సుభాష్నగర్ : థాయ్లాండ్ దేశంలోని రాచబురిలో మార్చి 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ 30వ థాయ్లాండ్ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా విద్యుత్ ఉద్యోగులు పతకాలు సాధించారు. 110 మీటర్ల హర్డిల్స్లో సీనియ ర్ అసిస్టెంట్ అశిలి గోపి బంగారు పతకం, ట్రిపుల్ జంప్, రిలే రన్నింగ్ పోటీల్లో 3 రజత పతకాలు, సీనియర్ అసిస్టెంట్ గుత్తికొండ రఘువీర్ హ్యామర్ త్రోలో రజతం, షాట్పుట్లో కాంస్య పతకం సాధించారు. లైన్ ఇన్స్పెక్టర్ వాగ్మారే దినేశ్ రిలే రన్నింగ్ పోటీల్లో 2 రజత పతకాలు సాధించారు. ఉద్యోగులను ఎస్ఈ రాజేశ్వర్రావు అభినందించారు.


