Nizamabad
-
అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ఓ వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఏఎస్సై ప్రకాష్నాయక్ తెలిపిన వివరాలు ఇలా.. అయిలాపూర్ గ్రామానికి చెందిన గుడ్డోళ్ల సులోచన(32)కు 2018లో కొర్పోల్ గ్రామానికి చెందిన కుమార్తో వివాహం జరిగింది. వీరికి అభినయ్, దీక్షిత ఇద్దరు పిల్లలు. వీరు బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం హైదరాబాదుకు వెళ్లగా ఇటీవల కొర్పోల్ గ్రామానికి వచ్చారు. ఈక్రమంలో అత్త గంగవ్వ, ఆడపడుచు సాయవ్వ, భర్త కుమార్, బావ రవి, తోటి కోడలు లలిత కలిసి సులోచనను మానసికంగా వేధింపులకు గురిచేసేవారు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పగా పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి సర్దిచెప్పి పంపించారు. అయినప్పటికీ వేధింపులు కొనసాగుతుండటంతో అయిలాపూర్లోని తల్లిగారింటికి వచ్చేసింది. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యాశాఖలో శాస్త్రవేత్తతో ఒకరోజు
నిజామాబాద్అర్బన్: జిల్లా విద్యాశాఖలో ‘శాస్త్రవేత్తతో ఒక రోజు’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు దగ్గరలోని రీసెర్చ్ ల్యాబ్, ప్లానిటోరియం, స్పేస్ సెంటర్, ఐఐటీ వంటి సంస్థలను సందర్శించి అనుభవాలు నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా సైంటిస్ట్ను ఒక రోజు వర్చువల్గా ఇంటర్వ్యూ చేయాలి. క్విజ్ పోటీలు, డిబెట్, పోస్టర్మేకింగ్ తదితర అంశాలు నిర్వహించాలి. 6 నుంచి 9వ తరగతి వరకు మే 5వ తేదీలోగా కార్యక్రమాన్ని నిర్వహించి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ శిక్షణ వారికి వివరాలు పంపించాల్సి ఉంటుంది. ఘనంగా గోటి తలంబ్రాల దీక్ష నిజామాబాద్ రూరల్: శ్రీరామనవమి రోజు న కనులపండువగా జరిగే భద్రాచల రామ య్య కళ్యాణానికి తెలంగాణ నుంచి 250 కిలోల గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్పంతో శ్రీరామకోటి భక్త సమాజం ధార్మి క సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని కోటగల్లి లో ఉన్న జైర్కోట్ హనుమాన్ మందిరంలో మంగళవారం వంద మందికిపైగా భక్తులు రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఒ లిచి సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు కు అందజేశారు. మైసమ్మ, జైర్కోట్, మల్లికార్జున, విజయగణపతి భజన మండళ్ల ఆ ధ్వర్యంలో నాలుగు గంటలపాటు భజన కొ నసాగింది. రామకోటి రామరాజును భక్తులు సన్మానించారు. తాము భద్రాచలం వెళ్లలేకపోయినా.. తమ చేతులతో ఒలిచిన గోటి తలంబ్రాలు వెళ్లడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఇరిగేషన్లో పదోన్నతులు నిజామాబాద్నాగారం: ఇరిగేషన్లో ఎట్టకేలకు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేశారు. ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉండగా, అధికారులు జాప్యం చేస్తున్న వైనాన్ని ఎత్తిచూపుతూ ‘ఇరిగేషన్లో పదోన్నతుల లొల్లి’ శీర్షికన జనవరి 8న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి శాఖ అధికారులు స్పందించారు. పదోన్నతుల ప్రక్రియకు ఎవరు అడ్డుపడుతున్నారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మండిపడినట్లు తెలి సింది. యూనియన్ నాయకులు తమకు సంబంధించిన వ్యక్తులను ఇతర జిల్లాల నుంచి తీసుకువచ్చేందుకు పదోన్నతులకు అడ్డుప డ్డారని ఉద్యోగులు చర్చించుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఐక్యంగా నిరసన తెలిపేందుకు సిద్ధం కా వడంతో ఫైల్ముందుకు కదిలింది. ఎట్టకేల కు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియ ర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. ఆ పోస్టుల సంగతేమిటో? ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతు లు రావడంతో 2పోస్టులు ఖాళీ అయ్యాయి. వాటితోపాటు దఫేదార్(సీనియర్ అటెండ ర్) 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 4 పోస్టులకు సంబంధించి పదోన్నతులను పెండింగ్లోనే ఉంచారు. వీటితోపాటు ఆరు కారుణ్య నియామకాలు చేపట్టాల్సి ఉంది. కొంతమంది ముడుపులు ఇస్తేనే పదోన్నతులు ప్రక్రియను పూర్తి చేస్తున్నారని, లేకుంటే నెలల తరబడి ఆలస్యం చేస్తున్నారని శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. క్యాన్సర్ బాధిత బాలుడికి తోటి విద్యార్థుల చేయూత డొంకేశ్వర్(ఆర్మూర్): లుకేమియా (బ్లడ్ క్యా న్సర్)తో బాధపడుతున్న బాలుడు నిర్విన్ తేజ్ వైద్యం కోసం తొండాకూర్ ఎస్ఎస్వీ పాఠశాల విద్యార్థులు విరాళాలు సేకరించా రు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రు లు, ఉపాధ్యాయులు కూడా విరాళాలు ఇ చ్చారు. మొత్తం రూ.2లక్షల వరకు సమకూరగా, డబ్బులను నిర్విన్ తేజ్ కుటుంబ స భ్యులకు అందజేసినట్లు పాఠశాల కరస్పాండెంట్ చిరంజీవి మంగళవారం తెలిపారు. అదేవిధంగా ఎంఎస్ఆర్ ఫౌండేషన్ తరపున రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందించారు. -
ఇసుక పాయింట్పై టాస్క్ఫోర్స్ దాడి
ఖలీల్వాడి/బోధన్రూరల్: బోధన్ రూరల్ మండలంలోని మందర్నా ఇసుక పాయింట్పై టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య, ఎస్సై గోవింద్, స్పెషల్పార్టీ సిబ్బంది దాడి చేశారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారు సోమవారం అర్ధరాత్రి ఇసుకను తరలిస్తున్న తొమ్మిది టిప్పర్లతోపాటు మూడు పొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్నారు. 12మంది డ్రైవర్లను అదుపులోకి తీసుకుని తదుపరి చర్య నిమిత్తం బోధన్ రూరల్ ఎస్సైకి అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య తెలిపారు. నిబంధనలు పాటించని వ్యాపారులు మందర్నా ఇసుక పాయింట్ నుంచి ప్రభుత్వ పనుల కోసం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కూలీల ద్వారా ట్రాక్టర్లలలో ఇసుకను తరలించడానికి అవకాశం ఉంటుంది. కానీ టిప్పర్లలలో నిబంధనల కంటే అదనంగా 10 టన్నుల వరకు ఇసుకను తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి బోధన్ పరిసర ప్రాంతాల వరకు మాత్రమే ఇసుకను తరలించాల్సి ఉంటుంది. కానీ నిజామాబాద్ వరకు తరలిస్తున్నారు. అధికారులు ఇసుక తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని బోధన్ ప్రజలు కోరుతున్నారు. 9టిప్పర్లు, 3 పొక్లెయిన్లు స్వాధీనం 12మంది అరెస్టు -
టమాట సాగు వైపే మొగ్గు!
బాల్కొండ: వేసవిలో టమాట సాగు ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది సైతం అన్నదాతలు టమాట సాగువైపే మొగ్గు చూపారు. టమాటకు మంచి ధర దక్కుతుందని ఆశతో సాగు చేపట్టారు. గత మూడు సంవత్సరాల క్రితం వేసవి సీజన్లో 25 కిలోల టమాట బాక్స్ ధర రూ.3 వేల వరకు పలికింది. దీంతో ఏదో ఒక సమయంలో ధర వస్తుందనే ఆశతో ఏటా టమాట పంటను సాగు చేస్తున్నారు. స్వల్పకాలిక పంట కావడంతో ప్రస్తుతం పసుపు పంట తవ్విన నేలలో అధికంగా టమాటను సాగు చేశారు. మరో పక్షం రోజుల్లో కాత ప్రారంభమవుతుంది. ప్రస్తుతం టమాట ధర అంతగా లేకున్నప్పటికీ కాత ప్రారంభమయ్యే వరకు ధర పెరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉద్యానశాఖ అధికారులు వివరించాలని రైతులు కోరుతున్నారు. ధర దక్కుతుందని అన్నదాతల ఆశ ప్రతి ఏడాది వేసవిలో పెరుగుతున్న సాగుధర పలుకుతుందని.. ఈ సీజన్లో మంచి ధర వ స్తుందని ఆశతో ఎకరం భూమిలో టమాట సాగు చేశాను. మదనపల్లి టమాట వేసవిలో మన వైపు రాదు. అందుకే ధర ఉంటుందని పంటను సాగు చేశాం. మంచి ధర రావాలని కోరుకుంటున్నాం. – కొత్తపల్లి దేవేందర్, రైతు -
సుదర్శన్రెడ్డి వైపే సీఎం మొగ్గు
మాజీ మంత్రి, బోధన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత పొద్దుటూరి సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే వార్తలు వస్తున్నాయి. పీసీసీ సర్కిళ్లతో పాటు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సుదర్శన్రెడ్డికి కచ్చితంగా బెర్త్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుదర్శన్రెడ్డి అన్నీ తానై జిల్లాలో అన్ని వ్యవహారాలను సమీక్ష చేస్తూ చక్కబెడుతూ వస్తున్నారు. షబ్బీర్అలీ ఎమ్మెల్సీ పదవి, తద్వారా మైనారిటీ కోటాలో కేబినెట్ పదవి ఆశిం నప్పటికీ పార్టీ నాయకత్వం అవకాశం ఇవ్వలేదు. సుదర్శన్రెడ్డిని తన కేబినెట్లోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం గట్టి పట్టుదలతో ఉన్నారు. పార్టీ నాయకత్వం మరో ఆలోచన చేస్తున్నప్పటికీ సీఎం రేవంత్ మాత్రం కచ్చితంగా సుదర్శన్రెడ్డికి బెర్త్ కేటాయించేందుకు అధిష్టానంపై ఒత్తిడి పెడుతున్నారు. దీంతో సుదర్శన్రెడ్డికి బెర్త్ ఖాయమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
ధర్పల్లి: మండలంలోని హోన్నాజిపేట్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ధ్యాప పెద్ద నర్సయ్య (60)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆయన కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణానికి అప్పులు కావడంతోపాటు తన మూడో కుమార్తెకు ఆరోగ్యం బాగాలేక వివాహం కావడంలేదు. దీంతో పెద్ద నర్సయ్య మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కొమరవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ పేర్కొన్నారు. ఇష్టం లేని పెళ్లి చేయడంతో యువతి బాన్సువాడ రూరల్: మండలంలోని కొల్లూర్ గ్రామంలో ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాన్సువాడ సీఐ మండలి అశోక్ తెలిపిన వివరాలు ఇలా.. కొల్లూర్ గ్రామానికి చెందిన వల్లెపు లక్ష్మికి ఫిబ్రవరి 23న అదే గ్రామంలో ఉంటున్న దగ్గరి బంధువైన వెంకటేష్ అనే యువకుడితో వివాహం జరిగింది. కాగా లక్ష్మికి వివాహం ఇష్టంలేక మంగళవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
కేబినెట్లో బెర్త్ ఉత్కంఠ
నిజామాబాద్శిథిలావస్థలో వంతెన సాలూర మండలంలోని ఖాజాపూర్– హున్సా గ్రామాల మధ్య వాగుపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుంది. బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025– 08లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధినాయకత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 15 నెలల కిందట ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటివరకు కేబినెట్లో బెర్త్ లేదు. తాజాగా విస్తరణ సమయంలో రాష్ట్రస్థాయిలో వివిధ సమీకరణాలు ప్రభావితం చేస్తున్నందున జిల్లాకు కేబినెట్లో బెర్త్పై అన్ని వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వచ్చే నెల 3న మంత్రివర్గ విస్తరణ అని వార్తలు వస్తున్నప్పటికీ మళ్లీ ఏమైనా వాయిదా పడుతుందా అనే విషయమై గుబులు కలిగిస్తోంది. జిల్లా నుంచి కేబినెట్ బెర్త్ ఖరారైతేనే తమకు నామినేటెడ్ పదవులు దక్కే విషయంలో కచ్చితమైన ముగింపు వస్తుందని ఆశావహులు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ నిర్మాణాత్మక విషయాల్లో తన మార్క్ చూపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అనూహ్య నిర్ణయాలు ఉంటాయోననే ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఇటీవ ల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వి వరాలను సేకరించినట్లు తెలుస్తోంది. మీనాక్షి న టరాజన్ గత ఎన్నికలకు ముందు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి, జక్రాన్పల్లి మండలాల్లోని సిర్నాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, క లిగోట్, తొర్లికొండ, మండలాల్లో 60 కిలోమీటర్ల మేర రాజీవ్గాంధీ సంఘటన మిషన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేశారు. తరువాత ఆ ర్మూర్ మండలం చేపూర్, బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా వరకు పాదయాత్ర చేశారు. ఆమె ఇటీవల రాష్ట్ర పార్టీ ఇన్చార్జిగా వచ్చాక ఎమ్మెల్యే భూపతిరెడ్డి గురించిన వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన భూపతిరెడ్డి ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు. కేసీఆర్తో విభేదించి మూడేళ్ల కాలపరిమితి ఉన్న ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు. తరువాత కాంగ్రెస్లో పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. బలమైన ప్రత్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను ఢీకొట్టి ఒకసారి ఓడినా పట్టువదలకుండా పార్టీ నిర్మాణం చేసుకుని గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ క్రమంలో మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా ఆరా తీసినట్లు సమాచారం. భూపతిరెడ్డి పేరు సైతం కేబినెట్ బెర్త్ కోసం పరిశీలనలో ఉందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. న్యూస్రీల్భూపతిరెడ్డి వివరాలను సేకరించిన మీనాక్షి నటరాజన్.. 15 నెలల ఉమ్మడి జిల్లా వాసుల నిరీక్షణ ఫలించేనా? రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు వచ్చే నెల 3న ముహూర్తం ఖరారు! సుదర్శన్రెడ్డికి బెర్త్ ఖాయమంటూ సంకేతాలు భూపతిరెడ్డి పేరును పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం -
ధాన్యం సేకరణతో ఆర్థిక ప్రగతి సాధించాలి
నిజామాబాద్ అర్బన్: ధాన్యం సేకరణ ద్వారా మ హిళా సంఘాలు ఆర్థిక ప్రగతి సాధించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 200 పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మ హిళా సంఘాల ప్రతినిధులతో మంగళవారం కలెక్టరేట్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కీలక సూచనలు చేశారు. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రభుత్వ పా ఠశాలలు, వసతి గృహాల విద్యార్థినీవిద్యార్థుల యూనిఫామ్లు కుట్టే బాధ్యతను, ఇందిరమ్మ మ హిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ పంప్లు, సొలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల వంటి సుమారు 14 రకాల పనులను ప్రభుత్వం మహిళ లకు కేటాయిస్తూ, వారి అభ్యున్నతికి ఎంతోగానో కృషి చేస్తోందన్నారు. గత సీజన్లో ఐకేపీ మహిళా సంఘాల ద్వారా జిల్లాలో కేవలం 50 కేంద్రాలు మాత్రమే నిర్వహించామని, ఈ సీజన్లో ఇప్పటికే 110 కేంద్రాల నిర్వహణ కోసం ఎస్హెచ్జీ గ్రూపులను గుర్తించినట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల సంఖ్యను 200 పైగా పెంచాలని, తద్వారా మహిళా సంఘాలు కమీషన్ రూపంలో సుమారు రూ.5 కోట్ల వరకు లాభాలు ఆర్జించగలుగుతాయని అన్నారు. మహిళా సంఘాల ప్రతినిధులకు ధాన్యం సేకరణ, కేంద్రాల నిర్వహణపై సహకార సంఘాల బాధ్యులు, సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో ఎవరైనా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని సుదర్శన్రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించే మహిళా సంఘాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు అందిస్తుందన్నారు. ముఖ్యంగా ధాన్యం రవాణాకోసం లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పెద్ద మొత్తంలో ఆర్థిక పరమైన లావాదేవీలతో ధాన్యం సేకరణ ప్రక్రియ ముడిపడి ఉందని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా రికార్డులను సక్రమంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, సివిల్ సప్లయీస్ డీ ఎం శ్రీకాంత్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, మెప్మా పీడీ రాజేందర్, డీసీవో శ్రీనివాస్, మార్కెటింగ్ ఏడీ గంగవ్వ, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎస్హెచ్జీలకు 200 పైగా కొనుగోలు కేంద్రాలు మహిళా సాధికారతకు ప్రాధాన్యతఇస్తున్న సీఎం రేవంత్ సన్నాహక సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి -
శిథిలావస్థలో వంతెన
● ఖాజాపూర్–హున్సా గ్రామల మధ్య వాగుపై 25 ఏళ్ల క్రితం నిర్మాణం ● అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పగుళ్లు ఏర్పడిన వైనంబోధన్: సాలూర మండలంలోని ఖాజాపూర్– హున్సా గ్రామాల మధ్య ఉన్న వాగుపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుంది. వంతెన పైభాగంలో పగుళ్లు ఏర్పడటంతోపాటు, సైడ్వాల్స్ దెబ్బతినడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. అయినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు మండలాలకు ప్రధాన వారధి.. ఖాజాపూర్–హున్సా గ్రామాల మధ్య గల వాగుపై గతంలో లో–లెవల్ వంతెన ఉండగా 25ఏళ్ల క్రితం హైలెవల్ వంతెనను నిర్మించారు. ఈ వంతెన బోధన్, సాలూర, పోతంగల్, కోటగిరి మండలాలకు మధ్య రాకపోకలకు ప్రధాన వారధిగా ఉంది. పొరుగున ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ముఖ్య పట్టణాలు, గ్రామాల నుంచి సాలూర మండల కేంద్రం నుంచి ఖాజాపూర్ వంతెన మీదుగా ఇతర మండలాలకు వెళ్తుంటారు. పోతంగల్, బీర్కూర్ మండలాల మీదుగా బానువాడ, జుక్కల్ మండలంలోని బిచ్కుంద, మద్నూర్, మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలూకా కేంద్రాలకు ఈ వంతెన పైనుంచి ప్రజలు వ్యక్తిగత పనులు, శుభకార్యాలకు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతోపాటు నిత్యం ఆర్టీసీ బస్సులు, ప్యాసింజర్ ఆటోలు, ద్విచక్రవాహనాలు రవాణా వేలసంఖ్యలో ఉంటుంది. మంజీర నది తీరంలో ఉన్న హున్సా, మందర్న, ఖాజాపూర్ గ్రామాల శివారులోని ఇసుక క్వారీల నుంచి టిప్పర్లు, ఇసుక ట్రాక్టర్ల రవాణా జోరుగానే సాగుతుంది. దీంతో అధిక బరువుల వాహనాల రవాణాతో వంతెన దెబ్బతింటోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి వంతెనకు వెంటనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.అధికారులు పట్టించుకోవాలి.. మా గ్రామం పక్కనే ఉన్న వంతెన కూలిపోయే దశకు వచ్చింది. ఆలస్యం చేయకుండా అధికారులు తాత్కాలికంగానైనా మరమ్మతులు చేపట్టాలి. ఈ వంతెన మీదుగా వాగు అవతలి ఒడ్డున ఉన్న రైతులమంతా పొలాలకు నిత్యం వెళ్తుంటాం. మా గ్రామస్తులకే కాక అనేక గ్రామాల ప్రజల రాకపోకలకు వంతెన ఎంతో సౌకర్యం ఉంది. అధికారులు ఇప్పటికై నా స్పందించాలి. – చిద్రపు రమేష్, ఖాజాపూర్, సాలూర మండలం -
కాలువలో పడి ఒకరి మృతి.. మరొకరు గల్లంతు
బాల్కొండ: మండలంలోని కాకతీయ కాలువలో పడి ఒకరు మృతిచెందగా, మృతుడి ఆచూకీ కోసం వచ్చిన మరో వ్యక్తి అదే కాలువలో పడి గల్లంతయ్యాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలుకకు చెందిన దేశ్ముఖ్ మారుతి(32) కూలీ పనుల కోసం ఇటీవల మెండోరాకు వచ్చాడు. రెండు రోజుల క్రితం మారుతి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కాలువ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. కాలువ వద్ద అతడి చెప్పులు ఆధారంగా మంగళవారం గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెతకడానికి వెళ్లి.. మారుతి గల్లంతయ్యాడని తెలియడంతో వెతుకుట కోసం అదే గ్రామానికి చెందిన హరి లఖోడి రాజారాం, అవినాష్ బైక్పై సోమవారం బయలుదేరారు. వెల్కటూర్ గ్రామ శివారులోని కాకతీయ కాలువ వద్ద వీరి బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వెనుక కూర్చున్న అవినాష్ పక్కకు దూకగా, బైక్పై ఉన్న రాజారాం బైక్తో సహ కాలువలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణ పేర్కొన్నారు. గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అనారోగ్యంతో గన్నారం జీపీ కార్యదర్శి మృతి ఇందల్వాయి: గన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్1) వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందారు. ఇందల్వాయి మండల కేంద్రంలో ఉంటూ గన్నారంలో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు సోమవారం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. మృతుడి స్వస్థలం జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండలం అని తెలిసింది. మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నట్లు సమాచారం. గుండెపోటుతో వివాహిత.. ఆర్మూర్టౌన్: పెర్కిట్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ వివాహితకు ఆపరేషన్ చేస్తుండగా గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వివరాలు ఇలా.. మోర్తాడ్ మండలం ఏర్గట్ల గ్రామానికి చెందిన మార్వాడి మాన్విత(23)కు ఐదేళ్ల క్రితం నందిపేట్ మండలం షాపూర్ గ్రామానికి చెందిన సురేష్తో వివాహం జరిగింది. పిల్లలు పుట్టటం లేదని మాన్వితకు మంగళవారం పెర్కిట్లోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేస్తుండగా గుండెపోటు రావడంతో మృతిచెందింది. భర్త సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ.. ఎల్లారెడ్డి: మెదక్ జిల్లా మాసాయిపేటలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామానికి చెందిన బోదాటి సాయవ్వ (43) అనే మహిళ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సాయవ్వ దంపతులు కొన్ని నెలల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఈక్రమంలో మాసాయిపేటలో కూలి పనులు చేసేందుకు రైలు దిగి రోడ్డు దాటుతున్న సమయంలో సాయవ్వను ఓ ప్రయివేటు బస్సు ఢీకొట్టింది. ఈఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. సాయవ్వ అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన కొట్టాల్లో నిర్వహించినట్లు తెలిపారు. -
ఉన్నట్టా? లేనట్టా?
బియ్యం నిలువలు ● ఏప్రిల్ 1 నుంచి రేషన్కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ ● మిగిలి ఉన్న దొడ్డుబియ్యంపై విజిలెన్స్ ఆరా ● గతంలో డీలర్లకు ఇచ్చిన కోటాలో కొంత మిగిలి ఉన్నట్లు రికార్డుల్లో నమోదు మోర్తాడ్(బాల్కొండ): రేషన్ డీలర్ల వద్ద మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిలువల్లో ఏమైనా తేడా ఉందా? లెక్కలు పక్కాగానే ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టేందుకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగనున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రేషన్కార్డు దారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్న దృష్ట్యా డీలర్ల వద్ద మిగిలిపోయినట్లు రికార్డుల్లో నమోదైన దొడ్డు రకం బియ్యం వాస్తవ నిల్వలను తెలుసుకునేందుకు తనిఖీలను విస్తృతం చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ గోదాముల నుంచి ప్రతి నెలా రేషన్ డీలర్లకు దొడ్డు రకం బియ్యాన్ని చేరవేసేవారు. కొన్ని చోట్ల సకాలంలో వినియోగదారులు బియ్యం తీసుకోకపోవడంతో ఆ బియ్యం మిగిలిపోయింది. కొందరు డీలర్లు మాత్రం నిలువలు ఏమీ లేనట్లు చూపగా మరి కొందరు మాత్రం తమ వద్ద నిలువలు ఉన్నాయని రికార్డుల్లో నమోదు చేశారు. ఇలా జిల్లాలోని వివిధ రేషన్ డీలర్ల వద్ద ఈ రోజు వరకూ 6,680 క్వింటాళ్ల 91 కిలోల బియ్యం నిలువ ఉన్నట్లు తేలింది. ఈనెల 20వ తేదీన బియ్యం పంపిణీ ముగిసిపోయిన తరువాత ఈ–పాస్ యంత్రంలో నమోదైన లెక్కలను పరిగణనలోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు తనిఖీలను విస్తృతం చేయాలని నిర్ణయించారు. అనేక చోట్ల బియ్యం నిలువ ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా వాస్తవానికి బియ్యం నిలువలు లేవని తమకు సమాచారం ఉందని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే డీలర్లకు సమాచారం ఇచ్చిన అధికారులు.. నిల్వ ఉన్న బియ్యాన్ని తాము తనిఖీలకు వచ్చిన సమయంలో పక్కాగా చూపాలని సూచించారు. దొడ్డు రకం బియ్యం పంపిణీ చేస్తే చర్యలు లబ్ధిదారులకు ఎట్టిపరిస్థితుల్లోనూ దొడ్డు బియ్యం పంపిణీ చేయొద్దని డీలర్లకు అధికారులు సూచించారు. మిగులు బియ్యాన్ని ఏమి చేయాలి అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తరువాత వెల్లడిస్తా మని అధికారులు చెబుతున్నారు. రికార్డుల్లో చూపిన విధంగా బియ్యం నిలువలు లేని పక్షంలో డీలర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మిగులు బియ్యం ఉండాల్సిందే రేషన్ డీలర్లు ఎవరైతే తమ వద్ద దొడ్డు బియ్యం మిగిలి ఉందని లెక్కలు చూపారో ఆ బియ్యం షాపుల్లో ఉండాల్సిందే. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. మిగులు దొడ్డు బియ్యాన్ని ఏమి చేయాలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన తరువాత వెల్లడిస్తాం. – అరవింద్రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి -
ముగిసిన గల్ఫ్ మృతుడి అంత్యక్రియలు
మోర్తాడ్: ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన ఈర్గల గంగాధర్(44) ఇటీవల యూఏఈలోని ఆబుదాబిలో ప్రమాదవశాత్తు మృతిచెందగా, మంగళవారం మృతదేహం స్వగ్రామానికి రాగా, అంత్యక్రియలు పూర్తయ్యాయి. గల్ఫ్లో డెలివరీ బాయ్గా పని చేస్తున్న గంగాధర్ శనివారం బైక్పై వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కంపెనీ యాజమాన్యం, గంగాధర్ సన్నిహితులు మృతదేహంను ఇంటికి తరలించడానికి వేగంగా స్పందించడంతో మూడురోజుల్లోనే మృతదేహం స్వగ్రామానికి చేరింది. గ్రామస్తులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై అంత్యక్రియలు నిర్వహించారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఆర్మూర్టౌన్: పట్టణంలోని టీచర్స్ కాలనీలోగల నిజాంసాగర్ కెనాల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ మంగళవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 35–45 ఏళ్ల మధ్యలో ఉంటుందని తెలిపారు. నలుపు రంగు టీషర్ట్, సిమెంటు రంగుల నైట్ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని ఆర్మూర్ ఏరియా ఆస్పత్రిలోని మార్చురిలో ఉంచినట్లు ఎస్హెచ్వో తెలిపారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలుఎల్లారెడ్డిరూరల్: మండలంలోని శివాపూర్ గ్రామ శివారులో సైకిల్ను బైక్ ఢీకొనడంతో ఒకరికి గాయాలైనట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. ఎల్లారెడ్డికి చెందిన గంగారాం శివాపూర్ నుంచి ఎల్లారెడ్డి వైపునకు వస్తుండగా, ఎల్లారెడ్డి వైపు నుంచి శివాపూర్ వైపునకు వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్పై ఉన్న గంగారాంకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటో–కారు ఢీకొనడంతో.. ఎల్లారెడ్డి: మండలంలోని కళ్యాణి గ్రామ శివారులో ఆటో–కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. నిజాంసాగర్ నుంచి ఎల్లారెడ్డి వైపునకు వస్తున్న కారు కల్యాణి ప్రాజెక్టు వద్ద ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నిజాంసాగర్కు చెందిన సునీత, అనిత అనే ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని సమీప ఆస్పత్రికి తరలించగా, సునీతకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్కు రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. కారును బస్సు ఢీకొనడంతో.. ఎడపల్లి(బోధన్): మండలంలోని జాన్కంపేట్ దర్గా వద్ద మంగళవారం కారును నిజామాబాద్ నుంచి బోధన్ వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుకాల నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న లారీకి ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న రవి, అతడి భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈమేరకు ఆర్టీసీ డ్రైవర్ రమేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీచందర్రెడ్డి తెలిపారు. -
న్యాక్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయండి
● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి మోర్తాడ్(బాల్కొండ): నిరుద్యోగ యు వతీయువకులకు స్వయం ఉపాధి కో సం మెరుగైన శిక్షణ ఇవ్వడానికి నిర్దేశించిన న్యాక్ సెంటర్ భవన నిర్మాణం పనులు కొనసాగేలా చూడాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీలో ఆర్అండ్బీ, టూరిజం, దేవాదాయ, క్రీడాశాఖల పద్దులపై జరిగిన చర్చలో ఆయన వివిధ అంశాలను సభ దృష్టికి తీసుకవెళ్లారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఎస్సారెస్పీ నుంచి బాసర వరకూ బోట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆలయాల నిర్మాణం పెండింగ్లో ఉందని వెంటనే బిల్లులు మంజూరి చేయాలని కోరారు. -
సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి
నిజామాబాద్ సిటీ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించాలని సిరిసిల్ల గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ అన్నారు. ఇందుకోసమే ‘జైబాపు–జై భీం–జై సంవిధాన్ అభియాన్’ కార్యక్రమం రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం ‘జైబాపు–జైభీం–జైసంవిధాన్ అభియాన్’ కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానపరిచేలా చేసే చర్యలు, అప్రజాస్వామిక నిర్ణయాలను ప్రజలు వివరించాలన్నారు. తనను నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలకు ఇన్చార్జిగా వేసినందున తన బాధ్యతలను నెరవేరుస్తున్నాన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్హందన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నాయకులు రత్నాకర్, జావేద్ అక్రమ్, సంతోష్, గోపి, రేవతి, అబ్దుల్ ఏజజ్, రామకృష్ణ, చంద్రకళ, ఉష, విజయలక్ష్మి, విజయ్పాల్ రెడ్డి, వినయ్, యెండల కిషన్, జియా, నరేందర్ గౌడ్, లవంగ ప్రమోద్, సంగెం సాయిలు పాల్గొన్నారు. -
భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి
మోపాల్(నిజామాబాద్రూరల్): మనుషులు సదా భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని ఆచార్య గంగోత్రి రామానుజ దాసుస్వామి అన్నారు. లోక కార్యానికి భగవంతుడు మనుషులను ఎంచుకుంటాడని, మనల్ని ఎంచుకునేలా అర్హత సాధించాలని తెలిపారు. మండలంలోని నర్సింగ్పల్లి ‘ఇందూరు తిరుమల’ ఆలయ 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు మంగళవారం యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం, సాయంత్రం పుష్ప యాగం కార్యక్రమం చేపట్టారు. అనంతరం దేవనాథ జీయర్ స్వామి, ఆచార్య గంగోత్రి రామానుజ దాసుస్వామి భక్తులనుద్ధేశించి ప్రవచనాలు చేశారు. కలియుగంలో హరినామమే మోక్ష మార్గమని, ప్రతి క్షణం హరి నామం జపిస్తూ ఉండాలని సూచించారు. ఇందూరు తిరుమల దేవస్థానం ఇలలో మరో వైకుంఠంగా వెలుగొందుతుందన్నారు. వేడుకల్లో సినీ దర్శకుడు అనిల్ రావిపూడి, ఛాయాగ్రాహకుడు సమీర్రెడ్డి, హీరోలు నారాయణమూర్తి, ఆశిష్, ఆలయ ధర్మకర్తలు నర్సింహారెడ్డి, దిల్రాజు, శిరీష్రెడ్డి, విజయసింహారెడ్డి, హరీష్, సుదర్శన్రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. గంగోత్రి రామానుజ దాసుస్వామి వైభవంగా కొనసాగుతున్న ‘ఇందూరు తిరుమల’ బ్రహ్మోత్సవాలు -
హిందూ పుణ్యక్షేత్రాల యాత్ర పథకం తీసుకురావాలి
సుభాష్నగర్: రాష్ట్రంలో హిందూ పుణ్యక్షేత్రాల యాత్ర పథకం తీసుకొచ్చి హజ్ యాత్ర తరహాలో ప్రతి నియోజకవర్గం నుంచి 500 మంది భక్తులకు చార్ధామ్ యాత్రకు ఆర్థికసాయం అందించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపై చర్చలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మంగళవారం సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్రంలో తెలంగాణ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని, తెలంగాణ టూరిజం అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఇందూరు ఖిల్లా రామాలయాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్చేశారు. రాష్ట్రంలో నూతన సాంస్కృతిక పాలసీని తీసుకురావాలని, కళా ప్రదర్శనకు ప్రతి జిల్లాలో మినీ రవీంద్ర భారతిలను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యాశాఖకు కనీసం 15శాతం నిధులు కేటాయించాలన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు పెట్టకుండా చట్టం తీసుకురావాలని సూచించారు. నగరంలోని పాత కలెక్టరేట్, మైదానం కలుపుకుని మినీ స్టేడియం, పాత ఇరిగేషన్ భవనం స్థలంలో ఇండోర్ స్టేడియం నిర్మించాలన్నారు. రాజారామ్ స్టేడియంను పూర్తిస్థాయి క్రికెట్ స్టేడియంగా అభివృద్ధి చేయాలని కోరారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ -
కరెంట్ షాక్తో రైతు మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని రాంపూర్గడ్డ తండాలో కరెంటు షాక్తో ఓ రైతు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వివరాలు ఇలా.. తండాకు చెందిన పిట్ల శ్రీను(30) అనే రైతు సోమవారం సాయంత్రం ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతుల కోసం పోతంగల్ కలాన్ సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకుని పనులు చేపట్టాడు. కానీ ట్రాన్స్ఫార్మర్ నుంచి అతడు కిందికి రాకముందే అధికారులు కరెంటు సరఫరా చేశారు. దీంతో ట్రాన్స్ఫార్మర్పై ఉన్న శ్రీను కరెంట్ షాక్కు గురయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో ఆగ్ర హించిన గ్రామస్తులు మృతదేహాన్ని పోతంగల్ కలాన్ స్టేజి వద్ద ఉంచి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింప జేశారు. మృతదేహాన్ని సమీపంలోని సబ్స్టేషన్ వద్ద ఉంచారు. సబ్స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే రైతు మృతి చెందాడని, ఉన్నతాధికారులు వచ్చేంత వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచుతామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న గ్రామస్తులు సబ్స్టేషన్లోనే మృతదేహాన్ని ఉంచిన వైనం రాంపూర్గడ్డ తండాలో ఘటన -
మరో సత్యాగ్రహ పోరాటానికి సిద్ధం కావాలి
మోర్తాడ్/కమ్మర్పల్లి/డిచ్పల్లి: రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు మరో సత్యాగ్రహ పోరాటానికి సిద్ధం కావాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏర్గట్ల, భీమ్గల్, కమ్మర్పల్లి, డిచ్పల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన సమావేశాల్లో బల్మూరి వెంకట్ పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, జాతిపిత మహాత్మాగాంధీపై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునివ్వడంతో ప్రజలు ఉమ్మడిగా మరో సత్యాగ్రహాన్ని చేయాలన్నారు. ఈమేరకు ఈనెల 27నుంచి గ్రామాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మైనింగ్ కార్పొరేషన్ ౖచైర్మన్ ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల అసోసియేషన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేష్రెడ్డి, నాయకులు అమృతాపూర్ గంగాధర్, పొలసాని శ్రీనివాస్, కంచెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పలు మండలాల్లో జై బాపు, జై భీం, జై సంవిధాన్ సమావేశాల నిర్వహణ -
ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి
నిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తోపాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, మెప్మా పీడీ రాజేందర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. మొత్తం 82 ఫిర్యాదులు రాగా, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ -
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్అర్బన్: నిజామాబాద్ నగర శివా రులోని నాగారం గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ బోధించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సైదా జైనబ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, పీహెచ్డీ, నెట్ లేదా సెట్ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 27 వరకు గురుకులంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. ఇది పూర్తి తాత్కాలిక పద్ధతిలో జరిగే నియామకమని, 28న డెమో ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. పీహెచ్డీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్పోస్టులకు.. బాల్కొండ: మండల కేంద్రంలోని టీఎస్ఎంఎస్ బాలికల హాస్టల్లో హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ భవాని ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 27లోపు హాస్టల్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. హెడ్ కుక్కు కనీస విద్యార్హత ఎస్సెస్సీ, అసిస్టెంట్ కుక్కు ఏడవ తరగతి అర్హత కలిగి ఉండాలన్నారు. స్థానికులైన 35ఏళ్ల లోపు వయసున్న మహిళలు మాత్రమే అర్హులన్నారు. మరిన్ని వివరాల కోసం 95734 81375ను సంప్రదించాలన్నారు. ముందుకొస్తున్న ఆపన్నహస్తాలుడొంకేశ్వర్(ఆర్మూర్): లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)తో బాధపడుతున్న డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ గ్రామానికి చెందిన నిర్విన్ తేజ్ ప్రాణాలను కాపాడేందుకు ఆపన్నహస్తాలు ముందుకొస్తున్నాయి. తొండాకూర్ గ్రామానికి చెందిన షేక్ సలీం బాలుడి వైద్య ఖర్చుల కోసం రూ.30వేల చెక్కును సోమవారం అందజేశారు. గంగాసముందర్ గ్రామానికి చెందిన యువత సైతం ముందుకొచ్చి తోచిన ఆర్థిక సాయాన్ని అందజేశారు. నిర్విన్ తేజ్ చదువుతున్న తొండాకూర్ ఎస్ఎస్వీ పాఠశాల యాజమాన్యం ౖసైతం విరాళాలు సేకరిస్తోంది. నిర్విన్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ‘సాక్షి’లో ‘పాపం బాలుడిని ఆదుకోరూ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించి చాలా మంది తమ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నారు. సీపీని కలిసిన ఉర్దూ అకాడమీ చైర్మన్ ఖలీల్వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్యను సోమవారం రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. 31లోపు పరీక్ష ఫీజు చెల్లించండినిజామాబాద్అర్బన్: గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2వ, 4వ, 6వ డిగ్రీ రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షలకు, 1 నుంచి 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు ఈనెల 31లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ రామ్మోహన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100తో అపరాధ రుసుంతో ఏప్రిల్ 4లోపు, రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 6లోపు చెల్లించడానికి అవకాశం ఉందన్నారు. రూ.1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 7వరకు ఫీజు చెల్లించవచ్చునన్నారు. పరీక్ష ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలన్నారు. విద్యతోపాటు క్రీడలకు ప్రోత్సాహం తెయూ(డిచ్పల్లి): రాష్ట్ర ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యతను ఇస్తుందని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి అన్నారు. తెయూలో సోమవారం తెలంగాణ యూనివర్సిటీ యాన్యువల్ డే–2025 స్పోర్ట్స్ మీట్లో భాగంగా బాలుర కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీలో విద్యతోపాటు క్రీడలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెయూ స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్, పీఆర్వో పున్నయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఆర్ నేత తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ తొలి పోరులో ఎంఎస్సీ కెమిస్ట్రీ జట్టు–అప్లయిడ్ ఎకనామిక్స్ జట్టు తలపడగా అప్లయిడ్ ఎకనామిక్స్ జట్టు విజయం సాధించింది. రెండవ పోరులో అప్లయిడ్ ఎకనామిక్స్ జట్టు, మాస్ కమ్యూనికేషన్ జట్టు తలపడగా మాస్ కమ్యూనికేషన్ జట్టు విజయం సాధించింది. -
కరెంట్ షాక్తో రైతు మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని రాంపూర్గడ్డ తండాలో కరెంటు షాక్తో ఓ రైతు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వివరాలు ఇలా.. తండాకు చెందిన పిట్ల శ్రీను(30) అనే రైతు సోమవారం సాయంత్రం ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతుల కోసం పోతంగల్ కలాన్ సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకుని పనులు చేపట్టాడు. కానీ ట్రాన్స్ఫార్మర్ నుంచి అతడు కిందికి రాకముందే అధికారులు కరెంటు సరఫరా చేశారు. దీంతో ట్రాన్స్ఫార్మర్పై ఉన్న శ్రీను కరెంట్ షాక్కు గురయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో ఆగ్ర హించిన గ్రామస్తులు మృతదేహాన్ని పోతంగల్ కలాన్ స్టేజి వద్ద ఉంచి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింప జేశారు. మృతదేహాన్ని సమీపంలోని సబ్స్టేషన్ వద్ద ఉంచారు. సబ్స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే రైతు మృతి చెందాడని, ఉన్నతాధికారులు వచ్చేంత వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచుతామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న గ్రామస్తులు సబ్స్టేషన్లోనే మృతదేహాన్ని ఉంచిన వైనం రాంపూర్గడ్డ తండాలో ఘటన -
త్వరితగతిన వ్యవసాయ కనెక్షన్లు
● ఎస్ఈ రవీందర్ నిజామాబాద్ సిటీ: రైతులు దరఖాస్తు చేసిన వెంటనే వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని విద్యుత్శాఖ ఎస్ఈ రవీందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,86,571 కనెక్షన్లు ఉండగా, 2024–25 సంవత్సరానికిగాను 3,597 కనెక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. కొ త్త సర్వీసులకు అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో మంజూరు వేగవంతం కానున్నదని, కనెక్షన్ల కోసం రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు విధానంతో పనులు జాప్యం లేకుండా జరుగుతాయని పేర్కొన్నారు. 155 రకాల వంగడాల ప్రదర్శన డొంకేశ్వర్(ఆర్మూర్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఇండియా ఫార్మ ర్స్ 68వ కౌన్సిల్ సమావేశం సోమవారం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వెయ్యి మంది రైతులు సమావేశానికి హాజరుకాగా, రాష్ట్రం నుంచి ఐదుగురు పా ల్గొన్నారు. వారిలో జక్రాన్పల్లి మండలం చింతలూరుకు చెందిన ఆదర్శరైతు నాగుల చిన్నగంగారాం (చిన్ని కృష్ణుడు) ఉన్నారు. తను సొంతగా అభివృద్ధి చేసిన 155 రకాల దేశీ వరి వంగడాలను చిన్నకృష్ణుడు ప్రదర్శనకు ఉంచారు. సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల రైతులు వరి విత్తనాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం చిన్నికృష్ణుడు ప్రకృతి వ్యవసాయంపై సమావేశంలో ప్రసంగించారు. కొనసాగుతున్న పది పరీక్షలు నిజామాబాద్ అర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించగా, 22,735 మంది విద్యార్థులకుగాను 22,679 మంది హాజరయ్యారు. 56 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. -
విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలి
మద్నూర్(జుక్కల్) : విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని ట్రాన్స్కో డీఈ గంగాధర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో సోమవారం మూడు నూతన ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అధిక లోడ్ ఉండడంతో వోల్టెజ్ సమస్య వస్తుండడం, వేసవికాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా అవసరం ఉండడంతో అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. ట్రాన్స్కో ఏడీఈ సంజీవన్రావ్, ఏఈ గోపికృష్ణ, సిబ్బంది స్వామి ఉన్నారు. ఆకట్టుకున్న కుస్తీపోటీలుబాన్సువాడ రూరల్: మండలంలోని కొల్లూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన కుస్తీపోటీలు ఆకట్టుకున్నాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మల్లయోధులు తమ ప్రతిభను చాటి బహుమతులు అందుకున్నారు. గ్రామంలో ప్రతి ఏటా పాడిపంట, ప్రజలు బాగుండాలని జాతర మహోత్సవం నిర్వహిస్తామని గ్రామకమిటీ అధ్యక్షులు పరిగె బాపురెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సంజీవ్రెడ్డి, సాయిలు, పర్వయ్య, దుర్గారెడ్డి, శ్రీనివాస్, వీరేందర్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. లొంకలో ఏసీపీ పూజలుసిరికొండ: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం లొంక రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని నిజామాబాద్ ఏసీపీ రాజావెంకటరెడ్డి సోమవారం సందర్శించారు. సిరికొండ మండల కేంద్రంలో ఉన్న ఈ ఆలయంలో ఏసీపీ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గర్భాలయంలో పూజలు, శివలింగానికి రుద్రాభిషేకం చేపట్టారు. పురోహితులు నాగరాజు వారికి ఆశీర్వాదాలు అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏసీపీ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఆలయం దట్టమైన అడవుల్లో ఎంతో మనోహరంగా ఉందన్నారు. ఎస్సై ఎల్ రామ్, ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, రాజ్కుమార్రెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో జీపీ కార్మికులు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుకు వారు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, నాయకులు మురళి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 12,750 గ్రామపంచాయతీలలో 60వేల మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, ఆరు నెలలుగా వారికి జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్గా రూ.5లక్షల ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహా 30 శాతం పీఆర్సీ అమలు చేయాలని, జీవో నెంబర్ 51సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60ప్రకారంగా రూ.16,500 వేతనాన్ని ఇవ్వాలన్నారు. నాయకులు అరవింద్, రాజేశ్వర్, సత్యమ్మ, కార్మికులు మహేష్, రాము, చింటూ, సురేష్, బాలు, నరేష్, గంగాధర్, భోజన్న, నరేష్, శ్రీకాంత్, రమేష్, లింగం, రాజేశ్వర్, సాయిలు, దుర్గ, తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
ఖలీల్వాడి: నగరంలోని వీక్లీ మార్కెట్లో సాయికిరణ్ అనే వ్యక్తి దుకాణంలో రేషన్ బియ్యంను టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారు దుకాణంపై దాడి చేసి, 20 క్వింటాళ్ల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. లక్ష ఉంటుందని, తదుపరి చర్య నిమిత్తం వన్టౌన్ ఎస్హెచ్వోకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య తెలిపారు. ఎస్సై గోవింద్, స్పెషల్ పార్టీ సిబ్బంది ఉన్నారు. వన్నెల్(బి)లో మొరం టిప్పర్లు.. బాల్కొండ: మండలంలోని వన్నెల్(బి) శివారులో వరద కాలువ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు టిప్పర్లను సోమవారం బాల్కొండ పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్లను, పొక్లెయిన్ను బాల్కొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. కుక్కల దాడిలో 18 గొర్రెలు మృతి ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని వెల్లుట్లపేట గ్రామంలో కుక్కల దాడిలో 18 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్తులు సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన కొర్వి నారాయణ గ్రామ శివారులో గొర్రెలను మేపుతుండగా అకస్మాత్తుగా కుక్కల గుంపు గొర్రెలపై దాడి చేయడంతో మృత్యువాత పడ్డాయని తెలిపారు. మృతి చెందిన 18 గొర్రెల విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. అధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. పేకాడుతున్న 8మంది అరెస్టు బోధన్: సాలూర మండల కేంద్రంలో పేకాడుతున్న 8మందిని అరెస్టు చేసినట్లు టాస్క్ఫోర్స్ సిబ్బంది తెలిపారు. సాలూరలోని పంటపొలాల్లో గల పేకాట స్థావరంపై సోమవారం రాత్రి టాస్క్ఫోర్స్ ఇన్చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సై గోవింద్, సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో పేకాడుతున్న 8మందిని పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి 9 సెల్ఫోన్లు, సుమారు రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం బోధన్ రూరల్ ఎస్సైకి అప్పగించినట్లు వెల్లడించారు. -
వర్నిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
వర్ని: మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ లో రెండు వర్గాలు ఘర్షణ పడినట్లు వర్ని ఎస్సై మహేష్ వెల్లడించారు. మండల కేంద్రంలో ఒక టీ పాయింట్ వద్ద చిన్నపాటి గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారు. ఘర్షణకు పాల్పడ్డ ఇరువర్గాలకు చెందిన 20మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. అలాగే వర్నిలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 20మందిపై కేసు నమోదు -
బాన్సువాడ గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా
బాన్సువాడ: బాన్సువాడ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సోమవారం బాన్సువాడ పెద్ద మజీద్ వద్ద నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ముస్లింల కోసం షాదీముబారక్ పథకం ప్రవేశపెట్టామన్నారు. రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహించి పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇవ్వడం లేదని విమర్శించారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పోచారం శ్రీనివాస్రెడ్డి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్పై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నాయ కులు వస్తారు.. పోతారని, కానీ కార్యకర్తలు మా త్రం ఎప్పటికీ ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ నాయకులు ఆయేషాబేగం, సుమిత్ర, జుబేర్, కిషన్, మోచీ గణేష్, గౌస్, సాయిబాబా, సాయిలు, శివ, రమేశ్యాదవ్ తదితరులు ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రంజాన్ తోఫా ఇవ్వడం లేదు ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత -
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
రుద్రూర్: పోతంగల్ మండలం కల్లూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి ఇల్లు దగ్ధమైంది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా. కల్లూర్ గ్రామానికి చెందిన బీర్కూర్ గంగారాం కుటుంబ సభ్యులు రేకుల ఇంట్లో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం వారు ఇంట్లో పూజాకార్యక్రమాలు ముగించుకుని ఇంటికి తాళం వేసి, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిపోయారు. కొద్దిసేపటికి ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి గంగారాంకు సమాచారం అందించారు. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో మంటలు ఆర్పివేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఇల్లు నిర్మించుకునేందుకు అప్పుగా తెచ్చుకున్న నగదుతోపాటు, బీరువాలోని బంగారం, వెండి ఆభరణాలు, బట్టలు, వంట సామగ్రి, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. రెవెన్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రూ.మూడు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. పూజ కోసం వెలిగించిన దీపం కింద పడిపోవడంతో మంటలు అంటుకుని ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
లెదర్పార్క్కు మోక్షమెన్నడో?
ఆర్మూర్: దశాబ్దాలు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారినా ఆర్మూర్ లెదర్ పార్క్కు మోక్షం కలగడం లేదు. చర్మకారులు, చేతివృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వారికి ఏళ్లుగా నిరాశే ఎదురవుతోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మంజూరు చేసిన నిధులతో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు అడ్మినిస్ట్రేషన్ భవన నిర్మాణం పను లు చివరి దశకు చేరుకున్నాయి. రూ.10 కోట్లతో చేపడుతున్న ప్రస్తుత నిర్మాణ పనులు పూర్తయిన తర్వాతైనా చర్మకారుల బతుకుల్లో వెలుగులు వచ్చేనా అనే చర్చ మొదలైంది. తుది దశకు మరో భవన నిర్మాణం.. ఆర్మూర్ పట్టణ శివారులో చర్మ పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2017లో రూ.10 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పర్యటన అనంతరం 80 శాతం కేంద్రం నిధులు, 20 శాతం రాష్ట్రం నిధులతో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీఐవో గ్రాంట్ రూ.2 కోట్ల 60 లక్షలను 2019లో డిపాజిట్ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తన వాటా ధనాన్ని కలిపి 2022లో రూ.10 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో చర్మ పరిశ్రమలో మౌలిక సదుపాయాల కల్పన పనులు ఏడాది క్రితం ప్రారంభమయ్యాయి. రూ.కోటీ 80 లక్షలతో అడ్మినిస్ట్రేషన్ భవనం నిర్మా ణం పూర్తి కావొస్తుండగా, తమ జీవితాలు మలుపు తిరగనున్నాయని చర్మకారులు భావిస్తున్నారు. 2003లో శంకుస్థాపన ఉమ్మడి రాష్ట్రంలో ఆర్మూర్ ప్రాంత చర్మ కార్మికుల కు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో లిడ్ క్యాప్(చర్మ పరిశ్రమ)నకు 2003 ఆగస్టు 20న అప్ప టి మంత్రి మండవ వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. జిరాయత్నగర్లోని యానంగుట్ట వద్ద 28 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించి రూ.10 లక్షలు మంజూరు చేయగా, చెప్పులు తయారు చేసే భవన నిర్మాణం పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. 60 మంది చర్మకారులను మాస్ట ర్ ట్రైనర్లుగా గుర్తించి వారిని చైన్నెకి పంపించి ఆరు నెలలపాటు శిక్షణ ఇప్పించారు. ప్రస్తు తం వీరంతా ఉపాధి లేక ఆర్మూర్, పెర్కిట్, మామిడిపల్లి రోడ్లపై పాత చెప్పులకు మరమ్మతులు చేస్తున్నారు. దశాబ్దాలుగా చర్మకారుల ఎదురుచూపులు గతంలోనే మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందిన 60 మంది.. తుది దశకు అడ్మినిస్ట్రేషన్ భవన నిర్మాణ పనులు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చర్మ పరిశ్రమలో మౌలిక సదుపాయాల కల్పన పనులు కొనసాగుతున్నాయి. చర్మకారులు ఇక్కడ ఉపాధి కల్పించుకోవడానికి పూర్తి అవకాశాలను కల్పిస్తాం. కేటాయించిన స్థలంలో 120 ప్లాట్లు చేసి అర్హత మేరకు చర్మకారులకు ఇస్తాం. – ప్రవీణ్ కుమార్, జనరల్ మేనేజర్, మైక్రో అండ్ స్మాల్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ -
పంట నష్టపరిహారం చెల్లించాలి
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): అకాల వర్షాలు, వడగళ్ల వానలకు సుమారు వేయి ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని, బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం ఆయన మా ట్లాడారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి ఎకరానికి రూ.10వేలు చొప్పున పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరగా.. సానుకూలంగా స్పందించిన సీఎం, మంత్రికి ధన్యవాదాలు తెలుపు తున్నామన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా పసుపు, ఎర్రజొన్నల రైతులపై, మంచిప్ప ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. గతంలో జిల్లాకు వచ్చిన సమయంలో సీఎం రేవంత్రెడ్డి సైతం కేసులు ఎత్తి వేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రూరల్ నియోజకవర్గంలో 400 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నందున జిల్లాకు నూతనంగా వ్యవసాయ యూనివర్సిటీ లేదా వ్యవసాయ కళాశాల మంజూరు చేయాలని భూపతిరెడ్డి కోరారు. బెట్టింగ్ యాప్ల ఓనర్లపై చర్యలు తీసుకోవాలి నిజామాబాద్ సిటీ: బెట్టింగ్యాప్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో సోమవా రం ఆయన మాట్లాడారు. అనేక మంది మధ్యతరగతి యువత తమకు తెలియకుండానే బెట్టింగ్ ఊబిలోపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యాప్స్లో పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయి ఆర్థికంగా, మానసికంగా కృంగిపోతున్న యువకులు చివరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. బెట్టింగ్యాప్స్ ప్రమోటింగ్లో మాజీ మంత్రి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై విచారణ జరపాలన్నారు. కొందరు ప్రమోటర్లకు నోటీసులిచ్చి కేసులు బుక్చేస్తే సరిపోదని, డ్రగ్స్ కేసును నీరుగార్చినట్లు కాకుండా పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు. ఆస్తి పన్ను వడ్డీ మాఫీపై వెసులుబాటు కల్పించాలన్నారు. పసుపు, ఎర్రజొన్న రైతులపై కేసులు ఎత్తివేయాలి వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలి అసెంబ్లీలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి -
క్షయరహిత జిల్లాగా మారుద్దాం
నిజామాబాద్నాగారం: నిజామాబాద్ను క్షయరహిత జిల్లాగా మార్చేందుకు కలిసికట్టుగా కృషిచేయాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినాన్ని పురస్కరించుకుని సోమవారం నిర్వహించిన ర్యాలీని జీజీహెచ్ ఆవరణలో అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రా రంభించారు. బస్టాండ్ మీదుగా న్యూ అంబేడ్కర్ భవన్కు ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో కిరణ్కుమార్ మా ట్లాడుతూ.. వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేసి క్షయను నివారించాలన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స, నివారణ చర్యలు సకాలంలో చేప ట్టి కొత్తగా క్షయ వ్యాధిగ్రస్తులు నమోదు కాకుండా చూ డాలన్నారు. డీఎంహెచ్వో రాజశ్రీ మాట్లాడుతూ.. క్షయ నివారణపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే వ్యాధి నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. టీబీ రోగులు పూర్తికాలం చికిత్స తీసుకోవాలని సూచించారు. చికిత్స తీసుకున్నంత కాలం పౌష్టకాహారం కోసం రోగి ఖాతాలో ప్రతి నెలా వెయ్యి రూపాయలు జమ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ దేవీనాగేశ్వరి, డీఐవో అశోక్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ డివిజన్ చైర్మన్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీశైలం, పల్మనాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ ఉమర్, టీబీ మెడికల్ ఆఫీసర్ అవంతి, రాజేందర్, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ ఘనపూర్ వెంకటేశ్వర్లు, టీబీ కోఆర్డినేటర్ రవి, ఆకాశవాణి కో ఆర్డినేటర్ మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. వైద్య సిబ్బంది అంకితభావంతో పని చేయాలి అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ -
గ్రూపుల లొల్లి
కాంగ్రెస్లో సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అత్యధిక సంఖ్యలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందిన బా ల్కొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం పవర్ సెంటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అంతా గందరగోళం అన్నట్లుగా తయారైంది. పార్టీ శ్రేణులు మాత్రం ఇదేం ప రిస్థితి వచ్చిందని పరేషాన్ అవుతున్నాయి. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే కథ ఇప్పటికే నడుస్తుండగా, తాజాగా ఇసుక తోలకాల విషయంలో పార్టీ నాయకుల మధ్యే రగడ నడుస్తోంది. గత ఎన్నికల ముందు మొదలైన గ్రూ పుల పంచాయితీ రానురాను మరింత పెరుగుతోంది తప్ప ఫుల్స్టాప్ పడడం లేదు. గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న నాయకులు పీసీసీ అధ్యక్షుడికి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అంతటితో ఆగక గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నాయకుల వర్గీయుల మధ్య వాట్సాప్ గ్రూపుల్లో హోరాహోరీ వార్ నడుస్తోంది. దీంతో ఈ సోషల్ యుద్ధం వ్యవహారం పోలీసు స్టేషన్లకు చేరుతోంది. నియోజకవర్గంలో ఇసుక తోలకాల విషయంలో సునీల్రెడ్డి వర్సెస్ మానాల, ఈరవత్రి గ్రూపుల మధ్య ఎడతెగని వార్ నడుస్తోంది. లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం సునీల్ వర్గీయులు తమను రాకుండా చేసినట్లు ఈరవత్రి, మానాల వర్గీయులు చెబుతున్నారు. నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈ చోద్యాన్ని చూస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికపై ప్రభావం.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారుల ఎంపికపై నాయకుల మధ్య ఆధిపత్య పోరు ప్రభావం చూపుతుందని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సైతం గందరగోళానికి గురవుతారని అంటున్నారు. బాల్కొండ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నియోజకవర్గంలో ఎడతెగని పంచాయితీ ఎన్నికల ముందు నుంచే మొదలు.. ఇసుక తోలకాల పంచాయితీతో అనేక మలుపులు చివరకు సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్న వైనం అసెంబ్లీ టికెట్ నుంచి.. గత శాసనసభ ఎన్నికల్లో ఈరవత్రి అనిల్, మా నాల మోహన్రెడ్డి టిక్కెట్ ఆశించారు. అయితే కొన్నిరోజుల ముందే కాంగ్రెస్లో చేరిన ముత్యా ల సునీల్రెడ్డి అనూహ్యంగా టిక్కెట్ దక్కించుకున్నారు. ఎన్నికల బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు. మానాల, ఈరవత్రిల సహకారం లేకపోవడంతోనే ఓడిపోయామని సునీల్ వర్గం ఆరోపిస్తుండగా, సునీల్రెడ్డి తమను పట్టించుకోలేదని, ఓటమికి తమను బాధ్యులను చేయడం సరికాదని మానాల, ఈరవత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మానాల మోహన్రెడ్డి రాష్ట్ర కో ఆపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా, ఈరవత్రి అనిల్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా, అన్వేష్రెడ్డి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా పదవులు దక్కించుకున్నారు. మధ్యలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన రమేశ్రెడ్డి డీసీసీబీ చైర్మన్ అయ్యారు. -
ఆదుకునేవారు లేక అనాథగా మాజీ సర్పంచ్
కామారెడ్డి: కొందరు ప్రజాప్రతినిధుల్లా పర్సంటేజీలకు ఆశపడలేదు..ఆస్తులు అంతస్తులు కూడగట్టుకోలేదు ఆ మాజీ మహిళా సర్పంచ్. గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధులను కూడా వెచ్చించింది. ప్రస్తుతం ఆదుకునేవారు లేక అనాథగా మారింది. రామారెడ్డి మండలం కన్నాపూర్ సర్పంచ్గా బాల్రాజవ్వ 2006 నుంచి 2011 వరకు పనిచేసింది నీటి సమస్య పరిష్కారానికి బోరుబావులను తవ్వచింది. ఇటీవల కాలంలో భర్త చనిపోయాడు. ఉన్న ఇల్లు కాస్త కాలిపోవడంతో గ్రామ కచేరీ ఆ మాజీ సర్పంచ్కు నివాస గృహంగా మారింది. ఆ ఊరి ప్రజలే అన్నం పెట్టి సాదుతున్నారు. భర్త చనిపోయిన తర్వాత బాల్రాజవ్వ మానసిక పరిస్థితి బాగాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. బాల్రాజవ్వ ఇద్దరు కూతుళ్లలో ఓ కూతురు చనిపోగా, మరో కూతురు ఉన్నా, పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ అండగా నిలిచి బాల్రాజవ్వకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే వైద్యం అందించాలని కోరుతున్నారు. -
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి
బాల్కొండ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండల కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్.. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతను అవమానపరుస్తుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే ఈ నెల 27 నుంచి గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటేశ్గౌడ్, ముత్యంరెడ్డి, కొత్తింటి ముత్యంరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
పాపం బాలుడిని ఆదుకోరూ!
డొంకేశ్వర్(ఆర్మూర్): పాఠశాల తరగతి గదిలో ఉండాల్సిన సమయంలో ఆస్పత్రిలో చేరి మహమ్మారి వ్యాధితో పోరాడుతున్నాడు బాలుడు నిర్విన్ తేజ్. డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ గ్రామానికి చెందిన మోతె అశోక్, గంగామణిల కుమారుడు నిర్విన్ తేజ్ తొండాకూర్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఇటీవల సైకిల్ పైనుంచి పడడంతో కాలుకు పెద్ద గాయం తగిలింది. చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు రక్త పరీక్షలు చేశారు. అందులో తెల్లరక్త కణాలు ఎక్కువగా ఉండటంతో మరిన్ని పరీక్షలు చేయగా బాలుడికి (అక్యూట్ మైలోయిడ్ లుకేమియా) బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నాణ్యమైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఎంఎంజే ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారం రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోజుకు కొన్ని యూనిట్ల రక్తం అవసరం అవుతోంది. ఇప్పటికే రూ. నాలుగైదు లక్షల వరకు ఖర్చు అయింది. ఇంకా పదిహేను రోజుల వరకు వైద్యం అందించాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. తల్లిదండ్రులది నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులకు స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి తన కొడుకును కాపాడాలని వేడుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు.. తండ్రి: మోతె అశోక్ బ్యాంకు ఖాతా నంబరు: 75010100025228 ఐఎఫ్ఎస్సీ కోడ్ : UBIN0817503 ఫోన్ పే నంబర్: 9705612610 (గంగామణి, తల్లి) లుకేమియాతో బాధపడుతున్న నిర్విన్ తేజ్ ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు -
జుక్కల్లో బంజార భవన్ నిర్మిస్తాం
పిట్లం/నిజాంసాగర్/బిచ్కుంద : సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గంలో గిరిజనులు నడవాలని ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. పిట్లంలోని సాయిగార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం మండల బంజార నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్ మ హరాజ్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎ మ్మెల్యే హాజరయ్యారు. భోగ్ బండార్లో పాల్గొని ప్ర త్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో బంజారా భవన్ ని ర్మిస్తామన్నారు. జుక్కల్ మండలం బంగారుపల్లి, దోస్త్ పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. దోస్త్పల్లి గ్రామం నుంచి జుక్కల్ మండల కేంద్రం వరకు బీటీ రోడ్డు పనులను నాణ్య తగా చేపట్టాలని కాంట్రాక్టర్, ఆర్ఆండ్బీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బిచ్కుంద క్లాసిక్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. షాదీఖానాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో బంజా రా, కాంగ్రెస్ నాయకులు రమేష్దేశాయ్, సాయాగౌడ్, మల్లికార్జునప్ప షెట్కార్, విఠల్రెడ్డి, నాగ్నాథ్, గంగాధర్, నాగ్నాథ్ పటేల్, సాహిల్, గౌస్, పాషా,అజీం, ఖలీల్, నౌషా నాయక్, తుకారం పాల్గొన్నారు. -
తెయూ విద్యార్థికి ‘సాహిత్య పురస్కారం’
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ విద్యార్థి రాజు సాహిత్య పురస్కారం అందుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంలో రాజు పాల్గొన్నారు. తను రచించిన ఉగాది పండుగ కవితా రచనను సమ్మేళనంలో విన్పించగా వెన్నెల సాహితీ సంగమం ప్రతినిధులు, సాహితీప్రియులు, కవులు, రచయితలు రాజును ప్రత్యేకంగా అభినందించారు. కవితా రచనను ప్రోత్సహిస్తూ ‘సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య పురస్కారం’, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. పురస్కారాన్ని అందుకున్న రాజును తెయూ తెలుగు అధ్యయన శాఖ ప్రొఫెసర్ డీ కనకయ్య, అధ్యాపకులు అభినందించారు. లింబాద్రి గుట్టను దర్శించుకున్న ఎన్నికల కమిషన్ కార్యదర్శిమోర్తాడ్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్కుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం భీమ్గల్ మండలంలోని లింబాద్రి గుట్టపై వెలిసిన లక్ష్మి నర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అశోక్కుమార్కు ఆలయ వంశపారంపర్య వేద పండితులు నంబి పార్థసారథి, విజయ సారథి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఆలయ అర్చకులు నంబి వాసుదేవాచార్యులు, వేల్పూర్ వాసు, నంబి శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది రావుట్ల అరవింద్, ఎడ్ల శ్రీకాంత్, సాయిలు తదితరులు ఉన్నారు. -
భారత సాఫ్ట్బాల్ జట్టుకు విద్యార్థిని ఎంపిక
జక్రాన్పల్లి : మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన గన్న వర్షిణి భారత సాఫ్ట్బాల్ అండర్–15 సబ్జూనియర్ జట్టుకు ఎంపికై ంది. ఈనెల 25 నుంచి 30 వరకు తైవాన్లో జరిగే ఏషియన్ చాంపియన్షిప్ పోటీల్లో వర్షిణి పాల్గొననుంది. అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టు తరఫున వర్షిణి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో మునిపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. మాజీ సర్పంచ్ ముస్కు చిన్న సాయిరెడ్డి ఆదివారం వర్షిణిని సన్మానించారు. ఖర్చుల నిమిత్తం రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు నరేశ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆస్తి పన్ను చెల్లించని దుకాణాల సీజ్బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించని పలు దుకాణాలను ఆదివారం బల్దియా అధికారులు సీజ్ చేశారు. అనిల్ టాకీస్ రోడ్డులోని కేకే సూపర్ మార్కెట్, లక్ష్మి అపార్ట్మెంట్లోని దుకాణ సముదాయాలతోపాటు మరో దుకాణ సముదాయాన్ని సీజ్ చేశారు. దు కాణాదారులు బల్దియాకు రూ.3,16,629ల ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్తి పన్ను చెల్లించకపోతే దుకాణాలను సీజ్ చేస్తామని, ఇంటికి తాగునీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. -
రుణాల పంపిణీలో రికార్డు
నిజామాబాద్కోర్టు దూరం.. ప్రజలకు భారం జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టు ఏర్పాటు కోసం భీమ్గల్తోపాటు ఐదు మండలాల ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025– 8లో uబ్యాక్ వాటర్లో భారీ జెల్లలు డొంకేశ్వర్(ఆర్మూర్): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో మత్స్యకారుల వలకు భారీ జెల్లలు చిక్కుతున్నాయి. వేసవిలో మాత్రమే జెల్లలు లభిస్తాయని, ప్రస్తుతం వలకు చిక్కుతున్న చేపలు భారీ సైజులో ఉంటున్నాయని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నా రు. జెల్లలకు కోల్కతాలో మంచి డిమాండ్ ఉంటుందని, కిలో రూ.500కుపైగానే ప లుకుతుందని తెలిపారు. డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ బ్యాక్వాటర్లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులకు భారీ జెల్లలు చిక్కాయి. ఒక్కోటి నాలుగు అడుగుల పొడవు, పది కిలోల పైనే ఉన్నాయని, వీటిని వ్యాపారులకు విక్రయించామని మత్స్యకారుడు మోహన్ తెలిపారు. గిరిజన వర్సిటీ తొలి వీసీకి సన్మానం బోధన్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ తొలి వైస్ చాన్స్లర్గా బోధన్కు చెందిన వైఎల్ శ్రీనివాస్ ఇటీవల నియామకమైన విషయం తెలిసిందే. ఆదివారం ఆయ న కుటుంబసభ్యులతో కలిసి పట్టణ కేంద్రంలోని స్వగృహానికి వచ్చారు. ఈ సందర్భంగా ట్రస్మా ప్రతినిధులు వీసీ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. వీసీని కలిసిన వారిలో సాలూర తహసీల్దార్ శశిభూషణ్ దంపతులు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిశోర్, ఇందూర్ హైస్కూల్ ఇంచార్జి స్వాతి, అంజలి, మున్సిపల్ మాజీ చైర్మన్ మహ్మద్ గౌసొద్దీన్, టీపీసీసీ ప్రతినిధి బీ గంగాశంకర్, లయన్స్ కంటి ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్ నర్సింహారెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. సాంకేతికతతో మెరుగైన సేవలు సుభాష్నగర్: సాంకేతికతను అందిపుచ్చుకొని వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పనిలో అధునాతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో మరింత నాణ్యతను మెరుగుపర్చడానికి సిస్టమ్ యావరేజ్ ఇంటరాప్షన్ డ్యూరేషన్ ఇండెక్స్ (సైది), సిస్టమ్ యావ రేజ్ ఇంటరాప్షన్ ఫ్రీక్వేన్సీ ఇండెక్స్ (సైఫీ)గా తీర్చిదిద్దామని తెలిపారు. సైది, సైఫీతో ప్రయోజనాలు ● విద్యుత్ అంతరాయం ఏర్పడి ఫీడర్లపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టడం. ● సమస్యను తక్కువ సమయంలో గుర్తించి త్వరగా మరమ్మతులు చేపట్టడం. ● ఫాల్ట్ డిటెక్షన్, రియల్–టైమ్ మానిటరింగ్ చేయడం. ● భవిష్యత్లో అంతరాయాలు జరగకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే ఆస్కారం ఉంటుంది. డొంకేశ్వర్(ఆర్మూర్): బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. గడువుకు ముందే అధికారులు రికార్డు స్థాయిలో రుణాలను పంపిణీ చేశారు. అత్యధిక రుణాలిచ్చిన జాబితాలో నిజామాబాద్ జిల్లా నంబర్ వన్ స్థానంలో ఉంది. సంఘాలకు రుణాలిచ్చి వారి ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్న ఐకేపీ ఉద్యోగులు ప్రశంసలు సైతం అందుకున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు బ్యాంకు లింకేజీ టార్గెట్ రూ.1,228.71 కోట్లుగా నిర్దేశించారు. వీటిని 20,350 ఎస్హెచ్జీలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది గతేడాది లక్ష్యంతో పోలిస్తే దాదాపు రూ.200 కోట్లు ఎక్కువ. కొండంత లక్ష్యాన్ని చూసి బెదరకుండా ఐకేపీ అధికారులు, ఉద్యోగులు సమష్టిగా పని చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమీక్షలు జరిపి ఎస్హెచ్జీలకు రుణాలను అందజేశారు. ఫలితంగా గడువుకు ఇంకా పది రోజులు మిగిలి ఉండగానే టార్గెట్ను మించారు. ఇప్పటి వరకు 14,725 ఎస్హెచ్జీలకు రూ.1229.24 కోట్ల (100.04 శాతం) రుణాలను పంపిణీ చేశారు. 90 శాతం చేరుకున్న సీ్త్రనిధి రుణాలు సీ్త్రనిధి ద్వారా కూడా మహిళా సంఘాలకు రుణాలు అందజేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.211 కోట్లు పంపిణీ చేయాలని జిల్లాకు లక్ష్యం ఉండగా, ఇప్పటి వరకు రూ.198 కోట్లు (90 శాతం) 23,780 మంది మహిళలకు అందజేశారు. ఈ నెలాఖరు నాటికి టార్గెట్ను పూర్తి చేయడానికి వెనుకబడిన మండలాల్లో అధికారులు పర్యటిస్తున్నారు. తరలివచ్చిన సినీ ప్రముఖులు ఇందూరు తిరుమలలో నిర్వహించిన శ్రీవారి కల్యాణోత్సవానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, సతీశ్ వేగేశ్న, రచయిత చిన్నికృష్ణ, జబర్దస్త్ వేణు (బలగం), బలగం ఫేమ్ మధు, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్వెనుకబడిన ఎనిమిది మండలాలు బ్యాంకు లింకేజీ రుణాలిచ్చే విషయంలో జి ల్లాలో కొన్ని మండలాలు వెనుకబడి ఉన్నా యి. ఇందులో ధర్పల్లి, భీమ్గల్, ఇందల్వాయి, రెంజల్, మోర్తాడ్, సిరికొండ, మా క్లూర్, వర్ని ఉన్నాయి. అలాగే లక్ష్యాన్ని చేరుకున్న జాబితాలో మెండోరా, ముప్కాల్, ఏర్గ ట్ల, బాల్కొండ, జక్రాన్పల్లి, డిచ్పల్లి, ఆర్మూ ర్, నవీపేట్, మోస్రా, ఎడపల్లి, నందిపేట్, కమ్మర్పల్లి, బోధన్, నిజామాబాద్ రూరల్, వేల్పూర్, రుద్రూర్, మోపాల్ ఉన్నాయి. లక్ష్యానికి చేరువలో చందూర్, కోటగిరి మండలాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన నిజామాబాద్ జిల్లా గడువుకు ముందే పూర్తయిన బ్యాంకు లింకేజీ రుణాల టార్గెట్ మహిళా సంఘాలకు రూ.1229.24 కోట్లు పంపిణీ అందరి కృషితో సాధ్యమైంది గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పని చేస్తున్న ఐకేపీ సిబ్బంది కృషితోనే లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమైంది. రాష్ట్రస్థాయిలో ఇతర జిల్లాల కన్నా ఎక్కువ రుణాలిచ్చాం. మిగిలిన పది రోజుల్లో కూడా ఇంకా బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సీ్త్రనిధి లక్ష్యాన్ని కూడా చేరుకుంటాం. – సాయాగౌడ్, డీఆర్డీవో, నిజామబాద్ -
అబుదాబిలో రోడ్డు ప్రమాదం.. తొర్తివాసి మృతి
మోర్తాడ్(బాల్కొండ): దుబాయ్ దేశంలోని అబుదాబి నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన ఈర్గల గంగాధర్(44) మరణించినట్లు అతని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఉపాధి కోసం అబుదాబిలో డెలివరీ బాయ్గా పని చేస్తున్న గంగాధర్.. శనివారం బైక్పై డ్యూటీకి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గంగాధర్కు భార్య, కూతురు, కొడుకు, తల్లి ఉన్నారు. గతంలో గీతా కార్మికునిగా పనిచేసిన గంగాధర్ ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టాడు. విధి వక్రీకరించి ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతదేహాన్ని త్వరగా రప్పించి, బాధిత కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి..బోధన్రూరల్: సాలూర మండలం జాడిజమాల్పూర్ గ్రామ శివారులోని చెరువు ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన రమేశ్ ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా గ్రామ శివారులోని చెరువులో కాలకృత్యాల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ లీకేజీ.. ఒకరికి తీవ్రగాయాలురెంజల్(బోధన్): ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పైపు లీకేజీ కావడంతో మంటలు వ్యాపించి దంపతులకు గాయాలైన ఘటన రెంజల్ మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మోతీలాల్ ఇంట్లో మధ్యాహ్నం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పైపు లికేజీ అయ్యి రెగ్యులేటర్ పేలింది. దీంతో మంటలు వ్యాపించి మోతీలాల్కు తీవ్రగాయాలు కాగా, భార్య లతకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరినీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.బాలికపై లైంగిక దాడిగాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వేణు అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేశామన్నారు. గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ విచారణ నిర్వహించినట్లు తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేతబోధన్రూరల్: సాలూర మండలంలోని మందర్న శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి ఆదివారం సాయంత్రం తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్లను సేష్టన్కు తరలించి కేసు నమోదు చేశామన్నారు. మట్కా స్థావరంపై దాడి ఖలీల్వాడి: నగరంలోని మిర్చి కాంపౌండ్లో మట్కాస్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడి చేశారు. మట్కా ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద సెల్ఫోన్తోపాటు రూ.3900ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఒకటో టౌన్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య తెలిపారు. హైలెవల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన డీసీఎంబోధన్రూరల్: సాలూర మండల కేంద్రం సమీపంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం బోధన్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి హైలెవల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ గాయాలపాలవ్వగా స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. నిత్యం వందలాది వాహనాలతో రద్దీ ఉండే బోధన్– సాలూర రోడ్డు అధికారులు అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
గేదెను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా
మాక్లూర్: అడ్డుగా వచ్చిన గేదెను తప్పించబోయి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడగా ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం నందిపేట మండలం సీహెచ్ కొండూర్ శివారులో చోటు చేసుకుంది. నందిపేట పోలీసుల కథనం ప్రకారం.. వెల్మల్ గ్రామానికి చెందిన చిన్నోల్ల సాయిలు(51) నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి వద్ద వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. నిత్యకృత్యంలో భాగంగా తన ట్రాక్టర్పై వెల్మల్ నుంచి పంచగుడిలోని పొలానికి వెళుతున్నాడు. సీహెచ్ కొండూర్ వద్ద ఒక్కసారిగా గేదె అడ్డురావడంతో దాన్ని తప్పించబోయే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న చిన్నోల్ల సాయిలుకు తీవ్రగాయాలు కావడంతో అంబులెన్సులో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయిలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకరి దుర్మరణం -
కమనీయం.. శ్రీవారి కల్యాణం
మోపాల్(నిజామాబాద్రూరల్): నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం శ్రీవారి కల్యాణం కనుల పండువగా జరిగింది. అంతకుముందు స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. స్వామి వారి కల్యాణం.. లోక కల్యాణమని, ఆ ఘ ట్టాన్ని తిలకిస్తే సకల పాపాలూ తొలగిపోతాయని దేవనాథ జీయర్ స్వామి, గంగోత్రి రామానుజదాసు స్వామి ప్రవచించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, నర్సింహారెడ్డి, విజయసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ రాము లు, నరాల సుధాకర్, పృథ్వీ, నర్సారెడ్డి, ప్రసాద్, రాజేశ్వర్, రమేశ్, భాస్కర్, నరేందర్, మురళి, రాజేశ్వర్, యాజ్ఞాచార్యులు శిఖామణి, సత్యనారాయణ స్వామి, శ్రీకర్ కుమారాచార్యులు, రోహిత్ కుమారాచార్యులు తదితరులు పాల్గొన్నారు. వైభవంగా ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు సినీ ప్రముఖుల సందడి -
నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం
ధర్పల్లి/సిరికొండ: అధైర్య పడొద్దని అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభు త్వం ఆదుకుంటుందని నిజామాబాద్ రూరల్ ఎ మ్మెల్యే భూపతిరెడ్డి భరోసా ఇచ్చారు. ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని మద్దుల్తండా, వాడి, హొన్నాజీపేట్, సీతాయిపేట్, చీమన్పల్లి, కొండూర్ గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్పల్లి, సిరికొండ మండలాల్లోనే పంట నష్టం ఎక్కువగా ఉందన్నారు. పంట నష్టం పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వివరించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పంటల నష్టం పై పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి అందగానే నష్టపరిహారం పై ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. గతేడాది రబీ సీజన్లో వడగళ్ల వానతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు పరిహరం ఇచ్చామని గుర్తు చేశారు. ఆయన వెంట నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, బాడ్సి శేఖర్గౌడ్, ధర్పల్లి, సిరికొండ మండలాల పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ బాలరాజ్, బాకారం రవి, సొసైటీ చైర్మన్ గంగాధర్, ఏఎంసీ డైరెక్టర్లు సంపత్రెడ్డి, ముత్తెన్న, ఏడీఏ ప్రదీప్కుమార్, ఏవో నర్సయ్య, నాయకులు ఉన్నారు. త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో సిరికొండ మండలం కొండూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. అకాల వర్షం ఆగం చేసింది..తనకున్న ఎకరం భూమిలో సాగు చేసిన వరి పూర్తిగా దెబ్బతిన్నదని ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన మహిళా రైతు జిన్న రాజమణి ఎమ్మెల్యే ఎదుట రోదించింది. పంట పొట్టదశలో ఉండగా బోరు ఎత్తిపోయిందని, మరో బోరుకు రూ.15వేలు అద్దె చెల్లించి నీరందించిన తరువాత అకాల వర్షం కురిసిందని ఆమె కన్నీటిపర్యంతమైంది. తన భర్త జీవనోపాధికోసం గల్ఫ్కు వెళ్లాడని, తమది పేద కుటుంబమని తెలిపింది. దీంతో ఎమ్మెల్యేతోపాటు అధికారులు చలించారు. నష్టపరిహారం అందేలా చూస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు. -
కోర్టు దూరం.. ప్రజలకు భారం
ఆర్మూర్: జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టు ఏర్పాటు కోసం భీమ్గల్తోపాటు ఐదు మండలాల ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిమినల్, సివిల్ కేసుల విషయంలో ఆర్మూర్ కోర్టుకు వెళ్లేందుకు ఇబ్బందులుపడుతున్నారు. సిరికొండ, వేల్పూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండలాలకు అందుబాటులో ఉండేలా భీమ్గల్లో జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టు 2007లో మంజూరైంది. కాగా, ఆ కోర్టును ఆర్మూర్లో ఏర్పాటు చేయడంతో సమస్య మొదలైంది. ప్రజలు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, పోలీసులు వివిధ కేసుల విషయంలో ఆర్మూర్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూరభారం, సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. దీంతో కోర్టును సాధించుకునేందుకు భీమ్గల్ ప్రాంతీయులు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా భీమ్గల్లో కోర్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలంటూ 2023 నవంబర్ 8న ఆర్మూర్ కోర్టుకు ఆదేశాలు వచ్చాయి. 500 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉంటేనే కొత్తగా కోర్టు మంజూరు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ, భీమ్గల్ పరిధిలోని ఆరు మండలాలను కలిపి సుమారు 2,500 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండడంతోపాటు భీమ్గల్ మున్సిపాలిటీగా ఏర్పడింది. ఈ గణాంకాల ప్రకారం భీమ్గల్లో జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టు ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ తెలంగాణ రాష్ట్ర లా సెక్రటరీకి నివేదిక రూపంలో సమర్పించి భీమ్గల్కు కోర్టు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కోర్టు భీమ్గల్లో జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టు ఏర్పాటుకు విజ్ఞప్తులు ఆర్మూర్లో నిర్వహణతో ఇక్కట్లుపడుతున్నామని ఆవేదన భీమ్గల్ పరిధి మండలాల్లో 2,500కు పైగా క్రిమినల్ కేసుల పెండింగ్ ఇబ్బందిగా ఉంది ఆర్మూర్ కోర్టులో గృహహింస, మెయింటెనెన్స్ కేసు నడుస్తోంది. నేను ఆర్మూర్కు వెళ్లాలంటే 62 కి.మీ ప్రయాణించాలి. మా గ్రామం నుంచి ఆర్మూర్కు బస్సు సౌకర్యం కూడా లేదు. ఇబ్బందిగా మారుతోంది. అదే కోర్టు భీమ్గల్లో ఉంటే మాలాంటి వారికి సౌకర్యంగా ఉండేది. – భూక్య లత, పాకాల, సిరికొండ మండలం -
కలగానే బీసీ గురుకుల సొంత భవనాలు!
మోర్తాడ్(బాల్కొండ): వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం కలగానే మిగిలిపోనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ప్రస్తావన తీసుకరాలేదు. జిల్లాలో మోర్తాడ్, ఎడపల్లి, ఆర్మూర్, బాల్కొండ, కుద్వాన్పూర్, బోధన్, శ్రీరాంపూర్, చీమన్పల్లి, నిజామాబాద్లో బాలబాలికలకు వేర్వేరుగా పాఠశాలలను నిర్వహిస్తున్నారు. 2017–18 విద్యా సంవత్సరంలో ఈ బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించగా ఎక్కడ కూడా సొంత భవనాలు లేవు. 2024–25 బడ్జెట్లో రూ.1,546 కోట్లు కేటాయించినా ఎక్కడ కూడా భవనాలు నిర్మించలేదు. దీంతో అద్దె భవనాల్లోనే వాటిని కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ గురుకుల పాఠశాలల ప్రారంభానికి చూపిన ఆసక్తి.. సొంత భవనాల నిర్మాణంపై చూపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించినా అడుగులు మాత్రం ముందుకు పడలేదు.తెరపైకి ఇంటిగ్రేటెడ్..కొత్తగా ఒక్కో నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు, భవనాల నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించేందుకు రూ.11,600ల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటును తెరపైకి తీసుకరావడంతో గతంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం మరుగునపడినట్లేనా అనే సందేహం వ్యక్తమవుతోంది. గతంలో నిధులు కేటాయించినా ముందుకు పడని అడుగులు ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయించని ప్రభుత్వం కొత్తగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు ప్రస్తావన -
చోరీ చేశారు.. వైరల్ అవడంతో వదిలేశారు..
మోర్తాడ్: గుర్తుతెలి యని దుండగులు పొ క్లెయిన్ని చోరీ చేయ గా, ఈ ఘటన సా మాజిక మాధ్యమా ల్లో వైరల్ కావడంతో వాహనాన్ని వదిలేశారు. వివరాలు ఇలా.. భీమ్గల్ మండలం జాగిర్యాల్లో చిన్నోల్ల గంగాప్రసాద్ తన పొక్లెయిన్ని శుక్రవారం రాత్రి ఇంటి వెనుక ఉన్న ఖా ళీ స్థలంలో నిలిపి ఉంచారు. శనివారం ఉదయం లే చి చూసేసరికి పొక్లెయిన్ కనిపించకపోవడంతో డ్రై వర్ తీసుకువెళ్లి ఉంటాడని భావించాడు. అంతలోనే డ్రైవర్ రావడం పొక్లెయిన్ను తాను తీసుకపోలేదని వెల్లడించడంతో చోరీకి గురైనట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో పొక్లెయిన్ని దొంగలు వేల్పూర్ మండలం పడగల్ క్రాస్రోడ్డు వద్ద పొదల్లో నిలిపి ఉంచగా, స్థానికులు గమనించి వాహన యజమానికి సమాచారం ఇచ్చారు. దీంతో పొక్లెయిన్ను వారు స్వాధీ నం చేసుకున్నారు. నిందితులను గుర్తించడానికి పో లీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
సిరికొండ: అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్ తెలిపారు. సిరికొండ మండలం రావుట్ల, న్యావనంది గ్రామ 33/11 కేవీ సబ్స్టేషన్లలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రేకర్లను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. రావుట్ల గ్రామంలో ఇళ్లు, వ్యవసాయానికి ఒకే బ్రేకర్ ఉండడంతో సరఫరాలో సమస్య వస్తే మొత్తం ఫీడర్ లైన్ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీంతో వినియోగదారులకు అసౌకర్యం కలుగుతోందని, సమస్య నివారణకు కొత్తగా మరో బ్రేకర్ ఏర్పాటు చేశామన్నారు. న్యావనంది సబ్స్టేషన్లో నర్సింగ్పల్లికి కొత్త బ్రేకర్ను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో డీఈ ఉత్తమ్ జాడే, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ చంద్రశేఖర్, డీసీసీ కార్యదర్శి ఎర్రన్న, డీలర్ రమేశ్, భాస్కర్, సామెల్, గంగారెడ్డి, దాసు, ప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్ ముత్తెన్న, నరేందర్, లైన్ ఇన్స్పెక్టర్ బాలచంద్రం ఉన్నారు. -
వేయి ఎకరాల్లో పంట నష్టం
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో కురిసిన అకాల వర్షానికి 1,036 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నెల 20, 21 తేదీల్లో సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, సాలూర, నవీపేట్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగళ్లు పడిన విషయం తెలిసిందే. వ్యవసాయాధికారులు శనివారం క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతుల నుంచి వివరాలు సేకరించారు. వరికి ఎక్కువ నష్టం వాటిల్లగా, మొక్కజొన్న స్వల్పంగా దెబ్బతిన్నది. రాళ్ల వానకు ధర్పల్లి మండలం హొన్నాజీపేట్లో 185 ఎకరాల్లో వరికి నష్టం జరిగింది. 1,036 ఎకరాల్లో 33 శాతానికి మించి దెబ్బతిన్న పంటలు 884 ఎకరాల్లో గుర్తించగా, 1,033 మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. కాగా, 33 శాతానికి మించి పంటకు నష్టం జరిగితేనే ప్రభుత్వం నుంచి రైతులకు నష్ట పరిహారం వచ్చే అవకాశం ఉంటుంది. ● వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్–పోచంపాడ్ గ్రామాల మధ్యగల జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరా లు ఇలా.. ౖభైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ గజారం(32) మూడేళ్ల క్రితం కూలీ పనుల కోసం మెండోరా మండల కేంద్రానికి వచ్చాడు. ఈక్రమంలో శనివారం ఉదయం బుస్సాపూర్ నుంచి పోచంపాడ్ వైపు జాతీయ రహదారి 44పై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం వచ్చి అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు మెండోరా ఎస్సై నారాయణ పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో ఒకరు.. వేల్పూర్: మండలంలోని పచ్చలనడ్కుడ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రకు చెందిన శంకర్(32) కూలీ పని కోసం కొన్ని నెలల పచ్చలనడ్కుడకి వచ్చాడు. మహారాష్ట్రకు చెందిన బాలాజీ అనే వ్యక్తితో కలిసి ఒకే గదిలో నివాసముంటూ గ్రామంలో కూలీ పనులు చేసేవారు. గురువారం రాత్రి ఇద్దరు గొడవ పడగా చుట్టుపక్కల వారు సర్ధిచెప్పారు. శనివారం ఉదయం వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు వచ్చి ఇంట్లో చూడగా శంకర్ మృతిచెంది ఉండడాన్ని గుర్తించారు. మరో వ్యక్తి బాలాజీ లేకపోవడం, మృతుడి వివరాలు తెలిపేందుకు ఎవరూ లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్రెడ్డి సందర్శించారు. చేపల వేటకు వెళ్లి.. మోపాల్: మండలంలోని మంచిప్ప గ్రామంలో ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. మంచిప్ప గ్రామానికి చెందిన సుంకరి సాయిలు (55), దండ్ల శ్రీను శుక్రవారం సాయంత్రం గ్రామంలోని కొండెం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. సాయిలు చెరువులోకి దిగగా, శ్రీను కట్టపై ఉన్నాడు. చెరువులోకి దిగిన సాయిలు బురదలో కూరుకుపోయి ఊపిరాడక మునిగిపోయాడు. విషయాన్ని శ్రీను కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సాయిలు కోసం గాలించగా, శనివారం మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. సాగర్ కాలువలో పడి.. రుద్రూర్: మండలంలోని రాయకూర్ గ్రామంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి మృతిచెందాడు. ఎస్సై సాయన్న తెలిపిన వివరాలు ఇలా.. రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి సుభాష్ (40)కు గతంలో యాక్సిడెంట్ కావడం వల్ల కాలు విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈనెల 19న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన సుభాష్ తిరిగి రాలేదు. 21న రాత్రి సులేమాన్ నగర్ శివారులోని సాగర్ కాలువలో అతడి మృతదేహం లభ్యమైంది. సుభాష్ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లగా, ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటాడని మృతుడి తండ్రి సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
రామాలయానికి రూ.20కోట్లు ఇవ్వండి
సుభాష్నగర్/డిచ్పల్లి: అసెంబ్లీ సమావేశాల్లో శనివారం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పలు అంశాలపై మాట్లాడారు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న రఘునాథాలయం (ఖిల్లా) అభివృద్ధికి రూ.20కోట్లు కేటాయించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బాసర సరస్వతి ఆ లయ టూరిజం సర్క్యూట్లో డిచ్పల్లి ఖిల్లా రామాలయాన్ని చేర్చాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఖిల్లా రామాలయంలో గతంలో అంగరంగ వైభవంగా ధూపదీప నైవేద్యాలు, పూజలు, సీతారాముల కల్యాణోత్సవాలు ఘనంగా జరిగేవని, నేడు శిథిలావస్థకు చేరిందని తెలపడం బాధగా ఉందని ధన్పాల్ అన్నారు. ఆలయ ప్రాంగణంలోని కోనేరు, శ్రీరామ కల్యాణవేదిక, దాశరథి మందిరం, గుడి గోపురం, పైకప్పు, గోడల మరమ్మతులు, మౌలిక సౌకర్యాల కల్పనకు కనీసం రూ.20కోట్లు స్పెషల్ ఫండ్ మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రాంతంలో ఎకో టూరిజం డెవలప్ చేయొచ్చని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. అలాగే నిజాంసాగర్, రామడుగు ప్రాజెక్టుల్లో వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ టూరిజం ఏర్పాటు చేయొచ్చని పేర్కొన్నారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న డిచ్పల్లి ఖిల్లా రామాలయం, రామడుగు, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను బాసర సర్క్యూట్లో కలిపి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నూతన బిల్లులో వీటిని చేర్చాలని విన్నవించారు. -
రైతన్నను ఆగం చేసిన వాన
ధర్పల్లి: జిల్లాలోని పలు మండలాల్లో ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వాన రైతులను ఆగమాగం చే స్తూ తీరని నష్టాన్ని మిగిల్చింది. శుక్రవారం సా యంత్రం ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కు ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని వరి పంట దె బ్బతింది. మరో రెండు మూడు రోజుల్లో వరి కోత లు ప్రారంభించనున్న సమయంలో అకాల వర్షం కురవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. వడగళ్ల వానల దాటికి వరి పంటలు నేలమట్టమయ్యాయి. మరికొన్నిచోట్ల భారీ గాలులకు పంట నేలకు ఒరిగిపోయింది. ధర్పల్లి మండలంలో ని మద్దుల్తండా, హోన్నాజీపేట్, వాడీ, సీతాయిపే ట్ గ్రామ రెవెన్యూ పరిధిలో వడగండ్ల వానకు 174 మంది రైతులకు సంబంధించి 265 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. సిరికొండ మండలం కొండూర్ , చీమన్పల్లి, చిన్నవాల్గొట్ గ్రామాల పరిధిలో 700 ఎకరా ల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమి క అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. పంట చివరి దశలో భూమిపాలు కావడంతో ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ● ధర్పల్లి మండలం మద్దుల్తండాకు చెందిన రైతు గోవింద్ 2 ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంట కోతదశకు వచ్చినప్పటికీ తన అన్న చనిపోవడంతో ఇంట్లో నుంచి బయటకు రాలేక వరి కోతలు రెండు రోజులు వాయిదా వేసుకున్నాడు. శుక్రవారం కురిసిన వడగళ్లకు పూర్తిగా వరి గింజ నేలరాలిపోయింది. పొలం కోసం రూ. 60వేలు పెట్టుబడి పెట్టగా, మరో రెండు రోజుల్లో కోతలు మొదలు పెట్టేలోపే వర్షం వల్ల పంట నష్టపోయాడు. పంట చేతికొచ్చే సమయంలో నేలపాలు కావడంతో అతడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు వ్యవసాయమే జీవనాధారం అని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని గోవింద్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. వడగండ్లతో దెబ్బతిన్న వరి పంట ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు దెబ్బతిన్న పంటపొలాల పరిశీలన ధర్పల్లి/సిరికొండ: వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను శనివారం ఏడీఏ ప్రదీప్ కుమార్, ఏవో వెంకటేష్, నర్సయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధర్పల్లి మండలంలోని హోన్నాజిపేట్, వాడీ, మద్దుల్ తండా, సీతాయిపేట్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను వివరాలు అడిగి, నమోదు చేశారు. ధర్పల్లి మండలంలో 174 మంది రైతులకు చెందిన 265 ఎకరాల్లో పంట నష్టపోయినట్టు ప్రాథమిక అంచనా వేసినట్లు వారు తెలిపారు. అలాగే సిరికొండ మండలంలోని కొండూర్, చిన్నవాల్గోట్, చీమన్పల్లి, సిరికొండ గ్రామాల్లో సుమార 700–750 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. పంట నేలరాలిపోయింది.. ఈ యాసంగిలో ఆరున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. కానీ ఇటీవల కురిసిన వడగండ్లకు ఆరున్నర ఎకరాల్లో ఒక్క వరి గింజ కూడా లేకుండా పూర్తిగా నేలరాలిపోయింది. ఇప్పుడు పచ్చి గడ్డి తప్ప ఏమి లేదు. రూ.1.80 లక్షల పెట్టుబడి పెట్టాను. పంట చేతికి వస్తుందని ఆశిస్తే వడగళ్ల వర్షానికి పంట మొత్తం నేలపాలయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి –మోహన్ రెడ్డి, రైతు, వాడి -
భవిష్యత్లో సోలార్ విద్యుత్కు డిమాండ్
సుభాష్నగర్: భవిష్యత్లో సోలార్ విద్యుత్కు మంచి డిమాండ్ ఉంటుందని అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. జిల్లాలో కొత్తగా సోలార్ పవర్ ప్లాంట్ ఏ ర్పాటు చేయాలనుకునే రైతులు, మహిళలు, యువకులు, వ్యాపారవేత్తలు అవగాహనతోనే ముందుకెళ్లాలని తెలిపారు. నగరంలోని పవర్హౌజ్ పరిధిలోగల గోల్డెన్ జూబ్లీ మీటింగ్ హాల్లో శనివారం టీజీఎన్పీడీసీఎల్, టీజీ రెడ్కో ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి కుసుమ్ యోజన పథకంలో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఔత్సాహికు లు సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని వి ద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్శాఖకు యూనిట్ల రూపంలో విక్రయించడంతో ఆదాయం పొందవచ్చని తెలిపారు. అనంతరం దరఖాస్తుదారులకు సోలార్ పవ ర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన సాంకేతిక విషయాలు, బ్యాంకు రుణాలకు సంబంధించి వివరాలు తెలియజేశారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్, టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ రమణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చౌహన్, డీఈలు అల్జాపూర్ రమేష్, వెంకట రమణ, ఉత్తం జాడే, మహ్మద్ ముక్తార్, తదితరులు పాల్గొన్నారు. -
టీబీ రహిత జిల్లాగా మారుద్దాం
డిచ్పల్లి: నిజామాబాద్ను క్షయరహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టిన టీబీ ముక్త్ గ్రామ పంచాయత్ కార్యక్రమంలో భాగంగా శనివారం డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్లో పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య సిబ్బందికి టీబీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తుకారాం రాథోడ్ మాట్లాడుతూ.. జిల్లాలో 11 గ్రామ పంచాయతీలను క్షయరహిత (టీబీ ముక్త్) గ్రామాలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ డీఎల్పీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో టీబీ నిర్మూలన దిశగా పని చేస్తున్నామన్నారు. సమావేశంలో టీబీ కో ఆర్డినేటర్ రవిగౌడ్, ఎంపీవోలు రామకృష్ణ, రాజేశ్, కిరణ్, రాజాఖాన్, తారాచంద్, పంచాయతీ కార్యదర్శులు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. క్షయరహిత గ్రామాలివే.. పడకల్, లక్ష్మాపూర్, పాల్దా, ముల్లంగి(బి), గంగరమంద, పోత్నూర్, తాళ్లరామడుగు, అబ్బాపూర్ (ఎం), సుంకెట్, వడ్యాట్, మల్కాపూర్ తండా. -
చికిత్స పొందుతూ..
రామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన పద్మ దినేష్ (52) మండల కేంద్రంలో ఆధార్, మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దుకాణ పని నిమిత్తం అతడు బైక్పై శుక్రవారం కామారెడ్డి వెళ్లి, సాయంత్రం తిరుగుపయనమయ్యాడు. గొల్లపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో బైక్ అదుపుతప్పి అతడు కింద పడగా, ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో దినేష్తోపాటు ఆటోలో ఉన్న పెద్ద బోయిన లింబాద్రి, అతడి భార్యకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ దినేష్ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. -
అందరూ పన్ను చెల్లించాల్సిందే..
● పోచమ్మగల్లీలో తాగునీరు సరిగా రావడం లేదు. పైప్లైన్ల మరమ్మతులు చేపట్టడం లేదు. బోర్లు పనిచేయడం లేదు. బల్దియా సరఫరాచేసే తాగునీరు సరిపోవడం లేదు. అరగంట ఎక్కువసేపు నీరు సరఫరా చేయాలి. దుబ్బ ముస్లిం బస్తీలో నీరు సరిగా రావడం లేదు. – గణేశ్ గౌతంనగర్, నాగరాజు పోచమ్మగల్లీ, లింబాద్రి బోర్గాం (పి), మాజిద్ మాలపల్లి, ధన్రాజ్ పోచమ్మగల్లీ, నూర్మహ్మద్ దుబ్బ, రవికుమార్ ఆదర్శనగర్. మున్సిపల్ కమిషనర్: అవసరమైన చోట్ల పైప్లైన్ల మరమ్మతులు చేయిస్తాం. తాగునీరు సరిపోకపోతే ఫ్లో పెంచుతాం. అసలు నీరు సరఫరాకాని కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తాం. నీటిని వృథా చేయొద్దు. జాగ్రత్తగా కాపాడుకోవాలి. మున్సిపల్ ఈఈ మురళీమోహన్రెడ్డికి ఆదేశాలు జారీచేశాం. ● ఎవరికీ మినహాయింపు ఉండదు ● తాగునీటి సమస్య లేకుండా చూస్తున్నాం ● వీధి లైట్ల సమస్యను పరిష్కరిస్తాం ● డ్రెయినేజీలను శుభ్రం చేయిస్తాం ● సాక్షి ‘ఫోన్ ఇన్’లో నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్ నిజామాబాద్ నగరంలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మా రిందని, డ్రెయినేజీలను శుభ్రపర్చడం, పిచ్చి మొక్కలను తొలగించడం లేదని నగరా నికి చెందిన పలువురు మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్కు సమస్యలను ఏకరువు పెట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో శనివారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహించగా, నగరవాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఉద యం 10 నుంచి 11 గంటల సాక్షి ఫోన్ ఇన్ కొనసాగగా, సుమారు 58 మంది ఫోన్లు చేసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సమస్యలను విన్న కమిషనర్ వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. – నిజామాబాద్ సిటీ● నీటిపన్ను ఒకేసారి రూ.7 వేలు కట్టమంటే ఎట్లాసార్.. ఐదేళ్ల నుంచి ఒక్కసారి అడగని అధికారులు ఇప్పుడు అకస్మాత్తుగా ఆరేళ్లకు సంబంధించి నీటి పన్ను కట్టమంటే ఎట్లాసార్.. – రాజ్కుమార్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ : నీటి పన్ను కూడా వెంటవెంటనే చెల్లించాలి. పెండింగ్లో ఉంచొద్దు. ఐదేళ్ల నుంచి పన్ను చెల్లించకుంటే ఎట్లా.. మున్సిపల్ నీటిని వాడుకుని పన్ను కట్టకుంటే ఎలా? మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. ఎలాంటి మినహాయింపు ఉండదు. ● వినాయక్నగర్ ప్రాంతంలోని 100 ఫీ ట్ల రోడ్డులో వీధిలైట్లు వెలగడం లేదు. పాంగ్రా, మాధవనగర్, ముబారక్నగర్, కేసీఆర్ కాలనీ, చంద్రశేఖర్ కాలనీల్లోనూ వీధిలైట్లు సరిగా వెలగడం లేదు. రాత్రివేళ బయటకు వెళ్లాలంటే పిల్లలు భయపడుతున్నారు. – రమేశ్ బొబ్బిలివీధి, శ్రీనివాస్ ప్రగతినగర్, రవీందర్ స్కాలర్స్ స్కూల్, విఠల్ వంద ఫీట్ల రోడ్డు, శ్రీనివాస్రెడ్డి కోజా కాలనీ మున్సిపల్ కమిషనర్: వీధిలైట్ల మెయింటెనెన్స్ను ప్రభుత్వం ఓ ఏజెన్సీకి ఇచ్చింది. కొన్ని చోట్ల ఇబ్బందులున్నాయి. చిన్న చిన్న మరమ్మతులు చేయిస్తాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. -
బంతి బంతికీ బెట్టింగ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఐపీఎల్ ప్రారంభం కావడంతో బెట్టింగ్ యాప్లు మరింత విజృంభిస్తున్నాయి. అదృష్టం కలిసి వస్తుందని, తేలికగా డబ్బు సంపాదించుకోవచ్చనే అత్యాశతో పలువురు బెట్టింగ్ రాయుళ్లు బయల్దేరారు. బెట్టింగ్ వైపు యువతను, క్రికెట్ అభిమానులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐపీఎల్కు సంబంధించి ప్రతి బంతికి బెట్టింగ్ చేసేలా యాప్లు పకడ్బందీగా కథ నడిపిస్తున్నాయి. డాట్ బాల్ మొదలు, సింగిల్ రన్, ఫోర్, సిక్సర్, వికెట్ అంటూ బంతిబంతికీ ప్రత్యేకంగా కథ నడిపిస్తున్నారు. బెట్టింగ్కు సంబంధించి అందుబాటులో ఉన్న యాప్లను, లింకుల ద్వారా పంపి టెంప్ట్ చేస్తున్నారు. బెట్టింగ్ కోసం రూపొందించిన ప్రత్యేక యాప్లతోపాటు వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా గ్రూపుల ద్వారా జిల్లాలో బెట్టింగ్ నడిపిస్తున్నారు. రెగ్యులర్గా రమ్మీ, స్కిల్ గేమ్స్ వంటివి ఆడిన వారు తాజాగా ఐపీఎల్ బెట్టింగ్లోకి దిగుతున్నారు. అంతా చేతిలోని స్మార్ట్ ఫోన్తోనే కావడంతో జిల్లాకు చెందిన అనేకమంది వయస్సుతో సంబంధం లేకుండా బెట్టింగ్ ఊబిలోకి దిగుతున్నారు. క్రమంగా ఇది వ్యసనంగా మారుతోంది. బెట్టింగ్ల కోసం అప్పులు చేస్తుండడంతో అనేక కుటుంబాలు రోడ్డుపైకి వస్తున్నాయి. మానసికంగా కుంగిపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పులు ఇచ్చిన వారిని తీసుకున్నవారు విషపు ఇంజక్షన్లు ఇచ్చి హతమార్చిన ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లాల్లో వెలుగు చూశాయి. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో బెట్టింగ్ నిషేధిత చట్టం చేసినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం 2015లోనే బెట్టింగ్ నిషేధిత చట్టాన్ని చేసింది. అయినప్పటికీ హైదరాబాద్తోపాటు అన్ని జిల్లాల్లో బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్ల హవా విచ్చలవిడిగా నడుస్తోంది. ఇక పక్కనే ఉన్న ఏపీలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో బెట్టింగ్ యాప్ల నిషేధ చట్టం చేశారు. అయితే తాజాగా వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ బెట్టింగ్ యాప్లకు స్వాగతం పలికేలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన నిషేధాన్ని ఎత్తేసి మరీ అనుమతులు ఇవ్వడం గమనార్హం. తెలంగాణలో మాత్రం బెట్టింగ్ యాప్లపై నిషేధం ఉంది. సెలబ్రిటీల ప్రమోషన్ కూడా కారణమే.. అనేక రకాల బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లను ప్రమోట్ చేసినవారిలో స్టార్ క్రికెటర్లు, బాలీవుడ్ యాక్టర్లు, తెలుగు నటీనటులు ఉన్నారు. దీంతో సహజంగానే బెట్టింగ్ యాప్లకు ఆకర్షితులయ్యేవారి సంఖ్య పెరిగింది. ధోని, సచిన్ టెండూల్కర్, దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లి వంటి క్రికెటర్లు, నటులు షారుఖ్ఖాన్, సోనూసు ద్, ప్రకాశ్రాజ్, విజయ్ దేవరకొండ, రాణా, మంచు లక్ష్మి తదితరులు, బాలకృష్ణ నిర్వహించే అన్స్టాపబుల్ షో ద్వారా బెట్టింగ్ యాప్ల గురించి భారీగా ప్రమోట్ చేయడంతో పలువురు ఆకర్షితులయ్యారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. జిల్లాలోనూ బెట్టింగ్ యాప్లపై ప్రత్యేక దృష్టి సారించామని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. బెట్టింగ్ మాఫియాపై ప్రత్యేక దృష్టి వడ్డేపల్లి కుటుంబ బలవన్మరణం కేసు పునః పరిశీలన సీపీ పోతరాజు సాయిచైతన్య మొదట్లో డబ్బులు వచ్చేలా చేస్తారు యాప్లు, వెబ్సైట్లలో బెట్టింగ్ చేసే వారిని మొదట డబ్బులు గెలుచుకునేలా చేస్తారు. తరువాత లక్షల్లో డబ్బులు గుంజుతారు. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే బెట్టింగ్ లింక్లకు టెంప్ట్ కాకుండా ఉంటే మంచిది. తెలంగాణ ప్రభుత్వం 108 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లను తాజాగా బ్లాక్ చేసింది. మరో 133 బెట్టింగ్ ప్లాట్ఫామ్లకు నోటీసులిచ్చింది. ప్రతిఒక్కరూ ఈ బెట్టింగ్ యాప్ల విషయంలో అప్రమత్తంగా ఉండి, వాటిబారిన పడకుండా ఉండాలి. – రాజావెంకటరెడ్డి, ఏసీపీ, నిజామాబాద్ఖలీల్వాడి: బెట్టింగ్ యా ప్లను ప్రమోట్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ పోతరాజు సాయిచైతన్య హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్ పర్యవసనంతో ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణం చెందిన కేసును పునఃపరిశీలిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈజీ మనీ వస్తుందనే ఆశతో 23 ఏళ్ల యువకుడు బెట్టింగ్ యాప్లకు బానిసగా మారడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. బెట్టింగ్లో నష్టపోతూ కుటుంబంపై అప్పుల భారం పెరగడంతో మానసిక బాధతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును మొదట ఆర్థిక ఇబ్బందుల ఒత్తిడిగా నమోదు చేశామని, కానీ, ఇది వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని, సామాజిక ప్రమాదమని చెప్పారు. వడ్డేపల్లి ఘటనను సీరియస్గా తీసుకున్నామని, అసలు కారణాలపై దర్యాప్తు జరిపి, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్ యాప్లకు యువకులు, ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ మాఫియాపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను విజయవంతం చేయాలి
నిజామాబాద్ సిటీ: కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టే రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను విజయవంతంగా నిర్వహించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగాన్ని కాలరాస్తూ అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఇందుకోసం జై బాపు– జై భీం– జై సంవిధన్ నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు చేపడతామన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. పాదయాత్ర కోసం ప్రతిఒక్కరు సిద్ధం కావాలన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నగర అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు, నాయకులు సునీల్రెడ్డి, వినయ్రెడ్డి, ఏబీ శ్రీనివాస్, నగేష్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమే ష్రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జావేద్ అక్రమ్, రాంభూపాల్, గోపి, విపూల్గౌడ్, వేణురాజ్, నరేందర్గౌడ్, సంతోష్, లింగం, కెతావత్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
గోవులను తరలిస్తున్న వాహనం అడ్డగింత
రుద్రూర్: మండల కేంద్రంలో గోవులను తరలిస్తున్న వాహనాన్ని గురువారం అర్ధరాత్రి బజరంగ్దళ్ నాయకులు అడ్డుకున్నారు. రెంజల్ మండలం సాటాపూర్ నుంచి రుద్రూర్ మీదు గా జహీరాబాద్ వైపు వెళ్తున్న ఐచర్ వాహనంలో గోవులను తరలిస్తున్నారనే సమాచారం రావడంతో వారు రుద్రూర్లో వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వాహనంలో ఉన్న పశువులను బోధన్ గోశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు. తెయూకు అంబులెన్స్ అందజేత తెయూ(డిచ్పల్లి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (టీజీ యూనివర్సిటీ బ్రాంచ్) ఆధ్వర్యంలో శుక్రవారం డీజీఎం బిజయ్కుమార్ సాహూ తెలంగాణ యూనివర్సిటీకి అంబులెన్స్ను అందజేశారు. వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, ఎస్బీఐ ఏజీఎం మహేశ్వర్ కొలాటే, బ్రాంచ్ మేనేజర్ శివనారాయణ సింగ్, సిబ్బంది రాథోడ్ రవీందర్, రాజేష్, గిరిప్రసాద్, ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, పీఆర్వో పున్నయ్య, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయాగౌడ్, భాస్కర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. 26 నుంచి ఎడపల్లి రైల్వేగేట్ మూసివేత ఎడపల్లి(బోధన్): ఎడపల్లి–బోధన్ ప్రధాన రహదారిపై ఉన్న రైల్వేగేట్ను ఈనెల 26న ఉదయం 6 గంటల నుంచి 28వ తేదీ రాత్రి 10గంటల వరకు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే ట్రాక్ పనుల నిమిత్తంగేటు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. బోధన్, నిజామాబాద్ వెళ్లే వాహనదారులు సాటాపూర్, ఏఆర్పీ క్యాంప్, అంబం(వై) గుండా వెళ్లాలని సూచించారు. పొగాకు దగ్ధం బోధన్: రెంజల్ మండలంలోని బొర్గాం గ్రామంలో గురువారం రాత్రి ఈదురుగాలులకు మంటలు ఏర్పడి రాము అనే రైతుకు చెందిన పొగాకు దగ్ధమైంది. రెండు ఎకరాలకు సంబంధించిన పంట కాలిపోవడంతో సుమారు రూ. 2లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. సమాచారం అందుకున్న మండల రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ‘అర్చరీ ఫెడరేషన్ అఫ్ ఇండియా’ చైర్మన్గా ఈగ సంజీవరెడ్డి నిజామాబాద్ నాగారం: అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏతిక్స్, డిసిప్లేన్ చైర్మన్గా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, అర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రాష్ట్ర అర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ ఒక ప్రకటనలో తెలిపారు. సంజీవరెడ్డి ఎన్నికపై జిల్లాలోని పలు క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. -
వ్యవసాయ క్షేత్రంలో విద్యార్థుల సాగు పాఠాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్చుకునేందుకు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్కు శనివారం నిర్మల్ జిల్లా జామ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు వచ్చారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు పూర్తి చేసుకున్న పలువురు ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు, అధ్యాపకులు గ్రామంలో సుభాష్ పాలేకర్ విధానంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కరుటూరి పాపారావు క్షేత్రాన్ని సందర్శించారు. రెండు గంటల పాటు వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతూ విద్యార్థులు వివిధ అంశాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. -
కానరాని నీటి పొదుపు
డొంకేశ్వర్(ఆర్మూర్): అన్ని వనరుల్లోకెల్లా అతి ముఖ్యమైనది జలం. మానవులతో పాటు జీవరాశులకు ఇదే ప్రధాన జీవనాధారం. అలాంటి నీటిని కాపాడుకునే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. భూగర్భ జలాల పెంపునకు కృషి చేయకపోయినా కనీసం నీటిని పొదుపుగా కూడా వాడుకోవడం లేదు. తద్వారా ప్రతీ ఏడాది వేసవిలో కొన్ని ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం అల్లాడే పరిస్థితి ఎదురవుతోంది. పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయి. నేడు ‘ప్రపంచ నీటి దినోత్సవం’ సందర్భంగా నీటి పొదుపుపై సాక్షి ప్రత్యేక కథనం. కుళాయిల ద్వారా వృథాగా.. జల వనరులను ఏవిధంగా కాపాడుకోవాలనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారులతో ప్రజలను చైతన్యం చేయించడం లేదు. దీంతో నీటి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. నీటి వృథా కూడా అదే స్థాయిలో జరుగుతోంది. పల్లెల్లో వ్యవసాయ బోర్ల కనెక్షన్లు, గృహ వినియోగ బోర్ల కనెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయి. జిల్లాలో సమారు వ్యవసాయ బోరు బావులు సుమారుగా 1.81లక్షలు ఉండగా, గృహ బోరు కనెక్షన్లు 6.70లక్షలు ఉన్నట్లు అంచనా. అలాగే జిల్లాలో ప్రస్తుత సరాసరి నీటిమట్టం 10 మీటర్ల లోతు ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామాల్లో నీటి సరఫరా, వాడకంపై పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు పర్యవేక్షణ చేయడం లేదు. వీధుల్లో, కుళాయిలకు ఆన్–ఆఫ్ సిస్టం లేకపోవడంతో గంటల తరబడి నీరు వృథాగా పోతుంది. తద్వారా భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. నిరంతరం బోర్లు నడవడంతో విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయి.ఇంకిపోతున్న భూగర్భ జలాలు.. జల వనరులను కాపాడుకునే ప్రయత్నం చేయని ప్రజలు చైతన్యం చేయని ప్రభుత్వం, అధికారులు నేడు ప్రపంచ నీటి దినోత్సవంఇంకుడు గుంతలే మార్గం.. జిల్లాలో బోరుబావుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. తద్వారా నీటి వాడకం ఎక్కువైంది. వ్యవసాయ బోర్ల ద్వారా ఎక్కువగా నీటి వినియోగం జరుగుతుంది. నీటిని ఎంతంత వాడుతున్నారో అంతకు మించి సంరక్షించాలి. వ్యవసాయ భూముల్లో ఫారంపాండ్లు, ఇంటికో ఇంకుడుగుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలి. – శ్రీనివాస్ బాబు, జిల్లా భూగర్భజల శాఖ అధికారిప్రస్తుతం జిల్లాలో ఐదారు మండలాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. భీమ్గల్, సిరికొండ, డిచ్పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, మోపాల్, నవీపేట్ మండలాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఐతే, వేసవిలో సైతం భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండాలంటే వ్యవసాయ క్షేత్రాల్లో ఫాంపాండ్లు నిర్మించుకోవాలి. అలాగే ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను కట్టుకోవాలి. తద్వారా నీటి వృథా తగ్గి భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టి, ప్రజలు, రైతులను కూడా చైతన్యం చేయించాలి. అలాగే నీటిని వృథా చేయకుండా, తక్కువగా వాడే పరికరాలను వాడాలి. వాడిన నీటిని మళ్లీ ఉపయోగించే పద్ధతులను అవలంబించాలి. -
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య ఆందోళన
ఆటో–బైక్ ఢీ: పలువురికి తీవ్ర గాయాలు రామారెడ్డి: రామారెడ్డి శివారులో శుక్రవారం రాత్రి ఆటో–బైకు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి వైపు నుంచి రామారెడ్డి వచ్చే క్రమంలో వాహనాలు ఢీకొన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఆటోలోని ఇద్దరు వ్యక్తులకు, బైక్పై ఉన్న దినేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అర్గుల్ గ్రామస్తులపై కేసు నమోదు జక్రాన్పల్లి: మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి శుక్రవారం తెలిపారు. అర్గుల్ గ్రామ శివారులోని తన భూమిలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి డ్యామేజ్ చేసినట్లు పాలెం గ్రామానికి చెందిన ఏలేటి రవీందర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అర్గుల్ గ్రామస్తులు భాస్కర్రెడ్డి, అల్కన్న, శేఖ్పాషా, రాంరెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని ఓ భార్య ఆందోళన చేపట్టిన ఘటన లింగంపేట మండలం కోమట్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. కేశాయిపేట గ్రామానికి చెందిన నెల్లూరి భాగ్య, కోమట్పల్లి గ్రామానికి చెందిన చీటూరి రాకేష్ ప్రేమించుకొని, పెద్దలను ఎదిరించి 2023లో పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలు హైదరాబాద్లో కాపురం చేయగా భాగ్య గర్భం దాల్చింది. ఈక్రమంలో ఆమెకు కడుపు నొప్పి రావడంతో భర్త కొన్ని మందులు ఇచ్చాడు. గత నెల 21న నొప్పి తీవ్రం కావడంతో వైద్య పరీక్షలు చేయించగా గర్భంలోని శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటినుంచి భార్యను రాకేష్ మానసికంగా వేధింపులు గురిచేస్తుండేవాడు. ఈక్రమంలో ఆమెను హైదరాబాద్ నుంచి కేశాయిపేటలోని తన ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. శుక్రవారం రాకేశ్ కోమట్పల్లికి వచ్చినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె రాకేశ్ ఇంటికి వచ్చింది. దీంతో రాకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి పారిపోయాడు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లనంటూ బాధితురాలు టెంట్ వేసుకొని ఆందోళనకు దిగింది. అధికారులు, గ్రామస్తులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతుంది. -
డౌన్ సిండ్రోమ్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
నిజామాబాద్నాగారం: తల్లిదండ్రులు డౌన్ సిండ్రోమ్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పద్మావతి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డౌన్ సిండ్రోమ్ నివారణకు చర్యలు లేవని, గర్భ విచ్ఛిత్తి మాత్రమే మార్గ మని తెలిపారు. ఈ పిల్లలు కొంచెం తెలివి తక్కువగా ఉంటారని, వారికి విద్యాబుద్ధులు నేర్పించా లని కోరారు. డౌన్ సిండ్రోమ్ పిల్లలపై తల్లిదండ్రు లు ప్రేమానురాగాలు, ఎక్కువ శ్రద్ధ చూపించినట్లయితే ఆ పిల్లల్లో మార్పు వస్తుందన్నారు. అనంత రం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీల్లో పాల్గొ న్న డౌన్ సిండ్రోమ్ విద్యార్థులకు బహుమతులు ప్ర దానం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి రసూల్బి, వైద్యులు ప్రతిమారాజ్, రవితేజ, అవినాష్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, అందుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభు త్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఉన్నత చదువులు పూర్తి చేసిన విద్యార్థుల చేతికి సర్ట్టి ఫికెట్లు వస్తున్నాయి.. కానీ ఉద్యోగాలు రావడం లే దని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫె సర్ పురుషోత్తం పేర్కొన్నారు. విద్యార్థులు చిన్న స మస్యలకే పిరికితనంతో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన కీలకవక్త గా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న తన సేవలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీ ఎం రేవంత్రెడ్డి తనకు చెప్పకుండానే ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్గా అవకాశం కల్పించారని తెలి పారు. తెలంగాణ విద్యారంగాన్ని ఉన్న త స్థాయికి చేర్చాలని, నైపుణ్యం కలిగిన యువతను తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం ముందుకు సాగుతున్నార ని అన్నారు. విద్యను అర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రణాళిక ప్రకారం సిలబస్ మార్పునకు శ్రీకా రం చుట్టినట్లు తెలిపారు. ఇందు లో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి కోర్సుకు ఇంటర్న్ షిప్ తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కోర్సు లో విద్యార్థులు చదువుతోపాటు ఇంటర్న్షిప్లో పా ల్గొనడం వల్ల ఉపాధి, ఉద్యోగావకాశాలు సాధించగలుగుతారని తెలిపారు. అలాగే సివిల్ సర్వీస్లో తెలంగాణ యువతకు తక్కువ అవకాశాలు వస్తున్నాయని, ఉత్తరాధి రాష్ట్రాల వారే సివిల్ సర్వెంట్లు గా మనపై పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నా రు. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉండటం ఒక కారణమని గుర్తించి, దీనిపై కేంద్రంతో పోరాడి ప్రాంతీయ భాషల్లో సైతం ఇంటర్వ్యూలు చేపట్టేలా చేశామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ హానర్స్ సబ్జెక్టును తెలుగులో ప్రవేశపెట్టామని, ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థు లు సివిల్ పరీక్షల్లో మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే మ్యాథ్స్ సబ్జెక్టులో పోటీ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలను విద్యార్థులకు నేర్పిస్తారని తెలిపారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లలో సమయాన్ని వృథా చేయవద్దని, చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. మారుమూల గ్రా మం నుంచి వచ్చిన తాను విద్య వల్లనే నేడు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ స్థాయికి చేరుకున్నట్లు పు రుషోత్తం తెలిపారు. ఇప్పటికీ తమ గ్రామస్తులు ఆర్టీసీ బస్సును చూడలేదన్నారు. పురుషోత్తం యా దాద్రి భువనగిరి జిల్లా బొమ్మర రామారం మండలం గందమల్ల గ్రామానికి చెందిన వారు. దేశాన్ని నడిపించేది అర్థశాస్త్రమే దేశాన్ని నడిపించేది అర్థశాస్త్రమేనని రాష్ట్ర ఉన్నత వి ద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అప్లయిడ్ ఎకనామిక్స్ విభాగాధిపతి పున్నయ్య అధ్యక్షతన శుక్రవారం క్యాంపస్ కా మర్స్ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్ సెమినార్ హాల్లో ‘రాష్ట్ర బడ్జెట్పై విశ్లేషణ’ అనే అంశంపై సెమినార్ ని ర్వహించారు. ఈసందర్భంగా వీసీ యాదగిరిరావు, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం, రిజి స్ట్రార్ యాదగిరి మాట్లాడారు. అనంతరం పురుషోత్తంను వీసీ, రిజిస్ట్రార్లు సత్కరించారు. ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, సెమినార్ కన్వీనర్ పున్నయ్య, కోకన్వీనర్ సంపత్, అధ్యాపకులు రవీందర్రెడ్డి, పా త నాగరాజు, స్వప్న, శ్రీనివాస్, దత్తహరి ఉన్నారు. ప్రతి కోర్సుకు ఇంటర్న్షిప్ తప్పనిసరి రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం -
విద్యుత్ పునరుద్ధరణకు ‘హైపర్’
సుభాష్నగర్: భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించినప్పుడు అతి తక్కువ సమయంలో విద్యుత్ పునరుద్ధరణ చేపట్టేందుకు ‘హైపర్’ కార్యచరణ ప్ర ణాళిక రూపొందించామని సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) రాపెల్లి రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. హైపర్ను సమర్థవంతంగా నిర్వర్తించడానికి ప్రతి ఒక్క ఉద్యోగి బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి, కార్యచరణను మెరుగుపర్చుకుంటూ గణనీయమైన అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని స్పష్టంచేశారు. హైపర్ అంటే (haiper) హెచ్: హెడ్క్వార్టర్లో అప్రమత్తంగా ఉండటం ఏ: సిబ్బంది, సామగ్రి సమీకరణ ఐ: సమాచార సేకరణ, చేరవేయడం పీ: పటిష్ట వ్యూహాన్ని అమలు చేయడం ఈ: నిర్ధిష్ట కార్యాచరణ అమలు ఆర్: విద్యుత్ సరఫరా పునరుద్ధరణ. -
హామీల అమలుపై చేతులెత్తేసిన కాంగ్రెస్
ధర్పల్లి: బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఆరు గ్యారెంటీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణలో మాదిగలు 11 శాతం రిజర్వేషన్ కోరగా 9 శాతం అమలు చేసి వారికి అన్యాయం చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కర్క గంగారెడ్డి, చిలుక మహేశ్, నరేశ్ గౌడ్, రాము, మురళి గౌడ్, తిరుపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎండిన పంటకు రూ.30వేల పరిహారమివ్వాలి
మోపాల్: యాసంగిలో వరి సహా ఇతర పంటలకు నీరందక ఎండిపోతున్నాయని, ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎండిన వరి పొలాలను ఏఐకేఎంఎస్ బృందం పరిశీలించింది. అనంతరం తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్ఐ రాజేశ్వర్కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ.. రైతులు అప్పులు చేసి వరి, మొక్కజొన్న పంటలను సాగు చేశారని, తీరా పంట చేతికొచ్చే సమయంలో నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నారు. ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ఎండుతున్న పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఎండిపోయిన పంటలకు రూ.30 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల పాపయ్య, దేశెట్టి సాయిరెడ్డి, అగ్గు ఎర్రన్న, అగ్గు చిన్నయ్య, బండమీది నర్సయ్య, గంగాధర్, ప్రకాశ్, అబ్బయ్య, ఎల్లయ్య, మహేశ్, గణేశ్, వినోద్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పారిశుధ్య పనుల తనిఖీ
నిజామాబాద్ సిటీ: నగరంలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న చెత్త సేకరణ, పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ ఎస్ దిలీప్కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఖానాపూర్లోని చెత్త శుద్ధి కేంద్రాన్ని, నాగారంలోని డంపింగ్యార్డును శానిటరీ అధికారులతోకలిసి పర్యవేక్షించారు. బయోవేస్టేజీ విధానాన్ని చూశారు. చెత్తను రీసైక్లింగ్ చేసే ప్రక్రియ నిరంతరం చేపట్టాలని ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్, మున్సిపల్ ఈఈ మురళీమోహన్రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సాజిద్, డంపింగ్యార్డ్ ఇన్చార్జి ప్రభురాజ్ తదితరులు ఉన్నారు. పోలీస్ కార్యాలయాలను తనిఖీ చేసిన సీపీ ఖలీల్వాడి/ ఎడపల్లి: జిల్లా కేంద్రంలోని పోలీస్ కా ర్యాలయాలను సీపీ సాయిచైతన్య శుక్రవారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. భరోసా సెంటర్, షీ టీమ్ కార్యాలయం, పోలీస్ ఫిల్లింగ్ స్టేషన్, సౌత్ రూరల్ ఆఫీస్లను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సీపీ కార్యాలయంలో రికార్డులను తని ఖీ చేశారు. అదేవిధంగా ఎడపల్లి పీఎస్ను సీపీ తని ఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీపీ వెంట పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఉన్నారు. సీసీ రోడ్డు పనులు ప్రారంభం సిరికొండ: మండలంలోని న్యావనందిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రవీణ్, ముత్తెన్న, నరేందర్, జనార్దన్, సాగర్, తేజ, గణేశ్, చందు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
మోపాల్: మండలంలోని నర్సింగ్పల్లిలో ఉన్న ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు రెండోరోజు శుక్రవారం కొనసాగాయి. గుడ ధ్వజారోహణ దేవత ఆహ్వానం తర్వాత సంతానార్థులకు గరుడ ప్రసాదం అందించారు. సాయంత్రం శేష వాహన సేవలో స్వామి వారి ప్రతిమలను ఉంచి ఊరేగించారు. మనసా వాచ కర్మన ఆ దేవదేవుడిని నమ్మితే కలికాలంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని ఆచార్య గంగోత్రి రామానుజ దాసు స్వామి ప్రవచించారు. ఉత్సవం అంటే లోకమంతా సంతోషించడమని, బ్రహ్మోత్సవం అంటే సాక్షాత్తూ బ్రహ్మనే లోక కల్యాణం కోసం జరిపించే ఉత్సవమని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, నర్సారెడ్డి, నరాల సుధాకర్, ప్రసాద్, రాజేశ్వర్, రమేశ్, సాయిలు, భాస్కర్, మురళి, చిన్నయ్య, గంగారెడ్డి, నరేశ్, సురేశ్, యజ్ఞాచార్యులు శ్రీఖర్ ఆచార్య, స్వామి రోహిత్ కుమారాచార్యులు, విజయ్ స్వామి, శిఖామణి స్వామి తదితరులు పాల్గొన్నారు. -
అధ్వానంగా పశువైద్యశాల
ధర్పల్లి: మండల కేంద్రంలోని పశువైద్యశాల అధ్వానంగా మారింది. పూర్తిగా శిథిలావస్థకు చేరినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి అందులోనే మూగ జీవాలకు వైద్యం అందించాల్సిన దుస్థితి నెలకొంది. మూగజీవాలకు వైద్యం అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పశువైద్యశాలలను ఏర్పాటు చేసింది. వైద్యసేవలు అందిస్తున్నా.. కొత్త భవనాల నిర్మాణంలో మాత్రం ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ధర్పల్లిలో యాభై ఏళ్ల క్రితం నిర్మించిన పశు వైద్యశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. దీంతో పశువైద్య సిబ్బందితోపాటు వైద్యశాలకు వచ్చే పశు పోషకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవనం ఎప్పుడు ఏ క్షణాన కూలుతుందో అని సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. చిన్నపాటి వర్షాలు కురిస్తే పైకప్పు నుంచి వర్షపు నీరు గదుల్లోకి చేరుతోంది. పశువైద్యశాలలో ఉన్న మందులతో పాటు రికార్డులు తడిచిపోతున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలకు కనీస మరమ్మతులు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో మొత్తం గొర్రెలు 14,320, గేదెలు 6,668, మేకలు 4,200, ఆవులు 3,600 ఉన్నాయి. ఈ పశు వైద్యశాలలో జీవాలకు వైద్యం అందించడానికి పశువైద్యాధికారితో పాటు ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి శిథిలావస్థకు చేరిన భవనాన్ని తొలగించి నూతన భవన నిర్మాణం చేపట్టాల్సిర అవసరం ఎంతైనా ఉంది. భయాందోళనలో సిబ్బంది నూతన భవనం నిర్మించాలని గ్రామస్తుల వేడుకోలు -
హెచ్సీయూ భూముల విక్రయాన్ని నిలిపివేయాలి
నిజామాబాద్అర్బన్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడం సరికాదని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ఐటీఐ కళాశాల ఎదుట సీఎం రేవంత్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్ మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోరాటాలు, నినాదాలు చేయొద్దని రిజిస్ట్రార్ చే జీవో జారీ చేయడం అప్రజాస్వామికమని అన్నారు. ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని పోరాటాలు చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులపై కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని అన్నారు. కార్యక్రమంలో దినేశ్, రాజు, వికాస్, సాయి, రోహిత్, నరేశ్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో.. తెయూ(డిచ్పల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూముల అమ్మకం నిర్ణయా న్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బి శివ డిమాండ్ చేశా రు. తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో క్యాంపస్ కళాశాల వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొనఊపిరితో ఉన్న విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చే స్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే అంబేడ్కర్, ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను వే లం వేయాలని చూడటం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో నాయకులు సాయికుమార్, మోహన్, నా యకులు సమీర్, రోహన్, నవీన్, సాయికుమార్, అనిత, నవీన, విద్యార్థులు పాల్గొన్నారు. -
బీమా చెక్కు అందజేత
నిజామాబాద్ రూరల్: ప్రమాదవశాత్తు మృతి చెందిన గాయత్రి బ్యాంక్ ఖాతాదారుడి కుటుంబ సభ్యులకు ప్రమాదబీమా కింద రూ. ఒక లక్ష బీమా చెక్కును అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా శుక్రవారం అందజేశారు. బ్యాంకు ఖాతాదారుడు సదా రంజిత్ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించగా ప్రమా ద బీమా కింద రూ. ఒక లక్ష మంజూరైంది. బ్యాంక్ అధికారులు ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు సుమన్, మర్చక నవీన్, అంకం రాజేందర్ పాల్గొన్నారు. కవులకు సన్మానం నిజామాబాద్ రూరల్: తెలుగు–వెలుగు సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని సీతారాంనగర్లో ప్రముఖ కవులు మహేశ్బాబు, అశోక్ గణపతిశర్మలను సమాఖ్య ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి వీపీ చందన్రావు, కవులు పాల్గొన్నారు. సీపీకి వినతిపత్రం అందజేత నిజామాబాద్ రూరల్: విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న చేపట్టే వీర హనుమాన్ విజయయాత్రల అనుమతి కోసం సభ్యులు సీపీ సాయిచైతన్యకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అజరామర పదంలో 60 ఏళ్లు అని రూపొందించిన పుస్తకాన్ని సభ్యులు సీపీకి అందజేశారు. కార్యక్రమంలో తమల కృష్ణ, దినేశ్ ఠాకూర్, గాజుల దయానంద్, దాత్రిక రమేశ్, కోడిమల శ్రీనివాస్, నికేశ్, ఇందూరు సురేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రికెట్ కిట్లు..నిజామాబాద్అర్బన్: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు నిజామాబాద్ కెనరా బ్యాంక్ రీజినల్ చీఫ్ మేనేజర్ బి చంద్రశేఖర్, రీజినల్ అసిస్టెంట్ మేనేజర్ బి శ్రీనివాస్ శుక్రవారం రెండు క్రికెట్ కిట్లను కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డికి శుక్రవారం అందజేశారు. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా కళాశాలకు క్రికెట్ కిట్లను అందించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, బాలమ ణి, భరత్ రాజ్, రామస్వామి, ఉదయ్ భాస్క ర్, బ్యాంక్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం ఖలీల్వాడి: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ పి శంకర్ ఈ నెల 13న సారంగపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గ్రూప్ పర్సనల్ యాక్సి డెంట్ ఇన్సూరెన్స్ పరంగా మంజూరైన రూ. ఐ దు లక్షల చెక్కును సీపీ కార్యాలయంలో బాధిత కుటుంబానికి సీపీ అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ లు జి బస్వారెడ్డి, కె రామచంద్రరావు, ఏవో అనిసాబేగం, రిజర్స్ సీఐ శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షకీల్ పాషా తదితరులు ఉన్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఖలీల్వాడి: నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025–26 ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎన్నికల అధికారులుగా సీనియర్ న్యా యవాదులు వెంకటేశ్వర్, ఆర్ఎస్ఎల్ గౌడ్ల ను నియమిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ అడ్హాక్ కమిటీ చైర్మన్ ఆకుల రమేష్, స భ్యులు బాస రాజేశ్వర్, నరసింహరెడ్డి, శ్రీహరి ఆచార్య ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, క్రీడా కార్యదర్శి, సాంస్కతిక కార్యదర్శి, కోశాధికారి పదవులతో పాటు కార్యవర్గ సభ్యుల పదవులకు మార్చి 22 నుంచి 26వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. 27న నామినేషన్ పత్రాల పరిశీలన, 28న నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 4న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఉద యం పది నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు న్యాయవాదులు తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామన్నారు. -
‘పది’ పరీక్షలు.. విస్తృతంగా తనిఖీలు
డిచ్పల్లి/ ఇందల్వాయి/ సిరికొండ/ నిజామాబాద్ రూరల్: పదో తరగతి పరీక్షలు నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. డిచ్పల్లి మండలంలో ఏర్పాటు చేసిన ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1268 మందికి 1266 మంది హాజరు కాగా ఇద్దరు విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎంఈవో సుధాకర్రెడ్డి తెలిపారు. మోడల్ స్కూల్లో ఒకరు, గురుకుల పాఠశాలలో ఒకరు గైర్హాజరైనట్లు ఎంఈవో పేర్కొన్నారు. ఇందల్వాయి మండలంలోని గన్నారం, ఎల్లారెడ్డిపల్లె, సిర్నాపల్లి, ఇందల్వాయి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో మొత్తం 467 మందికి ఇద్దరు గైర్హాజరైనట్లు ఎంఈవో శ్రీధర్ తెలిపారు. సిరికొండ మండలంలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో 569 మందికి గాను సిరికొండ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు ఎంఈవో రాములు తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు. రూరల్ మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనట్లు పరీక్ష నిర్వహణ అధికారి భూమాగౌడ్ తెలిపారు. -
8.5 శాతానికి తగ్గిన ఎన్పీఏ
సుభాష్నగర్: ఎన్డీసీసీబీని రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపేలా సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, సొ సైటీ చైర్మన్లు కృషి చేయాలని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి అన్నారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం ఉన్న ఎన్పీఏ 8.5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. నగరంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాల యంలో శుక్రవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు వ్యా పార కార్యకలాపాలు రూ.1800 కోట్ల నుంచి రూ. 2100 కోట్లకు పెరిగిన సందర్భంగా చైర్మన్ కేక్ కట్ చేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్ రమేశ్రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరంలో ఎన్పీఏ తగ్గింపునకు సిబ్బంది చేసిన కృషి అభినందనీయమన్నారు. ఓటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, సీఈవో నాగభూషణం వందే, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఎన్డీసీసీబీని ప్రథమస్థానంలో నిలపాలి చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి -
కలెక్టరేట్ ముట్టడి
నిజామాబాద్ అర్బన్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. గుండె పోటుతో మృతి చెందిన కాంట్రాక్టర్ మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గానికి ఇటీవల ఎన్ఆర్ఈజీఎస్ పనులు మంజూరయ్యాయి. వీటిని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి ఇస్తున్నారని మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ఇవ్వడం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు సుమారు 400 మంది వివిధ వాహనాలలో నిజామాబాద్ కలెక్టరేట్కు తరలి వచ్చారు. కలెక్టరేట్ ప్రవేశం మార్గం వద్ద బైఠాయించారు. జిల్లా కలెక్టర్ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. ఎంపీడీవోలు నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిన వారికే పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. స్థానికంగా కలెక్టర్ లేకపోవడంతో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రవేశ మార్గం వద్దకు వచ్చి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారమే పనులు కేటాయించాలని ఆందోళనకారులు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అదే సమయంలో బీర్కూరు మండలం దామరంచకు చెందిన కాంట్రాక్టర్ ఇక్బాల్ గుండెపోటుతో ఆయన స్వగ్రామంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టర్ శవాన్ని కలెక్టరేట్కు తరలించి ఆందోళన చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను కలెక్టరేట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పెట్టిన ఇబ్బందుల వల్లనే కాంట్రాక్టర్ ఇక్బాల్ గుండెపోటుతో మరణించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గతంలో ఇక్బాల్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని, వేధింపులకు గురి చేస్తున్నాడని సామాజిక మాద్యమంలో పోస్టులు కూడా పెట్టినట్లు ఆందోళన కారులు పేర్కొన్నారు. మృత దేహంతో అరగంట పాటు నిరసన వ్యక్తం చేసి వెళ్లిపోయారు. ఆందోళనలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు, బాన్సువాడ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, గణేశ్ నందుపటేల్, కమలాకర్రెడ్డి వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా బాన్సువాడ కాంగ్రెస్ నాయకుల ఆందోళన గుండెపోటుతో మరణించిన కాంట్రాక్టర్ శవంతో నిరసన -
‘పది’ పరీక్షలు ప్రారంభం
నిజామాబాద్అర్బన్ / ఆర్మూర్ టౌన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు 22,774 మందికి విద్యార్థులకుగాను 22,715 మంది హాజరయ్యారు. 59 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభంకాగా గంట ముందు నుంచే విద్యార్థులను లోనికి అనుమతించారు. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రంలోకి పంపించారు. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీ క్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి, విద్యార్థులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. లోటుపాట్లకు తావులేకుండా స జావుగా పరీక్షలు నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులను ఆదేశించారు. ఎక్క డా కాపీయింగ్కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పెర్కిట్లో ని జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, చీఫ్ సూపరింటెండెంట్ కవిత ఉన్నారు. తొలిరోజు ప్రశాంతం కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు -
టౌన్ప్లానింగ్కు 14 మంది ఉద్యోగులు
నిజామాబాద్ సిటీ: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల టౌన్ప్లానింగ్ విభాగంలో 14 మంది ఉద్యోగులు కొత్తగా విధుల్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ ము న్సిపల్ కార్పొరేషన్కు ఏడుగురు, బోధన్కు నలుగురు, ఆర్మూర్కు ముగ్గురిని నియమించింది. కొత్తగా వచ్చిన ఉద్యోగులు శుక్రవా రం ఆయా మున్సిపాలిటీల్లో జాయినింగ్ రిపోర్టు అందజేశారు. టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్లుగా విధులు నిర్వర్తించనున్నారు. మహిళా సంఘాల ద్వారా విత్తనాల విక్రయం ● తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి నిజామాబాద్అర్బన్: వచ్చే ఖరీఫ్ సీజన్కు మహిళా సంఘాల ద్వారా వివిధ పంటల విత్తనాలు విక్రయించనున్నట్లు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళా సంఘాల ద్వారా తెలంగాణ సీడ్స్కు సంబంధించిన విత్తనాలను రైతులకు సరఫరా చేస్తామన్నారు. మహిళా సంఘం ద్వారా సరఫరా అయిన విత్తనాలకు పంటల మేరకు అమ్మకపు ధర పై 1 నుంచి 8 శాతం వరకు సేవ చార్జీలను అందిస్తామని తెలిపారు. నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయడంతో రైతులకు మే లు చేకూరడంతోపాటు మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించినట్లు అవుతుందన్నారు. సమావేశంలో డీఆర్డీవో సాయాగౌడ్, రీజినల్ మేనేజర్ రఘు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి నిజామాబాద్అర్బన్: అనధికార లే–అవుట్ల క్రమబద్ధీకరణకు, ప్లాట్ల రెగ్యులరైజేషన్కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో సూచించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన నిర్ణయాలు తీసుకుందన్నారు. ఎఫ్టీఎల్, నిషేధించిన సర్వే నెంబర్లు మినహా ఎల్ఆర్ఎస్కు దరఖా స్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించినట్లు తెలిపారు. రుసు ము ఎంత అనేది ఎవరైనా తమ సెల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి పరిశీలించుకోవాలన్నారు. దరఖాస్తుదారులు ఈనెల 31లోగా ఫీజు చెల్లిస్తే 25 శాతం రిబేటు వర్తిస్తుందని తెలిపారు. రుసుము చెల్లించిన వారి దరఖాస్తును అధికారులు పరిశీలించి వెంటవెంటనే అనుమతి మంజూరు చేస్తారన్నారు. డ్యూ లిస్టు ముందే సిద్ధం చేసుకోవాలి నిజామాబాద్ నాగారం: ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాల్సిన వారి జాబితా(డ్యూ లిస్ట్)ను ముందు రోజే సిద్ధం చేసి, లబ్ధిదారులందరికీ సమాచారం అందించాలని డీఎంహెచ్వో రాజశ్రీ సిబ్బందికి సూ చించారు. నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యా లయంలో శుక్రవారం వ్యాధి నిరోధక టీకాల విభాగం ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక టీకాల సూక్ష్మ ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. పీహెచ్సీల సిబ్బందికి పలు సూచన లు, సలహాలు చేశారు. అనంతరం ఆర్మూర్ ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తూ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందిన డాక్టర్ శ్రీకాంత్కు సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎంవో డాక్టర్ అతుల్ నెగి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి అశోక్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేలరాలిన రైతుకష్టం
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో వడగళ్ల వాన బీభ త్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలను ప్రకృతి దెబ్బతీసింది. గురు, శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల దెబ్బకు రైతుల కష్టం నేలరాలింది. రాళ్ల వానతో సిరికొండ, ధర్పల్లి మండలాల్లో కోత దశకు వచ్చిన వరికి తీవ్ర నష్టం జరిగింది. వడగళ్ల ధాటికి వరి గింజలు రాలిపోయాయి. కల్లాల్లో ఆరబెట్టిన వడ్లు, పసుపు పంట తడిపోయింది. మామి డి కాయలు రాలిపోయాయి. పంటలు దెబ్బతినడంతో రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పంటనష్టం లెక్కలు తీస్తున్నారు. శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించాలని వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వర్షాల భయానికి రైతులు ముందస్తు వరి కోతలకు వెళ్తున్నారు. ● ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లో గురువారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు గ్రామాల్లో వరి నేలకొరిగింది. మామిడి నేలరాలింది. కల్లాల్లో ఆరబోసిన పసుపు రాశులు స్వల్పంగా తడిశాయి. ధర్పల్లి : మండలంలోని హొన్నాజీపేట్, వాడి, మద్దుల్ తండా, గుడి తండా గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. పంట నేలకొరగడంతోపాటు వరి గింజలు రాలిపోయాయి. సిరికొండ: మండల కేంద్రంతోపాటు మైలారం చిన్న వాల్గోట్, పెద్దట్ల్గోట్, పోతు నూర్, కొండూర్ తదితర గ్రా మాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూ డిన వర్షం కురిసింది. వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కొండూరు గ్రామంలో వడగళ్ల వాన కురవడంతో ధాన్యం రాలిపోయింది. ఇందల్వాయి: మండలంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది. ఆరబోసిన ధాన్యం తడవకుండా కాపాడేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. బాల్కొండ: నియోజకవర్గంలో గురువారం రాత్రి అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. ఉడికించి ఆరబెట్టిన పసుపు తడిసింది. శుక్రవారం ఎండ తీవ్రత ఉండడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఇందల్వాయి: జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతుల్లో గుబులు పుట్టుకుంది. గతేడాది అకాల వర్షాలతో వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తుగా వరి కోతలు ప్రారంభించారు. గురువారం రాత్రి వర్షం కురవడంతో భయాందోళన చెందిన రైతులు.. శుక్రవారం ఉదయం వరికోత యంత్రాలను ఆశ్రయించారు. కాగా, వడగళ్ల వాన భయంతో గింజ పూర్తి పరిపక్వతకు రాకపోయినా వరి కోస్తున్నారు. ముందస్తు కోతలతో ధాన్యంలో తాలుశాతం పెరిగే అవకాశం ఉంది. దీంతో మిల్లర్లు రైతులను దోచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆదివారం వరకు వర్ష సూచన ఉండడంతో వేల ఎకరాల్లో పచ్చి వరిపైర్లను కోసే అవకాశం ఉంది. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పలు ప్రాంతాలలో కురిసిన వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. రాజంపేట మండలం అర్గొండలో 21 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మాచాపూర్లో 9 మిల్లీ మీటర్లు, దోమకొండలో 8.9 మిల్లీ మీటర్లు, సదాశివనగర్లో 6.3 మిల్లీ మీటర్లు, లింగంపేటలో 6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. లింగంపేట మండలంలోని లింగంపల్లి(ఖుర్దు) గ్రామంలో పిడుగుపాటుకు రెండు గేదెలు, అదే మండలంలోని పోతాయిపల్లిలో మూడు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. తిమ్మారెడ్డిలో ట్రాన్స్ఫార్మర్పై విద్యుత్ స్తంభం విరిగిపడింది. పలుచోట్ల వరి పంట నేలకొరిగింది. మక్క, జొన్న పంటలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దోమకొండ శివారులో ఓ రేకుల షెడ్డు గాలికి కొట్టుకుపోయింది. ముందస్తు కోతలు..కామారెడ్డిలో పిడుగులు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం సిరికొండ, ధర్పల్లి మండలాల్లో రాళ్లవాన వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం రెండు లక్షలు నష్టపోయా.. గతేడాది యాసంగిలో వ డగళ్ల వానకు వడ్లు మొ త్తం రాలిపోయాయి. దీంతో సుమారు రూ.2 లక్ష లు నష్టపోయా. ఈసారి కూడా అలాగే జరుగుతుందనే భయంతో ముందుగానే పంటను కోస్తున్నాం. పంటనష్టం తర్వాత ప్రభుత్వం ఇచ్చే పరిహారం కన్నా పచ్చివడ్లు అమ్మడం ద్వారానే డబ్బులు ఎక్కువ వస్తాయని భావిస్తున్నాం. – నోముల వెంకట్రెడ్డి, రైతు, నల్లవెల్లి. -
తెలంగాణలో పలు చోట్ల వర్ష బీభత్సం
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులతో వర్ష బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో పలు చోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం పడింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురిసింది.మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి వడగళ్ల వాన కురిసింది. కాగజ్ నగర్లో దుకాణాలపై కప్పులు కూడా ఎగిరిపోయాయి. పోచమ్మ గుడి ముందున్న సుమారు 150 ఏళ్ల వృక్షం నేలమట్టం అయ్యింది. దీంతో వాహనాలను ఆ మార్గం నుంచి వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు.జగిత్యాల జిల్లాలో వాతావరణం చల్లబడటంతో ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఊరట చెందారు. రాళ్లవానతో అక్కడక్కడా మామిడి రైతులకు నష్టం. వాటిల్లింది. గాలి దుమారానికి పిందెలు రాలిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో మంథని, రామగిరి, ముత్తారం, కమాన్పూర్, మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, ఎలిగేడు మండలం దూళికట్టలో వడగళ్ల వాన పడింది. అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. బోయిన్పల్లి రామడుగు మల్యాల మండలాల్లో మోస్తరు కంటే ఎక్కువ వర్షం కురుస్తోంది. -
వలస కార్మికులకు మొండిచేయి
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ వలస కార్మికులకు మరోసారి మొండిచేయి ఎదురైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో.. ఎన్నో సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించిన తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికుల ఆశలను తీర్చలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో.. గల్ఫ్ వలస కార్మికుల అంశంపై ప్రత్యేక హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం రూ.7.50 కోట్లను ఖర్చు చేసింది. ఈసారి మాత్రం ఎలాంటి కేటాయింపులు లేకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గల్ఫ్ బోర్డు ఏర్పాటుతో పాటు రూ.500 కోట్ల కేటాయింపులే లక్ష్యంగా వలస కార్మిక సంఘాలు కృషి చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులతో అనేకమార్లు సమావేశాలను నిర్వహించారు. సీఎం కూడా గల్ఫ్ వలస కార్మికుల ఆశలు తీర్చడానికి సానుకూలంగానే స్పందించారు. తీరా బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం, కనీసం వలస కార్మికుల సంక్షేమం ప్రస్తావనే లేకపోవడంతో వలస కార్మికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వలస కార్మికులను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తీరుపైనా అలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఎన్నోమార్లు చర్చించి.. గల్ఫ్ వలస కార్మికులు, వారి కుటుంబాల ఓట్లను రాబట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంది. గల్ఫ్ ఓటర్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందేవారు. ఒకవేళ ఓడినా.. ఓట్లలో వ్యత్యాసం తక్కువగా ఉండేది. అయినా వలస కార్మికులను కరివేపాకులాగా తీసి పారేశారని కార్మిక సంఘాలు వాపోతున్నాయి.చదవండి: యూఏఈకి ఉచిత వీసాలు.. నకిలీ గల్ప్ ఏజెంట్లకు చెక్ప్రభుత్వ తీరు సరికాదు వలస కార్మికుల ఆశలు తీర్చేలా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఆశించాం. ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయక నిరాశ మిగిల్చింది. వలస కార్మికుల శ్రమకు గుర్తింపు లేకపోవడం శోచనీయం. వలస కార్మికులు పంపే విదేశీ మారకద్రవ్యం అవసరం కానీ వారి సంక్షేమం పట్టక పోవడం సరైంది కాదు. – గుగ్గిల్ల రవిగౌడ్, చైర్మన్, గల్ఫ్ జేఏసీ -
వర్ష సూచన... రైతుల్లో ఆందోళన
డొంకేశ్వర్(ఆర్మూర్): వాతావరణ మార్పులతో జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. వడగళ్లు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు గురువారం జిల్లా వ్యవసాయ, ఇతర సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేరవేసింది. సమాచారం అందే సమయానికి జిల్లాలో వాతావరణ పరిస్థితులు సైతం మారిపోయాయి. సాయంత్రం 6 గంటల తర్వాత ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు కనిపించాయి. బోధన్ మండలం కల్దూర్కి, సాలూరా ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. అయితే రైతులు యాసంగిలో సాగు చేసిన వరి పంట చేతికొచ్చే దశలో ఉంది. బోధన్ లాంటి కొన్ని చోట్ల వరికోతలు కూడా మొదలయ్యాయి. మామిడి తోటల్లో కూడా కాయలు మధ్య దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో జిల్లాకు వర్షాలు, వడగళ్ల సూచన రావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వరి, మామిడి పంటలపై వడగళ్లు ఎక్కడ దాడి చేస్తాయోనని కలవరపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగవగా 1లక్షల ఎకరానికి పైగా కోత దశలో ఉంది. గతేడాది కూడా దే సమయంలో వడగళ్ల వాన పంటలను దెబ్బతీసి రైతులను నష్టానికి గురి చేసింది. వడగళ్లు కురిసే అవకాశం -
దూసుకొచ్చిన మృత్యువు
● విధుల్లో ఉన్న పోలీసులను ఢీకొన్న కారు ● ఓ కానిస్టేబుల్ మృతి, మరో కానిస్టేబుల్కు గాయాలు ● గాంధారిలో వేకువజామున కలకలం రేపిన ఘటన కామారెడ్డి క్రైం/గాంధారి: తెల్లవారుజామున గాంధారి నడిబొడ్డున అదుపుతప్పిన ఓ కారు బీభత్సం సృష్టించింది. బీట్ విధులు నిర్వహిస్తు న్న పోలీసులపైకి దూసుకు రావడంతో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మరణించగా మరొకరు గాయాలతో బయటపడ్డారు. గురువారం వేకువజామున 3 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గాంధారి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు వడ్ల రవికుమార్ (35) సుభాష్ హనుమాన్ టిఫిన్ సెంటర్ ఎదురుగా బీట్ డ్యూటీ నిర్వ హిస్తున్నారు. ఆ సమయంలో కామారెడ్డి వైపు నుంచి బాన్సువాడ వైపు వెళ్తున్న ఓ కారు అతివేగంగా దూసుకువచ్చి ఢీకొనడంతో రవికుమార్ అక్కడికక్క డే మరణించాడు. కారు దూసుకు రావడాన్ని సెకండ్ల వ్యవధిలో గమనించిన మరో కానిస్టేబుల్ సుభా ష్ వేగంగా పక్కకు దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైన సన్నిత్కు సైతం గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిని స్థానిక ఆర్ఎంపీ కుమారుడిగా గుర్తించారు. వాహనం నడుపుతున్న సమయంలో మద్యం మత్తులో ఉండొచ్చని భావిస్తున్నారు. మిన్నంటిన రోదనలు.. 2007 బ్యాచ్కు చెందిన రవికుమార్ది తాడ్వాయి మండలం దేమె గ్రామం కాగా, కామారెడ్డిలోని దేవునిపల్లిలో స్థిరపడ్డారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహించి ఇటీవలే గాంధారికి బదిలీ అయ్యాడు.అండగా ఉంటాం కానిస్టేబుల్ రవికుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద రవికుమార్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
డీఎస్ఏలో నూతన సభ్యుల నియామకం
ఖలీల్వాడి: జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ముగ్గురు సభ్యులు నియమితులయ్యారు. సోషల్ వర్కర్ ఆర్ సురేందర్, న్యాయ రంగం నుంచి జీ రవి ప్రసాద్, వైద్య రంగం నుంచి డాక్టర్ కవితారెడ్డిని నూతన సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ లీగల్ ఎఫైర్స్ సెక్రెటరీ, లెజిస్టేటివ్ అఫైర్స్ అండ్ జస్టిస్ ఆర్ తిరుపతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సభ్యులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ సిబ్బంది నాగేందర్, లైజనింగ్ ఆఫీసర్ శ్యామ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ సిబ్బందికి కళ్లద్దాలు, వాటర్ బాటిళ్లు ఖలీల్వాడి : ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బందికి సీపీ పోతరాజు సాయిచైతన్య కళ్లద్దాలు, వాటర్ బాటిళ్లను అందజేశారు. రవీంద్ర మెడికల్ ఏజెన్సీ సౌజన్యంతో గురువారం కమిషనరేట్ కార్యా లయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతిరోజూ మండుటెండను తట్టుకుని ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారన్నారు. సిబ్బందికి ఎలాంటి అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నా రు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయ ణ, సీఐ ప్రసాద్, రవీంద్ర ఫార్మసీ బాధ్యులు మధుసూదన్, సుధాకర్, సాయిలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. వ్యాధుల నిర్ధారణ పరీక్షలను పెంచండి నిజామాబాద్నాగారం: అసంక్రమిత వ్యా ధుల నిర్ధారణ పరీక్షలను నిర్దేశించిన లక్ష్యాలకనుగుణంగా చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి రాజశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. లక్ష్యం కంటే తక్కువ పరీక్షలు చేసిన ఆరోగ్య ఉప కేంద్రాల సిబ్బంది, ఏఎన్ఎం, ఎమ్హెచ్పీల పనితీరుపై స మీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. లక్ష్యాన్ని అందరూ ఈనెల చివరికల్లా పూర్తి చేయాలన్నారు. లేనిపక్షంలో మెమోలు జారీ చేస్తామన్నారు. అదేవిధంగా ఆరోగ్య ఉప కేంద్రం, పీహెచ్సీ స్థాయిలలో అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు జరిగే తీరును ఆరోగ్య ఉప కేంద్రాల వారిగా సమీక్షించడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఎవరూ కూడా వడదెబ్బకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓఆర్ఎస్, ఐవీ ఫ్లూయి డ్స్, అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కూలీల పనివేళల్ని ఉదయం 6 గంటల నుంచి 11 గంటలు లో పే ఉండేలా చూడాలని సూచించారు. ఎన్సీ డీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ యాద వ్, ఎన్సీడీ కోఆర్డినేటర్ పి.వెంకటేశం, జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, హెచ్ఈవో నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఇంటికీ మంచినీరందించాలి
నిజామాబాద్అర్బన్: ప్రజలకు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు వీలుగా ఆయా పథకాల కింద నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుతో కలిసి అమృత్ 2.0 పథకం పనుల ప్రగతిపై గురువారం సమీక్షించారు. వేసవి సీజన్లో నగరంలోని ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టాలన్నారు. రోడ్లు, ఇతర పెండింగ్ పనులను పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నామని, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నిజామాబాద్ మాస్టర్ ప్లాన్పై ఉన్నతాధికారులతో ఇటీవలే చర్చించామని తెలిపారు. మాస్టర్ ప్లాన్ అమలైతే నిజామాబాద్ నగరం మరింత వేగంగా అభివద్ధి చెందే ఆస్కారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే నగరపాలక సంస్థ పనితీరు కలెక్టర్ పర్యవేక్షణలో ఎంతో బాగుందని షబ్బీర్ అలీ ప్రశంసించారు. సమావేశంలో నుడా చైర్మన్ కేశ వేణు, మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ నగరంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే ధన్పాల్ పంపిణీ చేశారు. నిజామాబాద్ సౌత్, నార్త్ మండలాలకు చెందిన 565 మందికి రూ. 5.65 కోట్ల పైచిలుకు విలువ చేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా పేదలను ఆదుకోవడానికి ఎంతో కృషి చేస్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేస్తోందన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగు పర్చాలి మాస్టర్ప్లాన్పై అధికారులతో చర్చించాం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిజామాబాద్ నగరంలో అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష -
ఫుట్పాత్ల ఆక్రమణతో ఇబ్బందులు
నగరంలో ఫుట్పాత్లను ఆక్రమించడంతో పాదచారులు ఇ బ్బందులు పడాల్సి వస్తోంది. వేగంగా దూసుకొచ్చే వాహనాలు ఢీకొడుతున్నాయి. అసలు ఫుట్పాత్లు అనేవే కనిపించకుండా ఆక్రమించడం కారణంగా అంతా గందరగోళంగా ఉంటోంది. అధికారులు స్పందించి ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించాలి. – ముత్యాల వినోద్, నిజామాబాద్ బస్సులు ఆపడం లేదు నిజామాబాద్లో తిరిగేందుకు సిటీ బస్సులుండాలి. ఆ టోలు ఎక్కితే డబ్బు లు బాగా అడుగుతున్నారు. బాన్సువాడ నుంచి వచ్చే బస్సులు నాగారం వద్ద ఆపడం లేదు. బస్టాప్లు లేకపోవడంతో బస్సులను నడి రోడ్డుమీదనే ఆపుతున్నారు. దీంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి. – సరస్వతి, నాగారం -
‘ఆదుకోండి.. ప్లీజ్’
బాల్కొండ: పేద కుటుంబానికి పెద్ద కష్టమొచ్చింది. ఇద్దరు చిన్నారులూ జబ్బులతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెండోరా మండల కేంద్రానికి చెందిన ప్రదీప్, విజయ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కొడుకు లక్షిత్(12) హైపర్ టెన్షన్, కూతురు శ్రీసాన్వీ(6) జంక్ఫిట్స్ వ్యాధితో మతిస్థిమితం కోల్పోయింది. ప్రతి నెల చిన్నారుల మందుల కోసం రూ.20వేలు ఖర్చవుతోంది. ఒక్కొక్కరి వైద్యానికి రూ.4లక్షల వరకు ఖర్చవుతాయని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా పనిచేసే ప్రదీప్కు వచ్చే జీతం పిల్లల మందులకే సరిపోతుంది. దీంతో వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఫోన్ పే నంబర్ 99661 56006కు దాతలు ఆర్థికసాయం అందించాలని ప్రాధేయపడుతున్నారు. చిన్నారులకు పెద్దజబ్బులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు -
ఆరు గ్యారంటీలను అమలు చేశాం
నిజామాబాద్ సిటీ: బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తుందని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుచేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి చూసి ఓర్వలేని విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఐదేళ్లలో హామీలు అమలు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే అమలు చేశామని పేర్కొ న్నారు. 50 వేల ఎకరాలకు నీరందించే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్ మంత్రిని కోరినట్లు భూపతిరెడ్డి తెలిపారు. అప్పులు చేసైనా ఇచ్చిన హామీలు అమలుచేసి తీరుతామన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో బీజేపీ కేంద్రమంత్రులు విఫలమయ్యారని అన్నారు. తెలంగాణకు నిధులను రాకుండా బీజేపీ మంత్రులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, నాయకులు భూమారెడ్డి, రమేశ్, లింగం తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
టాటా.. బైబై ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ముగిశాయి. పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు చివరి పరీక్ష పూర్తవ్వడంతో కేంద్రాల వద్ద ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఇన్నాళ్లూ కలిసి చదివి..ఇక మీదట ఉన్నత చదువుల కోసం ఎక్కడెక్కడికో వెళ్తామంటూ పలువురు కన్నీరుపెట్టుకున్నారు. హాస్టల్ విద్యార్థులు సామగ్రిని తీసుకొని ఇళ్లకు ప్రయాణమయ్యారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్–నిజామాబాద్ నిజామాబాద్అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. చివరి రోజైన గురువారం ఇంటర్ సెకండియర్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 15,896 మంది వి ద్యార్థులకు 15,458 మంది హాజరుకాగా, 438 మంది గైర్హాజరయ్యారు. 57 పరీక్ష కేంద్రాలకు గాను 52 కేంద్రాలను తనిఖీ చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఈనెల 5న పరీక్షలు ప్రారంభం కాగా, మొత్తం 14 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. అధ్యాపకులను రిలీవ్ చేయాలి ఈనెల 22 నుంచి మొదటి స్పెల్, 24 నుంచి రెండో స్పెల్, 26 నుంచి మూడో స్పెల్, 28 నుంచి నాల్గో స్పెల్ మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. మూల్యాంకనం విధులకు గైర్హాజరైతే చ ర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్లు నిర్ణీత తేదీల్లో మ్యూల్యాంకనం విధులకు సంబంధిత అధ్యాపకులను రిలీవ్ చేయాలని ఆదేశించారు. రిలీవ్ చేయని ప్రిన్సిపాల్లపై బోర్డు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. చివరి రోజు 438 మంది గైర్హాజరు -
సబ్స్టేషన్లో మంటలు
మాచారెడ్డి : పాల్వంచ మండలం ఫరీద్పేట గ్రామంలోని 33/11 కేవీ సబ్స్టేషన్లో గురువారం మంటలు చెలరేగాయి. వెంటనే తేరుకున్న సిబ్బంది సరఫరాను నిలిపివేసి మంటలను ఆర్పారు. ఎండవేడిమికి కెపాసిటర్లు కాలిపోవడంతో మంటలు అంటుకున్నట్లు విద్యుత్ సిబ్బంది తెలిపారు. అనంతరం కెపాసిటర్కు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఫైనాన్స్ కార్యాలయానికి నిప్పు లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో జక్సాని శ్రీహరికి చెందిన ఫైనాన్స్ కార్యాలయ తలుపులకు బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. గమనించిన స్థానికులు యజమానికి సమాచారం అందించి మంటలను ఆర్పివేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. కాగా, ఇదే కాలనీలో గతంలో ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు అపహరించి దుండగులు బట్టలకు నిప్పు పెట్టి పారిపోయారు. మరోసారి అదేవిధంగా జరగడంతో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. కిరాణా దుకాణం దగ్ధం మాక్లూర్: మండలంలోని మదన్పల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఓ కిరాణా దుకాణం కాలిబూడిదైంది. మ దన్పల్లికి చెందిన అమ్ముల నాగరాజు జీవనోపాధి కోసం నెల రోజుల క్రితం గ్రామంలో ఓ మడిగెను అద్దెకు తీసుకొని కిరాణా దుకాణం నడుపుతున్నాడు. గురువారం దుకాణం పూర్తిగా దగ్ధం కాగా, అందులో ఉన్న సుమారు రూ.2 లక్షల విలువజేసే సరుకులు కాలిబూడిదయ్యాయి. విద్యుదాఘాతంతో జరిగిందా? ఎవరైనా నిప్పు పెట్టారా? అనేది తెలియడం లేదని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయమై తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశామని నాగరాజు తెలిపారు. -
ఇసుక తరలిస్తున్న వాహనాల సీజ్
మాచారెడ్డి : పాల్వంచ మండల కేంద్రంలో అను మతి లేకుండా ఇసుక తరలిస్తున్న లారీ, రెండు ట్రా క్టర్లను మాచారెడ్డి పోలీసులు గురువారం సీజ్ చేశా రు. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మోపాల్లో పొక్లెయిన్, ట్రాక్టర్.. మోపాల్ : మండలంలోని బాడ్సి గ్రామ వాగులోంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్, ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ గురువారం తెలిపారు. బుధవారం అర్ధరాత్రి వాగులో ఇసుక తవ్వుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకొని ఆరుగురిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రుద్రూర్లో రెండు టిప్పర్లు.. రుద్రూర్: మండలంలోని లక్ష్మీపూర్ క్యాంపు శివారులో బుధవారం రాత్రి రెండు ఇసుక టిప్పర్లను పట్టుకున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. -
సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ వా ణిజ్య విభాగం నిర్వహించే జాతీయ సదస్సు బ్రోచర్ను వీసీ ప్రొఫెసర్ యాదగిరి రావు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడు తూ జూన్ 24న తెయూ వాణిజ్య విభాగం, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ‘వికసి త్ భారత్ –2047 ట్రాన్స్ఫార్మెటివ్ రోల్ ఆఫ్ కా మర్స్’ అనే అంశంపై నిర్వహించే సదస్సును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వాణిజ్య విభాగం ప్రొఫెసర్ రాంబాబు, ప్రిన్సిపాల్ ప్రవీణ్, గంటా చంద్రశేఖర్, సంపత్, శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కార్యశాల పోస్టర్లు..తెయూ(డిచ్పల్లి): శోధ్ తెలంగాణ ఆధ్వర్యంలో పరిశోధన అంశంపై నిర్వహించనున్న రెండు రోజుల కార్యశాలను సద్వినియోగం చేసుకోవాలని వీసీ యాదగిరిరావు సూచించారు. తెయూలో కార్యశాల పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. తెయూ శోద్ కన్వీనర్ గుర్రపు శ్రీకాంత్ మాట్లాడుతూ పరిశోధక విద్యార్థులు కార్యశాలలో పాల్గొనేందుకు ఈ నెల 28వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. -
సేవ.. ప్రోత్సాహం @ తెలుగు వెలుగు
నిజామాబాద్ రూరల్: స్వశక్తికి ప్రోత్సాహం తోడైతే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరికి వారే యమునతీరే అన్నట్లుగా మారింది. ఇతరులను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు అరుదు. విద్యార్థులు, కళాకారులు, వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని 45 ఏళ్లుగా తోడుగా మేమున్నామంటూ ప్రోత్సహిస్తోంది తెలుగు వెలుగు సమాఖ్య. నిజామాబాద్ నగరంలోని సీతారాంనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బొక్కసం చంద్రశేఖర్రావు 1980లో ఉగాది పండుగ రోజు ‘తెలుగు వెలుగు సమాఖ్య’ను నెలకొల్పారు. నాటి నుంచి జిల్లాలో ఆయా రంగాల్లో రాణిస్తున్న ప్రతిభావంతులను సత్కరిస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతోంది విద్యార్థులు, కళాకారులకు గుర్తింపు తెలుగు వెలుగు సమాఖ్య ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 1980లో పదో తరగతిలో జిల్లా ప్రథములుగా వచ్చినవారిని బంగారు పతకాలతో సత్కరించారు. సెప్టెంబర్ 5న ప్రతి ఏడాది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తున్నారు. 1986లో జిల్లాలో సాహిత్యసేవ చేస్తున్న కవులు, కళాకారులు సైబా పరంధాములు, వీపీ చందన్రావు, కందాళై రాఘవాచార్య, శిల్పి రఘు, గర్శకుర్రి రాజేందర్ను సన్మానించారు. 1993లో జిల్లాలో నటుడు ఎన్టీఆర్ పేరిట అవార్డును స్థాపించి మొదటి అవార్డును ఇంద్రజాల ప్రదర్శకుడు రంగనాథ్కు ప్రదానం చేశారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తూ ప్రతిభాపాఠవాలు పెంపొందిస్తోంది. పేద కుటుంబాలకు ఆర్థిక సాయం, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నోట్బుక్కులు పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి, ఉగాది పురస్కారాలతో కళాకారులను సన్మానిస్తోంది. డాక్టర్స్ డే, టైలర్స్ డే, ఫొటోగ్రాఫర్స్ డే, మాతృభాషా దినోత్సవం, కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ 45 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది తెలుగు వెలుగు సమాఖ్య. ముఖ్య కార్యదర్శిగా సేవలందిస్తున్న చంద్రశేఖర్ ఇప్పటి వరకు ప్రముఖుల ప్రశంసలు, సన్మానాలు పొందారు. ప్రతిభకు పట్టాభిషేకం చేస్తున్న సమాఖ్య 45 ఏళ్లుగా సేవలుప్రతిభను వెలికితీసేందుకే.. కవులు, కళాకారులతోపాటు అన్నిరంగాల వారిని ప్రోత్సహించేందుకు సమాఖ్య ను ఏర్పాటు చేశాం. మాతృభాషను బతికించి భావితరాలకు దాని గొప్పదనాన్ని తెలియజేస్తున్నాం. సమాజంలో అన్నివర్గాలకు సేవ చేయ డం నా ఆశయం. – చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి -
పోలీసుల పేరిట డబ్బులు వసూలు.. యువకుడి అరెస్టు
రెంజల్(బోధన్): టాస్క్ఫోర్స్ పోలీసునంటూ ఓ వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన యువకుడిని గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రెంజల్ ఎస్సై సాయన్న తెలిపారు. ఈ నెల 17న నిజామాబాద్కు చెందిన రఫీక్ అనే వ్యక్తి తన ఆటోలో ధర్మాబాద్కు నూకలు, బియ్యం తరలిస్తు న్నాడు. రెంజల్ మండలం కందకుర్తి బ్రిడ్జి వద్ద అదే గ్రామానికి చెందిన తానాజీ సతీశ్ తాను టాస్క్ ఫోర్స్ పోలీసునంటూ ఆటోను ఆపాడు. రఫీక్ను బెదిరించి తనకు డబ్బులు ఇవ్వకపోతే ఆటోను సీజ్ చేస్తాననడంతో బాధితుడు రూ. 3 వేలు ఫోన్ పే చే శాడు. ప్రతినెలా రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా రఫీక్ అంగీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చివరికి అనుమానం వచ్చి డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు డ బ్బులు వసూలు చేసిన సతీశ్ ఓ యూట్యూబ్ చానల్లో విలేకరిగా పనిచేస్తున్నట్లు గుర్తించి రిమాండ్కు తరలించారు. భిక్కనూరులో ఇద్దరిపై కేసుభిక్కనూరు: విలేకరుల ముసుగులో డబ్బులు డి మాండ్ చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎ స్సై ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన లింగాల నవీన్ గౌడ్, అర్జున్ విలేకరులమంటూ డబ్బులు డిమాండ్ చేశారని భిక్కనూరులోని సిద్ధిరామేశ్వర మోటార్ షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
జిల్లా జడ్జిని కలిసిన సీపీ
ఖలీల్వాడి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాలను నిజామాబాద్ కోర్టు కార్యాలయంలో సీపీ పోతరాజు సాయిచైతన్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్కను అందజేశారు. సీపీని కలిసిన ప్రొబెషనరీ ఎస్సైలు ఖలీల్వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్యను ఎనిమిది మంది ప్రొబెషనరీ ఎస్సైలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్కను అందజేశారు. సీపీని కలిసిన వారిలో ప్రొబెషనరీ ఎస్సైలు సుస్మిత, సుహాసిని, కళ్యాణి, రమ, రాజేశ్వర్, కిరణ్ పాల్, శైలేందర్, శ్రీనివాస్ ఉన్నారు. వీడీసీపై ఫిర్యాదు బాల్కొండ: మెండోరా మండలం సావెల్ గ్రామంలో తమను వీడీసీ బహిష్కరించిందంటూ గురువారం రెండు కులాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామశివారులోని వాగు నుంచి ఇంటి నిర్మాణాలకు ఇసుకను తెచ్చుకుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎస్సై నారాయణను ‘సాక్షి’ వివరణ కోరగా.. సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతున్నామని, శుక్రవారం గ్రామాన్ని సందర్శించి పూర్తిస్థాయి విచారణ చేపడతామని తెలిపారు. ఆఫీసర్ లోపల.. బయట తాళం ● ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు తాళం వేసిన మతిస్థిమితం లేని వ్యక్తి కామారెడ్డి టౌన్: ప్రభుత్వ అతిథి గృహంలో అధికారి విశ్రాంతి తీసుకుంటుండగా, మతిస్థితిమితం లేని వ్యక్తి బయట నుంచి తాళం వేసి వెళ్లిన ఘటన గురువారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం రాత్రి విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక అధికారి విశ్రాంతి తీసుకున్నారు. గెస్ట్హౌస్ సిబ్బంది వస్తే ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు లోపల నుంచి గొళ్లెం పెట్టకుండా తాళం సోఫాపై పెట్టి విశ్రాంతి తీసుకున్నారు. గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు పైఅంతస్తులోకి వెళ్లగా అదే సమయంలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి నేరుగా గెస్ట్హౌస్ లోపలికి వచ్చి సోఫాపై ఉన్న తాళం తీసుకుని డోర్కు తాళం వేసి వెళ్లిపోయాడు. కాసేపటికి కిందికి వచ్చిన అధికారి.. డోర్కు బయటి నుంచి తాళం వేసి ఉండడంతో కంగుతిన్నారు. సిబ్బందికి ఫోన్ చేయగా, సుమారు గంటపాటు శ్రమించి తాళం తీశారు. -
ఆరు గ్యారంటీలు ఎత్తేసి భట్టి ప్రకటించిన వొట్టి బడ్జెట్
2025–26 బడ్జెట్ తెలంగాణ ప్రజలను వంచించేలా ఉంది. అసెంబ్లీ సాక్షిగా పూర్తిగా అబద్దాల చిట్టా చదివారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేమని చేతులెత్తేసినట్టే ఉంది. ఆర్థిక మంత్రి భట్టి వట్టి మా టలే చెప్పారు. కాకి లెక్కలతో అన్నివర్గాలను మో సం చేసినట్లు స్పష్టమైంది. మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ.2,500, ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం, చేయూత ద్వారా వృద్ధులకు, వితంతులకు పింఛన్ పెంపు, విద్యార్థినులకు ఉచిత స్కూ టీలు, నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఊసే లేదు. సగం కూడా రైతు రుణమాఫీ ఇవ్వకుండా పూర్తిగా ఇచ్చినట్లు చదివారు. కౌలు రైతుకు భరోసా ప్రస్తావన లేదు. ఎగ్గొట్టిన రైతు భరోసా ఊసే లేదు. ఏ రంగానికి తగిన కేటాయింపులు లేవు. ఆదా యం ఎలా సమకూర్చుకుంటారు, రెవెన్యూ లోటు ఎంత అనేది స్పష్టంగా చెప్పలేకపోయారు. యువ వికాసం పేరుతో కాంగ్రెస్ నాయకుల వికాసానికి మాత్రం రూ.6వేల కోట్లు అప్పనంగా అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. – వేముల ప్రశాంత్రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే -
సునీతావిలియమ్స్కు జననీరాజనం
మహిళలను ప్రోత్సహించాలి మహిళలు అన్నిరంగాల్లో ఆకాశమే హద్దుగా రాణిస్తారనేది పురాణ కాలం నుంచి తెలుస్తూనే ఉంది. అయితే తాజాగా సునీతావిలియమ్స్ సాధించిన విజయం విద్యార్థుల నుంచి మొదలు ప్రతిఒక్కరికీ ఆదర్శనీయం. భావితరాలకు సునీత జీవితం అతి పెద్ద పాఠం. ఆమె భారత సంతతికి చెందిన మహిళ కావడం మనందరికి గర్వకారణం. – సరళ మహేందర్రెడ్డి, హైకోర్టు న్యాయవాది● అంతరిక్షం నుంచి క్షేమంగా తిరిగి రావడం పై సర్వత్రా హర్షం ● ఆమె రాకకోసం ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలు ● ఆకాశం హద్దును చెరిపేసిందంటూ ప్రశంసలు ● భారత సంతతికి చెందిన మహిళ కావడంతో గర్వంగా ఉందని ప్రశంసలు -
రైతులకు ఇబ్బందులు ఎదురవ్వొద్దు
సుభాష్నగర్: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపారు. రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం ఆయా శాఖల అధికారులు, పీఏసీఎస్ ల సీఈవోలు, ఐకేపీ సీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలన్నారు. రైతులకు ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర చెల్లించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సన్నాలకు మద్దతుధరతోపాటు క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించనున్నట్లు తెలిపారు. సేకరణ లక్ష్యం 9లక్షల మెట్రిక్ టన్నులు యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా లక్షా 69వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేశా రని కలెక్టర్ తెలిపారు. 11.85 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా కాగా, 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇందులో 6.80 లక్షల మెట్రిక్ టన్నులు సన్న, 2.20 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ఉంటుందని వివరించారు. కొనుగోలు కేంద్రాలు 664 జిల్లాలో 664 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో సన్న ధాన్యం సేకరణకు 472, దొడ్డు ధాన్యం సేకరణకు 192 కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్రెడ్డి, డీసీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్, డీఏవో వాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సన్నాలకు రూ.500 బోనస్ నేటి నుంచి అందుబాటులోకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు సన్నాహక సమావేశంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు పకడ్బందీగా పర్యవేక్షించాలి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ హనుమంతు ఆదేశించారు. తూకం, తరుగు అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలన్నారు. ధాన్యం సేకరణ వివరాలను వెంటవెంటనే ఆన్లైన్లో ఎంట్రీ చేస్తే త్వరితగతిన చెల్లింపులకు అవకాశం ఉంటుందన్నారు. బిల్లుల చెల్లింపుల్లో తప్పిదాలు చేస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆరబెట్టి, శుభపర్చిన ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులను చైతన్యపర్చాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణాకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉంచుకుని వెంటవెంటనే మిల్లులకు తరలించాలన్నారు. రైతులు దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని సూచించారు. -
నగరంలో అర్ధరాత్రి సీపీ తనిఖీలు
ఖలీల్వాడి: నిజామాబాద్ నగరంలో సీపీ పోతరాజు సాయిచైతన్య మంగళవారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఎల్లమ్మగుట్ట, ఎల్ఐసీ చౌరస్తా, దేవీరోడ్డు చౌరస్తా, పూలాంగ్ చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా, పెద్దబజార్, నెహ్రూపార్క్, హైమదీబజార్, బోధన్ బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆటోల ఆర్సీలు, డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించి ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఎలాంటి పని లేకుండా రాత్రి సమయంలో రోడ్లపై తిరిగే యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించి ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్వోలకు సలహాలు, సూచనలు చేశారు. రోడ్లపై తిరుగుతున్న యువకులకు కౌన్సెలింగ్ -
కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకునే బడ్జెట్..
బడ్జెట్ కేవలం కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకునేవిధంగా ఉంది. మ హిళలకు, వృద్ధులకు, చేనేత కార్మికులకు, ఆటో కార్మికులకు, దళితులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇందూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ బడ్జెట్లో దీనిపై స్పష్టత లేదు. వ్యవసాయ కేటా యింపులు కేవలం రైతుభరోసాకు మాత్రమే సరిపోతాయి. రుణమాఫీ, రైతు కూలీలు, కౌలు రైతుల సంక్షేమానికి నిధులు ఇవ్వలేదు. జక్రాన్పల్లి ఎయిర్పోర్టు ప్రస్తావన లేదు. తెలంగాణ యూనివర్సిటీకి నిధులు కేటాయించలేదు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు హామీ ఇచ్చినప్పటికీ దాని ఊసే లేదు. యువవికాసం పేరిట కాంగ్రెస్ కార్యకర్తలకు రూ.6వేల కోట్లు పంచడం సిగ్గుచేటు. – కులాచారి దినే్శ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
జమీల్ అహ్మద్కు అబ్దుల్ కలాం నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో హిందీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎండీ జమీల్ అహ్మద్ బోధన, పరిశోధన రంగంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. బెంగుళూరుకు చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ సంస్థ సోమవారం అవార్డును అందజేసింది. తెయూ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి అవార్డు అందుకున్న జమీల్ అహ్మద్ను బుధవారం అభినందించారు. కార్యక్రమంలో టూటా అధ్యక్షుడు ఏ పున్నయ్య, ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, అధ్యాపకులు సత్యనారాయణ రెడ్డి, మహమ్మద్ అబ్దుల్ ఖవి, మూసా ఖురేషీ, పార్వతి, గుల్–ఏ–రాణా తదితరులు పాల్గొన్నారు. -
ఇంటిబాట
రాష్ట్ర బడ్జెట్పై మిశ్రమ స్పందనలగేజీ తీసుకొని ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థినిఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ముగిశాయి. చివరి రోజు పరీక్ష రాసిన అనంతరం కేంద్రాల నుంచి బయటికి వచ్చిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కేరింతలు కొడుతూ సందడి చేశారు. హాస్టల్ విద్యార్థులు తమ లగేజ్లు పట్టుకొని ఇంటిబాట పట్టారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ అసెంబ్లీలో బుధవారం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై జిల్లాలో మిశ్రమ స్పందన వచ్చింది. అన్నివర్గాలకు మేలు చేసే బడ్జెట్ అంటూ కొందరు సమర్థించగా, విద్యారంగంతోపాటు బీసీ కార్పొరేషన్కు బడ్జెట్లో మొండి చేయి చూపినట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. బడ్జెట్ అంకెల గారడీ నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడి. నిజాం షుగర్, సారంగపూర్ చక్కెర పరిశ్రమ పునరుద్ధరణ, పసుపు శుద్ధి కార్మాగారాన్ని నిర్మించేందుకు నిధులను కేటాయించలేదు. నగరాభివృద్ధికి నిధులివ్వలేదు. – రమేశ్బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి క్రీడా రంగానికి పెద్దపీట నిజామాబాద్నాగారం: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో క్రీడారంగానికి పెద్దపీట వేసింది. రూ. 465 కోట్లు కేటాయించడం హర్షణీయం. త్వరలోనే జిల్లా కేంద్రంలో ఎనిమిది లైన్లతో స్టేడియం నిర్మాణం జరుగుతుంది. – సయ్యద్ ఖైసర్, జాతీయ అథ్లెటిక్స్ గోల్డ్ మెడలిస్టు, కాంగ్రెస్ నాయకులు విద్యాశాఖకు తగ్గిన కేటాయింపులు -
మానసిక వికాసానికి క్రీడలు దోహదం
తెయూ(డిచ్పల్లి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడా నైపుణ్యాలను అలవర్చుకోవాలని, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరి రావు తెలిపారు. తెయూ క్యాంపస్ క్రీడామైదానంలో యాన్యువల్ డే స్పోర్ట్స్ మీట్ –2025ను బుధవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జీవితంలో గెలుపు, ఓటములు సహజమని ఈ విషయాన్ని విద్యార్థులు క్రీడాపోటీల ద్వారా అలవర్చుకోవాలన్నారు. ఈ నెల 29వరకు పోటీలు జరుగుతాయన్నారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీలను బాలికలకు, బాలురకు వేర్వేరుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధ్యాపకులకూ వాలీబాల్, క్రికెట్ పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, పీఆర్వో ఏ పున్నయ్య, స్పోర్ట్స్ డైరెక్టర్ జీ బాలకిషన్, పీడీ బీఆర్నేత, కోచ్లు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. వీసీ ప్రొఫెసర్ యాదగిరి రావు తెలంగాణ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మీట్– 2025 ప్రారంభం -
నీటితొట్టిలో పడి చిన్నారి మృతి
నిజాంసాగర్(జుక్కల్): ఇంటి ఎదుట సరదాగా ఆడుకుంటూ వెళ్లి పశువుల నీటి తొట్టిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్నగర్ మండలం సింగీతంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సింగీతం గ్రామానికి చెందిన బిచ్చం గజ్జెలయ్యకు ఇద్దరు భార్యలు. చిన్న భార్య సుశీల కూతురు దుర్గాభవాని(3) బుధవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ వెళ్లి పశువుల నీటి తొట్టిలో పడింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న దుర్గాభవానీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అనుమానం వచ్చి నీటితొట్టిలో చూడగా అప్పటికే చిన్నారి నీట మునిగి మరణించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అద్భుతమైన పునరాగమనం
అంతరిక్షం నుంచి భూమికి 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ రాక నిజంగా అంతరిక్ష శాస్త్రం, సాంకేతికతలో పురోగతికి గొప్ప రుజువు. అంతరిక్ష వాతావరణంలో సూక్ష్మజీవులు, మొక్కల మనుగడపై పరిశోధన చేసింది. యువ శాస్త్రవేత్తలు సునీతా విలియమ్స్ను స్ఫూర్తిగా తీసుకొని భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్వన్గా నిలబెట్టాలి. – డాక్టర్ వాసం చంద్రశేఖర్, అధ్యాపకులు, తెయూ దేశానికి గర్వకారణం రుద్రూర్: వ్యోమగామి సునీ తా విలియమ్స్ క్షేమంగా భూ మిపై అడుగుపెట్టడం ఎంతో ఆనందం కలిగించింది. భార త సంతతికి చెందిన ఆమె సునీత అంతరిక్షంలో అధిక రోజులు ఉండి రావడం గర్వకారణం. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని నిరూపించారు. – శ్రీకాంత్ , పొతంగల్ సునీత తెగువ స్ఫూర్తిదాయకం బోధన్: అంతరిక్షంలో పరిశోధనకు వెళ్లి తొమ్మిది నెలల తర్వాత వచ్చిన సునీతా విలియమ్స్ సాహసం, పట్టుదల నేటి యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకం. మహిళలు ఏ రంగంలోనైనా ప్రతిభ చాటి సత్తాచాటుతారని నిరూపించారు. – నవిత, విద్యావంతురాలు, ఠాణాకలాన్ (ఎడపల్లి) స్ఫూర్తిమంతురాలు సునీతా విలియమ్స్ అందరికీ స్ఫూర్తిమంతురాలు. అంతరిక్షంలో ఆమె చేసిన ప్రయాణం నిజంగా అద్భుతం. భారత సంతతికి చెందిన వ్యోమగామి కావడం గర్వకారణం. – బాలకృష్ణ, ఆర్మూర్ -
విద్యుదాఘాతంతో కూలీ మృతి
భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఆ రోగ్య ఉప కేంద్రం భవన ని ర్మాణ పనులు చేస్తున్న ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో బుధవారం మృతి చెందాడు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రాములు (32) బస్వాపూర్ ఆ రోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం సెంట్రింగ్ పనులు చేస్తుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు భిక్కనూరు పోలీసులకు సమాచారం అందించారు. సిరికొండలో రైతు.. సిరికొండ: మండలంలోని దుప్యతండాకు చెందిన రైతు మలావత్ రమేశ్(45) పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్సై ఎల్ రామ్ బుధవారం తెలిపారు. పొలానికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన రమేశ్ తిరికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా మోటారు వైరు తగిలి చనిపోయినట్లు గుర్తించారన్నారు. మృతుడి భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రొఫెసర్ కనకయ్యకు పురస్కారం
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ అధ్యాపకులు ఆచార్య గుండె డప్పు కనకయ్యకు తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ‘ఆచార్య మడుపు కులశేఖరరావు’ పురస్కారం ప్రదానం చేశారు. హైదరాబాద్లో బుధవారం రాత్రి జరిగిన ‘ధర్మనిధి సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం’ కార్యక్రమంలో ఆచార్య కనకయ్యకు పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సంస్థ ప్రతినిధులు, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు. పన్ను చెల్లించని సీడ్స్ కంపెనీ సీజ్ ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న మారుతీ సీడ్స్ కంపెనీని కమిషనర్ రాజు ఆదేశాల మేరకు సీజ్ చేసినట్లు మున్సిపల్ మేనేజర్ హయ్యూమ్ తెలిపారు. రెండు సంవత్సరాలుగా సీడ్స్ కంపెనీ మున్సిపల్కు ఆస్తిపన్ను చెల్లించడం లేదని పేర్కొన్నారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో సీజ్ చేశామన్నారు. హనుమాన్ మందిరంలో చోరీసదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ఉత్తునూర్ గ్రామ హనుమాన్ మందిరంలో మంగళవారం రాత్రి అదే గ్రామానికి చెందిన తూర్పు శ్రీకాంత్(28) చోరీకి పాల్పడ్డాడు. గుడిలోని హుండిని పగులగొట్టడంతో గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడ్డ శ్రీకాంత్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు గతంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. ● నిందితుడికి దేహశుద్ధి చేసిన ఉత్తునూర్ గ్రామస్తులు ● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి -
ఇంటర్ ద్వితీయంలో 475 మంది గైర్హాజరు
● నేటితో ముగియనున్న ఫస్టియర్ పరీక్షలునిజామాబాద్అర్బన్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం 16,766 మంది విద్యార్థులకు 16,291 మంది హాజరుకాగా, 475 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 57 పరీక్షా కేంద్రాలకు 54 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. కాగా, నేడు (బుధవారం) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగియనుండగా, గురువారం ద్వితీయ సంవత్సర పరీక్షలు పూర్తికానున్నాయి. చిరుత కోసం గాలింపు ఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలంలోని జానకంపేట, ఠాణాకలాన్, నవీపేట్ మండలంలోని అబ్బాపూర్ అటవీ ప్రాంతాల్లో చి రుత పులి కోసం మూడు బృందాలు గా లింపు చేపట్టాయి. జానకంపేట సీటీసీతో పాటు అటవీ ప్రాంతాల్లో రెండురోజులపాటు పరిశీలించిన అధికారులు చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పంట పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. బృందంలో సెక్షన్ ఆఫీసర్ ప్రతాప్, బీట్ ఆఫీసర్ ప్రవీణ్, ఫారెస్టు అధికారులు ఉన్నారు. ఏప్రిల్ 27న మోడల్ స్కూల్ ప్రవేశపరీక్ష నిజామాబాద్ అర్బన్: మోడల్ స్కూల్ అడ్మిషన్లకు ఏప్రిల్ 27న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశానికి 27న ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, పదో తరగతికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆ సక్తి గల విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లా సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంతెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలను వ ర్సిటీ వైస్ చాన్స్లర్ టి యాదగిరి రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీసీ వెంట న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న రాణి, అడిషనల్ కంట్రోలర్ టి సంపత్ ఉన్నారు. పరీక్షలకు 42 మందికి 33 మంది హాజరు కాగా 9 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఎస్బీ ఏసీపీకి ఏఎస్పీగా పదోన్నతి ఖలీల్వాడి: నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ శ్రీనివాస్ రావు కు అదనపు ఎస్పీగా పదోన్నతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 15 మంది ఏసీపీలకు పదోన్నతులు కల్పిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప దోన్నతి పొందిన ఏసీపీలను డీజీపీ కార్యాల యంలో రిపోర్టు చేయాలని తెలిపారు. -
నేడు జీజీహెచ్ డైట్ టెండర్
నిజామాబాద్నాగారం: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో డైట్ టెండర్ అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఏళ్ల తరబడిగా గుట్టుచప్పుడు కాకుండా టెండర్ ప్రక్రియ కొనసాగగా.. సాక్షిలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో 2024 జూలై 11న డైట్ సప్లయ్ టెండర్ విడుదల చేసి అదే నెల 16వరకు దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వివిధ కారణాలతో మూడుసార్లు టెండర్లు వాయిదా పడుతూ వస్తోంది. కాగా, టెండర్లో అర్హత ఉన్న ఐదుగురు సభ్యులతో మంగళవారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ చాంబర్లో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కాగా, అధికారులు మాత్రం ప్రస్తుతం ఉన్న వారికే డైట్ సప్లై టెండర్ అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏళ్ల తరబడి అనుభవం, బిల్లులు సకాలంలో మంజూరు కాకపోయినా డైట్ సప్లై చేస్తారని చెబుతున్నారు. కానీ, మిగతా టెండర్దారులు మాత్రం లక్కీ డ్రా తీయాలంటూ పట్టుబడుతున్నారు. ‘టెండర్ ప్రక్రియ ఇప్పటికే ఆలస్యమవుతుంది. ఏది ఏమైనా అధికారులు బుధవారం టెండర్ ఫైనల్ చేసి తీరుతాం’ అని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. ● పాతవారికే అప్పగించేందుకు అధికారుల మొగ్గు ● లక్కీ డ్రా కోసం పట్టుబడుతున్న టెండర్దారులు -
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న 50వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నిజామాబాద్ నగర సమస్యలపై ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. నగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.4 కోట్లు మంజూరు చేయాలని, వాటిని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రధాని మోదీ ఫొటో తప్పక ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ వర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయాలని, జిల్లా కేంద్రంలోని బస్టాండ్ను ఆధునీకరించేందుకు నిధులివ్వాలని తెలిపారు. ఐటీ హబ్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ -
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
నిజామాబాద్ అర్బన్: సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్లు మంగళవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. వాగ్వాదాలు, తోపులాటలు, అరెస్టులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు మంగళవారం మెరుపు ముట్టడి చేపట్టారు. ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు గేట్లు మూసేసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సీఐటీయూ నాయకులతోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేయగా అంగన్వాడీలు అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏసీపీ రాజా వెంకటరెడ్డి, రూరల్ సీఐ సురేశ్ ఆధ్వర్యంలో నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలంటూ అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోగా, కాసేపు తోపులాట జరిగింది. అనంతరం కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు నిరసన ప్రాంతానికి చేరుకొని అంగన్వాడీలతో మాట్లాడారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయినా కూడా అంగన్వాడీలు వినకుండా ప్రవేశమార్గం వద్ద మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిరసన కొనసాగించారు. దీంతో కలెక్టరేట్లోనికి వెళ్లే ఉద్యోగులు బయటే నిలబడిపోయారు. అనంతరం పోలీసులు భారీ బందోబస్తుతో ఆందోళనకారులను నిలువరించారు. లోపలికి వెళ్లేందుకు అంగన్వాడీల యత్నం అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు నిరసనకారులతో మాట్లాడిన కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు -
వివాదాలకు కేరాఫ్గా అధికారులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో సుదీర్ఘకాలం సర్వీసులో ఉండే బ్యూరోక్రాట్లు, అధికారులు, ఉద్యోగులు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన నేపథ్యంలో తరచూ వివాదాస్పదం అవుతున్నారు. ఈ విషయమై ఉమ్మడి జిల్లాలో బీజేపీ నేతలు ఆయా అధికారు ల వ్యవహారశైలిపై బహిరంగంగానే నిప్పులు చెరుగుతున్నారు. దీంతో ఈ విషయాలు సాధారణ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నా యి. ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఇలా వివా దాలకు కేరాఫ్గా మారుతుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ● తాజాగా నిజామాబాద్లో కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని పసుపు బోర్డు సమావేశంలో చైర్మన్ పల్లె గంగారెడ్డి నేరుగా జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుపైనే విమర్శలు సంధించారు. జనవరిలో పసుపు బోర్డు తాత్కాలిక కార్యాలయాన్ని వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్లోనే నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ను సంప్రదించగా పండుగ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరంటూ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తిరస్కరించారని గంగారెడ్డి అధికారిక సమావేశంలోనే తెలిపారు. కొన్ని అపోహలు తొలగించేందుకు ఈ విషయాన్ని జిల్లా ప్రజలకు తెలపాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. దీంతో అక్కడకు వచ్చిన రైతులు, ఉన్నతాధికారుల్లో చర్చ జరిగింది. ఇదిలా ఉండగా మంగళవారం జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో సీనియర్ ఐఏఎస్లు, జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొన్న సమావేశం గురించి సైతం జిల్లా పౌరసంబంధాల అధికారికి తెలియకపోవడం గమనార్హం. ● జక్రాన్పల్లి మండలంలోని లక్ష్మాపూర్లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్ విషయమై కేఆర్ సుదర్శన్రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు తీసుకుని కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ కిరణ్లకు ఫిర్యాదులు చేశారు. అక్రమ క్రష ర్ నిర్వాహకుడికి అనేకసార్లు నోటీసులు ఇచ్చా రు. చర్యలు తీసుకోలేదని అడిగితే ఆ విషయమే తమకు తెలియదని చెబుతున్నారని సుదర్శన్రెడ్డి తెలిపారు. ఈ విషయమై సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు చెరుగుతున్న బీజేపీ నేతలు ఆర్టీఐ దరఖాస్తులను పట్టించుకోవడంలేదని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే కేవీఆర్ పసుపు బోర్డు ప్రారంభ సమావేశానికి సహకరించని కలెక్టర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేయనీయలేదు : బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శాసనసభలోనే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. కామారెడ్డిలో విద్య, వైద్య శాఖల్లో వివిధ అంశాలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద 86 దరఖాస్తులు ఇస్తే ఏమాత్రం సమాధానాలు ఇవ్వలేదన్నారు. పైగా తానే స్వయంగా దరఖాస్తు ఇవ్వడా నికి వెళితే ఇలాంటివి చాలా చూశాం.. అ య్యేవా.. పోయేవా అంటూ ఉద్యోగులు, అ ధికారులు మాట్లాడారన్నారు. అధికారుల కు ఇది మంచి పద్ధతి కాదన్నారు. సదరు అధికారుల పేర్లు సైతం చెప్పగలుగుతానన్నారు. సమాచారం అధికారులు ఇచ్చేది లేదని చెబితే ఎలా అన్నారు. ప్రతీది ఫైల్తో సహా తనవద్ద ఉందన్నారు. అధికారులు గౌరవంగా వ్యవహరిస్తే బాగుంటుందన్నా రు. ఈ ప్రవర్తన అందరికీ సిగ్గుచేటన్నారు. పద్ధతి మార్చుకోకుండా రాబోయే కాలంలో తన పద్ధతి మార్చుకునేలా చేస్తారా అని అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో ఓడినవారు, నియోజకవర్గం నుంచి పారిపోయిన వారి పేరిట ప్రతిపాదనలు ఇవ్వడమేమిటి.. ఇన్చార్జి మంత్రి మంజూరు చేయడమేమిటన్నారు. ఇలా అయితే ప్రజలచే ఎన్నుకోబడిన తానేం చేయాలంటూ పరోక్షంగా షబ్బీర్ అలీపై కేవీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు. -
పంట రుణాలకు ప్రాధాన్యమివ్వాలి
నిజామబాద్ అర్బన్: పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యమివ్వాలని, రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీఫ్, రబీ సీజన్లకు కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, రానున్న సీజన్లో రైతాంగానికి అందించాల్సిన పంట రుణాలు తదితర అంశాలపై బ్యాంకుల వారీగా అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉన్నాయని అన్నారు. వందశాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సమర్ధవంతంగా అందించాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఇబ్బంది లేకుండా అర్హత కలిగిన రైస్మిల్లర్లకు వెనువెంటనే బ్యాంకు గ్యారెంటీలను మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలని హితవు పలికారు. ఎస్బీఐ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పూర్తిచేసుకున్న యువతకు యూనిట్ల స్థాపన కోసం రుణాలు అందించాలన్నారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీవో పథ్వీ, డీఆర్డీవో సాయాగౌడ్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ అశోక్ చవాన్, నాబార్డు ఏజీఎం ప్రవీణ్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ సురేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్ -
నిరంతర సేవలు
పసుపు రైతుకురైతుల సలహాలను స్వీకరిస్తాంసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు రైతులు తాము పండించిన పంటకు అదనపు విలువ జోడించి, ‘విలువ ఆధారిత ఉత్పత్తి’ని తీసుకురావాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సూ చించారు. ఇందుకోసం రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీవో)లను మరింతగా ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. మంగళవారం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో పసుపు రైతులు, ట్రేడర్ల అనుసంధాన సమావేశం నిర్వహించారు. చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ రైతులు ఎఫ్పీవోలుగా ఏర్పడాలన్నారు. దీంతో ఎగుమతిదారులతో నేరుగా వ్యాపారం చేసేలా ఎదగొచ్చన్నారు. ప్రపంచంలో అత్యధికంగా 80 శాతం పసుపు భారత్లోనే రైతులు పండిస్తుండగా, ఇందులో 90 శాతం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల రైతులే పండిస్తున్నారన్నారు. 2023–24 సీజన్లో భారత్ నుంచి 226.58 మిలియన్ డాలర్ల విలువైన 1,62,018 టన్నుల పసుపును ఎగుమతి చేశామన్నారు. 2023–24 సీజన్లో దేశంలో 3.05 లక్షల హెక్టార్లలో రైతులు పసుపు సాగు చేశారన్నారు. 10.74 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందన్నారు. పసుపునకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో సుగంధ ద్రవ్యాల బో ర్డు నుంచి విడదీసి ప్రత్యేకంగా నిజామాబాద్లో కేంద్ర ప్రభు త్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందన్నా రు. పసుపు బోర్డు ద్వారా రైతులకు, ట్రేడర్లు, అంతర్జాతీయ ఎగుమతిదారులతో నిరంతరం అనుసంధానం చేస్తామన్నారు. పసుపు బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 23న నాగ్పూర్, 24న చైన్నె, 26న మేఘాలయ రాజధాని షిల్లాంగ్లలో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నిజామాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో పండిస్తున్న పసుపునకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందన్నారు. దీంతో ఎంపీ ధర్మపురి అర్వింద్ పట్టుబట్టి మరీ ఇందూరుకు పసుపు బోర్డు తీసుకొచ్చారన్నా రు. ఈ బోర్డు కార్యకలాపాలను విడతలవారీగా విస్తరించుకుంటూ వస్తామన్నారు. ప్రస్తుత సీజన్కు సంబంధించి పసుపు మార్కెట్కు వస్తున్న నేపథ్యంలో రైతులకు, ఎగుమతిదారులకు నేరుగా లింక్ ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈ సదస్పు ఏర్పాటు చేశా మన్నారు. రైతులకు ఇకమీదట నిరంతరం పసుపు బోర్డు ద్వారా అన్నిరకాలుగా పూర్తి సహకారం, ప్రోత్సాహం ఉంటుందన్నారు. జిల్లాలో పసుపు బోర్డు కార్యకలాపాలు విస్తరించిన తరువాత పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నా మని పేర్కొన్నారు. ఎఫ్పీవోలతో పాటు ఒక్కొక్క రై తును సైతం ప్రో త్సహిస్తామన్నా రు. రైతులను నేరు గా ట్రేడర్లు, ఎగుమతిదారులతో లింక్ చే సేందుకు నిరంతరం సమన్వయ సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త వంగడాల కోసం రీసెర్చ్, ఉద్యాన శాఖ, ఎంఎస్ఎంఈ, ట్రేడర్లు, ఎగుమతిదారులతో రైతులను అనుసంధానం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. మధ్యవర్తులు, ఏజెంట్లు లేకుండా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో స్పైసెస్ బోర్డు, టర్మరిక్ బోర్డు రీసెర్చ్ డైరెక్టర్ రేమాశ్రీ, జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, శాస్త్రవేత్తలు, నాబార్డ్, జిల్లా పరిశ్రమల కేంద్రం బాధ్యులు, రైతులు, 80 మంది ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం లేని అమ్మకాలకు కృషి కర్షకులు రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి విలువ ఆధారిత ఉత్పత్తులతో మరింత మేలు ట్రేడర్లు, అంతర్జాతీయ ఎగుమతిదారులతో రైతులకు అనుసంధానం జిల్లాలో పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి రైతులు, ట్రేడర్ల సమావేశంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి రైతులకు నిరంతరం అందుబాటులో ఉండి అన్నిరకాల సేవలందిస్తామని పసుపు బోర్డు కార్యదర్శి భవానిశ్రీ అన్నారు. రైతుల నుంచి వచ్చిన సలహాలను సైతం స్వీకరిస్తామన్నారు. ఏళ్లతరబడి పంటలు పండిస్తున్న రైతులు ఇచ్చే సలహాలు అందరికీ ఉపయోగపడేలా అమలు చేస్తామని ఆమె తెలిపారు.సదస్సులో ట్రేడర్లు, ఎగుమతిదారులు రైతులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యారు. రైతులు తీసుకొచ్చిన వివిధ రకాల పసుపు శాంపిళ్లను పరిశీలించారు. క్వాలిటీ పరీక్షలు చేశారు. పలువురు రైతులతో ఎగుమతిదారులు ఒప్పందాలు చేసుకున్నారు. -
‘సాగర్’లో డేంజర్ బెల్స్!
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటిమట్టంతో ఈ సంవత్సరం డేంజర్ బెల్స్ మోగేలా ఉన్నాయి. ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుండడంతో నీటి నిల్వ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రతి రోజు 0.7 టీఎంసీల నీరు ఆయకట్టుతోపాటు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. యాసంగి ప్రణాళిక ప్రకారం ఆయకట్టుకు మరో 22 రోజులపాటు నీటిని విడుదల చేయాలి. అందుకు 15 టీఎంసీల నీరు అవసరం. ప్రాజెక్ట్లో ప్రస్తుతం 23 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అందులో 5 టీఎంసీలు డెడ్స్టోరేజీకి పోగా, మిషన్ భగీరథకు 1.6 టీఎంసీలు, ఆవిరి రూపంలో 2.8 టీఎంసీల నీరు పోతుంది. చివరికి ప్రాజెక్ట్లో మిగిలేది 14 టీఎంసీల నీరు మాత్రమే. దీంతో ఆయకట్టుకు నీటి విడుదలలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే ఖరీఫ్లో సకాలంలో వర్షాలు కురువక పోతే తాగునీటికీ తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. చివరి ఆయకట్టు కోసం.. చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలంటే నిరంతరం కాలువల ద్వారా పరిమాణం తగ్గించకుండా నీటి విడుదల కొనసాగించాలి. దీంతో నీటి ఆవిరి కూడా ఎక్కువగానే అవుతుంది. ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు రికార్డుల్లో తెలుపుతున్నారు. కానీ, కాలువలో ఏడు వేల క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎల్ఎండీ ఎగున ఉన్న చివరి ఆయకట్టు వరకు నీరు అందాలంటే ఎక్కువ మొత్తంలోనే నీటి ప్రవాహం ఉండాలి. కొనసాగుతున్న నీటి విడుదల ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టు కోసం కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 5500, వరద కాలువ ద్వారా 500, సరస్వతి కాలువ ద్వారా 700, లక్ష్మి కాలువ ద్వారా 250, అలీసాగర్ లిప్టు ద్వారా 463 , గుత్ప లిప్టు ద్వారా 270, ముంపు గ్రామాల లిప్టుల ద్వారా 312, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 537 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1070.10(23 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ఇబ్బంది లేదు ఎస్సారెస్పీ నుంచి ఆయకట్టుకు, తాగునీటి అవసరాలకు నీటి విడుదలలో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం పంటల కోసం 13 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. రైతులు అధికారులతో సహకరించి నీటిని పొదుపుగా వాడాలి. చివరి ఆయకట్టుకు వరకు నీరు అందేలా సహకరించాలి. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ ఎస్సారెస్పీలో వేగంగా తగ్గుతోన్న నీటిమట్టం ప్రాజెక్ట్లో ప్రస్తుత నీటి నిల్వ 23 టీఎంసీలు రోజుకు 0.7 టీఎంసీల నీటి వినియోగం ఆయకట్టుకు మరో 15 టీఎంసీల నీరు అవసరం -
పేకాట స్థావరంపై దాడి
ఎడపల్లి: మండల కేంద్రంలోని ఓ రైస్మిల్ వద్ద నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది మంగళవారం దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకోగా వారి నుంచి రూ. 15,780 నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రెండు బోరు మోటార్ల చోరీమాచారెడ్డి: పాల్వంచ మండల శివారులోని ఇద్దరు రైతుల బోరు మోటార్లను గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి దొంగిలించినట్టు ఎస్సై అనిల్ తెలిపారు. గ్రామానికి చెందిన గాలి బొందయ్య, కొండె శ్రీనివాస్లకు చెందిన వ్యవసాయ భూమిలోని బోరు మోటార్లతో పాటు వైర్లను ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. రేపు సీజ్ చేసిన ఇసుక వేలంనందిపేట్: మండలంలోని తల్వేద శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పలకు గురువారం వేలం నిర్వహించనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ వసంతరావు పేర్కొన్నారు. గ్రామ శివారులో వాగు నుంచి అక్రమంగా తరలించిన 120 ట్రాక్టర్ల ఇసుకను కొందరు నిల్వ ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు. వేలంలో పాల్గొనే వారు రూ.20 వేలు దరావత్తు చెల్లించాల్సి ఉంటుందని డీటీ పేర్కొన్నారు. ఆర్మూర్ డిగ్రీ కళాశాలలో కార్యశాలఆర్మూర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఔషధ రూపకల్పనపై ప్రత్యేక కార్యశాల(వర్క్షాప్) నిర్వహించారు. ఈ సందర్భంగా తెయూ రసాయనశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ బాల్కిషన్ హాజరై విద్యార్థులకు ఔషధాల ఆవిష్కరణ అవసరం, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఔషధాన్ని రూపొందించడంలో అనుసరించాల్సిన పద్ధతులు, పరిశోధనలో ఎదురయ్యే సవాళ్లు వాటిని అధిగమించే వినూత్న సాంకేతికతల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వేణుప్రసాద్, సునీల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి
ఎడపల్లి: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఎడపల్లి మండలం జైతాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన చేపట్టారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని కలెక్టర్ ఆరా తీశారు. మొత్తం 125 మందికి మంజూరు కాగా, వారిలో 25 మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని అధికారులు తెలిపారు. మిగతా లబ్ధిదారులు సత్వరమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఎడపల్లిలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూం లను సందర్శించి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వంట నూనె, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. వండిన అన్నం, వంటలను పరిశీలించారు. కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ, అధికారులు, సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు -
కందకుర్తి సందర్శన
రెంజల్: మండలంలోని కందకుర్తి గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ మంగళవారం సందర్శించారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న స్మృతి మందిరం, స్కందాలయంతో పాటు స్వయంభూ రామ మందిరాన్ని దర్శించారు. నిర్మాణ పనుల గురించి స్థానిక ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. రామాలయం వైభవాన్ని ఆయనకు వివరించారు. కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రం ప్రాశస్తాన్ని వివరించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, బస్వా లక్ష్మీనర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు గోపికృష్ట, మేక సంతోష్, ఈర్లరాజు, ప్రసాద్, రంజిత్ పాల్గొన్నారు. -
అనాథ వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్పించాలి
డిచ్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం, రెడ్క్రాస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వృద్ధుల కోసం డిచ్పల్లి మండలం రాంపూర్లో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అనాథ వృద్ధులను గమనిస్తే రాంపూర్లో నూతనంగా ప్రారంభించబడిన వృద్ధాశ్రమంలో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, అందుబాటులో ఉంటే ఆరోగ్య సంబంధిత ఫైల్, సంబంధిత జీపీ నుంచి అనాథ వృద్ధులే అని ధ్రువీకరణ పత్రము, వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్పించే వారి పూర్తి వివరాలు, మొబైల్ నంబర్తో దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. జిల్లా వృద్ధుల, శిశు సంక్షేమ అధికారి కార్యాలయం, ఖలీల్వాడీ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం, రాంపూర్ లోని ఓల్డ్ ఏజ్ హోమ్ను సంప్రదించి వృద్ధులను ఆశ్రమంలో చేర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఆశ్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం 9849933300, 8688887004, 9618844461 నంబర్లను సంప్రదించవచ్చని అన్నారు. తలసేమియా బాధితులకు రక్తమార్పిడి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, నిజామాబాద్ శాఖ భవనంలో తలసేమియా వ్యాధి రక్త మార్పిడికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రక్త మార్పిడి చేయబడుతుందని, ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపారు. ఐదేళ్లు దాటిన తలసేమియా బాధితులు ఉచిత వైద్య సేవలు పొందేందుకు రేషన్, ఆధార్ కార్డు తప్పనిసరి అన్నారు. ఐదేళ్ల లోపు బాలలకు సంబంధించి వాళ్ల పేరెంట్స్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఒక రోజు ముందు ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవాలని, ప్రస్తుతం మంగళ, గురు, శనివారాల్లో రక్త మార్పిడి ఉంటుందని సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు ఉచిత వైద్య సేవలు -
గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్
డివైడర్ను ఢీకొన్న బైక్.. ఒకరు మృతిపెళ్లయిన పదమూడు రోజులకే మృత్యు ఒడికి..● చెరువులో పడి యువకుడి మృతి సదాశివనగర్: పెళ్లయిన పదమూడు రోజులకే ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కడమంచి రాములు(26) ఆరు నెలల క్రితం దుబాయి నుంచి వచ్చాడు. ఈ నెల 6న మెట్పల్లికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. గ్రామ సమీపంలోని పాత చెరువులో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన రాములు ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. రాములకు ఈత రాకపోవడంతోనే నీట మునిగి మృతి చెందాడు. మృతుడి తండ్రి సిద్ధిరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యంనిజాంసాగర్: నిజాంసాగర్ ప్రధాన కాలువలో గల్లంతైన రామగళ్ల దశరథం(38) అనే వ్యక్తి మృతదేహం మంగళవారం సాయంత్రం లభ్యమైంది. మహమ్మద్నగర్ మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన దశరథం సోమవారం గ్రామ శివారులోని ప్రధాన కాలువలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది ప్రధాన కాలువ నీటిలో గాలించారు. సింగీతం గ్రామ శివారులోని ప్రధాన కాలువ బ్రిడ్జి వద్ద మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డ్రంకన్ డ్రైవ్లో తొమ్మిది మందికి జైలుఖలీల్వాడి: డ్రంకన్ డ్రైవ్లో తొమ్మిది మందికి జైలు శిక్ష విధిస్తూ మెజి స్ట్రేట్ నూర్జహాన్ మంగళవారం తీర్పు ఇచ్చినట్లు ఏసీపీ రాజావెంకట్రెడ్డి తెలిపారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పీఎస్ల పరిధిల్లో డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ వారిని పోలీసులు పీఎస్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో హాజరుపర్చారు. జడ్జి తొమ్మిది మందికి జైలు శిక్ష విధించగా మరో 33 మందికి జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. తొమ్మిది మందిలో ఆరుగురికి రెండు రోజుల జైలు, ముగ్గురికి ఒక రోజు జైలు శిక్షను జడ్జి విధించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు. పబ్లిక్ న్యూసెన్స్ కేసులో ఎనిమిందికి ఒకరోజు.. బోధన్టౌన్: బోధన్ పట్టణంలో పబ్లిక్ న్యూసెన్స్కు పాల్పడ్డ ఏడుగురిపై ఒక రోజు జైలు శిక్షను విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్పసాయి తీర్పు ఇచ్చినట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ మంగళవారం తెలిపారు. బోధన్ పట్టణంలోని ఆజాంగంజ్ కాలనీలో పక్కపక్కన ఉండే ఇరు కుటుంబాలు చిన్న విషయంలో గొడవ పడి పబ్లిక్ న్యూసెన్స్ చేశారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరు కుటుంబాల సభ్యులను అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఇరు కుటుంబాలలోని ఏడుగురితో పాటు డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ మరో వ్యక్తికి జడ్జి ఒక రోజు జైలు శిక్షను విధించినట్లు సీఐ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతిమాచారెడ్డి: జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినఠ్లు ఎస్సై అనిల్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన బానోత్ పద్మ(43) అంగవైకల్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో ఈ నెల 15న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించింది. కొద్ది సేపటికి విషయాన్ని గమనించిన కుటుంబీకులు సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. దాడి చేసిన ఇద్దరికి జరిమానానందిపేట్: ఆస్తి తగాదాల్లో కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన ఇద్దరికి రూ. పది వేల చొప్పున జరిమానాను విధిస్తూ ఆర్మూర్ జడ్జి వేముల దీప్తి తీర్పు ఇచ్చినట్లు నందిపేట ఎస్సై చిరంజీవి పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి. 2019లో నందిపేట మండలం కుద్వాన్పూర్లో ఆస్తి పంపకాల విషయంలో తండ్రీ కొడుకులైన గోజూర్ పోశెట్టి, గోజూర్ గంగాధర్ తన కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాటి ఎస్సై రాఘవేందర్ కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఏపీపీ రామకృష్ణ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులపై నేరం రుజువు కావడంతో సదరు వ్యక్తులపై ఒకొక్కరికి రూ. పది వేలు చొప్పున విధిస్తూ జడ్జి దీప్తి జరిమానా విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.భిక్కనూరు: జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలైన ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో మంగళవారం వేకువజామున చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని ఈసీఎల్ ప్రాంతానికి చెందిన అనంత్(23), సంజన స్నేహితులు. వీరు సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి మంగళవారం వేకువజామున తిరిగి హైదరాబాద్కు బైక్పై వెళ్తుండగా జంగంపల్లి శివారులోని జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్నారు. ఈ ఘటనలో అనంత్ అక్కడికక్కడే మృతి చెందగా సంజనకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సంజనను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, అనంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కరెంట్ షాక్తో యువకుడు.. సదాశివనగర్: షార్ట్ సర్క్యూట్తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలం ఉత్తునూర్లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుడిసె సతీశ్(25) మంగళవారం ఉదయం పొలంలో మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. పిచికారీ కోసం కావాల్సిన నీటిని తెచ్చేందుకు తన వ్యవసాయ బావిలోకి దిగాడు. బావిలో ఉన్న మోటర్ వైర్ తెగి నీటిలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించని సతీశ్ నీటిని తీసుకుంటుండగా కరెంట్షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.చెరువులో పడి మహిళ..పిట్లం: ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి చెందిన ఘటన పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నోళ్ల సత్యవ్వ(45) మంగళవారం ఉదయం 10 గంటలకు గ్రామ చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోవడంతో నీట మునిగి మృతి చెందింది. భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.మద్నూర్: ట్రాక్టర్పై నుంచి పడి ఒకరు మృతి చెందిన ఘటన మద్నూర్ మండలం చిన్న ఎక్లార గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్ మండలం మేనూర్ గ్రామానికి చెందిన దశరథ్(25) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చిన్న ఎక్లార శివారులో ట్రాక్టర్పై మట్టిని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ట్రాక్టర్ వెనుక చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.పీడీఎస్ బియ్యం పట్టివేతఖలీల్వాడి: నగరంలో కోజ కాలనీలో టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం పీడీఎస్ బియాన్ని పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య ఆధ్వర్యంలో వన్ టౌన్ స్టేషన్ పరిధిలోని కోజ కాలనీలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 75 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని అధికారులకు, వాహనాన్ని ఒకటో టౌన్ పోలీసులకు అప్పగించినట్లు సీఐ పేర్కొన్నారు. బొలెరో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇసుక టిప్పర్..బోధన్ టౌన్: మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు టిప్పర్ను పట్టుకున్నట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. బోధన్ పట్టణంలోని బెల్లాల్ రైల్వేగేట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ టిప్పర్ను ఆపి పరిశీలించగా అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే టిప్పర్ను స్వాధీనం చేసుకొని డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.డిచ్పల్లి: గంజాయి అమ్మిన, కొనుగోలు చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డిచ్పల్లి సీఐ మల్లేశ్ తెలిపారు. మంగళవారం డిచ్పల్లి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై ఎండీ షరీఫ్తో కలిసి సీఐ మల్లేశ్ మాట్లాడారు. మంగళవారం ఉదయం ఎస్సై తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సీఎంసీ మెడికల్ కాలేజ్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన చిక్కలపల్లి శ్రీకాంత్, దర్బాషి నరేశ్ను తనిఖీ చేయగా వారి నుంచి 80 గ్రాముల గంజాయి లభించిందన్నారు. వారిని పీఎస్కు తరలించి విచారణ చేపట్టగా రూరల్ మండలం గుండారం శివారులోని రైస్మిల్లో పనిచేసే అరుణ్ సర్ధార్ వద్ద నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. దీంతో అరుణ్ సర్ధార్ను పట్టుకుని విచారించగా అతడి వద్ద కూడా 60 గ్రాముల గంజాయి లభించిందన్నారు. ముగ్గురు నిందితుల నుంచి మొత్తం 140 గ్రాముల గంజాయి, మూడు సెల్ఫోన్లు, ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుల్ రాజేందర్ ఉన్నారు.ట్రాక్టర్పై నుంచి పడి ఒకరి మృతి మరొకరికి తీవ్రగాయాలు -
కాలువ వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు
బాన్సువాడ రూరల్: నిజాంసాగర్ ప్రధాన కాలువ ద్వారా నీటిని వదిలిన ప్రతిసారి ఎక్కడో ఓ చోట నీటి ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఇటీవల సంగ్రాం తండాకు చెందిన సిద్దార్థ అనే 19 ఏళ్ల యువకుడు నీటిప్రవాహంలో కొట్టుకుపోయి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చాడు. వరుస నీటిప్రమాదాలతో స్పందించిన నీటిపారుదల శాఖ అధికారులు నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్టపై ప్రమాదం పొంచి ఉందంటూ హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంకిత భావంతో పనిచేయాలికామారెడ్డి క్రైం: అంకిత భావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ఎంపికై న స్టాఫ్ నర్సులు, వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ లకు మంగళవారం తన చాంబర్ లో నియామక పత్రాలను కలెక్టర్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం లోకి వచ్చిన వారు అంకిత భావంతో పనిచేయాలన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన 26 మందికి , వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ గా ఒకరికి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చంద్రశేఖర్, సబ్ యూనిట్ అఽధికారి చలపతి తదితరులు పాల్గొన్నారు. ఎంపీవో, సెక్రెటరీకి మెమోలు గాంధారి(ఎల్లారెడ్డి): జిల్లాలో తాగునీటి సమస్యలపై ‘సాక్షి’లో ‘గొంతు తడిసేదెలా?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. తాగు నీటి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో గాంధారి ఎంపీవో లక్ష్మీనారాయణ, సోమ్లానాయక్ తండా పంచాయతీ కార్యదర్శి దేవీసింగ్కు కలెక్టర్ మెమోలు జారీ చేసినట్లు ఎంపీడీవో రాజేశ్వర్ తెలిపారు. సోమ్లానాయక్ తండాను అధికారులు సోమవారం సందర్శించి విచారణ చేపట్టారు. పరిస్థితులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేశారు. -
దివ్యాంగుల సేవలను బాధ్యతగా భావించాలి
నిజామాబాద్ అర్బన్ : దివ్యాంగుల సేవను తల్లిదండ్రులు, సహిత విద్యా విభాగం ఉద్యోగులు బరువుగా కాకుండా బాధ్యతగా భావించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ అన్నారు. దివ్యాంగ విద్యార్థులకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు ఉండడంతోపాటు పదో తరగతి పాస్ మార్కుల విషయంలోనూ ప్రభుత్వం మినహాయింపునిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని న్యూ ఎన్జీవోస్ కాలనీలో సోమవారం దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సహాయ ఉపకరణాలు అందజేస్తున్న ఆలింకోను డీఈవో అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలింకో నిధులు రూ. 23,28,379తో విలువైన పరికరాలను పంపిణీ చేస్తున్నామన్నారు. దివ్యాంగ విద్యార్థులకు మంజూరైన స్టైఫండ్, అలవెన్సులు త్వరలోనే బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఐఈఆర్పీలు ప్రకాశ్, లింబాద్రి స్వా మి, సంతోష్, శేఖర్, నాగేశ్ గౌడ్, జలంధర్, కిష న్ సాగర్, ఆనంద్, కిషన్, లక్ష్మణ్, ప్రసాద్ , స్పె షల్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ -
పర్యాటక అభివృద్ధిలో సముచిత స్థానం
నిజామాబాద్ అర్బన్: పర్యాటక అభివృద్ధిలో అన్ని జిల్లాలకు స ముచిత ప్రాధాన్యత కల్పిస్తామ ని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో పర్యాటక అభివృద్ధిపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అడిగిన ప్రశ్న కు మంత్రి జూపల్లి సమాధానమిచ్చారు. ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ ప్రాంతంలో పర్యావరణ ప ర్యాటక అభివృద్ధిలో భాగంగా ఉమ్మెడ గ్రామ సమీపంలో 1.20 ఎకరాలు, జలాల్పూర్ గ్రామ పరిధిలో 3 ఎకరాల భూమిని ప్రభుత్వం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థకు అప్పగించినట్లు వెల్లడించారు. శ్రీరాంసాగర్ బ్యాక్వాటర్ ప్రాంత పర్యాటకాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు -
దివ్యాంగుల సేవలను బాధ్యతగా భావించాలి
నిజామాబాద్ అర్బన్ : దివ్యాంగుల సేవను తల్లిదండ్రులు, సహిత విద్యా విభాగం ఉద్యోగులు బరువుగా కాకుండా బాధ్యతగా భావించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ అన్నారు. దివ్యాంగ విద్యార్థులకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు ఉండడంతోపాటు పదో తరగతి పాస్ మార్కుల విషయంలోనూ ప్రభుత్వం మినహాయింపునిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని న్యూ ఎన్జీవోస్ కాలనీలో సోమవారం దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సహాయ ఉపకరణాలు అందజేస్తున్న ఆలింకోను డీఈవో అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలింకో నిధులు రూ. 23,28,379తో విలువైన పరికరాలను పంపిణీ చేస్తున్నామన్నారు. దివ్యాంగ విద్యార్థులకు మంజూరైన స్టైఫండ్, అలవెన్సులు త్వరలోనే బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఐఈఆర్పీలు ప్రకాశ్, లింబాద్రి స్వా మి, సంతోష్, శేఖర్, నాగేశ్ గౌడ్, జలంధర్, కిష న్ సాగర్, ఆనంద్, కిషన్, లక్ష్మణ్, ప్రసాద్ , స్పె షల్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ -
నస్రుల్లాబాద్లో ఒకరి ఆత్మహత్య
నస్రుల్లాబాద్(బాన్సువాడ): బాన్సువాడకు చెందిన ఓ వ్యక్తి నస్రుల్లాబాద్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నస్రుల్లాబాద్ చెరువులో సోమవారం ఓ వ్యక్తి మృతదేహం కనబడటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు బాన్సువాడ గ్రామానికి చెందిన కొత్తకొండ శ్రీనివాస్(53)గా గుర్తించారు. శ్రీనివాస్ విరిగిన కాలు తీవ్రంగా నొప్పి రావడంతో నిత్యం బాధపడేవాడు. ఈక్రమంలో ఈనెల 14న ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. కాలు నొప్పి భరించలేకనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని భార్య అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘ఓయూ’కి సురవరం పేరు పెట్టాలి
సుభాష్నగర్ : ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ సా యుధ పోరాట యోధుడు, ప్రత్యే క తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. తెలుగు యూనివర్సి టీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు మా ర్పుపై అసెంబ్లీలో పెట్టిన తీర్మానంపై సోమవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయా న్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పేరు మార్పు విషయంలో రాష్ట్ర ప్ర భుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. పొట్టి శ్రీరాములు కేవలం భాషాపరమైన ఉద్యమమే కాకుండా దళితుల హక్కుల కోసం, స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీతో కలిసి పనిచేశారని గుర్తుచేశారు. ఆయన పేరు తొలగిస్తే ఆర్యవైశ్య జాతి మొత్తం ఉద్యమానికి సిద్ధంగా ఉందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ -
ఉపాధికి ఊతం.. రాజీవ్ యువ వికాసం
తీసుకునే రుణం వర్తించనున్న సబ్సిడీ రూ.లక్ష 80 శాతం రూ. 2 లక్షలు 70 శాతం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 60 శాతం దరఖాస్తు చేసుకునేందుకు సందర్శించాల్సిన వెబ్పోర్టల్ https://tgobmmsnew.cgg.gov.inనిజామాబాద్ అర్బన్ /మోర్తాడ్(బాల్కొండ): యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉ ద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి దరఖాస్తు ల స్వీకరణ ప్రారంభించింది. డిగ్రీ ఉత్తీర్ణులైన ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు ఈ ఆర్థిక రుణాన్ని అందించనుంది. ప్రభుత్వం అందించే ఈ రుణంతో నిరుద్యోగు లు తమకు నచ్చిన వ్యాపారాన్ని నిర్వహించుకు నే అవకాశం కల్పిస్తోంది. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించి అనంతరం అర్హులను ఎంపిక చేయనున్నారు. అందులో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి 5,000 మందిని ఎంపిక చేసి జూన్ 2న రుణాలు పంపిణీ చేయనున్నారు. పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు మంగళవారం అధికారులు వెల్లడించనున్నట్లు తెలిసింది. కార్పొరేషన్లకు జీవం ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలను అందించేవారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కార్పొరేషన్లకు రాయితీ కోసం నిధులను కేటాయించకపోవడంతో సబ్సిడీ రుణాలకు బ్రేక్ పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక విడతలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితబంధు, బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీబంధు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలను అందించినా పూర్తిస్థాయిలో పథకాలు అమలు కాలేదు. ఫలితంగా ఆయా కార్పొరేషన్లు ఢీలా పడ్డాయి. తాజాగా యువతకు రూ.లక్ష నుంచి రూ.4లక్షల వరకూ రాయితీ రుణాలను అందించేందుకు కొత్త పథకానికి జీవం పోస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సర్కారు నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.4లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఆన్లైన్లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఎంపికలో పారదర్శకత లోపించవద్దు లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో పారదర్శకత లోపించకూడదు. అర్హులైన వారికే ప్రభు త్వ పథకాలు అందించాలి. నిరుద్యోగులు ప్రభు త్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికా ర పార్టీ నాయకుల జోక్యం లేకుండా చూడాలి. – పుప్పాల నరేశ్, బీజేపీ మండల అధ్యక్షుడు, మోర్తాడ్యువతకు మంచి అవకాశం రాజీవ్ యువ వికాసం పథకంతో యువతకు మంచి అవకాశం కల్పించినట్లు అవుతుంది. గతంలో రాయితీ రుణాలకు మంగళం పలకడంతో అనేక మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి లభించక వలస వెళ్లారు. ఇప్పుడు ఉన్న ఊరిలోనే సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. – తక్కూరి సతీశ్, కాంగ్రెస్ నాయకుడు, మోర్తాడ్ -
‘ప్రజావాణి’ అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు
నిజామాబాద్అర్బన్: ప్రజావాణికి ప్రాధాన్యతని స్తూ ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్లో పెట్టవద్దని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరం(కలెక్టరేట్)లో సోమవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జి ల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పా టు, ట్రెయినీ కలెక్టర్ సంకేత్, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్లకు విన్నవిస్తూ దరఖాస్తులు అందజేశారు. కాగా, అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్య లను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. -
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
ఆర్మూర్ : గోదావరి పరీవాహక ప్రాంతాలను పర్యాట క ప్రాంతాలుగా అభివృద్ధి చే యాలని సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పురాతన ఆలయాలున్న ఉమ్మెడ, కొండూరు, చిన్న యానాం వంటి ప్రాంతాలతో పాటు గోదావరి తీరాన భూములను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడంతో చాలా మందికి ఉపాధి లభిస్తుందన్నారు. జిల్లాకు బాసర పుణ్యక్షేత్రం అతి దగ్గర ఉండటంతో త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నా రు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథుల సిద్ధుల గుట్ట అభివృద్ధి కోసం గతంలో దేవాదాయ శాఖ మంత్రికి విన్నవించినా స్పందించలేదని ఆరోపించారు. కొడంగల్తో సమానంగా కాకున్నా కొంతైనా నిధు లు తమ నియోజకవర్గానికి ఇవ్వాలన్నారు. జక్రాన్పల్లి విమానాశ్రయ ఏ ర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి -
ఉత్తమ పరిశోధనలతో వర్సిటీకి గుర్తింపు తేవాలి
తెయూ(డిచ్పల్లి): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయస్థాయి ఉత్తమ పరిశోధనలు చేసి తెలంగాణ యూనివర్సిటీకి మంచి గుర్తింపు తీసుకురావాలని వీసీ యాదగిరిరావు సూచించారు. తెయూ ఫార్మాస్యూటికల్ విభాగానికి చెందిన విద్యార్థులు వెన్నెల, కృష్ణప్రకాష్లు ఇటీవల తైవాన్లోని నేషనల్ డాంగువా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశం పొందారు. ఈసందర్భంగా సోమవారం వీసీ, రిజిస్ట్రార్ వారిని అభినందించారు. అలాగే విద్యార్థులు అడ్మిషన్లు సాధించేందుకు కృషి చేసిన వాసం చంద్రశేఖర్, సత్యనారాయణరెడ్డి, శిరీషను వీసీ, రిజిస్ట్రార్ అభినందించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇందల్వాయి: ఇందల్వాయి ఉన్నత పాఠశాలలో సోమవారం 2006–07 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 18ఏళ్ల తర్వాత వారంత కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు. లోకాని గోపి, మారంపల్లి శ్రీకాంత్, అశోక్, సువర్ణ, స్వప్న, లావణ్య తదితరులు ఉన్నారు. -
పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు?
సుభాష్నగర్: పసుపు ధర విషయంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్రెడ్డి విమర్శించారు. ధర తగ్గితే పదేళ్లు అధికారంలో ఉండి అప్పుడు మాట్లాడలేదని, ఇప్పుడు ప్లకార్డులు పట్టుకోవడం సిగ్గుచేటన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డును సోమవారం ఆయన సందర్శించారు. అన్వేష్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.6వేలకు మించి ధర రాలేదని, ఆ సమయంలో ప్రశాంత్రెడ్డి, కవిత ఏం చేశారని ప్రశ్నించారు. ధర విషయమై ఎంపీ అర్వింద్ చొరవ తీసుకుని కేంద్ర మంత్రులతో మాట్లాడాలని, ధర నిలకడగా ఉండేలా చూడాలన్నారు. నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, పసుపునకు మద్దతు ధర అంశం కేంద్రం పరిధిలో ఉందని, ఇటీవల కేంద్ర మంత్రులకు లేఖలు రాశానని తెలిపారు. అనంతరం ఆయన అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మార్కెటింగ్శాఖ డీడీ మల్లేశం, డీఎంవో గంగుతోపాటు పసుపు రైతులు, వ్యాపారులతో సమావేశమయ్యారు. పసుపు ధర తగ్గడం, నిలకడ లేకపోవడానికి గల కారణాలపై సమీక్షించారు. వ్యాపారులు సిండికేట్ కాకుండా అధికారులు, మార్కెట్ కమిటీ పాలకవర్గం పర్యవేక్షించాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్ వల్లే ధరల్లో వ్యత్యాసం ఉందని వ్యాపారులు చెప్పగా, రైతు సంఘాల నాయకులు వ్యతిరేకించారు. కోల్డ్ స్టోరేజీ నిర్మాణంతోపాటు సాంగ్లీ, ఈ–రోడ్ మార్కెట్లను సందర్శించాలని రైతు సంఘాలు ప్రతిపాదించాయి. నాయకులు ప్రభాకర్, దేవరాం, లింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, డైరెక్టర్లు అగ్గు భోజన్న, నరేందర్, రాజలింగం, మారుతి మల్లేష్ ఉన్నారు. పసుపు ధరపై ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డివి అర్థం లేని మాటలు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్రెడ్డి -
పాత సీఎస్ఐ స్కూల్లో అగ్నిప్రమాదం
ఖలీల్వాడి: నగరంలో ని కంఠేశ్వర్లోని పాత సీఎస్ఐ స్కూల్లో సో మవారం ప్రమాదవ శాత్తు అగ్నిప్రమాదం జరిగింది. పాఠశాలలో ని స్టోర్రూం నుంచి అ కస్మాత్తుగా మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసినట్లు అగ్నిమాపకశాఖ అధికారి నర్సింగ్రావు తెలిపారు. పేకాడుతున్న నలుగురి అరెస్టు మాచారెడ్డి: పాల్వంచ మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై సోమవారం పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.3338 నగదు, నాలుగు సెల్ఫోన్లు, రెండు బైక్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
పసుపు ధరలో గోల్మాల్
● జగిత్యాల్ జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట్కు చెందిన రైతు వంగ శేఖర్ నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ మార్కెట్లో 12 క్వింటాళ్ల పసుపును విక్రయించాడు. ఒక్కో క్వింటాలుకు ఈనామ్ ప్రకారం రూ.10,006 ధర నిర్ణయించారు. పసుపును కొనుగోలు చేసిన వ్యాపారి మాత్రం ఒక్కో క్వింటాలుకు రూ.9,500లు మాత్రమే చెల్లిస్తానని స్పష్టం చేశారు. చేసేది లేక రైతు ఈనామ్ ధర కంటే తక్కువ ధరకే పసుపు విక్రయించాడు. ఫలితంగా రూ.6,072 నష్టపోయాడు. కమీషన్ ఏజెంట్కు మరో రూ.2,500ల చెల్లించాడు. అంటే వంగా శేఖర్కు తన పసుపును విక్రయించి రూ.8,572 తక్కువ పొందాడు. ఇది ఒక్క శేఖర్కు ఎదురైన నష్టమే కాదు. నిజామాబాద్ మార్కెట్లో పసుపును విక్రయించడానికి వెళ్లిన ఎంతో మంది రైతులకు ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధరలో గోల్మాల్ జరుగుతోంది. ఈనామ్ ట్రేడింగ్లో ఒక ధర, మాన్యువల్లో మరో ధర ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా మార్కెటింగ్ శాఖ అధికారులు మౌనం వహించడం ఎన్నో సందేహాలకు తావిస్తుంది. వ్యాపారులు చెప్పిందే ధర.. నిజామాబాద్ మార్కెట్ వరుస సెలవుల తరువాత సోమవారం ప్రారంభమైంది. కానీ ఈనామ్తో సంబంధం లేకుండానే గంజ్లో వ్యాపారులు ధర నిర్ణయించారు. పసుపు నాణ్యతను బట్టి కొమ్ముకు రూ.10వేల నుంచి రూ.12వేలు, మండకు రూ.8వేల నుంచి రూ.9,800ల వరకూ ధర చెల్లించారు. ఇటీవల ఈనామ్ ప్రకారం ఒక ధర మార్కెట్లో మరో ధర వల్ల రైతులు ఆందోళన చేపట్టగా తాజాగా ఈనామ్ను పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. రైతులకు ఆశించిన ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కో ఎకరం పసుపు సాగుకు రైతులు రూ.1.15లక్షల నుంచి రూ.1.30లక్షల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. పసుపు తవ్వడం, ఉడికించడం, ఆరబెట్టి పాలిషింగ్ చేయడం కోసం అదనంగా రూ.50వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి రావడంతోపాటు, క్వింటాలు ధర కనీసం రూ.12వేలకు మించి ఉంటేనే రైతుల శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కానీ ప్రస్తుత ధర రూ.10వేల లోపు ఉండటం, దిగుబడి తక్కువగా రావడంతో రైతులకు తీవ్రంగా నష్టం ఏర్పడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పసుపు సాగుపై చిత్తశుద్ధి లేకపోవడంతోనే పసుపు రైతులకు ప్రోత్సాహం కరువైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి పసుపు సాగు అంశంపై దృష్టిసారించి మద్దతు ధర నిర్ణయించడం, సాగు ఖర్చులు తగ్గేలా అధ్యయనం చేయడంపై చొరవ తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఈనామ్ ట్రేడింగ్లో ఒక ధర, మాన్యువల్లో మరో ధర రైతులను నమ్మించి మోసగిస్తున్న పసుపు వ్యాపారులు మద్దతు ధరనే కీలకం.. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల్ జిల్లాల్లోని నేలలు పసుపు సాగుకు ఎంతో అనువైనవి. పసుపు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలంటే మద్దతు ధర నిర్ణయమే కీలకమైంది. ప్రభుత్వాలు మద్దతు ధర నిర్ణయించి పక్కాగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ కిషన్రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త -
ఇంటి నిర్మాణంపై తెగని పంచాయితీ
ఖలీల్వాడి: జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఓ ఇంటి నిర్మాణం విషయమై స్థల యజమాని, వీడీసీల మధ్య పంచాయితీ ఏడాదిగా కొనసాగుతోంది. ని బంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారంటూ వీడీసీ సభ్యులు పనులను అడ్డుకోగా, బాధితురాలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. జక్రాన్పల్లికి చెందిన సుంకరి స్రవంతి తన భర్తకు వంశపరపర్యంగా వచ్చిన ఇల్లు శిథిలావస్థకు చేరడంతో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాలని కూల్చివేశారు. నూతన ఇంటి నిర్మాణం కోసం జులై11, 2024 జీపీ నుంచి ఆమె అనుమతి తీసుకున్నారు. కానీ నిబంధ నల మేరకు నిర్మాణం జరగడం లేదని, స్లాబు ముందుకు వచ్చిందని వీడీసీ సభ్యులు పనులను అడ్డుకున్నారు. వీడీసీ రూ.30వేలు జరిమానా విధించగా, కట్టేసి పనులు ప్రారంభించారు. అయినా మళ్లీ వీడీ సీ ఇబ్బందులకు గురిచేయడంతో బాధిత కుటుంబసభ్యులు పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. గతనెల లో వీడీసీపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నెల రోజులు గడుస్తున్నా వీడీసీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. బెదిరిపులకు పాల్పడు తూ, కుటుంబంను గ్రామబహిష్కరణ చేస్తామని భ యబ్రాంతులకు గురి చేస్తున్న వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు స్రవంతి ఈనె ల 12న ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. అ లాగే సెట్ బ్యాక్ లేకుండా, ఆర్అండ్బీ రోడ్డును ఆ క్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టారని వీడీసీ స భ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో జక్రాన్పల్లి జీపీ సెక్రెటరీ స్రవంతి భర్త లింగన్నకు నోటీసులు జారీ చేశారు. ఇంటిని కొలిచి ఇచ్చిన ప్లాన్కు విరు ద్ధంగా నిర్మించినట్లు నోటీసులో జీపీ సెక్రటరీ పే ర్కొన్నారు. దీనిపై బాధితురాలు హైకోర్టును ఆశ్ర యించగా స్టే విధించింది. స్పష్టమైన అధారాలతో ఈనెల 28న హాజరు కావాలని రాష్ట్ర పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రెటరీ, నిజామాబాద్ కలెక్టర్, జక్రాన్పల్లి సెక్రెటరీకి నోటీసులు జారీ చేసింది. దీంతో సద రు జీపీ సెక్రెటరీ నుంచి రాష్ట్ర పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రెటరీ వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. పనులను అడ్డుకున్న జక్రాన్పల్లి వీడీసీ హైకోర్టును ఆశ్రయించిన బాధితురాలు ఇంటి స్థలంలోనే నిర్మించాం.. ఇంటి నిర్మాణం చేపట్టినప్పటి నుంచి వీడీసీ సభ్యులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంటి స్థలంలోనే ఇంటిని నిర్మించాం. రోడ్డును ఆక్రమించుకోలేదు. కావాలనే వీడీసీ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలని చూస్తున్నారు. వీరి వేధింపులతో ఆత్మహత్యకు ప్రయత్నం చేశా. అధికారులు స్పందించి న్యాయం చేయాలి –సుంకరి స్రవంతి, జక్రాన్పల్లి -
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం
ఈసారి వేర్వేరుగా కొనుగోళ్లు ● జిల్లా వ్యాప్తంగా 622 కేంద్రాలు ● సన్నరకానికి 429, దొడ్డురకానికి 193 సెంటర్లు ● 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ● రేపు సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశం సుభాష్నగర్ : జిల్లాలో వరి పంట చేతికొస్తుంది. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈసారి సన్న, దొడ్డు రకాలకు వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. జిల్లా వ్యాప్తంగా సన్నరకానికి 429, దొడ్డు రకం ధాన్యానికి 193 కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఏప్రిల్ 1 నుంచి కొనుగోళ్లు ప్రారంభించేలా సర్వం సన్నద్ధం చేస్తున్నారు. 4.20 లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లా వ్యాప్తంగా రైతులు 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 3.75 లక్షల ఎకరాల్లో సన్నరకాలు, మిగతా 45 వేల ఎకరాల్లో ఇతర రకాలు పండించారు. మొత్తం 11.85 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అంచనా వేయగా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 7 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం 622 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాను 10 సెక్టార్లుగా విభజించి ధాన్యం రవాణా చేపట్టనున్నారు. గత వానాకాలం సీజన్లో దక్కించుకున్న కాంట్రాక్టర్లనే ఈసారీ కొనసాగించనున్నారు. సేకరించిన ధాన్యాన్ని సుమారు 250 రైస్మిల్లులకు కేటాయించనున్నారు. ధాన్యం సేకరణకు దాదాపు కోటీ 70 లక్షల గన్నీబ్యాగులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 55 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండగా, మిగతా వాటిని తెప్పిస్తున్నారు. ఏర్పాట్లు పూర్తయ్యాయి జిల్లాలో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే కొనుగోళ్లు ప్రారంభిస్తాం. సన్న, దొడ్డురకాలకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అన్నిశాఖల అధికారుల సమన్వయం, రైతుల సహకారంతో యాసంగి సీజన్లో కొనుగోళ్లను విజయవంతం చేస్తాం. – కిరణ్కుమార్, అదనపు కలెక్టర్ సన్నరకాలకు బోనస్! రాష్ట్ర ప్రభుత్వం సన్నరకాల సాగును ప్రోత్సహించేందుకు గత సీజన్లో క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. వానాకాలంలో 47,811 మంది రైతులకు రూ.158.63 కోట్ల బోనస్ను వారి ఖాతాల్లో జమ చేసింది. యాసంగిలోనూ బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో 85 శాతం మేర రైతులు సన్నరకాన్ని సాగుచేశారు. సన్నరకం ధాన్యాన్ని గుర్తించేందుకు మార్కెటింగ్ శాఖ ద్వారా ఒక్కో సెంటర్కు ధాన్యం కొలిచే యంత్రాన్ని సరఫరా చేయనున్నారు. ఇదిలా ఉండగా సన్న, దొడ్డురకం కేంద్రాలను వేర్వేరుగా ఏర్పాటు చేయనుండడంతో రైతుల్లో బోనస్ ఆశలు రేకెత్తుతున్నాయి. రేపు కో ఆర్డినేషన్ సమావేశం ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ నేతృత్వంలో ఈ నెల 19న సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ, సహకార, పౌరసరఫరా, రెవెన్యూ, మెప్మా, డీఆర్డీవో, రవాణా, ఇతర అన్నిశాఖల జిల్లాస్థాయి అధికారులతోపాటు క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది సమావేశంలో పాల్గొననున్నారు. -
సాంగ్లీ ధర ఇందూరులోనూ ఇవ్వాలి
మోర్తాడ్(బాల్కొండ): మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో పసుపు పంటకు లభిస్తున్న ధరనే నిజామాబాద్ మార్కెట్లోనూ అమలయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ మార్కెట్లో వ్యాపా రులు సిండికేట్గా ఏర్పడడంతో ఎంత నాణ్యత ఉన్నా పసుపు పంటకు ధర లభించడం లేద న్నారు. ఇదే రకం పసుపును రైతులు సాంగ్లీ మార్కెట్కు తరలిస్తే క్వింటాలు కు రూ.13వేల నుంచి రూ.14వేల ధర పలుకుతుందని వెల్లడించారు. నిజామాబాద్లో మొదట్లో క్వింటాలు పసుపునకు రూ.12వేల ధర లభించగా ప్రస్తుతం రూ.8వేలు మాత్రమే దక్కడంతో రైతులు నష్టపోతున్నారని వాపోయారు. ఇది ఎనిమిది నియోజకవర్గాల రైతుల సమస్య అని ఆయన చెప్పారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
ఆభరణాలు ఎత్తుకెళ్లిన నిందితుల రిమాండ్
నిజాంసాగర్(జుక్కల్): మహిళను నమ్మించి నగలు ఎత్తుకు వెళ్లిన ఆటో డ్రైవర్ సుందర్రాజుతోపాటు వడ్డే లక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా మార్డి గ్రామానికి చెందిన మ్యాతరి భూమవ్వ ఆదివారం అచ్చంపేట వెళ్లడానికి నిజాంసాగర్ బస్టాండ్ సమీపంలోని రోడ్డుపై నిల్చుంది. ఆటోలో వచ్చిన సుందర్రాజుతోపాటు వడ్డె లక్ష్మి కలిసి భూమవ్వను అచ్చంపేటకు తీసుకెళ్తామని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరు కలిసి భూమవ్వ మెడలోని రెండు తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకువెళ్లారు. సోమవారం బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటో డ్రైవర్ పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా భూమవ్వ వద్ద చోరీకి పాల్పడినట్లు తెలిపారు. వెంటనే వారి వద్ద నుంచి పోలీసులు ఆభరణాలను స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. నిజాంసాగర్ ఎస్సై శివకుమార్, కానిస్టేబుళ్లు శ్యామ్, మహేష్లను సీఐ అభినందించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఎడపల్లి(బోధన్): మండలంలోని ఠాణాకలాన్ గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రాజెక్టు డి–46 కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. సోమవారం కాలువలో మృతదేహాన్ని గుర్తించి ఒడ్డెపల్లి గ్రామ కార్యదర్శి రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
యూఏఈకి ఉచిత వీసాలు.. విమాన టికెట్స్
మోర్తాడ్: నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు యూఏఈ ప్రభుత్వరంగ సంస్థ ఏడీఎన్హెచ్ ఉచిత వీసాలను జారీ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఇంటర్వ్యూలు నిర్వహించి అనేకమంది నిరుద్యోగులకు యూఏఈలో ఉపాధి అవకాశాలు కల్పించింది. ఆ సంస్థకు చెందిన లైసెన్స్డ్ ఏజెన్సీ జీటీఎం ఆధ్వర్యంలో మరోసారి వీసాల జారీ కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 21, 22 తేదీలలో జగిత్యాల, నిజామాబాద్లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కేటరింగ్, సపోర్టింగ్గ్ సర్వీసెస్ రంగంలో వలస కార్మికులకు ఉచిత వీసాలను జారీ చేయనున్నట్లు పేర్కొంది.ఈసీఎన్ఆర్ పాస్పోర్టు (ECNR Passport) కలిగి, బేసిక్ ఇంగ్లిష్ మాట్లాడేవారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని జీటీఎం సంస్థ చైర్మన్ సతీశ్రావు కోరారు. 250 మందికి వీసాలు జారీ చేసే అవకాశం ఉందన్నారు. భారతీయ కరెన్సీలో రూ.23 వేల వేతనం, ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. వీసాల కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.వీసాల జారీతో పాటు యూఏఈకి వెళ్లడానికి విమాన టికెట్ను సంస్థే ఉచితంగా సమకూరుస్తుందని వెల్లడించారు. ఆసక్తిగలవారు 86868 60999 (నిజామాబాద్), 83320 62299 (ఆర్మూర్), 83320 42299 (జగిత్యాల), 93476 61522 (సిరిసిల్ల) నంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకుని టోకెన్లు పొందాలని సూచించారు. అమెరికాలో విషాదం.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి -
సమాజ పరివర్తనకు సంఘ్ కృషి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే హిందూ సమాజానికి శ్రేయస్సు అని, సమాజ పరివర్తనే స్వయం సేవక్ల బాధ్యత అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ధర్మజాగరణ ప్రముఖ్ అమర లింగన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఆదివారం ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో 56 శాఖల సంగమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా లింగన్న హాజరై ప్రసంగించారు. కుటుంబ వ్యవస్థ మనచేతిలోనే ఉందని, కుటుంబం నుంచే భావి పౌరులకు జీవన విలువలు తెలపాలని అన్నారు. హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఉద్భవించిన కలియుగ ప్రత్యేక అవతారం ఆర్ఎస్ఎస్ అన్నారు. ధర్మాన్ని కాపాడుకోవాలంటే శక్తిమంతంగా తయారు కావాలని, హిందువులందరూ సంఘటితంగా ఉంటేనే శక్తి సముపార్జన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భారతదేశంలో బ్రిటిష్ వాడు సృష్టించిన హిందువుల్లోని ఓ వర్గం విభజనవాదం చేస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టులు చీడపురుగుల్లా తయారయ్యారని, అన్నిమతాలు సమానమని చెబుతూనే మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. హిందువులను మైనారిటీలుగా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. గిరిజనులు, బంజారాలు, లింగాయత్లలో తాము హిందువులం కాదనే భావనను సృష్టిస్తున్నారన్నారు. ఇలాంటి కుట్రలకు ఫండింగ్ చేస్తున్న దొంగలెవరో ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. బానిసత్వంలోకి నెట్టారు.. మహాపురుషులకు కొదువ లేని భారతదేశం కొంద రి స్వార్థం, కుట్రల కారణంగా ఆత్మన్యూనత, అనై క్యతలకులోనై బానిసత్వంలోకి నెట్టబడిందని అమ ర లింగన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేప థ్యంలో డాక్టర్ హెడ్గేవార్ భారత్ను మళ్లీ గురుస్థానంలోకి తీసుకొచ్చేందుకు స్వాతంత్రోద్యమం చేస్తూనే ఆర్ఎస్ఎస్ను స్థాపించారన్నారు. హిందువుల్లో సమైక్యత నిర్మాణం కోసం కృషి చేశారని, ప్రతిరోజూ హిందువులు కలిసేలా సఫలపూరిత కార్యపద్ధతి నెలకొల్పారన్నారు. సమయపాలన, ఆజ్ఞాపాలన విషయమై పుస్తకాలు రాయలేదని, హెడ్గేవార్ ఆచరించి చూపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ అర్గుల సత్యం, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారితోపాటు స్వయం సేవక్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మరక్షణ కోసం శక్తిమంతులుగా తయారవ్వాలి దక్షిణ మధ్య క్షేత్ర ధర్మజాగరణ ప్రముఖ్ అమర లింగన్న ఇందూరు నగరశాఖ ఆధ్వర్యంలో 56 శాఖల సమ్మేళనం -
చెరుకు సాగు, క్రషింగ్పై అధ్యయనం
బోధన్: షుగర్ ఫ్యాక్టరీల నిర్వహణ, అధిక దిగుబడులు అందించే చెరుకు సాగు పద్ధతుల అధ్యయనం కోసం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీతోపాటు అధికారుల బృందం మహారాష్ట్రలో రెండురోజులు పర్యటించింది. మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లా సాంగ్లీ నగర కేంద్రంలోని శ్రీదత్తా కో – ఆపరేటీవ్ షుగర్ ఫ్యాక్టరీని అధికారులు శనివారం, కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్బాబుతోపాటు సభ్యులు, రైతులు ఆదివారం సందర్శించారు. ఫ్యాక్టరీ చైర్మన్ గణపతిరావు పాటిల్తో సమావేశమై ఫ్యాక్టరీ నిర్వహణ విధానం, అధిక దిగుబడులు అందించే వంగడాలు, రికవరీ, రోజువారీ క్రషింగ్ తదితర అంశాలను తెలుసుకున్నారు. అనంతరం చెరుకు తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధిక దిగుబడులు సాధించేందుకు సాగులో పాటించాల్సిన పద్ధతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రత్యేక కమిటీ సభ్యుడు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, పరిశ్రమల డైరెక్టర్ మన్సూద్, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, రాష్ట్ర, జిల్లా స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యానవన, పరిశ్రమలు, షుగర్ కేన్ శాఖల అధికారులు, బోధన్ ప్రాంత రైతులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ స్టడీ టూర్ రెండురోజులపాటు సాగిన పర్యటన మొదటి రోజు అధికారులు, రెండో రోజు సభ్యులు.. పాల్గొన్న మంత్రి, కమిటీ చైర్మన్ శ్రీధర్బాబు, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి -
విద్యార్థులకు కార్పొరేట్ గాలం
మొదలైన అడ్మిషన్ల దందా ● నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ ● రాజధానితోపాటు జిల్లాకు చెందిన ప్రైవేటు కళాశాలల పోటీ ● ప్రభుత్వ, ప్రైవేటు హెచ్ఎంలకు విందులు ● ఆఫర్లు ప్రకటిస్తున్న పీఆర్వోలు ● అయోమయంలో తల్లిదండ్రులు నిజామాబాద్అర్బన్: పదో తరగతి పరీక్షలు ముగియకముందే కార్పొరేట్ ‘దందా’ మొదలైంది. ‘మీ పిల్లలను మా కళాశాలలో చేర్పించండి’ అంటూ తల్లిదండ్రులకు గాలం వేస్తున్నాయి. విద్యార్థులు చ దివే పాఠశాలలకు వెళ్లి మరీ ప్రచారం చేస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన బడా కార్పొరేట్ విద్యాసంస్థలతోపాటు జిల్లాకు చెందిన ప్రైవేటు కళాశాలలు సైతం ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రత్యేకంగా పీఆర్వోలను నియమించుకుని నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల ప్రక్రియను చేపడుతున్నాయి. విందులు, ఆఫర్లు కార్పొరేట్ పీఆర్వోలు ప్రతిరోజు ప్రైవేట్ విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలను కలుస్తూ వారికి విందులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. తమ కళాశాలకు అడ్మిషన్లు ఇప్పించాలంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. చదువులో మెరుగ్గా ఉన్న విద్యార్థుల వివరాలను ముందే తీసుకొని హెచ్ఎంల ద్వారా తల్లిదండ్రులను కలుస్తున్నారు. ఇటీవల రెండు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలకు హైదరాబాద్కు చెందిన ఓ కార్పొరేట్ విద్యా సంస్థ జిల్లా కేంద్రంతోపాటు రాజధానిలో రెండుసార్లు పె ద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా.. పరీక్షలు పూర్తయి, ఫలితాలు వెలువడిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. నిబంధనల ప్రకారం మే, జూన్ నెలల్లో కళాశాలల్లో చేరికలు మొదలు పెట్టాల్సి ఉంటుంది. కానీ, అవేమీ పట్టించుకోని కార్పొరేట్ విద్యాసంస్థలు జనవరి నుంచే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి. ఇదంతా నిబంధనలకు విరుద్ధమంటూ విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల పర్వం మొదలుపెట్టినట్లు తెలిసినా సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగదీశ్రెడ్డి క్షమాపణలు చెపాల్సిందే చర్యలు తీసుకుంటాం నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపట్టొద్దు. ప్రైవే టు కళాశాలల్లో ముందస్తు గా అడ్మిషన్లు చేపడుతున్న దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. అనుమతి లేని కళాశాలలపై తప్పకుండా చర్యలు ఉంటాయి. – రవికుమార్, జిల్లా ఇంటర్ విద్యాధికారితిష్టవేసిన పీఆర్వోలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన పీఆ ర్వోలు రెండు నెలల క్రితం నుంచే జిల్లాలో తిష్ట వే శారు. లాడ్జీల్లో ఉంటూ పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల పాఠశాలలకు వెళ్తూ తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను తీసుకుంటున్నారు. అనంతరం మెసేజ్ లు, వాయిస్ కాల్స్ చేయడంతోపాటు వాట్సాప్ ద్వారా ప్రచార పోస్టర్లను పంపుతూ అడ్మిషన్లు తీసుకునేలా మభ్యపెడుతున్నారు. జిల్లా కేంద్రంలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు కూడా అడ్మిషన్ల కోసం ఇదే తంతు అవలంబిస్తున్నాయి. పరీక్షలు ప్రారంభంకాకముందే ఫోన్కాల్స్, ప్రచారంతో విసిగిస్తుండడంతో ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థులు అయోమయంలో పడుతున్నారు. -
తండ్రిని హతమార్చిన తనయుడు
ధర్పల్లి: తన అవసరాలకు డబ్బులు ఇవ్వడం లేదని కన్న తండ్రిని కొడుకు హతమార్చిన ఘటన ధర్పల్లి మండలంలో చోటుచేసుకుంది. తల్లి సైతం కొడుకుకు సహకరించడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని హొన్నాజీపెట్ గ్రామానికి చెందిన పాలెం చిన్న మల్లయ్య (65)కు భార్య లక్ష్మి, కొడుకు మధు ఉన్నారు. మల్లయ్య తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, ఆవుల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నారు. కొడుకు వివాహం జరుగగా, పొలం పనులు చేసుకుంటు ఉండేవాడు. డబ్బుల విషయంలో మల్లయ్యతో లక్ష్మి, కొడుకు మధు తరచూ గొడవపడేవారు. శనివారం రాత్రి గ్రామంలో ని ఒక కిరాణా దుకాణం వద్ద తనకు డబ్బులు కావాలని కొడుకు, తండ్రితో గొడవకు దిగగా, స్థానికులు సర్ధిచెప్పారు. కానీ కోపం పెంచుకున్న కొడుకు తండ్రిని చంపాలని నిర్ణయించుకొని, బీరు సీసాతో ఇంటికి వెళ్లాడు. గొడవ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఇద్దరు కలిసి మల్లయ్యతో గొడవకు దిగారు. తల్లి, కొడుకు ఇద్దరు కలిసి మల్లయ్య గొంతు పట్టుకొని కిందకు పడేశారు. వెంటనే మధు, మల్లయ్యపై సీసాతో దాడి చేశారు ఈ క్రమంలో మల్లయ్య తలకు గాయమై, రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితులను ఆదివారం రిమాండ్ కు తరలించారు. సహకరించిన తల్లి డబ్బులు ఇవ్వడం లేదని ఘాతుకానికి పాల్పడ్డ నిందితులు -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
బాన్సువాడ రూరల్: నిజాంసాగర్ ప్రధాన కాలువలో గల్లంతైన సంగ్రాం తండాకు చెందిన యువకుడు సిద్ధార్థ (19) మృతదేహం ఆదివారం లభ్యమైంది. బాన్సువాడ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. శనివారం సిద్ధార్థ, అన్న వరుసయ్యే రాజు ఇద్దరు కలిసి బైక్పై తండాకు వస్తుండగా మార్గమధ్యలో కాలువ వద్ద ఆగారు. రాజు కాలువలోకి దిగి కాళ్లుచేతులు కడుగుతుండగా నీటిలో పడిపోయాడు. రాజును రక్షించే క్రమంలో సిద్ధార్థ కాలువలో జారిపోగ స్థానికులు గమనించిన రాజును రక్షించారు. కానీ సిద్ధార్థ నీటిప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందినట్లు తండాపెద్దలు సంగ్రాం నాయక్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడి ఆత్మహత్యాయత్నం ● గోదావరిలో దూకుతుండగా అడ్డుకున్న పోలీసులు నవీపేట: ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకొని కాపాడారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ కాలనీకి చెందిన బయ్యాని వంశీకృష్ణ(30) వడ్రంగి పని చేస్తూ జీవించేవాడు. ఇటీవల ఇంట్లో కుటుంబ సభ్యులతో జరిగిన ఘర్షణతో అతడు తీవ్ర మనస్థాపం చెందాడు. ఆదివారం గోదావరి నదిలో దూకి చనిపోతానని కుటుంబ సభ్యులను బెదిరించి ఇంట్లోను వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వారు నవీపేట పోలీసులకు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మండలంలోని యంచ శివారులోగల గోదావరి బ్రిడ్జిపై నడుచుకుంటూ నదిలో దూకేందుకు య త్నించిన యువకుడిని అడ్డుకున్నారు. కౌన్సెలింగ్ చేసి అతడిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
28ఏళ్లకు కలుసుకున్న మిత్రులు
కామారెడ్డి రూరల్: చిన్నతనంలో కలిసి చదువుకున్న మిత్రులు 28ఏళ్ల తర్వాత కలుసుకున్న అపూర్వ ఘట్టం మండలంలోని దేవునిపల్లిలో చోటుచేసుకుంది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997–98 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏళ్ల తర్వాత కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వారంతా సహపంక్తి భోజనాలు చేశారు. పడకల్లో 25ఏళ్ల తర్వాత.. జక్రాన్పల్లి: మండలంలోని పడకల్ జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాల 1999–2000 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు స్థానిక మున్నూరుకాపు సంఘ భవనంలో ఆ త్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యార్థులు ఒకరినొకరు కలుసుకొని చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే అదే పాఠశాలకు చెందిన 2011–12 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు బడిలో నే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆనాటి ఉ పాధ్యాయులు గోపాలకృష్ణ, స్వామి, జెడ్పి సింధూర, ప్రసాద్, మమతలను పూర్వ విద్యార్థులు సత్కరించారు. కల్లెడిలో 13ఏళ్ల తర్వాత.. మాక్లూర్: మండలంలోని కల్లెడి ప్రభుత్వ పాఠశాలలో 2011–12 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆ త్మీయ సమ్మేళనం నిర్వహించారు. 13ఏళ్ల తర్వాత వారంత మళ్లీ కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. చదువు చెప్పిన ఆనాటి గురువులను వారు సన్మానించారు. -
నేడు ఇసుక డంపుల వేలం
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని మర్పల్లి గ్రామంలో సీజ్ చేసిన ఇసుక డంపులకు సోమవారం వేలంపాట నిర్వహించనున్నట్లు తహసీల్దార్ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి సంబందించిన వ్యక్తులు వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు. ప్రమాదకరంగా ప్రయాణం బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్ వద్దగల జాతీయ రహదారి 44పై ఆదివారం ఓ లారీ రాంగ్రూట్లో వస్తుండటంతో ‘సాక్షి’ క్లిక్మనిపించింది. గతంలో అనేక మార్లు ఈ చోటనే రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. అయినా రాంగ్రూట్లో వాహనాలు వస్తున్న హైవే అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రాంగ్రూట్లో వాహనాలు రాకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అలీసాగర్లో మడ్బాత్ ఎడపల్లి(బోధన్): మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్ వద్ద ఆదివారం యోగా గురువు ప్రభాకర్ ఆధ్వర్యంలో మడ్బాత్ (మట్టిస్నానం) నిర్వహించారు. నవీపేట, నందిపేట, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ఎడపల్లి, మోస్రా, బాన్సువాడ యోగా కేంద్రాల నుంచి సుమారు 400 మంది యోగా సాధకులు ఈ మడ్బాత్లో పాల్గొన్నారు. యోగా రత్న ప్రభాకర్ మాట్లాడుతూ.. మడ్బాత్ ఆర్యోగానికి మంచిదన్నారు. అనంతరం యజ్ఞం నిర్వహించారు. ప్రత్యేక బస్సులతో ఆర్టీసీకి ఆదాయం ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ డిపో నుంచి ఇటీవల నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆర్మూర్ డిపో నుంచి ఈ నెల 12నుంచి 15వరకు ప్రత్యేక బస్సులు నడిపినట్లు డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. మొత్తం 20 బస్సులు రోజుకు రెండు ట్రిప్పుల చొప్పున నడిచాయి. దీంతో సుమారు రూ. 25లక్షల ఆదాయం సమకూరింది. అలాగే ఇటీవలే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడకు 78 ప్రత్యేక బస్సులను నడిపించామని, అందులో ఆర్టీసీకి రూ. 20లక్షల ఆదాయం సమకూరిందన్నారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ చరిత్రాత్మక నిర్ణయం సుభాష్నగర్: దేశ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న సంస్కరణల్లో మరో చరిత్రాత్మక నిర్ణయం ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ వర్క్షాప్ ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ.. ప్రతిసారి ఎన్నికల కోసం రూ.వేల కోట్ల ప్రజాధనం ఖర్చవుతుందన్నారు. తరచూ జరిగే ఎన్నికల వల్ల అభివృద్ధి పనులకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ ద్వారా ప్రజాధనం ఆదా అవడంతోపాటు అభివృద్ధి పనులు వేగంగా అమలు చేయవచ్చన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మెరుగుపడుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, నాయకులు కంచెట్టి గంగాధర్, నక్క రాజేశ్వర్, లక్ష్మీనారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బందిపై నిఘా పెట్టేదెవరు?
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అతి కీలకమైన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్(ఎంహెచ్వో) పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో నగరంలో పారిశుధ్య పనులు, తనిఖీలు సరిగా చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పరిస్థితి.. నగరంలోని ఐదు జోన్లకు గాను ఐదుగురు శానిటరీ ఇన్స్పెక్టర్లున్నారు.వీరిపై శానిటరీ సూపర్వైజర్, ఆ యనపై ఎంహెచ్వో పర్యవేక్షణ ఉండాలి. కానీ పారిశుధ్య పనులు కేవలం శానిటరీ ఇన్స్పెక్టర్లు మాత్ర మే చూస్తున్నారు. కానీ పైఅధికారి లేకపోవడంతో వారు విధుల్లో తీవ్ర అలసత్వం వహిస్తున్నారు. నగరంలో ప్రతిరోజు 300 మెట్రిక్ టన్నుల చెత్త తయారవుతోంది. ఈ చెత్తను ఇంటింటి నుంచి సేకరించడం, మున్సిపల్ వాహనాల్లో తరలించడం, కూడళ్లలో వేసిన చెత్తను తొలగించడం వంటి నిత్య ప్రక్రియలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. డ్రైనేజీలు చెత్త, మురికినీటితో నిండిపోయాయి. అలాగే రెగ్యులర్ ఉద్యోగులు రాకున్నా వారికి హాజరువేసి వారి వద్దనుంచి నెలనెలా వసూళ్లకు పాల్పడుతున్నారు. అయినా వీరిపై అధికారులు నిఘా ఉంచడం లేదు. తనిఖీలు కరువు.. నగరంలో 200 వరకు ఫుట్పాత్ల మీదనే హోటళ్లు, దుకాణాలు నిర్వహిస్తున్నారు. నాణ్యతలేని సరుకు లు వాడటంతోపాటు అపరిశుభ్రంగా ఉన్న స్థలాల్లో తినుబండారాలు విక్రయించడంతో నగరవాసులు అనారోగ్యం పాలవుతున్నారు. అయినా వీరిపై ఎ లాంటి తనిఖీలు లేవు. టిఫిన్సెంటర్ల వద్ద ప్రతీనెల సిబ్బంది మాముళ్లు వసూలు చేసినా పట్టించుకునేవారు లేదు. పాలిథిన్ బ్యాగ్లపై నిషేదం ఉన్నా కిరాణదుకాణాలు, టిఫిన్సెంటర్లు, కూరగాయలు, పండ్ల వర్తకుల వద్ద తనిఖీలు చేయడం లేదు. కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు ట్రేడ్ లైసెన్స్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంహెచ్వో పోస్టు భర్తీ చేస్తే బల్దియా సిబ్బందిపై నిఘా ఉంచి, అందరూ సక్రమంగా విధుల నిర్వహించేలా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బల్దియాలో ఎంహెచ్వో పోస్టును భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. బల్దియా కార్యాలయం నిజామాబాద్ బల్దియాలో ఎంహెచ్వో పోస్టు ఖాళీ రెండేళ్లుగా భర్తీ చేయని అధికారులు నియంత్రణ లేక ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిఅధికారులు పట్టించుకోవడం లేదు మా ఇంటిముందు డ్రెయినేజీ లు నిండిపోయి మురికినీరు రో డ్డుమీద పారుతోంది. మున్సిప ల్ అధికారులకు ఎన్నిసార్లు చె ప్పినా పనులు చేయడం లేదు. నగరంలో పారిశుధ్య వ్య వస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఉన్నతాధికారులు సంబంధిత అధికారిని నియమిస్తే సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. –శ్రీనివాస్, జవహర్ రోడ్డు వాసి త్వరలో నియమిస్తాం బల్దియాలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంహెచ్వో పోస్టు కూడా ఖాళీగా ఉంది. సీడీఎంఏకు తెలియజేశాం. డిప్యూటీ కమిషనర్ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నేను తనిఖీలు నిర్వహిస్తున్న. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిని హెచ్చరిస్తున్నా. –దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్ -
బైక్, కంటెయినర్ను ఢీకొన్న కారు
● ఒకరి మృతి, నలుగురికి గాయాలు ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఓ కారు అతివేగంగా వచ్చి బైక్, కంటెయినర్ను ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఉత్తర ప్రదేశ్కు చెందిన ఇషాద్, కర్ణల్ ఉపాధి నిమిత్తం భీమ్గల్కు వచ్చారు. తమ స్నేహితులు ఆర్మూర్ నుంచి యూపీకి వెళుతుండగా కలవాలనుకున్నారు. దీంతో శనివారం రాత్రి ఇద్దరు కలిసి బైక్పై బయలుదేరగా, మార్గమధ్యలో పెర్కిట్లో ఉన్న మరో స్నేహితుడు మనీష్ను ఎక్కించుకుని వెళ్లారు. ఆర్మూర్లోని హైవే పైగల మహిళా ప్రాంగణం వద్ద వీరి బైక్ను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అనంతరం ఆగిఉన్న కంటెయినర్ను ఢీకొట్టింది. ఈఘటనలో ఇషాద్ అక్కడికక్కడే మృతిచెందగా బైక్పై ఉన్న మరో ఇద్దరు కర్ణల్, మనీష్, కారులోని రాహుల్, గణేష్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.మృతుడి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. -
మక్కల ట్రాక్టర్ బోల్తా
బాల్కొండ: ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన రైతు అమ్మక్కపేట్ కిషన్ మక్కల లోడ్తో ట్రాక్టర్ను చేనులో నుంచి కల్లాం వద్దకు తీసుకొస్తుండగా మార్గమధ్యలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రైతుకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ మక్కలు వరి పొలంలో పడటంతో నీటిపాలయ్యాయి. పొక్లెయిన్ సహాయంతో ట్రాక్టర్ను పంట పొలాల నుంచి బయటకు తీశారు. ఇసుక టిప్పర్, పొక్లెయిన్ సీజ్ ఆర్మూర్టౌన్: ఆలూర్ మండలం దేగాం గ్రామ శివారులోని వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించగా పొక్లెయిన్తోపాటు టిప్పర్ను సీజ్ చేశామన్నారు. అలాగే ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. -
రెండు ఆలయాల్లో చోరీ
వర్ని: మండలంలోని జలాల్పూర్ గ్రామంలోగల మల్లికార్జునస్వామి, కృష్ణ దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తి శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు చోరీని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దుండగుడు ఐదు తులాల బంగారం, 25 తులాల వెండి, హుండీలోని నగదును ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరా ఫుటేజీలో నిందితుడి దృశ్యం రికార్డయింది. గ్రామస్తులు వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్.. రుద్రూర్: కోటగిరి మండలం కొత్తపల్లి శివారులో ట్రాన్స్ఫార్మర్ నుంచి గుర్తుతెలియని దుండగులు కాపర్ కాయిల్స్ను ఎత్తుకెళ్లారు. పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను దుండగులు కిందపడవేసి అందులోని కాపర్ కాయిల్స్ దొంగిలించారు. ఘటనపై విద్యుత్ అధికారులకు సమాచారం అందించినట్టు రైతులు ఆదివారం తెలిపారు. పోతంగల్లో బైక్.. రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలో బైక్ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా.. పోతంగల్లోని ఆబాది బీసీ కాలనీలోగల కిరాణ షాపు వద్ద రెండు రోజుల క్రితం ఇందూర్ గంగాధర్ తన బైక్ను నిలిపాడు. దుకాణంలోకి వెళ్లివచ్చేసరికి దుండగులు బైక్ను చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు ఆదివారం తెలిపారు. -
షుగర్స్ పునఃప్రారంభంలో ని‘జామ్’!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్స్ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసినప్పటికీ.. మళ్లీ సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కొంత ప్రక్రియ పూర్తి చేసింది. ప్రైవేటు యాజమాన్యం పరిధిలోని ఈ ఫ్యాక్టరీకి చెందిన రూ.400 కోట్ల బ్యాంకుల బకాయిలకు సంబంధించి, వన్టైం సెటిల్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్లు చెల్లించింది. 2025 డిసెంబర్ నాటికి ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించినప్పటికీ.. అది మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆలస్యంగానైనా.. పబ్లిక్ సెక్టార్లోనా, ప్రైవేటు సెక్టార్లోనా, సహకార విధానంలో ప్రారంభిస్తారా? అనే అంశంపై కూడా స్పష్టత లేకుండా పోయింది. మరోవైపు క్షేత్రస్థాయిలో సన్నద్ధత విషయంలో ఇప్పటికీ గందరగోళమే నడుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది క్రషింగ్ సీజన్ (అక్టోబర్ నుంచి డిసెంబర్) నాటికి సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. ప్రభుత్వం నుంచి సైతం స్పష్టమైన ప్రకటన రావడం లేదు. బోధన్ ఫ్యాక్టరీని మరో చోటికి తరలించి.. కొత్త యంత్రాలతో నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. రైతులతో విడతల వారీగా కమిటీ చర్చలు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీలో సభ్యుడైన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ రైతులతో విడతలవారీగా ముఖాముఖి చర్చలు జరిపింది. చెరుకు సాగును ప్రోత్సహించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, షుగర్ కేన్ బోర్డు రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు. మరోవైపు ప్రస్తుతం ఫ్యాక్టరీ స్థితిగతులు, యంత్రాల పరిస్థితిని నిపుణుల బృందం పరిశీలిస్తోంది. తరువాత వారి నివేదిక మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నిపుణుల బృందం నివేదిక ప్రభుత్వం వద్దకు వెళ్లి దని ప్రచారం జరుగుతోంది. నివేదికలో ఏముందో బయటకు రాలేదు. మరోవైపు చెరుకు సాగుపై రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం విధానపరంగా ఫ్యాక్టరీ పునఃప్రారంభం విషయమై స్పష్టత ఇవ్వలేదు. రైతులు గణనీయమైన స్థాయిలో చెరుకు పంటను పండించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తేనే.. షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పునఃప్రారంభానికి అడుగులు మరింతగా పడాలంటే చెరుకు సాగు విస్తీర్ణమే ప్రధానం కానుంది. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంనగర్) జిల్లాల్లో నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీలున్నాయి. 2002లో ప్రైవేటుకు విక్రయించిన చంద్రబాబు ప్రభుత్వం.. నిజాం షుగర్స్ యూనిట్లను 2002లో డెల్టా పేపర్ మిల్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. 2014లో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నిజాం షుగర్స్ను ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ మూడు యూనిట్లకు లేఆఫ్ ప్రకటించారు. 2005–06లో చెరుకు దిగుబడి 35 వేల టన్నులున్నప్పటికీ నడిపిన ఈ కర్మాగారాలను.. 2015లో దిగుబడి లక్ష టన్నులకు పెరిగినా మూసేయడం గమనార్హం. దీంతో రైతులు వరి పంట వైపు మళ్లారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలున్న బోధన్, ముత్యంపేట, మంబోజిపల్లి ప్రాంతాల్లో రైతులు గణనీయమైన విస్తీర్ణంలో చెరుకు పంట పండించేందుకు ముందుకు వస్తేనే.. ప్రభుత్వం ఫ్యాక్టరీల పునఃప్రారంభం విషయంలో మరింత వేగంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు చెరుకు సాగు చేయడంపై ఆసక్తి నెలకొంది. -
నేటి బాల్కొండ
నాటి అల్లకొండ.. మిగిలింది పక్షం రోజులే..● అల్లయ్య, కొండయ్య అనే మల్లయోధులు నిర్మించిన పట్టణం ● 1059లో మూడంచెల వ్యవస్థతో ఖిల్లా నిర్మాణం ● 1102లో ఢిల్లీ సుల్తానుల ఆక్రమణతో ధ్వంసం.. తరువాత పునర్నిర్మాణం చేసిన కాకతీయులుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న బాల్కొండ పట్టణానికి ప్రపంచానికి చాటి చెప్పేలా గొప్ప ప్రాచీన చరిత్ర ఉంది. బాల్కొండకు చెందిన అల్లయ్య, కొండయ్య అనే మల్లయోధులు 1059లో ఇక్కడ కొండపై భారీ ఖిల్లాను నిర్మించారు. రాష్ట్ర పురావస్తు శాఖ వివరాల మేరకు ఖిల్లా లోపలి భాగంలో 39 ఎకరాల 27 గుంటల విస్తీర్ణం ఉంది. అప్పట్లో దీనిని అల్లకొండ కోట అనేవారు. ఈ కోట కొండలతో చుట్టుముట్టినట్లుగా ఉండేది. అప్పట్లో ఈ అల్లకొండ నగరాన్ని శ్రీ సోమ, ఆర్య, సూర్య క్షత్రియులు పరిపాలించారు. మూడు అంచెల వ్యవస్థతో అల్లకొండ రాజ్యాన్ని కాపాడారు. ఖిల్లా గుట్ట కింద లోపలి భాగంలో అంతర్గత రాజమహల్ నిర్మించారు. ఇక్కడ ఉన్న బావికి అత్తాకోడళ్ల బావి అని పేరు. ఈ బావిలో ఒక వైపు మంచినీరు, మరోవైపు ఉప్పు నీరు ఉండటం విశేషం. ఆ రోజుల్లో ఒకే బావిలో ఇలా రెండు రకాల నీరు లభించినట్లు విశేషంగా చెప్పుకునేవారు. శత్రువుల చొరబాటు నిరోధించేందుకు గాను కోటకు ఆరు సింహ ద్వారాలు(కమాన్లు), దీన్ని ఆనుకుని పట్టణం, చుట్టూ లోతైన ‘కందకాలు‘ నిర్మించారు. వీటికి అనుసంధానంగా ఆయా సింహద్వారాల అడుగు భాగంలో నాగపడగ ఆకారంలో ఇప్పటికీ గుర్తులు ఉన్నాయి. ● ఘనచరిత్ర కలిగిన అల్లకొండ ఖిల్లాపై 1101 లో ఢిల్లీ సుల్తాన్ అయిన అలంగీర్పాషా సోదరుడైన జాఫర్ ముఖురబ్ ఖాన్ 5 వేల మంది సిపాయిలతో దండెత్తి ఓటమి చెందాడు. ఓటమి సహించలేక మళ్లీ రెండోసారి 1102లో 5 వేల అశ్వక దళాలు, వెయ్యి ఏనుగులు, 7 వేల మంది సిపాయిలతో దండెత్తి అల్లయ్య, కొండయ్యలను హతమార్చి కోటను ఆక్రమించుకున్నారు. దీంతో ఖిల్లా ఢిల్లీ పాలకుల చేతిలోకి వెళ్లింది. ● ఢిల్లీ పాలకుల అనంతరం అల్లకొండ కోట కాకతీయుల పాలనలోకి వెళ్లింది. గణపతిదేవుడు ఈ ఖిల్లాను తిరిగి నిర్మించినట్లు చరిత్రకారుడు బీఆర్ నర్సింగ్రావు తెలిపారు. ఇప్పటికీ ఈ ఖిల్లా నిర్మాణాలపై కాకతీయ పాలకుడైన గణపతిదేవుడు వేసిన శాసనాలు ఉన్నాయి. ఇలాంటి పురాతన కట్టడాల వారసత్వ సంపద కనుమరుగు కాకుండా కాపాడుకోవాలని నర్సింగ్రావు కోరుతున్నారు. నర్సింగ్రావు 2014 నుంచి 2020 వరకు ఈ ఖిల్లా గురించి రీసెర్చ్ చేశారు.