breaking news
Nizamabad
-
మార్చిలో ఎకో టూరిజం పనులు!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ ప్రాంతంలో ఎకో టూరిజం పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అనుకున్నట్లుగా అన్ని జరిగితే రానున్న మార్చిలోనే మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. డొంకేశ్వర్ మండలం చిన్నయానం, గాదేపల్లి వద్ద బ్యాక్వాటర్ ప్రాంతాన్ని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ డైరెక్టర్ రంజిత్ నాయక్ డీఎఫ్డీవో వికాస్ మీనా, అర్కిటెక్చర్ పృథ్వీలతో కలిసి గురువారం పరిశీలించారు. వాచ్టవర్లు, రిసార్టు లు, విశ్రాంతి గదులు, పార్కింగ్ ఏరియా ఎక్కడెక్కడ పెట్టాలో మరోసారి చర్చించారు. మ్యాపులు, ప్లాన్లు అన్ని సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పనులు ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చన్నారు. స్థానిక గ్రామాలకు ఉపాధి కల్పించేలా నేచర్ గైడ్ల నియామకానికి కసరత్తు జరుగుతోందన్నారు. ఇందుకు కొంతమంది యువకులను పిలిచి వారితో మాట్లాడారు. త్వరలోనే హైదరాబాద్లో 20 రోజులపాటు శిక్షణ ఉంటుందని, ప్రభుత్వమే అన్ని వసతులు కల్పిస్తుందని తెలిపారు. పనుల్లో కూడా స్థానికులకే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. వన సంరక్షణ కమిటీలో కూడా స్థానికులనే ఉంచుతామని ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్ కలిపి మొత్తం 15 మంది సభ్యులు ఉంటారన్నారు. ఆరు నెలల్లో ఎకో టూరిజం పూర్తిగా ఏర్పడి పర్యాటకుల సందడి నెలకొంటుందని చెప్పారు. అధికారుల వెంట ఆర్మూర్ ఎఫ్డీవో భవానీ శంకర్, ఎఫ్డీసీ అధికారులు శ్రీనివాస్, శిరీష, డిప్యూటీ ఎఫ్ఆర్వో సుధాకర్, గాదేపల్లి సర్పంచ్ చిన్నారెడ్డి ఉన్నారు. కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు అధికారుల వెల్లడి గాదేపల్లి బ్యాక్వాటర్ ప్రాంతాన్ని పరిశీలించిన ఎఫ్డీసీ డైరెక్టర్ రంజిత్ నాయక్ -
‘ఇందూరు’పై కాషాయ జెండా ఎగరడం ఖాయం
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సుభాష్నగర్: ఇందూరు మున్సిపల్ ఎన్నికల్లో బీజే పీ అఖండ విజయం సాధించి మేయర్ పీఠాన్ని కై వ సం చేసుకోవడం ఖాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అధ్యక్షతన ము న్సిపల్ ఎన్నికల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లతో గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడు తూ మన ఇందూరు – మన మేయర్ నినాదానికి ప్రజలు మద్దతు పలికారని తెలిపారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే ప్రజల నాడి పూర్తిగా బీజేపీ వైపే ఉందని స్పష్టమవుతోందన్నారు. కార్యకర్తల కష్టానికి తగిన ఫలితం దక్కబోతోందని, నేడు వెలువడే ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతుందని తెలిపారు. ఓట్లు లెక్కించే సమయంలో ప్రతి ఓటును జాగ్రత్తగా గమనించాలని ఏజెంట్లకు సూచించారు. తేడా అనిపిస్తే, వెంటనే ‘రీ–కౌంటింగ్’ కోరాలని, కౌంటింగ్ ప్రక్రియపై అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశంచేశారు. సమావేశంలో నాయకులు, అభ్యర్థులు కందగట్ల రాంచందర్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రమోద్ కుమార్, తిరుపతిరెడ్డి, బద్దం కిషన్, బంటు రాము, పుట్ట వీరేందర్, శ్రీకాంత్, ఏజెంట్లు పాల్గొన్నారు. -
పకడ్బందీగా బందోబస్తు
నిజామాబాద్ అర్బన్: పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్న కౌంటింగ్కు పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని అదనపు డీసీపీ బస్వారెడ్డి పేర్కొన్నారు. గురువారం రాత్రి పాలిటెక్నిక్ కళాశాలలో సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, ఇతర సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పోలీసు జాగిలాలతో కౌంటింగ్ కేంద్రం పరిసరాలను తనిఖీలు చేశారు. ఎంట్రీ పాసులు ఉన్న కౌంటింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తమ వాహనాలను పాలిటెక్నిక్ కళాశాలలో పార్కింగ్ చేయాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు సీఎస్ఐ గ్రౌండ్లో పార్కింగ్ చేయాలని తెలిపారు. బృందావన్ కాలనీలో ● 16 తులాల బంగారం అపహరణ కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డు సమీపంలో ఉన్న బృందావన్ కాలనీలో గురువారం భారీ చోరీ ఘటన వెలుగు చూసింది. కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీలేఖ తన ఇంటికి తాళం వేసి బుధవారం రాత్రి దేవునిపల్లిలోని తన తల్లిగారింటికి వెళ్లారు. ఉదయాన్నే వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. దుండగులు చోరీకి పాల్పడినట్లు గుర్తించిన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ, సీసీఎస్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇంట్లో దాచి ఉంచిన 16 తులాల బంగారం, 5 తులాల వెండి, కొంత నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు. భిక్కనూరు: దేవాలయాల అభివృద్ధికి ప్రజలందరూ చేయూతనందించాలని సిద్ధరామేశ్వరాలయం మహంత్ సదాశివ మహంత్ అన్నారు. గురువారం తిప్పాపూర్ సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న కాకిగండి శివాలయంలో ఆయన మాట్లాడారు. శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తిప్పాపూర్ సర్పంచ్ కుంట లింగారెడ్డి, ఆలయం అభివృద్ధి కమిటీ ప్రతినిదులు తెలిపారు. సైంటిస్టు ఆకిటి రాజిరెడ్డి.. ఆలయంలో టైల్స్ వేసేందుకు రూ.43 వేలు విరాళంగా అందజేశాడన్నారు. నరకప్రాయంగా ప్రయాణం నిజామాబాద్ రూరల్: మాధవనగర్ వద్ద ఆర్వోబీ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న ఇరువైపుల రోడ్లు దెబ్బ తింటున్నాయి. కంకరతేలిన రోడ్డు ఉండడంతో పాటు దుమ్ము అధికంగా వస్తోంది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ ప్రాంతంలో వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అధికారులు స్పందించి తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
నేడే పుర తీర్పు!
నిజామాబాద్ముగ్గురికి ఏడాది జైలు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన ముగ్గురికి నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026– IIలో uమరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పోటీ చేసిన అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చైర్మన్ పీఠంపై కన్నేసిన ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు జరిగిన ప్రతి అంశాన్ని పోస్టుమార్టం చేస్తూ లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు అభ్యర్థులు చేజారకుండా క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. -
నేడు తేలనున్న భవితవ్యం
● ఆర్మూర్లో 36 వార్డులు, 153 మంది అభ్యర్థులు బరిలో.. ● విజయం ఎవరిని వరిస్తుందో..! ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డుల్లో పోటీపడ్డ 153 మంది అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలిపోనుంది. పట్టణంలోని 36 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ నుంచి 36 మంది, బీజేపీ నుంచి 33 మంది, బీఆర్ఎస్ నుంచి 35 మంది, ఎంఐఎం నుంచి నలుగురు, ఆప్ నుంచి నలుగురు, జనసేన నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి ఒకరు, ఇతర పార్టీల నుంచి ఇద్దరు, స్వతంత్రులు 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పోరు జరిగినప్పటికీ కొన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ, స్వతంత్య్ర అభ్యర్థులు గట్టి పోటీనిచ్చారు. ఎన్నికల అధికారులు నిర్వహించనున్న కౌంటింగ్లో అభ్యర్థుల జయాపజయాలు తేలనున్నాయి. ఆర్మూర్ పట్టణ శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో ఓట్ల లెక్కింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉదయం 8 నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్, ఆర్మూర్ సబ్ కలెక్టర్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మున్సిపల్ సిబ్బంది కౌంటింగ్ నిర్వహిస్తారు. సుమారు 50 మందికి పైగా అధికారులు కౌంటింగ్లో పాల్గొంటారు. శుక్రవారం నాటి ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ సరళిని అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దాగి ఉన్న బ్యాలెట్ బాక్స్లను ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పకడ్బందీగా చేపట్టాలి ఆర్మూర్టౌన్: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిర్వహించే బ్యాలెట్ పత్రాల కౌంటింగ్ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ సూపవర్వైజర్లకు మాక్ కౌంటింగ్ నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహణ రోజు ఏజెంట్లు ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఆ ఏజెంట్ను బయటకు పంపించాలన్నారు. రికౌంటింగ్ లేకుండా ఒకేసారి జాగ్రత్తగా చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్రావు, సిబ్బంది పాల్గొన్నారు. బోధన్లో కౌంటింగ్కు..బోధన్టౌన్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగనున్నందున పట్టణంలోని విజయ మేరీ పాఠశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని 38 వార్డుల్లో పోలింగ్ జరుగగా అధికారులు బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి విజయ మేరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించి భద్ర పరిచారు. కౌంటింగ్ సూపర్ వైజర్లు 38 మంది, అసిస్టెంట్ సూపర్వైజర్లు 38 మంది ఉండగా ఏవోలు, ఏపీవోలు 26 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏసీపీ శ్రీనివాస్, కమిషనర్ జాదవ్ కృష్ణ, సీఐ వెంకట నారాయణ, తహసీల్దార్ విఠల్ ఉన్నారు. -
నేటి నుంచి శివపురాణం ప్రవచనం
● పలుగుట్టలో మూడురోజులపాటు ప్రవచనాలు ● మంగి రాములు మహరాజ్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నందిపేట మండలంలోని పలుగుట్ట కేదారేశ్వర ఆశ్రమంలో ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంగి రాములు మహరాజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. గండ్ర ప్రేమ్సాగర్రావు సౌజన్యంతో చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రముఖ ప్రవచనకర్త ఆచార్య వాసుదేవ్జీ ప్రవచనాలు చెప్పనున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజులపాటు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రవచన కార్య క్రమం ఉంటుందన్నారు. ఇందులో శివమహాపురాణం ఉంటుందని వివరించారు. తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు కుటుంబాలతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకుడు సిక్కాల శంకర్కు రాజస్థాన్లోని శ్రీజగదీశ్ ప్రసాద్ జబర్మల్ టిబ్రీవాలా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. ప్రొఫెసర్ నీతుసింగ్ పర్యవేక్షణంలో ‘మేనేజిరల్ ఆన్పెక్ట్ అండ్ బయలాజికల్ స్టడీస్ ఆన్ పౌల్ట్రీఫాం ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్’ అనే అంశంపై పరిశోధన చేశారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్ సతీశ్, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ బీ సుమలత, డాక్టర్ బీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: సైబర్ మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం కాకతీయ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అభివృద్ధి చెందడంతో పాటు, సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందన్నారు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధిక లాభాలు వస్తాయని నమ్మబలికే నకిలీ వెబ్సైట్లు, యాప్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. కొద్దిపాటి పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని చెప్పి ప్రజల డబ్బును దోచుకునే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలంటే ఏ పెట్టుబడి పెట్టే ముందు ఆ సంస్థపై పూర్తి వివరాలు సేకరించాలని, అపరిచిత కాల్స్ను నమ్మకూడదని సూచించారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు, కాకతీయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
క్రీడల్లో గెలుపోటములు సహజం
ఆర్మూర్టౌన్: క్రీడల్లో గెలుపోటములు సహజమని వాటిని సమానంగా తీసుకోవాలని ఆర్మూర్ బాలుర పాఠశాల హెచ్ఎం లక్ష్మీనర్సయ్య అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి సీఎం కప్ సాఫ్ట్ బాల్ టోర్నోమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర క్రీడాకారులను ఒలంపిక్స్ స్థాయిలో రాణించే విధంగా ప్రభుత్వం చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా క్రీడాధికారి పవన్కుమార్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి సీఎం కప్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్కు 8 మహిళా విభాగం జట్లు, 8 పురుషుల విభాగం జట్లు పాల్గొన్నాయన్నారు. పోటీల్లో పురుషుల విభాగాంలో ఆర్మూర్ ప్రథమ, తొర్లికొండ ద్వితీయ, కమ్మర్పల్లి జట్లు తృతీయ స్థానంలో నిలిచాయి. అలాగే మహిళా విభాగంలో సుద్ధపల్లి ప్రథమ, ఆర్మూర్ ద్వితీయ, ముచ్కూర్ జట్లు తృతీయ స్థానాల్లో నిలిచాయి. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగామోహన్, సంయుక్త కార్యదర్శి సుజాత, జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వినోద్, ఉపాధ్యాయులు, స్వప్న, అనికెత్, రాహుల్, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆరంభం.. ఆగమాగం
ఇందల్వాయి: ఇసుక అక్రమ రవాణా, అడ్డగోలు దోపిడీని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఇసుక వాహనం యాప్నకు ఆరంభంలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో మన ఇసుక వాహనం యాప్ విధానాన్ని అమలు చేసేందుకు పైలెట్ జిల్లాగా నిజామాబాద్ను ఎంపిక చేశారు. అందులో భాగంగా జనవరి 31న యాప్ సేవలను ప్రారంభించారు. తక్కువ ధరలో, తక్కువ సమయంలో ఇసుకను ప్రజల ఇంటికే నేరుగా అందించేందుకు వీలుగా ఈ అప్లికేషన్ని రూపొందించారు. ఉన్నతాధికారులు సైతం ఈ యాప్పై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న కొందరికి మాత్రం అందులో తమ మండలాల పేర్లు కనబడకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. రూరల్లో జక్రాన్పల్లి మాత్రమే.. మన ఇసుక వాహనం అప్లికేషన్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి జక్రాన్పల్లి మండలం మాత్రమే ఇసుక బుకింగ్కి అందుబాటులో ఉంది. మిగతా మండలాలు అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రాంతంలో ఇసుక అవసరం ఉన్నవారు ఇబ్బందులుపడుతున్నారు. అత్యవసరంగా ఇసుక అవసరం ఉన్నవారు కచ్చితంగా అప్లికేషన్ ద్వారానే అనుమతులు తీసుకోవాలని, లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం మన ఇసుక వాహనం యాప్తో కొన్ని ప్రాంతాల వారికి లబ్ధి చేకూరనుండగా మరికొన్ని ప్రాంతాల వారికి ఇసుక మరింత ప్రియం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు నిజామాబాద్ రూరల్ ని యోజకవర్గంలో కొన్ని వాగు పరీవాహక ప్రాంతా ల్లో ఇసుక ఒక ట్రాక్టర్ (3 క్యూబిక్ మీటర్)కి రూ. ఏ డు వందల నుంచి రూ.వెయ్యి లోపే ఖర్చు అవు తుండగా బుకింగ్ విధానం ద్వారా వారికి రూ. 15 వందల వరకు అయ్యే అవకాశం ఉంది. మరోపక్క వాగుకు దూరంగా ఉన్న గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్ రూ.రెండు వేల నుంచి రూ. మూడు వేల మధ్యలో ఉండగా వారికి బుకింగ్ విధానం ద్వారా రూ. రెండు వేల లోపే ట్రాక్టర్ ఇసుక అందుబాటులోకి రా నుంది. ఏది ఏమైనా మన ఇసుక వాహనం ద్వారా ఇసుక ప్రజల చెంతకు చేరడంలో ఎన్నో సవాళ్లు ఎ దురవుతాయ ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మన ఇసుక వాహనం యాప్లో కొన్ని మండలాల పేర్లు లేకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలను పైఅధికారులతోపాటు మైనింగ్ అధికారులకు విన్నవించాం. మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. అంతవరకు ఇసుకను అక్రమంగా తరలించొద్దు. సొంత ట్రాక్టర్ ఉన్న సాధారణ వినియోగదారులు 3 క్యూబిక్ మీటర్లకు రూ. 1174.97, ఇందిరమ్మ ఇళ్ల వినియోగదారులు రూ. 614.16 చెల్లిస్తే (లేబర్ చార్జీలతో కలిపి) ఇసుక ఇంటికే డెలివరీ చేస్తాం. – శాంత, ఇన్చార్జి తహసీల్దార్, ఇందల్వాయి ‘మన ఇసుక వాహనం’ యాప్తో ఇబ్బందులు అయోమయంలో వినియోగదారులు సరైన వివరణ ఇవ్వలేకపోతున్న అధికారులు -
వృద్ధుడికి సపర్యలు
వృద్ధుడితో మాట్లాడుతున్న అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, సపర్యలు చేసిన స్వచ్ఛంద సంస్థ సభ్యులునిజామాబాద్ రూరల్: రోడ్డుపై నడవలేనిస్థితిలో పాకుతున్న ఓ అనాథ వృద్ధుడిని చూసి చలించి పోయిన అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి వెంటనే ఓ స్వచ్ఛంద సంస్థతో సపర్యలు చేపట్టి వైద్యం అందించేలా కృషి చేశారు. గురువారం విధి నిర్వహణలో భాగంగా కంఠేశ్వర్ ప్రాంతం గుండా పోలీస్ వాహనంలో వెళ్తున్న అడిషనల్ డీసీపీ ఓ అనాథ వృద్ధుడు నడవలేని స్థితిలో, గాయాలతో రోడ్డుపై పాకుతుండటాన్ని గమనించి చలించిపోయారు. వెంటనే తన వాహనం దిగి వృద్ధుడి వద్దకు వెళ్లి మాట్లాడారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు సమాచారం అందించాగా వారు అక్కడికి చేరుకొని వృద్ధుడికి సపర్యలు చేపట్టి చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ ప్రకాశ్, మూడో టౌన్ ఎస్సై హరిబాబు, స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు, వాల బాలకిషన్, దర్శనం రాజు, నయన్ పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
విద్యుత్షాక్తో వ్యవసాయ కూలీ మృతి భిక్కనూరు: విద్యుత్షాక్తో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గాంధారి మండలం జువ్వాడి గ్రామానికి చెందిన గౌనిభూమయ్య (60) భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం పొలంలో బోర్ మోటర్ను ప్రారంభించేందుకు వెళ్లాడు. అక్కడ స్టార్టర్ బాక్సుకు విద్యుత్ సరఫరా అవుతున్న విషయాన్ని గమనించని భూమయ్య దానికి తగలడంతో విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ లీగల్/ నిజాంసాగర్: కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. రెండువేల జరిమానా విధిస్తూ నిజామాబాద్ సెకండ్ క్లాస్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి (ఎస్సీ, ఎస్టీ కోర్టు) టి. శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పిప్పిరేగడి తండాకు చెందిన కేతావత్ పరశురాం, తమ గ్రామ శివారులోని హసన్పల్లిలో కురుమ భూమయ్యకు చెందిన ఎకరం ఇరవై గుంటల వ్యవసాయ భూమి కొనుగోలుకు రూ. రెండు లక్షల ఇరవై వేల నగదును మొదట బయానాగా ఇచ్చాడు. మిగతా డబ్బులు పట్టా అయ్యాక చెల్లిస్తానని ఒప్పందం కుదిరింది. ఈ వ్యవహారంలో 16.07.2021న పిప్పిరియగడి తండాకు పెద్దమనిషి ఇత్యా నాయక్ పిలుపు మేరకు పరశురాం తన మామతో కలిసి అక్కడికి వెళ్లాడు. ఈ సమయంలో భూమి అమ్మిన కురుమ భూమయ్య అల్లుడు బోయిన ప్రవీణ్కుమార్, హసన్పల్లి మాజీ సర్పంచ్ సంగమేశ్వర్గౌడ్, కురుమ భద్రయ్యలు కలిసి డబ్బులు వద్దు.. మా భూమి మాకు కావాలి అంటు వివాదం సృష్టించారు. అనంతరం పరశురాంను కులం పేరుతో దూషించి, బెదిరించి చేతులతో, చెప్పులతో దాడి చేశారు. దీంతో బాధితుడు పరశురాం తన మామతో కలిసి దాడి విషయమై నిజాంసాగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసును విచారించిన పోలీసులు, దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కేసులో సాక్షులను విచారించి, సాక్ష్యాధారాలను పరిశీలించిన నిజామాబాద్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి(ఎస్సీ, ఎస్టీ కోర్టు) టీ శ్రీనివాస్ నిందితులు కులం పేరుతో దూషించి దాడి చేసినట్లు నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. రెండు వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి
● డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా నియామకమైన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పా ర్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. తన నియామకానికి కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, అబుద్ బిన్ హందాన్, ప్రీతం, ముస్తాఫా, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు. -
తీవ్ర ఉత్కంఠ మధ్య వెలువడనున్న ఫలితాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరపాలక, పురపాలక ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఓట్ల లె క్కింపు చేసి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరం, బోధన్, ఆర్మూ ర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లోని డివిజన్లు, వార్డులకు పోటీ చేసిన అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అందరి దృష్టి ఉన్న నిజామాబాద్ నగర పాలకం ఫలితాలపై జిల్లాలోని అన్నివర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. మేయర్ పీఠంపై కన్నేసిన ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు జరిగిన ప్రతి అంశాన్ని పోస్టుమార్టం చేస్తూ సమీకరణాల లెక్కలు వేసుకుంటు న్నాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ను వ్వా నేనా అనేలా పోటీ నడిచింది. మధ్యలో ఎంఐ ఎం తన పట్టును నిలుపుకునేలా బరిలో కొట్లాడింది. దీంతో నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందూరులో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం మద్దతు తీసుకుని మేయర్ పీఠం కై వసం చేసుకుంటుందనే అంచనాలు సైతం ఉన్నాయి. ఇంతటి పోటీ మధ్య బీఆర్ఎస్ 3 నుంచి 4 సీట్లు గెలిచినప్పటికీ కింగ్మేకర్ అయ్యే చాన్స్ ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఇక స్వతంత్రులు ఒకటి రెండు గెలుచుకుంటే మాత్రం సమీకరణలు మరింత రసకందాయంలో పడినట్లే. ఎంఐఎంకు కింగ్మేకర్ అవకాశం వస్తే కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు కింగ్మేకర్ అవకాశం వస్తే బీజేపీకి మద్దతు ఇస్తాయంటున్నారు. స్వతంత్రులు రెండుకు మించి గెలుచుకుంటే మాత్రం రాజకీయం భలేగా ఉంటుంది. పార్టీల నేతలు ఓ వైపు తామే గెలుస్తామని ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు.పాలిటెక్నిక్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన టేబుళ్లుజిల్లాలోని మున్సిపాలిటీల్లో పోలింగ్ వివరాలు.. విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్న అభ్యర్థులు మెజార్టీ స్థానాలపై ప్రధాన పార్టీల్లో ధీమా పోలింగ్ శాతం తగ్గడంతో మారనున్న అంచనాలు అందరి దృష్టి ఇందూరు కార్పొరేషన్ పైనే.. -
ఒక్కో రౌండ్లో వెయ్యి ఓట్లు
● లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి ● ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం ● కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి ● కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ సుభాష్నగర్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లకు శుక్రవారం ఏర్పాటుచేసిన శిక్షణాతరగతులను కలెక్టర్ సందర్శించి, ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాల్సిన విధానంపై కీలక సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున ఎంతో జాగ్రత్తతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ హితవు పలికారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తు.చ తప్పక పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా పైఅధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడిలో గందరగోళానికి గురికాకూడదని, ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించుకొని వెల్లడించాలని సూచించారు. కౌంటింగ్ హాలులోనికి ఆర్వో మినహా ఇతరులు ఎవరికీ సెల్ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక్కో డివిజన్కు.. ఒక్కో టేబుల్.. అత్యధికంగా 60 డివిజన్లు కలిగిన నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ఓట్ల లెక్కింపు కోసం పాలిటెక్నిక్ కళాశాలలో నాలుగు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని తెలిపారు. ఒక్కో డివిజన్కు ఒకటి చొప్పున 60 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశామని, ఏక కాలంలో అన్ని డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. బ్యాలెట్ బాక్సులను తెరిచి, పోలైన ఓట్లను 25 చొప్పున బండిల్స్గా విభజిస్తూ, ఒక్కో రౌండ్లో వెయ్యి చొప్పున ఓట్లు లెక్కించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ఇదే తరహాలో ఒక్కో వార్డుకు ఒకటి చొ ప్పున కౌంటింగ్ టేబుళ్లు ఉంటాయని అన్నారు. ఓ ట్ల లెక్కింపు కోసం ఒక్కో టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతోపాటు సపోర్టింగ్ స్టాఫ్ను నియమించామని అన్నారు. అ భ్యర్థులు, ఏజెంట్లు ఉదయం 7 గంటల్లోపు కౌంటింగ్ సెంటర్ల వద్దకు రావాలని కలెక్టర్ సూచించారు. ఎంట్రీ పాసులతోపాటు ఏదైనా గుర్తింపుకార్డు వెంట తెచ్చుకోవాలని తెలిపారు. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేదని స్పష్టంచేశారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఉన్నారు. కౌంటింగ్ కేంద్రాలు ఇవే..పకడ్బందీ చర్యలు శుక్రవారం ఉదయం స్ట్రాంగ్రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు చేరుస్తూ, 8 గంటల నుంచి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ వెల్లడించారు. నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభించేందుకు అన్నివిధాలుగా సన్నద్ధం చేశామన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద డివిజన్/వార్డు వివరాలు తెలిపేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని, ఎలాంటి పొరపాట్లు, గందరగోళానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. -
పుణ్యస్నానాల గంగ
డొంకేశ్వర్(ఆర్మూర్): తల్లి కడుపులో బిడ్డ పడినా.. పండంటి బిడ్డ పుట్టినా ముందు మొక్కేది ఆ గంగమ్మ తల్లికే. పిల్లల పుట్టు వెంట్రుకలు.. ఖుషీ తెప్పలు.. పుణ్యస్నానాలతో నికాల్పూర్ గంగ (గోదావరి)ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. జిల్లాలో పుణ్య స్నానాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో ఇదొకటి. చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలు మూలల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తుంటారు. ప్రతి శుక్ర, సోమవారాల్లో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి తెప్పలతో మొక్కులు చెల్లిస్తారు. ఏమి లేకున్నా గంగమ్మ తల్లిని మరువకూడదనే భక్తితో, ప్రేమతో ఏడాదికోసారి ఖుషీ తెప్పను వదులుతారు. ప్రతి అమవాస్య, పౌర్ణమి నాడే కాకుండా ఏటా కార్తీక పౌర్ణమి రోజుల్లోనైతే భక్తుల తాకిడి మరింత ఎక్కువ ఉంటుంది. పచ్చని చెట్లు, పరుచుకున్న గడ్డి, జల సవ్వడుల ప్రకృతి నడుమల పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేస్తారు. పుష్కర ఘాట్కు అనువైన స్థలం భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు నికాల్పూర్ గంగ (గోదావరి) ఎంతో అనువైన స్థల మని, అధికారులు స్పందించి ఘాట్ను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లాలోని పదకొండుకు పైగా ప్రాంతాల్లో పుష్కరాలను నిర్వహిస్తుండగా ప్రసిద్ధి చెందిన నికాల్పూర్ గోదావరి వద్ద కూడా నిర్వహించాలని కోరుతున్నారు. ఆధ్మాత్మిక శోభతో అలరారుతున్న నికాల్పూర్ గోదావరి ప్రతి శుక్ర, సోమవారాల్లో జనసందోహం జిల్లా నలుమూలల నుంచి రాక గోదావరి పుష్కరాలకు అనువైన ప్రాంతం -
స్వల్ప ఉద్రిక్తతలు
నిజామాబాద్ అర్బన్: నగరంలోని 52వ డివిజన్ పరిధిలో ఉన్న గోల్డెన్జూబ్లీ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఎంఐఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినప్పటికీ మాట వినకపోవడంతో సీపీ సాయిచైతన్య అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. స్వల్ప లాఠీచార్జి చేశారు. మరొకరి ఓటువేసేందుకు ప్రయత్నించిన ఓ యువతిని పోలింగ్ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. మరో ఇదే సెంటర్లో మరో ఇద్దరిపై దొంగ ఓటింగ్ కేసులు నమోదయ్యాయి. ● 18వ డివిజన్ పరిధిలోని ముబారక్నగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో దొంగ ఓటు వేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని పోలింగ్ ఏజెంట్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ● 19వ డివిజన్ పరిధిలోని గూపన్పల్లి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున గుమిగూడారు. పోలీసులు రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టారు. బీజేపీ నాయకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేశ్రెడ్డితోపాటు ఇతర సీనియర్ నాయకులు ఆరోపించారు. మరోవైపు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వచ్చి కాంగ్రెస్ నాయకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఇరువురు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున గూమిగుడారు. వీరిని సీపీ సాయిచైతన్య సిబ్బందితో కలిసి చెదరగొట్టారు. ● పోలీస్ కమిషనర్ సాయిచైతన్య నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు. సీపీ వెంట ఏసీపీ ప్రకాశ్, ఎస్హెచ్వో సతీశ్ తదితరులున్నారు. ● 11వ డివిజన్లోని బాబన్సాహెబ్ పహాడ్లోని పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులను ఎంఐఎం నాయకులు ప్రశ్నించగా గొడవ ప్రారంభమైంది. ఎంఐఎం అభ్యర్థి కరీంతోపాటు మరికొందరిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఎంఐఎం నాయకులు పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయారు. ఎంఐఎం అభ్యర్థి కరీం గాయాలపాలయ్యారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ● మాలపల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఎంఐఎం నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడిచేశారు. పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ నాయకులు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు దాడిచేసినట్లు తెలిసింది. ● 34వ డివిజన్ ఓటింగ్ జరుగుతున్న హరిచరణ్ మార్వాడి పాఠశాల పోలింగ్కేంద్రంలో 60 ఏళ్ల వృద్ధురాలి ఓటును 30 ఏళ్ల మహిళ వేశారని దీనిపై బీజేపీ నాయకుడు ప్రవీణ్ పోలింగ్ అధికారులను ప్రశ్నించారు. మరో నలుగురు మహిళలు ఓటువేసేందుకు రాగా వారి ఓట్లను అప్పటికే ఇతరులు వేసేశారు. నలుగురు మహిళలపై దీనిపై అధికారులను ప్రశ్నించారు. బీజేపీ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎంపీ అర్వింద్ అక్కడికి చేరుకుని అధికారులను ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థిని బయటికి పంపించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని బీజేపీ నాయకులను సముదాయించారు. ● 20వ డివిజన్లోని బీజేపీ అభ్యర్థి న్యాలం సునీత భర్త న్యాలం రాజుపై కాంగ్రెస్ అభ్యర్థి లలిత కుమారుడు దాడి చేశాడు. వాగ్వాదానికి దిగిన వారిని చెదరగొట్టిన పోలీసులు 11వ డివిజన్లో కాంగ్రెస్ – ఎంఐఎం మధ్య లొల్లి ఎంఐఎం అభ్యర్థి కరీంకు గాయాలు 20వ డివిజన్లో బీజేపీ నాయకుడిపై దాడి పలుచోట్ల దొంగ ఓటర్ల పట్టివేత ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో 30వ వార్డుకు చెందిన బ్యాలెట్ పేపర్లలో 34వ వార్డుకు చెందిన స్వతంత్ర అభ్యర్థుల గుర్తులతో బ్యాలెట్ పేపర్లు రావడంతో సిబ్బంది రెండు ఓట్లను రద్దు చేసి వారితో తిరిగి ఓటు వేయించారు. దీంతో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పోలింగ్ కేంద్రానికి వచ్చి పోలీసులు, ఎన్నికల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. -
ఓటింగ్ తీరు.. పోలింగ్ ఏర్పాట్ల పరిశీలన
నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ, పోలింగ్ ఏర్పాట్లను జిల్లా ఎ న్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించా రు. నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్, అర్సపల్లి పాఠశాల, మాలపల్లిలోని బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలతోపాటు ఆర్మూర్ పట్టణంలోని రాం మందిర్ ప్రభు త్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ హైస్కూల్, పెర్కిట్లోని జిల్లా పరిషత్ బాలుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. హెల్ప్ డెస్క్లు, మెడికల్ క్యాంపు, వీల్ చైర్ ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నా యా? అని తనిఖీ చేశారు. కలెక్టరేట్ నుంచి వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను కలెక్టర్, అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, అబ్జర్వర్ సీహెచ్ సత్యనారాయణరెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొ నసాగిందని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వే చ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రని కలెక్టర్ అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రా ల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏ ర్పాటు చేయించామన్నారు. ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్ సత్యనారాయణరెడ్డి పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తీరును పరిశీలించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి, పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్రూమ్లకు తరలించారు. కలెక్టరేట్ నుంచి వెబ్క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న కలెక్టర్ ఆర్మూర్లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి -
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ
సుభాష్నగర్: నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రా లు, స్ట్రాంగ్ రూమ్లను సీపీ సాయి చైతన్య బుధవారం పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చ ర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూ మ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద నిరంతర నిఘా కోసం అదనపు సీసీ కెమెరాలను ఏ ర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రి య ముగిసే వరకు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ అమలులో ఉంటుందని, ఐదుగు రి కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని సీపీ స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీపీ వెంట అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్, టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు, ఎన్నికల పరిశీలకులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 69.48శాతం పోలింగ్ ● బిచ్కుందలో అత్యధికం.. కామారెడ్డిలో అత్యల్పం సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : చెదురుమదురు సంఘటనలు మినహా కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో 92 వార్డులుండగా.. 447 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కామారెడ్డిలో 65.94 శాతం, ఎల్లారెడ్డిలో 79.77, బాన్సువాడలో 73.66, మొదటిసారి ఎన్నిక జరుగుతున్న బిచ్కుందలో 78.49 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ ఆయా పార్టీల మధ్య వాగ్వాదాలు జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కామారెడ్డి పట్టణంలో కవరేజీకి వెళ్లిన మీడియాకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్ల ఫొటోలు తీయడానికి అనుమతి ఇవ్వలేదు. పీహెచ్సీల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి నందిపేట్(ఆర్మూర్): గర్భిణుల వివరాలు నమోదు చేసి పీహెచ్సీ కేంద్రాలలో ప్రసవాలయ్యేలా చూడాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. నందిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె బు ధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరా లు, రికార్డులను పరిశీలించారు. అనంతరం కుద్వాన్పూర్ గ్రామంలోని పల్లె దవా ఖాన ను పరిశీలించారు. ఎంసీహెచ్, ఎన్సీడీ, షుగర్, బీపీ, క్యాన్సర్ ఉన్నవారిని గుర్తించి ఇంటింటికి వెళ్లి మందులు ఇవ్వాలని సూచించారు. ఆమె వెంట డాక్టర్ స్వాతి, సూపర్వైజర్ భాస్కర్, సిబ్బంది ఉన్నారు. -
సమ్మెను విజయవంతం చేయండి
నిజామాబాద్ రూరల్: దేశవ్యాప్తంగా నేడు జరుగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్–రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రామ్మోహన్రావు అన్నారు. నాందేవ్వాడలోని పెన్షనర్స్ భవనంలో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు రిటైర్డ్ ఉద్యోగులందరూ పాత కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చౌక్లో నేడు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు. జిల్లా ప్రతినిధులు శిర్ప హనుమాండ్లు, ఈవీఎల్ నారాయణ, రాధా కిషన్, సాంబశివరావు, ప్రసాద్రావు పాల్గొన్నారు. -
ఉత్సవాలకు శివరాంమందిర్ ముస్తాబు
దోమకొండ: మండల కేంద్రంలోని శివరాంమందిర్ మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. గురువారం నుంచి ఈ నెల 16 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ కొండ అంజయ్య తెలిపారు. శివుడు, రాముడు కొలువైన ఆలయంగా శివరాంమందిర్కి పేరు ఉంది. దోమకొండతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సవాలకు తరలివస్తారు. ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల కోసం ఆలయాన్ని రంగులు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. నేటి నుంచి సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలు దోమకొండ: మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న 31వ వార్షికోత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. నేడు , రేపు వివిధ పూజా కార్యక్రమాలతో పాటు అన్నదానం ఉంటుందని ఆలయ కమిటీ ప్రతినిధులు జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకంరించారు. -
సీసీ కెమెరాలతో గ్రామ భద్రత బలోపేతం
పెద్దకొడప్గల్): గ్రామ భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని ఎంపీడీవో అభినవ్ చందర్ పేర్కొన్నారు. కాస్లాబాద్లో గ్రామ పంచాయతీ నిధులతో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎంపీడీవో అభినవ్ చందర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చైతన్ యాదవ్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో నేరాలను నిరోధించడంతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని అన్నారు. గ్రామంలో 8 చోట్ల సీసీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి శివాజీ, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లిసంగారెడ్డిలో బుధవా రం ఉపాధి హామీ పనులను సర్పంచ్ కత్తుల లక్ష్మి ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామంలోని కూలీల కు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పనులు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కార్యదర్శి, క్షేత్రసహాయకులకు సూచించారు. కుంటలో పూడికతీత ప నులు వేగవంతం చేయాలని సూచించారు. -
రాయకూర్ గ్రామసభలో గందరగోళం
● పోలీస్స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు రుద్రూర్: మండలంలోని రాయకూర్ గ్రామ పంచాయతీలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామసభలో కుర్చీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని మొదలైన వివాదం చివరకు పోలీస్స్టేషన్లో పరస్పరం ఫి ర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది. ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు రాయకూర్ పంచాయతీ ఆవరణలో 15వ ఆర్థిక సంఘం నిధులపై చర్చించేందుకు బుధవారం గ్రామసభ ఏర్పాటు చేశారు. సభలో టార్పాలిన్ కవర్లు వేయడంతో కుర్చీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. టెంట్, కుర్చీలు వేసి సభ ఏర్పాటు చేయా లని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో పాలకవర్గం, ప్రత్యర్థి వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి సభ గందరగోళంగా మారింది. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి ఇరువర్గాలను శాంతింపజేశారు. వివాదంపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై జీపీ పాలకవర్గ సభ్యులు ఎంపీడీవో కార్యాలయంలో సైతం ఫిర్యాదు చేయగా, మండలంలో చర్చనీయాంశంగా మారింది. -
కార్పొరేషన్లో 59.12 శాతం పోలింగ్
● గత ఎన్నికల కంటే 2శాతం తగ్గిన పోలింగ్ నమోదు ● ఓటేయడానికి ఆసక్తి చూపని జనంసుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో 59.12 శాతం పోలింగ్ నమోదైంది. 60 డివిజన్లలో 350 మంది అ భ్యర్థులు బరిలో నిలిచారు. 134 ప్రాంతాల్లోని 488 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 3,48,051 ఓట్లకు 1,67,461 పురుషులు, 1,80,546 సీ్త్రలు, 44 ఇతరులు ఉన్నారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో 2,05,753 మంది ఓటు వినియోగించుకున్నారు. అందులో 98,469 మంది పురుషులు, 1,07,282 సీ్త్రలు, ఇద్దరు ఇతరులు ఉ న్నారు. మొత్తం 59.12 శాతం పోలింగ్ నమోదైంది. 1,42,298 మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. నగరంలో ఎన్నికలను మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ పరిశీలించారు. సమస్యలు ఎ దురైన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని పరిష్కరించారు. ఓటేసిన ప్రముఖులు నగర పరిధిలోని గూపన్పల్లి 3వ డివిజన్లో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రజలు పెద్దఎత్తున పోలింగ్కు ముందుకు రావాలన్నారు. 45వ డివిజన్లో ఎంపీ అర్వింద్ ధర్మపురి ఓటుహక్కును వినియోగించుకున్నారు. నగరంలోని హరిచరణ్ మార్వాడి పాఠశాలలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దంపతులు ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. నగరంలో పోలింగ్ సరళిని ఎంపీ అర్వింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్పటేల్ కులాచారి పరిశీలించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి ఇందూరు కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగురవేస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్స్లు ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియగా బ్యాలెట్ బాక్సు లు స్ట్రాంగ్ రూమ్లకు చేరాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో పోలింగ్ సరళి ఆధారంగా తమ విజయావకాశాలపై అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఏ వార్డులో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయనే అంశంపై చర్చించుకుంటున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల నుంచి తాయిలాలు తీసుకున్న ఒకే ఇంట్లోని ఓటర్లు పలు చోట్ల ఒక్కో ఓటును ఒక్కో అభ్యర్థికి వేసినట్లు తెలుస్తోంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల ఓట్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నా అవి గెలిపించే ఓట్లు కాలేకపోతున్నాయి. శుక్రవారం ఓట్లను లెక్కించనుండగా.. అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. -
బ్యాక్ వాటర్లో బ్రాహ్మిణి బాతులు
ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్కు వలస పక్షుల రాక మొదలైంది. ఈ ఏడాది కొత్తగా బ్రాహ్మిణి బాతులు (రడ్డీ షెల్డక్స్) వలస వచ్చాయి. ఇవి సాధారణంగా భారత ఉప ఖండం అలాగే మధ్య ఆసియా, ఆగ్నేయ ఐరోపాలో శీతాకాల విడిది చేస్తాయి. చిత్తడి నేలలు, నదులు, జలాశయాలు వాటి సంతానోత్పత్తికి అనుకూలం. నారింజ, గోధుమ రంగుల్లో ఆకర్షనీయంగా కనిపించే ఈ బాతులు ఇప్పుడు డొంకేశ్వర్ మండలంలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో కనువిందు చేస్తున్నాయి. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
క్రైం కార్నర్
ఒంటరి జీవితాన్ని భరించలేక ఆత్మహత్య సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఒంటరి జీవితాన్ని భరించలేక ఓ వృద్ధుడు మంగళవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. తిమ్మోజివాడి గ్రామానికి చెందిన దుబ్బాక బాలయ్య(60)కు రామారెడ్డికి చెందిన సత్తవ్వతో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 15 సంవత్సరాలుగా గొడవల కారణంగా భర్తను వదిలి రామారెడ్డిలోని పుట్టింట్లో కుమారుడు, కుమార్తెతో కలిసి జీవిస్తుంది. అప్పటి నుంచి బాలయ్య ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. దగ్గి గ్రామశివారు 44వ జాతీయ రహదారి పక్కన ఓ చెట్టుకు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి కూతురు స్రవంతి, కుమారుడు భానుప్రసాద్ ఉన్నారు. రెండు బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు రెంజల్(బోధన్): రెండు బైకులు ఢీకొని ముగ్గురికి గాయాలైనట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. సోమవారం రాత్రి సాటాపూర్ సమీపంలోని ఫంక్షన్ హాల్లో శుభకార్యం ముగించుకొని అదే గ్రామానికి చెందిన ఆవుల సాయిలు, లంబాడి బంతి తమ టీవీఎస్ ఎక్సెల్పై గ్రామానికి వచ్చేందుకు రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో బోధన్ వైపు నుంచి పల్సర్ బైక్పై వస్తున్న దేవేందర్ టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెదగేట్ వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిద్దిగారి భూమయ్య తన ఎక్సెల్ వాహనంపై రోడ్డును దాటుతుండగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గడీల రవీందర్రెడ్డి తన కారుతో ఢీకొట్టాడు. ప్రమాదంలో భూ మయ్య తలకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు భూమయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజివాడి చౌరస్తాలో గల రా జారాణి వైన్ షాపులో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వైన్స్ షట్టర్ తాళం పగులగొట్టి లోపలికి చొరబడి గళ్లపెట్టెలో ఉన్న రూ.650 ల కాయిన్స్, రూ.750 విలువ గల రాయల్ స్టాక్ బాటిల్ను ఎత్తుకెళ్లినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల పరిశీలన నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొ న్నారు. పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లి ప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సా మగ్రితో సిబ్బంది తరలింపు, వెబ్ కాస్టింగ్ ఏర్పా ట్లు, పోలీసు బందోబస్తు, నిఘా బృందాల పనితీరు పర్యవేక్షణ తదితర అంశాలపై ఇప్పటికే అన్ని కసరత్తులు పూర్తి చేశామన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి వేర్వేరుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలతోపాటు బోధన్ మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా అంకితభావంతో కృషి చేయాలని ఎన్నికల సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ఎక్కడ కూడా రీపోలింగ్కు ఆస్కారం లేకుండా పక్కాగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని, ఓటింగ్ సందర్భంగా గోప్యతను కాపాడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. గడువులోపు పోలింగ్ కేంద్రంలోనికి చేరుకున్న ఓటర్లకు సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత కూడా టోకెన్లు జారీ చేసి, ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి భీంగల్, ఆర్మూర్ పట్టణాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. -
కాంగ్రెస్లో కలవని చేతులు
● ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య ఘర్షణ ● బాన్సువాడలో అర్ధరాత్రి ఉద్రిక్తత బాన్సువాడ/రుద్రూర్: హస్తం పార్టీలోని నేతల మధ్య సయోధ్య కరువయ్యింది. తన భార్యను ఓడించడానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రయత్నిస్తున్నారంటూ ఆంగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికలలో కాసుల బాల్రాజ్ భార్య విజయ 5వ వార్డునుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆమెకు చైర్ పర్సన్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఆమెను ఓడించడానికి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం జరుగుతోందని సోమవారం అర్ధరాత్రి సమాచారం అందడంతో కాసుల బాల్రాజ్ అక్కడికి బయలుదేరారు. ఎదురుగా కారులో వస్తున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ను ఆయన తన అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. చంద్రశేఖర్ కాలర్ పట్టుకుని తన భార్యను ఓడించడానికి బీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కయ్యావంటూ దుర్భాషలాడారు. అర్ధరాత్రి సమయంలో బీఆర్ఎస్ నాయకుడు యలమంచలి శ్రీనివాస్ను తాడ్కోల్లో ఎందుకు కలిశావంటూ నిలదీశారు. కారులో డబ్బులున్నాయని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం వచ్చింది. కారులో రూ. 52 వేలు లభించాయి. అయితే అవి తనవి కావని, కాసుల బాల్రాజ్ అనుచరులే పెట్టారని చంద్రశేఖర్ ఆరోపించారు. వైరల్గా మారిన వీడియోలు.. కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రశేఖర్ తాడ్కోల్లోని వెంకట్రాంరెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ నాయకుడు యలమంచలి శ్రీనివాస్తో సమావేశమై తిరిగి వెళ్తున్న సీసీ కెమెరా దృశ్యాలతోపాటు.. చంద్రశేఖర్పై కాసుల బాల్రాజ్ దాడి దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ గొడవపై ఇరువర్గాలు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలిసింది. రుద్రూర్ బంద్ ప్రశాంతం మాజీ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్పై దాడికి నిరసనగా మంగళవారం నిర్వహించిన రుద్రూర్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. అనంతరం ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కా సుల బాల్రాజు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రుద్రూర్లో 15 ఏళ్లుగా కాంగ్రెస్ జెండాను మోస్తు న్న సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ను బాల్ రాజు దుర్భాషలాడుతూ దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. బాల్ రాజును వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానాన్ని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ద్రోణపల్లి సతీశ్, కొత్తకొండ భాస్కర్, ఏఎంసీ మాజీ చైర్మన్ మాసాని శ్రీనివాస్ రెడ్డి, పాత బాలకృష్ణ, రుద్రూర్ సర్పంచ్ ఇందూర్ సునీత, ఉప సర్పంచ్ నిస్సార్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా కోఆర్డినేటర్ అంబర్సింగ్, బీసీ సెల్ అధ్యక్షుడు కర్క అశోక్, కూనిపూర్ సర్పంచ్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
స్ట్రైకింగ్ ఫోర్స్.. క్విక్ రియాక్షన్ టీములు
పోలింగ్ సమయంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా తక్షణమే స్పందించేందుకు వీలుగా స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీములను ఏర్పాటు చేశామని, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలు గట్టి నిఘా సారిస్తాయని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అన్నారు. పోలింగ్కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏడుగురు ఏసీపీలు, 70 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, మరో 70 మంది సబ్ ఇన్స్పెక్టర్లతో సహా 1370 మంది పోలీసు లు బందోబస్తులో పాల్గొంటున్నారని, ప్రత్యే కంగా మూడు ప్లాటూన్ల పోలీసు బలగాలు జిల్లాకు చేరుకున్నాయని అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే ఉపేక్షించబోమన్నారు. -
488 పోలింగ్ కేంద్రాలు.. 3.48 లక్షల ఓటర్లు
సుభాష్నగర్: నిజామాబాద్ కార్పొరేషన్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 60 డివిజన్లలో 350 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట ర్లకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. మంగళవారం నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్టిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 488 పోలింగ్ కేంద్రాలు.. మున్సిపల్ కార్పొరేషన్లో 134 ప్రాంతాలలో 488 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 3,48,051 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 1,67,461 పురుషులు, 1,80,546 సీ్త్రలు, 44 ఇతరులు ఉన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానిని వెంట తెచ్చుకుని ఓటు వేయవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికలకు అవసరమైన 488 బ్యాలెట్ బాక్సులతోపాటు మరో 20 శాతం అదనంగా అందుబాటులో ఉంచారు. మున్సిపల్ పోలింగ్ నిర్వహణ కోసం 60 డివిజన్లకు పీవోలు, ఏపీవోలు, ఓపీవోలను కలుపుకొని మొత్తం 2,930 మంది విధులు నిర్వర్తించనున్నారు. ఏర్పాట్లు పూర్తి.. 488 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రధానంగా ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి, వీల్చైర్స్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను వెబ్కాస్టింగ్ ద్వారా కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయనున్నారు. నగరంలోని ఫులాంగ్ వ ద్దగల టీటీడీ కల్యాణమండపం, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ను మోడల్ పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. నగరంలో 89 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికలు సజావుగా సాగేలా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలను మోహరిస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు భద్రత బలగాలు పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది నగరంలో పోలింగ్కు సర్వం సిద్ధం -
జాతీయ సమైక్యతా శిబిరానికి తెయూ విద్యార్థులు
తెయూ(డిచ్పల్లి): కేంద్ర యువజన సర్వీసు లు, క్రీడా వ్యవహరాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగనున్న జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపికై న తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మంగళవారం వెళ్లినట్లు కోఆర్డినేటర్ ప్రొఫెస ర్ అపర్ణ తెలిపారు. పుణే ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టర్ పరిధిలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో ఈ నెల 11 నుంచి 17 వరకు శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. బృందానికి కంటింజెంట్ లీడర్గా జీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ దస్తప్ప వ్యవహరిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రత్యేక శీతాకాల శిబిరంలో వారం రోజులపాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వివిధ పోటీల లో పాల్గొని జాతీయ సమైక్యతపై చక్కటి అవగాహన పెంపొందించుకోవాలని వీసీ యాదగిరిరావు,రిజిస్ట్రార్ యాదగిరి సూచించారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 17 నుంచి ప్రారంభం కావాల్సిన పీజీ మొదటి సెమిస్టర్, పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల మొదటి సెమిస్టర్, ఐఎంబీఏ 7వ సెమిస్టర్ పరీక్షలు మార్చి 2వ తేదీ నుంచి జరుగుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ కే.సంపత్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సి టీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికుడికి ఫిట్స్ బోధన్ టౌన్(బోధన్): బోధన్ బల్దియాలోని పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికుడు శివకుమార్ విజయ మేరీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో విధులు నిర్వహిస్తుండగా ఫిట్స్ వచ్చింది. గమనించిన తోటి సిబ్బంది, సంబంధిత అధికారి 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం శివ ఆరోగ్యం మెరుగుపడటంతో ఇంటికి తీసుకెళ్లారు. ● ఒకరిపై కేసు నమోదు రెంజల్(బోధన్): అనుమతి లేకుండా మొరం తరలించిన వ్యక్తిపై కేసు నమోదైంది. మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన జిన్న సాయిలు సోమవారం రాత్రి అనుమతి లేకుండా గుట్ట నుంచి సుమారు 250 ట్రాక్టర్ల మొరం తరలించినట్లు స్థానికులు తహసీల్దార్ శ్రావణ్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం ఎమ్మారై ఫహీం గ్రామానికి చేరుకొని విచారించారు. దీంతో సదరు వ్యక్తిపై చర్యల కోసం తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై చంద్రమోహన్ కేసు నమోదు చేశారు. సుభాష్నగర్: రంజాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని వంట గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ గ్యాస్ ఏజెన్సీల డీలర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. సరిపడా వంట గ్యాస్ సిలిండర్లు తెప్పించుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, అధికారులు అరవింద్ రెడ్డి, రవి రాథోడ్, ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు. -
పటిష్ట భద్రత కల్పించాలి
ఆర్మూర్/కమ్మర్ పల్లి(భీవ్ుగల్)/ బోధన్ టౌన్: మున్సిపల్ పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సీపీ సాయిచైతన్య అధికారులకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్డులో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను ఆయన మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. 13న ఓట్ల లెక్కింపు సంద ర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జర గకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఎస్హెచ్వో సత్యనారాయణ గౌ డ్, పోలీసు అధికారులు ఉన్నారు. అనంతరం భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రా లను సీపీ సాయి చైతన్య మంగళవారం సందర్శించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి , సీటీసీ ఏసీ పీ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, సీఐ పొన్నం సత్యనారాయణ, ఎస్సైలు తిరుపతి, అనిల్, రాము, రాజేశ్వర్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, తహసీల్దార్ షబీర్ పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని ధ్యాకం గల్లీ, శక్కర్నగర్లోని బస్తీ దవాఖాన, గ్రామ చావిడీ, మధుమలాంఛ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సీపీ సాయిచైతన్య పరిశీలించారు. సీపీ వెంట సీఐడీ ఏసీపీ రఘునాథ్, సీఐలు వెంకట నారా యణ, కృష్ణ, రమేష్, ఎస్సైలు సిబ్బంది ఉన్నారు. సీపీ సాయిచైతన్య -
ఇకపై యాప్లోనే యూరియా
డొంకేశ్వర్(ఆర్మూర్): యూరియా కొనుగోలు చేసే రైతులకు ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని తప్పనిసరి చే సింది. ఇక మీదట మొబైల్ యాప్ ద్వారానే యూరియాను పొందాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.రైతులకు బుకింగ్ పద్ధతిలోనే యూ రియా ఇవ్వాలని జిల్లాలోని సొసైటీలకు, డీలర్లకు వ్యవసాయాధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో పాత పద్ధతికి స్వస్తి చెప్పి, యాప్లో యూరియా బుక్ చేసుకున్న వారికే బస్తాలను ఇచ్చారు. మిగతా వారికి యూరియా ఇవ్వలేదు. దీంతో మొబైల్ యాప్ను అలవాటు చేసుకునేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగా బుక్ చేయాలో తెలిసిన వారిని అడిగి తెలుసుకుంటున్నారు.యూరియా పంపిణీలో పారదర్శకత, సులభతరం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ 19వ తేదీ నుంచి యూరియా బుకింగ్ యాప్ను అమల్లోకి తెచ్చింది. అదే నెల చివరి వారంలో సాంకేతిక కారణాలతో రెండుసార్లు యాప్ నిలిచిపోయింది. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న రైతులు ఆందోళన చెందారు. పంటలకు యూరియా అందకపోతే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో అధికారులు పాత పద్ధతిలోనే యూరియాను అందించారు. సుమారు 40 రోజులపాటు సొసైటీలు, డీలర్ల వద్దకు వెళ్లి కావాల్సినన్ని బస్తాలు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తేవడంతో రైతులకు అలవాటు చేసుకోవడం కొంచెం కష్టంగా మారింది. కానీ, ఇదే పద్ధతి సరైందని అధికారులతోపాటు కొంతమంది రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి ఎన్ని బస్తాలు అవసరమో అన్ని మాత్రమే తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని, పక్కదారి పట్టకుండా కట్టడి చేసినట్లుగా ఉంటుందని అంటున్నారు. కౌలు రైతుల గగ్గోలు ఆన్లైన్ విధానాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం పాత పద్ధతి ఉండదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు యాప్ను అలవాటు చేసుకోవాలని రైతులకు విన్నపం రెంజల్(బోధన్): ఫెర్టిలైజర్ యాప్లో యూరియాను బుకింగ్ చేసుకున్న కౌలు రైతులకు ఓటీపీ చిక్కులు మొదలయ్యాయి. బుకింగ్ సమయంలో ఒకసారి, యూరియా తీసుకునే సమయంలో మరోసారి ఓటీపీ వస్తుండటంతో భూ యజమానులు కొందరు స్పందించటం లేదు. పలుమార్లు ఓటీపీ చెప్పడంతో సైబర్ మోసగాళ్ల బారినపడతామని భావిస్తున్నారు. దీంతో కౌలు రైతులు ఇబ్బందిపడుతున్నారు. రెంజల్ మండలం దండిగుట్టకు చెందిన రైతులు జగదీశ్, నాని, గంగరాజు యూరియా బుకింగ్ చేసుకొని డీలర్ వద్దకు వెళ్లగా అక్కడ ఆధార్నంబరుతోపాటు ఓటీపీ చెప్పాలనటంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయమై ఇన్చార్జి వ్యవసాయాధికారి సిద్దిరామేశ్వర్ను వివరణ కోరగా ఫార్మర్ ఐడీ చేసుకున్న రైతులు కాకుండా బంధువులు, మిగతా ఎవరైనా వెళితే ఆధార్ నంబరుతోపాటు ఓటీపీని అందించాల్సి ఉంటుందని తెలిపారు. యాప్ ద్వారా సులభంగా.. ఇక నుంచి యూరియా పంపిణీ బుకింగ్ యాప్ ద్వారానే నిర్వహించడం జరుగుతుంది. రైతులకు సమయానికి ఎరువులు అందించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని తెచ్చింది. రైతులంతా యాప్ను డౌన్లోడ్ చేసుకొని సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తేవాలి. – మధుసూదన్, మండల వ్యవసాయాధికారి, డొంకేశ్వర్ -
స్వేచ్ఛగా ఓటేయండి
నిజామాబాద్ అర్బన్: ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అందు కు అవసరమైన అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అ న్నారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని, నిర్దేశిత సమయంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్లు అందజేసి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. కలెక్టరేట్లో సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్ అంకిత్తో కలిసి కలెక్టర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సాఫీగా ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లాలో మొత్తం 4375 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలె ట్ బాక్సులను భద్రత నడుమ స్ట్రాంగ్రూమ్లకు తరలిస్తామన్నారు. -
ఓటేద్దాం రండి
– IIలో uనిజామాబాద్ అర్బన్/సుభాష్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓట్ల పండుగకు సమ యం ఆసన్నమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటరు స్లిప్పుల పంపిణీ దాదాపుగా పూర్తయ్యింది. నిజామాబాద్ నగరంతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ పట్టణాల్లో ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి, వీల్చైర్స్ తదితర సదుపాయాలు ఏర్పాటుచేశారు. పోలింగ్ కేంద్రాలను వెబ్క్యాస్టింగ్ ద్వారా కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులు నిశితంగా పరిశీలించనున్నారు. బూత్కు రప్పిద్దాం.. ఇందూరు బల్దియాలో పోలింగ్ శాతం పెంచేందుకు అభ్యర్థుల పాట్లు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసినా అభ్యర్థులదే కీలక పాత్ర -
టెన్త్ విద్యార్థినికి తాళి కట్టిన ఉపాధ్యాయుడు
నిజామాబాద్ జిల్లా: అన్నోజిగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థిని మెడలో అదే స్కూల్కు చెందిన ఉపాధ్యాయుడు తాళి కట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నోజిగూడలోని ఓ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి అదే స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న పర్రే మైటీస్ మాయమాటలు చెప్పి రహస్యంగా పెళ్లి చేసు కున్నాడు. విద్యార్థిని మెడలో పసుపు తాడు చూసిన తల్లి ప్రశ్నించగా..తమ ఉపాధ్యా యుడు మైటీస్ తనను పెళ్లి చేసుకున్నట్లు కూతురు చెప్పింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిని పిలిపించి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం బయటకు వస్తే స్కూలు పరువు పోతుందని భావించిన యాజమాన్యం ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుంచి తొలగించి, పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. మై నర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్ప డిన ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
10, 11న మార్కెట్లో కొనుగోళ్ల నిలిపివేత
సుభాష్నగర్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈనెల 10, 11 తేదీల్లో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డులో టెండర్లు (కొనుగోళ్లు) నిలిపేస్తున్నట్లు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ మర్చంట్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేవలం తూకాలు మాత్రమే జరుగుతాయన్నారు. 12వ తేదీ నుంచి మార్కెట్యార్డులో యథావిధిగా వ్యాపార కార్యకలాపాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించి మార్కెట్ కమిటీకి సహకరించాలని ఆమె కోరారు. -
గరీబోళ్లకు అండగా కాంగ్రెస్ పార్టీ
● ఆర్మూర్ పట్టణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం ● టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్ ఆర్మూర్: గరీబోళ్లకు అండగా నిలిచేది కాంగ్రెస్ పా ర్టీ అని, మున్సిపల్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పట్టణంలోని అంగడిబజార్లో సోమవా రం కాంగ్రెస్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్ర చార సభ నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్(చిన్న) అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించా రు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్రెడ్డితో, ఓడిపోయిన జీవన్రెడ్డితో పట్టణ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లుగా విజయం సాధి స్తేనే ఆర్మూర్ పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుంద న్నారు. మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేసిన ఆరు నెలల్లో మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేస్తామన్నారు.15,16,17,29,35,34 వార్డుల పరిధి లోని కాంగ్రెస్ అభ్యర్థులు గోనె లహరి, సవిత, ఏబీ శ్రీదేవి(చిన్న), సడక్ వినోద్, నర్మె నవీన్, భారత్ గ్యాస్ తిరుమల సుమన్లను భారీ మెజారిటీతో గె లిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో నియోజకవర్గం ఇన్చార్జి వినయ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు ఉత్కర్ష్, అఖిల్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భీమ్గల్ను దత్తత తీసుకుంటా.. కమ్మర్పల్లి(భీమ్గల్): పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన భీమ్గల్ ప ట్టణాన్ని కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకొని, అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. భీమ్గల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఈరవ త్రి అనిల్, మానాల మోహన్రెడ్డి, అన్వేశ్ రెడ్డితో క లసి ప్రచారం నిర్వహించారు. నంది గల్లీ వద్ద ఆయ న మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్లా గాలి మా టలు చెప్పే సంప్రదాయం తమది కాదని, ఇప్పటికే రూ. 24 వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తు చేశా రు. భీమ్గల్ ప్రాంత వ్యక్తిగా, ఈ ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం రూ. 6 కో ట్ల విలువైన తన సొంత భూమిని ప్రభుత్వానికి ఇ చ్చానన్నారు. వంద పడకల ఆస్పత్రికి రూ. 5 కోట్లు మంజూరు చేసి మూడు నెలల్లో పూర్తిచేస్తామన్నా రు. రూ. 365 కోట్ల నిధులతో ధర్మపురి నుంచి కొండగట్టు, వేములవాడ, మీదుగా లింబాద్రిగుట్ట వర కు, అక్కడి నుంచి భీమ్గల్ మీదుగా బాసర వరకు పెద్ద కారిడార్ నిర్మించనున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులను 12 వార్డులలో గెలిపించి ఈ గడ్డను కాంగ్రెస్ అడ్డగా నిలపాలని కోరా రు. డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్, ఎన్నికల ఇన్చార్జి గాలి అనిల్ కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి బి. వేణుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అనేక వ్యూహాలు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు కేవలం కొన్ని గంటల సమయమే ఉంది. కౌంట్డౌన్ మొదలు కావడంతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలనే లక్ష్యంతో అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు. నిజామాబాద్లో మేయర్ పీఠంపై కన్నేసిన కాంగ్రెస్, బీజేపీ కీలక నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తద్వారా మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో ఆయా డివిజన్ల వారీగా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించుకున్నారు. అందులో భాగంగా ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ తగినవిధంగా ప్లాన్లు అమలు చేస్తున్నారు. హోరాహోరీ పోరులో గెలుపు అవకాశాలు అటుఇటుగా ఉన్న డివిజన్ల విషయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అంచనా వేసుకుంటూ కచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఆర్మూర్లో కాంగ్రెస్, బీజేపీలు, బోధన్లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు, భీమ్గల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఒక్క ఓటు విషయంలోనూ ఏమాత్రం తేడా రాకుండా ఉండేలా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ● ఇక అభ్యర్థులు సైతం తాము ఎలాగైనా గెలుపొందేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రచారం ముగిసిన తక్షణమే ఓటర్లకు సంబంధించి కులాలు, వర్గాల వారీగా ముందుగానే వేసుకున్న లెక్కల మేరకు డబ్బులు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొందరు అభ్యర్థులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఒక్కరోజులోనే అనేక వ్యూహాలు అమలు చేసేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయా వ్యూహాలకు పదును పెట్టారు. ● మరోవైపు ప్రత్యర్థులు ఒక్కో ఓటుకు ఎంతమేరకు డబ్బులు ఇస్తున్నారో తెలుసుకునేందుకు గాను సోమవారం రోజే పలువురు అభ్యర్థులు ట్రయల్గా కొందరు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. ఇది చూసి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఎంత డబ్బులు ఇస్తున్నారనే విషయాన్ని గమనిస్తున్నారు. ప్రత్యర్థి ఇచ్చేదానికంటే కొంత మొత్తం ఎక్కువ డబ్బు ఓటర్లకు ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక మద్యం బాటిళ్లు సైతం భారీగా ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ప్రత్యర్థి అమలు చేస్తున్న వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు గాను కోవర్టులను ఏర్పాటు చేసుకోవడం విశేషం. ప్రతి నిముషం సద్వినియోగం చేసుకుంటూ అభ్యర్థులు వ్యూహాలు అమలు చేస్తుండడంతో పుర పోరు మరింత ఆసక్తికగా మారింది.పోలింగ్కు కౌంట్డౌన్ మొదలు కాగా ఎత్తులు.. పైఎత్తులు గెలుపు కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు రవాణా ఖర్చులు డివిజన్, వార్డులను బట్టి ఓట్ల కొనుగోలుకు మారుతున్న రేటు ప్రత్యర్థి ఒక్కో ఓటుకు ఎంత ఇస్తున్నారో తెలుసుకునేందుకు ట్రయల్గా ఇప్పటికే డబ్బులు పంచిన పలువురు అభ్యర్థులు మద్యం, డబ్బులు..డివిజన్, వార్డులను బట్టి ఓటర్లకు ఏమేరకు డబ్బులు ఇవ్వాలనే విషయమై సైతం ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఒక్కో డివిజన్లో ఒక్కోవిధంగా ఓట్ల రేట్లు నిర్ణయించుకున్నారు. ఇక కులసంఘాలను గంపగుత్తగా కొనుగోలు చేసేందుకు అభ్యర్థులు ఆయా పా ర్టీల ద్వారా తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. మ రోవైపు మహిళా సంఘాలతో ఓటర్లవారీగా లె క్కలు వేసుకుని డబ్బులు ఇచ్చే కార్యక్రమం నడిపిస్తున్నారు. ఇక డబ్బులు తీసుకోని ఓటర్లు ఎక్కువగా ఉన్నచోట మాత్రం ఖరీదైన లిక్కర్ బాటిల్స్ ఇచ్చే కార్యక్రమాలు మూడు రోజులుగా నడుస్తూనే ఉన్నాయి. ఇక పలువురు ఓటర్లు ఇతర జిల్లాల్లో, హైదరాబాద్లో ఉంటే వారిని పోలింగ్ రోజువరకు తీసుకొచ్చేందుకు అన్నిరకాల రవాణా సౌకర్యాలు కల్పించేందుకు అభ్యర్థులు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. -
సీఎం బాటలోనే పీీసీసీ చీఫ్ అబద్ధాలు
● ఇద్దరూ దొందూ దొందే.. ● బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ● భీమ్గల్లో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం కమ్మర్పల్లి(భీమ్గల్): సీఎం రేవంత్రెడ్డి బాటలోనే పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ అబద్దాలు ఆడుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తులం బంగారం, స్కూటీలు ఇస్తామంటూ గతంలో రేవంత్ రెడ్డి ఎలా అబద్ధాలు చెప్పారో, ప్రస్తుతం పీసీసీ ప్రెసిడెంట్ కూడా అవే అబద్దాలు చెబుతున్నారన్నారు. ఇద్దరూ దొందూ దొందేనని ధ్వజమెత్తారు. భీమ్గల్లో సోమవారం ఆయన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమ్గల్లో అభివృద్ధి పనులు ఆగిపోయినప్పుడు రాని మంత్రులు, బడా నేతలు ఇప్పుడే ఎందుకు వస్తున్నారు. ఎన్నికలు వచ్చినయి కాబట్టే మంత్రి ఉత్తమ్కుమార్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్లతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నారని ధ్వజమెత్తారు. భీమ్గల్లో బీఆర్ఎస్ గెలుస్తోందని సర్వే రిపోర్ట్ రావడంతోనే కాంగ్రెస్ పెద్దలకు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే ఇక్కడ హామీలు కురిపిస్తున్నారన్నారు. బడా భీమ్గల్ బ్రిడ్జి రూ. 3 కోట్లతో రిపేర్ అవుతుంది. అది కూలిపోయి ఆరు నెలలైనా ఒక్క రూపాయి తేలేదన్నారు. తాను ఒత్తిడి చేస్తే మట్టి పోశారని తెలిపారు. రూ.3కోట్లు తేలేని పీసీసీ చీఫ్ రూ.360 కోట్లతో రింగ్ రోడ్ వేస్తామంటే నమ్మాలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అంటేనే ప్రజల మనిషి, అవసరమైతే మీ ముఖ్యమంత్రి చేత కూడా పనులు చేయిస్తానన్నారు. భీమ్గల్ ‘నా బిడ్డ లాంటిది, కంటికి రెప్పలా కాపాడుకుంటా’నన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. ‘ఒకసారి నమ్మితే మోసం చేసినవాడిది తప్పు.. రెండోసారి కూడా నమ్మితే నమ్మినవాడిదే తప్పు అవుతుంది‘ అని పేర్కొంటూ, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో భీమ్గల్లో ఒక్క పైసా పని కూడా జరగలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. -
సమయపాలన పాటించాలి
● డీఎంహెచ్వో డాక్టర్ రాజ శ్రీ సుభాష్నగర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజ శ్రీ తెలిపారు. నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఆమె సోమవారం సమీక్షించారు. ఆశా కార్యకర్తల ద్వారా కుష్టు నియంత్రణ కోసం చేపట్టిన ఎల్సీడీసీ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. క్షయ నియంత్రణలో భాగంగా క్షేత్రస్థాయిలో ఎక్స్ రే పరీక్షలు చేయాలని తెలిపారు. మాతృ మరణాలు, శిశువులు, చిన్నారుల మరణాలను జరగకుండా చూడాలన్నారు. గర్భిణులకు నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న గర్భిణుల జాబితాలను సేకరించి ఫాలో అప్ చేయాలని పేర్కొన్నారు. అర్హులైన శిశువులకు 100 శాతం వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలన్నారు. జీవన శైలి వ్యాధుల నియంత్రణలో మెడికల్ ఆఫీసర్ లాగిన్లో పెండింగ్ లేకుండా ఎంట్రీ చేయాలని, పాలియేటీవ్ కేర్లో ఓపీ, ఐపీ, గృహాల వద్ద చికిత్స పొందిన వారి పేర్లతో కూడిన జాబితాను తయారు చేయాలని తెలిపారు. రాష్ట్రీ య బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా రిఫరల్ చిల్డ్రన్స్ జాబితా సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. సమీక్షలో జిల్లా టీకాల అధికారి డాక్టర్ అశోక్, డీటీసీవో డాక్టర్ దేవి నాగేశ్వరి, జిల్లా ఉప వైద్యాధికారులు రవీందర్, సమత, అశ్వినీ, ప్రోగ్రాం అధికారులు శ్వేత, వెంకన్న, సుప్రియ, సామ్రాట్, శిఖర, చైతన్య, శ్రావ్య, పీఎంవో రూప, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
బీజేపీని ఓడించే కుట్ర
సుభాష్నగర్: నిజామాబాద్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కుట్ర ప న్నుతున్నాయని, ప్రజలు కళ్లు తెరిచి బీజేపీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పేర్కొన్నారు. నగరంలోని పూసలగల్లి టీ కార్నర్ వద్ద బీజేపీ అభ్యర్థులు బంటు ప్రీతి ప్రవీణ్, గిరిబాబు, బట్టు రాఘవేంద్ర, శీల శ్రీనివాస్, చింతకాయల రాజేందర్, వినోద్, సత్య పాల్ తరఫున సోమవారం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం నుంచి 100 మంది ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాంచందర్రావు మాట్లాడారు. ఎంఐఎం గత పదేళ్లు బీఆర్ఎస్తో కాపురం చేయగా, ప్రస్తుతం కాంగ్రెస్తో చేస్తుందన్నారు. ఎంఐఎంకు బీజేపీ అంటే భయం పట్టుకుందని ఆరోపించారు. నిజామాబాద్లో మళ్లీ నిజాం పాలన తీసుకొచ్చే ప్ర యత్నం చేస్తున్నారని విమర్శించారు. మతం పేరు తో రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బీజేపీ ఏనాడూ మతం ఆధారంగా రాజకీయం చే యలేదని, వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కలాంను రాష్ట్రపతిని చేశామని గుర్తుచేశారు. ఈ నెల13 తర్వాత నిజామాబాద్ పేరు ఇందూరుగా మారుతుందన్న విశ్వాసం ఉందని తెలిపారు. ఎన్నికలకు ముందు అబద్ధాలు ప్రచారం చేయడం కాంగ్రెస్కు, సీఎం రేవంత్రెడ్డికి అలవాటైందని రాంచందర్రావు విమర్శించారు. బీజేపీ, కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలను బదనాం చేస్తున్నారని దుయ్య బట్టారు. సమావేశంలో ఎంపీ అర్వింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీ య పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్, కాంతారావు, నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్లో మళ్లీ నిజాం పాలన తీసుకొచ్చే ప్రయత్నం ఈ నెల 13 తర్వాత ఇందూరుగా మార్పు తథ్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
సుభాష్నగర్: మున్సిపల్ ఎన్నికలను సజావుగా ని ర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి హాజరైన సెక్యూర్ సెల్ ఆఫీసర్ మంద మకరంద్తో కలి సి కలెక్టర్ సోమవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి, డిస్ట్రిబ్యూషన్ సెంటర్తోపాటు స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాళ్లను పరిశీలించారు. పొరపాట్లకు తా వులేకుండా ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా పంపిణీ చేయాలని, నిర్ణీత సమయానికి సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. -
చదువుతోనే ఉన్నత స్థానం..
ఆర్మూర్: చదువుతోనే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చంటూ కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణతో నిత్యం బిజీబిజీగా ఉండే కలెక్టర్ కొద్దిసేపు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయురాలి గా మారిపోయి వారిలో ఉత్సాహాన్ని నింపింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించడంలో భాగంగా సోమవారం ఆర్మూర్ పట్ట ణం మామిడిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఆమె వచ్చారు. 3వ తరగతిలో పలు ప్రశ్నలను విద్యార్థులను అడుగగా, వారు సమాధానా లు చెప్పడంతో చాక్లెట్లను ఇచ్చి ప్రోత్సహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్పై ఇష్టం పెంచుకొని చదవాలని సూచించారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్నాన్ మాల్వియా, ఏసీపీ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ ఉన్నారు. -
ఎన్నికల సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలి
● డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి అవరసమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఆమె సోమవారం సందర్శించారు. పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను సైతం పరిశీలించిన కలెక్టర్, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, ఒక్క సెకను కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవా లని సూచించారు. అనంతరం మామిడిపల్లిలోని ప్ర భుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో ఏ ర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల విధుల్లో తప్పిదాలకు తావిస్తే కఠిన చర్య లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆర్వో శ్రీనివాస్ ఉన్నారు. మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి.. నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహ ణ ఏర్పాట్లలో భాగంగా జిల్లాలో పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయింది. జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయా ల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ సీహెచ్ సత్యనారాయణ రెడ్డిల సమక్షంలో ర్యాండమైజేషన్ జరిపించారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులను ఆయా పోలింగ్కేంద్రాలకు కేటా యించారు. అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. -
మేయర్ రేసులో ఉత్తమ ఉపాధ్యాయురాలు
● ఐదు సార్లు అవార్డు అందుకున్న కాటిపల్లి శమంత ● తన గెలుపుతో పాటు ఇతర డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఐదు సార్లు అవార్డులు సాధించిన కాటిపల్లి శమంత నరేందర్రెడ్డి నిజామాబాద్ మేయర్ పీఠం రేసులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 19వ డివిజన్లో బరిలోకి దిగిన శమంత నరేందర్రెడ్డి నిజామాబాద్ ఉమెన్స్ కళాశాలలో విద్యనభ్యసించారు. 1989 సంవత్సరంలో టీటీసీ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయురాలి గా పనిచేస్తూనే ఉన్నత విద్యనభ్యసించారు. ఉస్మా నియా వర్సిటీ నుంచి ఎంఏ, బీఈడీ పూర్తి చేశారు. తిరుపతిలోని పద్మావతి వర్సిటీ నుంచి మరో పీజీ కోర్సు చేశారు. ఉపాధ్యాయ వృత్తిని శమంతరెడ్డి ని బద్ధతతో నిర్వహించారు. ఈ క్రమంలో శమంత ఐ దు సార్లు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డులు సాధించారు. అదేవిధంగా మహాత్మా జ్యోతిబాపూలే అవార్డు అందుకున్నారు. 2025 మే 24న శమంత ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్డు అయ్యారు. రిటైర్ అయిన తరువాత ఆమె విజయ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలకు, వంశీ ఇంటర్నేషనల్ హోటల్కు డైరక్టర్గా వ్యవహరిస్తూ వ్యాపార నిర్వహణలోనూ స త్తా చాటుతున్నారు. శమంతరెడ్డి వద్ద విద్య నేర్చుకు న్న పలువురు విద్యార్థులు యూఎస్ఏ, యూరప్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుత నగరపాలక సంస్థ ఎన్నికల్లో త నను గెలిపిస్తే ప్రజలకు శక్తివంచన లేకుండా పూర్తి స్థాయి లో సేవలందజేస్తానని శమంత చెబుతున్నారు. -
విద్యుత్, పారిశుద్ధ్యం సమస్యలు తలెత్తకుండా చూడాలి
● అదనపు కలెక్టర్ అంకిత్ ● ‘రంజాన్’ ఏర్పాట్లపై సమీక్ష నిజామాబాద్అర్బన్: రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యుత్, పారిశుధ్యం సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని అ దనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని తన ఛాంబర్లో సోమవారం ఆయన జిల్లా అధికారులతో సమావేశమై, రంజాన్ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఎక్కడ కూడా విద్యుత్, తాగునీరు, పా రిశుద్ధ్యం వంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి బాధ్యతలు పురమాయి స్తూ, నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించా రు. వైద్య శిబిరాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడ కూడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్రావు, డీఎంహెచ్వో రాజశ్రీ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ బకాసురుల పార్టీ
సుభాష్నగర్: కాంగ్రెస్ బకాసూరుల పార్టీ అని, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను అప్పగిస్తే లూటీ చేయడం ఖాయమని ఎంపీ అర్వింద్ ధర్మ పురి ఆరోపించారు. నగరంలో సోమవారం బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా పూసలగల్లిలో కార్నర్ మీటింగ్లో అర్వింద్ మాట్లాడుతూ.. ముస్లింల కోసం రేవంత్రెడ్డి చేస్తున్న ఊడిగంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంతుద్దీన్ కాదని.. రేవంత్ బేగం అని అభివర్ణించారు. సీఎం రేవంత్రెడ్డి తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా అమ్ముకున్నారని, ఎంఐఎంకు కాంగ్రెస్, సీ ఎం బ్రోకర్గా మారాడని విమర్శించారు. నిజామా బాద్లో వ్యక్తికి ఓటు వేయడం లేదని.. వ్యవస్థకు ఓటేయాలని, ఆ వ్యవస్థ బీజేపీ అని తెలిపారు. అవి నీతి రహిత పాలన కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూ ర్యనారాయణ మాట్లాడుతూ.. నిజామాబాద్లో నీ తికి, అవినీతికి, ధర్మానికి, అధర్మానికి మధ్య జరు గుతున్న ఎన్నికలు అని పేర్కొన్నారు. ప్రజలు ఈ ఎ న్నికల్లో కాంగ్రెస్కు దిమ్మతిరిగే ఫలితాలు ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. సమావేశంలో అభ్యర్థులు, బీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ● వ్యక్తిత్వాన్ని అమ్ముకున్న సీఎం ● ఎంపీ అర్వింద్ ధర్మపురి -
వాలీబాల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
● రాష్ట్రస్థాయి పోటీల్లో విన్నర్గా జిల్లా బాలికల జట్టు, రన్నర్గా బాలుర జట్టు కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు విజేతగా నిలువగా, రన్నర్గా మహబూబ్నగర్, తృతీయ స్థానంలో కరీంనగర్, నాల్గో స్థానంలో మెదక్ జట్లు నిలిచాయి. బాలుర విభాగంలో వరంగల్ జట్టు విజేతగా నిలువగా, రన్నర్గా నిజామాబాద్, తృతీయ స్థానంలో ఖమ్మం, నాల్గో స్థానంలో రంగారెడ్డి జట్లు నిలిచాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీబీ సీఐ గడ్డం నగేశ్ విజేతల కు బహుమతులు అందజేశారు. రాష్ట్ర వాలీ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జల రమేశ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్రెడ్డి, ట్రెజరర్ శ్రీకృష్ణ, వాలీబా ల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశ్గౌ డ్, ట్రెజరర్ ఏనుగు గంగారెడ్డి పాల్గొన్నారు. -
‘బీసీలను నిలువునా ముంచిన కాంగ్రెస్’
సుభాష్నగర్: బీసీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం వారి ఓట్లను వాడుకుని నిలువునా మోసం చేస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. ఆదివారం నగరంలోని 7వ డివిజన్ అభ్యర్థి నిమ్మల శ్రావణ్ కుమార్, 14వ డివిజన్ అభ్యర్థి రంజిత్, 15వ డివిజన్ అభ్యర్థి శేఖర్కు మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ.. బీసీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేని అసమర్థుడని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను పూర్తిగా మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే ఐదేళ్లలో బీసీల అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి.. రెండున్నరేళ్లలో కనీసం రూ.200 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. 12 ఏళ్లుగా దేశాన్ని ప్రధాని మోదీ, 7 ఏళ్లుగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంపీ అర్వింద్, రెండున్నరేళ్లుగా తాను అర్బన్ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పని చేస్తున్నామని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ధన్పాల్ సూర్యనారాయణ ఓటర్లను కోరారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నరాముల అశోక్(41) గత సంవత్సరం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా రు. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కావడం లేదు. దీంతో జీవితంపై విరక్తితో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భా ర్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ కలహాలతో తాపీ మేస్త్రి.. నిజాంసాగర్(జుక్కల్): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహమ్మద్నగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నిజాంసాగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘట్ జిల్లా వాలేగావ్ గ్రామానికి చెందిన రాజ్కుమార్(38) కొన్ని నెలల క్రితం మండల కేంద్రానికి వచ్చి తాపీ మేస్త్రి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. నాలుగు రోజులుగా మధ్యప్రదేశ్లో ఉంటున్న కుటుంబ సభ్యులతో తరచూ ఫోన్ మాట్లాడుతూ గొడవ పడేవాడు. అతిగా మద్యం సేవించేవాడు. ఆదివారం స్వగ్రామానికి వెళ్తున్నట్లు తోటివారితో చెప్పిన అతను ఇంటి బయట బట్టల బ్యాగు ఉండటాన్ని తోటి మేస్త్రిలు గమనించారు. వారు ఇంట్లో అతని కోసం వెతుకగా బాత్రూమ్లో ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. వెంటనే కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. -
జిల్లా కుమ్మర ఉద్యోగుల నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ రూరల్: నగరంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో నిజామాబాద్ జిల్లా కుమ్మర(శాలివాహన) ఉద్యోగుల సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో పనిచేస్తున్న అన్నిశాఖల ఉ ద్యోగులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ మర్రిపల్లి భూపతి, జనరల్ సెక్రెటరిగా బీ నాగేశ్వరరావు, కోశాధికారి గా కే హన్మాండ్లు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎ ప్రమో ద్కుమార్, కో–ఆర్డినేటర్గా కే రాజు, లీగల్ అడ్వైజర్గా విజిగిరి గంగారాం, కనకం గంగాధర్, అంకమ్మరావు, మీడియా సెక్రెటరీలుగా కత్తి గంగాధర్, కార్యవర్గ సభ్యులుగా టీ గంగాధర్, అశోక్, జైపాల్, పోశెట్టి, వినయ్కుమార్, దత్తు, రమేశ్, సంతోష్, సురేశ్, మధు, లక్ష్మణ్, బాలయ్య ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా అసిస్టెంట్ ప్రొఫెసర్(రిటైర్డ్) వీరప్రసాద్, న్యాయవాది విజిగిరి గంగారాం వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సభ్యులు సన్మానించారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
సమ్మేళనంలో పాల్గొన్న న్యాల్కల్ జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు, భీమ్గల్ జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు, తొర్తి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులుమోపాల్/ కమ్మర్పల్లి(భీమ్గల్)/ మోర్తాడ్: మండలంలోని న్యాల్కల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2001–02 సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భీమ్గల్లోని జెడ్పీహెచ్ఎస్లో 1979–80కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు లింబాద్రి గుట్టపై ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏర్గట్ల మండలంలోని తొర్తి ఉన్నత పాఠశాలలో 2007–08 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గురువులను సత్కరించారు. -
భీమ్గల్ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం
● మాజీ మంత్రి మహమూద్ అలీకమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ మున్సిపల్ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని రాష్ట్ర మాజీ హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో బాల్కొండ నియోజకవర్గం, ముఖ్యంగా భీమ్గల్ ప్రాంతం అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని కొనియాడారు. ప్రశాంత్ రెడ్డి నాయకత్వం నియోజకవర్గానికి గర్వకారణమన్నారు. ప్రశాంత్ రెడ్డి కేసీఆర్కు అత్యంత ఆప్తుడని అన్నారు. కాంగ్రెస్ వి అన్నీ అబద్ధపు హామీలే! కాంగ్రెస్ పార్టీ గతంలో 42 ఏళ్ల పాటు పాలించినా మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించిందని అలీ విమర్శించారు. కేవలం రెండేళ్లలోనే కేసీఆర్ 204 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి 1లక్ష,40వేల మంది పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావడం లేదని, ప్రజలను మోసం చేయడమే ఆ పార్టీ నైజమని మండిపడ్డారు. భీమ్గల్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 12 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అభివద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షుడు నవీద్ ఇక్బాల్, మొయిజ్ బాయ్, బీఆర్ఎస్ అభ్యర్థులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
‘ఇందూరు’ బీజేపీతోనే సాధ్యం
సుభాష్నగర్: కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగిరిన వెంటనే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని, మొదటి సర్వసభ్య సమావేశంలోనే తీర్మానం చేస్తామని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని కంఠేశ్వర్ టీ కార్నర్ చౌరస్తాలో 19 డివిజన్ అభ్యర్థి నాగోళ్ల లక్ష్మీనారాయణ, 20వ డివిజన్ అభ్యర్థి న్యాలం సునీత రాజు, 43వ డివిజన్ అభ్యర్థి సోమ లింగం, వినా యక్నగర్లోని హనుమాన్ జంక్షన్లో ఆరో డివిజన్ అభ్యర్థి గోపిడి స్రవంతిరెడ్డి, 22వ డివిజన్ అభ్యర్థి పులగం సాయి వైష్ణవి సుధా, 23వ అభ్యర్థి మేకల విజయ మల్లేశ్యాదవ్ తరఫున ఎంపీ అర్వింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మా జీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జిల్లా ఇన్చార్జి కాంతారావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రఘునందన్రావు మాట్లాడుతూ.. రెండేళ్లలో నిజామాబాద్ మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో.. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ని ధులు ఇచ్చిందో చర్చకు సిద్ధమా అని పీసీసీ అధ్యక్షు డు మహేశ్కుమార్గౌడ్కు సవాల్ విసిరారు. కాంగ్రె స్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని, అన్ని పార్టీలు ఒకవైపు ఉంటే.. బీజేపీ ఒకవైపు ఉందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోస్థానానికే పరిమితం కానుందని ఎద్దేవా చేశారు. ప్రతి నెలా అయోధ్యకు మేయర్గా బీజేపీ గెలిస్తే ప్రతినెలా ఒక రైలులో ఉచితంగా అయోధ్య దర్శనానికి ప్రజలను తీసుకెళ్తారని, అందుకు ఎంపీ అర్వింద్ సహకరిస్తారని రఘునందన్రావు ప్రకటించారు. ఎక్కడ చూసినా బీజేపీకి ప్రజలు నీరాజనం పలుకుతున్నారని, కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురవేస్తారన్న విశ్వాసం తనకు ఉందన్నారు. కాంగ్రెస్ హటావో.. ఇందూరు బచావో అని నినదించారు. కులాల పేరుతో హిందువుల విభజన నగరంలో కులాల పేరుతో హిందువుల విభజనకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని, మనమంతా ఐక్యంగా ఉండి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ అర్వింద్ అన్నారు. కౌన్సిలర్గా గెలవని మహేశ్కుమార్ గౌడ్ కూడా స్మార్ట్సిటీ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపించి.. ఆ తర్వాత మాట్లాడాలని హితవుపలికారు. జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్కు స్థలం అప్పగిస్తే.. ఏడాదిలో విమానాన్ని దింపుతానని సవాల్ విసిరారు. మన ఇందూరు.. మన మేయర్ నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. మొదటి సర్వసభ్య సమావేశంలోనే పేరు మార్పుపై తీర్మానం చేస్తాం మేయర్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ వస్తారు మెదక్ ఎంపీ రఘునందన్రావు -
ఎరుపెక్కిన ఇస్రోజివాడి
● లోకేటి చందర్కు కన్నీటి వీడ్కోలు ● అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన ప్రజలు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: గడ్చిరోలి ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు అగ్రనేత ప్రభాకర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ లోకేటి చందర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ఇస్రోజివాడి గ్రామంలో ఆదివారం జరిగాయి. ఈ నెల 6న జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఆయన మృతి చెందగా, శవాన్ని ఆదివారం ఉదయం గ్రామానికి తీసుకువచ్చారు. స్వామికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో ఖాళీ జాగాలోనే టెంటు వేసి ప్రజల సందర్శనార్థం ఉంచారు. గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చి నివాళులర్పించారు. ఆయనతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా నక్సలైట్ ఉద్యమంలో కీలకనేతగా స్వామి బాన్సువాడ, ఎల్లారెడ్డి, సిర్నాపల్లి, కామారెడ్డి ఏరియాలతోపాటు సిరిసిల్లా ఏరియాలోనూ సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయనతో కలిసి పనిచేసిన వందలాది మంది మాజీలు ఆఖరి చూపు కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. విప్లవోద్యమంలోనే కన్నుమూసిన స్వామి భార్య సులోచన అమరత్వంపై ప్రచురించిన ‘గెరిల్లా అమ్మ’ అనే పుస్తకాన్ని స్వామి కొడుకు రమేశ్తోపాటు బంధువులతో కలిసి అమరుల బంధుమిత్రుల సంఘం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సులోచన త్యాగాన్ని సైతం కొనియాడారు. పౌరహక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం నేతలు పలువురు స్వామి ఎదిగిన తీరును వివరించారు. ఎర్రజెండాల రెపరెపలు... స్వామి అంతిమయాత్రలో వందలాది మంది ఎర్రజెండాలు చేతబట్టుకొని పాల్గొన్నారు. దీంతో దారి మొత్తం ఎరుపెక్కింది. పాటలు పాడుతూ, నినదిస్తూ స్వామిని స్మరించుకున్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని నినదించారు. కాగా, స్వామి అంత్యక్రియల సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టిలో ఉండి పరిశీలించారు. చేను దగ్గర ఖననం స్వామి కుటుంబానికి చెందిన చేను దగ్గర ఖననం చేశారు. కొడుకు రమేశ్ చేతుల మీదుగా అంతిమక్రియలు నిర్వహించారు. ఉద్యమంలో ఉన్నపుడు తల్లి అంత్యక్రియలు నిర్వహించిన రమేశ్, ఇటీవలే ఉద్యమం నుంచి వైదొలిగి లొంగిపోయాడు. ఇదే సమయంలో చనిపోయిన తండ్రి అంత్యక్రియలు కూడా ఆయన చేతుల మీదుగా జరిగాయి. అంత్యక్రియల్లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఽఅధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మన్, కార్యదర్శి నారాయణరావ్, విరసం అధ్యక్షుడు పాణి, కార్యదర్శి రాజయ్య, అమరుల బంధుమిత్రుల సంఘం ప్రతినిధులు పద్మకుమారి, శాంతక్క, వివిధ సంఘాల నేతలు కుమారస్వామి, విజయరామరాజు, సుదర్శన్, భవానీ, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర, న్యాయవాదులు క్యాతం సిద్దరాములు, ఆజాద్, విద్యార్థి నేతలు విఠల్, సురేశ్, మాజీ మావోయిస్టు నేతలు అమర్, సునీత, నరేశ్, రామకృష్ణ, జనార్దన్ తదితరులు హాజరయ్యారు. -
ఎన్నికల ప్రచారంలో సోషల్ ట్రెండ్!
● ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్లు ఉపయోగిస్తున్న అభ్యర్థులు ● ప్రచారంలో భాగంగా ఓటర్లకు ఫోన్ కాల్స్ ఆర్మూర్: జిల్లాలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు యువ ఓటర్లను ఆకర్షించేందుకు సామాజిక మాధ్యమాలను ఎంచుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్లలో హామీలు గుప్పిస్తూ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. తరచూ ఆన్లైన్లో ఉండే యువతను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ప్రచారం జాతీయ రాజకీయాల్లో ఉండగా, ప్రస్తుతం మున్సిపల్ స్థాయి ఎన్నికల్లో ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ బయోడేటాను మొదలుకొని పార్టీ కార్యక్రమాల్లో, ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్న ఫొటోలను సోషల్ నెట్వర్క్ సైట్లలో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ లైక్స్, షేరింగ్, కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇంటర్నెట్, సోషల్ మీడియాపై పెద్దగా అవగాహన లేని సీనియర్ సిటిజెన్స్ అయిన అభ్యర్థులు సైతం తమ కుటుంబంలో ఉన్న యువకుల సహకారంతో తమ అకౌంట్స్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సైతం స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తుండటంతో అభ్యర్థులు సోషల్ మీడియాను ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. ఎన్నికల ఖర్చును ఎలక్షన్ కమిషన్కు సమర్పించాల్సి ఉండటంతో అభ్యర్థులు తమ ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నామినేషన్ల పర్వానికి ముందు నుంచే ప్రచారం నిర్వహించే పనిలో పడ్డారు. ఫోన్ కాల్.. మెసేజ్లతో.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ విజయా న్ని మూట గట్టుకోవడానికి ఉన్న ఏ చిన్న అవకాశా న్ని వదులుకోవడం లేదు. కాల్ సెంటర్ల వారితో ఒ ప్పందాలు చేసుకొని తమ పట్టణ పరిధిలోని లబ్ధిదారులు,ఓటర్ల ఫోన్ నంబర్లను వారికి చేరవేస్తున్నా రు.మరి కొందరు అభ్యర్థులు తనకు ఓటు వేసి గెలి పించాలంటూ ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ వాయిస్ రికా ర్డు చేసి ఫోన్లు చేస్తూ ఆ వాయిస్ రికార్డును వినిపిస్తున్నారు.ఫోన్ చేసి వివరాలు చెపితే సెల్ ఫోన్ ఉపయోగించే మహిళలు,వృద్దులు, నిరక్ష్యరాస్యులకు సైతం సమాచారం చేరవేసే ఆస్కారం ఏర్పడుతోంది.ఇది గ్రహించిన అభ్యర్థులు సెల్ ఫోన్ల ద్వారా ఓటర్లకు ఫోన్లు చేపిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకొ నే పనిలో పడ్డారు.దీంతో సోషల్ మీడియాతో పా టు కొత్త పుంతలు తొక్కుతున్న ఎన్నికల ప్రచారంపై సెల్ ఫోన్లు ఉపయోగించే ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్నారు. -
క్రైం కార్నర్
రుద్రూర్: చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన పొతంగల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. పొతంగల్ మండలం కొడిచర్ల గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్(35) కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 6న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం పొతంగల్ చెరువులో మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటన స్థలానికి చేరుకొని కుటుంబీకులకు సమాచారం అందించారు. చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పదస్థితిలో యువకుడు.. బాన్సువాడ రూరల్: మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఎస్హెచ్వో తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండల కేంద్రంలోని డబుల్బెడ్ రూం కాలనీలో నివాసం ఉంటున్న శివకుమార్(37) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో అతని భార్య ఎంతలేపినా నిద్రలేవకపోవడంతో ఆమె శివకుమార్ తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. చికిత్స పొందుతూ విద్యార్థిని..సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మల్లుపేట్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండలం కొప్పర్లకు చెందిన గడిపె గోపాల్రావు కుమార్తె లక్ష్మి(14) రెంజల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శనివారం కామారెడ్డిలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు కుమార్తె లక్ష్మిని రాయించేందుకు గోపాల్రావు తన భార్యతో కలిసి కామారెడ్డికి బైక్పై వచ్చారు. తిరుగు ప్రయాణంలో మల్లుపేట్ క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొన్నది. బైక్పై ఉన్న వీరు కింద పడడంతో లక్ష్మి తలకు బలమైన గాయమైంది. స్థానికులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రుద్రూర్: పొతంగల్ మండలంలోని జల్లాపల్లి శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీపీ, పొతంగల్ కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్కు తీవ్ర గాయలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ. 15వేల కోసం గొడవ.. హత్య
పిట్లం(జుక్కల్): కూలీ డబ్బుల విషయంలో ఇద్దరు కూలిల మధ్య జరిగిన వాగ్వాదమే ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. పిట్లం మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఈ నెల 6న ఓ వ్యక్తి హత్యకు గురికాగా ఈ కేసును 48 గంటల్లో పిట్లం పోలీసులు ఛేదించారు. హత్య కేసు వివరాలను డీఎస్పీ విఠల్రెడ్డి బాన్సువాడలోని తన కార్యాలయంలో వెల్లడించారు. పిట్లం మండల కేంద్రానికి చెందిన కోట సిద్ధులు అనే వ్యక్తి జాతీయ రహదారి పక్కన నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ నెల 6న సాయంత్రం కొత్త ఇంటికి వచ్చిన సిద్ధులుకు ఇంటి పెయింటింగ్ పనుల కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజేశ్(46) అనే వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించాడు. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. హత్య కేసును ఛేదించేందుకు ఎస్సీ రాజేశ్చంద్ర రెండు బృందాలను ఏర్పాటు చేశారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, పిట్లం ఎస్సై వెంకట్రావు ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేయగా వారు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం పిట్లం గ్రామంలోని శాంతినగర్ కాలనీలో ఓ వ్యక్తి కిరాయి ఉన్న ఇంటికి వచ్చి ఇంటి వస్తువులను సర్దుకొని పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు బృందాలు సీసీ కెమెరాల ద్వారా గమనించాయి. అనుమానంతో పోలీసులు అతన్ని పట్టుకొని విచారించగా నిందితుడు శ్రీకృష్ణ రాజేశ్ను హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. యూపీ కి చెందిన మృతుడు రాజేశ్, శ్రీకృష్ణ గతంలో బెంగళూరులో కలిసి పనిచేసేవారు. రాజేశ్ మిత్రుడు దిలీ ప్ పిట్లం గ్రామంలో పెయింటింగ్ పనులు ఉన్నా యని చెప్పడంతో వీరు ఇటీవల పిట్లంకు వచ్చారు. శ్రీకృష్ణతో దిలీప్ పెయింటింగ్ పనులు చేయించుకొని రూ. 15వేల నగదు ఇవ్వకుండా దిలీప్ గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో రాజేశ్తో శ్రీకృష్ణ తరచూ గొడవపడేవాడు. ఈ నెల 6న సిద్ధులు నిర్మాణం చేపడుతున్న ఇంటికి రాజేశ్ను శ్రీకృష్ణ తీసుకొచ్చి డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. దీంతో ఆగ్రహంతో అతని తలపై కర్రతో కొట్టి హత్య చేశాడు. మృతుడు రాజేశ్ జేబులో ఉన్న ఫోన్, రూ. 250 నగదు తీసుకొని పరారైనట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు హత్యకు ఉపయోగించిన కర్ర, ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును తక్కువ సమయంలో ఛేదించి నిందితుడిని పట్టుకున్న సీఐ బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, పిట్లం ఎస్సై వెంకట్రావు, కానిస్టేబుళ్లు కే రఘు, సాయాగౌడ్, వెంకటేశ్, నవీన్, హోమ్గార్డు సంగమేశ్ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ తెలిపారు. చంపింది తోటి కూలే.. 48 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తింపు, అరెస్టు -
ఎస్సీ స్టడీ సర్కిల్లో వార్డెన్ చేతివాటం
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడలోని ప్రభుత్వ ఎస్సీ స్టడీ సర్కిల్లో వార్డెన్ సన్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పట్టుకున్నారు. నాందేవ్వాడలోని ఎస్సీ స్టడీ సర్కిల్, ఎస్సీ వసతి గృహం ఉంది. ఆదివారం ఉదయం హాస్టల్ విద్యార్థులు తినే రెండు క్వింటాళ్ల సన్న బియ్యాన్ని వార్డెన్ జీవన్ అక్రమంగా కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు. హాస్టల్లో కొన్ని రోజుల నుంచి సన్న బియ్యం వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఎస్సై హరిబాబును వివరణ కోరగా వార్డెన్ జీవన్ సన్న బియ్యాన్ని ఇంటికి తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేశామని, సంబంధిత డిపార్ట్మెంట్కు లేఖ రాసినట్లు ఎస్సై తెలిపారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి రాజగంగారాంను వివరణ కోరగా తాను ఎన్నికల విధుల్లో ఉన్నందున ఏఎస్డబ్ల్యూతో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. బియ్యం తరలిస్తు పట్టుబడ్డ హాస్టల్ వార్డెన్ జీవన్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. నిజామాబాద్ అర్బన్: సీఎం కప్ జిల్లా స్థాయి యోగాసన పోటీలను నగరంలోని బాలభవన్లో ఆదివారం నిర్వహించారు. మూడు కేటగిరీల్లో పోటీలు నిర్వహించగా, వివిధ మండలాల నుంచి సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ యోగాసన పోటీల్లో పాల్గొంటారని జిల్లా యువజన క్రీడా అధికారి పవన్కుమార్ తెలిపారు. రుద్రూర్: పొతంగల్ మండలం సుంకిని గ్రామ శివారులోని మంజీరా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా సుంకిని గ్రామ శివారులోని మంజీరా నది వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను గుర్తించి కోటగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొన్ని గంటలే..
నిజామాబాద్● పరిస్థితులను బట్టి గేమ్ ఛేంజ్ చేసుకునేందుకు అభ్యర్థుల పాట్లు ● తుది దశ ఎత్తుగడలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళికలు ఎరుపెక్కిన ఇస్రోజివాడి గడ్చిరోలి ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు అగ్రనేత లోకేటి చందర్ అంత్యక్రియలు ఇస్రోజివాడిలో పూర్తయ్యాయి.సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026– 8లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పురపాలక ఎన్నికలకు సంబంధించి నేటితో ప్రచారం పరిసమాప్తం కానుంది. సోమవారం సాయంత్రం 5గంటలకు మైకులు బంద్ చేయాల్సిందే. అయితే నామినేషన్ల ప్రక్రియతోపాటు ప్రచారానికి సైతం చాలా తక్కువ స మయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ఉరుకులు పరుగుల మీద ప్రచార పర్వం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక ప్రచారానికి కొన్ని గంటలు మాత్రమే సమయం మిగలడంతో ‘సమయం లేదు మిత్రమా..’ అంటూ పరుగెత్తుతూ, తమ అనుచరులను పరుగెత్తిస్తున్నారు. నేడు అన్ని డివిజన్లు, వా ర్డుల్లో భారీ ర్యాలీలకు ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పరిస్థితులను బ ట్టి గేమ్ ఛేంజ్ చేసుకునే దిశగా అప్పటికప్పుడు ప్ర ణాళికలు రచించుకునేందుకు సిద్ధ మవుతున్నారు. కీలకమైన తుది దశ ఎత్తుగడలను కచ్చితమైన రీతిలో అమలు చేసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. నేటి సాయంత్రం నుంచి ఓటర్లకు డబ్బులు పంచేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నువ్వా – నేనా నిజామాబాద్ నగరంలో మేయర్ పీఠం కోసం బీ జేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అనేస్థాయిలో పో రు నడుస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ కింగ్ మేకర్ అయిన ఎంఐఎం మరోసారి కింగ్ మేకర్ అ వుతుందా అనేది చూడాల్సి ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నప్పటికీ తాము సైతం కొన్ని సీట్లు గెలుచుకుంటే కీలక పాత్ర పోషించే అవకాశముంటుందని బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకు లు లెక్కలు వేసుకుంటున్నారు. పరిస్థితులను చూ స్తుంటే ఒకరిద్దరు స్వతంత్రులు సైతం గెలుపొందే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు తప్పవనే చర్చ జరుగుతోంది. మహేశ్గౌడ్ వర్సెస్ ధర్మపురి అర్వింద్ అన్నట్లుగా పోరు నడుస్తోంది. ఆర్మూర్లో పై ‘చేయి’! ఆర్మూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఇప్పటివరకు పైచేయిగా నిలుస్తోంది. 2014 వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఆర్మూర్లో గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ గెలుపొందింది. మళ్లీ ఈసారి ఆర్మూర్లో హస్తం తమ హవాను తిరిగి కొనసాగించే వాతావరణం నెలకొంది. భీమ్గల్లో బీఆర్ఎస్కు కలిసొచ్చే అవకాశం భీమ్గల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డిప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో కొంతమేరకు గులాబీ పార్టీ మెరుగైన స్థితిలోకి వచ్చింది. మంత్రిగా ఉన్న సమయంలో ప్రశాంత్రెడ్డి చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్లస్ కానుంది. ప్రతి అభ్యర్థి విషయంలో ప్రశాంత్రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇదే అభివృద్ధి చూపడంతో గత ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే నియోజకవర్గ ఇన్చార్జి సునీల్రెడ్డి సీరియస్గా తీసుకోలేదనే చర్చ నడుస్తోంది. నేటి సాయంత్రానికి ప్రచారం సమాప్తంబోధన్లో హోరాహోరీబోధన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య పోటీ నడుస్తోంది. అయితే పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ బీజేపీ అభ్యర్థులు సైతం పుంజుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ అంతర్గతంగా ఎంఐఎంకు సహకరిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీంతో ఇక్కడ హోరాహోరీ నెలకొంది. ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి వ్యూహాలకు పదును పెడుతున్నారు.బయటి వ్యక్తులు ఉండొద్దు: సీపీ నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తరువాత బయటి వ్యక్తులు ఉండొద్దని సీపీ సా యిచైతన్య ఒక ప్రకటనలో సూచించారు. బయ టి వ్యక్తులు ఉంటే చర్యలు తీసుకుంటామని, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రచార సిబ్బంది తదితరులు తప్ప నిసరిగా వెనక్కి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. ప్రచారం నిషేధం: కలెక్టర్నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల ప్ర చారంపై సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. 11వ తేదీన పోలింగ్ ముగిసే వరకు మద్యం, కల్లు దుకాణాలను మూసివేయించాలని అధికారుల కు సూచించారు. 13న కౌంటింగ్ పూర్తయ్యే వ రకు డ్రైడే అమలులో ఉంటుందన్నారు. -
రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ పార్టీ జిల్లా అధ్యక్షు డు జీవన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కా ర్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మా ట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఆందోళన క లిగించేలా, తెలంగాణ సమాజాన్ని గాయపరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని, తెలంగాణ జాతిపిత కేసీఆరేనని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రస్థాయి పోలీస్ ఉన్నతాధికారులు కొందరు విపక్ష నేతలను హింసిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ ఉన్నతాధికారి సజ్జనార్ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి పూచీ నాది
నిజామాబాద్ రూరల్: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పూచీ తనదేనని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మవీధి చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ప్రజలకు అండగా ఉన్నారని, ఏది అవసరమున్నా అది తెచ్చిచ్చే బాధ్యత తనదేనని, కాంగ్రెస్ను గెలి పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో అర్హులందరికీ కార్డులు ఇచ్చామన్నారు. జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రూ.60కోట్ల నిధులు ఇచ్చామని గుర్తుచేశారు. అలా గే టెంపుల్ కారిడార్ రోడ్లకు రూ.650 కోట్లు మంజూరు చేశామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు బీజేపీ నాయకులు, ఎంపీ అర్వింద్ దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ సిటీ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లడిగే అర్వింద్కు పని చేసే ముఖం ఉందా అని విమర్శించారు. పనిచేసే వారిని గెలిపించుకోవాలన్నారు. దేశ ప్రధాని మోదీ గొప్ప లు చెప్పే గుజరాత్ రాష్ట్రంలో లో సన్న బియ్యం ఇవ్వడం లేదన్నారు. అద్దాలు పెట్టుకొని చేతులూపి తే రాజకీయం కాదని, తిడితే రాజకీయ నాయకుడా అని ఎద్దేవా చేశారు. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ , ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నాయకులు కవితారెడ్డి, రాంభూపాల్, రాము, ప్రమోద్గౌడ్, లవంగం ప్రమోద్, అంతిరెడ్డి స్వేతవిజయ్పాల్రెడ్డి, సకినాల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీఎం అండగా ఉన్నారు.. ఏ అవసరమున్నా తెచ్చే బాధ్యత నాదే.. రూ.60 కోట్ల నిధులు ఇచ్చాం టెంపుల్ కారిడార్ రోడ్లకు రూ.650 కోట్లు మంజూరు చేశాం దేవుడి పేరు చెప్పి ఓట్లడిగే అర్వింద్కు పని చేసే ముఖం ఉందా.. టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ -
తెలుగులో లింగరాజుకు డాక్టరేట్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాల యంలోని తెలుగు అధ్యయన శాఖలో పరిశో ధక విద్యార్థి బి.లింగరాజు డాక్టరేట్ సాధించా రు. ఆచార్య త్రివేణి పర్యవేక్షణలో ‘శ్రీకృష్ణదేవ రాయాంధ్ర భాషానిలయం –సాహిత్య సేవ’ అనే అంశంపై లింగరాజు పరిశోధన పూర్తిచేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. శనివారం తెయూ ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాలలో నిర్వహించిన మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖా ధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ వ్యవహరించారు. పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ డీన్ ఆచార్య కరిమిండ్ల లావణ్య, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య పి.కనకయ్య, పాఠ్యప్రణాళిక సంఘ చైర్మన్ డా.సీహెచ్ లక్ష్మణ చక్రవర్తి,కంట్రోలర్ సంపత్ కుమార్, ప్రిన్సిపల్ జి. రాంబాబు, హాస్టల్స్ చీఫ్ వార్డెన్ కే రవీందర్ రె డ్డితోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ 3, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ 9వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు శనివారం 78 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,977 మంది విద్యార్థులకు 1,899 మంది హాజరుకాగా, 78 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. కేంద్రాలను కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్కుమార్, వర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.రాంబాబు తనిఖీ చేశారు. ● టీచర్లకు స్వల్పగాయాలు ఇందల్వాయి: జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆర్మూర్కు చెందిన ఉపాధ్యాయులు గాంధారి మండలంలో విధులు నిర్వర్తిస్తున్నారు. విధులు ముగించుకొని తిరిగి ఆర్మూర్ వైపు కారులో వెళ్తుండగా చంద్రాయన్పల్లి గ్రామశివారులో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ధనలక్ష్మి, మహేశ్, రాజేశ్, శ్రీధర్ అనే ఉపాధ్యాయులకు స్వల్పగాయాలు కాగా, కారు ధ్వంసమైంది. -
36 వార్డులు గెలిపిస్తే రూ.కోటి నజరానా
● రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆర్మూర్: పట్టణంలోని 36 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే తన శాఖ తరఫున రూ.కోటి నజరానా ఇస్తానని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. పట్టణంలో శనివారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 17వ వార్డులో చైర్పర్సన్ ఆశావహురాలు ఏబీ శ్రీదేవి (చిన్న)తోపాటు పెర్కిట్ చౌరస్తా, గోల్బంగ్లా, కాశీ హనుమాన్ దేవాలయం సమీపంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు, రేషన్లో సన్నబియ్యం, కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని దుస్థితిని గుర్తు చేశారు. 34వ వార్డులో సుదర్శన్రెడ్డి... పట్టణంలోని 34వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్మె నవీన్ను గెలిపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి శనివారం రాత్రి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో సైతం ఆయన ప్రచారం కొనసాగింది. వారి వెంట టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ (చిన్న), ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి, పట్టణ, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
● కార్యదర్శి వేధింపులే కారణమని మృతుడి భార్య ఫిర్యాదు ● కేసు నమోదు చేసిన పోలీసులు బోధన్టౌన్(బోధన్): గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ నీరడి బాబు(38) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోధన్ మండలం పెంటాఖుర్దు గ్రామంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన నీరడి బాబు పెంటాఖుర్దు గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5న ఉదయం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా గమనించిన కుటుంబసభ్యులు బోధన్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పంచాయతీ కార్యదర్శి వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని బాబు భార్య నీరడి కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామంలో ఇంటి పన్ను వసూలు చేసినప్పటికీ లెక్కల్లో తేడాలున్నాయని అందరిముందు అవమానించాడని, దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మద్యానికి బానిసై ఒకరు ..బాన్సువాడ: పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసై శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. సంగమేశ్వర కాలనీకి చెందిన టాక్ సందీప్(24) మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవించే వాడు. రోజూ మద్యం తాగి ఇంట్లో అనవసరంగా గొడవ పడేవాడు. శుక్రవారం ఇంట్లో ఊరేసుకునేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు సముదాయించారు. శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ మరొకరు.. బీబీపేట: అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించిన ఒకరు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. సీతారాంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర గోపాల్ (35) అప్పులు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తితో ఈ నెల 5న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారకస్థితిలో ఉన్న గోపాల్ను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పార్కింగ్ స్థలంగా క్రీడా ప్రాంగణం
మీరు చూస్తున్నది పార్కింగ్ స్థలం అనుకుంటే పొరపాటే అవుతుంది. నవీపేట మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, విద్యార్థులను ఆటల వైపు మళ్లించి వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా చేయాలన్న సంకల్పంతో గత ప్రభుత్వం ప్రతీ పంచాయతీ, ఆవాస ప్రాంతాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసింది. అధికారుల నిర్లక్ష్యంతో అవి ప్రస్తుతం అక్కరకు రాకుండా పోతున్నాయి. క్రీడా ప్రాంగణాలు అనుకూలంగా లేక యువత ఇబ్బందులు పడుతున్నారు. అనువుగాని చోట ఆటలాడుతూ దెబ్బలు తగిలించుకుంటున్నారు. – రెంజల్ -
ఆర్టీసీ ప్రహరీ పనులు ఆపండి
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి వెళ్లే రోడ్డు వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు మూడు వారాలు స్టే విధించినట్లు స్థానికు లు విజయ్ అగర్వాల్ శనివారం తెలిపారు. పట్టణంలోని ఐబీ గెస్ట్హౌస్ను ఆనుకొని ఉన్న 401/66 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో 1983– 84లో ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే 105 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. నాటి నుంచి సుమారు వందకు పైగా కుటుంబాలు ఇళ్లు క ట్టుకొని నివాసముంటున్నాయి.ఈ స్థలానికి ప్లాన్లో రోడ్డును సూచించినప్పటికీ ఆ రోడ్డు ఆర్టీసీకి చెందినది కావడంతో నాటి నుంచి వివాదం తలెత్తుతూనే ఉంది. తాజాగా ఆర్టీసీ యాజమాన్యం తమ స్థలాల సంరక్షణలో భాగంగా ప్రహరీ నిర్మిస్తుంటే కాలనీవాసులు అడ్డుకున్నారు. రోడ్డు కోసం 20 ఫీట్ల స్థలాన్ని వదిలేసి ప్రహరీ నిర్మించుకోవాలని ఆర్టీసీ అధికారులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులకు కాలనీవాసులు విన్నవించారు. సమస్య జఠిలం కావడంతో అధికారులు కొద్దిరోజులు నిర్మాణ పనులను నిలిపివేశారు. రోడ్డుకు స్థలం వదలడానికి మొదట అంగీకరించిన ఆర్టీసీ అధికారులు, ఈ మధ్య మళ్లీ నిర్మాణ పనులు చేపట్టాలని సామగ్రిని తరలించారు. దీంతో కాలనీవాసులు విజయ్ అగర్వాల్ సహకారంతో హైకోర్టులో కొద్దిరోజుల క్రితం కేసు వేశారు. శుక్రవారం కేసు బెంచ్పైకి రావడంతో వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి మూడు వారాలు స్టే విధించారు. ఎలాంటి నిర్మాణా లు జరపకుండా మూడు వారాలపాటు యథాతదంగా ఉంచాలని, కాలనీవాసుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్, ఆర్టీసీ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు స్టే కాపీ చేతికి అందేలోపే ప్రహరీని నిర్మించాలని శనివారం సన్నద్ధమయ్యారు. బందోబస్తు కోసం పోలీసు అధికారులను సంప్రదించారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు హుటాహుటిన హైదరాబాద్ నుంచి స్టే కాపీ తీసుకొచ్చి ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్కు అందజేశారు. దీంతో ప్రహరీ నిర్మాణ పనులను అధికారులు విరమించుకున్నారు. పనులు ఆగిపోవడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ కాలనీలో పేదలకు కేటాయించిన ఇళ్లకు రోడ్డు లేక ఇక్కట్లు పడుతున్నారు. వారి సౌకర్యార్థం రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. కానీ, అధికార పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో రాజకీయాలు చేస్తూ కాలనీవాసులను ఇబ్బంది పెడుతున్నారు. కాలనీకి రోడ్డును సాఽధించే వరకు పోరాటం చేస్తాం. – విజయ్ అగర్వాల్, స్థానికుడు, ఆర్మూర్ ఆర్టీసీ డిపోకు చెందిన స్థలం నుంచే ప్రస్తుతం ప్రజలు నడుస్తున్న జీవన్రెడ్డి మార్గ్ను నిర్మించారు. ఎన్టీఆర్ కాలనీలో సుమారు 100 మంది ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. మానవతా దృక్పథంతో ఆర్టీసీ అధికారులు ఆలోచించి రోడ్డు నిర్మాణానికి సహకరించాలి. – జాడె శ్రీనివాస్, ఎన్టీఆర్ కాలనీ, ఆర్మూర్ స్టే విధించిన హైకోర్టు ఆర్మూర్ డీఎంకు ప్రతిని అందజేసిన కాలనీవాసులు రోడ్డు కోసం ఎన్టీఆర్ కాలనీ ప్రజల పోరాటం -
బాల సాహిత్యానికి పెద్దపీట
మోర్తాడ్(బాల్కొండ): పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టే వయస్సులోనే కవితలు, కథలు, పద్యాలు, పాటలు రాసే విద్యార్థులను ప్రోత్సహించి భావి కవులుగా, రచయితలుగా తీర్చిదిద్దడానికి బాల సాహిత్య కార్యశాలలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ఆదివారం కార్యశాల ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా బాలసాహిత్య కార్యశాలల ఏర్పాటు చేసేందుకు వేసిన కమిటీలో జిల్లా నుంచి డాక్టర్ కాసర్ల నరేశ్రావు, దేశ్ముఖ్ ప్రవీణ్శర్మలకు చోటు లభించింది. బాల సాహిత్య కార్యశాలలను ఏర్పాటు చేస్తే బాల సాహిత్యాన్ని విస్తృతం చేయొచ్చనే భావనతో తెలంగాణ సారస్వత పరిషత్ అడుగులు ముందుకు వేస్తోంది. బాలసాహిత్యంలో ఇప్పటికే జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు రాణిస్తున్నారు. శతక పద్యాలు, కవితలు, కథలు రాసి సాహిత్యలోకంలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. బాల సాహిత్యానికి ప్రత్యేక స్థానం ఉండటంతో బాల కవులు, రచయితలను భావి కవులుగా, రచయితలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తెలంగాణ సారస్వత పరిషత్తు అప్పుడప్పుడు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సాహితీ అభిమానులు కూడా బాల సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు తమవంతు సహకారం అందిస్తున్నారు. జిల్లాలోని బాల సాహితీవేత్తల్లో ఇద్దరిని ఆదివారం నాటి కార్యక్రమం కోసం సారస్వత పరిషత్తు ప్రతినిధులు ఆహ్వానించారు. వారి ఆధ్వర్యంలో త్వరలోనే జిల్లాలో బాల సాహిత్య కార్యశాలల విస్తరణ జరగనుంది. బాలకవులు, రచయితలను ఒక చోట సమావేశపరిచి వారికి కొన్ని అంశాలను ఇచ్చి కవితలు, పద్యాలు, రచనలకు ప్రతిరూపం కల్పించడానికి ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. బాల సాహిత్య కార్యాశాలల ఏర్పాటు ఆహ్వానించదగిన పరిణామమని సాహితీవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కార్యశాలల ఏర్పాటుకు సన్నాహాలు నేడు రాజధానిలో అంకురార్పణ దశల వారీగా జిల్లా, డివిజన్ల స్థాయిలో వర్క్షాప్ల విస్తరణ జిల్లా నుంచి ఇద్దరు సాహితీవేత్తలకు రాష్ట్ర కమిటీలో చోటు మంచి ప్రయత్నం భావితరాల కోసం బాల సా హిత్యాన్ని ప్రోత్సహించేందు కు తెలంగాణ సారస్వత పరిషత్తు చేస్తున్న ప్రయత్నం ఎంతో మంచింది. తెలుగు సాహిత్యంలో బాల సాహిత్యానికి ప్రాధాన్యత ఉంది. బాలకవులు, రచయితల కలాల నుంచి జాలువారే అక్షరమాలిక కోసం ఇలాంటి కృషి అవసరం. – దేశ్ముఖ్ ప్రవీణ్శర్మ, బాల సాహితీవేత్త, శెట్పల్లిశుభపరిణామం బాల కవులు, రచయితలను ప్రోత్సహించేందుకు బాల సాహిత్య కార్యశాలలను ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇలాంటి కార్యశాలల వల్ల బాల సాహిత్యానికి పెద్దపీట వేసినట్లు అవుతుంది. భావి కవులు, రచయితలకు ఇది మంచి అవకాశం. – డాక్టర్ కాసర్ల నరేశ్రావు, బాల సాహితీవేత్త, నిజామాబాద్ -
కోటగిరి పాలిటెక్నిక్లో సృజనా టెక్ ఫెస్ట్
రుద్రూర్: కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం ‘సృజనా టెక్ ఫెస్ట్–2026’ను శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లాలోని నవీపేట, నందిపేట, కోటగిరి, నిజామాబాద్ పాలిటెక్నిక్లకు చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులు హాజరయ్యారు. వివిధ సాంకేతిక ప్రదర్శనలు, నమూనాలతో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. పోటీలకు బాసర ట్రిపుల్ఐటీ మెకానికల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహేశ్, ట్రాన్స్కో ఏఈ బుజ్జిబాబు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కోటగిరి పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రథమ బహుమతి గెలుపొందగా, ప్రిన్సిపల్ సుధాకర్ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ పి.సోంప్రసాద్, గైడ్ శ్రీధర్, అధ్యాపకులు రమేశ్ నాయుడు, రజిని తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
జక్రాన్పల్లి: మునిపల్లి గ్రామ శివారులో టాటా సుమో, బైక్ను ఢీకొనడంతో మంత్రి శ్రీనివాస్గౌడ్ (41) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబా ద్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన శ్రీనివాస్గౌడ్ తొర్లికొండలోని బంధువుల ఇంటికి శుక్రవారం పండుగ నిమిత్తం వచ్చి బైక్పై తిరిగి వెళ్తున్నాడు. మునిపల్లి శివారులోని జాతీయ రహదారిపై టాటా సుమో ఎదురుగా వచ్చి ఢీకొనడంతో శ్రీనివాస్ గౌడ్కు తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం శ్రీనివాస్గౌడ్ మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య మంత్రి సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్లీడర్ టు మున్సిపల్ చైర్మన్
బోధన్: పట్టణంలోని గంజ్ ప్రాంతానికి చెందిన మహ్మ ద్ గౌసొద్దీన్ న్యాయవాద వృత్తి నుంచి మున్సిపల్ చైర్మన్గా ఎదిగారు. 2005 నుంచి 2010 వరకు మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. గౌసొద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా 16 వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో మొత్తం 35 వార్డులు ఉండగా, 18 వార్డుల్లో కాంగ్రెస్, ఏడు వార్డుల్లో టీడీపీ, ఐదు వార్డుల్లో ఎంఐఎం, రెండు టీఆర్ఎస్, ఒకటి బీజేపీ, రెండు వార్డుల్లో స్వతంత్రులు ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు మెజారిటీ ఉండటంతో చైర్మన్గా మహ్మద్ గౌసొద్దీన్, మరో న్యా యవాది మాసుల్ సాయిలు ను వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పొ ద్దుటూరి సుదర్శన్ రెడ్డి అప్ప ట్లో రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రిగా ఉండగా, ఆయన సహకారంతో గౌసొద్దీన్ పట్టణంలో కీలకమైన అభివృద్ధి పనులు చేపట్టారు. పట్టణ ప్రజల తాగునీటి స మస్య నివారణకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.20 కోట్ల 13 లక్షలతో పైప్లైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారు. రూ.6 కోట్ల 25 లక్షలతో సీసీ రో డ్లు, డ్రెయినేజీ లు, కల్వర్టుల నిర్మాణ పనులు పూర్తి చేశారు. రూ.కోటీ 90 లక్షలతో ఇంటింటా చెత్త సేకరణకు 10 ఆటోలు, 6 ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. పాండుఫారం శివారులో రూ.35 లక్షలతో డంపింగ్ యార్డు కోసం 22 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పటికీ ఆ డంపింగ్ యార్డు ఉపయోగంలో ఉంది. ప్రస్తుతం బోధన్లో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2005 నుంచి 2010 వరకు సేవలందించిన గౌసొద్దీన్ ప్రస్తుతం అడిషనల్ పీపీగా విధులు -
భీమ్గల్.. దంగల్
● బల్దియా చైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందోననే ఆసక్తి ● అన్ని పార్టీల హేమాహేమీలది ఒకే నియోజకవర్గం మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. అభ్యర్థులు ప్రతి ఇళ్లు తడుతూ, వాడవాడలా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే, అందరి చూపు భీమ్గల్ పురపాలకంపై పడింది. బల్దియాపై ఏ జెండా ఎగురుతుందోననే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన హేమాహేమీ నాయకులు ఇక్కడి వారే కావడంతో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. 12 వార్డులు ఉన్న ఈ ము న్సిపాలిటీ పరిధిలో 14,057 మంది ఓటర్లు ఉన్నా రు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్గౌడ్ది భీమ్గల్ మండలంలోని రహత్నగర్. రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర సహకార సంఘాల అసోసియేషన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేశ్ రెడ్డిలు బాల్కొండ నియోజకవర్గానికి చెందినవారే కావడం విశేషం. బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి వేల్పూర్కు చెందినవారు. నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి అర్వింద్ మూలాలు వేల్పూర్లో ఉన్నాయి. కీలక నాయకులు అందరూ బాల్కొండ నియోజకవర్గానికి చెందినవారు కావడంతో భీమ్గల్ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నా యి. ఇప్పటికే కాంగ్రెస్ ని యోజకవర్గ ఇన్చార్జీ ము త్యాల సునీల్రెడ్డి, ముగ్గు రు కార్పొరేషన్ చైర్మన్లు ఆ పార్టీ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం విశేష కృషి చేస్తున్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మల్లికార్జున్రెడ్డి, ఎంపీ అర్వింద్ సూచనల మేరకు ప్రచారం సాగిస్తున్నారు. కాగా, మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న రెండో ఎన్నికల్లో చైర్మన్ పీఠం ఏ పార్టీని వరిస్తుందో చూడాలి. -
లక్షల హెక్టార్లకు నీరందించిన ఘనత కాంగ్రెస్ది
● దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలకు సన్నబియ్యం ● మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కమ్మర్పల్లి(భీమ్గల్): రాష్ట్రంలో లక్షల హెక్టార్లలో సాగుకు నీరందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. భీమ్గల్ పట్టణంలోని సహస్ర కన్వెన్షన్లో ఖనిజాభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, కో ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డితో కలిసి మంత్రి మీడియా తో శనివారం మాట్లాడారు. రెండు సంవత్సరాల ప్ర జాపాలనలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ హ వా కొనసాగుతోందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అ న్ని వర్గాల ప్రజలు ఒకే రకం బియ్యం తినాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నామని, దే శంలోని ప్రజాపంపిణీ వ్యవస్థలో రాష్ట్రం అగ్రగామి గా నిలిచిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రైతుల పండించిన పంటలను, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తర్వాత రైతులు పండిస్తున్న పంటలను లెక్కలతో సహా బీఆర్ఎస్ నాయకులకు వి వరిస్తానన్నారు. భీమ్గల్ అభివృద్ధికి మంత్రిగా వే ముల ప్రశాంత్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్కార్డు ఇవ్వలేదన్నారు. భీమ్గల్ మున్సిపాలిటీకి అధిక ప్రాధా న్యం ఇస్తున్నామని, పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి, నాయకులు సునీల్రెడ్డి, కన్నె సురేందర్ పాల్గొన్నారు. -
వారం రోజుల్లో 97 కేసులు
నిజామాబాద్అర్బన్: జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో 97 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. 97 మందిని కోర్టులో హాజరుపర్చగా రూ.9,40,000 జరిమానా విధించినట్లు వెల్లడించారు. ముగ్గురికి వారం రోజులు జైలు శిక్ష సైతం విధించినట్లు తెలిపారు. నెమలి మృతి మాక్లూర్: మండలంలోని బొంకన్పల్లి, ముల్లంగి(బి) శివారులోని వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో గుట్ట మధ్య శనివారం జాతీయ పక్షి నెమలి మృతిచెందినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు మండల పశువైద్యాధికారి ఉమా సహేర్తో వచ్చి నెమలి కళేబరాన్ని పరిశీలించారు. ఆదివారం పోస్టు మార్టం నిర్వహిస్తామని తెలిపారు. అయితే, పంట పొలాలకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేసిన నీటిని తాగటంతో నెమలి మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. -
బల్దియా బరిలో ఉన్నత విద్యావంతులు
● రాజకీయాల్లో మార్పు రావాలంటూ పోటీకి సిద్ధం ● ఆర్మూర్లో అందరి దృష్టి ఆకర్షిస్తున్న అభ్యర్థులు ఆర్మూర్ : సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకురావాలనే సంకల్పంతో పలువురు విద్యావంతులు ఎన్నికల బరిలోకి దిగారు. ఆర్మూర్ పట్టణంలోని ఆయా వార్డుల నుంచి ఎండీ జనరల్ మెడిసిన్, ఎంబీబీఎస్, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫాం డీ), ఎల్ఎల్బీ, ఎంబీఏ, బీఎడ్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు పోటీలో నిలిచారు. ఉన్నత చదువులు.. వృత్తుల్లో ఉన్నప్పటికీ రాజకీయవారసత్వం, రిజర్వేషన్ కలిసి రావడం తదితర కారణాలు.. ప్రజలకు ఏమైనా చేయాలనే సంకల్పం వారిని రాజకీయాల వైపు మరల్చాయి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా ప్రజా సేవకే అంకితం అవుతామంటున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ● పట్టణంలోని 23వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న గుర్రం అభిలాష్ ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసి హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మోర్తాడ్ మాజీ ఎంపీపీ అయిన తన తండ్రి బొంబాయి నర్సయ్య రాజకీయ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని అభిలాష్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. ● 19వ వార్డుకు చెందిన దియా అగర్వాల్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదివారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ● 36వ వార్డుకు చెందిన దోండి రోమరాయ్ ఎంబీఏ, బీఎడ్, ఎంఏ వంటి ఉన్నత చదువులు చదివి ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్గా, ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించారు. సమాజానికి తన వంతుగా ఎంతో కొంత చేయాలనే సంకల్పంతో రాజకీయాలోకి వచ్చి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ● 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఖాందేశ్ సంగీత భర్త ప్రోత్సాహంతో ఎల్ఎల్బీ పూర్తి చేసి ఆర్మూర్ కోర్టులో న్యాయవాద పని చేస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు కౌన్సిలర్గా గె లుపొందిన సంగీత నాలుగోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ● 16వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బోచ్కర్ సవిత ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారు. -
జోరుగా మొక్కజొన్న సాగు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో వరి తర్వాత మొక్కజొన్న సాగుకే రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్ర భుత్వం ఇస్తున్న మద్దతు ధర కన్నా వ్యాపారులు ఎ క్కువ డబ్బులు ఇస్తుండడంతో విత్తన (సీడ్) మక్క సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రస్తుత యాసంగిలో రైతులు గతేడాదికి (21,482 ఎకరా లు) మించి మొక్కజొన్నను పండిస్తున్నారు. జిల్లా లో 25,202 ఎకరాల్లో మక్క సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. 32,674 ఎక రాల్లో పంటను వేశారు. అంచనా కన్నా 7,472 ఎకరాల విస్తీర్ణం పెరిగింది. సాగవుతున్న మొత్తం విస్తీర్ణంలో సగానికి పైగా సీడ్ మక్కనే ఉండడం గ మనార్హం. ప్రభుత్వం క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2,400 రైతుకు చెల్లిస్తోంది. వ్యాపారులు గ్రామాల్లోకే వచ్చి సీడ్ మక్కను సాగు చేస్తే బుట్టతోనే కొనుగోలు చేసి ఎక్కువ ధరను చెల్లిస్తున్నారు. దీంతో ఆర్మూర్, బాల్కొండ, రూరల్ నియోజకవర్గాల్లో 90శాతం మంది సీడ్ మక్క సాగు చేస్తున్నారు. యాసంగిలో అంచనాకు మించి పెరిగిన విస్తీర్ణం సీడ్ మక్కకే రైతుల అధిక ప్రాధాన్యం మద్దతు ధర కన్నా ఎక్కువ చెల్లిస్తున్న వ్యాపారులు -
నాపై దండయాత్రకు వస్తున్నారు
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ మున్సిపాలిటీ ఎ న్నికల ప్రచారంలో కాంగ్రెస్ అబద్దాలను ఎండగడుతున్నందునే తనపై కాంగ్రెస్ నాయకులు దండయాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎ మ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గత నా లుగైదు రోజులుగా భీమ్గల్లో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏయే పనులను ఆపేిసింది, ప్రజల ను ఎలా మోసం చేసిందో వివరిస్తుంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి, ఎక్కడ ఓడిపోతామో ననే భయంతో కాంగ్రెస్ నాయకులు తనపై మాట ల దాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్గల్ పట్టణంలోని ఆరో వార్డులో శనివారం రాత్రి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ప్రశాంత్రెడ్డి మా ట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని పిలిపించి ప్రెస్మీట్ పెట్టి ‘ప్రశాంత్రెడ్డి భీమ్గల్కు ఏమీ చేయలేదని’ ఆయనతో అబద్దాలు చెప్పించారని అన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి ఆయన వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలకు నిజాలు చెబుతుంటే నన్ను అడ్డుకోవడమే లక్ష్యంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి సునీల్రెడ్డి, ఈరవత్రి అనిల్, మానాల మోహన్రెడ్డి వంటి నాయకులు ప్రభుత్వ కార్లు, పోలీసుల జీపులతో తనపై దండయాత్రకు వస్తున్నారని అన్నారు. ఆరు నెలల క్రితం మంత్రి జూపల్లి కృష్ణారావు భీమ్గల్ వచ్చిన సమయంలో కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం ఏది అని ప్రశ్నించినందుకు తనతోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో దారుణంగా కొట్టించి అక్రమ కేసులు పెట్టారన్నారు. మంత్రి ఉత్తమ్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సిగ్గుచేటు తులం బంగారం అడిగినందుకు లాఠీలతో కొట్టించి, మాపైనే కేసులు పెడతారా? మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మకం
నిజామాబాద్ రూరల్: సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రేషన్కార్డు లబ్దిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇది చరిత్రాత్మక నిర్ణయమని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని దుబ్బ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. రేవంత్రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి పదేళ్లలో ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో మూడు కోట్ల 13 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేల సంఖ్యలో తెల్లరేషన్కార్డులు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నిజామాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకొని ఘర్షణ పరిస్థితులు తెస్తోందని ఘాటుగా విమర్శించారు. వారికి అభివృద్ధి, సంక్షేమం పట్టదన్నారు. ఎంపీ నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని, అలా మాట్లాడటం ఆయన హోదాకు తగదన్నారు. ప్రజల కోసం సీఎం పనిచేస్తున్నారు సీఎం రేవంత్రెడ్డి అహర్నిషలు ప్రజల కోసం పని చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ తన స్థాయి కి మించి మాట్లాడుతున్నారని, ఆయన జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. ఎంపీ ఆటలు నిజామాబాద్ జిల్లాలో సాగవని హెచ్చరించారు. హిందూముస్లింలకు కొట్లాట పెట్టి ఓట్లు దండుకునే రీతిలో ఎంపీ అరవింద్ ఉన్నారని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నాయకురాలు కవితారెడ్డి, రత్నాకర్, ధర్మపురి సంజయ్, జావిద్ అక్రమ్, ఆయా డివిజన్ల అభ్యర్థులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకుపోతోంది బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకుంటోంది కార్నర్ మీటింగ్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
కౌన్సిలర్.. ఎమ్మెల్యే.. మంత్రి
● 1981 మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలిచిన డి సత్యనారాయణ ● 1983, 1985 ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా విజయం ● ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా.. ● ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది శాఖల బాధ్యతలు ● డి సత్యనారాయణ, మాజీ మంత్రిసుభాష్నగర్: రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన డి సత్యనారాయణ కౌన్సిలర్ స్థాయి నుంచి మంత్రి వరకు పని చేశారు. నగరంలోని కు మార్గల్లీకి చెందిన సత్యనారాయణ తండ్రి దుగ్యా ల శివయ్య సొంత లారీకి డ్రైవర్ కాగా తల్లి రాజమల్లమ్మ గృహిణి. విద్యార్థి దశ నుంచే సత్యనారాయణ చురుగ్గా ఉండేవారు. డిగ్రీ చదివే రోజుల్లో గిరిరాజ్ కళాశాల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడి (రెండో)గా వ్యవహరించారు. 1981లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మిర్చి కంపౌండ్ ఏరియా నుంచి కౌన్సిలర్గా విజయం సాధించారు. చైర్మన్ స్థానానికి పోటీపడగా, అధిష్టానం గంగాకిషన్ పేరును ప్రకటించింది. 1983లో ఎన్టీ రామారావు ఆయనను పిలిచి అసెంబ్లీ టికెట్ ఇవ్వగా.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డి శ్రీనివాస్పై 13వేల ఓట్ల మెజార్టీతో సత్యనారాయణ విజయం సాధించారు. అదృష్టం వరించడంతో మంత్రిగా.. ఎమ్మెల్యేగా విజయం సాధించిన మొదటిసారే డి సత్యనారాయణకు మంత్రిగా అదృష్టం వరించింది. ఎన్టీఆర్ కేబినెట్(1984)లో మైన్స్, జియాలజీ మంత్రిగా వ్యవహరించారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తాహెర్ బిన్ హందాన్పై డి సత్యనారాయణ 9,321 ఓట్లతో గెలుపొందారు. అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 శాఖలకు మంత్రిగా వ్యవహరించిన ఏకై క వ్యక్తి డి సత్యనారాయణ. 1989 (టీడీపీ), 1994 (బీజేపీ) ఎన్నికల్లో వరుస ఓటములతో రాజకీయాలకు దూరమయ్యారు.హైదరాబాద్లో సాదాసీదా జీవితం గడుపుతున్న ఆయన జిల్లాకు రైలులోనే వస్తు వెళ్తుంటారు. జిల్లాకు వచ్చినప్పుడు అనుచరులను కలుస్తుంటారు. నిజామాబాద్ శిథిలావస్థకు చేరిన భవనం, హైదరాబాద్లో ఒక ఇల్లు మాత్రమే ఆయన ఆస్తి. మాజీ మంత్రిగా అందుతున్న పింఛన్తోనే కాలం వెళ్లదీస్తున్నారు. పదవులకే వన్నెతెచ్చిన వ్యక్తి..డి సత్యనారాయణ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో బస్టాండ్ల నిర్మాణం జరిగింది. జిల్లాకేంద్రానికి ప్రభుత్వ బాలికల ఐటీఐ, బాలికల పాలిటెక్నిక్ కళాశాలను తీసుకొచ్చారు. బాలికల ప్రభుత్వ పాఠశాలను అప్గ్రేడ్ చేసి కళాశాల, వసతిగృహాన్ని నిర్మించారు. రాజారాం స్టేడియం, పాత కలెక్టరేట్ భవనం, గ్రంథాలయ భవన నిర్మాణం జరిగింది. చంద్రశేఖర్ కాలనీ, పాములబస్తీ, వినాయక్నగర్, 350 క్వార్టర్స్, తదితర ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. జిల్లాలో ఎగ్జిబిషన్ సొసైటీని ఏర్పాటుచేశారు. డబ్బులు మిగిలేవి..అప్పటి రాజకీయాలే వేరు. పోటీ ఉన్నప్పటికీ ఖర్చు మా త్రం అంతంత మాత్రమే. ఎన్నికల్లో పోటీ చేయాలను కుంటే ఇరుగుపొరుగు వారు, స్నేహితులు డబ్బులు పోగు చేసి ఇచ్చేవారు. ఎన్నికలు పూర్తయ్యేసరికి జమ చేసిన డబ్బులు కూడా మిగిలేవి. ప్రస్తుత రాజకీయ నాయకులు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టిసారించాలి. చేసిన పనులే ప్రజాప్రతినిధులను చిరకాలం గుర్తుంచుకునేలా చేస్తాయి. -
ఎలా ఉంటుందో?
నిజామాబాద్ఇందూరు ఫలితం కారులో హుషారు! వాతావరణం ఉదయం ఈదురు గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. రాత్రి పొగమంచు కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగే అవకాశాలున్నాయి. భీమ్గల్.. దంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోగా.. అందరి చూపు భీమ్గల్ పురపాలకంపై పడింది.ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026– 8లో uసాక్షి ప్రతినిధి, కామారెడ్డి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో శనివారం రోడ్షోలు, ర్యాలీలు నిర్వహించారు. ఆయన ప ర్యటన బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ తెచ్చింది. బా న్సువాడ పట్టణం నడిబొడ్డున నిర్వహించిన సభ లో కేటీఆర్ సీఎం రేవంత్రెడ్డి, బాన్సువాడ ఎ మ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డిని టార్గెట్ చేసి మా ట్లాడారు. అప్పట్లో ఇదే గడ్డమీద రేవంత్రెడ్డి పోచారం శ్రీనివాస్రెడ్డిని, ఆయన కొడుకులను దున్నపోతులు, ఆంబోతులు అని సంబోధించిన ఆడియోను వినిపించారు. పోచారం పార్టీ మారడంతో దొంగ చాటు గా ప్రచారం చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ను, బాన్సువాడ ప్రజలను మోసం చేసిన పోచారం శ్రీనివాస్రెడ్డికి గుణపా ఠం చెప్పాలని ప్రజలను కోరారు. కేటీఆర్ ముందుగా బాన్సువాడకు చేరుకున్నారు. పట్టణ శివార్లలోని కొయ్యగుట్ట అమరవీరుల స్తూపం వద్ద నుంచి ర్యాలీగా వచ్చి అంబేడ్కర్ చౌరస్తా వద్ద సభలో మాట్లాడారు. అనంతరం బిచ్కుంద పట్టణంలో రోడ్షో, ర్యాలీ నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణంలోనూ భారీ ర్యాలీ తీశారు. కామారెడ్డి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కేటీఆర్ ప్రచారంనిజామాబాద్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీ ఉంది. మధ్యలో ఎంఐఎం ప్రత్యేకమైన ప్రాంతాల్లో కచ్చితంగా సీట్లను గెలుచుకునే వాతావరణం కనబడుతోంది. 2014లో 50 డివిజన్లకు గాను ఎంఐఎం 16 డివిజన్లు గెలుచుకుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 26. అదేవిధంగా 2020లో జరిగిన ఎన్నికల్లోనూ ఎంఐఎం 60 డివిజన్లకు గాను మళ్లీ 16 డివిజన్లలో గెలిచింది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 31. ఈ రెండుసార్లూ ఎంఐఎం కింగ్మేకర్గా నిలిచింది. వరుసగా రెండు టర్మ్ల్లో డిప్యూటీ మేయర్ సీటును ఎంఐఎం దక్కించుకుంది. అయితే ఈసారి కూడా ఎంఐఎం 16 డివిజన్లు కచ్చితంగా గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఎంఐఎం మరోసారి కింగ్మేకర్ అవుతుందా లేక ఫలితం మారుతుందా అని పలువురు లెక్కలు వేసుకుంటున్నారు. ఎక్స్ అఫీషియో ఓట్లు మరో సారి కీలకం కానున్నాయనే చర్చ జరుగుతోంది. గత రెండు ఎన్నికల్లోనూ ఎక్స్ అఫీషియో ఓట్లు వినియోగించుకోవడమే ఇందుకు కారణం. 2014లో ఎంఐఎం 16 డివిజన్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిస్తే, బీఆర్ఎస్ 10 డివిజన్లకు పరిమితమైంది. అయితే ఎంఐఎం మద్దతుతో బీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకుంది. ఆ సమయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్ ఎక్స్ అఫీషియో ఓట్లను వినియోగించుకున్నారు. అప్పటి ఎంపీ కవిత ఆర్మూర్లో తన ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకున్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో 60 డివిజన్లకు గాను బీజేపీ అత్యధికంగా 28 డివిజన్లు గెలుచుకుంది. ఎంఐఎం 16 చోట్ల, బీఆర్ఎస్ 13 చోట్ల, కాంగ్రెస్ 02 చోట్ల, ఒక డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఆ సమయంలో బీజేపీకి ఒక్క ఎంపీ అర్వింద్ మాత్రమే ఎక్స్ అఫీషియో ఓటరుగా ఉన్నారు. ఈసారి సైతం ఎంఐఎం మద్దతుతో బీఆర్ఎస్ మే యర్ పీఠం దక్కించుకుంది. మేయర్ ఎన్నిక కోసం బీఆర్ఎస్కు చెందిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్గుప్తా, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ ఎమ్మె ల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్లు ఎక్స్ అఫీషియో ఓట్లను వినియోగించుకున్నారు. ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ ఇచ్చారు. తాజా పరిస్థితి చూస్తే బీజేపీకి ఐదుగురు ఎక్స్ అఫీషియోలు ఉన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్ రెడ్డి, పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఉన్నారు. కాంగ్రెస్కు ఇద్దరు ఎక్స్ అఫీషియోలు ఉన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ ఉన్నారు. కాగా బీజేపీ, ఎంఐఎంలు కలిసే అవకాశాలు లేకపోవడంతో బీజేపీ 27 సీట్లు పైగా గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు గెలుచుకున్నప్పటికీ మేయర్ పీఠం చేజిక్కించుకునే అవకాశాలున్నాయి. ఇక బీ ఆర్ఎస్, స్వతంత్రులు సైతం కొన్ని సీట్లు గెలుచుకు నే అవకాశాలు లేకపోలేదు. ఇలా జరిగితే బల్దియా లో సమీకరణలు మరింత రసవత్తరం అవుతాయి. దీంతో మరోసారి నిజామాబాద్లో ఎక్స్ అఫీషియో ఓట్ల లెక్కలతో నంబర్ గేమ్ తప్పదు. ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకమా..? స్వతంత్రులు గెలిచినా ప్రాధాన్యత బీజేపీ, కాంగ్రెస్ల మధ్య పోటాపోటీ ఎంఐఎం కింగ్మేకర్గా నిలిచే అవకాశాలు రాజకీయ, వివిధ వర్గాల్లో ఆసక్తికర చర్చ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో ఎలాంటి ఫలితాలు వస్తాయోననే ఆసక్తికర చర్చ నెలకొంది. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇందూరు ఫలితంపై ఆసక్తి చూపుతున్నారు. కాగా పరిస్థితులు చూస్తుంటే ఇక్కడ మ్యాజిక్ నంబర్ గేమ్ తప్పేలా లేదు. గతంలోనూ ఇక్కడ నంబర్లాటలు చోటుచేసుకున్నాయి. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
బొట్టు పెడుతూ.. బీడీలు చుడుతూ..
● జిల్లాలో వినూత్నంగా మహిళా అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఆర్మూర్: జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులుగా టికెట్లు సాధించిన మహిళలు తమదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తమ వార్డుల పరిధిలోని కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి మరీ తమకు ఓటు వేస్తే తాము చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. మరోవైపు బీడీలు చుడుతున్న మ హిళల వద్దకు వెళ్లి వారితోపాటు బీడీలు చుడుతూ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. బోధన్ మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్ కాగా, నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్తోపాటు ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పీఠాలు జనరల్ మహిళలకే రిజర్వు చేయబడ్డాయి. జిల్లాలోని 146 వార్డుల్లో సుమారు 50 శాతం స్థానాలు వివిధ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకే రిజర్వు చేశారు. మరో వైపు జనరల్ స్థానాల నుంచి సైతం మహిళలు పోటీ చేస్తున్నారు. అలాగే వీధుల్లో నిర్వహిస్తున్న ప్రచారంలో సైతం వివిధ పార్టీల అభ్యర్థుల వెంట ర్యాలీ గా మహిళలే తరలి వస్తుండటంతో మహిళల ప్రచా రం ప్రత్యేకత సంతరించుకుంది. దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మహిళల సందడి నెలకొంది. -
కుటుంబ పెద్ద మరణిస్తే రూ.20 వేలు
మోర్తాడ్(బాల్కొండ): జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్ఎఫ్బీఎస్)పై రెవెన్యూ శాఖ విస్తృత ప్రచారం చేపట్టింది. కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని గతంలోనే ప్రవేశపెట్టింది. అయితే, ఈ పథకం గురించి సరైన ప్రచారం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో లబ్ధిదారుల సంఖ్య పెరగలేదు. కేంద్రం అందించే ఎన్ఎఫ్బీఎస్ కింద లబ్ధి పొందే వారి సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఇటీవల రెవెన్యూ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఎన్ఎఫ్బీఎస్ ద్వారా ఎక్కువ కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు కార్యాచరణ రూపొందించారు. గ్రామ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి తహసీల్ కార్యాలయంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రెండు, మూడు రోజులకోసారి తహసీల్దార్లు పంచాయతీరాజ్, రెవెన్యూ ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అవసరమైన పత్రాలివే.. మరణించిన వ్యక్తి వయస్సు 18 సంవత్సరాల వయస్సు నిండి 60 ఏళ్ల లోపు ఉండాలి. 2017 తర్వాత మరణించిన కుటుంబ సంపాదనపరుని ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికెట్, పాస్పోర్టు సైజ్ ఫొటోలు. అలాగే లబ్ధిదారుని రేషన్కార్డు, ఫ్యామిలీ మెంబర్ కార్డు, ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు పాస్బుక్ జిరాక్సులను అందజేయాల్సి ఉంటుంది. ఎన్ఎఫ్బీఎస్పై విస్తృత ప్రచారం ఇన్నాళ్లూ అవగాహన లేక లబ్ధి పొందని కుటుంబాలు లబ్ధిదారుల సంఖ్య పెంచేలా కార్యాచరణ -
క్రైం కార్నర్
బోధన్రూరల్: సాలూర మండలంలోని కుమ్మన్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. కుమ్మన్పల్లి గ్రామానికి చెందిన ఊషం లక్ష్మన్ (40) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అలాగే మద్యానికి బానిస కావడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈనెల 5న ఇంటి ముందు గల చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా శుక్రవారం మృతుడి భార్య మల్లుబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పిట్లంలో వ్యక్తి దారుణ హత్య పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో ఓ వ్యక్తి హత్యకు గురవ్వడం కలకలం రేపింది. జాతీ య రహదారి సర్వీస్ రోడ్డు పక్కన నిర్మాణంలో ఉన్న ఇంట్లో శుక్రవారం ఉదయం ఓ వ్య క్తి రక్తపు మడుగులో విగతజీవిగా ఉండటాన్ని స్థానికులు గుర్తించి, ఇంటి యజమానికి, పో లీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు అదే ఇంట్లో పని చేసే యూపీకి చెందిన రాజేష్ (46)గా గుర్తించారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ తిరుపయ్య, ఎస్సై వెంకట్రావ్ తెలిపారు. -
నేలకొరిగిన విప్లవ శిఖరం!
ఉమ్మడి జిల్లా విప్లవోద్యమ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విప్లవ శిఖరం నేలకొరిగింది. మూడున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉండి పీడిత ప్రజల కోసం నడిచిన స్వామి అలియాస్ లోకేటి చందర్ శకం శుక్రవారంతో ముగిసింది. మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మరణించాడు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్ మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్వార్ నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. కొద్దికాలానికే పూర్తి స్థాయి కార్యకర్తగా మా రాడు. పార్టీలో స్వామి పేరుతో పనిచేశాడు. ఉద్యమంలో చేరిననాటినుంచి వెనుదిరిగి చూడలేదు. కుటుంబమంతా ఉద్యమ బాటలో.. స్వామి కామారెడ్డి ఏరియాతో పాటు సిర్నాపల్లి, ఎల్లారెడ్డి ఏరియాల్లో దళ కమాండర్గా పనిచేశాడు. జిల్లా కమిటీ సభ్యుడి హోదాలో చాలా కాలం పనిచేసిన స్వామి కార్యదర్శిగా ఎదిగారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించడంతో లొంగుబాట్లు, అరెస్టులతో పాటు ఎన్కౌంటర్లు జరిగాయి. ఎంతో మంది సానుభూతిపరులు, నక్సలైట్లు చనిపోయారు. దీంతో అప్పటి పీపుల్స్వార్ నేతలు స్వామిని దండకారణ్యానికి పంపించారు. కొద్ది కాలానికే స్వామి భార్య సులోచన కూడా అడవి బాట పట్టింది. నవత పేరుతో దండకారణ్యంలో పనిచేసింది. వారి పిల్లలు రమేశ్, లావణ్యలు బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నారు. అయితే 2005 లో లావణ్య, రమేశ్లు కూడా అడవిబాట పట్టారు. ఎనిమిదేళ్ల క్రితం స్వామి భార్య సులోచన అనారోగ్యంతో అక్కడే చనిపోగా విప్లవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. స్వామి కూతురు లావణ్య ఆరు నెలల క్రితం చత్తీస్గఢ్లో అరైస్టె జైలులో ఉండగా.. కుమారుడు రమేశ్ డిసెంబర్ 2న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్వామి ప్రస్తుతం ప్రభాకర్ పేరుతో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా అలాగే వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రెటరీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆయనపై రూ. 25 లక్షల రివార్డ్ ఉంది. అంతటా స్వామి గురించే చర్చ ప్రభాకర్ పేరుతో పనిచేస్తున్న స్వామి అలియాస్ లోకేటి చందర్ ఎన్కౌంటర్లో చనిపోయిన వార్త శుక్రవారం రాత్రి ప్రసార ధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమైంది. ఉమ్మడి జిల్లా విప్లవోద్యమం గురించి అవగాహన ఉన్నవా రు చాలా మంది ఆయన గురించి చర్చించుకోసాగా రు. మూడున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన ఆపరేషన్ కగార్తో ఏర్పడిన తీవ్ర నిర్బంధంతో లొంగిపోతాడని అందరూ భావించారు. ఆ యన వెనకడుగు వేయకుండా చివరి వరకు విప్లవోద్యమానికి అంకితమయ్యాడని ప్రజలు చర్చించుకుంటున్నారు. మూడున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో స్వామి విప్లవోద్యమంలోనే కన్నుమూసిన భార్య ఇటీవల లొంగిపోయిన కొడుకు.. జైలులో కూతురు -
బీఆర్ఎస్ ఒక్క తెల్లరేషన్కార్డు ఇవ్వలేదు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క నిరుపేద కుటుంబానికి తెల్లరేషన్కార్డు ఇచ్చిన పాపన పోలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. పాత డిజైన్ ప్రకారమే 21–ఏ ప్యాకేజీ పనుల కింద మంచిప్ప ప్రాజెక్టు నిర్మించి 2లక్షల ఎకరాల ఆయకట్టు రైతులకు నీరందిస్తామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నమన్నారు. అర్హులైన వారందరూ తెల్ల రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
వ్యవసాయ రంగంలో జిల్లా ముందంజ
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిజామాబాద్ జిల్లా వ్యవసాయ రంగంలో ముందంజలో ఉందని వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలలను మంజూరు చేయగా అందులో ఒకటి నిజామాబాద్ జిల్లాకు దక్కిందన్నారు. అధికంగా వరి పంట పండించిన జిల్లాగా నిజామాబాద్ నిలుస్తుందన్నారు. పామాయిల్ సాగులో దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి జిల్లాకు ఆయిల్ఫామ్ సాగుచేసే రైతులకు అండగా ఉంటామన్నారు. -
ప్రజా సంక్షేమానికి బంగారు బాటలు
ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి బంగారు బా టవేస్తుందని ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. భీమ్గల్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు రూ. 25 కోట్లు, రోడ్లకు రూ.12 కోట్లు, అదే విధంగా ఇందిరమ్మ ఇళ్లకు నిధులు మంజూరు చేశామన్నారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతను ఇస్తు కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం జిల్లాకు పామాయిల్ ఫ్యా క్టరీ మంజూరు చేయాలని సీఎంను కోరారు. -
రాష్ట్రస్థాయి సబ్జూనియర్ వాలీబాల్ పోటీలు ప్రారంభం
కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో శుక్రవారం రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల విభాగంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను సర్పంచ్ హారిక జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జల రమేష్, ప్రధాన కార్యదర్శి ఎన్.వీ హన్మంత్రెడ్డి, ఎంపీడీఓ రాజశ్రీనివాస్, తహసీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సభ సక్సెస్
● జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు నిజామాబాద్ రూరల్: రూరల్ నియోజకవర్గం పరిధిలోని కేశాపూర్ శివారులో శుక్రవారం నిర్వహించిన సీఎం సభ (ప్రజాపాలన–ప్రగతిబాట కార్యక్రమం) విజయవంతంగా ముగిసింది. సభకు జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు భా రీగా తరలివచ్చారు. అధికారులు ఏర్పాట్లను పక డ్బందీగా చేపట్టగా, పోలీసులు పట్టిష్ట బందోబస్తు నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సభాధ్యక్షుడిగా వ్యవహరించగా కార్యక్రమంలో సీఎంతోపాటు పీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్ర సంగించారు. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర సహకార చైర్మన్ మానాల మోహన్రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్హందాన్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మా జీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి, ఆ ర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, పీసీసీ డెలిగెట్ బాడ్సి శేఖర్గౌడ్, గడ్కో ల్ భాస్కర్రెడ్డి, బోర్గాం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మోపాల్: మండలంలోని మంచిప్ప గ్రామంలో శుక్రవారం నిజామాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ –15 బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీల్లో 60 మంది క్రీడాకారులు పాల్గొనగా, వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన బాలబాలికలను ఎంపిక చేసినట్లు పీఈటీ దేవేందర్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. సదరు క్రీడాకారులను జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం అభినందించారు. ఎంపికై న క్రీడాకారులు: అనన్య (33 కేజీలు), ప్రణతి (36 కేజీలు), వైశాలి (39 కేజీలు), సృజన (42 కేజీలు), మహేక్ (46 కేజీలు), సాయినాథ్ (38 కేజీలు), విఘ్నేష్ (41 కేజీలు), అమన్ (44 కేజీలు), మహేందర్ (48 కేజీలు), అంశిని (60 కేజీలు), సాయి సుశాంత్ (62 కేజీలు), అరవింద్ (49 కేజీలు), ఆదిత్య (85 కేజీలు). కామారెడ్డి జిల్లా నుంచి.. కావేరి (36 కేజీలు), స్వాతి (42 కేజీలు), లహరిక (54 కేజీలు), జయశ్రీ (58 కేజీలు), ఆనంద్ (58 కేజీలు). తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్లో కొనసాగుతున్న పీజీ ఇంటిగ్రేటెడ్ (ఐదు సంవత్సరాల) 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 43 మంది విద్యార్థులకు గాను 42 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు. డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలంలో అన్నారం, సిర్పూర్, గాదేపల్లి, జీజీ నడ్కుడ, చిన్నయానం, మారంపల్లి, నికాల్పూర్, డొంకేశ్వర్ గ్రామాలకు గోదావరి నది ఆనుకుని ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తగ్గిపోవడంతో ఆయా గ్రామాల్లో ముంపు భూములు బయటపడుతున్నాయి. దీంతో రైతులు వారి భూముల్లో వరినాట్లు వేస్తున్నారు. శుక్రవారం డొంకేశ్వర్లో ఓ రైతు సదరు భూమిలో కూలీలతో నాట్లు వేస్తుండగా, సాక్షి క్లిక్ మనిపించింది. మే, జూన్ నెలల్లో పంట చేతికి అందుతుంది. ఒకవేళ వర్షాలు కురిస్తే భూములన్ని మళ్లీ మునిగిపోతాయని రైతులు పేర్కొంటున్నారు అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యం మాక్లూర్: అవినీతి రహిత పాలన అందించటం బీజేపీతోనే సాధ్యమవుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని 2వ డివిజన్ పరిధిలోగల మాణిక్భండార్లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి కొమ్ము కాస్తు ఇతర వర్గాల ప్రజలను విస్మరిస్తుందన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 2వ డివిజన్ అభ్యర్థి మారంపలి మోహన్ను బలపరచి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటర్లు కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. పార్టీ అభ్యర్థి మారంపల్లి మోహన్, నాయకులు మదారి మమత, శివలాల్, రమేష్నాయక్, రాజు, అనీల్కుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప రిజర్వాయర్ నిర్మించాలి
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మంచిప్ప రిజర్వేయర్ను పాత డిజైన్ ప్రకారమే నిర్మించాలని, తద్వారా ప్యాకేజీ–21 కింద 2వేల ఎకరాలకు నీరు అందుతుందని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి సీఎం దృష్టికి తీసుకవచ్చారు. అలాగే రూరల్ నియోజకవర్గంలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గుండారం శివారు ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ జోన్గా ప్రకటించాలని సీఎంను కోరారు. అదేవిధంగా జక్రాన్పల్లి ఎయిర్పోర్టును పున:పరిశీలించాలని, ఎయిర్పోర్టు నిర్మిస్తే ఇక్కడ పండే పసుపు, జొన్న ఇతర పంటలకు ఎగుమతి, దిగుమతులకు సులువుగా ఉంటుందన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఫార్మసిస్ట్ కాలేజీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు ప్రారంభించాలని కోరారు. జిల్లాను స్మార్ట్సిటీగా ప్రకటించాలని, ఆర్టీసీ బస్టాండ్, స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణాలకు భూములు, నిధులు కేటాయించాలన్నారు. రామడుగు ప్రాజెక్టు, టెంపుల్ కారిడార్ కింద రోడ్డు నిర్మాణాలు చేపట్టాలన్నారు. -
మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్
● 1931లో నిజామాబాద్ మున్సిపల్గా ఏర్పాటు ● 2005లో కార్పొరేషన్గా రూపాంతరంసుభాష్నగర్: 1905లో జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలో ఇందూరుగా పేరున్న జిల్లాను నిజామాబాద్గా నామకరణం చేశారు. 1931వ సంవత్సరంలో నిజామాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడింది. స్వాతంత్య్రం రాక ముందు నిజాం పాలనలో మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారులు ఉండేవారు. ఎన్నికలు జరగకుండా నామినేటెడ్గా చైర్మన్లను నిజాం నవాబులే నియమించేవారని కొందరు పేర్కొంటున్నారు. 1987 సంవత్సరంలో నిజామాబాద్ను స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మార్చారు. తొలుత 36 వార్డులు ఉన్నాయి. 2005లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. సమీప గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేశారు. కార్పొరేషన్ను జనాభా ప్రాతిపదికగా 50 డివిజన్లుగా విభజించారు. 2019లో నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేసి, 60 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. 2017లో నిజామాబాద్తోపాటు మరో నాలుగు నియోజకవర్గాల్లోని గ్రామాలను కలిపి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా)గా ఏర్పాటైంది. 2023లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలోని 325కు పైగా గ్రామాలను నుడాలో కలుపుతూ ప్రత్యేక జీవో ఇచ్చింది. కాగా, నిజామాబాద్ మున్సిపాలిటీ, కార్పొరేషన్లో కొన్నేళ్లపాటు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఆయా ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారులను నియమించింది. కార్పొరేషన్ మేయర్లు -
దరఖాస్తు గడువు పొడిగింపు
ఖలీల్వాడి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువత ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు తేదీని ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ఎస్సీ సంక్షేమశాఖ డీడీ రాజగంగారాం, స్టడీ సర్కిల్ డైరెక్టర్ సోమశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో గ్రూప్–1, 2, 3, 4తోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు అభ్యర్థులకు ఉచిత వసతితోపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9951199460, 9490511953 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి ● వీసీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా, ప్రశాంత వాతావరణంలో పా రదర్శకంగా నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమి షనర్ రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్ నుండి మున్సిపల్ ఎన్నికలపై శుక్రవారం ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జి ల్లాల జనరల్ అబ్జర్వర్లు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అక్రమ మద్యం, డబ్బు, ప్రలోభాలకు గురి చేసే సామగ్రిపై ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నిజామాబాద్తోపాటు ఇంచార్జి జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కామారెడ్డి జిల్లాలో కూడా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కమిషనర్ దృష్టికి తెచ్చారు. వీసీ అనంతరం నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్, ఫెసిలిటేషన్ సెంటర్ను నిశితంగా పరిశీలించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఎంపీ అర్వింద్ జిల్లాకు చేసిందేమీ లేదు.. ● టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ నిజామాబాద్ రూరల్: జిల్లాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో మంది పెద్దలు సేవలందించారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ సభలో ఆయన మాట్లాడారు. అర్గుల్ రాజారాం నుంచి డి.శ్రీనివాస్ వరకు జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 1959లో ఏర్పడిన కరీంనగర్ మున్సిపాలిటీని స్మార్ట్సిటీగా ప్రకటించిందని, అంతకంటే ముందు ఏర్పడిన 1931 ఏర్పడిన నిజామాబాద్ మున్సిపాలిటీని ఎందుకు స్మార్ట్సిటీగా ప్రకటించలేదని ఎంపీ అర్వింద్కు సవాల్ విసిరారు. రెండోసారి ఎంపీగా గెలిచిన అర్వింద్ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. మూడు జిల్లాలకు కేంద్రబిందువుగా అధికారిక గెస్ట్హౌస్ను డిచ్పల్లి బైపాస్ వద్ద ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీ డాకారులు రాణిస్తున్నందున స్పోర్ట్స్ హబ్, టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎంను కోరారు. కాంగ్రెస్ పార్టీ అన్ని ము న్సిపాలిటీలు, కార్పొరేషన్ను కై వసం చేసుకునేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. -
చెక్కులు అందజేసిన సీఎం
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలో ఇటీవల గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి చి కిత్స పొందుతూ మృతి చెందిన ఎకై ్సజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి సీఎం రేవంత్రెడ్డి ఆర్థి కసాయం అందజేశారు. సౌమ్య కుటుంబసభ్యు లు చంద్రకళ, సాయిలు, శ్రావణ్లకు రూ.కోటి చెక్కును ఇచ్చారు. గతేడాది విధి నిర్వహణలో భాగంగా దుండగుడి చేతిలో కత్తిపోటుకు గురై ప్రాణాలు వదిలిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.కోటి చె క్కును అందజేశారు. అంతకుముందు జిల్లాలోని 1614 మహిళా సంఘాల బ్యాంకు రుణాలకు సంబంధించి రూ.200కోట్ల చెక్కును పంపిణీ చేశారు. అభివృద్ధి పనులకు శ్రీకారం.. జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.20 కోట్లతో డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో ఎస్సీ బాలుర, బాలికల హాస్టళ్లు, ఇందల్వాయిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బంది నివాస గృహాలు, అదనపు సౌకర్యాలు, రూ.600 కోట్లతో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గా లలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.8.60 కోట్లతో తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్, రూ.1.36 కోట్లతో ఇండోర్ స్టేడియం, రూ.18 కోట్లతో సైన్స్ ల్యాబ్, రూ.43 కోట్లతో ఆడిటోరియం, పరిపాలనా భవనం, సీఎస్ఈ భవనం, రూ.21 కోట్లతో నవీపేట మండలం గాంధీనగర్ నుంచి బినోలా వరకు, సిరన్పల్లి నుంచి నిజాంపూర్ వరకు రూ.21 కోట్లతో నిర్మించనున్న రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. -
వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి..
● ఏడేళ్లలో చేసింది ట్రైలర్ మాత్రమే.. పిక్చర్ అబీ బాకీ హై ● మహేశ్కుమార్ గౌడ్కు ఎంపీ అర్వింద్ ధర్మపురి కౌంటర్ సుభాష్నగర్: నిజామాబాద్ అభివృద్ధిపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తనను ప్రశ్నించే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి హితవుపలికారు. నిజామాబా ద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడేళ్లలో అర్వింద్ చేసిన అభివృద్ధి ఏంటని మహేశ్కుమార్ గౌడ్ తా జాగా ప్రశ్నించగా, శుక్రవారం ఎంపీ అర్వింద్ కౌంటర్గా ఓ వీడియోను విడుదల చేశారు. ఎంపీగా ఏడేళ్ల లో చేసింది ట్రైలర్ మాత్రమేనని, పిక్చర్ అబీ బాకీ హై అని పేర్కొన్నారు. పసుపు రైతుల దశాబ్దాల కల పసుపు బోర్డును నిజామాబాద్ గడ్డపై ఏర్పాటు చేశానని, తద్వారా పసుపు ధరలు పెరిగాయని గుర్తుచేశారు. ఏడు ఆర్వోబీల నిర్మాణంతో ఇందూరు నగర రూపురేఖలు మారుతున్నా యని, మూడు ప్రాంతాల్లో ఆర్యూబీల నిర్మాణ ప నులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. రూ.53 కోట్ల వ్యయంతో నిజామాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. ముత్కేడ్ –డోన్ స్టేషన్ల మధ్య 418 కిలోమీటర్ల డబ్లింగ్ ప్రాజెక్ట్కు, పటాన్చెరు –ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఆ ర్మూర్–జగిత్యాల–మంచిర్యాల రహదారిని నాలు గు లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. బోధన్–బాసర–భైంసా మార్గం ద్వారా నూతన జాతీయ రహదారి ఏర్పడిందని, మూడు కేంద్రీయ విద్యాలయాలు, రెండు న వోదయ విద్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. ‘అర్వింద్ ఫర్ అస్’ హెల్ప్లైన్ సెంటర్ ద్వారా గల్ఫ్లో మృతి చెందిన 141 మంది మృతదేహాల ను, గల్ఫ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 508 మందిని స్వదేశానికి రప్పించామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ మీదుగా వందే భారత్ రైలును తీసుకొస్తానని హామీనిచ్చారు. -
కాంగ్రెస్ని గెలిపించే బాధ్యత అభ్యర్థులదే..
● సీఎం రేవంత్ రెడ్డినిజామాబాద్ రూరల్: నగరంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత బరిలో ఉన్న కార్పొరేటర్ అభ్యర్థులదేనని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కేశాపూర్ శివారులో నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ అభ్యర్థులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ కార్పొరేషన్ బరిలో కాంగ్రెస్ తరఫున మహిళా అభ్యర్థులు సగానికి పైగా ఉన్నారని, ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారబోతున్నార ని పేర్కొన్నారు. గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్ బీఫా మ్ ఇచ్చిందని, టికెట్ వచ్చిన వాళ్లు నిర్లక్ష్యం చేయ వద్దని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లే దాన్ని బట్టే విజయావకాశాలు ఉంటాయన్నారు. అందరినీ కలుపుకొనిపోతే 59 శాతం గెలిచినట్లేనని తెలిపారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని, అన్ని సర్వేలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు విద్వేషా లు రెచ్చగొడతాయని, మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కై వసం అయిన త ర్వాత మున్సిపల్ మంత్రిగా కావాల్సిన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
ఔటర్ రింగ్రోడ్డు నిర్మిస్తాం..
ప్రజాపాలన–ప్రగతిబాట సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి, పాల్గొన్న ప్రజలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండడం సాధ్యం కాదు. బీజేపీకి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే ఎలా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేశాపూర్ వద్ద ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో నిజామాబాద్ నగరం చెత్తకుప్పలా మారిందన్నారు. 12 ఏళ్లుగా మోదీ, 10 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. 90 శాతం ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. నిజామాబాద్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన అర్వింద్ స్మార్ట్ సిటీ పథకం ఎందుకు తేలేదన్నారు. ఎంపీ కేవలం మోదీ జపం చేస్తున్నారన్నారు. నిజామాబాద్ గల్లీల్లో మోరీలు తీయాలంటే మోదీ అవసరమా అన్నారు. నిజామాబాద్ జిల్లాకు విమానాశ్రయం ఎందుకు సాధించలేదన్నారు. ఎందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కేంద్రం నుంచి నిజామాబాద్ ఔటర్ రింగ్రోడ్డుకు నిధులు ఇస్తే మేం వద్దన్నామా అన్నారు. ఏమి నిధులు తెచ్చారని ఓట్లు అడుగుతున్నారన్నారు. మూడు సార్లు మోదీ ప్రధాని అయినప్పటికీ నిజామాబాద్ ను స్మార్ట్ సిటీ చేయలేకపోయారన్నారు. ● నిజామాబాద్ రైతులు ఆత్మగౌరవంతో పంటలు పండించుకుంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల వల్లేనన్నారు. నిజామాబాద్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి నినదించింది ఈ గడ్డమీద నుంచేనన్నారు. సుదర్శన్రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు లాంటి వాళ్లు మంత్రులుగా పని చేశారని, చిన్న మచ్చ లేదన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి మారు పేరన్నారు. క్వింటా పసుపు అమ్మితే తులం బంగారం వస్తుందన్న నానుడి ఉండేదన్నారు. ఇక్కడి వ్యవసాయం తెలంగాణతో పాటు దేశానికే ఆదర్శమన్నారు. నిజామాబాద్ రైతుల పోరాటాలు దేశానికే ఆదర్శమన్నారు. ● జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రైతు సమస్యలపై అనేక పోరాటాలు చేశారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నా మనసులో నిజామాబాద్కు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాకు అవసరమైన నిధులు మంజూరు చేస్తా. జిల్లాలో వివిధ విద్యాసంస్థల కోసం రూ.600 కోట్లు మంజూరు చేశాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో రూ.1,045 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నిధులు కావాలంటే స్థానిక ఎమ్మెల్యే కానీ మున్సిపల్ శాఖ మంత్రినైన నావద్దకు రావాలి. నిధులు ఇచ్చే బాధ్యత నాదే. జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాదేనన్నారు. సీఎం రేవంత్రెడ్డిని సన్మానిస్తున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్డీఎస్ సమాధి వద్ద నివాళుర్పిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ త దితరులుకాంగ్రెస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపిస్తే అభివృద్ధినిజామాబాద్ నగరపాలకం, ఉమ్మడి జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపించుకోవాలని, అప్పుడే అభివృద్ధి పనులు జరుగుతా యని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బంగారం లాంటి అవకాశాన్ని ఉమ్మడి నిజామాబాద్ ప్రజలు వదులుకోవద్దన్నారు. నిజామాబాద్ నగరంలో బీజేపీ ఓట్లు అడగాలంటే స్మార్ట్ సిటీగా ప్రకటించాలన్నారు. ఓట్లు అడిగే హక్కు లేని బీజేపీని బొందపెట్టాలన్నారు. నిజామాబాద్కు ఎయిర్పోర్టు తీసుకొచ్చే బాధ్యత మాదేనన్నారు. ఇప్పటికే వరంగల్, ఆదిలాబాద్లకు ఎయిర్పోర్టులు తీసుకొచ్చామన్నారు. నిజామాబాద్కు ఔటర్ రింగ్రోడ్డు నిర్మిస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ చెత్తకుప్పలా మారింది ఎంపీ అర్వింద్ స్మార్ట్ సిటీ స్కీం ఎందుకు తేలేదు.. విమానాశ్రయం ఎందుకు తీసుకురాలేదు గతంలో 90 శాతం ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అభివృద్ధిని అడ్డుకున్నారు గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండడం సాధ్యం కాదు నేనే మున్సిపల్ మంత్రిని.. కాంగ్రెస్ను గెలిపిస్తే నిధులిస్తా నగరపాలకం, పురపాలకాల్లో కాంగ్రెస్ను గెలిపిద్దాం కేశాపూర్ వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
‘యువత బీజేపీ ట్రాప్లో పడొద్దు.. కాంగ్రెస్ను గెలిపించండి’
నిజామాబాద్: యువత బీజేపీ ట్రాప్లో పడొద్దని, కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాలని సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్లో ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు సీఎం రేవంత్. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 6వ తేదీ) కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ.. ‘ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి నినాదం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. గొప్ప గొప్ప నాయలకులు నిజమాబాద్ నుండే వచ్చారు. 2014 నుండి కేంద్రం, రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు పాలించినా.. నిజమాబాద్ కార్పొరేషన్ లో అభువృద్ధి జరగలేదు. అంకపూర్ దేశి చికెన్కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు. వ్యవసాయనికి పెట్టింది పేరు నిజమాబాద్. నిజమాబాద్ పసుపు బంగారంతో సమానం. నిజమాబాద్ జిల్లా వ్యవసాయం దేశానికే ఆదర్శం. పంజాబ్, హర్యానా రైతుల వలే చైతన్యం ఉన్న రైతులు ఈ జిల్లాలో ఉన్నారు. నాడు వైఎస్, డిఎస్.. ద్వయం కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారో... అలాగే నేను, మహేష్ కుమార్ గౌడ్ కలిసి మళ్ళీ కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తాం. అందరి సహకారంతో కాంగ్రెస్ ఆధికారంలోకి వచ్చింది. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి నిజమాబాద్ జిల్లానే కారణం. నిజమాబాద్ జిల్లాపై తనకు ప్రత్యేక అభిమానం, జిల్లా అభివృద్ధి బాధ్యత నాది. తెలంగాణ యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశాం. రూ.1045 కోట్ల రూపాయలతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాం. మున్సిపల్ మంత్రిగా అభివృద్ధి బాధ్యత. రెండు సార్లు ఎంపీగా గెలిచిన అర్వింద్ జిల్లాకు ఏమి చేశారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి
● అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్ అర్బన్: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో గురువారం గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా పుష్కర ఘాట్ల వద్ద అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉంటాయని, వీటితోపాటు అనువైన ప్రదేశాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించాలన్నారు. పసుపును ఎండబెట్టి తీసుకురావాలి ● పాటుకూరి తిరుపతిరెడ్డి సుభాష్నగర్: సాంగ్లీ పసుపు మార్కెట్లోకి జిల్లా రైతులు పసుపు పంటను బాగా ఎండబెట్టి, డబుల్ పాలిష్తో ఎక్స్పోర్ట్ క్వాలిటీగా చేసుకుని తీసుకొస్తున్నారని, అందుకే మంచి ధర వస్తుందని జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ పాటుకూరి తిరుపతిరెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని సాంగ్లీ పసుపు మార్కెట్ను జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పిత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పసుపు క్రయవిక్రయాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అంక్సాపూర్ నుంచి తీసుకొచ్చిన పసుపు కొమ్ముకు రూ.16,800, మండకు రూ.13 వేల ధర రావడం శుభసూచికమని పేర్కొన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో నాణ్యమైన పసుపునకు సరైన ధర అందించాలని పసుపు రైతు ఉత్పిత్తిదారుల సంఘం తరపున పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డికి విన్నవించారు. అవసరమైతే సాంగ్లీ వ్యాపారులను నిజామాబాద్ మార్కెట్కు రప్పించి పసుపు కొనుగోలు చేయిస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కోరారు. పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలి నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఐడీఓసీ(కలెక్టరేట్), మున్సిపల్ కార్యాలయాల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు ఐడీఓసీ(కలెక్టరేట్)లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. అదేవిధంగా బోధన్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు బోధన్ మున్సిపల్ కార్యాలయంలో, ఆర్మూర్లో విధులు నిర్వర్తించనున్న వారు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో, భీమ్గల్లో విధులు నిర్వర్తించనున్న ఉద్యోగులు భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఆయా కార్యాలయాల పని వేళల్లో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని, ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది 8వ తేదీన పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. -
శంకుస్థాపనలు
● జిల్లా అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులను ప్రకటించనున్న సీఎం ● రూ.20 కోట్లతో టీయూలో నిర్మించిన సైన్స్ భవన ప్రారంభోత్సవం ● నగరం చుట్టూ ఔటర్ రింగ్రోడ్డు కోసం రూ.2 వేల కోట్లతో ప్రతిపాదనలు ● గుండారం వద్ద 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్కు ప్రతిపాదనలు ● నిజామాబాద్ స్మార్ట్ సిటీకి ప్రతిపాదనలు పంపించాం ● ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ‘సాక్షి’ ఇంటర్వ్యూలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిరూ.687 కోట్ల పనులకు జిల్లాల పర్యటనల్లో భాగంగా ముఖ్యమంత్రి వస్తున్నారు. రూరల్ నియోజకవర్గంలోని కేశాపూర్ వద్ద నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొంటారు. రూ.600 కోట్లతో నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సీఎం శంకుస్థాపనలు చేస్తారు. అదేవిధంగా టీయూలో రూ.10 కోట్లతో ఇంజినీరింగ్ కళాశాల భవనం, రూ.18 కోట్లతో ఆడిటోరియం, రూ.17 కోట్లతో అడ్మిన్ భవనం, రూ.10 కోట్లతో బాలికల హాస్టల్, రూ.10 కోట్లతో ఎస్టీ బాలుర హాస్టల్, రూ.10 కోట్లతో ఎస్టీ బాలికల హాస్టల్స్ నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా రూ.12 కోట్లతో నిర్మించనున్న ఏకలవ్య పాఠశాల క్వార్టర్స్, మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే టీయూలో నిర్మాణం పూర్తి చేసుకున్న సైన్స్ భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు. రూ.10 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.2 కోట్లు పాఠశాలల అభివృద్ధికి, రూ.కోటి తాగునీటికి, మిగిలిన రూ.7 కోట్లు కమ్యూనిటీ భవనాలకు, రోడ్ల పనులకు ఖర్చు చేశాం. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండా నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు కనెక్టివిటీ, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు నాలుగు లేన్ల రోడ్డు కోసం కృషి చేస్తున్నాం. మరోవైపు ఎస్సీ సబ్ ప్లాన్ కింద డ్రెయిన్ల కోసం రూ.10 కోట్లతో, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రోడ్ల కోసం రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ఇందల్వాయి వద్ద హైవే పక్కన రోడ్డుప్రమాదాల సమయంలో అత్యవసర వైద్యసేవల కోసం ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రక్రియ నడుస్తోంది. నిజామాబాద్ నగరంతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో పాగా వేస్తాం. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా మా ప్రభుత్వం సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ముందుకెళ్తోంది. నిజామాబాద్ స్మార్ట్ సిటీకి ప్రతిపాదనలు పంపాం. నగరంలో రూ.10 కోట్లతో క్రీడల కాంప్లెక్స్, 10 ఎకరాల్లో పార్క్, ఎలక్ట్రిక్ బస్ డిపో కోసం కృషి చేస్తున్నాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పూర్తి విధ్వంసం జరిగింది. గడీల పాలన నడిచింది. కాంగ్రెస్ పాలన వచ్చాక అన్ని వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నాం. దీంతో సర్పంచ్ ఎన్నికల్లోనూ ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధిస్తాం. బీజేపీ, ఎంఐఎంలు మతాల పేరిట రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజలు వీటిని గమనించాలి.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా రూ.687 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని, అదేవిధంగా రూ.20 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న తెలంగాణ వర్సిటీలోని సైన్స్ బిల్డింగ్ను ఆయన ప్రారంభిస్తారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో భూపతిరెడ్డి గురువారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొత్త రోడ్లు, వంతెనల కోసం ఆర్అండ్బీ మంత్రి ద్వారా రూ.150 కోట్లు మంజూరయ్యాయి. వీటికి టెండర్లు పూర్తయ్యాయి. మరిన్ని రోడ్లు, వంతెనల కోసం రూ.250 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. అలాగే పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్లకు మరో రూ.200 కోట్లు తీసుకొచ్చా. రోడ్ల మరమ్మతుల నిర్వహణకు మరో రూ.10 కోట్లు మంజూరు చేయించా. ప్రాణహిత–చేవెళ్ల 21ఏ ప్యాకేజీ పనులను త్వరలో పూర్తి చేసి 1.82 లక్షల ఎకరాలకు నీరందిస్తాం. మోపాల్, గుండారం బస్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపించాం. తిర్మన్పల్లి, తాటిపల్లి, న్యాల్కల్, డీబీ తండా వద్ద 33/11 విద్యుత్ సబ్ స్టేషన్ల కోసం రూ.12 కోట్లు మంజూరయ్యాయి. కేశ్పల్లి, హుస్సేన్నగర్, సుద్దులం వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపగా మంజూరయ్యాయి. జక్రాన్పల్లి, ధర్పల్లి వద్ద 133/33 సబ్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపాం. మరోవైపు రైతుల సౌకర్యం కోసం డిచ్పల్లి, ధర్పల్లి వద్ద సర్వీస్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపాం. జిల్లాకు ఇప్పటికే వ్యవసాయ కళాశాల సైతం మంజూరైంది. నిజామాబాద్ నగరం చుట్టూ రూ.2వేల కోట్ల అంచనాతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు, డిచ్పల్లి వద్ద డ్రైపోర్ట్ ఏర్పాటుకు, గుండారం వద్ద 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేశాం. అలాగే నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ సైతం మార్చేందుకు ప్రతిపాదనలు చేశాం. ప్రాణహిత–చేవెళ్ల పథకం కింద 21ఏ ప్యాకేజీ పనులను పాత డిజైన్ మేరకు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. -
పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నిజామాబాద్ అర్బన్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, జనరల్ అబ్జర్వర్ సీహెచ్. సత్యనారాయణ రెడ్డిల సమక్షంలో గురువారం నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ చేపట్టారు. ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, వోపీవోలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ డిప్యూటీ సీఈవో సాయన్న, డీఈవో అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు
సుభాష్నగర్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బరిలో బంధువులు పోటీ పడుతున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్క డివిజన్లో.. ఒకే పార్టీ నుంచి పలు డివిజన్లలో.. కొందరు ఒకటే డివిజన్లో బరిలో నిలిచారు. వీరిలో గతంలో గెలిచిన వారు ఉండగా, మరికొందరు మొదటిసారిగా పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎక్కువగా కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చారు. ● నిజామాబాద్ నగరంలోని 8వ డివిజన్లో బీఆర్ఎస్ నుంచి దండు చంద్రశేఖర్ పోటీ చేస్తుండగా, ఆయన కుమార్తె డాక్టర్ దండు రుషిత 21వ డివిజన్లో అదే పార్టీ నుంచి బరిలో నిలిచారు. దండు చంద్రశేఖర్ గతంలో కార్పొరేటర్గా పనిచేశారు. కాగా దండు చంద్రశేఖర్ భార్య దండు నీతూకిరణ్ తాజా మాజీ నిజామాబాద్ నగర మేయర్గా ఉన్నారు. తండ్రి, కుమార్తె ఒకే పార్టీ నుంచి వేర్వేరు డివిజన్లలో బరిలో నిలిచారు. ● నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 28వ డివిజన్లో బీఆర్ఎస్ నుంచి రంగు సీతారాం బరిలో ఉండగా, ఆయన భార్య రంగు అపర్ణ 50వ డివిజన్లో అదే పార్టీ నుంచి పోటీపడుతున్నారు. భార్యభర్తలిద్దరూ ఒకే పార్టీ నుంచి వేర్వేరు డివిజన్లలో పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రంగు అపర్ణ గతంలో కార్పొరేటర్గా పని చేశారు. ● నిజామాబాద్ నగరంలోని 47వ డివిజన్లో సొంత అన్నదమ్ములు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఉల్లెంగ భూపతి పోటీ చేస్తున్నాడు. అదే డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన తమ్ముడు ఉల్లెంగ నాగరాజు బరిలో ఉన్నాడు. నాగరాజుకు బ్యాట్ గుర్తును కేటాయించారు. ● నిజామాబాద్ కార్పొరేషన్లోని 7వ డివిజన్లో ఆకుల పాపయ్య సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన కుమార్తె ఆకుల అరుణ 24వ డివిజన్లో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థిగా మొదటిసారి పోటీ చేస్తున్నారు. తండ్రి, కుమార్తె ఒకే పార్టీ నుంచి వేర్వేరు డివిజన్లలో పోటీలో ఉన్నారు. పాపయ్య గతంలో కౌన్సిలర్, కార్పొరేటర్గా పని చేశారు. ● నిజామాబాద్ నగరంలోని 43వ డివిజన్లో ఎర్రం గంగాధర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలవగా, ఆయన అన్న కుమారుడు ఎర్రం సుధీర్ 35వ డివిజన్లో బీజేపీ నుంచి పోటీలో ఉన్నాడు. ఎర్రం సుధీర్ అదే డివిజన్లో తాజా మాజీ కార్పొరేటర్. బాబాయ్, కుమారుడు వేర్వేరు డివిజన్లలో వేర్వేరు పార్టీల నుంచి బరిలో నిలిచారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● అధికారులతో కలెక్టర్, సీపీ సమీక్ష000000(ఫొటోనం.254,255–250035నిజామాబాద్ అర్బన్: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కోసం ఈ నెల 6న రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైత న్య, జిల్లా అధికారులు, సీఎంవో కార్యాలయ భద్ర తా విభాగం అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి, హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్ తదితర ప్రాంతాలను సందర్శించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సీఎం సభకు విద్యుత్ అంతరాయం తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, సభకు హాజరయ్యే వారికి తాగునీరు వంటి వసతులు కల్పిస్తూ, ప్రథమ చికిత్స సదుపాయం, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాగా, సీఎం భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సాయి చైతన్య పోలీసు అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, సీఎంవో కార్యాలయ భద్రతా అధికారి మాధవరావు, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, ప్రకాశ్, మస్తాన్ అలీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు. -
మహిళా సంఘాలదే హవా..
● సంఘానికి రూ. 3వేల నుంచి రూ. 5వేలు ● ప్రచారానికి ఒక లెక్క.. ఓటు వేసేందుకు మరో లెక్క.. ● మహిళల ఓట్ల కోసం అభ్యర్థుల పాట్లుఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల్లో మహిళా సంఘాల హవా కొనసాగుతోంది. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే నానుడికి అనుగుణంగా మహిళలు వ్యవహరిస్తున్నారు. వార్డుల్లో అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఒక లెక్క.. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు మరో లెక్క అని ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిఽధిలోని 60 డివిజన్లతోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలోని 86 వార్డుల నుంచి రాజకీయ పార్టీల తరఫున, స్వతంత్రులుగా నిలిచిన అభ్యర్థులు వీధుల్లో ప్రచారం కోసం మహిళా సంఘాల సభ్యులను ఉపయోగించుకుంటున్నారు. వార్డు పరిధిలోని మహిళా సంఘాల సభ్యులకు డబ్బులు ముట్టజెప్పి ప్రచారానికి తిప్పుకుంటున్నారు. అయితే, పార్టీ ఏదైనా అభ్యర్థుల వెంట ఆ వార్డుకు చెందిన మహిళా సంఘాల సభ్యులే ప్రతి రోజు కనిపిస్తున్నారు. ఒక్కో సభ్యురాలు ప్రచారానికి వస్తే రూ.200 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు. మహిళల ఓట్లే కీలకం.. స్వయం సహాయక మహిళా సంఘాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే సభ్యత్వం కలిగి ఉన్నారు. దీంతో అన్ని డివిజన్లు, వార్డుల్లో మహిళా సంఘాల సభ్యుల ఓట్లే అభ్యర్థుల గెలుపు, ఓటమిలను ప్రభావితం చేసేవిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ గెలుపు కోసం అభ్యర్థులు మహిళా సంఘ సభ్యులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా సంఘం లీడర్లతో రాయబారాలు కొనసాగిస్తున్నారు. లీడర్ల నిర్ణయం మేరకు ఆ సంఘం సభ్యులంతా కట్టుబడి ఉండే పరిస్థితులు ఉన్నందున ముందుగా సంఘం లీడర్లతో మంతనాలు సాగిస్తున్నారు. ఒక్కో సంఘానికి రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు ముట్టజెపుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తమ పరిధిలో పోటీకి నిలిచిన ప్రతి అభ్యర్థితో వేర్వేరుగా సమావేశమై డబ్బులు తీసుకుంటున్నారు. ఒక్కో డివిజన్, వార్డులో సుమారు నలుగురు అభ్యర్థులు పోటీలో ఉంటే ప్రతి సంఘానికి రూ. 20 వేల వరకు డబ్బులు అందుతున్నట్లు తెలిసింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఓటును డబ్బుతో కొనుగోలు చేయడం నేరం. ఒకవైపు అధికారులు ఓటు హక్కును అమ్ముకోవద్దని ప్రచారం చేస్తున్నా.. మరోవైపు మహిళలు తెలివిగా వ్యవహరిస్తూ తమ ఓటు హక్కును అభ్యర్థులకు ఎరగా వేస్తూ లాభపడుతున్నారు. -
వైద్యసిబ్బందికి హెపటైటిస్ బి టీకాలు
మోపాల్(నిజామాబాద్రూరల్): వైద్యసిబ్బంది హెపటైటిస్ బి వ్యాధికి గురికాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు ఇస్తున్నట్లు డీఎంహెచ్వో రాజశ్రీ తెలిపారు. జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యసిబ్బందికి హెపటైటిస్ బి టీకాల పంపిణీని డీఎంహెచ్వో మోపాల్ మండలంలోని ముదక్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రారంభించారు. పీహెచ్సీల్లో పనిచేసే వైద్యాధికారులు, నర్సింగ్ అధికారులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు, నాల్గోతరగతి సిబ్బందికి టీకాలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 739 మందిని గుర్తించామని, వీరిలో మొదటిరోజు 647 మంది సిబ్బందికి టీకాలు ఇచ్చామన్నారు. మిగతా వారికి త్వరలోనే ఇస్తామన్నారు. రెండో మోతాదును 28 రోజుల తర్వాత ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా టీకాల అధికారి డాక్టర్ అశోక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజ్మల్, డాక్టర్ అలేఖ్య, సీహెచ్ఓ భూలక్ష్మి, పర్యవేక్షణ అధికారులు మధుకర్, రవీందర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
బీజేపీది డైవర్షన్ పాలిట్రిక్స్
● దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష ● అనుచిత వ్యాఖ్యలపై పవన్ వివరణ ఇవ్వాలి ● టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ నిజామాబాద్ రూరల్: ఓటు బ్యాంకు లేక బీజేపీ డైవర్షన్ పాలిట్రిక్స్ చేస్తోందని, ఆ పార్టీ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఎందుకు వివక్ష చూపుతుందని ప్రశ్నించారు. 12 ఏళ్లుగా ఇక్కడి బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు రాగానే కులం, మతం పేరిట చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ అని, ప్రజల మనోభావాలని ఎన్నికలకు వాడుకునే దుర్నీతి ఆ పార్టీ నేతలకు ఉందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తర్వాతే తెలంగాణలో అడుగుపెట్టాలని హితవుపలికారు. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. 19వ వార్డు అభ్యర్థి శమంత నరేందర్ రెడ్డి రూ.8 కోట్ల ము న్సిపల్ ట్యాక్స్ కట్టడం మంచిదేనన్నారు. నిజా మాబాద్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రె స్ జెండా ఎగురుతుందన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, అగ్రికల్చర్ క ళాశాలలు, రోడ్ల నిర్మాణానికి శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తారని వివరించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, ను డా చైర్మన్ కేశ వేణు, మాజీ ఎమ్మెల్యే ఆకుల ల లిత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీపీ సీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, దాసరి నర్సింలు, విఫుల్గౌడ్, కైసర్, నరేందర్సింగ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఆర్మూర్లో వార్ వన్ సైడేనా?
ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసి అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించగా, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠం కోసం జరిగే వార్ వన్సైడే ఉండనుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏబీ శ్రీదేవి శ్రీనివాస్(చిన్న) నామినేషన్ వేస్తే టీపీసీసీ అధికార ప్రతినిధి హోదాలో ఆయనకు కాంగ్రెస్లో ఉన్న పరిచయాలతో చైర్పర్సన్ పీఠం తమ వరకు రాదని భావించిన ఆశావహులు స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ తరఫున మొదటి నుంచి తెరపై ఉన్న మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు కశ్యప్ స్వాతిసింగ్ బబ్లూ, పండిత్ వినీత పవన్, కాంగ్రెస్ నాయకులు మెడిదల సంగీత రవిగౌడ్, బీజేపీ నాయకులు గాండ్ల కంచెట్టి లక్ష్మి గంగాధర్ బరిలో నుంచి తప్పుకున్నారు. మరోవైపు చిన్నతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి ఉన్న సత్సంబంధాల కారణంగా ఏబీ శ్రీదేవి(చిన్న) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన 17వ వార్డులో బీజేపీ అభ్యర్థిని పోటీలో నిలపకపోవడంతో నాయకుల మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందానికి నిదర్శనమని ప్రచారం జరుగుతోంది. పట్టణంలోని 36 వార్డుల్లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే 1, 14, 17, 20, 22, 28వ వార్డుల్లో సైతం బీజేపీ అభ్యర్థులను బరిలో ఉంచింది. 1వ వార్డు నుంచి ముస్లిం మైనార్టీకి చెందిన అర్షియా ఫర్హీన్కు టికెట్ కేటాయించారు. అయితే, బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఏబీ శ్రీదేవి(చిన్న)కు వ్యతిరేకంగా మాత్రం పోటీకి అభ్యర్థిని నిలపకపోవడంపై చర్చ జరుగుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం బీఆర్ఎస్కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఆదరణ లభించడం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అందులో ఏబీ శ్రీదేవి(చిన్న)కు వన్ సైడ్ కానున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. కీలకమైన 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఏబీ శ్రీదేవి(చిన్న), బీఆర్ఎస్ అభ్యర్థి బేగం రహతున్నీసా మధ్యనే పోటీ నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి ని పోటీ నుంచి ఉపసంహరింపజేయడానికి ప్రయత్నాలు చేయగా మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అడ్డుకున్నట్లు తెలిసింది. ఏబీ శ్రీదేవి(చిన్న) నామినేషన్తో పోటీ నుంచి తప్పుకున్న ఆశావహులు శ్రీదేవికి పోటీగా అభ్యర్థిని నిలబెట్టని బీజేపీ లోపాయకారి ఒప్పందాలే శ్రీదేవిని చైర్పర్సన్ పీఠానికి దగ్గర చేస్తున్న వైనం! -
బల్దియా బరిలో బావ, బావమరిది
బోధన్టౌన్(బోధన్): బోధన్ బల్దియా పరిధిలోని 26వ వార్డులో బావ, బావమరిదిలు పోటీలో ఉన్నారు. బావ అంకు దామోదర్, మేన బావమరిది బీర్కూర్ శ్రీనివాస్రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదర్, బీఆర్ఎస్ తరఫున బీర్కూర్ శ్రీనివాస్ రెడ్డి నామినేషన్లు వేశారు. గడిచిన మూడు పర్యాయాలు ఈ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. ఆర్మూర్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను మోసం చేశారని ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ మున్ను ఆరోపించారు. పట్టణంలోని 20వ వార్డులో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు బీ ఫామ్ ఇస్తామని చెప్పి నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం రెండు సంవత్సరాలుగా 24 గంటలు శ్రమించానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత వినయ్రెడ్డి తమను నమ్మించి మోసం చేసారని మండిపడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేసారు. -
ట్రాక్టర్ ఢీకొని ఒకరి మృతి
బాన్సువాడ: బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రామానికి చెందిన మచ్కురి రాజు (35) అనే వ్యక్తి మంగళవారం రాత్రి ఇటుక ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడు. అయితే, రాజు చెట్టుకు ఢీకొని మృతి చెందినట్లు ఇటుక ట్రాక్టర్ డ్రైవర్ చిత్రీకరించిన విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు రాజు మిర్జాపూర్లో బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వీరాపూర్ వద్ద ఇటుక బట్టీ ప్రాంతంలో అతివేగంతో వస్తున్న ఇటుక ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందగా ట్రాక్టర్ డ్రైవర్ రాజు మృతదేహాన్ని చెట్టు పక్కన ఉంచి, చెట్టును ఢీకొని మృతి చెందినట్లు చిత్రీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజు మృతదేహాన్ని బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి ఇటుక బట్టీలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించగా ట్రాక్టర్ ఢీకొన్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో రాజు కుటుంబానికి న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు బాన్సువాడలో రాస్తారోకో చేశారు. పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని చెప్పడంతో విరమింపజేశారు. కాగా, భార్య పుట్టిన రోజునాడే భర్త రాజు మృతి చెందడంతో కుటుంబీకులు గుండెలవిసెల రోదించారు.● రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన డ్రైవర్ -
బీఆర్ఎస్ హయాంలోనే నగరాభివృద్ధి
● మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తానిజామాబాద్ అర్బన్: బీఆర్ఎస్ హయాంలోనే నగరాభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందూరు ఆడబిడ్డల కోసం ఐటీ హబ్ నిర్మించి, విదేశాలకు వెళ్లి 25 కంపెనీలు తీసుకువచ్చామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రూ.2 వేల పింఛన్, కల్యాణలక్ష్మి తదితర పథకాలు అమలు చేసి ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నగరమంతా పచ్చదనంలా తయారు చేశామన్నారు. సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన ఘనత తమదేనన్నారు. నూతన శ్మశాన వాటికలు, మినీ ట్యాంక్బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నూతన కలెక్టరేట్, మున్సిపల్ భవనాన్ని నిర్మించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఎక్కడుందో చూపించాలని ప్రశ్నించారు. నగర ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఎన్ని నిధులు తీసుకొచ్చారో ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల కోసం ఊరు పేరు మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. నగరంలో మార్కండేయ గుడి, సాయిబాబా ఆలయాలను కట్టించిన ఘనత తమదేనన్నారు. అబద్ధపు మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో 36, 37, 38, 43,9, 10 డివిజన్ల బీఆర్ఎస్ అభ్యర్థులు వెంకట్, విజయలక్ష్మి, రాజేశ్, వెంకటరమణ, సోనీ ఆకాష్, మక్కల గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సమరశీల పోరాటాలతోనే తిప్పికొడదాం
● టీయూసీఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలుఆర్మూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రమజీవుల వ్యతిరేక విధానాలను సమరశీల పోరాటాలతోనే తిప్పికొడదాంమని ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, కాంగ్రెస్ కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. కార్మిక, రైతు సంఘాలు, ఎస్కేఎం జాతీయ కమిటీ ఈ నెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అమెరికాకు దాసోహం అంటూ భారత దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ఆరోపించారు. అదానీ, అంబానీల ప్రయోజనాల కోసం కార్మిక, కర్శకుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కా ర్మికులకు 8 గంటల పనిదినాన్ని ఒక్క కలం పోటుతో రద్దు చేసి 12 గంటలకు పెంచడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్రలు తెలుస్తున్నాయన్నారు. 12న సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఏఐయూకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవారం, సీఐటీయూ మండల కార్యదర్శి ఎల్లయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్మూర్ ఇన్చార్జీ అవిష్, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రమేశ్ ప్రసంగించారు. వివిధ ప్రజాసంఘాల నాయకులు, పీడీఎస్యూ, పీవోడబ్ల్యూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియ పసుపు రైతులకు ప్రోత్సాహకం
సుభాష్నగర్: సేంద్రియ పద్ధతిలో పసుపు సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.16వేల ప్రోత్సాహకం అందించే ఆలోచన చేస్తున్నట్లు ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో పసుపును జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అర్వింద్ ధర్మపురి కాసేపు జర్నలిస్టుగా మారి పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఫలితం దక్కిందా? అని ఎంపీ ప్రశ్నించగా.. పసుపు బోర్డు ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని, పంటకు మంచి ధర రావాలంటే మార్కెట్ ముఖ్యమన్నారు. దీని కోసం ఎగుమతులు, ప్రమోషన్లపై కార్యక్రమాలు చేపట్టిన ట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పసుపు క్వింటాలుకు రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతుందన్నారు. నిజామాబాద్లో ధర రాకపోవడంపై తాను వ్యాపారులు, అధికారులతో మాట్లాడగా.. రైతులు పచ్చి పసుపు తెస్తున్నట్లు తన దృష్టికి తీసుకొచ్చారని గంగారెడ్డి తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ఏం చేస్తున్నారని ఎంపీ ప్రశ్నించగా.. బోర్డు ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కమ్మర్పల్లిలో పసుపు పరిశోధన కేంద్రం ఉందని, కొత్త వంగడాలు వచ్చిన రైతులు ఎర్రగుంట అనే పసుపు రకాన్ని మాత్రమే సాగు చేస్తున్నారని చైర్మన్ తెలి పారు. రాష్ట్రంలోని పలు గ్రామాలను ఎంపిక చేసి పసుపు సాగు విధానాలపై, ఏ రకమైన వైరెటీ సాగు చేయాలో అవగాహన కల్పించామని వివరించారు. పసుపు రైతులకు ఏమైనా సబ్సిడీలు అందిస్తున్నారా అని అర్వింద్ ప్రశ్నించగా.. ఎఫ్పీఓలకు 90శాతం సబ్సిడీపై, రైతులకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం రాయితీపై బాయిలర్లు, పాలిషింగ్ మిషన్లు అందిస్తున్నట్లు గంగారెడ్డి వివరించారు. పసుపు తవ్వకాల మిషన్ కోసం పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. పసుపు బోర్డు ద్వారా ఎగుమతుల లైసెన్స్ ఇప్పిస్తామన్నారు. ఈయూతో వాణిజ్య ఒప్పందంతో పసుపు సహా ఇతర సుగంధ ద్రవ్యాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. యూరోపియన్ దేశాల్లో ఆర్గానిక్ పసుపునకు డిమాండ్ ఉందని తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, వ్యాపారులు, పసుపు రైతులు పాల్గొన్నారు. -
300 మందితో బీజేపీలో చేరిక
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరానికి చెందిన విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్త, యువ నాయకుడు రాజ్గణేశ్ బుధవారం ఎంపీ అర్వింద్ సమక్షంలో 300 మంది యువకులతో బీజేపీలో చేరాడు. ఎంపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాజ్గణేశ్ చాలాకాలంగా హిందుత్వ భావజాలంతో పనిచేస్తున్నాడని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం అభినందనీయమన్నారు. పార్టీ విస్తరణ, సైద్ధాంతిక భావజాలాన్ని కిందిస్థాయికి తీసుకెళ్లేందుకు రాజ్గణేశ్ పనిచేశాడన్నారు. భవిష్యత్తులోనూ ఇదేవిధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎన్నికల ఇన్చార్జి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తెయూ (డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏపీఈ, ఐపీసీహెచ్, ఐఎంబీఏ 3, 5వ సెమిస్టర్, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎమ్ 1, 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం ఆర్ట్స్అండ్సైన్స్ కాలేజ్, న్యాయ కళాశాలలో జరిగిన పరీక్షలకు మొత్తం 201 మంది విద్యార్థులకు 195 మంది హాజరుకాగా ఆరుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. నందిపేట్(ఆర్మూర్): ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే పాలీసెట్–2026 పరీక్షకు ఏప్రిల్ 20 తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నందిపేట పాలిటెక్నిక్ పిన్సిపాల్ రాజ్కుమార్ తెలిపారు. మే 13 న పాలీసెట్ పరీక్ష ఉంటుందన్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నందిపేట కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ కోర్సులలో 60 సీట్ల చొప్పున ఉన్నాయని తెలిపారు. ఎల్లారెడ్డిరూరల్: మున్సిపాలిటీ పరిధిలోని వడ్డె ర కాలనీకి చెందిన గండికోట మల్లేశ్ (35) మంగళవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేశ్ బుధవారం తెలిపా రు. మల్లేశ్ కొన్నిరోజులుగా అనారోగ్యంతో బా ధపడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మా నసికంగా కుంగిపోయి, జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● ఒకరి మృతి ● మరొకరి పరిస్థితి విషమం నందిపేట్(ఆర్మూర్): ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నందిపేట మండలం చౌడమ్మ కొండూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై శ్యాంరాజ్ తెలిపిన వివరాలిలా ఉన్నా యి. చౌడమ్మ కొండూర్ గ్రామానికి చెందిన కొడపాల్ సాగర్ (30) మంగళవారం రాత్రి 10 గంటలకు బైక్పై నందిపేట నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. బైక్లపై ప్రయాణిస్తున్న కొడుపుల సాగర్తోపాటు శివకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాగర్ మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన శివ పరిస్థితి విషమంగా ఉంది. మృతుడి తండ్రి సాయన్న ఫిర్యాదు మేరకు అతివేగంగా అజాగ్రత్తగా బైక్ నడిపిన వెలుమల ప్రవీణ్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమమే మా నినాదం
● పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం ● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డినిజామాబాద్ రూరల్ : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ఒకవైపు సంక్షేమం మరోవైపు అనే నినాదంతో ముందుకు సాగుతుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని, రాష్ట్రంలో నియంతృత్వ గడీల పాలన కొనసాగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని, వాటి ఫలితంగానే సర్పంచ్ ఎన్నికల్లో 60 శాతం ఓట్లు సాధించి అత్యధిక సీట్లు గెలుపొందామని చెప్పారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సైతం నిజామాబాద్ కార్పొరేషన్తోపాటు బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీల్లో సైతం కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. బీజేపీ, ఎంఐఎంలు మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్ప నగరాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు. సమావేశంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, వివిధ మండల పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, సాయిరెడ్డి, నవీన్ గౌడ్, బాలరాజ్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మునిపల్లి చిన్న సాయిరెడ్డి, ధర్మారం సర్పంచ్ వాసు బాబు తదితరులు పాల్గొన్నారు.నిజామాబాద్ మండలం పాల్దా సర్పంచ్ మున్నూరు ప్రభాకర్, ఉప సర్పంచ్ మల్లారం రమేశ్, ఖానాపూర్ బీఆర్ఎస్ నాయకుడు మోహన్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సమక్షంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేరుతున్నారని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు రాజలింగం, బాగారెడ్డి, తిర్మన్పల్లి, కొండూర్ సర్పంచులు మోహన్, సంతోష్, కాలూర్, ఖానాపూర్ డివిజన్ అభ్యర్థి అగ్గు భోజన్న తదితరులు పాల్గొన్నారు. -
మొదటి మహిళా కౌన్సిలర్ గొల్ల నాగమ్మ
● రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన సునీతాదేశాయ్సుభాష్నగర్: నిజామాబాద్ మున్సి పల్ కౌన్సిల్లో మొదటి మహిళా కౌ న్సిలర్గా మాదాసు గొల్ల నాగమ్మ పని చేశారు. 1981లో ఆమె 16వ వార్డు (ఎల్లమ్మగుట్ట) నుంచి 400 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 8 మంది ఎన్నికల బరిలో నిలవగా నాగమ్మ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. నాగమ్మ కౌన్సిలర్గా ఎన్నిక కాక ముందే కాలనీల్లో మహిళలకు ఉపాధి కోసం బీడీ కార్ఖానాలు ఏర్పాటు చేయించారు. ప్రజా సమస్యలపై స్పందించే వ్యక్తిత్వం, పరిష్కార మా ర్గాలు చూపడం ఆమె విజయానికి కా రణమయ్యాయి. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తన తమ్ముడు గొల్ల నర్సయ్య హోటల్లో కేవలం చాయ్ తాగించారు. ఆమె వారసత్వాన్ని నాగ మ్మ మేనల్లుడు మాదాసు స్వామి యాదవ్ పుణికి పుచ్చుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. పేదలు, నిరక్షరాస్యులకు సేవలందిస్తున్నారు. గతేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదర్శ మహిళలకు మాదాసు నాగమ్మ పేరుతో స్వామి యాదవ్ అవార్డులు ప్రదానం చేశారు. స్వామి యాదవ్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. గొల్ల నాగమ్మ (ఫైల్)ఎంపీటీసీ నుంచి మున్సిపల్ చైర్పర్సన్గా..బోధన్ : ఎంపీటీసీ నుంచి మున్సిపల్ చైర్పర్సన్గా సునీతా దేశాయ్ ఎదిగారు. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది వీఆర్ దేశాయ్ కుటుంబం 1981 సంవత్సరానికి ముందే చదువుల నిమిత్తం బోధన్కు వచ్చింది. న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ కోసం పట్టణంలోనే స్థిరపడ్డారు. వీఆర్ దేశాయ్ సతీమణి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీతా దేశాయ్ రాజకీయరంగ ప్రవే శం చేసి అంచెలంచెలుగా ఎదిగారు. 1987లో టీడీపీలో చేరారు. 1989– 96 వరకు టీడీపీ వర్ని మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. 1997లో జరిగిన మండల పరిషత్ ఎన్నిక ల్లో రుద్రూర్–2 ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీగా ఎ న్నికయ్యారు. 2000 సంవత్సరంలో మున్సిపల్ చై ర్మన్ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సునీ తా దేశాయ్, కాంగ్రెస్ అభ్యర్థిగా డీసీసీబీ మాజీ చైర్మన్ గంగాధర్రావు పట్వారీ సతీమణి పద్మావతి ప ట్వారీ, ఎంఐఎం నుంచి ముంతాజ్ సిద్ధికీ పోటీ పడ్డారు. 1,765 ఓట్ల మెజారిటీతో సునీతా దేశాయ్ విజయం సాధించారు. 2000 నుంచి 2005 వరకు చైర్పర్సన్గా పనిచేశారు. ఆమె హయాంలో మున్సిపల్ స్థలాల్లో ని వా సం ఉంటున్న పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కు అప్పట్లో 194 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. సునీతా దేశాయ్ భర్త వీఆర్ దేశాయ్ 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. 2022–2024 వరకు బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్య తలు నిర్వర్తించారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1981లో 400 ఓట్ల భారీ మెజార్టీతో విజయం మహిళల ఉపాధి కోసం బీడీ కార్ఖానాలు ఏర్పాటు చేయించిన నాయకురాలు -
బ్యాలెట్ ముద్రణలో అప్రమత్తంగా ఉండాలి
సుభాష్నగర్: మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పత్రాల ముద్రణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షించారు. డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ ఏర్పాట్ల గురించి కమిషనర్ దిలీప్ కుమార్ను వివరాలు అడిగి తెలుసుకున్నా రు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో బ్యా లెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్ ముద్రణ గురించి ఆ రా తీశారు. గోప్యతను పాటిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ముద్రణ చేయించాలని, పోలీసు భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించి జాగ్రత్తగా భద్రపర్చాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు అదనంగా పోలింగ్ సిబ్బందిని కేటాయిస్తున్నామని తెలిపారు. ఎలాంటి తప్పిదాలు, లోటుపాట్లకు తావులేకుండా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. సమీ క్షలో డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ డ్యూటీకి ఉపాధ్యాయులు
ఖలీల్వాడి: మున్సిపల్ ఎన్నికల విధులు అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు ‘పరీక్ష’గా మారాయి. జిల్లాలో 769 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. 160 స్కూళ్ల టీచర్లందరికీ ఎన్నికల డ్యూ టీ పడింది. ఒక్క ధర్పల్లి మండలంలోని దాదాపు 10 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులందరూ ఎన్నికల విధులకు వెళ్లనున్నారు. అలాగే పీజీహెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు 450 మందికి ఎన్నికల విధులు కేటాయించారు. మార్చిలో పదో తరగతి పరీక్షలు ఉండగా హైస్కూల్ టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ వేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీవోలు, ఏపీవోలుగా 90 మంది వరకు టీచర్లను నియమించారు. పోలింగ్ డే అయిన ఈనెల 11న అలాగే ముందు రోజైన 10వ తేదీన 160 స్కూళ్లకు టీచర్లు వెళ్లే పరిస్థితి లేదు. ఎన్నికలు జరగనున్న నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ పట్టణాల్లో పాఠశాలలకు బంద్ ఇచ్చినప్పటికీ.. ఎన్నికల విధులకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు వెళ్లే స్కూళ్ల పరిస్థితిపై క్లారిటీ లేదు. జిల్లాలో మొత్తం 2848 మంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. ఇదిలా ఉండగా టీచర్లకు డ్యూటీల కేటాయింపులో నిబంధనలను పాటించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీజీహెచ్ఏంలు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు నిబంధనల ప్రకారం ఆర్వో, ఏఆర్వో వంటి విధులు కేటాయించాల్సి ఉండగా ఏ మాత్రం పట్టించుకోలేదని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. పీజీహెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు 450 మంది.. పలు ప్రాథమిక పాఠశాలల టీచర్లందరికీ ఎన్నికల విధులు ఎన్నికలు జరగనున్న చోట్ల స్కూళ్లు బంద్ గ్రామీణ ప్రాంత బడులను ఆ రెండు రోజులు చూసేదెవరు? -
క్రమంగా కిందకు..
● జనవరిలో 2.36 మీటర్లు తగ్గిన భూగర్భ జలాలు ● జిల్లాలో ప్రస్తుత నీటి మట్టం 9.56 మీటర్లు డొంకేశ్వర్(ఆర్మూర్): వేసవి ప్రారంభానికి ముందే జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఏకంగా 4.16 మీటర్ల లోతులోకి వెళ్లాయి. జనవరిలోనే 2.36 మీటర్లు తగ్గిపోవడం నీటి వినియోగ తీవ్రతను తెలుపుతోంది. వ్యవసాయ బోర్ల వాడకం పెరగడం కారణంగా డిసెంబర్లో 7.20 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలు జనవరి ముగిసే నాటికి 9.56 మీటర్ల లోతులోకి చేరాయి. ఇది 2025 జనవరి నెలతో (10.09 మీటర్లు) పోలిస్తే కొంచెం మెరుగైన పరిస్థితి అని చెప్పొచ్చు. జిల్లాలో 82 పరిశీలక బోరు బావులు (ఫీజో మీటర్లు) ద్వారా జనవరి మాసానికి సంబంధించిన నీటి లెక్కలను ఇటీవల గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు తీశారు. ఇందులో 49 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. అలాగే 30 ఫీజో మీటర్లలో 10 నుంచి 20 మీటర్ల లోపు భూగర్భ జలాలున్నాయి. అదే విధంగా మూడు ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 74 శాతం భూరగ్భజలాలు విస్తరించి ఉండగా భీమ్గల్, సిరికొండ, డిచ్పల్లి, మోపాల్, నవీపేట్ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో వేగంగా నీటి మట్టాలు తగ్గుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి రానున్న వేసవిలో ఎల్నినో ప్రభావం ఉండొచ్చని ప్రపంచ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా ప్రజలు, రైతులు భూగర్భ జలాలు తగు మోతాదులో వాడుకోవాలి. వేసవిలో ఎద్దడి రాకుండా ఉండాలంటే నీటిని వృథా చేయొద్దు. వృథా నీరు భూమిలోకి చేరేలా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. – శ్రీనివాస్బాబు, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి -
ఎత్తులకు పై ఎత్తులు
నిజామాబాద్సేంద్రియ పసుపు రైతులకు.. సేంద్రియ పద్ధతిలో పసుపు సాగు చేసే రైతు లకు రూ.16వేల ప్రోత్సాహకం అందజేసే ఆ లోచన చేస్తున్నట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు.గురువారం శ్రీ 5 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026– 8లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సమయం లేదు మిత్రమా.. ప్రతి నిమిషాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి.. అంటూ పురపోరులో బరిలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. ఆయా పార్టీలు సైతం నిజామాబాద్ మేయర్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ల పీఠాలు దక్కించుకునేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తూ వ్యూహాలు రచిస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం మొదలైంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసు కుంటున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన మేయర్ అభ్యర్థులు శమంత, స్రవంతిలు తాము పోటీలో ఉన్న డివిజన్లలో గెలుపొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిజామాబాద్లోని 60 డివిజన్లలో 20 చోట్ల ఎంఐఎం ప్రభావం చూపుతోంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో పోటాపోటీగా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం పలు డివిజన్లలో తీవ్రమైన పోటీ ఇస్తున్నారు. అత్యధిక డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు చూపించే ప్ర భావం కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలున్నట్లు అంచనా. బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా.. 20 వార్డుల్లో ఎంఐఎం ప్రాబల్యం ఉంది. గత ఎన్నికల్లో 11 చోట్ల గెలిచిన ఎంఐఎం ఈసారి 20 వార్డుల్లో గెలిచే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ను ఎదుర్కొని చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఎంఐఎం వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ మద్దతు సైతం తీసుకుని పీఠం దక్కించుకునేందుకు ఎంఐఎం ప్రణాళికలు రచిస్తోంది. దీంతో ఇక్కడ వచ్చే ఫలితంపై ఆసక్తి పెరిగింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏబీ చిన్నా భార్య శ్రీదేవి చైర్పర్సన్ రేసులో ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆ పార్టీ అంతగా పోటీ ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇక్కడి నుంచే ఉన్నప్పటికీ ఆ పార్టీ సైతం ప్రభావం చూపలేకపోతోంది. దీంతో కాంగ్రెస్కు కలిసొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. భీమ్గల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి చైర్మన్ పీఠమే లక్ష్యంగా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సైతం ప్రశాంత్రెడ్డి కృషితో మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ, వేల్పూర్, ఏర్గట్ల, బడాభీమ్గల్ తదితర మేజర్ పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇదే ఒరవడితో భీమ్గల్ మున్సిపాలిటీలో సైతం పాగా వేసేందుకు ప్రశాంత్రెడ్డి పావులు కదుపుతున్నారు. పురపోరులో ఆయా పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. మున్సిపల్ పీఠాలపై జెండా ఎగరేసేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వ్యూహాలు రచిస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం మొదలైంది. బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం పలు డివిజన్లలో తీవ్రమైన పోటీ ఇస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కార్పొరేషన్తోపాటు మూడు మున్సిపాలిటీల్లో రాజకీయ సమీకరణాలు రకరకాలుగా మారుతున్నాయి. సమయం సద్వినియోగానికి అభ్యర్థుల ఉరుకులు పరుగులు కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రత్యర్థులకు టెన్షన్ పెంచుతున్న బీఆర్ఎస్ ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో తీరుగా మారుతున్న సమీకరణాలు -
పట్టణానికి పోదాం చలో చలో..
మోర్తాడ్(బాల్కొండ): మున్సిపల్ ఎన్నికల వా తావరణం వేడెక్కడంతో పల్లెలకు చెందిన నాయకులు ‘పట్టణానికి పోదాం చలో చలో’ అంటున్నారు. నిజామాబాద్ నగరంతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ పట్టణాల్లో మున్సిపల్ ఎన్నిక ల నేపథ్యంలో అభ్యర్థులకు అండగా ఉంటూ వా రి విజయానికి కృషి చేసేలా గ్రామీణ ప్రాంత నాయకులకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు బా ధ్యతలను అప్పగించాయి. భీమ్గల్ మున్సిపాలిటీలో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో అ భ్యర్థుల వెంట ఉన్నారు. ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో ఆయా నియోజకవర్గాల్లోని గ్రామీణ నా యకులు అభ్యర్థుల వెన్నంటి ఉంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో నగరానికి చెందిన వారితోపాటు రూరల్ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొంటున్నారు. పట్టణాలకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలకు అక్కడి స్థానిక నాయకులు ప్రచారంపై దిశానిర్దేశం చేస్తున్నారు. పల్లె నాయకులకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు తమ అభ్యర్థులకు అండగా ఉండాలని రాజకీయ పార్టీల ఆదేశం మూడు ప్రధాన పార్టీలదీ అదే ప్లాన్ -
దిమ్మ తిరిగే దిగుబడి!
● ఎకరానికి 10 ట్రాక్టర్ల పసుపు ● డొంకేశ్వర్ యువరైతు కళ్లెం మహిపాల్రెడ్డి ఘనతడొంకేశ్వర్(ఆర్మూర్): పసుపు సాగు చేస్తున్న డొంకేశ్వర్ రైతులు అద్భుత దిగుబడులు సాధిస్తున్నారు. యువతరైతు కళ్లెం మహిపాల్రెడ్డి వ్యవసాయక్షేత్రంలో ఎకరానికి ఏకంగా 10 ట్రాక్టర్లకు పైగా (35క్వింటాళ్లు) దిగుబడి రావడంతో తోటి రైతులు ఆశ్చర్యపోతున్నారు. మహిపాల్రెడ్డి గత కొన్నేళ్లుగా పసు పు సాగు చేస్తున్నారు. నేల స్వభావమో, సేంద్రియ ఎరువుల వాడకమో లేదా చేతి గుణమో తెలియదు కానీ.. ఊహించని విధంగా దిగుబడులు తీస్తున్నాడు. మహిపాల్రెడ్డి ఈ ఏడాది ఆరు ఎకరాల్లో పసుపు సాగుచేశాడు. ఎకరానికి పది ట్రాక్టర్ల చొప్పున మొత్తం అరవై ట్రాక్టర్ల వరకు పంట చేతికి వచ్చింది. క్వింటాళ్ల లెక్కన చూస్తే ఎకరానికి సాధారణంగా అందరికి 25 నుంచి 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా మహిపాల్ మాత్రం 36 క్వింటాళ్ల వరకు దిగుబడిని సాధించడం గొప్ప విషయం. పశువులు, గొర్ల ఎరువు ఉపయోగించడంతోపాటు బెడ్ విధానంలో డ్రిప్ ద్వారా పసుపు సాగు చేశానని మహిపాల్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పండిన పసుపును ఉడికించి డబుల్ పాలిష్ చేసి ఎప్పటిలాగే సాంగ్లీ మార్కెట్లో విక్రయిస్తానని అన్నారు. -
హిందుత్వం మా ఎన్నికల ఎజెండా కాదు
సుభాష్నగర్: హిందుత్వం బీజేపీ ఎన్నికల ఎజెండా కాదని, శ్రీ రాముడితో బీజేపీ రాజకీయం చేయడం లేదని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. హిందూ రాష్ట్రం కోసం ఎప్పటికీ పోరాడుతూనే ఉంటామని, అది తమ డీఎన్ఏలోనే ఉందని పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎన్నికల ఇన్చార్జి, మా జీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలంటే కాంగ్రెస్కు భయం పట్టుకుందని, అవినీతి ఆ పార్టీ ఎజెండా అని విమర్శించారు. ఎన్ని కల సమయంలోనే రాముడు గుర్తుకొస్తాడన్న కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలపై అర్వింద్ తీవ్రంగా స్పందించారు. జిల్లా కాంగ్రెస్లో పరిణతి చెందిన నాయకుడు ఉన్నాడా.. అంతా పరిణతి లేని నాయకులు ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ కాబట్టే తాను పార్టీలో చేరలేదని స్పష్టంచేశారు. ఎంఐఎంతో కాంగ్రెస్కు జీవితాంతం లోపాయికారి ఒప్పందం ఉంటుందని, బీజేపీ మి గులు సరుకుకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందని ఎద్దేవాచేశారు. బీజేపీలో ఉండి వేరే పార్టీకి పని చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన సిట్టింగులకు టికెట్లు ఇవ్వలేదన్నారు. ఓ పార్టీ నుంచి మేయర్గా ప్రచారంలో ఉన్న అభ్యర్థి నుంచి 17 ఏళ్ల ఆస్తిపన్ను బకాయి కట్టించిన ఘనత బీజేపీదేనని అన్నారు. బీజేపీ గెలిస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని, ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని, మే యర్ సీ టు కోసం కోట్లు ఖర్చు చేసి.. ఆ తర్వాత కార్పొరేషన్ను లూటీ చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు. సుమారు రూ.100 కోట్ల ఆస్తిపన్ను బకాయిలు ముక్కు పిండి వసూలు చేసి, నగర అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, నాయకులు గద్దె భూమన్న, శ్రీధర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అవినీతి కాంగ్రెస్ ఎజెండా ఇందూరును అప్పగిస్తే లూటీ చేస్తారు వసూళ్లకు పాల్పడిన సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వలేదు ఎంపీ అర్వింద్ ధర్మపురి -
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఆర్మూర్ టౌన్: యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మంగళవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎలాంటి సందర్భంలోనూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దని, రాత్రి సమయాలలో అనవసరంగా తిరగకూడదన్నారు. ఈవ్టీజింగ్, మహిళలను వేధించడం సరికాదని, ఎవరైనా మహిళలను వేధిస్తే షీ టీంకు సమాచారం అందించాలన్నారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ఆధార్ కార్డు, సరైన వివరాలు ఉంటేనే ఇళ్లను అద్దెకు ఇవ్వాలన్నారు. అంతకుముందు 120 ఇళ్లలో తనిఖీలు నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లభించని 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్మూర్, రూరల్ సీఐలు సత్యనారా యణ, జాన్ రెడ్డి, ఆర్మూర్ డివిజన్లోని తొమ్మిది మంది ఎస్సైలు, ఏఎస్ఐలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కిలో 265 గ్రాముల గంజాయి స్వాధీనం
● నిందితుడి రిమాండ్ బోధన్టౌన్(బోధన్): అక్రమంగా గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించా రు. పట్టణంలోని రవి గార్డెన్ వద్ద బైపాస్ రోడ్లో ఎస్సై భాస్కరా చారీ వాహనాలు తనిఖీ చేస్తుండగా రాకాసీపేట్కు చెందిన మహ్మద్ అష్రఫ్ అలీ అలి యాస్ అష్రఫొద్దీన్ స్కూటీ డిక్కీలో కిలో 265 గ్రా ముల గంజాయి పట్టుబడిందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని స్కూటీని, గంజాయిని స్వా ధీనం చేసుకున్నట్లు తెలిపారు. అష్రఫొద్దిన్ను విచా రించగా తన తండ్రి రషీదొద్దీన్తో కలిసి నాందెడ్కు చెందిన ఫేరోజ్, షేక్ మాజిద్ల నుంచి గంజాయి కొనుక్కొని వచ్చి ఇక్కడ కాలేజీ యువకులకు, కూలీ పని చేసేవారికి విక్రయిస్తున్నట్లు వెల్లడించారన్నారు. అష్రఫొద్దీన్ నుంచి మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో పట్టణ సీఐ వెంకట నారాయణ, సిబ్బంది ఉన్నారు. -
స్ట్రాంగ్ రూంకు మరమ్మతులు చేపట్టాలి
● ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణరెడ్డి ● ఆర్మూర్లో కౌంటింగ్ కేంద్రం పరిశీలన ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్లను భద్రపరిచే స్ట్రాంగ్ రూంతోపాటు కౌంటింగ్ కేంద్రానికి మరమ్మతులు చేపట్టాలని ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సూచించారు. పిప్రి రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన మంగళవారం పరిశీలించారు. కళాశాల భవనంలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందున సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను భద్రపరిచే స్ట్రాంగ్ రూంతోపాటు కౌంటింగ్ హాల్ను పరిశీలించారు. ఏడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు సమయంలో హాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలిచ్చారు. కౌంటింగ్కు వచ్చే ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందికి వేర్వేరుగా బారీకేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి ఆర్మూర్టౌన్: ఆర్మూర్తోపాటు భీమ్గల్ మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సూచించారు. ఆర్మూర్లోని క్షత్రియ ఫంక్షన్హాల్లో మంగళవారం పీవో, ఏపీవోలకు ఎన్నికలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్, కౌంటింగ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్ రావు, డీఈ భరత్, పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు. -
పునరావాసంలో పుట్టెడు కష్టాలు
● కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న గరీబ్ నవాజ్ కాలనీవాసులు ● పాలకులు మారుతున్నా అభివృద్ధికి నోచుకోని వైనంబోధన్ : ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది’ అని ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న పాడిన పాట బోధన్ పట్టణ శివారులోని గరీబ్ నవాజ్ కాలనీ పరిస్థితులకు అద్దం పడుతోంది. బోధన్ –నిజామాబాద్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న ఆచన్పల్లి ప్రాంతానికి కిలోమీటర్ల దూరంలో పాండుఫారం శివారులో గల ఈ కాలనీలో కనీస సౌకర్యాలు లేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ కాలనీ మున్సిపల్ ఒకటో వార్డు పరిధిలోకి వస్తుంది. కాలనీలో రెక్కలు తప్ప ఇతర ఎలాంటి ఆస్తులు లేని 35 నిరుపేద కుటుంబాలు జీవిస్తున్నాయి. దినసరి కూలీపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. పిచ్చిమొక్కలు.. ముళ్ల పొదలు 15 ఏళ్ల క్రితం పట్టణంలోని అనిల్ టాకీస్ ఏరియా లోని ఖాళీ ప్రదేశాల్లో చిన్న గుడారాలు వేసుకొని జీ విస్తున్న జనానికి పునరావాసం కల్పించేందుకు పాండుఫారం శివారులో ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇచ్చింది. పేదలు తమకు కేటాయించిన స్థలాల్లో ప్లాస్టిక్ కవర్లతో కొందరు గుడారాలు వేసుకోగా, మ రికొందరు ఇనుప రేకులతో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కాలనీలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేవు. వీరి గుడారాల చుట్టూ పిచ్చిమొక్క లు, ముళ్ల పొదలు అల్లుకుపోయాయి. ఎక్కడి నుంచి ఏ విషపురుగు కాటు వేస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. పాములు ఇళ్లలోకి వస్తున్నాయని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలంలో రోడ్లు బురదమయంగా మారి వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలనీవాసులను అసలు మనుషులుగా అధికార యంత్రాంగం, పాలకులు గుర్తించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేను నా భర్త, ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నాను. కాలనీలోని తమ గుడారాల చుట్టూ పాము లు, తేళ్లు తిరుగుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నాం. కనీసం సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మించండి. ఏ అవసరానికై నా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. – సాయమ్మ, కాలనీవాసిరేషన్బియ్యం, పిల్లల చదువుకు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆచన్పల్లికి ఈ కాలనీ ప్రజలు వెళ్లాల్సి వస్తుంది. వైద్యం కోసం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోధన్ జిల్లా ప్రభుత్వాస్పత్రికి వెళ్తామని స్థానికులు చెబుతున్నారు. పునరావా సం కాలనీ ఏర్పడి ఏళ్లు గడిచినా కనీస సౌక ర్యాలు కల్పించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టలేదు. మున్సిపల్ పాలకులు మారుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదన వారిలో తన్నుకొస్తుంది. కొన్నేళ్ల నుంచి కాలనీవాసులు మున్సిపల్ శాఖ అధికారులు, సబ్ కలెక్టర్, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలని వేడుకున్నారు. -
చికిత్స పొందుతూ వార్డు సభ్యుడు మృతి
ఎల్లారెడ్డి: మండలంలోని మౌళాన్ఖేడ్ గ్రామ వార్డు సభ్యుడు మారటి పోచయ్య (47) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మూడు రోజుల క్రితం పోచయ్య ఎల్లారెడ్డి నుంచి మౌళాన్ఖేడ్కు వస్తుండగా అడవిపందులు అడ్డు రావడంతో బైక్పై నుంచి పడి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోచయ్యను హైదరాబాద్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడన్నారు. 3వ వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న పోచయ్య నెల రోజులు తిరగక ముందే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని రాంలక్ష్మణ్పల్లి గ్రామంలో ఓ ఇంట్లో మంగళవారం నాలుగు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లకావత్ రాము కొంతకాలంగా తన ఇంట్లో నాటుసారా తయారు చేస్తూ విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు మంగళవారం ఇంట్లో సోదాలు నిర్వహించామన్నారు. కూలర్లో రెండు ప్లాస్టిక్ సీసాల్లో అక్రమంగా దాచి ఉంచిన నాలుగు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని రాముపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
● తొలిరోజు ఇద్దరు విద్యార్థుల డిబార్ తెయూ (డిచ్పల్లి) : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయంలోని పరీక్ష కేంద్రాన్ని వైస్ చాన్సలర్ యాదగిరిరావు, కళాశాల ప్రిన్సిపల్ రాంబాబు, పరీక్షల నియంత్రణ అధికారి సంపత్ కుమార్, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్తో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అబ్జర్వర్లకు సూచించారు. పరీక్షలకు మొత్తం 1,981 విద్యార్థులకు 1,902 మంది హాజరుకాగా 79 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కాగా, తొలిరోజే ఇద్దరు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడి డిబార్కు గురైనట్లు ఆయన వివరించారు. కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ఆకాశవాణి రిలే కేంద్రంలో మంగళవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కేంద్రం ఆవరణలోని గడ్డి, ఇతర వ్యర్థాలకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్ రూరల్ : మండలంలోని మల్కాపూర్ (ఎ) గ్రామంలో ఉన్న అనంత పద్మానాభ స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మల్కాపూర్(ఎ),లక్ష్మాపూర్, అనంతగిరి, ధర్మారం గ్రామాల ఆధ్వర్యంలో 28 సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు మాకునూరి వెంకటరమణా చార్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం అంకురారోహణ, ఋత్వికుల దీక్షాధారణ, హారతి, మంత్ర పుష్పం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 5న సుప్రభాత సేవ, అభిషేకం, సుదర్శన కలశ ప్రతిష్ట, ధ్వజారోహరణ, నైవేద్యం, హారతి, తీర్థ, ప్రసాద వితరణ, సాయంత్రం హోమం, బలిప్రదాన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 7న డోలారోహణం, 8న శ్రీ లక్ష్మీ అనంత పద్మానాభ స్వామి రథోత్సవం, 9న చక్రతీర్థం, పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు సంపూర్ణమవుతాయని తెలిపారు. పిట్లం(జుక్కల్): మండల కేంద్రమైన పిట్లంలో సోమవారం రాత్రి జరిగిన బైక్ చోరీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాన్సువాడ నుంచి వచ్చిన క్లూస్ టీం అధికారి ప్రవీణ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, వేలిముద్రలు సేకరించారు. ఆయన వెంట పిట్లం ఎస్సై వెంకట్రావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
● జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతున్న జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి డిచ్పల్లి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీవో) సద్వినియోగం చేసుకోవాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సూచించారు. వాల్మార్ట్ మద్దతుతో అమలవుతున్న ఈ–ఫార్మ్ ప్రాజెక్ట్లో భాగంగా హక్దర్శక్, డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ సహకారంతో ‘‘ఎఫ్పీవోల కోసం ప్రభుత్వ పథకా లను వినియోగించుకోవడం’’ అనే అంశంపై డిచ్పల్లి మండలం సుద్దపల్లి శివారులోని రిసార్ట్లో రెండు రోజుల శిక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి పల్లె గంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పసుపు రైతులకు మంచి అవకాశాలు ఉన్నాయని, స్థిరమైన ఆదాయం కోసం సాంకేతిక పరిజ్ఞానం, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల సమర్థ వినియో గం ద్వారా ఎఫ్పీవోలను బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ ప్రాంతీయ అధికారి నరేంద్ర మాట్లాడుతూ.. ఏఐ ఆధారిత సాంకేతికత ఉపయోగించి రైతులు, ఎఫ్పీవోలు ఉత్పత్తి పెంచుకోవాలన్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గోపా ల్ ఎఫ్పీవోలకు అందుబాటులో ఉన్న బ్యాంకు రుణాల వివరాలు తెలిపారు. ప్రభుత్వ పథకాలు, అర్హతలు, దరఖాస్తు విధానాలపై హక్దర్శక్ ప్రతినిధులు వివరించారు. సమావేశంలో జేఎంకేపీఎం చైర్మన్ తిరుపతిరెడ్డి, డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాంత్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల 22 ఎఫ్పీవోలకు చెందిన 50 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. -
చదువుతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● బీసీ వసతిగృహ విద్యార్థులకు ‘ప్రేరణ’ఖలీల్వాడి : విద్యార్థి దశలో ఏకాగ్రతతో ఇష్టపడి చ దువుకుంటే, జీవితమంతా సంతోషమయంగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉద్బోధించారు. వి ద్యను ఆయుధంగా మల్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బ మున్నూరు కాపు కల్యాణ మండపంలో ‘ప్రేరణ’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్.. విద్యార్థులకు ప దో తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై దిశా నిర్దేశం చేశారు. ఉన్నత చదువు చదివి జీవితంలో స్థిరపడేందుకు పదో తరగతి తొలిమెట్టు అని అన్నారు. ఆరంభంలోనే తప్పటడుగు వేస్తే అది భవిష్యత్తును దెబ్బతీస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబ ద్ధంగా వార్షిక పరీక్షలకు అన్ని విధాలా సంసిద్ధులు కావాలని సూచించారు. ప్రస్తుతం వసతి గృహాల్లో అనేక వసతులు అందుబాటులోకి వచ్చాయని, ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తోందన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని ల క్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. చదు వు కష్టంగా అనిపించిన ప్రతీసారి తల్లిదండ్రులు ప డే కష్టాన్ని గుర్తుచేసుకుని మరింత కసి, పట్టుదలతో చదవాలని హితబోధ చేశారు. బాలికలు పట్టుదల తో రాణించాలని, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను ప్రద ర్శిస్తూ జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. పది పరీక్షల్లో ప్రతిభను చాటితే బిగ్ స్క్రీన్పై టీ20 వరల్డ్ కప్ లైవ్ మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేయిస్తానని వి ద్యార్థులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. పరీక్షలు సమీపించిన తరుణంలో సమయం ఏమాత్రం వృథా కా కుండా విద్యార్థులకు పునఃశ్చరణ జరిపించాలని ఉ పాధ్యాయులు, సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ఖిల్లా రామాలయ బ్రహ్మోత్సవాలు సంపూర్ణం
డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్): డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో వారం రోజులుగా జరుగుతున్న సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం నాకబలి, పుష్ప యాగం, ఉద్వాసన బలి కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు సుమిత్ శర్మ దేశ్ పాండే ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన నాగవెల్లి కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గజవాడ రాందాస్ గుప్తా, ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, సర్పంచ్ లొక్కిడి యాదగిరి, డైరెక్టర్లు గడ్డం నర్సారెడ్డి, సున్నం పోశెట్టి, సూర మాధురి, ఆసది జితేందర్, ఉప సర్పంచ్ సౌజన్య, వీడీసీ రైటర్ దాసరి అశోక్, క్యాషియర్ రాజారెడ్డి తదితరులు పాల్గొని పూజలు చేశారు. రాత్రి ఏకాంతసేవ కార్యక్రమంతో ఉత్సవాలు సంపూర్ణమయ్యాయి. -
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రచారం చేయాలి
రుద్రూర్ : శిక్షణ పొందిన మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఇతర రైతులకు తెలియజేసి ఆ దిశగా ప్రోత్సహించాలని కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా.టి.సుప్రజ సూచించారు. రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టులో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పూర్తిచేసిన కృషి సఖిలకు మంగళవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కోఆర్డినేటర్ మాట్లాడుతూ రైతులు ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఆహార సాంకేతిక కళాశాల అసోసియేట్ డీన్ డా. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా భావితరాలకు ఆరోగ్యవంతమైన నేలతోపాటు నాణ్యమైన ఆహారాన్ని అందించవచ్చని అన్నారు. కార్యక్రమంలో విస్తరణ శాస్త్రవేత్త డా.ఎం.శ్వేత, వ్యవసాయాధికారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు సమన్వయంతో పని చేయాలి
నిజామాబాద్ అర్బన్: సీఎం పర్యటన నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బైపాస్ రోడ్డు ప్రాంతంలో సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని సీపీ సాయిచైతన్య, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ మంగళవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్, వేదిక తదితర వాటి ఏర్పాట్లను నిర్ణీత గడువు కన్నా ముందే పూర్తి చేయాలన్నారు. పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని, భద్రత, వాహనాల పార్కింగ్ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, ఆర్ అండ్ బీ ఎస్ఈ సర్దార్ సింగ్, ట్రాన్స్కో ఎస్ఈ రాజేశ్వర్, ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న, డీపీవో శ్రీనివాస్ రావు, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ తదితరులు ఉన్నారు. -
ఆయకట్టుకు నీరందిస్తున్నా.. నిండుకుండే!
● రెండు విడతల్లో 6 టీఎంసీల విడుదల ● అయినా కళకళలాడుతున్న నిజాంసాగర్ నిజాంసాగర్: ఆయకట్టు కోసం ఇప్పటికే ఆరు టీ ఎంసీల నీటిని విడుదల చేసినా నిజాంసాగర్ ప్రా జెక్టు నిండుకుండలానే కళకళలాడుతోంది. సింగూర్ రిజర్వాయర్నుంచి నాలుగు టీఎంసీలు వచ్చి చేరడమే ఇందుకు కారణం. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు కరకట్ట, రివిట్మెంట్ మరమ్మతు పనులు చేపడుతుండడంతో నీటిని ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతనెల 10న ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. గత నెల 13 నుంచి ఈనెల ఒకటో తేదీ వరకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నాలుగు టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఒక టీఎంసీ నీరు మంజీర నదిలో స్టోర్ అయ్యింది. రెండో విడతలో సింగూరు నుంచి మరో మూడు టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ఆయకట్టుకు సాగునీరు.. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ పరిధిలో 1.5 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగవుతున్నాయి. ఇప్పటికే మొదటి విడతలో నెల రోజులపాటు 3.225 టీఎంసీల నీటిని విడుదల చేశారు. రెండ దఫాలో 21 రోజుల పాటు 2.6 టీఎంసీల నీటిని వదిలారు. నీటిని వదులుతుండడంతో ప్రాజెక్టు ఖాళీ కావాల్సి ఉండగా.. సింగూరు నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు మళ్లీ కళకళలాడుతోంది. ప్రాజెక్టు పూ ర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. మంగళవారం సాయంత్రానికి 1,403.33 అడుగుల (15.4 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. -
వలస కార్మికుల గోస తీరేనా..!
మోర్తాడ్(బాల్కొండ) : వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడకు చెందిన బొమ్మకంటి అరవింద్ గౌడ్(35) గత నెల జనవరి 7న టర్క్స్ అండ్ కై కోస్ ఐలాండ్స్–టీసీఐ(బ్రిటీష్ ఓవర్సీస్ టెరిటరీ)లో ఆకస్మికంగా మరణించాడు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల సాయం అరవింద్ కుటుంబానికి అందే అవకాశం లేదు. కే వలం గల్ఫ్ దేశాల్లో మరణించినవారికే రాష్ట్ర ప్రభు త్వం అందిస్తున్న సాయం వర్తిస్తుంది. కేంద్ర ప్రభు త్వం ఏదైనా సంక్షేమ పథకం అమలు చేసి ఉంటే ఎంతో కొంత అరవింద్ కుటుంబానికి చేయూత అందేది. రాష్ట్ర ప్రభుత్వం తన సాయాన్ని గల్ఫ్ దే శాల వలస కార్మికులకే పరిమితం చేయడం, కేంద్రం ఎలాంటి పథకాలను అమలు చేయకపోవడంతో అరవింద్లాంటి ఎన్నో బాధిత కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షలా మారాయి. వలస కార్మికులతో కేంద్రానికి ఆదాయం లభిస్తున్నా వారి బాగు కోసం ఎలాంటి కేటాయింపులు లేకుండానే బడ్జెట్ ప్రసంగం ముగియడం తీవ్ర నిరాశను మిగిల్చింది. గత ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విదేశీ వ్యవహారాల కోసం రూ.22,119 కోట్లను కేటాయించింది. ఈ నిధులలో కొంత మొత్తం ఆయా దేశాలకు సాయంగాను మరికొంత సంయుక్త ప్రాజెక్టుల కోసమే వినియోగించనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. విదేశాంగ శాఖకు కే టాయించిన నిధులలో కొంతైనా ఆయా దేశాల రాయబార కార్యాలయాల ద్వారా భారతీయ వలసదారులకు న్యాయ సహాయం ఇతర సౌకర్యాలను కల్పించడానికి వినియోగిస్తే మేలు అని పలువురు సూచిస్తున్నారు. కేంద్రం మాత్రం తన బడ్జెట్లో వలస కార్మికుల అంశంను అసలే ప్రస్తావించలేదు. కేంద్రం బాటలోనే రాష్ట్రాలు..వలస కార్మికుల విషయంలో కేంద్రం అనుస రిస్తున్న విధానాన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి. వలస కార్మికుల ద్వారా వచ్చే ఆదాయంపై చూపుతున్న ఆసక్తిని వారి మంచి చెడుల కోసం కనబరచకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. వలస కార్మికులు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వారికి పునరావాసం, పునరేకీకరణ చర్యలు తీసుకోకపోవడంతో అనేక మంది మానసిక క్షోభకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. వలస కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. వలస కార్మికుల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు నిర్లక్ష్యం వ హిస్తున్నాయి. రైతు ఉ ద్యమాల మాదిరిగానే వలస కార్మికుల కు టుంబాలతో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. – గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్ జేఏసీ చైర్మన్కేంద్ర బడ్జెట్లో వలస కార్మికుల సంక్షేమం కోసం కేటా యింపులు జరుపకపోవడం దురదృష్టకరం. వలసదారులతో వచ్చే ఆదాయం అవసరం ఉంది. కానీ వారి మంచి కోరే చర్యలు తీసుకోకపోవడం సరైంది కాదు. ప్ర భుత్వాలు పునరాలోచన చేయాలి. – స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు విదేశాల్లో వ్యాపారం, ఉద్యోగం చేస్తూ వలసదారులు ఆర్జిస్తున్న మొత్తంలో ఖర్చులు పోను మిగిలిన సొమ్మును భారతదేశానికే పంపిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల పౌరులకన్నా భారతీ యులే అత్యధికంగా విదేశీ మారకద్రవ్యాన్ని పంపిస్తున్న జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. 2025లో రూ.10.25లక్షల కోట్ల ధనాన్ని చేరవేశా రు. కేంద్ర బడ్జెట్కు రూ.1,10,700 కోట్లను విదేశాల్లో ఉన్న మన దేశ పౌరులు అందించారు. అ యినా వలసదారుల సంక్షేమం బాధ్యతను కేంద్రం రాష్ట్రాలకే అప్పగించి చేతులు దులుపుకుందనే విమర్శ వ్యక్తమవుతోంది. గల్ఫ్ బోర్డును ఏ ర్పాటు చేయాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తున్నా ఉలుకుపలుకు లేకుండా పోయింది. ఆదాయం ఉన్నా... కేటాయింపులు సున్నా.. కేంద్ర బడ్జెట్లో వలస కార్మికుల సంక్షేమంపై ఊసెత్తకపోవడంతో సర్వత్రా నిరసన రెమిటెన్స్లలో మొదటిస్థానంలో నిలిచినా వలసదారులకు అన్యాయమే -
ప్రచార పరుగు!
ఎన్ఎంసీ బరిలో 350 మంది● 298 నామినేషన్ల ఉపసంహరణసుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్లలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు కలుపుకుని మొత్తం 350 మంది నిలిచారు. మంగళవారం 3 గంటల వర కు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. అన్ని పార్టీలు, స్వతంత్రులు కలిపి 298 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకు న్న వారిలో కాంగ్రెస్–128, బీజేపీ–97, బీఆర్ఎస్–20, ఎంఐఎం–21, స్వతంత్రులు–24, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు–8 మంది ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ తెలిపారు. అలా గే బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. గుర్తులతో ప్రజల్లోకి వెళ్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆర్మూర్లో 153.. బోధన్లో 162.. భీమ్గల్లో 49 మంది.. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులకు 153 మంది బరిలో మిగిలారు. అలాగే బోధన్లో 38 వార్డులకు 162 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు 38 వార్డుల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. భీమ్గల్ పట్టణంలో 12 వార్డుల్లో 49 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో మున్సిపల్ ఎన్నికల బరిలో నిలబడిన ఆయా పార్టీల అభ్యర్థులు తక్షణమే ప్రచారాన్ని మరింత స్పీడ్ చేశారు. ప్రచారానికి కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో నిజామాబాద్ నగరపాలక సంస్థ, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులు ఓటర్లను పూర్తి స్థాయిలో కలిసేందుకు ఆయా డివిజన్లు, వార్డుల్లో ఊపిరి సలపని స్థాయిలో ప్రచారంలోకి దిగారు. ఈ నెల 9 వరకు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా హైరానా పడుతున్నారు. ● నిజామాబాద్ మేయర్ స్థానంపై కన్నేసిన కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అనేస్థాయిలో హోరాహోరీగా తలపడుతున్నా యి. ఎంఐఎం సైతం తన పట్టును నిలబెట్టుకునేందుకు ప్ర ణాళికలు రచించి ముందుకు వెళుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థులు కింగ్మేకర్ కావాలనే లక్ష్యంతో పరుగు లు తీస్తున్నారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కవిత అనుచరులు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గు ర్తుపై బరిలోకి దిగారు. నిజామాబాద్ నగరంలో మొత్తం అన్ని పక్షాలకు సంబంధించి 298 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివ రకు 60 డివిజన్లలో కలిపి 350 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కంటే మూ డు రోజులు ముందుగానే బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం చివరి రోజున ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల వి షయమై సుదీర్ఘ ఉత్కంఠ నడిచింది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు ముందుగానే ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు బుధ వారం నుంచి ప్రచారంలోకి దిగుతున్నారు. కాగా చివరి వరకు ప్రయత్నించినప్పటికీ టికెట్టు రాని అసంతృప్తులు ఏమేరకు గెలుపోటములను ప్రభావితం చేస్తారనే టెన్షన్ ప్రధాన పార్టీల్లో ఉంది. ● ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు నిజామాబాద్ మేయర్ పదవిని దక్కించుకునే విషయంలో పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డిలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మేయర్ పీఠం దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నెల 6న సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటన తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మేయర్ అభ్యర్థులు కాటిపల్లి శమంతరెడ్డి, గోపిడి స్రవంతిరెడ్డి తమ డివిజన్లలో గెలుపొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో గ్రౌండ్లోకి అభ్యర్థులు సమయం తక్కువగా ఉండడంతో ప్రధాన పార్టీల హడావుడి 6న జిల్లాలో సీఎం పర్యటనపై కాంగ్రెస్ ఆశలు ముందుగానే రంగంలోకి దిగిన బీజేపీ -
పుష్కరఘాట్ నిర్మాణానికి స్థల పరిశీలన
నవీపేట: మండలంలోని యంచ శివారులోని గోదావరి నది ఒడ్డున పుష్కర ఘాట్ నిర్మాణం కోసం దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. యంచ శివారులో పుష్కర ఘాట్ను నిర్మించాలని శ్రీ ఓం జగదాద్రి ట్రస్టు ప్రతినిధులు, వీడీసీ ప్రతినిధులు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డితోపాటు కలెక్టర్ను కోరవడంతో స్థలాన్ని పరిశీలించాలని వారు అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయరామారావు నది ఒడ్డున ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. స్థలం అనుకూలంగా ఉండడంతో నివేదికలను అధికారులను అందజేస్తామన్నారు. సర్పంచ్ బేగరి సాయిలు, ఉప సర్పంచ్ ప్రవీణ్, వీడీసీ ప్రతినిధులు రాజేశ్వర్, కొట్టాల ప్రవీణ్, చింటూ, చంద్ర లక్ష్మణ్, ట్రస్ట్ ప్రతినిధులు సురేశ్, రమేశ్ తదితరులు ఉన్నారు. 14న నీట్, ఐఐటీ, సీఏ ప్రవేశ పరీక్ష ఖలీల్వాడి : నాగారంలోని తెలంగాణ మైనారిటీ బాలుర జూనియర్ కళాశాలలో ఐఐటీ, నీట్, క్లాట్, సీఏ ఉచిత కోచింగ్కు ఈ నెల 14న ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రిన్సిపాల్ సయ్యద్ హైదర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోచింగ్తోపాటు ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులలో అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి ఈ నెల 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ అఫీషియల్ వ్యవహారాల ప్రతినిధిగా గన్రాజ్ నిజామాబాద్ రూరల్: టీపీసీసీ ప్రె సిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్గౌడ్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అఫీషి యల్ వ్యవహారాల ప్రతినిధిగా కాపుకర్ గన్రాజ్ నియామకం అయ్యారు. నిజామాబాద్ కా ర్పొరేషన్తోపాటు మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల స మస్యలను గన్రాజ్ నివృత్తి చేయనున్నారు. కాంగ్రెస్ కమిటీ తరఫున ఎలక్షన్ కమిషన్కి వా రధిగా, కాంగ్రెస్ ప్రతినిధిగా ఎలక్షన్స్కి సంబంధించిన అఫీషియల్ వ్య వహారాలు, ఎలక్షన్ కమిషన్తో సంప్రదింపులు, తదితర సమస్యల ను గన్రాజ్ దృష్టికి తీసుకురావాలని కోరారు. హుండీ ఆదాయం లెక్కింపు బోధన్: ఎడపల్లి మండలంలోని జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మమోత్సవాలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.93 వేల 667 నగదు ఆదాయం సమకూరిందని ఈవో వేణు తెలిపారు. అలాగే ప్రత్యేక పూజలు, తైబజార్ కలుపుకుని మొత్తం రూ.2లక్షల 8 వేల 951 ఆదాయం సమకూరిందని వివరించారు. గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
6న సీఎం రేవంత్రెడ్డి పర్యటన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 6న జిల్లా పర్యటనకు రానున్నారు. సీఎం అ య్యాక రేవంత్రెడ్డిది ఇదే మొదటి అధికారిక పర్యటన. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేశాపూర్ వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చే స్తున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సభ ద్వారా ము ఖ్యమంత్రి రేవతంరెడ్డి జిల్లా అభివృద్ధికి సంబంధించి దిశానిర్దేశం చేసే కీలకమైన ప్రకటనలు చేయనున్నారన్నారు. సుమారు 50వేల మందితో సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం పర్యటన చారిత్రక ఘట్టం కానుందన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కా ర్యకర్తలు భారీగా హాజరై సభను విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. వారివెంట నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, డీసీసీ కార్యదర్శి గడ్కోల్ భాస్కర్రెడ్డి, బీరెడ్డి సంతోష్రెడ్డి, జావెద్ అక్రమ్, కేశాపూర్, బర్థిపూర్, కంజర్, ధర్మారం సర్పంచ్లు గంగారెడ్డి, భాస్కర్, రాకేశ్యాదవ్, వాసుబాబు, యూత్ నా యకులు నరేశ్, పెంటాజీ తదితరులు ఉన్నారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, నాయకులు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపు -
90 ఏళ్ల కుర్రాడు!
● వృద్ధాప్య కష్టాలు ఎరుగని కిష్టన్న ● యువకులతో పోటీపడుతూ వ్యవసాయ పనులు ● ఎక్కడికి వెళ్లినా సైకిల్పైనే..డొంకేశ్వర్(ఆర్మూర్): వృద్ధాప్య కష్టాలు ఏ మాత్రం తెలియని కిష్టన్న 90 ఏళ్ల వయస్సులో రయ్మని దూసుకుపోతున్నారు. పొలం గట్లపై యువరైతులతో పోటీ పడుతూ వారి ఉత్సాహాన్ని నింపుతున్నారు. డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామానికి చెందిన బానోత్ కిష్టన్న 90 ఏళ్ల వయస్సు వచ్చినా వృద్ధాప్యం అంటే ఏమిటో తెలియని వ్యక్తిలా అందరినీ ఆశ్యపరుస్తున్నారు. వ్యవసాయదారుడైన కిష్టన్న ఎక్కడికి వెళ్లినా గత 40 ఏళ్లుగా సైకిల్పైనే ప్రయాణం చేస్తున్నాడు. మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా, మండలం దాటి నందిపేట్, మాక్లూర్, ఆర్మూర్, నిజామాబాద్ ప్రాంతాలకు సైతం సైకిల్పైనే వెళ్లడం అలవాటుగా మారింది. పొలానికి ఇంటికి ప్రతిరోజూ నాలుగైదు కిలో మీటర్లు సైకిల్ తొక్కుతున్నాడు. కాగా బంధువుల ఇళ్లకు, శుభ కార్యాలకు కూడా సైకిల్నే వాడుతూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. కిష్టన్న గత 35 సంవత్సరాలుగా ఒకే సైకిల్ను సెంటిమెంట్గా వాడుతున్నాడు. కిష్టన్న కొడుక్కి 55 ఏళ్లు, మనవడికి 35 ఏళ్లు. ప్రస్తుతం జీవన శైలిలో 60 సంవత్సరాలు బతికితేనే మహాభాగ్యం అనుకుంటున్న రోజుల్లో కిష్టన్న 90 ఏళ్ల ప్రాయంలో కూడా సైకిల్ తొక్కడం, వ్యవసాయం చేయడం నిజంగా వరమనే చెప్పాలి. వ్యవసాయం, సైకిల్ తొక్కడమే.. ప్రతిరోజూ వ్యవసాయ పనులు చేయడం, సైకిల్ తొక్కడమే తన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయని కిష్టన్న చెబుతున్నాడు. రొట్టెలు తింటానని, మాంసాహారం, మద్యం, కల్లుకు దూరంగా ఉంటానని అంటున్నాడు. పొలాల్లో పండించిన చిరు ధాన్యాలు, కూరగాయలు తింటానని తెలిపారు. -
ఆర్మూర్ కాంగ్రెస్లో ధిక్కార స్వరం
● బీ ఫామ్లు అమ్ముకున్నారని ఆరోపణ ● ఇద్దరు నాయకులు వార్డులను పంచుకున్నారు ● పార్టీ అభ్యర్థులను ఓడిస్తామన్న రెబల్స్ ఆర్మూర్: టికెట్లు ఆశించి భంగపడిన వారు ఆ ర్మూర్ కాంగ్రెస్లో ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నా రు. పార్టీ అభ్యర్థుల తరఫున బీఫామ్లను కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారులకు అందజేయడంతో టికెట్ రాని వారు ఒక్కసారిగా అసంతృప్తిని వె ల్లగక్కారు. ఒక్కొక్కరుగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ నాయకత్వంపై దుమ్మెత్తి పో స్తున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్(చిన్న), పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి పట్టణంలోని 36 వార్డులను పంచుకొని తమ అనుచరులకు మాత్రమే బీ ఫామ్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 2వ వార్డు నుంచి వనం శేఖర్, 3వ వార్డు నుంచి పూల నర్సయ్య, 13వ వార్డు నుంచి కన్న లక్ష్మణ్, 14వ వార్డు నుంచి ఇంతియాజ్, 19వ వార్డు నుంచి విజయ్ అగర్వాల్, 20వ వార్డు నుంచి ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ మున్న, 27వ వార్డు నుంచి మాజీ కౌన్సిలర్ అతిక్ కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడ్డారు. ఆయా వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ని లుస్తామని, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి ఆ వా ర్డుల్లో తమ బలాన్ని ప్రదర్శిస్తామని అంటున్నారు. ఓడించి తీరుతాం తమను నమ్మించి మోసం చేశారని, కాంగ్రెస్ అభ్యర్థులపై స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి వారిని ఓడించి తీరుతామని రెబల్స్ వనం శేఖర్, విజయ్ అగర్వాల్, పూల నర్సయ్య, కన్న లక్ష్మణ్ అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ వారు మీడియాతో మాట్లాడారు. ఇన్ని రోజులుగా కాంగ్రెస్కు సేవలందిస్తున్న తమను కాదని కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు బీ ఫామ్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తాము చేసిన నిస్వార్థ సేవలను గుర్తించి స్వతంత్రులుగా బరిలో ఉంటున్న తమను గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
సర్పంచ్ పదవి కోసం కన్న కూతురునే కడతేర్చి..
నిజామాబాదు జిల్లా: మహారాష్ట్రలో మరో ఆరు నెలల్లో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకున్నాడు. అందుకు ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా నిలవడంతో కన్నబిడ్డనే హతమార్చిన ఘటన వెలుగు చూసింది. నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య సోమవారం ఎడపల్లి పోలీస్ స్టేషన్లో మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... జనవరి 29న ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామ పరిధిలో గల నిజాంసాగర్ డి–46/8 కెనాల్లో గుర్తు తెలియని ఆరేళ్ల బాలిక మృత దేహం కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాలిక వివరాల కోసం మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు బృందంలో ఒకరైన కానిస్టేబుల్ సు«దీర్ తన వాట్సాప్ స్టేటస్లో బాలిక మృత దేహం ఫొటో పెట్టాడు. ఈ వాట్సాప్ స్టేటస్ చూసిన మహారాష్ట్ర ప్రాంతంలోని ముఖేడ్కు చెందిన ఆయన బంధువులు ఫోన్ చేసి బాలిక వివరాలు తెలిపారు. ముఖేడ్ పట్టణ కేంద్రానికి చెందిన బాలిక పేరు ప్రాచి కొండమంగలే అని చెప్పారు. ముఖేడ్కు వెళ్లిన పోలీసుల బృందం విచారణలో బాలికను కన్న తండ్రే హతమార్చిన విషయం తెలిసింది. బోధన్ రెవెన్యూ డివిజన్కు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని ముఖేడ్ తాలూకా కెరుర్ గ్రామానికి చెందిన కొండమంగలే పాండురంగకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పాండురంగ ముఖేడ్లో విరాట్ సెలూన్ పేరిట షాపు పెట్టి క్షౌ ర వృత్తి చేస్తున్నాడు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కెరుర్ గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేయాలని భావించాడు. ఈ విషయాన్ని అప్పుడప్పుడూ సెలూన్కు వచ్చే ప్రస్తుత కెరుర్ గ్రామ సర్పంచ్ గణేశ్ షిండేకు తెలిపాడు. ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హుడవుతావని గణేశ్ చెప్పడంతో, పాండురంగ తన ముగ్గురు పిల్లల్లోని బాబును ఎవరికైనా దత్తత ఇవ్వాలని ప్రయతి్నంచాడు. పుట్టిన తేదీని మార్చాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి తప్పిపోయినట్టు అందరికీ చెప్పాలని పాండురంగ, గణేశ్ కలిసి ప్లాన్ చేశారు. అనంతరం పాండురంగ తన పెద్ద కూతురు ప్రాచికి నిజామాబాద్ వెళ్దామని మాయ మాటలు చెప్పాడు. మోటార్ బైక్పై తీసుకొచ్చి మార్గ మధ్యలో ఎడపల్లి మండలం నిజాంసాగర్ కెనాల్ నీటిలో తోసేశాడు. ఈ కేసులో పాండురంగ, గణేశ్లను అరెస్టు చేశామని, మోటార్ బైక్, మూడు మొబైల్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నట్టు సీపీ సాయి చైతన్య తెలిపారు. బాలిక హత్య కేసును ఛేదించిన రూరల్ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, ఏఎస్ఐ బాబూరావు, కానిస్టేబుల్స్ సు«దీర్, శ్రీకాంత్లను సీపీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రీల్స్... ఏఐ కాల్స్
● పురపోరులో వినూత్నంగా అభ్యర్థుల ప్రచారం ● ఓటర్లను ఆకర్షించేలా సోషల్ మీడియా వాడకం నిజామాబాద్ రూరల్: పురపోరులో అభ్యర్థులు ప్రచారానికి సరికొత్త దారిని ఎంచుకుంటున్నారు. గెలుపే ధ్యేయంగా ఓటర్లను ఆకర్షించేలా సాంకేతికతను వాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రీల్స్.. షార్ట్ వీడియోలు ప్రస్తుతం అందరి చేతుల్లో మొబైల్స్ సర్వసాధారణం. మున్సిపల్ డివిజన్, వార్డుల్లో ఓటర్లందరూ అభ్యర్థులకు తెలిసే అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో ప్రతి ఓటరుకు తమ సందేశం చేరేలా అభ్యర్థులు సోషల్ మీడియాను ఎంచుకున్నారు. ఇన్స్ట్రాగామ్లో రీల్స్ చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా షార్ట్స్ చేస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. స్థానిక సమస్యలపై వివరిస్తూ తమను గెలిపిస్తే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. వార్డులు, డివిజన్లో రోజూవారీగా చేస్తున్న ప్రచారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ప్రచారానికి ఉపయోగిస్తున్న కరపత్రాలపై క్యూఆర్ కోడ్లను ముద్రిస్తూ వాటి ద్వారా తమ వీడియో సందేశాన్ని ఓటర్లకు చేరవేస్తున్నారు. ఏఐ కాల్స్... అభ్యర్థులు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను సైతం విరివిగా వాడుతున్నారు. అభ్యర్థుల స్వరంతో ఓటర్లకు వ్యక్తిగతంగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఏఐ ద్వారా ప్రచార పోస్టర్లను తయారు చేయిస్తున్నారు. -
బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ అంకిత్ ● పీవో, ఏపీవోలకు శిక్షణ బోధన్టౌన్(బోధన్): మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. పట్టణంలోని లయన్స్ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు సోమవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. బోధన్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో పీవోలు, ఏపీవోలు బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించాలని, ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు జరుగకుండా చూడాలన్నారు. మాస్టర్ ట్రైనర్లు ఇచ్చిన సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. స్ట్రాంగ్ రూంల పరిశీలన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని విజయ మేరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల భద్రత, సీసీటీవీల పర్యవేక్షణ, సీల్ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సామగ్రి పంపిణీ కేంద్రంలో వసతులు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు తలత్తెకుండా జాగ్రత్తలు తీసుకుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, తహసీల్దార్ విఠల్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఉన్నారు. మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ అంకిత్ , పాల్గొన్న పీవోలు, ఏపీవోలు -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్ట్
కామారెడ్డి క్రైం: తప్పించుకొని తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులిద్దరిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర వివరాలు వెల్లడించారు. గత నెల 2 న మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడి నగదు, బంగారం అపహరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన చిల్లకూరి క్రిష్ణారెడ్డి అలియాస్ చండీక్రిష్ణను పోలీసులు 20 రోజుల క్రితమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు నిందితులు మూడవత్ అంజియా, సత్యనారాయణ (దొంగ సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తి)లను కామారెడ్డిలోని సిరిసిల్ల బైపాస్ వద్ద అనుమాన్పాదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పట్టుబడిన నిందితులు క్రిష్ణారెడ్డి, మరోవ్యక్తి అయిన ప్రభులతో కలిసి తాళం వేసిన షట్టర్లు, ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. దొంగిలించిన బంగారు ఆభరణాలను ముత్తూట్, ఇతర ఫైనాన్స్లలో తాకట్టు పెట్టడం, గుర్తు తెలియని వ్యాపారులకు అమ్మడం చేస్తారని, వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుంటారని విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. అంజియాపై ఏపీ, తెలంగాణల్లోని పలు పీఎస్లలో 5, క్రిష్ణారెడ్డిపై 8 కేసులు ఉన్నట్లు వివరించారు. కేసు ఛేదనలో కృషి చేసిన సీఐ నరహరి, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, సిబ్బందిని అభినందించారు. బంగారం గొలుసు చోరీ కేసులో.. వృద్ధురాలిని నమ్మించి బంగారం గొలుసు అపహరించిన కేసులో నిందితుడిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డీపీవోలో సోమవారం ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని భరత్ రోడ్కు చెందిన బట్టు నర్సవ్వ కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తోంది. రెండు రోజుల క్రితం భూపుత్రమ్మ కల్యాణ మండపం సమీపంలోని కల్లు దుకాణంలో కల్లు సేవించి ఇంటికి వెళ్తుండగా గాంధారి మండలం జెమిని తండాకు చెందిన రత్లా రవి మాటలు కలిపాడు. ఆమె సరిగ్గా నడవలేని స్ధితిలో ఉండటాన్ని గమనించి బైక్పై ఇంటివద్ద దింపుతానని నమ్మించాడు. ఇంటికి తీసుకువెళ్లిన అనంతరం వృద్ధురాలికి మళ్లీ కల్లు తాగించి, మత్తులో ఉన్న ఆమె మెడలో నుంచి తులం బంగారు గుండ్లను లాక్కొని పరారయ్యాడు. మరుసటి రోజు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రవిని గుర్తించి సోమవారం పట్టుకున్నారు. పట్టణ పోలీసులను ఎస్పీ అభినందించారు. -
క్రైం కార్నర్
నవీపేట: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మల్లెపూల శ్రీనివాస్(46) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ సోమవారం తెలిపారు. మూడు రోజుల క్రితం మండలంలోని నిజాంపూర్–తుంగిని గ్రామాల మధ్య రహదారిపై రెండు బైకులు ఢీకొనడంతో నవీపేటకు చెందిన రాజు అక్కడికక్కడే మృతి చెందగా మల్లెపూల శ్రీనివాస్, నరేశ్ గాయపడ్డారని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన మల్లెపూల శ్రీనివాస్ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపి ఒకరికి స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష సాయితల్ప సాయి వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. ఉద్మీర్గల్లీకి చెందిన గంగాధర్ మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకొని బోధన్ కోర్టులో హాజరుపర్చారు. వారం రోజుల జైలు శిక్షను విధిస్తూ జడ్జి తీర్పునిచ్చినట్లు తెలిపారు. పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని కాస్లాబాద్ గ్రామశివారులో ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు చేసి పేకాడుతున్న 10 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై అరుణ్ కుమార్ పేర్కొన్నారు. వారి నుంచి రూ.3,200, మూడు ఫోన్ల్, మూడు బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ షాప్లో పేకాడుతున్న ఆరుగురిని పట్టుకొని వారి నుంచి రూ.3,480 నగదు, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. -
కుటుంబకలహాలతో భర్త ఆత్మహత్య
● భార్యను కాపాడిన స్థానికులు ● చిన్న మల్లారెడ్డి చెరువు వద్ద ఘటన కామారెడ్డి క్రైం: భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ ఒకరి ఆత్మహత్యకు దారితీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాడ్వాయి మండలం సోమారం గ్రామానికి చెందిన చింతమడక రాజేశ్వర్ (45), అతని భార్య అర్పిత సోమవారం కామారెడ్డికి వచ్చి బైక్పై తిరిగి వెళ్తుండగా చిన్న మల్లారెడ్డి కల్లు దుకాణం వద్ద ఆగారు. అక్కడ కుటుంబ విషయాలపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన రాజేశ్వర్ పక్కనే ఉన్న చెరువులో దూకేశాడు. గమనించిన అర్పిత కూడా చెరువులోకి దూకేందుకు ప్రయత్నించగా స్థానికులు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రాజేశ్వర్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్: హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. జనవరి 22న ముజాయిద్నగర్లోని బాబాకిరాణం షాపు వద్ద గొడవ జరిగింది. ఈ వ్య వహరంలో జహీర్ అనే వ్యక్తికి కత్తిపోట్లు జరిగాయి. ఘటనలో జునేద్, మునవర్, అబ్దుల్వహీద్, మహ్మద్ షేక్ రఫీక్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. గౌస్, ఫజీల్ పరారీలో ఉన్నారని, నిందితుల నుంచి కత్తి, రెండు రాడ్లు, కర్రలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. -
కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ పరిశీలన
సుభాష్నగర్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూమ్లను మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ సోమవారం పరిశీలించారు. కౌంటింగ్ కోసం డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన టేబుళ్లు, విద్యుత్ సరఫరా, పోలింగ్ కేంద్రాల సంఖ్య, ఇతరత్రా వసతులను అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు, బ్యాలెట్ బాక్సుల రవాణా, సిబ్బందిపై ఆరా తీశారు. కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కమిషనర్ సూచించారు. ఆయన వెంట టౌన్ప్లానింగ్ ఏసీపీలు, అధికారులు ఉన్నారు. -
విద్యార్థులకు బహుమతుల ప్రదానం
ఖలీల్వాడి: జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంఘిక శాస్త్ర ప్రతిభాపాటవ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు సోమవారం బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంగ్లిష్, తెలుగు మీడి యం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇంగ్లిష్ మీడియంలో కె.నిహారిక (టీజీఎమ్ఎస్, ఆర్మూర్), జి.సరయు (టీజీఎమ్ఎస్, ఆర్మూర్), ఎస్. దర్శిని (టీజీఎమ్ఎస్, ధర్పల్లి) ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కై వసం చేసుకున్నారు. తెలుగు మీడియంలో ఎం.అక్షయ (జెడ్పీహెచ్ఎస్, పెంటాకుర్దు), ఎం.సింధు (జెడ్పీహెచ్ఎస్, పెంటకలాన్), జి. నరసింహ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వీరికి త్వరలో రాష్ట్రస్థాయి ప్రతిభాపాటవ పరీక్ష హైదరాబాద్లో జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీబీ చైర్మన్ సీతయ్య, నిజామాబాద్ సౌత్ ఎంఈవో సాయి రెడ్డి, సోషల్ ఫోరం జిల్లా అధ్యక్షులు శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి నారాయణ, గెజిటెడ్ హెచ్ఎంలు మురళి, రవి రవీందర్ ,వెంకట్రాంరెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సీతారాముల వనవిహారం
డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్): డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో నిర్వహిస్తున్న తిరుక్కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం సీతారాముల వనవిహారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు సుమిత్ శర్మ దేశ్ పాండే ఆధ్వర్యంలో ఉదయం హోమం, పూర్ణాహుతి నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం గ్రామశివారులోని మామిడి తోటలో సీతారాముల ఉత్సవమూర్తులను వనవిహారం చేయించారు. ఈ సందర్భంగా చక్రతీర్థం(జాతర) నిర్వహించారు. జాతరలో వివిధ రకాల దుకాణాలు ఏర్పాటు కాగా, భక్తులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. రాత్రికి సీతారాముల వారిని గజవాహనంపై ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం స్వామి వారి ఏకాంత సేవతో ఉత్సవాలు సంపూర్ణమవుతాయని ఆలయ ప్రధానార్చకులు సుమిత్ శర్మ దేశపాండే తెలిపారు. భక్తులకు గ్రామావృవద్ధి కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. లాల్బహదూర్ యూత్ ఆధ్వర్యంలో పానకం, వడపప్పు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గజవాడ రాందాస్ గుప్తా, ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, సర్పంచ్ లొక్కిడి యాదగిరి, డైరెక్టర్లు గడ్డం నర్సారెడ్డి, సున్నం పోశెట్టి, సూర మాధురి, ఆసది జితేందర్, సొసైటీ మాజీ చైర్మన్ గజవాడ జైపాల్, బూస సుదర్శన్, వీడీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందూరు’పై బీజేపీ జెండా ఎగురవేస్తాం
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సుభాష్నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు, కార్యకర్తలంతా ఐక్యంగా పని చేస్తే ఇందూరుపై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయ మని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అధ్యక్షతన అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ రెండేళ్లుగా తాను నగరాభివృద్ధికి సుమారు రూ.130 కోట్లు నిధులు తీసుకొచ్చానని వెల్లడించారు. ఇటీవల కాలంలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా ప్రతి డివిజన్కు రూ.కోటీ చొప్పన నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని, డివిజన్లలో సమగ్రంగా అభివృద్ధి పనులు జరగనున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి రూ.23 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కోసం ఇందూరులో నిర్వహించిన అన్ని సర్వేలు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. మన ఇందూరు.. మన మేయర్ నినాదాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. నేటి నుంచి తనతోపాటు ఎంపీ అర్వింద్, జిల్లా, రాష్ట్ర నాయకులు, పదాధికారులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నక్క రాజేశ్వర్, బద్దం కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సంపూర్ణం
● రసవత్తరంగా కుస్తీ పోటీలు ● ఘనంగా చక్రస్నానం బోధన్: ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామశివారులో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం సంపూర్ణమయ్యాయి. ఉదయం అష్టముఖి కోనేరులో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు చక్రస్నానం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. విజేతలకు గ్రామపెద్దలు నగదు బహుమతిని ప్రదానం చేశారు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామపెద్దలు రాధాకిషన్ గౌడ్, విజయ్కుమార్ గౌడ్, ఉప్పు సంతోష్, మిద్దె చిన్నయ్య, ఉప్పు సురేశ్, కిశోర్, ఆలయ ఈవో వేణు తదితరులు పాల్గొన్నారు. కుస్తీ పోటీల్లో తలపడుతున్న మల్లయోధులుమల్లయోధుడికి నగదు బహుమతి అందజేస్తున్న గ్రామపెద్దలు


