breaking news
Nizamabad
-
పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం తగదు
● విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే షోకాజ్ నోటీసులు ● మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ సుభాష్నగర్: నగరంలోని ఆస్తి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం తగదని, ఎవరైనా విధుల్లో అలసత్వం ప్ర దర్శిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ ఆదేశించారు. ఆదివా రం నగరంలోని జోన్ – 1 కార్యాలయంలో జోనల్, నోడల్, సూపర్వైజర్, సపోర్టింగ్ స్టాఫ్తో పన్నుల వసూళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఈనెలాఖరు నాటికి రూ.35కోట్ల లక్ష్యాన్ని చేరుకునే లా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అందుకనుగుణంగా జోన్కు జోనల్ ఆఫీసర్, నోడల్ ఆ ఫీసర్, సూపర్వైజర్తోపాటు సపోర్టింగ్ స్టాఫ్తో ప్ర త్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వ రకు పన్నుల వసూళ్ల కోసం క్షేత్రస్థాయిలో తిరగాల ని సూచించారు. ఈనెలాఖరు నాటికి లక్ష్యాన్ని చేరు కునేలా చూడాలన్నారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం విధులకు సకాలంలో హాజరు కాని ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ తెలిపారు. అనంతరం జోన్–1 పరిధిలో పైప్లైన్ లీకేజీ మరమ్మతు పనులను స్థానిక ఏఈతో కలిసి కమిషనర్ పరిశీలించారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నీటిని పొదుపుగా వాడుకోవాలి
మోపాల్: నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేంద్రకుమార్ సూచించారు. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని ఒడ్డెరకాలనీ గ్రామపంచాయతీలో జల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి వినియోగంపై గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఫ్లకార్డులతో అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఈ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రభుత్వం ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోందని అన్నారు. నల్లాలు లేని రోజుల్లో మహిళలు నీటి కోసం బిందెలు పట్టుకుని బోరుబావుల వద్దకు వెళ్లే వారని, ఈ స్కీమ్ను మహిళల కోసమే ప్రవేశపెట్టారని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మిషన్ భగీరథ నీటిని పూర్తిగా క్లోరినేషన్, బ్లీచింగ్ చేసిన తర్వాతే సరఫరా చేస్తున్నామని, ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఆ నీటిని తాగడానికి వినియోగించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా వేసవిలో నీటిని వృథా చేయొద్దని, గ్రామంలో వందశాతం మిషన్ భగీరథ నీటిని వినియోగిస్తున్నారని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సర్పంచ్ సుమలతను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇంట్రా, గ్రిడ్ ఈఈలు రాకేశ్, నరేశ్, ఎంపీడీవో రాములు నాయక్, డీఈలు వెంకటేశ్వర్ గౌడ్, శివ, ఏఈ వినయ్రెడ్డి, ఎంపీవో కిరణ్కుమార్, ఉపసర్పంచ్ దుర్గయ్య, జీపీ కార్యదర్శి నర్సింహులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతనతో మోక్షం
నిజామాబాద్ రూరల్: ఆధ్యాత్మిక చింతనతో మోక్షం లభిస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతం, ఇందిరా ప్రియదర్శిని కాలనీల్లో నూతనంగా నిర్మించిన ఇందూర్ ఘడ్ జగదాంబ – సేవాలాల్ మహరాజ్ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనన్పాల్ సూర్యనారాయణ, పౌరఘడ్ పీఠాధిపతి జితేందర్ సింగ్ మహరాజ్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ..మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమాలను జ్యోషి మధుసూదన్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి , రమేశ్, 42వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ శశాంక్ రెడ్డి, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మి నారాయణ , 39వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి మురళి, డాక్టర్ మెతితాల్, పాండ్యరావు, దేవిసింగ్, హవాల్సింగ్, బిలోజీనాయక్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
● ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ● ఇందూరులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఖలీల్వాడి/ సిరికొండ/ సుభాష్నగర్/ మోపాల్/ నిజామాబాద్ రూరల్/ ధర్పల్లి/ నిజామాబాద్ అర్బన్: మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో 150 మంది మహిళలను జిల్లా పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు చేశామని, పోలీస్ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు మోహన్రెడ్డి, కిషన్ మాట్లాడుతూ పీఆర్టీయూ ఎల్లప్పుడూ మహిళల పక్షపాతిగా ఉంటుందన్నా రు. కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, డీఈవో అశోక్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అంకం నరేశ్, సోషల్ మీడియా కన్వీనర్ రవీందర్రెడ్డి, అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్ జీపీ కార్యాలయంలో మహిళా వార్డు సభ్యులను, మహిళా ఉద్యోగులను సర్పంచ్ పిట్ల వనితనర్సింగ్ ఘనంగా సన్మానించారు. ఉపసర్పంచ్ తలకట్ల రాములు, జీపీ కార్యదర్శి రాజు, కారొబార్ చింటు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జాగిరపు నర్సారెడ్డి, లియాఖత్ అలీ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని బీసీ డిగ్రీ ఉమెన్స్ హాస్టల్లో మహిళా దినోత్సవ వేడుకలను ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి బీ సుజాత, రజియా, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ మనుషాని సీఐ భిక్షపతి, పోలీస్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి నాయకులు వివిధ సంస్థల ఉద్యోగులు, వ్యాపారస్తుల మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ భరద్వాజ్, పంచరెడ్డి మురళి, రేఖ, శోభ, పుష్ప తదితరులు పాల్గొన్నారు. జిల్లా జైలులో మహిళ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మహిళా అధికారులను సన్మానించారు. జైలు అధికారులు అశోక్, అనిల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి పద్మ, వైద్యురాలు సవిత, తేజప్వీని, శ్రీరేఖ, స్వరూప తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని జిల్లా క్రీడల అధికారి పవన్కుమార్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా క్రీడాకారులకు వివిధ పోటీలు నిర్వహించారు. కాకతీయ ఒలింపియాడ్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు బాస్కెట్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో పలువురు మహిళలను సన్మానించారు. నాయకులు నాగభూషణం, సిరిమల సురేశ్, తెడ్డు గంగారాం తదితరులు పాల్గొన్నారు. -
ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయం ప్రథమ పుష్కర (12వ) బ్రహ్మోత్సవాలకు యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీనివాసచార్యులు ఆదివారం అంకురార్పణ చేయడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా ఆలయ పరిసరాల్లో గ్రామస్తులు శ్రమదానం చేశారు. ఆలయ ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి సంకల్ప బలంతో, దిల్ రాజు కుటుంబ సభ్యులు అకుంఠిత దీక్షతో ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నిర్మించి 12ఏళ్లు పూర్తయిన శుభ సందర్భంగా పుష్కర బ్రహ్మోత్సవాలను వైభవంగా ప్రారంభించారు. 12 ఏళ్లు పూర్తయితే స్వామి వారి ప్రాభవం రెట్టింపుగా ఉంటుందని అర్చక అస్వాములు రోహిత్ కుమారాచార్య అన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు విజయసింహారెడ్డి, అర్చకులు సంపత్ కుమారాచార్య, రోహిత్ కుమారాచార్య, ఆలయ సభ్యులు నరాల సుధాకర్, నర్సారెడ్డి, రమేష్, మురళి, భాస్కర్, సురేష్, గంగారెడ్డి, సాయిలు, సాయి, భక్తులు పాల్గొన్నారు. -
వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలి
నిజామాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీ గోదావరి, కే సంధ్యారాణి డిమాండ్ చేశారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో సదస్సు నిర్వహించారు. పీవోడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు నా గమణి, శకుంతల, సహాయ కార్యదర్శులు గౌరి, బిపాషా, నాయకులు జమున, నర్సక్క, అ మూల్య, ఆశలత, కీర్తి, అంబిక, మానస, పూజ, రెహా నా, విజయ, భూదేవి, సునీత, లక్ష్మి పాల్గొన్నారు. ఖలీల్వాడి: నగరంలోని సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో ఆదివారం రోబోటిక్ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను సౌత్ ఎంఈవో సాయిరెడ్డి రోబోటిక్ ప్రదర్శనను తిలకించారు. విద్యార్థుల నుంచి రోబోటిక్తో వచ్చే లాభాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో రోబోలు మానవులకు చాలా ఉపయోగపడుతుందని ఎంఈవో అన్నారు. రోబోటిక్ ప్రదర్శన చేసిన సెయింట్ జేవియర్స్ హైస్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పాకాల నరసింహారావు, ప్రిన్సిపాల్ లతాగౌడ్, డైరెక్టర్ పుష్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వృద్ధురాలి అదృశ్యం
మోపాల్: మండలంలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన కంటేగారి జానాబాయి అదృశ్యమైనట్లు ఎస్సై జాడె సుస్మిత ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. జానాబాయి న్యాల్కల్లోని తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. భర్త నర్సింగ్రావు గతంలోనే చనిపోయాడు. వీరికి పిల్లలు లేరు. ఈనెల 4న ఉదయం 7 గంటలకు కామారెడ్డి జిల్లా అంబార్పేట్లోని తన సోదరి ఇంటికి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లింది. రెండు రోజులైనా అక్కడికి వెళ్లలేదు.. గ్రామంలోని ఇంటికి రాలేదు. అనుమానం వచ్చిన బంధువులు పలు చోట్ల వెతికారు. కోడలు(వరుసకు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జానాబాయి ఆచూకీ తెలిసిన వారు 87126 59850 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. -
గ్రామాలను శుభ్రంగా ఉంచాలి
డిచ్పల్లి: గ్రామాలను శుభ్రంగా ఉంచాలని డీఎల్పీవో డీ శ్రీనివాస్ రావు అన్నారు. ఆదివారం మండలంలోని ధర్మారం(బి)గ్రామంలో ఎంపీవో శ్రీనివాస్గౌడ్ తో కలిసి జీపీలో ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా తడిచెత్త, పొడిచెత్త పై అవగాహన, కంపోస్ట్ షెడ్ లో సెగ్రీగేషన్ చేయుట, డంపింగ్ యార్డ్ మెంటెనెన్స్, పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గొట్టిపాటి వాసు, ఉప సర్పంచ్ మహ్మద్ సల్మాన్, జీపీ కార్యదర్శి బాల కృష్ణ, ఐకేపీ మహిళలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సేవాలాల్ బోధనలను అనుసరించాలి
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డిబోధన్ : బంజారాల ఆరాధ్య గురువు, ఆధ్యాత్మిక మార్గదర్శి సంత్ సేవాలాల్ మహరాజ్ బోధనలను అనుసరించి, సన్మార్గంలో నడవాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సూచించారు. బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పాండుఫారం సమీపంలో నియోజకవర్గ స్థాయి సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. పిల్లలను బాగా చదివించి వారు ఉన్నత స్థాయిలో స్థిరపడేలా బంజారాలంతా దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి, కౌన్సిలర్ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పాషా మోహినొద్దీన్, టీపీసీసీ డెలిగెట్ గంగాశంకర్, బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బాబూరాం నాయక్, ప్రతినిధులు చంద్రూ నాయక్, తారాచంద్, యాదగిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బాసరలో డీఎఫ్వో పూజలు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని నిజామాబాద్ డీఎఫ్వో వికాస్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఇన్చార్జి ఈవో విజయరామారావు, ఏఈవో శ్రీనివాస్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం చిన్నారికి అక్షర శ్రీకారం చేయించారు. వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. నిజామాబాద్ రూరల్: మహిళలు తమ సమస్యలపై పోరాడాలని, ఉపాధికి దూరం చేసే విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిట్ల సరిత అన్నారు. నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో శ్రామిక అంతర్జాతీయ మహి ళా దినోత్సవ సభను ఆదివారం నిర్వహించా రు. సరిత మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు దాటినా దేశంలో మహిళలపై వివక్షత ఇంకా కొనసాగుతోందని అన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ.. అంతర్జాతీయ యు ద్ధాలతో భారతదేశంలో గ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతాయని, యుద్ధాలతో మానవాళికి నష్టం తప్ప ఉపయోగం లేదని అన్నారు. కార్యక్రమంలో నాయకులు భారతి,నీలం లక్ష్మి, సంజన, అనంత, లక్ష్మి, దేశెట్టి రాధ, ఆకుల స్వప్న, రేఖ, సురేఖ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: మహిళలకు సమాన హ క్కులు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు విఫలమయ్యాయని సీఐటీయూ, ఏఐకేఎంఎస్, ఏఐఏడబ్ల్యూ, ఐద్వా, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ ఐ నాయకులు అన్నారు. జిల్లా కేంద్రంలోని సీ ఐటీయూ కార్యాలయంలో ప్రజాసంఘాల ఆ ధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూ ర్జహాన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కా ర్యదర్శి పెద్ది వెంకట్రాములు, ిసీఐటీయూ జి ల్లా ఉపాధ్యక్షుడు ఏ రమేశ్బాబు మాట్లాడుతూ.. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్స వం వేడుక కాదు.. సుదీర్ఘ పోరాటాల ఫలితమ ని అన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవేందర్ సింగ్,సిర్పలింగం,పీ స్వర్ణ, సుకన్య, సూ ర్యకళ, రేణుక, డీ రాములు, ఎస్కే ఇమామ్, నీలావతి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలినిజామాబాద్ రూరల్: నగరంలోని ప్రెస్క్లబ్లో ఆదివారం సీపీఐఎంఎల్ ప్రతిఘటన పార్టీ అనుబంధ సంఘం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం నిర్వహించారు. ప్రగతిశీల మహిళా సంఘం రెండు తెలుగు రాష్ట్రాల కార్యదర్శి బొనుగుల లలిత మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్కే సైదులు, బొంగుల లలిత, బెల్లడిగ సాయిలు, ప్రశాంత్, ఖాన్, జీవన్, ఎస్కే భానుబేగం తదితరులు పాల్గొన్నారు. ఐక్యంగా పోరాడితేనే హక్కులు సాధ్యం సిరికొండ: ఐక్యంగా పోరాడితేనే తమ హక్కుల ను సాధించుకోవడం సాధ్యమవుతుందని ప్రగ తిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వీ సత్తెవ్వ అన్నారు. మండలంలోని హుస్సేన్నగర్ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో సత్తెవ్వ మాట్లాడుతూ.. మహిళా బిల్లును అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. సమావేశంలో నాయకులు పిట్ల రమ, పుష్పలత, పద్మ, సునీత, లతిక, సావిత్రి, విజయ, అరుణ, ప్రవీణ, లత, మానస, సరిత, రాణి, జయంతి తదితరులు పాల్గొన్నారు. -
విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో స్వచ్ఛ భారత్
ఆర్మూర్: పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం ఆవరణలో ఆదివారం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘ భవనం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వచంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ 45వ ఆదివారం సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం ఆవరణలో స్వచ్ఛ భారత్ చేపడుతున్నామన్నారు. ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తామన్నారు.కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, వన్నెలేవి గంగాధర్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, వేదశ్రీ రాజ్ కుమార్, డ్రైవింగ్ స్కూల్ వేణు, చోల రాకేష్, కుతాడి ఎల్లయ్య, సాయి చరణ్, సుమన్, రాహుల్ రాజ్, కృషివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
సేవాలాల్ బోధనలను అనుసరించాలి
● ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డిబోధన్ : బంజారాల ఆరాధ్య గురువు, ఆధ్యాత్మిక మార్గదర్శి సంత్ సేవాలాల్ మహరాజ్ బోధనలను అనుసరించి, సన్మార్గంలో నడవాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సూచించారు. బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పాండుఫారం సమీపంలో నియోజకవర్గ స్థాయి సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. పిల్లలను బాగా చదివించి వారు ఉన్నత స్థాయిలో స్థిరపడేలా బంజారాలంతా దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి, కౌన్సిలర్ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పాషా మోహినొద్దీన్, టీపీసీసీ డెలిగెట్ గంగాశంకర్, బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బా బూరాం నాయక్, ప్రతినిధులు చంద్రూ నాయక్, తారాచంద్, యాదగిరి నాయక్ తదితరులున్నారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణ ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ బొదిరే నాగమణి పేర్కొన్నారు. ఆదివారం ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి ఇళ్ల వద్దకు వచ్చే మున్సిపల్ వాహనంలో వేయాలని సూచించారు. వైస్ చైర్ పర్సన్ సంటి లత, కౌన్సిలర్లు, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్, మెప్మా సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కోమట్పల్లిలో పరిసరాల పరిశుభ్రత డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మండలంలోని కోమట్పల్లి గ్రామంలో ఆదివారం పరిసరాల పరిశుభ్రత నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, రామాలయ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను సర్పంచ్ బర్కుంటి సుమలత పర్యవేక్షించారు. అనంతరం రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. దేగాంలో ప్రజా పాలన, పల్లె ప్రగతి పెర్కిట్(ఆర్మూర్): ఆలూర్ మండలం దేగాం గ్రామంలో ఆదివారం ప్రజా పాలన, పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇట్టెడి లింగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ తడి, పొడి చెత్త వేరు చేయడంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో.. ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మూడవ రోజైన ఆదివారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. వాటర్ ట్యాంకులను, తాగు నీటి ట్యాంకులను, టాయిలెట్స్ లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏ.మౌనిక, ఎస్.సుష్మ, వీ.సవిత పాల్గొన్నారు. -
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
రెంజల్(బోధన్): మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ ప్రధాన సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి నిజామాబాద్లోని ఆయన స్వగృహంలో అందించారు. ఆదివారం మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. సకాలంలో చెక్కులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మొబిన్ఖాన్, దండిగుట్ట సర్పంచ్ ధనుంజయ్, తహసీల్దార్ శ్రావణ్కుమార్, మండల కాంగ్రెస్ నాయకులు గంగాకిషన్, ఎంఎల్ రాజు, జావీదోద్దిన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని సుదర్శన్రెడ్డికి వినతి బోధన్: ఎడపల్లి గ్రామంలో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం నిజామాబాద్ నగర కేంద్రంలోని స్వగృహంలో ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డిని కలిసి ఆ గ్రామ ఉపసర్పంచ్ మచ్కూరి గంగాధర్, నాయకులు వినతి పత్రం అందించారు. గ్రామ పంచాయతీ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నందున పాలనపరంగా ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. సీసీ డ్రెయినేజీల నిర్మాణం ,కొన్ని చోట్ల కరెంట్ బోరుబావుల అవసరాలను వివరించారు. పంచాయతి ఖాళీ స్థానాల భర్తీ చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.బోధన్ ఏఎంసీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్, నాయకులు మస్తాన్, నవీన్, గోపి, పురం శేఖర్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మోక్షమెప్పుడో..
● లోలెవల్ వంతెనలను ముంచెత్తుతున్న వరద ● నిలిచిపోతున్న రాకపోకలుహైలెవల్ వంతెనలకువేల్పూర్ : వేల్పూర్ మండలం పడగల్, పోచంపల్లి గ్రామాలకు రహదారుల్లో ఉన్న లోలెవల్ వంతెనలపై హైలెవల్ వంతెనల నిర్మాణానికి మోక్షమెప్పుడోనని ఆ గ్రామాల వారు ఎదురు చూస్తున్నారు. జాతీయ రహదారి 63 నుంచి పడగల్ గ్రామానికి ఉన్న రహదారిలో నవాబు చెరువు నీరు ప్రవహించే పెద్ద ఒర్రె, ఊరచెరువు నీరు ప్రవహించే చిన్న ఒర్రె ఉన్నాయి. గతంలో ఈరెండు ఒర్రెలకు లోలెవల్ వంతెనలు నిర్మించారు. 2016లో నవాబు చెరువుకు వచ్చిన భారీ వరదకు ఒర్రె లోలెవల్ వంతెనపై నుంచి ప్రవహించగా అందులో కారు కొట్టుకుపోయి తల్లి, కొడుకు మరణించారు. దాంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హైలెవల్ వంతెన నిర్మింపజేశారు. ఊర చెరువు నుంచి వచ్చే చిన్న ఒర్రెకు లోలెవల్ వంతెన అలాగే ఉండిపోయింది. నవాబు చెరువు, ఊరచెరువుల నీరు కిందికి పోచంపల్లి గ్రామం దాటి మోర్తాడ్ మండల గ్రామాలకు వెళ్తుంది. పోచంపల్లికి ఇక్కడ కూడా లోలెవల్ వంతెన ఉంది. పోచంపల్లి గ్రామస్తులు ఆర్మూర్, నిజామాబాద్ లాంటి దూరప్రాంతాలకు వెళ్లాలంటే ఇక్కడ లోలెవల్ వంతెన దాటి వెల్లాల్సి ఉంటుంది. గత సెప్టెంబరులో కురిసిన భారీ వర్షానికి లోలెవల్ వంతెన ధ్వంసమైంది. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలంలో ఏదో ఒక సమయంలో భారీ వర్షం కురవడం, లోలెవల్ వంతెనలపై నుంచి వరద ప్రవహించడం, రాకపోకలు నిలిచిపోవడం గ్రామస్తులకు ప్రతి ఏటా నిత్యకృత్యమైతోంది. వంతెనలు దాటలేని విధంగా వరదలు వచ్చినప్పుడు సుమారు 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి వన్నెల్ బి గ్రామం మీదుగా ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. కొత్త ప్రభుత్వంలోనైనా హైలెవల్ వంతెనలు నిర్మించాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. భారీ వర్షం కురిసినపుడు పడగల్ ఊరచెరువు నుంచి వెళ్లే వరదనీరు గ్రామ రహదారికి ఉన్న లోలెవల్ వంతెనపై నుంచి ప్రవహిస్తుంది. దాంతో గ్రామానికి ఆర్మూర్ వైపు రాకపోకలు ఆగిపోతాయి. చాలా ఏళ్ల నుంచి ఈ సమస్య గ్రామస్తులకు వర్షాకాలంలో ప్రతి ఏటా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. హైలెవల్ వంతెన నిర్మాణానికి నా వంతు కృషి చేస్తా. – నల్లరాజు, సర్పంచ్, పడగల్ -
షాదీఖానాకు నిధులు విడుదల చేయాలి
● ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి డిమాండ్ మోర్తాడ్: తాను మంత్రిగా ఉన్న సమయంలో బాల్కొండలో షాదీఖానాను నిర్మించడానికి రూ.30లక్షల నిధులు మంజూరు చేయించగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను నిలిపివేసిందని ఇప్పుడు వెంటనే నిధులను విడుదల చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బాల్కొండలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. మైనారిటీలకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే స్వర్ణయుగం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. బాల్కొండ షాదీఖానాకు నిధులు విడుదల అయ్యే వరకూ తాను వ్యక్తిగతంగా పోరాడుతానని హామీ ఇచ్చారు. నిధులు విడుదల అయ్యే వరకూ ఊరుకునేది లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, మైనారిటీలు పాల్గొన్నారు. వెల్మల్లో ఇఫ్తార్ విందు నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సర్పంచు గొజ్జి దేవేందర్ మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, పరస్పర ప్రేమను పెంపొందిస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. గ్రామ పెద్దలు, యువకులు, ముస్లింలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
మహిళలు చైతన్యవంతులు కావాలి
● అంతర్జాతీయ మహిళ దినోత్సవంలో వక్తలు ● పలు చోట్ల మహిళలకు సన్మానం బోధన్/పెర్కిట్/డొంకేశ్వర్/ఆర్మూర్/మాక్లూర్/ నందిపేట్/రుద్రూర్: నేటి పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికి మరింత చైతన్యవంతులై ప్రతిభావంతులుగా ఎదగాలని వక్తలు పేర్కొన్నారు.ఆదివారం అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా పలు చోట్ల మహిళలను సన్మానించారు.మహిళలు చదువు, కుటుంబం, ఉద్యోగం, రాజకీయాలు,క్రీడలు వ్యాపారం వంటి అన్ని రంగాలలో ముందుండి రాణించాలని ఆకాక్షించారు. -
అబాకస్లో జాతీయ స్థాయి ర్యాంకులు
నవీపేట: మండల కేంద్రంలోని సాహితీ విద్యానికేతన్కు చెందిన విద్యార్థులు జా తీయ స్థాయి అబాకస్ పోటీలలో ఉత్త మ ప్రతిభ కనబరిచా రు. హైదరాబాద్లో ఆదివారం జరిగిన పోటీలలో సాహితీ విద్యానికేతన్కు చెందిన సాత్విక(3వ తరగతి), శ్రీక ర్(5వ తరగతి)లు జాతీయ స్థాయి రెండవ ర్యాంక్ సాధించారు. విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందని కరస్పాండెంట్ సునీత హర్షం వ్యక్తం చేశారు. రుద్రూర్: పొతంగల్ మండలం పీఎస్ఆర్ నగర్ (రాంగంగానగర్ )లో గ్రామ మహిళ భవన్ నిర్మాణానికి ఆదివారం సర్పంచ్ రాంబాయి భూమి పూజ చేశారు. మహిళ దినోత్సవం రోజూ మహిళ భవన్కు భూమి పూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు సర్పంచ్ అనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ అట్కారి సతీష్ , వార్డు సభ్యులు శేఖర్ గైడ్, రమేష్, మాజీ ఉప సర్పంచ్ అశోక్, అంగన్వాడీ టీచర్ ప్రేమలత, వీఏవో స్వరూప, గ్రామ సంఘం అధ్యక్షురాలు సావిత్రి బాయి , సాయినాథ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలోని బోయిగల్లీలో కుటుంబ వివాదంలో అన్నకు గాయాలు కావడంతో పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. బోయిగల్లీకి చెందిన కొప్పుల సాయిలు మేసీ్త్రగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 7న రాత్రి సాయిలు తన తండ్రి సాయిబోయిని ఇంటికి తీసుకొచ్చి తమ్ముడి ఇంటి వద్ద దింపేందుకు వెళ్లాడు. అక్కడ అడ్డుగా ఉన్న ఇటుకలను తొలగించగా అతని తమ్ముడు మక్కయ్య, అతని భార్య అక్కడికి వచ్చి గొడవకు దిగారు. మక్కయ్య అత్త, బావమరిది సాయిలును దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మక్కయ్య ఇటుకతో సాయిలు తలపై కొట్టినట్లు బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మాక్లూర్: మండల పరిధిలోని సుఖిజిత్ ఫ్యాక్ట రీ శివారు పూలాంగ్ వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు మాక్లూర్ పోలీసులు ఆదివారం తెలిపారు. వాగులో మృతహాన్ని గుర్తించిన పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మోపాల్: మండలంలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన కంటేగారి జానాబా యి అదృశ్యమైనట్లు ఎస్సై జాడె సుస్మిత ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. జానాబాయి న్యాల్కల్లోని తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. భర్త నర్సింగ్రావు గతంలోనే చనిపోయాడు. వీరికి పిల్లలు లేరు. ఈనెల 4న ఉదయం 7 గంటలకు కామారెడ్డి జిల్లా అంబార్పేట్లోని తన సోదరి ఇంటికి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లింది. రెండు రోజులైనా అక్కడికి వెళ్లలేదు.. గ్రామంలోని ఇంటికి రాలేదు. అనుమానం వచ్చిన బంధువులు పలు చోట్ల వెతికారు. కోడలు(వరుసకు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జానాబాయి ఆచూకీ తెలిసిన వారు 87126 59850 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. సిరికొండ: మండలంలోని మైలారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ సర్దాన్ సదానంద్ ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుగ్గెం నితీష్, వార్డు సభ్యులు చిన్నదాసు, వీడీసీ సభ్యులు గంగాకిషన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా సరిత
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన కే. సరిత మండల ఉత్తమ అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా అవార్డును అందుకున్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు కల్యాణ మండపంలో జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ, ఆక్స్ ఫర్డ్ హైస్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, కామారెడ్డి ఎస్ఈ రవీందర్, జిల్లా వెల్ఫేర్ అధికారిణి పద్మ చేతుల మీదుగా మండల ఉత్తమ అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా సరిత ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను అందుకున్నారు. -
పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి
కమ్మర్పల్లి: రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన కమ్మర్పల్లి మండలం నాగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద ఉప సర్పంచ్ శశిధర్ నిర్మించుకున్న ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రజలకు త్వరగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. సర్పంచ్లు అశోక్, శైలేందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రవి, నాయకులు తిప్పిరెడ్డి శ్రీను, బుచ్చిమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత పెరగాలి.. శుభ్రత మెరవాలి
కమ్మర్పల్లి : ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యత పెంచాలని, శుభ్రమైన వాతావరణం నెలకొల్పాలని ఇటీవల రాష్ట్ర విద్యా కమిషన్ సిఫారసు చేసింది. సమయానికి అందని మధ్యాహ్న భోజన బిల్లులు, వారానికి తప్పనిసరిగా మూడు రోజులు గుడ్డు అందించే నిబంధన పాటించకపోవడం, సరైన వంట గదులు లేకపోవడం తదితర కారణాలతో జిల్లాలో పిల్లలకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. మరోవైపు అపరిశుభ్ర వాతావరణంతో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలోని కమిటీ 14 నెలలు పర్యటించి విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో పలు లోపాలను గుర్తించింది. వంట గదులు, తాగునీరు లేకపోవడం, వంట బిల్లు ప్రతి విద్యార్థి పరంగా తక్కువగా ఉండటం, బియ్యం సరిగ్గా ఉండకపోవడం, గుడ్డు అందించకపోవడం వంటి అంశాలను పరిశీలించింది. అనంతరం ఈ పథకం పక్కాగా అమలు కావడానికి పలు ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం ఉన్న రేట్లను రెట్టింపు చేయాలని, గుడ్డు ధర రూ. 8 ఇవ్వాలని, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు వారానికి ఒక్కసారి బిల్లుల చెల్లింపు జరగాలని, దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని సిఫారసు చేసింది. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని 12వ తరగతి(ఇంటర్మీడియెట్) వరకు అమలు చేయాలని సూచించింది. ఎండీఎంపై ఫోకస్ ఈ నెల 6 నుంచి జాన్ 12 వరకు నిర్వహించే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టర్లు వా రంలో ఒకరోజు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించి భుజించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల పర్యటన సందర్భంగా కలెక్టర్లు మధ్యాహ్న భోజన సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కట్టెల పొయ్యిపై వంట, బియ్యం నాసిరకం తదితర సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం ధరలు రెట్టింపు చేయాలి. ఏజెన్సీ నిర్వాహకులకు ప్రతి నెలా ఒకటో తారీఖున వేతనాలు, బిల్లులు అందేలా చూడాలి. అంగన్వాడీ కేంద్రాల మాదిరిగా పాఠశాలలకు కూడా గుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి. – పి. చంద్రశేఖర్, పీఆర్టీయూ మండలాధ్యక్షుడు, కమ్మర్పల్లి సమస్యలు తీరితేనే నాణ్యత మెరుగవుతుంది వారంలో ఒకరోజు కలెక్టర్లు తింటే అపశ్రుతులు తగ్గే అవకాశం మధ్యాహ్న భోజనంపై విద్యా కమిషన్ సిఫార్సులు -
రిమాండ్కు కిరాతక తండ్రి..
● ముగ్గురు చిన్నారుల హత్య కేసులో.. ● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్య రెడ్డికామారెడ్డి క్రైం: కడుపున పుట్టిన ముగ్గురు కుమార్తెలను చెరువులో తోసేసి దారుణంగా హత్య చేసిన కసాయి తండ్రిని కామారెడ్డి పోలీసులు రిమాండ్కు తరలించారు. అప్పుల బాధలు, పోషించలేకనే అతడు తన ముగ్గురు పిల్లలను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. కామారెడ్డి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3.30 గంట ల ప్రాంతంలో ఆర్బీ నగర్ కాలనీకి చెందిన భార్యాభర్తలు షబీనీ, ఇస్మాయిల్లు పట్టణ పోలీస్స్టేషన్కు వచ్చి తమ ముగ్గురు కుమార్తెలు షీపత్(8), అయాత్(7), మరియం(5) కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. తన ఆటోలోనే పిల్లలను ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కాలనీకి దగ్గర్లోని ఓ దుకాణానికి తీసుకువెళ్తానని చెప్పి తినుబండారాలు కొనిచ్చాడు. ఆ తర్వాత ఆటో గిరాకీ రావడంతో గల్లీ చివర్లో దింపేసి ఇంటికి వెళ్లాలని చెప్పి వెళ్లిపోయానని ఇస్మాయిల్ పోలీసులతో చెప్పాడు. పోలీసులు వెంటనే 5 ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పిల్లల జాడ కోసం గాలించడం మొదలు పెట్టారు. పిల్లలను దింపిన చోటును చూపించే క్రమంలో ఇస్మాయిల్ తడబడుతూ అడిగిన ప్రతిసారి వేర్వేరు ప్రదేశాలను చూయించాడు. అంతేకాకుండా సీసీ ఫుటేజీల్లో ఇస్మాయిల్ పిల్లలను ఎక్కడా ఆటోలో నుంచి దింపినట్లు కనిపించలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి ఇస్మాయిల్ను విచారించగా నేరం అంగీకరించాడని ఏఎస్పీ తెలిపారు. కామారెడ్డి పెద్ద చెరువులో రాత్రి 10 గంటల ప్రాంతంలో అయాత్, మరియం, దాదాపు 12 గంటల ప్రాంతంలో షీపత్ మృతదేహాలను కనుగొన్నామని వెల్లడించారు. నిందితుడు ఇస్మాయిల్ను రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. అప్పుల బాధలు, పోషించే స్థోమత లేకపోవడంతోనే నిందితుడు ఈ ఘోరానికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. కేసు చేధనలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ, రూరల్ సీఐలు నరహరి, రామన్, సీసీఎస్ పోలీసులను అభినందించారు. -
విద్యుత్ ఉద్యోగుల ఉత్తమ ప్రతిభ
సుభాష్నగర్ : థాయ్లాండ్ దేశంలోని రాచబురిలో మార్చి 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ 30వ థాయ్లాండ్ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా విద్యుత్ ఉద్యోగులు పతకాలు సాధించారు. 110 మీటర్ల హర్డిల్స్లో సీనియ ర్ అసిస్టెంట్ అశిలి గోపి బంగారు పతకం, ట్రిపుల్ జంప్, రిలే రన్నింగ్ పోటీల్లో 3 రజత పతకాలు, సీనియర్ అసిస్టెంట్ గుత్తికొండ రఘువీర్ హ్యామర్ త్రోలో రజతం, షాట్పుట్లో కాంస్య పతకం సాధించారు. లైన్ ఇన్స్పెక్టర్ వాగ్మారే దినేశ్ రిలే రన్నింగ్ పోటీల్లో 2 రజత పతకాలు సాధించారు. ఉద్యోగులను ఎస్ఈ రాజేశ్వర్రావు అభినందించారు. -
జీవనోపాధి..!
ముంపు గ్రామాలకుడొంకేశ్వర్(ఆర్మూర్) : ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో త్వరలో ఎకో టూరిజం పనులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు కేవలం ప ర్యాటక అభివృద్ధికి మాత్రమే పరిమితం కాకుండా స్థానిక ముంపు గ్రామాలకు జీవనోపాధిని చూపేలా రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన కసర త్తు ప్రారంభం కాగా.. ప్రతి పనిలో గ్రామస్తులను భాగస్వాములను చేసి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే డొంకేశ్వర్ మండలంలో గాదేపల్లి, చిన్నయానం, జీజీ నడ్కుడ గ్రామాల నుంచి కొంతమంది నిరుద్యోగ యువతను అధికారులు ఎంపిక చేశారు. వచ్చిన టూరిస్టులకు గైడ్లుగా పని చేసేందుకు, స్థానిక రుచులను అందించే క్యాంటీన్ల బాధ్యతలను వారికే అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం వారిని ఈ నెలాఖరు లో హైదరాబాద్ తీసుకెళ్లి కొన్ని రోజులపాటు నైపు ణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా శిక్షణ ఇవ్వను న్నారు. మొదటి బ్యాచ్ పూర్తయిన తర్వాత మిగిలిన యువతకు కూడా దశల వారీగా శిక్షణ ఇచ్చి వన్యప్రాణుల సంరక్షణ, టూరిస్టులు పర్యావరణ కాలు ష్యం చేయకుండా పలుఉద్యోగాలతో ఉపాధి కల్పించనున్నారు. హోటళ్లు, రిసార్ట్లు, క్యాంటీన్లు లాంటి వ్యాపారాలు పెట్టుకునే విషయంలో ముంపు గ్రా మాల ప్రజలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారు ఉ పాధి పొందేలా ప్రోత్సహించనున్నారు. తద్వారా స్థానిక గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి. ఈ ని ర్ణయం పట్ల స్థానిక గ్రామాల యువతతో పాటు ప్ర జలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గాదేపల్లిలో త్వరలో ప్రారంభం కానున్న ఎకో టూరిజం పనులు స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు అటవీశాఖ ప్రణాళిక ఇప్పటికే పలువురిని ఎంపిక చేసిన అధికారులు ఈ నెలాఖరులో హైదరాబాద్లో శిక్షణ -
ఘనంగా మహిళా దినోత్సవం
పీఆర్టీయూ ఆధ్వర్యంలో టీచర్లను సన్మానిస్తున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, మేయర్ ఉమారాణిడీఎస్ఏ మైదానంలో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రక్రీడాకారిణులుఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఆయా సంస్థలు, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళలను, పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయినులను సన్మానించారు. క్రీడా మైదానంలో జిల్లా క్రీడల అధికారి పవన్కుమార్ క్రీడాకారిణులను సన్మానించారు. వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించగా కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు బాస్కెట్ బాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. – సాక్షి నెట్వర్క్ -
బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● జీజీహెచ్లో వ్యాక్సినేషన్ ప్రారంభం సుభాష్నగర్ : గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిరోధానికి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ను 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు తప్పనిసరిగా ఇప్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆదివారం హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమైనదని, దీన్ని తీసుకోవడంతో 95 శాతం వరకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ను నిరోధించుకోవచ్చని అన్నారు. వ్యాక్సిన్ పట్ల అపోహలు అవసరం లేదని, ఆందోళనకు గురికాకుండా జిల్లాలోని 12,363 మంది బాలికలకు మిషన్ మోడ్లో వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఇప్పటి వరకు ఇది కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లోనే అందుబాటులో ఉండేదని, సర్వైకల్ క్యాన్సర్ను నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా ఈ వ్యాక్సిన్ను అందిస్తోందని తెలిపారు. జీజీహెచ్తోపాటు జిల్లాలోని డిచ్పల్లి, ధర్పల్లి, నవీపేట్, వర్ని, మోర్తాడ్, బాల్కొండ, ఆర్మూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా వ్యాక్సిన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారు సర్టిఫికెట్ తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తేనున్న హెల్త్ ప్రొఫైల్ కోసం ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం డీఎంహెచ్వో రాజశ్రీ మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో శారీరక బలహీనతతో కొంతమందికి అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపించవచ్చని, అంతమాత్రాన భయపడకుండా పారాసిటమల్ టాబ్లెట్ వేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన బాలికలతో కలెక్టర్ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అశ్విని, నర్సింగ్ సూపరింటెండెంట్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
జయహో భారత్
టీ20 విజేతగా టీం ఇండియా ● జిల్లాలో క్రికెట్ అభిమానుల సంతోషంభారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారీ విజయం సాధించింది. దీంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా పలు హోటళ్లలో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. టీవీలకు అతుక్కుపోయిన అభిమానులు గెలుపు అనంతరం సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు పేల్చారు. – నిజామాబాద్అర్బన్భారత్ టీ20 ప్రపంచ కప్ గెలవడం సంతోషంగా ఉంది. మన దేశానికి ఎంతో గర్వకారణం. ఇండియా ఆడే ప్రతి క్రికెట్ మ్యాచ్ తిలకిస్తాను. మన జట్టు గెలవాలని తాపత్రాయ పడేవాణ్ణి. – చంద్రశేఖర్, మాజీ సైనికుడు, మామిడిపల్లిరెండు రోజులుగా ఇండియా టీ20 ప్రపంచకప్ గెలుస్తుందా? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న. మ్యాచ్ను తిలకించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నా. నా కల నెరవేరింది. – భాస్కర్, క్రికెట్ అభిమానిన్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుపై భారీ విజయం సాధించడం గ్రేట్. న్యూజిలాండ్పై ఆడటం అంటే ఆందోళనకు గురయ్యాం. కానీ, భారత జట్టు పటిష్టమైన బౌలింగ్, బ్యాటింగ్తో సత్తా చాటారు. – ప్రవీణ్, క్రికెట్ అభిమాని, ముబారక్నగర్ -
తాటి చెట్టు పైనుంచి పడి కల్లు గీత కార్మికుడి మృతి
నిజామాబాద్ రూరల్: తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందిన ఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తకుంట గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపిన వి వరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గమ్మగొని స్వామిగౌడ్ (55) శనివారం ఉదయం కెనాల్ కట్టకు ఆనుకొని ఉన్న తాటి చెట్టు పైనుండి కాలు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతుడి కుమారుడు సతీశ్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నవీపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిటైర్డ్ టీచర్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన ట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. జన్నెపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ దొడ్డి శ్రీనివాసరావ్ (70), నిజాంపూర్ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం మురళీధర్ రావ్తో కలిసి ఈ నెల 5న నిజామాబాద్కు బైక్పై వెళ్తుండగా.. మరో బైక్పై ఫకీరాబాద్ వైపు వెళ్తున్న గంగాప్రసాద్ ఎదురెదురుగా ఢీకొన్నారు. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన రిటైర్డ్ టీచర్ శ్రీనివాసరావ్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కామారెడ్డి క్రైం: కామారెడ్డిలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. గోసంగి కాలనీకి చెందిన అన్నా, చెల్లెలి పిల్లలు కోదండం సాంబయ్య కొడుకు విజయ్ (9), పానేటి శారద కొడుకు సింహాద్రి (10) స్థానికంగా ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వీరిద్దరూ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యలు చాలా చోట్ల గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో శనివారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పిల్లల కోసం గాలిస్తున్నామని టౌన్ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. రామారెడ్డి (ఎల్లారెడ్డి): మండలంలోని ఓ గ్రామంలో వరుసకు బావ అయ్యే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్న ఘటన చోటు చేసుకుంది. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటికి పోక్కింది. ఈ విషయమై ఎస్సై రాజశేఖర్ను సాక్షి వివరణ కోరగా కేసు నమోదు చేసి విచారణ చేసున్నట్లుగా తెలిపారు. -
మహారాణులు ఉత్సవ విగ్రహాలేనా!
● స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసొచ్చిన రిజర్వేషన్లు ● అయినా పాలనా వ్యవహారాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువే.. ఆర్మూర్: మహిళలకు స్థానిక సంస్థల్లో రాజకీయ భాగస్వామ్యం పెరగటం వారు సాధించిన గొప్ప విజయం. అయితే, ప్రజాప్రతినిధులుగా గెలిచిన మహిళలు కొన్నిచోట్ల ఉత్సవ విగ్రహాలుగా మారారన్న విమర్శలున్నాయి. జిల్లాలో ఒకరిద్దరు మహిళా ప్రజా ప్రతినిధులు మినహా మెజారిటీ మహిళా ప్రజా ప్రతినిధులు భర్తలకే బాధ్యతలు అప్పగించి మౌనంగా ఉండిపోతున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 146 వార్డుల్లో 73 స్థానాలు మహిళలకే రిజర్వు చేశారు. నిజామాబాద్ మేయర్గా ఉమారాణి, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్లుగా గోనె లహరి, తూము పద్మ, బోదిరె నాగమణి విజయం సాధించారు. అయితే జిల్లాలోని పట్టణాలతోపాటు పల్లెల్లో సైతం ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో మహిళా ప్రజా ప్రతినిధుల ప్రాధాన్యత అంతంత మాత్రంగానే ఉంది. వారి భర్తలే చక్రం తిప్పుతూ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. కౌన్సిలర్లు, సర్పంచ్లు కేవలం సమావేశాలు, కార్యక్రమాల్లో వేదికలపైకి మాత్రమే పరిమితమవుతున్నారు. గ్రామ పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. మహిళా రిజర్వేషన్తో విజయం సాధించినప్పటికీ వారి స్థానంలో భర్త లేదా కుటుంబసభ్యులు పెత్తనం సాగిస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామంటూ ప్రజల ఓట్లతో గెలిచిన మహిళలు మాత్రం అధికారాలన్నీ తమ భర్తలకు కట్టబెట్టి వంటింటికే పరిమితం అవుతున్నారు. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో రాణిస్తున్న ఎంతో మంది మహిళా నాయకురాళ్లను ఆదర్శంగా తీసుకొని తాము ప్రజాసేవలో రాణించాలని ఆసక్తి ఉన్నా పురుషాధిక్యత గల పార్టీలు తమను తొక్కి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నీల వాసికి ‘గద్దర్ అవార్డు’
● ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకోనున్న అనురాగ్ కులకర్ణి రెంజల్(బోధన్): పాటలే ప్రాణంగా చిన్నతనం నుంచి సినిమాల్లో రాణిస్తున్నారు రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన అనురాగ్ కులకర్ణి. తెలంగాణ గద్దర్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన తండ్రి మారుతిరావు కులకర్ణి సాక్షితో మాట్లాడారు. అనురాగ్ కులకర్ణి ఇప్పటి వరకు 500 సినిమాల్లో సుమారు వెయ్యి పాటలు రాసి పాడారని పేర్కొన్నారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలో రాంబాయి నీ మీద మనసాయనే అనే పాటకు గద్దర్ అవార్డు వరించినట్లు తెలిపారు. తన కుమారుడికి ఉత్తమ గాయకుడిగా అవార్డు లభించడం గర్వకారణమన్నారు. ఇప్పటి వరకు తమిళ, కన్నడ, మరాఠి, తెలుగు భాషాల్లో పలు చిత్రాలకు పాటలు రచించినట్లు ఆయన వివరించారు. -
సంకల్పంతో ‘యూనిఫాం సర్వీస్’ సాధించారు..
మోర్తాడ్(బాల్కొండ): ఆమె చదివింది బీ ఫార్మసీ.. కానీ ఇష్టంతో గ్రూప్–2 సాధించి ఎకై ్సజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. చదివిన చదువుకు చేస్తున్న ఉద్యోగానికి ఏమాత్రం సారూప్యత లేకపోయినా యూనిఫాం సర్వీసులోనే ఎంతో తృప్తి ఉందని చెబుతున్నారు బొండ్ల మానస. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మానస ప్రస్తుతం మోర్తాడ్ ఎకై ్సజ్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. వైద్య విద్యనభ్యసించాలని ఇంటర్ బైపీసీలో చేరిన మానసకు సరైన ర్యాంకు రాకపోవడంతో మెడిసిన్ చదివే అవకాశం లభించలేదు. తండ్రి మల్లయ్య సూచనతో బీఫార్మసీ చదివారు. ఆ తర్వాత ఆదిలాబాద్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు.కానీ యూనిఫాం సర్వీసు ఏకై క లక్ష్యంతో గ్రూప్–2 రాసి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు సుజాత, మల్లయ్య, బ్యాంకు అధికారైన భర్త వంశీ కృష్ణ ప్రోత్సాహంతో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్నానని మానస తెలిపారు. -
విద్యార్థుల మానసిక ఆరోగ్యమే దేశ ప్రగతికి సోపానం
● తెయూ రిజిస్ట్రార్ యాదగిరి తెయూ(డిచ్పల్లి): విద్యార్థుల మానసిక ఆరోగ్యమే దేశ ప్రగతికి సోపానం అని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం.యాదగిరి పేర్కొ న్నారు. తెయూ హెల్త్ సెంటర్ ఇన్చార్జి డాక్టర్ గోపిరాజు ఆధ్వర్యంలో శనివారం వర్సిటీ వి ద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యా, పోటీ పరీక్షలు, కుటుంబవ్యవహారాలు మొదలైన వాటి ద్వారా ఒత్తిడికి గురికాకుండా మా నసిక ధైర్యంతో ముందుకెళ్లాలని సూచించారు. డాక్టర్ గోపిరాజు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.కార్యక్రమంలో హాస్టల్స్ చీఫ్ వార్డెన్ రవీందర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం నిజామాబాద్, బోధన్ కేవీఎస్లలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉపాధ్యాయుల నియామకానికి ఈ నెల 9న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వర్రావు తెలిపారు. ఇంటర్వ్యూలు నిజామాబాద్లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రాంగణంలో జరుగుతా యని పేర్కొన్నారు. ప్రైమరీ టీచర్ (పీఆర్టీ), టీజీటీ (ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, గణితం, సైన్స్, సోషల్ సైన్స్), తెలుగు లాంగ్వేజ్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఏటీఎల్ ఇన్స్ట్రక్టర్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నియామకాలు పూర్తి పారదర్శకంగా జరుగుతాయని, సీటెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 9 నుంచి ఒరిజినల్ విద్యార్హత ల సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలు పాఠశాల వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ బార్ అసో సియేషన్ ఎన్నికల అధికారులుగా అమిడాల సుదర్శన్, మెట్టు నరేశ్లను నియమించినట్టు అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయిరెడ్డి ప్రకటించారు. శనివారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో సుదర్శన్కు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి, బట్టు మాణిక్ రాజు, రెంజర్ల సురేశ్ నియామక పత్రాన్ని అందజేశారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 9 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 16 వరకు ఉపసంహరణ, 17న అభ్యర్థుల తుదిజాబితా, 26న ఎన్నికలు అనంతరం ఫలితాల ప్రకటన ఉంటుందని తెలిపారు. నూతనంగా ఎన్నికయ్యే కార్యవర్గ సభ్యులు ఏప్రిల్ 1న బాధ్యతలు చేపట్టనున్నారు.ఎల్లారెడ్డి: మండలంలోని కల్యాణి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న పది మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై మహేశ్ శనివారం తెలిపారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న స మాచారం మేరకు దాడి చేసినట్లు పేర్కొన్నారు. 10 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.3,240 నగదు, 8 సెల్ఫోన్లు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
బాన్సువాడ రూరల్: తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జుక్కల్ మండలం మందాబాద్తండాకు చెందిన దేవల్ల హనుమంతు (19) నెలరోజులుగా బాన్సు వాడ మండలం సోమేశ్వర్ గ్రామంలోని తన మే నత్త వద్ద ఉంటూ కూలి పని చేసుకుంటున్నాడు. ఈ నెల 6న హనుమంతు బీరు తాగుతూ దిగిన ఫొటో ను కుటుంబసభ్యులకు పంపాడు. చిన్నవయసులో బీరు ఎందుకు తాగుతున్నావని తల్లి ఫోన్చేసి మందలించింది. దీంతో హనుమంతు సోమేశ్వర్ శివారు లోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. దేవల్ల చిన్నక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న మోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాన్సువాడ రూరల్: మండలంలోని మొగులాన్పల్లి గ్రామానికి చెందిన మెగావత్ రావణ (40) జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. రావణకు 20 ఏళ్ల క్రితం సునీత అనే మహిళతో వివాహం జరిగింది. రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. సునీత కొన్నేళ్లుగా భర్తను వదిలి దూరంగా ఉంటుండగా, రావణ తన కుమారుడితో మొగులాన్పల్లితో నివసిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన రావణ ఈ నెల 5న రాత్రి పొలం వద్ద పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలించగా చికిత్స పొందుతూ 6న సాయంత్రం మృతి చెందాడు. శనివారం కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. వర్ని: మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి పదిమందిపై దాడి చేసింది. శనివారం ఉదయం రాంమందిర్ కాలనీ, బోధన్ రోడ్డు, శ్రీనివాస కాలనీలో సుమారు పదిమందిని పిచ్చికుక్క గాయపరిచింది. బాధితులను సర్పంచ్ కనకదుర్గ రవి చికిత్స నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ, అధికారులు స్పందించి కుక్కలను తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షి యల్ బాలుర పాఠశాల విద్యార్థి ముజాహిద్ (17) శనివారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాసేందుకు ఈ నెల 5న పాఠశాల నుంచి విద్యార్థులతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న కేంద్రానికి ఆటోలో వెళ్లాడు. పరీక్ష రాసిన తర్వాత తోటి విద్యార్థులతో కలిసి తిరిగి పాఠశాలకు రాలేదు. సాయంత్రం వరకు రాకపోవడంతో ప్రిన్సిపల్ స్వామికు టుంబసభ్యులకు సమాచారం అందించగా, వారు శుక్రవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం చిన్నదడ్గి వాగులో ముజాహిద్ మృతదేహమై కనిపించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విద్యార్థి మృతిపై మైనార్టీ స్కూల్ పర్యవేక్షణ జిల్లా అధికారి బషీర్ పాఠశాలలో విచారణ చేపట్టారు. కాగా, విద్యార్థి మృతిపై ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిచ్కుందలో విద్యార్థి కుటుంబసభ్యులతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. సిరికొండ: మండలంలోని పందిమడుగు అటవీ సెక్షన్ చీమన్పల్లి బీట్ నుంచి అక్రమంగా బండరాళ్లు తరలిస్తున్న ట్రాక్టర్ను శనివారం పట్టుకున్నట్లు సిరికొండ ఎఫ్ఆర్వో నర్సింగ్రావు తెలిపారు. అనుమతి లేకుండా తరలిస్తున్నందున ట్రాక్టర్ను సీజ్ చేశామన్నారు. బండరాళ్లను తరలిస్తున్న శాంతం, ఆలకుంట చిన్న ఎల్లయ్యలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న రాళ్ల విలువ రూ.15,433 ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెటం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గంగారాం, సెక్షన్ అధికారి కృష్ణగీత్, బీట్ అధికారులు హరీశ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ఇంటర్ కళాశాలల హ్యాండ్బాల్ జట్టు ఎంపికలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీతో పాటు వర్సిటీ పరిధిలోని ఇంటర్ కళాశాలల హ్యాండ్బాల్ (పురుషులు, మహిళలు) ఎంపిక పోటీలు శనివారం క్యాంపస్ క్రీడామైదానంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెయూ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోటీలలో చక్కని ప్రతిభచూపి వర్సిటీ క్రీడా జట్టు సభ్యులుగా ఎంపిక కావాలని సూచించారు. వర్సిటీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ బాలకిషన్ మాట్లాడుతూ ఎంపికై న పురుషుల జట్టు ఈ నెల 15న తమిళనాడులోని వీఐటీ వెల్లూరులో జరిగే సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో పాల్గొంటారని అన్నారు. మహిళల జట్టు ఈ నెల 17న కేరళలోని కొట్టాయం ఏంజీయూలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో పాల్గొంటుందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ప్రిన్సిపల్ గోపిశెట్టి రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బీఆర్నేత, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్స్ రాము, రూప, అనిల్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ నరేశ్ జాదవ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
స్వయం శక్తితో మహిళా ప్రగతి
● రుణమే పెట్టుబడిగా సొంత వ్యాపారాలు ● ఆదర్శంగా నిలుస్తున్న జిల్లాలోని పలువురు ఎస్హెచ్జీ మహిళలు ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్కు చెందిన అనుగందుల అమిత కార్తికేయ మహిళా సంఘంలో సభ్యురాలు. డిగ్రీ వరకు చదివిన ఈమె 2014లో మోర్తాడ్ జెడ్పీటీసీగా కూడా పని చేశారు. ప్రజలను కల్తీ నూనె బారి నుంచి కాపాడాలనే ఉద్దేశంతోపాటు ఆర్థికాభివృద్ధి సాధించాలనే సంకల్పంతో నాలుగేళ్ల క్రితం ఇంటి వద్ద సొంతగా ఆయిల్ మిల్లును ప్రారంభించారు. రూ.5 లక్షల రుణంతో యంత్రాన్ని కొనుగోలు చేసి స్వచ్ఛమైన నువ్వులు, పల్లి, కొబ్బరి, కుసుమ, ఇతర వంట నూనెలను పట్టి ఇస్తున్నారు. వ్యాపారంలో నిలదొక్కుకుని ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. నూనె మిల్లుతోపాటు బీడీ కార్ఖానాలు కూడా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చందూర్ మండల కేంద్రానికి చెందిన గొల్లపల్లి సవిత దివ్యశ్రీ మహిళా సంఘంలో సభ్యురాలు. కుమ్మరి వృత్తి కావడంతో బ్యాంకు లింకేజీ రుణాలను పొంది భర్తతో కలిసి కొన్నేళ్లుగా ఇంటి వద్దనే ఉంటూ మట్టి పాత్రల వ్యాపారం చేస్తున్నారు. అద్భుతమైన బొమ్మలు, టీ కప్పులు, వంట పాత్రలు, ఇతర వస్తువులు పూర్తిగా చెరువు మట్టితోనే తయారు చేస్తున్నారు. వ్యాపారాభివృద్ధి కోసం అప్పుడప్పుడు కూడా మహిళ సంఘంలో రుణాలు పొందుతున్నారు. ప్రస్తుత కాలంలో మట్టి పాత్రలకు ప్రాధాన్యం పెరగడంతో వ్యాపారం బాగా నడుస్తోంది. రుణమే పెట్టుబడిగా మలిచి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంతో సవితను పలువురు ప్రశంసిస్తున్నారు. మోస్రా మండలం గోవూరుకు చెందిన జ్యోతిర్మయి ఇందిరా మహిళా సంఘంలో సభ్యురాలు. డిగ్రీ వరకు చదువు పూర్తి చేసిన ఈమె ఏడాది క్రితం గ్రామీణ ఉత్పత్తుల వ్యాపారాన్ని మొదలు పెట్టారు. గానుగ నూనెను కూడా విక్రయిస్తున్నారు. నగరవాసుల ఆరోగ్యం కోసం చిరుధాన్యాలు, మిల్లెట్లు, పప్పు దినుసులు, మసాలాలు, ఔషధ పౌడర్లు, తైలాలు, చూర్ణాలను సొంతగా తయారు చేసి జిల్లా కేంద్రంలో గంగస్థాన్ వద్ద షాపును పెట్టి విక్రయిస్తున్నారు. ఇందుకోసం బ్యాంకు లింకేజీ ద్వారా రూ.3.50లక్షల రుణం తీసుకొని వ్యాపారంలో నిలదొక్కుకుంటున్నారు. మాక్లూర్ మండలం మాదాపూర్కు చెందిన కట్టాజి వైష్ణవి.. అంబికాదేవి మహిళా సంఘంలో సభ్యురాలు. ఇంటర్ వరకు చదివిన ఈ యువతి స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో ఇంట్లోనే సొంత బిజినెస్ను ప్రారంభించారు. ఇందుకు కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్, డిజైనర్గా ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్నారు. గృహ అలంకరణ వస్తువుల తయారీ, పెయిటింగ్ వేయడంలోనూ ఆమె నిష్ణాతురాలు. అయితే, తనకున్న నైపుణ్యంతో బిజినెస్ను ఇంటికే పరిమితం చేయకూడదనే ఉద్దేశంతో మహిళా సంఘంలో రూ.2 లక్షల బ్యాంకు లింకేజీ రుణం పొందారు. ఆర్మూర్ పట్టణంలో వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమె బిజినెస్ వివిధ గ్రామాలకు విస్తరించారు. ఆర్డర్లు తీసుకొని మరీ డిజైన్లు తయారు చేస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళల పేర్లు సునీత, రజిత, కమల, లావణ్య. వీరిది సిరికొండ మండలం న్యావనంది గ్రామం. చేపలు పట్టే వృత్తి కావడంతో గంగపుత్ర మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న వీరు గోదావరి స్వయం సహాయం సంఘంలో సభ్యులుగా ఉన్నారు. కలిసికట్టుగా ఏదైనా వ్యాపారం చేయాలని భావించి బ్యాంకు లింకేజీ రుణాలు పొందారు. ఆ డబ్బులతో ఏడాది క్రితం ఊరిలోనే చేపలు, రొయ్యలు, చికెన్, కూరగాయల పచ్చళ్ల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆర్డర్లపై ఫిష్ ఫ్రై, పచ్చళ్లు చేసి అమ్ముతున్నారు. విదేశాలకు సైతం విక్రయిస్తున్నారు. తనకంటూ సొంత సందపాదనతో ఇతరులకు ఆదర్శంగా నిలువాలనే పట్టుదలతో కాస్మోటాలజిస్టుగా రాణిస్తున్నారు ఆర్మూర్ పట్టణానికి చెందిన యువతి కొక్కుల శ్వేత. డిగ్రీ, బీఎడ్ చదివినప్పటికీ స్వయం శక్తితో ఎదగాలనే సంకల్పంతో బ్యాంకులో రూ.4 లక్షల రుణం తీసుకుని వీక్లి మార్కెట్లో అపారాజిత బ్యూటీ జోన్ను స్థాపించారు. ఇందుకోసం హైదరాబాద్లోని ఓ ఇంటర్నేషనల్ అకాడమీలో ప్రొఫెషనల్ కోర్సు చేసి సర్టిఫికెట్ పొందారు. బ్యూటీ జోన్లో మహిళలకు నాన్సర్జికల్ ట్రీట్మెంట్, కేశ సంరక్షణ, మేకప్ చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. యువతి నైపుణ్యానికి శుభకార్యాలు, పెళ్లిళ్లలో వధువుల మేకప్ కోసం ఆర్డర్లు క్యూ కడుతున్నాయి. నేటి మహిళ అబల కాదు సబల అని నిరూపిస్తున్నారు స్వయం సహాయక సంఘాల మహిళలు. ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహాన్ని, బ్యాంకు రుణాలను ఆసరాగా చేసుకుని సొంతగా వ్యాపారాలు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. జిల్లాలో స్వయం శక్తితో ఎదిగిన, ఎదుగుతున్న పలువురు ఎస్హెచ్జీ మహిళలు గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మినీ సరస్ మేళాలో వ్యాపార ఉత్పత్తులను, హస్త కళలను ప్రదర్శించి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారిపై ప్రత్యేక కథనం. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
మహిళల ఆరోగ్యంపై చొరవ చూపాలి
తెయూ(డిచ్పల్లి): సమాజంలో ప్రజా ఆరోగ్యం, పౌష్టికాహారం ప్రమాణాల విషయంలో లింగ వివక్ష, లింగపరమైన అసమానతలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మహిళలు తీవ్రమైన పౌష్టికాహార సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి ప్రసూతి సమయంలో ఆపరేషన్లు (సిజేరియన్) తప్పనిసరి అవుతున్నాయి. 70 శాతానికి పైగా యువతులు, మహిళలు, 80 శాతం వరకు గర్భిణులు తీవ్రమైన ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. దీని ప్రభావం పుట్టే పిల్లలపై పడుతోంది. ఏటా పది లక్షల కొత్త క్యాన్సర్ల కేసులు నమోదవుతుంటే అందులో 70 శాతం మహిళా బాధితులున్నారు. ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యంపై ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టాలి. ఆరోగ్య బీమా పాలసీని ప్రవేశపెట్టాలి. మహిళల ఆరోగ్యంపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలి. – మోచి సిద్ధలక్ష్మి, ఎకనామిక్స్ లెక్చరర్, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, మద్నూర్ -
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
నిజామాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కోయడి నర్సింహులు గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం రూ. ఐదు వేల కోట్లు కేటాయించాలన్నారు. ప్ర భుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న హైదరాబాద్లో చేపట్టే ధర్నాను గీత కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు పెద్దివెంకట రాములు మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికులకు ప్రతిసారి అన్యాయం జరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శేఖర్ గౌడ్, సాయాగౌడ్, శ్రీరాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఈకో క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ హిత మట్టి కుండలు, ప్రమిదలు, గృహోపకరణాల తయారీ పై శనివారం కార్యశాల నిర్వహించారు. ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందేందుకు విద్యార్థులు ఇలాంటి కార్యశాలలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు మట్టితో చేసిన వస్తువులు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఈకో క్లబ్ కన్వీనర్ డాక్టర్ రంజిత, సభ్యులు రజిత, విజయ, డాక్టర్ నరేశ్, డీఏ అనూష, వినయ్ కుమార్, శ్రీనివాస్, సతీశ్, సంతోష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్అర్బన్: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణను ఆలూరు మండలం ఢీకంపల్లి కాంగ్రెస్ నాయకులు శనివారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. కాంగ్రెస్ నాయకుడు పడమటి ప్రవీణ్, ఓబీసీ జిల్లా నాయకుడు రాజా నరేంద్ర గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ రూరల్: బీఎస్పీ జిల్లా ఇన్చార్జిగా డాక్టర్ నీరడి లక్ష్మణ్ను రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ నియమించారు. తనపై నమ్మకంతో జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన నాయకులకు లక్ష్మణ్ శనివారం కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. డిచ్పల్లి: వంద రోజుల హెల్త్ క్యాంప్లో భాగంగా శనివారం డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల లో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బాలికలకు రక్తపరీక్షలు, ఒత్తిడి నిర్వహణ, సీపీఆర్పై శిక్షణ, హెచ్పీవీ వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించారు. డిప్యూటీ డీఎంహెచ్వో అశ్విని, డాక్టర్ సందీప్, మండల వైద్యాధికారి డాక్టర్ క్రిస్టినా, ప్రిన్సిపాల్ మాధవీలత, శివప్రసాద్, తహిమినా ఫాతిమా, ఆశాలత, మౌనిక, జ్యోతి, సుమలత, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు పాదపూజ ఖలీల్వాడి: నగరంలోని వీఎన్ఆర్ పాఠశాలలో శనివారం త ల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రము ఖ వ్యక్తిత్వ వికా స నిపుణులు తిరునగరి శ్రీహరి మాట్లాడు తూ.. పిల్లలను పెంచడం ఒక గొప్పకళ అని అన్నారు. పి ల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ఆ దిశగా ప్రోత్సహించాలని అన్నా రు. ప్రముఖ మెజీషియన్ రంగనాథ్ చేసిన మ్యాజిక్ షో అందరినీ అలరించింది. కార్య క్రమంలో జేసీఐ ఇందూర్ ప్రతినిధులు లావణ్య, నయన్, గంగాదాస్, వీఎన్ఆర్ పాఠశాల కరస్పాండెంట్ యాదేశ్, డైరెక్టర్లు వీణ, ప్రస న్న, నరహరి, కావ్య తదితరులు పాల్గొన్నారు. -
సంక్షిప్తం
గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి మోపాల్: రైతులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి శిరీష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఈనెల 9 నుంచి ఏప్రిల్ 10వ తేదీవరకూ ఆవులు, గేదెలకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 4 నెలలు, ఆపైన పశువులకు టీకాలు ఇప్పించాలని, ఈ అవకాశాన్ని మండలంలోని పాడి రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 9న మోపాల్, 10న కులాస్పూర్, కులాస్పూర్ తండా, 11న కంజర్, 12న న్యాల్కల్, 13న సిర్పూర్, 14న కాల్పోల్, 16న మంచిప్ప, 17న బైరాపూర్, 18న తాడెం, 20న బాడ్సి, 23న ఎల్లమ్మకుంట, 24న నర్సింగ్పల్లి, 25న అమ్రాబాద్, 26న ముదక్పల్లి, గుడి తండా, 27న చిన్నాపూర్, సింగంపల్లి, 28న కాస్బాగ్ తండా, ఒడ్డెరకాలనీల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అవార్డు గ్రహీతతో సర్పంచులకు శిక్షణ సుభాష్నగర్: నూతనంగా ఎన్నికై న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సర్పంచులకు నగరంలోని న్యాక్భవన్లో శనివా రం శిక్షణనిచ్చారు. తెలంగాణ నుంచి గతంలో జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్న సర్పంచ్ పాట్కూరి తిరుపతిరెడ్డి శిక్షణా కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్నారు. జాతీయస్థాయిలో అవార్డు తీసుకొచ్చేందుకు పరిగణనలోకి తీసుకునే అంశాలు, తాను సాధించిన జాతీ య అవార్డు గురించి వివరించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులు ఎలా సాధించాలి.. గ్రామాల్లో ఉన్న పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం తదితర అంశాలపై శిక్షణనిచ్చారు.నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పంచాయతీ అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. తప్పుడు షూరిటీ కేసులో ఇద్దరి అరెస్ట్ నిజామాబాద్ అర్బన్: తప్పుడు షూరిటీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి శనివారం తెలిపారు. కోర్టులో షూరిటీగా హాజరయ్యేటప్పుడు తమ పై లేని ఆస్తులను చూపిస్తూ తప్పుడు గృహ విలువ సర్టిఫికెట్లు, హౌస్ టాక్స్ రసీదులు ఇతర పత్రాలను నకిలీగా తయారు చేసి కోర్టులో సమర్పించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన రత్నం, ముజాపురుల్లా అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీరు ఓ కేసులో తప్పుడు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారని, విచారణ చేపట్టి అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిజామాబాద్ రూరల్: విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేశ్ ఠాకూర్ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, యజ్ఞ కార్యక్రమాన్ని శనివారం శనిర్వహించారు. కార్యక్రమంలో ప్రాంత కృషి ప్రముఖ్ దాత్రిక రమేశ్ జీ, జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ ఆనంద్, జిల్లా సేవా ప్రముఖ్ రాంప్రసాద్ చటర్జీ, రాజేశ్వర్, తులసీదాసు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధంతి సభను జయప్రదం చేయండి నిజామాబాద్ రూరల్: హైదరాబాద్లో ఈ నెల 10న ని ర్వహించే నిర్వహించే రాయల సుభాష్ చంద్రబోస్ 10వ వ ర్ధంతి సభను జయప్రదం చేయాలని సీపీఐఎంఎల్ మాస్లైన్(ప్రజాపంథా) నగర కార్యదర్శి ఎం సుధాకర్ కోరారు. నగరంలోని కోటగల్లీలో ఉన్న కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం వర్ధంతి సభ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీ గోదావరి, కే సంధ్యారాణి, కర్క గణేశ్, వినోద్, లింగం, విఠల్, గంగాధర్, శివ పాల్గొన్నారు. విద్యార్థుల విజ్ఞాన యాత్ర సిరికొండ: మండలంలోని న్యావనంది జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు విజ్ఞాన యాత్రకు వెళ్లారు. గ్రామా నికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమ్మాజీ నరేశ్ విజ్ఞా న యాత్రకు తగిన సహకారం అందించారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో యాత్రను ఎమ్మెల్యే భూపతిరె డ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం పదో తరగతి వి ద్యార్థులకు పరీక్ష సామగ్రిని ఎమ్మెల్యే అందచేశారు. ఉమ్మాజీ నరేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నియామకం సిరికొండ: బీజేపీ ఎస్సీ మోర్చా మండలాధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన బందెల ధర్మపురిని నియమించారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి హాజరై ధర్మపురిని సన్మా నించారు. పార్టీ జిల్లా నాయకుడు అల్లూరి రాజేశ్వర్రెడ్డి, మండలాధ్యక్షుడు సంజీవ్రెడ్డి,రంజిత్రెడ్డి, రామస్వామి, బాబురావు, గంగామురళి, కిరణ్, మధు, లింబాద్రి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిజామాబాద్ అర్బన్: నగరంలోని రెండో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి స్థానిక ఎస్సై సయ్యద్ముజాయిద్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. అహ్మద్బజార్, బోధన్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో వస్త్రదుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలను తనిఖీలు చేపట్టినటులఎస్సై తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా ఈ తనిఖీలు చేపట్టామని ప్రజల్లో భద్రత కలిగించేలా పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సెల్ఫోన్ల అప్పగింత మోపాల్: మోపాల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న ఆరుగురి సెల్ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు ఎస్సై జాడె సుస్మిత శనివారం తెలిపారు. మండలంలో ఫోన్లు పోయిన వారు పీఎస్లో ఫిర్యాదు చేస్తే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్లను గుర్తిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలి
● మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ సుభాష్నగర్: నగరంలోని ఆస్తిపన్ను బకాయిల వసూళ్లలో వేగం పెంచాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ సమావేశపు హాల్లో ఆస్తి పన్ను బకాయిలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో ఆస్తి పన్ను బకాయిలు రూ.95కోట్లకుపైనే ఉందని, ఇప్పటివరకు రూ.35కోట్ల వరకు వసూలైందని తెలిపారు. మిగతా బకాయిలు కూడా వసూలు చేసేలా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. స్పెషల్ డ్రైవ్ కోసం మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందితో ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీలైనంత వరకు లక్ష్యం చేరుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆ తర్వాత చెల్లించే వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. యజమానులు తమ ఆస్తి పన్నులను ఈ నెల 31వ తేదీలోపు చెల్లించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ రవీందర్ సాగర్, డీసీ రవిబాబు, ఏసీపీలు, ఆర్ఓలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నివర్గాల అభ్యున్నతికి కృషి
నిజామాబాద్ రూరల్: అన్నివర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని జలాల్పూర్ గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సర్పంచ్ చెన్నూరు నవనీత వెంకట్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గనిశెట్టి రాజు కుమారుడి వివాహం రెండురోజుల క్రితం జరగగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, నాయకులు బాగారెడ్డి, కార్పొరేటర్ అగ్గుభోజన్న, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ● అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో కొనసాగిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ నిజామాబాద్ రూరల్/ సిరికొండ: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించారు. రూరల్ మండల కాలూర్ గ్రామంలో నిర్వహించిన పరిశుభ్రథ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుంటే ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. కాలూర్లో స్థానిక నాయకులతో కలిసి పారిశుద్ధ్య పనులు, రోడ్డును శుభ్రం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని వారిని నమ్మొద్దని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో రాబోవు రోజుల్లో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, నాయకులు బాగారెడ్డి, కార్పొరేటర్ అగ్గు భోజన్న, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని గడ్కోల్, చిన్నవాల్గోట్ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీలను శుభ్రం చేశారు. గడ్కోల్లో సర్పంచ్ లత, ఉపసర్పంచ్ సంపత్రెడ్డి, చిన్నవాల్గోట్లో సర్పంచ్ దడివె గణేశ్, ఉపసర్పంచ్ రొండ్ల గోవర్ధన్రెడ్డి, జీపీ కార్యదర్శి శరణ్య, కారొబార్ సాయి తదితరులు పాల్గొన్నారు. -
14ఏళ్ల బాలికలకు హెచ్పీవీ టీకాలు ఇప్పించాలి
డీఎంహెచ్వో రాజశ్రీ సుభాష్నగర్: గర్భాశయ క్యాన్సర్ (సర్వైకర్ క్యాన్సర్ నివారణ) రాకుండా 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ టీకాలు ఇప్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ సూచించారు. ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో హెచ్పీవీ టీకాల పంపిణీని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభిస్తామని తెలిపారు. ఈసందర్భంగా జిల్లాలోని వైద్యాధికారులు, పీహెచ్సీ, వైద్యసిబ్బందితో జూమ్ మీటింగ్ ద్వారా హెచ్పీవీ వ్యాక్సినేషన్, ఇతర జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్వో మాట్లాడుతూ.. మహిళల్లో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్కు ప్రధాన కారణం ఈ హెచ్పీవీ అని తెలిపారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఫిబ్రవరి 28న ప్రారంభించారని, రాష్ట్రంలో కూడా అదేరోజు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభమైందని తెలిపారు. హెచ్పీవీ టీకాలు వేయడం, క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ కొత్త కేసులు, మరణాలను తగ్గించవచ్చన్నారు. జిల్లాలో 14 ఏళ్ల బాలికలు మొత్తం 12,363 మంది ఉన్నారని, వీరందరికి ఆదివారం ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు ఇస్తామన్నారు. తర్వాత అన్ని పీహెచ్సీల్లో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వోలు రవీందర్, సమత, అశ్విని, ప్రోగ్రాం అధికారులు శ్వేత, వెంకన్న, వెంకటేశ్, శ్రావ్య, డీపీవో విశాల, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, ఫార్మసీ అధికారి నారాయణ పాల్గొన్నారు. -
ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ
డిచ్పల్లి: మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణ పనులకు సర్పంచ్ లొక్కిడి యాదగిరి శనివారం భూమిపూజ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చెరువు కట్టపై శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సౌజన్య అనిల్, గ్రామాభివృద్ధి కమిటీ క్యాషియర్ రాజరెడ్డి, రైటర్ దాసరి అశోక్, ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందించిన జేసీఐ ప్రతినిధులు -
భారతీయ సంస్కృతికి ఆధారం మాతృమూర్తులే
● నగర మేయర్ కూరగాయల ఉమారాణి ● ఆదర్శ మహిళలకు సన్మానంసుభాష్నగర్/ ధర్పల్లి/ తెయూ(డిచ్పల్లి)/ నిజామాబాద్ రూరల్: భారతీయ సంస్కృతికి ఆధారం మాతృమూర్తులే అని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇందూరు మొట్టమొదటి మహిళా కౌన్సిలర్ మాదాసు నాగమ్మ యాదవ్ జ్ఞాపకార్థంగా ఆమె మేనల్లుడు మాదాసు స్వామి యాదవ్ శనివారం ఎల్లమ్మగుట్టలోని మున్నూరు కాపు సంఘంలో ఆదర్శ మహిళల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమారాణి మాట్లాడుతూ.. ఇంటిని తీర్చిదిద్దడంలో సీ్త్ర శ్రమ ఎంతో ఉందన్నారు. ముఖ్య వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ కృష్ణశాస్త్రి విజయభాస్కర్ మాట్లాడుతూ.. దేశంలో పుట్టి చిరస్మరణీయులుగా నిలిచిపోయిన ఎంతోమంది మహనీయులు వెనక ఉన్నది వారి తల్లులు మాత్రమేనని, అందుకే సీ్త్ర తలుచుకుంటే అసాధ్యం అనేది ఏదీ లేదని ఆయన అన్నారు. అనంతరం పలువురు ఆదర్శ మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ, కార్యక్రమ నిర్వాహకులు మాదాసు స్వామి యాదవ్, బీడీ కార్మికురాలు బెల్లాల్ సావిత్రి, మహిళలు పాల్గొన్నారు. నగరంలోని మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ ఉమారాణి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు కుటుంబం, సమాజానికి బలమైన ఆధారమన్నారు. అనంతరం పలువురు మహిళాసిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారికత విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని చేపట్టారు. మెహెంది పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ జ్యోతి, మహిళా సాధారికత విభాగం కోఆర్డినేటర్ శారద, సరిత, నిహారిక, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్–3 ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ స్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించాలని జేసీఐ పూర్వ అధ్యక్షురాలు జిల్కర్ లావణ్య అన్నారు. జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో నగరంలోని వీఎన్ఆర్ పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల మాతృ మూర్తులకు క్రీడలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జేసీఐ ఇందూర్ పూర్వ అధ్యక్షుడు గంగాదాస్, జోన్ ఆఫీసర్ జిల్కర్ నయన్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి, ప్రముఖ మెజీషియన్ వేదాంతం రంగనాథ్, పాఠశాల కరస్పాండెంట్ యాదేశ్ గౌడ్, డైరెక్టర్లు వీణారాణి, ప్రసన్న, నరహరి తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి మోపాల్: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని సిర్పూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లాటికర్ రాము అన్నారు. శనివారం మండలంలోని సిర్పూర్ ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ బొడ్డు గౌతమి గణేశ్, పాఠశాల కమిటీ చైర్మన్ రేణుక, ఎండీఎం కార్మికులు, పాఠశాల ఆయాను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు అనురాధ, గంగాప్రసాద్, సుకన్య, ఛాత్రోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణా కట్టడికి చర్యలు
బోధన్: పొరుగు రాష్ట్రాల నుంచి ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని టీజీఎండీసీ(తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ) మేనేజింగ్ డైరెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. రాష్ట్ర సరిహద్దులోని సాలూర మండల కేంద్రం శివారులో టీజీఎండీసీ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ను కలెక్టర్ ఇలాత్రిపాఠితో కలిసి శనివారం భవేశ్ మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. తెలంగాణ వైపు వచ్చే ఇసుక వాహనాలను చెక్పోస్ట్ వద్ద వేయింగ్ మిషన్తో తని ఖీ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇసుక అక్రమరవాణాతోపాటు ఓవర్లోడింగ్ను నిరోధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. చెక్పోస్ట్ వద్ద ప్రతి వా హనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నా రు. ఆన్లైన్లో బుక్ చేసుకుని మహారాష్ట్ర ప్రాంత ఇసుక క్వారీల నుంచి తెలంగాణ వైపు నిర్ణీత పరి మాణం, నిబంధనలకు అనుగుణంగా ఇసుక తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో సాలూ ర వద్ద చెక్పోస్ట్ నెలకొల్పామని, తద్వారా రాష్ట్ర ప్ర భుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు. ఓవ ర్లోడ్ వాహనాలను అడ్డుకుని రోడ్లు చెడిపోకుండా, ప్రమాదాలు జరగకుండా నిలువరించవచ్చన్నా రు. సరిహద్దు సమస్య తలెత్తకుండా.. మంజీర నదిలో సరిహద్దు సమస్య తలెత్తకుండా ఆఽ దునిక సాంకేతికత సహాయంతో పకడ్బందీ చర్యలు చేపట్టామని భవేశ్మిశ్రా తెలిపారు. రాష్ట్ర సరిహద్దు భూభాగాన్ని గుర్తిస్తూ స్పష్టంగా సరిహద్దులు ఏర్పా టు చేశామన్నారు. మంజీర నది నుంచి ఇసుక అక్ర మ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్ర త్యేక దృష్టిసారించిందని, ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి ఈ మేర కు స్పష్టమైన ఆదేశాలిచ్చారని వెల్లడించారు. ఇసుక తవ్వకాలు, రవాణా విషయంలో పాదర్శకత కోసం ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశ పె ట్టిందని, నిజామాబాద్ జిల్లాతోపాటు మరో నాలు గు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నా మన్నారు. మైనింగ్ శాఖ ఏడీ సంజయ్, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ అశోక్, అధికారులు పాల్గొన్నారు. నిబంధనల మేరకు మహారాష్ట్ర వైపు నుంచి ఇసుక తరలించాలి ఓవర్లోడ్ వాహనాలను నిరోధిస్తాం టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ భవేశ్మిశ్రా సాలూర శివారులో అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ ప్రారంభం -
నిజామాబాద్
ప్రోత్సహిస్తే లక్ష్యాలను ఛేదిస్తాం..! నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం● కుటుంబ సహకారం తప్పనిసరి ● మహిళలను చిన్నచూపు చూడొద్దు ● ‘సాక్షి’ సర్వేలో యువతుల మనోగతం వాతావరణం ఉదయం ఈదురు గాలులు వీస్తాయి. ఎండ ప్రకాశవంతంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది. ఇంటర్ కళాశాలల.. తెలంగాణ యూనివర్సిటీతోపాటు వర్సిటీ పరిధిలోని ఇంటర్ కళాశాలల హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026– 10లో uమీరు ప్రస్తుతం చదువుతున్న కోర్సును మీరే ఎంచుకున్నారా ?మీరు తీసుకునే రోజువారీ నిర్ణయాల్లో ఎంత శాతం స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు ?సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్వేచ్ఛ, సహకారం, ప్రోత్సాహం లభిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతామని, అప్పుడే మహిళా అభివృద్ధి సాధ్యమవుతుందని యువతులు స్పష్టం చేస్తున్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ నిర్వహించిన సర్వేలో పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి 20 మంది చొప్పున నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బోధన్, డిచ్పల్లి, బాల్కొండ నియోజకవర్గాల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా వంద మంది 18 నుంచి 25 ఏళ్ల వయస్సు విద్యార్థుల మనోగతాన్ని ‘సాక్షి’ తెలుసుకుంది. ‘మీరెంత ఇండిపెండెంట్ ’ అనే అంశంపై సీ్త్ర స్వతంత్రంగా ముందుకు వెళ్లాలంటే కుటుంబ సహకారం తప్పనిసరన్నారు. విద్య, వ్యాపారం వివిధ రంగాల్లో ముందుకు వెళ్లేందుకు తోడ్పడాలన్నారు. మహిళలను చిన్నచూపు చూడకుండా అన్నిరంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. మీ నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంత మేర మద్దతు లభిస్తోంది ?ఒక సీ్త్ర ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలంటే.. ఎవరి సహకారం ఎక్కువ అవసరంసర్వేలో అభిప్రాయం వ్యక్తం చేసిన వారు మొత్తం 100 మంది (గ్రాఫ్లలో అభిప్రాయం చెప్పిన వారి సంఖ్య) -
ఆకాశమే హద్దుగా విజయాలు సాధించాలి
నిజామాబాద్ లీగల్ : మహిళలు ఆకాశమే హద్దుగా అన్ని రంగా ల్లో విజయాలు సా ధించాలని జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా ది నోత్సవం సందర్భంగా మహిళలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో పు రుషులతో పోటీ పడి ఎదగాలని అన్నారు. ఉద్యోగ, కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చే సుకోవాలని, ఉద్యోగ ఒత్తిడిలో తల్లిగా బా ధ్యతలను విస్మరించొద్దన్నారు. మహిళలకు భద్రత, సమాన అవకాశాలు..నిజామాబాద్అర్బన్: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆ ర్థిక, సామాజిక అభివృద్ధి సాధించాలని క లెక్టర్ ఇలా త్రిపాఠి ఆకాంక్షించారు. అంత ర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు తె లిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పా త్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మహిళలకు భద్రత, గౌరవం, సమా న అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి ● సీపీ సాయిచైతన్య నిజామాబాద్అర్బన్: కమిషనరేట్ పరిధిలో పెండింగ్లో ఉన్న మౌఖిక విచారణ కేసులను త్వరగా పూర్తిచేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విచారణ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 17 మౌఖిక విచారణ కేసుల దర్యా ప్తును ముమ్మరం చేయాలని ఆదేశించారు. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, ఆర్మూర్, బోధన్ నిజామాబాద్ ఏసీపీలు వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్, ప్రకాశ్ పాల్గొన్నారు. పంటలకు సరిపడా యూరియా డొంకేశ్వర్(ఆర్మూర్): పంటలకు సరిపడా యూరియా ఉందని, రైతులు ఆందోళన చెందకుండా అవసరం మేరకే తీసుకోవాలని జి ల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి అన్నా రు. మండలంలోని నికాల్పూర్, డొంకేశ్వర్, గా దేపల్లి, నూత్పల్లి, గంగాసముందర్ సొ సైటీ గోదాములను శనివారం తనిఖీ చేసి యూరియా నిల్వలను పరిశీలించారు. ప్రభు త్వం ప్రవేశపెట్టి న బుకింగ్ యాప్ ద్వారానే యూరియాను తీసుకోవాలని, దీనిని రైతులంతా అలవాటు చేసుకోవాల్సిందేనన్నారు. ● చెరువులో తోసి ముగ్గురు పిల్లల హత్య కామారెడ్డి క్రైం: కన్న తండ్రే తన ముగ్గురు పిల్లలను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీనగర్ కాలనీలో నివాసం ఉండే ఇస్మాయిల్, షహీబాలకు ముగ్గురు కుమార్తెలు షీపత్(8), అయాత్(7), మరియం(5) ఉన్నారు. ఇస్మా యిల్ ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం దుకాణంలో తినుబండారాలు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లి చెరువులో తోసేసి చంపాడు. పిల్లలు తప్పిపోయినట్లు నటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నాటకమాడాడు. అనుమానం వచ్చి పోలీసులు ఇస్మాయిల్ను విచారించగా తానే పిల్లలను పోషించలేక చెరువులో తోసి హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు అర్ధరాత్రి వరకు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి పిల్లల శవాలను వెలికి తీయించారు. -
అందరి భాగస్వామ్యంతో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● 2కే రన్ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ కె ఉమారాణి సుభాష్నగర్: అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. 99 రోజు ల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉద యం నగరంలో 2కే రన్ నిర్వహించారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు నుంచి చేపట్టిన రన్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ ఉమారాణి జెండా ఊపి ప్రా రంభించారు. కంఠేశ్వర్ బైపాస్ నుంచి ప్రధాన మా ర్గాల మీదుగా పాత ఆర్డీవో కార్యాలయం వరకు 2కే రన్ కొనసాగింది. అంతకుముందు ప్రతిజ్ఞచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను చాటేలా కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. అంకితభావం, చిత్తశుద్ధితో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందిని గుర్తించి ఉత్త మ అవార్డులు అందజేస్తామని అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు మంచి పేరు తేవాలన్నారు. వైద్యశాఖతో సమన్వ యం చేసుకుని మహిళలందరికీ ఆ రోగ్య పరీక్షలు నిర్వహించాలని, సర్వైకల్ క్యాన్సర్ నిరో ధం కోసం 14 నుంచి 15 ఏళ్లు కలిగిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మున్సిపల్ కార్మికులకు ప్రయోజనం చేకూరేలా, వారి న్యాయమైన కోర్కెలు పరిష్కారమయ్యేలా తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమాన్ని ఆయా శాఖల వారీగా విస్తృత స్థాయిలో అ మలు చేస్తూ నగర అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చా రు. ప్రజలకు సదుపాయా లు మెరుగుపర్చేందుకు ప్రగ తి ప్రణాళిక ఎంతో చక్కటి కార్యక్రమమని, అధికాారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించి చక్కటి పేరు పొందాలని సూచించారు. నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను నగర ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు. నగర సుందరీకరణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని, ఇతర అన్నివిభాగాల అధికారులు, సిబ్బంది 99 రోజుల ప్రభుత్వ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అడిషనల్ కమిషనర్ రవీందర్సాగర్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, తహసీల్దార్ విజయ్కాంత్రావు, కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, పసునూరి రమేశ్, చింత శ్రీనివాస్రెడ్డి, మెప్మా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
భారమైన గ్యాస్ బుడ్డి
సుభాష్నగర్: జిల్లా ప్రజలపై గ్యాస్ సిలిండర్ భారం పడింది. గృహ వినియోగ సిలిండర్ పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.114.50 ధర పెరిగింది. పెరిగిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రతినెలా జిల్లా ప్రజలపై రూ.కోటి వరకు భారం పడనుంది. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 42 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రతినెలా సగటున 1.50 లక్షల వరకు సిలిండర్ల వినియోగం అవుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భారం కానున్నాయి. ఇప్పటికే చాలామంది లబ్ధిదారులకు మహాలక్ష్మి పథకం కింద రూ.500 కూడా రావడంలేదు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధవాతావరణం నెలకొనడమే ధరలు పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. పెరిగిన సిలిండర్ ధరలు గృహ వినియోగంపై రూ.60.. కమర్షియల్పై రూ.114.50 జిల్లా ప్రజలపై రూ.కోటి వరకు భారం -
మీ సమస్యలు ఏమునా్నయ్..
‘సాక్షి’ స్టార్ రిపోర్టర్గా కూరగాయల ఉమారాణి స్టార్ రిపోర్టర్ (మేయర్) : కాలనీలో ఏం సమస్యలు ఉన్నాయి ? కాలనీవాసులు : మా డివిజన్ (49వ డివిజన్) నుంచి మీరు కార్పొరేటర్గా గెలిచి మేయర్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. అద్దె ఇళ్లల్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాం. రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. ● రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి సమస్యలు ● కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి సమస్యలను గతంలో పలుమార్లు కార్పొరేటర్లు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. డ్రెయినేజీల్లోంచి దుర్వాసన వస్తోంది. రోగాల బారిన పడుతున్నాం. ● ప్రభుత్వం నుంచి ఇంకా మీరు కోరుకుంటున్న అభివృద్ధి ? ● డివిజన్ను నగరంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి. ప్రతిరోజూ చెత్త సేకరించాలి, రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం చేపట్టాలి. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య పరిష్కరించాలి. కాలనీవాసులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. అమృత ధార ద్వారా ఇంటింటికి తాగునీటి వసతి కల్పించాలి. డ్రెయినేజీలను ప్రతిరోజూ శుభ్రం చేయించాలి. పారిశుద్ధ్య కార్మికులతో.. స్టార్ రిపోర్టర్ (మేయర్) : పారిశుద్ధ్య కార్మికులుగా మీ జీవన విధానం పారిశుద్ధ్య కార్మికులు : ప్రతిరోజూ ఉదయం 4 గంటల నుంచి మా పని మొదలవుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తాం. ఇదే మా దినచర్య. పని చేస్తేనే జీతం వస్తుంది. జీతాలు వస్తేనే పూట గడుస్తుంది. ● జీతం ఎంత వస్తుంది ● ప్రతినెల రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు వస్తుంది. ఈ జీతం సరిపోవడంలేదు. మీరే ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పెంచితే మేలు. కనీసం రూ.20 వేల వరకు ఇస్తే బాగుంటుంది. అధికారులకు చెప్పినం కానీ.. మీరు ప్రభుత్వంతో మాట్లాడి పెంచాలి. ● అనారోగ్యం బారిన పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు ● మా పని అంతా చెత్తా, దుమ్ములోనే. మురుగుకాల్వల్లో చెత్త తీస్తాం. ఈ సమయంలో అనేక రోగాల బారిన పడుతున్నాం. పని మానేసి తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం. మున్సిపాలిటీ నుంచి నూనె, సబ్బులు, గ్లౌజు లు అందుతున్నాయి. ఆరోగ్య బీమా కల్పించాలి. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సాయం కోరుకుంటున్నారు ఈ పని చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చిన వారు అనారోగ్యంతో తరచూ సెలవులు పెడుతూ, మానేస్తున్నా రు. దీంతో ఉన్న వారిపై నే పనిభారం పడుతుంది. అవసరం మేర కార్మికు లు లేరు. చీపుర్లు, గ్లౌజులు, షూలు, పారలు, ఫాగింగ్ యంత్రాలు, మాస్కు లు, ఇతరత్ర పని పరికరాలు సరిపడా ఇవ్వాలి. వే తనాలు పెంచే బాధ్యతను మీరు తీసుకోవాలి. ప్ర భుత్వం పథకాల్లో మాకు ప్రాధాన్యత ఇవ్వాలి. ‘నేను మీ ఉమారాణిని.. మీరంతా నా వాళ్లే.. ప్రతి రోజూ మీతో కలిసే ఉంటాను.. మాట్లాడతాను.. కాలనీలో సమస్యలు ఏమున్నాయి..’ అంటూ నగరంలోని 49వ డివిజన్లో కాలనీవాసులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ కాలనీల్లో నెలకొన్న సమస్యలను ‘సాక్షి’ స్టార్ రిపోర్టర్ (నగర మేయర్) కూరగాయల ఉమారాణి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పారిశుద్ధ్య కార్మికులను కలిసి వారి జీవన స్థితిగతులు, జీతభత్యాలు, ఆరోగ్యం, ప్రభుత్వం నుంచి ఇంకా అందాల్సిన సాయంపై ఆమె ఆరా తీశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నగర మేయర్ ‘సాక్షి’ స్టార్ రిపోర్టర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 99 రోజులపాటు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా అధికారులు, ప్రభుత్వంతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. – సుభాష్నగర్ కాలనీల్లో పర్యటించి ఇబ్బందులు తెలుసుకున్న నగర మేయర్ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం -
నెరవేరిన సీఎం హామీ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా 2023 మార్చి 18న కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామం మీదుగా పాదయాత్రగా వెళుతున్న అప్పటి పీసీసీ అధ్యక్షుడు, నేటి సీఎం రేవంత్రెడ్డిని భిక్కనూరు లక్ష్మి అనే మహిళ కలిసి కూలిపోయిన తన ఇంటిని చూడమని వేడుకుంది. దీంతో రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ కూలిపోయిన ఆమె ఇంటిని చూసి తాము అధికారంలోకి రాగానే ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ‘రేవంతన్నా.. నన్ను యాది మరవకు’అన్న శీర్షికతో ‘సాక్షి’మెయిన్ ఎడిషన్లో 2023 డిసెంబర్ 31న కూలిపోయిన ఇంటిలో భిక్కనూరు లక్ష్మితో మాట్లాడుతున్న ఫొటోతో ప్రచురించిన కథనానికి సీఎంవో అధికారులు స్పందించారు. అదేరోజు జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భిక్కనూరు లక్ష్మికి వెంటనే అప్పటికే పక్క గ్రామంలో నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు లక్ష్మి దగ్గరకు వెళ్లి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని చెప్పారు. అయితే కూలిన ఇంటి స్థలంలోనే తాను ఇల్లు కట్టుకుంటానని ఆమె చెప్పడంతో ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపించారు. తొలి విడతలోనే లక్ష్మితో పాటు ఆమె తోటి కోడలు రాజమణికి కూడా ఇల్లు మంజూరైంది. ఎట్టకేలకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లక్ష్మి కుటుంబ సభ్యులు శనివారం గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పాదయాత్రలో ఇచి్చన మాట ప్రకారం సీఎం రేవంత్రెడ్డి లక్ష్మికి ఇల్లు మంజూరు చేశారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారి గృహ ప్రవేశానికి తాను హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పేద మహిళలకు న్యాయం చేసిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఉమ్మడి జిల్లా విలువిద్య క్రీడాకారుల ఎంపిక
మోపాల్: మండలంలోని ఏకలవ్య ఆర్చరీ అకాడమిలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విలువిద్య క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. మినీ సబ్జూనియర్ విభాగంలో జరిగిన ఎంపికలకు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి సుమారు వంద మంది క్రీడాకారులు హాజరయ్యా రు. పోటీలను అర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లోని పటాన్చెరువులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 8న రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు ఉంటాయన్నారు. రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. జిల్లా నుంచి పోటీ పడే క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దాలని నిర్వాహకులకు సూచించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో కోచ్ ఎన్ రవీందర్, ప్రతినిధులు ప్రతాప్దాస్, రవీందర్, మురళి, పీరియా, జైత్రం, నవనీత్రెడ్డి, సంజీవ్రెడ్డి క్రీడాకారులు పాల్గొన్నారు. -
జిల్లా ఇన్చార్జి మంత్రికి ఘన స్వాగతం
సాక్షి నెట్వర్క్: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలుపై కలెక్టరేట్లో శుక్రవారం ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హాజరయ్యారు. జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమె ముందుగా గెస్ట్హౌస్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి సీతక్కకు కలెక్టర్ ఇలా త్రిపాఠి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలపై ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, షబ్బీర్ అలీ, రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చర్చించారు. పాల్గొన్న ఉమ్మడి జిల్లా అధికారులు -
క్రైం కార్నర్
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఉన్న వీఆర్ కాంప్లెక్స్ సెల్లార్లో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు. ఎస్హెచ్వో తెలిపిన వివరాల ప్రకారం.. కాంప్లెక్స్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వయస్సు 35ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందన్నారు. వారం రోజుల క్రితం ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య బాన్సువాడ రూరల్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాన్సువాడ మండలం సోమేశ్వర్లో చోటు చేసుకుంది. బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ధ్యావల్ల రాములు (26) హోలీ పండుగ రోజున మద్యం తాగి భార్యతో గొడవపడి కొట్టాడు. మరుసటి రోజు సైతం భార్యను కొట్టడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన రాములు గురువారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కుమారుడిని చంపిన తండ్రి రిమాండ్ ఇందల్వాయి: కుమారుడిని చంపిన తండ్రిని రిమాండ్కు తరలించినట్లు డిచ్పల్లి సీఐ వినోద్ తెలిపారు. పోలీస్స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన కొత్తగొల్ల కిషన్కు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు భాను ప్రకాశ్ గంజాయికి అలవాటు పడి తల్లితండ్రులను వేధించేవాడు. కొడుకు వేధింపులు భరించలేక కిషన్ తన కుమారుడు భానుప్రకాశ్ను గురువారం హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కుమారుడి వేధింపులు తాళలేకే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని సీఐ పేర్కొన్నారు. -
మత్స్యకారులకు నైపుణ్య పరీక్షలు
నవీపేట: మండలంలోని అబ్బాపూర్(ఎం), అభంగపట్నం గ్రామాల మధ్య ఉన్న ఎర్రుకుంట చెరువులో ఇరు గ్రామాల మత్స్యకారులకు శుక్రవారం నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. వల అల్లుట, విసురువల, ఈత కొట్టుట, తెప్ప వినియోగం వంటి అంశాలపై పరీక్షలు నిర్వహించారు. పరీక్షలలో అర్హులైన వారికి లైసెన్స్ పత్రాలను జారీ చేస్తామని మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి ఎఫ్డీవోలు లాయక్ మొయినొద్దీన్, డోలీసింగ్, జిల్లా కో–ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ రమావతి పాల్గొన్నారు. సుభాష్నగర్: సామాజిక న్యాయాన్ని పాటించకుండా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. శుక్రవారం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రమోద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు రాజ్యసభలో సీటు కల్పించకుండా మోసం చేసినందుకు భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేస్తామని అన్నారు. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిత్యం మాదిగలను మోసం చేస్తోందని ఆరోపించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రం నుంచి ఏడుగురు అగ్రకులాల నుంచి ఎంపీలుగా ఉన్నా.. సీఎం రేవంత్రెడ్డి తన సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డికి రాజ్యసభ అవకాశం కల్పించారని విమర్శించారు. నేటి నుంచి 13వ తేదీవరకూ వివిధ రూపాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎదుట నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు దౌర్జన్యంగా తరలించడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. నాయకులు సరికెల పోశెట్టి, గంధమాల నాగభూషణం, యమున, భూమయ్య, ఆకారం రమేశ్, మహేశ్, మోహన్, సత్యం, అనిల్ తదితరులు పాల్గొన్నారు. బోధన్: బోధన్కు చెందిన ప్రముఖ కరాటే మాస్టర్ మల్లెపూల పల్లవి జాతీయ స్థాయి ఝాన్సీలక్ష్మీబాయి శౌర్య అవార్డుకు ఎంపికై ంది. హైదరాబాద్కు చెందిన వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి ప్రతి ఏటా వివిధ రంగాల ప్రతిభావంతులకు జాతీయ స్థాయి అవార్డులను అందిస్తుంది. ఈ ఏడాది పట్టణ కేంద్రానికి చెందిన కరాటే మాస్టర్ పల్లవిని అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించనున్న అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో నిర్వాహకుల చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నట్లు ఆమె శుక్రవారం తెలిపారు. కరాటేతో పాటు కర్ర, కత్తిసాము, గుర్రపు స్వారీ, బాక్సింగ్ విద్యలో శిక్షణ పొందినట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన కరాటే పోటీల్లో పాల్గొన్న ఆమె ప్రతిభ చాటి అనేక మెడల్స్ సాధించింది. 2022లో మార్షల్ ఆర్ట్స్ సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే స్పారింగ్(ఫైటింగ్) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే లైసెన్స్ పొందిన ఏకై క మహిళా కరాటే మాస్టర్గా నిలిచింది. జాతీయ స్థాయి అవార్డుకు ఆమె ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు -
బాలికలకు హెచ్పీవీ టీకా ఇప్పించాలి
సుభాష్నగర్: బాలికలకు హెచ్పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకా ఇప్పించాలని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని త న కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేక రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 8న నిర్వహించను న్న హెచ్పీవీ టీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభిస్తారని అన్నారు. 14 ఏళ్ల లోపు బాలికలంద రికి ఈ హెచ్పీవీ టీకాను అందించనున్నట్లు ఆమె పే ర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధి కారి డాక్టర్ అశోక్, పాలన అధికారి సుమంత్ కుమార్, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మహిళలకు బాసటగా నిలుద్దాం
● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ● నగరంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం నిజామాబాద్అర్బన్: మనమందరం మహిళలకు మంచి అవకాశాలను ఇవ్వడమే కాకుండా వారికి బాసటగా నిలుద్దామంటూ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మహిళలకు సమాన అవకాశాలను ఇచ్చినట్లయితే వారి నుంచి సమాజ అభివృద్ధికి ఎంతో పొందుతామన్నారు. నగరంలోని విజయలక్ష్మి గార్డెన్లో శుక్రవారం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స మా వేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన జీవితాన్ని ఒక ఉదాహరణగా, ఆదర్శవంతమైన మహిళగా తీర్చిదిద్దుకొనుటకు చదువు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి మహిళ కమిట్మెంట్ అండ్ కరేజ్ను కలిగి ఉండాలన్నారు. ఛాలెంజ్ లేని జీవితం చప్పడి కూర వంటిదన్నారు. పదవ తరగతి చదువుతూ విప్లవోద్యమంలో వెళ్లిన తను ఒక నక్సలైట్గా ఏ కో ర్టులో నిల్చున్నానో, అదే కోర్టు లో నేను అడ్వకేట్గా నిలిచినట్లు పేర్కొన్నారు. అనంతరం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కరపత్రాలను విడుదల చేశారు. సురక్ష దీప అన్న భద్రత బోర్డులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఏర్పాటు చేయాలని సీపీ పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. మహిళలు సమాజంలో అభివృద్ధి చెందేందుకు పాటుపడాలన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి, కౌన్సిల్ కన్వీనర్ అదనపు డీసీపీ బస్వారెడ్డి, కోశాధికారి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కవితరెడ్డి, సభ్యు లు కాకతీయ కళాశాల కరస్పాండెంట్ రజినీకాంత్, కామారెడ్డి ఏసీపీ చైతన్యరెడ్డి, కామారెడ్డి డీఎఫ్వో నికిత, నూడా చైర్మన్ కేశవ వేణు పాల్గొన్నారు. -
ముగిసిన ఎస్జీఎఫ్ జిల్లా జట్టు శిక్షణ శిబిరం
డిచ్పల్లి: మండలంలోని సుద్దపల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 2 నుంచి 6 వరకు నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ జిల్లా సాఫ్ట్బాల్ అండర్–14 బాలికల జట్టు శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. పాఠశాల ప్రిన్సిపాల్ నళిని మాట్లాడుతూ.. ఈనెల 7 నుంచి 9 వరకు మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టును మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మర్కంటి సుజాత, గంగా మోహన్, చిప్ప నవీన్, జ్యోత్స్న, మెండె రమేశ్, మౌనిక, నర్మదా, అనికేత్, అర్చన తదితరులు పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెయూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్, టాస్క్ సహకారంతో ఈ నెల 10, 11వ తేదీల్లో ‘ఏఐ యుగంలో విద్య’ అనే అంశం పై నిర్వహించనున్న రెండు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ యాదగిరి సూచించారు. శుక్రవారం తన చాంబర్లో తెయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి, ప్రోగ్రాం కన్వీనర్ అతిక్ సుల్తాన్ ఘోరీ తో కలిసి రిజిస్ట్రార్ ప్రోగ్రాం బ్రోచర్ను ఆవిష్కరించారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. పరిశోధన, వినియోగాలలో ఏఐ ప్రాముఖ్యత, ఆధునిక విద్యా విధానంలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానం, సవాళ్లు, అవరోధాలు, పరిష్కారాలు ఈ శిక్షణా కార్యక్రమంలో చర్చిస్తారని తెలిపారు. తెయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల సిబ్బంది ఈ నెల 9వ తేదీ లోపు గూగుల్ ఫారం ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి నీలిమ, అధ్యాపకులు నందిని, భ్రమరాంబిక, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్: నగరంలోని ఏఐటీయూసీ కా ర్యాలయంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్లో ఎస్డబ్ల్యూఎఫ్ మాజీ నాయకుడు డీ సంజీవ్ శుక్రవారం చేరారు. ఆయనకు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం వెంకట్ గౌడ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, యూనియన్ రీజినల్ కార్యదర్శి సాయిలు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వెంకట్గౌడ్, ఓమయ్య మాట్లాడుతూ.. ఆర్టీసీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ ఏర్పడిందని తెలిపారు. ఆర్టీసీలో సుమారు 20వేల ఖాళీలు ఏర్పడ్డాయని, వాటిని భర్తీ చేయాలని డిమాండ్చేశారు. రాబోయే కాలంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని సంజీవ్ తెలిపారు. నాయకులు పీ సుధాకర్, విఠల్ గౌడ్, రాధాకుమార్ పాల్గొన్నారు. -
‘మాండలిక వికాసమే భాషాభివృద్ధికి సోపానం’
ఖలీల్వాడి: మాండలికి వికాసమే భాషాభివృద్ధికి మూలం అని, మన భాషలోని తెలుగు భాషకు మూలాలు ఉన్నాయని పలువురు ప్రముఖ సాహితీవేత్తలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం వికాసం వికృతి వైవిధ్యం అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆచార్యులు బాణాల భుజంగరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాష మూలాలు తెలంగాణ మాండలికంలోనే దాగి ఉన్నాయని పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ పరిశోధకులు సంగనభట్ల నర్సయ్య మాట్లాడుతూ.. తెలంగాణ భాషా పరిరక్షణకు ప్రత్యేకంగా నిఘంటువును రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రామాణిక వ్యాసాలతో రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త హైదరాబాద్ సిటీ కళాశాల ఆచార్యులు డాక్టర్ కోయ కోటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి, సదస్సు కన్వీనర్ రామస్వామి, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, ఐకేసి కోఆర్డినేటర్ రాజేశ్, పీఆర్వో దండు స్వామి, ఏవో రామకృష్ణ, సూపరింటెండెంట్ ఉదయ్ భాస్కర్, అధ్యాపకులు, శమంత, శ్రీనివాస్ గంగాధర్ రాజేశ్వర్, రాధిక, అర్చన తదితరులు పాల్గొన్నారు. -
మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు పెంచాలి
● సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి ● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు వినతిసుభాష్నగర్: గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలను రూ.15వేలకు పెంచాలని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి (ముస్కు) సాయిరెడ్డి కోరారు. ఈమేరకు జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్కను శుక్రవారం నగరంలోని ఆర్అండ్బి అతిథిగృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. సాయిరెడ్డి మాట్లాడుతూ.. మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలను జీపీ నిధుల నుంచి చెల్లించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీచేసిందని, చిన్న గ్రామ పంచాయతీలకు వేతనాలు భారంగా మారుతున్నాయని వివరించారు. వేతనాల కోసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సెపరేట్గా నిధులు జమ చేయాలని విజ్ఞప్తిచేశారు. జీపీల ద్వారా వసూలు చేస్తున్న పన్నులు, ఫీజులు వంటి నిధులు జీపీ అకౌంట్లలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీలకు విడుదల అయ్యేలా చూడాలని కోరారు. పెండింగ్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలు, సానిటేషన్ పనుల ఖర్చులు జీపీలకు భారమయ్యాయన్నారు. సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మానాల మోహన్రెడ్డి, ముప్ప గంగారెడ్డి, బోర్గాం శ్రీనివాస్, సర్పంచులు పాల్గొన్నారు. -
న్యాయవాద వృత్తికి ఉజ్వల భవిష్యత్తు
● రిటైర్డ్ రిజిస్ట్రార్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ రఘురామ్ తెయూ(డిచ్పల్లి): సమాజంలో న్యాయవాద వృత్తికి ఉజ్వల భవిష్యత్తు, గౌరవం ఉందని రిటైర్డ్ రిజిస్ట్రార్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ, రిటైర్డ్ స్పెషల్ జడ్జి ఫర్ ట్రయల్ కోర్డు ఆఫ్ సీబీఐ టీ రఘురామ్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ‘లే మాన్ టు లా మాన్’ అనే అంశంపై నిర్వహించిన కాలోక్వియంలో రఘురామ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయ విద్యార్థులకు న్యాయవాద వృత్తిలో ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు. న్యాయ వ్యవస్థలో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. సమాజంలో న్యాయ స్థాపనకు న్యాయ విద్యార్థులు కృషి చేయాలన్నారు. న్యాయవాద వృత్తి ఎంచుకున్న తర్వాత తమ క్లయింట్లతో పాటు న్యాయస్థానాల్లో ఎలా మెలగాలనే విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లా కాలేజ్ ప్రిన్సిపాల్, హెచ్వోడీ డాక్టర్ ప్రసన్నరాణి, మాజీ ప్రిన్సిపాల్ జెట్లింగ్ ఎల్లోసా, బీవోఎస్ చైర్మన్ స్రవంతి, లా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
భళా... సరస్ మేళా!
● పాత కలెక్టరేట్ గ్రౌండ్లో ప్రారంభించిన జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ● సొంత ఉత్పత్తులు, హస్త కళలను ప్రదర్శించిన ఎస్హెచ్జీ మహిళలు డొంకేశ్వర్: జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన మినీ సరస్ మేళా – 2026 ఆకట్టుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ మేళాకు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి లతో కలిసి సందర్శించారు. గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలు వడ్డీలేని రుణాలు పొంది సొంతగా తయా రు చేసిన పలు ఉత్పత్తులు, వస్తువులు, వస్త్రాలను పరిశీలించారు. ఎస్హెచ్జీ మహిళలు వ్యాపారాలు చేసి తమ కాళ్లపై నిలబడి ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకోవడంపై సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని, మహిళా ప్రగతి – తెలంగాణ ఉన్నతి అ నే నినాదానికి సీఎం రేవంత్రెడ్డి కట్టుబడి ఉన్నారని తెలిపారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే వడ్డీ లేని రుణాల పంపిణీ, ఉచిత ప్రమాద బీమా, లోన్ బీమా, ఆర్టీసీలో ఆద్దె బస్సులు, పెట్రో ల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. వ చ్చే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కో సం తమ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టనుందని మంత్రి వెల్లడించారు. మహిళలు ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని, వారం రోజుల పాటు జరిగే ఈ మేళాను వ్యాపారాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఆర్డీవో సాయాగౌడ్, ఏపీడీ మధుసూదన్, డీపీఎంలు, ఏపీఎంలు, ఎస్హెచ్జీ మహిళలు పాల్గొన్నారు. -
టెన్త్ ఫలితాల్లో టాప్ ఫైవ్లో ఉంటాం!
సాక్షి: ఉత్తమ ఫలితాల కోసం తీసుకుంటున్న చర్యలు డీఈవో: విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాసులు బోధిస్తున్నాం. టీచర్ల కొరత ఉన్న చోట గెస్ట్ టీచర్లను నియమించాం. సర్దుబాటు ద్వారా అవసరం ఉన్నచోట టీచర్లను నియమించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాం. విద్యార్థులకు ఇప్పటికే కరదీపికలను పంపిణీ చేపట్టి రివిజన్ చేస్తున్నాం. ఏ, బీ, సీ గ్రూపులుగా చదువులు కొనసాగిస్తున్నాం. వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం. ● విద్యార్థులకు స్నాక్స్ ● ప్రత్యేక తరగతుల నేపథ్యంలో విద్యార్థులు అలసిపోకుండా స్నాక్స్ అందించేందుకు చర్యలు చేపట్టాం. పరీక్షల కోసం విద్యార్థులను మానసికంగా దృఢంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ● కాపీయింగ్ నివారణకు● ఎట్టి పరిస్థితిల్లో కాపీయింగ్ ఆస్కారం లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. టీచర్లు ఎవరు విద్యార్థులను కాపీయింగ్కు ప్రోత్సహించవద్దు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. ● ఈసారి ఎన్నో స్థానం ● గతేడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 96.62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో 16వ స్థానం వచ్చింది. ఈసారి జరిగే పరీక్షల్లో వంద శాతం విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రాష్ట్రస్థాయిలో ఐదవ స్థానం లోపల ఉండాలని ప్రయత్నిస్తున్నాం. ● పరీక్షలకు విద్యార్థుల హాజరు ● పదో తరగతి పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 144 కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా 24,399 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ● పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు ● పరీక్షల నిర్వహణ కోసం 144 మంది చొప్పున సీఎస్, డీవోలను, 27 మంది కస్టోడియన్లను, నలుగురు అడిషనల్ డిపార్ట్మెంటల్ అధికారులను నియమించాం. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, బెంచీలు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు మీరిచ్చే సలహాలు పరీక్షలకు వారం రోజుల వరకు సమయం ఉంది. ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. మాస్ కాపీయింగ్పై ఆధారపడొద్దు. సెల్ఫోన్లు, టీవీలు, సోషల్ మీడియాను వినియోగించవద్దు. పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోవాలి. విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏవైన సందేహాలు ఉంటే టీచర్లను, ఎంఈవో కార్యాలయ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో గతేడాది కంటే ఈసారి జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించి, రాష్ట్రంలో టాప్ ‘5’లో నిలుస్తామని డీఈవో అశోక్ కుమార్ అన్నారు. ఇందుకోసం చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారిని పరీక్షలకు సిద్ధం చేస్తున్నామన్నారు. కొన్ని రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం ‘సాక్షి’ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలను డీఈవో వివరించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఆలస్యంగా వెళ్తే ఐదు నిమిషాలు వెసలుబాటు కల్పించినట్లు చెప్పారు. – ఖలీల్వాడి చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ మాస్ కాపీయింగ్కు ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈవో అశోక్ కుమార్ -
బీజేపీకి ప్రజలే బాస్
● మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ● మాధవనగర్లో బీజేపీ కౌన్సిలర్, కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభ నిజామాబాద్ రూరల్: బీజేపీ అంటేనే క్రమశిక్షణ పార్టీ అని, ఇందులో ఎవరు బాస్లు కాదు ప్రజలే బాస్లు అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామన్నారు. ప్రజలు పదేళ్లు కేసీఆర్ పా లన చూసి బొంద పెట్టారన్నారు. రెండు సంవత్సరాలు పాలించిన రేవంత్ ప్ర భుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. మాధవనగర్లోని క మ్మ సంఘంలో శుక్రవారం నిజామాబాద్పార్లమెంట్ పరిధిలో నూతనంగా ఎన్నికై న బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సభ నిర్వహించా రు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ ప ద్ధతి ప్రకారం నడుచుకునే నాయకుడని, రాష్ట్ర సాధ న కోసం ధర్మరాజు పాత్ర పోషించారన్నారు. అంతుకుముందు ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. తెలంగాణలో హుందాగా ఉన్న ఏకై క నాయకుడు ఈటల రాజేందర్ అని, ఆయనతో కలిసి రా ష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తామన్నారు. ప్ర జాస్వామ్యంలో వ్యాపారం చేయడం సరికాదు, అందుకే నిజామాబాద్ మేయ ర్ పదవిని వదులుకున్నామన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజ లు బీజేపీకి నైతికంగా పట్టం కట్టారన్నారు. ప్రజల కు సేవలందిస్తే నేతలకు రాజకీయ పరంగా భవిష్య త్తు ఉంటుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారన్నారు. బల్దియా ఎన్నికల్లో బీజేపీ తరఫున నిలబడినందుకు ఇందూ రు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అ నంతరం ఎంపీలు రాజేందర్, అర్వింద్, ఎమ్మెల్యే ధ న్పాల్ సూర్యనారాయణలను గజమాలతో సన్మా నించారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను సన్మానించా రు. రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లావణ్య, శ్రీకాంత్రెడ్డి, జగిత్యా ల జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, జిల్లా ప్రబారి కాంతారావు, కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
పెర్కిట్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆలూరు మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సా యంత్రం తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో డ్యూటీ డాక్టర్ రక్షిత అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకుండా, స రైన వివరాలు అందించని ఏఎన్ఎం పద్మలత తీరును తప్పుబడుతూ, షోకాజ్ నోటీ సు జారీ చేయాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటు లో ఉన్నాయా అని ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. 289 మంది విద్యార్థుల గైర్హాజరు ఖలీల్వాడి: జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శు క్రవారం నిర్వహించిన సెకండియర్ మ్యాథ్స్ –2బీ, జువాలజీ, హిస్టరీ, ఒకేషనల్ పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 14,761 మందికి 14,472 మంది 289 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు ఆయన పే ర్కొన్నారు. జిల్లాలో మొత్తం 58 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతుండగా 47 కేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఐఈవో తెలిపారు. తేలిన మల్లన్న గుడి డొంకేశ్వర్(ఆర్మూర్): గోదావరి నీటిలో మునిగిన మల్లన్న గుడి బయటకు తేలింది. డొంకేశ్వర్ మండలం జీజీ నడ్కుడ పాత గ్రామంలోని మల్లన్న ఆలయం వర్షాకాలంలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో ముంపునకు గురైంది. పంటల సాగు కోసం లిఫ్టులు, ప్రాజెక్టు ద్వారా నీళ్లు విడుదల చేస్తుండడంతో ప్రస్తుతం ఆలయం బయటకు తేలింది. ఈసందర్భంగా గ్రామస్తులు శుక్రవారం వెళ్లి పూజలు నిర్వహించారు. -
అమలులో ఉమ్మడి జిల్లాను ముందంజలో నిలుపుదాం
నిజామాబాద్అర్బన్: పల్లెలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. కార్యక్రమం అమలులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ముందంజలో నిలపాలని సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. వివిధ శాఖల వారీగా పరిసరాల శుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్–అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్ కట్టడి, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం అంశాలలో నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా విజయవంతం అయ్యేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉద్యోగులు ప్రగతి ప్రణాళిక అమలులో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ, ప్రజలకు జవాబుదారీగా పారదర్శకతతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రణాళిక అమలు ద్వారా ఆయా శాఖల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పని చేయాలన్నారు. కార్యక్రమం పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను వినియోగించాలని ఉమ్మడి జిల్లా అధికారులకు సూచించారు. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళిక అమలులో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలన్నారు. ప్రభుత్వ సౌకర్యాలు, పథకాలను ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంపొందించాలన్నారు. కేంద్రం ద్వారా సమకూరే నిధులతో చేపట్టాల్సిన పనులను సకాలంలో పూర్తి చేయించేలా చొరవ చూపాలన్నారు. వేసవిలో ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారులు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్లు ప్రగతి ప్రణాళిక అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక గురించి ఆయా శాఖలు, అంశాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముగ్గురు దివ్యాంగులకు మంత్రి సీతక్క ల్యాప్టాప్లు అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నగర మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సీపీ సాయిచైతన్య, ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎఫ్వోలు వికాస్ మీనా, నిఖిత, ఏసీపీ చైతన్య రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్లు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ నగరంలో ఉభయ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సన్నాహక సమావేశం -
కలెక్టరేట్ ఆవరణలో అగ్నిప్రమాదం
● ఎగిసి పడిన మంటలు నిజామాబాద్అర్బన్: నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ఓ శానిటేషన్ కార్మికుడు కలెక్టరేట్ ప్రాంగణంలోని వాహనాల పార్కింగ్ వద్ద జనరేటర్ స మీపంలో చెత్త కుప్పకు నిప్పు పెట్టాడు. అది కాస్త గాలికి పక్కనే ఉన్న ముళ్లపొదలు, చెత్తకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. జనరేటర్ నుంచి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వెనుక వైపు మంటలు వేగంగా వ్యాపించాయి. టాయిలెట్ గదుల వెంబడి ఉన్న ఎండిపోయిన చెట్ల పొదలకు మంటలు అంటున్నా యి. ట్రాన్స్పార్మర్ వైర్లు కాలిపోయాయి. సమీపంలోనే వివిధ శాఖలకు సంబంధించిన కార్లు పార్కింగ్ చేసి ఉండడంతో అప్రమత్తమైన సిబ్బంది కార్లను అక్కడి నుంచి తీసివేయించారు. గంటన్నర పాటు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అదే సమయంలో కలెక్టరేట్లో జరుగుతున్న సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఉండడంతో అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. -
జిల్లా దాటిన పెద్దపులి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణలో పెద్ద పులి సంచారం కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పులి గత కొన్ని నెలలుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, భువనగిరి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సంచరిస్తోంది. పెద్ద పులి తాజాగా శుక్రవారం మళ్లీ నిజామాబాద్ జిల్లా నుంచి జగిత్యాల జిల్లా మల్యాల అటవీ ప్రాంతం మీదుగా సిరిసిల్ల జిల్లా చందుర్తి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. చందుర్తి అటవీ ప్రాంతం సమీపంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. పులి ఈ నెల 3వ తేదీన సిరిసిల్ల జిల్లా మీదుగా నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి అటవీ రేంజ్లోని గట్టుపొడిచినవాగు వద్దకు వచ్చింది. ట్రాప్ కెమెరాకు చిక్కింది. తోడు కోసం వెతుక్కుంటూ తిరుగుతున్న ఈ పులి మళ్లీ వచ్చిన దారిలోనే వెళ్లింది. అయితే ఈ పెద్ద పులి కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు సైతం ఉన్నట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో చుట్టుపక్కల జిల్లాలకు చెందిన అటవీ అధికారులు ఈ పులికి ఎలాంటి హాని కలుగకుండా ఉండేందుకు గాను అన్ని అటవీ రేంజ్ల పరిధి లో పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేశారు. పులిని జాగ్రత్తగా సంరక్షించే అంశం అటవీ శాఖకు పెద్ద సవాల్గా మారింది. అటవీ శాఖకు అతిపెద్ద సవాల్.. గత ఏడాది జూలైలో పెద్ద పులిపై విషప్రయోగం జరిగిన ఘటన నేపథ్యంలో ఈ పులికి సైతం అలాంటి హాని జరుగకుండా చూసేందుకు గా ను అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. విషప్రయోగం జరుగకుండా, వేటగాళ్ల బారిన పెద్ద పులి పడకుండా, వ్యవసాయ క్షేత్రాల వద్ద, అటవీ భూముల్లో ఏమైనా తీగలు, ఉచ్చులు పెట్టి ఉంటే వాటిని గుర్తించి తొలగించేందుకు గాను అటవీ అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో టెన్షన్ పడుతున్నారు. పెద్ద పులి బారిన పడకుండా ఉండాలని అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే దాన్ని రక్షంచేందుకు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా పులి జనావాసాల్లోకి వస్తేనే, మనుషులపై దాడి చేస్తేనే.. వైల్డ్ లైఫ్ బోర్డు నుంచి పూర్తి స్థాయి అనుమతులు తీసుకుని మాత్రమే పట్టుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప దాన్ని పట్టుకునే ప్రయత్నం ఏమాత్రం చేయకూడదు. పెద్ద పులికి ఎలాంటి హాని తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఉన్న నేపథ్యంలో అటవీశాఖకు అతిపెద్ద సవాల్గా మారింది.ఆ పులి ఆచూకీ మిస్టరీ 2025 జూలై నెలలో కామారెడ్డి జిల్లాలోకి మరో పెద్ద పులి ప్రవేశించి అటవీ ప్రాంతా ల్లో తిరుగాడింది. ఈ క్రమంలో సదరు పులి మాచారెడ్డి రేంజ్ పరిధిలో ఓ ఆవును చంపేసింది. పులి మళ్లీ ఆవు మాంసం తినేందు కు వస్తుందనే ఆలోచనతో కొందరు సదరు ఆవు కళేబరంపై విషం చల్లారు. అటవీ అధికారులు విషప్రయోగం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపారు. అయితే ఆ పులి తరువాత కనిపించకుండా పోయింది. దీంతో ఆ పులి మరణించిందా లేక మరోవైపు వెళ్లిందా అనే విషయ మై ఇప్పటికీ ఆనవాళ్లు లేకుండా పోవడం పట్ల అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆ పులి ఆచూకీ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. మళ్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశం సిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రాంతంలో పాదముద్రల గుర్తింపు కామారెడ్డి జిల్లా అటవీప్రాంతంలోకి వచ్చే అవకాశాలు పెద్ద పులి రక్షణే అటవీశాఖకు సవాల్ గత జూలైలో కామారెడ్డి జిల్లాలో పులిపై విషప్రయోగం నేపథ్యంలో టెన్షన్ -
పది విద్యార్థి.. జాగ్రత్త మరి..
ఖలీల్వాడి: పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. పాఠశాలల్లో పున:శ్చరణ, రోజువారీ సాధన, డైలీ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు ఈనెల 14 నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు ప్రతి నిమిషం కీలకమేనని, ఇంటి వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని విద్యారంగ, వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. ● విద్యార్థులు ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ● విద్యార్థులు రాత్రి 8 గంటలకే నిద్ర పోవాలని టీచర్లు సూచిస్తున్నారు. ● పరీక్షల వేళ విద్యార్థులను ఇంటి పనులకు దూరంగా ఉంచడం ఎంతోమేలు. ఫలితాలపై ప్రభావం చూపకుండా జాగ్రత్త వహించాలి. ● విద్యార్థులకు పోషకాహారం అత్యంత కీలకమైంది. పరీక్షలకు సిద్ధం కావాలన్నా, రాయాలన్నా బలం అవసరం అవుతుంది. ఆకు కూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, సోయా గింజలు, పెరుగు, పాలు, ఉడకబెట్టిన గుడ్డు, మాంసాహారులైతే చేపలు, చికెన్ వంటివి తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలసటగా ఉంటే నిమ్మకాయను నీటిలో కలుపుకొని తాగాలి. పరీక్షలు అయ్యేంత వరకు బయట ఆహారం తీసుకోరాదు. ● విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ తెలిపారు. ఈనెల 14 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు సన్నద్ధతకు ప్రతి నిమిషం కీలకం ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి దూరం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులూ ప్రత్యేక దృష్టి పెట్టాలి -
కూలేందుకు సిద్ధంగా..
సిరికొండ: మండలంలో ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. సిరికొండ మండల కేంద్రం నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలో ఉన్న గోప్య తండా వద్ద కొండాపూర్ ఊర చెరువు అలుగు వాగుపై నుంచి ప్రధాన రహదారి వెళ్తుంది. ఈ వాగుపై సుమారు 35 ఏళ్ల క్రితం బండ రాళ్లతో వంతెనను నిర్మించారు. వంతెన నుంచి వాగు బాగా లోతుగా ఉంటుంది. వంతెన నిర్మించి చాలా ఏళ్లు గడుస్తుండటంతో వాగు ప్రవాహానికి వంతెన అడుగు భాగం దెబ్బతింటోంది. వంతెనను నాటి సాంకేతికతకు అనుగుణంగా బండ రాళ్లతో నిర్మించారు. వరద ఉధృతికి ప్రతి ఏటా వంతెన అడుగు భాగంలో కోతకు గురవుతు రాళ్లు పడిపోతున్నాయి. వంతెన పైభాగంలో కూడా స్లాబ్ ధ్వంసమైంది. సిరికొండ మండలంతో పాటు మోర్తాడ్, కమ్మర్పల్లి, భీంగల్ మండలాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ వెళ్లేందుకు ఈ మార్గాన్నే వినియోగిస్తారు. ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చడంతో నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా మారింది. రోడ్డు డబుల్గా ఉండి వంతెన సింగిల్ రోడ్డుతో ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వంతెనకు ఇరు పక్కల ఉన్న రెయిలింగ్ కూడా దెబ్బతింది. రెయిలింగ్ లేకపోవడంతో రాత్రి వేళలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై శిథిలావస్థకు చేరిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణం చేపట్టాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. కామారెడ్డికి వెళ్లే రోడ్డులో కొండాపూర్ వాగుపై ఉన్న వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వంతెనపై స్లాబ్ ధ్వంసమై గుంతలు ఏర్పడ్డాయి. రెయిలింగ్ విరిగిపోయింది. వంతెన పైనుంచి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వంతెన శిథిలావస్థకు చేరడంతో ఇబ్బందులు పడుతున్నాం. – కిరణ్, గ్రామస్తుడు, గడ్కోల్ వంతెనను చాలా ఏళ్ల క్రితం ని ర్మించారు. వంతెన అడుగు భా గంలో రాళ్లు ఊడిపోతున్నా యి. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిగా మారింది. ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా చేయడంతో రద్దీ ఎక్కువైంది. శిథిలావస్థకు చేరిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. – రహీం, గ్రామస్తుడు, కొండాపూర్ శిథిలావస్థకు చేరిన కొండాపూర్ వంతెనతో అవస్థలు గోప్యతండా వద్ద కొన్నేళ్ల క్రితం నిర్మాణం దెబ్బతిన్న వంతెన అడుగుభాగం పట్టించుకోని అధికారులు -
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
సిరికొండ: ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిరికొండ సర్పంచ్ మల్లెల సాయిలు సూచించారు. మండల కేంద్రంలోని వివిధ వార్డుల్లో పాలకవర్గంతో కలిసి సర్పంచ్ గురువారం పర్యటించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల యజమానులను కలిసి మరమ్మతులు చేసుకోవాలని సూచించారు. ఉపసర్పంచ్ శోభన్, వార్డు సభ్యులు కనగందుల మురళి, అల్లిపురం శంకర్, జీపీ కార్యదర్శి వినీల్, కారొబార్ ప్రవీణ్ పాల్గొన్నారు. మోపాల్: మండలంలోని ముదక్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున పలు పరికరాలను గురువారం వితరణ చేశారు. లేబర్ రూమ్ టేబుల్, వెయిటింగ్ కుర్చీలు, ఐరన్ రాక్స్, స్ట్రక్చర్, వీల్ చైర్, ఆఫీస్ టేబుల్, ఇంజక్షన్ ట్రాలీ, వాటర్ ఫ్యూరిఫైయర్, బేబీ వార్మర్, వేయింగ్, నెబులైజర్ మిషన్, తదితర వస్తువులను ఎస్బీఐ అధికారులు వైద్యులు, సిబ్బందికి అందజేశారు. పీహెచ్సీకి అవసరమైన పరికరాలు అందజేయడంపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజ్మల్ ఎస్బీఐ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఎస్బీఐ అధికారులు పాల్గొన్నారు. సిరికొండ: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు సిరికొండ సత్యశోధక్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య గురువారం తెలిపారు. మహబూబాబాద్లో ఈ నెల 7 నుంచి 9 వరకు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్(అండర్–14) సాఫ్ట్బాల్ పోటీల్లో పాఠశాల విద్యార్థులు ఎ అజయ్, బి వర్షిత్ పాల్గొంటారని తెలిపారు. తొర్లికొండలో గత నెలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. పోటీలకు ఎంపికై న విద్యార్థులకు పాఠశాలలో జ్ఞాపికలు అందజేసి ప్రిన్సిపాల్ అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగారెడ్డి, లింగం, సాహెబ్రావు, వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: మాక్లూర్ మండలం చిన్నాపూర్లో ఉన్న అరణ్య అర్బన్ పార్క్లో ఈకో క్లబ్ వారు నిర్వహించిన నేచర్ క్యాంప్లో నగరంలోని గిరిరాజ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. నేచర్ క్యాంపుల నిర్వహణతో విద్యార్థుల్లో ప్రకృతి వనరుల పరిరక్షణ బాధ్యత పెరుగుతుందని తెలిపారు. బీట్ ఆఫీసర్ రాజేందర్ పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర గురించి వలంటీర్లకు వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రంగరత్నం, ఈకో క్లబ్ కన్వీనర్ నరేశ్, సభ్యులు డాక్టర్ రంజిత, డాక్టర్ చంద్రశేఖర్, రజిత, విజయ, డాక్టర్ అనూష, వలంటీర్లను తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి:మండలంలోని ధర్మారం(బి), యా నంపల్లి తండా, మిట్టాపల్లి తండా, నక్కలగుట్ట తండా గ్రామాల్లో గురువారం గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులకు ఆయా గ్రామాల సర్పంచులు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారం(బి) సర్పంచ్ గొట్టిపాటి వాసుబాబు మాట్లాడుతూ.. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశాల మేరకు ఉపాధి హామీ నిధులు రూ.10లక్షల వ్యయంతో ఒక్కో గ్రామ మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు గొట్టి పాటి వాసుబాబు, నీల బలరాం, బుక్య సేవంతనవుసి, లకావత్ దేవీసింగ్, ఉప సర్పంచ్ మహమ్మద్ సల్మాన్, వార్డు సభ్యులు, పీఆర్ ఏఈ శ్రీధర్, గ్రామ మహిళా సమాఖ్యల అధ్యక్షురాళ్లు, ఐకేపీ సీసీలు పాల్గొన్నారు. -
విద్యాకమిషన్ సిఫార్సులతో ప్రభుత్వ పాఠశాలలకు నష్టం
ఖలీల్వాడి: విద్యాకమిషన్ ఆకునూరి మురళి సమర్పించిన సిఫార్సులతో భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల మనుగడ కష్టమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మోహన్రెడ్డి, కిషన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో ఉన్న పీఆర్టీ యూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీచర్ల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, పర్మినెంట్ టీచర్లు వద్దని, పదోన్నతులు ఇవ్వొదని అనడం సరైంది కాదన్నారు. ప్రతి మండలంలో ఒకటి నుంచి రెండు పబ్లిక్ పాఠశాలల స్థాపనతో మిగతా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్లు మూతపడతాయని అన్నారు. ప్రాథమిక విద్యకు పూర్వ విద్యను మిళితం చేయడం, బడ్జెట్లో విద్యకు 18 శాతం నిధులు కేటాయించడం మధ్యాహ్న భోజనాన్ని రెట్టింపు చేయడం అంశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అంకం నరేశ్, సోషల్ మీడియా కన్వీనర్ గోపిడి రవీందర్రెడ్డి, నాయకులు నరేశ్, అబ్దుల్లా తదితరులు ఉన్నారు. -
కంచెట్టిని పరామర్శించిన ఎమ్మెల్యే
డిచ్పల్లి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, డిచ్పల్లి మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని కంచెట్టి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ రాంచందర్గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గొట్టిపాటి వాసుబాబు, డీసీసీ డెలిగేట్ ధర్మాగౌడ్, శ్యాంసన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి
● నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మోపాల్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో నిర్మించనున్న మండలంలోని కాస్బాగ్ తండా గ్రామపంచాయతీ భవనానికి గురువారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్లే గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించారని గుర్తుచేశారు. పేదోడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతోందని, ఒక్కో ఇందిరమ్మ లబ్ధిదారుడికి రూ.5లక్షలు ఇస్తుందని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఇల్లు, రేషన్కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 25లక్షలకుపైనే రేషన్కార్డులు మంజూరు చేసిందన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ సదాసింగ్, ఉపసర్పంచ్ కమలాజీ, ఎంపీడీవో రాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యెల్లోళ్ల సాయిరెడ్డి, నాయకులు సద్మల రాములు, పంచాయతీరాజ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సంక్షిప్తం
నియామకం సుభాష్నగర్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ రాష్ట్ర కో చైర్మన్గా డాక్టర్ విశాల్ ఆకుల నియమితులయ్యారు. ఆయన ఏడాదిపాటు కో చైర్మన్గా కొనసాగనున్నారు. డాక్టర్ విశాల్ రాష్ట్రంలో వైద్యరంగాభివృద్ధి, యువ వైద్యుల ప్రోత్సాహం, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వైద్య సమాజానికి సేవలందిస్తున్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీ కిషన్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వీ అశోక్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి డాక్టర్ టీ దయాల్సింగ్కు విశాల్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఎల్లప్పుడూ మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ ఈ రవీంద్రరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తోటి వైద్యులు, మిత్రులు విశాల్ను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 26 మందికి జరిమానా నిజామాబాద్ అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 26 మందికి జరిమానా, ముగ్గురికి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ గురువారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో వారు పట్టుబడ్డగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. విచారణ చేపట్టిన జడ్జి 26 మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధించగా, ముగ్గురికి జైలుశిక్ష విధించినట్లు ఏసీపీ తెలిపారు. ట్రంప్ దిష్టిబొమ్మ దహనం నిజామాబాద్ రూరల్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ (ప్రజాపంథా) జిల్లా కమిటీ నాయకులు గురువారం ధర్నా చౌక్ వద్ద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం నరేందర్, ఎం వెంకన్న, డీ రాజేశ్వర్, ఎం సుధాకర్, కే గంగాధర్, బీ మల్లేశ్, బీ మురళి, సంధ్యారాణి, గణేశ్, సాయిబాబా, సాయారెడ్డి, లక్ష్మణ్, విఠల్, మోహన్, చరణ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పరీక్ష అట్టల పంపిణీ మోపాల్: తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో మండలంలోని మంచిప్ప, మోపాల్, సిర్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి చదువున్న విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులను గురువారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా టీటీయూ జిల్లా అధ్యక్షుడు లాటికర్ రాము మాట్లాడుతూ.. విద్యార్థులు ఉపాధ్యాయులు అందించే సలహాలు, సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు గేమ్సింగ్, ప్రసాద్, సత్యనారాయణ, టీటీయూ జిల్లా కార్యదర్శులు గంగాప్రసాద్, అక్బర్ బాషా, ఉపాధ్యాయులు కాసర్ల నరేశ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వేం నరేందర్రెడ్డికి సన్మానం
సుభాష్నగర్: తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై న వేం నరేందర్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాట్పల్లి నరేందర్రెడ్డి గురువారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఖలీల్వాడి: ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం సభ్యులు గురువారం డీఈవో అశోక్ను కలిశారు. రాష్ట్ర ప్రైమరీ స్కూల్స్ హె డ్మాస్టర్స్ అసోసియేషన్ డైరీని డీఈవో ఆవిష్కరించారు. రచ్చ మురళి, అంకం నరేశ్, కొట్టూరు దేవదాసు, సురేశ్రెడ్డి, కళ్లెం మల్లారెడ్డి పాల్గొన్నారు. -
డాక్టర్ కాసర్లకు ధర్మనిధి పురస్కారం
నిజామాబాద్ రూరల్: తెలంగాణ సారస్వత పరిషత్, హైదరాబాద్ వారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అందించే ‘ధర్మ నిధి పురస్కారం’ 2026వ సంవత్సరానికి ఇందూరు కవి డాక్టర్ కాసర్ల నరేశ్ రావుకి అందజేయనున్నట్లు పరిషత్ ప్రధాన కార్యదర్శి జే చెన్నయ్య తెలిపారు. సాహిత్య రంగంలో విస్తృతమైన సేవలు నిరంతరం అందిస్తున్న వారికి ఈ పురస్కారాన్ని ప్రతిఏటా పరిషత్ వారు అందజేస్తున్నారు. దీంట్లో భాగంగా గత 30 ఏళ్లుగా ఇందూరు జిల్లా సాహిత్య రంగంలో నిత్య కవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, బాల సాహిత్య వేత్తగా రాణిస్తున్న కాసర్లకు ఈ ఏడాది పురస్కారం వరించింది. ఈనెల 17న హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఇతర సాహిత్య వేత్తల చేతుల మీదుగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాహిత్య ధర్మనిధి పురస్కారాన్ని అందుకోనున్న కవి కాసర్లను ఇందూరు జిల్లా కవులు వీపీ చందనరావు, పంచరెడ్డి లక్ష్మణ, తల్లా వజ్జల మహేశ్ బాబు, డాక్టర్ గణపతి అశోక శర్మ, డాక్టర్ తంగుడిగె ఫణీంద్ర, వారె దస్తగిరి, ప్రవీణ్ కుమార్ శర్మ, నాగుల రాజేందర్, అష్ట గంగాధర్ తదితరులు అభినందించారు. సుభాష్నగర్: హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తోపాటు నూతనంగా ఎన్నికై న గిరిజన ఆదివాసీ చైర్మన్ శంకర్ నాయక్ను నిజామాబాద్ ఆదివాసీ చైర్మన్ కెతావత్ యాదగిరి నాయక్ గురువారం శాలువాతో సన్మానించారు. అంతకుముందు ఆదివాసీ గిరిజన విభాగం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, పోడు భూములపై హక్కులు, చేవెళ్ల డిక్లరేషన్పై సుదీర్ఘంగా చర్చించారు. గిరిజన, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఈ అంశాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో చర్చించినట్లు కెతావత్ యాదగిరి నాయక్ తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ వెంకట్రాం నాయక్, బానోత్ రవీందర్, తదితరులు జిల్లా నుంచి పాల్గొన్నారు. -
పిల్లల భవిష్యత్తును పాడు చేయొద్దు
● పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సుభాష్నగర్: వేశ్య వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగించవద్దని, తమ పిల్ల లు కూడా ఈ వృత్తిని ఎంచుకొని వారి బంగారు భవిష్యత్ను పాడు చేసుకోకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అన్నారు. గురువారం నగరంలోని ఖలీల్వాడిలో ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ టార్గెట్ ఇంటర్వేన్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లో వేశ్య వృత్తి ఎంచుకుని తమ కుటుంబాన్ని పోషించుకున్నారని తెలిపారు. కానీ ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం పూర్తిగా కొనసాగించవద్దని సూచించారు. ఈ తరంతో వృత్తికి స్వస్తి పలకాలని, భవిష్యత్తరాలకు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. తమ పిల్లలు కూడా ఈ వృత్తిని ఎంచుకొని వారి బంగారు భవిష్యత్ను పాడు చేసుకోకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందన్నారు. పోలీస్శాఖ మహిళ సెక్స్ వర్కర్ల హక్కులు, వారి జాగ్రత్తల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సెక్స్ వర్కర్లకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని, హక్కుల కోసం పోలీస్శాఖ, షీ టీమ్, భరోసా సెంటర్ అందుబాటులో ఉందన్నారు. అనంతరం విశేష సేవలు అందించిన సిబ్బంది, ఎడ్యుకేటర్లు, మహిళా సెక్స్ వర్కర్లను జిల్లా సంక్షేమాధికారి పద్మ అనిల్తో కలిసి సీపీ సన్మానించారు. కార్యక్రమంలో స్నేహ టీఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సిద్ధయ్య, జిల్లా వయోజన విద్య సహాయ సంచాలకులు పురుషోత్తం, మానసిక వైద్యనిపుణులు డాక్టర్ ఏ వికాస్, డీపీఎం సుధాకర్, సీపీవో మొయిజ్ అహ్మద్, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి భానుప్రియ, స్నేహ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
నర్సరీ మొక్కల పరిశీలన
జక్రాన్పల్లి: మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో నర్సరీలోని మొక్కలను సర్పంచ్ చింత ప్రియాంక గురువారం పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలని సూచించారు. నాయకులు చింత మహేశ్, గంగాధర్ తదితరులు ఉన్నారు. డిచ్పల్లి: మండలంలోని నర్సింగ్పూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీ నర్సింహస్వామి వారి కల్యాణ మహోత్సవం శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సబ్యులు, గ్రామ పెద్దలు గురువారం తెలిపారు. మధ్యాహ్నం స్వామి వారి కల్యాణం, భక్తులకు అన్నదానం, సాయంత్రం రథోత్సవం ఉంటుందని అన్నారు. -
బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దాం
సిరికొండ: విప్లవపంథా కోసం చివరిదాకా పోరాడిన రవన్న స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సీపీఐఎంఎల్ మాస్లైన్(ప్రజాపంథా) రాష్ట్ర సెక్రెటేరియట్ సభ్యుడు వీ ప్రభాకర్ అన్నారు. మండలంలోని గడ్కోల్ గ్రామంలో రాయల రవన్న 10వ వర్ధంతి సభ వాల్ పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి ప్రభాకర్ గురువారం ఆవిష్కరించారు. ఈనెల 10న హైదరాబాద్లో నిర్వహించే 10వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరారు. రవన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ నాయకుడిగా సుదీర్ఘకాలం రహస్యంగా పని చేసి మృతి చెందాడన్నారు. 40 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపి దేశ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా విప్లవపంథా ఉండాలని, విప్లవకారులు ఐక్యంగా పని చేయాలని, తన ఊపిరి ఉన్నంత వరకు విప్లవోద్యమ నాయకుడిగా పని చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పిట్ల రామకృష్ణ, జిల్లా నాయకులు ఆర్ రమేశ్, ఆర్ దామోదర్, బాబన్న, కిశోర్, అనీస్, సాయారెడ్డి, లింబాద్రి, నారాగౌడ్, రమేశ్, బాల్రెడ్డి, రమ, పుష్పలత, స్వప్న, కిశోర్, నరేశ్, ఆశీష్, ఆశన్న, పోశన్న తదితరులు పాల్గొన్నారు. -
కిసాన్ క్లాత్ షోరూంలో సమ్మర్ స్పెషల్ కాంబో
నిజామాబాద్ రూరల్: నగరంలోని కిసాన్ క్లాత్ యాజమాన్యం సమ్మర్ స్పెషల్ కాంబో ఏర్పాటు చేసింది. శుభకార్యాలను పురస్కరించుకొని కిసాన్ కల్యాణ ఆఫర్ల జాతర కొనసాగుతోంది. కిడ్స్వేర్, మెన్స్వేర్, మహిళలు, యువతులకు సమ్మర్ స్పెషల్ కాటన్ దుస్తువులను అతి తక్కువ ధరలో వినియోగదారులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కొనుగోలుపై బహుమతులను అందిస్తున్నట్లు తెలిపారు. కిసాన్ క్లాత్ షోరూంలో ప్రస్తుతం ఆఫర్ల సందర్భంగా బట్టలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. కిసాన్ అందిస్తున్న ఆఫర్లను వినియోగదారులు సద్వినిమోగం చేసుకోవాలని కిసాన్ క్లాత్ నిర్వాహకులు కోరారు. -
ప్రైవేట్కు దీటుగా సీవోఈ కస్తూర్బాలు
ఖలీల్వాడి : కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇక నుంచి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నారు. విద్యారంగంలో వెనుకబడిన ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, పేద కుటుంబాల విద్యార్థినులకు విద్యనందించే లక్ష్యంతో కొనసాగుతున్న ఈ స్కూళ్ల విద్యార్థినులు రెగ్యులర్ పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ పోటీ పరీక్షల్లో వెనుకబడకుండా ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దనున్నారు. జేఈఈ, నీట్, ఎప్సెట్, క్లాట్(కామన్ లా అడ్మిషన్ టెస్ట్) పరీక్షలకు విద్యార్థినులను సన్నద్ధం చేయనున్నారు. ఇందుకోసం జిల్లాలోని డిచ్పల్లి, మాక్లూర్, నిజామాబాద్ కస్తూర్బాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సీవోఈ)లుగా అప్గ్రేడ్ చేశారు. అయితే ఒక్కో పాఠశాలలో ఒక్కో పోటీ పరీక్షకు సంబంధించి శిక్షణను ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందుకోసం జిల్లా అధికారుల నుంచి విద్యాశాఖ వివరాలు సేకరించింది. జిల్లాలో మొత్తం 27 కస్తూర్బా పాఠశాలలు/కళాశాలలు ఉన్నాయి. 2,331 మంది ఇంటర్ విద్యను అభ్యసిస్తుండగా అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థినులు 1799 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 532 మంది ఉన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలుగా అప్గ్రేడ్ అయిన డిచ్పల్లి, మాక్లూర్, నిజామాబాద్ కస్తూర్బాలకు ప్రభుత్వం గ్రంథాలయాలు, ఫర్నిచర్, పుస్తకాలతోపాటు ఇతర సామగ్రిని అందుబాటులోకి తెచ్చింది. సెకండియర్ చదువుతున్న విద్యార్థినులకు గతేడాది నవంబర్, డిసెంబర్లో, ఈ ఏడాది జనవరిలో నీట్, జేఈఈ, ఐఐటీ, క్లాట్ పరీక్షలకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించారు. పరీక్షలు ముగిసిన తరువాత విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు. పేద విద్యార్థులకు కేజీబీవీలో పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యనందిస్తున్నాం. అలాగే విద్యార్ధినిలను జేఈఈ, ఐఐటీ, నీట్, క్లాట్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ జిల్లాలోని పాఠశాలల వివరాలను అడిగింది. ఇంటర్ సెకండియర్ పరీక్షలు ముగిసిన తరువాత దీనిపై స్పష్టత వస్తుంది. జిల్లాలోని మూడు ఎంపిక చేసిన కేజీబీవీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాం. – భాగ్యలక్ష్మి, జీసీడీవో, నిజామాబాద్ ప్రవేశ పరీక్ష ద్వారా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాత పరీక్ష ద్వారా సీవోఈ పాఠశాలల్లో విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. ఆరో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 40 సీట్ల చొప్పున కేటాయించారు. పోటీ పరీక్షల శిక్షణ కోసం నలుగురు బోధకులను నియమించడంతోపాటు మానసిక వైద్యులనూ నియమిస్తారు. జిల్లాలో మూడు పాఠశాలల ఎంపిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ స్కూళ్లలో పోటీ పరీక్షలకు శిక్షణ వచ్చే ఏడాది నుంచి రాత పరీక్ష ద్వారా ప్రవేశాలు -
సెంటర్లలో వసతుల లేమిపై కలెక్టర్ అసహనం
బోధన్టౌన్(బోధన్) : బోధన్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాల్లో సరైన వసతులు లే వని కలెక్టర్ ఇలా త్రిపాఠి అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలోని విజేత, విద్యావికాస్, ఉషోదయ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఎగ్జామినేషన్ సెంటర్లను కలెక్టర్ గు రువారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతాన్ని తెలుసుకున్నారు. సెంటర్లలో సీసీ కెమెరాలు ఉన్నాయా, లేదా అని పరిశీలించారు. సెంటర్లలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడాన్ని గమనించిన కలెక్టర్.. వివరాలు అందించాలని డీఐఈవో రవికుమార్ను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని, ప్రశాంత వాతావ రణంలో విద్యార్థులు పరీక్షలు రాసే వి ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సెంటర్లోకి అ నుమతించాలన్నారు.షోరూం ప్రారంభించిన అనంతరం అభిమానులను ఉత్సాహ పరుస్తూ స్టెప్పులేస్తున్న నిధి అగర్వాల్ -
జిల్లాలోనే పెద్దపులి
నిజామాబాద్మార్కెట్ యార్డుకు పోటెత్తిన పసుపుఇస్రో ఆహ్వానం.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందు కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘యువికా’ కార్యక్రమాన్ని చేపడుతోంది. శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026– 10లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం జిల్లాలోని కమ్మర్పల్లి అటవీ క్షేత్రం పరిధిలోకి వచ్చిన ఈ పెద్ద పులి అదే రేంజ్లో తిరుగుతున్నట్లు అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. కోనాపూర్ సెక్షన్లోని ఇనాయత్నగర్ బీట్ పరిధిలో ఉన్న గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు సమీపంలో జలాశయం ప్రాంతంలో ఈ పులి తిష్ట వేసుకుని ఉంది. గురువారం తెల్లవారుజామున అటవీ శాఖ అమర్చిన ట్రాప్ కెమెరాకు పెద్ద పులి కదలికలు చిక్కడంతో కచ్చితమైన నిర్ధారణ అయింది. హారాష్ట్రలోని తాడోబా అడవి నుంచి వచ్చిన ఈ పులి గత కొన్ని నెలలుగా ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో సంచరిస్తూ వచ్చింది. యాదాద్రి జిల్లా అటవీ ప్రాంతం వరకు వెళ్లి మళ్లీ తిరుగు ప్రయాణంలో ఉన్న ఈ పులి జగిత్యాల జిల్లా మీదుగా నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి రేంజ్లోకి వచ్చింది. ప్రస్తుతం కమ్మర్పల్లి అటవీ రేంజ్ అధికారి రవీందర్ ఆధ్వర్యంలో 18 మంది మూడు బృందాలుగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. 30 మీటర్ల దూరంలో.. ఆరుగురితో కూడిన అటవీ అధికారుల బృందం గట్టుపొడిచిన వాగు బ్యాక్వాటర్ ప్రాంతంలో గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో బీట్ అధికారి శ్రీదేవికి అలసట రావడంతో అక్కడే ఉన్న కల్వర్టు మీద కూర్చుంది. బృందంలోని మిగిలిన సభ్యులు కొంత మేర ముందుకు వెళ్లారు. ఇదే సమయంలో వెనుక వైపు 30 మీటర్ల దూరంలో ఆకుల అలికిడి వినిపించడంతో శ్రీదేవి ఆవైపు చూసింది. పెద్ద పులి నడిచి వెళుతూ కనిపించింది. దీంతో ఆమె అక్కడికక్కడే మూర్ఛపోయింది. కల్వర్టుకు ఇవతలివైపు పడిపోయింది. శ్రీదేవి కనిపించకపోవడంతో అధికారుల బృందం తిరిగి వచ్చి చూడగా ఆమె మూర్చపోయి ఉంది. తక్షణమే శ్రీదేవిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పులిని మధ్యాహ్నం సమయంలో చూడగా రాత్రి అయినప్పటికీ షాక్ నుంచి కోలుకోలేదు. కల్వర్టుకు అవతలివైపు పడిపోయి ఉంటే పులికి ఆహారం అయ్యేదానినని శ్రీదేవి ఏడుస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ ఘటనతో ఇతర అధికారులు సైతం భయాందోళనలకు గురవుతున్నారు. టైగర్ రిలాక్స్! నెలల తరబడి వివిధ జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ వచ్చిన ఈ మగ పెద్ద పులి ఆడ పులి తోడు కోసం తిరుగుతోంది. వందల కిలోమీటర్ల మేర తిరుగుతూ వచ్చిన ఈ పులి కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో తిష్ట వేసుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. నెలలపాటు తిరిగిన పులి ఇక్కడ రిలాక్స్ అవుతున్నట్లు అంచనా. మూ డు రోజుల క్రితం ఇక్కడకు వచ్చిన ఈ పులి ఇదే చోట వన్యప్రాణని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ● వన్యప్రాణుల దాహార్తి తీర్చడంలో భాగంగా ఉమ్మడి ఏపీలో జలయజ్ఞం కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో నిర్మించిన మొదటి ప్రాజెక్టు గట్టుపొడిచినవాగు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు జలాశయంలోని నీరు సాగునీటికి సైతం ఉపయోగపడుతున్నాయి. ఇందుకోసం ఎత్తిపోతల పథకం, కాలువలు నిర్మించారు. ● జిల్లాలోకి ఈ నెల 3న ప్రవేశించిన పెద్ద పులి పాద ముద్రలను గట్టుపొడిచినవాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో అధికారులు గుర్తించారు. ఈ పులి పాద ముద్రలు 19 సెంటీమీటర్ల మేర ఉండడంతో మగపులిగా అధికారులు నిర్ధారించారు. ఇదే ప్రాంతంలో పలుచోట్ల పులి పాద ముద్రలు కనిపించడం గమనార్హం. అటవీ అధికారులు, సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు. సమీప ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పెద్ద పులి కచ్చితంగా గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రాంతంలోనే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఆహారం కోసం వన్యప్రాణుల లభ్యత, వేసవి కావడంతో దాహార్తిని తీర్చుకునేందుకు పుష్కలంగా నీటి సౌకర్యం ఉండడంతో పులి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు.వేం నరేందర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నగేష్రెడ్డి సుభాష్నగర్: తెలంగాణ నుంచి కాంగ్రె స్ అభ్యర్థిగా రాజ్యసభ స భ్యత్వానికి నా మినేషన్ వేసి న వేం నరేందర్రెడ్డికి డీసీసీ అధ్యక్షుడు కాట్పల్లి నగేష్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గు రువారం హైదరాబాద్లోని తన నివాసంలో నరేందర్రెడ్డిని నగేష్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుచ్ఛం అందజేశారు. ఈసందర్భంగా నగేష్రెడ్డి మాట్లాడుతూ.. వేం న రేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికకానుండడం హర్షణీయమని అన్నారు. రంజాన్ ఉపవాసాలతో సహనం, క్రమశిక్షణ నిజామాబాద్ అర్బన్: రంజాన్ ఉపవాసాల తో నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని సీపీ సాయిచైతన్య అన్నా రు. నగరంలోని కచ్చియాన్ మసీద్లో గురువారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ కేవలం ఉపవాసాల నెల మా త్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చే సుకునే ఆత్మపరిశీలన కాలమని అన్నారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీఐ ప్రసాద్, వన్టౌన్ ఎస్హెచ్వో రఘుపతి, కచ్చియాన్ మసీద్ ప్రెసిడెంట్ యాసీన్ పాల్గొన్నారు. నేడు బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు అభినందన సభ సుభాష్నగర్: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో గెలుపొందిన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు శుక్రవారం నగరశివారులోని కమ్మసంఘంలో అభినందన సభ ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పార్లమెంట్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యఅతిథులుగా మల్కాజిగిరి, నిజామాబాద్ ఎంపీలు ఈట ల రాజేందర్, అర్వింద్ ధర్మపురి, ఎమ్మె ల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, జిల్లా ప్రభారి కాంతారావు హాజరవుతారని తెలిపారు. జిల్లా పదాధికారులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, మోర్చాల జిల్లా పదాధికారులు, మండలాల అధ్యక్షులు, మండల పదాధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని దినేశ్ కోరారు. పెద్ద పులి కదలికలు కనిపెట్టడంతో పాటు అది ఎటువైపు వెళ్తుందో గమనించేందుకు గాను అ టవీ శాఖ అధికారులు పలు చోట్ల ట్రాప్ కెమెరా లు ఏర్పాటు చేశారు. గట్టుపొడిచినవాగు ప్రాంతంలో కనిపించడంతో అటవీ యంత్రాంగం మరింత అలర్ట్ అయింది. మహారాష్ట్ర నుంచి మొదటగా ఆదిలాబాద్ జిల్లా ద్వారానే తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో సంచరిస్తూ వచ్చిన ఈ పులి ఇక్కడ తిష్ట వేసి నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి సైతం అటవీ అధికారుల బృందాలు జిల్లాకు వచ్చాయి. డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి పెద్ద పులి కదలికలను పూర్తి స్థా యిలో గుర్తించేందుకు అటవీ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. డీఎఫ్వో వికాస్మీనా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి తెప్పించిన డ్రోన్ కెమె రా ద్వారా రెండు కిలోమీటర్ల రేడియస్లో పరిశీలించారు. అయితే పులి జాడ కనిపించలేదు.నేడు జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు మోపాల్: మండలకేంద్రం శివారులోని ఏకలవ్య ఆర్చరీ అకాడమీలో జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలను శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు ఈగ సంజీవ్రెడ్డి, జిల్లా కార్యదర్శి గంగరాజు, కోచ్ ఎన్ రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికై న వారు 8వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అండర్ – 10, 13, 15 విభాగాల నుంచి ఉమ్మడి జిల్లా క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు జిల్లాస్థాయి పోటీలకు హాజరుకావాలని, ఉదయం 8 గంటల లోగా ఏకలవ్య ఆర్చరీ అకాడమీలో క్రీడాకారులు రిపోర్ట్ చేయాలని కోరారు.సుభాష్నగర్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డుకు పసుపు పోటెత్తింది. వరుస సెలవుల తర్వాత ప్రారంభమైన శ్రద్ధానంద్ గంజ్కు గురువారం ఒక్కరోజే దాదాపు 60 వేల బస్తాల వరకు పసుపు పంట వచ్చినట్లు అధికారులు తెలిపారు. సీజన్ మొదలైన రెండు నెలల్లో మార్కెట్కు పసుపు రావడం ఇదే అత్యధికమని అన్నారు. రెండు నెలల్లో గంజ్కు సుమారు 2 లక్షల క్వింటాళ్ల పసుపు వచ్చిందని తెలిపారు. ఈ సీజన్లో క్వింటాల్కు రూ.15,650కు పైచిలుకు ధర పలికిందన్నారు. తేమశాతం 12 ఉండేలా నాణ్యమైన పసుపు తీసుకురావాలని రైతులు వారు సూచించారు. గట్టుపొడిచిన వాగు వద్ద తిష్ట జంతువులను వేటాడి చంపి తిని విశ్రాంతి డ్రోన్ కెమెరాలతో పులి కదలికలను గుర్తించేందుకు అటవీశాఖ ప్రయత్నాలు పులిని చూసి కళ్లు తిరిగి మూర్చపోయిన బీట్ అధికారి శ్రీదేవి -
వేరే దారి చూసుకోండి..!
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. జీపీలకు వచ్చే జనరల్ ఫండ్ లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వేతనాలు చెల్లించుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ డి దివ్య రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల్లో కారోబార్లు, బిల్కలెక్టర్లు, వాటర్మెన్లు, పారిశుద్ధ్య కార్మికులు మొత్తం 3054 మంది ఉండగా, వారందరికీ ప్రతి నెలా రూ.9,500 చొప్పున వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం గతంలోనే అంగీకరించింది. ఇందుకోసం టీఎస్బీపాస్ను తీసుకువచ్చింది. గతేడాది నవంబర్ 2025 వరకు మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు తమకు సంబంధం లేదనడంతో సర్పంచ్లు తలలుపట్టుకుంటున్నారు. కేంద్రం నుంచి రాలేదు.. రాష్ట్రం ఇవ్వలేదు వాస్తవానికి జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ప్రతినెలా కేంద్రం, రాష్ట్ర నుంచి రూ.10.30 కోట్ల చొప్పున రూ.20.60 కోట్లు విడుదల కావాలి. అయితే గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన కాలానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. పాలకవర్గాలు లేకపోవడమే దీనికి కారణం. ఎస్ఎఫ్సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా ప్రతి నెలా రూ.10.30 కోట్లు విడుదల చేయలేదు. టీఎస్బీపాస్ ద్వారా మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల కోసం రూ.2,90,13,000 నిధులను విడుదల చేసింది. ఈ లెక్కన రూ.7,39,87,000 చొప్పున నిధుల జాడ లేకుండా పోయింది. పాలకవర్గాలు లేకపోవడంతో నిధుల అంశాన్ని లేవనెత్తేవారు కరువయ్యారు. నిధుల విషయంలో చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కొత్త సమస్య ఆదాయం అంతంతే.. వేతనాలు చెల్లించేదెలా.. ప్రభుత్వ నిర్ణయం సరికాదు పంచాయతీ కార్మికుల వేతనాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు. పంచాయతీలకు ఆదాయం ఎంతో తక్కువగా ఉంది. ప్రభుత్వం వేతనాలను చెల్లించి పంచాయతీలకు భారం తప్పించాలి. – పావని, సర్పంచ్, తొర్తి -
కారు బోల్తా : భార్యాభర్తలు మృతి
నలుగురికి తీవ్ర గాయాలు డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మాధవనగర్ బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారు ఝామున కారు బోల్తా పడిన ఘటనలో భార్యాభర్తలు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన ఇటుకబట్టి యజమాని చింతల శ్రీనివాస్, అదే గ్రామానికి చెందిన సాయిలు, ఐదుగురు బట్టీ కార్మికులతో కలిసి కారులో బుధవారం రాత్రి మహారాష్ట్రలోని నాందేడ్కు వెళ్లారు. తిరిగి గురువారం తెల్లవారుఝామున నాందేడ్ నుంచి దోమకొండకు బయలుదేరారు. ఉదయం సుమారు 6.30 గంటలకు నిజామాబాద్ బైపాస్ రోడ్డుపై సత్యనారాయణ క్రాకర్స్ షాపు దాటిన తర్వాత కారు అతివేగం వల్ల అదుపుతప్పి కల్వర్టు వద్ద రోడ్డు కిందకు దిగిపోయి మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న శోభ వాగ్మరే (42) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఆమె భర్త సత్వ తుకారాం వాగ్మరే (నాందేడ్ జిల్లా ముథ్ఖేడ్) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారులో ఉన్న చింతల శ్రీనివాస్, అనిత, సాహెబ్రావు, నగరం సాయిలు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ సీతారాం, మృతుడి కుమారుడు బాలాజీ సత్వ వాగ్మరే (2 వతరగతి విద్యార్థి) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తల్లిదండ్రులిద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో చిన్నారి బాలాజీ సత్వ అనాథగా మారాడు. ప్రమాదం జరిగిన వెంటనే వచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్ పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన సీపీ పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితి సమీక్షించారు. సీపీ మాట్లాడుతూ కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ముఖ్యంగా బైపాస్ రోడ్డులో అతివేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. సీపీ వెంట డిచ్పల్లి ఎస్సై ఎండీ అరిఫ్, నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ ఉన్నారు. -
ఆశల ముడుపులు
కోరిన కోరికలు నెరవేరాలని పరమేశ్వరుడిని వేడుకుంటూ ఎన్నో ఆశలతో కట్టిన ముడుపులు ఇవి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం శివలింగేశ్వరస్వామి మర్రిచెట్టు దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామి తమ కోరికలను నెరవేరుస్తాడని, కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని విశ్వాసంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లకు కొబ్బరికాయ ముడుపులు కడుతారు. భక్తుల కడుతున్న ముడుపుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
ఇస్రో ఆహ్వానం.. బాలలకు అవకాశం..
కమ్మర్పల్లి: శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలపై విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్(వైఎస్పీ, యువ విజ్ఞాన్ కార్యక్రమం) ‘యువికా’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. క్యాచ్ దెమ్ యంగ్ పేరిట రెండు వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. తద్వారా వారిని పరిశోధనల వైపు దృష్టి మళ్లించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అర్హులు–దరఖాస్తులు.. ● ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఇస్రో మేటి ప్రయోగాలు చేస్తూ, దేశంలోని బాల మేధావులను ప్రోత్సహించే క్రమంలో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్(యువికా) కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్(దరఖాస్తు) ప్రక్రియ ఫిబ్రవరి 27న ప్రారంభం కాగా, మార్చి 31న ముగుస్తుంది. ● 2025–26 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 8వ తరగతి వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 50 శాతం, ఆన్లైన్ క్విజ్ ప్రతిభకు, సైన్స్ ఫెయిర్లో పాల్గొన్న వారికి 10 శాతం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ చేసిన వారికి 5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారికి 15 శాతం వెయిటేజీ మార్కులు కేటాయించి అనుమతిస్తారు. –ఆసక్తిగల విద్యార్థులు ఇస్రో అధికారిక వెబ్సైట్ ఠీఠీఠీ. జీటటౌ. జౌఠి. జీుఽ లో లాగిన్ అయి, యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అందులో విద్యార్థుల వివరాలను నమోదు చేయాలి. ● ఇస్రో చేపట్టిన యువ విజ్ఞాన కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరిని వెంట అనుమతిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, డెహ్రాడూన్, శ్రీహరికోట, హైదరాబాద్, బెంగళూర్, షిల్లాంగ్, తిరువనంతపురంలో విద్యార్థులకు ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చా వేదికలు, ప్రయోగశాలల సందర్శన, ముఖ్యులతో సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. అంతరిక్ష శాస్త్రం, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. ● మే 11న యువ విజ్ఞాన కార్యక్రమం.. ఈనెల 31 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రిల్లో రెండు సార్లు జాబితాను ప్రకటిస్తారు. ఎంపికై న విద్యార్థులు మే 10న ఇస్రో కేంద్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 11 నుంచి 22 వరకు యువ విజ్ఞాన కార్యక్రమం నిర్వహిస్తారు. యువ శాస్త్రవేత్తలుగా ఎదగాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు యువికా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్కూల్ హెచ్ఎంలు, సైన్స్ టీచర్లు చొరవ తీసుకొని 9వ తరగతి విద్యార్థులకు ఈ విషయాలను తెలియజేసి, దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. విద్యార్థుల్లో ఉన్న శాసీ్త్రయ జిజ్ఞాసను మేల్కొల్పడం, అంతరిక్ష రహస్యాల పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉంది. –కె. గంగాకిషన్, జిల్లా సైన్స్ అధికారి, నిజామాబాద్ఇస్రో చేపట్టిన యువ విజ్ఞాన్ కార్యక్రమం(యువికా)కు ప్రచారం కరువైంది. జిల్లాలో ఐదేళ్లలో కేవలం 150 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి 26415 మంది విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్ ద్వారానే చేపడుతున్నారు. యువికా కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కూడా చాలా పాఠశాలలకు తెలియడం లేదు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు తెలియజేసే విధంగా ఇస్రో చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. బాల శాస్త్రవేత్తల తయారీకి ‘యువికా’ ప్రత్యేక కార్యక్రమం ‘క్యాచ్ దెమ్ యంగ్’ పేరిట యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ దరఖాస్తుల స్వీకరణకు మార్చి 31వరకు గడువు -
వ్యవసాయ సమాచారం
● బహుబాగు.. పాప్కార్న్ మక్క సాగు డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయం చేస్తున్న డొంకేశ్వర్ మండల రైతులు కొత్త రకాల పంటలను పండిస్తున్నారు. మండలంలోని తొండాకూర్ గ్రామాని కి చెందిన అల్లారి గంగాధర్ (సక్కర్ రెడ్డి) ప్రస్తుతం ఊరి సర్పంచ్గా పని చేస్తుండగా, మొక్కజొన్నలో పాప్కార్న్ రకాన్ని సాగు చేస్తున్నాడు. కంకితో క్వింటాలుకు రూ.2,200 చొప్పున వ్యాపారితో ముందస్తు ఒప్పందం చేసుకుని రెండెకరాల్లో పాప్కార్న్ మక్కను వేశాడు. యాసంగిలో 90 రోజుల పాటు సాగయ్యే ఈ పంట ఎకరానికి 30–40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని సక్కర్ రెడ్డి పేర్కొంటున్నారు. త్వరలోనే పంటకోత చేయనున్నట్లు వెల్లడించారు. ● డ్రమ్సీడర్పై అవగాహన రుద్రూర్: కోటగిరి మండలం రాంపూర్ గ్రామంలో గురువారం డా. రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోధన్ క్లస్టర్ పరిధిలో డ్రమ్ సీడర్ ఫీల్డ్ ఎక్స్పోజర్ రైతు సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కేవీకే శాస్త్రవేత్త ఇందుదార్ రెడ్డి, డిప్యూటీ మేనేజర్ వీరస్వామి, ఏరియా మేనేజర్ అరుణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు డ్రమ్ సీడర్ వినియోగం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. రైతులు పరికరాన్ని పరిశీలించి పలు సందేహాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ● సేంద్రియ ఆహార ఉత్పత్తులు ఆరోగ్యకరం బోధన్: ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో పండించిన సేంద్రియ ఆహార ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆలిండియా భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు కొండెల సాయరెడ్డి అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్లో ఆదర్శ రైతు కరుటూరు పాపరావు సొంత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో రసాయన రహితంగా పండించిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులు వినియోగదారుల అందుబాటులో ఉంచారు. సాయరెడ్డి గురువారం పాపారావు ఇంట్లో ఉన్న సేంద్రియ ఆహార ఉత్పత్తులను పరిశీలించి, ఆయనను అభినందించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మాజీ అధికారి దశరథ్ రెడ్డి పాల్గొన్నారు. -
‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ సిద్ధం చేశాం
● డీఎంహెచ్వో రాజశ్రీ ● ‘టెలీ మానస్’ కరపత్రాల ఆవిష్కరణ సుభాష్నగర్: రాష్ట్ర ప్రభుత్వం 99 రోజులపాటు నిర్వహించనున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేశామని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో గురువారం ఆమె డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాజశ్రీ మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్యవారం నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 38 పీహెచ్సీల్లో రోగులకు ఉచిత వైద్య ఆరోగ్య సేవలు అందిస్తారని తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కిషోర బాలికలకు హెచ్పీవీ టీకాలను మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా జీజీహెచ్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మాతా శిశు మరణాలతోపాటు నెలలోపు శిశువుల మరణాల సంఖ్య తగ్గించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వైద్య పరీక్షలు, శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అలాగే మానసిక ఒత్తిడిలో పరీక్షలంటే భయపడుతూ ఇతర సమస్యలతో బాధపడే విద్యార్థులు, యువకులను దృష్టిలో ఉంచుకుని మానసిక నిపుణుల ద్వారా ఉచిత కౌన్సిలింగ్ కోసం నిర్వహించే టెలి మానస్ కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యార్థులకు ఎలాంటి మానసిక సమస్యలున్నా.. 14416 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించి ఉచిత కౌన్సిలింగ్ పొందవచ్చన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్, ఏవో సుమంత్ కుమార్, ఉప వైద్యాధికారులు రవీందర్, సమత, అశ్విని, ప్రోగ్రాం అధికారులు శ్వేత, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
గొంతులో రొట్టె అడ్డు తగిలి ఒకరి మృతి! నస్రుల్లాబాద్: గోధుమ రొట్టె గొంతులో అడ్డు తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాఘవేంద్ర తెలిపిన వివరాలు ఇలా.. దుర్కి గ్రామానికి చెందిన గరుగళ్ల చిన్న మొగులయ్య (45) బుధవారం రాత్రి ఓ పురాతన ఇంటి వద్ద అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుడి నోటిలో గోధుమ రొట్టెలు ఉన్నాయి. గోధుమ రొట్టెలను ప్లాస్టిక్ కవర్లో తీసుకుని వచ్చి తింటుండగా గొంతులో అడ్డు తగిలి ఊపిరి ఆడక మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాడిలో ఒకరి ఆత్మహత్య నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని వాడి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పోల్కంపేట అంజయ్య(42)కు 15ఏళ్ల క్రితం నింగసానిపల్లి గ్రామానికి చెందిన జ్యోతితో వివాహామయింది. కాగా గత కొంతకాలంగా దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో గత నెల 17న ఇరువురి మధ్య గొడవ జరగడంతో జ్యోతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అంజయ్య జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంటి పక్కన ఉన్న రేకులషెడ్డులోకి వెళ్లి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. కామారెడ్డి క్రైం: మద్నూర్ డిప్యూటీ తహసీల్దార్గా పని చేస్తున్న శరత్ కుమార్ బస్సు దిగుతుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో గాయపడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి కొత్త బస్టాండ్లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. శరత్ కుమార్ గౌడ్ ఉదయం బస్టాండ్లో బస్సు దిగే క్రమంలో అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో అదే బస్సు టైర్ అతడి కుడి కాలు పైనుంచి వెళ్లింది. కాలు మడమ నుంచి కింద భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. స్థానికులు, పోలీసులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. -
నగరంలో ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం ప్రారంభం
● ముఖ్య అతిథులుగా హాజరైన సినీనటి నిధి అగర్వాల్, నగర మేయర్ ఉమారాణి ● భారీగా తరలివచ్చిన జనం నిజామాబాద్ రూరల్: నగరంలోని ఆర్పీ రోడ్డులో ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రముఖ సినీనటి నిధిఅగర్వాల్, నగర్ మేయర్ ఉమారాణి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేశారు. ఈసందర్భంగా నటి నిధి అగర్వాల్ మట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ఆర్ఎస్ బ్రదర్స్ సరికొత్త షోరూ మ్ను ప్రారంభించడం ద్వారా ఆర్ఎస్ బ్రదర్స్ మరో మైలురాయిని సగర్వంగా చేరుకుందన్నారు. సౌత్ ఇండియాలో కుటుంబ షాపింగ్ అవసరాలను తీర్చే విశ్వసనీయ సంస్థగా, ఏకై క గమ్యంగా, ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంను నిజామాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడంతో విజయకేతనం ఎగురవేస్తోందన్నారు. చైర్పర్సన్ హోల్ టైం–డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు, మేనేజింగ్ డైరెక్టర్ సీర్ణ రాజమౌళి, హోల్ టైం డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్లను సేకరించి జిల్లా కస్టమర్లకు అందిస్తున్నామన్నారు. అలాగే ఒక సమగ్రమైన లైఫ్స్టైల్ విభాగాన్ని కూడా పరిచయం చేస్తోందన్నారు. కుటుంబానికి అవసరమైన ప్రతి వస్తువు ఒకేచోట దొరికే ఒక పరిపూర్ణమైన గమ్యస్థానం ‘ఆర్ఎస్ బ్రదర్స్’ అన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న ప్రజలు పాల్గొన్నారు. -
విద్యార్హతలతోపాటు నైపుణ్యాలు అవసరం
తెయూ(డిచ్పల్లి): నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కేవలం విద్యార్హతలే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ ఎంతో అవసరమని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రా ర్ యాదగిరి అన్నారు. తెయూలో గురువారం యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్, రిలయన్స్ ఫౌండేషన్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘కనెక్ట్ విత్ వర్క్: ఎంప్లాయిబిలిటీ అండ్ లైఫ్ స్కిల్స్’ పై వారం రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. యూనివర్సిటీలకు ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ట్రైనింగ్ ఆఫీసర్లు పవన్రెడ్డి, అంజలి, రోహిణి పటేల్ వివిధ నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ప్లేస్మెంట్ డైరెక్టర్ పాతనాగరాజు, ప్రిన్సిపాల్ రాంబాబు, అంజనేయులు, వాసం చంద్రశేఖర్, నాగరాజు, శ్రీనివాస్, కిరణ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: భారతీయ వాయు సేన నందు అగ్నివీర్ వాయు ఉద్యోగాల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతీయువకులకు ఈనెల 8 నుంచి 18 వరకు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వింగ్ కమాండర్ షేక్ యాకుబ్అలీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోగల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 17 నుంచి 21 సంవత్సరాలలోపు వారు, పెళ్లికాని పురుషులు, మహిళలు అర్హులన్నారు. ధర్పల్లి: మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ధర్పల్లి కొత్త బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న మంచి కంటి రామచందర్ ఇంటికి కొన్ని రోజులుగా తాళం వేసి ఉంది. ఈక్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి కొంత నగదుతో పాటు, ఒక తులం బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
వ్యసనాల కొడుకును వధించి..
ఇందల్వాయి (నిజామాబాద్ రూరల్): మత్తు వ్యసనాలకు బానిసైన కొడుకును ఒక తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. నల్లవెల్లికి చెందిన కొత్తగొల్ల లక్ష్మి, కిషన్ దంపతులకు ఇద్దరు కొడుకుల్లో భాను ప్రకాశ్ (23) చిన్నవాడు. పదో తరగతి వరకు చదివిన భాను ప్రకాశ్ పైచదువులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. అయిదారేళ్లుగా చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలకు బానిసై తల్లిదండ్రులను వేధిస్తూ జులాయిగా తిరుగుతున్నాడు. భాను ప్రకాశ్ తరచూ గొడవ పడటంతో.. అతని అన్న గ్రామాన్ని విడిచి హైదరాబాద్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. తల్లిదండ్రులు కొద్ది రోజులుగా వేరే వారి ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో కొడుకుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తండ్రి కిషన్ ఇంట్లో నిద్రిస్తున్న భానుప్రకాశ్ను బుధవారం అర్ధరాత్రి గొడ్డలితో నరికి చంపాడు. ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నామని ఎస్ఐ సందీప్ తెలిపారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
అమ్మో... పులి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రాంతంలో సేదతీరుతోంది. గురువారం తెల్లవారుజామున అటవీ శాఖ అమర్చిన ట్రాప్ కెమెరాకు పెద్ద పులి కదలికలు చిక్కడంతో కచ్చితంగా నిర్ధారణ అయింది. మహారాష్ట్రలోని తడోబా అడవి నుంచి వచ్చిన ఈ పులి కొన్ని నెలలుగా ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో సంచరిస్తోంది.మూడు రోజుల క్రితం కమ్మర్పల్లి రేంజ్లోకి వచ్చిన ఈ పులి ఇదేచోట వన్యప్రాణిని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెద్ద పులి కదలికలపై పూర్తి స్థాయి సమాచారం కోసం అటవీ అధికారులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. గట్టుపొడిచినవాగు బ్యాక్వాటర్ ప్రాంతంలో గురువారం అటవీ అధికారుల బృందం పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో బీట్ అధికారి శ్రీదేవికి అలసట రావడంతో అక్కడే ఉన్న కల్వర్టు మీద కూర్చున్నారు.ఇది గమనించకుండా బృందంలోని మిగిలిన సభ్యులు కొంత ముందుకు వెళ్లారు. ఇదే సమయంలో వెనుక వైపు 30 మీటర్ల దూరంలో అలికిడి వినిపించడంతో శ్రీదేవి ఆవైపు చూడగా, పెద్ద పులి నడిచి వెళుతూ కనిపించింది. దీంతో ఆమె అక్కడికక్కడే మూర్ఛపోయారు. కల్వర్టుకు ఇవతలివైపు పడిపోయారు. అధికారుల బృందం తక్షణమే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కల్వర్టుకు అవతలివైపు పడిపోయి ఉంటే పులికి ఆహారం అయ్యేదానినని శ్రీదేవి విలపిస్తుండటంతో అధికారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు.ఏ బిడ్డా.. ఇది నా అడ్డామన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో పెద్ద పులులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అటవీ శాఖ చేపట్టిన జంగిల్ సఫారీలో భాగంగా పర్యాటకులకు తరచూ పెద్ద పులులు కనిపిస్తూ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి విధుల్లో భాగంగా సఫారీ వాహనంలో వెళ్తున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి.. గుండం వద్ద చెట్ల పొదల నుంచి వచ్చిన పెద్దపులి కనిపించింది. సఫారీ వాహనం దీపాలను ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డుపైనే ఠీవిగా నడుచుకుంటూ సాగిపోయింది. దీంతో అధికారులు తమ సెల్ఫోన్లలో పులి కదలికలను వీడియోలు తీశారు.కెమెరాకు చిక్కిన చిరుతపులిబోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కరత్వాడ గ్రామ శివారులోని లక్కాయి లొద్ది వద్ద చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం కరత్వాడ గ్రామానికి చెందిన ద్యాగాల గంగయ్యకు చెందిన ఆవు.. లక్కాయి లొద్ది వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిని చిరుత దాడిగానే భావించిన అటవీ శాఖ అధికారులు అక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 5.29 గంటల ప్రాంతంలో ఆవు కళేబరాన్ని చిరుత తింటున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఆవును చంపింది చిరుతేనని అటవీ అధికారులు ధ్రువీకరించారు. చిరుత సంచారం దృష్ట్యా అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పశువుల కాపరులు, వృద్ధులు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. -
ఉత్కంఠగా సాగిన ‘పిడిగుద్దులాట’
నిజామాబాద్ జిల్లా : మంజీర నది తీర సమీపంలోని నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్స గ్రామంలో ‘పిడిగుద్దులాట’ఉత్కంఠ భరితంగా సాగింది. శతాబ్దానికి పైగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం హున్స గ్రామస్తుల ఐకమత్యం, పోలీసుల పర్యవేక్షణలో ఈ ఏడాది పిడిగుద్దులాటను విజయవంతంగా నిర్వహించారు. సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు గ్రామస్తులు, ప్రేక్షకుల కేరింతలు, చప్పట్ల నడుమ పిడిగుద్దులాట కొనసాగింది. అనంతరం గ్రామపెద్దలు ఆట ముగిసినట్లు ప్రకటించగా గ్రామస్తులంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పిడిగుద్దులాటను తిలకించేందుకు మహారాష్ట్ర వాసులు, బోధన్ డివిజన్లోని పలు ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ విజయ్బాబు, ఎస్ఐ మచ్చేందర్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
మస్కట్లో ఆలూర్ వాసి మృతి
పెర్కిట్: ఆలూర్ మండల కేంద్రానికి చెందిన అండ్రాసి మల్లయ్య(45) మస్కట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు గ్రామస్తులు బుధవారం తెలిపారు. ఆలూర్ మండల కేంద్రానికి చెందిన మల్లయ్య ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన మస్కట్ వెళ్లాడు. మంగళవారం పని ముగించుకుని రోడ్డు దాటుతుండగా కారు వేగంగా వచ్చి ఢీకొన్నది. దీంతో మల్లయ్య ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయ్యాడు. మల్లయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు నమోదు మోపాల్: మండలంలోని ముదక్పల్లి గ్రామశివారులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జాడె సుస్మిత గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మంచిప్ప గ్రామానికిచెందిన కమ్మరి రాజు ఈనెల 2న సాయంత్రం ఆటోను నిర్లక్ష్యంగా నడిపి అదేసమయంలో బైక్పై వస్తున్న కొండెంగల శ్యామ్ను ఢీకొన్నాడు. ప్రమాదంలో శ్యామ్ కులి కాలి వేళ్లు, మోకాలి వద్ద గాయాలయ్యాయి. శ్యామ్ సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కమ్మరి రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. 304.70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత డిచ్పల్లి: మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో ఉన్న శ్రీగణేశ్ రైస్మిల్ లో అక్రమంగా నిర్వహించిన 304.70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీ నం చేసుకొని కేసు నమోదు చేసినట్టు డిచ్పల్లి ఎస్సై ఆరిఫ్ తెలిపారు. ఎ స్సై తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్ రైస్ మిల్లు రేషన్ బియ్యాన్ని అక్ర మంగా రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు పోలీస్, సివిల్ సప్లై డీటీ రాథోడ్ రవికుమార్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది మంగళవారం రా త్రి దాడి నిర్వహించారు. రైస్ మిల్ యజమాని గందె నాగరాజును విచారించగా రేషన్ బియ్యానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు చూయించ లేదు. ఈ దాడిలో 304.70 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకోగా వీటి విలువ రూ.11,57,860 ఉంటుందని తెలిపారు. డీటీ రవికుమార్ ఫిర్యాదు మేరకు రైస్ మిల్ యజమాని నాగరాజు, చీల రోహిత్, సీహెచ్ కిరణ్ కుమార్, ఆటో డ్రైవర్లు షేక్ రఫీ, షేక్ అన్సర్, షేక్ గౌస్పై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
పీజీ పరీక్షలకు 107 మంది గైర్హాజరు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ రెగ్యులర్ మొదటి, 7వ సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం 107 మంది గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. వర్సిటీ పరిధిలో నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బోధన్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్మూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల, భిక్కనూర్ సౌత్క్యాంపస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 1,905 మందికి 1,798 మంది హాజరు కాగా 107 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు సుభాష్నగర్: పిల్లల భవిష్యత్తుకు వెలుగులు నింపే అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో ఎన్పీడీసీఎల్ కీలకపాత్ర పోషిస్తోందని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్కిల్ పరిధిలో నేటికీ విద్యుత్ కనెక్షన్ లేని అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 378 అంగన్వాడీలకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలను గుర్తించి కనెక్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించే పనుల దిశగా విద్యుత్ కనెక్షన్లు, అంతర్గత వైరింగ్, ఇతర సదుపాయాలు వేగవంతంగా పనులు కొనసాగుతున్నాయని, ఇది పూర్తిగా ఉచితమని తెలిపారు. విద్యుత్ వెలుగులతో అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటర్లు, తదితర పరికరాలు సక్రమంగా పనిచేయడంతో పిల్లలు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించగలుగుతున్నారని ఎస్ఈ తెలిపారు. పెర్కిట్(ఆర్మూర్): మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎంహెచ్వో రా జశ్రీ సూచించారు. ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామంలో బుధవారం అధికారులు గ్రామాభివృద్ధిలో మహిళల పాత్రపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి డీఎంహెచ్వో హాజరై మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కట్ల మల్లవ్వ, ఉప సర్పంచ్ కట్ట నర్సయ్య, ఎంపీడీవో గంగాధర్, ఎంఈవో నరేందర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సమతా, ఎస్సై అప్పారావు, కార్యదర్శి నసీర్, మహిళ సంఘాల సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సబ్ సెంటర్ తనిఖీ మాక్లూర్: ఆలూర్ మండలం కల్లెడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గుత్ప ఆరోగ్య కేంద్ర సబ్ సెంటర్ను డీఎంహెచ్వో రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు వేస్తున్న టీకాలు, గర్భిణులకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సెంటర్లోని రికార్డులను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
వేతన కష్టాలు..
సుభాష్నగర్: వేతనాలు అందక గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఈ–పంచాయతీ ఆపరేటర్లు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలుగా జీతాలు రాకపోవడం.. అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో ఈ–పంచాయతీ ఆపరేటర్లలో మరింత ఆందోళన మొదలైంది. అదనపు పనిభారం, ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు చెల్లించాలని పంచాయతీరాజ్ మంత్రి సహా ఆ శాఖ ఉన్నతాధికారులకు, డీపీవోలకు వినతిపత్రాలు అందజేసినా ఆశించిన ఫలితం రావడంలేదని వారు వాపోతున్నారు. సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే ఉద్ధేశంతో ఈ–పంచాయతీ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం 2014–15లో క్లస్టర్ వారీగా గ్రామ పంచాయతీ స్థాయిలో 94 మంది ఆపరేటర్లను నియమించింది. మండలానికి ముగ్గురు, నలుగురు చొప్పున మండల పరిషత్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా పరిపాలన వ్యయం నుంచి 10 శాతం నిధులతో ఒక్కో ఆపరేటర్కు రూ.19,500 వేతనం చెల్లించేవారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో కేంద్రం గ్రాంట్లు నిలిపేసింది. ఐదు నెలల క్రితం వరకు మల్టీపర్పస్ వర్కర్లకు కేటాయించిన నిధుల్లోని మిగులు బడ్జెట్ నుంచి చెల్లించారు. ప్రస్తుతం ఐదు నెలలుగా చెల్లించడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సమాచారాన్ని ఆపరేటర్లు ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో ఆన్లైన్ చేస్తున్నారు. దశాబ్ద కాలంగా విధులు నిర్వర్తిస్తున్నా తమకు గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా వేతనాల చెల్లింపు విషయమై డీపీవో శ్రీనివాస్రావు వివరణ కోరగా.. ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టిలో ఉందని, ట్రెజరీలో పెండింగ్లో ఉన్నట్లు తెలిసిందని సమాధానమిచ్చారు. అదనపు పనిభారంతో సతమతం గ్రామపంచాయతీ పనులతోపాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్నిరకాల పనులను ప్రభుత్వం ఈ–ఆపరేటర్లతో చేయిస్తోంది. ప్రజాపాలన, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి మార్పిడి, వ్యాపార లైసెన్సు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, ఎన్నికల పనులు, పంచాయతీల ఆదాయ, వ్యయాలతో పాటు ఇతరత్రా పనులు కంప్యూటీకరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. వేతనాలు, డిమాండ్ల పరిష్కారం కోసం డీపీవోను కలిసి వినతిపత్రం అందజేశాం. మేము ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు అసోసియేషన్ రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఉద్యోగ భద్రత, డిమాండ్లపై రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణతో ముందుకు సాగుతాం. – సురేశ్, ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు.. ఐదు నెలలుగా ఈ–పంచాయతీ ఆపరేటర్లకు అందని జీతాలు ‘అవుట్సోర్సింగ్’ సిబ్బంది తొలగింపుతో ఆందోళన సమస్య పరిష్కరించాలని ఉన్నతాధికారులకు వినతి -
రూ.151కే సీతారాముల కల్యాణ తలంబ్రాలు
సుభాష్నగర్: భద్రాచలంలో ఈ నెల 27న నిర్వహించే సీతారాముల వారి కల్యాణానికి వెళ్లలేని భక్తులకు కేవలం రూ.151కే కల్యాణ తలంబ్రాలు ఇంటి వద్దకే అందించే ఏర్పాట్లు ఆర్టీస చేపట్టిందని నిజామాబాద్ డిపో–1 మేనేజర్ ఆనంద్ తెలిపారు. ఈమేరకు బుధవారం నగరంలోని డిపో కార్యాలయంలో కల్యాణ తలంబ్రాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కల్యాణ తలంబ్రాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఆర్మూర్ డిపో– 73968 89496 బోధన్ డిపో – 91542 98729 నిజామాబాద్ – 1 91542 98727 నిజామాబాద్ – 2 73968 89496 బాన్సువాడ – 91542 98729 కామారెడ్డి డిపో – 91542 98729 ఆర్ఎం ఆఫీస్ – 86399 69647 ● ఇంటిపన్ను చెల్లించిన వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు కమ్మర్పల్లి: మండలంలోని బషీరాబాద్లో సకాలంలో ఇంటి పన్ను చెల్లించిన వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేశారు. జీపీ నూతన పాలకవర్గం కొలువుదీరిన సమయంలో సర్పంచ్ బైకానీ జమున, అధికారులు కలిసి 2025–26 సంవత్సరానికి గాను సకాలంలో ఇంటి పన్ను, పన్ను బకాయిలు చెల్లించిన వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. బుధవారం జీపీ ఆవరణలో గ్రామసభ నిర్వహించిన అనంతరం గ్రామస్తుల సమక్షంలో ఇంటి పన్ను చెల్లించిన 534 మంది చెల్లింపుదారుల ఇంటి నంబరు, పేరుతో కలిసి డ్రా పద్ధతిన విజేతలను ఎంపిక చేశారు. డ్రా లో సుంకెట చిన్న గంగారాం సీలింగ్ ఫ్యాన్, బొక్కెన శోభ హెల్మెట్, సుంకెట పెద్ద ముత్తెన్న రైస్ కుక్కర్ గెలుపొందారు. తహసీల్దార్ జీ ప్రసాద్, ఆర్ఐ శరత్, ఉపసర్పంచ్ చిలివేరి భూమేశ్వర్, కార్యదర్శి నరేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎల్ఎల్బీ ఐదో సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ఈ పరీక్షకు 28 మందికి 27 మంది హాజరు కాగా ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. -
జాతీయ స్థాయి అవార్డుకు అవంతి ఎంపిక
బోధన్: హైదరాబాద్కు చెందిన గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు జాతీయ స్థాయి అవార్డును అందిస్తుంది. చిత్ర కళలో రాణిస్తున్న బోధన్ పట్టణం తట్టికోట కాలనీకి చెందిన చిత్రకారిణి ఎర్రోల్ల అవంతి ‘బాపు చిత్ర కళారత్న’ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 26న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నిర్వాహకుల చేతుల మీదుగా అవంతి అవార్డును అందుకోనున్నారు. సాలూర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ లింబూరి లక్ష్మణ్ ప్రోత్సాహంతో ఇంటర్ చదువుకుంటూనే అవంతి డ్రాయింగ్ డిప్లొమాలో లోయర్, హయ్యర్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవల ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా 15 అడుగుల ఎత్తు గల క్లాథ్ బ్యానర్పై శివాజీ చిత్రం గీశానని పేర్కొంది. -
సౌత్క్యాంపస్లో విద్యార్థుల మధ్య ఘర్షణ
● ఏడుగురి విద్యార్థుల సస్పెండ్ ● హోలీ సంబరాల్లో చోటు చేసుకున్న ఘటన భిక్కనూర్: తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్క్యాంపస్లో సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య మంగళవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. హోలీ సంబరాల్లో పాల్గొన్న విద్యార్థులు డీజే సౌండ్ పెట్టుకుని నృత్యాలు చేస్తుండగా వివాదం తలెత్తింది. ఒకరి నుంచి మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో హిస్టరీ విభాగానికి చెందిన జూనియర్ విద్యార్థి రాజు తలకు గాయమైంది. విద్యార్థి రాజును దోమకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం జూనియర్ విద్యార్థులు బాలుర వసతి గృహం ప్రాంగణంలో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఆంజనేయులు బాలుర హాస్టల్ వార్డెన్ యాలాద్రి సౌత్క్యాంపస్నకు చేరుకొని విద్యార్థులను సముదాయించి నిరసనను విరమింపజేశారు. బుధవారం ఉద యం విషయం తెలుసుకున్న రాజు కుటుంబ సభ్యులు సౌత్ క్యాంపస్కు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరోమారు సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నెలకొంది. జూనియర్ విద్యార్థులు ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఆంజనేయులు, ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్ సీనియర్, జూనియర్ విద్యార్థులతో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్ మాట్లాడుతూ.. ఘర్షణకు కారకులైన ఏడుగురు సీనియర్ విద్యార్థులను బాలుర వసతి గృహం నుంచి తాత్కాలింకగా సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ విషయమై కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ వివరించారు. తలుపులు మూసేసి దాడి? హోలీ సందర్భంగా సంబరాల్లో పాల్గొన్న విద్యార్థులు రెండు గ్రూపులుగా సీనియర్, జూనియర్లుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. కొంత మంది జూనియర్ విద్యార్థులను సీనియర్లు మెస్ రూంలోకి తీసుకెళ్లి తలుపులు మూసి దాడులకు పాల్పడినట్లు జూనియర్లు ఆరోపించారు. -
లైన్మన్ల సేవలు అభినందనీయం
● ఘనంగా లైన్మన్ దివస్ ● సిబ్బందికి ప్రశంసాపత్రాల అందజేతసుభాష్నగర్/సిరికొండ : ఎన్పీడీసీఎల్ సంస్థలో క్షేత్రస్థాయిలో లైన్మన్ల సేవలు అభినందనీయమని డీఈలు అల్జాపూర్ రమేశ్, వెంకటరమణ కొనియాడారు. బుధవారం నగరంలోని ఎంఆర్టీ కన్స్ట్రక్షన్ డివిజన్, డీ–2, 3, 5, 9, బోర్గాం(పి) సెక్షన్లో టెస్టర్ గ్రేడ్–1, 2, జూనియర్ లైన్మన్, ఆర్టిజన్లను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం ప్రశంసాపత్రాలతో సన్మానించారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏడీఈలు తోట రాజశేఖర్, ప్రదీప్రెడ్డి, ఏఈలు గయాస్ అహ్మద్, బాబా శ్రీనివాస్, జాకీర్ అలీ, మౌనిక రెడ్డి, రజిని, ఫోర్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సిరికొండ విద్యుత్ శాఖ కార్యాలయంలో లైన్మన్లను మేన్లను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకారం రవి, సిరికొండ సెక్షన్ ఏఈ చంద్రశేఖర్ ఘనంగా సన్మానించారు.సబ్ ఇంజనీర్ గంగారాం సిబ్బంది పాల్గొన్నారు. ఎంఆర్టీలో లైన్మన్లను సన్మానించిన డీఈ, ఏడీఈ, ఏఈలుడీ–5 సెక్షన్లో లైన్మన్లను సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేసిన డీఈ, ఏడీఈ, ఏఈలు -
కాంగ్రెస్కు కుల, మత భేదాల్లేవ్
సుభాష్నగర్: కాంగ్రెస్కు కుల, మత భేదాల్లేవని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు పార్టీకి మూల స్తంభాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ భవన్లో కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 21 నుంచి పది రోజుల పాటు వికారాబాద్లో జరిగిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ డీసీసీ అధ్యక్షుల శిక్షణ అనుభవాలను మీడియాతో నగేష్రెడ్డి పంచుకున్నారు. అంటరాని తనం, ప్రజల్లో అంతరాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని, గరీబీ హఠావో ఇందిరాగాంధీ నినాదమని గుర్తు చేశారు. కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదని, ఎందరో ప్రాణత్యాగాలు చేశారన్నారు. మేధావులు, యువకులు, విద్యార్థులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. కేసీఆర్ దొంగ నిరాహార దీక్ష చేశారని, దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్ర అప్పు రూ.64 వేల కోట్లు ఉంటే, కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరిందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రాజెక్టులు కట్టారని, రోడ్లు వేశామని, పేదలకు ఇండ్లు, పింఛన్లు, ఎయిర్ పోర్టులు, విశ్వ విద్యాలయాలు, ట్రిపు ల్ ఐటీలు, ఆస్పత్రులు నిర్మించారన్నారు. సీ ఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమా ర్గౌడ్ సారథ్యంలో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. పనిచేసే వారికే ప్రాధాన్యత.. కాంగ్రెస్ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి రా మకృష్ణ మాట్లాడుతూ శిక్షణా శిబిరంలో ఏఐసీసీ నా యకులు, రాష్ట్ర మంత్రులు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మేధావు లు, ప్రొఫెసర్లు వివిధ అంశాలపై శిక్షణనిచ్చారని తెలిపారు. ఏఐసీసీ నాయకులు, మంత్రులు పార్టీని బలోపే తం చేయడంపై దిశానిర్దేశం చేశారన్నారు. పార్టీ జిల్లా, మండల, బూత్ కమిటీలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్లో పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని, ఆర్గనైజేషన్ విషయంలో ఎవరి పరిధిలో వారు పని చేసుకోవాలని అధిష్టానం సూచించిందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ సర్టిఫికెట్తోపాటు చరఖాను ప్రదానం చేశారని, రాహుల్ గాంధీ నా లుగు గంటలపాటు ఆత్మీయంగా కుటుంబ సభ్యులందరితో ఫొటో సెషన్కు అవకాశమివ్వ డం మరుపురాని సంఘటన అని, ఆయనకు రుణప డి ఉంటామన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీని యర్ నాయకులు జావిద్ అక్రమ్, నరాల రత్నాకర్, ఘన్రాజ్, విఫుల్ గౌడ్, గడీల రాములు, వైశాక్షి సంతోష్, రాజా నరేందర్ గౌడ్, కెతావత్ యాదగిరి, సు భాష్ జాదవ్, మల్యాల గోవర్ధన్ పాల్గొన్నారు. రాహుల్గాంధీని ప్రధానిని చేసి తీరుతాం.. ప్రజలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేశారని, ఈ అవకాశాన్ని ప్రజలు, పార్టీ కోసం పని చేసి సద్వినియోగం చేసుకోవాలని రాహుల్గాంధీ చెప్పారని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరికీ గులాంగిరి చేయొద్దని, పార్టీకి, కార్యకర్తలకు, ప్రజలకు మాత్రమే గులాంగిరి చేయాలని సూచించారన్నారు. 2029 ఎన్నికల్లో జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. రాహుల్గాంధీని ప్రధానిని చేసి తీరుతామన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మూలస్తంభాలు అందరి సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేస్తాం డీసీసీ అధ్యక్షుడు కాట్పల్లి నగేష్రెడ్డి -
పెద్దపులి అలజడి
నిజామాబాద్విద్యార్థుల మధ్య ఘర్షణ హోలీ సంబరాలు తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్క్యాంపస్ విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీశాయి. గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026– 8లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఊహించిన విధంగానే జిల్లాలోకి పెద్ద పులి రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లోని జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులి వచ్చే అవకాశాలున్నట్లు అటవీ అధికారులు గత పది రోజులుగా భావిస్తూ వచ్చారు. అనుకున్నట్లుగానే పెద్ద పులి జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోకి వచ్చింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఇందులో భాగంగా పులి అడుగులను గుర్తించారు. పాదముద్రల కొలతలను సేకరించారు. అయితే ఈ పులి ఎటు వెళ్లిందనే విషయమై అధికారులు ఒక అంచనాకు రాలేదు. కమ్మర్పల్లి రేంజ్ అధికారి రవీందర్ ఆధ్వర్యంలో ఆరుగురు సిబ్బంది కలిగిన మూడు బృందాలు బుధవారం ఆయా అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 3న కమ్మర్పల్లి రేంజ్లోని కోనాపూర్ సెక్షన్లోని ఇనాయత్నగర్ బీట్ పరిధిలో గట్టుపొడిచినవాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి పాద ముద్రలను గుర్తించారు. అయితే తాజాగా బుధ వారం పెట్రోలింగ్ చేసిన అటవీ సిబ్బందికి సమీప అడవుల్లో మరోచోట పెద్ద పులి పాద ముద్ర కనిపించింది. దీంతో పెద్దపులి కిలోమీటరు పరిధిలోనే ఉండవచ్చనే అంచనాకు వచ్చారు. కాగా పక్కనే సరిహద్దుల్లో ఉన్న సిరిసిల్ల జిల్లా మానాల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. ● పెద్ద పులి కదలికలు కనిపెట్టడంతో పాటు అది ఎటువైపు వెళ్తుందో గమనించేందుకు గాను అటవీ శాఖ అధికారులు గట్టుపొడిచినవాగు సమీపంలో పలు చోట్ల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి దాహం తీర్చుకునేందుకు నీటి కుంటల వద్దకు వచ్చే అవకాశం ఉండడంతో దాని కదలికలు గుర్తించేందుకు అవకాశాలు ఉన్నాయి. ట్రాప్ కెమెరాల్లో పెద్ద పులి కదలికలు రికార్డు అయితే కమ్మర్పల్లి రేంజ్లోనే సంచరిస్తున్నట్లుగా అధికారులు స్పష్టమైన ప్రకటన చేస్తారు. ఒకవేళ రికార్డు కాకపోతే మాత్రం అది వేరే చోటికి వెళ్లినట్లుగా భావించాల్సి ఉంటుందని అంటున్నారు. జిల్లాలోని ఆయా రేంజ్ల పరిధిలోని గ్రామాల ప్రజలకు పెద్దపులి సంచారంపై హెచ్చరికలు జారీ చేశారు. జత కోసం.. జత కోసం వెదుకుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గత కొన్ని వారాలుగా తిరుగుతున్న పులి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు రెండు వారాల క్రితమే భావించిన అధికారులు తగినవిధంగా అప్రమత్తమయ్యారు. పది రోజుల కిందటే కమ్మర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. మహారాష్ట్రలోని తాడోబా అడవుల నుంచి అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని జన్నారం మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లి, తిరిగి మళ్లీ సిద్దిపేట జిల్లా, సిరిసిల్ల జిల్లా మీదుగా జగిత్యాల జిల్లాలోకి పులి ప్రవేశించింది. వేములవాడ ప్రాంతంలో ఒక ఆవును చంపేసింది. అయితే తాజాగా గుర్తించిన పులి పాదముద్రలను బట్టి ఇది 300 కిలోలకు పైగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. మేకల మందపై చిరుత దాడి వర్ని: మండలంలోని కూనిపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం మేకల మందపై చిరుత దాడి చేసింది. గ్రామానికి చెందిన కుక్కలి సాయిలు మేకల మందను అటవీ ప్రాంతంలోకి మేత కోసం తీసుకువెళ్లగా చిరుత మందపై దాడి చేసి ఓ మేకను చంపేసింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. చిరుతల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని వర్ని అటవీ రేంజ్ అధికారి గంగారాం సూచించారు. 369 మంది విద్యార్థుల గైర్హాజరు ఖలీల్వాడి : జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్ర శాంత వాతావరణంలో కొనసాగుతున్నా యి. బుధవారం నిర్వహించిన సెకండియర్ మ్యాథ్స్–2 ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 16,899 మంది విద్యార్థులకు గాను 16,530 (97.8 శాతం) మంది హాజరుకాగా, 369 మంది గైర్హాజరయ్యారని వివరించారు. 58 సెంటర్లలో ఎగ్జామ్స్ కొనసాగుతుండగా.. 54 సెంటర్లను తనిఖీ చేశామన్నారు. పుష్కరాల వేళ పటిష్ట బందోబస్తు రెంజల్(బోధన్): గోదావరి పుష్కరాలకు (2027 జూన్ – జూలై)పటిష్ట బందోబస్తు ఏ ర్పాటు చేస్తామని సీపీ సాయి చైతన్య అన్నా రు. కందకుర్తి పుష్కర క్షేత్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. 2015 పుష్కరాల నిర్వహణ, లోటుపాట్ల వివరాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. భక్తు లు రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా రూట్మ్యాప్ను రూపొందించాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్కు సూచించారు. వాహనాల పార్కింగ్కు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఘాట్లను పరిశీలించిన సీపీ.. పరిశుభ్రంగా ఉంచాలని స్థానిక సర్పంచ్ గయాసుద్దీన్కు సూచించారు. సీపీ వెంట బోధన్ రూరల్ సీఐ విజయ్బాబు, ఎస్సై చంద్రమోహన్ ఉన్నారు. ఇనాయత్నగర్ అడవిలో పెద్దపులి పాదముద్రల కోసం గాలిస్తున్న అటవీ సిబ్బంది ఇనాయత్నగర్ అటవీ ప్రాంతంలో అధికారులు గుర్తించిన పులి పాదముద్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కోనాపూర్, ఇనాయత్నగర్, కొత్త చెరువు తండా, మానాల, నర్సాపూర్ గ్రామాలతో పాటు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ క్షేత్ర అధికారి రవీందర్ హెచ్చరించారు. గ్రామస్తులు ఎవరూ ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లకూదన్నారు. రైతులు పంట చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. మేకలు, గొర్రెలు, పశువుల కాపర్లు అడవిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కమ్మర్పల్లి: పెద్దపులి అడుగుల గుర్తింపు కోసం అటవీ అధికారులు కాలినడకన గా లింపు చర్యలు చేపట్టారు. కమ్మర్పల్లి రేంజ్ అధికారు లు గట్టు పొడిచిన వాగు ప్రా జెక్ట్ బ్యాక్ వాటర్ ఏరియా కాంపార్ట్మెంట్ నంబర్ 14 లో తిరిగారు. మెట్పల్లి రేంజ్, సిరిసిల్ల జిల్లా మ ల్యాల, చందుర్తి రేంజ్ల అటవీ అధికారులు కో నాపూర్ రాళ్లవాగు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రదేశం కాంపార్ట్మెంట్ 24లో గాలించారు. కమ్మ ర్పల్లి రేంజ్ ఇనాయత్నగర్ పరిధిలోని కాంపార్ట్మెంట్ 14లో పెద్దపులి వంద మీటర్ల వరకు సంచరించినట్లు పాదముద్రలను గుర్తించారు. పెద్ద పులి సంచరించిన చోట ఒక్కో అడుగు 17 నుంచి 19 సెంటీమీటర్లు ఉన్నట్లు కమ్మర్పల్లి అట వీ క్షేత్ర పరిధి అధికారి రవీందర్ తెలిపా రు. అడుగులను బట్టి మగపులిగా గుర్తించామన్నారు. జగిత్యాల, సిరిసిల్ల సరిహద్దుల్లో సంచరించి జిల్లాలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. కమ్మర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి రేంజ్లలో టెన్షన్ పులి రాక నిర్ధారణ.. ఎటు వెళ్లిందో అంచనాకు రాలేకపోతున్న అధికారులు ట్రాప్ కెమెరాల ఏర్పాటు, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ క్రమంగా అడుగంటుతున్న భూగర్భ జలాలు రెండు నెలల్లో 3.36 మీటర్లు తగ్గిన వైనం జిల్లాలో ప్రస్తుత నీటి మట్టం 11 మీటర్లు -
బాధిత కుటుంబం ఆందోళన
సుభాష్నగర్/ఇందల్వాయి: ఆత్మహత్య చేసుకున్న ఏకలవ్య ఆదర్శ గురుకులం విద్యార్థి రామచరణ్ కుటుంబ సభ్యులు బుధవారం పాఠశాల ఎదుట, జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ట్రైబల్ వెల్ఫేర్ ఆర్సీవో గంగారాం నాయక్ పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. పాఠశాల వద్ద పోలీసులు బందబోస్తు నిర్వహించారు. ఉపాధ్యాయుల ఒత్తిడి కారణంగానే రామ్చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు. విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను సముదాయించి పంపించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపారు. ఇందల్వాయిలో మాట్లాడుతున్న బాధితులుజీజీహెచ్ ఎదుట బైఠాయించిన బాధిత కుటుంబం -
వాల్పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్ రూరల్: నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రగతిశీల మహిళా సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు నీలం లక్ష్మీ, గొంట్యాల సంజన తెలిపారు.బుధవారం పోచమ్మగల్లిలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరారు.మహిళల హక్కుల కోసం ఉద్యమాలు నిర్మిద్దామని పిలుపునిచ్చారు.పీవోడబ్ల్యూ నాయకులు జమున రాధా నర్సు బాయి, కళావతి, పోచమ్మ గల్లీ కాలనీవాసులు పాల్గొన్నారు. ధర్పల్లి: మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు నాలెడ్జ్ టెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విద్యార్థుల నైపుణ్యం పెంపొందించే విధంగా వివిధ మోడల్స్ రూపంలో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రి న్సిపల్ అల్లాడి శ్రీకాంత్, డైరెక్టర్ ప్రశాంత్, స్పందన ఉపాధ్యాయులు తదితరులున్నారు. విద్యార్థులు సంస్కారాన్ని పెంచుకోవాలి నిజామాబాద్ రూరల్: విద్యార్థులు చదువుతోపాటు సంస్కారాన్ని పెంచుకోవాలని నిజామాబాద్ రూరల్ మండల విద్యాశాఖ అధికారి సేవులా అన్నారు. బుధవారం సారంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల సాంస్కతిక ప్రదర్శనలు అలరించాయి. పాఠశాల హెచ్ఎం పోశన్న, ఉపాధ్యాయులు లలిత, డాక్టర్ సత్యనారాయణ, గోపాల్, మొహమ్మద్ జావిద్, విద్యాసాగర్, గంగాధర్, ఘనపురం దేవేందర్, స్వరూప, లలిత, శ్రీలత, సుజాత, సునంద, కృష్ణంరాజు తదితరులున్నారు. -
ఎత్తిపోతున్న బోర్లు..!
డొంకేశ్వర్(ఆర్మూర్): వేసవి ప్రారంభంలోనే జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఏకంగా 3.36 మీటర్ల లోతులోకి వెళ్లాయి. జనవరిలో 2.36 మీటర్లు, ఫిబ్రవరిలో 1 మీటరు మేర తగ్గిపోవడం నీటి వినియోగ తీవ్రతను తెలుపుతోంది. వరినాట్లు పూర్తి కావడంతో వ్యవసాయ బోర్ల వాడకం పెరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో మోటార్లకు నీరందక ఎత్తిపోతున్నాయి. పంట పొలాలకు నీరు అందించడానికి రైతులకు ఇబ్బందులు ఇప్పుడే మొదలయ్యాయి. కొన్ని చోట్ల వ్యవసాయ, గృహవసర బోర్లు సన్న ధార పోస్తున్నాయి. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే మూడు నెలలు ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జనవరిలో 9.56 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలు ఫిబ్రవరి ముగిసే నాటికి 11 మీటర్ల లోతులోకి చేరాయి. ఇది 2025 ఫిబ్రవరి నెలతో (11.94 మీటర్లు) పోలిస్తే కొంచెం మెరుగైన పరిస్థితి అయినప్పటికీ భూరగ్భ జలాలు వేగంగా కిందికి వెళ్తున్నాయి. ఇటీవల గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు జిల్లాలో 82 పరిశీలక బోరు బావులు (ఫీజో మీటర్లు) ద్వారా జనవరి మాసానికి సంబంధించిన నీటి లెక్కలను తీశారు. ఇందులో 45 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. అలాగే 30 ఫీజో మీటర్లలో 10 నుంచి 20 మీటర్ల లోపు భూగర్భ జలాలున్నాయి. అదే విధంగా 7 ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఆరోగ్యకర నీటి మట్టాలు 54.87శాతం విస్తీర్ణంలో ఉన్నాయి. భీమ్గల్, సిరికొండ, డిచ్పల్లి, మోపాల్, నవీపేట్ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో వేగంగా నీటి మట్టాలు తగ్గుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి వేసవిలో ఎల్నినో ప్రభావం ఉండొచ్చని ప్రపంచ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా ప్రజలు, రైతులు భూగర్భ జలాలు తగు మోతాదులో వాడుకోవాలి. రానున్న రోజుల్లో నీటి ఎద్దటి రాకుండా ఉండాలంటే నీటిని వృథా చేయకూడదు. వృథా నీరు భూమిలోకి చేరేలా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. – శ్రీనివాస్బాబు, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి -
విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
● పీడీఎస్యూ డిమాండ్ డిచ్పల్లి: ఇందల్వాయి మండల పరిధిలోని ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం విద్యార్థి మృతి పై వివరాలు సేకరించడానికి పీడీఎస్యూ నాయకులు ఏకలవ్య పాఠశాలకు చేరుకున్నారు. అధికారులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కర్క గణేశ్ మాట్లాడుతూ విద్యార్థి రామ్చరణ్ మంగళవారం ఉరి వేసుకుని మృతి చెందిన ఘటనలపై అనుమానాలున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు మున్నా, జీవన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి:బీజేవైఎం ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయమని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన డిచ్పల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు పాఠశాల ప్రిన్సిపాల్, కొంతమంది ఉపాధ్యాయుల మానసిక ఒత్తిడి కారణమని తోటి విద్యార్థులు వెల్లడించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. బీజేవైఎం ప్రధాన కార్యదర్శి అమంద్ విజయ్ కృష్ణ పాల్గొన్నారు. బాధ్యులను శిక్షించాలి: ఎస్ఎఫ్ఐ ఖలీల్వాడి: ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి అనుమానాలున్నాయని, బాధ్యులు శిక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేష్ అన్నారు.ఈమేరకు బుధవారం విఘ్నేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడుతాం: ఏబీవీపీ ఖలీల్వాడి: ఇందల్వాయి ఏకలవ్య గురుకుల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ అమృతచారి ఆన్నారు. బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్, జిల్లా హాస్టల్ కన్వీనర్ సమీర్, విద్యార్థి నాయకులు అశోక్, శివ, లెనిన్, కార్తీక్, నితిన్ పాల్గొన్నారు. -
స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలి
నిజామాబాద్ అర్బన్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ విజయవంతానికి కృషి చేయాలని, ఐదు దశల్లో నిర్వహించనున్న కార్యక్రమాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఐదు దశల్లో చేపట్టనున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఈనెల 6న జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికపై సన్నాహక సమావేశం ఉంటుందని, అన్ని శాఖల అధికారులు సమగ్ర వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్కుమార్, దిలీప్కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విజయవంతానికి కృషి చేయండి 6న ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం సమీక్షా సమావేశంలో అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఏకలవ్య సిబ్బందిపై వేటు
● విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్ ● ప్రిన్సిపాల్తోపాటు నలుగురి సస్పెన్షన్ డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ఇందల్వాయి మండలం మాక్లూర్ తండాలోని ఏకలవ్య ఆదర్శ గురుకులం విద్యార్థి ఆత్మహత్యఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ఆర్సీవో గంగారాం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల ఏకలవ్య గురుకులాల ప్రిన్సిపాల్లు శ్రీనివాస్స్వామి, డాక్టర్ సైదా జైనబ్, ఫణికుమార్, డాక్టర్ జ్యోతి ప్రాథమిక విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. వారి నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్ రమేశ్కుమార్, హౌజ్ మాస్టర్ కుల్దీప్యాదవ్, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇన్చార్జి ఆకాశ్యాదవ్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ త్రిపాఠి బుధవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి తొమ్మిదో తరగతి విద్యార్థి రామ్చరణ్ ఆత్మహత్య ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రామ్చరణ్ బలవన్మరణానికి పాల్పడడం ఎంతో బాధ కలిగించిందని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్ సొంతమవుతుందన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చవద్దని సూచించారు. ఆత్మహత్య ఆలోచనలు దరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్సీవో గంగారాం నాయక్ తదితరులు ఉన్నారు. -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
● చెరువుల్లో పడి ఇద్దరు.. ● రోడ్డు ప్రమాదాల్లో మరో ఇద్దరు ధర్మారెడ్డిలో వివాహిత.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారెడ్డిలో ఓ వివాహిత కలకృత్యాలు తీర్చుకునేందుకు ఊరచెరువుకు వెళ్లి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందింది. వివరాలు ఇలా.. ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు పోచమ్మ(46) అనే వివాహిత సోమవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామశివారులోని ఊరచెరువుకు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త నారాయణ, గ్రామస్తులతో కలిసి మంగళవారం గ్రామశివారులోని ఊరచెరువులో గాలించారు. దీంతో పోచమ్మ మృతదేహం చెరువులో లభ్యమయింది. కాగా పోచమ్మ గత ఆరునెలలుగా పక్షపాతానికి గురై ఒక కాలు, ఒక చేయి పనిచేయక అనారోగ్యంతో బాధపడుతుందని ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బైక్ అదుపుతప్పడంతో.. నవీపేట: మండలంలోని నాగేపూర్ గ్రామ శివారు లోని బాసర రహదారి మూల మలుపు సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీ వ్రంగా గాయపడ్డారని ఎ స్సై శ్రీకాంత్ తెలిపారు. వివరాలు ఇలా.. మహారాష్ట్రలో ని నాందేడ్ జిల్లా బోకర్ తా లూక పరిధిలోని హనుమాన్ నగర్కు చెందిన సుదో ధన్(22) నాలుగు నెలల నుంచి నిర్మల్ జిల్లా దిలా వర్ పూర్లో నివాసం ఉంటున్నారు. సుదోధన్ సో దరి శివాని నవీపేటలో ఉండడంతో సోమవారం స్నేహితుడు సతీష్ వాగ్మారేతో కలిసి బైక్పై నవీపేటకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బైక్పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి నాగేపూర్ శివారులోని రహదారి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్ నడుతుపున్న సతీష్తో పాటు సుదోధన్ కింద కిందపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఇరువురిని జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుదోధన్ మంగళవారం ఉదయం చికిత్స పొందు తూ మృతి చెందాడు. సతీష్ వాగ్మారే చికిత్స పొందుతున్నాడు. మృతుడి తండ్రి మనోహర్ తేజారావ్ సోన్ కాంబ్లే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.కోమట్పల్లిలో యువకుడు.. లింగంపేట(ఎల్లారెడ్డి) : మండలంలోని కోమట్పల్లి గ్రామంలో మతి స్థిమితం లేని ఓ యువకు డు చెరువులో పడి మృతిచెందాడు. వివరాలు ఇ లా.. కోమట్పల్లి గ్రామానికి చెందిన ధరణి బా లమల్లు–సాయవ్వల కుమారుడు నవీన్(18) మతి స్థిమితం కోల్పోయి ఇంటి వద్దనే ఉంటున్నాడు. తండ్రి బాలమల్లు 11 సంవత్సరాల క్రి తం కరెంటు షాక్తో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి సాయవ్వ కుమారుడిని పోషించు కుంటూ జీవనం కొనసాగిస్తుంది. సోమవారం సాయవ్వ కామారెడ్డికి వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఇంట్లో కుమారుడు లేకపోవడంతో ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా అతడు కనిపించలేడు. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని ఊర చెరువు కట్టపై కుమారుడి చెప్పులు కనిపించడంతో చెరువులో గాలించారు. కొద్దిసేపటికీ నవీన్ మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మతి స్థిమితం కోల్పోయి చెరువులో కాలుజారి పడి మృతి చెందినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. తల్లి సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పలు ఘటనల్లో నలుగురు మృతిచెందారు. వారిలో ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువుల్లో పడి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు. భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక్రూ మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన గడ్డమీది చంద్రం (43) స్థానిక దాభా హోటల్లో వంటమనిషిగా పనిచేస్తు జీవిస్తున్నాడు. సోమవారం రాత్రి వ్యక్తిగత పనుల నిమిత్తం చంద్రం బస్వాపూర్ గ్రామానికి వెళ్లాడు. తిరిగి భిక్కనూరు వచ్చేందుకు బస్వాపూర్ శివారులో రోడ్డు దాటుతుండగా కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటెయినర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
తీవ్ర జాప్యం.. యువతలో నైరాశ్యం
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీయువకులకు స్వయం ఉపాధిని కల్పించడానికి ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈపథకం ద్వారా యువతకు రాయితీ రుణాలను అందించడమే లక్ష్యంగా దరఖాస్తులను సైతం స్వీకరించింది. కానీ నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రుణాలను అందించకపోవడంతో దరఖాస్తులు చేసుకున్న యువతలో నైరాశ్యం నెలకొంది. జిల్లాలో 58వేలకు పైగా దరఖాస్తులు.. గత ప్రభుత్వాలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాల యువతకు రాయితీపై రుణాలను పంపిణీ చేసేవారు. సామాజిక వర్గాల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా రాయితీని లబ్ధిదారులు పొందేవారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు, బీసీబంధు పథకాల పేరిట కొంత మందికే లబ్ధి చేకూర్చి ముఖం చాటేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేషన్లను అన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకవచ్చి ‘రాజీవ్ యువ వికాసం’ కార్యక్రమం కింద రాయితీ రుణాలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో భాగంగా జిల్లాలో సుమారు 58వేల మంది తొమ్మిది నెలల కింద దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఏ ఒక్క దరఖాస్తుకు కూడా రుణం పంపిణీ చేయలేదు. రాజీవ్ యువ వికాసం పేరిట అన్ని కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాల నిరుద్యోగులకు రుణాలు అందించి వారి స్వయం ఉపాధికి బాటలు వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆచరణలో మాత్రం విఫలం కావడంతో యువతకు నిరాశే మిగిలింది. దీంతో రాయితీ రుణాల పంపిణీ లక్ష్యంకు ప్రభుత్వం గండికొడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న రుణాలకు వంద శాతం రాయితీ.. రాజీవ్ యువ వికాసం కార్యక్రమంలో భాగంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.50వేల వరకూ రుణ సదుపాయం కల్పిస్తే వంద శాతం రాయితీని ప్రకటించారు. రూ.లక్ష వరకు రుణం పొందితే 90 శాతం రాయితీ, రూ.2లక్షల వరకు రుణం పొందితే రూ.80శాతం రాయితీని రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణం పొందినవారికి 70 శాతం రాయితీని అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కువ మంది రూ.4లక్షల వరకు రుణాలు పొందాలని దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకులు కూడా సమ్మతించినా ప్రభుత్వం రాయితీ నిధులను విడుదల చేయకపోవడంతో బ్యాంకర్లు ఏమీ చేయలేకపోయారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా యువతీయువకులకు రాయితీ రుణాలు అందిస్తామని అప్పట్లో ప్రకటించగా ఇప్పటి వరకూ ఊసెత్తేవారు కరువయ్యారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రాయితీ రుణాలను పంపిణి చేసే విషయంలో పునరాలోచన చేసి పథకాలను పునరుద్దరించాలని పలువురు కోరుతున్నారు. యువతకు ఉపాధిని కల్పించడానికి, రాయితీ రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. కానీ ఆ దరఖాస్తులను చెత్తబుట్ట దాఖలు చేయడం ఎంత వరకూ సమంజసం. ప్రభుత్వం స్పందించి నిరుద్యోగులకు రుణాల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలి. – ఉమేష్, ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు, మోర్తాడ్ స్వయం ఉపాధి కోసం ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం భారీగా దరఖాస్తు చేసిన నిరుద్యోగులు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రాని రాయితీ రుణాలు -
అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్
● జైలులో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు ● నిందితులపై పాత కేసులు ● వివరాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్య నిజామాబాద్అర్బన్: ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, కాపర్ కాయిల్స్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకొని అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ నగరంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముఠాలో మొత్తం 10 మంది ఉన్నారు. ఏడుగురిని అరెస్టు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితులు గత మూడు నెలలుగా నిజామాబాద్ జిల్లాలోని నవీపేట, నందిపేట, బోధన్ ఎడపల్లి, ప్రాంతాలతో పాటు నిర్మల్ జిల్లా బాసర, ముధోల్, తానూరు, బైంసా, కుంటాల, నర్సాపూర్ జి మండలాలలో ట్రాన్స్ఫార్మర్ల రాగి తీగలను దొంగతనం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడు నిజామాబాద్లోని ఆటోనగర్కు చెందిన అఫ్జల్ ఖాన్ను, ముఠా సభ్యులు రెంజల్కు చెందిన సిద్ధిఖాన్, ధర్మపురి హిల్స్కు చెందిన అర్వాజ్ ఖాన్, భైంసాకు చెందిన మెహబూబ్ ఖాన్, అర్సపల్లికి చెందిన బోర్గే బాలాజీ, నాందేడ్కు చెందిన ఆరిఫ్, వెంగళరావు కాలనీకి చెందిన మహమ్మద్ రాజాలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రెంజల్కు చెందిన హుస్సేన్ ఖాన్, జిల్లా కేంద్రంలోని సాగర్హిల్స్కు చెందిన షేక్ తహేర్, భైంసాకు చెందిన మహమ్మద్ అప్సర్ పరారీలో ఉన్నారు. నిందితుల్లో కొందరు గతంలో ఆవుల దొంగతనం, బైకుల చోరీ కేసుల్లో జైలుకు వెళ్లగా, అక్కడ పరిచయమై, ముఠాగా ఏర్పడ్డారు. పగలు రెక్కి నిర్వహించి రాత్రికి బైకులపై వచ్చి దొంగతనానికి పాల్పడుతున్నారు. 34 చోట్ల సుమారు 8 నుంచి 10 క్వింటాళ్ల రాగి తీగలను చోరీ చేసి, నిజామాబాదులోని ఏపీహెచ్బీ కాలనీలో ఒక రూమును అద్దెకు తీసుకొని దాచిపెట్టేవారు. అక్కడ నుంచి సమయానుకూలంగా కిలోకి రూ. 800 చొప్పున విక్రయించేవారు. వచ్చిన డబ్బులతో జల్సాలకు పాల్పడేవారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గ్యాంగ్ను పట్టుకున్నట్లు సీపీ సాయి చైతన్య వివరించారు. నిందితుల నుంచి 20 క్వింటాళ్ల కాపర్ కాయిల్స్, రూ.2,75,000 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, చోరీకి వినియోగించే పనిముట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ ప్రకాష్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట ఎస్సై శ్రీకాంత్, యాదగిరి గౌడ్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, ఐదో టౌన్ ఎస్సై గంగాధర్, ఏఎస్ఐ గఫార్ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, రాజారెడ్డి, సందీప్, అబ్బులు, శ్రీకాంత్ గౌడ్, నాగరాజ్ శంకర్, సాయిలు, రామకృష్ణ, సచిన్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్టు
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ముస్తాయిద్పుర కాలనీలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ శాఖ ఎస్హెచ్వో స్వప్న మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా.. ముస్తాయిద్ పురకు చెందిన షేక్ అబ్దుల్ కై సర్ అనే వ్యక్తి తన ఇంటిలో గంజాయి కలిగి ఉండి విక్రయిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు నిందితుడి ఇంటిపై దాడి చేయగా, 1.6 కిలోల గంజాయి లభించిందన్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. వేల్పూర్ మండలంలో.. వేల్పూర్: వేల్పూర్ క్రాస్రోడ్డు 63 నంబరు జాతీయ రహదారిపై మంగళవారం గంజాయిని సరఫరా చేయడానికి వచ్చిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు వేల్పూర్ క్రాస్రోడ్డు వద్ద నిఘా ఉంచగా భీమ్గల్కు చెందిన శ్రీరామ్ అఖిల్, సయ్యద్ సోహైల్, నాందేడ్కు చెందిన షేక్ అర్బాజ్, నాందేడ్కు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశామన్నారు. వారి వద్ద 47 గ్రాముల చరస్(గంజాయి పదార్థం), 29 గ్రాముల ఎండు గంజాయి లభించినట్లు వెల్లడించారు. వీరంతా వేల్పూర్ మండలంలోని ఒక వ్యక్తికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిసి, నిఘా ఉంచగా పట్టుబడ్డట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి ఒక ద్విచక్రవాహనం, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. డిచ్పల్లి(ఇందల్వాయి): పోలీసుల విధులకు అడ్డంకి కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపారు. వివరాలు ఇలా.. ఇందల్వాయి పోలీస్ స్టేషన్కు సంబంధించి సోమవారం రాత్రి విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు పోతుల ప్రతాప్, తిరుపతిలకు అర్ధరాత్రి మెగ్యానాయక్ తండాలో గొడవ జరుగుతున్నట్లు డయల్ 100 ద్వారా సమాచారం అందింది. వెంటనే వారు తండాకు చేరుకుని పరిశీలించగా లకావత్ నరేష్, లకావత్ బంతిలాల్, దెగావత్ పీర్సింగ్ అలియాస్ చందు మద్యం మత్తులో గొడవ పడుతూ అల్లర్లు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించగా పోలీసులను దూషిస్తూ విధినిర్వహణకు అడ్డంకి కలిగించారు. కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. నిజామాబాద్అర్బన్: గ్రామస్తులను బెదిరింపులకు గురిచేస్తు న్న కానిస్టేబుల్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని నందిపే ట మండలం లక్కంపల్లి సర్పంచ్ సంతోష్గౌడు మంగళవా రం సీపీ సాయి చైతన్యకు ఫిర్యాదు చేశారు. హోలీ రోజున కామదహనాన్ని డప్పులతో ర్యా లీగా తీసుకురాలేదని గ్రామ కమిటీతో తనపై రూ.5000 జరిమానా వేయించారన్నారు. అ లాగే గ్రామంలో తరచు అనేక వివాదాలు సృష్టించడం గొడ వలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాడని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థాని క సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయా ల్లో పా ల్గొంటూ గొడవలకు కారణం అవుతున్నాడని పేర్కొన్నారు. వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపిచర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కొరియర్ సిబ్బందిపై.. నిజామాబాద్అర్బన్: కొరియర్ సిబ్బంది తన వస్తువులను మాయం చేశాడని వెంకటరమణ అనే వ్యక్తి మంగళవారం రెండవ టౌన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. ఇటీవల ఓ ప్రయివేట్ కొరియర్ ద్వారా తాను పార్సిల్ పంపానని, అందులో నాలుగు ట్యాబ్లు ప్యాకింగ్ చేసి కొరియర్ యజమానికి అందజేశానన్నారు. అయితే పా ర్సిల్ చేరాల్సిన స్థలానికి వెళ్లలేదన్నారు. తాము విచారిస్తే స దరు కొరియర్ సిబ్బంది తన పార్సిళ్లను మాయం చేసినట్లు తెలిసిందన్నారు. హైదరాబాద్లోని సదరు కొరియర్ బ్రాంచ్ ను సంప్రదించగా సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై వివాదం
రెంజల్: ఓ ప్రజాప్రతినిధి తన సొంత పొలానికి విద్యుత్ లైన్ను వేసుకునేందుకు యత్నించగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా.. మండలంలోని కళ్యాపూర్ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధికి గ్రామంలోని శ్మశాన వాటిక పక్కన పట్టా భూమి ఉంది. పొలంలో విద్యుత్ కనెక్షన్ కోసం ఇటీవల విద్యుత్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోగా, ఎస్టిమేషన్ వేసి అందుకు అవసరమైన నిధులు డీడీ రూపంలో చెల్లించాలని ట్రాన్స్కో వారు సూచించారు. కానీ సదరు ప్రజాప్రతినిధి ఇవేమి పట్టించుకోకుండా సోమవారం గ్రామ చెరువు సమీపంలో వృథాగా ఉన్న 6 విద్యుత్ స్తంభాలను తీసుకొని తన పొలం పక్కన ఉన్న శ్మశాన వాటిక దగ్గర పాతించారు. విషయం తెలుసుకున్న స్థానికులు ట్రాన్స్కో అధికారులకు సమాచారం అందించారు. అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో అతడు వాటిని యథాస్థానంలో పెట్టాడు. మళ్లీ మంగళవారం విద్యుత్ స్తంభాలను తిరిగి శ్మశానవాటిక దగ్గర పాతించారు. ఈ విషయమై ఇన్చార్జి లైన్మన్ విచారణ చేశారు. సమస్యను తమ ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఆయన తెలిపారు. తదుపరి చర్యలు వారు తీసుకుంటారని ఇన్చార్జి ఏఈ కిశోర్ వివరించారు. శ్మశాన వాటికకు కరెంట్ లేకపోవడంతో గతంలో పలువురు ప్రమాదాలకు గురయ్యారు. స్థానికుల సూచన మేరకు చెరువు కట్ట వద్ద నిరుపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తీసుకొచ్చి పాతించాను. ఇందులో ఎలాంటి దురుద్దేశంలేదు. కావాలనే కొందరు తనపై కక్ష పెంచుకుని రాద్ధాంతం చేస్తున్నారు. – భానుచందర్, సర్పంచ్, కళ్యాపూర్ 15 ఏళ్ల క్రితం గ్రామంలోని చెరువు కట్ట పక్కన విద్యుత్ అధికారులు స్తంభాలను ఏర్పాటు చేశారు. అధికారులకు సమాచారం లేకుండా సర్పంచ్ 6 స్తంభాలతోపాటు విద్యుత్ తీగలను తీసుకుని శ్మశాన వాటిక పేరుతో తన సొంత పొలం వద్దకు తీసుకెళ్తున్నాడు. ట్రాన్స్కో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – కాశం సాయిలు, వీడీసీ చైర్మన్ కళ్యాపూర్లో సొంత పొలానికి విద్యుత్ లైన్ తీసుకునేందుకు ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నం! అడ్డుకున్న గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ట్రాన్స్కో అధికారులు -
హోలీ.. ఆనందకేళి
● అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో ఘనంగా వేడుకలు ● నృత్యాలు చేసిన యువకులు, చిన్నారులుసుభాష్నగర్/ డిచ్పల్లి/ నిజామాబాద్ రూరల్/ సిరికొండ/ జక్రాన్పల్లి: ఇందూరులో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎక్కడ చూసినా రంగులు చల్లుకుంటూ చిన్నా, పెద్దా సందడి చేశారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. దీంతో వీధులన్నీ రంగులమయంగా మారాయి. సోమవారం రాత్రి కామదహన కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో ప్రజలు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకున్నారు. యువత, చిన్నారులు, మహిళలు రంగులు పూసుకుని.. నృత్యాలతో హోరెత్తించారు. ఆర్ఎస్ఎస్ ఇందూరు నగర స్వయంసేవకులు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకొన్నారు. నగరంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ప్రార్థన చేసిన అనంతరం నగరంలోని జేష్ఠ కార్యకర్తల ఇంటికి వెళ్లి సహజ రంగులతో వారికి వారి కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న పద్ధతిని ఈ ఏడాది కూడా కొనసాగించినట్లు నగర కార్యవాహ అర్గుల సత్యం తెలిపారు. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు హోలీ వేడుకలను జరుపుకొన్నారు. మండల కేంద్రంలోని బంజారా భవన్ వద్ద బంజారా నాయకులు హోలీ వేడుకలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి స్వగ్రామమైన ముల్లంగి(ఐ)లో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు గడ్కోల్, కొండూర్ తదితర గ్రామాల్లో హోలీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. రంగుల దుకాణలు ప్రజలతో కిటకిటలాడాయి. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాకతీయ కళాశాలలో నృత్యం చేస్తున్న విద్యార్థిని -
సింగంపల్లిలో కుస్తీ పోటీలు
మోపాల్: మండలంలోని సింగంపల్లిలో హోలీ పండుగను పురస్కరించుకుని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని మద్నూర్, జుక్కల్, బోధన్, బాన్సువాడతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మల్లయోధులు తరలివచ్చారు. పోటీల్లో గెలుపొందిన మల్లయోధుడు ప్రభులాల్కు వీడీసీ ప్రతినిధులు రూ.4100 నగదు బహుమతిని అందజేశారు. అలాగే కుస్తీ పోటీల్లో పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అరికెల సవిత ప్రవీణ్రెడ్డి, ఉపసర్పంచ్ గోర్కంటి విజయ్రావు, వీడీసీ ప్రతినిధులు మేక మోహన్రెడ్డి, గోర్కంటి జయ్, జినిగాల శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
నిజామాబాద్ రూరల్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ అన్నారు. ఒకటో డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో మత్తు పదార్థాలు, రోడ్డు భద్రతపై కాలనీవాసులకు మంగళవారం అవ గాహన కల్పించారు. యువత మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలని అన్నారు. ఎవరైనా మ త్తు పదార్థాలు విక్రయిస్తే పోలీసులకు సమాచా రం అందించాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో కాలనీవాసు లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యాన్ని యాజమాన్యాలు చెల్లించాలని తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు అన్నారు. నగరంలోని శివాజీనగర్లో ఉన్న కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెరిగిన కరువు భత్యాన్ని బీడీ యాజమాన్యాలు ఏప్రిల్ ఒకటి నుంచి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కరువు భత్యాన్ని చెల్లించకుంటే కార్మికులతో కలిసి పోరాటాలు చేస్తామని అన్నారు. సమావేశంలో నాయకులు రాములు, రేణుకా, వనజ, గంగామణి, బీడీ కార్మికులు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ను కలిసిన యువజన నాయకుడు కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణానికి చెందిన యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరెపల్లి నాగేంద్రబాబు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో నాగేంద్రబాబు సతీమణి శ్రీజ 1వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికై ంది. ఈ నేపథ్యంలో టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్కుమార్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డితో కలిసి మంగళవారం హైదరాబాద్లో వారిని కలిసి సత్కరించారు. భీమ్గల్ పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని మహేశ్కుమార్గౌడ్, సుదర్శన్రెడ్డి హామీ ఇచ్చినట్లు నాగేంద్రబాబు తెలిపారు. ట్రంప్ దిష్టిబొమ్మ దహనం బోధన్: ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్ దేశా ల దాడిని ఖండిస్తూ మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ.. ఇరాన్ పై యుద్ధం వెంటనే ఆపాల ని డిమాండ్ చేశారు. పశ్చిమ ఆసియాలో ఆయిల్ పై ఆధిపత్యం కోసమే ఇరాన్పై అమెరికా యుద్ధానికి దిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ దేశ అధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమేనీని క్షిపణులతో దాడి చేసి హత్య చేసిందని పేర్కొన్నారు. ప్రపంచం వాణిజ్యం, రాజకీయ ఆధిపత్యం కోసం అమెరికా చిన్న దేశాలపై దురాక్రమణకు పాల్పడుతుందని ఆరోపించారు. నాయకులు సుల్తాన్ సాయిలు, రవి, పోశెట్టి, హన్మాండ్లు, సుదర్శన్, గంగాధర్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. -
లా పుస్తకాల పంపిణీ
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ బార్ అసోసియేషన్లో నూతనంగా చేరిన న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది తులసీదాస్ అందించిన న్యాయశాస్త్ర పుస్తకాలను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి మంగళవారం అందించారు. జూనియర్ న్యాయవాదులు ఈ పుస్తకాలను చదవాలని, సీనియర్ న్యాయవాదుల వాదనలు విని కోర్టు ప్రొసీడింగ్స్ అర్థం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు పీపీ రాజేశ్వర్రెడ్డి, జీపీ ఆమిదాల సుదర్శన్, జగదీశ్వర్రావు, జే వెంకటేశ్వర్, పిట్లం శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, కార్యదర్శి ఝాన్సీరాణి, శ్రీమాన్, మద్దెపల్లి శంకర్, ఆశనారాయణ, ప్రభాకార్రెడ్డి, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలి
నిజామాబాద్ రూరల్ : ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలని వ్యాసపురి కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మూడ నాగభూషణం గుప్తా అన్నారు. మంగళవారం ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థ ఇందూరు యజ్ఞ సమితి వ్యాసపురి కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నిఖిల్ సాయి హోటల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాహిత్య పురస్కారాలు, అతిథుల సత్కారాలు ఉంటాయన్నారు. తెలుగు సాహిత్య అభిమానులు, కవులు, కళాకారులు, నగర పురప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సభ్యులు దారం గంగాధర్, డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, డాక్టర్ గంట్యాల ప్రసాద్, తొగర్ల సురేశ్, డాక్టర్ మద్దుకూరి సాయిబాబు పాల్గొన్నారు. -
వన్య ప్రాణులపై అవగాహన
సిరికొండ : మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వన్యప్రాణులపై అవగాహన కల్పించారు. సిరికొండ ఎఫ్ఆర్వో నర్సింగ్రావు మాట్లాడుతూ.. అడవులను సంరక్షించడం ద్వారా వన్యప్రాణులను కాపాడవచ్చని తెలిపారు. అడవులు తరగిపోతే వన్యప్రాణుల మనుగడ కష్టమన్నారు. వన్యప్రాణులను జాతీయ సంపదగా భావించి ప్రతి పౌరుడు వాటిని కాపాడాలని తెలిపారు. పై విషయాలను తల్లిదండ్రులకు వివరించాలని విద్యార్థులకు సూచించారు. సమావేశంలో డీఆర్వో గంగారాం, రావుట్ల సెక్షన్ అధికారి లచ్చయ్య, బీట్ అధికారులు, బేస్ క్యాంపు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మధుసూదన్కు సన్మానం
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రానికి చెందిన సా మాజిక సేవాతత్పరుడు మధుసూదన్ దంపతుల ను ఎం–థ్రిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాదూ యుగంధర్ రంగనాథ్ ఆధ్వర్యంలో పలువురు మంగళవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర శా ఖ సభ్యుడు కే రామ్మోహన్రావు, తపాలా శాఖ వి శ్రాంత ఉద్యోగి కేవీ కృష్ణారావు, రైల్వే మెయిల్ స ర్వీస్ ఉద్యోగి అజయ్ పాల్గొన్నారు. చిరంజీవాచార్యులకు.. నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రానికి చెందిన చి రంజీవాచార్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా లో రామలింగేశ్వర ఆలయం సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హరికథగా నం, ద్రౌపది స్వయంవరం వినిపించారు. అనంత రం నిర్వాహకులు చిరంజీవాచార్యులను ఘనంగా సన్మానించారు. -
6 నుంచి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక
నిజామాబాద్అర్బన్: ఈనెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ నిర్వహించనున్నారు. ఐదు దశల్లో 99 రోజులపాటు వివి ధ శాఖలకు సంబంధించి పది ముఖ్యమైన అంశాల వారీగా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. దీనిని ప్రణాళిక శాఖ పర్యవేక్షించనుంది. దీనికోసం ప్రత్యే క యాప్ను రూపొందించారు. మంత్రి ఆధ్వర్యంలో ఈనెల 6న ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్ర ణాళిక’ నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా నుంచి ప్రభుత్వ సుదర్శన్రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరయ్యారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై సీఎం దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాల నిర్వహణ ఇలా.. ఈనెల 6వ తేదీన గ్రామస్థాయిలో గ్రామస భల నిర్వహణ, 16న మండల స్థాయిలో కార్యక్రమాలు, మే 2న నియోజకవర్గస్థాయిలో, 22న జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామస్థా యి నుంచి రాష్ట్రస్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్ అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత.. డ్రగ్స్కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం.. వ్యవసాయం, విద్య, యువత.. క్రీడలు, మహిళలు, పర్యావరణం పది అంశాలతో 99 రోజులపాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఐదు దశల్లో 99 రోజులపాటు కార్యక్రమాలు పర్యవేక్షించనున్న ప్రణాళిక శాఖ మొదటిరోజు ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం -
‘పులి సంచరిస్తే సమాచారమివ్వండి..’
సిరికొండ: పులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సిరికొండ ఫారెస్ట్ రేంజర్ నర్సింగ్రావు మంగళవారం ఒక ప్రకటనలో ప్రజలను కోరారు. జిల్లాలోని సిరికొండ మండలానికి ఆనుకొని ఉన్న కమ్మర్పల్లి రేంజ్లో పెద్దపులి సంచారం ఉన్నందున ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పొలాల వద్ద విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయొద్దని, రాత్రి వేళల్లో అటవీప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. నిజాంసాగర్: పంటలకు సాగునీరందించేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువకు బాన్సువాడ మండల పరిధిలో బుంగపడడంతో పది రోజుల నుంచి సాగు నీరు లేక పొలాలు ఎండుతున్నాయి. బుంగకు మరమ్మతు పనుల నేపథ్యంలో లీకేజీ నీటిని మంజీర నదిలోకి మళ్లించడంతో జలాలు వృథా అవుతున్నాయి. అయితే మహమ్మద్నగర్ మండలం గాలీపూర్ గ్రామ రైతులు ఈ నీటిని తమ పంటలకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం ప్రధాన కాలువలో అడ్డుకట్ట వేసి నీటిని డిస్ట్రిబ్యూటరీకి మళ్లించారు. బుంగ మరమ్మతులు పూర్తయిన తర్వాత ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు సాగు నీటిని విడుదల చేస్తామని నిజాంసాగర్ ప్రాజెక్టు ఈఈ సోలొమన్ తెలిపారు. కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రంలోని శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వైదిక స్మార్త ఆగ మ వేదపాఠశాలలోని 12 మంది విద్యార్థులకు సామూహిక ఉపనయన ఉత్సవం నిర్వహించనున్నారు. ఈనెల 8న దేవునిపల్లి బ్రహ్మంగారి ఆలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ధర్మ పీఠం అధిపతి శీర్లవంచ కృష్ణామాచార్యులు, వేద విద్యార్థులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కలిసి కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానించారు. -
చెత్త పనికి సెంటిమెంట్తో చెక్
● సమస్య పరిష్కారానికి సర్పంచ్ వినూత్న ఆలోచన ● గోడలపై దేవుళ్ల వాల్పెయింటింగ్ మోర్తాడ్(బాల్కొండ): ఇళ్లలోని చెత్తను ఎక్కడపడితే అక్కడ రోడ్లపక్కన పారవేస్తుండడంతో పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. ఎంత అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించకపోవడంతో మెండోరా మండల కేంద్రం సర్పంచ్ బుట్టడి ప్రమోద్కుమార్ వినూత్న ఆలోచన చేశారు. గ్రామంలోని ప్రధాన రోడ్లు, కూడళ్లను పరిశుభ్రం చేయించి అక్కడి గోడలపై దేవుళ్ల చిత్రాలను పెయింట్ వేయించారు. దీంతో అక్కడ చెత్త వేయలేక తమ ఇళ్లలోనే ఉంచి చెత్త సేకరణ వాహనానికి అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్ వినూత్నంగా ఆలోచించి ‘చెత్త పనులకు’ చెక్ పెట్టారని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు వీధుల్లో గోడలపై దేవుళ్ల చిత్రాలతో పెయింటింగ్తోపాటు ‘చెత్త వేయరాదు’ అంటూ అవగాహన కల్పిస్తూ రాయించారు.పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని.. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా, చెత్త సే కరణ వాహనానికి అందించా లి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నాం. వాహనం రావడం లేదని కొందరు చెత్తను వీధుల్లో పారబోస్తున్నారు. దీంతో పరిసరాలు కంపుకొడుతున్నాయి. చెత్తను సేకరించడం కూడా కష్టంగా ఉంది. అందుకే ఇలా ఆలోచన చేశాం. ప్రజలు సహకరిస్తారని ఆశిస్తున్నాం. – బుట్టడి ప్రమోద్కుమార్, సర్పంచ్, మెండోరా -
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ప్రాధాన్యం : కాటిపల్లి నగేష్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు
పార్టీ పదవుల్లో బీసీలకు చెప్పినదానికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. అగ్రనేత రాహుల్గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, సీఎం రేవంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తాం. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ప్రజలతో మరింతగా మమేకమ య్యే లక్ష్యంతోనే తాజాగా శిక్షణ తరగతులను అధినాయకత్వం నిర్వహించింది. ఆ మేరకు తక్షణమే ముందుకు వెళ్లేందుకు కసరత్తులు చేస్తున్నాం. ఇక బీసీలకు 42 శాతం పదవులు ఇస్తామని చెప్పగా, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో 53 శాతం పదవులను పార్టీ కేటాయించింది. చెప్పినదానికంటే ఎక్కువగా ఇచ్చాము. పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాతో ముందుకెళ్లనున్నాం. కీలకమైన పార్టీ పదవుల్లోనూ బీసీలకు 42 శాతానికి మించి ఇస్తాం తప్ప తక్కువ ఏమాత్రం ఇచ్చేది లేదు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చేలా ఆయా నియోజకవర్గాల వారీగా కసరత్తులు చేస్తున్నాం. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతానికి ప్రణాళికలు వేసుకుంటున్నాం. -
దవాఖానా నిర్వహణ ఎలా?
● సామాజిక ఆస్పత్రులకు విడుదల కాని నిధులు ● రెండేళ్లుగా నిలిచిపోయిన వైనం మోర్తాడ్(బాల్కొండ): వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని సామాజిక ఆస్పత్రుల(కమ్యూనిటీ హెల్త్ సెంటర్)కు నిధులు విడుదల కాకపోవడంతో నిర్వ హణ భారమవుతోంది. జిల్లాలో మోర్తాడ్, బాల్కొండ, ధర్పల్లి, డిచ్పల్లి, నవీపేట్, వర్నిలో 30 పడకల, ఆర్మూర్, బోధన్లో వంద పడకల ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. భీమ్గల్లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణ దశలోనే ఉంది. ఒక్కో ఆస్పత్రికి ప్రతి ఏటా రూ.2.50 లక్షల చొప్పున నిధులు కేటాయించేవా రు. రెండేళ్లుగా నిధులు విడుదల కావడంలేదు. ఆస్పత్రికి గతంలో సలహా కమిటీలు కొనసాగాయి. ఆ కమిటీల ఆధ్వర్యంలోనే ని ధులను వినియోగించేవారు. ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కా లం ముగిసిపోవడంతో సలహా కమిటీలు నామమా త్రమయ్యాయి. ఎమ్మెల్యేలు సలహా కమిటీకి బాధ్య త వహించాల్సి ఉంది. నిధులు విడుదల చేయకపోవడంతో కమిటీల పని తీరు అంతంత మాత్రంగానే ఉంది. ఆస్పత్రుల నిర్వహణకు నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు. నిధుల కోసం విన్నవించాం ఆస్పత్రుల నిర్వహణకు నిధులు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం నిధులను విడుదల చేస్తేనే నిర్వహణకు ఇబ్బంది ఉండదు. నిధుల మంజూరు కోసం విన్నవించాం. త్వరలోనే విడుదల కావొచ్చు. – డాక్టర్ వివేక్, కమ్యూనిటీ ఆస్పత్రి వైద్యాధికారి -
ఆడా.. ఈడా ఓటేశారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని 38 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ టికెట్టు కోసం రంగ మాధవితో పాటు ఇప్ప ఉమారాణి ప్రయత్నించారు. అయితే పార్టీ మాధవికి టికెట్టు కేటాయించడంతో ఉమారాణి ఇండిపెండెంట్గా బరిలో నిలిచారు. ఈ పోరులో మాధవిపై మూడు ఓట్ల ఆధిక్యతతో ఉమారాణి గెలిచారు. ఓటమిపై సమీక్ష నిర్వహించగా ఆసక్తికర విషయం తెలిసింది. 40 వ వార్డులో ఓటేసినవారిలో చాలామంది 38 వ వార్డులోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారని, అలాగే రాజంపేట మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన వారు కామారెడ్డి పట్టణంలోని 38 వ వార్డులో ఓటు వేశారని గుర్తించారు. తన ఓటమికి దొంగ ఓట్లే కారణమంటూ మాధవి కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, కొందరు ఓటర్లు రెండు వార్డులలో ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కామారెడ్డిలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ కోర్టులో మంగళవారం పిటిషన్ వేశారు. రెండు వార్డులలో ఓటేసిన వారి వివరాలతోపాటు పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు, మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడంపై పిటిషన్లో వివరించినట్టు సమాచారం. రెండు వార్డులలో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ఓటర్లు కోర్టు మెట్లెక్కిన కామారెడ్డి 38వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికను రద్దు చేయాలంటూ పిటిషన్కామారెడ్డి 38వ వార్డునుంచి పోటీ చేసి మూడు ఓట్ల తేడాతో ఓటమి పాలైన రంగ మాధవి దాఖలు చేసిన పిటిషన్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన లోపాలు, నిబంధనల ఉల్లంఘనను పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేశారు. -
భర్తీకి కసరత్తు
సంస్థాగత పదవుల ● ఏర్పాటు కానున్న డీసీసీ కార్యవర్గం ● ప్రాధాన్య పోస్టులకు పెరుగుతున్న డిమాండ్ ● ఆశలు పెంచుకున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అధికార పార్టీ కాంగ్రెస్లో సంస్థాగత పదవుల కేటాయింపుల్లో భాగంగా జిల్లాలో డీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ నాయకత్వం కసరత్తులు మొదలుపెట్టింది. పరిషత్ ఎన్నికలు మినహా స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో కాంగ్రెస్ పార్టీ వచ్చే రెండు వారాల్లో సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియను షురూ చేయనుంది. అయితే పార్టీ పదవుల్లో ఉండి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినవారికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని పార్టీ అధినాయకత్వం చెబుతోంది. దీంతో ఈ పదవుల కోసం ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, ఆయా నియోజకవర్గాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నాయకులు ఆశలు పెట్టుకున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో పదిరోజుల పాటు నిర్వహించిన జిల్లా అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ డీసీసీ అధ్యక్షులు, కార్యవర్గమే ప్రధానమని చెప్పడంతో మరింత డిమాండ్ పెరిగింది. ఇటీవల డీసీసీ అధ్యక్షుల ఎంపికలోనూ జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలను వన్ టు వన్ అభిప్రాయాలు సేకరించి ఏఐసీసీ ప్రక్రియ నిర్వహించింది. ఈ క్రమంలో పార్టీ పదవులకు తిరుగులేని ప్రాధాన్యత ఉన్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ పదవులకు డిమాండ్ పెరుగుతోంది. పైగా గత ఏడాదిలో యూత్ కాంగ్రెస్ పదవుల విషయంలో పోటాపోటీ నెలకొన్న విషయాన్ని కార్యకర్తలు ప్రస్తావిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలే నిత్యం ప్రజల్లోకి వెళ్లాలని, తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకత్వం చెబుతోంది. అందువల్ల భవిష్యత్తులో ఉన్నత పదవులకు, ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు మంచి ప్రాధాన్యత దక్కుతుందని నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే పార్టీ పదవుల నియామకాల్లో భాగంగా డీసీసీ కార్యవర్గం విస్తరణ చేసేందుకు రంగం సిద్ధం అవుతుండడంతో శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాల మూసివేత
● నేడు శుద్ధి తరువాత తెరుచుకోనున్న ఆలయాలు నిజామాబాద్ రూరల్: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం జిల్లాలోని ఆలయాలను మూసివేశారు. బుధవారం ఉదయం శుద్ధి అనంతరం ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. గ్రహణం మధ్యాహ్నం 3.22 నుంచి సాయంత్రం 6.49 గంటల వరకు కొనసాగింది. ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జపం, ధ్యానం చేస్తూ దైవ చింతనలో గడిపారు. 6.49 గంటల తరువాత ఇళ్లను శుద్ధి చేసుకుని స్నానాల అనంతరం భోజనాలు చేశారు. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వ, శంభులిగేశ్వర, సారంగాపూర్ హనూమాన్ ఆయాలతోపాటు నామ్దేవాడ సాయిబాబా ఆలయం, సంతోషిమాత, వేంకటేశ్వర తదితర ఆలయాలన్నింటినీ మూసి ఉంచారు. -
రంగు పడింది
కాకతీయ బాయ్స్ హాస్టల్లో హోలీ సంబరాల్లో విద్యార్థులు విద్యార్థినికి రంగులు చల్లుతున్న స్నేహితులు... డ్యాన్స్ చేస్తున్న విద్యార్థినిరంగుల కేళీ హోలీ సంబురాలు జిల్లాలో అంబరాన్నంటాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం హోలీ వేడుకలను నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి కామదహనం చేశారు. అర్సపల్లి, గాయత్రినగర్, వినాయక్నగర్, మహాలక్ష్మినగర్ తదితర ప్రాంతాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల హాస్టళ్లలో హోలీని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు డీజేలు ఏర్పాటు చేసుకుని డ్యాన్స్లు చేస్తూ ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. – నిజామాబాద్ రూరల్ -
కమ్మర్పల్లిలో పులి అడుగులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోకి పెద్ద పులి ఎంట్రీ ఇచ్చింది. జిల్లా సరిహద్దుల్లోని జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో సంచరించిన పెద్ద పులి తాజాగా కమ్మర్పల్లి అటవీ రేంజ్లోకి వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించాయి. కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ కోనాపూర్ అడవుల్లో మంగళవారం పెద్ద పులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు జిల్లా అటవీ అధికారి వికాస్మీనా ‘సాక్షి’కి ధ్రువీకరించారు. రెండురోజుల క్రితం వరకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీ ప్రాంతంలో సంచరించిన ఈ మగ పులి తాజాగా నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోకి రావడంతో జిల్లా అటవీ శాఖ అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. రాష్ట్ర అటవీ శాఖకు సమాచారం అందించారు. కమ్మర్పల్లి రేంజ్లో పెద్ద పులి పాద ముద్రలను గుర్తించిన అధికారులు అది ఎటువైపు వెళ్లిందో? అనే విషయమై కచ్చితమైన అంచనాలకు రాలేదు. కమ్మర్పల్లి రేంజ్ అడవుల్లోనే ఉందా? లేక పక్కనే ఉన్న మెట్పల్లి, వేములవాడ, సిరిసిల్ల రేంజ్లకు వెళ్లిందా? అనేదానిపై నిర్ధారణ చేయాల్సి ఉంది. కాగా, సిరికొండ, ఇందల్వాయి రేంజ్ల్లోకి సైతం పులి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అటవీ శాఖ భావిస్తోంది. ఈ మగపులి జోడీ కోసం మహారాష్ట్ర తడోబా నుంచి యాదాద్రి జిల్లాలోకి ప్రవేశించి తిరిగి సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల మీదుగా జగిత్యాల నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించిందని అధికారులు చెబుతున్నారు. -
పండుగ వేళ విషాదం
సుభాష్నగర్/బోధన్/ఆర్మూర్టౌన్/హాలియా: హోలీ వేడుకలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. తెలంగాణ, ఏపీలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందారు. హోలీ సంబరాలను ముగించుకొని నది/చెరువులోకి స్నానాలకని వెళ్లిన వారు మృతి చెందారు. మరో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. విగత జీవులైన పిల్లలను చూసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సూరారంలో... పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీకి చెందిన సాగర్, అజయ్, ఛత్రపతి, కృష్ణనగర్కు చెందిన అభిషేక్, శ్రీరామ్నగర్కు చెందిన విగ్నేష్ స్నేహితులు. వీరు బహదూర్పల్లిలోని తాము చదువుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విశ్వకర్మ కాలనీని ఆనుకొని ఉన్న రామన్ చెరువులో స్నానానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అజయ్, విగ్నేష్, ఛత్రపతి.. షాపులో షాంపూలు కొనితెస్తామని చెప్పగా.. సాగర్, అభిషేక్ చెరువు వద్దకు వెళ్లి లోపలికి దిగారు. అంతలోనే మిగతా ముగ్గురు స్నేహితులు అక్కడికి రాగా ఆ ఇద్దరు చెరువులో మునిగిపోతూ చేతులు ఊపారు. దీంతో బయట ఉన్న ముగ్గురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నీళ్లలోకి దిగారు. అయితే, అక్కడ లోతుగా ఉండటంతో సాగర్, అభిషేక్ మునిగిపోయారు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెదక్ జిల్లా హవేలీ గణపురం మండలం తొగుట గ్రామానికి చెందిన ఏసు, జ్యోతిల కుమారుడు అభిషేక్. విశ్వకర్మ కాలనీకి చెందిన సంతోష్ కుమార్, రేఖ దంపతుల చిన్న కుమారుడు సాగర్. మంజీరలో మునిగి... స్నేహితులతో హోలీ సంబరాలు జరుపుకుని మంజీరనదిలోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ఒకటో వార్డు పరిధిలోని ఆచన్పల్లికి చెందిన సాయికుమార్ (20), రోని చౌదరి (18) మంగళవారం సాలూర సమీపంలోని మంజీర నదికి వెళ్లారు. స్నానాలు చేస్తూ నీటిలో గల్లంతై మృతి చెందారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు నదికి చేరుకుని మృత దేహాలను బయటకు తీయించారు. సాయికుమార్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి పది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. రోని చౌదరి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆర్మూర్లో విషాదం : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో స్థానిక గోల్ బంగ్లా ప్రాంతానికి చెందిన బోగడ నరేష్ పెద్ద కుమారుడు హర్షిత్ (15) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. హర్షిత్ మంగళవారం స్నేహితులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నాడు. అనంతరం గుండ్ల చెరువు వద్ద ఉన్న ట్యాంక్బండ్కు వెళ్లాడు. ఈ క్రమంలో కాలుజారి చెరువులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో హర్షిత్ నీటిలో మునిగిపోయి మరణించాడు. సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు గల్లంతు నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిరసనగండ్ల గ్రామానికి చెందిన కన్నకుంట్ల బబ్లూచారి(17), నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్(14), అదే మండలం శాఖాపురం గ్రామానికి చెందిన పోలేపల్లి నాని స్నేహితులు. వీరు హాలియాలో నివాసముంటున్నారు. బబ్లూచారి బైక్ వాషింగ్ సెంటర్లో పనిచేస్తుండగా.. కార్తీక్ 9వ తరగతి చదువుతున్నాడు. నాని ఆటోలకు రెగ్జిన్ పనిచేస్తున్నాడు. ముగ్గురు కలిసి బిర్యానీ పార్సిల్తో మంగళవారం సాయంత్రం హాలియాలోని అక్విడెక్ట్ వద్దకు వెళ్లారు. బిర్యానీ తిన్న అనంతరం కార్తీక్ చేతులు కడుక్కోవడానికి సాగర్ ఎడమ కాల్వలోకి దిగుతుండగా కాలుజారి అందులో పడిపోయాడు. కార్తీక్ను రక్షించేందుకు బబ్లూచారి కాల్వలోకి దిగుతుండగా.. అతడు కూడా కాలుజారి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. నాని ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పగా.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చీకటిగా ఉండటంతో వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఏపీలో... గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం శివారు కండ్రిగలో ముగ్గురు స్నేహితులు చెరువులోకి దిగి మృతిచెందారు. బోళ్ల సాయి (15), ముచ్చు వెంకట జోసఫ్ (15), దుప్పుల వినయ్కుమార్(12) హోలీ పండుగ జరుపుకొని అనంతరం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. కాలుజారి సాయి, వెంకట జోసఫ్, వినయ్కుమార్ చెరువులో పడి మృతిచెందారు. వీరు గొల్లనపల్లి జెడ్పీ హైసూ్కల్లో చదువుతున్నారు. -
పీఎం రాహత్ స్కీమ్ను వినియోగించుకోవాలి
సుభాష్నగర్: కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న పీఎం రాహత్ స్కీమ్ను యాక్సిడెంట్ బాధితులు వినియోగించుకోవాలని డీఎంహెచ్వో రాజశ్రీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి అన్నారు. నగరంలోని కలెక్టరేట్లో గల ఎన్ఐసీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం పీఎం రాహత్ స్కీమ్పై ఆరోగ్య శ్రీ మిత్రలు, ఆపరేటర్లకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఎం రాహత్ స్కీమ్లో భాగంగా యాక్సిడెంట్ జరిగిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.50లక్షల వరకు లేదా, ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స ఉంటుందని తెలిపారు. ఇందుకు ఆరోగ్యమిత్రల సహకారం ఉండాలని, ఎలాంటి పొరపాట్లు చేయకుండా బాధితులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. ఈదార్ మేనేజర్ వర్షాని హందు మాట్లాడుతూ.. త్వరలోనే జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభం కానుందని తెలిపారు. పోలీస్, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. వర్క్షాప్లో జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి మధు, జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ శశాంక్రెడ్డి, సూపరింటెండెంట్ భాస్కర్, ఆరోగ్యశ్రీ మిత్రలు, ఆపరేటర్లు పాల్గొన్నారు. -
నేలపై సప్తవర్ణాల హరివిల్లు
● జిల్లాలో రంగురంగుల పంటలు పండిస్తున్న రైతులు ● నేడు హోలీ పండుగ ఆర్మూర్: హోలీ పండుగ అంటే కేవలం రంగులు చల్లుకోవడమే కాదు. మానవ జీవితంలో రంగులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మనుషుల భావోద్వేగాలపై, పర్యావరణంపై లోతైన ప్రభావం చూపుతాయి. జిల్లా రైతాంగం వివిధ రంగులలో ఉన్న పంటలను పండిస్తూ ఆకాశంలోని సప్తవర్ణాల హరివిల్లును నేలపై ఉండేలా మారుస్తున్నారు. ● జిల్లాలో ఇందల్వాయి, సిరికొండ, వర్ని, మాక్లూర్ మండలాల్లో సుమారు 86 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. జిల్లాలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంతో పాటు పల్లె గట్లపై వేసవి కాలంలో మోదుగ పూల చెట్టు విరగబూస్తుంది. ఈ పువ్వులతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పువ్వులను నీళ్లలో ఉడకబెట్టి తయారు చేసిన రంగును హోలీ రోజున ప్రత్యేకంగా ఉపయోగిస్తుంటారు. ● అదేవిధంగా విత్తన వ్యాపారానికి కేరాఫ్గా మారిన ఆర్మూర్ ప్రాంతంలో పండించే ఎర్ర జొన్నలు కోతకు వచ్చిన తర్వాత కల్లాల్లో ఆరబెట్టిన ఎర్రజొన్నలతో గ్రామాలు ఎరుపు మయంగా మారుతాయి. ● జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జూన్ నెలలో ప సుప పంట విత్తుకుంటారు. తొమ్మిది నెలల్లో పంట చేతికి వస్తుంది.దీంతో జనవరి, ఫిబ్రవ రి నెలల్లో పసుపు కల్లాలు అమ్మవారిని మరిపించేలా పసుపుమయంగా మారుతాయి. ● జిల్లాలో వరి తరువాత మొక్కజొన్న పంటను విస్తారంగా పండిస్తారు. రోహిణీ కార్తె, వర్షాకాలం, వేసవి కాలాల్లో మూడు పంటలను తీస్తారు. ఈ మొక్కజొన్న పంట కోతలు పూర్తయిన తరువాత రైతుల ఇంటి ముందర పోసిన మక్కల రాసులతో నారింజ (ఆరెంజ్) రంగు శోభితమవుతుంది. ● వరి పంట నారు పో సిన నాటి నుంచి కో తలు పూర్తయ్యే వర కు వేల హెక్టార్లలోని పొలాలు భూమాతకు పచ్చ ని చీర కట్టుకున్నట్లుగా కనువిందు చేస్తుంది. ● ఉమ్మడి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లోని నీరు నీలం రంగును పులుముకొని కనువిందు చేస్తాయి. ● జిల్లాలోని బోధన్, భీమ్గల్ తదితర ప్రాంతాల్లో నల్ల రేగడి నేలలు ఉండటంతో పత్తి పంటను పండిస్తున్నారు. మరో వైపు విత్తన వ్యాపారం అభివృద్ధి చెందిన ఆర్మూర్ ప్రాంతంలో తెల్లజొన్నలను సైతం పండించి ఉత్తర భారత దేశంతో పాటు దేశ విదేశాలకు పశువుల దాణా కోసం ఎగుమతి చేస్తున్నారు. రేపు హున్సాలో పిడిగుద్దులాట బోధన్రూరల్(బోధన్): తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మంజీర తీరంలోగల హున్సా గ్రామం ‘పిడిగుద్దులాట’తో ప్రత్యేకతను చాటుకుంటుంది. దేశంలో ఎక్కడలేని విధంగా దశాబ్ధాల కాలం నుంచి హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట నిర్వహించడం సాలూర మండలంలోని హున్సా గ్రామ ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి ఏటా కామదహనం చేసిన మరుసటి రోజు గ్రామంలో పిడిగుద్దులాట నిర్వహిస్తారు. సోమవారం గ్రామంలో కామదహనం నిర్వహించారు. నేడు (మంగళవారం) సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా రేపు (బుధవారం) పిడిగుద్దులాటను నిర్వహించేందుకు గ్రామపెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండలానే ఆకాంక్షతో కుల, మత, వయోబేధం లేకుండా ఐక్యతతో పిడిగుద్దులాటను ఆడుతూ పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పిడిగుద్దులాట నిర్వహణపై పోలిస్ శాఖ నుంచి అభ్యంతరం వస్తున్నా గ్రామస్తులంతా ఐకమత్యంతో అధికారులను ఒప్పంచి ఆటను ఆడుతున్నారు. గతంలో ఒక ఏడాది పిడిగుద్దులాటను నిలిపివేయగా తమ గ్రామానికి అనేక విధాలుగా నష్టం వాటిల్లిందని అప్పటినుంచి తప్పనిసరిగా ఈ పిడిగుద్దులాటను నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు అంటున్నారు. -
క్రైం కార్నర్
డిచ్పల్లి(ఇందల్వాయి): ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని గంగారాం తండా శివారులోగల 44వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రవిపాఠక్ (38) అనే వ్యక్తి డిచ్పల్లి మండలం బీబీపూర్ తండా శివారులోని బబ్లు యూపీ దాబాలో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి దాబా నుంచి బయలుదేరిన రవిపాఠక్ హైవేపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈక్రమంలో గంగారాం తండా శివారులోని హైవేపై అతడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈఘటనలో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దాబా యజమాని పరమేశ్వర్పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చేపల వేటకు వెళ్లి ఒకరు.. బోధన్: ఎడపల్లి మండలం అంబం గ్రామంలో ఓ వ్యక్తి చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన డప్పు మహేష్ (40) ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేడు. దీంతో అతడి ఎడపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సోమవారం గ్రామంలోని చెరువులో మహేష్ మృతదేహం లభ్యమైంది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడు కాలకృత్యాలకు వెళ్లిన అనంతరం, చెరువులో చేపల వేటకు వెళ్లాడు. నీటిలో వల వేయగా ప్రమాదవశాత్తు వల కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి చనిపోయాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు. బ్రాహ్మణపల్లిలో.. జక్రాన్పల్లి: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఆర్మూర్ పట్టణానికి చెందిన చనమతుల శివ(30) కొంతకాలంగా బ్రాహ్మణపల్లి గ్రామంలోని కానున్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ప్లాస్టిక్ డ్రమ్ములు అమ్ముతూ జీవిస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా అతడు ఫిట్స్ వ్యాధితో బాదపడుతున్నాడు. కాగా ఈ నెల 1న శివ కాలకృత్యాల కోసం పక్కన ఉన్న చెరువు దగ్గరకి వెళ్లగా, అదే సమయంలో ఫిట్స్ రావడంతో చెరువులో పడి, మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రజావాణికి అధికారులందరూ రావాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● ప్రజల నుంచి వినతుల స్వీకరణ నిజామాబాద్అర్బన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో సోమవారం ఆమె అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఇన్చార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో, ప్రజావాణికి హాజరుకాని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. సీబీఎస్సీ పాఠశాల పేరుతో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అడ్మిషన్లు చేపడుతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ నాయకులు అఖిల్ ప్రజావాణిలో ఫిర్యాదు చే శారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద బోర్గాం(కె) గ్రామానికి చెందిన కొందరు గేదెలను కట్టేస్తున్నారని వాటి ని తొలగించడం లేదని గ్రామానికి చెందిన మాల కులస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నగరంలోని కంఠేశ్వర్లోని మహా దేవ్ హైట్స్ భవన నిర్మాణం నిబందనలకు విరద్ధుంగా ఉండడంతో తుమ్మ శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గతంలో సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలను కలెక్టర్కు వివరించా రు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి ము న్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ విచారణ చేయా లని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్టీసీ అధికారులు వేధిస్తున్నారంటూ.. కలెక్టరేట్ వద్దకు సందీప్ అనే వ్యక్తి తన ఆర్టీసీ అద్దె బస్సును తీసుకవచ్చి తనను అధికారులు వేధిస్తున్నారని నిరసన చేపట్టారు. బస్సును ఐదు రోజులు నడపకుండా, డిపోలోనే ఉంచి తనకు ఆర్థికంగా నష్టపరిచారని ఆర్ఎం జ్యోత్స్న, డిపో మేనేజర్ ఆనంద్పై ఫిర్యాదు చేశారు. -
ఎఫ్ఎల్ఎన్ పరీక్షకు ఆన్లైన్ గండం
కమ్మర్పల్లి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మూడో తరగతి విద్యార్థులకు నిర్వహించనున్న ఎఫ్ఎల్ఎన్ ఆన్లైన్ మాక్ పరీక్షకు గండాలు వెంటాడుతున్నాయి. దీంతో సోమవారం (మార్చి 2) నిర్వహించిన ఆన్లైన్ మాక్ టెస్ట్ విఫలమైంది. విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాల కోసం ఎన్సీఈఆర్టీ ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్య శాస్త్రం(ఫౌండేషన్ లిట్రసీ అండ్ న్యూమరసీ–ఎఫ్ఎల్ఎన్)ను 2021–22 నుంచి నిర్వహిస్తోంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా నిపుణ భారత్ కార్యక్రమం కింద మూడో తరగతి విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు తెలుసుకునేందుకు ఎన్సీఈఆర్టీ మార్చి 12, 13న దేశమంతటా సామర్థ్యాల పరీక్ష నిర్వహించనుంది. ఈక్రమంలో రాష్ట్రస్థాయిలో మూడవ తరగతి విద్యార్థులకు 3వ నమునా పరీక్షను మార్చి 2, 4 తేదీలలో ఆన్లైన్లో నిర్వహించాలని రాష్ట్రవిద్యాశాఖ అధికారులు, ఎస్సీఈఆర్టీ అధికారులు నిర్ణయించారు. మూడు నమూనా పరీక్షలు.. జిల్లావ్యాప్తంగా 719 ప్రాథమిక, 127 ప్రాథమికోన్నత పాఠశాలల్లో కలిపి మొత్తం 15600 మంది విద్యార్థులు మూడవ తరగతి చదువుతున్నారు. రాష్టస్థాయిలో ఎస్సీఈఆర్టీ మూడో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఇదివరకు రెండు నమూనా పరీక్షలు ఆఫ్లైన్లో నిర్వహించారు. కానీ మూడో మాక్ టెస్ట్ను ఆన్లైన్ నిర్వహించగా, సాంకేతిక కారణాలతో ఫెయిల్ అయింది. చాలా చోట్ల సైట్ ఓపెన్ కాలేదు. కొందరికి సైట్ ఓపెన్ అయినా పరీక్ష ప్రశ్న పత్రం రాలేదు. దీంతో జిల్లాలో సుమారు 90 శాతం పాఠశాలల్లో 3వ నమూనా పరీక్ష నిర్వహించలేదు. ఎస్సీఈఆర్టీ అధికారుల తొందరపాటు చర్య వల్ల ఆన్లైన్ మాక్ టెస్ట్ విఫలమైందని పలు ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా మూడో మాక్ టెస్ట్ను కూడా ఆఫ్లైన్లోనే నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే ఈనెల 4న జరుగనున్న మరో పరీక్షను సైతం ఆఫ్లైన్లోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్సీఈఆర్టీ నిర్వహించనున్న ఎఫ్ఎల్ఎన్ పరీక్ష కోసం రాష్ట్ర విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ సంయుక్తంగా డిసెంబర్ నుంచి విద్యార్థులను సంసిద్ధులను చేస్తున్నాయి. విద్యార్థులకు ప్రతిరోజు ఒక పీరియడ్లో 45 నిమిషాలు పాఠ్యంశాలు, మిగిలిన 45 నిమిషాలు ఎఫ్ఎల్ఎన్పై తర్పీదు ఇస్తున్నారు. కానీ జిల్లాలో దాదాపుగా 280 పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ఒకరిద్దరూ ఉపాధ్యాయులతో నడుస్తున్నాయి. ఇటువంటి పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ ప్రిపరేషన్లో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకరిద్దరూ ఉన్న బడుల్లో ఎఫ్ఎల్ఎన్ సంసిద్ధతలో తీవ్ర ఇ బ్బందులు ఎదురవుతున్నా యి. ఇతర తరగతుల విద్యా ర్థులను పక్కన పెట్ట వీరికి బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. –వేంకటేశ్వర్గౌడ్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మూడో తరగతి విద్యార్థుల సామర్థ్యాల కోసం ఎఫ్ఎల్ఎన్ పరీక్ష నిర్వహించడం శుభపరిణామం. కానీ ప్రాథమిక స్థాయిలో 5వ తరగతికి కూడా నిర్వహించాలి. 3వ నమూనా పరీక్ష ఆఫ్లైన్లో నిర్వహిస్తే బాగుంటుంది. –ప్రవీణ్కుమార్, ఎస్జీటీ ఎస్సీఈఆర్టీ అధ్వర్యంలో విద్యార్థులకు మాక్టెస్టులు ఇప్పటికే 2 నమూనా పరీక్షలు ఆఫ్లైన్లో పూర్తి 3వ పరీక్షకు సాంకేతిక ఆటంకాలు -
జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు
నిజామాబాద్ అర్బన్: హోలీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ ఇ లా ట్రిపాఠి జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రా గద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆమె ఒక ప్రకటనలో ఆకాంక్షించా రు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుక జరుపుకోవాలని అభిలాషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా పండుగను నిర్వహించుకోవాలన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బీ ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఒక విద్యార్థి పరీక్షకు గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 28 మంది విద్యార్థులకు గానూ 27 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ పరీక్షల్లో ఒకరు డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలు, యూనివర్సిటీ మెయి న్ క్యాంపస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల, భిక్కనూర్ సౌత్క్యాంపస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో పీజీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ, రెగ్యులర్ మొదటి, 7వ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,905 మంది విద్యార్థులకు గానూ 1,798 మంది హాజరు అయ్యారు. 107 మంది గైర్హాజరయ్యారు. ఆర్మూర్లోని పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టీస్కు పాల్పడటంతో డిబార్కు గురయ్యారు. మాచారెడ్డి: కోళ్లకు సాధరణంగా రెండు కాళ్లు మాత్రమే ఉంటాయి. అయితే మాచారెడ్డి మండలం గజ్యనాయక్ తండా చౌరస్తాలోని ఎజాజ్ అనే యువకుడి చికెన్ సెంటర్లో నాలుగు కాళ్ల కోడి ఽసోమవారం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు చికెన్ సెంటర్ వద్దకు భారీగా తరలివచ్చి వింత కోడిని చూశారు. జన్యులోపంతో అప్పుడప్పుడు ఈ విధంగా జరుగుతుందని పలువురు విదావంతులు తెలిపారు. -
గిరిజన ఆవాసాల్లో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు
మోపాల్(నిజామాబాద్రూరల్): దర్తీ అభజాన్ జా తీయ గ్రామీణ ఉత్కర్షఅభియాన్ (డీఏజేజీయూఏ) ద్వారా గిరిజన ఆవాసాల్లో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫా ర్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ వెలుగులు నింపుతున్న ట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు తెలిపారు. మండలంలోని అమ్రాబాద్ గ్రామంలో సో మవారం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, ఎల్టీ లైన్లతోపాటు 13 గిరిజన కుటుంబాలకు విద్యుత్ మీటర్లను సర్పంచ్ ప్రియాంక ప్రేమ్సింగ్తో కలిసి ఎస్ ఈ ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్ఈ మా ట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ సౌకర్యం లేని ప్రతి గిరిజన ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డీఏజేజీయూఏ ప థకాన్ని ప్రవేశపెట్టాయని పేర్కొన్నారు. ఈపథకంలో భాగంగా జిల్లాలో రూ.80 లక్షల వ్యయంతో 80 మంది గిరిజనుల ఇళ్లకు, 380 అంగన్వాడీ కేంద్రా లకు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. కార్యక్ర మంలో డీఈ (కన్స్ట్రక్షన్) వెంకట రమణ, ఏడీఈలు తోట రాజశేఖర్, బాలేశ్ కుమార్, ఏఈ (కన్స్ట్రక్షన్) కాశీనాథ్, ఉపసర్పంచ్ ఏ ప్రకాశ్, విద్యుత్ సిబ్బంది జహీర్ఖాన్, మోహన్, గ్రామస్తులు పాల్గొన్నారు. బోధన్రూరల్: సాలూర మండలం జాడిజమాల్పూర్ గ్రామంలో ఓ వ్యక్తి చెట్టు పైనుంచి పడి గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన సిరిగిరి నాగ్ గొండ (48) ఆదివారం గ్రామంలోని చింత చెట్టు చింతకాయలు తెంపుతుండగా కాలు జారి కిందపడ్డాడు. దీంతో అతడు తీవ్ర గాయాల పాయ్యాడు. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
కామారెడ్డి టౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి అడ్డాగా మారింద ని, ఏఐసీసీకి డబ్బు మూటలు పంపేందుకే ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి తాపత్రయ పడుతున్నారని పేర్కొన్నారు. సోమవారం ఆయన కామారెడ్డిలోని బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఇటీవల బాన్సువాడలో చోటు చేసుకున్న ఘటనలో అరైస్టె జైలు పాలైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి కిరాణా సామగ్రిని అందించి, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజ లపై నిజమైన ప్రేమ ఉంటే హైడ్రా బాధితులను, ఖ మ్మం నిర్వాసితులను, దాడులకు గురైన దేవాలయాలను సందర్శించాలని సవాల్ విసిరారు. బా న్సువాడ ఘటనలో పోలీసుల తీరుపై సంజయ్ మండిపడ్డారు. ఏ పాపం తెలియని వ్యక్తులను, కేవ లం కిరాణా సామగ్రి కొనేందుకు వెళ్లిన వారిని కూ డా వీడియోలో ఉన్నారనే సాకుతో అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. హోం శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నా, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆయనకు సమాచారం అందడం లేదా అని నిలదీశారు. ఎంఐఎం, ఒవైసీ సోదరుల మెప్పు కోసమే 17 మంది అ మాయక హిందువులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. హైడ్రా, ఎఫ్టీఎల్ పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్లను టార్గెట్ చేస్తోందని సంజయ్ ధ్వజమెత్తారు. పేదల ఇళ్ల జోలికి వస్తే, అదే పొక్లెయిన్లతో కాంగ్రెస్ నేతల ఇళ్లను కూలుస్తామని, అప్పుడు శాంతిభద్రతల సమస్య తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక దేవాలయాలపై దాడు లు జరిగాయన్నారు. హిందూ దేవాలయాలపై దా డులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేమని పేర్కొన్నారు. హిందూ సమాజం ఇకనైనా జాగృతం కావా లని పిలుపునిచ్చారు. జెండాలు పక్కన పెట్టి హిందూ ధర్మం కోసం ప్రజలు కాషాయ జెండా పట్టి ఏకం కావాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, నాయకులు పైడి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం మెప్పు కోసమే బాన్సువాడలో అక్రమ అరెస్టులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపణలు బాన్సువాడ ఘటన బాధిత కుటుంబాలకు పరామర్శ -
రెడ్ నోటీసులు!
మొండి బకాయిలపైసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిల వ సూళ్లకు అధికార యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో బకాయిలు రాబట్టేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్ ఆధ్వర్యంలో బల్దియా అధికారులు ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. నగరంలో మొత్తం 89 వేల అసెస్మెంట్లు ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షి యల్ కేటగిరీలు ఉన్నాయి. అన్నింటికీ కలిపి రూ.95 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉంది. డబుల్ అసెస్మెంట్లు, కూల్చేసిన, శిథిల దశలో ఉన్న భవనాలను మినహాయిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.75 కోట్ల ఆస్తి పన్నులు రావాల్సి ఉంది. అయితే ఇందులో ఇప్పటికే రూ.33.5 కోట్లు వసూలు అయ్యాయి. మిగిలిన రూ.41.5 కోట్లు వసూలు చేసేందుకు గాను అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. చెల్లించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా రూ.41.5 కోట్ల బకాయిలలో సుమారు రూ.15 కోట్ల వరకు నలుగురైదుగురు మాత్రమే చెల్లించాల్సి ఉండడం విశేషం. వీటిపై అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. బకాయిల వసూలు కోసం స్పెషల్ డ్రైవ్లో భాగంగా అన్ని జోన్లలో ప్రత్యేకంగా నోడల్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ కమిషనర్లను నియమించారు. అదేవిధంగా 60 వార్డులకు గాను సూపర్వైజర్లు, మరో ముగ్గురు చొప్పున అధికారులను బృందాలుగా ఏర్పాటు చేశారు. డబుల్ అసెస్మెంట్లు, శిథిల, కూల్చేసిన భవనాలను శాసీ్త్రయ విధానంలో క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నారు. డాక్యుమెంట్ వారీగా ఫైల్ను నిర్వహించి వాటిని తొలగించనున్నారు. మిగిలిన వాటికి సంబంధించి వసూళ్లకు కచ్చితమైన ప్రణాళికలను తయారు చేశారు. డిఫాల్టర్లకు వారంరోజుల గడువు 30 వేల మందికి నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం.. ఇప్పటికే 9 వేల మందికి అందించిన కార్పొరేషన్ రావాల్సిన బకాయిలు రూ.41.5 కోట్లు.. నాలుగైదు పెద్ద ప్రాపర్టీల బకాయిలే రూ.15 కోట్లు చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధంబకాయిలకు సంబంధించి 30 వేల మందికి రెడ్ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో ఇప్పటికే 9 వేల మందికి నోటీసులు జారీ చేశారు. మిగిలినవాళ్లకు సైతం జారీ చేసేందుకు యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ముందుకెళుతోంది. ముఖ్యంగా మొండి బకాయిదారులను గుర్తించి ప్రత్యేకంగా జాబితా రూపొందించారు. వీటిలో హోటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లను ప్రత్యేకంగా గుర్తించి రెడ్ నోటీసులు జారీ చేశారు. వీటికి సంబంధించిన పాత బకాయిల ను సైతం ఏడు రోజుల్లో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లను క్షేత్రస్థాయిలోకి పంపుతున్నారు. ఇందూరులో ఆస్తి పన్నుల వసూలుకు నెలాఖరు వరకు స్పెషల్ డ్రైవ్ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు బకాయిల వసూళ్లకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. నలుగురైదుగురు మొండి బకాయిదారులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం. మొత్తం ఇంకా రావాల్సిన 41.5 కోట్లలో ఈ నలుగురైదుగురే రూ.15 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అందరికీ ముందుగానే సమాచారం ఇస్తుండడంతో పాటు రెడ్ నోటీసులు జారీ చేస్తున్నాం. వసూళ్లకు సంబంధించి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాం. ప్రతి రోజూ ఉదయం సంబంధిత బృందాల్లోని అధికారులు నగరపాలక సంస్థ కార్యాలయంలో రిపోర్ట్ చేసి క్షేత్రస్థాయికి వెళ్లాలి. ముందురోజు రాత్రే వసూళ్ల ప్రణాళిక వివరాలను వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసేలా నిర్ణయించాం. బకాయిలు పూర్తిస్థాయిలో వసూలు అయితే నగర అభివృద్ధికి ఉపయోగపడతాయి. – దిలీప్కుమార్, కమిషనర్ -
ఇన్చార్జి అదనపు కలెక్టర్గా దిలీప్కుమార్
సుభాష్నగర్: జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్గా (స్థానిక సంస్థలు) దిలీప్కుమార్ సోమ వారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ అంకిత్ పదోన్నతిపై భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్గా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ను నియమించారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మర్యాద పూర్వకంగా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి పుష్ఫగుచ్ఛం అందజేశారు. దిలీప్ కుమార్ను పలువురు జిల్లా అధికారులు కలిసి పుష్ఫగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నేడు, రేపు మద్యం దుకాణాలు బంద్ నిజామాబాద్ అర్బన్: హోలీ పండుగ నేప థ్యంలో మంగళ, బుధవారాలు రెండు రోజులపాటు కమిషనరేట్ పరిధిలో మద్యం దు కాణాలు బంద్ ఉంటాయని పోలీస్ కమిషన ర్ సాయిచైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా మద్యం దుకాణాలు, కల్లుడిపోలు, బార్లు బంద్ పాటించాలని పేర్కొన్నారు. 5వ తేదీన ఉదయం 10 గంటలకు మద్యం దుకాణాలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. 687 మంది విద్యార్థుల గైర్హాజరు ఖలీల్వాడి: ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సో మవారం ఫస్టియర్ మ్యాథ్స్–1 ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరగగా, 96.8 శాతం విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 21,473 మంది విద్యార్థులకు గాను 20,786 మంది హాజరు కాగా, 687 మంది గైర్హాజరయ్యారని వివరించారు. జిల్లాలోని మొత్తం 58 పరీక్షాల కేంద్రాలకుగాను తాను ఆరు జూనియర్ కళాశాలలను తనిఖీ చేయగా, 56 కేంద్రాలను పరీక్షల అధికారులు పర్యవేక్షించారన్నారు. పోలీస్ ప్రజావాణికి 34 ఫిర్యాదులు నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో 34 ఫి ర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ సా యి చైతన్య ఫిర్యాదులు స్వీకరించారు. ఫి ర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల బాధ్యులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను పోలీసులకు విన్నవించుకోవాలని ఆయన సూచించారు. -
వరద కాలువలోకి రివర్స్ పంపింగ్
● కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేసిన అధికారులు ● రెండు మీటర్ల మేర నీటిని నిలువ ఉంచేందుకు చర్యలు మోర్తాడ్(బాల్కొండ): కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని వరద కాలువకు విడుదల చేస్తున్నారు. యాసంగి పంటలను గట్టెక్కించే ఉద్దేశంతో రివర్స్ పంపింగ్ను సోమవారం ప్రారంభించారు. కాలువలో రెండు మీటర్ల మేర నీరు నిల్వ ఉంచేందుకు నాలుగైదు రోజులపాటు రివర్స్ పంపింగ్ కొనసాగనుంది. గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండికి మరమ్మతులు కొనసాగుతుండగా.. పనులు జరిగే చోటుకు కొద్ది దూరంలో నీటిని నిలువ ఉంచితే ఆయకట్టు భూములకు సాగునీరందుతుందని గతంలోనే రైతులు విన్నవించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పంప్హౌజ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నీటి విడుదలకు ఆటంకం ఏర్పడింది. ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా గండికి మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. పాలెం, మోర్తాడ్, గాండ్లపేట్, తిమ్మాపూర్, కమ్మర్పల్లి, నాగాపూర్, ఉప్లూర్ రైతులకు చెందిన దాదాపు 2,600 ఎకరాల భూములకు సాగునీటిని అందించాల్సి ఉంది. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో ఫోన్లో మాట్లాడి నీటిని విడుదల చేయాలని విన్నవించారు. జనవరిలో ఒక దఫా రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేసినా పూర్తి స్థాయిలో నీరు నిలువ ఉంచలేదు. మరోసారి నీటిని విడుదల చేసి వరద కాలువలో నిలువ ఉంచితే కాలువకు ఇరువైపులా ఉన్న భూములకు సాగునీటి సమస్య తీరుతుందని రైతులు కోరారు. మరోసారి నీటిని విడుదల చేస్తుండడంతో పాలెం శివారు వరకు నీరు నిలువ ఉంచే అవకాశం ఏర్పడింది. యాసంగి సీజన్లో రైతులు వరి, మొక్కజొన్న, నువ్వులు, సజ్జ పంటలను సాగు చేశారు. వరద కాలువలోకి నీరు వచ్చి చేరడంతో పంటలను గట్టెక్కించే అవకాశం ఏర్పడిందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించింది వరద కాలువలో వేసవి ముగిసేవరకు నీటిని నిలువ ఉంచాలని కోరగా ప్రభుత్వం స్పందించింది. నీటిని విడుదల చేయడంతో పంటల సాగుకు ఇబ్బంది తొలగిపోనుంది. యాసంగి సీజన్ పంటలు సాగు చేస్తున్న రైతులకు ఊరట లభించింది. – రొక్కం మురళి, సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్, తిమ్మాపూర్ -
వచ్చిన బస్తాలు వచ్చినట్లుగా..
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో యూరియా విక్రయాలు అసాధారణ స్థితికి చేరాయి. సొసైటీలకు వచ్చిన బస్తాలను వచ్చినట్లుగా రైతులు తీసుకెళ్తుండడంతో గోదాములు వేగంగా ఖాళీ అవుతున్నాయి. జిల్లా కోటా ముగిసిన కూడా రైతులు ఇంకా యూరియా బస్తాలను కొనుగోలు చేయ డం వ్యవసాయాధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎంత స్టాక్ తెప్పించినా సరిపోవడం లే దని తలలు ప ట్టుకుంటున్నారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5లక్షల ఎకరాలకుపైగా వివిధ పంటలు సాగవుతున్నాయి. అత్యధికంగా వరి 4.25లక్షల ఎకరాలు, మొక్కజొన్న 32,754 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాకు 78వేల మెట్రిక్ టన్నుల యూరి యా సరిపోతుందని భావించిన వ్యవసాయశాఖ బ ఫర్ స్టాక్తో కలిపి మొత్తం 82వేల మెట్రిక్ టన్నులు అవసరమని రాష్ట్ర శాఖకు ఇండెంట్ పంపింది. రైతులు వరికి మూడో డోసు యూరియా తీసుకునే సమయంలోనే ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యా ప్ను తీసుకొచ్చింది. అప్పటికే పాత పద్ధతిలో ఒక టి, రెండు డోసుల యూరియాను తీసుకున్న రైతు లు రానున్న రోజుల్లో కొరత రావచ్చనే ఉద్దేశంతో యాప్ ద్వారా మరింత యూరియా కొనుగోలు చేస్తున్నారు. పెద్ద రైతులు ఎక్కువ బస్తాలను తీసుకెళ్లడంతో చిన్న రైతులకు సమయానికి దొరకడం లేదు. ఇప్పటి వరకు 79వేల మెట్రిక్ టన్నుల యూ రియా అమ్ముడుపోగా, సోమవారం మరో వెయ్యి మెట్రిక్ టన్నులు తెప్పించారు. ఇది కూడా సరి పోదని జిల్లాకు మరింత కావాలని వ్యవసాయ శాఖ ఇండెంట్ పంపింది. పోయిన ఏడాది యాసంగిలో 79,615 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దానిని మించి కొనుగోళ్లు జరుగుతాయని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ విధానం కారణంగా కొన్ని చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ లేని రైతులు బుకింగ్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో సొసైటీల ముందు, రోడ్లపై ధర్నా లు చేస్తున్నారు. యాప్ అలవాటైన రైతులు మా త్రం చకచక యూరియాను బుకింగ్ చేసేస్తున్నా రు. స్టాక్ వచ్చిందని తెలియగానే స్టాక్ ఎక్కడ అ యిపోతుందేమోనని పొద్దున్నే సొసైటీ గోదాము ల వద్ద మొబైల్ ఫోన్లతో కుస్తీ పడుతున్నారు. రైతులు అవసరం మేరకే తీసుకోవాలి యాసంగి సీజన్కు అవసరమయ్యే యూరియా కోటా ఇప్పటికే పూర్తయ్యింది. ఇంకా రైతుల నుంచి డిమాండ్ ఉండడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి జిల్లాకు ఎప్పటికప్పుడు యూరియాను తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులు సహకరించి అవసరం మేరకే బస్తాలను తీసుకెళ్లాలి. యాప్ను అందరూ అలవాటు చేసుకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఉండవు. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో అసాధారణంగా యూరియా విక్రయాలు యాసంగిలో ఇప్పటి వరకు 79వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన రైతులు జిల్లా కోటా ముగిసినా.. మరింత తెప్పిస్తున్న వ్యవసాయ శాఖ -
అనారోగ్యానికి దెయ్యాలే కారణమని… ఇంట్లోనే రక్తరంజితం?
ప్రపంచం ప్రస్తుతం ఏఐ యుగంలోకి మారుతున్నా.. మనిషి మాత్రం తన మూఢనమ్మకాలను మాత్రం వీడటం లేదు. దీంతో ఇలాంటి ప్రజలను ఆసరాగా చేసుకొని నకిలీ బాబాలు మోసాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు చేతబడులు, పూజల నెపంతో దాడులకు పాల్పడుతు న్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి.తమ అనారోగ్యానికి కారణం దుష్టశక్తులే అని ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు విన్న ఓ కుటుంబం.. తమలో ఒకరైన వృద్ధురాలిని హత్య (నరబలి) చేశారనే పుకార్లు వ్యాపించాయి. వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయినట్లు చిత్రీకరించారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. ఈ ఘటన గత నెలలో పాల్వంచ గ్రామంలో చోటు చేసుకుంది.నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హొన్నాజీపేట గ్రామా నికి చెందిన దుమ్మల్ల బీరవ్వ ఇంటికి కొద్దిరోజుల క్రితం వాస్తు, అ తీంద్రియ శక్తులు అంటూ వచ్చిన ఓ వ్యక్తి మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని నమ్మించాడు. లంకెబిందెల కారణంగానే కు టుంబంలో అనారోగ్య సమస్యలు, అశాంతి పెరుగుతోందని, వా టిని బయటికి తీయకపోతే మీ ప్రాణాలకు ముప్పు అని భయపెట్టాడు. క్షుద్రపూజలు చేసి లంకె బిందెలు తీస్తానని నమ్మించి రూ. 8.20 లక్షలు వసూలు చేశాడు. బీరవ్వ కుటుంబ సభ్యులు సదరు వ్యక్తికి కామారెడ్డిలో డబ్బులు ముట్టజెప్పారు. ఆ తరువాత అతడు ఫోన్ ఎత్తకపోవడంతో తాము మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజన్నసిరిసిల్లకు చెందిన మోసగాడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన లాస్య అనే మహిళ ఇంటికి దాదాపు నాలుగు నెలల క్రితం భిక్షాటనకు ఓ వ్యక్తి వచ్చాడు. మీ ఇంట్లో అందరూ అనారోగ్య సమస్యలతో బాధపడటానికి ఇంట్లో ఉన్న లంకె బిందెలే కారణమని నమ్మించాడు. వాటిని తీసివ్వడానికి రూ.14 లక్షలు డిమాండ్ చేసి లాస్య వద్ద నుంచి రూ.2.93 లక్షలు తీసుకుని ఉడాయించాడు. సదరు నిందితుడు ఇతర జిల్లాల్లో కూడా మూఢనమ్మకాలను ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.కామారెడ్డి క్రైం: కాలం వేగంగా మారుతున్నా.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నా మూఢ నమ్మకాలను మాత్రం మనిషి వీడటం లేదు. మాయగాళ్లు లంకెబిందెలు, నరబలులు అంటూ సులువుగా బురిడీ కొట్టించి ఉడాయిస్తున్నారు. నరబలులకు సైతం వెనుకాడని అనాగరిక, మూర్ఖపు సంస్కృతి వైపు అడుగులు వేస్తున్న ఘటనలు, మంత్రాల నెపంతో దాడులు వంటి ఘటనలు ఇప్పటికీ అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. అప్పులు, అనారోగ్యం, ఇతర బాధల్లో ఉన్న వారు మూఢనమ్మకాలకు బలవుతున్నారు. దొంగ బాబాలు, స్వామీజీలు, మోసగాళ్ల ఉచ్చులో ఇరుక్కుని లబోదిబోమంటున్నారు. గుప్త నిధులు, లంకె బిందెల మాయలో పడి నిలువు దోపిడీకి గురవుతున్నారు. కామారెడ్డి పోలీసులు ఇటీవల ఓ ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో.. పోలీసు శాఖ కళాబృందం నిత్యం గ్రామాల్లో ప్రదర్శనలు ఇస్తూ మూఢ నమ్మకాలను వీడాలని సూచిస్తున్నా ఫలితం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి సమాజంలో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది. రెండు నెలల క్రితం చిన్నమాల్లారెడ్డి గ్రామానికి వచ్చిన ఓ దొంగ స్వామీజీ గుప్తనిధులంటూ కొందరిని నమ్మించాడు. అతడు ఉండే చోట ఇంటిపని చేయడానికి నియమించిన ఓ మహిళను లోబర్చుకుని మోసం చేసినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విస్తృతంగా అవగాహన కలి్పస్తున్నాం మూఢనమ్మకాలను వీడాలని ప్రజలకు విస్తృతంగా అవగాహన కలి్పస్తున్నాం. మంత్రాలు అంటూ ఎవరైనా భయపెడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మంత్రాలు, అతీంద్రియ శక్తులంటూ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – రాజేశ్చంద్ర, ఎస్పీ, కామారెడ్డి మంత్రాల నెపంతో దాడులు మంత్రాల నెపంతో దాడులకు పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. 2025లో జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు కేసులు న మోదయ్యాయి. గ్రామాల్లో పంచాయతీల కారణంగా చాలా కేసులు వెలుగు చూడటం లేదు. -
జోరందుకున్న ప్లాట్ఫారాల నిర్మాణాలు
వేల్పూర్: వేల్పూర్ క్రాస్రోడ్డు సమీపంలోని పసుపుపార్కులో పసుపు ఆర బెట్టుకునే ప్లాట్ఫారాల ని ర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. సుమా రు పదేళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 63 నంబరు జాతీయ రహదారికి సమీపంలో, పడగల్ రైల్వే స్టేషన్ పక్కన సుమారు 42 ఎకరాల స్థలాన్ని పసుపు పార్కు కోసం కేటాయించింది. చుట్టుపక్కల మండలాల రైతుల నుంచి తీసుకునే పసుపు తో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్ర ణాళికలు రూపొందించారు. కానీ పరిశ్రమలు, వ్యా పారులు ముందుకు రాకపోవడంతో ఎటువంటి కార్యకలాపాలు మొదలు కాలేదు. ఇటీవల రాష్ట్ర ప్ర భుత్వం సుగంధ ద్రవ్యాల బోర్డు ద్వారా రూ.1.38 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో పసుపు పార్కులో మరుగుదొడ్లు, మూత్రశాలలు, 580 మీటర్ల వెడల్పు కొలత గలిగిన నాలుగు ప్లాట్ ఫారాలను నిర్మిస్తున్నారు. తిరిగి నిధులు కేటాయించి, ప్లాట్ ఫారాల నిర్మాణం చేపడుతుండటంతో పసుపు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దశల వారీగా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
క్షణక్షణం.. భయంభయం
నిజామాబాద్అర్బన్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో వలస కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పొట్ట చేతపట్టుకుని వెళ్లిన త మ వారు అక్కడ ఎలా ఉంటున్నారోనని క్షణక్షణం భయపడుతున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటూ గత రెండు రోజులుగా గంటగంటకూ వాట్సా ప్ వీడియో, ఆడియోకాల్స్ చేస్తూ క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. దుబాయి, ఇజ్రాయి ల్, సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్, కువైట్, యూఏఈ తదితర దేశాల్లో జిల్లాకు చెందిన 20వేల మందికిపైగా కార్మికులు, విద్యార్థులు ఉన్నారు. యుద్ధ వాతావరణం నెలకొనడంతో వలసకార్మికుల కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. దుబాయిలో ఉన్నవారు డ్రోన్ దాడుల వీడియోలను ఇక్కడున్న తమ బంధువులకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చేయాలని ఉన్నా ఎయిర్పోర్టులు మూసివేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు వలస కార్మికుల కుటుంబాల్లో ఆందోళన తమవారి క్షేమ సమాచారం కోసం గంటగంటకూ ఫోన్లు మిడిల్ ఈస్ట్లోని పలు దేశాల్లో 20వేల మందికిపైగా జిల్లావాసులు


