Nizamabad
-
ఇంటర్ ద్వితీయంలో 475 మంది గైర్హాజరు
● నేటితో ముగియనున్న ఫస్టియర్ పరీక్షలునిజామాబాద్అర్బన్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం 16,766 మంది విద్యార్థులకు 16,291 మంది హాజరుకాగా, 475 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 57 పరీక్షా కేంద్రాలకు 54 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. కాగా, నేడు (బుధవారం) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగియనుండగా, గురువారం ద్వితీయ సంవత్సర పరీక్షలు పూర్తికానున్నాయి. చిరుత కోసం గాలింపు ఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలంలోని జానకంపేట, ఠాణాకలాన్, నవీపేట్ మండలంలోని అబ్బాపూర్ అటవీ ప్రాంతాల్లో చి రుత పులి కోసం మూడు బృందాలు గా లింపు చేపట్టాయి. జానకంపేట సీటీసీతో పాటు అటవీ ప్రాంతాల్లో రెండురోజులపాటు పరిశీలించిన అధికారులు చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పంట పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. బృందంలో సెక్షన్ ఆఫీసర్ ప్రతాప్, బీట్ ఆఫీసర్ ప్రవీణ్, ఫారెస్టు అధికారులు ఉన్నారు. ఏప్రిల్ 27న మోడల్ స్కూల్ ప్రవేశపరీక్ష నిజామాబాద్ అర్బన్: మోడల్ స్కూల్ అడ్మిషన్లకు ఏప్రిల్ 27న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశానికి 27న ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, పదో తరగతికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆ సక్తి గల విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లా సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంతెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలను వ ర్సిటీ వైస్ చాన్స్లర్ టి యాదగిరి రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీసీ వెంట న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న రాణి, అడిషనల్ కంట్రోలర్ టి సంపత్ ఉన్నారు. పరీక్షలకు 42 మందికి 33 మంది హాజరు కాగా 9 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఎస్బీ ఏసీపీకి ఏఎస్పీగా పదోన్నతి ఖలీల్వాడి: నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ శ్రీనివాస్ రావు కు అదనపు ఎస్పీగా పదోన్నతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 15 మంది ఏసీపీలకు పదోన్నతులు కల్పిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప దోన్నతి పొందిన ఏసీపీలను డీజీపీ కార్యాల యంలో రిపోర్టు చేయాలని తెలిపారు. -
నేడు జీజీహెచ్ డైట్ టెండర్
నిజామాబాద్నాగారం: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో డైట్ టెండర్ అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఏళ్ల తరబడిగా గుట్టుచప్పుడు కాకుండా టెండర్ ప్రక్రియ కొనసాగగా.. సాక్షిలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో 2024 జూలై 11న డైట్ సప్లయ్ టెండర్ విడుదల చేసి అదే నెల 16వరకు దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వివిధ కారణాలతో మూడుసార్లు టెండర్లు వాయిదా పడుతూ వస్తోంది. కాగా, టెండర్లో అర్హత ఉన్న ఐదుగురు సభ్యులతో మంగళవారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ చాంబర్లో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కాగా, అధికారులు మాత్రం ప్రస్తుతం ఉన్న వారికే డైట్ సప్లై టెండర్ అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏళ్ల తరబడి అనుభవం, బిల్లులు సకాలంలో మంజూరు కాకపోయినా డైట్ సప్లై చేస్తారని చెబుతున్నారు. కానీ, మిగతా టెండర్దారులు మాత్రం లక్కీ డ్రా తీయాలంటూ పట్టుబడుతున్నారు. ‘టెండర్ ప్రక్రియ ఇప్పటికే ఆలస్యమవుతుంది. ఏది ఏమైనా అధికారులు బుధవారం టెండర్ ఫైనల్ చేసి తీరుతాం’ అని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. ● పాతవారికే అప్పగించేందుకు అధికారుల మొగ్గు ● లక్కీ డ్రా కోసం పట్టుబడుతున్న టెండర్దారులు -
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న 50వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నిజామాబాద్ నగర సమస్యలపై ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. నగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.4 కోట్లు మంజూరు చేయాలని, వాటిని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రధాని మోదీ ఫొటో తప్పక ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ వర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయాలని, జిల్లా కేంద్రంలోని బస్టాండ్ను ఆధునీకరించేందుకు నిధులివ్వాలని తెలిపారు. ఐటీ హబ్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ -
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
నిజామాబాద్ అర్బన్: సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్లు మంగళవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. వాగ్వాదాలు, తోపులాటలు, అరెస్టులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు మంగళవారం మెరుపు ముట్టడి చేపట్టారు. ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు గేట్లు మూసేసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సీఐటీయూ నాయకులతోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేయగా అంగన్వాడీలు అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏసీపీ రాజా వెంకటరెడ్డి, రూరల్ సీఐ సురేశ్ ఆధ్వర్యంలో నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలంటూ అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోగా, కాసేపు తోపులాట జరిగింది. అనంతరం కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు నిరసన ప్రాంతానికి చేరుకొని అంగన్వాడీలతో మాట్లాడారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయినా కూడా అంగన్వాడీలు వినకుండా ప్రవేశమార్గం వద్ద మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిరసన కొనసాగించారు. దీంతో కలెక్టరేట్లోనికి వెళ్లే ఉద్యోగులు బయటే నిలబడిపోయారు. అనంతరం పోలీసులు భారీ బందోబస్తుతో ఆందోళనకారులను నిలువరించారు. లోపలికి వెళ్లేందుకు అంగన్వాడీల యత్నం అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు నిరసనకారులతో మాట్లాడిన కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు -
వివాదాలకు కేరాఫ్గా అధికారులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో సుదీర్ఘకాలం సర్వీసులో ఉండే బ్యూరోక్రాట్లు, అధికారులు, ఉద్యోగులు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన నేపథ్యంలో తరచూ వివాదాస్పదం అవుతున్నారు. ఈ విషయమై ఉమ్మడి జిల్లాలో బీజేపీ నేతలు ఆయా అధికారు ల వ్యవహారశైలిపై బహిరంగంగానే నిప్పులు చెరుగుతున్నారు. దీంతో ఈ విషయాలు సాధారణ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నా యి. ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఇలా వివా దాలకు కేరాఫ్గా మారుతుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ● తాజాగా నిజామాబాద్లో కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని పసుపు బోర్డు సమావేశంలో చైర్మన్ పల్లె గంగారెడ్డి నేరుగా జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుపైనే విమర్శలు సంధించారు. జనవరిలో పసుపు బోర్డు తాత్కాలిక కార్యాలయాన్ని వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్లోనే నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ను సంప్రదించగా పండుగ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరంటూ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తిరస్కరించారని గంగారెడ్డి అధికారిక సమావేశంలోనే తెలిపారు. కొన్ని అపోహలు తొలగించేందుకు ఈ విషయాన్ని జిల్లా ప్రజలకు తెలపాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. దీంతో అక్కడకు వచ్చిన రైతులు, ఉన్నతాధికారుల్లో చర్చ జరిగింది. ఇదిలా ఉండగా మంగళవారం జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో సీనియర్ ఐఏఎస్లు, జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొన్న సమావేశం గురించి సైతం జిల్లా పౌరసంబంధాల అధికారికి తెలియకపోవడం గమనార్హం. ● జక్రాన్పల్లి మండలంలోని లక్ష్మాపూర్లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్ విషయమై కేఆర్ సుదర్శన్రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు తీసుకుని కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ కిరణ్లకు ఫిర్యాదులు చేశారు. అక్రమ క్రష ర్ నిర్వాహకుడికి అనేకసార్లు నోటీసులు ఇచ్చా రు. చర్యలు తీసుకోలేదని అడిగితే ఆ విషయమే తమకు తెలియదని చెబుతున్నారని సుదర్శన్రెడ్డి తెలిపారు. ఈ విషయమై సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు చెరుగుతున్న బీజేపీ నేతలు ఆర్టీఐ దరఖాస్తులను పట్టించుకోవడంలేదని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే కేవీఆర్ పసుపు బోర్డు ప్రారంభ సమావేశానికి సహకరించని కలెక్టర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేయనీయలేదు : బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శాసనసభలోనే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. కామారెడ్డిలో విద్య, వైద్య శాఖల్లో వివిధ అంశాలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద 86 దరఖాస్తులు ఇస్తే ఏమాత్రం సమాధానాలు ఇవ్వలేదన్నారు. పైగా తానే స్వయంగా దరఖాస్తు ఇవ్వడా నికి వెళితే ఇలాంటివి చాలా చూశాం.. అ య్యేవా.. పోయేవా అంటూ ఉద్యోగులు, అ ధికారులు మాట్లాడారన్నారు. అధికారుల కు ఇది మంచి పద్ధతి కాదన్నారు. సదరు అధికారుల పేర్లు సైతం చెప్పగలుగుతానన్నారు. సమాచారం అధికారులు ఇచ్చేది లేదని చెబితే ఎలా అన్నారు. ప్రతీది ఫైల్తో సహా తనవద్ద ఉందన్నారు. అధికారులు గౌరవంగా వ్యవహరిస్తే బాగుంటుందన్నా రు. ఈ ప్రవర్తన అందరికీ సిగ్గుచేటన్నారు. పద్ధతి మార్చుకోకుండా రాబోయే కాలంలో తన పద్ధతి మార్చుకునేలా చేస్తారా అని అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో ఓడినవారు, నియోజకవర్గం నుంచి పారిపోయిన వారి పేరిట ప్రతిపాదనలు ఇవ్వడమేమిటి.. ఇన్చార్జి మంత్రి మంజూరు చేయడమేమిటన్నారు. ఇలా అయితే ప్రజలచే ఎన్నుకోబడిన తానేం చేయాలంటూ పరోక్షంగా షబ్బీర్ అలీపై కేవీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు. -
పంట రుణాలకు ప్రాధాన్యమివ్వాలి
నిజామబాద్ అర్బన్: పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యమివ్వాలని, రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీఫ్, రబీ సీజన్లకు కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, రానున్న సీజన్లో రైతాంగానికి అందించాల్సిన పంట రుణాలు తదితర అంశాలపై బ్యాంకుల వారీగా అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉన్నాయని అన్నారు. వందశాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సమర్ధవంతంగా అందించాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఇబ్బంది లేకుండా అర్హత కలిగిన రైస్మిల్లర్లకు వెనువెంటనే బ్యాంకు గ్యారెంటీలను మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలని హితవు పలికారు. ఎస్బీఐ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పూర్తిచేసుకున్న యువతకు యూనిట్ల స్థాపన కోసం రుణాలు అందించాలన్నారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీవో పథ్వీ, డీఆర్డీవో సాయాగౌడ్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ అశోక్ చవాన్, నాబార్డు ఏజీఎం ప్రవీణ్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ సురేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్ -
నిరంతర సేవలు
పసుపు రైతుకురైతుల సలహాలను స్వీకరిస్తాంసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు రైతులు తాము పండించిన పంటకు అదనపు విలువ జోడించి, ‘విలువ ఆధారిత ఉత్పత్తి’ని తీసుకురావాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సూ చించారు. ఇందుకోసం రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీవో)లను మరింతగా ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. మంగళవారం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో పసుపు రైతులు, ట్రేడర్ల అనుసంధాన సమావేశం నిర్వహించారు. చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ రైతులు ఎఫ్పీవోలుగా ఏర్పడాలన్నారు. దీంతో ఎగుమతిదారులతో నేరుగా వ్యాపారం చేసేలా ఎదగొచ్చన్నారు. ప్రపంచంలో అత్యధికంగా 80 శాతం పసుపు భారత్లోనే రైతులు పండిస్తుండగా, ఇందులో 90 శాతం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల రైతులే పండిస్తున్నారన్నారు. 2023–24 సీజన్లో భారత్ నుంచి 226.58 మిలియన్ డాలర్ల విలువైన 1,62,018 టన్నుల పసుపును ఎగుమతి చేశామన్నారు. 2023–24 సీజన్లో దేశంలో 3.05 లక్షల హెక్టార్లలో రైతులు పసుపు సాగు చేశారన్నారు. 10.74 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందన్నారు. పసుపునకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో సుగంధ ద్రవ్యాల బో ర్డు నుంచి విడదీసి ప్రత్యేకంగా నిజామాబాద్లో కేంద్ర ప్రభు త్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందన్నా రు. పసుపు బోర్డు ద్వారా రైతులకు, ట్రేడర్లు, అంతర్జాతీయ ఎగుమతిదారులతో నిరంతరం అనుసంధానం చేస్తామన్నారు. పసుపు బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 23న నాగ్పూర్, 24న చైన్నె, 26న మేఘాలయ రాజధాని షిల్లాంగ్లలో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నిజామాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో పండిస్తున్న పసుపునకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందన్నారు. దీంతో ఎంపీ ధర్మపురి అర్వింద్ పట్టుబట్టి మరీ ఇందూరుకు పసుపు బోర్డు తీసుకొచ్చారన్నా రు. ఈ బోర్డు కార్యకలాపాలను విడతలవారీగా విస్తరించుకుంటూ వస్తామన్నారు. ప్రస్తుత సీజన్కు సంబంధించి పసుపు మార్కెట్కు వస్తున్న నేపథ్యంలో రైతులకు, ఎగుమతిదారులకు నేరుగా లింక్ ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈ సదస్పు ఏర్పాటు చేశా మన్నారు. రైతులకు ఇకమీదట నిరంతరం పసుపు బోర్డు ద్వారా అన్నిరకాలుగా పూర్తి సహకారం, ప్రోత్సాహం ఉంటుందన్నారు. జిల్లాలో పసుపు బోర్డు కార్యకలాపాలు విస్తరించిన తరువాత పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నా మని పేర్కొన్నారు. ఎఫ్పీవోలతో పాటు ఒక్కొక్క రై తును సైతం ప్రో త్సహిస్తామన్నా రు. రైతులను నేరు గా ట్రేడర్లు, ఎగుమతిదారులతో లింక్ చే సేందుకు నిరంతరం సమన్వయ సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త వంగడాల కోసం రీసెర్చ్, ఉద్యాన శాఖ, ఎంఎస్ఎంఈ, ట్రేడర్లు, ఎగుమతిదారులతో రైతులను అనుసంధానం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. మధ్యవర్తులు, ఏజెంట్లు లేకుండా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో స్పైసెస్ బోర్డు, టర్మరిక్ బోర్డు రీసెర్చ్ డైరెక్టర్ రేమాశ్రీ, జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, శాస్త్రవేత్తలు, నాబార్డ్, జిల్లా పరిశ్రమల కేంద్రం బాధ్యులు, రైతులు, 80 మంది ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం లేని అమ్మకాలకు కృషి కర్షకులు రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి విలువ ఆధారిత ఉత్పత్తులతో మరింత మేలు ట్రేడర్లు, అంతర్జాతీయ ఎగుమతిదారులతో రైతులకు అనుసంధానం జిల్లాలో పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి రైతులు, ట్రేడర్ల సమావేశంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి రైతులకు నిరంతరం అందుబాటులో ఉండి అన్నిరకాల సేవలందిస్తామని పసుపు బోర్డు కార్యదర్శి భవానిశ్రీ అన్నారు. రైతుల నుంచి వచ్చిన సలహాలను సైతం స్వీకరిస్తామన్నారు. ఏళ్లతరబడి పంటలు పండిస్తున్న రైతులు ఇచ్చే సలహాలు అందరికీ ఉపయోగపడేలా అమలు చేస్తామని ఆమె తెలిపారు.సదస్సులో ట్రేడర్లు, ఎగుమతిదారులు రైతులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యారు. రైతులు తీసుకొచ్చిన వివిధ రకాల పసుపు శాంపిళ్లను పరిశీలించారు. క్వాలిటీ పరీక్షలు చేశారు. పలువురు రైతులతో ఎగుమతిదారులు ఒప్పందాలు చేసుకున్నారు. -
‘సాగర్’లో డేంజర్ బెల్స్!
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటిమట్టంతో ఈ సంవత్సరం డేంజర్ బెల్స్ మోగేలా ఉన్నాయి. ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుండడంతో నీటి నిల్వ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రతి రోజు 0.7 టీఎంసీల నీరు ఆయకట్టుతోపాటు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. యాసంగి ప్రణాళిక ప్రకారం ఆయకట్టుకు మరో 22 రోజులపాటు నీటిని విడుదల చేయాలి. అందుకు 15 టీఎంసీల నీరు అవసరం. ప్రాజెక్ట్లో ప్రస్తుతం 23 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అందులో 5 టీఎంసీలు డెడ్స్టోరేజీకి పోగా, మిషన్ భగీరథకు 1.6 టీఎంసీలు, ఆవిరి రూపంలో 2.8 టీఎంసీల నీరు పోతుంది. చివరికి ప్రాజెక్ట్లో మిగిలేది 14 టీఎంసీల నీరు మాత్రమే. దీంతో ఆయకట్టుకు నీటి విడుదలలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే ఖరీఫ్లో సకాలంలో వర్షాలు కురువక పోతే తాగునీటికీ తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. చివరి ఆయకట్టు కోసం.. చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలంటే నిరంతరం కాలువల ద్వారా పరిమాణం తగ్గించకుండా నీటి విడుదల కొనసాగించాలి. దీంతో నీటి ఆవిరి కూడా ఎక్కువగానే అవుతుంది. ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు రికార్డుల్లో తెలుపుతున్నారు. కానీ, కాలువలో ఏడు వేల క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎల్ఎండీ ఎగున ఉన్న చివరి ఆయకట్టు వరకు నీరు అందాలంటే ఎక్కువ మొత్తంలోనే నీటి ప్రవాహం ఉండాలి. కొనసాగుతున్న నీటి విడుదల ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టు కోసం కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 5500, వరద కాలువ ద్వారా 500, సరస్వతి కాలువ ద్వారా 700, లక్ష్మి కాలువ ద్వారా 250, అలీసాగర్ లిప్టు ద్వారా 463 , గుత్ప లిప్టు ద్వారా 270, ముంపు గ్రామాల లిప్టుల ద్వారా 312, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 537 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1070.10(23 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ఇబ్బంది లేదు ఎస్సారెస్పీ నుంచి ఆయకట్టుకు, తాగునీటి అవసరాలకు నీటి విడుదలలో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం పంటల కోసం 13 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. రైతులు అధికారులతో సహకరించి నీటిని పొదుపుగా వాడాలి. చివరి ఆయకట్టుకు వరకు నీరు అందేలా సహకరించాలి. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ ఎస్సారెస్పీలో వేగంగా తగ్గుతోన్న నీటిమట్టం ప్రాజెక్ట్లో ప్రస్తుత నీటి నిల్వ 23 టీఎంసీలు రోజుకు 0.7 టీఎంసీల నీటి వినియోగం ఆయకట్టుకు మరో 15 టీఎంసీల నీరు అవసరం -
పేకాట స్థావరంపై దాడి
ఎడపల్లి: మండల కేంద్రంలోని ఓ రైస్మిల్ వద్ద నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది మంగళవారం దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకోగా వారి నుంచి రూ. 15,780 నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రెండు బోరు మోటార్ల చోరీమాచారెడ్డి: పాల్వంచ మండల శివారులోని ఇద్దరు రైతుల బోరు మోటార్లను గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి దొంగిలించినట్టు ఎస్సై అనిల్ తెలిపారు. గ్రామానికి చెందిన గాలి బొందయ్య, కొండె శ్రీనివాస్లకు చెందిన వ్యవసాయ భూమిలోని బోరు మోటార్లతో పాటు వైర్లను ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. రేపు సీజ్ చేసిన ఇసుక వేలంనందిపేట్: మండలంలోని తల్వేద శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పలకు గురువారం వేలం నిర్వహించనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ వసంతరావు పేర్కొన్నారు. గ్రామ శివారులో వాగు నుంచి అక్రమంగా తరలించిన 120 ట్రాక్టర్ల ఇసుకను కొందరు నిల్వ ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు. వేలంలో పాల్గొనే వారు రూ.20 వేలు దరావత్తు చెల్లించాల్సి ఉంటుందని డీటీ పేర్కొన్నారు. ఆర్మూర్ డిగ్రీ కళాశాలలో కార్యశాలఆర్మూర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఔషధ రూపకల్పనపై ప్రత్యేక కార్యశాల(వర్క్షాప్) నిర్వహించారు. ఈ సందర్భంగా తెయూ రసాయనశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ బాల్కిషన్ హాజరై విద్యార్థులకు ఔషధాల ఆవిష్కరణ అవసరం, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఔషధాన్ని రూపొందించడంలో అనుసరించాల్సిన పద్ధతులు, పరిశోధనలో ఎదురయ్యే సవాళ్లు వాటిని అధిగమించే వినూత్న సాంకేతికతల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వేణుప్రసాద్, సునీల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి
ఎడపల్లి: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఎడపల్లి మండలం జైతాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన చేపట్టారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని కలెక్టర్ ఆరా తీశారు. మొత్తం 125 మందికి మంజూరు కాగా, వారిలో 25 మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని అధికారులు తెలిపారు. మిగతా లబ్ధిదారులు సత్వరమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఎడపల్లిలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూం లను సందర్శించి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వంట నూనె, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. వండిన అన్నం, వంటలను పరిశీలించారు. కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ, అధికారులు, సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు -
కందకుర్తి సందర్శన
రెంజల్: మండలంలోని కందకుర్తి గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ మంగళవారం సందర్శించారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న స్మృతి మందిరం, స్కందాలయంతో పాటు స్వయంభూ రామ మందిరాన్ని దర్శించారు. నిర్మాణ పనుల గురించి స్థానిక ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. రామాలయం వైభవాన్ని ఆయనకు వివరించారు. కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రం ప్రాశస్తాన్ని వివరించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, బస్వా లక్ష్మీనర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు గోపికృష్ట, మేక సంతోష్, ఈర్లరాజు, ప్రసాద్, రంజిత్ పాల్గొన్నారు. -
అనాథ వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్పించాలి
డిచ్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం, రెడ్క్రాస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వృద్ధుల కోసం డిచ్పల్లి మండలం రాంపూర్లో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అనాథ వృద్ధులను గమనిస్తే రాంపూర్లో నూతనంగా ప్రారంభించబడిన వృద్ధాశ్రమంలో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, అందుబాటులో ఉంటే ఆరోగ్య సంబంధిత ఫైల్, సంబంధిత జీపీ నుంచి అనాథ వృద్ధులే అని ధ్రువీకరణ పత్రము, వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్పించే వారి పూర్తి వివరాలు, మొబైల్ నంబర్తో దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. జిల్లా వృద్ధుల, శిశు సంక్షేమ అధికారి కార్యాలయం, ఖలీల్వాడీ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం, రాంపూర్ లోని ఓల్డ్ ఏజ్ హోమ్ను సంప్రదించి వృద్ధులను ఆశ్రమంలో చేర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఆశ్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం 9849933300, 8688887004, 9618844461 నంబర్లను సంప్రదించవచ్చని అన్నారు. తలసేమియా బాధితులకు రక్తమార్పిడి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, నిజామాబాద్ శాఖ భవనంలో తలసేమియా వ్యాధి రక్త మార్పిడికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రక్త మార్పిడి చేయబడుతుందని, ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపారు. ఐదేళ్లు దాటిన తలసేమియా బాధితులు ఉచిత వైద్య సేవలు పొందేందుకు రేషన్, ఆధార్ కార్డు తప్పనిసరి అన్నారు. ఐదేళ్ల లోపు బాలలకు సంబంధించి వాళ్ల పేరెంట్స్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఒక రోజు ముందు ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవాలని, ప్రస్తుతం మంగళ, గురు, శనివారాల్లో రక్త మార్పిడి ఉంటుందని సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు ఉచిత వైద్య సేవలు -
గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్
డివైడర్ను ఢీకొన్న బైక్.. ఒకరు మృతిపెళ్లయిన పదమూడు రోజులకే మృత్యు ఒడికి..● చెరువులో పడి యువకుడి మృతి సదాశివనగర్: పెళ్లయిన పదమూడు రోజులకే ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కడమంచి రాములు(26) ఆరు నెలల క్రితం దుబాయి నుంచి వచ్చాడు. ఈ నెల 6న మెట్పల్లికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. గ్రామ సమీపంలోని పాత చెరువులో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన రాములు ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. రాములకు ఈత రాకపోవడంతోనే నీట మునిగి మృతి చెందాడు. మృతుడి తండ్రి సిద్ధిరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యంనిజాంసాగర్: నిజాంసాగర్ ప్రధాన కాలువలో గల్లంతైన రామగళ్ల దశరథం(38) అనే వ్యక్తి మృతదేహం మంగళవారం సాయంత్రం లభ్యమైంది. మహమ్మద్నగర్ మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన దశరథం సోమవారం గ్రామ శివారులోని ప్రధాన కాలువలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది ప్రధాన కాలువ నీటిలో గాలించారు. సింగీతం గ్రామ శివారులోని ప్రధాన కాలువ బ్రిడ్జి వద్ద మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డ్రంకన్ డ్రైవ్లో తొమ్మిది మందికి జైలుఖలీల్వాడి: డ్రంకన్ డ్రైవ్లో తొమ్మిది మందికి జైలు శిక్ష విధిస్తూ మెజి స్ట్రేట్ నూర్జహాన్ మంగళవారం తీర్పు ఇచ్చినట్లు ఏసీపీ రాజావెంకట్రెడ్డి తెలిపారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పీఎస్ల పరిధిల్లో డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ వారిని పోలీసులు పీఎస్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో హాజరుపర్చారు. జడ్జి తొమ్మిది మందికి జైలు శిక్ష విధించగా మరో 33 మందికి జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. తొమ్మిది మందిలో ఆరుగురికి రెండు రోజుల జైలు, ముగ్గురికి ఒక రోజు జైలు శిక్షను జడ్జి విధించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు. పబ్లిక్ న్యూసెన్స్ కేసులో ఎనిమిందికి ఒకరోజు.. బోధన్టౌన్: బోధన్ పట్టణంలో పబ్లిక్ న్యూసెన్స్కు పాల్పడ్డ ఏడుగురిపై ఒక రోజు జైలు శిక్షను విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్పసాయి తీర్పు ఇచ్చినట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ మంగళవారం తెలిపారు. బోధన్ పట్టణంలోని ఆజాంగంజ్ కాలనీలో పక్కపక్కన ఉండే ఇరు కుటుంబాలు చిన్న విషయంలో గొడవ పడి పబ్లిక్ న్యూసెన్స్ చేశారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరు కుటుంబాల సభ్యులను అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఇరు కుటుంబాలలోని ఏడుగురితో పాటు డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ మరో వ్యక్తికి జడ్జి ఒక రోజు జైలు శిక్షను విధించినట్లు సీఐ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతిమాచారెడ్డి: జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినఠ్లు ఎస్సై అనిల్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన బానోత్ పద్మ(43) అంగవైకల్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో ఈ నెల 15న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించింది. కొద్ది సేపటికి విషయాన్ని గమనించిన కుటుంబీకులు సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. దాడి చేసిన ఇద్దరికి జరిమానానందిపేట్: ఆస్తి తగాదాల్లో కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన ఇద్దరికి రూ. పది వేల చొప్పున జరిమానాను విధిస్తూ ఆర్మూర్ జడ్జి వేముల దీప్తి తీర్పు ఇచ్చినట్లు నందిపేట ఎస్సై చిరంజీవి పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి. 2019లో నందిపేట మండలం కుద్వాన్పూర్లో ఆస్తి పంపకాల విషయంలో తండ్రీ కొడుకులైన గోజూర్ పోశెట్టి, గోజూర్ గంగాధర్ తన కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాటి ఎస్సై రాఘవేందర్ కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఏపీపీ రామకృష్ణ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులపై నేరం రుజువు కావడంతో సదరు వ్యక్తులపై ఒకొక్కరికి రూ. పది వేలు చొప్పున విధిస్తూ జడ్జి దీప్తి జరిమానా విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.భిక్కనూరు: జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలైన ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో మంగళవారం వేకువజామున చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని ఈసీఎల్ ప్రాంతానికి చెందిన అనంత్(23), సంజన స్నేహితులు. వీరు సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి మంగళవారం వేకువజామున తిరిగి హైదరాబాద్కు బైక్పై వెళ్తుండగా జంగంపల్లి శివారులోని జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్నారు. ఈ ఘటనలో అనంత్ అక్కడికక్కడే మృతి చెందగా సంజనకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సంజనను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, అనంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కరెంట్ షాక్తో యువకుడు.. సదాశివనగర్: షార్ట్ సర్క్యూట్తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలం ఉత్తునూర్లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుడిసె సతీశ్(25) మంగళవారం ఉదయం పొలంలో మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. పిచికారీ కోసం కావాల్సిన నీటిని తెచ్చేందుకు తన వ్యవసాయ బావిలోకి దిగాడు. బావిలో ఉన్న మోటర్ వైర్ తెగి నీటిలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించని సతీశ్ నీటిని తీసుకుంటుండగా కరెంట్షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.చెరువులో పడి మహిళ..పిట్లం: ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి చెందిన ఘటన పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నోళ్ల సత్యవ్వ(45) మంగళవారం ఉదయం 10 గంటలకు గ్రామ చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోవడంతో నీట మునిగి మృతి చెందింది. భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.మద్నూర్: ట్రాక్టర్పై నుంచి పడి ఒకరు మృతి చెందిన ఘటన మద్నూర్ మండలం చిన్న ఎక్లార గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్ మండలం మేనూర్ గ్రామానికి చెందిన దశరథ్(25) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చిన్న ఎక్లార శివారులో ట్రాక్టర్పై మట్టిని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ట్రాక్టర్ వెనుక చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.పీడీఎస్ బియ్యం పట్టివేతఖలీల్వాడి: నగరంలో కోజ కాలనీలో టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం పీడీఎస్ బియాన్ని పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య ఆధ్వర్యంలో వన్ టౌన్ స్టేషన్ పరిధిలోని కోజ కాలనీలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 75 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని అధికారులకు, వాహనాన్ని ఒకటో టౌన్ పోలీసులకు అప్పగించినట్లు సీఐ పేర్కొన్నారు. బొలెరో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇసుక టిప్పర్..బోధన్ టౌన్: మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు టిప్పర్ను పట్టుకున్నట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. బోధన్ పట్టణంలోని బెల్లాల్ రైల్వేగేట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ టిప్పర్ను ఆపి పరిశీలించగా అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే టిప్పర్ను స్వాధీనం చేసుకొని డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.డిచ్పల్లి: గంజాయి అమ్మిన, కొనుగోలు చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డిచ్పల్లి సీఐ మల్లేశ్ తెలిపారు. మంగళవారం డిచ్పల్లి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై ఎండీ షరీఫ్తో కలిసి సీఐ మల్లేశ్ మాట్లాడారు. మంగళవారం ఉదయం ఎస్సై తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సీఎంసీ మెడికల్ కాలేజ్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన చిక్కలపల్లి శ్రీకాంత్, దర్బాషి నరేశ్ను తనిఖీ చేయగా వారి నుంచి 80 గ్రాముల గంజాయి లభించిందన్నారు. వారిని పీఎస్కు తరలించి విచారణ చేపట్టగా రూరల్ మండలం గుండారం శివారులోని రైస్మిల్లో పనిచేసే అరుణ్ సర్ధార్ వద్ద నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. దీంతో అరుణ్ సర్ధార్ను పట్టుకుని విచారించగా అతడి వద్ద కూడా 60 గ్రాముల గంజాయి లభించిందన్నారు. ముగ్గురు నిందితుల నుంచి మొత్తం 140 గ్రాముల గంజాయి, మూడు సెల్ఫోన్లు, ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుల్ రాజేందర్ ఉన్నారు.ట్రాక్టర్పై నుంచి పడి ఒకరి మృతి మరొకరికి తీవ్రగాయాలు -
కాలువ వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు
బాన్సువాడ రూరల్: నిజాంసాగర్ ప్రధాన కాలువ ద్వారా నీటిని వదిలిన ప్రతిసారి ఎక్కడో ఓ చోట నీటి ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఇటీవల సంగ్రాం తండాకు చెందిన సిద్దార్థ అనే 19 ఏళ్ల యువకుడు నీటిప్రవాహంలో కొట్టుకుపోయి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చాడు. వరుస నీటిప్రమాదాలతో స్పందించిన నీటిపారుదల శాఖ అధికారులు నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్టపై ప్రమాదం పొంచి ఉందంటూ హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంకిత భావంతో పనిచేయాలికామారెడ్డి క్రైం: అంకిత భావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ఎంపికై న స్టాఫ్ నర్సులు, వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ లకు మంగళవారం తన చాంబర్ లో నియామక పత్రాలను కలెక్టర్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం లోకి వచ్చిన వారు అంకిత భావంతో పనిచేయాలన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన 26 మందికి , వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ గా ఒకరికి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చంద్రశేఖర్, సబ్ యూనిట్ అఽధికారి చలపతి తదితరులు పాల్గొన్నారు. ఎంపీవో, సెక్రెటరీకి మెమోలు గాంధారి(ఎల్లారెడ్డి): జిల్లాలో తాగునీటి సమస్యలపై ‘సాక్షి’లో ‘గొంతు తడిసేదెలా?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. తాగు నీటి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో గాంధారి ఎంపీవో లక్ష్మీనారాయణ, సోమ్లానాయక్ తండా పంచాయతీ కార్యదర్శి దేవీసింగ్కు కలెక్టర్ మెమోలు జారీ చేసినట్లు ఎంపీడీవో రాజేశ్వర్ తెలిపారు. సోమ్లానాయక్ తండాను అధికారులు సోమవారం సందర్శించి విచారణ చేపట్టారు. పరిస్థితులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేశారు. -
దివ్యాంగుల సేవలను బాధ్యతగా భావించాలి
నిజామాబాద్ అర్బన్ : దివ్యాంగుల సేవను తల్లిదండ్రులు, సహిత విద్యా విభాగం ఉద్యోగులు బరువుగా కాకుండా బాధ్యతగా భావించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ అన్నారు. దివ్యాంగ విద్యార్థులకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు ఉండడంతోపాటు పదో తరగతి పాస్ మార్కుల విషయంలోనూ ప్రభుత్వం మినహాయింపునిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని న్యూ ఎన్జీవోస్ కాలనీలో సోమవారం దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సహాయ ఉపకరణాలు అందజేస్తున్న ఆలింకోను డీఈవో అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలింకో నిధులు రూ. 23,28,379తో విలువైన పరికరాలను పంపిణీ చేస్తున్నామన్నారు. దివ్యాంగ విద్యార్థులకు మంజూరైన స్టైఫండ్, అలవెన్సులు త్వరలోనే బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఐఈఆర్పీలు ప్రకాశ్, లింబాద్రి స్వా మి, సంతోష్, శేఖర్, నాగేశ్ గౌడ్, జలంధర్, కిష న్ సాగర్, ఆనంద్, కిషన్, లక్ష్మణ్, ప్రసాద్ , స్పె షల్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ -
పర్యాటక అభివృద్ధిలో సముచిత స్థానం
నిజామాబాద్ అర్బన్: పర్యాటక అభివృద్ధిలో అన్ని జిల్లాలకు స ముచిత ప్రాధాన్యత కల్పిస్తామ ని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో పర్యాటక అభివృద్ధిపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అడిగిన ప్రశ్న కు మంత్రి జూపల్లి సమాధానమిచ్చారు. ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ ప్రాంతంలో పర్యావరణ ప ర్యాటక అభివృద్ధిలో భాగంగా ఉమ్మెడ గ్రామ సమీపంలో 1.20 ఎకరాలు, జలాల్పూర్ గ్రామ పరిధిలో 3 ఎకరాల భూమిని ప్రభుత్వం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థకు అప్పగించినట్లు వెల్లడించారు. శ్రీరాంసాగర్ బ్యాక్వాటర్ ప్రాంత పర్యాటకాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు -
దివ్యాంగుల సేవలను బాధ్యతగా భావించాలి
నిజామాబాద్ అర్బన్ : దివ్యాంగుల సేవను తల్లిదండ్రులు, సహిత విద్యా విభాగం ఉద్యోగులు బరువుగా కాకుండా బాధ్యతగా భావించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ అన్నారు. దివ్యాంగ విద్యార్థులకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు ఉండడంతోపాటు పదో తరగతి పాస్ మార్కుల విషయంలోనూ ప్రభుత్వం మినహాయింపునిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని న్యూ ఎన్జీవోస్ కాలనీలో సోమవారం దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సహాయ ఉపకరణాలు అందజేస్తున్న ఆలింకోను డీఈవో అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలింకో నిధులు రూ. 23,28,379తో విలువైన పరికరాలను పంపిణీ చేస్తున్నామన్నారు. దివ్యాంగ విద్యార్థులకు మంజూరైన స్టైఫండ్, అలవెన్సులు త్వరలోనే బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఐఈఆర్పీలు ప్రకాశ్, లింబాద్రి స్వా మి, సంతోష్, శేఖర్, నాగేశ్ గౌడ్, జలంధర్, కిష న్ సాగర్, ఆనంద్, కిషన్, లక్ష్మణ్, ప్రసాద్ , స్పె షల్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ -
నస్రుల్లాబాద్లో ఒకరి ఆత్మహత్య
నస్రుల్లాబాద్(బాన్సువాడ): బాన్సువాడకు చెందిన ఓ వ్యక్తి నస్రుల్లాబాద్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నస్రుల్లాబాద్ చెరువులో సోమవారం ఓ వ్యక్తి మృతదేహం కనబడటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు బాన్సువాడ గ్రామానికి చెందిన కొత్తకొండ శ్రీనివాస్(53)గా గుర్తించారు. శ్రీనివాస్ విరిగిన కాలు తీవ్రంగా నొప్పి రావడంతో నిత్యం బాధపడేవాడు. ఈక్రమంలో ఈనెల 14న ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. కాలు నొప్పి భరించలేకనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని భార్య అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘ఓయూ’కి సురవరం పేరు పెట్టాలి
సుభాష్నగర్ : ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ సా యుధ పోరాట యోధుడు, ప్రత్యే క తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. తెలుగు యూనివర్సి టీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు మా ర్పుపై అసెంబ్లీలో పెట్టిన తీర్మానంపై సోమవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయా న్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పేరు మార్పు విషయంలో రాష్ట్ర ప్ర భుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. పొట్టి శ్రీరాములు కేవలం భాషాపరమైన ఉద్యమమే కాకుండా దళితుల హక్కుల కోసం, స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీతో కలిసి పనిచేశారని గుర్తుచేశారు. ఆయన పేరు తొలగిస్తే ఆర్యవైశ్య జాతి మొత్తం ఉద్యమానికి సిద్ధంగా ఉందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ -
ఉపాధికి ఊతం.. రాజీవ్ యువ వికాసం
తీసుకునే రుణం వర్తించనున్న సబ్సిడీ రూ.లక్ష 80 శాతం రూ. 2 లక్షలు 70 శాతం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 60 శాతం దరఖాస్తు చేసుకునేందుకు సందర్శించాల్సిన వెబ్పోర్టల్ https://tgobmmsnew.cgg.gov.inనిజామాబాద్ అర్బన్ /మోర్తాడ్(బాల్కొండ): యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉ ద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి దరఖాస్తు ల స్వీకరణ ప్రారంభించింది. డిగ్రీ ఉత్తీర్ణులైన ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు ఈ ఆర్థిక రుణాన్ని అందించనుంది. ప్రభుత్వం అందించే ఈ రుణంతో నిరుద్యోగు లు తమకు నచ్చిన వ్యాపారాన్ని నిర్వహించుకు నే అవకాశం కల్పిస్తోంది. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించి అనంతరం అర్హులను ఎంపిక చేయనున్నారు. అందులో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి 5,000 మందిని ఎంపిక చేసి జూన్ 2న రుణాలు పంపిణీ చేయనున్నారు. పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు మంగళవారం అధికారులు వెల్లడించనున్నట్లు తెలిసింది. కార్పొరేషన్లకు జీవం ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలను అందించేవారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కార్పొరేషన్లకు రాయితీ కోసం నిధులను కేటాయించకపోవడంతో సబ్సిడీ రుణాలకు బ్రేక్ పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక విడతలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితబంధు, బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీబంధు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలను అందించినా పూర్తిస్థాయిలో పథకాలు అమలు కాలేదు. ఫలితంగా ఆయా కార్పొరేషన్లు ఢీలా పడ్డాయి. తాజాగా యువతకు రూ.లక్ష నుంచి రూ.4లక్షల వరకూ రాయితీ రుణాలను అందించేందుకు కొత్త పథకానికి జీవం పోస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సర్కారు నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.4లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఆన్లైన్లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఎంపికలో పారదర్శకత లోపించవద్దు లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో పారదర్శకత లోపించకూడదు. అర్హులైన వారికే ప్రభు త్వ పథకాలు అందించాలి. నిరుద్యోగులు ప్రభు త్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికా ర పార్టీ నాయకుల జోక్యం లేకుండా చూడాలి. – పుప్పాల నరేశ్, బీజేపీ మండల అధ్యక్షుడు, మోర్తాడ్యువతకు మంచి అవకాశం రాజీవ్ యువ వికాసం పథకంతో యువతకు మంచి అవకాశం కల్పించినట్లు అవుతుంది. గతంలో రాయితీ రుణాలకు మంగళం పలకడంతో అనేక మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి లభించక వలస వెళ్లారు. ఇప్పుడు ఉన్న ఊరిలోనే సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. – తక్కూరి సతీశ్, కాంగ్రెస్ నాయకుడు, మోర్తాడ్ -
‘ప్రజావాణి’ అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు
నిజామాబాద్అర్బన్: ప్రజావాణికి ప్రాధాన్యతని స్తూ ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్లో పెట్టవద్దని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరం(కలెక్టరేట్)లో సోమవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జి ల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పా టు, ట్రెయినీ కలెక్టర్ సంకేత్, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్లకు విన్నవిస్తూ దరఖాస్తులు అందజేశారు. కాగా, అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్య లను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. -
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
ఆర్మూర్ : గోదావరి పరీవాహక ప్రాంతాలను పర్యాట క ప్రాంతాలుగా అభివృద్ధి చే యాలని సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పురాతన ఆలయాలున్న ఉమ్మెడ, కొండూరు, చిన్న యానాం వంటి ప్రాంతాలతో పాటు గోదావరి తీరాన భూములను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడంతో చాలా మందికి ఉపాధి లభిస్తుందన్నారు. జిల్లాకు బాసర పుణ్యక్షేత్రం అతి దగ్గర ఉండటంతో త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నా రు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథుల సిద్ధుల గుట్ట అభివృద్ధి కోసం గతంలో దేవాదాయ శాఖ మంత్రికి విన్నవించినా స్పందించలేదని ఆరోపించారు. కొడంగల్తో సమానంగా కాకున్నా కొంతైనా నిధు లు తమ నియోజకవర్గానికి ఇవ్వాలన్నారు. జక్రాన్పల్లి విమానాశ్రయ ఏ ర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి -
ఉత్తమ పరిశోధనలతో వర్సిటీకి గుర్తింపు తేవాలి
తెయూ(డిచ్పల్లి): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయస్థాయి ఉత్తమ పరిశోధనలు చేసి తెలంగాణ యూనివర్సిటీకి మంచి గుర్తింపు తీసుకురావాలని వీసీ యాదగిరిరావు సూచించారు. తెయూ ఫార్మాస్యూటికల్ విభాగానికి చెందిన విద్యార్థులు వెన్నెల, కృష్ణప్రకాష్లు ఇటీవల తైవాన్లోని నేషనల్ డాంగువా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశం పొందారు. ఈసందర్భంగా సోమవారం వీసీ, రిజిస్ట్రార్ వారిని అభినందించారు. అలాగే విద్యార్థులు అడ్మిషన్లు సాధించేందుకు కృషి చేసిన వాసం చంద్రశేఖర్, సత్యనారాయణరెడ్డి, శిరీషను వీసీ, రిజిస్ట్రార్ అభినందించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇందల్వాయి: ఇందల్వాయి ఉన్నత పాఠశాలలో సోమవారం 2006–07 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 18ఏళ్ల తర్వాత వారంత కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు. లోకాని గోపి, మారంపల్లి శ్రీకాంత్, అశోక్, సువర్ణ, స్వప్న, లావణ్య తదితరులు ఉన్నారు. -
పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు?
సుభాష్నగర్: పసుపు ధర విషయంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్రెడ్డి విమర్శించారు. ధర తగ్గితే పదేళ్లు అధికారంలో ఉండి అప్పుడు మాట్లాడలేదని, ఇప్పుడు ప్లకార్డులు పట్టుకోవడం సిగ్గుచేటన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డును సోమవారం ఆయన సందర్శించారు. అన్వేష్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.6వేలకు మించి ధర రాలేదని, ఆ సమయంలో ప్రశాంత్రెడ్డి, కవిత ఏం చేశారని ప్రశ్నించారు. ధర విషయమై ఎంపీ అర్వింద్ చొరవ తీసుకుని కేంద్ర మంత్రులతో మాట్లాడాలని, ధర నిలకడగా ఉండేలా చూడాలన్నారు. నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, పసుపునకు మద్దతు ధర అంశం కేంద్రం పరిధిలో ఉందని, ఇటీవల కేంద్ర మంత్రులకు లేఖలు రాశానని తెలిపారు. అనంతరం ఆయన అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మార్కెటింగ్శాఖ డీడీ మల్లేశం, డీఎంవో గంగుతోపాటు పసుపు రైతులు, వ్యాపారులతో సమావేశమయ్యారు. పసుపు ధర తగ్గడం, నిలకడ లేకపోవడానికి గల కారణాలపై సమీక్షించారు. వ్యాపారులు సిండికేట్ కాకుండా అధికారులు, మార్కెట్ కమిటీ పాలకవర్గం పర్యవేక్షించాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్ వల్లే ధరల్లో వ్యత్యాసం ఉందని వ్యాపారులు చెప్పగా, రైతు సంఘాల నాయకులు వ్యతిరేకించారు. కోల్డ్ స్టోరేజీ నిర్మాణంతోపాటు సాంగ్లీ, ఈ–రోడ్ మార్కెట్లను సందర్శించాలని రైతు సంఘాలు ప్రతిపాదించాయి. నాయకులు ప్రభాకర్, దేవరాం, లింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, డైరెక్టర్లు అగ్గు భోజన్న, నరేందర్, రాజలింగం, మారుతి మల్లేష్ ఉన్నారు. పసుపు ధరపై ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డివి అర్థం లేని మాటలు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్రెడ్డి -
పాత సీఎస్ఐ స్కూల్లో అగ్నిప్రమాదం
ఖలీల్వాడి: నగరంలో ని కంఠేశ్వర్లోని పాత సీఎస్ఐ స్కూల్లో సో మవారం ప్రమాదవ శాత్తు అగ్నిప్రమాదం జరిగింది. పాఠశాలలో ని స్టోర్రూం నుంచి అ కస్మాత్తుగా మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసినట్లు అగ్నిమాపకశాఖ అధికారి నర్సింగ్రావు తెలిపారు. పేకాడుతున్న నలుగురి అరెస్టు మాచారెడ్డి: పాల్వంచ మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై సోమవారం పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.3338 నగదు, నాలుగు సెల్ఫోన్లు, రెండు బైక్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
పసుపు ధరలో గోల్మాల్
● జగిత్యాల్ జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట్కు చెందిన రైతు వంగ శేఖర్ నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ మార్కెట్లో 12 క్వింటాళ్ల పసుపును విక్రయించాడు. ఒక్కో క్వింటాలుకు ఈనామ్ ప్రకారం రూ.10,006 ధర నిర్ణయించారు. పసుపును కొనుగోలు చేసిన వ్యాపారి మాత్రం ఒక్కో క్వింటాలుకు రూ.9,500లు మాత్రమే చెల్లిస్తానని స్పష్టం చేశారు. చేసేది లేక రైతు ఈనామ్ ధర కంటే తక్కువ ధరకే పసుపు విక్రయించాడు. ఫలితంగా రూ.6,072 నష్టపోయాడు. కమీషన్ ఏజెంట్కు మరో రూ.2,500ల చెల్లించాడు. అంటే వంగా శేఖర్కు తన పసుపును విక్రయించి రూ.8,572 తక్కువ పొందాడు. ఇది ఒక్క శేఖర్కు ఎదురైన నష్టమే కాదు. నిజామాబాద్ మార్కెట్లో పసుపును విక్రయించడానికి వెళ్లిన ఎంతో మంది రైతులకు ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధరలో గోల్మాల్ జరుగుతోంది. ఈనామ్ ట్రేడింగ్లో ఒక ధర, మాన్యువల్లో మరో ధర ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా మార్కెటింగ్ శాఖ అధికారులు మౌనం వహించడం ఎన్నో సందేహాలకు తావిస్తుంది. వ్యాపారులు చెప్పిందే ధర.. నిజామాబాద్ మార్కెట్ వరుస సెలవుల తరువాత సోమవారం ప్రారంభమైంది. కానీ ఈనామ్తో సంబంధం లేకుండానే గంజ్లో వ్యాపారులు ధర నిర్ణయించారు. పసుపు నాణ్యతను బట్టి కొమ్ముకు రూ.10వేల నుంచి రూ.12వేలు, మండకు రూ.8వేల నుంచి రూ.9,800ల వరకూ ధర చెల్లించారు. ఇటీవల ఈనామ్ ప్రకారం ఒక ధర మార్కెట్లో మరో ధర వల్ల రైతులు ఆందోళన చేపట్టగా తాజాగా ఈనామ్ను పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. రైతులకు ఆశించిన ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కో ఎకరం పసుపు సాగుకు రైతులు రూ.1.15లక్షల నుంచి రూ.1.30లక్షల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. పసుపు తవ్వడం, ఉడికించడం, ఆరబెట్టి పాలిషింగ్ చేయడం కోసం అదనంగా రూ.50వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి రావడంతోపాటు, క్వింటాలు ధర కనీసం రూ.12వేలకు మించి ఉంటేనే రైతుల శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కానీ ప్రస్తుత ధర రూ.10వేల లోపు ఉండటం, దిగుబడి తక్కువగా రావడంతో రైతులకు తీవ్రంగా నష్టం ఏర్పడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పసుపు సాగుపై చిత్తశుద్ధి లేకపోవడంతోనే పసుపు రైతులకు ప్రోత్సాహం కరువైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి పసుపు సాగు అంశంపై దృష్టిసారించి మద్దతు ధర నిర్ణయించడం, సాగు ఖర్చులు తగ్గేలా అధ్యయనం చేయడంపై చొరవ తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఈనామ్ ట్రేడింగ్లో ఒక ధర, మాన్యువల్లో మరో ధర రైతులను నమ్మించి మోసగిస్తున్న పసుపు వ్యాపారులు మద్దతు ధరనే కీలకం.. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల్ జిల్లాల్లోని నేలలు పసుపు సాగుకు ఎంతో అనువైనవి. పసుపు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలంటే మద్దతు ధర నిర్ణయమే కీలకమైంది. ప్రభుత్వాలు మద్దతు ధర నిర్ణయించి పక్కాగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ కిషన్రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త -
ఇంటి నిర్మాణంపై తెగని పంచాయితీ
ఖలీల్వాడి: జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఓ ఇంటి నిర్మాణం విషయమై స్థల యజమాని, వీడీసీల మధ్య పంచాయితీ ఏడాదిగా కొనసాగుతోంది. ని బంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారంటూ వీడీసీ సభ్యులు పనులను అడ్డుకోగా, బాధితురాలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. జక్రాన్పల్లికి చెందిన సుంకరి స్రవంతి తన భర్తకు వంశపరపర్యంగా వచ్చిన ఇల్లు శిథిలావస్థకు చేరడంతో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాలని కూల్చివేశారు. నూతన ఇంటి నిర్మాణం కోసం జులై11, 2024 జీపీ నుంచి ఆమె అనుమతి తీసుకున్నారు. కానీ నిబంధ నల మేరకు నిర్మాణం జరగడం లేదని, స్లాబు ముందుకు వచ్చిందని వీడీసీ సభ్యులు పనులను అడ్డుకున్నారు. వీడీసీ రూ.30వేలు జరిమానా విధించగా, కట్టేసి పనులు ప్రారంభించారు. అయినా మళ్లీ వీడీ సీ ఇబ్బందులకు గురిచేయడంతో బాధిత కుటుంబసభ్యులు పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. గతనెల లో వీడీసీపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నెల రోజులు గడుస్తున్నా వీడీసీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. బెదిరిపులకు పాల్పడు తూ, కుటుంబంను గ్రామబహిష్కరణ చేస్తామని భ యబ్రాంతులకు గురి చేస్తున్న వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు స్రవంతి ఈనె ల 12న ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. అ లాగే సెట్ బ్యాక్ లేకుండా, ఆర్అండ్బీ రోడ్డును ఆ క్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టారని వీడీసీ స భ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో జక్రాన్పల్లి జీపీ సెక్రెటరీ స్రవంతి భర్త లింగన్నకు నోటీసులు జారీ చేశారు. ఇంటిని కొలిచి ఇచ్చిన ప్లాన్కు విరు ద్ధంగా నిర్మించినట్లు నోటీసులో జీపీ సెక్రటరీ పే ర్కొన్నారు. దీనిపై బాధితురాలు హైకోర్టును ఆశ్ర యించగా స్టే విధించింది. స్పష్టమైన అధారాలతో ఈనెల 28న హాజరు కావాలని రాష్ట్ర పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రెటరీ, నిజామాబాద్ కలెక్టర్, జక్రాన్పల్లి సెక్రెటరీకి నోటీసులు జారీ చేసింది. దీంతో సద రు జీపీ సెక్రెటరీ నుంచి రాష్ట్ర పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రెటరీ వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. పనులను అడ్డుకున్న జక్రాన్పల్లి వీడీసీ హైకోర్టును ఆశ్రయించిన బాధితురాలు ఇంటి స్థలంలోనే నిర్మించాం.. ఇంటి నిర్మాణం చేపట్టినప్పటి నుంచి వీడీసీ సభ్యులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంటి స్థలంలోనే ఇంటిని నిర్మించాం. రోడ్డును ఆక్రమించుకోలేదు. కావాలనే వీడీసీ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలని చూస్తున్నారు. వీరి వేధింపులతో ఆత్మహత్యకు ప్రయత్నం చేశా. అధికారులు స్పందించి న్యాయం చేయాలి –సుంకరి స్రవంతి, జక్రాన్పల్లి -
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం
ఈసారి వేర్వేరుగా కొనుగోళ్లు ● జిల్లా వ్యాప్తంగా 622 కేంద్రాలు ● సన్నరకానికి 429, దొడ్డురకానికి 193 సెంటర్లు ● 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ● రేపు సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశం సుభాష్నగర్ : జిల్లాలో వరి పంట చేతికొస్తుంది. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈసారి సన్న, దొడ్డు రకాలకు వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. జిల్లా వ్యాప్తంగా సన్నరకానికి 429, దొడ్డు రకం ధాన్యానికి 193 కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఏప్రిల్ 1 నుంచి కొనుగోళ్లు ప్రారంభించేలా సర్వం సన్నద్ధం చేస్తున్నారు. 4.20 లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లా వ్యాప్తంగా రైతులు 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 3.75 లక్షల ఎకరాల్లో సన్నరకాలు, మిగతా 45 వేల ఎకరాల్లో ఇతర రకాలు పండించారు. మొత్తం 11.85 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అంచనా వేయగా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 7 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం 622 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాను 10 సెక్టార్లుగా విభజించి ధాన్యం రవాణా చేపట్టనున్నారు. గత వానాకాలం సీజన్లో దక్కించుకున్న కాంట్రాక్టర్లనే ఈసారీ కొనసాగించనున్నారు. సేకరించిన ధాన్యాన్ని సుమారు 250 రైస్మిల్లులకు కేటాయించనున్నారు. ధాన్యం సేకరణకు దాదాపు కోటీ 70 లక్షల గన్నీబ్యాగులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 55 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండగా, మిగతా వాటిని తెప్పిస్తున్నారు. ఏర్పాట్లు పూర్తయ్యాయి జిల్లాలో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే కొనుగోళ్లు ప్రారంభిస్తాం. సన్న, దొడ్డురకాలకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అన్నిశాఖల అధికారుల సమన్వయం, రైతుల సహకారంతో యాసంగి సీజన్లో కొనుగోళ్లను విజయవంతం చేస్తాం. – కిరణ్కుమార్, అదనపు కలెక్టర్ సన్నరకాలకు బోనస్! రాష్ట్ర ప్రభుత్వం సన్నరకాల సాగును ప్రోత్సహించేందుకు గత సీజన్లో క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. వానాకాలంలో 47,811 మంది రైతులకు రూ.158.63 కోట్ల బోనస్ను వారి ఖాతాల్లో జమ చేసింది. యాసంగిలోనూ బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో 85 శాతం మేర రైతులు సన్నరకాన్ని సాగుచేశారు. సన్నరకం ధాన్యాన్ని గుర్తించేందుకు మార్కెటింగ్ శాఖ ద్వారా ఒక్కో సెంటర్కు ధాన్యం కొలిచే యంత్రాన్ని సరఫరా చేయనున్నారు. ఇదిలా ఉండగా సన్న, దొడ్డురకం కేంద్రాలను వేర్వేరుగా ఏర్పాటు చేయనుండడంతో రైతుల్లో బోనస్ ఆశలు రేకెత్తుతున్నాయి. రేపు కో ఆర్డినేషన్ సమావేశం ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ నేతృత్వంలో ఈ నెల 19న సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ, సహకార, పౌరసరఫరా, రెవెన్యూ, మెప్మా, డీఆర్డీవో, రవాణా, ఇతర అన్నిశాఖల జిల్లాస్థాయి అధికారులతోపాటు క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది సమావేశంలో పాల్గొననున్నారు. -
సాంగ్లీ ధర ఇందూరులోనూ ఇవ్వాలి
మోర్తాడ్(బాల్కొండ): మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో పసుపు పంటకు లభిస్తున్న ధరనే నిజామాబాద్ మార్కెట్లోనూ అమలయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ మార్కెట్లో వ్యాపా రులు సిండికేట్గా ఏర్పడడంతో ఎంత నాణ్యత ఉన్నా పసుపు పంటకు ధర లభించడం లేద న్నారు. ఇదే రకం పసుపును రైతులు సాంగ్లీ మార్కెట్కు తరలిస్తే క్వింటాలు కు రూ.13వేల నుంచి రూ.14వేల ధర పలుకుతుందని వెల్లడించారు. నిజామాబాద్లో మొదట్లో క్వింటాలు పసుపునకు రూ.12వేల ధర లభించగా ప్రస్తుతం రూ.8వేలు మాత్రమే దక్కడంతో రైతులు నష్టపోతున్నారని వాపోయారు. ఇది ఎనిమిది నియోజకవర్గాల రైతుల సమస్య అని ఆయన చెప్పారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
ఆభరణాలు ఎత్తుకెళ్లిన నిందితుల రిమాండ్
నిజాంసాగర్(జుక్కల్): మహిళను నమ్మించి నగలు ఎత్తుకు వెళ్లిన ఆటో డ్రైవర్ సుందర్రాజుతోపాటు వడ్డే లక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా మార్డి గ్రామానికి చెందిన మ్యాతరి భూమవ్వ ఆదివారం అచ్చంపేట వెళ్లడానికి నిజాంసాగర్ బస్టాండ్ సమీపంలోని రోడ్డుపై నిల్చుంది. ఆటోలో వచ్చిన సుందర్రాజుతోపాటు వడ్డె లక్ష్మి కలిసి భూమవ్వను అచ్చంపేటకు తీసుకెళ్తామని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరు కలిసి భూమవ్వ మెడలోని రెండు తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకువెళ్లారు. సోమవారం బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటో డ్రైవర్ పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా భూమవ్వ వద్ద చోరీకి పాల్పడినట్లు తెలిపారు. వెంటనే వారి వద్ద నుంచి పోలీసులు ఆభరణాలను స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. నిజాంసాగర్ ఎస్సై శివకుమార్, కానిస్టేబుళ్లు శ్యామ్, మహేష్లను సీఐ అభినందించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఎడపల్లి(బోధన్): మండలంలోని ఠాణాకలాన్ గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రాజెక్టు డి–46 కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. సోమవారం కాలువలో మృతదేహాన్ని గుర్తించి ఒడ్డెపల్లి గ్రామ కార్యదర్శి రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
యూఏఈకి ఉచిత వీసాలు.. విమాన టికెట్స్
మోర్తాడ్: నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు యూఏఈ ప్రభుత్వరంగ సంస్థ ఏడీఎన్హెచ్ ఉచిత వీసాలను జారీ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఇంటర్వ్యూలు నిర్వహించి అనేకమంది నిరుద్యోగులకు యూఏఈలో ఉపాధి అవకాశాలు కల్పించింది. ఆ సంస్థకు చెందిన లైసెన్స్డ్ ఏజెన్సీ జీటీఎం ఆధ్వర్యంలో మరోసారి వీసాల జారీ కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 21, 22 తేదీలలో జగిత్యాల, నిజామాబాద్లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కేటరింగ్, సపోర్టింగ్గ్ సర్వీసెస్ రంగంలో వలస కార్మికులకు ఉచిత వీసాలను జారీ చేయనున్నట్లు పేర్కొంది.ఈసీఎన్ఆర్ పాస్పోర్టు (ECNR Passport) కలిగి, బేసిక్ ఇంగ్లిష్ మాట్లాడేవారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని జీటీఎం సంస్థ చైర్మన్ సతీశ్రావు కోరారు. 250 మందికి వీసాలు జారీ చేసే అవకాశం ఉందన్నారు. భారతీయ కరెన్సీలో రూ.23 వేల వేతనం, ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. వీసాల కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.వీసాల జారీతో పాటు యూఏఈకి వెళ్లడానికి విమాన టికెట్ను సంస్థే ఉచితంగా సమకూరుస్తుందని వెల్లడించారు. ఆసక్తిగలవారు 86868 60999 (నిజామాబాద్), 83320 62299 (ఆర్మూర్), 83320 42299 (జగిత్యాల), 93476 61522 (సిరిసిల్ల) నంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకుని టోకెన్లు పొందాలని సూచించారు. అమెరికాలో విషాదం.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి -
సమాజ పరివర్తనకు సంఘ్ కృషి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే హిందూ సమాజానికి శ్రేయస్సు అని, సమాజ పరివర్తనే స్వయం సేవక్ల బాధ్యత అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ధర్మజాగరణ ప్రముఖ్ అమర లింగన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఆదివారం ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో 56 శాఖల సంగమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా లింగన్న హాజరై ప్రసంగించారు. కుటుంబ వ్యవస్థ మనచేతిలోనే ఉందని, కుటుంబం నుంచే భావి పౌరులకు జీవన విలువలు తెలపాలని అన్నారు. హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఉద్భవించిన కలియుగ ప్రత్యేక అవతారం ఆర్ఎస్ఎస్ అన్నారు. ధర్మాన్ని కాపాడుకోవాలంటే శక్తిమంతంగా తయారు కావాలని, హిందువులందరూ సంఘటితంగా ఉంటేనే శక్తి సముపార్జన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భారతదేశంలో బ్రిటిష్ వాడు సృష్టించిన హిందువుల్లోని ఓ వర్గం విభజనవాదం చేస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టులు చీడపురుగుల్లా తయారయ్యారని, అన్నిమతాలు సమానమని చెబుతూనే మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. హిందువులను మైనారిటీలుగా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. గిరిజనులు, బంజారాలు, లింగాయత్లలో తాము హిందువులం కాదనే భావనను సృష్టిస్తున్నారన్నారు. ఇలాంటి కుట్రలకు ఫండింగ్ చేస్తున్న దొంగలెవరో ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. బానిసత్వంలోకి నెట్టారు.. మహాపురుషులకు కొదువ లేని భారతదేశం కొంద రి స్వార్థం, కుట్రల కారణంగా ఆత్మన్యూనత, అనై క్యతలకులోనై బానిసత్వంలోకి నెట్టబడిందని అమ ర లింగన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేప థ్యంలో డాక్టర్ హెడ్గేవార్ భారత్ను మళ్లీ గురుస్థానంలోకి తీసుకొచ్చేందుకు స్వాతంత్రోద్యమం చేస్తూనే ఆర్ఎస్ఎస్ను స్థాపించారన్నారు. హిందువుల్లో సమైక్యత నిర్మాణం కోసం కృషి చేశారని, ప్రతిరోజూ హిందువులు కలిసేలా సఫలపూరిత కార్యపద్ధతి నెలకొల్పారన్నారు. సమయపాలన, ఆజ్ఞాపాలన విషయమై పుస్తకాలు రాయలేదని, హెడ్గేవార్ ఆచరించి చూపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ అర్గుల సత్యం, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారితోపాటు స్వయం సేవక్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మరక్షణ కోసం శక్తిమంతులుగా తయారవ్వాలి దక్షిణ మధ్య క్షేత్ర ధర్మజాగరణ ప్రముఖ్ అమర లింగన్న ఇందూరు నగరశాఖ ఆధ్వర్యంలో 56 శాఖల సమ్మేళనం -
చెరుకు సాగు, క్రషింగ్పై అధ్యయనం
బోధన్: షుగర్ ఫ్యాక్టరీల నిర్వహణ, అధిక దిగుబడులు అందించే చెరుకు సాగు పద్ధతుల అధ్యయనం కోసం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీతోపాటు అధికారుల బృందం మహారాష్ట్రలో రెండురోజులు పర్యటించింది. మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లా సాంగ్లీ నగర కేంద్రంలోని శ్రీదత్తా కో – ఆపరేటీవ్ షుగర్ ఫ్యాక్టరీని అధికారులు శనివారం, కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్బాబుతోపాటు సభ్యులు, రైతులు ఆదివారం సందర్శించారు. ఫ్యాక్టరీ చైర్మన్ గణపతిరావు పాటిల్తో సమావేశమై ఫ్యాక్టరీ నిర్వహణ విధానం, అధిక దిగుబడులు అందించే వంగడాలు, రికవరీ, రోజువారీ క్రషింగ్ తదితర అంశాలను తెలుసుకున్నారు. అనంతరం చెరుకు తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధిక దిగుబడులు సాధించేందుకు సాగులో పాటించాల్సిన పద్ధతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రత్యేక కమిటీ సభ్యుడు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, పరిశ్రమల డైరెక్టర్ మన్సూద్, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, రాష్ట్ర, జిల్లా స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యానవన, పరిశ్రమలు, షుగర్ కేన్ శాఖల అధికారులు, బోధన్ ప్రాంత రైతులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ స్టడీ టూర్ రెండురోజులపాటు సాగిన పర్యటన మొదటి రోజు అధికారులు, రెండో రోజు సభ్యులు.. పాల్గొన్న మంత్రి, కమిటీ చైర్మన్ శ్రీధర్బాబు, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి -
విద్యార్థులకు కార్పొరేట్ గాలం
మొదలైన అడ్మిషన్ల దందా ● నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ ● రాజధానితోపాటు జిల్లాకు చెందిన ప్రైవేటు కళాశాలల పోటీ ● ప్రభుత్వ, ప్రైవేటు హెచ్ఎంలకు విందులు ● ఆఫర్లు ప్రకటిస్తున్న పీఆర్వోలు ● అయోమయంలో తల్లిదండ్రులు నిజామాబాద్అర్బన్: పదో తరగతి పరీక్షలు ముగియకముందే కార్పొరేట్ ‘దందా’ మొదలైంది. ‘మీ పిల్లలను మా కళాశాలలో చేర్పించండి’ అంటూ తల్లిదండ్రులకు గాలం వేస్తున్నాయి. విద్యార్థులు చ దివే పాఠశాలలకు వెళ్లి మరీ ప్రచారం చేస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన బడా కార్పొరేట్ విద్యాసంస్థలతోపాటు జిల్లాకు చెందిన ప్రైవేటు కళాశాలలు సైతం ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రత్యేకంగా పీఆర్వోలను నియమించుకుని నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల ప్రక్రియను చేపడుతున్నాయి. విందులు, ఆఫర్లు కార్పొరేట్ పీఆర్వోలు ప్రతిరోజు ప్రైవేట్ విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలను కలుస్తూ వారికి విందులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. తమ కళాశాలకు అడ్మిషన్లు ఇప్పించాలంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. చదువులో మెరుగ్గా ఉన్న విద్యార్థుల వివరాలను ముందే తీసుకొని హెచ్ఎంల ద్వారా తల్లిదండ్రులను కలుస్తున్నారు. ఇటీవల రెండు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలకు హైదరాబాద్కు చెందిన ఓ కార్పొరేట్ విద్యా సంస్థ జిల్లా కేంద్రంతోపాటు రాజధానిలో రెండుసార్లు పె ద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా.. పరీక్షలు పూర్తయి, ఫలితాలు వెలువడిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. నిబంధనల ప్రకారం మే, జూన్ నెలల్లో కళాశాలల్లో చేరికలు మొదలు పెట్టాల్సి ఉంటుంది. కానీ, అవేమీ పట్టించుకోని కార్పొరేట్ విద్యాసంస్థలు జనవరి నుంచే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి. ఇదంతా నిబంధనలకు విరుద్ధమంటూ విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల పర్వం మొదలుపెట్టినట్లు తెలిసినా సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగదీశ్రెడ్డి క్షమాపణలు చెపాల్సిందే చర్యలు తీసుకుంటాం నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపట్టొద్దు. ప్రైవే టు కళాశాలల్లో ముందస్తు గా అడ్మిషన్లు చేపడుతున్న దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. అనుమతి లేని కళాశాలలపై తప్పకుండా చర్యలు ఉంటాయి. – రవికుమార్, జిల్లా ఇంటర్ విద్యాధికారితిష్టవేసిన పీఆర్వోలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన పీఆ ర్వోలు రెండు నెలల క్రితం నుంచే జిల్లాలో తిష్ట వే శారు. లాడ్జీల్లో ఉంటూ పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల పాఠశాలలకు వెళ్తూ తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను తీసుకుంటున్నారు. అనంతరం మెసేజ్ లు, వాయిస్ కాల్స్ చేయడంతోపాటు వాట్సాప్ ద్వారా ప్రచార పోస్టర్లను పంపుతూ అడ్మిషన్లు తీసుకునేలా మభ్యపెడుతున్నారు. జిల్లా కేంద్రంలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు కూడా అడ్మిషన్ల కోసం ఇదే తంతు అవలంబిస్తున్నాయి. పరీక్షలు ప్రారంభంకాకముందే ఫోన్కాల్స్, ప్రచారంతో విసిగిస్తుండడంతో ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థులు అయోమయంలో పడుతున్నారు. -
తండ్రిని హతమార్చిన తనయుడు
ధర్పల్లి: తన అవసరాలకు డబ్బులు ఇవ్వడం లేదని కన్న తండ్రిని కొడుకు హతమార్చిన ఘటన ధర్పల్లి మండలంలో చోటుచేసుకుంది. తల్లి సైతం కొడుకుకు సహకరించడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని హొన్నాజీపెట్ గ్రామానికి చెందిన పాలెం చిన్న మల్లయ్య (65)కు భార్య లక్ష్మి, కొడుకు మధు ఉన్నారు. మల్లయ్య తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, ఆవుల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నారు. కొడుకు వివాహం జరుగగా, పొలం పనులు చేసుకుంటు ఉండేవాడు. డబ్బుల విషయంలో మల్లయ్యతో లక్ష్మి, కొడుకు మధు తరచూ గొడవపడేవారు. శనివారం రాత్రి గ్రామంలో ని ఒక కిరాణా దుకాణం వద్ద తనకు డబ్బులు కావాలని కొడుకు, తండ్రితో గొడవకు దిగగా, స్థానికులు సర్ధిచెప్పారు. కానీ కోపం పెంచుకున్న కొడుకు తండ్రిని చంపాలని నిర్ణయించుకొని, బీరు సీసాతో ఇంటికి వెళ్లాడు. గొడవ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఇద్దరు కలిసి మల్లయ్యతో గొడవకు దిగారు. తల్లి, కొడుకు ఇద్దరు కలిసి మల్లయ్య గొంతు పట్టుకొని కిందకు పడేశారు. వెంటనే మధు, మల్లయ్యపై సీసాతో దాడి చేశారు ఈ క్రమంలో మల్లయ్య తలకు గాయమై, రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితులను ఆదివారం రిమాండ్ కు తరలించారు. సహకరించిన తల్లి డబ్బులు ఇవ్వడం లేదని ఘాతుకానికి పాల్పడ్డ నిందితులు -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
బాన్సువాడ రూరల్: నిజాంసాగర్ ప్రధాన కాలువలో గల్లంతైన సంగ్రాం తండాకు చెందిన యువకుడు సిద్ధార్థ (19) మృతదేహం ఆదివారం లభ్యమైంది. బాన్సువాడ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. శనివారం సిద్ధార్థ, అన్న వరుసయ్యే రాజు ఇద్దరు కలిసి బైక్పై తండాకు వస్తుండగా మార్గమధ్యలో కాలువ వద్ద ఆగారు. రాజు కాలువలోకి దిగి కాళ్లుచేతులు కడుగుతుండగా నీటిలో పడిపోయాడు. రాజును రక్షించే క్రమంలో సిద్ధార్థ కాలువలో జారిపోగ స్థానికులు గమనించిన రాజును రక్షించారు. కానీ సిద్ధార్థ నీటిప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందినట్లు తండాపెద్దలు సంగ్రాం నాయక్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడి ఆత్మహత్యాయత్నం ● గోదావరిలో దూకుతుండగా అడ్డుకున్న పోలీసులు నవీపేట: ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకొని కాపాడారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ కాలనీకి చెందిన బయ్యాని వంశీకృష్ణ(30) వడ్రంగి పని చేస్తూ జీవించేవాడు. ఇటీవల ఇంట్లో కుటుంబ సభ్యులతో జరిగిన ఘర్షణతో అతడు తీవ్ర మనస్థాపం చెందాడు. ఆదివారం గోదావరి నదిలో దూకి చనిపోతానని కుటుంబ సభ్యులను బెదిరించి ఇంట్లోను వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వారు నవీపేట పోలీసులకు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మండలంలోని యంచ శివారులోగల గోదావరి బ్రిడ్జిపై నడుచుకుంటూ నదిలో దూకేందుకు య త్నించిన యువకుడిని అడ్డుకున్నారు. కౌన్సెలింగ్ చేసి అతడిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
28ఏళ్లకు కలుసుకున్న మిత్రులు
కామారెడ్డి రూరల్: చిన్నతనంలో కలిసి చదువుకున్న మిత్రులు 28ఏళ్ల తర్వాత కలుసుకున్న అపూర్వ ఘట్టం మండలంలోని దేవునిపల్లిలో చోటుచేసుకుంది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997–98 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏళ్ల తర్వాత కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వారంతా సహపంక్తి భోజనాలు చేశారు. పడకల్లో 25ఏళ్ల తర్వాత.. జక్రాన్పల్లి: మండలంలోని పడకల్ జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాల 1999–2000 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు స్థానిక మున్నూరుకాపు సంఘ భవనంలో ఆ త్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యార్థులు ఒకరినొకరు కలుసుకొని చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే అదే పాఠశాలకు చెందిన 2011–12 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు బడిలో నే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆనాటి ఉ పాధ్యాయులు గోపాలకృష్ణ, స్వామి, జెడ్పి సింధూర, ప్రసాద్, మమతలను పూర్వ విద్యార్థులు సత్కరించారు. కల్లెడిలో 13ఏళ్ల తర్వాత.. మాక్లూర్: మండలంలోని కల్లెడి ప్రభుత్వ పాఠశాలలో 2011–12 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆ త్మీయ సమ్మేళనం నిర్వహించారు. 13ఏళ్ల తర్వాత వారంత మళ్లీ కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. చదువు చెప్పిన ఆనాటి గురువులను వారు సన్మానించారు. -
నేడు ఇసుక డంపుల వేలం
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని మర్పల్లి గ్రామంలో సీజ్ చేసిన ఇసుక డంపులకు సోమవారం వేలంపాట నిర్వహించనున్నట్లు తహసీల్దార్ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి సంబందించిన వ్యక్తులు వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు. ప్రమాదకరంగా ప్రయాణం బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్ వద్దగల జాతీయ రహదారి 44పై ఆదివారం ఓ లారీ రాంగ్రూట్లో వస్తుండటంతో ‘సాక్షి’ క్లిక్మనిపించింది. గతంలో అనేక మార్లు ఈ చోటనే రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. అయినా రాంగ్రూట్లో వాహనాలు వస్తున్న హైవే అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రాంగ్రూట్లో వాహనాలు రాకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అలీసాగర్లో మడ్బాత్ ఎడపల్లి(బోధన్): మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్ వద్ద ఆదివారం యోగా గురువు ప్రభాకర్ ఆధ్వర్యంలో మడ్బాత్ (మట్టిస్నానం) నిర్వహించారు. నవీపేట, నందిపేట, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ఎడపల్లి, మోస్రా, బాన్సువాడ యోగా కేంద్రాల నుంచి సుమారు 400 మంది యోగా సాధకులు ఈ మడ్బాత్లో పాల్గొన్నారు. యోగా రత్న ప్రభాకర్ మాట్లాడుతూ.. మడ్బాత్ ఆర్యోగానికి మంచిదన్నారు. అనంతరం యజ్ఞం నిర్వహించారు. ప్రత్యేక బస్సులతో ఆర్టీసీకి ఆదాయం ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ డిపో నుంచి ఇటీవల నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆర్మూర్ డిపో నుంచి ఈ నెల 12నుంచి 15వరకు ప్రత్యేక బస్సులు నడిపినట్లు డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. మొత్తం 20 బస్సులు రోజుకు రెండు ట్రిప్పుల చొప్పున నడిచాయి. దీంతో సుమారు రూ. 25లక్షల ఆదాయం సమకూరింది. అలాగే ఇటీవలే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడకు 78 ప్రత్యేక బస్సులను నడిపించామని, అందులో ఆర్టీసీకి రూ. 20లక్షల ఆదాయం సమకూరిందన్నారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ చరిత్రాత్మక నిర్ణయం సుభాష్నగర్: దేశ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న సంస్కరణల్లో మరో చరిత్రాత్మక నిర్ణయం ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ వర్క్షాప్ ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ.. ప్రతిసారి ఎన్నికల కోసం రూ.వేల కోట్ల ప్రజాధనం ఖర్చవుతుందన్నారు. తరచూ జరిగే ఎన్నికల వల్ల అభివృద్ధి పనులకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ ద్వారా ప్రజాధనం ఆదా అవడంతోపాటు అభివృద్ధి పనులు వేగంగా అమలు చేయవచ్చన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మెరుగుపడుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, నాయకులు కంచెట్టి గంగాధర్, నక్క రాజేశ్వర్, లక్ష్మీనారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బందిపై నిఘా పెట్టేదెవరు?
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అతి కీలకమైన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్(ఎంహెచ్వో) పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో నగరంలో పారిశుధ్య పనులు, తనిఖీలు సరిగా చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పరిస్థితి.. నగరంలోని ఐదు జోన్లకు గాను ఐదుగురు శానిటరీ ఇన్స్పెక్టర్లున్నారు.వీరిపై శానిటరీ సూపర్వైజర్, ఆ యనపై ఎంహెచ్వో పర్యవేక్షణ ఉండాలి. కానీ పారిశుధ్య పనులు కేవలం శానిటరీ ఇన్స్పెక్టర్లు మాత్ర మే చూస్తున్నారు. కానీ పైఅధికారి లేకపోవడంతో వారు విధుల్లో తీవ్ర అలసత్వం వహిస్తున్నారు. నగరంలో ప్రతిరోజు 300 మెట్రిక్ టన్నుల చెత్త తయారవుతోంది. ఈ చెత్తను ఇంటింటి నుంచి సేకరించడం, మున్సిపల్ వాహనాల్లో తరలించడం, కూడళ్లలో వేసిన చెత్తను తొలగించడం వంటి నిత్య ప్రక్రియలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. డ్రైనేజీలు చెత్త, మురికినీటితో నిండిపోయాయి. అలాగే రెగ్యులర్ ఉద్యోగులు రాకున్నా వారికి హాజరువేసి వారి వద్దనుంచి నెలనెలా వసూళ్లకు పాల్పడుతున్నారు. అయినా వీరిపై అధికారులు నిఘా ఉంచడం లేదు. తనిఖీలు కరువు.. నగరంలో 200 వరకు ఫుట్పాత్ల మీదనే హోటళ్లు, దుకాణాలు నిర్వహిస్తున్నారు. నాణ్యతలేని సరుకు లు వాడటంతోపాటు అపరిశుభ్రంగా ఉన్న స్థలాల్లో తినుబండారాలు విక్రయించడంతో నగరవాసులు అనారోగ్యం పాలవుతున్నారు. అయినా వీరిపై ఎ లాంటి తనిఖీలు లేవు. టిఫిన్సెంటర్ల వద్ద ప్రతీనెల సిబ్బంది మాముళ్లు వసూలు చేసినా పట్టించుకునేవారు లేదు. పాలిథిన్ బ్యాగ్లపై నిషేదం ఉన్నా కిరాణదుకాణాలు, టిఫిన్సెంటర్లు, కూరగాయలు, పండ్ల వర్తకుల వద్ద తనిఖీలు చేయడం లేదు. కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు ట్రేడ్ లైసెన్స్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంహెచ్వో పోస్టు భర్తీ చేస్తే బల్దియా సిబ్బందిపై నిఘా ఉంచి, అందరూ సక్రమంగా విధుల నిర్వహించేలా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బల్దియాలో ఎంహెచ్వో పోస్టును భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. బల్దియా కార్యాలయం నిజామాబాద్ బల్దియాలో ఎంహెచ్వో పోస్టు ఖాళీ రెండేళ్లుగా భర్తీ చేయని అధికారులు నియంత్రణ లేక ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిఅధికారులు పట్టించుకోవడం లేదు మా ఇంటిముందు డ్రెయినేజీ లు నిండిపోయి మురికినీరు రో డ్డుమీద పారుతోంది. మున్సిప ల్ అధికారులకు ఎన్నిసార్లు చె ప్పినా పనులు చేయడం లేదు. నగరంలో పారిశుధ్య వ్య వస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఉన్నతాధికారులు సంబంధిత అధికారిని నియమిస్తే సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. –శ్రీనివాస్, జవహర్ రోడ్డు వాసి త్వరలో నియమిస్తాం బల్దియాలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంహెచ్వో పోస్టు కూడా ఖాళీగా ఉంది. సీడీఎంఏకు తెలియజేశాం. డిప్యూటీ కమిషనర్ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నేను తనిఖీలు నిర్వహిస్తున్న. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిని హెచ్చరిస్తున్నా. –దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్ -
బైక్, కంటెయినర్ను ఢీకొన్న కారు
● ఒకరి మృతి, నలుగురికి గాయాలు ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఓ కారు అతివేగంగా వచ్చి బైక్, కంటెయినర్ను ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఉత్తర ప్రదేశ్కు చెందిన ఇషాద్, కర్ణల్ ఉపాధి నిమిత్తం భీమ్గల్కు వచ్చారు. తమ స్నేహితులు ఆర్మూర్ నుంచి యూపీకి వెళుతుండగా కలవాలనుకున్నారు. దీంతో శనివారం రాత్రి ఇద్దరు కలిసి బైక్పై బయలుదేరగా, మార్గమధ్యలో పెర్కిట్లో ఉన్న మరో స్నేహితుడు మనీష్ను ఎక్కించుకుని వెళ్లారు. ఆర్మూర్లోని హైవే పైగల మహిళా ప్రాంగణం వద్ద వీరి బైక్ను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అనంతరం ఆగిఉన్న కంటెయినర్ను ఢీకొట్టింది. ఈఘటనలో ఇషాద్ అక్కడికక్కడే మృతిచెందగా బైక్పై ఉన్న మరో ఇద్దరు కర్ణల్, మనీష్, కారులోని రాహుల్, గణేష్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.మృతుడి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. -
మక్కల ట్రాక్టర్ బోల్తా
బాల్కొండ: ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన రైతు అమ్మక్కపేట్ కిషన్ మక్కల లోడ్తో ట్రాక్టర్ను చేనులో నుంచి కల్లాం వద్దకు తీసుకొస్తుండగా మార్గమధ్యలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రైతుకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ మక్కలు వరి పొలంలో పడటంతో నీటిపాలయ్యాయి. పొక్లెయిన్ సహాయంతో ట్రాక్టర్ను పంట పొలాల నుంచి బయటకు తీశారు. ఇసుక టిప్పర్, పొక్లెయిన్ సీజ్ ఆర్మూర్టౌన్: ఆలూర్ మండలం దేగాం గ్రామ శివారులోని వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించగా పొక్లెయిన్తోపాటు టిప్పర్ను సీజ్ చేశామన్నారు. అలాగే ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. -
రెండు ఆలయాల్లో చోరీ
వర్ని: మండలంలోని జలాల్పూర్ గ్రామంలోగల మల్లికార్జునస్వామి, కృష్ణ దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తి శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు చోరీని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దుండగుడు ఐదు తులాల బంగారం, 25 తులాల వెండి, హుండీలోని నగదును ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరా ఫుటేజీలో నిందితుడి దృశ్యం రికార్డయింది. గ్రామస్తులు వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్.. రుద్రూర్: కోటగిరి మండలం కొత్తపల్లి శివారులో ట్రాన్స్ఫార్మర్ నుంచి గుర్తుతెలియని దుండగులు కాపర్ కాయిల్స్ను ఎత్తుకెళ్లారు. పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను దుండగులు కిందపడవేసి అందులోని కాపర్ కాయిల్స్ దొంగిలించారు. ఘటనపై విద్యుత్ అధికారులకు సమాచారం అందించినట్టు రైతులు ఆదివారం తెలిపారు. పోతంగల్లో బైక్.. రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలో బైక్ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా.. పోతంగల్లోని ఆబాది బీసీ కాలనీలోగల కిరాణ షాపు వద్ద రెండు రోజుల క్రితం ఇందూర్ గంగాధర్ తన బైక్ను నిలిపాడు. దుకాణంలోకి వెళ్లివచ్చేసరికి దుండగులు బైక్ను చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు ఆదివారం తెలిపారు. -
షుగర్స్ పునఃప్రారంభంలో ని‘జామ్’!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్స్ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసినప్పటికీ.. మళ్లీ సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కొంత ప్రక్రియ పూర్తి చేసింది. ప్రైవేటు యాజమాన్యం పరిధిలోని ఈ ఫ్యాక్టరీకి చెందిన రూ.400 కోట్ల బ్యాంకుల బకాయిలకు సంబంధించి, వన్టైం సెటిల్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్లు చెల్లించింది. 2025 డిసెంబర్ నాటికి ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించినప్పటికీ.. అది మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆలస్యంగానైనా.. పబ్లిక్ సెక్టార్లోనా, ప్రైవేటు సెక్టార్లోనా, సహకార విధానంలో ప్రారంభిస్తారా? అనే అంశంపై కూడా స్పష్టత లేకుండా పోయింది. మరోవైపు క్షేత్రస్థాయిలో సన్నద్ధత విషయంలో ఇప్పటికీ గందరగోళమే నడుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది క్రషింగ్ సీజన్ (అక్టోబర్ నుంచి డిసెంబర్) నాటికి సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. ప్రభుత్వం నుంచి సైతం స్పష్టమైన ప్రకటన రావడం లేదు. బోధన్ ఫ్యాక్టరీని మరో చోటికి తరలించి.. కొత్త యంత్రాలతో నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. రైతులతో విడతల వారీగా కమిటీ చర్చలు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీలో సభ్యుడైన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ రైతులతో విడతలవారీగా ముఖాముఖి చర్చలు జరిపింది. చెరుకు సాగును ప్రోత్సహించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, షుగర్ కేన్ బోర్డు రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు. మరోవైపు ప్రస్తుతం ఫ్యాక్టరీ స్థితిగతులు, యంత్రాల పరిస్థితిని నిపుణుల బృందం పరిశీలిస్తోంది. తరువాత వారి నివేదిక మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నిపుణుల బృందం నివేదిక ప్రభుత్వం వద్దకు వెళ్లి దని ప్రచారం జరుగుతోంది. నివేదికలో ఏముందో బయటకు రాలేదు. మరోవైపు చెరుకు సాగుపై రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం విధానపరంగా ఫ్యాక్టరీ పునఃప్రారంభం విషయమై స్పష్టత ఇవ్వలేదు. రైతులు గణనీయమైన స్థాయిలో చెరుకు పంటను పండించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తేనే.. షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పునఃప్రారంభానికి అడుగులు మరింతగా పడాలంటే చెరుకు సాగు విస్తీర్ణమే ప్రధానం కానుంది. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంనగర్) జిల్లాల్లో నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీలున్నాయి. 2002లో ప్రైవేటుకు విక్రయించిన చంద్రబాబు ప్రభుత్వం.. నిజాం షుగర్స్ యూనిట్లను 2002లో డెల్టా పేపర్ మిల్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. 2014లో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నిజాం షుగర్స్ను ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ మూడు యూనిట్లకు లేఆఫ్ ప్రకటించారు. 2005–06లో చెరుకు దిగుబడి 35 వేల టన్నులున్నప్పటికీ నడిపిన ఈ కర్మాగారాలను.. 2015లో దిగుబడి లక్ష టన్నులకు పెరిగినా మూసేయడం గమనార్హం. దీంతో రైతులు వరి పంట వైపు మళ్లారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలున్న బోధన్, ముత్యంపేట, మంబోజిపల్లి ప్రాంతాల్లో రైతులు గణనీయమైన విస్తీర్ణంలో చెరుకు పంట పండించేందుకు ముందుకు వస్తేనే.. ప్రభుత్వం ఫ్యాక్టరీల పునఃప్రారంభం విషయంలో మరింత వేగంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు చెరుకు సాగు చేయడంపై ఆసక్తి నెలకొంది. -
నేటి బాల్కొండ
నాటి అల్లకొండ.. మిగిలింది పక్షం రోజులే..● అల్లయ్య, కొండయ్య అనే మల్లయోధులు నిర్మించిన పట్టణం ● 1059లో మూడంచెల వ్యవస్థతో ఖిల్లా నిర్మాణం ● 1102లో ఢిల్లీ సుల్తానుల ఆక్రమణతో ధ్వంసం.. తరువాత పునర్నిర్మాణం చేసిన కాకతీయులుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న బాల్కొండ పట్టణానికి ప్రపంచానికి చాటి చెప్పేలా గొప్ప ప్రాచీన చరిత్ర ఉంది. బాల్కొండకు చెందిన అల్లయ్య, కొండయ్య అనే మల్లయోధులు 1059లో ఇక్కడ కొండపై భారీ ఖిల్లాను నిర్మించారు. రాష్ట్ర పురావస్తు శాఖ వివరాల మేరకు ఖిల్లా లోపలి భాగంలో 39 ఎకరాల 27 గుంటల విస్తీర్ణం ఉంది. అప్పట్లో దీనిని అల్లకొండ కోట అనేవారు. ఈ కోట కొండలతో చుట్టుముట్టినట్లుగా ఉండేది. అప్పట్లో ఈ అల్లకొండ నగరాన్ని శ్రీ సోమ, ఆర్య, సూర్య క్షత్రియులు పరిపాలించారు. మూడు అంచెల వ్యవస్థతో అల్లకొండ రాజ్యాన్ని కాపాడారు. ఖిల్లా గుట్ట కింద లోపలి భాగంలో అంతర్గత రాజమహల్ నిర్మించారు. ఇక్కడ ఉన్న బావికి అత్తాకోడళ్ల బావి అని పేరు. ఈ బావిలో ఒక వైపు మంచినీరు, మరోవైపు ఉప్పు నీరు ఉండటం విశేషం. ఆ రోజుల్లో ఒకే బావిలో ఇలా రెండు రకాల నీరు లభించినట్లు విశేషంగా చెప్పుకునేవారు. శత్రువుల చొరబాటు నిరోధించేందుకు గాను కోటకు ఆరు సింహ ద్వారాలు(కమాన్లు), దీన్ని ఆనుకుని పట్టణం, చుట్టూ లోతైన ‘కందకాలు‘ నిర్మించారు. వీటికి అనుసంధానంగా ఆయా సింహద్వారాల అడుగు భాగంలో నాగపడగ ఆకారంలో ఇప్పటికీ గుర్తులు ఉన్నాయి. ● ఘనచరిత్ర కలిగిన అల్లకొండ ఖిల్లాపై 1101 లో ఢిల్లీ సుల్తాన్ అయిన అలంగీర్పాషా సోదరుడైన జాఫర్ ముఖురబ్ ఖాన్ 5 వేల మంది సిపాయిలతో దండెత్తి ఓటమి చెందాడు. ఓటమి సహించలేక మళ్లీ రెండోసారి 1102లో 5 వేల అశ్వక దళాలు, వెయ్యి ఏనుగులు, 7 వేల మంది సిపాయిలతో దండెత్తి అల్లయ్య, కొండయ్యలను హతమార్చి కోటను ఆక్రమించుకున్నారు. దీంతో ఖిల్లా ఢిల్లీ పాలకుల చేతిలోకి వెళ్లింది. ● ఢిల్లీ పాలకుల అనంతరం అల్లకొండ కోట కాకతీయుల పాలనలోకి వెళ్లింది. గణపతిదేవుడు ఈ ఖిల్లాను తిరిగి నిర్మించినట్లు చరిత్రకారుడు బీఆర్ నర్సింగ్రావు తెలిపారు. ఇప్పటికీ ఈ ఖిల్లా నిర్మాణాలపై కాకతీయ పాలకుడైన గణపతిదేవుడు వేసిన శాసనాలు ఉన్నాయి. ఇలాంటి పురాతన కట్టడాల వారసత్వ సంపద కనుమరుగు కాకుండా కాపాడుకోవాలని నర్సింగ్రావు కోరుతున్నారు. నర్సింగ్రావు 2014 నుంచి 2020 వరకు ఈ ఖిల్లా గురించి రీసెర్చ్ చేశారు. -
భారత జట్టుకు జిల్లా క్రీడాకారులు ఎంపిక
నిజామాబాద్నాగారం: సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ భారత జట్టుకు జిల్లాకు చెందిన క్రీడాకారిణులు ఎంపికయ్యారు. ఈనెల 25 నుంచి తైవాన్ దేశంలో జరుగనున్న ఏషియన్ సబ్ జూనియర్ మహిళల సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో భార త జట్టు తరఫున వారు పాల్గొననున్నారు. అంతకుముందు ఈనెల 15నుంచి 20 వరకు న్యూఢిల్లీలో జరిగే మూడవ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఎంపికై న వారిలో జిల్లా క్రీడాకారులు బి నిశిత, జి వర్షిని, డి కీర్తన (సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్ధపల్లి), ఆర్ సౌజన్య (సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల ఆర్మూర్)ఉన్నారు. ఈసందర్భంగా క్రీడాకారులను జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగామోహన్, సంయుక్త కార్యదర్శి చిప్ప నవీన్, జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వినోద్ అభినందించారు. -
ఆశల సాగు ఆవిరయ్యే..
కర్నల్ తండాలో పొలంలో మేస్తున్న పశువులుధర్పల్లి : రైతులు ఎన్నో ఆశలతో సాగు చేసిన వరి పైర్లు నిట్టనిలువునా ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పొట్ట దశకు వచ్చిన వందల ఎకరాల్లో వరి పొలాలు బీటలువారుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వానాకాలంలో భారీ వర్షాలు కురవడంతో కుంటలు, చెరువులు నిండాయి. భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి బోర్లు బాగా పోశాయి. దీంతో పంటలు పండుతాయనే నమ్మకంతో యాసంగిలో కూడా రైతులు ఎక్కువగా వరి సాగు చేశారు. కానీ, ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోవడంతో పొట్ట దశలో ఉన్న పంట ఎండిపోతోంది. బోర్లను నమ్ముకొని వరి వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.అప్పులే మిగిలాయి ఈ రైతు పేరు మహిపా ల్. ధర్పల్లి మండలం కర్నల్ తండా. యాసంగిలో మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. పొట్ట దశకు వచ్చాక బోరు ఎత్తిపోయింది. దీంతో రూ. 1.20 లక్షలు వెచ్చించి 800 అ డుగుల బోరు బావి తవ్వించా డు. కొద్దిపాటి నీరు బయటకు రాగా పంటకు సరిపోతాయనే ఆశతో మరో రూ.1.40 లక్షలతో కొత్త పైపులు, కేబుల్తో మోటారు బిగించాడు. కానీ ఆ రైతు ఆశలు కొన్ని రోజుల్లోనే ఆవిరయ్యాయి. కొత్తగా తవ్వించిన బోరు నుంచి నీరు రాకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో చేసేదేమీ లేక పంటలో పశువులను మేపుతున్నాడు. నీరందక ఎండిపోతున్న పంటలు అడుగంటుతున్న భూగర్భ జలాలు లక్షల్లో అప్పులు చేసి బోరుబావుల తవ్వకం జీవాల మేతగా ఎండిన పంటలు -
జాతీయ సెమినార్లో ఇందూరు చరిత్ర పరిశోధకులు
సుభాష్నగర్: ఇతిహాస సంకలన సమితి తెలంగాణ ఆధ్వర్యంలో ‘దక్షిణ పథ’ పేరుతోహైదరాబాద్లోని ఐసీఎంలో శనివారం నిర్వహించిన జాతీయస్థాయి సెమినార్కు ఇందూరు చరిత్ర పరిశోధకులు కందకుర్తి ఆనంద్, దావుల వివేకానంద హాజరయ్యారు. దక్షిణ భారతదేశ చరిత్ర పరిశోధకులు సెమినార్ ఏర్పాటు చేయగా, ఇందూరు ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల గురించి కందకుర్తి ఆనంద్, ఇందూరు జిల్లా దేవాలయాల చరిత్రను దావుల వివేకానంద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమర్పించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కాగా, విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, అరవింద్రావు, చరిత్ర పరిశోధకులు, పురావస్తు శాఖ అధికారులు పాల్గొన్నారు. -
క్యూఆర్ కోడ్తో ఆన్సర్ బుక్లెట్లు
ఎస్సెస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం ● ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం ● మాస్కాపీయింగ్కు తావుండదు.. ● ఒకవేళ జరిగితే పరీక్షల అధికారులను బాధ్యులను చేస్తాం ● సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ● హాల్టికెట్లపై తప్పులుంటే ఆందోళన చెందొద్దు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా విద్యాశాఖాధికారి అశోక్నిజామాబాద్ అర్బన్: పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఈసారి ఆన్సర్ షీట్లకు బదులు 24 పేజీల బుక్లెట్ను అందజేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ తెలిపారు. ఒక్కో సబ్జెక్ట్కు 24 పేజీల ప్రత్యేక క్యూఆర్ కోడ్తో ఉండే బుక్లెట్ అందిస్తామని, అలాగే ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్కు 12 చొప్పున పేజీలుండే బుక్లెట్లను ఇస్తామన్నారు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహిస్తామని, హాల్ టికెట్లపై తప్పులుంటే విద్యార్థులు ఆందోళన చెందొద్దని సూచించిన డీఈవోతో పరీక్షల నిర్వహణపై ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. ● పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారా? ● 141 సెంటర్లలో పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ఇన్విజిలేట ర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించాం. విద్యార్థులు గంట ముందే సెంటర్కు చేరుకోవాలి. ● మాస్కాపీయింగ్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలు..? ● ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది. ఇప్పటికే పరీక్షల నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. మాస్కాపీయింగ్కు అవకాశం ఉండే సెంటర్లలో ముందస్తు చర్యలు చేపట్టాం. ● కొత్త నిబంధనలు ఏమైనా ఉన్నాయా..? ● ఈ ఏడాది కేవలం ఆరు పేపర్లతో పరీక్షలు ఉంటాయి. కొత్తగా నిబంధనలు ఏమీ లేవు. కేవలం పేపర్ల సంఖ్య మాత్రమే తగ్గింది. విద్యార్థులు సజావుగా పరీక్షలు రాయొచ్చు. ● గ్రామీణ ప్రాంతాల్లోని సెంటర్లలో మాస్కాపీయింగ్కు అవకాశం ఉందనే ఆరోపణలపై.. ● పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అని తేడా లేకుండా జిల్లాలోని 141 సెంటర్లలో గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. ఏ సెంటర్లో మాస్కాపీయింగ్ జరిగినా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంట్ఆఫీసర్లను బాధ్యులను చేస్తాం. మాస్కాపీయింగ్ నిరోధానికి ప్రత్యేక బృందాలున్నాయి ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారు. సీసీ కెమె రాలతో నిఘా కొనసాగుతోంది. ● సెంటర్లలో ఏర్పాట్లు..? ● ఎగ్జామినేషన్ సెంటర్లలో తాగునీటి సదుపాయం, ఫ్యాన్లు, టేబుళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ వైద్య బృందాలు విధుల్లో ఉంటాయి. సెంటర్లలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేపడతారు.మొత్తం విద్యార్ధులు : 22,915 బాలికలు : 11,239 బాలురు : 11,418 ప్రైవేట్/సప్లిమెంటరీ : 258 విద్యార్థులు ఎగ్జామినేషన్ సెంటర్లు : 141 చీఫ్ సూపరింటెండెంట్, : 141 డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఫ్లయింగ్స్క్వాడ్లు : 06 సిట్టింగ్స్క్వాడ్లు : 141 కంట్రోల్ రూం నంబర్ : 9030282993 పరీక్ష సమయం: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు హాల్ టికెట్లపై తప్పులుంటే..? హాల్ టికెట్లపై తప్పులున్నా విద్యార్థులు ఆందోళన చెందొద్దు. పరీక్ష రాసేందుకు అనుమతిస్తాం. సెంటర్లో ఉండే చీఫ్ సూపరింటెండెట్లు, డిపార్ట్మెంట్ల్ ఆఫీసర్లు పరిశీలిస్తారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత పాఠశాల హెచ్ఎంలకు సమాచారం ఇచ్చి వివరాలు తెలుసుకొని విద్యార్థులను అనుమతిస్తారు. ఇప్పటికే చాలా మంది తమ హాల్టికెట్లను సరిచూసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ఎక్కువ సెంటర్లు ఇచ్చారనే విమర్శలపై.. అలాంటిదేమీ లేదు మౌలిక సదుపాయాలు దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉన్న, సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్న స్కూళ్లను సెంటర్ల కోసం ఎంపిక చేశాం. ఒక ప్రాంతాన్ని తీసుకొని ఆ ప్రాంతంలోని విద్యార్థులందరికీ సౌకర్యంగా ఉండే పాఠశాలలో సెంటర్ ఏర్పాటు చేశాం. అయినా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎక్కువ సెంటర్లు ఉన్నాయి. సెంటర్ ఏదైనా పూర్తి స్థాయి నిఘా జిల్లా విద్యాశాఖదే ఉంటుంది. ప్రైవేట్ వారికి ఎలాంటి అధికారం కూడా ఉండదు. -
ట్రాన్స్ఫార్మర్కు రైతుల మరమ్మతులు
మోపాల్: మండలంలోని ఎల్లమ్మకుంట శివారులో ట్రాన్స్ఫార్మర్ లోపల తీగ తెగిపోవడంతో శుక్రవారం సాయంత్రం రైతులే మరమ్మతులు చేపట్టిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్శాఖ అధికారులు మరమ్మతులు చేసేందుకు రావడం ఆలస్యమవుతుందని, పంటలకు సాగునీరు త్వరగా అందాలనే ఉద్దేశంతో తామే మరమ్మతులు చేపట్టామని రైతులు పేర్కొన్నారు. మరమ్మతులు చేసే సమయంలో విద్యుత్ సరఫరా అయి, ఏదైనా ఘటన జరిగితే బాధ్యులెవరని చర్చ జరుగుతోంది. ట్రాన్స్ఫార్మర్ తీగ తెగిపోవడంతో రైతులు లైన్మన్ మురళీని సంప్రదించారు. గతంలో ఇక్కడ పనిచేసిన జూనియర్ లైన్మన్ మహేశ్ బదిలీ కావడంతో మురళికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన వస్తున్నానని సమాధానమిచ్చినా.. ఆలస్యమవుతోందని భావించిన రైతులు ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేపట్టారు. లైన్మన్ అక్కడికి వెళ్లేలోపే మరమ్మతులు పూర్తిచేశారు. కాగా ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు రైతులు సబ్స్టేషన్లో అనుమతి తీసుకుని విద్యుత్ సరఫరా నిలిపివేశారని కొందరు.. ట్రాన్స్ఫార్మర్ బంద్ చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. ఇదే విషయమై మోపాల్ ఏఈ నాగశర్వాణి ని వివరణ కోరగా, రైతులు మరమ్మతులు చేసిన విషయం తనకు తెలియదని, సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్నారు. ఇకముందు రైతులకు ఏమైనా విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలే తప్ప అలా చేయొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. పంటలకు సాగునీరు అందడం లేదని.. విద్యుత్శాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో.. -
సైబర్ నేరాలపై అవగాహన
నిజామాబాద్అర్బన్: నగరంలోని కోటగల్లీలో ఉన్న పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ ప్రోగ్రాంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రెండో టౌన్ ఎస్సై యాసిన్ అరాఫత్, షీ టీం ఎస్సై స్రవంతి హాజరై విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం బి మల్లేశం, మాధవి, రజని, గంగా కిషన్, శైలేష్ దామోదర్, విద్యార్థినులు పాల్గొన్నారు. ఏఐ ద్వారా విద్యా బోధన ప్రారంభంసిరికొండ: మండలంలోని రావుట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా విద్యా బోధనను ఎంఈవో రాములు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ఏఐ ద్వారా విద్యార్థులకు బోధన సులభంగా అర్థమయ్యేలా వారే సొంతంగా మూల్యాంకనం చేసుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. దీనిని విద్యార్థులకు సక్రమంగా అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యక్రమంలో పీజీహెచ్ఎం శ్రీనివాస్, రాజేశ్వర్ హెచ్ఎం విజేత, ఉపాధ్యాయులు బాలయ్య, దయాల్ సింగ్, ఉమా, శేఖర్, వీణ, శివాణి, నవిత, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన ఆర్టీఏ సభ్యుడునిజామాబాద్ సిటీ: ఆర్టీఏ సభ్యుడిగా నియామకమైన రాజ నరేందర్గౌడ్ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతును శనివారం సమీకృత కలెక్టరేట్ సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్హందాన్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. తెయూకు ఈశ్వరీబాయి పేరు పెట్టాలి నిజామాబాద్నాగారం: జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి తెలంగాణ పోరాట యోధురాలు ఈశ్వరీ బాయి పేరు పెట్టాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీకి నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం జైలు పాలైన మొట్టమొదటి మహిళా నాయకురాలు ఈశ్వరీ బాయి అని అన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. కార్యక్రమంలో అలుక కిషన్, గంట సదానందం, సిద్ధిరాములు, కొక్కెర భూమన్న, మోహన్ రావు, సక్కి ఉదయ్, గొరికంటి లింగన్న, వెంకట రమణ, కిరణ్ అనుపాల్, ఇత్వర్పెట్ లింగన్న, అజయ్, అర్గుల్ సురేశ్, తర్ల లక్ష్మణ్, గోలెం అరుణ్, అచ్చుత్, రవి, రాము తదితరులు పాల్గొన్నారు. రాయితీని వినియోగించుకోవాలి ఆర్మూర్టౌన్: ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై అందిస్తున్న 25 శాతం రాయితీని దరఖాస్తుదారులు వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఎల్ఆర్ఎస్ చెల్లించిన వారికి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈనెల 31 వరకు 25 శాతం రాయితీ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. -
ఇబ్బందిగా మారిన గేటును తొలగించాలి
ఖలీల్వాడి: వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలోని పెరిక సంఘం సభ్యులు నిర్మించిన ఫంక్షన్ హాల్ గేట్తో గజ్జెలమ్మ ఆలయానికి ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు కలెక్టర్, సీపీకి శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. జీపీ అనుమతి లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మించారని, అలాగే గేటు ఏర్పాటు చేయొద్దని చెప్పినా నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ గేటు ఏర్పాటుతో భక్తులు ఆలయంలోకి వెళ్లలేకపోతున్నారని అన్నారు. అధికారులు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాములు, గైని గోపి, శ్రీనివాస్, గోపి తదితరులు పాల్గొన్నారు. -
మైనారిటీల అభివృద్ధికి కృషి
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. హిందూ–ముస్లిములు తనకు రెండు కళ్లలాంటి వారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్హందాన్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు, నాయకులు పాల్గొన్నారు. రంజాన్ కిట్లు పంపిణీ జిల్లా కేంద్రంలో పేద ముస్లిములకు రంజాన్ కిట్లు, నిత్యావసర సామగ్రిని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ అందజేశారు. షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏడాది పేద ముస్లిములకు రంజాన్ కిట్లను అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈద్గాల పరిశీలన జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానాలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. నగరంలోని జదీద్ ఈద్గా, మదీనా ఈద్గా, ఐలేహదీస్ ఈద్గాలను మైనార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ఇతర నేతలతో కలిసి పర్యటించారు. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల నిర్వహణకు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఈద్గాల వద్ద పిచ్చిమొక్కల తొలగింపు, గుంతలు పూడ్చడం, తాగునీటి వసతి, విద్యుద్దీపాల ఏర్పాటు లాంటి వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ -
26న ‘తెలుగు సాహిత్యం–ప్రదర్శన కళలు’పై వర్క్షాప్
నిజామాబాద్అర్బన్: నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘తెలుగు సాహిత్యం ప్రదర్శన కళలు’ అనే అంశంపై కార్యశాల నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నంతో కలిసి శనివారం ఆవిష్కరించారు. తృతీయ సంవత్సరం విద్యార్థుల సిలబస్కు అనుబంధంగా ఈ కార్యశాలను రూపొందించడం జరిగిందని ప్రముఖ వ్యాఖ్యాత వీపీ చందన్ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో రామస్వామి, రాజేశ్, భారత్ రాజ్, వినయ్ కుమార్, బాలమణి, రాజేశ్వర్, రాధిక, గంగాధర్, అర్చన, సవిత, పద్మారావు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు/హిందీ/ఇంగ్లిష్
బీమా చెక్కు అందజేత నిజామాబాద్ రూరల్: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా కుటుంబానికి ఆర్థిక దీమా అని శ్రీరామ్ లైఫ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. రూరల్ మండలంలోని అశోక్ ఫారం గ్రామానికి చెందిన షేక్ హలీం బీ అనే మహిళ మూడేళ్ల క్రితం. రూ. 3వేలుతో శ్రీరామ్ లైఫ్లో ఇన్సూరెన్స్ చేశారు. ఇటీవల పాలసీదారురాలు మరణించగా ఆమె భర్త షేక్ ఆదం సాహెబ్కు మంజూరైన రూ. ఆరు లక్షల 30వేల నగదును శ్రీరామ్ లైఫ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి శనివారం అందజేశారు. కార్యక్రమంలో మెట్టు అశోక్ కుమార్, రమణి, మోహన్రావు, కంపెనీ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్) స్క్రీన్–1 దిల్రూబా(తెలుగు)–11.00, 4.35, 7.30, 10.25 –ఛావా(హిందీ)–1.40 స్క్రీన్–2 యుగానికి ఒక్కడు(తెలుగు)–11.00, 4.40 కోర్ట్(తెలుగు)–1.45, 7.35, 10.30 స్క్రీన్–3 ఆఫీసర్ ఆన్ డ్యూటీ (తెలుగు)–1.30, 7.30 –ఛావా(తెలుగు)–4.30, 10.20 పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్) స్క్రీన్–1 ఛావా(తెలుగు)–10.00, 4.15 ఆఫీసర్ ఆన్ డ్యూటీ(తెలుగు)–1.20 కోర్ట్(తెలుగు)–7.35, 10.40 స్క్రీన్–2 కోర్ట్(తెలుగు)–10.00, 4.25 ఛావా(తెలుగు)–1.05, 7.30 ఛావా(హిందీ)–10.50 స్క్రీన్–3 ఛావా(హిందీ)–10.30, 1.50 ల్యాంప్(తెలుగు)–5.10 రిటర్న్ ఆఫ్ది డ్రాగన్(తెలుగు)–7.35 యుగానికి ఒక్కడు(తెలుగు)–10.45 స్క్రీన్ –4 దిల్రూబా(తెలుగు)–10.15, 4.10. 7.20, 10.30 1000 వాలా(తెలుగు)–1.25 లలితామహల్ కోర్ట్ (తెలుగు) దేవి దిల్రూబా(తెలుగు) నటరాజ్ యుగానికి ఒక్కడు (తెలుగు) విజయ్ ఛావా (తెలుగు)24 క్యారెట్స్ 88,900 22 క్యారెట్స్ 82,047 వెండి(కిలో) 1,03,000 – నిజామాబాద్ బిజినెస్చికెన్ ధరలు (కిలోకు) స్కిన్లెస్ 160 డ్రెస్స్డ్ 140 లైవ్ 90 మటన్ 800బంగారం ధరలు (10గ్రాములు)మాంసం ధరలువెండితెర -
బహుజన బాంధవుడు కాన్షీరాం
నిజామాబాద్నాగారం: బహుజనులను రాజ్యాధికా రానికి దగ్గర చేసిన వారు కాన్షీరామ్ అని సీనియర్ న్యాయవాది ఘంటా సదానందం, టీజీవో అధ్యక్షుడు అలుక కిషన్ అన్నారు. భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో కాన్షీరాం జయంతిని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వారు హాజరై కాన్షీరాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దళిత బహు జనుల రాజ్యాధికారం కోసం తన జీవితాంతం నిరంతరం పోరాటం చేసి యూపీలో తన కన్న కలలు దళితులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికా రాన్ని అందించడం జరిగిందన్నారు. నేడు యూపీ తర్వాత ఏపీ అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేవ్లో దళితుల రాజ్యాధికారం కోసం నిరంతరం కృషి చేసిన కృషివలుడు మాన్యశ్రీ కాన్షీరాం అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మదాలె అజయ్, బత్తుల కిష్టయ్య, సాయినాథ్ గైక్వాడ్, షేక్ మిరాజ్, లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు. -
పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండాలి
సుభాష్నగర్: నగరంలో చైన్ స్నాచింగ్, వాహనాల దొంగతనాలు, ఇళ్ల చోరీలను అరికట్టి, పోలీసులు ప్రజలకు రక్షణగా నిలవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విజ్ఞప్తిచేశారు. జిల్లావ్యాప్తంగా సరఫరా అవుతున్న డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, యువతను వాటి బారిన పడకుండా కాపాడాలన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్యను శనివారం తన ఛాంబర్లో ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా సీపీకి మొక్కును అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో లా అండ్ ఆర్డర్ అదుపు చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్య, ఫుట్పాత్ కబ్జాలు, అక్రమ భూకబ్జాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. జిల్లా అభివృద్ధి, లా అండ్ ఆర్డర్ అదుపు చేయడంలో పోలీస్శాఖ తీసుకునే ప్రతి విషయంలో ఎమ్మెల్యేగా తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. సీపీని కలిసిన బోధన్ సబ్ కలెక్టర్ ఖలీల్వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్యను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాన్ని అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. సబ్ కలెక్టర్ను సీపీ స్వాగతిస్తూ అభినందించారు. -
నిజామాబాద్ రైల్వేస్టేషన్లో బాలిక అదృశ్యం
ఖలీల్వాడి: నిజామాబాద్ రై ల్వేస్టేషన్లో ఓ బాలిక అదృశ్యమైనట్లు ఎస్హెచ్వో ర ఘుపతి, రైల్వే ఎస్సై సాయిరె డ్డి శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. వివరాలు ఇలా.. బాన్సువాడకు చెందిన మహేంధర్ సింగ్ తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి ఈ నెల 13న నిజామాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చారు. నాందేడ్ వెళ్లడానికి దేవగిరి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. కొంతసేపటికి తన కూతురు సోనమ్కౌర్(4) కనిపించలేదని, రైలులో వెతికినా ఆచూకీ లభించలేదని మహేందర్సింగ్ తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికై నా బాలిక ఆచూకీ తెలిస్తే నిజామాబాద్ రైల్వే పోలీసులకు గాని, ఒకటో టౌన్ పోలీసులకు గాని సమాచారం అందించాలన్నారు. పశువులను తరలిస్తున్న వాహనాల పట్టివేత ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మీదుగా అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాలను బజరంగ్దళ్ నాయకులు శనివారం అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా సాటాపూర్ నుంచి రెండు లారీలలో పరిమితికి మించి అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నారన్న సమాచారం బజరంగ్దళ్ సభ్యులకు తెలిసింది.దీంతో వారు ఆజామాబాద్ గేట్ వద్ద రెండు లారీలను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు రెండు లారీలలో ఉ న్న పశువులను బిచ్కుంద గోశాలకు తరలించారు. 8 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని పీడీఎస్ రైస్ గోదాంపై టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించి 8 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ ఇన్చార్జి ఏసీపీ నాగేంద్ర ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, సిబ్బంది పట్టణంలోని 3 గోదాముల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వచేసిన 8 టన్నుల రేషన్ బియ్యంను పట్టుకున్నారు. వీటి విలువ రూ. 2,80,000 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. మూడు గోదాముల యజమానులును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. -
ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు
ఖలీల్వాడి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు అందించనున్నట్లు ఆర్ఎం జ్యోత్స్న ఒక ప్రకటనలో తెలిపారు.‘శ్రీరామనవమి’ సందర్బంగా ఏప్రిల్ 6న భద్రాచలంలో జరుగనున్న శ్రీ సీతారాముల వారి కల్యాణంలో వాడిన తలంబ్రాలు, ముత్యాలు రాష్ట్ర ఆర్టీసీ కార్గో సేవా విభాగం ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు ఆర్టీసీ కార్గోలో శుక్రవారం నుంచి రూ.151 చెల్లించి బుక్ చేసుకోవాలన్నారు. వారికి తలంబ్రాలను హోమ్ డెలివరీ ద్వారా అందిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం కింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు. నిజామాబాద్–1డిపో – 9154298727 నిజామాబాద్–2డిపో – 7396889496 ఆర్ఏం ఆఫీసు – 8639969647 ఆర్మూర్ డిపో – 7396889496 బోధన్ డిపో – 9676747174 బాన్సువాడ డిపో – 9154298729 కామారెడ్డి డిపో – 9154298729 -
నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు
ఖలీల్వాడి: నకిలీ గల్ఫ్ ఏజెంట్లను న మ్మి మోసపోవద్దని పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య శనివారం ఒ క ప్రకటనలో సూచించారు. గల్ఫ్లో ఉపాధి అవకాశాల పేరిట మాయమాటలు చెబుతూ చాలా మంది ఏజెంట్లు అనధికారికంగా చలామణి అవుతున్నారని, దీంతో అమాయకులు మోసపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు గల్ఫ్ ఏజెంట్ల కు తమ ఇళ్లను అద్దెకు ఇవ్వొద్దని, ఒక వేళ ఇస్తే పోలీసులకు ముందస్తు సమాచారం అందించాలని సూ చించారు. అలాగే రద్దీ ప్రాంతాలు పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు వంటి ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయొద్దని, విగ్రహాల ఏర్పాటుకు కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అ నుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. 500 మందితో కూడిన సమావేశాలు, సభలకు ఏసీపీ అనుమతి తప్పనిసరి అని, రాత్రి 10 నుంచి ఉదయం 6గంట ల వరకు డీజే సౌండ్ సిస్టంపై పూర్తి ని షేధం ఉంటుందని తెలిపారు. ఈ ని బంధనలు ఈనెల 16 నుంచి 31వరకు ఉంటాయన్నారు. డ్రోన్లతో జనజీవనానికి, శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లితుందని, ప్రభుత్వ సంస్థలు, పోలీసులు, ఏవియేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
టెండర్లు పూర్తయ్యేదెన్నడో?
బాల్కొండ: కాలువల లిఫ్టుల నిర్వహణకు అధికారు లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందు కు రావడం లేదు. దీంతో టెండర్లు పూర్తయ్యేదెన్న డంటూ ఆయకట్టు రైతులు అసహనం వ్యక్తం చేస్తు న్నారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరాఫరా చేసే లక్ష్మి కాలువపై నిర్మించిన ఎత్తిపోతల పథకాల తోపాటు, లక్ష్మి ఎత్తిపోతల పథకం లిప్టుల నిర్వహ ణ కోసం నెలన్నర క్రితం ప్రభుత్వం రూ. 10కోట్ల 47లక్షల 40వేల నిధులను మంజూరు చేసింది. ఈక్రమంలో అధికారులు టెండర్లు పిలిచి నెల రోజు లు గడిచినా ఇప్పటి వరకు ప్రక్రియ పూర్తి కాలేదు. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదని సమాచారం. ఆందోళనలో రైతులు.. ప్రస్తుతం మరో నెల రోజుల్లో యాసంగి సీజన్కు నీటి విడుదలను నిలిపివేస్తారు. ఇప్పటికే టెండర్లు పూర్తయి సిద్ధంగా ఉంటే సకాలంలో పనులు ప్రారంభించి వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి ఎత్తిపోతలను సిద్ధంగా ఉంచవచ్చు. కానీ టెండర్లు ఆలస్యంగా పూర్తిచేస్తే నీటి విడుదలకు ఆటంకాలు ఏర్పడుతాయని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తిచేసి, పనులు పూర్తయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. లక్ష్మి ఎత్తిపోతల పథకం లక్ష్మి కాలువపై లిప్టుల నిర్వహణకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం అధికారులు టెండర్లు పిలిచినా ముందుకురాని కాంట్రాక్టర్లు త్వరలో పూర్తిచేస్తాం.. ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. టెండర్లను ఆహ్వానించినా ఇప్పటి వరకు పూర్తికాలేదు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి, ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి లిఫ్టుల మెయింటెనెన్స్ పూర్తి చేస్తాం. –సురేశ్, డిప్యూటీఈఈ, మైనర్ ఇరిగేషన్, బాల్కొండ -
పాముకాటుతో పదేళ్ల బాలుడి మృతి
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని తొండాకూర్ గ్రామంలో ఓ బాలుడు పాముకాటుతో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలో ఒడ్డె సునీత తన కొడుకు శ్యామ్(10)తో కలిసి ఓ అద్దె ఇంట్లో నివసిస్తోంది. బాలుడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. సునీత కూలీపని చేసుకుంటూ బాలుడిని చూసుకుంటుంది. ఈక్రమంలో శనివారం మధ్యాహ్నం బాలుడు, తల్లి ఇంట్లో నిద్రించగా, నాగుపాము వచ్చి బాలుడి చెవి దగ్గర కాటు వేసింది. తల్లి గమనించి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పామును కర్రతో చంపేశారు. వెంటనే బాలుడిని నందిపేట్లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా, నిజామాబాద్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. జిల్లా కేంద్రంలో రెండు మూడు ఆస్పత్రులు తిరిగినా వైద్యం చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. ఆలస్యం కావడంతో బాలుడు మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లి రోదనలు మిన్నంటాయి. -
వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి
సుభాష్నగర్: వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై వినియోగదారుల హక్కులు, బాధ్యతలను తెలియజేస్తూ, చట్ట పరిధిలో ఎలాంటి సేవలు పొందవచ్చు, వస్తు, సేవలలో మోసాలు ఎదురైనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి.. పలు అంశాలపై వినియోగదారులను చైతన్యపర్చే కార్యక్రమాలు నిర్వహించాలని వినియోగదారుల సంఘాలకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వస్తువుల నాణ్యత, వాటి ప్రమాణాల గుర్తింపు, తదితర అంశాలపై వినియోగదారులకు అవగాహన ఉన్నప్పుడే, నాసిరకం, నాణ్యతా లోపాలను గుర్తించి తమ హక్కులకు ఫిర్యాదు చేస్తారన్నారు. ఏదైనా సందర్భంలో మోసాలకు గురైతే న్యాయం పొందేందుకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలు దోహదపడతాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు వినియోగదారులకు వారి హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. నేటి రోజుల్లో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన వస్తువులు, సేవలను గుర్తించేందుకు గల అవకాశాలను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం ప్రతినిధి రాజేశ్వర్, అధికారులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పరీక్షల్లో ఒత్తిడికి గురికావొద్దు
నిజామాబాద్అర్బన్: ప్రస్తుతం విద్యాసంస్థల్లో వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. త్వరలో పదోతరగతి పరీక్షలు సైతం ప్రారంభం కానున్నాయి. ఈక్రమంలో విద్యార్థులు పరీక్షల్లో ఒత్తిడికి గురికాకుండా, భయం లేకుండా పరీక్షలు రాయాలని మానసిక వైద్యుడు, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశాల్ పేర్కొంటున్నారు. చాలా మంది విద్యార్థులు పరీక్షలు రాగానే భయపడుతుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సులువుగా పరీక్షల్లో విజయం సాధించవచ్చు. అలాగే విద్యార్థులకు ఒక ప్రకటనలో పలు సలహాలు, సూచనలు చేశారు. ● పరీక్షలకు వెళ్లేముందు పరీక్ష విధానం గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. టీచర్స్ చెప్పిన మెళకువలు గుర్తుచేసుకోవాలి. ● ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు. వాటికి జవాబులు ఎలా రాయాలి, ఎంత రాయాలి, ఎంత సమయం కేటాయించాలో తెలుసుకోవాలి. ● జ్ఞాపకశక్తి అందరికి ఒకేవిధంగా ఉంటుంది. మనం ఎంత శ్రమిస్తే మన జ్ఞాపకశక్తి అంత మెరుగుపడుతుందని గ్రహించాలి. ● నేను పరీక్షలు సరిగ్గా రాయగలను అన్న ఆత్మవిశ్వాసంతో పరీక్షకేంద్రంలోకి వెళ్లాలి. ● అర్థంగాని విషయాలను (సబ్జెక్టు)ను టీచర్స్లేదా మీ తోటి విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి. ● బద్దకం, సోమరితనం, అతినిద్ర మన దగ్గరకు రాకుండా ఉండాలంటే ఉదయం ఒక అరగంట యోగా, వ్యాయమం చేయడం మంచిది. ● ఎట్టిపరిస్థితిలోనూ ముఖ్యమైన పనులను, చదువును వాయిదా వేయకూడదు. ● భోజనం చేసిన తర్వాత నిద్ర రావడం సహజం. చదువుకునే సమయంలో నిద్రవస్తే మీ తోటి స్నేహితులతో గ్రూప్ ్డిస్కర్సన్ చేయాలి. ● చదువుతున్నపుడు ప్రతి గంటకు ఒక పది నిమిషాలు విరామం తీసుకోండి. దీనివలన చదివిన విషయాలు ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉంటాయి. ● సబ్జెక్టు అర్థంకాకపోతే వదిలి వేయకుండా సబ్జెక్టు టీచర్ను అడిగి నేర్చుకోవాలి. అవసరమయితే ఆ సబ్జెక్టులో అవగాహన ఉన్న మీ తోటి స్నేహితులతో అడిగి తెలుసుకోవాలి. ● పరీక్షలలో జవాబులు సొంతంగా రాయడానికి ప్రయత్నించండి. జవాబుల్లో మీదంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అందరు రాసే గైడ్లోని, మాడల్పేపర్లోని జవాబులను చూసి బట్టి పట్టకూడదు. ● జవాబులు పాయింట్లు లాగా సక్రమంగా, సంపూర్ణంగా, అర్థవంతంగా ఉండాలి. వీలైతె ప్రతి జవాబుకు డయాగ్రామ్ వేయండి. రాసిన రాతలో పటుత్వం ఉండాలి. అనవసరమైన వ్యాఖ్యలు, పిచ్చిరాతలు లేకుండా, జవాబు స్పష్టంగా రాయాలి. ● చేతిరాతను అందంగా మెరుగు పరుచుకోవాలి. అంతే కాకుండా అవసరమయినంత వేగంగా రాయడానికి ప్రయత్నించాలి. ● పరీక్షలో కష్టమయిన ప్రశ్నలను కూడా వదలకుండా మీకు వచ్చినంత వరకు రాయడానికి ప్రయత్నించాలి, అంతేగాని ప్రయత్నాన్ని విరమించకూడదు. భయం వీడి, బాగా రాసి, మంచి మార్కులు సాధించాలి విద్యార్థులకు మానసిక వైద్యుడు విశాల్ సూచనలు -
గంజాయి విక్రేత అరెస్టు
ఖలీల్వాడి: నగరంలోని సుభాష్నగర్ ఎన్జీవో కాలనీలో గంజాయి అమ్ముతున్న ఓ యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై హరిబాబు శనివారం తెలిపారు. వివరాలు ఇలా.. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఎన్జీవో కాలనీకి వెళ్లారు. అక్కడ గంజాయి అమ్ముతున్న నిర్మల్ జిల్లా గాజుల నర్సాపూర్ గ్రామానికి చెందిన కోడె సంపత్ను పట్టుకున్నారు. అలాగే అతడి వద్ద నుంచి 230 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసు కున్నారు. గంజాయిని నాందేడ్ నుంచి తీసుకుని వచ్చి నిజామాబాద్లో అమ్ముతున్నట్లు అతడు తెలిపాడు. ఈమేరకు కేసు నమోదు చేశామన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్అర్బన్: ప్రొఫెసర్ రాంరెడ్డి దూరవిద్య కేంద్రంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాంమోహన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, పిజీ, డిప్లోమా కోర్సులలో ప్రవేశాలకు రెండో విడత ఆవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆసక్తిగలవారు ఈనెల 31లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 99126 70252 సంప్రదించాలన్నారు. ఉచిత డ్రైవింగ్ కోర్సుకు.. నిజామాబాద్అర్బన్: వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత డ్రైవింగ్ కోర్సులలో శిక్షణ పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవింగ్లో హెచ్ఎంవీ, ఎల్ఎంవీ శిక్షణ కాలం 30రోజులు ఉంటుందన్నారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత రవాణా సంస్థ అర్హత కలిగిన అభ్యర్థులకు పర్మినెంట్ లైసెన్స్ ఉచితంగా అందిస్తుందన్నారు. అభ్యర్థులకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి హైదరాబాదులో కల్పించనున్నట్లు తెలిపారు. 18ఏళ్ల నుంచి 45ఏళ్లలోపు వారు అర్హులన్నారు. 8వ తర గతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆసక్తి గల బీసీ నిరుద్యోగ యువతీయువకులు దరఖాస్తులను ఈనెల 15నుంచి 31లోపు జిల్లా బీసీ వెనుకబడిన తరగతుల కార్యాలయంలో అందించాల. కేసుల చార్జిషీట్పై సమీక్ష ఖలీల్వాడి: నగరంలో శనివారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కేసుల చార్జిషీట్పై సమీక్ష నిర్వహించారు. కొత్త చట్టాల ద్వారా లోక్ అదాలత్ కేసుల లొసుగుల గురించి సమీక్షించారు. లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ.. నూతన చట్టాల ద్వారా నేరపరిశోధన, చార్జిషీట్ దాఖలు చేసే విధానం గురించి, సాక్షుల వివరాలు సేకరించే విధానం గురించి వివరించారు. ప్రతి కేసులో ముద్దయిలకు శిక్ష పడే విధంగా చూడాలని కోరారు. జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పీసు రాజేశ్వర్రెడ్డి, రాజగోపాల్గౌడ్, దామోధర్ రెడ్డి, కావేటి శేషు, బంటు వసంత్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి. రామకృష్ణ, భూసారపు రాజేష్ గౌడ్, అశోక్ శివరాంనాయక్, చిదిరాల రాణి పాల్గొన్నారు. ఏప్రిల్ 20 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు నిజామాబాద్అర్బన్: జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పరీక్షలు 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఏప్రిల్ 26నుంచి మే 3వరకు కొనసాగుతాయన్నారు. -
కాలువలో పడి యువకుడి గల్లంతు
బాన్సువాడ రూరల్: మండలంలోని జక్కల్దాని తండా సమీపంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు పడిపోయి గల్లంతయ్యాడు. వివరాలు ఇలా.. మండలంలోని సంగ్రాంతండాకు చెందిన బోడ సిద్దు (సిద్దార్థ) అనే 19ఏళ్ల యువకుడు శనివారం మిత్రుడు రాజుతో కలిసి సేవాలాల్ దీక్ష చేపట్టడానికి కావాల్సిన షాపింగ్ కోసం బాన్సువా డ వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్ర మంలో పెద్దపూల్ బ్రిడ్జి వద్ద కాళ్లు చే తులు కడుక్కొవడా నికి ఇరువురు కాలు వలో దిగారు. ప్ర మాదవశాత్తు ఇద్ద రు నీటిలో పడిపో యి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా రాజును స్థానికులు కాపాడారు. సిద్ధు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. విష యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో కాలువలో గాలిస్తున్నారు. -
భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ
కామారెడ్డి క్రైం: లైంగిక దాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కోర్టులో కేసు ట్రయల్కు వచ్చే వరకూ, పరిహారం ఇప్పించేవరకూ ‘భరోసా సెంటర్‘ అండగా నిలుస్తుందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి లోని వడ్లూర్ రోడ్డులో ఉన్న భరోసా సెంటర్ను ఎస్పీ శనివారం సందర్శించారు. అందుబాటులో ఉన్న లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సెలింగ్ గదులు, స్టేట్మెంట్ రికార్డు, సమావేశ గదులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లో బాధిత మహిళలకు వైద్య, సైకాలజీ, పోలీసులు సహకారం, పరిహారం ఇప్పించడం లాంటి సేవలు అందుతున్నాయని తెలిపారు. బాధితులకు న్యాయపరమైన సూచనలు అందించాలని, అవసరం ఉన్న వారికి భరోసా సెంటర్లో ఆశ్రయం కల్పించాలని సిబ్బందికి సూచించారు. -
కస్టడీలోని యువకుడి మృతితో కలకలం
నిజామాబాద్: సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న యువకుడు మృతి చెందిన ఘటన జిల్లాలో కల కలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలోని వడ్డెర కాలనీకి చెందిన అలకుంట సంపత్ (31) జగిత్యాల జిల్లాలోని శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్పవర్ కన్సల్టెన్సీ మేనేజర్గా పని చేస్తున్నారు. సంపత్తోపాటు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగపేటకు చెందిన చిరంజీవి, ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్కు చెందిన మిట్టాపల్లి నర్సారెడ్డిలు పనిచేస్తున్నారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష వసూలు చేశారు. కొంతమందిని లావోస్ దేశానికి డేటాఎంట్రీ ఆపరేటర్ల పేరిట పంపించారు. తీరా అక్కడ సైబర్నేరాలు చేయించడంతో బాధితులు అక్కడి భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసి స్వదేశానికి తిరిగొచ్చారు. అనంతరం ఆలకుంట సంపత్, చిరంజీవి, నర్సారెడ్డిలపై జిల్లా కేంద్రంలోని సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ నెల 4న ముగ్గురిని పోలీసులు రిమాండ్కు తరలించారు. 12న కోర్టు అనుమతితో ముగ్గురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ నిమిత్తం జగిత్యాల జిల్లాకు తీసుకెళ్లారు. విచారణ అనంతరం జిల్లా కేంద్రంలోని సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్కు తీసుకురాగా, గురువారం రాత్రి సంపత్ ఎడమ చేయి లాగుతోందని పోలీస్ సిబ్బందికి చెప్పడంతో వెంటనే జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. సంపత్ మృతి విషయాన్ని గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు తమకు చెప్పినట్టు కుటుంబీకులు తెలిపారు.ఫస్ట్క్లాస్ జడ్జి సమక్షంలో..సంపత్ మృతదేహానికి ఫస్ట్క్లాస్ జడ్జి హరికృష్ణ సమక్షంలో ముగ్గురు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టును సీపీ సాయిచైతన్యకు అందించారు. సంపత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.గుండె సమస్యతో మృతి చెందాడు‘అలకుంట సంపత్ గుండె సంబంధిత సమస్యతోనే మృతి చెందాడు. సంపత్ శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ద్వారా నిరుద్యోగ యువతను థాయిలాండ్, మయన్మార్, లావోస్ తదితర ప్రాంతాలకు పంపించేవాడు. మోసపోయిన వారి ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు గురువారం జగిత్యాలలోని సంపత్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ విచారణ చేశారు. అదే రోజు రాత్రి ఎడమ చేయి, ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో పోలీసులు జీజీహెచ్కు తీసుకువెళ్లారు. జీజీహెచ్లోని సీసీటీవీ ఫుటేజీలో సంపత్ నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించాం. జీజీహెచ్కు వెళ్లిన తర్వాత సంపత్ కుప్పకూలిపోయాడు. వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. సంపత్ మృతిపై ఒకటో టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. విచారణ కొనసాగుతోంది.’ అని సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సమగ్ర విచారణ జరపాలిసంపత్ మృతి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం జీజీహెచ్కు చేరుకున్నారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే తన భర్త సంపత్ మృతి చెందాడని భార్య ఆరోపించారు. మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని జీజీహెచ్ ఎదుట ఉన్న రోడ్డుపై ధర్నా చేశారు. న్యాయం చేస్తామని, జడ్జి సమక్షంలో వీడియో రికార్డింగ్ ద్వారా పోస్టుమార్టం చేయించి, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రాజా వెంకట్రెడ్డి హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ధర్నా విరమించారు. -
షార్ట్సర్క్యూట్తో ఇళ్లు దగ్ధం
రుద్రూర్: మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో శుక్రవారం షార్ట్సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించి రెండు నివాసపు గృహలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన లక్ష్మీ, సావిత్రిలు తమ ఇళ్లల్లో ఒంటరిగానే ఉంటున్నారు. హోలీ సందర్భంగా వారు బయటకు వెళ్లిన సమయంలో ఆయా ఇళ్లల్లో షార్ట్సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి బోధన్ ౖఫైర్ స్టేషన్ సిబ్బందికి స మాచారం అందించగా, వారు గ్రామానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు కాలిపోయాయని బాధితులు తెలిపారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ భారతి, తహసీల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ భూషన్ ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఒక్కొక్కరి ఇంటిలో సుమారు రూ. లక్షా 50వేలు ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. బాధితులకు ప్రభుత్వం సహాయాన్ని అందించాలని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు. -
అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు
మాక్లూర్: మండలానికి చెందిన ఓ వ్యక్తి ఈనెల 13న అదృశ్యమవగా, శుక్రవారం వాగులో శవమై తేలాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని గుంజ్లి గ్రామానికి చెందిన గోపు పెద్ద భోజన్న (55) గురువారం ఉదయం పొలానికి వెళ్లగా, రాత్రయినా తిరిగి ఇంటికి రాలేడు. కుటుంబసభ్యులు ఎంతవెతికినా అతడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఉదయం స్థానిక వ్యవసాయ బోరుబావి వద్దగల వాగులో శవమై తేలాడు. వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడు చేపలు పట్టడానికి వాగులోకి దిగాడా? లేక వ్యవసాయ మోటార్కు రిపేర్ చేయడానికి వాగులో దిగి, ప్రమాదవశాత్తు మృతి చెందాడా అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈమేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. -
ప్రైమరీల్లో ఏఐ బోధన
కమ్మర్పల్లి: ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కృత్రి మ మేధ బోధనను ప్రవేశపెడుతోంది. విద్యార్థుల పఠనా సామర్థ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ కోర్సును ప్రాథమిక స్థాయి నుంచే ప్రారంభించేందుకు జిల్లాలో 44 పాఠశాలలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసింది. ఈ నెల 15 నుంచి కృత్రిమ మేధ ద్వారా బోధన ప్రారంభం కానుంది. ఈ మేరకు డీఈవో ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీచేశారు. సర్వం సిద్ధం.. కృత్రిమ మేధతో విద్యా బోధన కోసం విద్యాశాఖ అధికారులు జిల్లాలో 44 ప్రాథమిక పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 3 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విద్యనందించేందుకు ఒక్కో పాఠశాలలో 5 కంప్యూటర్లు, హెడ్ఫోన్స్, ఇంటర్నెట్ సదుపాయంతోపాటు అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థుల స్థాయి మేరకు బోధన.. 3, 4, 5వ తరగతుల విద్యార్థులు ఆశించిన స్థాయిలో అభ్యసనా సామర్థ్యాలు సాధించడానికి, గణితంలో చతుర్విద ప్రక్రియలు సులభంగా నేర్చుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. చిన్నారులను ఆకట్టుకునేలా రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్తో బోధిస్తారు. ఎంపిక చేసిన 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఐదుగురిని ఒక బ్యాచ్గా ఏర్పాటు చేసి, ఒక్కో బ్యాచ్కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలను బోధించనున్నామని విద్యాధికారులు తెలిపారు. విద్యార్థి అర్థం చేసుకుంటున్నాడా లేదా అని ఏఐ గుర్తించి.. అర్థం కాకపోతే సరళమైన మార్గంలో, అర్థం అయ్యిందంటే మరికొంత మెరుగైన పద్ధతిలో పాఠాలు బోధిస్తారు. విద్యా ప్రగతికి దోహదపడుతుంది ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం, కృత్రిమ మేధ ద్వారా తరగతులు నిర్వహించడంతో విద్యార్థుల అభ్యసనంలో ప్రగతికి దోహదపడుతుంది. విద్యార్థుల హాజరుశాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరిగే ఆస్కారం ఉంటుంది. – అశోక్, డీఈవో, నిజామాబాద్.ప్రయోజనాలివే.. విద్యార్థుల వ్యక్తిగత అభ్యాసన శైలిని మెరుగుపరచడంలో సహాయపడనుంది. విద్యార్థులకు తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే అవకాశం లభిస్తుంది. విద్యార్థుల బలహీనతలను గుర్తించి, వారి సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు టీచర్లు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఏఐ టెక్నాలజీ సహాయంతో విద్యార్థులు నేర్చుకునే విధానాన్ని టీచర్లు విశ్లేషించి, వారికి తగిన మార్గదర్శకత ఇస్తారు. నేటి నుంచి నూత్పల్లి పాఠశాలలో..డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలంలోని నూత్పల్లి ప్రాథమిక పాఠశాలలో నేటి నుంచి కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా బోధన అందించనున్నారు. అందుకోసం పక్కనే ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో కంప్యూటర్లను సిద్ధం చేశారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఏఐ ద్వారా బోధన శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఎంఈవో రామకృష్ణ తెలిపారు. త్వరలోనే కంప్యూటర్ సౌకర్యాలున్న మిగతా పాఠశాలల్లో కూడా ఏఐ విద్యను అందుబాటులోకి తెస్తామన్నారు. నేటి నుంచి 44 పాఠశాలల్లో శ్రీకారం ప్రాథమిక స్థాయిలోనే డిజిటల్ నైపుణ్యం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
నిజాంసాగర్నుంచి నీటి విడుదల
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు శుక్రవారం ఐదో విడత నీటి విడుదలను ప్రారంభించారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద 1.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో నీటిని అందించారు. ఐదో విడతలో రోజూ వెయ్యి క్యూసెక్కుల చొప్పు న నీటిని అందించనున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1,396.92 అడుగుల (8.351 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేస్తున్నందున ప్రధాన కాలువలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు కోరారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. ఆయకట్టు కింద సాగు చేసిన ప్రతి గుంటకు సాగు నీరు అందించి పంటలను గట్టెక్కిస్తామని అధికారులు పేర్కొన్నారు. నేటి నుంచి ఒంటిపూట బడులు నిజామాబాద్అర్బన్ : నేటి నుంచి ఒంటిపూ ట బడులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో తెలిపా రు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యా హ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగుతా యని తెలిపారు. గ్రూప్స్లో జిల్లావాసి సత్తా నిజామాబాద్నాగారం: గ్రూప్స్ ఫలితాల్లో జిల్లాకు చెందిన ఆనంద్కుమార్ సత్తా చాటాడు. కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన ఆనంద్–కరుణల కుమారుడు ఆనంద్. 2012లో ఎంఫార్మసీ పూర్తిచేశారు. అనంతరం ఢిల్లీలోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం సాధించాడు. కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఐదేళ్ల క్రితం ఉద్యోగం మానేసి జిల్లాకు తిరిగి వచ్చేశాడు. అప్పటినుంచి పోటీ పరీక్షలకు సన్నద్ధమవగా గ్రూప్స్ పరీక్షలు రాశాడు. గత సంవత్సరం విడుదలైన గ్రూప్–4లో ఉత్తమ మార్కులు రావడంతో వాణిజ్య పన్నులశాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించాడు. గ్రూప్ 1, 2, 3 పరీక్షలు రాయగా అందులోనూ ఉత్తమ మార్కులు సాధించాడు. గ్రూప్ 1లో 448 ర్యాంకు, గ్రూప్–2 ఫలితాల్లో 359 మా ర్కులతో 877 ర్యాంకు, బీసీ–సీ కేటగిరిలో రాష్ట్రస్థాయిలో–5వ ర్యాంకు సాధించాడు. శుక్రవారం విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లో 281 మార్కులతో 506 ర్యాంకు సాధించారు. బీసీ– సీ కేటాగిరిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించ డం చాలా సంతోషంగా ఉంది. ఐదేళ్లు శ్రమించిన కష్టానికి ఫలితాలు వచ్చాయని ఆనంద్ కుమార్ చెప్పారు. -
కళ్లముందే మాయాజాలం
తూనికలు, కొలతలు, వస్తువుల నాణ్యతా ప్రమాణాలు, ఆహార కల్తీ తదితరాలకు సంబంధించి వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. ప్రభుత్వాలు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో వ్యాపారులు, వస్తు తయారీదారులు యథేచ్ఛగా వినియోగదారులను మోసం చేస్తూనే ఉన్నారు. శనివారం అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినం నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ‘సాక్షి’ బృందం వివిధ వ్యాపార సముదాయాల వద్ద పరిశీలన చేసింది.● వినియోగదారులను తెలివిగా మోసం చేస్తున్న పలువురు వ్యాపారులు ● తూనికలు, కొలతల్లో మోసాలు.. నాసిరకం వస్తువులు అంటగడుతున్న వైనం ● ఔషధాలు, ఆహార పదార్థాలు, ఎలక్ట్రిక్ వస్తువుల అమ్మకాల్లో ఇదే పరిస్థితి ● థియేటర్లలో తినుబండారాలకు అనేక రెట్ల వసూళ్లు ● నేడు అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినం ● ఇందూరులో ‘సాక్షి’ పరిశీలనసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ వినియోగదారులు 67 శాతం ఉన్నారు. ఇక్కడ తూనికలు, కొలతల శాఖ 2011 లీగల్ మెట్రాలజీ రూల్స్ అమలు చేసే విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా ఉంటోంది. అసలు ఈ శాఖ పనిచేస్తున్న సంగతే ఎవరికీ తెలియని పరిస్థితి. ఇక అక్రమ నిర్మాణాల విషయంలో 1987 మున్సిపల్ కార్పొరేషన్ అపార్ట్మెంట్ చట్టం, 2012 భవన నిర్మాణ నిబంధనలు, 2019 వినియోగదారుల రక్షణ చట్టం అమలు కావడం లేదు. జిల్లా స్థాయిల్లో వినియోగదారుల కమిషన్లు వేయడం లేదు. దీంతో వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు. బంగారు తూకంలో.. బంగారు దుకాణాల్లో కొనుగోలుదార్లకు టీజీఎస్టీ, సీజీఎస్టీ బిల్లులు ఇవ్వడం లేదు. తూకంలో సరైన కొలతలు పాటించినప్పటికీ, బంగారం తూకం వేసే సమయంలో వ్యాపారులు తెలివిగా సీలింగ్ ఫ్యాన్ను ఎక్కువ స్పీడ్ పెట్టడం ద్వారా తూకంలో తేడాను గమనించడం జరిగింది. శుభకార్యాలకు ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేసేవారి వద్దకు తెలిసిన వ్యక్తులు వచ్చి మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ, బంగారు వ్యాపారుల నుంచి ఎల్సీడీ టీవీలు, ఏసీలు, ఇతర ఖరీదైన గృహోపకరణాలను బహుమతిగా పొందుతున్నారు. ఈ మేరకు ఒప్పందం చేసుకుంటున్నారు. హోటళ్లలో నీళ్ల బాటిల్ నుంచి దోపిడీ మొదలు.. జిల్లా కేంద్రంలో సుమారు 200 వరకు చిన్న, పెద్ద హోటళ్లు ఉన్నాయి. చాలావాటిలో బిల్లులు ఇవ్వడం లేదు. బడా హోటల్స్లో జీఎస్టీ పేరిట పిండేస్తున్నారు. వందలో ఒకరిద్దరికి కచ్చితమైన బిల్లులు ఇస్తున్నారు. నీరు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా, నీళ్ల బాటిళ్లకు జీఎస్టీతో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి మాత్రం జీఎస్టీ లెక్కలు చూపించని పరిస్థితి. హద్దులేని సినిమా థియేటర్ల దోపిడీ.. నగరంలోని మల్టీప్లెక్స్లు, టాకీస్లలో పార్కింగ్ నుంచి నీళ్ల బాటిళ్లు, శీతల పానీయాలు, తినుబండారాలకు బయటితో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. తినుబండారాల క్వాలిటీ, క్వాంటిటీ అంతా తీసికట్టే. ఈ దోపిడీపై అనేక మంది నిలదీసినప్పటికీ మార్పు రావడం లేదు. చిన్నపిల్లల కోసం ఇంటి నుంచి తీసుకొచ్చిన పాలకు సైతం అనుమతించని పరిస్థితి.ఆహార భద్రత కమిటీలు వేయాలి హక్కుల పరిరక్షణకు వినియోగదారులు సంఘటితం కావాలి. బహిరంగ మార్కెట్లో ఉప్పు ప్యాకెట్లు, వంట నూనెల ప్యాకెట్లు నాసిరకం ప్లాస్టిక్తో తయారు చేసినవి ఉంటున్నాయి. ప్రతి వినియోగ వస్తువు 90 శాతం వరకు ప్లాస్టిక్ కవర్లతో ప్యాకింగ్ జరుగుతోంది. దీంతో ఆరోగ్యరీత్యా, పర్యావరణ పరంగా తీవ్ర నష్టాలకు కారణమవుతోంది. వస్తు వినియోగం నాణ్యతను ఽధ్రువీకరించే ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’, ఆహార పదార్థాల్లో ప్లాస్టిక్ను నియంత్రించే ఆహార కల్తీ నిరోధక శాఖ, స్థానిక స్వపరిపాలన సంస్థలు క్రియాశీలకంగా వ్యవహరించాలి. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆహార సలహా సంఘాలు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిటీలు, ఆహార భద్రత కమిటీల ఏర్పాటు జరగాలి. హక్కుల అమలుకు ప్రభుత్వ యంత్రాంగాలు చిత్తశుద్ధితో వ్యవహరించినపుడే సుస్థిరమైన జీవనశైలికి మార్గం వేసినట్లు. – సాంబరాజు చక్రపాణి, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి బిల్లులు ఇవ్వరు.. ఎలక్ట్రికల్ షాపులో ఏ వస్తు వు కొనుగోలు చేసినా బిల్లు లు ఇవ్వడం లేదు. ఎంఆర్ పీ రేట్లను బట్టి అమ్మకాలు చేస్తున్నారు. దీంతో గ్యారంటీ వస్తువులు చెడిపోయినప్పుడు ఇబ్బందులు పడ్డాల్సి వస్తుంది. అధికారులు దృష్టి సారించి వినియోగదారులకు న్యాయం చేయాలి. – బలేరావు వేణుగోపాల్, ముబారక్ నగర్ -
కుటుంబ విషయాల్లో అడ్డొస్తుందని తల్లి హత్య
నిజామాబాద్: కన్న తల్లిని కట్టుకున్న భర్తతో కడతేర్చింది ఓ కూతురు. ఈ ఘటనలో దంపతులిద్దరిని పోలీ సులు అరెస్టు చేశారు. నగరంలోని నార్త్ సీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. నాగారం 300క్వార్టర్స్లో రమేష్, సౌందర్య అనే దంపతులు నివసిస్తున్నారు. సౌందర్య తల్లి విజయలక్ష్మి నాలుగు సంవత్సరాలుగా వీరివద్దనే ఉంటోంది. ఈక్రమంలో విజయలక్ష్మీ తరుచూ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడంతో కూతురు, అల్లుడికి ఇబ్బందిగా మారింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించి బుధవారం రాత్రి విజయల క్ష్మి పడుకోగానే దంపతులు ఇద్దరు కలిసి ఆమె ము ఖంపై దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చేసి, చేతితో గొంతు పిసికి చంపారు. సహజ మరణంగా నమ్మించడానికి యత్నించగా, అనుమానం వచ్చి స్థానికు లు పోలీసులకు సమాచారం అందించారు. విచార ణలో వారు నేరం అంగీకరించడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు పోలీసు లు తెలిపారు. ఎస్సై గంగాధర్, సిబ్బంది ఉన్నారు. -
సిండికేట్ దందా..
నగరంలో పూల వ్యాపారులు సిండికేట్గా వ్యవహరిస్తున్నారు. పండుగలు, పూజల సమయంలో మహారాష్ట్ర నుంచి పూలు తెస్తారు. హోల్సేల్గా విక్రయించే వర్తకులు కిలోకు 100 గ్రాములు గండికొడుతున్నారు. 50 కిలోలకు 2 కిలోలు తక్కువగా తూకం వేస్తున్నారు. కూరగాయల వ్యాపారులు సైతం ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారు. కొందరు తక్కువ బరువు తూచే సాధారణరాళ్లను ఉపయోగిస్తున్నారు. డిజిటల్ తూకం యంత్రాల్లోనూ కిలోకు 100 గ్రాముల మేర తక్కువ వచ్చేలా సెట్ చేసుకుంటున్నారు. మాంసం వి క్రయాల్లో మాయ చేస్తున్నారు. మాంసం కోసిన తర్వాత నీళ్లలో నానబెడుతున్నారు. -
హున్సాలో పిడిగుద్దులాట
బోధన్: వందేళ్ల క్రితం నాటి నుంచి హోలీ సందర్భంగా హున్సా గ్రామంలో నిర్వహిస్తున్న పిడిగుద్దులాట ఆఖరికి ఆనవాయితీ ప్రకారం కొనసాగింది. పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆట కొనసాగింపుపై సందిగ్ధత నెలకొనగా, ఆఖరుకు ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు పోలీసులను ఒప్పించారు. దీంతో సాలూర మండలంలోని హున్సా గ్రామంలో శుక్రవారం ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు ప్రజలు రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకున్నారు. సాయత్రం గ్రామ శివారు లో కుస్తీ పోటీలు నిర్వహించారు. అనంతరం గ్రా మంలోని హనుమాన్ ఆలయం వద్ద గ్రామస్తులు పి డిగుద్దులాటకు సిద్ధమయ్యారు. గ్రామ పెద్దలు కర్ర స్తంభాలు పాతి, బలమైన తాడును బిగించారు. తాడుకు ఇరువైపులా గ్రామస్తులు ఉండగా గ్రామ పెద్దల సూచన మేరకు ఆట మొదలు పెట్టారు. కుడిచేతితో తాడును పట్టుకుని ఎడమ చేతి పిడికిలితో ఒకొరినొకరు కొట్టుకున్నారు. పదినిమిషాల అనంతరం గ్రామపెద్దలు తాడును వదిలివేయడం ఆట ముగిసింది. అనంతరం ఇరువైపుల వారు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రూరల్ సీఐ విజయబాబు, ఎస్సై మచ్చేందర్ రెడ్డి పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. -
ఇసుక డంపులు సీజ్
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని తల్వేద గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పలను స్థానిక పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. అంతకుముందు తల్వేద గ్రామ శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్నారు. అనంతరం గ్రామంలో నిల్వ ఉంచిన సుమారు 20 ట్రిప్పుల ఇసుక డంపులను రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ సురేష్తోపాటు ట్రాక్టర్ యజమాని సంటోళ్ల సాయరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. అదుపుతప్పి బ్రిడ్జి కిందకు దూసుకెళ్లిన కారు భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలో జాతీయ రహదారి వద్ద ఉన్న టోల్గేట్ను తప్పించుకునేందుకు దారిని మార్చుకుని వెళ్తున్న కారు అదుపుతప్పి బ్రిడ్జి కిందికి దూసుకెళ్లింది. వివరాలు ఇలా.. హైదరాబాద్కు చెందిన ఒక కుటుంబం కారులో బాసరకు బయలుదేరారు. భిక్కనూరు వద్ద టోల్ తప్పించుకునేందుకు జాతీయ రహదారిని వదిలి భిక్కనూరు వచ్చి అంతంపల్లి మీదుగా వెళ్లారు. ఈక్రమంలో కారు అదుపుతప్పి బ్రిడ్జి కిందికి వెళ్లింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో వారు డయల్ 100కు సమాచారం అందించారు. వెంటనే భిక్కనూరు పోలీసులు, ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడికి చేరుకుని కారును పైకి తీసుకవచ్చారు. టోల్ తప్పించుకునేందుకు ఇలా అడ్డదారిలో వెళ్లడంపై అధికారులు వారిని మందలించారు. అనంతరం సదరు కుటుంబం అదే కారులో బాసరకు వెళ్లారు. -
ఇందూరు తిరుమలలో వైభవంగా వసంతోత్సవం
మోపాల్: హోలీ పౌర్ణమి సందర్భంగా ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నర్సింగపల్లిలో శుక్రవారం వసంతోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గోశాలలో జన్మించిన దూడకు రంగులు పూసి వసంతోత్సవాన్ని మొదలుపెట్టారు. అలాగే అర్చకులు ఒకరినొకరు రంగులు చల్లుకున్నారు. ఉత్తర తిరుపతిలో.. నిజామాబాద్ రూరల్: నగరంలోని గంగాస్థాన్ ఫేజ్–2లోగల ఉత్తర తిరుపతిలో శుక్రవారం హోలీ పౌర్ణమి సందర్భంగా వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు రంగులు చల్లుకుంటూ హోలీ ఆడారు. -
నిజామాబాద్ పోలీస్ కస్టడీలో యువకుడు అనుమానాస్పద మృతి
సాక్షి, నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ పోలీస్ కస్టడీలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఒకటవ టౌన్లో సైబర్ క్రైమ్ కేసులో విచారణ జరుపుతున్న ఆలకుంట సంపత్(31) గురువారం రాత్రి పోలీస్ కస్టడీలో విచారణ చేస్తున్న సమయంలో ఎడమ చేతి నొప్పి రావడంతో జీజీహెచ్కు తరలించారు. జీజీహెచ్కు వెళ్లిన తర్వాత చికిత్స పొందుతూ సంపత్ మృతి చెందాడు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.పెద్దపల్లి జిల్లాలోని అంతర్గామ్లోని ఒడ్డెర కాలనీకి చెందిన సంపత్ శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్పవర్ కన్సల్టెన్సీ మేనేజర్గా పని చేస్తున్నారు. డేటా ఏంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష వసూళ్లు చేశారు. లావోస్ దేశం పంపించి అక్కడ సైబర్ నేరాలు చేయించడంతో బాధితులు అక్కడి భారత రాయబార కార్యాలయంకు వెళ్లి వారి సహాకారంతో భారతదేశంకు తిరిగివచ్చారు. భారతదేశంలోని రాయబార కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆలకుంట సంపత్, దండగుల చిరంజీవి, రాజారెడ్డిని నిజామాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 4న రిమాండ్కు తరలించారు. సంపత్తో పాటు చిరంజీవిని ఈనెల 12న కోర్టు అనుమతితో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు జగిత్యాల జిల్లాకు తీసుకెళ్లి విచారించినట్లు తెలుస్తోంది. అనంతరం నగరంలోని ఒకటవ టౌన్ పోలీస్స్టేషన్లో విచారణ జరుపుతున్న సమయంలో సంపత్కు ఎడమ చేతి నొప్పి రావడంతో సైబర్ క్రైమ్ సీఐ ఆధ్వర్యంలో సిబ్బంది జీజీహెచ్కు తరలించారు.చికిత్స పొందుతున్న సమయంలో ఫిట్స్ రావడంతో సంపత్ చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. గురువారం రాత్రి 12:30 గంటల ప్రాంతంలో సైబర్ క్రైమ్ పోలీస్ నెంబర్ నుంచి కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సంపత్ గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పడంతో ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు సంపత్ తీవ్రంగా గాయపడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబంసభ్యుల న్యాయం చేయాలని రోడ్డుపై ధర్నా చేశారు. వీడియో ద్వారా పోస్టుమార్టరం నిర్వహిస్తామని డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజావెంకట్రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. పోలీసుల విచారణలో సంపత్ మృతి చెందాడా లేక ఆసుపత్రిలో మృతి చెందాడా.. అనేది పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు.సంపత్ పోలీసు కస్టడీలో చనిపోలేదు: సీపీఈ ఘటనపై నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఓ ప్రకటన విడుదల చేశారు. సంపత్ పోలీసు కస్టడీలో చనిపోలేదని స్పష్టం చేశారు. అతనికి ఎడమ చేయి నొప్పి వస్తే పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. ‘‘ఆసుపత్రికి సంపత్ నడుచుకుంటూ వెళ్లాడు.. ఆ సీసీ కెమెరా దృశ్యాలు కూడా ఉన్నాయి. ఆసుపత్రి లోపల అతనికి సడన్ హార్ట్ ఎటాక్ వచ్చింది.. వైద్యులు సీపీఆర్ చేశారు.. ఎమర్జెన్సీ చికిత్స అందించారు.. అయినా ఫలితం లేకుండాపోయింది. మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై డీఎస్పీ ర్యాంక్ అధికారితో విచారణ కూడా ప్రారంభించాం’’ అని సీపీ వెల్లడించారు. -
హోలీ వేళ పిడిగుద్దుల ఆటపై పోలీసుల ఆంక్షలు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో 124 ఏళ్ల నుంచి ఆచారంగా వస్తున్న పిడిగుద్దుల(Pidiguddulata) ఆటపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పిడిగుద్దుల ఆటకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయంగా వస్తున్న ఆటను అడ్డుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో, ఈ ఆటపై ఉత్కంఠ నెలకొంది.నిజామాబాద్ జిల్లాలోని సాలూర మండలం హున్సాలో ప్రతీ ఏడాది హోలీ సందర్బంగా పిడిగుద్దుల ఆట నిర్వహిస్తారు. ఈ ఆటలో భాగంగా ముందుగా గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. గ్రామం మధ్యలో ఉన్న చావిడి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో రెండు వైపులా రెండు కర్రలు (గుంజలు) భూమిలో పాతుతారు. ఆ రెండు కర్రలకు మధ్యన ఓ బలమైన తాడును కడుతారు.అంతకుముందు గ్రామదేవతలకు పూజలు చేసి గ్రామ పెద్ద మనుషులు, పటేల్, పట్వారీలను డప్పులు, బాజాలతో పిడిగుద్దుల ఆట నిర్వహించే స్థలం వద్దకు వస్తారు. తర్వాత ఆట మొదలు కాగానే ఒక వర్గంపై మరో వర్గం పిడిగుద్దులతో విరుచుకుపడతారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ ఆట కొనసాగుతుంది. ఈ క్రమంలో దెబ్బలు తాకినా లెక్క చేయకుండా ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆట ముగిసిన ఒకరినొకరు కౌగిలించుకుంటారు.ఈ ఆటలో దెబ్బలు తగిలి రక్తాలు కారినా పట్టించుకోకుండా, కామదహనంలోని బూడిదను చేతులతో తీసుకుని దెబ్బలు, గాయాలపై రాసుకుంటే గాయాలు మానిపోతాయని, నొప్పులు కూడా తెలియవని గ్రామస్థులంటారు. కొత్తగా చూసేవారికి విచిత్రంగా అనిపించే ఈ ఆట హున్సా గ్రామానికే ప్రత్యేకతను సంతరించి పెట్టింది. అనంతరం, ఆట స్థలం నుంచి డప్పులు బాజాలతో కేకలు వేస్తూ గ్రామంలో తిరుగుతారు. ఈ ఆటను తిలకించడానికి తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ప్రజలు వస్తారు. అందుకే ఎన్ని ఆంక్షలు, హెచ్చరికలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా గ్రామస్థులంతా ఏకంగా నిలబడి ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల నుంచి గ్రామస్థులు పిడిగుద్దులాట కోసం రిహార్సల్స్ చేస్తూ ఆటకు సిద్ధమవుతున్నారు. -
ఏటీసీలకు అనువైన స్థలాలు గుర్తించాలి
నిజామాబాద్అర్బన్ : యువతలో వృత్తి నైపు ణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ నియోజకవర్గాల్లో నూతనంగా అడ్వాన్స్డ్ టెక్నా లజీ సెంటర్లను (ఏటీసీ)ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్లతో గురువారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో 70 ఏటీసీల నిర్మాణాలు వివిధ దశ ల్లో కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. ఇదే తర హాలో ఐటీఐ, ఏటీసీలు లేని ప్రతి గ్రామీణ ప్రాంత అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం ఒకటి చొప్పున ఏర్పా టు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏటీసీల నిర్మాణానికి అనువైన ప్రదేశం, స్థలాన్ని గుర్తిస్తూ సమగ్ర వివరాలతో కూడిన నివేదికలను త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. రోడ్డు, రవాణా వసతితోపాటు సమీపంలో పరిశ్రమలు ఉన్న స్థలాలను ఎంపిక చేస్తే ఏటీసీల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి, ఇన్స్ట్రక్టర్లు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని సూచించారు. శిక్షణ పూర్తి చే సుకున్న వెంటనే యువతకు స్థానిక పరిశ్రమల్లో ఉ పాధి అవకాశాలు లభించేందుకు దోహదపడినట్లు అవుతుందన్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లాలోని ఆర్మూర్, నిజామాబా ద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏటీసీల ఏ ర్పాటుకు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి నివేదికను సోమవారంలోపు పంపిస్తామని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ ఆధారిత, విత్తనశుద్ధి పరిశ్రమలకు అనుగుణంగా ఏటీసీల్లో కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జూమ్ మీటింగ్లో సంబంధిత శాఖల అధికారులు, ఐటీఐ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. గ్రామీణ నియోజకవర్గాల్లోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కలెక్టర్లతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష -
ఆత్మవిశ్వాసంతో సాగితే అద్భుతాలు
నిజామాబాద్అర్బన్: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సూచించారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో గురువారం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అద్భుతాలు సాధించగలరని అన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గుర్తుచేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తెచ్చిందని, క్యాంటీన్ల నిర్వహణ, యూనిఫాంలు కుట్టే బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులు ఇంటి పనులు, ఉద్యోగ విధులను సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం మహిళా ఉద్యోగులు, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, జిల్లా పౌర సంబంధాల అధికారిణి నార్ల పద్మశ్రీ , జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుమన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు -
వృథాగా ‘పరిశోధన కేంద్రం’
బాల్కొండ: మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ స్థాయి పశువుల వ్యాధుల నివారణ–పరిశోధన కేంద్రం నిర్మించి పదేళ్లు అవుతోంది. అయినా ఇప్పటివరకు సిబ్బందిని నియమించకపోవడంతో ఇక్కడ ఎలాంటి పరిశోధన చేపట్టలేదు. దీంతో పరిశోధన కేంద్రం నిరుపయోగంగా మారింది. పశువుల మూగ వేదన పాలకులకు, ఉన్నత అధికారులకు అర్థం కావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు స్పందించి పరిశోధన కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని పాడి రైతులు కోరుతున్నారు. అలాగే బాల్కొండ పశు వైద్యశాలలో గత రెండేళ్లుగా ఇన్చార్జి వైద్యుడే సేవలు అందిస్తున్నాడు. కనీసం పూర్తి స్థాయిలో వైద్యుడిని నియమించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. మండల కేంద్రంలోని నియోజకవర్గ స్థాయి పశు వ్యాధుల నివారణ–పరిశోధన కేంద్రం గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ప్రభుత్వం సిబ్బందిని నియమిస్తే కేంద్రంలో పరిశోధనలు చేపట్టవచ్చు. – గౌతంరాజు, ఇన్చార్జి పశు వైద్యుడు, బాల్కొండ -
విద్యార్థులు శుభ్రత పాటించాలి
● డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ ● మైనారిటీ గురుకులం సందర్శన నిజామాబాద్అర్బన్: వసతిగృహాలు, గురుకులాల్లోని విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికా రి డాక్టర్ బీ రాజశ్రీ సూచించారు. నాగారంలోని మైనారిటీ గురుకులాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గది, టాయిలెట్స్, హాస్టల్ పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రతతో విద్యార్థులకు అంటువ్యాధులైన గజ్జి, తామర వంటివి సోకి అస్వస్థతకు గురవుతారని పేర్కొన్నారు. వా ర్డెన్ అందుబాటులో ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వంట చేసేముందు కూరగాయలను శుభ్రంగా కడగాలన్నారు. అనంతరం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పీవోఎన్సీడీ డాక్టర్ సామ్రాట్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సబీయుద్దీన్, హెచ్ఈవో గిరిబాబు, నాగరాజు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. డిగ్రీ రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలి తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (సీబీసీఎస్) పరీక్షలకు సంబంధించి 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, 2, 4, 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ థియరీ (నవంబ ర్, డిసెంబర్– 2024, పరీక్షలకు హాజరైన వి ద్యార్థులు మాత్రమే) పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవా లని కంట్రోలర్ సంపత్కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. ఒక్కో పేపర్కు రూ.500లు, రీవాల్యుయేషన్ ఫామ్కు రూ.25లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 20లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు. డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించండి తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2,4,6వ సెమిస్టర్ రెగ్యులర్, 1,3,5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ 2020–24 బ్యా చ్ విద్యార్థులు ఈ నెల 26లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని కంట్రోలర్ సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ షెడ్యూల్కు సంబంధించిన పరీక్షలు ఏప్రిల్, మేలో జరుగుతాయన్నారు. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 27వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. జిల్లా హాకీ జట్టు ఎంపిక ఆర్మూర్టౌన్: పట్టణంలోని మినీ స్టేడియంలో గురువారం రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల పురుషుల హాకీ టోర్నమెంట్కు జిల్లా జట్టు ను ఎంపిక చేసినట్లు జిల్లా హాకీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గంగారెడ్డి, రమణ తె లిపారు. ఈనెల 16,17,18 తేదీల్లో కరీంన గర్ జిల్లా హుజూరాబాద్లో జరగబోయే రా ష్ట్రస్థాయి టోర్నమెంట్లో జిల్లా జట్టు పాల్గొననున్నట్లు తెలిపారు. జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొండ్రా అంజు, ఈసీ సభ్యులు సడక్ నాగేష్, సీనియర్ క్రీడాకారులు జిన్నా గంగాధర్, నర్సింగ్ పాల్గొన్నారు. విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి నిజామాబాద్ సిటీ: పదో తరగతి విద్యార్థులు ఫైనల్ పరీక్షలకు సిద్ధం కావాలని, భయపడకుండా పరీక్షలు రాయాలని డీఈవో అశోక్ సూచించారు. జిల్లాకేంద్రంలోని బోర్గాం(పి) ఉన్నత పాఠశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. అసెంబ్లీ నిర్వహణ, విద్యార్థుల హాజరు, క్రమశిక్షణ చూసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులకు గణితం పాఠాలు బోధించారు. సుమీష అనే 9వ తరగతి విద్యార్థిని గణితంలో ప్రతిభ చూపడంతో వెంటనే తన జేబులోంచి రూ.500 బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు. -
హోలీ వేళ అల్లర్లను ఊపేక్షించం
ఖలీల్వాడి : ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవాలని నిజామాబాద్ సీపీ పీ సాయి చైతన్య ప్రజలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ హోలీకి ఆరోగ్యకరమైన సంప్రదాయ రంగులను వాడాలన్నారు. శుక్రవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేడుక జరుపుకోవాలని సూచించారు. పండుగను ఇష్టపడని వ్యక్తులపై, వాహనాలపై రంగులు చల్లటం సరికాదన్నారు. బహిరంగ ప్రాంతాల్లో ఇతరులను ఇబ్బందులకు గురిచేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, అల్లర్లకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైక్ ర్యాలీలు, రహదారులపై ఇష్టం వచ్చినట్లు తిరుగొద్దన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. హున్సా ‘పిడిగుద్దుల’పై సమీక్షిస్తాం.. బోధన్ మండలం హన్సాలో హోలీ రోజు నిర్వహించే పిడిగుద్దుల ఆటను నిషేధించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో మీడియా ప్రతినిధులు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీపీ స్పందిస్తూ పిడిగుద్దులపై ఎలాంటి నిషేధం విధించలేదన్నారు. ఈ ఆటకు ఎంతమంది హాజరవుతారనేదానిపై సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. హిజ్రాలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.బార్లు, వైన్స్ షాపులు బంద్ జిల్లాలోని లిక్కర్, బార్ షాపులను గురువారం సాయంత్రం 6 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు సీపీ సాయి చై తన్య వెల్లడించారు. హోలీ సందర్భంగా మ ద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు, గొడవలు జరిగే ఆస్కారం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బంగులో గంజాయి వంటి మత్తు పదార్థాలు కలుపుకొని తాగితే చర్యలు తీసుకుంటామన్నారు.బెట్టింగ్ నిర్వాహకులపై చర్యలుజిల్లాలో యువకులు, విద్యార్థులు బెట్టింగ్ బారినపడి అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని సీపీ సాయి చైతన్య తెలిపారు. ఎక్కడైనా బెట్టింగ్ ఆడినా, బెట్టింగ్ యాప్లు నిర్వహించినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. బెట్టింగ్ ఆడేవారికి కౌన్సెలింగ్ ఇచ్చి యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులే బెట్టింగ్ యాప్లపై సమాచారం ఇవ్వండి రేపటి వరకు లిక్కర్ షాపుల మూసివేత సీపీ సాయి చైతన్య వెల్లడి -
రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి
నిజామాబాద్అర్బన్ : ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర వాటితో ముడిపడిన అంశాలపై చర్చించేందుకు వీలుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్ సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఈఆర్వోలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అధికారులు తమతమ స్థాయిలో రాజకీయ పార్టీలతో మీటింగ్లు ఏర్పాటు చేసి అప్డేట్స్ అందించాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను రిజిస్టర్లలో నమోదు చేసి వివరాలను సీఈవో కార్యాలయానికి, గుర్తింపు పొందిన పార్టీల ప్రధాన కార్యాలయాలకు పంపించాలన్నారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని సూచించారు. వీసీలో కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్ -
సీఎంపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికావు
నిజామాబాద్ సిటీ: బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, కవితలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మానాల మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్నుద్దేశించి మాట్లాడిన మాటలను వారు విమర్శిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 14నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. హరీశ్రావు వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ఆధిపత్య పోరుకోసం చేసినవిధంగా ఉన్నాయన్నారు. హరీశ్రావు బీజేపీ కోవర్టులాగా మాట్లాడుతున్నారన్నారు. మార్కెట్కమిటీ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు భోజన్న, భాగారెడ్డి, లింగం, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
హౌసింగ్లో ఆ నలుగురే!
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఉద్యోగుల కొరత ప్రభావం చూపనుంది. ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని భారీగా నిర్దేశించిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల సంఖ్య పెంపుపై దృష్టి సారించడం లేదు. సొంత స్థలం, అర్హత ఉన్నవారు ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున సాయం అందించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఒక్కో ని యోజకవర్గంలో తొలి విడతలో 3,500 ఇళ్లకు సా యం అందించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశా రు. అందులో భాగంగానే గృహ నిర్మాణ సంస్థకు మరోసారి జీవం పోశారు. లక్ష్యానికి అనుగుణంగా ఇళ్లను నిర్మించడంతోపాటు ప్రభుత్వం అందించే సాయం పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో పక్కా పర్యవేక్షణకు గృహ నిర్మాణ సంస్థలో ఇంజినీర్లను నియమించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇద్దరు డిప్యూటీ ఇంజినీర్లు, మరో ఇద్దరు ఏఈఈలను మాత్రమే విధుల్లోకి తీసుకున్నారు. గతంలో హౌసింగ్ సంస్థలో విధులు నిర్వహించి మరో ఇంజినీరింగ్ శాఖకు బదిలీ అయిన అధికారులను వారి మాతృశాఖలోకి ఆహ్వానించారు. జిల్లా అంతటా తొలి విడతలో 18,500 ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించే అవకాశం ఉంది. కానీ, ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు నలుగురు ఇంజినీర్లు మాత్రమే ఉండడంతో వారిపై పనిభారం పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురు ఏఈఈలు, మండలానికి నలుగురు వర్క్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించేవారు. డివిజన్కు ఒక డిప్యూటీ ఇంజినీర్ పర్యవేక్షించేవారు. ఎంపీడీవోలే బిల్లులు చెల్లించేలా..ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునేవారికి నాలుగు విడతల్లో రూ.5 లక్షల సాయం అందించనున్నారు. అందుకోసం ఎంపీడీవోల ఫోన్లలో ప్రత్యేక యాప్ను ఇన్స్టాల్ చేశారు. బిల్లుల తయారీ, చెల్లింపుల బాధ్యత గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లపై లేకున్నా పర్యవేక్షణ అంశం వారిదే కావడం గమనార్హం. హౌసింగ్ ఉద్యోగులే మార్కింగ్ ఇచ్చి ఇంటి నిర్మాణం పూర్త య్యే వరకూ అన్ని దశలను పర్యవేక్షించి నివేదికను సమర్పించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా నలుగురే అధికారులు ఉండడంతో నిర్దేశిత సమయంలో పరిశీలన పూర్తవుతుందా అనే సంశయం నెలకొంది. లక్ష్యం మాత్రం కొండంత జిల్లాలో ఇద్దరు డిప్యూటీ ఇంజినీర్లు, ఇద్దరు ఏఈఈలు ‘ఇందిరమ్మ ఇళ్ల’పై ప్రభావం చూపే అవకాశం తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణ లక్ష్యం పెరగనున్న పనిభారం -
ఆనందాల రంగుల కేళీ.. హోలీ
నిజామాబాద్ రూరల్/ఆర్మూర్: రంగుల కేళీ హోలీ పండుగకు రంగం సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా నేడు పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నిన్నటి రోజున కాముని దహనం భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, శుక్రవారం హోలీ పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకొనున్నారు. వసంత రుతువులో వచ్చే తొలి వేడుక ఇది. వసంతగమనాన్ని, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పౌర్ణమి రోజు వచ్చే ఈ పర్వదినాన్ని వసంతోత్సవం అని అంటారు. ఈ పండుగ రోజు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకొంటారు. హోలీ సందర్భంగా జిల్లాకేంద్రంతోపాటు అన్ని మండలాలు, పట్టణాల్లో రంగుల దుకాణాలు వెలిశాయి. చిన్నారుల కోసం హోలీ గన్స్, గులాలు, పంపులు వంటి వాటిని విక్రయిస్తున్నారు. అలాగే కుడుకల పేర్లు.. చక్కరబెండ్లు విక్రయాలు సైతం జోరుగా కొనసాగుతున్నాయి. హోలీ పండుగను సంప్రదాయం ప్రకారం జరుపుకోవాలని, రసాయన రంగులతో కాకుండా సహజ రంగులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. రసాయన రంగులు వాడేసమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. పండుగను ప్రజలు శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని పోలీసులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నేడు వేడుకలకు సిద్ధమైన ప్రజలు మార్కెట్లలో జోరుగా రంగులు, రంగుల పరికరాల విక్రయాలు -
పసుపు బోర్డును తెచ్చిన ఘనత ఎంపీ అర్వింద్దే
నిజామాబాద్ సిటీ: ఎన్నికల సమయంలో పసుపు రైతుల సమస్యలు స్వయంగా చూసి చలించిన ఎంపీ ధర్మపురి అర్వింద్, పసుపు బోర్డు కోసం ఎంతో శ్రమించి జాతీయ పసుపు బోర్డును జిల్లాలో ఏర్పాటు చేయించారని బీజేపీ మాజీ కార్పొరేటర్లు అన్నారు. జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ కార్పొరేటర్లు పంచరెడ్డి ప్రవళిక, ఇప్పకాయల సుమిత్ర మాట్లాడుతూ.. పసుపు ధర తగ్గడంతో దానికి బాధ్యుడు ఎంపీ అర్వింద్ అన్నట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. ఎంపీ త్వరలో జాతీయ పసుపు బోర్డుకు కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారన్నారు. -
ప్రజలకు హోలీ శుభాకాంక్షలు
నిజామాబాద్అర్బన్: హోలీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రాగ ద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోలీ నిర్వహించుకోవాలని కోరారు. పోచారం రైల్వేగేటు మూసివేత ఎడపల్లి(బోధన్): మండలంలోని పోచారం వద్దగల రైల్వేగేటును గురువారం రైల్వే సిబ్బంది మూసివేశారు. రైల్వేగేట్ వద్ద అండర్ పాస్ రహదారి పనులు ప్రారంభమైన సందర్భంగా గేట్ను మూసేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. 12నెలలపాటు ఈ పనులు కొనసాగుతాయని అటువైపు వెళ్లే వాహనదారులు దూపల్లి గేటు నుంచి ప్రయాణాలు కొనసాగించాలని వారు సూచించారు పసుపు బోర్డు ఎక్కడుందో ఎంపీ అర్వింద్ చెప్పాలి నిజామాబాద్ సిటీ: జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుచేశామని గొప్పలు చెప్పుకుంటున్న ఎంపీ అర్వింద్ అసలు పసుపు బోర్డు ఎక్కడుంది? దాని విధివిధానాలు ఏమిటో చెప్పాలని నిజామాబాద్ మార్కెట్కమిటీ చైర్మ న్ ముప్ప గంగారెడ్డి ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో పసుపు రైతులు రోడ్డెక్కుతున్నారని అన్నారు. పసుపు రైతుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. నవోదయ విద్యాలయం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కృషితోనే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎంపీ అర్వింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులపై మాట్లాడేముందు బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. డీఎస్పీ కార్యాలయం తనిఖీ కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం ఎస్పీ రాజేశ్ చంద్ర సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. సబ్ డివిజన్లోని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన అధికారులు, సి బ్బంది వివరాలను ఏఎస్పీ చైతన్యారెడ్డిని అడి గి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య ఉన్నారు. -
సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం
నిజామాబాద్ సిటీ: విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ నారాయణ అన్నారు. జిల్లాకేంద్రంలోని పవర్హౌస్లో గురువారం విద్యు త్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. డివిజన్ పరిధిలోని వినియోగదారు ల నుంచి చైర్మన్ నారాయణ సమస్యలపై దరఖాస్తు లు స్వీకరించారు. విద్యుత్శాఖ సిబ్బంది రామకృష్ణ, కిషన్, రాజారెడ్డి, శ్రీనివాస్, చంద్రశేఖర్, మంగ్త్య నాయక్, నగేష్, రావూఫ్ తదితరులు పాల్గొన్నారు. ఆలయాల్లో హుండీ లెక్కింపు నిజామాబాద్ రూరల్: శ్రీ బడా రాంమఠ్ ఆలయంలో గురువారం దేవాదాయ ధర్మాదా య శాఖ ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు. మొత్తం రూ.89,320 ఆదా యం వచ్చింది. నగరంలోని శంభులింగేశ్వరస్వామి దేవస్థా నంలో హుండీ లెక్కించగా రూ.1,09,815 ఆదా యం వచ్చింది. శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి రా ములు, శాఖ పరిశీలకులు కమల, శ్రీ బడారాంమఠ్ ఫిట్మాన్ వేణు, జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ కుమార్ ఉన్నారు. -
మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్
మాచారెడ్డి: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ గురువారం తెలిపారు. పాల్వంచ మండలం బండ రామేశ్వర్పల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తాము పెట్రోలింగ్ నిర్వహించామన్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసి కేసు నమోదు చేశామని, వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్సై వివరించారు. బిచ్కుందలో రేషన్ షాపు.. బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని రేషన్ షాపు డీలర్ అక్రమాలకు పాల్పడటంతో దుకాణాన్ని సీజ్ చేసినట్లు ఆర్ఐ రవింధర్ గురువారం తెలిపారు. రేషన్ బియ్యంను ప్రజలకు పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడ్డాడని ఫిర్యాదు రావడంతో తహసీల్దార్ ఆదేశాల మేరకు షాపులో తనిఖీ చేశామన్నారు. విచారణ చేపట్టడంతో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో షాపును సీజ్ చేసినట్లు తెలిపారు. -
రోడ్డు నిర్మాణంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ
పెద్దకొడప్గల్(జుక్కల్): నూతన సీసీ రోడ్డు నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని జగన్నాథ్పల్లి తండాలో గురువారం చోటుచేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని జగన్నాథ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో రోడ్డు నిర్మాణ ప్రాంతంలో ఈ స్థలం తమది అంటే తమదని ఇరువర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. రెండు వర్గాలవారు రెచ్చిపోయి ఇటుకలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళతోపాటు ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై మహేందర్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేట్టారు. గాయపడ్డ హుషార్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆటో ఢీకొని వృద్ధుడి మృతి
ఎల్లారెడ్డి: హోలీ పండుగ సందర్భంగా గురువారం ఎల్లారెడ్డి మటన్ మార్కెట్కు వచ్చిన ఓ వృద్ధుడిని ఆటో ఢీకొనడంతో మృతిచెందాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని సబ్దల్పూ ర్ గ్రామానికి చెందిన గడ్డం పోచయ్య (64) మటన్ కోసం ఎల్లారెడ్డికి వచ్చాడు. పట్టణంలోని గాంధీచౌ క్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుండగా అతడిని వెనక నుంచి ఆటో వచ్చి ఢీకొట్టింది. ఈఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చెరువులో పడి వృద్ధురాలు.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ముంబోజి పేట గ్రామ శివారులోగల సింగయ్య చెరువులో ఓ వృద్ధురాలు పడి మృతిచెందినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మా దిగ కాశవ్వ(60) అనే వృద్ధురాలు నాలుగు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఎంత వెతికి నా ఆమె ఆచూకీ లభించలేదు. గురువారం భవానిపేట, ముంబోజిపేట శివారులోని సింగయ్య చెరువులో ఆమె మృతదేహం తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు న మోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యారంగానికి నిధులను కేటాయించాలి
నిజామాబాద్అర్బన్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులను కేటాయించాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు గురువారం కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రశాంత్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శశిధర్, బాలకృష్ణ, దుర్గాదాస్ ఇంద్రసేన, యోగేశ్ రంజిత్, మణికంఠ, రఘు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ నాయకులు జెడ్పీ కార్యాలయ సమీపంలో ఉన్న మదర్ థెరిస్సా విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. నా యకులు విఘ్నేశ్, దీపిక, దినేశ్, రాజు, ఆజాద్, పృథ్వి, పరమేశ్, శ్రీ చరణ్, రమేశ్, అజయ్ ఉన్నారు. -
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పిడిగుద్దులాటకు బ్రేక్
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పిడిగుద్దులాటకు బ్రేక్ పడింది. హోళీ పండుగ రోజు ఆనవాయితీగా మధ్యలో తాడు కట్టి ఇరువైపులా నిలబడి కొట్టుకునే సంప్రదాయంతో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అయితే, శాంతి భద్రతల ఇబ్బందుల దృష్ట్యా ఈసారి అనుమతి నిరాకరించారు. గ్రామస్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఐదుగురు కంటే ఎక్కువగా గుమిగూడవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోళీ రోజూ కొట్టుకుంటే గ్రామానికి కీడు జరగదని ఐదు నిమిషాలు అయినా అవకాశం ఇవ్వాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. కొట్టుకుంటే కక్షలు పెరిగి.. గొడవలు జరుగుతాయంటున్న పోలీసులు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని మంజీర తీరంలో ఉన్న హున్సా గ్రామం పిడిగుద్దులాటతో ప్రత్యేక గుర్తింపు పొందింది.దేశంలో ఎక్కడాలేని విధంగా హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ కులమత, వయోబేధం లేకుండా దశాబ్దాలుగా ఐక్యతతో పిడిగుద్దులాటను నిర్వహిస్తుంటారు. వసంత రుతువు రాకకు గుర్తుగా సంబురంగా నిర్వహించే హోలీ.. ఆ గ్రామంలో పిడిగుద్దులకు వేదిక అవుతుంది. గ్రామ శ్రేయస్సు కోసం యువత, పెద్దలు రెండుగా విడిపోయి ఒకరిపైఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. -
ఎమ్మెల్యే సవాల్కు సిద్ధం
సుభాష్నగర్: నవోదయ విద్యాలయం ఏర్పాటు విషయంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. బుధవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వచ్చే ఆదివారం ఏ అంశంపైన అయినా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సవాల్పై చర్చకు ఏ ఇటుకబట్టీకి రావాలో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ అర్వింద్ రెండు నవోదయలను మంజూరు చేయించారని తెలిపారు. జిల్లా అభివృద్ధికి అర్వింద్ కృషి చేస్తున్నారని, ఆయన ఆదరణను ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పసుపు రైతులు, బోర్డు గురించి మాట్లాడే అర్హత భూపతిరెడ్డికి లేదని, ధర తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతుంటే.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ పేరును ప్రభుత్వం మారిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు, మాజీ కార్పొరేటర్లు న్యాలం రాజు, స్రవంతిరెడ్డి, నాగోళ్ల లక్ష్మీనారాయణ, పద్మారెడ్డి, అంబదాస్రావు, ప్రమోద్కుమార్, బద్దం కిషన్, గంగాధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చర్చకు ఏ ఇటుకబట్టీకి రావాలో చెప్పాలి ఎంపీ అర్వింద్ ఆదరణను ఓర్వలేక విమర్శలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి -
వర్సిటీ పేరు మారిస్తే ఊరుకోం
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నుంచి వ చ్చిన ప్రతిపాదనలపై వర్సిటీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్టు అ ధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, పూర్వ విద్యార్థుల సంఘం, ఔట్సోర్సింగ్ అసోసియేషన్, కాంట్రాక్టు అ ధ్యాపకులతో పాటు రెగ్యులర్ అధ్యాపకులు సైతం వర్సిటీ పేరు మార్పు సరైన నిర్ణయం కాదని విమ ర్శిస్తున్నారు. బుధవారం ఉదయం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వచ్చి పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. యూనివర్సిటీ పేరును మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృతచారి మాట్లాడుతూ.. ఎందరో విద్యార్థుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. యూనివర్సిటీ పేరు మారిస్తే సీఎం రేవంత్రెడ్డి చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్ పేర్కొన్నారు. తెయూ పేరు మార్చడమంటే తెలంగాణ ప్రజ ల అస్తిత్వాన్ని దెబ్బతీయటమేనని పీడీఎస్యూ జి ల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నా రు. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చే బదులు క్యాంపస్లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్ను ఏర్పాటు చేసి ఈశ్వరీబాయి పేరు పెట్టుకోవాలని వర్సిటీ పూర్వ విద్యార్థులు యెండల ప్రదీప్, శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు వీసీకి, రిజిస్ట్రార్కు వినతిపత్రా లు అందజేశారు. తెలంగాణ పేరు సున్నితమైన, భావోద్వేగాలతో కూడుకున్నదని ఈ పేరు మారిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశాలున్నాయని వీసీ టి యాదగిరి రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్సిటీ పేరు మార్పు ప్రతిపాదనను వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలికి లేఖ ద్వారా తెలియజేస్తామని వీసీ పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతిపాదనపై విద్యార్థుల ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం వీసీకి వినతిపత్రాలు అందజేసిన విద్యార్థి సంఘాలు -
వాహనం ఢీకొని జింక మృతి
బోధన్రూరల్: బోధన్ మండలం రాంపూర్, కల్దుర్కి రాజన్న చౌరస్తా వద్ద బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసు సిబ్బంది జింకకు నీరు తాగించినా కోలుకోలేదని, కొద్ది సేపటికి మృతి చెందిందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పీడీఎస్ బియ్యం పట్టివేత కమ్మర్పల్లి: మండల పరిధిలోని గాంధీనగర్లో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై అనిల్రెడ్డి బుధవారం తెలిపారు. కడమంచి రవి అనే వ్యక్తి ఓ వాహనంలో రేషన్ బియ్యాన్ని నిల్వ చేశాడనే సమా చారం మేరకు స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు దా డి చేసి పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యం మూడు టన్నులు ఉంటుందని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. డ్రంకన్ డ్రైవ్లో నలుగురికి జైలు ఖలీల్వాడి: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ నలుగురికి రెండు రోజుల జైలు శిక్షను సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ బుధవారం తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి నడిపిన 17 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వీరికి నగరంలోని ట్రాఫిక్ పీఎస్లో కౌన్సెలింగ్ ఇచ్చి జడ్జి ఎదుట హాజరుపర్చినట్లు తెలిపారు. జడ్జి నలుగురికి రెండు రోజుల జైలు శిక్షను, 13 మందికి జరిమానా విధించినట్లు వెల్లడించారు.బైక్ దహనం ఎడపల్లి: మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఓ బైక్ను దుండగులు దహనం చేసినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఎడపల్లికి చెందిన చింటు తన బైక్ను తన ఇంటి ఎదుట నిలిపి నిద్రించాడు. ఉదయం 3 గంటల ప్రాంతంలో దుండగులు బైక్కు నిప్పంటించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
చిరుత సంచారం.. ప్రజల్లో కలవరం
నవీపేట: నవీపేట మండలం అల్జాపూర్, అబ్బాపూర్(బి) గ్రామాల్లో చిరుత పులుల సంచారం చుట్టు పక్కల గ్రామాల ప్రజలను కలవరపెడుతోంది. మండలంలోని వివిధ గ్రామాలు గుట్టలకు ఆనుకుని ఉండడంతో అటవీ జంతువులు జనవాసాల మధ్య సంచరిస్తున్నాయి. రెండు రోజుల క్రితం అల్జాపూర్–యంచ గ్రామాల మధ్య చెరువుకు తాగునీటి కోసం రెండు చిరుతలు రాగా శివారులో ఉన్న రైతులు భయాందోళనకు గురయ్యారు. గతంలో ఇదే ప్రాంతంలో చిరుత దాడిలో మేకలు మృత్యువాత పడ్డాయి. మళ్లీ కనిపించడంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. నందిగామ–అల్జాపూర్–యంచ గ్రామాల ను ఆనుకుని ఉన్న గుట్టల్లో రోడ్లు దాటుతూ రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అబ్బాపూర్ గుట్టల్లో నాలుగు చిరుతలు నెల రోజుల క్రితం మండలంలోని అబ్బాపూర్ (ఎం) శివారులోని గుట్ట అంచున ఉన్న పశువుల పాకపై చిరుత దాడి చేసి రెండు ఆవులను చంపేసింది. ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల పరిధిలోని పలు గ్రామాలను ఆనుకుని దట్టంగా ఉన్న అడవిలో చిరుతలు, దుప్పిలు, అడవి పందులు, ఇతర జంతువులు ఉన్నట్లు గతంలో అధికారులు గుర్తించారు. మరో నాలుగు చిరుతలు ఈ దట్టమైన ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు. మోకన్పల్లి శివారులోని చిన్నపాటి గుట్ట సమీపంలోని ఉన్న ఇటుక బట్టీ దగ్గర ఏడాది క్రితం కనిపించిన తల్లీ, పిల్ల చిరుతలను చుట్టు పక్కల గ్రామాల వాసులను భయబ్రాంతులకు గురి చేశాయి. అధికారులు బంధించాలంటున్న అబ్బాపూర్, అల్జాపూర్ గ్రామస్తులు సంచార ప్రదేశాలను పరిశీలించిన అటవీశాఖ అధికారులుదాడి తీవ్రమైతే బంధిస్తాం మండలంలోని అబ్బాపూర్(ఎం), అల్జాపూర్ గ్రామాల అటవీ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయి. దట్టమైన అబ్బాపూర్ అటవీ ప్రాంతంలో నాలుగు చిరుతలు, అల్జాపూర్ శివారులో జంట చిరుతలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని చిరుతలు ఇంత వరకు మనుషులపై దాడి చేయలేదు. చిరుతల దాడి తీవ్రమైతే బంధిస్తాం. – జెహ్రూ, సెక్షన్ ఆఫీసర్ (నిజామాబాద్ రేంజ్) -
రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి
ఖలీల్వాడి: నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయుర్వేద వైద్యుడు హన్మాండ్లు(52) మృతి చెందినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నందిపేట్ మండలం తల్వేదకు చెందిన ఆయుర్వేద వైద్యుడు హన్మాండ్లు నగరంలోని గోల్హనుమాన్వద్ద వాసవి ఆయుర్వేద ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం వినాయక్నగర్కు బైక్పై వెళ్లి తిరిగి వస్తుండగా పులాంగ్ చౌరస్తా వద్ద సిగ్నల్ ప్రాంతంలో టిప్పర్ ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హన్మాండ్లును స్థానికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అదే బైక్పై ఉన్న మరో వ్యక్తి శ్రీహరికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. చికిత్స పొందుతూ మహిళ ..మాక్లూర్: కుటుంబ కలహాలతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మాక్లూర్ మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన దుంపల సాయమ్మ(45) ఈనెల 6న భర్తతో గొడవపడి క్షణికావేశంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు వెంటనే మంటలను ఆర్పివేసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
గ్రూప్–2లో మెరిసిన మగ్గిడి వాసి
పెర్కిట్: ఆర్మూర్ మండ లం మగ్గిడి గ్రామానికి చెందిన దాస గంగాధర్ మంగళవారం విడుదల చేసిన టీజీపీఎస్సీ ఫలితా ల్లో రాష్ట్ర స్థాయిలో 102 ర్యాంకు, బాసర జోన్ పరిధిలో 8వ ర్యాంకు, బాసర ఎస్సీ కమ్యూనిటీలో మొదటి ర్యాంకు సాధించాడు. మగ్గిడి గ్రామానికి చెందిన దాస చిన్న గంగారాం, దాస రాజు దంపతుల కుమారుడు గంగాధర్ పదో తరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివాడు. భిక్కనూరు గురుకుల పాఠశాలలో 2013లో ఇంటర్, ఆర్మూర్ పట్టణంలోని నరేంద్ర డిగ్రీ, పీజీ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీఎస్, ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తి చేశాడు. 2024లో గ్రూప్–4 ద్వారా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ట్రెజరి ఆఫీస్లో జూనియర్ అకౌంటెంట్గా కొలువు సాధించాడు. అలాగే గ్రూప్–2 ఫలితాల్లో సైతం ఉత్తమ ర్యాంకు సాధించాడు. తమ కుమారుడు ఉత్తమ ర్యాంకు సాధించడంపై తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకోవాలి బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా విడుదలవుతున్న ప్రతి నీటి చుక్క నూ ఆయకట్టు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్ట్ ఈఈ చక్రపాణి, ఏఈఈ రవి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రాజెక్ట్లో ప్రస్తుతం నీటినిల్వ బోటాబోటిగా ఉన్న నేపథ్యంలో నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని, ఏప్రిల్ 9వరకు నీటి విడుదల ఉంటుందని అన్నారు. ఆలోగా పంటలు గట్టెక్కేలా రైతులు ప్రణాళిక రూపొందించుకోవాలని, ఆయకట్టు రైతులు ప్రాజెక్ట్ అధికారులకు సహకరించాలని వారు కోరారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు నిజామాబాద్అర్బన్: జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ సెకండియర్ బొటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్–2ఏ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 17,064 మందికి 16,587 మంది పరీక్షలు రాయగా 477 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. బోధన్లోని విజేత జూని యర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు చీటీలు రాస్తుండగా చీఫ్ సూపరింటెండెంట్ పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారన్నారు. జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 51 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్అర్బన్: బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉచిత శిక్షణకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో ఒక నెల నాన్ రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ప్రయివేట్ బ్యాంకుల్లో ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తయి, 26ఏళ్ల లోపు వయసున్నవారు అర్హులన్నారు. ఆసక్తిగల బీసీ అభ్యర్థులు ఈనెల 15నుంచి వచ్చే నెల 8లోపు దరఖాస్తులను ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకో వాలన్నారు. వచ్చే నెల 12న అభ్యర్థులకు ఎంపిక పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కు 08462–241055ను సంప్రదించాలన్నారు. ‘నిజాంసాగర్ కెనాల్ వైపు వెళ్లొద్దు’ నిజాంసాగర్: యాసంగి పంటల అవసరాల నిమిత్తం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నందున ఎవరూ కెనాల్వైపు వెళ్లవద్దని నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ సూచించారు. గురువారం నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్ర ధాన కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండనున్న నేపథ్యంలో కాలువలోకి వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని సూచించారు. -
చోరీ కేసులో నిందితురాలి అరెస్టు
ఎల్లారెడ్డి: వృద్ధురాలి మెడలో నుంచి బంగారం చోరీ చేసిన కేసులో నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రవీందర్నాయక్ తెలిపా రు. స్థానిక పీఎస్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన కాశవ్వ అనే వృద్ధురాలు ఈనెల 9న ఎల్లారెడ్డికి వారాంతపు సంతకు వచ్చింది. స్వగ్రామానికి వెళ్లేందుకు స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఆటో కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎల్లారెడ్డికి చెందిన ఏసవ్వ వృద్ధురాలితో మాటాలు కలిపింది. తాను కూడా అటు వైపే వెళ్తున్నానని అంబేడ్కర్ చౌరస్తా వద్ద తక్కువ రేటుకు ఆటోలు వస్తాయని చెప్పి చర్చి కాంపౌండ్ సమీపంలోని నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ కాశవ్వ కంట్లో కారంపొడి చల్లి ఆమె మెడలో ఉన్న రెండు తులాల గుండ్లు, రెండున్నర తులాల పుస్తెల తాడును ఎత్తుకెళ్లింది. మరుసటి రోజు కాశవ్వ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బుధవారం గాంధీచౌక్ ప్రాంతంలో ఏసవ్వ అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను పట్టుకున్నారు. బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు ఏసవ్వ ఒప్పుకోవడంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై మహేశ్, సిబ్బంది అనిల్గౌడ్, అర్చన తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
ఆర్మూర్టౌన్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్(సీజీఆర్ఎఫ్) ఎరుకల నారాయణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యుత్ ఏఈ కార్యాలయంలో బుధవారం విద్యుత్ వినియోదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది 24గంటల పాటు వినియోగదారులకు అందుబాటులో ఉండాలన్నారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు రామకృష్ణ, లకావత్కిషన్, రాజగౌడ్, రాజేశ్వర్, రాజేశ్వర్రావు, కృష్ణ, లైన్మన్లు పాల్గొన్నారు. -
ముగిసిన అంతర్ జిల్లాల యువ ఎక్స్చేంజ్ కార్యక్రమం
డిచ్పల్లి: కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, మేరా యువ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే అంతర్ జిల్లాల యువ ఎక్స్చేంజ్ కార్యక్రమం జిల్లాలో బుధవారం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్కు చెందిన ఎంపిక చేయబడిన 30 మంది యువతీ యువకుల బృందం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చరిత్రాత్మక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు, కర్మాగారాలను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, ఎస్బీఐ శిక్షణ సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు మహేశ్, ప్రభుత్వ అధికారులు, నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. -
షార్ట్సర్క్యూట్తో మూడు షాపులు దగ్ధం
ఆర్మూర్టౌన్: షార్ట్సర్క్యూట్తో మూడు షాపులు దగ్ధమైన ఘటన పెర్కిట్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పెర్కిట్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న కిరాణషాప్, ఆటోమొబైల్షాప్, హోటల్ దుకాణాల నుంచి ఉదయం పొగలు వస్తున్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. మూడు దుకాణాల్లో ఉన్న సామగ్రి అగ్నికి ఆహుతైంది. జిల్లా అగ్నిమాపక అధికారి పరమేశ్వర్, అగ్నిమాపక అధికారి మధుసూదన్ రెడ్డి, ఆర్మూర్ పోలీసులు, రెవన్యూ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ. 24 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు బాల్రాజ్, గోపాల్, ముగ్ధుమ్ తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. -
నిఖిలేశ్కు భరోసానివ్వండి
వేల్పూర్: వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడలో లుకేమియా అనే క్యాన్సర్ వ్యాధి సోకిన విద్యార్థి నిఖిలేశ్ చికిత్సకు సాయం చేయాలని ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని యాష్ టాగ్ తెలంగాణ సీఎంవో అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి తన వ్యక్తిగత ఎక్స్ లో బుధవారం పోస్ట్ చేశారు. చిరుప్రాయంలోనే ప్రాణాంతక వ్యాధి అనే శీర్షికన నిఖిలేశ్కు సోకిన క్యాన్సర్ వ్యాధిపై ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీనిని చూసిన ఎమ్మెల్యే సీఎం రేవంత్రెడ్డి దయచేసి చికిత్సకు సహాయం చేయాలంటు ఎక్స్లో విన్నవించారు. ● చికిత్సకు సాయం చేయాలని సీఎంకు విన్నవించిన ఆర్మూర్ ఎమ్మెల్యే -
పసుపు రైతులు అల్లాడుతుంటే.. రేవంత్ సర్కార్ ఏం చేస్తోంది?: కవిత
సాక్షి, హైదరాబాద్: పసుపు రైతుల ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ నిలదీశారు. మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. క్వింటాలు పసుపుకు 15 వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పసుపునకు కనీసం 9 వేలు రాని పరిస్థితి ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమని కవిత ధ్వజమెత్తారు.‘‘ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమే. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలి. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ చెప్పారు. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలి’’ అని కవిత డిమాండ చేశారు. -
రోడ్డెక్కిన పసుపు రైతులు
సుభాష్నగర్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కొనడం లేదని రైతులు రోడ్డెక్కారు. ప్రధాన బస్టాండ్ ఎదుట ధర్నాకు దిగారు. సోమవారం శ్రద్ధానంద్ గంజ్కు 39 వేల బస్తాల పసుపు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో పసు పు ధర తగ్గడంతో పంట కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. మధ్యాహ్నం కావస్తున్నా వ్యాపారులు ధర కోడ్ చేయడానికి రాకపోవడంతో రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద కు చేరుకున్నారు. పసుపును ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులు, సిబ్బందిని నిలదీయగా, వారి నుంచి సరైన సమాధానం రాలేదు. కోపోద్రిక్తులైన రైతులు మార్కెట్యార్డు నుంచి ర్యా లీగా నగరంలోని ప్రధాన బస్టాండ్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. సుమారు గంటకుపైగా ధర్నా చేయడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ● అంతర్జాతీయ మార్కెట్లో 45 రోజుల క్రితం పసుపు ధర క్వింటాలుకు రూ.15,200 ఉండగా, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ మార్కెట్ కమిటీ క్వింటాలుకు కటాఫ్ ధర రూ.10 వేలుగా నిర్ణయించింది. ఈ మేరకు కొనుగోళ్లు జరిగేవి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో కొన్నిరోజులుగా పసుపు ధర తగ్గుతూ ప్రస్తుతం క్వింటాలుకు రూ.11,500 పలికింది. మార్కెట్ కమిటీ నిర్ణయించిన కటాఫ్ ధర తగ్గించాలని వ్యాపారులు కోరారు. రైతుల సంక్షేమం దృష్ట్యా కటాఫ్ ధర తగ్గించేందుకు మార్కెట్ కమిటీ అంగీకరించలేదు. దీంతో రైతులు తీసుకొచ్చిన పంటకు వ్యాపారులు ధర కోడ్ చేయడానికి ముందుకు రాలేదు. రైతులు ఆందోళన చెంది ధర్నాకు దిగారు. రైతులతో చర్చలు.. ధర్నా విరమించిన అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ రాజా వెంకట రెడ్డి, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ, డీఎంవో గంగు సమక్షంలో వ్యాపారులు, రైతులతో మార్కెట్ కమిటీ కార్యాలయంలో చర్చ లు జరిపారు. అంతర్జాతీయంగా ధర తగ్గిందని కటాఫ్ ధర తగ్గించాలని వ్యాపారులు అధికారుల తో పేర్కొన్నారు. ధర తగ్గిస్తే ఊరుకోబోమని, మద్ద తు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు జోక్యం చేసుకుని కటాఫ్ ధరను పసుపు కాడికి రూ.9,500, గోలకు రూ.8 వేలుగా వ్యాపారులు, రైతుల సమక్షంలో నిర్ణయించారు. అందరూ సమ్మతం తెలపడంతో చర్చలు సఫలమయ్యాయి. అదనపు కలెక్టర్ హామీతో విరమణ ప్రధాన బస్టాండ్ ఎదుట రైతుల ధర్నా విష యం తెలుసుకున్న ఏసీపీ రాజా వెంకట రెడ్డి అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మార్కెట్యార్డులో వ్యా పారులు సిండికేట్ అయ్యారని, పసుపు ధర తగ్గిస్తున్నారని, పంటను కొనడం లేదని రైతు లు ఆరోపించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ వచ్చి హామీనివ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. ఎండిన పసుపు తేవాలి.. రైతుల సంక్షేమానికి మార్కెటింగ్ శాఖ, ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులు పచ్చి పసుపు తీసుకురావొద్దు. ఎండిన పసుపు తెచ్చి మంచి ధర పొందాలి. కొందరు రైతులు పచ్చి పసుపు తేవడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు, వ్యాపారులు, అధికారుల సమక్షంలో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. మంగళవారం నుంచి యథావిధిగా పసుపు క్రయవిక్రయాలు జరుగుతాయి. – ముప్ప గంగారెడ్డి, చైర్మన్ నిజామాబాద్ మార్కెట్లో పంట కొనుగోలు చేయాలని ధర్నా అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గడంతో కొనడానికి ముందుకు రాని వ్యాపారులు నగరంలోని బస్టాండ్ ఎదుట రైతుల ఆందోళనతో ట్రాఫిక్కు అంతరాయం.. వ్యాపారులు, రైతులతో అధికారులు జరిపిన చర్చలు సఫలం నేటి నుంచి యథావిధిగా మార్కెట్లో పసుపు కొనుగోళ్లు -
డీపీవోగా శ్రీనివాస్రావు బాధ్యతల స్వీకరణ
సుభాష్నగర్: జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా శ్రీనివాస్రావు సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. గతంలోనే శ్రీనివాస్రా వు బదిలీ ఉత్తర్వులు వెలువడినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఇన్చార్జి డీపీవోగా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాస్ నిజామాబాద్ డీఎల్పీవోగా కొనసాగనున్నారు. అలాగే బోధన్ డీఎల్పీవోగా నాగరాజు బాధ్యతలు చేపట్టారు. ఆయన బాన్సువాడ నుంచి బోధన్కు బదిలీపై వచ్చారు. 13 నుంచి రైల్వే గేటు మూసివేత నవీపేట: మండలంలోని ధర్మారం(ఏ) రైల్వే గేటును ఈనెల 13 నుంచి మూసివేయనున్న ట్లు రైల్వే ఇంజినీర్ రవి ప్రకాశ్ సోమవారం తెలిపారు. అండర్ బ్రిడ్జి నిర్మా ణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో గేటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నా రు. ప్రయాణికులు సహకరించాలని కోరారు. అల్జాపూర్ శివారులో చిరుత సంచారం నవీపేట: మండలంలోని అల్జాపూర్–యంచ గ్రామాల మధ్య చెరువు కట్టపై సోమవారం చిరుత కనిపించడంతో రెండు గ్రామాల ప్ర జలు భయాందోళనకు గురవుతున్నారు. రైతులకు చిరుత కనిపించడంతో వెంటనే పారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. నిజామాబాద్ బీట్ ఆఫీసర్ సుధీర్, సెక్షన్ ఆఫీసర్ జెహ్రూ చెరువు ప్రాంతంలో పర్యటించి ఆనవాళ్లను సేకరించారు. పాదముద్రలు చిరుతవేనని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. సీఐల బదిలీలు ఖలీల్వాడి: మల్టీ జోన్–1 పరిధిలో 114 మంది సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీకి అటాచ్గా ఉన్న రవికుమార్ను సీసీఎస్ నిజామాబాద్కు, జి.వెంకటయ్య పీసీఆర్ కామారెడ్డి నుంచి ఎన్ఐపీ నిజామాబాద్కు బదిలీ అయ్యారు. కాగా, రెండు, మూడు రోజుల్లో కొత్త సీఐలు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంటర్ పరీక్షలకు 417 మంది గైర్హాజరునిజామాబాద్అర్బన్: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగినట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. మొత్తం 16,297 మంది విద్యార్థులకు 15,880 మంది హాజరుకాగా, 417 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. ఇంటర్ బోర్డు ప రీక్షల విభాగం నుంచి విశ్వేశ్వర్ బృందం ప లు సెంటర్లను తనిఖీ చేసి సమీక్షించింది. ధర్మపురి జాతరకు ప్రత్యేక బస్సులు ● మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్మూర్టౌన్: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ధర్మపురి జాతరను పురస్కరించుకొని టీజీఎస్ ఆర్టీసీ ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బ స్సులను నడుపుతున్నట్లు మేనేజర్ రవీందర్ తెలిపారు. ఈ నెల 11 నుంచి 15 వరకు ఆ ర్మూర్ నుంచి ధర్మపురికి ప్రత్యేక రవాణా ఏ ర్పాట్లు చేశామన్నారు. మహిళలకు ఉచిత ప్ర యాణమని, పురుషులకు రూ. 220, పిల్లల కు రూ.120 టికెట్ ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
భీమ్గల్లో మితంగానే ఖర్చులు
మోర్తాడ్(బాల్కొండ): భీమ్గల్ మున్సిపాలిటీ లో చెత్త సేకరణకు మూడు ట్రాక్టర్లు, రెండు ట్రా లీ ఆటోలను వినియోగిస్తున్నారు. గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్గల్ పట్టణాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ కాక ముందే చె త్త సేకరణ కోసం రెండు ట్రాక్టర్లను వినియోగించారు. జీపీ నిధులతోనే వీటిని కొనుగోలు చేయ డం గమనార్హం. మున్సిపాలిటీగా మారిన తరువాత మరో ట్రాక్టర్తోపాటు మూడు ట్రాలీ ఆటోలను కొనుగోలు చేశారు. ఒక ఆటో రిపేర్ చే యించాల్సి ఉంది. ప్రస్తుతానికి మూడు ట్రాక్టర్లు, రెండు ట్రాలీ ఆటోలతో చెత్త సేకరిస్తున్నారు. 40 మోటార్లు.. మిషన్ భగీరథ నీరు ఇంటింటికి అందక ముందు 40 మోటార్లతో నీటి సరఫరాను కొనసాగించారు. ఇంటింటికి నీరు సరఫరా అవుతుండటంతో కేవలం ఆరు మోటార్లను అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నారు. మరో ఆరు చేతి పంపులు అక్కడక్కడ ఉన్నాయి. వీటిని మున్సిపాలిటీ నిధులతోనే నిర్వహిస్తున్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని మున్సిపాలిటీ అధికారులు భావిస్తున్నారు. -
నెలకు రూ.20లక్షలకు పైగా..
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణకు ఉపయోగించే వాహనాలు, వాటి నిర్వహణ బల్దియాకు భారంగా మారింది. కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజూ 300 మెట్రిక్ టన్నుల చెత్త జమవుతున్నాయి. చేత సేకరణకు మొత్తం 137 వాహనాలు ఉండగా, వాటిలో 68 టాటా ఏస్లు, 34 ట్రాక్టర్లు, తొమ్మిది ఐచర్లు, మూడు కంప్రెషర్లు, మరో మూడు స్వీపింగ్ మిషన్లు ఉన్నాయి. మిగతా 20 వాహనాలను స్క్రాప్కు పంపించాలని ఆర్టీఏ అధికారులు బల్దియాకు నోటీసులు ఇచ్చారు. పలు కాలనీలకు మున్సిపల్ వాహనాలు వెళ్లకపోవడంతో చెత్త పేరుకుపోతోంది. తలకు మించిన భారం.. పెద్ద వాహనాలు బల్దియాకు 12 పెద్ద వాహనాలు ఉన్నాయి. కోట్లా ది రూపాయలు వెచ్చించి వాటిని కొనుగోలు చేశా రు. వాటి ద్వారా చేసే పనులతో పోలిస్తే డీజిల్ మెయింటెనెన్స్ తడిసిమోపెడవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.లక్షల్లో ఖర్చు గత పాలకవర్గం కమీషన్ల కోసం బల్దియాకు నాసిరకం వాహనాలు కొనుగోలు చేసిందనే చర్చ విస్తృతంగా సాగింది. ఈ అవకాశాన్ని అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వా టి మరమ్మతులు, నిర్వహణ పేరుతో లక్షలాది రూ పాయలు బిల్లులు చేస్తున్నారు. ప్రతినెలా రూ.20లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. వాహనాల కొనుగోలు లేనట్లే.. శానిటేషన్కోసం వినియోగించే వాహనాలు తరచూ రిపేర్కు వస్తున్నాయి. వెంటనే రిపేర్లు చేయించకుండా జాప్యం చేస్తే చెత్త తరలింపు ఆలస్యమవుతుంది. ఇప్పటికే కొన్ని వాహనాలు మూలనపడ్డాయి. ఇప్పట్లో కొత్త వాహనాల కొనుగోలు లేనట్లే. – సాల్మన్ రాజు, మున్సిపల్ వెహికిల్స్ ఇన్చార్జితరచూ మరమ్మతులు అనుభవం ఉన్న డ్రైవర్లు, మంచి రోడ్లున్నప్పటికీ చెత్త సేకరణ వాహనాలు తరచూ రిపేర్లకు వెళ్తున్నాయి. రిపేర్ల పేరుతో ప్రతినెలా భారీగా బిల్లులు పెడుతున్నారు. వాటిని పరిశీలించకుండానే బిల్లులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాహనాల మరమ్మతుల పేరుతో పెద్ద ఎత్తున నిధులు దారి మళ్లుతున్నాయని పలువురు ప్రజాప్రతినిధులు, సిబ్బంది వాపోతున్నారు. గత కొన్నేళ్లుగా తతంగం కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. -
చివరాయకట్టు వరకు నీరందించాలి
నిజామాబాద్ అర్బన్: చేతికొచ్చిన పంటలను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి విషయంలో నీటిపారుదల శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూ చించారు. సోమవారం సాయంత్రం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారితో కలిసి ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మరో 15 రోజుల్లో పంటలు చేతికి రానున్నందున అధికారులు సమన్వయంతో రైతాంగానికి తోడ్పాటునందించాలని సూచించారు. చివ రాయకట్టు వరకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో నిజనిజాలు తెలుసుకోకుండా పంట నష్టంపై జరుగుతున్న ప్రచారం సత్య దూరమన్నారు. వనరులను సద్వినియోగం చేసుకుంటాం జిల్లాలో యాసంగి పంటల పరిస్థితిని నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. ప్రధానంగా వరి పంట కోసం చివరి ఆయకట్టు వరకు సాగు నీరందేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో మొత్తం 4.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేశారని మంత్రుల దృష్టికి తెచ్చారు. 2.38లక్షల ఎకరాలు చెరువులు, కాలువల కింద సాగు చేయడంతో ఎలాంటి ఇబ్బందుల్లేవని తెలిపారు. బోరుబావులపై ఆధారపడి మరో లక్షా 80వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారని, భూగర్భ జలాలు కొంతమేర తగ్గడంతో భీమ్గల్, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్పల్లి, డిచ్పల్లి, మోపాల్ మండలాల్లో సుమారు 1100 ఎకరాలకు సాగునీటి కొరత నెలకొందని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాగునీటిని అందించి పంటలు కాపాడుకునేలా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటామని అన్నారు. వీసీలో సీపీ సాయి చైతన్య, అధికారులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలి వీసీలో మంత్రులు ఉత్తమ్కుమార్, తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశం -
మూలకు చేరిన 14 ఆటోలు
బోధన్ టౌన్ : బోధన్ మున్సిపాలిటీ పరిధిలో రెండుమూడు రోజులకోసారి చెత్త సేకరిస్తుండడంతో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మా రింది. మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డులు, లక్షలకు పైగా జనాభా ఉంది. పారిశుధ్య విభాగంలో 182 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 38 వార్డులను ఎనిమిది జోన్లుగా విభజించి పను లు నిర్వహిస్తున్నారు. చెత్త సేకరించేందుకు కో ట్లాది రూపాయలు వెచ్చించి 24 ఆటోలు, ఏడు ట్రాక్టర్లు, ఒక స్వీపింగ్ మిషన్ను కొనుగోలు చే శారు. 38 వార్డుల్లో నుంచి ప్రతి రోజూ 35 మె ట్రిక్ టన్నుల చెత్త సేకరించాల్సి ఉండగా గడిచి న 4 నెలలుగా 50 శాతం చెత్తను మాత్రమే సేకరిస్తున్నారు. మొత్తం 24 ఆట్లో నుంచి 10 మాత్రమే పనిచేస్తుండగా 14 మూలనపడ్డాయి. స్వీపింగ్ మిషన్ సైతం పని చేయడం లేదు. అదనపు కలెక్టర్ వచ్చినా.. గత 10 రోజుల క్రితం అదనపు జిల్లా కలెక్టర్ అంకిత్ బోధన్ బల్దియాను సందర్శించారు. పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. మున్సిపల్ వాహనాల కండీషన్, మరమ్మతులకు సంబంధించి నివేదిక అందించాలని కమిషనర్ను ఆదేశించారు. బోధన్లో అస్తవ్యస్తంగా పారిశుధ్య నిర్వహణ రెండు, మూడు రోజులకోసారి చెత్త సేకరణ -
వేర్వేరు చోట్ల ముగ్గురి ఆత్మహత్య
బాల్కొండ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక మెండోరా మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన చంద్రగిరి వెంకటేశ్గౌడ్(39) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేశ్గౌడ్ ఆరు నెలల క్రితం దుబాయి నుంచి ఇంటికి వచ్చి గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బతుకుదెరువు కోసం గతంలో మూడుసార్లు దుబాయి వెళ్లగా అక్కడ సరైన పని లభించక తిరిగి వచ్చాడు. దుబాయి వెళ్లినప్పుడల్లా అప్పు చేసి ఏజెంట్లకు డబ్బులు చెల్లించాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఆదివారం వెంకటేశ్గౌడ్ భార్య శ్రావణి పిల్లలతో కలిసి తల్లిగారింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. తాడ్బిలోలిలో మరొకరు..రెంజల్(బోధన్): అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తాడ్బిలోలి గ్రామానికి చెందిన సాకినిగారి పోశెట్టి(55) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు. గత నెల 22న ఇంటి నుంచి వెళ్లిన పోశెట్టి కనిపించకపోవడంతో కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేశారు. సోమవారం స్థానిక చెరువులో మృతదేహం కనిపించడంతో జాలర్లతో బయటకు తీయించారు. అక్కడే శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి మృతుడి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సావిత్రిబాయి పూలేకు ఘన నివాళి
నిజామాబాద్ నాగారం: నగరంలోని మాల మహా నాడు జిల్లా కార్యాలయంలో సోమవారం సావిత్రిబాయిపూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పూలే చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షుడు సక్కి విజయ్కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి లక్ష్మణ్, నాయకులు చంద్రశేఖర్, విజయ, ప్రభంజన్, రాజు, సంతోష్, సునీత, లావణ్య, మంజుల, పుష్ప, గంగవ్వ, రమ్య, విమల పాల్గొన్నారు. సిరికొండ: మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో సావిత్రిబాయిపూలే వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి ప్రిన్సిపాల్ నర్సయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పరీక్షలంటే భయం వద్దు
సిరికొండ: విద్యార్థులు పరీక్షల పట్ల భయం పెట్టుకోవద్దని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ కోటగిరి గంగాప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో సోమవారం ఆయన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఒత్తిడిని అధిగమించి పరీక్షలను ఎలా రాయాలి, సమయాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలి, పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలో వివరించారు. హెచ్ఎం గడ్డం రాజేష్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సబ్స్టేషన్లో బ్రేకర్ ఏర్పాటు నిజామాబాద్ రూరల్: రూరల్ మండల పరిధిలోని సారంగాపూర్ సబ్ స్టేషన్లో రూ.10 లక్షల వ్యయంతో నూతన బ్రేకర్ను విద్యుత్శాఖ అధికారులు అమర్చారు. సోమవారం వారు బ్రేకర్ను ప్రారంభించారు. వచ్చే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని డివిజన్ పరిధిలో విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు నూతనంగా బ్రేకర్ను అమర్చినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. డీఈ ఉత్తమ్ జాడే, ఏడీఏ బాలేష్ కుమార్, ఏఈ శ్రీనివాస్, విద్యుత్ అధికారులు సంజీవ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, హరిచంద్, రాంసింగ్, అక్బర్ నావాజుద్దీన్, అప్సర్, గూలాబ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ధర్పల్లి: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎంపీడీవో బాలకృష్ణ సూచించారు. మండలంలోని వాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యత గల వంట సామగ్రిని వాడాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు భోజనంలో కోడిగుడ్లు ఎందుకు పెట్టడం లేదని నిర్వాహకులను ప్రశ్నించారు. బర్డ్ఫ్లూ వచ్చినప్పటి నుంచి గుడ్లు ఇవ్వడం లేదని హెచ్ఎం సమాధానం ఇచ్చారు. అనంతరం హొన్నాజీపేట్ గ్రామంలోని నర్సరీ, ఉపాధిహామీ పనులను తనిఖీ చేశారు. వేసవి దృశ్య నర్సరీలోని మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పట్టించాలని సిబ్బందికి సూచించారు. అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలి నిజామాబాద్ నాగారం: ప్రత్యేక తెలంగాణ కోసం చనిపోయిన అమరుల కుటుంబాలకు, జైలుకు వెళ్లిన ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని జేఏసీ కన్వీనర్ గైని గంగారాం అన్నారు. వినాయక్నగర్లోగల అమరవీరుల స్థూపం వద్ద సోమవారం ఆయన అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఇప్పటివరకు తెలంగాణ కోసం చనిపోయిన కుటుంబాలకు, జైలుకు వెళ్లిన ఉద్యోగులకు న్యాయం చేయడం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వమైన తెలంగాణ కోసం త్యాగంచేసిన కుటుంబాలకు ఆదుకోవాలని కోరారు. నాయకులు భాస్కర్, మోహన్, రాజారాం, సంతోష్, లక్ష్మన్, సక్కి విజయ్కుమార్ తదితరులు ఉన్నారు. అనుమతిలేని బడులపై చర్యలు తీసుకోవాలి నిజామాబాద్అర్బన్: అనుమతి లేకుండ అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రయివేటు బడులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు నగరంలోని ఓ ప్రయివేటు పాఠశాల ఎదుట సోమవారం వారు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి రఘురాం, ఓమయ్య, రంజిత్, అంజలి, తదితరులు ఉన్నారు. -
అక్రమ నియామకాలు రద్దు చేయాలి
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు అక్రమ పద్ధతుల్లో జరిగాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నూతనంగా నోటిఫికేషన్ విడుదల చేసి నియమనిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలన్నారు. ఈమేరకు సోమవారం తెలంగాణ యూనివర్సిటీ వీసీ చాంబర్ ఎదుట పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో ఇచ్చిన గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ డిపార్ట్మెంట్ నోటీస్ బోర్డు మీద తప్ప పత్రిక ప్రకటన ఇవ్వకుండా గోప్యంగా ఉంచారన్నారు. మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా నియామకాలను చేపట్టాలన్నారు. నాయకులు నరేందర్, కర్క గణేష్, రఘురాం, శివ, చరణ్, రాజు, సంజయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి ఎంపీ అర్వింద్ కృషి
సుభాష్నగర్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు వడ్డీ మోహన్రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి న్యాలం రాజు అన్నారు. జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చిన ఎంపీ అర్వింద్ మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేశారని, కేంద్ర కార్యాలయాన్ని కూడా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయించారన్నారు. జిల్లాలో సుదర్శన్రెడ్డి శకుని పాత్ర పోషిస్తూ, శనిలా మారారని, ఆయనకు భజన బ్యాచ్ సభ్యులైన కొందరు ఎంపీ అర్వింద్పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అర్వింద్పై అసత్య ప్రచారాలు చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, రాగి నారాయణ యాదవ్, సుధాకర్ చారి, ఇప్పకాయల కిషోర్, బాల్రాజ్, రాంచందర్, తదితరులు పాల్గొన్నారు. -
దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కళ్లద్దాలు అందిస్తాం
మోపాల్(నిజామాబాద్రూరల్): జిల్లాలో దృష్టిలోపం ఉన్న విద్యార్థులందరికీ ప్రభుత్వం కంటి అద్దాలను పంపిణీ చేస్తోందని జిల్లా వైద్యశాఖ అధికారి (డీఎంహెచ్వో) రాజశ్రీ తెలిపారు. మండలంలోని కంజర్ సాంఘిక సంక్షేమ బాలికల విద్యాలయంలో సోమవారం ఆమె విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల విద్యార్థులకు వైద్య సిబ్బంది కంటి పరీక్షలను నిర్వహించిందని, దృష్టిలోపం ఉన్న వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తుందన్నారు. అందులోభాగంగా మొదటి విడతలో 1277 కళ్లద్దాలు జిల్లాకు వచ్చాయన్నారు. జిల్లావ్యాప్తంగా ఆర్బీఎస్కే బృందాల ద్వారా వాటిని పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి అశోక్, ప్రిన్సిపాల్ విజయ, మేనేజర్ సచిన్, డాక్టర్ మాధవి, సందీప్, కరీం, సంధ్య, నర్సవ్వ, రఘుపతి, నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మోపాల్ మండలం తాడెం గ్రామంలో నిర్మిస్తున్న చెక్డ్యామ్ పనులకు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. అలాగే మాధవ్నగర్ బోర్గం(పి), పాంగ్రా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ, బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఆర్యనగర్లోని రామాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రూరల్ మండల పరిధిలో తాగునీటి సమస్య లేకుండా చేస్తానని, గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల సేవకోసం తన వైద్య వృత్తిని సైతం పక్కకు పెట్టినట్లు వివరించారు. నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, ిసీనియర్ నాయకులు సందగిరి భూమారెడ్డి, గడ్కోల భాస్కర్రెడ్డి, సూర్యరెడ్డి, సింగిల్విండో చైర్మన్లు, చంద్రశేఖర్రెడ్డి, మోహన్రెడ్డి, పైస ఎల్లయ్య, సాయారెడ్డి, బోర్గం శ్రీను, చిలుక సాయిలు, గంగాప్రసాద్, రఘు, ఎల్ఐసీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆలయంలో ఎమ్మెల్యే పూజలు ఇందల్వాయి: మల్లాపూర్లో జరుగుతున్న వేంకటేశ్వరస్వామి ఆలయ ఉత్సవాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈసందర్భంగా స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్గౌడ్, పీసీసీ డెలిగేట్ శేఖర్గౌడ్, నాయకులు సంతోష్రెడ్డి, రాజేందర్రెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెలే భూపతిరెడ్డి పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
ఘనంగా మహిళా దినోత్సవం
నిజామాబాద్ రూరల్: నగరంలోని ఎల్లమ్మగుట్ట మున్నూరుకాపు సంఘంలో సోమవారం గంగారాం మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్రావు, ఎస్ఈ రవీందర్, నార్త్ తహసీల్దార్ నాగరాజు, సరళ, మహేందర్రెడ్డి ఉన్నారు. బాధితుడికి పరామర్శ నిజామాబాద్అర్బన్: బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు త్యాగస్వామి ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో సోమవారం అతడిని తెలంగాణ ఉద్యమకారులు కోనేరుసాయికుమార్, ఈర్లశేఖర్, ప్రవీణ్లు పరామర్శించారు. -
విద్యుత్ను పొదుపుగా వాడాలి
ఎడపల్లి(బోధన్): వేసవిలో డిమాండ్ దృష్ట్యా వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని బోధన్ డీఈ ముక్తార్ కోరారు. మండలంలోని ఠాణాకలాన్ గ్రామంలో సోమవారం విద్యుత్ వినియోగ దారులకు, రైతులకు విద్యుత్ ఆదాపై అవగాహన కల్పించడానికి పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏడీఈ ప్రభాకర్, సిబ్బందితో కలిసి ఆయన గ్రామంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈ కిశోర్ రెడ్డి, సిబ్బంది శంకర్ నాయక్, గంగయ్య, హైమద్ పాష, గజానంద్, అశోక్, శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం
నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారిని ప్రోత్సహించేవిధంగా సమానమైన ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కాంగ్రెస్ ఎస్టీసెల్ చైర్మన్ కెతావత్ యాదగిరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించడంలో ఏఐసీసీ పెద్దలు సమ న్యాయం చేశారన్నారు. పార్టీలో ముందునుంచి ఉన్నవారు, కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని కష్టనష్టాలను భరించి పార్టీ కోసం పనిచేసినవారికి గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపించారన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కుతాయనేందుకు శంకర్ నాయక్ ఎంపిక నిదర్శనమన్నారు. భవిష్యత్లో ఉత్తర తెలంగాణ గిరిజనులకు పార్టీలో ఉన్నత పదవులు కల్పించాలని కోరారు. పార్టీ అగ్రనేతలకు ధన్యవాదాలు తెలుపుతున్నా మన్నారు. నాయకులు బున్నె రవీందర్ ఉన్నారు. నేడు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ నిజామాబాద్రూరల్: రూరల్ నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు మంగళవారం ఉదయం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేయనున్నట్లు కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందించనున్నట్లు వారు తెలిపారు. ‘నవోదయ’పై రాజకీయాలు తగవు నిజామాబాద్ అర్బన్: జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటుపై అధికార కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలు చేయడం సరికాదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్ అన్నారు. నగరంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు వచ్చిన నవోదయ పాఠశాలను కాంగ్రెస్, బీజేపీ సమన్వయంతో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రతినిధులు దీపిక, దినేష్, ఆజాద్, చక్రి, రాజు, వీణ ఉన్నారు. బోధన్లో 4 దుకాణాలు సీజ్ బోధన్టౌన్(బోధన్): పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించని నాలుగు దుకాణాలను సోమవారం బల్దియా అధికారులు తాళం వేసి సీజ్ చేశారు. బకాయి ఉన్న దుకాణాల్లో బల్దియా అధికారులు పన్ను వసూలు చేస్తున్నారు. అనిల్ టాకీస్ రోడ్డులో రెండు దుకాణాలతో పాటు మరో రెండు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. -
పన్ను వసూళ్లకు మెప్మా సిబ్బంది
● అదనంగా మరో 40 (హెచ్హెచ్డీ) మిషన్ల కోసం ప్రతిపాదనలు ● వేగంగా వసూళ్ల కోసం బల్దియా అధికార యంత్రాంగం చర్యలు నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్కు రావాల్సిన పన్నుల కోసం అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ సంవత్సరం రావాల్సిన పన్నులు, పాత బకాయిలు, జరిమానాలు, నీటి పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టిసారించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలివుంది. దీంతో మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. రెవెన్యూ సిబ్బందితోపాటు తాను కూడా రోడ్డుబాట పట్టారు. దుకాణాలు తిరుగుతూ పన్నులు చెల్లించాలని సూచిస్తున్నారు. మొండి బకాయిదారులపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇప్పటివరకు రూ.30 కోట్లు వసూలు.. పన్నుల రూపేనా బల్దియాకు దాదాపు రూ.90 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు రూ. 29.80 కోట్లు వసూలు చేశారు. కేవలం వారం రోజుల్లోనే రూ.4 కోట్ల వరకు వసూలు చేశారు. మరో 10 రోజుల వ్యవధిలో రూ. 15 కోట్ల వరకు పన్నులు వసూలు చేయాలని అధికారులు లక్ష్యం నిర్ధేశించారు. ఆదివారం, రెండో శనివారం, ఇతర సెలవు దినాల్లో సైతం సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 80 మంది వరకు సిబ్బంది పన్ను వసూళ్ల విధుల్లో ఉన్నారు. వీరితోపాటు తాజాగా మెప్మా విభాగానికి చెందిన సిబ్బంది సేవలు సైతం వినియోగించనున్నారు. వీరిలో బల్దియాలో టౌన్ప్లానింగ్ ఆఫీసర్, 8 మంది సీవోలున్నారు. నగరంలో ఆర్పీలు (రిసోర్సు పర్సన్లు) 200 మంది వరకు ఉన్నారు. బిల్ కలెక్టర్లతోపాటు ఆర్పీలు, సీవోల సహాయంతో పన్నులు వసూలుచేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ సూచించారు. ఈమేరకు వారితో ప్రత్యేక సమావేశం సైతం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఆర్పీలు సహకరించాలి బల్దియా పన్నుల వసూళ్ల కోసం మెప్మా సిబ్బంది సహకారం కూడా తీసుకుంటున్నాం. నగరంలోని ఆర్పీలు క్షేత్రస్థాయిలో సహకరించాలి. వారి సహకారంతో పన్నుల వసూళ్లు వేగవంతం అవుతాయి. బల్దియాకు చెల్లించాల్సిన పన్నులను నగరవాసులు వెంటనే చెల్లించాలి. –దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్, నిజామాబాద్ అవగాహన కల్పించాలి నిజామాబాద్ బల్దియాలో పన్నుల వసూళ్ల కోసం మెప్మా సిబ్బందిని కమిషనర్ భాగస్వామ్యం చేశా రు. క్షేత్రస్థాయిలో బిల్ కలెక్టర్లకు ఆర్పీలు సహకరించాలి. ఆయా డివిజన్లలో తెలిసినవారికి పన్నులు చెల్లించేలా ఆర్పీలు అవగాహన కల్పించాలి. పన్ను వసూళ్లకు పూర్తి సహకారం అందించాలి. –చిదుర రమేష్, మున్సిపల్ టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ సరిపోని మిషన్లు.. పన్నుల వసూళ్ల కోసం బల్దియా అధికారులు హాండ్ హెల్డు డివైజ్ (హెచ్హెచ్డీ) మిషన్లను వాడుతున్నారు. ఈ మిషన్లు బిల్లు కలెక్టర్ల ఆధీనంలో ఉంటాయి. బల్దియాలో ఇప్పటివరకు 38 మిషన్లు మాత్రమే ఉన్నాయి. నగరంలో 60 డివిజన్లు ఉండగా, మరో 40 మిషన్ల కోసం కమిషనర్ సీడీఎంఏకు సమాచారం ఇచ్చారు. దాంతో యాక్సిస్ బ్యాంక్వారు 40 మిషన్లు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈనేపథ్యంలో మంగళవారం నుంచి పన్ను వసూళ్లు వేగవంతం కానున్నాయి. మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ నేరుగా పన్నుల వసూళ్లలో నేరుగా పాల్గొంటున్నారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి వారి వెంట పన్నుల వసూళ్లకు వెళుతున్నారు. పన్నులు చెల్లించనివారి దుకాణాలు సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 15 దుకాణాలు సీజ్చేశారు. చెల్లించాల్సిన పన్నులకు సంబంధించిన సొమ్ము బిల్ కలెక్టర్కు నేరుగా చెల్లించి రసీదు పొందాలి. బల్దియా కార్యాలయంలో, మీసేవా కేంద్రాల్లో, ఆన్లైన్లో కూడా పన్నులు చెల్లించవచ్చు. -
మనిషి ఆలోచనలో మార్పురావాలి
తెయూ (డిచ్పల్లి): మనిషి జీవితంలో విజయం సాధించాలంటే తన ఆలోచన విధానంలో మార్పురావాలని యూనివర్సిటీ ఆఫ్ టెక్నిక్స్ ప్రొఫెసర్, అకడమిక్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్ డాక్టర్ గడ్డం వాణి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో సోమవారంవిద్యార్థుల ఆలోచనలు– అవకాశాలు అనే అంశంపై కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ అధ్యక్షతన విస్తృతోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గడ్డం వాణి మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలంటే నిరంతర అధ్యయనం, బహుముఖ విజయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అపజయాలు ఎదురైనప్పుడు అనుభవాలను గుణపాఠాలుగా మార్చుకొని, విజయం కోసం ముందడుగు వేయాలని ఉద్బోధించారు. కార్యక్రమంలో లా కాలేజ్ ప్రిన్సిపల్ ప్రసన్న రాణి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ నాగరాజు, చీఫ్ వార్డెన్ మహేందర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి 95 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీవో శ్రీనివాస్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఏసీపీ శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్లకు వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఆదేశాలు -
అంకాపూర్లో కడప వ్యవసాయాధికారులు
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్సార్ కడప జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం సందర్శించారు. వైఎస్సార్ కడప జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఏ నాగేశ్వర్ రావు, డ్వామా పీడీ బీ ఆదిశేషా రెడ్డి, ఉద్యావన శాఖ జిల్లా అధికారి ఎస్ఎస్వీ సుభాషిణి తదితరులు అంకాపూర్లో సాగుచేస్తున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పసుపు ఉడకబెట్టే యంత్రాలు, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, నీటి నిలువ తొట్టెలను పరిశీలించి రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీ ఎంఐపీ పీడీ ఎం వెంకటేశ్వర్ రెడ్డి, డీపీఎం ప్రవీణ్, ఆర్మూర్ ఏడీఏ విజయలక్ష్మి, ఏఈవో అనూష, అంకాపూర్ రైతులు సల్ల అనంత్ రెడ్డి, నారాయణ రెడ్డి, కేకే భాజన్న, జీ భూమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వరంగల్ రైతులు.. పెర్కిట్(ఆర్మూర్): వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం, గిట్ల కనిపర్తితోపాటు శాయంపేట మండలానికి చెందిన రైతులు అంకాపూర్ గ్రామాన్ని సోమవారం సందర్శించారు. రైతు విజ్ఞానయాత్రలో భాగంగా నాబార్డు సహకారంతో శాంతది సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో అంకాపూర్లో పర్యటించారు. పంటలను పరిశీలించిన బృందం -
ప్రమాదవశాత్తు ఆర్మీ జవాన్ మృతి
సిరికొండ: మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ కాసుల ప్రమోద్ ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నెల 1న హైదరాబాద్లోని తన గదిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రమోద్కు తీవ్రగాయాలయ్యాయి. మొదట సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించగా, మెరుగైన చికిత్స కోసం పుణెలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 8న రాత్రి మృతి చెందాడు. ప్రమోద్ స్వగ్రామం సిరికొండలో సోమవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమోద్ భౌతికకాయానికి ఆర్మీ అధికారులతోపాటు సిరికొండ ఎస్సై ఎల్ రామ్ నివాళులర్పించారు. మృతుడికి తల్లిదండ్రులతోపాటు చెల్లెలు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
మాచారెడ్డి: పాల్వంచ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. భవానీపేట తండాకు చెందిన బూక్య సురేశ్, మాలోత్ తేజ పాల్వంచ నుంచి కామారెడ్డి వైపు బైకుపై వెళుతుండగా, వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. ఆటో దొంగ అరెస్ట్ఖలీల్వాడి: జీజీహెచ్లో ఆటో చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్హెచ్వో రఘుపతి సోమవారం తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సుల్తాన్పేట్ గ్రామానికి చెందిన అమృత్వార్ మోహన్ తన చిన్నమ్మ డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. ఈ నెల 5న రాత్రి 10 గంటలకు తన ఆటోను జీజీహెచ్ పార్కింగ్ ఏరియాలో నిలిపాడు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి ఆటో కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని ఎస్హెచ్వో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని బోధన్ బస్టాండ్లోని వాహనాల తనిఖీ చేస్తుండగా బర్కత్పురాకు చెందిన ఖలీద్ బిన్ మొహమ్మద్పై అనుమానంతో విచారించగా చోరీకి పాల్పడినట్లు తేలిందన్నారు. ఆటోను స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. -
రాత్రికి రాత్రే ఇసుక తోడేస్తున్నారు
ఖలీల్వాడి: మంజీర పరీవాహకంలో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. రాత్రివేళ పొక్లెయినర్లు, ట్రాక్టర్ లోడర్స్తో ఇసుక తోడేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి రూ. లక్షల్లో గండిపడుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టేవారు మూడు గ్రూపులుగా మారి తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఒక గ్రూపు అధికారులను మచ్చిక చేసుకుంటుండగా, మరో గ్రూపు మంజీరా పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వించి టిప్పర్లలో పంపిస్తారు. మూడో గ్రూపు ఇసుక టిప్పర్లకు ఎస్కార్ట్గా మారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని అక్రమంగా ఇసుక తరలిస్తున్నా పోలీసులు, రెవెన్యూ, మైనింగ్, ఆర్టీఏ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సామర్థ్యానికి మించి తరలింపు.. పొతంగల్ మండలం కల్లూర్, కొడిచర్ల, పొతంగల్, హంగార్గా, సుంకిని, రెంజల్ మండలంలోని నీలా, కందకుర్తి ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. మంజీరా పరీవాహక ప్రాంతంలో కొందరు ఇంటిపనుల కోసం ఇసుకను తరలిస్తుండగా, మరికొందరు ప్రభుత్వ కార్యక్రమాలకు ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడి నుంచి తరలించిన ఇసుకను డంప్లుగా చేసుకుంటున్నారు. అనంతరం అక్కడి నుంచి టిప్పర్లలో సామర్థ్యానికి మించి తీసుకెళ్తున్నారు. రాత్రివేళలో ఇసుక అక్రమదందా కొనసాగుతుందని తెలిసినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక టిప్పర్లతో ప్రమాదాలు జరిగినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.వే బిల్లులు లేకుండానే..ఇసుక తరలింపునకు సంబంధిత టిప్పర్లు, ట్రాక్టర్ల యజమానులు మీ సేవల్లో దరఖాస్తు చేసుకొని వాటికి చలాన్ కట్టాల్సి ఉంటుంది. అనంతరం జారీ అయిన వే బిల్లుతో ప్రభుత్వం కేటాయించిన రీచ్ నుంచి ఇసుకను తీసుకువెళ్లాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి నిబంధనలు ఉండవు. రాత్రివేళల ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంప్ చేస్తారు. అనంతరం అక్కడి నుంచి టిప్పర్లలో నిజామాబాద్, బోధన్ వంటి ప్రాంతాలకు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇలా తరలించిన ఇసుకకు ఎలాంటి వే బిల్లులు ఉండవు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. పొతంగల్, రెంజల్ పరిధిలోని మంజీరా పరీవాహకంలో తవ్వకాలు అక్రమంగా టిప్పర్లలో తరలింపు పట్టించుకోని పోలీసులు, రెవెన్యూ, ఆర్టీఏ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండిప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి వే బిల్లు లేకుండానే రాత్రివేళ టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. రెవెన్యూ, పోలీసులు, మైనింగ్, ఆర్టీఏ అధికారులకు విన్నవించినా ఫలితం కనిపించడం లేదు. ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే ఇసుక అక్రమ రవాణాను అరికట్టవచ్చు. ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసి రాత్రివేళలల్లో తనిఖీ చేపట్టాలి. – లింగారెడ్డి, నిజామాబాద్ లారీ ఓనర్స్, బిల్డింగ్ మెటీరియల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి -
పంటలకు సాగునీరందించాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి సుభాష్నగర్: జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, కాలువల కింద ఉన్న పంటలకు తక్షణమే నీరందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుకు లేఖ రాశారు. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, మోపాల్, డిచ్పల్లి మండలాల్లో బోరుమోటార్లు ఎత్తిపోయి వరి ఎండిపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మెట్ట ప్రాంతాల్లోని రైతులకు ట్యాంకర్ల ద్వారా, కాలువల కింద ఉన్న పంటలకు సాగునీరు అందించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మోసగించిన యువకుడి రిమాండ్దోమకొండ: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన కేసులో దోమకొండకు చెందిన యువకుడిని సోమవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై స్రవంతి తెలిపారు. సదరు యువతిని ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకొని లైంగికదాడికి పాల్పడి వదిలివేసినట్లు పేర్కొన్నారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి యువకుడిని రిమాండ్కు పంపినట్లు ఎస్సై తెలిపారు. బాధితులకు న్యాయం చేయండి నిజామాబాద్నాగారం: జిల్లాలో అక్షర ఫైనాన్స్ ప్రయివేట్ లిమిటెడ్తో మోసపోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కో రుతున్నారు. నగరంలోని ప్రెస్క్లబ్లో సోమ వారం నిర్వహించిన సమావేశంలో బాధితులు మాట్లాడారు. సదరు ఫైనాన్స్ కంపెనీ యాజ మాన్యం రాష్ట్రవ్యాప్తంగా 72 బ్రాంచీలు పెట్టి మూడు వేల మందిని మోసగించి కోట్లాది రూపాయలు వసూలు చేశారన్నారు. జిల్లా బ్రాంచ్లో 72మంది బాధితులకు రూ. 2కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా, ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ మాక్లూర్: స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో డీఆర్డీవో సాయాగౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధి హామీ సామాజిక తనిఖీ నిర్వహించారు. గతేడాది ఉపాధి హామీ పనులు ఏ మేరకు జరిగాయి, ఏఏ పనులు చేశారనే రికార్డులను తనిఖీ చేశారు. కూలీలకు డబ్బులు చెల్లించటంలో ఆలస్యం జరిగిందా జరిగితే ఎందుకు జరిగిందనే వివరాలను ఎఫ్ఏలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మండల వ్యాప్తంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిగింది. ఇక ముందు చేపట్టే పనులు ఇతర అంశాలపై ఏపీవో ఓంకార్కు డీఆర్డీవో సూచనలు చేశారు. ఈ తనిఖీలో ఎంపీడీవో లక్ష్మారెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, సుశీల, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ముషీర్నగర్లో యువకుడు..
సిరికొండ: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ముషీర్నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ఎల్ రామ్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బట్టు మనోహర్(24) ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసై ఈ నెల 7న పురుగుల మందు సేవించాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చి కిత్స పొందుతున్న మనోహర్ ఈ నెల 9న రాత్రి మృతి చెందినట్లు ఎస్సై రావ్ు సోమవారం తెలిపా రు. మృతుడి భార్య గౌత మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
ప్రతిపాదిత స్థలాలు ఫైనలయ్యేనా?
ఆర్మూర్: జిల్లాలో మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఈ సమీకృత గురుకులాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ పరిశీలించిన స్థలాలు సమీకృత స్కూళ్ల నిర్మాణానికి ఫైనల్ అవుతాయా? అనేది చర్చనీయాంశమైంది. ఒక్కో ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనుండగా, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు రెండు నెలల క్రితం పలు స్థలాలను ప్రతిపాదించారు. ఆర్మూర్ నియోజకవర్గానికి మంజూరైన స్కూల్ను అంకాపూర్ శివారులోని 493/1 సర్వే నంబర్లోని ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి విజ్ఞప్తి చేయగా, కలెక్టర్ ప్రతిపాదనలు పంపారు. మరో రెండింటిని నవీపేట్ మండలం దర్యాపూర్, డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామశివార్లలో నిర్మించాలని కలెక్టర్ ప్రతిపాదనలు పంపారు. అయితే అధికార పార్టీ నాయకులు రెండు చోట్ల వేరే స్థలాలను సూచించడంతో కలెక్టర్ వాటిని సైతం పరిశీలిస్తున్నారు. ఆర్మూర్ పట్టణ శివారులోని పిప్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక ప్రాంతం, బోధన్ మండలం బెలాల్ గ్రామ శివారులోని మధుమలంచ డిగ్రీ కళాశాల స్థలంలో సమీకృత గురుకులాలను నిర్మించాలని అధికార పార్టీ నాయకులు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విద్యార్థులు, తల్లిదండ్రులు సులభంగా పాఠశాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం ఉన్న చోటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కామారెడ్డి ఎస్పీ బాధ్యతల స్వీకరణకామారెడ్డి క్రైం : జిల్లా ఎస్పీగా నియమితులైన రాజేశ్ చంద్ర సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ ఎస్పీగా పని చేసిన సింధు శర్మ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో రాజేశ్ చంద్ర వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆయనను జిల్లాకు చెందిన పలువురు పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సమీకృత గురుకులాలకు నిధులు కేటాయించిన సర్కారు స్థల కేటాయింపు ప్రతిపాదనలు పంపిన కలెక్టర్ రెండు చోట్ల వేరే స్థలాలను సూచిస్తున్న అధికార పార్టీ నేతలు -
మహిళలను గౌరవించాలి
సుభాష్నగర్: ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి అన్నా రు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని ఉమ్మ డి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ, త్యాగం, సహనం కలిస్తే మహిళ అని కొనియాడారు. అనంతరం మహిళా మేనేజర్లు, సిబ్బందితో కలిసి కేక్ కట్చేసి, సీనియర్ మహిళా మేనేజర్లను సన్మానించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, సీఈవో నాగభూషణం వందే, టీసీసీబీఈఏ రాష్ట్ర నాయకురాలు రాధ, నిజామాబాద్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు నాగభూషణం, సందీప్, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి -
మూడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు నిధులు
● ఒక్కోదానికి రూ.200 కోట్లు.. ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం బోధన్/ నిజామాబాద్ అర్బన్ : జిల్లాకు మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలకు నిధులు కేటాయిస్తూ రా ష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యా ప్తంగా 55 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయగా, అందులో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూర ల్ నియోజకవర్గాలున్నాయి. ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి రూ. 200 కోట్ల చొప్పున పరిపాలన అనుమ తు లు మంజూరు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. నేడు బాధ్యతలు స్వీకరించనున్న సీపీ ఖలీల్వాడి : నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పోతరాజు సాయి చైతన్య సోమవా రం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. హైదరా బాద్ నార్కోటిక్ విభాగంలో ఎస్పీగా విధు లు నిర్వర్తిస్తున్న ఆయనను ప్రభుత్వం నిజామాబాద్ సీపీగా నియమించిన విషయం తెలిసిందే. కాగా, సాయిచైతన్య ఆదివారం నార్కోటిక్ విభాగంలో రిలీవ్ అయినట్లు సమాచారం. నూతన సీపీ బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేసినట్లు తెలిసింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి ధర్పల్లి: నీళ్లు లేక వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు. ధర్పల్లి, దుబ్బాక గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా దినేశ్ మాట్లాడుతూ.. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి నీళ్లు లేక ఎండిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. రూరల్ నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ఎమ్మెల్యే భూపతిరెడ్డి పట్టించుకోవడంలేదని విమర్శించారు. మంచిప్ప రిజర్వాయర్ పనులు పూర్తిచేసి రైతులకు సాగునీరందించాలని సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పంట నష్టపరిహారం కోసం కలెక్టర్కు లేఖ రాస్తాన ని అన్నారు. బీజేపీ తరఫున అందుబాటులో ఉంచనున్న నీళ్ల ట్యాంకర్లను రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, నాయకులు గంగాదాస్, కర్క గంగారెడ్డి, మహేశ్, సదానందగౌడ్, అమృనాయక్, నరేశ్గౌడ్, రాము, మల్లయ్య, సుమన్, తిరుపతి తదితరులు ఉన్నారు. ‘మీటర్’ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సుభాష్నగర్: విద్యుత్ మీటర్లలో రీడింగ్ త క్కువ అయ్యేలా చేస్తామంటూ వస్తున్న వ్య క్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీటీఎస్ సీఐ బి గోవర్ధన్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొందరు వ్యక్తు లు తక్కువ కరెంటు బిల్లు వచ్చేలా చేస్తామంటూ డబ్బులు తీసుకొని విద్యుత్ మీటర్లోని తీగలను కట్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. మీటర్లోని తీగలను కట్ చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తామని, మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ మీ టర్ తిరగకుండా చేస్తామని ఎవరైనా వస్తే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. శ్రీవారికి చక్ర స్నానం ● తెలంగాణ తిరుమలలో ముగిసిన బ్రహ్మోత్సవాలు బాన్సువాడ : బీర్కూర్ మండలం తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివా రం శ్రీవారికి చక్ర స్నానం చేయించారు. అంతకుముందు వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీ వారి విగ్రహానికి పంచామృతాభిషేకం చేసి, ఆలయంలో ఉన్న పుష్కరిణిలో వేదపండితులు చక్రస్నానం చేయించారు. చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి దంపతులు, నేతలు పోచారం శంభురెడ్డి, పోచారం సు రేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు ఎంపీ అర్వింద్ తెచ్చిన నిధులు ఎన్ని?
నిజామాబాద్ సిటీ: రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన అర్వింద్ జిల్లాకు ఎన్ని నిధులు తెచ్చారని, ఏయే పనులు చేపట్టారో తెలపాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో ఆదివారం నుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కేశవేణు మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్ మతిభ్రమించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఇష్టారీతిన మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని విమర్శించే స్థాయి అర్వింద్కు లేదన్నారు. తాహెర్ మాట్లాడుతూ.. జిల్లాలో నవోదయ ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో జిల్లా విద్యా శాఖ అధికారులు ఆలోచిస్తారన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా కేంద్ర గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే.. నిజామాబాద్ సిటీ: కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి ఎంపీ అరవింద్ అబద్ధపు వాదనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి యత్నిస్తున్నాడని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కేవలం మాటలతో పబ్బం గడపడం అర్వింద్కు అలవాటే అని అన్నారు. నిజంగా ఎంపీ అర్వింద్కు నవోదయ సమస్య పరిష్కారం కావాలంటే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డితో మాట్లాడితే బాగుండేదన్నారు. జిల్లా అభివృద్ధిలో సుదర్శన్ రెడ్డికి పోటీ ఎవరూ లేరన్నారు -
అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు
● ఇద్దరికి గాయాలు సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని రామారెడ్డి–సదాశివనగర్ రోడ్డు మార్గంలో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈఘటనలో కారులోని ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం కారులో రామారెడ్డి నుంచి సదాశివనగర్కు బయలుదేరారు. మార్గమధ్యలో వారి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ – కారు ఢీ: ముగ్గురికి గాయాలు రుద్రూర్: మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని బోధన్–రుద్రూర్ ప్రధాన రహదారిపై ట్రాక్టర్ – కారు ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్షతగాత్రులు రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
47ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు
భిక్కనూరు: చిన్ననాటి మిత్రులందరూ దాదాపు 47ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారంతా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1977–78 ఎస్సెస్సీ బ్యాచ్ బి సెక్షన్ విద్యార్థులు ఆదివారం భిక్కనూరు మండలంలోని బీటీఎస్ చౌరస్తా వద్ద పూర్వ విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. ఏళ్ల తర్వాత వారంతా కలుసుకోవడంతో చిన్ననాటి తీపీ గుర్తులను నెమరువేసుకున్నారు. ప్రతి ఏడాది ఇలానే కలుసుకోవాలని, స్నేహితుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని తీర్మానించుకున్నారు. కార్యక్రమంలో ఆనాటి పూర్వ విద్యార్థులు శ్రీధర్, భూమయ్య, సునీల్కుమార్, చాట్ల రాజేశ్వర్, పాత బాల్కిషన్, రామలింగం, పార్శి మధుసూధన్, వెంకటరమణ, కస్వ వెంకటేశం, ముప్పారపు రాజేందర్, బీమ్రావు, గోజే రాజేందర్, రమేష్, చిట్టిమధు, ఇంద్రసేనారెడ్డి తదితరులు ఉన్నారు. 38ఏళ్ల తర్వాత.. భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి జెడ్పీహెచ్ఎస్ 1986–87 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. బస్వాపూర్ గ్రామంలోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో నాటి విద్యార్థులందరూ హాజరయ్యారు. సుమారు 38ఏళ్ల తర్వాత వారంతా కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. తమతో చదువుకుని స్వర్గస్తులైన నలుగురు స్నేహితుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఆనాటి గురువులను కార్యక్రమానికి ఆహ్వానించి, సన్మానించారు. -
నగరంలో క్రికెట్ అభిమానుల సంబురాలు
నిజామాబాద్నాగారం: నగరంలో క్రికెట్ అభిమానుల సంబురాలు మిన్నంటాయి. దుబాయ్లో ఆదివారం జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఇండియా– న్యూజిలాండ్ తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈమ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో నగరంలోని పలు కాలనీల్లో క్రికెట్ అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబురాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. జయహో.. భారత్.. అంటు నినాదాలు చేశారు. అలాగే పలువురు అభిమానులు సాక్షితో తమ అభిప్రాయాలను తెలిపారు. టీంఇండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో టపాసులు కాల్చిన యువత -
శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
నిజామాబాద్ రూరల్: వచ్చే నెల లో నిర్వహించే శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్ ఇందూరు జిల్లా కార్యదర్శి పరాయితం లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ప్రఖండ స మావేశం నిర్వహించారు. ప్రాంత కార్యదర్శి పరాయితం లక్ష్మీనారాయణ మాట్లాడూతూ.. రాబోయే కార్యక్రమాలు, ఉత్సవాలు, పరిషత్ వర్గ, బజరంగ్ దళ్ శౌర్యా ప్రశిక్షణ వర్గ, దుర్గా వాహిని వర్గ, మాతృశక్తి వర్గాల గురించి చర్చించారు. అంతకు ముందు శ్రీరాముని, భారతమాత చిత్రపటాలకు విశ్వ హిందూ పరిషత్ నా యకులు పూలమాలలు వేశారు. పదాధికారులు, ప్రఖండ అధ్యక్షులు, బజరంగ్ దళ్ సంయోజక్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి ధర్పల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని శాఖ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి అన్నారు. ఆదివారం ధర్పల్లి మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని పరిశీలించారు. గ్రంథాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. ఇటీవల ధర్పల్లి గ్రంథాలయానికి మౌలిక సదుపాయాల కోసం రూ.5 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో గ్రంథాలయంలో చేసిన పనులను పరిశీలించారు. గ్రంథాలయంలో వైఫై కనెక్షన్, నాలుగు కంప్యూటర్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని గ్రంథ పాలకుడు కిషన్ను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రంథాలయ చైర్మన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు చెలిమెల నర్సయ్య, చిన్నారెడ్డి, గంగారెడ్డి, సుభాష్, సురేందర్ గౌడ్, రాకేశ్ తదితరులు ఉన్నారు. ఎండిన పంటల పరిశీలన ఇందల్వాయి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో ఎండి న వరి పంటలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేశ్ ఆదివారం పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని అన్నారు. నియోజకవర్గంలో చెక్ డ్యాములు, కుంటలను పునర్ నిర్మించాలన్నారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, చిన్నూ, నాయుడు రాజన్న, సక్కీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మోపాల్లో వాహనాల తనిఖీ మోపాల్: మండలకేంద్రంలో ఆదివారం ఎస్సై యాదగిరిగౌడ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. అలాగే వాహనదారులకు డ్రంకన్డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో 3 డ్రంకన్డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు పాటించిన వాహనదారులకు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. -
చిరుప్రాయంలోనే ప్రాణాంతక వ్యాధి
వేల్పూర్: చిరుప్రాయంలోనే ప్రాణాంతక వ్యాధికి గురైన ఓ బాలుడు, ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నాడు. వైద్య చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు పేర్కొనడంతో తల్లి దండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూ స్తున్నారు. మండలంలోని పచ్చలనడ్కుడ గ్రా మంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన నవీన్రెడ్డి, మనోజ దంపతులకు కుమారుడు నిఖిలేష్ ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఆరో తరగతి చదువుతుండగా ఇటీవల అనారోగ్యానికి గురికాగా వైద్యపరీక్షలు చేయించారు. అందులో అతడికి అరుదైన బ్లడ్ క్యాన్సర్ సోకినట్లు వైద్యు లు తెలిపారు. దీంతో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నా రు. ఇప్పటిదాకా రూ. 14 లక్షలు చికిత్సకు ఖర్చు చే శారు. నిఖిలేష్ పూర్తి కోలు కోవాలంటే చికిత్సకు రూ. 60లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతఖర్చు భరించే స్థోమత తమకు లేదని, దాతలు తోచినంత సహాయం అందించాలని వేడుకుంటున్నారు. 9494719197 నంబరుకు ఫోన్పే చేసి, కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని కోరుతున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పచ్చలనడ్కుడకు చెందిన నిఖిలేష్ చికిత్సకు రూ.60లక్షలు ఖర్చవుతుందంటున్న వైద్యులు దాతలు ఆదుకోవాలంటూ బాలుడి తల్లిదండ్రుల వేడుకోలు -
చేపలను గ్రామంలోనే విక్రయించాలి
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని వాజిద్నగర్ గ్రామ చెరువులో గంగపుత్రులు పట్టిన చేపలను గ్రామంలోనే విక్రయించాలని గ్రామస్తులు కోరారు. ఇతర ప్రాంతాలకు తరలించొద్దని చేపల వాహనా న్ని శనివారం స్థానికులు అడ్డుకున్నారు. ప్రస్తుతం వాహనాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దనే నిలిపిఉంచారు. స్థానికంగా చేపలు అమ్ముడుపోవడం లేదని, అందుకే హైదరాబాద్కు తీసుకెళ్లి విక్రయిస్తామని గంగపుత్రులు పేర్కొంటున్నారు. సుమారు రూ.6 లక్షల విలువ ఉన్న చేపల వాహనాన్ని రెండు రోజుల నుంచి జీపీ వద్ద పెట్టారని వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకు న్న కొందరి వ్యక్తులపై పొలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. గ్రామంలో కొన్ని చేపలు విక్రయించాలని గంగపుత్రులకు సూచించిన ఒక్క చేప కూడా విక్రయించడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. ఇతర ప్రాంతాలకు తరలించొద్దు వాజిద్నగర్వాసుల డిమాండ్ చేపల వాహనం అడ్డగింత -
కొత్త వేతనాలు వచ్చేదెప్పుడు?
మోర్తాడ్(బాల్కొండ): మినీ అంగన్వాడీల నుంచి మెయిన్ అంగన్వాడీలుగా గుర్తింపు పొందినా పాతవేతనాలు మంజూరుకావడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడిచినా తమకు కొత్త వేతనాలు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 135 మంది సిబ్బంది.. జిల్లాలో 135 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరిలోనే ఉత్తర్వులను జారీ చేసింది. కానీ ఆర్థికశాఖ ఆమోదం లభించకపోవడంతో అప్గ్రేడ్ చేయబడిన అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త వేతనానికి బదులు, పాత వేతనమే అందుతుంది. మినీ అంగన్వాడీలకు మొదట్లో నెలకు రూ.7,500ల చొప్పున వేతనం లభించేది. అప్గ్రేడ్ చేయడంతో వారికి ప్రతి నెలా రూ.15వేల వేతనం అందాల్సి ఉంది. అప్గ్రేడ్ చేసిన తొలినాళ్లలో రెండు నెలల పాటు కొత్త వేతనం అందించారు. సాంకేతిక కారణాలతో ఆర్థికశాఖ ఆమోదం లభించలేదని ఏప్రిల్ 2024 నుంచి పాత వేతనమే అందిస్తున్నారు. ఏ అంగన్వాడీ కేంద్రంలోనైనా ఒకే విధమైన పని భారం ఉందని ఒక చోట తక్కువ మరో చోట ఎక్కువ అనే తేడా ఏమి లేదని కార్యకర్తలు చెబుతున్నారు. వేతనం విషయంలోనే ప్రభుత్వం దోబూచులాడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నిమార్లు విన్నవించినా.. అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త వేతనం చెల్లించాలని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు, ఆర్థిక శాఖకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. తమ శాఖ విధులే కా కుండా ప్రభుత్వం సూచించిన ఎలాంటి పనినైనా ఎంతో బాధ్యతతో చేస్తున్న తమ పట్ల ఎవరూ కనికరం చూపడం లేదని అప్గ్రేడ్ చేయబడిన అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొత్త వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మెయిన్ అంగన్వాడీలుగా మినీ అంగన్వాడీ కార్యకర్తల గుర్తింపు 2024లోనే ఉత్తర్వులు జారీ అయినా సిబ్బందికి పాతవేతనాలే మంజూరు ప్రభుత్వం స్పందించాలి.. అప్గ్రేడ్ చేయబడిన మినీ అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త వేతనం చెల్లించాలని ఎన్నోమార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదు. మహిళా దినోత్సవం సందర్బంగానైనా ప్రభుత్వం స్పందించి, అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్తను అందించేలా చొరవ తీసుకోవాలి. –కై రి దేవగంగు, అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు -
నిజామాబాద్ బస్టాండ్లో గంజాయి పట్టివేత
ఖలీల్వాడి: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సుమా రు 250 గ్రామలు ఎండు గంజాయిని పట్టుకున్నట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు బృందం బస్టాండ్ వద్దకు వెళ్లగా అ నుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతడి బ్యాగ్ను చెక్ చేయగా అందులో 250 గ్రాముల ఎండు గంజాయి ఉందన్నారు. అతడిని వి చారించగా నవీపేట్ మండలం నాళేశ్వర్కు చెందిన బీస ప్రవీణ్(29)గా గుర్తించామన్నారు. ప్రస్తుతం అతడు నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎలవాత్ గ్రామంలో ఉంటున్నారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి పట్టివేతలో కీలకపాత్ర పోషించిన ఎస్సై మొగులయ్య, సిబ్బందిని అధికారులు అభినందించారు. -
లయన్స్ కంటి ఆస్పత్రిలో ‘ఆరోగ్య శ్రీ’
బోధన్: బోధన్ లయన్స్ కంటి ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆస్పత్రి వ్యవస్థాపకులు పోలవరపు బసవేశ్వర్రావు, చైర్మన్ నర్సింహారెడ్డితో కలిసి శనివారం ఆరోగ్య శ్రీ సేవలను ప్రారంభించారు. అధునాతన వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన ఐ స్క్రీనింగ్ టెస్ట్ మొబైల్ వ్యాన్ను పరిశీలించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగుల కోసం ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ పాతికేళ్లుగా లయన్స్ కంటి ఆస్పత్రి ద్వారా నామమాత్రపు రుసుముతో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు పూర్తిస్థాయిలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు అందుబాటులోకి తెచ్చేందుకు లయన్స్ కంటి ఆస్పత్రికి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపజేసినట్లు పేర్కొన్నారు. తెల్ల రేషన్కార్డు కలిగిన వారికి ద్వారా పైసా ఖర్చు లేకుండా కంటి శస్త్రచికిత్సలు చేస్తారని వివరించారు. ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ కంటి ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, తహసీల్దార్ విఠల్, ఏసీపీ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొడాలి కిశోర్, శ్రీనివాస్రావు, ఉమేశ్ షిండే తదితరులు పాల్గొన్నారు. సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, కలెక్టర్ -
కుటుంబంలో తల్లిపాత్ర అనిర్వచనీయం
సుభాష్నగర్: కుటుంబంలో తల్లి పాత్ర అనిర్వచనీయమని, గృహిణి శ్రేయస్సే గృహం శ్రేయస్సని నిజామాబాద్ ఏసీపీ రాజావెంకటరెడ్డి అన్నారు. జిల్లాలోనే మొట్టమొదటి మహిళా మున్సిపల్ కౌన్సిలర్ మాదాసు నాగమ్మ యాదవ్ స్మారకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నగరంలోని ఎల్లమ్మగుట్ట మున్నూరుకాపు సంఘంలో శనివారం నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ సీ్త్ర వైద్య నిపుణురాలు రమాదేవి మాట్లాడుతూ.. సీ్త్ర ఆధారంగానే సమాజం నిర్మాణమవుతుందని, కుటుంబం మంచిచెడులకు ఆధారం ఆ సీ్త్ర నడవడి మాత్రమేనని, అందుకే సీ్త్రలు తమ జీవితాన్ని ఉన్నతమైన మార్గం వైపు నడిపించాలని సూచించారు. తమ పిల్లల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దిన బీడీ కార్మికులు బెల్లాల్ సావిత్రి, బొబ్బిలి ఒడ్డెమ్మ, మున్సిపల్ కార్మికురాలు లావణ్య, డ్వాక్రా పొదుపు సంఘాల సభ్యురాలు వేముల శోభ, మున్సిపల్ ఆర్పీలు మీన, నిర్మల, నీరజ, సుజాత, ధారాబాయిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ వారే దస్తగిరి, కార్యక్రమ నిర్వాహకుడు మాదాసు స్వామియాదవ్, బీజేపీ నగర మాజీ అధ్యక్షుడు యెండల సుధాకర్, బీడీ కార్మికులు, పొదుపు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
మహనీయుల వీరగాథలను స్ఫూర్తిగా తీసుకోవాలి
తెయూ(డిచ్పల్లి): విద్యార్థులు, యువత మహనీయుల వీరగాథలతో స్ఫూర్తి పొంది నవభారత నిర్మాణం చేయాలని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) కమ్యూనికేషన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ కే రాజారామ్ పిలుపునిచ్చారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ (ఏబీఆర్ఎస్ఎం) నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వర్సిటీలో రాణీ అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రాజారామ్ మాట్లాడుతూ... వ్యక్తిగత జీ వితంలోని విషాదాలను అధిగమించి మూడు దశాబ్దాలపాటు మాల్వా రాజ్యంలో అహిల్యాబాయి పరిపాలన కొనసాగించారని తెలిపారు. యుద్ధరంగంలో ఆమె చూపిన తెగువ, పాలన సంస్కరణలు తెచ్చిన విధానం, సామాజిక సమరసత కోసం చేసిన కృషి, కాశీ విశ్వనాథ్, సోమనాథ్ ఆలయాల పునరుద్ధరణలో పోషించిన పాత్రను రాజారామ్ గుర్తు చేశారు. వర్సిటీ పూర్వ విద్యార్థి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వారె దస్తగిరి మాట్లాడుతూ యు వత రాణి అహిల్యాబాయి జీవితగాథ స్ఫూర్తితో గొప్ప పనులు చేయడానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెయూ అధ్యాపకులు వాసం చంద్రశేఖర్, అకడమిక్ కన్సల్టెంట్ నర్స య్య, తెయూ ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇఫ్లూ అసోసియేట్ ప్రొఫెసర్ రాజారామ్ తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
దొంగల ముఠా అరెస్టు
ఖలీల్వాడి: ప్రైవేటు ట్రాన్స్పోర్టు కార్యాలయంలో చోరీకి పాల్పడిన దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ రాజావెంకట్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సాదక్, సురేకర్ ప్రకాశ్, సయ్యద్ షాదుల్లా, సాయినాథ్ విఠల్రావులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. ఈ ముఠా సభ్యులు గతంలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలైనట్లు తెలిపారు. ఈ నెల 5న అర్ధరాత్రి నలుగురు ముఠా సభ్యులు నాందేవ్వాడలోని సాయి బాలాజీ టాన్స్పోర్టు కార్యాలయంలో చొరబడి కౌంటర్లో దాచిన రూ.10.27లక్షలను అపహరించారని పేర్కొన్నారు. ట్రాన్స్పోర్టు యజమాని నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చేపట్టామన్నారు. శనివారం ఉదయం బైపాస్ రోడ్లో వాహనాల తనిఖీ చేపడుతుండగా అనుమానంగా సంచరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీకి పాల్పడినట్లు అంగీకరించారని ఏసీపీ వెల్లడించారు. చోరీ జరిగిన 48 గంటల్లోనే సీసీఎస్ సీఐ సురేశ్, టౌన్ సీఐ శ్రీనివాసరాజు, త్రీటౌన్ ఎస్సై హరిబాబు ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నట్లు వివరించారు. కాగా, అపహరించిన సొత్తులో నుంచి రూ.10వేలను నిందితులు జల్సాలకు వినియోగించగా, మిగతా రూ.10.17లక్షల నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై పీడీయాక్టు నమోదు కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. చోరీ కేసు చాకచక్యంగా ఛేదించిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు. రూ.10.17 లక్షల నగదు స్వాధీనం పీడీ యాక్ట్ నమోదుకు సిఫారసు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి వెల్లడి