతుల వాట్సాప్కు నేరుగా ఏఐ ఆధారిత సలహాలు తొలిదశలో 17 జిల్లాల్లో కార్యక్రమం అమలు జిల్లాలో 2 లక్షల మందికి పైగా సెల్ఫోన్ నంబర్ల అనుసంధానం రైతు భరోసా పోర్టల్ ఆధారంగా సేవలు -
28న పోలియో చుక్కలు పంపిణీ
● డీఎం అండ్ హెచ్వో డాక్టర్ రాజశ్రీ సుభాష్నగర్: ఐదేళ్లలోపు పిల్లలకు జూన్ 28న పోలియో చుక్కల మందు పంపిణీ చేయనున్నట్లు డీఎంఅండ్హెచ్వో డాక్టర్ బి రాజశ్రీ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్లోగల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జాతీయ ఆరో గ్య కార్యక్రమాలపై ఆమె సమీక్షించారు. రాజశ్రీ మాట్లాడుతూ మొదటిరోజు 28న 90 శాతానికిపైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. 29న, 30న వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి చుక్కలు పంపిణీ చేయాలన్నారు. ఇటుక బట్టీలు, కన్స్ట్రక్షన్ భవన నిర్మాణాలు జరిగే ప్రదేశాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఐదేళ్లలోపు అర్హులైన పిల్లలందరికీ మందులు వేసి వందశాతం పూర్తి చేయాలని సూచించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లోభాగంగా క్షయ రహిత గ్రామాల మా దిరి పట్టణాల్లో కూడా క్షయ రహిత వార్డుల కోసం లక్షణాలు ఉన్న వారందరినీ పరీక్షించాలన్నా రు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు, న్యూట్రిషన్ కిట్లను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. జీవనశై లి వ్యాధుల నియంత్రణలో భాగంగా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ స్క్రీనింగ్ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 932 క్యాన్సర్ కేసులు ఉన్నట్లు తేలిందని, ప్రతి కేసును స్థానిక వైద్యాధికారి సమీక్షించి నిర్ధారించుకోవాలన్నారు. మొత్తం జనాభాలో 30 ఏళ్లు పైబడిన వారు 52 శాతం ఉంటారని, వారికి హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్స ర్ నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. కాగా పోలి యో చుక్కల మందు వేసిన తర్వాత మార్కింగ్ చేసేందుకు 1100 మార్కర్ పెన్నులను రెడ్క్రాస్ ప్ర తినిధులు డీఎంఅండ్హెచ్వో అందించారు. సమావేశంలో డీటీసీవో డాక్టర్ బేబీ నాగేశ్వరి, ఏవో సు మంత్ కుమార్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ సికందర్ నాయక్ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వెంక న్న, డాక్టర్ శిఖర, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శ్రావ్య, రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ ఆంజనేయులు, రాష్ట్ర ఎంసీ కమిటీ మెంబర్ తోట రాజశేఖర్పాల్గొన్నారు. 24ఎన్జెడ్టి241 : రోడ్డు ప్రమాదంలో కిందపడిపోయిన భర్తకు సపర్యాలు చేస్తున్న నూతన వధువు 24ఎన్జెడ్టి 242 : ప్రమాదంలో దెబ్బతిన్న నూతన దంపతుల కారు 24ఎన్జెడ్టి 243 : జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవీన్ -
విద్యుదాఘాతంతో గేదె మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): వ్యవసాయక్షేత్రాల్లో పడిపోయిన విద్యుత్ తీగలకు తగిలి గేదె మృతి చెందింది. మంగళవారం రాత్రి వీచిన గాలులకు మండలంలో ని గుర్జాల్ గ్రామశివారులోని వ్యవసాయభూముల్లో మూడు విద్యుత్ స్తంభాలు విరిగి కిందపడిపోయా యి. బుధవారం ఉదయం ఎప్పటిలాగే గ్రామానికి చెందిన రైతులు తమ పశువులను మేతకు వదిలగా అప్పటికే భూమిపై పడిపోయిన 11కేవీ విద్యుత్ తీగలు తగిలి రైతు చిటికె కిష్టయ్యకు చెందిన గేదె మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ రూ.50వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
ఇదేం పని..!?రోడ్డు విస్తరిస్తున్నారని ఆనంద పడాలో.. ఇరువైపులా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను చూసి భయపడాలో తెలియని పరిస్థితి. నిజామాబాద్ నగరంలోని వర్ని చౌరస్తా నుంచి నాగారం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. అయితే విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే పనులు చేపట్టడం గమనార్హం. రాత్రి వేళల్లో ప్రతిరోజూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ డిచ్పల్లి: ప్రభుత్వం ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలనే వాడి అధిక దిగుబడి సాధించాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) వీరాస్వామి రైతులకు సూచించారు. మండలంలోని నడిపల్లి రైతువేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళాను రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి తన సందేశాన్ని వినిపించారు. అనంతరం డీఏవో మాట్లాడుతూ.. మేళాలో ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. రైతులు తమకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను ఒకే చోట కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. పంటల సాగులో వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు. రూరల్ ఏడీఏ కృష్ణ, మండల వ్యవసాయాధికారి ఆంజనేయులు, టీఎస్ సీడ్ ఆర్ఎం వినయ్, నడిపల్లి సర్పంచ్ కులాచారి అశ్వినిసతీశ్కుమార్, సర్పంచ్లు సూదం శ్రీనివాస్, శాంతిలాల్, సొసైటీ సీఈ వో సాయిచంద్, సాయిలు, ఏఈవో లక్ష్మీప్రసన్న, సతీశ్, బూస సుదర్శన్, అశోక్, లక్ష్మారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తిచేయాలి
సుభాష్నగర్: జిల్లాలో ఎల్పీజీ వినియోగదారుల బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను ఈనెల 30వ తేదీలోగా వందశాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో పౌరసరఫరాలశాఖ అధికారులు, ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్తో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బయోమెట్రిక్ ఆధార్ ప్రక్రియ పూర్తి కాలేదనే కారణంతో ఏ ఒక్క వినియోగదారుడికీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపేయొద్దని ఆదేశించారు. ఇన్వాయిస్ బిల్లు కన్నా ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినట్లు ఫి ర్యాదులు వస్తే డీలర్లను బాధ్యులను చేస్తూ కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సబ్సిడీ సిలిండర్లు పక్కదారి పట్టొద్దని, వన్ టైమ్ పాస్వర్డ్ ఆధారిత డెలివరీ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని డీలర్లను ఆదేశించారు. బీఎల్వోలకు కిట్లు అందజేత నిజామాబాద్ అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టేందుకు ఇంటింటికి వెళ్లనున్న బూత్ లెవెల్ అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి బీఎల్వో కిట్లను మంగళవారం కలెక్టరేట్లో అందజేశారు. పారదర్శక ఓటరు జా బితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని బీఎల్వోలకు కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి సదస్సుకు జునైద్ అలీ నిజామాబాద్ లీగల్ : జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది, సామాజికవేత్త మహ్మద్ జునైద్ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వ హించనున్న అంతర్జాతీయ సదస్సుకు దేశం తరఫున ప్రాతినిథ్యం వ హించనున్నారు. ‘వాతావరణ మార్పులు, సమగ్ర అభివృద్ధి’పై థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఈనెల 29, 30 తేదీల్లో సదస్సు జరగనుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ ఎఫైర్స్ (యూఎన్డీఈఅండ్ ఎస్ఏ), ఎకనామిక్స్ అండ్ సోసియల్ కమీషన్ ఫర్ ఏసియా అండ్ పసిఫిక్ (యూఎన్ఈఎస్సీఏపీ) సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నాయి. ‘వా తావరణ మార్పులు, సుస్థిర అభివద్ధి లక్ష్యా ల మధ్య సమన్వయం’పై జునైద్ అలీ చర్చించనున్నారు. ఆయనకు సామాజిక కార్యకర్తలు, న్యాయవాద సంఘాల సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా తిరుపతిరెడ్డి సుభాష్ నగర్: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా జక్రాన్పల్లి మండలం మనోహ రాబాద్ గ్రామానికి చెందిన పాట్కూరి తి రుపతిరెడ్డి రెండోసారి నియమితులయ్యా రు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రా వు ఆదేశాల మేరకు కిసాన్ మోర్చా రాష్ట్ర అ ధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతిరెడ్డి గతంలో మనోహరాబాద్ సర్పంచ్గా పనిచేశారు. జిల్లాలో రైతాంగ సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. ఈసందర్బంగా ఆయ న మాట్లాడుతూ.. జిల్లాలో రైతుల సమస్యలపై భవిష్యత్లో మరింత ఉద్యమిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తన నియామకానికి సహకరించిన ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, పసుపు బోర్డు చైర్మ న్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారికి కృతజ్ఞతలు తెలిపారు. -
‘పబ్లిక్ స్కూల్’ ఏర్పాటుకు స్థల పరిశీలన
నవీపేట: మండల కేంద్రంలో నూతనంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనుండగా, అనువైన స్థలం కోసం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యటించారు. నవీపేటలోని ప్రభుత్వ బాలికల, బాలు ర ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. అలాగే మేకలు, కూరగాయల సంత ప్రాంగణాన్ని నిర్మాణానికి అనుకూలంగా మలుచుకోవాలనే ఆలోచనను పరిగణనలోకి తీసుకున్నారు. అనువైన స్థలం ఎంపిక జరిగాక స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అంతకుముందు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి వేర్వేరుగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ప్రముఖుల పేర్లను అడిగి తెలుసుకున్నారు. -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
డిచ్పల్లి: వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ కమాండెంట్ పి సత్యనారాయణ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సురక్షిత రవాణాపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ‘రోడ్డు భద్రత అవగాహన– ట్రాఫిక్ భద్రత ప్రతిజ్ఞ’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. అధికారులు, పోలీసు సిబ్బంది రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్బెల్ట్ వినియోగించాలని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. అనంతరం బెటాలియన్ అధికారులు, పోలీసు సిబ్బంది అందరూ ట్రాఫిక్ భద్రత ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించడంతోపాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రజల్లో కూడా అవగాహన కల్పించి సురక్షిత తెలంగాణ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. బెటాలియన్కు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అధికారులు తీరు మార్చుకోవాలి
● విధుల్లో అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదు ● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణసుభాష్నగర్: నిజామాబాద్ నగర కార్పొరేషన్లోని అన్ని విభాగాల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని, అలసత్వం వహిస్తే ఊరు కునేది లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా స్పష్టం చేశారు. నగర కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం ఇంజినీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బందితో స మావేశం నిర్వహించారు. ఒక్కో విభాగం వారీగా ఆయా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. టౌన్ ప్లానింగ్లో అనేక ఫిర్యాదులు తన దష్టికి వచ్చాయని, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. అలాగే ఇంజినీరింగ్ అధికారులు నగరంలో కొనసాగుతున్న పనులతోపాటు స్ట్రీట్ లైట్, పచ్చదనంపై దృష్టిసారించాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని శానిటేషన్ విభాగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో నెలరోజుల్లో మళ్లీ అన్ని విభాగాలతో సమావేశం నిర్వహిస్తానన్నారు. కమి షనర్ దిలీప్ కుమార్, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, ఆయా విభాగాధికారులు పాల్గొన్నారు. -
అసౌకర్యాల మధ్య ఎక్సలెన్స్
ఖలీల్వాడి: ఇంటర్మీడియెట్ విద్యనందిచడంతోపా టు విద్యార్థులను జాతీయస్థాయి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్కు సన్నద్ధం చేసేందుకు ఉద్దేశించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ)ని శిథిల భవనంలో ఏర్పా టు చేయడం ఏమిటని విద్యావేత్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గురుకులాల్లో విద్యనభ్యసించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు, ఎంట్రన్స్ ఎగ్జామ్లో అర్హత సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి జేఈఈ, నీట్, ఎప్సెట్, క్లాట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో పోటీ పడే విధంగా వారికోసం కంజర (మోపాల్), నిజామాబాద్ అర్బన్ మహాత్మ జ్యోతిబా పూలే (ఎంజేపీ) గురుకులాలను సీవోఈలుగా ఎంపిక చేశారు. అయితే డిజిటల్ తరగతులు, అత్యాధునిక ల్యాబ్లను ఏర్పాటు చేసి విద్యనందించాల్సిన సీవోఈల ను శిథిలభవనంలో ఏర్పాటు చేస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. నాలుగు బీసీ గురుకుల కళాశాలలు.. జిల్లాలోని మోర్తాడ్, రాంపూర్, కంజర(మోపాల్), నిజామాబాద్ అర్బన్ బీసీ గురుకుల కళాశాలలకు భవనాలు లేకపోవడంతో డిచ్పల్లి మండలం ధర్మారంలోని కాకతీయ బిల్డింగ్లో ఒకే దగ్గర ఏర్పాటు చేశారు. కంజర, నిజామాబాద్ అర్బన్ గురుకులాలు సీవోఈలుగా ఎంపికయ్యాయి. స్థానికంగానే ఉన్న మరో విద్యా సంస్థకు చెందిన భవనంలో ‘ఇందూర్ స్కూల్’ను ఎంజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే వారు. సుమారు 460 మంది విద్యార్థులు వసతులు లేక ఇబ్బందులు పడ్డారు. అయితే కాలేజీకి అప్గ్రేడ్ కావడంతో కంజరకు తరలిపోయింది. కలెక్టర్ చొరవ చూపిస్తే మేలు.. పాత భవనంలో బీసీ గురుకులాలు (సీవోఈ) ఏర్పాటు చేయకుండా కలెక్టర్ చొరవ చూపించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. అరకొర వసతుల మధ్య నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్ ్డ్స, ఎప్సెట్, క్లాట్, లాసెట్ వంటి అత్యుత్త మ శిక్షణ ఎలా పొందవచ్చని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ స్పందించి భవనాన్ని పరిశీలించాలని, సీవోఈలను అన్ని సౌకర్యాలు ఉన్న భవనంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. భవనం పరిస్థితి పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్సీవో సత్య నాథ్రెడ్డికి ఫోన్లో వివరించినట్లు సమాచారం. రేకుల షెడ్డులో తరగతి గది సిమెంట్ వాటర్ ట్యాంక్ పరిస్థితి.. డోర్లు లేని మరుగుదొడ్లు కథ మొదలైంది ఇక్కడే.. అప్గ్రేడ్ కావడంతో ఇందూర్ స్కూల్ తరలిపోవడంతో ఖాళీగా ఉన్న భవనంలోకి సీవోఈలను ఏర్పాటు చేయించుకునేందుకు ఆ భవన యజమాని తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు తెలిసింది. సరిపడా తరగతి గదు లు, ల్యాబ్లకు గదులు లేకపోగా, వాష్ రూమ్ లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రేకుల షెడ్డుల్లో తరగతి గదులను కొనసాగించాల్సిన పరిస్థితి. ఇటువంటి భవనంలో ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. రాష్ట్ర బీసీ గురుకుల కమిషనర్ సీఈవో విద్యార్ధులకు అవసరమైన మెటీరియల్ పంపించారు. అయితే ఈ శిథిల బిల్డింగ్లో మెటీరియల్ను నిల్వ చేసే పరిస్థితి లేదని తెలిసింది. ఎంజేపీ సీవోఈపై రాజకీయ ఒత్తిళ్లు! 230 మంది విద్యార్థుల భవిష్యత్తో చలగాటం నీట్, జేఈఈ, ఎప్సెట్ కోచింగ్కు అనుకూలంగా లేని భవనం రేకుల గదులు, డోర్లు లేని టాయిలెట్లు ఆ బిల్డింగ్లో వద్దంటూ ఆర్సీవోకు విద్యార్థుల తల్లిదండ్రుల విన్నపం రాజకీయ ఒత్తిడి లేదు పాత జీనియస్ స్కూల్ భవనంలో సీవోఈల ఏర్పాటుకు ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదు. ఈ భనవంలో దసరా వరకు నాలుగు గదులు నిర్మించడంతోపాటు వచ్చే ఏడాది వరకు భవనాన్ని పూర్తిస్థాయిలో అందిస్తానని యజమాని అగ్రిమెంట్ ఇచ్చారు. అవసరమైన మరమ్మతులు చేస్తారు. గతేడాది ఏంజేపీకి సంబంఽధించిన ఇందూర్ స్కూల్ ఈ భవనంలోనే కొనసాగింది. – సత్యనాథ్రెడ్డి, ఆర్సీవో, నిజామాబాద్ జిల్లా -
మామూళ్ల మల్లారెడ్డి
ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు – 8లో uప్రగతినగర్లో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇల్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని హైదరాబాద్కు తరలిస్తున్న ఏసీబీ అధికారులు నిజామాబాద్ అర్బన్: ఆదాయానికి మంచి ఆస్తులను కూడబెడుతూ ‘పైసల మత్తు’లో ఉన్న ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని ప్రగతినగర్లో ఉన్న ఆయన ఇంట్లో, ఎకై ్సజ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని ఆ యన బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ప్రగతినగర్లోని ఇంట్లో రూ.3.31 లక్షలు, బ్యాంకులో రూ.50 లక్షలు జప్తు చేశారు. వివిధ ప్రాంతాల్లో నాలుగు ఇళ్లు, ఒక కమర్షియ ల్ భవనం, ఎనిమిది ఖాళీ స్థలాలు, 10.23 ఎకరాల వ్యవసా య భూమిని గుర్తించారు. మూడు లాకర్లను తెరిస్తే మరిన్ని ఆస్తులు, నగదు బయటపడే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు మల్లారెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. సాధారణ బదిలీల్లో భాగంగా నేడో రేపో వేరే జిల్లాకు వెళ్లిపోవాల్సిన ఎస్ఈని ఏసీబీ పట్టుకుంది. మూడున్నరేళ్లుగా జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న కొమ్మూరి మల్లారెడ్డి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. వైన్షాపులు, బార్లు, కల్లు డిపోలకు ఇవ్వాల్సిన మామూళ్లను ఫిక్స్ చేశారనే ఆరోపణలున్నాయి. వారికే కాదు.. ఈయనకూ ‘గుడ్విల్’ నూతన వైన్షాపులు కేటాయించిన సమయంలో లక్కీడ్రాలో షాపులు దక్కించుకున్న వారు ‘గుడ్విల్’ తీసుకుని ఇతరులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో ఒక్కో షాపు నుంచి ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రూ.2 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్షాపుల నుంచీ కిందిస్థాయి సిబ్బంది ద్వారా నెలవారి మామూళ్లు అందేవి. వైన్స్షాపులు మద్యం విక్రయాల నిబంధనలను ఉల్లంఘించినా ఏనాడూ ఎస్ఈ తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు. కోటాకు మించి విక్రయాలు సాగిస్తున్న వైన్షాపుల నుంచి నెలవారి మామూళ్లతో సంబంధం లేకుండా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అదనంగా వసూలు చేసేవారనే ఆరోపణలున్నాయి. అలాగే బార్లను రెండేళ్లుగా తనిఖీ చేయకపోవడానికి నెలవారీ మామూళ్లతోపాటు అదనపు వసూళ్లే కారణమని తెలుస్తోంది. కల్లు డిపోల నిర్వహణకు సంబంఽధించి ప్రతి సొసైటీ నుంచి రూ.25 వేల చొప్పున ఎస్ఈ నెలనెలా వసూలు చేశారని, ఇటీవల ఓ డిపో వ్యవహారంలో వివాదాలు తారాస్థాయికి చేరగా, విచారణ పేరుతో ఓ వర్గానికి లబ్ధి చేకూర్చి రూ.3 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. నిందితులను వదిలేస్తూ..జిల్లాలో భీమ్గల్, మోర్తాడ్, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ ఎకై ్సజ్ శాఖ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఎస్హెచ్వోలు కొనసాగుతున్నా రు. జిల్లా టాస్క్ఫోర్స్ బృందం ఏర్పాటు చేశా రు. అయితే జిల్లా అధికారులకు నెలవారి మామూళ్లు అందించడం, తప్పుచేసిన వారిని తప్పించేందుకు జిల్లా అధికారులకు భారీగా డబ్బులు సమర్పించడంలో కిందిస్థాయి సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కల్లు డిపోల్లో నిషేధిత మత్తుపదార్థాలు లభించినప్పడల్లా కేసు లు నమోదు చేయకుండా వదిలేసిన ఘటనలు ఉన్నాయి. ఈ వ్యవహారాల్లో భారీ ఎత్తున డబ్బులు తీసుకొని నిందితులను వదిలేశారు. రెంజల్ మండలంలోని గత మూడు నెలల క్రితం చోటు చేసుకున్న ఘటన పరిస్థితికి అద్దం పడుతోంది. మంగళవారం తెల్లవారు జామునే చేరుకున్న అధికారులు వైన్షాపులు, బార్లు, కల్లు డిపోల నుంచి నెలవారీ మామూళ్లు కిందిస్థాయి సిబ్బంది ద్వారా వసూళ్లు -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఆర్మూర్టౌన్/మాక్లూర్/బోధన్రూరల్/నందిపేట్ : యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సైలు అనిల్రెడ్డి, రజనీకాంత్, రా జశేఖర్ అన్నారు. ఆర్మూర్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో, మాణిక్భండార్, పెగడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రధానంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి నందిపేట్ (ఆర్మూర్): గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలు అరికట్టే అవకాశం ఉందని ఆ ర్మూర్ రూరల్ సీఐ జాన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో మంగళవారం ఎస్ ఐ వినయ్ ఆధ్వ ర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ ఎర్రం లింగం, ఉప సర్పంచ్ రామచందర్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, తదితరులున్నారు.నందిపేటలో మాట్లాడుతున్న సీఐ జాన్రెడ్డి అవగాహన కల్పిస్తున్న ఎస్సై రజినీకాంత్ -
రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
రెంజల్(బోధన్): వానాకాలం సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అఖిల భారత ఐక్య రైతు వేదిక, వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం రెంజల్ తహసీల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రావణ్కుమార్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య వేదిక రాష్ట్ర ప్రతినిధులు పుట్టి నాగన్న, గుమ్ముల గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రతినిధి పార్వతి రాజేశ్వర్లు మాట్లాడుతు విత్తనాల ఎంపిక, ఎరువుల సరఫరాతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఫర్టిలైజర్ యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. యూరియాను ఎకరాకు కనీసం 4 బస్తాలను అందించాలన్నారు. ఏడు రకాల సన్నాలకే కొనుగోలు చేస్తామని నిబంధనలను పెట్టడం సరికాదన్నారు. మండల ప్రతినిధులు పెద్దులు, పొశెట్టి, గంగాధర్, సిద్ద పొశెట్టి, రవి, సాయిలు, మైసయ్య, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిళ్ల వితరణ
వేల్పూర్: మండలం అంక్సాపూర్ హైస్కూల్లో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు రూ. 24 వేల విలులైన స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిళ్లను మంగళవారం విద్యార్థులకు అందజేశారు. ఎన్.ఆర్.ఐ లు, గ్రామ పూర్వ విద్యార్థులు సుంకరి నరేశ్, బాల రాజేశ్వర్, బి.నవీన్, సుంకరి రాజేశ్, రిక్క వంశీలు విద్యార్థులకు అవసరమైన వస్తువులను వితరణ చేశారు. ప్రాథమిక పాఠశాలకు మూడు అదనపు గదులు, ప్రహరీ నిర్మాణానికి రూ. 63 లక్షల నిధు లు మంజూరు చేయించిన సొసైటీ మాజీ చైర్మన్ దేగాం రాములును సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ తీట్ల శ్రీనివాస్, ఉపసర్పంచ్ నేరెళ్ల రాజేశ్వర్రెడ్డి, హైస్కూలు, ప్రైమరీస్కూలు హెచ్ఎంలు మల్లీశ్వరి, రాజేందర్గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నోట్బుక్స్ పంపిణీ బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని శక్కర్నగర్ కాలనీలోని శ్రీ సరస్వతి శిశుమందిరం పాఠశాలలో మంగళవారం చిట్ చాట్ సర్వీస్ భాగంగా నోట్ బుక్కుల, బ్యాగ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సరస్వతి శిశుమందిరం పాఠశాల కమిటీ అధ్యక్షులు గణేశ్, ప్రతినిధులు మహేశ్, నరేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మమత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బోధన్లో సర్ హెల్ప్డెస్క్ ప్రారంభం
బోధన్: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్– స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)సర్వే ప్రక్రియలో తలెత్తే సమస్యలు, సందేహాలు నివృత్తికి హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశామని బోధన్ ఆర్డీవో విజయకుమారి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్ ఆవరణలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్షన్ సెల్ వద్ద సర్ హెల్ప్ డెస్క్ను ఆర్డీవో ప్రారంభించారు. హెల్ప్డెస్క్ను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ విఠల్, సీనియర్ అసిస్టెంట్ సుశీల,ఆపరేటర్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఓటరు సవరణను సక్రమంగా చేపట్టాలి వేల్పూర్: త్వరలో నిర్వహించే ప్రత్యేక ఓటరు సవరణ(సర్) కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టాలని వేల్పూర్ మండల తహసీల్దార్ అనిరుధ్ పేర్కొన్నారు. మంగళవారం వేల్పూర్ రైతు వేదికలో మండల, గ్రామాల బూత్స్థాయి అధికారులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్లో పొందుపరచిన నియమ నిబంధనలు అనుసరించి గ్రామాలో ఓటరు జాబితా రూపొందించాలని చెప్పారు. ఎటువంటి పొరపాట్లు జరిగినా బూత్స్థాయి అధికారులే బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అధికారులు, సూపర్వైజర్లు, బీఎల్వోలు పాల్గొన్నారు. -
సాలూర మండల ఉపసర్పంచ్ల ఫోరం ఎన్నిక
బోధన్: సాలూర మండల ఉపసర్పంచ్ల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం ఆవరణలో మండలంలోని గ్రామ ఉపసర్పంచ్లు సమావేశం అయ్యారు. అధ్యక్షుడిగా భుయ్యన్ సురే శ్ పటేల్( సాలూర) ఉపాధ్యక్షుడు మహేశ్ రెడ్డి( సాలూర క్యాంప్),ప్రధాన కార్యదర్శి ప్రహ్లాద్( మందర్నా), కార్యదర్శిగా ఎం.డి.సత్తార్ (సాలంపాడ్) కోశాధికారిగా శ్రావణ్ మిగిలిన ఉపసర్పంచ్లు సభ్యులుగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపసర్పంచ్లకు చెక్ పవర్ తొలగించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. వివిధ గ్రామాల ఉపసర్పంచ్లు ఉన్నారు. -
రైతు వేదికల్లో విత్తన మేళా
పెర్కిట్/వర్ని/వేల్పూర్/మాక్లూర్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు పలుచోట్ల రైతువేదికల్లో విత్తన మేళా లు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని పిప్రి, ఫత్తేపూర్, గోవింద్పేట్, వర్ని, వేల్పూర్, పడగల్, అంక్సాపూర్, పచలనుడ్కుడ, మోతె, మాక్లూర్, గొట్టిముక్కుల, చిన్నాపూర్, అ మ్రాద్ రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహించారు. ఈసందర్భంగా ఏడీఏ విజయలక్ష్మీ మాట్లాడుతూ విత్తన డీలర్లు ప్రభుత్వం గుర్తించిన విత్తన రకాలను రైతులకు ప్రదర్శించడానికి విత్తన మేళా నిర్వహించినట్లు తెలిపారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఏఈవోలు, విత్తన డీలర్లు, రైతులు పాల్గొన్నారు. -
వానలు కురవాలి..రైతులు మురవాలి
● నానో యూరియాతో అధిక ప్రయోజనాలు ● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డిరెంజల్(బోధన్): వానాకాలం సీజన్లో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులు మురవాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అకాంక్షించారు. రెంజల్ మండలం దండిగుట్టలో మంగళవారం రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఆయన పాల్గొని, ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. జీపీ భవనం మీడియా సమావేశంలో మాట్లాడారు. చెరువులు, కుంటల్లో మట్టి, మొరం తవ్వకాలను అధికారులు అడ్డుకోవద్దని సూచించారు. సమాంతరంగా తవ్వడంతో చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. ప్రమాదకరంగా గుంతలు తవ్వకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. యూరియా కష్టాలను అధిగమించేందుకు ప్రభు త్వం మార్పులు, చేర్పులు చేస్తుందన్నారు. నానో యూరియాతో అధిక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అనంతరం స్థానిక అధికారులతో సమావేశ మై పలు సూచనలు అందించారు. ఆయా గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించి గ్రామాల అభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొబిన్ఖాన్, డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి, సర్పంచ్లు ధనుంజయ్, గయాసోద్దిన్, తెలంగాణ శంకర్, మల్లేశ్, నాయకులు సాయరెడ్డి, రాములు, జావీద్, ఒడ్డెక్క మోహన్, సాయిబాబగౌడ్, అసానీ అనీల్, నితిన్, సురేందర్గౌడ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలందించాలి.. బోధన్: ప్రభుత్వాస్పత్రులకు వైద్య చికిత్సల కోసం వచ్చే రోగులకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డి వైద్యులు,సిబ్బందికి సూచించారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నూ తన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానిక పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్ని పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి మండల టాపర్స్గా నిలిచిన విద్యార్థినులు రూమేస్సా, అల్ఫీనాలను శాలువాతో సన్మానించి అభినందించారు. సర్పంచ్ సుంచన కోట అనురాధ రాధ కిషన్ గౌడ్, ఉపసర్పంచ్ నీలం కృష్ణ, పాఠశాల హెచ్ఎం జోన్స్, ఎడపల్లి పీహెచ్సీ వైద్యాధికారి వినీత్కుమార్ రెడ్డి, తహసీల్దార్ దత్తాద్రి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షుడు పులి శ్రీనివాస్, లక్ష్మి నర్సింహాస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్ గౌడ్, సర్పంచ్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కమలాపూర్లో పల్లె దవాఖానా ప్రారంభం నవీపేట: మండలంలోని కమలాపూర్ గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుమూల గ్రామాలలోని కొందరు ఆర్ఎంపీలు కాసుల కక్కుర్తికి అలవాటు పడి కార్పొరేట్ ఆస్పత్రులకు పంపిస్తున్నారని, వారి మాయమాటలు నమ్మవద్దని సూచించారు. లేనిపోనా భయాన్ని సృష్టించే నకిలీ ఆర్ఎంపీలపై కేసులు నమోదు చేయాలని స్థానిక సీఐ, ఎస్సైలను ఆదేశించారు. కాంగ్రెస్పార్టీ నాయకులు నగేష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.ఆటోడ్రైవర్లకు ఇళ్ల పట్టాల పంపిణీ బోధన్టౌన్: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం 59 మంది ఆటోడ్రైవర్లకు సుదర్శన్రెడ్డి పట్టాలు అందజేశారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో 8 ఏళ్ల క్రితం ఆటో డ్రైవర్లకు స్థలాలు కేటాయించారు. ఆటో యూనియన్ ప్రతినిధులు, ఉన్నారు. -
నృత్యప్రదర్శనకు వెళ్తూ.. అనంతలోకాలకు..
● రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్మాస్టర్ మృతి ● నిజామాబాద్ రూరల్ మండలం గాంధీనగర్లో ఘటన బాన్సువాడ/నిజామాబాద్ రూరల్ : నృత్య ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లిన ఓ డ్యాన్సర్ ప్ర మాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడలోని శాంతినగర్ కాలనీకి చెందిన అన్నం అనిల్(34) డ్యాన్స్ మాస్టార్గా జీవ నం సాగిస్తున్నాడు. నిజామాబాద్లో తన డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వడానికి మంగళవారం ఉదయం బా న్సువాడ నుంచి బైక్పై బయలుదేరాడు. నిజామాబాద్ రూరల్ మండలం గాంధీనగర్ వద్ద ఆర్టీసీ బ స్సును ఢీకొనడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాన్సువాడలో విషాదఛాయలు.. అనిల్ స్వగ్రామం బోర్లం కాగా, సుమారు 20 ఏళ్ల క్రితం బాన్సువాడకి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆరేళ్ల క్రితం బోధన్ మండలం ఎరాజ్పల్లికి చెందిన సిరిని పెళ్లి చేసుకున్నాడు. అనిల్కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పట్టణంలోనే నటరాజ్ నాట్య మండలిని ఏర్పాటు చేసి చిన్నారులతోపాటు, యువతీయువకులకు డ్యాన్స్లో శిక్షణ ఇచ్చారు. బాన్సువాడ, నిజామాబాద్తోపాటు రాష్ట్రస్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. తన డ్యాన్స్తో అందరి మన్ననలు పొందిన అనిల్ మృతి కళారంగాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. బాన్సువాడలోని కుటుంబసభ్యులతోపాటు అభిమానులు, స్నేహితులు అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంత్యక్రియలకు వందలాది మంది బంధువులు, అభిమానులు, యువకులు, కళాకారులు హాజరయ్యారు. -
పేకాడుతున్న ముగ్గురి అరెస్టు
బోధన్ రూరల్: సాలురా మండలంలోని మందర్న గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను బోధన్ రూరల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోధన్: సాలూర మండల కేంద్రానికి చెందిన శతాధి క వయస్సు ఉన్న వృద్ధురా లు కందిమల్ రామ వ్వ(103) మంగళవారం సాయంత్రం కన్నుమూ శా రు. ఆరు నెలల నుంచి ఆ నారోగ్య సమస్యలతో ఆ మె బాధపడుతుంది. వందేళ్లకు పైగా రామవ్వ ఆరోగ్యంగానే తమ మధ్య జీవనం గడిపిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం మ ధ్యాహ్నం స్వగ్రా మంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. ఖలీల్వాడి: డొంకేశ్వర్ మండల తపాస్ అధ్యక్షుడు సుదర్శన్, జక్రాన్పల్లి అధ్యక్షుడు శ్రీనివాస్ పీఆర్టీయూ చేరారు. జిల్లాకేంద్రంలో మంగళవారం వారికి పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొద్దుటూరి మోహన్రెడ్డి, గంగోని కిషన్ సంఘ కండువాలు వేసి, ఆహ్వానించారు. సుదర్శన్, శ్రీనివాస్లను పీఆర్టీయూ రాష్ట్ర అసోషియేట్ అధ్యక్షులుగా నియమించినట్లు జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు మోహ న్ రెడ్డి తెలిపారు. జక్రాన్పల్లి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోపి, రవీన్, డొంకేశ్వర్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్, మోహన్, ఎడపల్లి అధ్యక్షుడు సాయిరెడ్డి, రేంజల్ అధ్యక్షుడు సోమలింగం గౌడ్, నాయకులు ప్రవీణ్ రెడ్డి, గట్ల కిషన్, సంతోష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: పోలీస్ శాఖలోని ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. జిల్లాకేంద్రంలోని సీపీ కార్యాలయంలో మంగళవారం సీపీ సాయిచైతన్య పదోన్నతి పొందిన బి.సుదర్శన్, ఎన్.ప్రసాద్ను అభినందించారు. జిల్లాకేంద్రంలో కారు చోరీ నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఒకటవ టౌన్పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కారు చోరీ జరిగింది. వివరాలు ఇలా.. నగరంలోని చైన్నె షాపింగ్మాల్ సమీపంలో కొన్ని కార్లు అద్దె కోసం నిలిపి ఉన్నాయి. హైమద్ అనే వ్యక్తి మంగళవారం కారు రెంట్కు కావాలని, నాందేడ్కు వెళ్లాలని కారు ఓనర్తో మాట్లాడుకున్నాడు. అనంతరం వారు నాందేడ్కు బయలుదేరారు. గాంధీచౌక్లో అరటిపండ్లు కొనుగోలు చేసి, తీసుకురావాలంటూ డ్రైవర్కు హైమద్ తెలిపాడు. దీంతో డ్రైవర్ అరటిపండ్లు కొనుగోలు చేసేందుకు కారు దిగి వెళ్లగా, హైమద్ కారుతో పరారయ్యాడు. దీంతో బాధితుడు ఒకటవ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగబోధన్టౌన్(బోధన్): పట్టణంలోని పాన్గల్లీ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాల మధ్య మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా మహాలక్ష్మి మందిరానికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజ లు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఇందులో మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఏర్పాట్లుఆర్మూర్: ఆర్మూర్ విద్యుత్ డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కొత్తగా విద్యుత్ లైన్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి మౌళిక వసతులను బలోపేతం చేసినట్లు ఆర్మూర్ పట్ట ణ–1,2 ఏఈలు నజ్మా, సాయి వినాయ్ పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. గృహజ్యోతి పథకంలో భాగంగా ఉచిత విద్యుత్ ప్ర యోజనం పొందాలంటే కేవలం 200 యూనిట్ల లోపు వినియోగం ఉండాలన్నారు. 200ల యూని ట్లు దాటితే ఈ పథకం వర్తించదని వివరించారు. నెల వారీ బిల్లులను సైతం సకాలంలో చెల్లించని పక్షంలో రూ.25, రూ.75, రూ.250 జరిమానా విధిస్తామన్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేసే అవకాశం సైతం ఉందని వివరించారు. -
వర్షాధార పంటలకు గడ్డుకాలం
● సరిపడా వర్షాలు లేక ఆందోళనలో అన్నదాతలు ● సోయాబీన్, మొక్కజొన్న విత్తుకోవడంపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితిఆర్మూర్: జిల్లాలో వర్షాధార పంటలకు గడ్డుకాలం వచ్చింది. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటికీ సరిపడ వర్షాలు పడకపోవడంతో జిల్లా రైతాంగం సోయాబీన్ వేయాలా, మొక్కజొన్న వేయాలా అని తేల్చుకోలేక తీవ్ర అయోమయంలో పడింది. జిల్లాలో 98,500 వ్యవసాయ బోరు బావులు ఉన్నా యి. ఈ ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 54,601 ఎకరాల్లో మొక్కజొన్న, 34,227 ఎకరాల్లో సోయాబీన్ సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ వానలు లేకపోవడంతో ఆ లెక్కలన్నీ తలకిందులయ్యే పరిస్థితి వచ్చింది. సోయాకు వాన.. మక్కకు బోరు.. తక్కువ పెట్టుబడి, తక్కువ కూలీలతో లాభాలు వస్తాయని శ్రమ తగ్గించుకొనే కొందరు రైతులు సోయాబీన్వైపు మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్నతో పోలిస్తే సగం శ్రమతోనే సోయాలో సమానమైన దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. దీంతో పొలాలను దుక్కి చేసి, విత్తనాలు సిద్ధం చేసుకుని ఆకాశం వైపు చూస్తున్నారు. కానీ సోయా పూర్తిగా వర్షాధార పంట కావడంతో తొలకరి పడితేనే విత్తనం పడేది. అలాగే మే చివరి నుంచి జూలై 15 వరకు మొక్కజొన్న విత్తుకోవచ్చు. ఇది 120 రోజుల పంట. నీటి వసతి ఉన్న రైతులు ధైర్యంగా మొక్కజొన్న వేస్తున్నారు. బోర్లలో నీళ్లు ఉన్నవారు కొంతలో కొంత విత్తనం వేసినా, వర్షం లేకపోతే ఆ పంట కూడా నిలబడే పరిస్థితి లేదు. జాడలేని వ్యవసాయాధికారులు.. ప్రతికూల వాతావరణంలో రైతులకు దిశానిర్దేశం చేయాల్సిన వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాము రైతుల వద్దకు వెళ్లలేకపోతున్నామని కొందరు సిబ్బంది వాపోతున్నారు. గతంలో మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా సోయాను ప్రోత్సహించిన అధికారులు, ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంట వేయాలో చెప్పలేక చేతులెత్తేస్తున్నారు. విత్తుకోవడానికి అయోమయం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి వచ్చిందని రైతులకు తెలుసు కానీ.. చూస్తూచూస్తూ వ్యవసాయ భూమిలో పంటలు విత్తుకోకుండా ఉండలేము. వర్షాలపై నమ్మకం ఉంచి బోరు బావులతోనైనా పంట పండిస్తామనే నమ్మకంతో విత్తుకుంటున్నాము. కానీ పంట చేతికి రావాలంటే వర్షం పడాల్సిందే. – పెద్దకాపు రాజు, రైతు, పెర్కిట్, ఆర్మూర్ మొక్కజొన్న విత్తాను.. ప్రతీ ఏడాదిలాగే సోయాబీన్ విత్తుకుందామని అనుకున్నాం. కానీ తొలకరి సకాలంలో రాకపోవడంతో బోరుబావిలో ఉన్న నీటితో మొక్కజొన్న విత్తాను. మొక్కజొన్నకు కూడా వర్షం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో తోచడం లేదు. భూగర్భ జలాలు సైతం ఆశించిన స్థాయిలో లేవు. – నచ్చు గంగాధర్, రైతు, పెర్కిట్, ఆర్మూర్ -
వైద్య శిబిరానికి విశేష స్పందన
బోధన్: పట్టణ కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్, లయన్స్ కంటి ఆస్పత్రి, మ నోరమ హస్పిటల్ అధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది.ప్రజలు, న్యాయవాదులు, పోలీ సు ,కోర్టు సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఈశిబిరాన్ని ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి వరూధుని ప్రారంభించారు. నిర్వాహకులను న్యా యమూర్తులు అభినందించారు.న్యాయమూర్తులు కాంచనరెడ్డి, మర్కల్ పూజిత, సాయి శివ, ఏసీపీ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీఆర్ దేశాయ్, ప్రతినిధులు విద్యాసాగర్, ఈశ్వర్, బానోత్ రమేశ్,న్యాయవాదులు ,వివిధ విబాగాల వైద్యులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి
సాక్షి,నిజామాబాద్: ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని అవినీతిశాఖ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో చేపట్టిన సోదాల్లో నాలుగు ఇళ్లు,ఒక వాణిజ్య భవనం ఉన్నట్లు గుర్తించారు. 8 ఇళ్ల స్థలాలు,10.23 ఎకరాల భూమి,3.31లక్షల నగదు,ఖాతాలో 50 లక్షలు ఉన్నట్లు తేల్చారు.మొత్తం మూడు కోట్లకుపైగా అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో స్థిరాస్తుల విలువ అధికంగా ఉంటుందని అధికారులు వివరించారు. నిజామాబాద్,సికింద్రాబాద్ మచ్చ బొల్లారం ఇళ్లతోపాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో మొత్తం 11 బృందాలు,11 చోట్ల ఉదయం నుంచి తనిఖీలు చేశాయి. సోదాలు ముగిసినప్పటికీ విచారణ మాత్రం కొనసాగుతుందని అనిశా అధికారులు వెల్లడించారు. -
ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
బోధన్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని బోధన్ ఆర్డీవో విజయకుమారి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణిలో ఆర్డీవో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 11 దరఖాస్తులు వచ్చాయని అధికారు లు తెలిపారు. బోధన్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న రాకాసీపేట జీహెచ్ఎస్ (జేసీ) ప్రభుత్వం కేటాయించిన నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘా ల జేఏసీ ప్రతినిధులు ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. వివిధ ప్రభుత్వ శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఖలీల్వాడి: తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని ఐటీ టవర్లో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టాస్క్ అధికారి హన్మంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, అర్థమెటిక్, రీజనింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని, 29 నుంచి తరగతుల ప్రారంభమవుతాయని తెలిపారు. వివరాలకు 7013675052 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని పసుపు పరిశోధన స్థానంలో సోమవారం రైతులకు పసుపు నారు(మొక్కలు)ను, అల్లం మొక్కలను పంపిణీ చేశారు. భీమ్గల్, మెట్పల్లి, జగిత్యాల్, అర్గుల్, గుమ్మిర్యాల్, ఉప్లూర్, పాలెం, నిర్మల్ తదితర ప్రాంతాల నుంచి రైతులు వచ్చి ఒక్కో మొక్కకు రూ. 2 చొప్పున చెల్లించి తీసుకెళ్లారు. పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త విద్య, ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ బుచ్చన్న, టీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వర్ని: ప్రస్తుత ఖరీఫ్ సాగుకు అవసరమైన యూరియా ఎరువులు సరిపడా అందుబాటు లో ఉన్నాయని వర్ని ఏవో రాజశేఖర్ వెల్లడించారు. మండలంలోని తగిలేపల్లి సహకార సంఘం గోడౌన్లో సోమవారం ఆయన యూరి యా నిల్వలను పరిశీలించారు. మండలంలో ఇప్పటివరకు 21,612 యూరియా బస్తాలు రైతులకు అందజేశామన్నారు. మండలంలో ప్రస్తుత సాగు విస్తీర్ణం 16వేల ఎకరాలు ఉండగా 32వేల యూరియా బస్తాలు కేటాయించబడినట్లు వెల్లడించారు. మిగిలిన యూరియా నిల్వలు ఈ నెలాఖరులోపు మండలంలోని సహకార సంఘాల ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మంగళవారం రైతు వేదికలో సీడ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
క్రైం కార్నర్
విద్యుత్ షాక్తో రైతు మృతి ఇందల్వాయి: మండలంలోని తిర్మన్పల్లి గ్రామానికి చెందిన అన్నారం భూమయ్య(51) అనే రైతు పొలం వద్ద సోమవారం ఉదయం విద్యుత్షాక్తో మృతి చెందాడు. ఎస్సై సుమలత తెలిపిన వివరాల ప్రకారం.. భూమయ్య తన ఇంటి పక్కనే ఉన్న తన వ్యవసాయ మోటార్ని ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్షాక్ తగిలి మృతి చెందాడన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతుడి తమ్ముడు మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మల్లుపేట్ గ్రామ స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి నిజామాబాద్ వైపు వస్తున్న మరో కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కారులోని భార్యాభర్తలు, మరో కారులోని ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. -
దోస్త్ స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
తెయూ(డిచ్పల్లి): డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు నిర్వహిస్తున్న దోస్త్ 2026–27 మూడవ విడతకు సంబంధించి ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాలను సోమవారం తెలంగాణ యూనివర్సిటీ అధికారులు పరిశీలించారు. వర్సిటీ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎన్సీసీ 19,స్పోర్ట్స్ 10, ది వ్యాంగులు 03, మొత్తం 32 మంది అభ్యర్థులు హా జరైనట్లు తెయూ దోస్త్ కోఆర్డినేటర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు. ఎన్సీసీ లెఫ్ట్నెంట్ అధికారి రామ స్వామి, తెయూ ఫిజికల్ డైరెక్టర్ బీఆర్ నేత, సిబ్బంది దిలీప్, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడాలు) నూతన కార్యవర్గం ఎన్నికై ంది. ఈమేరకు సోమవారం బాధ్యతలు స్వీకరించింది. మాజీ అధ్యక్షుడు కార్తీక్ కొమ్మనబోయిన నూతన కార్యవర్గానికి బాధ్యతలు అప్పగించారు. అధ్యక్షుడిగా ప్రణీత్రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా ప్రణయ్, వరప్రసాద్ ఎన్నికయ్యారు. అనంతరం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ నూతన కార్యవర్గానికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ రూరల్: నిజామాబాద్–1 డిపో కార్గో పార్సిల్కు సంబంధించిన అన్కై ్లమ్డ్ పార్సిల్, వస్తువులను మంగళవారం వేలం వేయనున్నట్లు డిపో–1 మేనేజర్ ఆనంద్కుమార్ ఒక ప్రకటనలతో తెలిపారు. బస్టాండ్లోని కార్గో కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు వేలం ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు వేలం పాటల్లో పాల్గొనాలని సూచించారు. అదేవిధంగా పార్శిల్ సేవల్లో 30 శాతం తగ్గింపు ఉంటుందని డీఎం తెలిపారు. -
పారిశుద్ధ్య సమస్య రానీయొద్దు
సుభాష్నగర్: నిజామాబాద్ నగరంలో ఎక్కడ కూ డా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ముందస్తు చ ర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్రెడ్డి సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకు ని నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారు ల్లో మురుగు జలాలు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, ఇతర అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి సోమవారం ఉదయం నగరంలోని ఆయా ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. బోధన్ రోడ్, ఖిల్లా రోడ్డు, ఫ్రూట్ మార్కెట్, దేవీ థి యేటర్ చౌరస్తా, ఖలీల్వాడి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్ తదితర ప్రాంతాలను సందర్శించారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు భవన సముదాయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన మార్గాల్లోని డ్రెయినేజీలను పరిశీలించి, చెత్తాచెదారం పేరుకుపోకుండా వెంటనే శుభ్రం చేయించాలని, వర్షపు జలాలు నిల్వ ఉండకుండా సాఫీగా ముందుకు ప్రవహించేలా డ్రెయినేజీలపై గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సుదర్శన్రెడ్డి సూచించా రు. వానల వల్ల రోడ్లపై ఏర్పడే గుంతలను పూడ్చేయించాలని, అవసరమైన చోట డ్రెయినేజీల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. తాగునీరు కలు షితం కాకుండా సరఫరా తీరును నిశితంగా పర్యవేక్షించాలన్నారు. మూడు నెలల అవసరాలకు సరిప డా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని, తా గు నీటికి ఎలాంటి ఇబ్బంది లేదని భరోసా కల్పించారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్య బోధించాలని ఉపాధ్యాయులకు హితవు పలికారు. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఈసారి నగరంలోని అన్ని డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఒక్కో సర్కిల్ వారీగా 60 డివిజన్లలో డ్రెయినేజీలు, రోడ్లు శుభ్రం చేయడం, చెత్త తరలించడం, పిచ్చిమొ క్కలు, ముళ్ల పొదలు శుభ్రం చేయడం వంటి పను లు పూర్తయ్యాయన్నారు. సుమారు రూ.70 లక్షల వ్యయంతో మురుగుకాల్వల్లో పూడికతీత పనులు కూడా వేగవంతంగా చేయిస్తున్నామని పేర్కొన్నారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నగేష్రెడ్డి అధికారులు ఉన్నారు. తాగునీరు కలుషితం కాకుండా పర్యవేక్షించాలి ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్రెడ్డి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్తో కలిసి నగరంలో విస్తృత పర్యటన -
మెడికల్ ఆఫీసర్లకు శిక్షణ
సుభాష్నగర్: నగరంలోని కలెక్టరేట్లోగల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం మెడికల్ ఆఫీసర్లకు డ్రాఫ్టింగ్, పాలనాపరమైన అంశాలపై రిటైర్డ్ జిల్లా కార్మిక అధికారి యోహన్ శిక్షణనిచ్చారు. వైద్యాధికారులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాలనాపరమైన అంశాలు, డ్రాఫ్టింగ్, ప్రొసీడింగ్స్, లెటర్ రైటింగ్, లీవ్స్ రూల్స్, ఆఫీస్ సబార్డినేట్ రూల్స్, మెమో, షోకాజ్ నోటీసు, ఆర్టీఐ అంశాలు, కోర్టు కేసులు డీల్ చేయడం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వైద్యాధికారుల సందేహాలను నివృత్తి చేశారు. డీఎంహెచ్వో రాజశ్రీ, ఇతక అధికారులు అశోక్, రవీందర్, సమత, సికందర్ నాయక్, సుమంత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలి
● ఎరువుల కొరత తలెత్తకుండా చూడాలి ● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డినిజామాబాద్అర్బన్ : జిల్లాలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, నకిలీ విక్రేతలపై ఉక్కుపాదం మోపాలని ప్రభు త్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సోమవారం వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖ అధికారులతో ప్రభుత్వ సలహాదారు సమీక్ష నిర్వహించారు. నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన గురుతర బాధ్యతను వివరించారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నకిలీ విత్తనాల బెడద లేకుండా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేయాలని, కేసులు నమోదు చేసి రికవరీ యాక్టు అమలు చేయాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూ చించారు. లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని అన్నారు. మంచినీటి ట్యాంకులను శు భ్రం చేయిస్తూ, క్లోరినేషన్ జరిపించాలని సూచించారు. పట్టణాల్లోని డ్రెయినేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలన్నారు. ఇళ్ల మధ్య ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొ లగించి, సురక్షిత ప్రదేశాల్లోకి మార్చాలని పేర్కొన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ, నిజామాబాద్ను గుడిసెలు లేని జిల్లా గా తీర్చిదిద్దాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
యూరియా కోసం ఆత్మహత్యాయత్నం
భిక్కనూరు : రాజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. యాప్ ద్వారా బుక్ చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. యాప్తో సంబంధం లేకుండా ఎకరానికి రెండు బస్తాల యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, రాజంపేట గ్రామానికి చెందిన ఓ రైతు యూరియా కోసం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సొసైటీ సిబ్బంది, పోలీసులు ఆ రైతు వద్దనున్న పెట్రోల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ జానకీ, ఏడీఏ అపర్ణ, ఏవో జ్యోత్స్న సొసైటీ వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు. ఏవో జ్యోత్స్న మాట్లాడుతూ సొసైటీ పరిధిలో 60 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మంగళవారం రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. మక్కల డబ్బుల కోసం మరో రైతు.. గాంధారి(ఎల్లారెడ్డి): మక్కల డబ్బులు ఖాతాల్లో జమ కాలేదని మండల కేంద్రానికి చెందిన రైతు చి ల్లాల గోపాల్ అనే రైతు సోమవారం స్థానిక సింగిల్ విండో కార్యాలయ సిబ్బందితో గొడవకు దిగాడు. అందరితోపాటు జమ అవుతాయని నచ్చజెప్పినా వినకుండా హంగామా చేశాడని, బాటిల్లో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని కార్యాయలంలో కూడా పెట్రోల్ చల్లినట్లు సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న ఏఎస్సై ప్రకాశ్ ఘ టనా స్థలానికి చేరుకొని రైతును స్టేషన్కు తీసుకొ చ్చి నచ్చజెప్పారు. కాగా, ఈ విషయమై విండో కార్యదర్శి సాయిలును వివరణ కోరగా డబ్బులు మార్క్ఫెడ్ అధికారులు జమచేస్తారని తెలిపారు. మార్క్ఫెడ్ డీఎం క్రాంతిని సంప్రదించగా మూడు రోజుల్లో రైతులందరికీ డబ్బులు జమ చేస్తామని చెప్పినట్లు కార్యదర్శి వివరించారు. -
చిన్న నిర్లక్ష్యం.. ప్రాణాలు తీసింది
బోధన్ రూరల్ : చిన్నపాటి విద్యుత్ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. బ ట్టలు ఆరేసుకునేందుకు కట్టిన ఇనుప తీగకు విద్యుత్ సరఫరా కావడంతో దంపతులు ప్రాణా లు కోల్పోయిన ఘటన ఊట్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రత్నావత్ సంజీవ్ (46) తన కుటుంబంతో కలిసి వ్యవసాయం, పాడి ఆధారంగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్ద రు భార్యలు. పెద్ద భార్య జ్యోతి (44), చిన్న భార్య తిరుమల (35) ఉన్నారు. జ్యోతికి ముగ్గురు కూతు ళ్లు గోదావరి, శ్వేత, సంధ్యారాణి ఉన్నారు. రెండో భార్యకు కూతురు, కొడుకు సంతానం ఉన్నారు. కుటుంబ అవసరా ల కోసం ఇంటి ముందు ఖాళీ స్థలంలో గేదెల కోసం రేకుల షెడ్ నిర్మించి అందులో ఫ్యాన్లు ఏ ర్పాటు చేశారు. అదే షెడ్డుకు బట్టలు ఆరేసుకోవడానికి జీఏ వైరు కట్టి దానిపై ప్రతిరోజూ బట్టలు ఆరేసుకునేవారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో చిన్న భార్య తిరుమల వైరు మీద ఉన్న బట్టలు తీస్తుండగా స్వల్పంగా కరెంట్ షాక్ తగిలింది. వెంటనే ఈ విషయాన్ని భర్త సంజీవ్కు చెప్పింది. దీంతో సంజీవ్ వైరు దగ్గరకు వెళ్లి చూడగా, ప్రమాదవశాత్తు అతడికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. సమీపంలో ఉన్న పెద్ద భార్య జ్యోతి భర్తను కాపాడాలనే హడావుడిలో ఆ వైర్ను పట్టుకోవడంతో ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో భార్యాభర్తలిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. కుటుంబానికి అండగా నిలిచిన తల్లిదండ్రులు ఒక్కసారిగా దూరం కావడంతో పిల్లల రోదనలు అందరినీ కలచివేశాయి. కుమార్తె గోదావరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ విజయ్, ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. విద్యుత్ ప్రమాదంపై బోధన్ ట్రాన్స్కో డీఈ ముక్తార్ను ‘సాక్షి’ సంప్రదించగా పోలీస్ కేసు నమోదైన నేపథ్యంలో బాధిత కుటుంబానికి పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు. బట్టలు ఆరేసిన తీగే బలితీసుకుంది విద్యుత్ షాక్తో భార్యాభర్తల మృతి క్షణంలో కుటుంబం చిన్నాభిన్నం.. బోధన్ మండలం ఊట్పల్లిలో ఘటన గ్రామంలో విషాదఛాయలు -
ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్ అర్బన్: విదేశీ ఉద్యోగ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. కలెక్టరేట్లో జి ల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఏర్పాటు చేయనున్న ఉద్యోగ మేళా పోస్టర్లను ఆమె సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ న్యూజిలాండ్, జర్మనీ, జపాన్, ఇజ్రాయెల్, దుబాయ్, కువైట్, ఒమన్ తదితర దేశాలలో ఉన్న ఇంజినీర్స్, టెక్నీషియన్స్, సూపర్వైజర్, నర్సులు, డ్రైవ ర్లు బైక్ రైడర్స్, కార్పెంటర్, మిషన్ వర్కర్స్, హెల్పర్స్, ప్లంబర్ తదితర ఉద్యో గాల కోసం మేళాలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధి కల్పన శాఖ అధికారి విజేత, అదనపు కలెక్టర్లు కిరణ్కుమార్, భుజంగరావు, డీఆర్వో లత పాల్గొన్నారు. ప్రజావాణికి 160 ఫిర్యాదులు నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరే ట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 160 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో సాయన్న, బోధన్ ఏసీపీ శ్రీనివాస్కు వివరించారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పోలీస్ ప్రజావాణికి 17.. నిజామాబాద్అర్బన్: పోలీస్ ప్రజావాణి కా ర్యక్రమంలో 17 ఫిర్యాదులు వచ్చాయి. క మిషనర్ సాయిచైతన్య సోమవారం తన కార్యాలయంలో ఫిర్యాదులను స్వీకరించా రు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, చట్టపరంగా న్యాయం చేయాల ని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు ఏదైనా సమస్య ఉంటే నేరుగా పోలీసు అధికారులను కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు. అటవీ అధికారిపై ఇంటెలిజెన్స్ ఆరా! డొంకేశ్వర్(ఆర్మూర్): అవినీతి ఆరోపణల తో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల విచారణను ఎదుర్కొంటున్న ఓ డిప్యూటీ రేంజ్ (డీఆ ర్వో) ఆఫీసర్ ఎవరనే విషయంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ నెల 22న సాక్షిలో వచ్చిన ‘అవినీతి ఉచ్చులో అటవీ అధికారి’ అనే కథనం అటవీ శాఖను కుదిపేసింది. ఇప్పటికే సదరు అధికారి ఎవరనేది చాలా మంది ఉద్యోగులకు తెలిసిపోయిన ప్పటికీ బటయకు తెలియనట్లుగా ఉంటున్నారు. అయితే, సాక్షి కథనంతో ఇంటలిజెన్స్ వర్గాలు సోమవారం విస్తృతంగా ఆరా తీశారు. సదరు డిప్యూటీ రేంజ్ అధికారితో పాటు విజిలెన్స్కు ఫిర్యాదులు వెళ్లిన ఎఫ్ఆర్వో మీద కూడా వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. -
కోఆప్షన్కు మోక్షం ఎప్పుడో?
● గ్రామ పంచాయతీల్లో ముగ్గురికి అవకాశం ● ఎదురుచూస్తున్న ఆశావహులుకమ్మర్పల్లి : గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరి గి ఆరు నెలలు గడుస్తున్నా కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. ఫలితంగా గ్రా మ పంచాయతీల్లో సలహాలు, సూచనలు ఇచ్చే వా రు లేక పాలకవర్గాలు నిధుల వినియోగం విషయంలో ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో జరిగిన గ్రా మ పంచాయతీ ఎన్నికల అనంతరం పాలకవర్గాల కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అప్పటి ప్ర భుత్వం గ్రామ పంచాయతీల్లో కోఆప్షన్ సభ్యుల ఎ న్నిక విధానం ప్రవేశపెట్టింది. కానీ, ప్రస్తుత ప్రభు త్వ హయాంలో పంచాయతీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జాడే లేకుండా పోయింది. పంచాయతీరాజ్–2018 చట్టం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ లో ముగ్గురు చొప్పున కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలి. వారికి వార్డు సభ్యులతో సమాన హోదా ఉంటుంది. పాలకవర్గం కొలువుదీరిన 60 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వ రకు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగలేదు. జిల్లాలో 31 మండలాల పరిధిలో 545 గ్రామ పంచాయతీ లు ఉన్నాయి. హోదా, అధికారం, బాధ్యతలు.. కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నికై న వారు పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలపై సలహాలు, సూచనలు ఇచ్చే హక్కు ఉంటుంది. వీరికి వార్డు సభ్యులతో సమానమైన ప్రొటోకాల్, హోదా, గౌరవం దక్కుతుంది. సమావేశాల్లో చర్చించే అవకాశం ఉన్నప్పటికీ, తీర్మానాల ఆమోదంలో మాత్రం ఓటు హక్కు ఉండదు. కేవలం పంచాయతీకి సలహాదారులుగా మాత్రమే వ్యవ హరించాల్సి ఉంటుంది. పంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక రూపకల్పనలో కోఆప్షన్ సభ్యుల పాత్ర కీలకం అవుతుంది. సర్పంచ్, వార్డు సభ్యులు సమావేశమై గ్రామానికి చెందిన ముగ్గురిని కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఇందులో ఒకరు పదవీ విరమణ చేసిన ఉద్యోగి లేదా అనుభవం ఉన్న సీనియర్ సిటిజన్, మరొకరు గ్రామ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లేదా గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, ఇంకొకరు పంచాయతీలకు స్థలాలు ఇచ్చిన దాతలు లేదా భారీగా విరాళాలు ఇచ్చిన దాతలు, గ్రామాభివృద్ధికి దోహదపడే ప్రవాస భారతీయులను నియమించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. స్పష్టమైన ఆదేశాలు రాగానే అందుకనుగుణంగా గ్రామ పంచాయతీల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక చేపడతాం. – శ్రీనివాసరావు, డీపీవో, నిజామాబాద్ -
స్వచ్ఛంద సంస్థల సహకారంతో శ్మశానవాటికల అభివృద్ధి
● టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని రెండు హిందూ శ్మశానవాటికలను స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని హిందూ శ్మశానవాటిక అభివృద్ధి కోసం ఎస్ఆర్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందని, ఇందుకు మున్సిపాలిటీ నుంచి పూర్తి అనుమతులు లభించాయన్నారు. సోమవారం నుంచి ఫౌండేషన్ ప్రతినిధులు స్థల పరిశీలన ప్రారంభించారని, గదుల నిర్మాణంతో పాటు పూర్తి స్థాయి అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇందిరానగర్ శ్మశానవాటిక అభివృద్ధికి మరో రెండు స్వచ్ఛంద సంస్థలు అంగీకరించాయని తెలిపారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం.. కామారెడ్డి కాంగ్రెస్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సూచించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయాల మేరకే ఉమ్మడిగా ముందుకెళ్తామన్నారు. పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మ విజయకుమార్ రెడ్డి, సబ్బని హరికృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, కాంగ్రెస్ నాయకులు ప్రసాద్, సలీం, రంగ రమేష్ గౌడ్, పిడుగు సాయిబాబా, శంకర్రావు, జమీల్, రవీందర్, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
కందకుర్తిలో ఇసుక అక్రమ నిల్వలు
రెంజల్(బోధన్): మండలంలోని కందకుర్తి శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులు దర్శనమిస్తున్నాయి. రాత్రి సమయంలో మంజీరా, హరిద్ర నదుల నుంచి అక్రమార్కులు ఇసుకను తోడేస్తు సమీపంలోని పంట పొలాల్లో నిల్వ చేస్తున్నారు. రాత్రి సమయంలో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వార తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. అయినా పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవిషయమై తహసీల్దార్ శ్రావణ్కుమార్ను సంప్రదించగా అక్రమంగా నిల్వ చేసిన ఇసుక నిల్వలను సీజ్ చేసి ప్రభుత్వ పనులకు తరలిస్తామన్నారు. -
పర్మిట్ దాటారు..
నిజామాబాద్● నిత్యం వేలాది మందితో సిట్టింగ్లు ● ప్రధాన రోడ్లపై మందుబాబుల హంగామా ● తనిఖీలు మరచిన అధికారులు సెమిస్టర్ పరీక్ష ఫలితాలు.. తెయూ పరిధిలో డిగ్రీ సెమిస్టర్స్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి విడుదల చేశారు.మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2026– 8లో uజిల్లా కేంద్రంలో పర్మిట్ రూమ్ల పేరిట వైన్స్ల పక్కన అక్రమ సిట్టింగ్లు నడుస్తున్నాయి. బార్లను తలదన్నేలా సిట్టింగ్ రూమ్లను నడుపుతున్నారు. ఎకై ్సజ్ అధికారులు, మద్యం వ్యాపారులు కుమ్మకై ్క నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాత్రి అయితే చాలు వందలాది మంది మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. గూపన్పల్లి చౌరస్తా వద్ద నిబంధనలకు విరుద్ధంగా వేసిన రేకుల షెడ్డులో నిత్యం వందలాది మంది మద్యం సేవిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు తలుపులు మూసి కేంద్రాలు కొనసాగుతున్నాయి. వైన్స్ల సమయం ముగియగానే అందులోని మందు బాటిళ్లను తీసుకువచ్చి సిట్టింగ్ కేంద్రంలో అందుబాటులో ఉంచుతున్నారు. కంఠేశ్వర్, గూపన్పల్లి, గంగస్థాన్, వినాయక్నగర్ ప్రధాన రోడ్డు, దుబ్బా రోడ్ వద్ద ఉన్న మద్యం షాపుల నిర్వాహకులతో కొందరు ప్రయివేటు వ్యక్తులు ఒప్పందం చేసుకొని పర్మిట్ రూమ్లను బార్ల మాదిరిగా నిర్వహిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో సుమారు 100 మంది వరకు సిట్టింగ్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ అక్రమ సిట్టింగ్ల నిర్వహణతో మద్యం ప్రియులు చిత్తుగా తాగి రోడ్డుపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో వివిధ అవసరాల నిమిత్తం బయటకు వచ్చేవారు మందుబాబులతో ఇబ్బందులు పడుతున్నారు. ఎకో టూరిజం మరో ముందడుగు జిల్లాలో ఎకై ్సజ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వైన్స్ నిర్వాహకులు కొందరు అక్రమ దందాలు నిర్వహిస్తున్నారు. బార్లను తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నిత్యం వేలాది మంది సిట్టింగ్లో మద్యం సేవిస్తున్నారు. వైన్స్ నిర్వాహకులు నిబంధనలు బేఖాతరు చేస్తున్నా సంబంధిత ఎకై ్సజ్ శాఖ చోద్యం చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – నిజామాబాద్అర్బన్ తనిఖీలు చేస్తాం వైన్స్ల వద్ద పరిమితికి మించి సిట్టింగ్ కేంద్రాలు కొ నసాగితే చర్యలు తీసుకుంటాం. తనిఖీలు చేస్తాం. అనుమతి మేరకే పర్మిట్ రూమ్లు ఉండాలి. – స్వప్న, ఎకై ్సజ్ శాఖ ఎస్హెచ్వో, నిజామాబాద్ -
తెయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
ప్రతిభ చాటిన విద్యార్థినులు తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ –మే 2026లో నిర్వహించిన డిగ్రీ 2,4,6వ సెమిస్టర్స్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరితో కలిసి సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ ఫలితాల్లో అమ్మాయిలు చక్కని ప్రతి భ చూపడం అభినందనీయమన్నారు. 6వ సెమిస్టర్లో 4,970 మంది హాజరుకాగా 3,091 మంది ఉత్తీర్ణులయ్యారు.మొత్తం 62.19 శాతం ఉత్తీర్ణత న మోదుకాగా అమ్మాయిలు 70.22 శాతం, అబ్బాయి లు 40.61 శాతం పాసయ్యారు. 4వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 4,427 మంది హాజరుకాగా 1,714 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 38.72 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా అమ్మాయిలు 46.51 శాతం, అబ్బాయిలు 18.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2వ సెమిస్టర్లో మొత్తం 5,139 మంది హాజరుకాగా 2,000 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 38.92 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా అమ్మాయిలు 49.27 శాతం, అబ్బాయిలు 15.23 శాతం ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కె.సంపత్ కుమార్, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, అడిషనల్ కంట్రోలర్స్ నందిని, శాంత తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి వినతుల వెల్లువ
అదనపు కలెక్టర్కు సమస్యను విన్నవిస్తున్న సీపీఐ(ఎంఎల్) నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్న ఐద్వా ప్రతినిధులునవీపేట/నిజామాబాద్అర్బన్: జిల్లాకేంద్రంలోని క లెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను పేర్కొంటూ అధికారులకు వినతులు సమర్పించారు. నవీపేటలోని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఉప సర్పంచ్ నవీన్రాజ్, వా ర్డు సభ్యులు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో విద్యు త్ మరమ్మతులు చేపట్టాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ నగర కమిటీ ఆ ధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చే యాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత అధికారుల కు విన్నవించారు. రేషన్ షాపుల్లో 14 రకాల సరుకు లు ఇవ్వడంతో ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అడివాల అనిత, నగర కమిటీ సభ్యురాలు శ్రీదేవి, లలిత, మాధవి తదితరులు పాల్గొన్నారు. జీపీ కార్మికుల నిరసన.. నిజామాబాద్అర్బన్: గ్రామ పంచాయతీ కార్మికుల కు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చే స్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్క ర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరే ట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం ప్రజావాణి లో అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్కు వినతిపత్రం ఇచ్చారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకన్న, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్, సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
పట్టింపు కరువు
వైన్స్ల వద్ద అక్రమ సిట్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినా ఎకై ్సజ్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కొన్నేళ్లుగా పలు వైన్స్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా ఎకై ్స్జ్ శాఖ ఎందుకు దృష్టి పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇతర ప్రాంతాలలో ఎలా ఉంటుందోనని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. వైన్స్ యజమానుల ద్వారా సిట్టింగ్ కేంద్రాల నిర్వాహకులు నెలవారీ మామూళ్లు అందిస్తుండటంతోనే పట్టింపు కరువైందనే ఆరోపణలున్నాయి. -
మహిళలతో మునగ సాగు..!
డొంకేశ్వర్(ఆర్మూర్): మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులను కూడా సాగు బాట పట్టించనున్నారు. ఇప్పటికే ఆయా రంగాల్లో దూసుకెళ్తున్న మహిళలను వ్యవసాయ రంగంలో నూ రాణించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మునగ తోటల పెంపకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు అధికారులు ము మ్మరంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ వినూత్న పథకంలో లబ్ధి పొందేందుకు చిన్న, సన్నకారు రైతులై ఉండి, మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉంటే సరిపోతుంది. నిరుపేద రైతులకు పెట్టుబడి భారం లేకుండా చేసేందుకు మునగ తోటల సాగుకు అవసరమయ్యే ప్రతి పైసాను ప్రభుత్వమే భరించనుంది. ఉపాధిహామీ (వీబీజీ రామ్ జీ) పథకం నిధుల ద్వారా ఈ సాగు ఖర్చులను పూర్తిగా భరించనున్నారు. గుంతలు తీయడం, మొక్కల కొనుగోలు, ఎరువులు, నీటి పారుదల వంటి అన్ని పనులను ఈజీఎస్ కింద కేటాయించనున్నారు. గ్రా మీణాభివృద్ధి శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహించిన అవగాహన సదస్సులకు జిల్లాలో స్పందన లభిస్తోంది. మొదటి విడతగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 64 మంది మహిళా సంఘాల సభ్యులు మునగ తోటల పెంపకానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు. వీరి ద్వారా మొత్తం 84.17 ఎకరాల్లో త్వరలోనే మునగ సాగు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన భూముల ఎంపిక, సాంకేతిక అనుమతుల ప్రక్రియను అధికారు లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మహిళల జీవితాల్లో ఈ ప్రాజెక్టు సరికొత్త వెలుగులు నింపనుందని జిల్లా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోషకాల పంట.. ఎగుమతులతో సిరులు అత్యధిక పోష విలువలు కలిగిన మునగ ఆకులు (మొరింగా), మునక్కాయలకు అంతర్జాతీయంగా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. కేవలం మునక్కాయలు అమ్మడమే కాకుండా... మునగ ఆకులను శాసీ్త్రయ పద్ధతితో ఎండబెట్టి, నాణ్యమైన ప్యాకింగ్ చేసి ఇతర ప్రాంతాలకు, విదేశాలకు సైతం ఎగుమతి చేసుకునేలా మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నా రు. ఈ వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల ద్వారా ఎస్హెచ్జీ మహిళలు అద్భుతమైన లాభాలు సాధించి, ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం లభిస్తుంది. మునగ సాగుకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం (రూ.లలో) ఏపీవో, ఏపీఎంలకు దరఖాస్తులు ఇవ్వొచ్చు ఎస్హెచ్జీ మహిళలను వ్యవసాయంలో నూ భాగస్వాములను చేయడానికి మునగ తోట వ్యాపారాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఆసక్తి కలిగిన వారు ఉపాధిహామీ జాబ్కార్డు, ఆధార్, పట్టా పాసు పుస్తకం, బ్యాంకు ఖాతాలను దరఖాస్తుకు జోడించి స్థానిక మండలాల్లో ఏపీవో, ఏపీఎం కార్యాలయాల్లో అందజేస్తే సరిపోతుంది. రూపాయి పెట్టుబడి లేకుండా మునగను సాగు చేసుకొని లాభాలు పొందవచ్చు. దీనిని ఎస్హెచ్జీ మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. – సాయన్న, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి గ్రామీణాభివృద్ధి శాఖ సరికొత్త ప్రణాళిక భూమి ఉంటే చాలు.. పెట్టుబడి భారం పూర్తిగా సర్కారుదే ఇప్పటికే జిల్లాలో ముందుకొచ్చిన 64 మంది మహిళలు -
గడ్కోల్లో ఒకరి ఆత్మహత్య
సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన దొమ్మాటి నితిన్ గౌడ్ (27) అనే యువకుడు కొన్ని రోజులుగా తమకు గ్రామంలో సొంత ఇల్లు లేదని, ఎంబీఏ చదువుకున్నప్పటికీ ఉద్యోగం లభించడం లేదని మానసికంగా బాధపడుతున్నాడు. ఈక్రమంలో సోమవారం ఉదయం లొంక ఆలయానికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయలుదేరాడు. మార్గ మధ్యలో లొంకతండా దాటిన తర్వాత అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎల్లమ్మ ఆలయంలో చోరీ సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఎల్లమ్మ ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. గర్భగుడి తాళాలు పగులగొట్టి అమ్మవారి మెడలో ఉన్న బంగారు వస్తువులను అపహరించుకుపోయారు. హుండీని గడ్డపారతో పెకిలించి అందులోని డబ్బులను దోచుకెళ్లారు. హుండీని, పగుల గొట్టిన తాళాలను ఆమడ దూరంలో పడేశారు. ఈ విషయమై గౌడ సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
వైద్య శిబిరానికి అనూహ్య స్పందన
మాచారెడ్డి: ఘన్పూర్లో సోమవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆస్పత్రి వైద్యుడు అభినయ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 226 మందికి పరీక్షలు నిర్వహించి 26 మందిని మోతి బిందు ఆపరేషన్ కోసం సిఫారసు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అభినయ్ మాట్లాడుతూ.. మోతి బిందు ఆపరేషన్ అయిన వారికి మందులతో పాటు కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. సర్పంచ్ ప్రశాంత్ గౌడ్, ఉపసర్పంచ్ స్వామి యాదవ్, పంచాయతీ కార్యదర్శి చైతన్య, వార్డు సభ్యులు మహేష్, ప్రవీణ్, నరేష్, సతీష్ సురేష్ కారోబార్ నరేష్, శంకర్ పాల్గొన్నారు. -
రికార్డింగ్ భయం.. వాట్సాప్ కాల్కే మొగ్గు!
సాధారణ ఫోన్ కాల్ సంభాషణల రికార్డులు రచ్చకెక్కి వివాదాలకు కారణమవుతుండడంతో ఇప్పుడు వాట్సాప్ కాల్ ట్రెండ్ నడుస్తోంది. నేతలతోపాటు అధికారులు సైతం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడడానికి మొగ్గు చూపుతున్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: సరదాగానో, కోపంతో నో మాట్లాడిన మాటల రికార్డులు బయటకు రావడం, అవి వివాదాలకు కారణమవుతుండడంతో చా లామంది సాధారణ ఫోన్ కాల్స్ మాట్లాడాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అధికారులు ఎవరితోనైనా కాల్స్ మాట్లాడేటపుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరైతే సాధారణ కాల్స్ వస్తే కట్ చేస్తున్నారు. వాట్సాప్ వాయిస్ కాల్స్ చేస్తేనే స్పందిస్తున్నారు.రచ్చకెక్కిన సందర్భాలెన్నో..కొన్నాళ్ల క్రితం ఓ ఎమ్మెల్యే అధికారితో ఫోన్ మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలపై అసహనం వ్యక్తం చేసిన దానిని ఎవరో వీడియో రికార్డు చేశారు. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. మరో నేత మాట్లాడిన మాటలు సైతం దుమారం రేపాయి. ఇటీవల అధికార కాంగ్రెస్ పారీ్టలో గ్రూపు గొడవల నేపథ్యంలో ఓ వాయిస్ కాల్ రికార్డ్ వైరల్ అయ్యి ఆ పార్టీలో రచ్చకు దారితీసిన విషయం తెలిసిందే. చివరికి అది ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ కాల్ అంటూ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు జిల్లా స్థాయి అధికారులు సైతం నార్మల్ కాల్స్ తక్కువగా మాట్లాడుతున్నారు. వాట్సాప్ వాయిస్ కాల్స్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నా..సాధారణ ఫోన్ కాల్స్ రికార్డు చేస్తుండడం, అవి వివాదాలకు కారణమవుతుండడంతో చాలామంది వాట్సాప్ ద్వారా వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో తాము వాట్సాప్ కాల్ మాట్లాడేటపుడు చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా వీడియో రికార్డు చేస్తున్నారేమోనని కూడా అటూ ఇటూ చూసుకుంటున్నారు. కొన్ని సందర్బాల్లో తమ వద్దకు వచ్చే వారు ఫోన్ వీడియో రికార్డు ఆన్ చేసుకుని జేబులో వేసుకుని వస్తున్నారనే అనుమానాలతో ప్రజాప్రతినిధులు, నాయకులు మొబైల్స్ను బయటు పెట్టి రావాలని సూచిస్తున్నారు.కాల్ లిఫ్ట్ చేయాలంటే...సార్వత్రిక ఎన్నికల సమయంలో పలువురి ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు కొందరు కాల్స్ రికార్డు చేస్తుండడంతో ఏదైనా పొరపాటు మాట్లాడినా, ఎవరి గురించైనా చెడుగా మాట్లాడినా.. ఆ కాల్ రికార్డులు బయటకు వస్తున్నాయి. ఏదో టెన్షన్లోనో, ఒత్తిడిలోనో ఉన్నపుడు ఎదుటి వారు మాట్లాడే మాటలు కోపం తెప్పిస్తే నోరు జారుతుంటారు. అలాగే కొందరు మద్యం సేవించిన తర్వాత కాల్స్ చేసి విసిగిస్తుంటారు. అలాంటి కాల్స్తోనూ సమస్యలు ఎదురవుతుంటాయి. పలు సందర్భాలలో మాట్లాడిన మాటల రికార్డులు లీకై వివాదాలూ సృష్టించాయి. దీంతో ప్రజాప్రతినిధులు, నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయడానికి వెనకాముందవుతున్నారు. సాధారణ కాల్స్ విషయంలో ఆచితూచి మాట్లాడుతున్నారు. కొందరు తమ ఫోన్కు వచ్చే కాల్స్ను కట్ చేస్తున్నారు. మరికొందరు పీఏలు, అనుచరుల ఫోన్ల నుంచి మాట్లాడుతున్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
బోధన్ : ఎడపల్లి మండలం జంలం గ్రామంలోని తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి నర్సయ్య కుటుంబీకులతో కలిసి వారం క్రితం బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లారు. దుండగులు ఇంటి తాళాలను పగులగొట్టి బీరువాను ధ్వంసం చేసి బంగారు, వెండి ఆభరణాలు అపహరించుకొని వెళ్లారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న నర్సయ్య తిరిగొచ్చి ఇంటిని పరిశీలించారు. దుండగులు మూడు తులాల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్సై తెలిపారు. -
తుకానికి నీళ్లు పెట్టబోయి..
– విద్యుత్షాక్తో రైతు మృతి దోమకొండ : వరి తుకానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన అబ్బగోని రాజయ్య(48)కు గ్రామశివారులో మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. వరి నారుమడికి ఆదివారం నీళ్లు పెట్టేందుకు వెళ్లి బోరుమోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై ప్రభాకర్ పరిశీలించి, మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వాట్సాప్ కాల్కే మొగ్గు!
● వివాదాలకు కారణమవుతున్న కాల్ రికార్డులు ● సాధారణ కాల్స్ మాట్లాడడానికి వెనుకంజ ● నేతలే కాదు అధికారులదీ అదే దారిరికార్డింగ్ భయం..సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సరదాగానో, కోపంతో నో మాట్లాడిన మాటల రికార్డులు బయటకు రావడం, అవి వివాదాలకు కారణమవుతుండడంతో చా లామంది సాధారణ ఫోన్ కాల్స్ మాట్లాడాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అధికారులు ఎవరితోనైనా కాల్స్ మాట్లాడేటపుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరైతే సాధారణ కాల్స్ వస్తే కట్ చేస్తున్నారు. వాట్సాప్ వాయిస్ కాల్స్ చేస్తేనే స్పందిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఓ ఎమ్మెల్యే అధికారితో ఫోన్ మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలపై అసహనం వ్యక్తం చేసిన దానిని ఎవరో వీడియో రికార్డు చేశారు. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. మరో నేత మాట్లాడిన మాటలు సైతం దుమారం రేపాయి. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపు గొడవల నేపథ్యంలో ఓ వాయిస్ కాల్ రికార్డ్ వైరల్ అయ్యి ఆ పార్టీలో రచ్చకు దారితీసిన విషయం తెలిసిందే. చివరికి అది ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ కాల్ అంటూ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు జిల్లా స్థాయి అధికారులు సైతం నార్మల్ కాల్స్ తక్కువగా మాట్లాడుతున్నారు. వాట్సాప్ వాయిస్ కాల్స్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సాధారణ ఫోన్ కాల్స్ రికార్డు చేస్తుండడం, అవి వివాదాలకు కారణమవుతుండడంతో చాలామంది వాట్సాప్ ద్వారా వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో తాము వాట్సాప్ కాల్ మాట్లాడేటపుడు చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా వీడియో రికార్డు చేస్తున్నారేమోనని కూడా అటూ ఇటూ చూసుకుంటున్నారు. కొన్ని సందర్బాల్లో తమ వద్దకు వచ్చే వారు ఫోన్ వీడియో రికార్డు ఆన్ చేసుకుని జేబులో వేసుకుని వస్తున్నారనే అనుమానాలతో ప్రజాప్రతినిధులు, నాయకులు మొబైల్స్ను బయటు పెట్టి రావాలని సూచిస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల సమయంలో పలువురి ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు కొందరు కాల్స్ రికార్డు చేస్తుండడంతో ఏదైనా పొరపాటు మాట్లాడినా, ఎవరి గురించైనా చెడుగా మాట్లాడినా.. ఆ కాల్ రికార్డులు బయటకు వస్తున్నాయి. ఏదో టెన్షన్లోనో, ఒత్తిడిలోనో ఉన్నపుడు ఎదుటి వారు మాట్లాడే మాటలు కోపం తెప్పిస్తే నోరు జారుతుంటారు. అలాగే కొందరు మద్యం సేవించిన తర్వాత కాల్స్ చేసి విసిగిస్తుంటారు. అలాంటి కాల్స్తోనూ సమస్యలు ఎదురవుతుంటాయి. పలు సందర్భాలలో మాట్లాడిన మాటల రికార్డులు లీకై వివాదాలూ సృష్టించాయి. దీంతో ప్రజాప్రతినిధులు, నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయడానికి వెనకాముందవుతున్నారు. సాధారణ కాల్స్ విషయంలో ఆచితూచి మాట్లాడుతున్నారు. కొందరు తమ ఫోన్కు వచ్చే కాల్స్ను కట్ చేస్తున్నారు. మరికొందరు పీఏలు, అనుచరుల ఫోన్ల నుంచి మాట్లాడుతున్నారు. -
అశోక్సాగర్లో పడి బ్యాంక్ అధికారి మృతి
నిజామాబాద్ అర్బన్: నగర శివారులోని అశోక్సాగర్లో పడి ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ మృతి చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై సందీప్ తెలిపారు. ప్రగతి భవన్ బ్రాంచీలో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్న కొటారి శ్రీధర్ ఆదివారం ఉదయం 6 గంటలకు వాకింగ్కు వెళ్లి తిరిగి రాలేదు. అశోక్సాగర్లో సాయంత్రం 6 గంటలకు ఓ మృతదేహం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తింపు కార్డు ఆధారంగా శ్రీధర్ వివరాలు తెలుసుకున్నారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాలకృత్యాలకు వెళ్లి అశోక్సాగర్లో పడి ఈతరాక మృతి చెందినట్లు భార్య కొటారి లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. -
హెచ్ఎంగా, రిసోర్స్ పర్సన్గా..
సీనియర్ ఉపాధ్యాయుడు రాములు చింతలూర్ పాఠశాల హెచ్ఎంగా ఉంటూ మండల, జిల్లా, రాష్ట్ర రిసోర్స్ పర్సన్గా విద్యా విధానాలు, పాఠ్య ప్రణాళికలు, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు, డిజిటల్ కంటెంట్, ఏఐ ద్వారా విద్యార్థులకు ఆసక్తికరంగా పాఠాలు బోధిస్తున్నారు. విద్యా వీడియోలు, నీతి కథలు, పాటలు, పాఠ్యంశాలను యూట్యూబ్ ద్వారా వివరిస్తూ డిజిటల్ లెర్నింగ్ను ప్రోత్సహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సమయ పాలన వంటి అంశాలపై శిక్షణను అందిస్తున్నారు. పాఠశాలలో వివిధ రకాల పూల మొక్కలను పెంచుతూ హరిత ఉపాధ్యాయుడిగా జిల్లాస్థాయి పురస్కారం అందుకున్నారు. విద్యార్థుల అభ్యసనానికి ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా తన సేవా కాలమంతా అత్యల్ప సెలవులను మాత్రమే వినియోగిస్తూ అంకిత భావాన్ని చాటుకున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీ.. ఒకరి మృతి
● మరొకరి పరిస్థితి విషమం ● ఆస్పత్రికి తరలింపు మాచారెడ్డి: ఆర్టీసీ బస్సు, ఓ బైకును ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం పాల్వంచ బ్రిడ్జి సమీపంలో చోటుచేసుకుంది. మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట మండలం షేర్శంకర్ తండాకు చెందిన పెంట్యా (28), ఎల్లారెడ్డిపల్లికి చెందిన సక్కుబాయితో కలిసి బైక్పై కామారెడ్డి నుంచి మాచారెడ్డి వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బైక్ను ఢీ కొట్టింది. దీంతో పెంట్యా అక్కడికక్కడే మృతి చెందగా, సక్కుబాయికి తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు. పెంట్యా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నిత్య సాధనతో ఆరోగ్య యోగం
● జిల్లా జడ్జి భారతలక్ష్మి నిజామాబాద్ లీగల్ : నిత్య సాధనతో ఆరోగ్య యోగం కలుతుందని జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో యోగా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి భారతలక్ష్మి కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులతో కలిసి యోగా చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా సాధన చేయాలని అన్నారు. యోగాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, మంచి ఆరోగ్యంతోపాటు చక్కని జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. శిబిరంలో కోర్టు ఉద్యోగులు సంగీత, న్యాయవాది చౌదరి యోగా గురువులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో అదనపు జడ్జీలు నారాయణ, శ్రీనివాస రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు, న్యాయవాదులు మాణిక్రాజ్, రాజ్కుమార్ సుబేదార్, రషీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి: ప్రపంచానికి మన పూర్వీకులు అందించిన ఒక గొప్ప వరం ‘యోగా’ అని, ప్రతి ఒక్కరూ నిత్యం యోగాసనాలు ఆచరించడంతో మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని కమాండెంట్ సత్యనారాయణ పేర్కొన్నారు. డిచ్పల్లి ఏడో బెటాలియన్లో కమాండెంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ నిజామాబాద్ ప్రతినిధులు బెటాలియన్ అధికారులు, సిబ్బందితో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతుంటారని, యోగా ఆచరించడం ద్వారా ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగుతుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు డీ శ్రీనివాసరావు, వీ నరసింహస్వామి, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మందులు లేని వైద్యం యోగా
నిజామాబాద్ అర్బన్/సుభాష్నగర్: భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక సంపదల్లో యోగా ఒకటని నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యోగా ఆరోగ్య ప్రయోజనాలు అందించడమే కాకుండా మనిషి వ్యక్తిత్వం, ఆలో చన విధానం, సమాజం, ప్రకృతి మధ్య ఉన్న అను బంధాన్ని కూడా బలపరుస్తుందన్నారు. ఆధునిక కాలంలో చాలామంది యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం, బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అని భావిస్తున్నారన్నారు. కానీ మనిషి శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయా న్ని సాధించడమే యోగా అసలు లక్ష్యమని పేర్కొ న్నారు. మనిషి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాడని, ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్నాయన్నా రు. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఔషధంలా పనిచేస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాను విశ్వవ్యాప్తం చేశారని, ఐక్యరాజ్యసమితి వేదికపై 2014 సెప్టెంబర్ 27న యోగాను అంతర్జాతీయ దినోత్సవం గా ప్రకటించాలని ప్రతిపాదించారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. డిసెంబర్ 11న 177 దేశాల మద్దతుతో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. అనంతరం ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. విద్యార్థుల యోగా విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయుష్ ఆఫీసర్ గంగాదాస్, మేరా యువ భారత్ సమన్వయకర్త రమేశ్, డీవైఎస్వో పవన్కుమార్, యోగా గురువులు ప్రభాకర్, సిద్ధి రాములు, రాంచందర్, ఆయుష్ డీపీఎం వందన, తోట రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి అందిన ఆధ్యాత్మిక సంపద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం -
తొలకరి వర్షం.. పంటలకు జీవం!
డొంకేశ్వర్(ఆర్మూర్): తొలకరి వర్షం పంటలకు జీవం పోసింది. ఆదివారం డొంకేశ్వర్ మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో వర్షం కురవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. విత్తనాలు విత్తి వరుణుడి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో వర్షం ఎంతో మేలు చేసింది. మండలంలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే, ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు అడ్డం పడ్డగా స్థానికులు వాటిని తొలగించారు. తొండాకూర్లో నేలకొరిగిన చెట్టుతొండాకూర్ శివారులోని పొలం మడుల్లో నిలిచిన వర్షపు నీరు -
కామారెడ్డి కాంగ్రెస్లో సయోధ్య!
● చేతులు కలిపిన షబ్బీర్ అలీ, చంద్రశేఖర్రెడ్డి ● కలిసి పనిచేయాలని సూచించిన క్రమశిక్షణ కమిటీకామారెడ్డి క్రైం: కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్లో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు చేపట్టింది. ఇరువర్గాలను కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చింది. ఇరువర్గాలు కలిసిపోవడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్రెడ్డి వర్గాలున్నాయి. జిల్లా కేంద్రంలోని శ్మశానవాటిక అభివృద్ధి విషయంలో వీరి మధ్య విభేదాలు ముదిరి, రచ్చకెక్కిన విషయం తెలిసిందే. వ్యక్తిగత వ్యవహారాలు, గౌరవం లేకుండా మాట్లాడడం, అవినీతి, అక్రమాల విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకుని ఇరు వర్గాలు పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆశ్రయించాయి. ఇటీవల లీక్ అయిన ఓ ఆడియో కాల్ వ్యవహారంతో పరిస్థితి మరింత ముదిరి, ఇరువర్గాలు ఎస్పీకి ఫిర్యాదులు సమర్పించాయి. ఆరోపణల వ్యవహారంలో షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్రెడ్డిలు ఇదివరకే వేర్వేరుగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తమ వాదనలు వినిపించారు. వివాదం పరిష్కారం! ఇరువర్గాల మధ్య ఆరోపణలతో కాంగ్రెస్కు నష్టం జరుగుతోందని భావించిన పార్టీ.. నష్ట నివారణకు చర్యలు చేపట్టింది. ఆదివారం హైదరాబాద్లో క్రమశిక్షణ కమిటీ సమక్షంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి గడ్డం ఇందుప్రియతో పాటు షబ్బీర్ అలీ సమావేశమయ్యారు. వివాదానికి కారణమైన ఆడియో కాల్ తదితర అంశాలపై మరోసారి కమిటీ విచారణ జరిపింది. కమిటీ చైర్మన్ మల్లు రవి ఇరువర్గాలతో విడివిడిగా సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి దంపతులతో కలిసి చర్చించి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని మల్లు రవి సూచించినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్రెడ్డిలు స్వీట్లు పంచుకుని, వివాదాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేస్తామని కమిటీకి హామీ ఇచ్చారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదరడంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదు
వర్ని: కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం చేపడుతున్న సిద్దాపూర్ ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టర్లను హెచ్చరించారు. రిజర్వాయర్ వద్ద కొనసాగుతున్న పనులను ఆదివారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. రైతుల కు సాగునీరందించే ప్రాజెక్టు నిర్మాణ పను ల్లో కాంట్రాక్టర్లు అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అధికారులు దగ్గరుండి నిర్మాణ పనులను నాణ్యతతో జరిగే విధంగా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రాజెక్టు పనులు పూర్తయ్యే వరకు తరచూ తాను తనిఖీలు చేస్తానన్నారు. నిజాంసాగర్ కాలువ ఎగువ భాగాన ఉన్న రైతులకు సాగు నీరందించేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆయనవెంట సర్పంచ్ బాల్సింగ్ తదితరులు ఉన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయండి ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు చ ర్యలు తీసుకోవాల ని ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వా న్ని కోరారు. ఈ మేరకు హైదరాబాద్ లోనిసచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్ అండ్బీ మంత్రి వాకిటి శ్రీహరిని వేర్వేరుగా ఆదివారం కలిసి పలు వినతిపత్రాలు అందజేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని డిప్యూటీ సీఎంకు వివరించా రు. నందిపేట్లో క్రీడాభివృద్ధి కోసం మినీ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి శ్రీహరిని ఎమ్మెల్యే కోరా రు. డిప్యూటీ సీఎంతోపాటు మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఆరుతడి పంటలవైపు రైతులు మొగ్గు చూపాలి బోధన్రూరల్ : ప్రస్తుత వాతావరణ పరిస్థితు ల్లో రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలని ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కోన్నారు. ఆదివారం మండలంలోని కల్దుర్కి గ్రామంలో రైతులకు సబ్సిడీ సోయాబీన్ విత్తనాల పంపిణీ చేశారు. జాతీయ నూనెగింజల పథకం కింద మొత్తం 1,424 బ్యాగుల సో యాబీన్ విత్తనాలను రైతులకు అందజేశారు. బెల్లాల్లో శివ పంచాయతన ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. -
దుబాయి వెళ్లడం ఇష్టం లేక..
లింగంపేట(ఎల్లారెడ్డి): దు బాయ్ వెళ్లడం ఇష్టం లేక మండలంలోని మోతె గ్రా మానికి చెందిన ఓ యువకు డు శనివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై దీపక్ కుమార్ తెలిపి న వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రంజిత్రెడ్డి(23) గతంలో రెండుసార్లు దుబాయి వె ళ్లి వచ్చాడు. తిరిగి ఆదివారం దుబాయి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో తనకు దుబాయి వెళ్లడం ఇష్టం లేక ఆ విషయం కుటుంబ సభ్యులకు చెబితే బాధపడతారని జీవితంపై విరక్తి చెంది శనివారం అర్ధరాత్రి ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లా డు. తన వ్యవసాయ బోరుబావి వద్ద ఉరేసుకొని ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం కు టుంబసభ్యులు రంజిత్రెడ్డికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు భాగ్య హన్మంత్రెడ్డి బోరున విలపించారు. మృతుడి అన్న రామ్మోహన్రెడ్డి ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపా రు. మృతుడి కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఓదార్చారు. కంజర్లో మరో యువకుడు.. మోపాల్ : మండలంలోని కంజర్లో ఓ యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..కంజర గ్రామానికి చెందిన మమత, నర్సింగ్పల్లి తండాకు చెందిన పృథ్వీనాయక్ అలియాస్ అనిల్ (34) ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పృథ్వీనాయక్ ఆటో నడుపుకుంటూ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఇరువురి మధ్య గొడ వలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన పృథ్వీనాయక్ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తల్లి నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
తెయూలో ప్రశాంతంగా నీట్
● భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇన్చార్జీ సీపీ తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ – 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెయూ ఆర్ట్స్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాల్లో 960 మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాశారు. డిచ్పల్లి సీఐ వినోద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష గదుల్లోకి అనుమతించారు. కేంద్రాల వద్ద జామర్లు, బగ్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలతోపాటు కేంద్రం లోపల గోడ గడియారాలు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను నిజామాబాద్ ఇన్చార్జీ సీపీ రాజేశ్చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాశ్, డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై ఎండీ అరిఫ్ తదితరులున్నారు.పరీక్షకు వస్తున్న విద్యార్థిని -
ప్రశాంతంగా నీట్ రీ ఎగ్జామ్
ఖలీల్వాడి: నీట్ యూజీ–2026 రీ ఏగ్జామ్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షాకేంద్రా ల వద్ద పోలీసులు ఆంక్షలు అమలు చేశారు. బందోబస్తు మధ్య ప్రశ్నపత్రాలు, ఇతర సామగ్రిని పరీక్షా కేంద్రాలకు తరలించారు. జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాల సెంటర్కు ఆలస్యంగా వచ్చిన నలుగురు విద్యార్థులను పోలీసులు అనుమతించలేదు. అలా గే బోధన్ సెంటర్కు వెళ్లాల్సిన మరో అభ్యర్థి పొరపాటున జీజీ కళాశాల సెంటర్కు వచ్చాడు. మొత్తం ఐదుగురు అభ్యర్థులు నీట్కు దూరమయ్యారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థుల మెడల్లోని చైన్లను, ఆడపిల్లల చేతుల గాజులు, కమ్మలను తీసివేసిన తరువాతే అనుమతించారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష కొనసాగింది. పరీక్ష అసలు సమయం మూడు గంటలు కాగా, ఈ సారి 15 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. 3459 మంది అభ్యర్థులకు గాను 2994 మంది పరీక్షకు హాజరుకాగా, 465 మంది గైర్హాజరయ్యారు. హాజరుశాతం 86.56 నమోదైంది. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. బయోమెట్రిక్ హాజరు నమోదులో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కాపీయింగ్, పేపర్ లీక్కు అవకాశం లేకుండా పరీక్షా కేంద్రంలోని ఆయా గదుల వద్ద ఏర్పాటు చేసిన జామర్లను పరిశీలించారు. ఎన్టీఏ నిర్దేశించిన నిబంధనలను తప్పకుండా అమలు చేస్తూ, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్ష జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పరీక్ష సమయం ముగిసే వరకు ఎవరు కూడా బయటికి వెళ్లకుండా చూడాలని, ఆన్సర్ షీట్స్, ఎగ్జామ్ మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్ కు చేరుకునే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. 86.56 శాతం మంది అభ్యర్థుల హాజరు జీజీ కళాశాల సెంటర్కు ఆలస్యంగా వచ్చిన నలుగురికి అనుమతి నిరాకరణ వేరే సెంటర్కు వెళ్లి పరీక్షకు దూరమైన మరో విద్యార్థి కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఈ సారు.. పాఠాల స్టైలే వేరు
వినూత్న రీతిలో విద్యాబోధన ● టీఎల్ఎంతో విద్యార్థుల్లో సృజనాత్మకత ● ఆదర్శం.. చింతలూర్ ఎంపీపీఎస్ హెచ్ఎం రాములు జక్రాన్పల్లి: పాఠాల బోధన అనేది ఒక కళ. ఏది ప డితే అది, ఎలా పడితే అలా బోధిస్తే విద్యార్థులు స రిగ్గా అర్థం చేసుకోలేరు. అయితే, కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే లా పాఠాల బోధనకు కొన్ని ప్రత్యేక పద్ధతులను పా టిస్తారు. అభ్యసనంపై విద్యార్థులకు ఉత్సాహం కలిగిస్తారు. అలాంటి కోవకే చెందుతారు జక్రాన్పల్లి మండలం చింతలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పొలాస రాములు. 2021లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకొని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తున్న రాములుపై ప్రత్యేక కథనం.. ఆటల ద్వారా విద్య.. రాములు సంప్రదాయ బోధనా విధానాలకు భిన్నంగా టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్( టీఎల్ఎం)ను స మర్థవంతంగా వినియోగిస్తూ విద్యార్థులలో నేర్చుకునే ఆసక్తిని పెంపొందిస్తున్నారు.తరగతి గదిలో వి విధ రకాల నమూనాలు, చార్టులు, చిత్రాలు, కార్యకలాపాల ఆధారిత బోధన సామగ్రిని ఉపయోగించి క్లిష్టమైన అంశాలను కూడా విద్యార్థులకు సుల భంగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు. దీంతో విద్యార్థులు పాఠాలను కేవలం కంఠస్థం చేయడమే కాకుండా వాటి భావాన్ని లోతుగా గ్రహించే అవకా శం పొందుతున్నారు. ఆటల ద్వారా విద్య, అనుభవాత్మక అభ్యాసం, విద్యార్థుల భాగస్వామ్యంతో కూడిన బోధనా విధానాలతో తరగతి గది విద్యార్థులకు ఆనందదాయకమైన అభ్యాస కేంద్రంగా మారుతోంది. 11 నుంచి 40 మంది విద్యార్థులకు పెంపు... చింతలూర్ పాఠశాలలో గతంలో 11 మంది మాత్రమే విద్యార్థులు ఉండేవారు. ఈ సంవత్సరం రాములు, ఉపాధ్యాయ బృందం సహకారంతో 40 మంది విద్యార్థులకు పెంచారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులను చేర్పించారు. సర్పంచ్ నాగుల శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ, అమ్మ ఆదర్శ కమిటీ సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. -
అటకెక్కినట్టేనా..?
విజిలెన్స్ విచారణ ● బాల్కొండ నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా చెక్డ్యాముల పనులు ● తీవ్రంగా నష్టపోయిన రైతులు మోర్తాడ్(బాల్కొండ): రైతాంగానికి మేలు చేయాలనే సంకల్పంతో చేపట్టిన పెద్దవాగు, కప్పలవాగుల్లో 12 చోట్ల చెక్ డ్యాములు నిర్మించిన విషయం తెలిసిందే. ఐదు చెక్డ్యాముల నిర్మాణంలో నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడంతో వరద తాకిడి ని అవి తట్టుకో లేకపోయాయి. కుంగి, కూలిపోయి కట్టలు తెగి పంట పొలాల్లోకి నీరు చేరింది. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కాంట్రాక్టర్లు పా టించకపోవడంతో వరదల తాకిడికి చెక్డ్యాములు కొట్టుకుపో యి రైతులకు నష్టం కలిగింది. పనుల్లో అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టినా కొందరు ప్రభుత్వ పెద్దలు అడ్డుపడడంతో అటకెక్కిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇదీ.. ● వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ, జాన్కంపేట్ మధ్య 3 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన చెక్ డ్యాంను 4.1 మీటర్ల ఎత్తులో నిర్మించారు. వరద నీటి తాకిడిని అంచనా వేయకపోవడంతో మట్టికట్టలు కూలిపోయి పంట పొలాలను నీరు ముంచెత్తింది. ● రూ.9.38 కోట్లతో మోర్తాడ్ మండలం సుంకెట్ వద్ద చెక్డ్యాం పనులను వర్షాకాలంలోనూ కొన సాగించాలని చూశారు. రెండుమార్లు చెక్డ్యాం కొట్టుకుపోయి పంట పొలాలు నీట మునిగాయి. ఇసుక మేటలు వేయడంతో ఒక్కో రైతు ఎకరానికి రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ● మోర్తాడ్ మండలం పాలెం, ధర్మోరా మధ్య పెద్దవాగుపై నిర్మించిన చెక్డ్యాం మట్టి కట్ట కూలిపోయి పంటలు పూర్తిగా నీట మునిగాయి. నాణ్యతా ప్రమాణాలను పా టించకపోవడంతో మూడుసార్లు కాజ్వే కుంగిపో యి, కూలిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. ● ఏర్గట్ల మండలం తొర్తి, మోర్తాడ్ మండలం శెట్పల్లి మధ్య పెద్దవాగులో 2.5 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన చెక్డ్యాం ఎత్తును 4 మీటర్లకు పెంచారు. చెక్డ్యాం ఎత్తు పెరగడంతో నీటి నిలువ సామర్థ్యం ఎక్కువై పొలాల్లోకి నీరు చేరి పంటలు నీట మునిగాయి. దీంతో ఎలాంటి అనుమతులు లేకుండానే కట్ట ఎత్తును కుదించారు. ● భీమ్గల్ మండలం బెజ్జోరా వద్ద కప్పలవాగుపై నిర్మించిన చెక్డ్యాం ఎత్తు అధికంగా ఉండటంతో పంట పొలాల్లోకి నీరు చేరి రైతులు పంటలు సాగు చేసుకోలేని దుస్థితిలో ఉండిపోయారు. రికార్డులు సేకరించారు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెక్డ్యాముల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విభాగానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేష్రెడ్డి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి చెక్డ్యాంల నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలపై విన్నవించారు. స్పందించిన విజిలెన్స్ అధికారులు నీటి పారుదల శాఖ నుంచి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల బృందం చెక్డ్యాంలను పరిశీలించి వెళ్లింది. ఇప్పటి వరకు తుది నివేదికను మా త్రం అందించకపోవడం గమనార్హం. -
కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు
చెక్డ్యాంల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. అందుకే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెక్డ్యాంల నిర్మాణం వల్ల రైతులకు మేలు జరిగిందనే కంటే నష్టం ఎక్కువైందని చెప్పొచ్చు. బాధిత రైతులకు ఇప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదు. – బక్కూరి మోహన్, బాధిత రైతు, సుంకెట్రైతులకు న్యాయం చేయాలి చెక్డ్యాంల నిర్మాణంలో నాణ్యత లోపించడంతో మూడుసార్లు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెక్డ్యాం వద్ద మట్టి కట్ట కొట్టుకపోయి మా పంట పొలాలు మూడుసార్లు నీటి పాలయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభు త్వం పట్టించుకోలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా శ్రద్ధ చూపాలి. – నవీన్యాదవ్, బాధిత రైతు, సుంకెట్ వాస్తవాలు తెలియాల్సిందే.. చెక్డ్యాంల నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలపై రైతులకు వాస్తవాలు తెలియాలి. గత ప్రభుత్వ హ యాంలో కమీషన్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా నిర్మాణాలు లోపభూయిష్టంగా మారి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. విజిలెన్స్ విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందించాలి. – సుంకెట్ అన్వేష్రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ -
అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో బాలుడి ప్రతిభ
ఇందల్వాయి: అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో మండలంలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన బాలుడు నోముల బద్దం ఆరూష్ రెడ్డి ప్రతిభ చాటాడు. తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ థాయ్లాండ్ ఆధ్వర్యంలో మే నెల చివరి వారంలో జరిగిన ఈపోటీల్లో ఆరూష్ రెడ్డి కాంస్య పతకాన్ని సాధించినట్లు తల్లిదండ్రులు గౌతమి, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన సందర్భంగా ఆరూష్రెడ్డిని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ : చెస్ ఆడటం ద్వారా పిల్లలు చదువులో కూడా ముందంజలో ఉంటారని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని అభ్యాస ద స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–11 బాలబాలికల చెస్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిత్య సాధనతో చెస్ క్రీడలో ముందుకెళ్లవచ్చని తెలిపారు. బాలుర విభాగంలో విజేతలుగా సోహన్ (మోడల్ స్కూల్, ఆర్మూర్), ఆర్. అర్జన్ (ప్రెసిడెన్సీ స్కూల్), బాలికల విభాగంలో నిత్యశ్రీ (విజయసాయి, బోధన్), సాయి సహారా (కిడ్స్ టౌన్, బోధన్)లు నిలిచారు. నిత్యశ్రీ, సాయి సహారా బోధన్లోని సాయి సామల చెస్ అకాడమీలో శిక్షణ పొందారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ ప్రతినిధులు ఏ.రమేశ్, ఆర్బిటర్ శివ, సాయిబాబా పాల్గొన్నారు. నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సులో ఆర్మూర్ నుంచి భీమ్గల్కు ప్రయాణించింది. ప్రయాణికులంతా వెళ్లిపోవడంతో డ్రైవర్ భాషాఖాన్, కండక్టర్ శ్రీనివాస్ బస్సును తనిఖీ చేయగా, సీట్లో పర్సు కనిపించింది. వెంటనే తెరిచి చూడగా, అందులో 5 తులాల బంగారం ఉంది. దీంతో డ్రైవర్, కండక్టర్ కలిసి పర్సు మరిచిపోయిన ప్రయాణికురాలి ఆచూకీ కోసం ఆరా తీశారు. ఆమె ఆచూకీ తెలుసుకొని పర్సు, అందులోని బంగారాన్ని అప్పగించారు. పర్సు తీసుకున్న సదరు ప్రయాణికురాలు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది. -
ఎస్ఐఆర్ పకడ్బందీగా నిర్వహించాలి
రుద్రూర్: ఎన్నికల ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి సూచించారు. ప్రత్యేక ఇంటింటి సర్వే కార్యక్రమంపై బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు, సూపర్వైజర్లకు శనివారం పోతంగల్, రుద్రూర్ మండల కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ బీఎల్వోలు, బీఎల్ఏలు ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటింటి సర్వే విధానంపై అధికారులు సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు సందీప్, తారాబాయి, కోటగిరి డీటీ మధు, ఎంఆర్ఐలు విజయ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అర్హులకు అన్యాయం జరగొద్దు వర్ని: ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఎల్వోలు, అధికారులకు సూచించారు. వర్ని మండల కేంద్రంలో శనివారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పకడ్బందీగా, ప్రతిష్టాత్మకంగా సర్ ప్రోగ్రాంను నిర్వహించాలన్నారు. అనర్హులను జాబితా నుంచి తొలగిస్తూ అర్హులైన వారికి అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. బాన్సువాడ ఆర్డీవో రవీందర్, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్బాబా, తహసీల్దార్ ప్రశాంత్, వర్ని సొసైటీ చైర్మన్ సాయిబాబా పాల్గొన్నారు. -
ఉపాధి కూలీల పెళ్లి రోజు సంబరాలు
● పూలదండలు మార్చుకొని స్వీట్లు పంచిన దంపతులుఅశోక్, గంగామణిలకు పెళ్లి రోజు వేడుకలు నిర్వహిస్తున్న తోటి కూలీలుడొంకేశ్వర్(ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో శనివారం ఉపాధిహామీ పనులు జరుగుతున్న చోట ఓ వినూత్న వేడుక చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీలు కొండమడుగు అశోక్, గంగామణి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవాన్ని తోటి కూలీలందరూ కలిసి పని స్థలంలోనే ఘనంగా నిర్వహించారు. పని విరామ సమయంలో కూలీలంతా ఒక్కటై అశోక్–గంగామణి దంపతులను ప్ర త్యేకంగా వధువు, వరుడిలాగా నిలబెట్టి వారి చేత పూల దండలు మార్పించారు. ఒకరికొక రు స్వీట్లు తినిపించుకునేలా చేశారు. కూలీలందరూ అక్షింతలు చల్లి దందపతులను ఆశీర్వదించారు. శుభాకాంక్షలు తెలుపుతూ కేరింతలు, చప్పట్లతో ఆ ప్రాంతంలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. నిత్యం పారలు, గంపలతో చెమటోడ్చే కూలీలు... ఇలా తోటి కూలీల పెళ్లిరోజు వేడుకను సంబరంగా నిర్వహించడం స్థానికంగా విశేషంగా ఆకట్టుకుంది. -
నాగావళి ఎక్స్ప్రెస్లో గంజాయి స్వాధీనం
● బెర్త్ కింద దొరికిన 20 కిలోలు ● పట్టుకున్న ఎకై ్సజ్ పోలీసులు కామారెడ్డి టౌన్ : కామారెడ్డి రైల్వేస్టేషన్ లో శనివారం ఎకై ్సజ్ అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. జిల్లా ఎకై ్సజ్ అధికారులు, ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి అరుణ్చంద్ర వివరాలను వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు శనివారం సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న నాగావళి ఎక్స్ప్రెస్ కామారెడ్డికి రాగానే ఎకై ్సజ్ బృందం రైలులోకి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎస్–7 బోగీలోని ఓ బెర్త్ కింద అనుమానాస్పదంగా ఉన్న రెండు గంజాయి బ్యా గులు లభ్యమయ్యాయి. వాటిని తెరిచి చూడగా మొత్తం 22 ప్యాకెట్లలో మొత్తం 20 కిలోల ఎండు గంజాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో కేజీ గంజాయి విలువ సుమారు రూ. 50 వేల చొప్పున ఉంటుందని, మొత్తం రూ. 10 లక్షల విలువ ఉంటుందన్నారు. అయితే, బ్యాగులను రవాణా చేస్తున్న నిందితుడు ఎవరనేది తెలియలేదని, అక్రమార్కుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో డీటీఎఫ్ సీఐ సుందర్ సింగ్, ఎస్సైలు విక్రమ్, శరత్ కుమారి, దీపిక, రైల్వే ఎస్సై మధుసూదన్, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
అబ్బురపరుస్తున్న ‘అక్షర’
మోపాల్: పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న చందంగా యోగాసనాల్లో మోపాల్ మండల కేంద్రానికి చెందిన అక్షర ఆరితేరింది. తొమ్మిదేళ్ల వయస్సులోనే కఠినమైన ఆసనాలను అలవోకగా చేస్తూ అబ్బురపరుస్తోంది. తండ్రి అంగలి నవీన్రెడ్డి ప్రోత్సాహంతో మొదట ఇంటి దగ్గర యోగాసనాలను ప్రారంభించింది. చిన్నారికి మరో ఇద్దరు పిల్లలు తోడయ్యారు. యోగా ప్రాధాన్యతను గుర్తించిన గ్రామస్తులు యోగాసనాలు చేసేందుకు ఆసక్తిచూపారు. ఐదుగురితో మొదలైన యోగా టీం.. నేడు ఆ సంఖ్య 60కి పైగా చేరింది. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జిల్లా పరిషత్ పాఠశాలలో శిబిరం కొనసాగుతోంది. శీర్షాసనం, హ లాసనం, భుజంగాసనం, చక్రాసనం, బద్ద పద్మాసనం, పూర్ణ ధనురాసనం వంటి కఠినమైన ఆసనాలు అలవోకగా చేస్తుంది. పద్మాసనం, పచ్చిమొత్తాసనం, వజ్రాసనం, మయూరాసనం, నౌకాసనం, అర్ధ చక్రాసనం, త్రికోణాసనం, వక్రాసనం, భద్రాసనం, వంటి అనేక ఆసనాలు ప్రదర్శిస్తూ అందరితో శెభాష్ అనిపించుకుంటుంది. -
11 గంటల కరెంట్తో తడవని మడులు
మాక్లూర్: ఓ వైపు ఎల్నినో ప్రభావంతో వర్షం లేక ఆందోళన చెందుతుంటే.. మరోవైపు రెండు విడతలుగా 11 గంటలు మాత్రమే కరెంటు సరఫరాతో బోర్ల నుంచి వచ్చే నీరు వరి నాట్ల కోసం సిద్ధం చేసుకున్న భూమి తడవక రైతులు అయోమయానికి గురవుతున్నారు. మాక్లూర్ మండలంలో ఖరీఫ్లో 19,300 ఎకరాల వరి సాగవుతుంది. అత్యధిక రైతులు వ్యవసాయ బోర్ల ఆధారంగా సాగు చేస్తారు. కొత్తపల్లి, గుంజ్లి, చిక్లి, వల్లభాపూర్, ధర్మోరా, గొట్టిముక్కల, మెట్పల్లి, మాక్లూర్, ఒడ్డెట్పల్లి తదితర గ్రామాల్లో రైతులు మే మొదటి వారంలోనే నారు పోసుకున్నారు. నారు మడులు పెరిగి నాటడానికి సిద్ధం అయ్యాయి. కొందరు రైతులు ధైర్యం చేసి బోరుబావుల నీటితో నాటడానికి సిద్ధమై రోజుకు కొంత భూమి తడిపి దమ్ము చేశారు. అయితే 11 గంటల కరెంట్తో పారిన మడులే పారుతూ దమ్ము చేసిన పొలం మడు లు ఆరిపోతున్నాయి. ఇలాగైతే నాట్లు వేయలేమని కొందరు రైతులు ట్రాక్టర్లను ప్రక్కన పెట్టి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. -
అధ్యాపకుల నియామకాలపై అసత్య ఆరోపణలు తగవు
● టూటా అధ్యక్ష, కార్యదర్శులు పున్నయ్య, మోహన్బాబు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో 2012 ఏడాది నోటిఫికేషన్ ద్వారా 2014లో భర్తీ అయిన అధ్యాపకుల నియామకాలపై తప్పుడు ఆరోపణలు పూర్తిగా ఏకపక్షమని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(టూటా) ఖండించింది. శనివారం యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టూటా అధ్యక్ష, కార్యదర్శులు ఏ.పున్నయ్య, మోహన్బాబు మాట్లాడుతూ న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న అంశాన్ని తప్పుగా చిత్రీకరించేలా కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టులో అప్పీళ్లు పెండింగ్లో ఉండగా సింగిల్ జడ్జి తీర్పును అంతిమ తీర్పుగా ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. 2013లో వేసిన రిట్ పిటిషన్ నెంబరు 5566 కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వు (తేదీ 31.10.2025)లపై ఇప్పటికే హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు రిట్ అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వు పై డివిజన్ బెంచ్ ఇంటీరిమ్ సస్పెన్షన్ మంజూరు చేసిందన్నారు. దీంతో సింగిల్ జడ్జి ఉత్తర్వును అమలులో ఉన్న తుది తీర్పుగా చూపిస్తూ, అధ్యాపకులను ‘అక్రమ నియామకులు’గా ముద్ర వేయడం చట్టపరంగా తప్పు అని పేర్కొన్నారు. 2014లో నియామకమైన అధ్యాపకులకు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం న వంబర్ 2024లో లేఖ ద్వారా తెలిపిందని టూటా అధ్యక్ష, కార్య దర్శులు తెలిపారు. పదోన్నతుల ప్రక్రియను కొనసాగించాలని అడ్వకేట్ జనరల్ తన లీగల్ ఒపీనియన్లో పేర్కొన్నారని, 2025 జనవరి 4న జరిగిన వర్సిటీ పాలకమండలి సమావేశంలో పదో న్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని తీర్మానించిందని గుర్తుచేశారు. పదోన్నతుల ప్రక్రియ కొనసాగిస్తుండగానే, హైకోర్టు సింగి ల్ బెంచ్ 2012లో ఇచ్చిన 1, 2వ నోటిఫికేషన్లను రద్దు చేయాలని తీర్పునిచ్చిందని, దీంతో తమ పదోన్నతుల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయిందన్నారు. అధ్యాపకులు న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని స్పష్టం చేశారు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న అంశాలను వక్రీకరించి అసత్య ఆరోపణలు చేస్తే సంబంధితులపై డిఫమేషన్, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అసోసియేషన్ వెనుకాడదని హెచ్చరించారు. టూటా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శులు బాలకిషన్, నీలిమా, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు జమీల్, ప్రసన్న రా ణి, విద్యావర్ధిని, వాసం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
● నిర్ణీత సమయం తర్వాత కేంద్రాల్లోకి అనుమతి లేదు ● ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిజామాబాద్ అర్బన్: నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరగనున్న పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. నీట్ పరీక్ష పున:నిర్వహణ ఏర్పాట్లపై శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీ క్ష జరిపారు. జిల్లాలో 3456 మంది పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నాగారంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల/కళాశాల, బోధన్ పట్టణంలోని రైల్వే గేట్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్న్స్ కళాశాల బిల్డింగ్, కంప్యూటర్ సైన్న్స్ అండ్ ఇంజినీరింగ్ కళాశాల బిల్డింగ్, మాక్లూర్ లోని శ్రీ బిగాల కృష్ణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అను మతిస్తారన్నారు. నిర్ణీత సమయం దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రం లోనికి వెళ్లేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థులు పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, గుర్తింపు కార్డు, అడ్మిట్ కార్డు తమ వెంట తెచ్చుకోవాలన్నారు. ఎల క్ట్రానిక్ ఉపకారణాలైన మొబైల్ ఫోన్లు, డిజిటల్ చేతి గడియారాలు, బ్లూటూత్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవన్నారు. నీట్ పరీక్ష రో జున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు ఉండే అవకాశం ఉన్నందు న విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలని అదనపు డీసీపీ శుభం నగ్రాలేకు సూచించారు. సమావేశంలో పరీక్షా కేంద్రాల నోడల్ ఆఫీసర్లు, అధికారులు పాల్గొన్నారు. -
గుండెల్లో నాన్న.. పొలంలో గుడి
● కానిస్టేబుల్ కృష్ణసాగర్ పితృభక్తి ● సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘మాది ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ఖుషీనగర్ జిల్లాలోని పడెరోనా అనే చిన్న పట్టణం. నాన్న వ్యవసాయంతోపాటు వ్యవసాయానికి సంబంధించిన పని పరికరాల వ్యాపారం చేసేవారు. పదో తరగతి వరకు మా ఊళ్లోనే చదువుకున్నాను. చదువు విలువ తెలిసిన నాన్న లెవంత్ క్లాస్ చదువుకోసం 1500 కిలోమీటర్ల దూరాన ఉన్న రాజస్థాన్లోని కోటకు పంపించారు. అక్కడ ఐఐటీ లక్ష్యంగా చదివి ముంబయి ఐఐటీలో సీటు సాధించా’ అని 2019 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి, కామారెడ్డి డీఎఫ్వో నీరజ్కుమార్ టిబ్రేవాల్ తెలిపారు. ఫాదర్స్ డే సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నాన్న చూపిన దారిలో నడవడం వల్లే ఈ రోజు సివిల్ సర్వీసెస్ అధికారిగా మీ ముందున్నాను’ అని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఐఐటీ పూర్తవగానే చదువుకు సంబంధం లేని బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించి ఐదేళ్లు పనిచేశాను. తరువాత యూపీఎస్సీకి ప్రిపేర్ కావాలనే నా కోరికను నెరవేర్చుకునేందుకు ప్రిపేర్ అయ్యా ను. మొదట ప్రిలిమినరీ క్లియర్ కాలేదు. రెండోసారి ప్రిలిమినరీ క్లియర్ అయినా మెయిన్స్లో సక్సెస్ కాలేదు. ఆ సమయంలో నాన్న మరింత పట్టుదలతో చదివితే సక్సెస్ అవుతావని ప్రోత్సహించారు. మూడో ప్రయత్నంలో 20వ ర్యాంక్తో ఐఎఫ్ఎస్ సాధించాను. మొదటి పోస్టింగ్ ఎఫ్డీవోగా ఇల్లందులో లభించింది. అక్కడి నుంచి డీఎఫ్వోగా ఆసిఫాబాద్లో పనిచేసి నెలకిందటే కామారెడ్డికి బదిలీపై వచ్చానని తెలిపారు. మా నాన్న అశోక్, అమ్మ రేఖ నాతో పాటు అన్నను చదివించడానికి వెనుకడుగు వేయలేదు. వాళ్లిచ్చి న ప్రోత్సాహంతోనే ఇద్దరం రాణించాం. అన్న బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు. పిల్లల ఉన్నతి కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తారు. వాళ్ల మాటను గౌరవించాలి. డొంకేశ్వర్(ఆర్మూర్): లోకం విడిచి వెళ్లినా తన గుండెల్లో ఉన్న నాన్నకు గుడి కట్టించి ఆరాదిస్తున్నాడు డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ కృష్ణసాగర్. వివరాల్లోకి వెళ్తే.. కీ.శే. కీని నల్ల రాజన్నకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసిన రాజన్న 2018 అక్టోబర్ 3న గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన హఠాన్మరణాన్ని ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. అయితే తండ్రి బతికుండాగానే చిన్న కుమారుడు కృష్ణసాగర్ పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించాడు. కొడుకుని ఖాకీ దుస్తుల్లో చూసి రాజన్న మురిసిపోయేవాడు. తండ్రి భౌతికంగా దూరమైనా ఎప్పటికీ తమలోనే ఉండాలనే సంకల్పంతో కృష్ణసాగర్ తన వ్యవసాయ క్షేత్రంలో రాజన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి చక్కని గుడి కట్టించాడు. ప్రతి ఏటా తండ్రి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తారు. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన నాన్నకు ఎంత చేసినా తక్కువే, ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం అని కానిస్టేబుల్ కృష్ణసాగర్ భావోద్వేగంతో పేర్కొన్నారు.● తన పిల్లలను ఉన్నత స్థితిలో చూడాలని పరితపిస్తాడు.. ఎంతటి భారాన్నైనా బాధ్యతగా భావిస్తాడు. వ్యవసాయ క్షేత్రంలో రాజన్న గుడి, తండ్రి విగ్రహం వద్ద పిల్లలతో కలిసి కృష్ణసాగర్ సెల్ఫీబంగారు భవిష్యత్వైపు అడుగులు వేయిస్తాడు నాన్న.. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ‘సాక్షి’ కథనాలు.నాన్నే నా మార్గదర్శి ‘సాక్షి’తో డీఎఫ్వో నీరజ్ కుమార్ టిబ్రేవాల్ -
లోక్ అదాలత్లో కేసుల సత్వర పరిష్కారం
● జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి నిజామాబాద్ లీగల్: లోక్ అదాలత్ ద్వార పరిష్కారమైన కేసుకు చట్టబద్ధత వస్తుందని, సమయం, డబ్బులు మిగులుతాయని, సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగాల్సిన అగత్యం తప్పుతుందని, పెండింగ్ కేసులో ఇద్దరికీ విజయం చేకూరుతుందని జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి అన్నారు. జిల్లా న్యాయసేవ సంస్థలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ను ఆమె అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, ఇతర జడ్జీలతో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జడ్జి మాట్లాడుతూ ఈ సంవత్సరం లోక్ అదాలత్ ద్వార ఐపీసీ సెక్షన్ 324, 338 కేసులను సైతం పరిష్కరించేందుకు కషిచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు జిల్లా జడ్జి రూ. కోటి పదిలక్షల పరిహారం చెక్కును అందజేశారు. లోక్ అదాలత్లో మొదటి జిల్లా జడ్జి హరీష, రెండవ జిల్లా జడ్జి సుగాలి నారాయణ, నాల్గవ జిల్లా జడ్జి దరావత్ దుర్గాప్రసాద్, మొబైల్ కోర్టు జడ్జి చైతన్య అంగారి, జూనియర్ సివిల్ జడ్జి ఎం కీర్తిరాజ్, ఎకై ్సజ్ కోర్టు జడ్జి వడ్డి హరికుమార్ పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఏడో స్థానంలో నిలిచింది. లోక్ అదాలత్లో జిల్లాలో మొత్తం 28,686 కేసులను పరిష్కరించారు. ఇందులో 68 సివిల్ కేసులు, 7025 క్రిమినల్ కేసులు, 21,593 ప్రీలిటిగేషన్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న పెండింగ్ కేసుల్లో 68 సివిల్ కేసులు, 7025 క్రిమినల్ కేసులు, మొత్తం 7093 పెండింగ్ కేసులకు ఈ లోక్ అదాలత్ ద్వార శాశ్వత పరిష్కారం చూపా రు. 41 మోటారు వాహన ప్రమాదాల కేసు ల్లో కక్షిదారులకు రూ. 4 కోట్ల 79 లక్షలు, 162 బ్యాంక్ ప్రీలిటిగేషన్ కేసుల్లో ఒక్క కోటి 25 లక్షల 22,070 పరిహారం అందజేశారు. -
కాంగ్రెస్ డివిజన్ అధ్యక్ష పదవుల నిలిపివేత
నిజామాబాద్ రూరల్ : కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుల పదవులను తాత్కాలికంగా ని లిపివేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు కుమార్రావు ఉత్తర్వులు జారీ చేసినట్లు కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బి లి రామకృష్ణ పేర్కొన్నారు. నగరంలోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. మే 30న పలు డివిజన్లకు సంబంధించి అధ్యక్షుల నియామకాలను విడుదల చేశామని, దీంతో కొన్ని డివిజన్ల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపా రు. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, అర్బన్లకు సంబంధించిన డివిజన్ అధ్యక్షుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఫిర్యాదులను పరిశీలించి నియామకాలను విడుదల చేస్తామని తెలిపారు. అభ్యంతరాలు ఉన్నవారు సంప్రదించాలని కోరారు. -
‘ప్రగతి ప్రణాళిక’ నివేదికలు అందించాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల వివరాలను పొందుపరుస్తూ శాఖల వారీగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం అన్ని శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల నిర్వహణ తీరును పర్యవేక్షించి, తగిన దిశానిర్దేశం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్లను నియమించిందన్నారు. నిజామాబాద్ జిల్లాకు స్పెషల్ ఆఫీసర్గా నియమితులైన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, డాక్టర్ యోగితారాణా త్వరలోనే జిల్లాకు వచ్చి ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలును సమీక్షిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో, వార్డులు, మున్సిపల్ పట్టణాల వారీగా నిర్వహించిన గ్రామసభలు, ఇతర కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ సోమవా రం సాయంత్రం లోపు సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆయా వర్గాల వారికి చేకూర్చిన లబ్ధిని నివేదికల్లో పొందుపరచాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీఈవో అశోక్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎంజేపీలో ఇంటర్ స్పాట్ ప్రవేశాలు
ఖలీల్వాడి: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం ఈనెల 23న ఉదయం 10 గంటలకు మోపాల్ మండలంలోని కంజర ఎంజేపీ పాఠశాలలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆర్సీవో సత్యనాథ్రెడ్డి తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిలాలో 10 బాలుర, 11 బాలికలకు సీట్లు ఉన్నాయని వివరించారు. ఎంపీసీ గ్రూప్ కోసం 10వ తరగతిలో 500 మార్కులు లేదా అంతకన్నా ఎక్కువ సాధించినవారు అర్హులని, బైపీసీకి బాలురు 450 మార్కులు లేదా అంతకన్నా ఎక్కువ, బాలికలు 475 మార్కులు లేదా అంతకన్నా ఎక్కువ, సీఈసీ గ్రూప్లో 450 మార్కులు లేదా అంతకన్నా ఎక్కువ సాధించిన వారు అర్హులని తెలిపారు. విద్యార్థులు ఎస్సెస్సీ మార్కుల మెమో ఒరిజినల్తోపాటు రెండు సెట్ల జిరాక్స్, ఆన్లైన్ దరఖాస్తు ఫారంతో హాజరై స్పాట్ అడ్మిషన్ పొందవచ్చని పేర్కొన్నారు. -
యోగాలో ‘మహాజన్’ కుటుంబం
రుద్రూర్: యోగా మాస్టర్ మహాజన్ విశ్వనాథ్ తన కుటుంబంతో కలిసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మహాజన్ విశ్వనాథ్తోపాటు ఆయన కుమారుడు అద్వైత్, కుమార్తె అక్షయ శ్రీ యోగా విభాగంలో ఐదు ప్రపంచ రికార్డులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. మహాజన్ విశ్వనాథ్ ఇప్పటి వరకు 52 యోగా ధ్రువపత్రాలు సాధించారు. 784 మంది విద్యార్థులకు యోగా శిక్షణ అందించారు. ఆయన వద్ద శిక్షణ పొందిన వారిలో 358 మంది విద్యార్థులు ఆయుష్, పీఎంశ్రీ పాఠశాలల్లో ఉద్యోగాలు పొందడం విశేషం. ఆరోగ్యవంతమైన వృద్ధాప్యాన్ని సాధించాలంటే యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని యోగ మాస్టర్ విశ్వనాథ్ మహాజన్ చెప్తున్నారు. -
ప్రభుత్వ బడికి పంపితే ఇంటి పన్ను రద్దు
● తొండాకూర్ గ్రామ పంచాయతీ ఆకట్టుకునే తీర్మానం డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి డొంకేశ్వర్ మండలం తొండాకూర్ గ్రామ పంచాయతీ ప్రజలను ఆకట్టుకునే తీర్మానం చేసింది. గ్రామంలోని తల్లిదండ్రులు వారి పిల్లలను స్థానిక ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలకు పంపితే వారికి ఇంటి పన్నును రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు శనివారం పాఠశాల హెచ్ఎం వరలక్ష్మితో కలిసి పాలకవర్గ సభ్యులు సమావేశమయ్యారు. మన ఊరి పాఠశాలను మనమే బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడిలో ఉచితంగా నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందుతుందని, ప్రయివేటుకు పంపితే అధిక ఫీజులు ఉంటాయని సర్పంచ్ అల్లారి గంగాధర్ తెలిపారు. తల్లిదండ్రులు ఆలోచించి ఇంటి పన్ను రద్దు ఆఫర్ను సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. యూరియా కోసం ఎగబడ్డ రైతులు వేల్పూర్: వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామంలో శనివారం యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. సుమారు మూడు లారీ ల యూరియాను అధికారులు పచ్చల నడ్కు డ సొసైటీ పరిధిలోని జాన్కంపేట్ గిడ్డంగికి కేటాయించారు. దీంతో జాన్కంపేట్, సా హేబ్పేట్, వాడి, కొత్లపల్లి గ్రామా ల రైతులతో పాటు ఇతర గ్రామాల రైతులు గిడ్డంగి వద్దకు తరలివచ్చారు. యూరియా కోసం యాప్లో బుక్ చేసుకున్నప్పటికీ వరుస క్ర మంలో పాస్బుక్లు, ఆదార్కార్డు లు, ఇతర వస్తువులు పెట్టుకున్నారు. యూ రియా పంపిణీ ప్రారంభం కాగానే రైతులు ఒక్కసారిగా గోదాము వద్దకు చేరుకోగా గందరగోళం నెలకొంది. తాము వేల్పూర్, లక్కోర గోదా ముల వద్దకు వెలితే తమను వాపసు పంపించారని, నడ్కుడ సొసైటీ పరిధిలోని గ్రామా ల రైతులకు ఇచ్చిన తర్వాతనే ఇతర గ్రామా ల రైతులకు ఇవ్వాలని సొసైటీ పరిధిలోని రైతులు గిడ్డంగి షట్టర్ను కిందికి దించారు. దీంతో రైతుల మధ్య వాద్వాదం జరిగింది. పోలీసులు వచ్చి రైతులకు వరుసక్రమంలో యూరియాను సరఫరా చేయించారు. -
సొసైటీ డైరెక్టర్ పదవులకు మూకుమ్మడి రాజీనామా
కమ్మర్పల్లి : కమ్మర్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు(డైరెక్టర్లు) మూకుమ్మడి రాజీనామాలు చేశారు. తమకు తెలియకుండా సొసైటీ చైర్మన్, సీఈవో కలిసి ఉప్లూర్ రైతులకు రెండు లారీల యూరియాను ఆన్లైన్లో కాకుండా, ఆఫ్లైన్లో తరలించారని ఆరోపిస్తూ, యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైస్ చైర్మన్ పార్శెపు అరుణ్రెడ్డి, డైరెక్టర్లు రెంజెర్ల మహేందర్ రెడ్డి, బద్దం రాజశేఖర్ రెడ్డి, తీగల హరీస్ రెడ్డి, సదిరం ముత్తెమ్మ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సొసైటీ సీఈవో శంకర్కు శనివారం అందజేశారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
క్రైం కార్నర్
జక్రాన్పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం మునిపల్లి గ్రామ శి వారు ప్రొద్దుటూరి సదానందం వృద్ధాశ్రమం వెనకాల ఓ వృద్ధుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం కంకట గ్రామానికి చెందిన నడ్కుల పెద్ద లస్మన్న (68) భార్య, కుమారుడు, కూతురు గతంలో వివిధ కారణాలతో మృతి చెందారు. దీంతో లస్మన్న ఒంటరిగా ఉంటూ బాధపడేవాడు. ఈ నెల 19న కంకట నుంచి బయల్దేరి అంకాపూర్లో బస్సు దిగాడు. వృద్ధాశ్రమం వెనుకకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బావమరిది కుంటోల్ల లస్మన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గుర్జాల్ గ్రామానికి చెందిన మంగళారం పోచయ్య (60) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేందర్ శనివారం తెలిపారు. పోచయ్య ఈ నెల 16న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. 19న కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులకు శనివారం బ్రాహ్మణ్పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఒకరు ఉరేసుకొని మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడిని పోచయ్యగా గుర్తించారు. మృతుడి కుమారుడు సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని శివాజీనగర్కు చెందిన లక్ష్మి(45) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. తనకు క్యాన్సర్ సోకడంతో వైద్యం కోసం రూ.10 లక్షలు ఖర్చయ్యాయని, అయినా కూడా క్యాన్సర్ తగ్గదనే ఆవేదనతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దోమకొండ: మండలంలోని అంచనూరు గ్రామంలో శనివారం ఓ బాలుడిపై పిచ్చికుక్కలు దాడిచేశాయి. గ్రామానికి చెందిన బైకరి రుత్విక్పై కుక్కలు దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే కుక్కలను తరిమివేసి బాలుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్లు తండ్రి బైకరి మహేశ్ తెలిపారు. రుత్విక్తోపాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరిపై కుక్కలు దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. -
పంటలేమవునో!
ఎల్నినో.. డొంకేశ్వర్(ఆర్మూర్): వాతావరణ నిపుణులు చెప్పినట్లుగానే ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు వచ్చినట్లే వచ్చి ముఖం చాటేశాయి. జూన్ నెల ముగుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవగా, జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలతో ఎండలు మళ్లీ ముదురుతున్నాయి. దీంతో ఈ ఏడాది వానాకాలం (ఖరీఫ్ సీజన్ ) ఆరంభంలోనే అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పంటలు ఏమవుతాయోనని పసుపు, సోయా, మక్క విత్తనాలు విత్తిన రైతుల్లో ఆందోళన నెలకొంది. మబ్బుల రాక కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. వరుణదేవా కరుణించవా అంటూ వేడుకుంటున్నారు. విత్తనాలు మొలకెత్తడానికి నీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా బోర్లపైనే ఆధారపడి పంటలకు, వరి నాడుమడులకు రోజూ నీరందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు పొలాల్లోనే రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారు. వాడుతున్న పంటలు.. జిల్లాలో సాధారణంగా ఖరీఫ్ సీజన్లో లక్షలాది ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈ ఏడాది 5.30 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే, వర్షాలు లేకపోవడంతో సముచిత నీటి వనరులు లేని ప్రాంతాల్లో పోసిన వరి నారుమడులు ఎండుతున్నాయి. అప్పుడే మొలకెత్తిన సోయా, మక్క పంటలు వాడుతున్నాయి. ఇటు ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోవడంతో ఆయకట్టు రైతుల్లో పంటల సాగుపై భయం పట్టుకుంది. పంటలు వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. వ్యవసాయ బోర్ల వాడకం పెరగడంతో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. రైతులు కొత్త బోర్లు వేస్తున్నారు. ఇప్పటికే 60 శాతం మంది రైతులు వరినారు పోయగా, 7190 ఎకరాల్లో నాట్లు వేశారు. 8,728 ఎకరాల్లో మొక్కజొన్న, 1,229 ఎకరాల్లో సోయాను విత్తారు. సోయా విత్తనాలు ఎండవేడికి కుళ్లిపోయి మొలకెత్తడం లేదు.తొండాకూర్ శివారులో బోరుతో మక్కకు నీరు పారిస్తున్న రైతు ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు గరిష్ట ఉష్ణోగ్రతలతో భూమిలోనే ఉడికిపోతున్న విత్తనాలు నిలిచిపోయిన వ్యవసాయ పనులు వర్షం కోసం ఆకాశం వైపు రైతన్నల ఎదురు చూపులు -
ఏఎంసీల ఫీజు వసూలు లక్ష్యం ఖరారు
● కమ్మర్పల్లి మార్కెట్ కమిటీకి రూ. 4.55 కోట్లు ● వేల్పూర్ ఏఎంసీకి రూ. 99.35 లక్షలు కమ్మర్పల్లి:కమ్మర్పల్లి, వేల్పూర్ వ్యవసాయ మా ర్కెట్ కమిటీలు గతేడాది నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం పొందడంతో 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ రెండు మార్కెట్ కమిటీలకు కలిపి రూ. 5.34 కోట్లు మార్కెటింగ్ రుసుము(ఫీజు) రూపంలో లక్ష్యం నిర్దేశించింది. లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కమ్మర్పల్లి మార్కెట్ కమిటీకి చెక్పోస్ట్ల ద్వారా రూ.60 లక్షలు, ప్రభుత్వ ఏ జెన్సీల ద్వారా రూ. 3 కోట్ల 95 లక్షల 40 వేలు కలి పి రూ. 4 కోట్ల 55 లక్షల 40 వేలు లక్ష్యం నిర్దేశించింది. వేల్పూర్ మార్కెట్ కమిటీకి చెక్పోస్ట్ల ద్వారా రూ.30 లక్షలు, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రూ. 69.35 లక్షలు కలిపి రూ. 99.35 లక్షలు మార్కెటింగ్ రుసుము వసూలు చేయాలని స్పష్టం చేసింది. 2025–26లో రూ. 7.13 కోట్ల ఆదాయం కమ్మర్పల్లి, వేల్పూర్ మార్కెట్ కమిటీలు చెక్పోస్ట్లు, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.7.13 కోట్ల ఆదాయం పొందాయి. కమ్మర్పల్లి ఏఎంసీకి మొత్తం రూ. 3.64 కోట్లు లక్ష్యం విధించగా, రూ. 5.34 కోట్లు వసూలయ్యాయి. వేల్పూర్ ఏఎంసీకి రూ. 80.90 లక్షలు లక్ష్యం నిర్దేశించగా, రూ. కోటీ 79 లక్షల 2 వేలు వసూలయ్యాయి. రెండు మార్కెట్ కమిటీలు లక్ష్యానికి మించి ఫీజు వసూలు చేయడంతో ఈ ఏడాది మార్కెటింగ్ ఫీజు లక్ష్యాన్ని పెంచింది. కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని సిబ్బంది సహకారంతో గడువులోగా పూర్తి చేస్తాం. గతేడాది విధించిన లక్ష్యాన్ని సమర్థవంతంగా పూర్తి చేశాం. పంట ఉత్పత్తులు అక్రమంగా తరలిపోకుండా చెక్పోస్టుల వద్ద తమ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఇచ్చిన లక్ష్యాన్ని కూడా మార్చి నెలాఖరులోగా వసూలు చేస్తాం. – జే మధుసూదన్, కార్యదర్శి, మార్కెట్ కమిటీ, కమ్మర్పల్లి -
రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం
● డీఈవో అశోక్ జక్రాన్పల్లి : hÌêÏÌZ ÑÑ«§ýl ´ëuý‡Ô>ÌSÌZÏ ÆørÈ MýSÏ »Œæ ^ólçÜ$¢¯]l² õÜÐ]lË$ AÀ-¯]l…-§ýl±-Ķæ$Ð]l$° yîlD-Ðø AÔZMŠS õ³ÆöP-¯é²Æý‡$. f{M>¯ŒS-ç³-ÍÏ Ð]l$…yýl-ÌS…ÌZ° ™öÇ-ొ hÌêÏ ç³ÇçÙ™Œæ E¯]l²™èl ´ëuý‡-Ô>-ÌSÌZ ÆørÈ MýSÏ»Œæ BÆý‡*ÃÆŠæ, ÆørÈ MýSÏ»Œæ Ððl¬Æ‡$$-¯é»ê§Šæ ç܅Ķæ¬MýS¢ B«§ýlÓ-Æý‡Å…ÌZ Æý‡*.12 ÌS„ýS-ÌS™ø °ÇÃ…_¯]l sêÆ‡$$-ÌñæsŒæÞ »êÏMŠS¯]l$ yîlD-Ðø AÔZMŠS, ÆørÈ MýSÏ»Œæ hÌêÏ VýSÐ]l-Æý‡²ÆŠ‡ yéMýStÆŠ‡ GïÜÓ Æ>…{ç³-Ýë§Šæ Ô¶æ${MýS-ÐéÆý‡… {´ëÆý‡…-À…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> yîlD-Ðø Ð]l*sêÏ-yýl$™èl* ÆørÈ MýSÏ»Œæ-™ø-´ër$ §é™èlË$ {V>Ð]l*-°MìS ^ðl…¨¯]l Ððl…MýS-r-Æ>-Ñ$-Æð‡yìlz, VýSr$t Ò$¨ Æ>…Æð‡yìlz MýS$Ð]l*-Æý‡$Ë$ ѧéÅ-Æý‡$¦ÌS BÆø-VýSÅ…, ç³Ç-Ô¶æ$-{¿ýæ™èl¯]l$ §ýl–íÙtÌZ ò³r$t-Mö° A«§ýl$-¯é-™èl¯]l ÝûMýS-Æ>Å-ÌS™ø sêÆ‡$$-ÌñæsŒæ »êÏMŠS¯]l$ °ÇÃ…^èlyýl… AÀ¯]l…§ýl-±-Ķæ$-Ð]l$-¯é²Æý‡$. ™èlÍÏ-§ýl…-{yýl$Ë$ ™èlÐ]l$ í³ÌSÏ-ÌS¯]l$ {糿¶æ$™èlÓ ´ëuý‡-Ô>-ÌSÌZ ^èl¨-Ñ…^éÌS° çÜ*_…-^éÆý‡$. ´ëuý‡-Ô>ÌS AÀ-Ð]l–-¨®MìS MýS–íÙ^ól-çÜ$¢¯]l² {糫§é-¯ø-´ë-«§éÅ-Ķæ¬yýl$ }°-Ðé‹Ü¯]l$ AÀ¯]l…¨…-^éÆý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ hÌêÏ Ð]l*i VýSÐ]l-Æý‡²ÆŠ‡ G¯ŒSÒ çßæ¯]l$-Ð]l$…™Œæ Æð‡yìlz, {´ëgñæMŠSt O^ðlÆý‡Ã¯ŒS M>…† VýS…V>-Æð‡yìlz, çÜÆý‡µ…^Œl ç³§ýlà ¯éVýS-Æ>-k, Eç³ çÜÆý‡µ…^Œl ™ðlyýl$z Ð]l$íßæ-´ëÌŒæ, G…DÐø }°-Ðé‹Ü, ÒyîlïÜ {糫§é¯]l M>Æý‡Å-§ýlÇØ ¿¶æ*Ðól$ÔŒæ, Ý÷OòÜsîæ O^ðlÆð‡Ã¯ŒS ¯]lÆ>ÞÆð‡yìlz, ¯éĶæ$-MýS$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. -
క్రైం కార్నర్
వర్ని: చందూర్ మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్కు చెందిన జోషి బూమ్ జీ (56) మృతి చెందినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. నాట్లు వేయటానికి వచ్చిన మహిళ చందూర్ వద్ద రోడ్డు దాటుతుండగా నిజామాబాద్ వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బోధన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా జోషి బూమ్ జీ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మహిళ మృతికి కారణమైన కారు డ్రైవర్ సయ్యద్ వాజిద్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండల కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త ఎర్రం పవన్కుమార్ (42) అప్పుల భాదతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో హార్డ్వేర్ దుకాణం నడుపుతున్న పవన్కుమార్కు అప్పులు ఎక్కువయ్యాయి. మనస్తాపం చెందిన ఆయన ఈ నెల 17న లక్కంపల్లి శివారులో గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న మిత్రులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. నగరంలో మరొకరు... నిజామాబాద్ అర్బన్ : నగరంలోని బ్రాహ్మణకాలనీకి చెందిన అనంతరావు(50) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు 5వ టౌన్ ఎస్సై సునీల్ తెలిపారు. కిడ్నీ, షుగర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అనంతరావు శుక్రవారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ప్రస్తుతం రెండో భార్య గోదావరితో కలిసి ఉంటున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ రాజేశ్ చంద్ర గాంధారి(ఎల్లారెడ్డి): పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, గంజాయి వినియోగం, విక్రయం, పేకాటపై గట్టి నిఘా పెట్టాలని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ఆయన గాంధారి పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడుతూ వారి సమస్యలను ఓపికతో వినాలని, వీలైనంత తొందరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో దొంగతనాల నివారణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, సైబర్ నేరాలపై నిఘా ఉంచాలని సూచించారు. సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, స్థానిక ఎస్సై మహేందర్, సిబ్బంది ఉన్నారు. -
ఎస్ఐఆర్’ పకడ్బందీగా నిర్వహించాలి
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ● వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లకు సూచననిజామాబాద్ అర్బన్: ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమగ్రంగా, పారదర్శకంగా రూపొందించేందుకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ –2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. బూత్ లెవల్ ఆఫీసర్లు, బూత్ లెవల్ ఏజెంట్లకు ఈ నెల 24లోగా శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 25 నుంచి బీఎల్వోలు తమ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురించే వరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాల ని సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, షెడ్యూల్కు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఈవో దష్టికి తెచ్చారు. ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్వోలు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రీ మ్యాపింగ్ 87 శాతం పూర్తయ్యిందని తెలిపారు. 1565 పోలింగ్ కేంద్రాల పరిధిలో రాజకీయ పార్టీలు బీఎల్ఏ ల నియామకాలు పూర్తి చేశాయని, వారికి ఐడీ కార్డులు సమకూర్చాల్సిందిగా సూచించామన్నారు. జిల్లాకు బీఎల్వో కిట్లు కేటాయించాలని సీఈవోను కోరారు. అదనపు కలెక్టర్ భుజంగ రావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్వోలు పాల్గొన్నారు. వీసీలో మాట్లాడుతున్న సుదర్శన్రెడ్డి -
పెండింగ్ బిల్లుల్లో కమీషన్ల మతలబు
నిజామాబాద్ రూరల్: మాధవనగర్ ఆర్వోబీ పనులను త్వరిగతిన పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు అయినా రాష్ట్ర నిధు లు ఇవ్వండంలో అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి , టీపీసీసీ చీఫ్ మహేశ్కు మార్గౌడ్లు కమీషన్లకు ఆశపడి బ్రిడ్జి నిర్మాణానికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ దాదాపు ఐదు సంవత్సరాలుగా ఆర్వోబీ పనులకు ముగింపు పలకడం లేదన్నారు. ప్రతి రోజు సుమారు వంద అంబులెన్స్లు, వేలాది వాహనాలు ఆర్వోబీ గుండా ప్రయాణిస్తున్నాయన్నారు. రైల్వేగేట్ పడితే అంబులెన్స్లో ఉన్న రోగులు ప్రాణాలు కోల్పో యే ప్రమాదం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడకుండా కాంగ్రెస్ నాయకులు వెంటనే బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రూ. 3 కోట్ల పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నారు. అవి మంజూరు అయితే ఆర్వోబీ పనులు వేగంగా కొనసాగుతాయన్నా రు. కాంగ్రెస్ నాయకులు చొరవ చూపి పనులను జరిపించాలని ఎంపీ అర్వింద్ కోరారు. మాధవ నగర్ ఆర్వోబీ పనులకు అడ్డుపడుతున్న మహేశ్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి కేంద్రం నిధులు విడుదలైనా.. మంజూరు కాని రాష్ట్ర నిధులు ఎంపీ అర్వింద్ తీవ్ర విమర్శలు.. సోషల్ మీడియాలో వీడియో -
మహాప్రస్థానానికి ముందడుగు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో అంతిమ కష్టాలు తీర్చేందుకు దారి సుగమమైంది. శ్మశాన వాటిక అభివృద్ధికి ముందుకొచ్చిన ఎస్ఆర్ ఫౌండేషన్కు మున్సిపాలిటీ అనుమతి లేఖ అందజేసింది.దింపుడుకళ్లెం దిమ్మె కూడా లేని కామారెడ్డిలోని ప్రధాన శ్మశాన వాటికలో నెలకొన్న కష్టాలపై ఏప్రిల్ 20న ‘సాక్షి’లో ‘అంతిమ కష్టం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. సమస్య తీవ్రతను చూసి ఎందరో చలించిపోయారు. లక్షకుపైగా జనాభా ఉన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైకుంఠధామాల దుస్థితిని చూసి అవాక్కయ్యారు. ఈ కథనం ప్రచురితమైన రోజే జరిగిన మున్సిపల్ సమావేశంలో ఆయా పార్టీల కౌన్సిలర్లు సాక్షి క్లిప్పింగ్ను చూపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి ‘సాక్షి’ కథనాన్ని చదివి చలించిపోయారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం స్థాయిలో శ్మశాన వాటికను తీర్చిదిద్దడానికి ముందుకువచ్చిన ఆయన.. తన ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధుల ద్వారా జిల్లా అధికారులకు లేఖను అందించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సుభాష్రెడ్డిని కలిసి అభినందించారు. పట్టణంలోని పలు కుల సంఘాల ప్రతినిధులు సమావేశమై ఎస్ఆర్ ఫౌండేషన్కు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు.‘అంతిమ కష్టం’ తీరే దారిలో.. ఇటీవలే తీర్మానం చేసిన బల్దియా తాజాగా ఎస్ఆర్ ఫౌండేషన్కు అనుమతి లేఖ అందజేత -
అక్రమాలను అరికట్టేందుకే యూరియా యాప్
● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రైతులను కష్టపెట్టే పని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ చేయదని, ఇది రైతు ప్రభుత్వమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పేర్కొన్నారు. డిచ్పల్లి సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం యూరియా యాప్పై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సొసైటీలో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించారు. సంబంధిత వ్యవసాయశాఖ అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. తానే స్వయంగా రైతుతో యూరియా యాప్లో ఎరువుల బస్తాలను బుకింగ్ చేయించి, యాప్తో తలెత్తే సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. స్మార్ట్ ఫోన్లు లేనివారు, పట్టా పాస్బుక్లు లేని అసైన్డ్, పోడు భూములున్న వారు యూరియా బుకింగ్ కాక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ యూరియా అక్రమ రవాణాని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాప్ను ప్రవేశపెట్టిందని వివరించారు. యాప్లో సాంకేతిక కారణాలతో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతుల సమస్యలు ధైర్యంగా విని భరోసా కల్పించేందుకే ఇక్కడికి వచ్చానని.. చిత్తశుద్ధి లేకుంటే వచ్చేవాళ్లమే కాదన్నారు. కేంద్రం విధించిన పరిమితుల కారణంగా తెలంగాణకు యూరియా నిల్వలు రావడం లేదన్నారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతులను రోడ్లపైకి వచ్చేలా రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సర్పంచ్ యాదగిరి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్లు మునిపల్లి సాయరెడ్డి, తారాచంద్ నాయక్, డీసీసీ ఉపాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ రాంచందర్గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ చింత శ్రీనివాస్రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వాసుబాబు, అంబర్సింగ్, డాక్టర్ షాదుల్లా, బూస సుదర్శన్, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే లక్ష్యం
ఎంపీ అర్వింద్ ధర్మపురి సుభాష్నగర్ : దేశ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎంవీబీఆర్వై) పథకం లక్ష్యమని ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. నగరంలోని నిఖిల్సాయి ఇంటర్నేషనల్లో శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ అర్వింద్ ధర్మపురి పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధులను పంపిణీ చేశారు. అదేవిధంగా ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఎంపీ అర్వింద్ వర్చువల్గా విన్నారు. అనంతరం ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2024–25 బడ్జెట్లో పీఎంవీబీఆర్వై పథకాన్ని 2047 లక్ష్యమే సాధనగా ప్రకటించిందని గుర్తుచేశారు. ఉద్యోగుల సృష్టి, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈపీఎఫ్వో ద్వారా కేంద్రం మొదట ఉద్యోగంలో చేరిన వారికి రూ.15 వేల ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో నిజామాబాద్ ఈపీఎఫ్వో ప్రాంతీయ కార్యాలయ పరిధిలో 764 మంది ఉద్యోగులకు సుమారు రూ.15.71లక్షలు లబ్ధి పొందారన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచి, ఉద్యోగులకు, యజ మానులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే కేంద్ర ప్రభుత్వ ఉపాధి ప్రోత్సాహక పథకం పీఎంవీబీఆర్వై అని ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన అధికారులు పాల్గొన్నారు. -
ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ తప్పనిసరి
● అదనపు కలెక్టర్ భుజంగరావు సుభాష్నగర్ : ప్రయివేటు ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని, ఐదేళ్లకోసారి రెన్యువల్ చేయించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ విభాగం ఆధ్వర్యంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రయివేటుగా ఆరోగ్య సేవలు అందించాలనుకునే ఏ విభాగం ఆస్పత్రి అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, తప్పకుండా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. మొదట అర్హతలు పరిశీలించి తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఇస్తామని, ఏడాది తర్వాత ఐదేళ్ల వరకు అర్హత ఉండే శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వను న్నట్లు తెలిపారు. అర్హులైన వైద్యులు, సిబ్బంది మా త్రమే పనిచేయాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్వో రాజశ్రీ రిజిస్ట్రేషన్ విధానాన్ని వివ రించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వోలు విద్య, రవీందర్, సికందర్ నాయక్, ప్రోగ్రాం అధి కారి డాక్టర్ శిఖర, బోధన్ ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు మకంద, నాగనాథ్, డిప్యూటీ డెమో దుర్గారావు,వేణుగోపాల్,సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నోడల్ అధికారిగా లావణ్య
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మాదకద్రవ్యాల (డ్రగ్స్) నిరోధ క నోడల్ అధికా రిగా ప్రొఫెసర్ కే లావణ్య ని యామకమయ్యారు.వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లావణ్య మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణ, వాటి వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై యువతకు అవగాహన సదస్సులు, నిపుణులతో ముఖా ముఖి చర్చలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. నోడల్ అధికారిగా నియామకమైన లావణ్యకు వర్సిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ అప్లయిడ్ ఎకనామిక్స్ పరిశోధక విద్యార్థిని వై.ప్రమీల డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ కే రవీందర్రెడ్డి పర్యవేక్షణలో ‘తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో బాల కార్మికుల ఆర్థిక విశ్లేషణ – ఒక అధ్యయనం’ అనే అంశంపై ప్రమీల పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. శుక్రవారం జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేశ్లాల్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వ్యవహరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు స్వప్న, పున్నయ్య, నాగరాజు, సంపత్, శ్రీనివాస్, దత్తహరి, పరిశోధక విద్యార్థులు పా ల్గొన్నారు. డాక్టరేట్ సాధించిన ప్రమీలను వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి, కంట్రోలర్ కే సంపత్కుమార్ అభినందించారు. దరఖాస్తుల ఆహ్వానం ఖలీల్వాడి: ఎంబీఏలో అడ్మిషన్ తీసుకోవాలనే, ఐసెట్ – 2026 పరీక్ష రాయని వారికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించే ఎంబీఏ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ రాంమోహన్ రెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ రంజిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగష్టు 5వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు. ఖలీల్వాడి: డిచ్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలోని జడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థిని పి. శ్రీహితను డీఈవో పార్శి అశోక్, జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్ శుక్రవారం సన్మానించారు. 2026 ఆగస్టులో జరగనున్న ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి అంతరిక్ష కార్యశాలలో శ్రీహిత రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికయ్యారు. ఆమె పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ ఆధ్వర్యంలో ‘మిషన్ శక్తిశాట్’ భారత రాయబారి అయిన వింగ్ కమాండర్ జయ తారే (రిటైర్డ్) పర్యవేక్షణలో ‘శక్తిశాట్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. శక్తిశాట్ మిషన్లో రియల్–టైమ్ శాటిలైట్ ప్రాజెక్టుల ద్వారా 108 దేశాల నుంచి 12 వేల మంది బాలికలకు సాధికారత కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం గంగసావిత్రి, ఏటీఎల్ ఇన్చార్జి శ్రీనివాస్ ఖత్రి, బోధన్ ఎంఈవో నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
జీజీ కాలేజీ పరీక్ష ఫలితాలు విడుదల
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఏప్రిల్/మే–2026లో నిర్వహించిన యూజీ బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ 2వ, 4వతోపాటు 6వ సెమిస్టర్ల (రెగ్యులర్), 1వ, 3వ, 5వ (బ్యాక్లాగ్) సెమిస్టర్ (2025–26) పరీక్షా ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సంపత్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ పి. రాంమోహన్ రెడ్డి, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి కే భరత్ రాజ్, కళాశాల అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు కే వినయ్ కుమార్, డాక్టర్ యస్ జయప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. https:// gdctg. cgg. gov. in/ nizamabad. edu లో ఫలితాలను చూసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఆరో సెమిస్టర్లో 82.27 శాతం, నాలుగవ సెమిస్టర్ లో 50.17 శాతం, ఫస్ట్ ఇయర్ లో 47.96 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. నిజామాబాద్ రూరల్: రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి శుక్రవారం ఆదర్శనగర్లోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాల ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి , అమృతాపూర్ గంగాధర్, పొలసాని శ్రీనివాస్, బాల్రాజు, శ్యాంసన్, ధర్మాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గడుగు గంగాధర్ను అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సైతం పరామర్శించారు. నిజామాబాద్ అర్బన్ : నగరంలోని రెండో టౌన్ పోలీస్స్టేషన్ పరిధి వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న మదర్సా నుంచి 11 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. డిచ్పల్లికి చెందిన బాలుడు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు సమాచారం అందింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. గుర్జాల్లో వృద్ధుడు.. గాంధారి : మండలంలోని గుర్జాల్కు చెందిన మంగళారం పోశయ్య(60) అదృశ్యమైనట్లు ఎస్సై మహేందర్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 16 న ఇంటి నుంచి వెళ్లిన పోశయ్య తిరిగిరాలేదు. కొడుకు సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అభివృద్ధి అంతంతే!
బోధన్టౌన్(బోధన్): నిజాం చక్కెర కర్మాగారం ఉన్నంత కాలం ఓ వెలుగు వెలిగిన బోధన్ పట్టణం నేడు అరకొర అభివృద్ధితో ముందుకు సాగుతోంది. 1956లో మున్సిపాలిటీగా ఏర్పడి ప్రస్తుతం గ్రేడ్ –2 స్థాయికి ఎదిగింది. బోధన్లో 16 ఏళ్ల క్రితం నర్సింగ్ కళాశాల ఏర్పాటైంది. ఇప్పటి వరకు సొంత భవనానికి మోక్షం లభించలేదు. అప్పటి మాజీ మంత్రి, ఇప్పటి ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో నర్సింగ్ కళాశాల బోధన్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు ఆస్పత్రిలోని నాలుగు గదుల్లో నడుస్తోంది. అరకొర వసతులతో విద్యార్థులు చదువుకుంటున్నారు. వసతి గృహం లేక పోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే చొరవతో నర్సింగ్ పాఠశాలకు సొంత భవనం ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడ్డాయి. పాఠశాల భవన నిర్మాణం కోసం స్థల పరిశీలనతో పాటు రూ. 21 కోట్లు మంజూరు అయ్యాయి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.. బోధన్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సీఐ, సిబ్బందిని నియమించారు. అయితే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేక పోవడంతో పట్టణ పోలీస్ స్టేషన్లోనే కొనసాగుతోంది. స్థల సేకరణ చేసి సొంత భవనం నిర్మాణం జరిగేలా చర్యలు చేపట్టాల్సిన అసవరం ఉంది. పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్తో పాటు, సీసీఎస్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు పంపిన ప్రతిపాదలకు మోక్షం లేదు. మున్సిపాలిటీకి.. బోధన్ మున్సిపాలిటీ 1956లో ఏర్పాటయ్యింది. ప్రస్తుతం మున్సిపాలిటీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రతి వర్షాకాలంలో భవనం లీకేజీలు అవుతున్నాయి. అధికారులు మరమ్మతులు చేసి నెట్టుకొస్తున్నారు. నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వంద పడకలకే పరిమితం బోధన్లోని ప్రభుత్వ ఆస్పత్రి జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయ్యి పదేళ్లు గడుస్తోంది. 100 పడకల ఆస్పతిగానే కొనసాగుతోంది. ఈ ఆస్పత్రికి బోధన్ పట్టణం, బోధన్ మండలంతో పాటు ఇతర చుట్టు పక్కల ఏడు మండలాల ప్రజలు, మహారాష్ట్ర నుంచి సైతం ప్రజలు చికిత్స కోసం వస్తుంటారు. ప్రతి రోజు ఓపీ 500 నుంచి 700 వరకు నమోదవుతుంది. ఈ ఆస్పత్రికి స్థల సేకరణ చేసి నూతన భవనాన్ని నిర్మించాలని, అప్గ్రేడ్చేసి మరో 50 పడకలను పెంచాల్సిన అసవరం ఉంది. అలాగే స్కానింగ్ సెంటర్, ఇతర వసతులు కల్పించి, గైనిక్ విభానికి ఓ భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఒకప్పుడు వెలుగు వెలిగిన బోధన్ పట్టణం నిజాం షుగర్స్ లేఆఫ్తో మసకబారిందా.. జిల్లా ఆస్పత్రికి నూతన భవనం ఎప్పుడో.. లీకేజీలమయం మున్సిపాలిటీ భవనం నాలుగు గదుల్లోనే నర్సింగ్ కళాశాల -
నేడు జాతీయ లోక్ అదాలత్
నిజామాబాద్ లీగల్: రాష్ట్ర న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ద్వార కక్షిదారులు తమ పెండిగ్ కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి సూచించారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో పెండింగ్ ఉన్న సివిల్, క్రిమినల్, ఇతర కేసులను గుర్తించినట్టు జిల్లా జడ్జి తెలిపారు. లోక్ అదాలత్ ద్వార పరిష్కరించడానికి గుర్తించిన కేసుల్లో కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు 1650, యన్ఐ యాక్ట్ కేసులు 700, బ్యాంకు రికవరీ కేసులు 20, ఎంన్ఓపీలు 130, మ్యాట్రిమో నియల్ డిస్ప్యూట్స్ 200, సివిల్ కేసులు 592 కేసులు ఉండగా, ప్రీలిటిగేషన్తో కలిపి మొత్తం 3500 కేసులు గుర్తించినట్టు ఆమె తెలిపారు. యాప్ను రద్దు చేయాలి ● ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణ ఆర్మూర్: రైతులను ఎ రువుల కోసం ఇబ్బందులు పెడుతున్న యాప్ను రద్దు చేసి సింగిల్ విండో ద్వారా నేరుగా ఎరువులను సరఫరా చేయాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణ డిమాండ్ చేసారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగా, రైతులకు ఎరువులను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. ఇప్పటికే రైతులు పంటలు విత్తుకోవాలో లేదో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే రైతులకు అవసరమున్న ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్ చేసారు. పుష్కర ఘాట్లను పరిశీలించిన అధికారులు బోధన్: వచ్చే ఏడాది జరుగనున్న పుష్కరాల నేపథ్యంలో రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి నది ని జిల్లా అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారా వు, పంచాయత్రాజ్ ఇంజనీరింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. గోదావరి ఒడ్డు న అధికారులు పుష్కరఘాట్లను పరిశీలించారు. ఘాట్ల నిర్మాణం, ఆలయాల మరమ్మతుల కోసం కలెక్టర్కు నివేదికను అందించనున్నామన్నారు. తహసీల్దార్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
హుండీ చోరీ కేసులో నిందితుని అరెస్ట్
● రూ. 21,660 నగదు, స్కూటీ స్వాధీనం ● పరారీలో మరో నిందితుడు రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలోని సాయిఅయ్యప్ప దేవాలయంలో రెండు రోజుల క్రితం జరిగిన హండీ చోరీ కేసును ఛేదించినట్టు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ. 21,660 నగదు, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. కోటగిరి పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఏసీపీ వెల్లడించారు. శుక్రవారం ఉదయం రుద్రూర్ నుంచి స్కూటీపై వస్తున్న వ్యక్తి పోలీసులకు చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకొని విచారించారు. పోలీసుల విచారణలో ఈ నెల 17న ఏడుకొండలు అనే వ్యక్తితో కలిసి చోరీకి పాల్పడినట్లు నిందితుడు రాజు అంగీకరించాడు. నిందితుడు ఏడుకొండలు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కేసు దర్యాప్తులో ఎస్సై శ్రీనివాస్, హెడ్కానిస్టేబుల్ బస్వంత్ రావ్, కానిస్టేబుల్ యాదగిరి కీలకపాత్ర పోషించారని, అరెస్ట్ చేసిన కోటగిరి పోలీసులను ఏసీపీ అభినందించారు. -
భరోసా ఎక్కడ..?
ప్లే స్కూళ్లలో● మూడేళ్ల లోపు పిల్లలకూ అడ్మిషన్లు ● అనుమతులు లేకుండానే ఏర్పాటు ● జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వైనం ఖలీల్వాడి: విద్యాశాఖ అనుమతులు లేకుండానే నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్లే స్కూల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇవి నడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. యాజమాన్యాలు చెప్పినంత ఫీజులు తల్లి దండ్రులు చెల్లిస్తున్నా పిల్లల భద్రతకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారో చెప్పడం లేదు. ఒక్కో పాఠశాలలో సుమారు 50 నుంచి 100 మంది చిన్నారులను చేర్చుకొని, వారి అలనా పాలన చూసేందుకు కేవలం ఇద్దరు లేదా నలుగురు టీచర్లను, ఆయాలను నియమించి వదిలేస్తున్నారు. నిబంధనలకు నీళ్లు... 2010 ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్రకారం ఈ ప్లే స్కూల్స్ అనుమతి తీసుకొని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్లేస్కూళ్ల యాజామాన్యాలు ఎక్కడ ఇలాంటి నిబంధన పాటించడం లేదు. పిల్లలకు మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే ప్లే స్కూల్లో చేర్చుకోవడం ఎన్సీపీసీఆర్ నిబంధనలకు వ్యతిరేకం. అయినప్పటీకి కొన్ని యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే జిల్లాలో కొత్తగా ప్లే స్కూళ్లు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో పదుల సంఖ్యలో ప్లేస్కూళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టడం లేదంటున్నారు. కొన్ని ప్లే స్కూళ్లలో తల్లిదండ్రులను ఆకర్షించేందుకు బిల్డింగ్కు రంగురంగుల బొమ్మలు వేసి, అక్కడ పిల్లలకు ఆట వస్తువులను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో ఫీజు వసూళ్లు చేస్తున్నారు. కొన్ని ప్లేస్కూళ్ల యాజమాన్యాలు ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట ప్రచారం చేసి అడ్మిషన్లు చేస్తున్నారు. ఆడ్మిషన్ ఫీజుతోపాటు ఏడాది ఫీజును గంపగుత్తగా రూ. 50 వేల నుంచి రూ. 80 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు లేని ప్లేస్కూళ్లపై చర్యలు ప్రభుత్వ నిబంధనలు లేకుండా నడిచే ప్లేస్కూళ్లపై డీఈవో అనుమతితో తనిఖీలు చేసి నోటీసులు అందించి చర్యలు తీసుకుంటాం. ప్లేస్కూళ్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి. ఆపార్ట్మెంట్లు, ఫస్ట్ ఫోర్లులో పెట్టొద్దు. ప్రభుత్వం జిల్లాలో 112 ప్లేస్కూళ్లను ఏర్పాటు చేసింది. అందులో పిల్లలకు ఆడ్మిషన్లు తీసుకోవాలి. సాయారెడ్డి, సౌత్ ఎంఈవో, నిజామాబాద్ సీసీ కెమెరాలు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్లే స్కూళ్లను గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్ని యాజమాన్యాలు అపార్ట్మెంట్లలో లేదా ఫస్ట్ ఫ్లోర్లో ఏర్పాటు చేస్తున్నాయి. దీంతోపాటు స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్లే స్కూళ్లలో సౌకర్యాలు చూడకుండానే తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలాంటి సదుపాయాలు లేని పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా తప్పనిసరిగా ప్రమాణాలు పాటించే పాఠశాలలకే అనుమతులు మంజూరు చేసేలా, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
నందిపేటలో మహిళల ధర్నా
● మహిళా సంఘ స్థలం కబ్జాపై ఆందోళననందిపేట్(ఆర్మూర్): మహిళా సంఘానికి చెందిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నందిపేట మండల కేంద్రంలో శుక్రవారం మహిళా సంఘ సభ్యులు ధర్నా చేపట్టారు. స్థానిక బస్టాండ్ ఎదుట బైఠాయించారు. మండల కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన ఉన్న మహిళ సంఘం స్థలంలో ఓ ఆలయానికి సంబంధించిన వారు పిల్లర్లను వేయడాన్ని వ్యతిరేకించారు. ధర్నా నిర్వహించిన అనంతరం గ్రామ పంచాయతీకి ర్యాలీగా వెళ్లి సర్పంచ్ ఎర్రం లింగం, పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అనంతరం మహిళా సంఘం ఆవరణలో కట్టిన పిల్లర్లను కూలదోశారు. మండల కేంద్రంలోని ఏడు సంఘాలలోని 3 వేల మంది మహిళలకు ఈ భవనం ఒక్కటే దిక్కుఅని మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు ఎర్రం పద్మ అన్నారు. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క భవనాన్ని కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
సీఎంసీ ప్రతిష్టను దెబ్బతీయొద్దు
● చైర్మన్, ఎండీ షణ్ముగం మహాలింగం నిజామాబాద్ రూరల్: డిచ్పల్లి మండల పరిధిలో ఉన్న సీఎంసీ (క్రిస్టియన్ మెడికల్ కాలేజీ) ప్రతిష్టను భంగపరిచేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చైర్మన్, ఎండీ షణ్ముగం మహాలింగం హెచ్చరించారు. నగరంలోని ప్రెస్క్లబ్లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రూ.200 కోట్ల పెట్టుబడితో కళాశాలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తే దురుద్దేశ పూర్వకంగా సంస్థపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎంసీ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య జరుగుతున్న వివాదాలను వివరించారు. సీఎంసీ క్యాంపస్లో జరిగిన ఘటనల నేపథ్యంలో ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేయకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఎఫ్ఐఆర్ నం.176/2026 ద్వారా సీఎస్ఐ ప్రతినిధులైన బి. విమల్ సుకుమార్, దయానంద్, కేవీ ప్రసాద్ నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అజ్జ శ్రీనివాస్తోపాటు మరో ఇద్దరిపై ఈ నెల 11న కేసు నమోదైనట్లు తెలిపారు. అక్టోబర్ 2024 నుంచి సీఎస్ఐ టీఏ మెదక్ డయాసిస్తో కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు సీఎంసీ క్యాంపస్లో పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. -
రైతులను రోడ్లపైకి తెచ్చిన ఘనత కాంగ్రెస్దే..
● రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదు ● మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డివేల్పూర్: రైతులను రోడ్లపైకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేల్పూర్ క్రాస్రోడ్డు వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్రెడ్డిది తుగ్లక్ పాలన అని విమర్శించారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదని, కేసీఆర్ పాలనలో రాజుగా ఉన్న రైతు రేవంత్రెడ్డి పాలనలో రోడ్డున పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్తోపాటు వ్యవసా య అధికారులు ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదన్నా రు. కలెక్టర్ స్వయంగా వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రైతుల తరపున ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తామని ప్రకటించారు. కలెక్టర్ తరఫున అదన పు కలెక్టర్ కిరణ్కుమార్ ధర్నా స్థలానికి చేరుకొని కలెక్టర్తో ఫోన్లో మాట్లాడించగా, రైతుల తరఫున పలు డిమాండ్లను ప్రశాంత్రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో ఒకరి అరెస్టు
నిజామాబాద్ అర్బన్: నగరంలోని శాంతినగర్లో బుధవారం తెల్లవారుజామున చోరీకి పాల్పడిన నేరస్తున్ని ఐదో టౌన్పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు.. శాంతినగర్లోని అజ్మీర్బేగం ఇంటిబయట నిద్రిస్తుంది. శాంతినగర్కు చెందిన పాతనేరస్తుడు రియాజ్ఖాన్ బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి రూ.లక్ష 20వేల నగదును , 20 తులాల వెండి, ఆరు గ్రాముల చెవి కమ్మలు చోరీ చేశాడు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా గురువారం ఉదయం ఖిల్లా చౌరస్తా వద్ద నేరస్తున్ని పట్టుకొని అతని వద్ద రూ.లక్ష 10వేల నగదును, ఇనుప సుత్తెలను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో రెండు కేసులు, నిజామాబాద్ ఒకటో, మూడవ టౌన్లల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. -
హార్వెస్టర్ పనికి వచ్చి చోరీలు
● నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నిజామాబాద్ అర్బన్: హర్యానా రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హార్వెస్టర్ పనుల కోసం జిల్లాకేంద్రానికి వచ్చారు. ఉదయం పనులు చేస్తు రాత్రివేళలో చోరీలకు పాల్పడుతున్నట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. ఇటీవల హమాల్వాడిలో సాయిబాబా ఆలయంలో జరిగిన దొంగతనం కేసులో వీరిని అరెస్టు చేశారు. హర్యానాకు చెందిన రింకుసింగ్, రవిసింగ్, అమన్దీప్సింగ్లు రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. హమాల్వాడిలోని సాయిబాబా మందిరంలో దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు కాగా ఇటీవల మరొకరిని పట్టుకున్నట్లు తెలిపారు. వీరిపై మూడో టౌన్లో రెండు కేసులు, రెండో టౌన్లో, మాక్లూర్లో ఒక్కొక్క కేసు, ఐదోటౌన్, ఆర్మూర్ టౌన్లో రెండేసి కేసుల చొప్పున నమోదైనట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. -
ఆటపాఠాల బడి
ప్రభుత్వ బడివైపు అడుగులు..పన్ను చెల్లిస్తామని కోనాపూర్ జీపీ నిర్ణయం● తన పిల్లలను చేర్పించిన బెజ్జోర సర్పంచ్ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పిస్తున్న సర్పంచ్ కార్తీక్ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు పేద, మధ్య తరగతిపై చదువుల కోసం ఆర్థికభారం పడకుండా ప్రజాప్రతినిధులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇందుకోసం తామే ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించగా, తాజాగా భీమ్గల్ మండలం బెజ్జోర సర్పంచ్ కార్తీక్ తన కూతురు అక్షరవింద, కొడుకు శ్రీమాన్ రుద్రను నాల్గో తరగతిలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులు ఉంటారని, దీనిని దృష్టిలో ఉంచుకొనే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించానని సర్పంచ్ అన్నారు. సర్పంచ్ నిర్ణయంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. – కమ్మర్పల్లి(భీమ్గల్) ఆటలు ఆడిస్తూ అక్షరాలు నేర్పిస్తే.. పాటలు పాడుతూ అంకెలు వల్లె వేయిస్తే.. బడికి వెళ్లనని మారాం చేసే చిన్నారులు ఉంటారా? పిల్లల శారీరక, మానసిక వికాసం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రీ ప్రైమరీ’ పాఠశాలలు దోహదం చేయనున్నాయి. జక్రాన్పల్లి మండలం నారాయణపేట గ్రామంలోని ప్రీ ప్రైమరీ పాఠశాల ఇది. ప్రైవేట్కు దీటుగా అన్ని హంగులతో రూపుదిద్దుకున్న పాఠశాలలకు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా వస్తున్నా రు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పాఠశాల కొనసాగుతోందని ఇన్స్ట్రక్టర్ తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంతోపాటు అన్ని రకాల ఆటవస్తువులు అందుబాటులో ఉండడంతో పిల్లలు ఉత్సాహంగా వస్తున్నారని హెచ్ఎం కిషన్ తెలిపారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించే వారి ఇంటి పన్ను (2026–27)ను గ్రామ పంచాయతీ నుంచి చెల్లించాలని కమ్మర్పల్లి మండలం కోనాపూర్ జీపీ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ రిక్క అరుణ్కుమార్ అధ్యక్షతన గురువారం సమావేశమైన పాలకవర్గ సభ్యులు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బతికించుకోవాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులు తీసుకున్న నిర్ణయంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అనర్హుల ఓట్లు జాబితాలో లేకుండా చూడాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చి అనర్హులను జాబితాలో లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఎల్వోలదేనని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ సూచించారు. గురువారం సదాశివనగర్, రామారెడ్డి, గాంధారి మండలాల బీఎల్వోలకు ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెల 25 నుంచి జూలై 26 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను సేకరించాలన్నారు. ఎన్యూమరేషన్ ఫాంను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాల్సిన బాధ్యత కూడా బీఎల్వోలపై ఉందన్నారు. తహసీల్దార్లు సత్యనారాయణ, ఉమాలత, రేణుకా చౌహాన్, ఎంఆర్ఐ సంతోష్కుమార్, బీఎల్వోలు పాల్గొన్నారు. -
పసికందుతో పరీక్షకు
● టెట్ రాసిన అభ్యర్థిని ● సహకరించిన భర్త ఖలీల్వాడి: జిల్లాలోని సాలూర మండలానికి చెందిన కందిమల్ కళ్యాణి, కందిమల్ అభినయ్ దంపతులు కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ లక్ష్యాలపై తమ నిబద్ధతను చాటిచెప్పారు. కందిమల్ కళ్యాణి 11 రోజుల పసికందుతో నిజామాబాద్లో నిర్వహించిన టెట్ పరీక్షకు హాజరైంది. భర్త అభినయ్ కూడా పరీక్ష కేంద్రానికి వచ్చి పసిబాబును ఆడించారు. తల్లి పరీక్ష రాస్తుండగా తండ్రి బయట బిడ్డను చూసుకుంటూ నిలిచిన సన్నివేశం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. నిజామాబాద్ పరీక్ష కేంద్రంలో కనిపించిన ఈ ఘటన కుటుంబ బంధం, బాధ్యత, పరస్పర సహకారానికి మంచి ఉదాహరణగా నిలిచింది. నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఆదర్శనగర్ లో నివాసం ఉంటున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఇంట్లో గురువారం రా త్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆయన ఇల్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిసింది ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో భారీ ఎ త్తున అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాప శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని అధికారు లు భావిస్తున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున నష్టం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. -
క్రైం కార్నర్
కామారెడ్డి క్రైౖం: రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటన భిక్కనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం జరిగింది. రైలు పట్టాల మధ్య ఓ మృతదేహం ఉందనే సమాచారం రావడంతో కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒంటిపై నలుపు, తెలుపు రంగుల చెక్స్ షర్టు, బూడిద రంగు ప్యాంటు వేసుకుని ఉన్నాడు. కుడి చేతికి స్టీల్ కడియం, లవ్ గుర్తు పచ్చబొట్టు ఉన్నాయి. మృతుని వయస్సు 30–35 మధ్య ఉంటుందని, ఘటన జరిగిన తీరు బట్టి ఆత్మహత్య చేసుకున్నారని రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎవరైనా ఆయనను గుర్తుపట్టినా, ఆనవాళ్లు తెలిసినా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. భార్య కాపురానికి రావడం లేదని .. వర్ని: మోస్రా మండల కేంద్రానికి చెందిన గంగాప్రసాద్ (24) భార్య మమత కాపురానికి రావడం లేదని మనస్తాపంతో గురువారం తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. మమత పుట్టింటికి వెళ్లి గత ఐదు నెలలుగా తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి చెందాడని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గడ్డివాము దగ్ధం ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని సాతెల్లి గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించి గడ్డి వాము దగ్ధమైందని స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన జంగిలి బాలయ్యకు చెందిన 1500 గడ్డి మోపుల వాముకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుందన్నారు. మంటలు అంటుకున్న వెంటనే వాటిని ఆర్పే ప్రయత్నం చేశామని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించామని తెలిపారు. గడ్డి మోపులు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితుడు బాలయ్య తెలిపారు. -
మైనర్ డ్రైవింగ్కు నిండు ప్రాణం బలి
కామారెడ్డి క్రైం: మైనర్ డ్రైవింగ్ నేరమని తెలిసినా తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లల విషయంలో అతి విశ్వాసంతో వాహనాలను అప్పగిస్తున్నారు. ఇది ప్రాణాల మీదికి తెస్తోంది. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇల్చిపూర్ శివారులో రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రి పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. తాడ్వాయి మండలం నందివాడకు చెందిన పుల్గం వెంకటస్వామి (39) ఎనిమిదేళ్ల క్రితం లింగంపేట మండలం మోతె గ్రామానికి చెందిన బొద్దుల పౌల్ ఇంటికి ఇల్లరికం వచ్చాడు. అతడికి భార్య స్వప్న, ఐదేళ్లలోపు వయసుగల కుమారు లు విస్తృత్, విహాల్ ఉన్నారు. అతడు కామారెడ్డిలోని ఓ ప్రై వేటు కంపెనీలో రికవరీ ఏ జెంట్గా పని చేస్తున్నాడు. రో జూ మాదిరిగానే గురువా రం ఇంటి నుంచి బైక్పై విధులకు వెళ్లాడు. ఇల్చిపూర్ శివారులో ఎదురుగా వచ్చిన రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్పై ప్ర యాణించిన జిల్లాకేంద్రంలోని అశోక్నగర్కు చెందిన బాలుడికి గాయాలయ్యాయి. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పదో తరగతి పాసయ్యాడని స్పోర్ట్స్ బైక్! సదరు బాలుడు పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్లో అడుగుపెట్టాడు. కొడుకు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడన్న సంబురంతో అతడి తండ్రి రూ. 4 లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ బైక్ను గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని ఎస్సై రంజిత్ తెలిపారు. -
ఏఐపై విద్యార్థులకు ఇంటర్న్షిప్ శిక్షణ
కామారెడ్డి అర్బన్: శాస్త్రసాంకేతిక యుగానికి విద్యార్థులను భావి ప్రపంచానికి సిద్ధం చేసే లక్ష్యంతో తెలంగాణ విద్యాశాఖ ‘అన్న–అక్క’ ఇంటర్న్షిప్ కార్యక్రమం ప్రారంభించిందని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నోడల్ అధికారి ఎ. రాజేందర్ అన్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ అంశాలపై గురువారం ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అన్న–అక్క ఇంటర్న్షిప్లో భాగంగా 30 గంటల శిక్షణ అందిస్తామని నోడల్ అధికారి పేర్కొన్నారు. ప్రిన్సిపల్ విజయ్కుమార్ మాట్లాడుతూ.. ఇంటర్న్షిప్ ద్వారా విద్యార్థుల్లో సమాజంపై బాధ్యత పెంచుతుందన్నారు.సమన్వయకర్తలు విశ్వప్రసాద్, సుధాకర్, శ్రీనివాస్రావు, రాములు, కవిత, రాంప్రసాద్తో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి కళాశాలల నోడల్ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పోస్టుల భర్తీ ఎన్నడో?
మోర్తాడ్(బాల్కొండ): అంగన్వాడీ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉంటున్నా వాటి భర్తీ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. ఆయా పోస్టులతోపాటు టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారోనని ఎంతో మంది నిరీక్షిస్తున్నారు. జిల్లాలో 1501 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, ఇందులో 135 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ అయిన సెంటర్లలో ఆయా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అంగన్వాడీ ఆయాలు, టీచర్లకు పదవీవిరమణ నిబంధనలు అమలులోకి రావడంతో ఎంతో మంది ఇంటికి వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో 400 ఆయా పోస్టులు, 76 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2018 తరువాత పోస్టుల భర్తీ లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. గతంలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఖాళీలను భర్తీ చేసేవారు. అయితే నియామకాల్లో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యేలు తమ అనుకూలురను నియమించుకోవడంతో అర్హులకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో నియామకాల ప్రక్రియను కలెక్టర్లకు అప్పగించింది. బాధ్యతలు కలెక్టర్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత ఒక్కసారి మాత్రమే ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ఆ తరువాత పోస్టుల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఇంగ్లిష్ మాధ్యమంలో చిన్నారులకు బోధన అందించాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఎంతో ప్రాధాన్యత లభించనుంది. ప్రభుత్వ ఆశయం బాగానే ఉన్నా ఖాళీలను భర్తీ చేయకుండా ఎలాంటి విద్యా సేవలు అందించలేరని పలువురు పేర్కొంటున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. ఏళ్ల తరబడి పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పని చేస్తున్న వారిపై భారం పెరిగింది. ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న టీచర్, ఆయాల పోస్టులను భర్తీ చేసి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి. – దేవగంగు, అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు అంగన్వాడీ సెంటర్లలో 400 ఆయా, 76 టీచర్ పోస్టులు ఖాళీ 2018 తరువాత మళ్లీ రిక్రూట్మెంట్ లేదు మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసినా ఆయాలను నియమించని వైనం -
మానవత్వంతో రక్తదానం చేయాలి
సుభాష్నగర్: మానవత్వంతో రక్తదానం చే సి విలువైన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు అన్నారు. ప్రపంచ రక్తదాతల వారోత్సవాలను పురస్కరించుకుని ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కో సం రక్తదాన శిబిరాన్ని నగరంలోని పవర్ హౌజ్ ఆవరణలో ఉన్న గోల్డెన్ జూబ్లీ సమావేశమందిరంలో గురువారం ఏర్పాటు చేశారు. ఎస్ఈ రాజేశ్వర్రావు బోధన్ డీఈ మహ్మద్ ముక్తార్తో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారిద్దరితోపాటు ఆ యా యూనియన్లు, అసోసియేషన్ల నా యకులు, ఉద్యోగులు మొత్తం 50 మంది రక్తదానం చేశారు. రెడ్క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, డీఈలు ఎం శ్రీనివాస్రావు, ఎండీ ముక్తార్, వెంకటరమణ, హరిచంద్ర నాయక్, తోట రాజశేఖర్, పీవో పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాలి ఆర్మూర్టౌన్ : గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకునేలా చూడాలని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. డివిజన్లోని పట్టణ ఆరోగ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పని చేస్తున్న డాక్టర్లు, హెల్త్ సూపర్వైజర్లు, రిపోర్టింగ్ అధికారులతో పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరా రు. జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశో క్, ఆర్మూర్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ రవీందర్ పాల్గొన్నారు. జీపీ రికార్డుల తనిఖీ డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): మండలంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి పీఆర్ అండ్ ఆర్డీ డిప్యూటీ డైరెక్టర్ (విజిలెన్స్) సుబ్రమణ్యం సందర్శించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, రికార్డుల నిర్వహణను, ఉపాధిహామీ పనుల రికార్డులను తనిఖీ చేశారు. తడి, పొడి చెత్త వేస్ట్ మేనేజ్మెంట్పై సుప్రీం కోర్డు గైడ్లైన్స్ తదితర అంశాలకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి రమేశ్ కు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీవో శ్రీనివాస్గౌడ్ ఉన్నారు. సర్పంచ్ రవికిరణ్, ఉప సర్పంచ్ ఖాదర్, వార్డు మెంబర్లు, పంచాతీయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లితే ఉన్నత అవకాశాలు
● తెయూ రిజిస్ట్రార్ యాదగిరి ఖలీల్వాడి: విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందకెళ్లితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెయూ రిజిస్ట్రార్ యాదగిరి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులకు పట్టాలను అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యతో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, సాఫ్ట్వేర్ రంగమే కాకుండా పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చునని తెలిపారు. అనంతరం కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ చెరుకూరి రజినీకాంత్ మాట్లాడుతూ కాకతీయ మహిళ ఇంజినీరింగ్ కాలేజ్కు చెందిన 232 విద్యార్థినులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించడంతో వారిని అభినందించారు. విద్యార్థినులు తల్లిదండ్రులు, సమాజానికి గర్వకారణంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సెల్వకుమార్, మేనేజర్ నాగేశ్వర్రావు, వైస్ప్రిన్సిపల్ సాయారెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు. కామారెడ్డి టౌన్: టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందుప్రియలు గురువారం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో కమిటీ ముందు హాజరై కమిటీ చైర్మన్ మల్లు రవికి తన వివరణ ఇచ్చారు. పక్షం రోజుల క్రితం కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీస్కు సమాధానమిస్తూ నివేదికలను చైర్మన్కు స్వయంగా అందజేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, చంద్రశేఖర్రెడ్డి మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేసుకున్నారు. రుద్రూర్: రుద్రూర్ పోలీస్స్టేషన్ నూతన ఎస్సైగా మనోజ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బోధన్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తు న్న ఆయన బదిలీపై రుద్రూర్ వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నిజామాబాద్ రూరల్: మండలంలోని ముత్తకుంట గ్రామంలో ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల ఇళ్లను గురువారం హౌసింగ్ పీడీ గీత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపడుతుందన్నారు. అర్హులను గుర్తించడంతో అధికారులు అలసత్వం వహించరాదని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాంనారాయణ రెడ్డి, గ్రామ కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు. -
పగలు రెక్కీ.. రాత్రి చోరీ
● జిల్లాలో పెరుగుతున్న దొంగతనాలు ● జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్రకు పరారీ ● మరింత నిఘా పెంచితేనే మేలు నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో మళ్లీ దొంగతనాలు పెరిగాయి. కొన్ని రోజులుగా దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సోమవారం జిల్లా కేంద్రంలో మూడు ప్రాంతాల్లో దొంగతనాలు జరిగాయి. పోలీసుల నిఘా, పెట్రోలింగ్ వ్యవస్థ మరింత పెంచితేనే దొంగతనాలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. – ఇటీవల నగరంలోని సుభాష్నగర్లో రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ రవికుమార్ ఇంటిలో తాళం పగులగొట్టి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. 20 తులాల బంగారం ఉన్న లాకర్ను ఎత్తుకెళ్లారు. గాయత్రినగర్, పద్మనగర్ కాలనీలతోపాటు సుభాష్నగర్ ఏరియాల్లో చైన్స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. పద్మనగర్లో వరుసగా మూడు ఇళ్లలో దొంగతనం జరిగింది. – ఆర్మూర్లో వరుసగా మూడు ఇళ్లలో, వర్ని మండలం శ్రీనగర్లో వరుసగా నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. తాళాలు పగులగొట్టి 4 తులాల బంగారం, రూ. 20 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇటీవల నగరంలోని వర్నిరోడ్డు, ఆర్యనగర్ ప్రాంతాల్లో ఏటీఎంలను కొల్లగొట్టి రూ.35 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఖలీల్వాడిలో పంజాబ్నేషనల్ బ్యాంక్ ఏటీఎం దొంగతనానికి యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. సుభాష్నగర్లోని అపార్ట్మెంట్లో తాళం పగులగొట్టి దొంగతనం చేశారు. ఇలా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలు పగటిపూట రెక్కి నిర్వహించి రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రివేళల్లో చోరి చేస్తున్నారు. దొంగలు పగటి పూట వీధుల్లో వివిధ రకాల వస్తువులు విక్రయిస్తూ తాళం లేని ఇళ్లను గుర్తిస్తున్నారు. రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతూ జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్ర వైపు తేలికగా తప్పించుకొని పారిపోతున్నారు. దొంగలకు తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా మారుతున్నాయి. పగటి పూట వీధుల్లో చిన్నచిన్న వస్తువులు విక్రయిస్తూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తున్నారు. తర్వాత రెక్కీ నిర్వహించి ఇంట్లోని సభ్యులు ఊరికి వెళ్లారని నిర్ధారించుకుని రాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఒకే రోజు వరుసగా రెండుమూడు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. -
రాష్ట్రంలో అధ్వానంగా విశ్వవిద్యాలయాలు
● నిజాంసాగర్ ప్రాజెక్టులో పూడికతీతపై దృష్టి సారించాలి ● మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సుభాష్నగర్ : రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు అ ధ్వానంగా తయారయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ గవర్నర్, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో పార్టీ నాయకులు, పసుపు రైతులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న 19 విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయన్నారు. 2026–27 బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 8.2 శాతం నిధులు కేటాయించడం తగదన్నారు. ఉత్తర తెలంగాణజీవనాడి అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో పూడికతీత, కాలువల ఆధునీకరణ, నీటి నిల్వ సా మర్థ్యం పెంపు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రెండున్నరేళ్లు గ డుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిజాంషుగర్స్ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం పసుపు రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పసుపుబో ర్డు ఏర్పాటు చారిత్రక నిర్ణయమని, పసుపు ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగిందన్నారు. కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతిఒక్కరూ పార్టీ కోసం కష్టపడాలని దత్తాత్రేయ సూచించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, సీనియర్ నాయకులు లోక భూపతిరెడ్డి, టక్కర్ హన్మంత్రెడ్డి, గీతారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి
● ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నిరుద్యోగ అభ్యర్థులు డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేసేలా చొరవ చూపాలని కోరుతూ.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డికి పలువురు నిరుద్యోగ అభ్యర్థులు విన్నవించారు. ఈ మేరకు గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు పోస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడేలా చూడాలని తద్వారా అనేకమంది నిరుద్యోగులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రూప్స్, డీఎస్సీ తదితర విభాగాల వారీగా ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లు జారీ అయ్యేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులపై చిత్తశుద్ధితో ఉందని అందుకు నిదర్శనమే ఇప్పటి వరకు దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. -
సర్లో తప్పిదాలకు తావివ్వొద్దు
● కలెక్టర్ ఇలా త్రిపాఠినిజామాబాద్ అర్బన్: స్పెషల్ ఇంటెన్నిస్ రివిజన్ (సర్) ప్రక్రియలో తప్పిదాలకు తావివ్వొద్దని, పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ నెల 25 నుంచి ‘సర్’ సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో గురువారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. బీఎల్వోలు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటరు మ్యాపింగ్ను పూర్తి చేయాలన్నారు. ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, జాబితాలో పేర్లు ఉన్నవారు ఇతర ప్రాంతానికి శాశ్వతంగా వలస వెళ్ళారా? మృతి చెందారా? రెండు చోట్ల పేర్లు ఉన్నాయా? అనే అంశాలను నిశితంగా గమనించాలన్నారు. ఎస్ఐఆర్ సర్వే వివరాల ఆధారంగానే ఓటరు జాబితాను రూపొందించనున్న దృష్ట్యా పొరపాట్లకు అవకాశం ఇ వ్వొద్దన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఒక్క ఓట రు పేరు కూడా తప్పిపోకుండా చూడాలని, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర వీఐపీల మ్యాపింగ్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఇప్పటికే ప్రీ– మ్యా పింగ్ చేసుకున్న ఓటర్లకు సంబంధించి కూడా ఏవై నా మార్పులు చేయాల్సి ఉంటే, వాటిని సరి చేయొచ్చన్నారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండుతున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం జరుగుతుందన్నారు. ఉపాధి నిమిత్తం విదేశాలలో ఉంటున్న వారి ఎన్యుమరేషన్ ఫారంపై వారి కు టుంబ పెద్ద సంతకం తీసుకోవచ్చని స్పష్టం చేశా రు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో బీఎల్వోల కృషితో జిల్లాలోనే అత్యధికంగా ప్రీ మ్యాపింగ్ 93.5 శాతమై ప్రస్తుతం చివరి దశలో ఉందన్నారు. నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కృషి
● కల్లూర్ గ్రామంలో జిల్లాలోనే తొలి మహిళా మండలి భవనం నిర్మాణం ● ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి రుద్రూర్ : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో రూ.10 లక్షల ఎన్న్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన గ్రామ మహిళా సంఘం భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... జిల్లాలోనే తొలి మహిళా మండలి భవనం కల్లూర్ గ్రామంలో నిర్మించబడటం అభినందనీయమన్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు. బాన్సువాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో విజయకుమారి, సర్పంచ్ రామ్రెడ్డి, డీఆర్డీవో సాయన్న, తహసీల్దార్ సందీప్, ఎంపీడీవో చందర్, ఐకేపీ ఏపీఎం భాస్కర్, మాజీ ఎంపీపీ పుప్పాల శంకర్, ఏఎంసీ చైర్మన్ హనుమంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కొయ్యగుండు తండా శివారులో గురువారం ఉదయం పెరుగు, పాలు తరలిస్తున్న ట్రాలీ ఆటో బాల్తాపడి ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపు పెరుగు బకెట్లు, పాల ప్యాకెట్లతో వెళ్తున్న ట్రాలీ ఆటో కొయ్యగుండు తండా శివారులోకి రాగానే రోడ్డుదాటే ప్రయత్ని చేస్తున్న తండాకు చెందిన సునీతను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సతీశ్కు తీవ్రగాయాలు కాగా, సునీతకు స్వల్ప గాయాలయ్యాయయి. డ్రైవర్ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నిజామాబాద్ ఏరియా ఆస్పపత్రికి తరలించారు. -
సైబర్ నేరాలపై అవగాహన
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సైబర్ నేరాలపై ఖాతాదారులు, బ్యాంకు సిబ్బందికి పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడారు. సైబర్ నేరాలతో మోసపోతే టోల్ ఫ్రీ నంబర్ 1903కి కాల్ చేయాలని సూచించారు. ఎవరికి ఓటీపీలు చెప్పవద్దన్నారు. బ్యాంకు అధికారులు, పోలీసులు ఓటీపీలు చెప్పమని ఎవరు అడగరని అన్నారు. అత్యవసర సమయాల్లో 100/112 నంబర్లకు డయల్ చేయాలన్నారు. కళాబృందం సభ్యులు తిరుపతి, శేషారావు, ప్రభాకర్, సాయిలు, షీటీమ్ సభ్యులు శ్రీశైలం, సుప్రజ, బ్యాంకు మేనేజర్ జ్యోతి, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. -
ఆటో సీజ్ చేసిన ఎంవీఐ
ఆర్మూర్టౌన్: పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద గురువారం ఉదయం ఎంవీఐ రాహుల్ కుమార్ వాహనాలను తనిఖీ చేశారు. ఆటోలో పరిమితికి మించి స్కూల్ పిల్లలను తరలిస్తున్న ఆటోను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ.. ఆటోలో ముగ్గురికి మించి పిల్లలను ఎక్కించొద్దని, వాహనదారులు సీట్ బెల్టు ధరించడంతోపాటు స్పీడ్ లిమిట్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేసి జరిమానా విధించామన్నారు. ఏఎంవీఐ రోహిత్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రాఘవపల్లి శివారులో బుధవారం రాత్రి అక్రమంగా మొరం తవ్వకం పనులు చేపట్టిన జేసీబీ, ట్రాక్టర్ను పట్టుకొని సీజ్ చేసినట్లు స్థానిక ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. మొరం తవ్వకానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కేసు నమోదు చేసి జేసీబీని, ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించామని చెప్పారు. -
సింగిల్యూజ్ ప్లాస్టిక్ నిషేధ అమలు నోడల్ అధికారిగా రామేశ్వర్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యూపీ) నిషేధం అమలు కోసం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగానికి చెందిన ఎన్.రామేశ్వర్ నోడల్ అధికారిగా నియామకమయ్యారు. తెయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రామేశ్వర్ వర్సిటీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, అమలు చర్యలు, పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించనున్నారు. నోడల్ అధికారిగా నియామకమైన రామేశ్వర్కు వర్సిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. -
159 సెల్ఫోన్ల రికవరీ
● నెలరోజులపాటు స్పెషల్ డ్రైవ్ ● కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్రకామారెడ్డి క్రైం: జిల్లాలో నెల రోజులుగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 159 సెల్ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 25.44 లక్షలు ఉంటుందన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మ్తొతం రూ. 7.90 కోట్ల విలువైన 4,939 సెల్ఫోన్లను రికవరీ చేశామన్నారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే పాత సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. రికవరీ చేసినవాటి వివరాలను బాధితులకు తెలియజేస్తామని, వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్సై బాల్రాజు (87126 86114) ను సంప్రదించి ఫోన్లు తీసుకువెళ్లాలని సూచించారు.కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకుగాను జిల్లావ్యాప్తంగా గురువారం ఒకే రోజు 383 మందికి కోర్టులు శిక్షలు విధించాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని ఆయా కోర్టులలో హాజరుపరచగా.. ఇద్దరికి 5 రోజులు, ఒకరికి 3 రోజులు, నలుగురికి 2 రోజులు, 46 మందికి ఒకరోజు జైలు శిక్షలతో పాటు మొత్తం 383 మందికిగాను రూ.4,93,500 జరిమానాలను విధించారని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమన్నారు. జిల్లావ్యాప్తంగా క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అర్బన్ పార్క్లకు ప్రాధాన్యత ఇవ్వాలి
మాక్లూర్ : ప్రాణవాయువునిచ్చే అరణ్య అర్బన్ పార్క్ల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వా టి సంఖ్యను మరింత పెంచాలని ఆర్మూర్ ఎమ్మె ల్యే పైడి రాకేశ్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మండ లంలోని అడవిమామిడిపల్లి, చిన్నాపూర్ శివార్లలో 63వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో 476 ఎకరాల విస్తీర్ణంలో రూ. 5 కోట్ల నిధులతో నిర్మించిన అరణ్య అర్బన్ పార్క్ను ముఖ్యమంత్రి ఏ రే వంత్రెడ్డి హైదరాబాద్ నుంచి గురువారం వర్చుల్గా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి రిబ్బన్ కట్ చేశారు. అనంత రం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ వంటి మహానగరాల్లో గాలిని కొనుక్కు నే పరిస్థితి వచ్చిందని, పరిస్థితులను గుర్తించి ప్ర భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 11 అరణ్య అర్బన్ పార్క్లను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. అర ణ్య అర్బన్ పార్క్లోకి ఆకతాయిలు చేరి సందర్శకులను వేధిస్తున్న విషయం తన దృష్టికి వచ్చింద ని అటవీ అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు. ఇటువంటి ఫిర్యాదులు మళ్లీ వస్తే సహించేది లేదన్నా రు. ఎవరైనా జులుం ప్రదర్శిస్తే వెంటనే పోలీసుల కు సమాచారం ఇచ్చి వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధి కారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ మాట్లాడుతూ.. అడవుల సంరక్షణ అనేది తన ఒక్కడితో సాధ్యం కాదన్నా రు. చిన్నాపూర్ శివారులో అటవీ భూమి కబ్జాకు గురవుతోందని ఎమ్మెల్యే పలుమార్లు తన దృష్టికి తీసుకువచ్చారని, స్థానిక అధికారులు బాధ్యత తీ సుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి, బాసర సర్కిల్ అటవీ అధికారిణి అర్పన అడవుల సంరక్షణపై మాట్లాడారు. అడిషనల్ డీసీపీ శుభంప్రకాశ్, అడిషనల్ కలెక్టర్లు కిరణ్కుమార్, భుజంగరావు, డీఆర్డీవో జి సాయన్న, అడవిమామిడిపల్లి, చిన్నాపూర్ సర్పంచ్లు కూన లత, పు ప్పాల చిన్నా, అటవీ అధికారులు పాల్గొన్నారు. పార్క్ల సంఖ్యను మరింత పెంచాలి ఆకతాయిలను రానివ్వొద్దు అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి వర్చువల్గా ప్రారంభించిన సీఎం రేవంత్ -
కంఠేశ్వరాలయాన్ని సందర్శించిన చరిత్రకారులు
నిజామాబాద్ రూరల్: నగరంలోని నీలకంఠేశ్వరాలయాన్ని కొ త్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయం ఉత్తర దిక్కున ఉన్న కోనేరు వద్ద పు లిని వేటాడుతూ మరణించిన వీరుని యాదిలో వేసిన పులివేట వీరగల్లు శిల్పాన్ని గుర్తించారు. ప్రతిమ లక్షణాల్ని వివరించారు. నీలకంఠేశ్వరాలయ నిర్మాణం ఉత్తర భారతీయ శైలిలో ఉందని, 2 వేల సంవత్సరాల ఘన చరిత్ర కల్గినదని తెలిపారు.వారి వెంట భీంగల్ పట్టణ సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు తీగల రఘు తదితరులు ఉన్నారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
● కమ్మర్పల్లి, అడవిమామిడిపల్లిలో ఎన్హెచ్ 63పై రాస్తారోకో ● యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్కమ్మర్పల్లి/మాక్లూర్: యూరియా యాప్ను రద్దు చేయడంతోపాటు వ్యవసాయానికి నాణ్యమైన వి ద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్లెక్కారు. కమ్మర్పల్లి మండల కేంద్రం, మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లిలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యాప్ విధానం, మండలాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం కా రణంగా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్య క్తం చేశారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరా యం ఏర్పడుతుండడంతో బోరు మోటార్లు, స్టార్ట ర్లు కాలిపోతున్నాయని కమ్మర్పల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మర్పల్లిలో రాస్తారోకో చేస్తున్న రైతుల వద్దకు ఏవో రమ్యశ్రీ, తహసీల్దార్ నరేశ్, ఎస్సై సతీశ్కుమార్ చేరుకుని వారితో మాట్లా డారు. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. అడవిమామిడిపల్లి వద్ద రాస్తారోకో చేస్తున్న రైతులను ఎస్సై అనిల్రెడ్డి సముదాయించి విరమింపజేశారు. కమ్మర్పల్లిలో రైతులతో మాట్లాడుతున్న అధికారులు అడవి మామిడిపల్లి వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు -
కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
నిజామాబాద్ రూరల్ : కార్మికుల సమస్యలను పరిష్కరించాలి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డీఆర్ఎం జ్యోతిని కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నాయకులు ఆర్టీసీ కార్మికుల సమస్యలను వివరించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రీజియన్ కార్యదర్శి సాయిలు, రాష్ట్ర నాయకులు వీడీ దాస్, సంజీవ్, నాయకులు మల్లయ్య, ఎంజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: జిల్లాలో ఫిట్నెస్లేని ప్రయివేటు స్కూల్ బస్సులను సీజ్ చేసి యాజమాన్యాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. నాగారంలోని డీటీవో రమేశ్ రాథోడ్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలో 840 పైగా ప్రయివేటు విద్యాసంస్థల బస్సులు ఉన్నాయని, అందులో 150పైగా బస్సులు ఫిట్నెస్ రెన్యువల్ చేయించకుండా నడుపుతున్నారని తెలిపారు. ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నగర అధ్యక్షుడు సిర్రం పవన్ కుమార్, నాయకులు భవానీ, శ్రీకర్, దత్తు తదితరులు పాల్గొన్నారు. -
ఒకరి ఆత్మహత్య
మోపాల్ : మండలంలోని వడ్డెర కాలనీ గ్రామ పంచాయతీకి చెందిన వరి కుప్పల భీమారాజ్ (40) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జాడె సుస్మిత బుధవారం తెలిపారు. భీమారాజ్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా కుటుంబ, వ్యక్తిగత కారణాలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో 16న ఇంటి నుంచి వెళ్లిన భీమారాజ్ సిర్పూర్ తండా నుంచి సిర్పూర్ వెళ్లే మార్గంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వెంటనే 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి అదే రోజు అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నాగ్లూర్లో మరొకరు.. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని నాగ్లూర్ గ్రామానికి చెందిన బాలగోల్ల సుధాకర్రావు(35) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేందర్ బుధవారం తెలిపారు. ఈ నెల 15న సుధాకర్రావు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. సుధాకర్రావు గతంలో కూడా ఇంటి నుంచి వెళ్లి కొన్నిరోజులకు తిరిగి వచ్చేవాడని, అలానే వస్తాడని కుటుంబసభ్యులు భావించారు. గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆదర్శ పాఠశాలలను ఉన్నతీకరించాలి
● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ.. ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)ను మంజూరు చేసిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి మంజూరైన టీపీఎస్ ఏర్పాటు విషయమై బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో డీఈవో అశోక్తో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆదర్శ పాఠశాలలను టీపీఎస్గా ఉన్నతీకరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థానంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 90 శాతం ఇందిరమ్మ ఇళ్లు పూర్తి.. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా హౌసింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు. హౌసింగ్ పీడీ గీత, డీఈఈ రాజలక్ష్మితో క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు సుమారు 90 శాతం పూర్తయినట్లు తెలిపారు. రెండో విడతలో నియోజకవర్గానికి సుమారు 2,000 ఇళ్లు మంజూరు కానున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. -
యాప్తోనే అత్యధికంగా యూరియా విక్రయాలు
● అవకతవకలకు తావులేదు ● కలెక్టర్ ఇలా త్రిపాఠినిజామాబాద్ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా జిల్లా రైతులు రాష్ట్రంలోనే అత్యధికంగా యూరియా కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారానే యూరియా విక్రయాలు జరుగుతున్నాయన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రణాళికాబద్ధంగా యూరియా పంపిణీ జరుగుతోందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో పంటల సాగు కోసం 80,857 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని అంచనా వేయగా, 38,766 మెట్రిక్ టన్నుల నిల్వలు వచ్చాయని వివరించారు. ఇప్పటి వరకు 21,071 మెట్రిక్ టన్నుల యూరియాను యాప్ ద్వారా 1,46,393 మంది రైతులు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి 13,995 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అమ్మకం జరిగిందని, ప్రస్తుతం 21,071 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించామన్నారు. జిల్లాలో ఇంకా 17,695 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు. రైతులు ఆందోళనకు గురి కావొద్దని, సొసైటీలు, ప్రయివేటు డీలర్లతోపాటు జిల్లాలోని 106 రైతు వేదికల ద్వారా ఎరువుల విక్రయాలు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. -
ఏడు రకాలకే బోనస్
స్పష్టం చేసిన మంత్రి తుమ్మలమోర్తాడ్(బాల్కొండ): సన్నాలు సాగు చేసే రైతులకు ‘బోనస్’ బెంగ పట్టుకుంది. మొన్నటి వరకు ఏ రకం సన్నాలైనా బోనస్ వర్తిస్తుందని అధికార యంత్రాంగం చెప్పగా.. ప్రభుత్వం సూచించిన ఏడు రకాలకే ఇస్తామని తాజాగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సాగు ప్రమోషన్ పేరుతో మే నెలలో ఎనిమిది సన్న రకాలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ విస్తృతంగా ప్రచారం చేసింది. ఎనిమిది రకాలకే ప్రాధాన్యం అని చెప్పి ఆ తరువాత ఏ సన్న రకాలకై నా బోనస్ వర్తిస్తుందన్నారు. తాజాగా మంత్రి ఏడు రకాలను సూచించడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. రైస్మిల్లర్లు సూచించిన సన్నాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం సూచిస్తున్న సన్న రకాల విత్తనాలు ఏ మేరకు అందుబాటులో ఉంచుతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాగు ప్రమోషన్లో సూచించిన రకాల్లో నుంచి కొన్నింటిని తొలగించి తాజాగా ఏడు రకాలనే తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే వర్షాకాలం సాగుకోసం విత్తనాలు కొనుగోలు చేసుకున్న రైతులు ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఏడు రకాలు ఇవే..అన్ని రకాలకు ఇవ్వాలి రైతులు నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విత్తనం రకాన్ని ఎంపిక చేస్తారు. ప్రభుత్వం కేవలం ఏడు రకాలకే అనే నిబంధన విధించకుండా అన్ని సన్న రకాలకు బోనస్ వర్తింపజేయాలి. లేకుంటే రైతులు నష్టపోతారు. – డాక్టర్ కిషన్రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త -
ఇందూరు గ్రీన్ లంగ్
అందాల అడ్డా అరణ్య అర్బన్ పార్క్ ● మాక్లూర్ మండలం చిన్నాపూర్ శివారులో ఏర్పాటు ● 476 ఎకరాల విస్తీర్ణంలో రూ.5 కోట్ల వ్యయంతో.. ● నేడు వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి ఆర్మూర్: ప్రజలకు కనువిందు చేసే ప్రకృతి అందాలు, ఒత్తిడిని తగ్గించే వాతావరణం, స్వచ్ఛమైన గాలినిచ్చే చెట్లు.. మొత్తానికి అటవీ అందాలకు కేరాఫ్గా నిలుస్తోంది అరణ్య అర్బన్పార్క్. నిజామాబాద్ నగరవాసులతోపాటు ఆయా ప్రాంతాల ప్రజలకు ‘గ్రీన్ లంగ్ స్పేస్’ (హరిత ఊపిరి తిత్తులు)గా ఉపయోగపడనుంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో మాక్లూర్ మండలం మానిక్ బండార్, అడవి మామిడిపల్లి, చిన్నాపూర్ శివార్లలోని రిజర్వ్ ఫారెస్ట్కు చెందిన 476.30 ఎకరాల విస్తీర్ణంలో రూ.5 కోట్ల నిధులతో అర్బన్ పార్క్ను ఏర్పాటు చేశారు. పార్క్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అఫారెస్టేషన్, కాంపా(సీఏఎంపీఏ), నుడా (ఎన్యూడీఏ), ఎన్ఎంసీ తదితర ప్రభుత్వ పథకాలతో 63వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకొని ఈ పార్క్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రజలకు పచ్చదనాన్ని చేరువ చేయడం, పట్టణ పర్యావరణ నాణ్యతను మెరుగుపరచడంలో ప్రభుత్వ సంకల్పానికి ఈ పార్క్ ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణతో పట్టణాభివృద్ధిని సమన్వయం చేయడానికి ఇదొక నమూనా అని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. హాజరు కానున్న ప్రముఖులు అర్బన్ పార్కు ప్రారంభోత్సవానికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరకానున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సభకు అధ్యక్షత వహిస్తారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సీ సువర్ణ, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొననున్నారు.అర్బన్ పార్క్ ప్రధాన ద్వారం సదుపాయాలు గ్రావెల్ వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్, పిల్లల సాహస క్రీడలకు ప్రత్యేక స్థలం, వాచ్ టవర్, శౌచాలయాల సముదాయం, నాలుగు రచ్చబండలు, సందర్శకులకు విశ్రాంతి కోసం ప్రత్యేక స్థలాలు. -
సర్ పకడ్బందీగా చేపట్టాలి
● బూత్స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లాలి ● ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియాఆర్మూర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా సూచించారు. పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఆర్మూర్ నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ అధికారులకు, సూపర్వైజర్ల కు, బూత్ లెవల్ ఏజెంట్లకు బుధవారం ప్రత్యేక శిక్ష ణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్వియా మాట్లాడుతూ.. అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చాలన్నారు. అలాగే మరణించిన, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు అశోక్, జగదీశ్, రఘుపతి, రాంప్రసాద్ శిక్షణ తరగతులను నిర్వహించారు. తహసీల్దారు, సిబ్బంది పాల్గొన్నారు. సర్వే ప్రక్రియకు సహకరించాలి బోధన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) సర్వే ప్రక్రియ సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు సహకరించాలని ఆర్డీవో విజయకుమారి రాజకీయ పార్టీల నాయకులను కోరారు. ఈ నెల 25 నుంచి సర్వే ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం రెవెన్యూ డివిజన్ ఆఫీస్లో సమావేశం నిర్వహించారు. సర్వే షెడ్యూల్, బూత్లవారీగా బీఎల్ఏల నియామకం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. -
మాతాశిశు మరణాలను నివారించాలి
బోధన్టౌన్(బోధన్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచాలని, మాతా శిశు మరణాలను నివారించాలని డీ ఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మార్పు బృందంతో కన్వర్జెన్స్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ముందుగా చిన్న పిల్లల వ్యాక్సినేషన్ విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులకు నాణ్యమైన సేవలందించాలని, వారికి తప్పని సరిగా ఏఎన్సీ పరీక్షలు చేయాలని, హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వారిని ముందుగానే గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి జి ల్లా ఆస్పత్రి వరకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి సురక్షత మాతృత్వ లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రభుత్వం ని ర్వహించే మాతృ, శిశు ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ శ్రీనివా స్, డిప్యూటీ డీఎంహెచ్వో విద్య, వైద్యులు పాల్గొన్నారు. ఫిఫా టాలెంట్ అకాడమీకి నక్షత్ర ఎంపిక మోపాల్: ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) – ఫిఫా టాలెంట్ అకాడ మీ శిక్షణకు బోర్గాం(పి) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని నక్షత్ర ఎంపికై ంది. ఆమెను కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఈవో అశోక్ తదితరులు బుధవారం పాఠశాలలో అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం సీ హెచ్ శంకర్ మాట్లాడుతూ.. తమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నక్షత్ర ఫుట్బాల్ కోచ్ నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోందన్నారు. కార్పొరేటర్ యాదల నరేశ్, ఎంఈవో అమ్దాపూర్ సాయిలు, హెచ్ఎం శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పీఎంఎఫ్ఎంఈ రుణాల క్లియరెన్స్ డ్రైవ్ డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం రుణాల పరిష్కారం కోసం బుధవారం కలెక్టరేట్లో ప్రత్యేక క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించారు. వివిధ బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న 121 దరఖాస్తులపై లబ్ధిదారులు, బ్యాంకు మేనేజర్లతో ముఖాముఖి సమీక్ష చేపట్టారు. దర ఖాస్తుదారులు పూర్తి పత్రాలతో తమ బ్యాంకులను సంప్రదిస్తే రుణాలు త్వరగా మంజూరయ్యేలా చూస్తామని అధికారులు అన్నా రు. హైదరాబాద్కు చెందిన అధికారుల బృందం సభ్యులు నవీన్, రాజేశ్లు లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. డీఆర్డీవో సాయన్న, ఏపీడీ మధుసూదన్, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆలయాల హుండీ ఆదాయం లెక్కింపు నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయం, జెండా బాలజీ, గోల్హనుమాన్, మాధవనగర్ సాయిబాబా ఆ లయాల హుండీ ఆదాయాన్ని బుధవారం లె క్కించారు. ఉమ్మడి జిల్లా దేవాదాయ, ధ ర్మ దాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు ఆధ్వర్యంలో, ఈవోలు శ్రీరాం రవీందర్, వేణు పర్యవేక్షణలో సిబ్బంది, భ క్తులు ఆదాయాన్ని లెక్కించారు. కంఠేశ్వరాలయానికి రూ.4,03,405, జెండా బాలజీ ఆలయానికి రూ.1,60,297 ఆదాయం సమకూరింది. అలాగే గోల్హనుమాన్ ఆలయా నికి రూ.53,299, మాధవనగర్ సాయిబాబా ఆలయానికి రూ.1,37,971 ఆదాయం సమకూరింది. ఆలయాల చైర్మన్లు సిరిగిరి తిరుపతి, బండారి నరేందర్, ప్రమోద్కుమార్, అర్చకులు, ధర్మకర్తలు పాల్గొన్నారు. -
ఏడున్నర గంటల పని..
● సమగ్ర శిక్షలో సీజీవీల శ్రమ దోపిడీ ● ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 46 మంది రూ.108 వేతనం ఆర్మూర్: సమగ్ర శిక్ష ప్రాజెక్టు పరిధిలో కొనసాగుతున్న భవిత కేంద్రాల్లో కిందిస్థాయి ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కేర్ గివింగ్ వలంటీర్ (ఆయా)లుగా విధులు నిర్వహిస్తున్న మహిళలకు పని వేళల్లో.. వేతనంలో భారీ వ్యత్యాసం ఉంటోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 46 మంది సీజీవీలు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్రాన్ని శుభ్రం చేసుకోవడంతో మొదలుకొని దివ్యాంగ విద్యార్థులు సపర్యలు చేయడంలో సీజీవీల పాత్ర కీలకంగా ఉంటోంది. ఉన్నతాధికారుల చిన్నచూపు కారణంగా వీరికి నెల వేతనం రూ.3,250గా నిర్ణయించి చెల్లిస్తున్నారు. రోజుకు ఏడున్నర గంటలు పనిచేసే వీరికి కేవలం రూ.108 మాత్రమే వేతనంగా అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రీ ప్రైమరీ స్కూల్లలో ఆయాలకు రూ.6 వేలు, అంగన్వాడీ కేంద్రాల్లోని ఆయాలకు నెల వేతనం రూ.6 వేలు లభిస్తోంది. కానీ, వీరిద్దరికన్నా భవిత కేంద్రాల్లోని దివ్యాంగ పిల్లలకు సేవలందిస్తున్న ఆయాలకు తక్కువ వేతనాలు ఉండటంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
ప్రభుత్వ పాఠశాలకే పంపుతాం
● ధర్మోరలో ఒకే రోజు 50 మంది చేరిక ● సర్పంచ్ కూతురు సైతం.. ● భీమ్గల్లో మున్సిపల్ చైర్పర్సన్ కూతురు.. మాక్లూర్ : మాక్లూర్ మండలం ధర్మోర గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా సర్పంచ్ పందిరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ రాజుల నాగేష్, పాలకవర్గం కల్పించిన అవగాహనతో గ్రామస్తులు ముందడుగు వేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించారు. తొలుత సర్పంచ్ శ్రీనివాస్ ప్రయివేటు పాఠశాలలో 3వ తరగతి చదివే తన కుమార్తె శ్రీహితను ప్రభుత్వ బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. దీంతో గ్రామంలోని సుమారు 50 మంది పిల్లలను బుధవారం ఎంఈవో సత్యనారాయణ సమక్షంలో తల్లిదండ్రులంతా కలిసి చేర్పించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈవో సత్యనారాయణ మాట్లాడుతూ ధర్మోర గ్రామాన్ని, పాలకవర్గాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అన్ని గ్రామాలు ముందుకు రావాలని కోరారు. కూతురిని చేర్పించిన సర్పంచ్ శ్రీనివాస్ను అభినందించారు. సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పాఠశాల విద్యార్థులకు అవసరమయ్యే బెంచీలు, విద్యా వలంటీర్లు, ఇతర వాటి కోసం సహకారం అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాఠశాలకు రూ.25,000 అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం శంకర్, ఉపాధ్యాయుడు కపిల్ దేవ్, వలంటీర్లు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ కూతురు.. కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ మున్సిపల్ చైర్ పర్సన్ బొదిరే నాగమణి, స్వామి దంపతులు తమ కూతురు బొదిరే శ్రీహితను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ 6వ తరగతి ఇంగ్లిష్ మీడియంలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని భావించి చేర్పించామని వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలని కోరారు. -
క్రైం కార్నర్
చెరువులో పడి ఒకరు మృతి నవీపేట : మండలంలోని నాగేపూర్ శివారులోని చెరువులో పడి అదే గ్రామానికి చెందిన దేవరి నడిపి మోనన్న (55) మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ బుధవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోనన్న భార్య లక్ష్మి 30 ఏళ్ల కిందట మృతి చెందడంతో శోభను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమారుడు చింటూ ఐదేళ్ల కిందట మృతి చెందడంతోపాటు రెండో భార్య అనారోగ్యానికి గురై మోనన్నకు దూరంగా ఉంటుంది. కుమార్తె మౌనిక కూడా కొద్ది రోజులుగా దూరంగా ఉంటుండటంతో జీవితంపై విరక్తితో మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 16న చెరువు కట్టపై మద్యం సేవిస్తూ కనపడిన మోనన్న.. మరుసటి రోజు చెరువులో శవమై కనిపించాడు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి సోదరుడు నడిపొల్ల శ్రీను ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ● వృద్ధురాలి బంగారు గుండ్లు అపహరణ నవీపేట : మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ఎక్కుతున్న వృద్ధురాలి మెడలో నుంచి రెండు తులాల బంగారు గుండ్లను దుండగులు అపహరించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన వృద్ధురాలు విజయ నవీపేటకు మంగళవారం వచ్చింది. తిరిగి బుధవారం ఇంటికి వెళ్లేందుకు నిజామాబాద్ బస్సు ఎక్కే క్రమంలో తోపులాట జరిగింది. రద్దీ నుంచి సీట్లో కూర్చున్నాక.. వృద్ధురాలి బంగారు గుండ్లు అపహరణకు గురైనట్లు గుర్తించింది. ఈ విషయమై ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం పెద్దకొడప్గల్(జుక్కల్) : మండల కేంద్ర శివారులోని 161 సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ను అపహరించినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హైవే సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్కుమార్ తెలిపారు. -
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు
● 12 కేసుల ఛేదన.. చోరీ సొత్తు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్ర కామారెడ్డి టౌన్ : గంజాయితో పట్టుబడిన నిందితుల వద్ద కూపీ లాగితే వరుస చోరీల కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాహనాలు, మొబైల్ ఫోన్లు, షట్టర్ లిఫ్టింగ్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను కామారెడ్డి పట్టణ, సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ రాజేశ్చంద్ర కేసు వివరాలను వెల్లడించారు. పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని రాజీవ్నగర్ కాలనీ డీలక్స్ బేకరీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు బుధవారం గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో పట్టణ ఎస్సై సాయికృష్ణ, సిబ్బందితో కలిసి దాడి చేశారు. అక్కడ గంజాయితో పట్టుబడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, రాష్ట్రవ్యాప్తంగా వా రు చేసిన వరుస ఆస్తి నేరాల చిట్టా బయటపడింది. రాజీవ్నగర్ కాలనీకి చెందిన తిలిపితియ రూబిన్సింగ్ అలియాస్ రూబిన్సింగ్, మంగళ్సింగ్ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. గంజాయి, మద్యం వ్యసనా లకు బానిసలైన వీరు జల్సాల కోసం డబ్బులు సంపాదించేందుకు ముఠాగా ఏర్పడ్డారు. వివిధ జిల్లా ల్లో తిరుగుతూ మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్లు, ఇళ్ల తాళాలు పగలగొట్టి, దుకాణాల షట్టర్లు లేపి దొంగతనాలకు పాల్పడుతున్నారు. జగద్గిరిగుట్ట, బచ్చుపల్లి, భిక్కనూరు, దేవునిపల్లి, రాజంపేట, మాచారెడ్డి, కామారెడ్డి, పోచారం, ఐటీ కారిడార్, ఘట్కేసర్, యాదాద్రి భువనగిరి, జనగామ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 నేరాలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దొంగిలించిన మొబైల్ ఫోన్ల ను అజంపురాకు చెందిన షేక్ ముజాహిద్, కల్కినగర్కు చెందిన ఆసం రాజేందర్కు విక్రయించేవారు. కామారెడ్డికి చెందిన సమీర్, శివ సహాయంతో ప్ర త్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగించి దొంగిలించిన మొ బైల్ ఫోన్లను అన్లాక్ చేయిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు నలుగురు నిందితుల ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 6 మోటార్ సైకిళ్లు, 23 మొబైల్ ఫోన్లు, 2 డెస్క్టాప్ కంప్యూటర్లతోపాటు 95 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ను తక్కువ సమయంలోనే ఛేదించి సొత్తును స్వాధీనం చేసుకున్న కామారెడ్డి సీసీఎస్, పట్టణ పోలీస్ బృందాలను ఎస్పీ అభినందించారు. -
ఆలయాల్లో చోరీ
రుద్రూర్ : కోటగిరి శివారులోని అయ్యప్ప స్వామి, సాయిబాబా ఆలయాల్లో బుధవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి గర్భగుడిలోని రెండు హుండీలను ఎత్తుకెళ్లారు. దేవాలయం సమీపంలోని కాలువ వద్ద హుండీల తాళాలు పగులగొట్టి అందులోని నగదును తీసుకుని పరారయ్యారు. ఉదయం ఆలయ నిర్వాహకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కార్యదర్శి నిశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ఎస్సై తెలిపారు. శాంతినగర్లో.. నిజామాబాద్ అర్బన్ : నగరంలోని 5వ టౌన్ పోలీస్స్టేషన్ పరిధి శాంతినగర్లో చోరీ జరిగినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. కాలనీలోని అజుమారీ బేగం మంగళవారం తన తల్లి, తండ్రి, కూతురుతో నిద్రపోయింది. బుధవారం ఉదయం లేచేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించింది. బీరువాలోని రూ.40 వేల నగదు, ఆరు గ్రాముల బంగారం, మరొక బీరువాలోని రూ.80 వేల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
క్షయ నియంత్రణే లక్ష్యం
సుభాష్నగర్: టీబీ నియంత్రణే అందరి లక్ష్యమని డీఎంహెచ్వో రాజశ్రీ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని కార్యాలయంలో బుధవారం టీబీ కార్యక్రమాల పురోగతిపై సంబంధిత సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ టీబీ రోగులకు ప్రభుత్వం అందించే నిక్షయ్ పోషణ యోజన నగదు ప్రోత్సాహకాలు సకాలంలో బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వారాంతంలోగా అర్హులైన ప్రతి రోగి ఖాతా వివరాలు, ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. జూలై నుంచి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ అవగాహన, స్క్రీనింగ్ క్యాంపులను విస్తృతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సమావేశంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి దేవి నాగేశ్వరి, కోఆర్డినేటర్లు లక్ష్మణ్, నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు. అన్ని ఆస్పత్రుల్లో క్యాన్సర్ కేసుల నమోదు రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో క్యాన్సర్ కేసులను నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ సూచించారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ, క్లినికల్ ఎస్లాబ్లిష్మెంట్ యాక్ట్ విభాగం అధికారులతో జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కేసుల నమోదుతో క్యాన్సర్ల రకాలు, వ్యాధిగ్రస్తుల వివరాలు తెలుస్తుందని, దీంతో చికిత్స అందించడం సులభం అవుతుందని రవీంద్రనాయక్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం తనిఖీ జక్రాన్పల్లి : మండలంలోని పడకల్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని డీఎంహెచ్వో రాజశ్రీ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టిక, మందుల నిల్వ రిజిస్టర్, ఓపి రిజిస్టర్లను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. -
రైతుల విషయంలో ప్రశాంత్రెడ్డిది ద్వంద్వ నీతి
● రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి ఆరోపణ మోర్తాడ్(బాల్కొండ): బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన ప్రశాంత్రెడ్డి ఎన్నో సమస్యలపై రైతులు రోడ్డు ఎక్కాలని ప్రయత్నిస్తే పో లీసులపై ఒత్తిడి తీసుకువచ్చి నిర్బంధించారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేష్రెడ్డి ఆరోపించారు. రైతుల విషయంలో మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి ద్వంద్వ నీతి పాటిస్తున్నారని స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి శ్రీసాక్షిశ్రీతో ఫోన్లో మాట్లాడారు. రైతులు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పు లేదన్నారు.పసుపు, ఎర్రజొన్నల ధరలు, ఎస్సారెస్పీ లీకేజీ నీటి గురించి ప్రశ్నించిన రైతులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించిన ప్రశాంత్రెడ్డి ఇప్పుడు అధికారం కోల్పోగానే మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. యూరియా కోటాను కేంద్రం తగ్గించినా జిల్లాలో మాత్రం ఎలాంటి కొరత లేకుండా తాము చర్యలు తీసుకున్నామని వివరించారు. యూరియా సమస్య లేకున్నా రైతులను బీఆర్ఎస్ నాయకులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో చిక్కుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సుభాష్నగర్ : వర్షాకాలంలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అడ్వాన్స్డ్ యాక్షన్ ప్లాన్ను చేపట్టామని ఎన్పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పీవీ రాజేశ్వర్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక టెక్నాలజీ సాయంతో విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడమే ఉద్దేశమని పేర్కొన్నారు. హైపర్ సిక్స్ –స్టెప్ ఫార్ములా విద్యుత్ అంతరాయాలను అధిగమించడానికి సంస్థ ఆరు అంచెల వ్యూహాత్మక క్రమాన్ని రూపొందించిందన్నారు. కంట్రోల్ రూమ్ అలర్ట్, కావాల్సిన అదనపు సిబ్బంది, అవసరమైన లైన్ మెటీరియల్ను సిద్ధంగా ఉంచడం, కచ్చితమైన సమాచారాన్ని వేగంగా సేకరించి, సంబంధిత టీమ్లకు చేరవేయడం, పటిష్ట వ్యూహం, యుద్ధప్రాతిపదికన పనులు, ఫైనల్ రీస్టోరేషన్ విధానాలను అవలంబిస్తున్నట్లు తెలిపారు. రుద్రూర్ : సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుందని, నేరాలను నియంత్రించొచ్చని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాయకూర్ క్యాంపులో ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గ్రామాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా పోలీసు శాఖకు దర్యాప్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న, సర్పంచ్ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
● కామన్ డైట్మెనూను అనుసరించాలి ● కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం ● సుద్దపల్లి బాలికల గురుకులం సందర్శనతెయూ(డిచ్పల్లి): ప్రభుత్వం నిర్దేశించిన కామన్ డైట్ మెనూను అనుసరిస్తూ విద్యార్థులకు పరిశుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. కిచెన్, డార్మెటరీ, డైనింగ్ హాల్ను పరిశీలించారు. పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు పూర్తి స్థాయిలో వచ్చాయా అని ఆరా తీశారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా పరిసరాలతోపాటు కిచెన్, డైనింగ్ హాల్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు, సంరక్షకులు వస్తేనే పంపించాలని సూచించారు. ఎక్కువ రోజులపాటు పాఠశాలకు హాజరు కాని విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎందుకు పాఠశాలకు రావడం లేదని ఆరా తీయాలన్నారు. డ్రైనేజీ పనులను తక్షణమే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం సెకండియర్ క్లాస్ రూమ్ కు వెళ్లి వారితో ముచ్చటించారు. విద్యార్థినులకు పలు సబ్జెక్టులలో ప్రశ్నలు వేస్తూ, సమాధానాలు ఇచ్చిన వారికి బహుమతులు అందజేశారు. చక్కగా చదువుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ స్వప్న, పాఠశాల సిబ్బంది ఉన్నారు.


