breaking news
Nizamabad District News
-
స్థల ఎంపికపై సందిగ్ధత!
నవీపేట: పుష్కరాల (2027) నేపథ్యంలో యంచ గోదావరి ఒడ్డున ఘాట్ నిర్మాణానికి స్థలం ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారింది. యంచలో నూతనంగా నిర్మించే పుష్కర ఘాట్కు రూ.2.15 కోట్లతోపాటు రహదారి విస్తరణకు రూ.కోటి మంజూరయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ప్రతిపాదిత స్థలాన్ని సైతం పేర్కొన్నారు. అయితే కొన్నేళ్ల కిందట ఆధ్యాత్మిక గురువు గణపతి సచ్చిధానందస్వామి ఆశ్రమ ట్రస్టు ప్రతినిధులు గోదావరి నది ఒడ్డున 6 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. తాము ఘాట్ నిర్మాణానికి భూమి ఇస్తామని, తమ స్థలంలోనే నిర్మించాలని ట్రస్ట్ బాధ్యులు ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచారు. ఓ ప్రజాప్రతినిధి కు టుంబ సభ్యులు సచ్చిదానంద స్వామి భక్తులు కావడంతో ట్రస్టు సూచించిన స్థలంలోనే ఘాట్ నిర్మించాలని ఉన్నతస్థాయిలో అధికారులు చెప్పకనేచెప్పి చేతులు ఎత్తేసినట్లు సమాచారం. అయితే గ్రామస్తు లు మాత్రం ప్రభుత్వ జీవోలో పేర్కొన్న స్థలంలోనే ఘాట్ నిర్మించాలని, వేరే చోట నిర్మిస్తే ఊరుకోబోమని అంటున్నారు. అయోమయం పుష్కర ఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరైనా స్థల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. ఇరిగేషన్, పీఆ ర్ శాఖల అధికారులు ఉమ్మడిగా సర్వే చేసి స్థలాన్ని ప్రతిపాదించారు. కానీ స్థల ఎంపికలో ఉన్నతస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకోవడంతో స్థానిక అధికారులు అయోమయంలో పడ్డారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా గ్రామస్తులతో కలిసి మంగళవారం పుష్కర ఘాట్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ ప్రకాశ్, పీఆర్ ఎస్ఈ శంకర్రాథోడ్, డీఈఈలు బలరామ్, వెంకటేశ్వర్రావు, ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ, సర్పంచ్ బేగరి సాయిలు, ఉప సర్పంచ్ ప్రవీణ్, వీడీసీ ప్రతినిధులు రాజేశ్వర్, కొట్టాల ప్రవీణ్, విజయ్, ధర్మాజీ, సాయిలు తదితరులు ఉన్నారు. యంచలో పుష్కరఘాట్ నిర్మాణ స్థలంపై తేల్చుకోని అధికారులు జీవోలో పేర్కొన్న ప్రతిపాదిత స్థలంలోనే నిర్మించాలంటున్న గ్రామస్తులు తాము భూమి ఇస్తామంటున్న గణపతి సచ్చిదానంద ఆశ్రమ నిర్వాహకులు -
గుండెపోటుతో హెడ్కానిస్టేబుల్ మృతి
ఆర్మూర్టౌన్: ఆర్మూ ర్ పట్టణానికి చెందిన తలారి తిరుపతి(60) అనే హెడ్ కానిస్టేబుల్ మంగళవారం ఉద యం గుండెపోటుతో మృతిచెందారు. పట్టణానికి చెందిన తిరుప తి రెంజల్ పీఎస్లో హెడ్ కానిస్టేబుల్గా విధు లు నిర్వహిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆర్మూర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశా రు. ఉదయం ఇంట్లో తిరుపతి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా తిరుపతి అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. -
‘సున్హరి మిట్టి’ ప్రారంభోత్సవానికి గవర్నర్కు ఆహ్వానం
సుభాష్నగర్: హైదరాబాద్లోని లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లాకు మంగళవారం జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, సెక్రెటరీ భవానీ, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురితో కలిసి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. నగరంలోని జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 25న నిర్వహిస్తున్న పసుపు మార్కెట్ అనుసంధాన కార్యక్రమం, సున్హరి మిట్టి అభియాన్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ము ఖ్యఅతిథిగా విచ్చేయాలని వారు కోరారు. కాగా అదేరోజు గవర్నర్ జిల్లా పర్యటన ఖ రారైనట్లు తెలిసింది. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నషా ముక్త్ భారత్ ప్రచా ర కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. అదేవిధంగా నగరశివారులోని పీహెచ్ఆర్ కల్యాణమండపంలో ఎంపీ అర్వింద్ జన్మదినం సందర్భంగా నిర్వహించే చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు తెలిసింది. -
గెస్ట్ ఫ్యాకల్టీల నియామకానికి 20న డెమో క్లాస్
సుభాష్నగర్: ఆర్మూర్, జక్రాన్పల్లి మండలం మునిపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గె స్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఈనెల 20న నగరశివారులోని దాస్నగర్ ఎంజేపీ కళాశాలలో డె మో క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఆర్సీవో సత్యనాథ్రె డ్డి మంగళవారం తెలిపారు. డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ 1, కామర్స్ 1, జువాలజీ 1 సబ్జెక్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతో 55 శాతం ఉత్తీర్ణతతో పాటు నెట్, సెట్, పీహెచ్డీ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. డెమోకు సంబంధిత ధ్రువపత్రాలతో మహిళా అభ్యర్థులు మాత్రమే హాజరుకావాలని తెలిపారు. మోపాల్: జిల్లాలోని బాలబాలికల గురుకుల పాఠశాల/కళాశాల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 22న స్పాట్ అడ్మిషన్, కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీసీవో విజయలలిత మంగళవారం తెలిపారు. 5 నుంచి 9వ తరగతి వరకు, ఇంట ర్ ఫస్టియర్లో బాలికలు 160 సీట్లకు, బాలురు 231 సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తా మన్నారు. 22న కంజర్ గురుకుల పాఠశాలలో బాలికలకు, ఆర్మూర్ గురుకుల పాఠశాలలో బాలురకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వ రకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు సీ ట్ల కేటాయింపు ఉంటుందన్నారు. కౌన్సెలింగ్ లో ప్రవేశ పరీక్ష రాసి ఏ పాఠశాలలో కూడా సె లెక్ట్ కానీ వాళ్లకు మొదటి ప్రాధాన్యత, పరీక్షకు దరఖాస్తు చేసుకోలేక, పరీక్ష రాయలేక సీట్లు అవసరమున్న వారికి రెండో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఏ గురుకుల పాఠశాలలో కూడా సీటు లభించని అభ్యర్థులకు మాత్రమే ఈ కౌన్సిలింగ్లో సీట్లు కేటాయిస్తామని విజయలలిత తెలిపారు. నిజామాబాద్ అర్బన్: హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో జైలు అనుభవం అనే కార్య క్రమం అందుబాటులో ఉందని జిల్లా జైలు సూపరింటెండెంట్ ఆశోక్ మంగళవారం తెలి పారు. ప్రజలకు వాస్తవిక అవగాహన కల్పించడంతోపాటు స్వేచ్ఛ విలువలను తెలియజేయ డం కోసం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఆసక్తి గల వారు జైలు అనుభవం కోసం ఫీల్ ఈవెంట్ పేజీ ద్వారా టికెట్ బుక్చేసుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన వారు అర్హులని, 12 గంటల జైలు అనుభవానికి రూ. వెయ్యి, 24 గంటల అనుభవానికి రూ.2వేలు రుసుం విధించినట్లు తెలిపారు. నిజామాబాద్ అర్బన్: వచ్చే నెలలో నియోస్ ఓపెన్స్కూల్, ఉల్లాస్కు సంబంధించిన పరీక్షలు ఉన్నందున నిరక్షరాస్యులను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని, హాజరుకాని వారిని రెండో దశలో గుర్తించి పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో అభ్యాసకుల గుర్తింపు నమోదు హాజరుపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. డీఈవో అశోక్, వయోజన విద్యాఉపసంచాలకులు పురుషోత్తం తదితరులున్నారు. సుభాష్నగర్: బీజేపీ ఓ బీసీ మోర్చా నిర్మల్ జి ల్లా ఇన్చార్జిగా నగరాని కి చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదాసు స్వా మి యాదవ్ను రాష్ట్ర అఽ ద్యక్షుడు ఆనంద్ గౌడ్ మంగళవారం నియమించారు. ఈసందర్భంగా స్వామి యాదవ్ మాట్లాడుతూ.. తనకు రాష్ట్ర నాయకత్వం అందించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, నిర్మల్ జిల్లాలో బీసీ సమాజాన్ని ఏకం చేసి వా రి హక్కుల కోసం నిరంతర కార్యక్రమాలు ని ర్వహిస్తామని తెలిపారు. బీసీ బిడ్డ నరేంద్ర మో దీ నేతృత్వంలో భారత దేశం ప్రపంచాన్నే శా సించే శక్తిగా ఎదిగిందని, ఇదే స్ఫూర్తి, ఉత్సాహంతో తాము కూడా బీసీ కులాలను ఏకంచేసి సుసంపన్న భారతదేశాన్ని నిర్మిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. నిర్మల్ జిల్లా ఇన్చార్జిగా తనకు ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యకుడు ఆనంద్ గౌడ్, రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఇందూరు యువత సేవలు అభినందనీయం
● నగర మేయర్ కూరగాయల ఉమారాణినిజామాబాద్ రూరల్: సమాజ సేవ కోసం కృషి చే స్తున్న ఇందూరు యువత సేవలు అభినందనీయ మని మేయర్ ఉమారాణి అన్నారు. నగరంలోని రా జీవ్ గాంధీ ఆడిటోరియంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సేవాస్ఫూర్తి అవార్డ్స్–2026 కార్యక్రమం నిర్వహించారు. మేయర్ ఉమారాణి, నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బీ ప్రకాశ్ జ్యోతి ప్రజ్వల న చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ.. తమ కోసం కాకుండా సమాజం కో సం జీవించే సేవామూర్తులను గుర్తించి గౌరవించ డం ఎంతో గొప్ప విషయమని అన్నారు. సేవ అనే ది కేవలం ఒక కార్యక్రమం కాదని, సమాజంపై ఉ న్న మన బాధ్యత అని అన్నారు. ఏసీపీ ప్రకాశ్ మా ట్లాడుతూ.. యువతలో సేవాభావం, సామాజిక బాధ్యత మరింత బలపడితే సమాజంలో ఎన్నో సా నుకూల మార్పులు సాధ్యమవుతాయని అన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థా పక అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే త మ సంస్థ లక్ష్యమని తెలిపారు. 30 మందికి సేవా మూర్తులకు అవార్డులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించా యి. కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్, మద్ది గంగాధర్, రచర్ల రాజేశ్, శర్మ,కొండా, నాగేందర్, సుజాత, దారం గంగాధర్, పుష్పవతి, సుధాకర్, సంస్థ సభ్యులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
పిచ్చికుక్క స్వైర విహారం
నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండల కేంద్రంలో ఓ పిచ్చికుక్క మంగళవారం స్వైరవిహారం చేసింది. వేకువజామున ఇంటి వాకిలిని శుభ్రం చేస్తున్న వృద్ధురాలు సక్కుబాయిపై దాడి చేసింది. తలకు, ముఖానికి బలమైన గాయలయ్యాయి. అలాగే మధ్యాహ్నం వేళ రాంమందిర్ కాలనీలో మరో ఇద్దరిపై, పశువులపై సైతం పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చింది. గాయపడ్డ వారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. బోధన్రూరల్: మండలంలోని కొప్పర్గ గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. దాడిలో 13 మందిని అరెస్టు చేయగా వారి నుంచి రూ.44,330 నగదు, 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మోపాల్: మండల శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ను దుండగులు ధ్వంసం చేసి కాపర్ వైర్ను మంగళవారం ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పంచనామ చేశారు. లైన్ ఇన్స్పెక్టర్ నజీరుద్దీన్, లైన్మన్ మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు క్షమించరాని నేరం
● బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ● కలెక్టర్ భవేష్ మిశ్రా నిజామాబాద్ అర్బన్: పుట్టబోయేది ఆడ శిశువు అని నిర్ధారణ చేసి, గర్భవిచ్చిత్తికి పాల్పడడం క్షమించరాని నేరమని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంట ర్లపై ఉక్కుపాదం మోపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం గర్భస్థపూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లాస్థాయి సలహా సంఘ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కమిటీ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసంతప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడ కూడా లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు జరుగకుండా గట్టి నిఘా పెట్టాలన్నారు. పక్కాగా నిబంధనలు పాటించే స్కానింగ్ కేంద్రాలకే లైసెన్సులు రెన్యూవల్ చేయాలని ఆదేశించారు. పిసిపి ఎన్డిటి, ఎంటిపీ చట్టాలను ఉల్లంఘించడం వల్ల సమాజంలో సీ్త్ర, పురుషుల నిష్పత్తి గణనీయంగా తగ్గిపోతున్నదన్నారు. పుట్టబోయే శిశువు ఆడ, మగ ఎవరైనా సరే, అందరూ సమానమే అని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూ ర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఎంహెచ్వో రాజశ్రీ, కమిటీ సభ్యులు సిద్దయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ భవిష్యత్ ఏమిటీ?
ఖలీల్వాడి : పాలిటెక్నిక్ విద్య బలోపేతం కోసమే శక్తి (స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనీషియేటివ్స్) విభాగంలో కలుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. విద్యార్థి సంఘాలు మాత్రం ప్రభుత్వం ప్రయివేటీకరణకు యత్నిస్తుందని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పాలిటెక్నిక్ విద్య భవిష్యత్ ఏమిటనే చర్చ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో 5 ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యాసంస్థలున్నా యి. ఇందులో 1,440 మంది విద్యార్థులు ఏటా పా లిటెక్నిక్ కోర్సుల్లో చేరుతున్నారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో నేరుగా (లేటరల్ ఎంట్రీ) ఆడ్మిషన్ తీసుకునే వె సులుబాటు ఉంది. పాలిటెక్నిక్ కోర్సుల ఫీజులను ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి (ఎస్ఆర్) ఖరారు చేస్తుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ ఇండియా యూనివర్సిటీ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తుంది. విద్యాశాఖ నుంచి విడిపోతే స్కిల్ యూనివర్సిటీ పాలక మండలికి ఫీజులు నిర్ణయించే అవకాశం ఉంటుంది. విద్యార్థి సంఘాల నిరసన.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘా లు కొన్నిరోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఫీజులను పెంచితే సామాన్య విద్యార్థుల కు సాంకేతిక విద్య అందని ద్రాక్షలా మారే ప్రమా దం ఉంటుందని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభు త్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరిట పాలిటెక్నిక్ విద్యను ప్రయివేటీకరణ చేస్తున్నారు. దీనికి తీసుకువచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలి. లేకుంటే విద్యార్థులు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తాం. శక్తిని రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలి. –రఘురామ్ నాయక్, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఏఐఎస్ఎఫ్ పాలిటెక్నిక్ కాలేజీలను ప్ర యివేటీకరణ చేయడానికి శక్తీ స్కీమ్ తీసుకువచ్చింది. దీంతో ఫీజులు పెరిగి పేద, మధ్య తరగతి, సామాన్య విద్యార్థులకు భారంగా మా రుతుంది. ప్రయివేట్కు కేటాయిస్తే రూ. కోట్లు విలు వ చేసే ప్రభుత్వ ఆస్తులు ధారదత్తం చేయాల్సి వ స్తుంది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలి. –కైరి శశిధర్, కన్వీనర్, ఇందూర్ విభాగ్, ఏబీవీపీ ‘శక్తి’లో కళాశాలల విలీనానికి సర్కారు చర్యలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు ప్రయివేటీకరణ ప్రయత్నమేనని ఆరోపణ -
జైలులో పరీక్ష కేంద్రం
నిజామాబాద్అర్బన్ : నేరస్తులను శిక్షించడమే కా కుండా వారిలో పరివర్తన తెచ్చి, సమాజంలో బా ధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి జైళ్ల శాఖ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తోంది. తా ము చేసిన తప్పును తెలుసుకున్న ఖైదీలకు అక్షరజ్ఞానాన్ని ప్రసాదించింది. నేరం వెనుక ఉన్న గతాన్ని పక్కనపెట్టి, విద్యాబుద్ధులతో భవిష్యత్తు వైపు అ డుగులు వేసేందుకు కల్పించిన అవకాశాన్ని సద్విని యోగం చేసుకొని నిజామాబాద్ కేంద్ర కారాగారానికి చెందిన ఖైదీలు ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 15 మంది ఖైదీలు అద్భుత విజయం సాధించారు. ప్రత్యేకంగా టీచర్ల నియామకం జిల్లా జైలులో ఓపెన్ ఎస్సెస్సీ చదువుతున్న ఖైదీల కోసం ప్రత్యేకంగా టీచర్లను నియమించి పాఠాల బోధన చేపట్టారు. గతేడాది మేలో ఎన్ఐవోఎస్ ద్వా రా తరగతులు ప్రారంభమయ్యాయి. టీచర్లు నాగరాజు, గంగాధర్, సరిత, శివకుమార్ జైలులోనే ప్ర త్యేక బోధన చేశారు. తెలుగు, ఇంగ్లిష్, డేటా ఎంట్రీ, పెయింటింగ్, హోమ్ సైన్స్ సబ్జెక్టుల్లో శిక్షణ ఇ చ్చారు. డేటా ఎంట్రీ, పెయింటింగ్ వంటి వృత్తి వి ద్యా కోర్సులతో ఖైదీలు విడుదలయ్యాక సమాజంలో సొంతంగా ఉపాధి పొంది గౌరవంగా జీవించే అవకాశం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించేందుకు ఆ శాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా దూరవిద్యా విధానం(ఎన్ఐవోఎస్) ప్రవేశపెట్టింది. దీంతో నిజామాబాద్ జై లు నుంచి మొత్తం 16 మంది ఖైదీలు ఓపెన్ ఎ స్సెస్సీ చదివారు. అందులో 15 మంది ఉత్తీర్ణులు కాగా, ముగ్గురు ఖైదీలు కరీంనగర్ నుంచి కేవలం పదో తరగతి విద్యను అభ్యసించేందుకు జిల్లా జైలుకు రావడం గమనార్హం. అయితే, సాధారణంగా ఖైదీలు విద్యను అభ్యసించినప్పటికీ పరీక్షలు రాసే సమయంలో ఎదురయ్యే భద్రతా కారణాలు, రవాణా ఇబ్బందులు వారి చదువుకు ఆటంకంగా మారేవి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, పరీక్షలు రాసేందుకు బయటికి వెళ్లే అవసరం లేకుండా జైలు ఆవరణలోనే ప్రత్యేక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. -
ఆర్టీసీలో శ్రమదోపిడీ!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ 1961 ప్రకారం రవాణా రంగంలో కార్మికులు రోజుకు 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది. వారానికి మొత్తంగా 54 పనిగంటలు దాటొ ద్దని చట్టాలు చెబుతున్నాయి. కానీ ఆర్టీసీలో ఈ చట్టాలు యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతున్నాయి. యాజమాన్యం కార్మికులతో రోజుకు 12 గంటల నుంచి 16 గంటలు పనిచేయిస్తోంది. దీంతో కార్మికులు తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రధానంగా డ్రైవర్లు వెన్ను సమస్యలతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పోనీ అదనంగా చేసిన పనికి నిబంధనల ప్రకారం స్పెషల్ ఆఫ్లు ఇస్తున్నారా అంటే అదీ లేదు.. ఓవర్ టైం డ్యూటీలుగా పరిగణిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. పెరిగిన రద్దీతో ఇబ్బంది.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆరు డిపోల పరిధిలో మొత్తం షెడ్యూల్స్ 6 వందలపైచిలుకు ఉన్నాయి. ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి ఈ షెడ్యూల్ ప్రకారం తిరుగుతాయి. రాజధాని బస్సులు 25, లహరీ బస్సులు 8, సూపర్ లగ్జరీ బస్సులు 88, డీలక్స్ బస్సులు 59, ఎక్స్ప్రెస్లు 194, పల్లెవెలుగు బస్సులు 290 తిరుగుతున్నాయి. వాస్తవంగా యాజమాన్యం రూట్ సర్వే చేసి షెడ్యూల్ నిర్ణయించాలి. దీనికి ఆయా రూట్లలో రోడ్ల పరిస్థితి, ప్రయాణికుల రద్దీని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చాక బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఓవైపు రోడ్డు సరిగా లేక.. మరోవైపు బస్సు నిండా ప్రయాణికులతో అడుగడుగునా ఆపాల్సిన పరిస్థితుల్లో నిర్ణయించిన సమయం సరిపోవడం లేదు. జేబీఎస్కు వెళ్లే బస్సులు ట్రాఫిక్ సమస్యతో నిర్ణీత సమయంలో చేరుకునే పరిస్థితి ఉండడం లేదు. దీంతో రెస్ట్ లేకుండా పనిచేస్తున్న కార్మికులు తీవ్ర అలసటకు గురవుతున్నారు. అదనపు పనికి ఇచ్చేది అరకొరే... ఆర్టీసీలో రోజుకు ఎనిమిది గంటల డ్యూటీ అన్నది పేరుకు మాత్రమే.. ప్రతి కార్మికుడు 12 గంటల నుంచి 16 గంటల వరకు పని చేస్తున్నారు. విరామం లేకుండా అదనంగా 4 గంటలు పనిచేసినపుడు స్పెషల్ ఆఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాటిని ఓవర్ టైం డ్యూటీలుగా మార్చి (సింగిల్కు) శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. కార్మికుల నిజ వేతనాలు సరాసరిగా రోజుకు రూ.1,500 నుంచి రూ.3 వేల వరకు ఉండగా.. నిబంధనల ప్రకారం డబుల్ డ్యూటీ చేసిన డ్రైవర్, కండక్టర్లకు రెట్టింపు వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రూ.3 వేల నుంచి రూ.6 వేల దాకా చెల్లించాలి. కానీ కండక్టర్కు రూ.710, డ్రైవర్కు రూ.వెయ్యి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అడ్డా కూలీ ఉదయం 9 గంటలకు పనికి వెళ్లి సాయంత్రం 5 గంటలకు తిరిగి వెళతాడని, మధ్యలో తినడానికి, బీడీకాడీకి, కాలకృత్యాలంటూ కనీసం గంంట సమయం ఖాళీగా ఉంటారని, తమకు మాత్రం ఆ అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక్కడ వింత లెక్కలు.. కార్మికుడు యజమాని ఆధీనంలో ఉన్న కాలా న్ని పనిగంటలుగా లెక్కిస్తారు. కానీ ఆర్టీసీలో మాత్రం డ్రైవర్ సీటు మీద కూర్చున్న కాలాన్నే (స్టీరింగ్ అవర్స్) పరిగణనలోకి తీసుకుని మి గతా సమయాన్ని రెస్ట్గా (డ్యూటీ నుంచి మినహాయించి) చూపుతున్నారు. ట్రిప్పు, ట్రిప్పున కు మధ్య ఇచ్చే విరామ సమయాన్ని డ్యూటీ కింద లెక్కించడం లేదు. స్టీరింగ్ అవర్స్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న యాజమాన్యం విరామ సమయాన్ని డ్యూటీ కింద లెక్కించని సంస్థ అదనపు పనికి స్పెషల్ ఆఫ్ల స్థానంలో ఓటీ డ్యూటీలు.. పనిచేయని కార్మిక నిబంధనలు అడ్డాకూలీలే నయమంటున్న కార్మికులు కామారెడ్డి నుంచి బాన్సువాడకు నడిచే ఆర్డినరీ బస్సు మూడు ట్రిప్పులు చేయాల్సి ఉంటుంది. ఒక్కో ట్రిప్పునకు తక్కువలో తక్కువ 4 గంటల సమయం పడుతుంది. కానీ ఆర్టీసీ అధికారులు 3.30 గంటలకు కుదించారు. ఒక్కో ట్రిప్పునకు గంట చొప్పున రెస్ట్ పేరుతో సమయం ఇచ్చి 15 గంటల పాటు తమ ఆధీనంలో ఉంచుకుని పని చేయించుకుంటారు. 15 గంటలు డ్యూటీలోనే ఉన్నప్పటికీ ఓవర్ టైం మాత్రం 3 గంటలు ఇస్తున్నారు. ఓటీ, టిమ్లతో పనిభారం.. ఖర్చు తగ్గించుకునే లక్ష్యంతో యాజమాన్యం సి బ్బందిని తగ్గిస్తూ వస్తోంది. దీంతో ఉన్న కార్మికులపైనే పనిభారం పడుతోంది. సింగిల్ క్రూ (ఓటీ) డ్యూటీలు, టిమ్ డ్యూటీలతో కార్మికు లు ఎక్కువ శ్రమకోర్చాల్సి వస్తోంది. రీజియన్లో సింగిల్ క్రూ (ఓటీ) డ్యూటీలు 2 వందల పైచిలుకు ఉండగా, టిమ్ డ్యూటీలు 140 వరకు ఉ న్నాయి. టిమ్ సర్వీసుల్లో డ్రైవరే టికెట్టు ఇవ్వా ల్సి ఉంటుంది. ప్రయాణికులు చేయి ఎత్తితే బస్సు ఆపడం, వాళ్ల టికెట్టు తీసుకోవడం ద్వారా సమయం వృథా అవుతోంది. నిర్ణీత సమయానికి గమ్యస్థానం చేరడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే సింగల్ క్రూ డ్యూటీలతో అలసిపోతున్నారు. -
ఖైదీల అక్షరవిజయం
నిజామాబాద్● మరో ఖైదీ 5 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతను ఐదో తరగతి వరకే చదివాడు. జైల్లో ఇటీవల దూరవిద్యా విధానం అందుబాటులోకి రావడంతో 10వ తరగతి చదివి ఉత్తీర్ణుడయ్యాడు. ● జిల్లాకు చెందిన వ్యక్తికి ఓ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. తను కేవలం నాలుగో తరగతి వరకే చదివాడు. జైలులో దూరవిద్య అందుబాటులోకి రావడంతో 10 వ తరగతి చదివి ఇటీవల ఉత్తీర్ణత సాధించాడు. జల్సాల కోసం.. వ్యసనాల కోసం బైక్ చోరీలకు పాల్పడు తున్న ఇద్దరు వ్యక్తులను మద్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 8లో uజైలులో పరీక్షలు రాస్తున్న ఖైదీలు (ఫైల్) జీవితంలో పరివర్తన ఎంతో అవసరం. తెలిసోతెలియకో చేసిన నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సమయాన్ని వృథా చేయకుండా అక్షరాలు దిద్దుతున్నారు. చదువుతో పరివర్తన సాధ్యమని అవగాహన కల్పిస్తూ ఖైదీలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు జైలు అధికారులు. జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న 15 మంది ఎస్సెస్సీలో ఉత్తీర్ణత సాధించారు. చదువుకునే అవకాశం కల్పించిన జైళ్ల శాఖ విడుదలయ్యాక గౌరవప్రదంగా జీవించేలా కృషి ఓపెన్ ఎస్సెస్సీలో 15 మంది ఉత్తీర్ణత -
జల్సాల కోసం బైక్ల చోరీ
● మద్నూర్లో ఇద్దరు నిందితుల అరెస్ట్మద్నూర్ : వ్యసనాలకు బానిసైన ఇద్దరు వ్యక్తులు బైక్ దొంగలుగా మారారు. మద్నూర్ శివారులో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. నిందితుల వివరాలను ఎస్సై మోహన్రెడ్డి మంగళవారం స్థానిక పీఎస్లో వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన జాదవ్ అజయ్, షేక్ అయాన్ జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడుతున్నారు. మహారాష్ట్రలో వీరిపై కేసులు ఉండటంతో తెలంగాణలోని మద్నూర్, డోంగ్లి మండలాల్లో బైక్ చోరీలు చేద్దామని ఇక్కడకు వచ్చారు. వీరు గత నెల 28న డోంగ్లి మండల కేంద్రంలో, మద్నూర్ మండలంలోని హండేకెల్లూర్లో రెండు బైక్లను దొంగిలించారు. వీటిని పిట్లం, బిచ్కుంద ప్రాంతాల్లో విక్రయిద్దామని తీసుకెళ్తుండగా మద్నూర్ శివారులో పోలీసులు గమనించి పట్టుకున్నారు. విచారణలో నిందితులు చేసిన నేరాలను ఒప్పుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోలీసు సిబ్బంది విఠల్, శ్రావణ్, సంతోష్ ఉన్నారు. -
ఏపీపీ రహీమొద్దీన్ బదిలీ
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ మొదటి అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ఏపీపీగా ఉ న్న మహ్మద్ రహీమొద్దీన్ను ఎల్బీ నగర్ మెజిస్ట్రేట్ కో ర్టుకు బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్ సాంబశివరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశా రు. ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బి చ్కుందలో 2015 సంవత్సరంలో మొదటిసారిగా ఏ పీపీగా చేరాడు. 2022లో నిజామాబాద్కు బదిలీపై వచ్చి ఏపీపీగా విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో పదోన్నతి పొందాల్సి ఉండగా ఆయనను ఎల్బీ నగర్ కోర్టుకు బదిలీ చేశారు. రహీమొద్దీన్ మరో ఏపీపీ రాహూల్ కు బాధ్యతలు అప్పగించి రిలీవ్ కానున్నారు. నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టంవేల్పూర్: ఎస్సారెస్పీలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో నాలుగైదు రోజులుగా ప్రాజెక్టులో నీటిమట్టం నిలకడగా ఉంటోంది. కొద్దిరోజులుగా 1013 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, అంతేమొత్తంలో అవుట్ఫ్లో వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 43.967 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా 330 క్యూసెక్కులు, మిషన్ భగీరథ పథకానికి 231 క్యూసెక్కులు వెళుతుండగా, ఆవిరి రూపంలో 482 క్యూసెక్కులు కలిపి మొత్తం 1013 క్యూసెక్కులు అవుట్ఫ్లో వెళుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
‘ఖేలో ఇండియాలో యోగా సిలబస్ మార్చాలి’
నిజామాబాద్ రూరల్ : ఖేలో ఇండియా యోగా పోటీల సిలబస్ను మార్చాలని తెలంగాణ యోగా అసోసియేషన్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి మంగళవారం హైదరాబాద్లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని తన నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. భారతీయ సంస్కృతికి ప్రతీకై న యోగాలో దేశంలో 1974 నుంచి యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీలు నిర్వహిస్తోందని తెలిపారు. యోగాకు సంబంధం లేని కొంతమంది దొడ్డి దారిన యోగాసనా భారత్ సరైనదంటూ ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్లియేషన్ పొందినట్లు చెప్పారు. ప్రాచీన యోగాను పక్కనపెట్టి తమకు అనుకూలమైన సిలబస్ యోగాసనా భారత్ చేసిన సిఫారసు మేరకు ఇన్నాళ్లు పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న సిలబస్ తో కూడిన యోగా పోటీలను ఖేలో ఇండియాలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సిలబస్ తో పాటు అప్లియేషన్ విషయాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖతో మాట్లాడతానని కేంద్రమంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చినట్లు సిద్ధారెడ్డి పేర్కొన్నారు. -
పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ
● ఎంపిక కోసం ఈనెల 23న ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిజామాబాద్ అర్బన్: పోలీసుశాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఈనెల 23వ తేదీన ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆబ్జెక్టివ్ విధానంలో టెస్ట్ ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తుఫారాలను ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసు కోవాలని, నిజామాబాద్ డివిజన్ పరిధిలోని వారికి విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కాలేజీలో, ఆర్మూర్ డివిజన్ వారికి క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజీలో, బోధన్ డివిజన్ వారికి ప్రభుత్వ జూనియర్ ఇంటర్, డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. -
పెద్దపులి బతికే ఉందా?
డొంకేశ్వర్(ఆర్మూర్): కమ్మర్పల్లి అడవుల్లో కనిపించకుండా పోయిన పెద్దపులి ఇంతకు బతికే ఉందా? నాలుగు నెలలుగా అటవీ శాఖ అధికారులు ఈ ప్ర శ్నకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. పులి బతికే ఉందని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేకపోవడం, ఉన్నట్టుండి అధికారులు మౌ నం పాటిస్తుండడం వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందనే అనుమానాలు పెరుగుతున్నాయి. పెద్దపులి సె ర్చ్ ఆపరేషన్లో చిరుతలను హతమార్చిన ఉదంతం వెలుగుచూడగా, పులి విషయాన్ని తేల్చకుండా అధికారులు వెనక్కి తగ్గడం అంతుచిక్కని రహస్యంగా మారింది. బలమైన క్లూ దొరికినప్పటికీ ఎవరో చేస్తున్న ఒత్తిళ్లతో ముందుకు వెళ్లలేకపోతున్నారని తెలుస్తోంది. మార్చిలో వచ్చి... ఏప్రిల్లో మాయం! జే–1గా పిలువబడే పెద్దపులి మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల మీదుగా నిజామాబాద్ జిల్లాలో సంచరించింది. ఈ ఏడాది మార్చిలో కమ్మర్పల్లి అడవుల్లోకి వచ్చింది. పులి కదలికలు ట్రాప్ కెమెరాలో రికార్డయ్యాయి. గట్టుపొడిచిన వాగువద్ద దట్టమైన అడవికి తోడు నీటి వనరులు ఉండడంతో ఆ ప్రాంతంలోనే తిరిగింది. భీమ్గల్ ప్రాంతంలో రెండు అవులపై దాడిచేసి హతమార్చింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్లో దమ్మాయిపేట్ అటవీ ప్రాంతో కూడా ఒక ఆవును చంపింది. ఏప్రిల్లో మరోసారి జిల్లాలోకి వచ్చిన పెద్దపులి కమ్మర్పల్లి అడవుల్లోనే తిరిగి జాడలేకుండా పోయింది. పులి జాడను కనిపెట్టేందుకు నాలుగు జిల్లాల సరిహద్దుల్లో అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను రప్పించారు. డ్రోన్లు తెప్పించారు. ట్రాప్ కెమెరాలు పెట్టినా పులి ఆనవాళ్లు చిక్కలేదు. నేలపై ఎక్కడా దాని పాదముద్రలు కనిపించలేదు. అయితే స్థానిక అటవీ అధికారులు వేటగాళ్లపై నిఘా సారించి పులి సంరక్షణకు చర్యలు చేపట్టకపోవడంతేనే ఈ పరిస్థి తి వచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పులి వేటగాళ్ల చేతికి చిక్కిందా అనే అనుమానంతో మే నెలలో కోనాపూర్ సెక్షన్ సమీప గ్రామాల్లోని పలు వురి ఇళ్లలో పోలీసుల సహాయంతో తనిఖీలు నిర్వహించారు. కథ ఇంతవరకు బాగానే నడించింది. పెద్దపులి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా.. వేట గాళ్లు చిరుతలను హతమార్చిన ఘటనలు వెలుగుచూశాయి. విచారణ చేపట్టిన సీసీఎస్ పోలీసులకు కారేపల్లి అడవుల్లో పాతిపెట్టిన చిరుత కళేబరం, అలాగే ఇందల్వాయి రేంజ్ ధర్పల్లి శివారులోని ఓ వ్యవసాయ బావిలో చిరుత చర్మంతోపాటు నిందితుల వద్ద దాని గోళ్లు లభించాయి. వేటగాళ్లను జై లుకు తరలించారు. అయితే పెద్దపులి కనిపించకుండా పోవడం వెనుక శాఖలోని ఓ ఉద్యోగి పాత్ర ఉందనే అనుమానంతో ఇటీవల ఉన్నతాధికారులు వి చారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విచారణ కొనసాగుతున్న తరుణంలోనే అధికారులు సైలెంట్ అయిపోయారనే చర్చ సర్వత్రాసాగుతోంది. జే–1 జాడ లేకపోవడంపై పెరుగుతున్న అనుమానాలు! డ్రోన్లు తిరిగినా, ఆపరేషన్లు చేసినా లభించని ఆధారాలు సవాల్గా తీసుకున్న అధికారులు ఉన్నట్టుండి ఎందుకు ఆగిపోయారు? ఒత్తిళ్లతో అసలు కథను తొక్కి పెడుతున్నారా? అటవీ అధికారుల మౌనం వెనుక ఎన్నో సందేహాలు -
సేవా కార్యక్రమాలతో సామాజిక బాధ్యత పెరుగుతుంది
డిచ్పల్లి : సేవా కార్యక్రమాల ద్వారా మానవత్వం, సామాజిక బాధ్యత పెంపొందుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్ (డిచ్పల్లి) బి– కంపెనీ అధికారులు పేర్కొన్నారు. బి– కంపెనీ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతాసదన్ను సందర్శించారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పండ్లు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీ కంపెనీ అధికారులు మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన వారికి చేయూతనందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అధికారులు మనోహర్, శ్రీనివాస్, ప్రమోద్ కుమార్, సిబ్బంది, ఎంఈవో నరేష్, మానవతాసదన్ లైజనింగ్ అధికారి సుధాకర్రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మీ ఓటు భద్రమేనా..?
ఎల్లారెడ్డి: ఓటరు జాబితాలో తమ పేరు ఉందా.. ఓటరు వివరాలు సక్రమంగా ఉన్నాయా.. తమ పేరుతో వేరొకరు ఓటు నమోదు చేసుకున్నారా.. అనే సందేహాలు ఉంటే ఓటర్లు సులభంగా తెలుసుకోవచ్చు. ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన ఆన్లైన్ పోర్టల్, మొబైల్ యాప్, బీఎల్వో ద్వారా ఓటు వివరాలను పరిశీలించుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా... ● ఎన్నికల సంఘం అధికారిక ఓటర్ సర్వీస్ పోర్టల్(voters.eci.gov.in)ఓపెన్ చేయాలి. ● సెర్చ్ ఇన్ ఎలెక్టరల్ రోల్ పై ఆప్షన్పై క్లిక్ చేయాలి. ● ఇక్కడ మూడు పద్ధతులలో ఓటును చెక్ చేసుకోవచ్చు. ● ఓటర్ కార్డు నంబర్, రాష్ట్రం పేరు ఎంటర్ చేసి చెక్ చేయాలి. ● మీ పేరు, తండ్రి పేరు, వయస్సు, నియోజకవర్గం వివరాలతో కూడా చెక్ చేయొచ్చు. ● మీ ఓటర్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ ను అందులో నమోదు చేయాలి. ఓటీపీ వచ్చాక ఓటరు వివరాలు వస్తాయి. ● జాబితాలో మీ పేరు కనిపిస్తే మీ ఓటు భద్రంగా ఉన్నట్లే. ● గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ● యాప్ ఓపెన్ చేసి సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలెక్టరల్ రోల్ పై క్లిక్ చేయాలి. ● మీ ఓటర్ కార్డుపై ఉండే బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ ఓటు స్టేటస్ తెలుసుకోవచ్చు. మీ పోలింగ్ కేంద్రం పరిధిలోని బూత్ స్థాయి అధికారి (బీఎల్వో) ని సంప్రదించాలి. ఈ నెల 17న విడుదల చేసిన కొత్త ముసాయిదా జాబి తాలో మీ పేరు ఉందో లేదో సరి చూసుకోవచ్చు. అలాగే ఇదివరకు అందించిన ఎనుమ్యరైషన్ ఫారాలలో తప్పులు ఉంటే సవరణకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఓటర్ల జాబితాలో తమ పేరు లేకున్నా, ఏ మైనా సవరణలు ఉన్నా సెప్టెంబర్ 16 వరకు తమ దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందించాలి. ఈ నెల 22, 23, 29, 30వ తేదీ ల్లో మీ ఊరి పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్వోలు అందుబాటులో ఉంటారు. నేరుగా వెళ్లి సవరణల ఫారాలు అందించవచ్చు. 2026 అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల అవుతుందని అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేకపోయినా, ఏవైనా సవరణలు ఉన్నా సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజలు ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతులలో తెలుసుకోవచ్చు. తుది ఓటరు జాబితా వరకు సవరణలకు అవకాశం ఉంటుంది. – ప్రభాకర్, ఆర్టీవో, ఎల్లారెడ్డి మూడు మార్గాల్లో ఓటరు వివరాల పరిశీలన సవరణలకు సెప్టెంబర్ 16 వరకు గడువు -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్–గుండారం రోడ్డుపై బైక్ను టిప్పర్ ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందాడు. రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా.. ఖానాపూర్లోని భాగ్యనగర్ కాలనీకి చెందిన అలండి అనిల్(38) సోమవారం బైక్పై గుండారం నుంచి ఖానాపూర్కు బయలుదేరారు. మార్గమధ్యలో అతడి బైక్ను ఎదురుగా వస్తున్న టిప్పర్ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ ఢీకొట్టాడు. ఈ ఘటనలో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్హెచ్వో తెలిపారు. బాన్సువాడలో మరొకరు.. బాన్సువాడ: పట్టణంలోని కొయ్యగుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ గ్రామానికి చెందిన సుభాష్గౌడ్ (32) నాగుల పంచమి సందర్బంగా కొములంచ గ్రామంలోని తన సోదరి ఇంటికి వచ్చాడు. అతడు సోమవారం రాత్రి బైక్పై తిరిగి సొంతూరికి బయలుదేరాడు. కొయ్యగుట్ట సమీపంలో అతడి బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షించాలి
● డీఎంహెచ్వో రాజశ్రీ ● నగరంలో రాష్ట్రీయ బాలస్వాస్థ్య ఆరోగ్య కార్యక్రమంపై సమీక్ష సుభాష్నగర్: జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మొబైల్ హెల్త్ టీమ్లు ఆరునెలలకోసారి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షించాలని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. రాష్ట్రీయ బాలస్వాస్థ్య ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేయాల న్నారు. నగరంలోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం రాష్ట్రీయ బాలస్వాస్థ్య ఆరోగ్య కార్యక్రమంపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. మొ బైల్ హెల్త్ టీమ్లో ఉన్న సభ్యులందరికీ వైద్యాధికారి టీమ్ లీడర్గా వ్యవహరించాలన్నారు. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను జీజీహెచ్లోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వేన్షన్ సెంటర్కు రిఫర్ చేయాలన్నారు. వి ద్యార్థులను ఏఎన్ఎంలు, ఆశాలు, పీహెచ్సీ వై ద్యా ధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఏ వ్యాధితో ఏ విద్యార్థి బాధపడుతున్నారో రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. అనుమానిత క్యాన్స ర్ కేసులను క్యాన్సర్ కేర్ సెంటర్కు రిఫర్ చేయా లని తెలిపారు. విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడితే వారిని గుర్తించి డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ఆఫీసర్కు, 14416 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారమివ్వాలని సూచించారు. ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వోలు సికందర్ నాయక్, విద్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో నిరసనల హోరు
● వేర్వేరు డిమాండ్లపై రాజకీయ, విద్యార్థిసంఘాల ఆందోళనలు ● ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు వందేమాతర గీతాన్ని అవమానించారంటూ.. సుభాష్నగర్: నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట సోమవారం బీజేవైఎం నాయకులు వందేమాతర గీతాలాపన చేసి నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వందేమాతర గీతాన్ని పాడకుండా అడ్డుకోవడం సి గ్గుచేటన్నారు. ఇందుకు నిరసనగా బీజేవైఎం పిలుపుమేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బీజేవైఎం నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేసి 1వ పోలీస్స్టేషన్కు తరలించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రత్నగారి వంశీగౌడ్ కార్పొరేటర్లు, నాయకులు ఎర్రం సుధీర్, చిరంజీవి, శశాంక్, శ్రావణ్, బీజేవైఎం నాయకులు విపుల్, ప్రశాంత్, రాజశేఖర్, మహేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్లను విడుదల చేయాలంటూ.. ఖలీల్వాడి: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల ను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ నా యకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు ర్యాలీ గా వెళ్లి, జిల్లాకేంద్రంలోని మహాలక్ష్మి కాలనీలోగల పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్గౌడ్ ఇంటిని ముట్టడించారు. పీసీసీ చీఫ్ ఇంటికి పీడీఎస్ యూ నేతలు ర్యాలీగా వెళ్లారు. పెండింగ్ లో ఉన్న స్కాల ర్షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చే యాలన్నారు. నాలగవ టౌన్ పోలీసులకు సమాచారంతో వెంటనే పీసీసీ ఛీప్ ఇంటికి వెళ్లిన పీడీఎస్ యూ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పీడీఎస్ యూ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ ఉన్న విద్యార్థులను పోలీసులు చేదరగొట్టారు. ‘కల్యాణలక్ష్మి’ పునరుద్ధరించాలంటూ.. నిజామాబాద్ అర్బన్: కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలంటూ బీఆర్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు ఎన్టీఆర్ చౌరస్తాలో ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా నగర అధ్యక్షుడు సిర్ప రాజు మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందు కు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించా రు. మాజీ మేయర్ దండు నీతుకిరణ్ శేఖర్, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, సత్య ప్రకాష్, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ మతీన్, జగత్రెడ్డి పాల్గొన్నారు. -
సక్రమంగా నడిస్తేనే సత్ఫలితాలు
● ఈ నెల 19 నుంచి 29 వరకు కాంప్లెక్స్ సమావేశాలు ● మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖసిరికొండ: పాఠశాల సముదాయ సమావేశాలు సక్రమంగా జరిగితేనే విద్యారంగంలో సత్ఫలితాలు వస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు. ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధి, బోధన అనుభవాలు పంచుకోవడం, మెరుగైన పని తీరు కోసం ప్రతి విద్యాసంవత్సరంలో ఆరు నుంచి ఏడుసార్లు పాఠశాల సముదాయ సమావేశాలు జరుగుతాయి. ఈ విద్యా సంవత్సరం విద్యా శాఖ ముందుగానే ఎజెండా అంశాలను విడుదల చేసింది. పా ఠశాల పనితీరు నివేదిక(పీజీఐ), విద్యార్థుల ప్రొగ్రె స్ కార్డులు(హెచ్పీసీ), ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) ప్రధాన అంశాలుగా ఈనెల 19 నుంచి 29 వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 33 మండలాల పరిధిలో 81 కాంప్లెక్స్ సముదాయ పాఠశాలల పరిధిలో సమావేశాలు కొనసాగనున్నాయి. 19, 20 తేదీల్లో ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి స మావేశాలు, 25, 27, 29 తేదీల్లో సబ్జెక్టు పరంగా కాంప్లెక్స్ సమా వేశాలు జరుగుతాయి. చిన్నబడుల్లో నిర్వహించేవారేరి? ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్ సమావేశాలు తమ పరిధిలో ఉన్న కాంప్లెక్స్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు నిర్వహిస్తారు. అయితే ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించే కార్యక్ర మాలైన ఎఫ్ఎల్ఎన్, రెమిడియేషన్పై వీరికి సరైన అవగాహన లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రస్థాయిలో ఇటీవల ఒక్కరోజు మాత్రమే శిక్షణ ఇవ్వగా.. సరైన అవగాహన లేక సమావేశాలు తూతుమంత్రంగా సాగే అవకాశం ఉంది. కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న సీనియర్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు సమావేశాల నిర్వహణ అప్పగిస్తే సత్ఫలితాలను సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తవుతోంది. జిల్లాలో పాఠశాలలు ప్రాథమిక 735 ప్రాథమికోన్నత 127 ఉన్నత 256 ఉపాధ్యాయులు 4,800 ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ బాధ్యతలు ఆ కాంప్లెక్స్ పరిధిలోని సీనియర్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు అప్పగించాలి. దీని వల్ల కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ ద్వారా ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధితోపాటు తమ అనుభవాలను పంచుకుంటారు. – దేవదాస్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం -
బైక్ల చోరీ కేసులో నిందితుల అరెస్టు
భిక్కనూరు: బైక్ల చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు భిక్కనూరు ఎస్సై అనిల్ తెలిపారు. రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు శంకర్, క్రిష్ణలు సోమవారం భిక్కనూరు టోల్ప్లాజా వద్ద అనుమానాస్పదంగా బైక్పై వెళ్తుండగా పట్టుకున్నామన్నారు. వారిని విచారించగా.. ఇటీవల చోరీ చేసిన రెండు బైక్లను హైదరాబాద్కు తీసుకెళ్లి విక్రయించేందుకు వెళ్తున్నట్లు తేలిందన్నారు. దీంతో వీరిని అరెస్టు చేసి బైక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
జీవో 97ను రద్దు చేయాలని..
ఖలీల్వాడి: ప్రస్తుత సాంకేతిక విద్యావ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలంటూ ఏబీవీపీ నాయకులు, పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో అందిస్తున్న సాంకేతిక విద్యను ప్రయివేట్ సంస్థల్లో విలీనం చేయడం సరికాదని, ఇంజనీర్ కావాలనే వారి కలల్ని దూరం చేసి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు అక్షయ్, శివ, దామ సునీల్, బాలకృష్ణ, కన్నా పాల్గొన్నారు. నందిపేట్లో.. నందిపేట్(ఆర్మూర్): రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో–97ను రద్దు చేయాలని కోరుతూ సోమవారం నందిపేట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా నందిపేట బస్టాండు ఎదురుగా బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకో కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపి ప్రభుత్వ వైఖరి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను విద్యా చట్టం నుంచి తొలగించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చట్టం పరిధిలోకి చేర్చడం వల్ల నిరుపేద విద్యార్థులకు పాలిటెక్నిక్ చదువు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎలాంటి అభిప్రాయాలను సేకరించకుండా జీవో తెచ్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు మచ్చర్ల సాగర్, కోమన్పల్లి రాజన్న, ఎర్రటి మెహాన్, గంగాసాగర్, బాబురావు, సుభాష్గౌడ్ పాల్గొన్నారు. -
కొనసాగుతున్న పీజీ బ్యాక్లాగ్ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో సోమవారం పీజీ 1, 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు మొత్తం 284 మంది విద్యార్థులకు గానూ 238 మంది విద్యార్థులు హాజరు కాగా.. 46 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్షలు.. తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ బీటెక్ సీఎస్ఈ, ఏఐ 2వ సెమిస్టర్ రెగ్యులర్, 1వ సెమిస్టర్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు 56 మంది విద్యార్థులకు గానూ 55 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. ఖలీల్వాడి: జిల్లాలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న ఒక ఏఎన్ఎం పోస్టు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టును ఎస్సీలకు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్తోపాటు ఏఎన్ఎం పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 20లోపు జిల్లాకేంద్రంలోని న్యూ కలెక్టరేట్లోని జిల్లా విద్యాశా ఖాధికారి కార్యాలయంలోని సమగ్ర శిక్ష, రూం నెంబర్. 117లో దరఖాస్తులను సమర్పించాలన్నారు. పెర్కిట్(ఆర్మూర్): విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ సూచించారు. అంకాపూర్ భార్గవి విద్యానికేతన్ విద్యార్థులకు సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్వో మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లో ఆన్లైన్ ఆటలు ఆడడం వల్ల సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. కరస్పాండెంట్ పట్వారి గోపికృష్ణ, సామాజిక సేవకుడు పట్వారి తులసి, ప్రిన్సిపల్ ప్రగతి, విద్యార్థులు పాల్గొన్నారు. పిట్లం : పిట్లం – బాన్సువాడ రోడ్డు మధ్యలో లారీ మెయిన్ పట్టి విరిగిపోవడంతో ఆగింది. దీంతో సుమారు మూడు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని సిద్దాపూర్ గ్రామం సమీపంలో పిట్లం – బాన్సువాడ రోడ్డుపై వర్షాలకు భారీ గుంతలు ఏర్పాడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కామారెడ్డి టౌన్ : హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద మంగళవారం జరిగే గీతన్న సభను జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగష్టు 2న ప్రారంభించిన గీతన్న చైతన్య యాత్ర మంగళవారం హైదరాబాద్ సభతో ముగుస్తుందన్నారు. దీంట్లో భాగంగా ట్యాంక్బండ్పై పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం కల్లుగీత కా ర్మికులకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రవిందర్,రాజాగౌడ్,స్వామి తదితరులున్నారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జిల్లా కళాకారుల సంఘం నూతన కార్యవర్గా న్ని సోమవారం ఎన్నుకున్నారు.జిల్లా గౌరవ అధ్యక్షుడిగా రెడ్డి రాజయ్య, నర్సింలు,అధ్యక్షుడిగా కాగుల మో హన్ యా దవ్, ప్రధానకార్యదర్శిగా సురేందర్, ఉపాధ్యక్షుడిగా రాముపటేల్, సత్యనారాయణ, దేవాగౌడ్, కార్యదర్శిగా పల్లె నర్సింలు, సంయుక్త కార్యదర్శులుగా యాదగిరిగౌడ్, రెడ్డి స్వ ప్న, మహ్మద్ మహమూద్, నవీన్రావు, కోశా ధికారిగా డప్పు స్వామి, ఆర్గనైజింగ్ కార్యదర్శి గా శంకర్గౌడ్లు ఎన్నికయ్యారు. కళాకారు ల సమస్యలను గుర్తించి సంక్షేమం,ఉపాధి అవకాశాలు,గుర్తింపుఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మాచారెడ్డి: మండలంలోని సోమారంపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాదులోని రాష్ట్రపతి భవన్ ఆవరణలో ప్రతిభ కనబరిచారు. పిరమిడ్ ఆకారం, అలాగే గ్రామ దేవత ల వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్,సోమారంపేట సర్పంచ్ మమత,సోమారంపేట తండా సర్పంచ్ సునీత, గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు. -
రేషన్ బియ్యం పట్టివేత
తాడ్వాయి(ఎల్లారెడ్డి): లింగంపేట్ మండలం నుంచి కామారెడ్డి వైపు కారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పట్టుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. తాడ్వాయి పోలీస్ స్టేషన్ సిబ్బంది సోమవారం ఉదయం కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టగా, ఓ కారును అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేయగా రేషన్ బియ్యం సంచులను గుర్తించారన్నారు. కారులో ఉన్న వ్యక్తిని సంగన్నగారి భాస్కర్ గౌడ్గా గుర్తించి, కారు, బియ్యాన్ని స్వాధీనం చేసుకొని పీఎస్కు తరలించారు. డీటీ తిరుపతి పంచనామా ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు. -
హైవేపై ఢీకొన్న కార్లు
డిచ్పల్లి: మండలంలోని సీఎంసీ మెడికల్ కాలేజ్ సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. డిచ్పల్లి ఎస్సై మహమ్మద్ ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. సీఎంసీ మెడికల్ కాలేజ్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం వేగనార్ కారు యూ టర్న్ తీసుకుంటుండగా, అదే సమయంలో హైద రాబాద్ వైపు నుంచి నాగాపూర్ వైపు వెళ్తున్న వోక్స్వాగన్ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్ల ముందుభాగాలు దెబ్బతిన్నా యి. వోక్స్వాగన్ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిలో ఒకరి తీవ్ర గాయాలైన ట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బాధితులు ప్రయివేట్ ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. గాయ పడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ● ముగ్గురికి గాయాలు -
నేటి నుంచి కొత్త ఓటర్ల నమోదు
బాన్సువాడ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల కోసం మంగళవారం నుంచి నమోదు కార్యక్రమం, మార్పులు, చేర్పుల కోసం ఫారం 6,7,8 స్వీకరిస్తామని బాన్సువాడ ఆర్డీవో రవీందర్రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలో 1,96,331 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు సర్ 89.87 శాతం పూర్తయిందని, డ్రాప్ట్ ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశామని అన్నారు. నియోజకవర్గంలో 19,887 ఓట్లు డిలీట్ అయ్యాయన్నారు. ఓటర్ల పేర్లు వివరాల్లో ఏమైన తప్పులు, అభ్యంతరాలుంటే సంబంధిత బీఎల్వోలను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ నరేందర్గౌడ్, కాంగ్రెస్ నాయకులు కాసుల రోహిత్, మాసాని రవీందర్రెడ్డి, బీజేపీ నాయకులు కోనాల గంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రమేష్యాదవ్, టీడీపీ నాయకులు శంషోద్దీన్, ఎంఐఎం నాయకులు హశం తదితరులు ఉన్నారు. -
వరదకు అడ్డంకి.. ప్రజలకు ఇబ్బంది
● లోలెవల్ వంతెన రింగుల్లో పేరుకుపోయిన చెత్త ● వరద పోటెత్తడంతో పైనుంచి ప్రవహించిన వర్షపునీరు ● రాకపోకలకు తీవ్ర అంతరాయం మోపాల్: మండలంలోని గున్యానాయక్ తండా వద్దగల లో–లెవల్ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సమీప అటవీ ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం తర్వాత భారీగా వర్షం కురవడంతో ఎగువ నుంచి వరద పోటెత్తింది. దీంతో వంతెన కింద ఉన్న రింగుల్లో చెత్తాచెదారం, చెట్ల కొమ్మలు అడ్డురావడంతో నీరంతా పై నుంచి ప్రవహించింది. ఈక్రమంలో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ఒకరిసాయంతో మరొకరు జాగ్రత్తగా రోడ్డును దాటి ఇళ్లకు చేరుకున్నారు. గతంలో కూడా ఇలా గే చెత్త పేరుకుపోతే జేసీబీ సాయంతో తొలగించారని గ్రామస్తులు తెలిపారు. హైలెవల్ వంతెన నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
స్థానికంగా ప్రజావాణి
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు చింతకుంట పెద్దసాయన్న. మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన సాయన్నకు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ధరణి పోర్టల్లో రెండు ఎకరాల భూమి వేరే వారి పేరిట నమోదైంది. తన పేరిట నమోదు కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. ఏళ్లుగా తానే సాగులో ఉంటున్నా ఆన్లైన్లో లేకపోవడంతో రైతుభరోసాతోపాటు ధాన్యం విక్రయం, యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఇప్పటికే పదుల సార్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పని కావడం లేదని ఆవేదన చెందుతున్నాడు. డొంకేశ్వర్ మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ఇది. మండల స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కార్యక్రమానికి మెజార్టీ శాఖల అధికారులు హాజరుకాలేదు. రోడ్లు భవనాలు, ఇరిగేషన్, పశుసంవర్ధక, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, అటవీ, ఫైర్ తదితర శాఖల అధికారుల హాజరు కరువైంది. ప్రజల సమస్యలను నివేదించే కీలక కార్యక్రమానికి అధికారుల హాజరుకాకపోతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయనే ప్రశ్న తలెత్తుతోంది. -
మార్పులు, సవరణలకు దరఖాస్తు చేసుకోవాలి
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐఆర్) ప్రక్రియలో భాగంగా జిల్లా ముసా యిదా ఓటరు జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట ర్ భవేశ్ మిశ్రా సోమవారం విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను ప్రతి అర్హ త కలిగిన ఓటరు పరిశీలించుకోవాలని సూ చించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోయి నా, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా మార్పు లు, సవరణలు అవసరమైనా సెప్టెంబర్ 16లోగా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాపై అందిన క్లెయిమ్లు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి తుది ఓటరు జాబితా రూపొందిస్తామని తెలిపారు. ● కలెక్టర్ భవేశ్మిశ్రా -
‘ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోంది’
ప్రజావాణికి 80 ఫిర్యాదులు నిజామాబాద్ అర్బన్: ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 80 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ భు జంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, నగర పాలకసంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో సాయన్న, ట్రె యినీ ఆర్డీవో సందీప్, రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్కు విన్నవిస్తూ అర్జీలు అందజేశా రు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను స త్వరమే పరిష్కరించాలని అధికారులకు కలె క్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీస్ ప్రజావాణికి 31 అర్జీలునిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 31 ఫిర్యాదులు అందాయి. ఫి ర్యాదులను స్వీకరించిన సీపీ సాయిచైతన్య సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు వచ్చి సీపీకి తమ సమస్యలను విన్నవించారు. భారీ వర్షం నిజాంసాగర్: నిజాంసాగర్, మహమ్మద్నగర్ మండలాలలోని పలు ప్రాంతాలలో సోమవారం విడతలుగా భారీ వర్షం కురిసింది. దీంతో మహమ్మద్నగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్కు వరద వస్తుండడంతో రిటెయినింగ్ వాల్కు అడ్డుకట్టగా వేసిన మొరం బస్తాలు కొట్టుకుపోయింది. దీంతో నీరు వృథా కాకుండా ఉండేందుకు వరద గేటు ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువకు మళ్లించారు.వేల్పూర్: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం వేల్పూర్ తహసీల్ ఎదుట సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. తమ ప్రభుత్వ హయాంలో పేదలు, రైతులు, వృద్ధుల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేసే కుట్ర పన్నుతోందని విమర్శించారు. పేదింటి ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కాంగ్రెస్ వారు తమకు అనుకూలమైన వారితో కేసు వేయించి పథకాన్ని రద్దు చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేయకుండా ఈ పథకాలను కొనసాగిస్తామని కోర్టులో స్పష్టమైన అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. వచ్చే విచారణలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించి పథకాలను కొనసాగిస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ అనురుధ్కు వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాలూర మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గదుల కొరతను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపీడీవో నర్సయ్య, తహసీల్దార్ నవాజ్ను కలసి విజ్ఙప్తి చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థలం లేకపోవడంతో రైతు వేదిక భవనంలో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలస్థాయిలో ప్రజావాణి ప్రారంభమైన మొదటిరోజున వివిధ సమస్యలపై పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు తమ విజ్ఞప్తులను సమర్పించారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సమస్యలను స్థానికంగానే ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్ధేశంతో మండల స్థాయిలో ‘ప్రజావాణి’ని సోమవారం ప్రా రంభించారు. తొలి సమావేశానికి పలు మండలా ల్లో విశేష స్పందన లభించగా, మరికొన్ని మండలా ల్లో ఆదరణ కరువైంది. జిల్లావ్యాప్తంగా మండలకేంద్రాల్లో ఎంపీడీవో, తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వర కు ‘ప్రజావాణి’ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఙప్తులను స్వీకరించారు. తనకు జీ రామ్ జీ (ఉపాధిహామీ) జాబ్కార్డు కావాలని రాయకూర్ క్యాంప్నకు చెందిన విజయ్కుమార్ రుద్రూర్లో నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తును అందజేశాడు. అధికారులు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో దరఖాస్తుదారుడు సంతోషం వ్యక్తం చేశాడు. నామమాత్రపు హాజరుపై విమర్శలు ప్రతి సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ కా ర్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి ఎక్కువగా మండలస్థాయి సమస్యలే వస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటిలో ఎక్కువ శాతం సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు వీలుగా మండలకేంద్రాల్లోనే ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే చాలాచోట్ల ఎంపీడీవో, తహసీల్దార్తోపాటు ఇద్దరు, ముగ్గురు అధికారులతోనే ప్ర జావాణి కార్యక్రమం ముగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ, ఉ ద్యాన, విద్య, వైద్య, పశుసంవర్ధక, పంచాయతీరా జ్, విద్యుత్, మత్స్య, గృహనిర్మాణ, అంగన్వాడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమ శాఖ లు, అటవీ, స్థానిక ఎస్సై తదితర అధికారులు తప్పనిసరిగా హాజరవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా చాలా చోట్ల మెజార్టీ అధికారులు హాజరుకాలేదు. కోటగిరి మండలంలో 11 దరఖాస్తులు రాగా, రుద్రూర్, పోతంగల్ మండలాల్లో నాలుగు చొప్పు న, మాక్లూర్ మండలకేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో కేవలం ఒక దరఖాస్తు మాత్రమే వ చ్చింది. మండలాల్లో వస్తున్న దరఖాస్తుల్లో అధికంగా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలకు సంబంధించిన విజ్ఙప్తులే ఎక్కువగా ఉన్నాయి. ‘చలో విద్యుత్ సౌధ’ పోస్టర్ల ఆవిష్కరణ స్కూళ్లలో పనులు పూర్తి చేయాలి నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేందుకు వీలుగా చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్రెడ్డి సూచించారు. కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి వివిధ శాఖల పనితీరుపై సంబంధిత అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న పనులను గుర్తించి.. విద్యార్థుల సంఖ్య, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో పనులను పూర్తి చేయాలన్నారు. ఎక్కడా కూడా తాగునీరు, టాయిలెట్స్ వంటి సమస్యలు లేకుండా చూడాలని, విద్యార్థులు ప్రయోజనాల విషయంలో రాజీ పడొ ద్దని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థినీవిద్యార్థులకు వారం రోజుల్లోగా యూనిఫామ్ల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, స్వయం సహాయక సంఘాల ద్వారా యూనిఫామ్లను వేగవంతంగా కుట్టించాలని సూచించారు. పౌర సరఫరాల శాఖ పనితీరును సమీక్షిస్తూ.. డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై చేపట్టిన చర్యల వివరాలను సుదర్శన్రెడ్డి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత మంది నుంచి ఎంత మొత్తం బకాయిలు రాబట్టగలిగారు, ఇంకా ఎంత మంది సీఎంఆర్కు సంబంధించిన బకాయిలు చెల్లించేందుకు సముఖంగా ఉన్నారనే వివరాలపై ఆరా తీశారు. బకాయిలు చెల్లించని మిల్లర్లకు నోటీసులు జారీ చేసి, రెవెన్యూ రికవరీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. నిజామాబాద్ నగరంలో చెత్త సేకరణ కోసం డంపింగ్ యార్డ్ మల్టిపుల్ పాయింట్స్ను ఏర్పాటు చేయాలని కమిషనర్ దిలీప్కుమార్ కు సూచించారు. జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీఎస్ఓ శ్రీకాంత్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం ప్రవీణ్, డీఈవో అశోక్, డీపీవో శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్: పెన్షనర్లకు సంబంధించి పీఆర్సీ 26వ వేతన కమిటీ ఏర్పాటు చేయాలని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రయివేటీకరణ నిలిపేయాలని తదితర డిమాండ్లతో ఈనెల 19న చేపట్టనున్న చలో విద్యుత్ సౌధా మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ రఘునందన్ పిలుపునిచ్చారు. చలో విద్యుత్ సౌధ మహాధర్నా పోస్టర్లను నాయకులతో కలిసి సోమవారం నగరంలోని జేఏసీ కార్యాలయంలో ఆవిష్కరించారు. డిమాండ్లు సాధించుకునే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని రఘునందన్ స్పష్టంచేశారు. జేఏసీ ప్రధాన కార్యదర్శి పూదరి గంగాధర్, జేఏసీ కన్వీనర్ ప్రసాద్రెడ్డి, జి శ్రీనివాస్, తోట రాజశేఖర్, రాజేంద్రరెడ్డి, గంగారాం నాయక్, పీరాజీ, చంద్రశేఖర్, నరేష్, రాజేందర్ గౌడ్, జిల్లాలోని అన్ని డివిజన్ల చైర్మన్లు, జనరల్ సెక్రెటరీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ నిరసన కాంగ్రెస్ అఽగ్రనేత సోనియాగాంధీ వందేమాతర గీతాన్ని పాడకుండా అడ్డుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు.. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాయి. కదం తొక్కిన ఏబీవీపీసాంకేతిక విద్యావ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు, పాలిటెక్నిక్ జిల్లా కేంద్రంలోని భారీ ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలన్నారు.బీఆర్ఎస్ ఆందోళన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. రోడ్లపై బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మంచి అవకాశం.. జిల్లాస్థాయిలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి సైతం ఎక్కువగా మండలస్థాయిల సమస్యలు వస్తున్నా యి. మండలాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం ద్వారా స్థానిక సమస్యలకు పరిష్కారం సులభమవుతుంది. సమస్యలను గుర్తించి ఎప్పటిప్పుడు సంబంధిత అఽధికారులతో మాట్లాడుతున్నాం. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. – నర్సయ్య, ఎంపీడీవో, సాలూర మండలం మండలకేంద్రాల్లో మొదలైన కార్యక్రమం సింహభాగం వినతులు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లపైనే.. భూ సమస్యలపై కొనసాగుతున్న దరఖాస్తులు మండలస్థాయిలో పలుశాఖల అధికారుల ప్రాతినిధ్యం కరువు నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్ లను బ్లాక్ లిస్టులో పెడతాం వారం రోజుల్లోపు ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలి సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి -
నిండుకుండలా కౌలాస్ ప్రాజెక్ట్
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కౌలాస్నాలా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో 9 వేల ఎకరాల ఆయకట్టుకు భరోసా లభించింది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎగువన సరైన వర్షాలు లేక జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అయితే ఇటీవలి కాలంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగులు పారుతూ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కౌలాస్ నాలా జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగా.. సోమవారం సాయంత్రానికి 457.55 మీటర్ల (1.129 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కౌలాస్నాలా నిండడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.27 కోట్ల విలువైన ధాన్యం గోల్మాల్
● రైస్మిల్ యాజమాన్యంపై కేసు డిచ్పల్లి: మండలంలోని సుద్దులం గ్రామ శివారులో ఉన్న ఓం సాయిబాలాజీ రైస్మిల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహ్మద్ ఆరిఫ్ ఆదివారం తెలిపారు. రైస్మిల్లుకు ధాన్యం కేటాయించగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రభుత్వానికి అప్పగించక పోవడంతో సివిల్ సప్లై ఆధ్వర్యంలో మూడు రోజులపాటు మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 8 వేల క్వింటాళ్లు ధాన్యం గోల్మాల్ అ య్యిందని, దాని విలువ రూ.27,11,17,286 ఉంటుందని సివిల్ సప్లయీస్ అధికారులు లెక్క తేల్చారు. సివి ల్ సప్లయీస్ డీఎం ఫిర్యాదు మేరకు రైస్మి ల్లు యజమానులైన కూన వెంకటేశం, కూన వరలక్ష్మి, కూన ప్రియాంకపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నాగభైరవ పురస్కారం అందుకున్న చింతల నిజామాబాద్ రూరల్: ఇందూరు కవి, బాలసాహితీవేత్త చింతల శ్రీనివాస్గుప్తా నాగభైరవ జాతీయ స్థాయి బాలసాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. ఒంగోలులోని రాఘవ భైరవ సాహిత్య పీఠం బాల సాహిత్య పుస్తకాలకు ఇచ్చే పురస్కారానికి జిల్లాకు చెందిన కవి చింతల శ్రీనివాస్గుప్తా రచించిన బాల సాహిత్య గ్రంథం ‘చిగురింతలు’ ఎంపికై ంది. ఆదివారం ఒంగోలు నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్గుప్తా పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కారం అందుకున్న చింతల శ్రీనివాస్గుప్తాను ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ కాసర్ల నరేశ్రావు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ శర్మ, కార్యవర్గ సభ్యులు డాక్టర్ శారద తదితరులు అభినందించారు. రెజ్లింగ్ అకాడమీకి ఎంపిక మోపాల్: విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి తాము పుట్టిన గ్రామంతోపాటు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కు, విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని మంచిప్ప జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యా యుడు గేమ్సింగ్ అన్నారు. తమ పాఠశాల నుంచి తెలంగాణ రీజినల్ స్పోర్ట్స్ రెజ్లింగ్ అకాడమీకి ఎంపికై న బీ శ్రీకాంత్, బీ ప్రవీణ్, బీ మహేందర్ను హెచ్ఎంతోపాటు పీఈటీ దేవేందర్, గ్రామస్తులు ఆదివారం అభినందించారు. పీఈటీ మాట్లాడుతూ.. అకాడమీ లో తెలంగాణ నుంచి 12 సీట్లకుగాను ము గ్గురు మంచిప్ప జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని హన్మాజీపేట్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో భాగంగా హైదరాబాద్లోని శ్రీరాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్లో ఆదివారం నిర్వహించిన పోటీ ల్లో గ్రామానికి చెందిన కమ్మరి ఆనంద్, పర్షా వినయ్, వడ్ల శ్రావణ్ పాల్గొన్నారు. 80 నిమిషాల నాన్స్టాప్ రోలర్ స్కేటింగ్లో పాల్గొని బహుమతులు సాధించారు. -
‘విద్యుత్ ప్రజావాణి’ని సద్వినియోగం చేసుకోవాలి
సుభాష్నగర్: వినియోగదారులకు మరింత చేరువగా ఉంటూ.. ఫిర్యాదులను నేరుగా స్వీకరించి వారి సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న విద్యుత్ ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ సర్కిల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని, ఇందులోభాగంగా సర్కిల్, డివిజన్, ఈఆర్వోలు, సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్కిల్ కార్యాలయాల్లో ‘ప్రజావాణి’ కొనసాగుతుందని తెలిపారు. విద్యుత్ సరఫరా, బిల్లులు, మీటర్లు, కొత్త కనెక్షన్లు, ఓల్టేజ్ సమస్యలు, ట్రాన్స్ఫార్మర్లు, వ్యవసాయ విద్యుత్ సరఫరా తదితర సమస్యలను విద్యుత్ ప్రజావాణి దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. అందుబాటులోకి పోర్టల్.. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు ఎన్పీడీసీఎల్ పోర్టల్, కనూ్స్య్మర్ రిసెప్షన్ డెస్క్లకు అనుసంధానంగా విద్యుత్ ప్రజావాణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు తెలిపారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును నమోదు చేసి పరిష్కరించేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. విద్యుత్ ప్రజావాణి సత్ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే ఇంట వివాహ విందు.. హాజరైన సీఎం
నిజాంసాగర్ /బిచ్కుంద: కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు కూతురు జొనిట వివాహ విందుకు సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. జొనిట వివాహం దాస్తో జరుగనుండగా.. ఆదివారం బిచ్కుందలో విందు ఏర్పాటు చేశారు. సీఎంతోపాటు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు మదన్ మోహన్, సంజీవ్రెడ్డి విందుకు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆశీర్వదించారు. -
బురుజుతో ముప్పు.. కలగదా కనువిప్పు?
● హున్సాలో ప్రమాదకరంగా మట్టి బురుజులు ● తరచూ పడుతున్న మట్టి పెల్లలు బోధన్: రక్షణ కోసం వందల ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక బురుజులు ఎప్పుడు కూలుతా యో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నా రు. మంజీర నది తీరంలో ఉన్న సాలూర మండలంలోని హున్సా గ్రామం చుట్టూ ఏడు ఎత్తైన బురుజులు ఉండేవి. ఐదు కాలగర్భంలో కలిసిపోగా.. ప్రస్తుతం రెండు మిగిలాయి. ఈ రెండు మట్టిబురుజులు చుట్టూ పాత కాలం నాటి పెంకుటిళ్లతో పాటు ఆధునాత భవనాలు నిర్మించు కుని ప్రజలు నివాసం ఉంటున్నారు. మట్టిబురుజులు అనుహ్యంగా కుప్ప కూలితే ప్రజల ప్రా ణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. కళ్లెదుటే ప్రమాదం నిలిచి ఉన్నా అధికార యంత్రాంగానికి కనువిప్పు కలగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. వర్షాకాలంలో బురుజుల నుంచి మట్టి పెల్లలు విరిగి పడుతున్నాయని, అవి ఎప్పుడు కూలుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న బురుజులను గతంలో ఆర్డీవోగా పని చేసిన శ్యాంప్రసాద్లాల్ పరిశీలించారు. ఆర్అండ్బీ అధికారులతో చర్చించి బురుజులను వెంటనే తొలగించేందుకు అంచనా వ్యయం తయారు చేయాలని ఆదేశించారు. ఆ తరువాత సమస్య అలాగే మిగిలిపోయింది. సర్పంచ్ శివకుమార్ పటేల్ సాలూరా తహసీల్దార్ను కలిసి సమస్య తీవ్రత, గతంలో అధికారుల పరిశీలనకు సంబంధించిన వివరాలను తెలిపారు. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి అడుగు ముందుకు పడడం లేదు. -
మనీలా పర్యటనకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్ రూరల్: ఉపాధి, మెరుగైన భవిష్యత్ కోసం తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్తున్న యువత, వలసకార్మికుల సంక్షేమం కోసం పటిష్టమైన విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విదేశీ వలస కార్మికుల సంక్షేమ విధానాలను అధ్యయనం చేయడానికి తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ ప్రతినిధి బృందం ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు ఫిలిప్పీన్స్లోని మనీలాలో పర్యటించనుంది. కమిటీలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ఉన్నారు. ఫిలిప్పీన్స్ అనుసరిస్తున్న విదేశీ కార్మిక విధానాలు, భద్రత, చట్టపరమైన రక్షణ పద్ధతులను కమిటీ పరిశీలించనుంది. అలాగే స్వదేశానికి తిరిగి వచ్చే వలస కార్మికులకు పునరావాసం, వారి సంక్షేమానికి చేపడుతున్న చర్యలను కమిటీ తెలుసుకోనుంది. అలాగే వలస కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం అవసరమైన సలహాలు, సూచనలను స్వీకరించనుంది. -
నిజామాబాద్
విచారణలతోనే సరి.. బోధన్ బల్దియాలో అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు అందగా, అధికారులు విచారణ చేపట్టి వెళ్లిపోయారు. సోమవారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 8లో uజిల్లాలో వరుస చైన్ స్నాచింగ్లు కలకలం రేపుతున్నాయి. ఒకేరోజు రెండుమూడు చోట్ల గొలుసు దొంగతనాలు జరిగాయి. దీంతో రోడ్డెక్కాలంటేనే మహిళలు భయపడుతున్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు ఐదు చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకోగా.. దుండగులు రెండు చోట్ల విఫలమయ్యారు. మూడు చోట్ల మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు. నిజామాబాద్అర్బన్: గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో చోటుచేసుకుంటున్న ఘటనలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. నిజామాబాద్నగరంతోపాటు పల్లెల్లోనూ చైన్స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు. 2022 నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు 139 గొలుసు దొంగతనాలు జరగగా.. 54 కేసులను మాత్రమే పోలీసులు ఛేదించారు. మరో వైపు ఈ కేసుల్లో రికవరీ కూడా తక్కువగా ఉండటం గమనార్హం. ● ఈనెల 13వ తేదీన నందిపేట మండలం ఉమ్మెడ వద్ద మహిళ మెడలో నుంచి దుండగులు చైన్ లాక్కెళ్లగా మరుసటి రోజు పోలీసులు దొంగలను పట్టుకున్నారు. ఇదే రోజు మాక్లూర్ మండలం గోట్టుముక్కలలో చైన్ స్నాచింగ్ జరిగింది. ● 14 తేదీన నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ వద్ద మహిళ మెడలో నుంచి దుండగులు గొలుసు లాక్కునేందుకు యత్నించగా.. మహిళ అప్రమత్తం కావడంతో పారిపోయారు. సుమారు గంట తర్వాత నగరంలోని తిరుమల టాకీస్ చౌరస్తాలో నడుచుకుంటూ వెళ్తున్న మానస అనే మహిళ మెడలోనుంచి బైక్పై వచ్చిన దుండగులు చైన్ లాక్కెళ్లారు. ● 15వ తేదీన ఆర్మూర్లోని పెర్కిట్ వద్ద దంపతులను చైన్ స్నాచర్లు వెంబడించారు. గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించి విఫలమయ్యారు. గతంలో.. జూలై 11వ తేదీన నగరంలోని దుబ్బ ప్రాంతంలో మహిళపై దాడి చేసి చైన్ లాక్కెళ్లారు. ఈ ఘటనకు ముందు అదే రోజు ముబారక్నగర్ ప్రాంతంలోని శ్రీనివాసనగర్ కాలనీలో మరో మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెళ్లారు. మే 27 తేదీన నగరంలోని పలు ప్రాంతాల్లో ఢిల్లీకి చెందిన ముఠా చైన్స్నాచింగ్లకు పాల్పడింది, నగరంలోని గాయత్రినగర్లో, సుభాష్నగర్లో మహిళల మెడల్లో నుంచి చైన్లు లాక్కెళ్లారు. అంతేగాక వీరే ఆలూర్ మండలం రామచంద్రపల్లి బస్స్టాప్ వద్ద సాయంత్రం సమయంలో గూపన్పల్లికి చెందిన లక్ష్మి మహిళ మెడలో చైన్ లాక్కెళ్లారు. అలాగే నగరంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, రుద్రూర్, బోధన్ ప్రాంతాల్లోనూ చైన్ స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. ● 2025 డిసెంబర్ 26న ఉదయం వేళ నిజామాబాద్ నగరంలోని వినయక్నగర్, కోటగల్లీ ప్రాంతాల్లో ఇదరు మహిళల చైన్లను లాక్కెళ్లారు. అటు సమీక్షలు.. ఇటు ఘటనలుసీపీ సాయిచైతన్య కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేయడంతోపాటు డివిజన్స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. కమిషనరేట్ కార్యాలయంలోనూ సమీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్మూర్లో గత నెలలో సీపీ సాయి చైతన్య సమీక్ష నిర్వహించిన మరుసటిరోజే మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా మెడికల్ షాపులో చోరీకి పాల్పడింది. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి చేరుకున్న దుండగులు రెండుచోట్ల మహిళల మెడల్లో నుంచి చైన్లను లాక్కెళ్లారు. ఇటీవల నందిపేటలో సీపీ సమీక్ష నిర్వహించిన మరుసటి రోజే చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈనెల 14న సీపీ సాయిచైతన్య నగరంలోని బోర్గాం(పి) బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేశారు. అదే రోజు గంట తర్వాత తిరుమల టాకీస్ చౌరస్తాలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ వైపు సీపీ సమీక్షలు, తనిఖీలు కొనసాగుతుండగా.. మరోవైపు నేరాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో గొలుసు దొంగతనాలు నిఘా సారించాం చైన్స్నాచింగ్లకు పాల్పడే దుండగులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోంది. పాత నేరస్తులు, ఇ తర రాష్ట్రాలకు చెందిన వారిపై నిఘా సారించాం. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన జరుగుతుంది. ప్రజలు కూడా నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. – ప్రకాశ్యాదవ్, ఏసీపీ, నిజామాబాద్ డివిజన్ -
సీపీ సాయిచైతన్యకు జాతీయస్థాయి గుర్తింపు
నిజామాబాద్అర్బన్: సీపీ సాయి చైతన్యకు జాతీయస్ధాయిలో గుర్తింపు లభించింది. ఉత్తమ సేవలు అందిస్తున్న అధి కారులను, నాయకుల ను జాతీయస్థాయిలో ఫేమ్ ఇండియా – ఏషియా పోస్ట్ సంస్థలు ఎంపిక చేయగా.. సీపీ సాయిచైతన్యకు చోటు లభించింది. దేశ వ్యా ప్తంగా మొత్తం 100 మందిని ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి ముగ్గురు ఐపీఎస్లు ఉన్నారు. ప్రజాభద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న విధానలు తదితర అంశాల ఆధారంగా ఐపీఎస్లను ఎంపిక చేశారు. జిల్లా పోలీసుయంత్రాంగం సీపీకి అభినందనలు తెలిపింది. పోక్సో కేసుల్లో నిందితులను పట్టుకోవాలి నిజామాబాద్అర్బన్: పోక్సో కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను వీలైంత త్వరగా పట్టుకుని శిక్ష పడేలా చర్యలు తిసుకోవాలని సీపీ సాయిచైతన్య అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం పోక్సో కేసుల పురోగతిపై సీపీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధి త చిన్నారులకు న్యాయం అందేలా చూడాలన్నారు. బాధిత చిన్నారుల వివరాలు గోప్యంగా ఉంచాలని, కేసుల దర్యాప్తులో శాసీ్త్రయ ఆధారాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటి వరకు నమోదైన పోక్సో కేసులు.. వాటి స్థితిగతులపై సీపీ క్షుణ్ణంగా సమీక్షించారు. సమావేశంలో ఏసీపీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. -
చౌట్పల్లిలో మద్యం స్వాధీనం
కమ్మర్పల్లి: మండలంలోని చౌట్పల్లిలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఓ ఇంట్లో నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు మోర్తాడ్ ఎకై ్సజ్ ఎస్సై మానస ఆదివారం తెలిపారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లోని ఆయా గ్రామాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. చౌట్పల్లిలో గడ్డం మహేష్ అనే వ్యక్తి మద్యం విక్రయిస్తుండడంతో దాడి చేసి 3.4 లీటర్ల మద్యం, 7.8 లీటర్ల బీరును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు రజిత, మమత, కమలాకర్, దిగంబర్, శివయ్య, జలపతి, సతీష్ తదితరులు ఉన్నారు. -
విచారణలతోనే సరి.. చర్యలు శూన్యం
బోధన్టౌన్(బోధన్): బోధన్ బల్దియాపై నిధులు దుర్వినియోగంతోపాటు పలు అక్రమాలపై ఆరోపణలతో పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో అధికారులు విచారణ చేపట్టి వెళ్లారు.కానీ రోజులు గడుస్తున్నా ఆరోపణలను నిర్ధారణ చేసి,చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. శ్మశాన వాటికలకు రూ.28లక్షలు.. పట్టణ ప్రగతిలో భాగంగా 2018లో 16వ వార్డులోని శ్మశాన వాటిక అభివృధ్ది కోసం రూ.8లక్షలు, 2023లో రూ.20లక్షలు మొత్తం రూ.28 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో చేపట్టిన పనుల్లో అక్రమాలు జరిగాయని లోకాయుక్తకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో జులై 28న మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ విచారణ చేశారు. అనంతరం ఆగస్టు 5న లోకాయుక్త డిప్యుటీ డైరక్టర్ జైపాల్ స్మశాన వాటికను సందర్శించి పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్మశాన వాటికలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫోటోలు, ఖర్చు చేసిన నిధులు వివరాలకు సంబంధించిన రికార్డులను వెంట తీసుకెళ్లారు. నిధుల దుర్వినియోగంపై.. బల్దియాలోని వాటర్ వర్క్స్లో నిధుల దుర్వినియోగంతోపాటు పట్టణంలో ఏర్పాటు చేసిన ట్రీప్లాంట్స్, వాటర్ వర్క్స్ విభాగానికి సంబంధించిన పాత ఇనుపసామగ్రి, విద్యుత్ దీపాలు, కొనుగోలు చేసిన మోటార్లతోపాటు మరికొన్ని అంశాల్లో అవినీతి జరిగిందని పలువురు ఆరోపించారు. ఈక్రమంలో ఇంజినీరింగ్ శాఖ అధికారులపై సీడీఎంఏకు ఫిర్యాదు రాగా వారు విచారణ చేపట్టాలని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్కు సూచించింది. దీంతో రీజినల్ డైరెక్టర్ 2025 నవంబర్ 1న విచారణకు వస్తున్నట్లు కమిషనర్కు, వాటర్ వర్క్స్ను పర్యవేక్షణ చేస్తున్న ఇంజినీర్లకు, ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 1న బల్దియా కార్యాలయానికి వచ్చిన ఆర్డీ నోటీసులు అందిన ఇంజినీర్లను వాటర్ వర్క్స్ పర్యవేక్షణ అధికారులను విచారణ చేశారు. ఫిర్యాదులు వచ్చిన అంశాల రికార్డులను స్వాధీనం చేసుకొని విచారణ చేశారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. బల్దియా పరిపాలన అంశాలపై, నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు విచారణ చేపట్టారే తప్ప నిజనిర్ధాఽరణ చేసి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని పట్టణ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కుళాయి బిల్లు చెల్లించినా..?పట్టణ ప్రజలకు కుళాయి బిల్లు చెల్లింపునకు సంబంధించిన రసీదులు ఆన్లైన్ నమోదు చేసినా బిల్లు చెల్లించలేదని చూపించడంతో అయోమయానికి గురైన చెల్లింపుదారులు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. 2017 నుంచి చెల్లించిన కుళాయి బిల్లుల రసీదులు ఆన్లైన్లో నమోదు చేసినా 8వేల మందికి సంబంధించిన బిల్లులు చెల్లించలేదని, దీనిపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో గడిచిన 6 నెలల క్రితం గతంలో ఇక్కడ అదనపు కలెక్టర్గా విధులు నిర్వహించిన అంకిత్ విచారణ చేపట్టి రికార్డులు సైతం పరిశీలించారు. బోధన్ బల్దియాలో అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు విచారణ చేపట్టి వెళ్లిన అధికారులు నిర్ధారణ చేసి, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం -
సేంద్రియ వ్యవసాయంతో లాభాల పంట
● ఆదర్శంగా నిలుస్తున్న కొత్తపల్లికి చెందిన యువరైతు ● 30 గుంటల భూమిలో పండ్లు, కూరగాయల సాగు మాచారెడ్డి: ఉన్న ఆ కొద్ది భూమిలో సేంద్రియ ఎరువులతో రూ. లక్షల దిగుబడిని సాధిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓయువరైతు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే యువరైతు రసాయన ఎరువులకు స్వస్తి చెప్పి గత ఐదేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తుండగా రెండేళ్లుగా దిగుబడి వస్తోందన్నారు. ఈసందర్భంగా ఆయన ‘సాక్షి’తో పలు విషయాలను వెల్లడించాడు. 30 గుంటల్లో డ్రాగన్, గ్యాక్, జామ, వాటర్ ఆపిల్, మామిడి పండ్ల రకాలతోపాటు కొబ్బరి పంటను కూడా సాగు చేస్తున్నట్లు వివరించారు. అలాగే వివిధ రకాల కూరగాయలు కూడా సాగు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. మరో ఐదు గుంటల్లో ఫాంపాండ్ను ఏర్పాటు చేసి చేపలు పెంచుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన రైతులు తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సేంద్రియ వ్యవసాయంలోని మెళకువలను తెలుసుకుంటున్నారన్నారు. సేంద్రియ ఎరువులతో సాగు చేసిన పంటలకు చీడపీడలు ఆశించవని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు. -
చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
● కాపాడిన 108 సిబ్బంది భిక్కనూరు: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించగా 108 సిబ్బంది కాపాడారు. వివరాలు ఇలా.. మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యసమస్యలతో బాధపడుతోంది. దీంతో ఆమె విరక్తి చెంది ఆదివారం స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి ఆమెను చెరువు నుంచి ఒడ్డుకు తీసుకవచ్చారు. వెంటనే ఈఎంటీ రాజేందర్, పైలట్ రాజయ్య ప్రాథమిక చికిత్స నిర్వహించి ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడారు. అలాగే పుష్ప వద్ద ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడుతోపాటు నగదును కుటుంబీకులకు అందజేశారు. దీంతో కుటుంబీకులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని పశువుల సంత నిర్వహించే ప్రాంతం నుంచి గోవును వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా ఆదివారం బజరంగ్ దళ్ సభ్యులు రంజిత్, అశోరాజ్ అడ్డుకున్నారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసుల సమక్షంలో గోవును గోశాలకు తరలించినట్లు తెలిపారు. -
వాస్తవ చరిత్రను రాయకపోతే అసత్యాలే మిగిలిపోతాయి
నిజామాబాద్ రూరల్: చరిత్రలో జరిగిన వాస్తవాలను ప్రస్తుత కాలంలో జరుగుతున్న నిజాలను లిఖించకపోతే అసత్యాలే చరిత్రగా మిగిలిపోతాయని ఇతిహాస సంకలన సమితి అఖిల భారతీయ సహ సంఘటన కార్యదర్శి సంజయ్ కుమార్ మిశ్రా అన్నారు. అందుకే వాస్తవాలతో కూడిన చరిత్రను ఆధారాలతో సహా రాసి భవిష్యత్తు తరాలకు అందించాలనే ఏకై క లక్ష్యంతో సంస్థ పనిచేస్తున్నట్లు వివరించారు. రెంజల్ మండల కందకుర్తి గ్రామంలోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర సందర్శన కోసం ఆదివారం ఆయన జిల్లా కేంద్రానికి విచ్చేశారు. నగరంలోని ఇతిహాస సంకలన సమితి కార్యాలయంలో నిర్వహించిన ఇందూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మట్లాడారు. ఇతిహాస సంకలన సమితి సంస్థగతంగా మరింత బలోపేతం కావాలన్నారు. సంస్థ ప్రతినిధులు మోహన్ దాస్, శైలి బెల్లాల్, కందకుర్తి ఆనంద్, భోగరాజు వేణుగోపాల్, చంద్రశేఖర శర్మ, రిషి, నవీన్, వెంకట మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: నగరంలో ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–17 జిల్లాస్థాయి ఎంపిక టోర్నమెంట్ నిర్వహించగా, పలువురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. బాలుర విభాగంలో సాయిసామల చెస్ అకాడమీ విద్యార్థి రిష్విక్ బొర్రొల్ల ప్రథమ స్థానం సాధించారు. అదే అకాడమీకి చెందిన గౌరంగ అశోక్ ద్వితీయ స్థానం సాధించాడు. బాలికల విభాగంలో నలంద పాఠశాలకు చెందిన హర్షిత, అభ్యాస పాఠశాలకు చెందిన అభిగ్న ఎంపికయ్యారు. విజేతలకు చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేశ్ బహుమతులు అందజేశారు. -
ఎస్సారెస్పీపై పర్యాటకుల సందడి
వేల్పూర్ (మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవురోజు కావడంతో జిల్లావాసులే కాకుండా ఇత ర ప్రాంతాల నుంచి ప్రజలు ప్రాజెక్టును చూడడానికి వచ్చారు. ప్రాజెక్టు అందాలను చూస్తూ సేదతీరారు. చిన్నపిల్లలు గుర్రపుస్వారీని ఆస్వాదించారు. పర్యాటకులు డ్యాం గేట్ల వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తగ్గిన ఇన్ఫ్లో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో భారీగా తగ్గిపోయింది. వర్షాలు లేకపోవడంతో తగ్గిపోయిన ఇన్ఫ్లో అవుట్ఫ్లోతో సమానంగా ఉంటోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా, ఆదివారం నాటికి నీటిమట్టం 43.967 టీఎంసీలు ఉంది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వెళుతుండగా, ఆవిరిరూపంలో 482 క్యూసెక్కులు వెళుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
నర్సింగ్ స్కూల్లో బోధకులు కరువు!
మాక్లూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ (జీఎన్ఎం) విద్యార్థులకు పాఠాలు బోధించేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో తెలియక నర్సింగ్ కోర్సు చదువుతున్న విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయమై ఇటీవల భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సిద్దుల నాగరాజు, జిల్లా కమిటీ సభ్యుడు మహేష్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలలో నెలకొన్న సమస్యలపై ప్రిన్సిపాల్ను ‘సాక్షి’ సంప్రదించగా, ఆయన అనుమతించలేదు. ఈ సంవత్సరం జనవరి నుంచే బోధన సిబ్బంది లేరని సమాచారం. విద్యార్థులకు అత్యంత ముఖ్యమైన థియరీ సబ్జెక్ట్తోపాటు ప్రాక్టికల్ విద్య కూడ కొనసాగటం లేదని తెలుస్తోంది. గత్యంతరం లేక బీఎస్సీ పైనల్ ఇయర్ విద్యార్థులతో బోధన సాగిస్తున్నట్లు విద్యార్థి సంఘాల సర్వేలో వెల్లడైంది. ప్రాక్టికల్స్ కోసం విద్యార్థులను జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాడానికి బస్సుకూడ లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నర్సింగ్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మాక్లూర్ నర్సింగ్ స్కూల్లో విద్యార్థులు దీర్ఘకాలికంగా ఎదుర్కోంటున్న సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలి. ఇటీవల స్కూల్ను సందర్శించి, సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అరకోరగా కొన్ని సమస్యలను పరిష్కరించినట్టు తెలిసింది. సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించకుంటే విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తాం. –మహేష్, యూఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
కామారెడ్డి రూరల్: కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిధిలోని రామారెడ్డి మండలం రంగంపేట శివారులో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకోటి జగదీష్(52)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడికి ఇంకా కాలేదు. జగదీష్ హైదరాబాద్లో వాచ్మన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడు కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో ఈనెల 14న అతడు హైదరాబాద్ నుంచి సొంతూరికి వచ్చాడు. 15న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన జగదీష్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలో రంగంపేట శివారు ప్రాంతంలో రైలు కింద పడి మృతి చెందినట్లు సమాచారం అందింది. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై, సిబ్బంది వెంటనే రైలు మార్గం పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టగా, చీకటి కావడంతో ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం రైల్వే పోలీసులు మరోసారి రంగంపేట శివారు ప్రాంతంలో గాలింపు చేపట్టగా, జగదీష్ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రేషన్ బియ్యం పట్టివేత
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మెదక్ జిల్లా బూర్గుపల్లి నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను ఆదివారం మాల్తుమ్మెద గేటు వద్ద నాగిరెడ్డిపేట పోలీసులు పట్టుకున్నారు. బూర్గుపల్లికి చెందిన తొగిట బాలరాజు, మెంగరబోయిన యేసు వ్యానులో 29 సంచులలోని సుమారు 14.5క్వింటాళ్ల రేషన్ బియ్యంను పోచారం మీదుగా లింగంపేటవైపు తీసుకెళ్తున్నారు. మాల్తుమ్మెద గేట్ వద్ద నాగిరెడ్డిపేట పోలీసులు తనిఖీలు చేపట్టి, బియ్యంను పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ మదన్, సిబ్బంది ఉన్నారు. -
యాప్ వచ్చె.. తిప్పలు తెచ్చె
● కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన యూరియా యాప్తో ఇబ్బందులు ● ఎన్నో సందేహాలు, మరెన్నో అవాంతరాలు ఇందల్వాయి: రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, ఎరువులు వినియోగం, నిల్వలు, పంపిణీపై పర్యవేక్షణ కోసం తీసుకొచ్చిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్(ఎఫ్ఎఫ్ఎస్) రైతులకు కొత్త తిప్పలు తెచ్చి పెడుతోంది. ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్తో అపసోపాలు పడ్డ రైతులకు ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన ఈ యాప్ మరింత గందరగోళానికి గురిచేస్తోంది. యాప్లో యూరియా ఎలా బుక్ చేయాలో తెలియక చదువుకున్న రైతులతో పాటు నిరక్షరాస్యులైన రైతులు అయోమయానికి గురవుతున్నారు. అంతా గందరగోళం.. నూతన యూరియా బుకింగ్ అప్లికేషన్లో పూర్తి స్థాయిలో లాగిన్ అయి యూరియా బుకింగ్ ఆప్షన్కి వెళ్లే సరికి లాగిన్లు, ఓటీపీలు, వెరిఫికేషన్లు, సబ్ కేటగిరిలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయి. సరిగా వివరాలు పొందుపర్చకపోతే ముందుకు వెళ్లడం సాధ్యపడటం లేదు. ఇవన్నీ సరిచూసుకొని చివరి దశకు చేరుకునే సరికి అందుబాటులో ఉన్న డీలర్ వద్ద యూరియా కోటా అయిపోతోంది. మళ్లీ వచ్చే సరికి పొలానికి యూరియా అందించే సమయం ఆలస్యమవుతోందని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో నమోదుకాని వందల ఎకరాలు ధరణి నుంచి భూ భారతి వరకు ఒక్కో గ్రామంలో రైతులకు సంబంధించిన వందల ఎకరాలు ఆన్లైన్లో నమోదు కాలేదు. కొందరివి వేరే రైతుల పేరు మీద నమోదయ్యాయి. ఇలాంటి వారికి ఈ నూతన యూరియా బుకింగ్ ఆప్లో యూరియా పొందే అవకాశం ఇప్పుడు లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పాస్బుక్ ఉండి అప్లికేషన్లో చూపించని సర్వే నంబర్లను మొదట నమోదు చేసుకుంటే మండల వ్యవసాయ అధికారి లాగిన్లోకి ఆ వివరాలు వెళ్తాయని అక్కడ ఏవో అనుమతిస్తే రైతు లాగిన్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. సకాలంలో అందక.. అందుబాటులో ఉన్న డీలర్ల వద్ద అవసరమైన యూరియా సకాలంలో దొరకక రైతులు దూర ప్రాంతాల్లో ఉన్న డీలర్ల వద్ద యూరియా బుక్ చేసుకుంటున్నారు. దీంతో వారు అక్కడికి వెళ్లి యూరి యా ఇంటికి తీసుకొచ్చే క్రమంలో సమయంతో పా టు రవాణా చార్జీలు అధికమవుతున్నాయి. దగర్లోని డీలర్ల వద్ద యూరియా ఉన్నా యూరియాని ఆన్లైన్లో ఉంచిన ఐదు, పది నిమిషాల్లోనే అయిపోతోందని, దీంతో చదువురాని రైతులు, మహిళ రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాగు చేయని వారికి.. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అసలు భూమే లేని వందల ఎకరాలకు, సర్వే నంబర్లలో విస్తీర్ణం పెంచి సాగు చేయని వందల మంది రైతులకు వేల ఎకరాలను రెవెన్యు అధికారులు పట్టాలు మంజూరు చేశారు. ఇప్పుడు వారందరు ఆ పట్టాలతో వారి స్నేహితులకు, బంధువులకు యూరియా బుక్ చేసి ఇస్తున్నారు. దీంతో భూమి ఉండి పట్టా లేని అర్హులైన రైతులకు యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఎలా ముందుకెళ్లాలో జిల్లా స్థాయి అధికారులు కూడా సరైన వివరణ ఇవ్వలేకపోవడం గమనార్హం. -
క్రైం కార్నర్
జ్వరంతో చిన్నారి మృతి మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో ఓ చిన్నారి జ్వరంతో మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరా లు ఇలా.. మద్నూర్కు చెందిన వంగపల్లి యోగేశ్– వైష్ణవి దంపతులకు కుమారుడు, కూతురు అద్విక(5) ఉన్నారు.అద్విక ప్రస్తుతం ఎల్కేజీ చదువుతోంది. శనివారం సాయంత్రం ఆమెకు జ్వరం రావడంతో కుటుంబసభ్యులు స్థానిక మెడికల్లో జ్వరం మందు తీసుకువచ్చి, పోశారు. ఆదివారం ఉదయం చిన్నారి ఆటలు ఆడగా, మధ్యాహ్నం నీరసంతో పడుకుంది. కొంతసేపటికి చిన్నారిని పిలిచినా లేవకపోవడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు దద్దరిల్లిపోయాయి. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో ఒకరు .. రుద్రూర్: అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం ఆస్పతికి తరలిస్తుండగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు కోటగిరి ఎస్పై శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. పోతంగల్ మండలంలోని టాక్లి గ్రామానికి చెందిన జీవన్ పటేల్(48) అనే వ్యక్తి నెల రోజుల క్రితం ప్రత్యర్థులు జరిపిన దాడిలో గాయపడ్డాడు. చికిత్స అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని బోధన్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మరణానికి గల అసలు కారణం తెలుసుకునేందుకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సిరికొండ: మండలంలోని పాకాల గ్రామంలోగల జగదాంబ దేవి ఆలయంలో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయ పూజారి సేవాలాల్ ఆదివారం ఉదయం ఆలయాన్ని తెరవగా అమ్మవారి మెడలోని బంగారు పుస్తెలు చోరీకి గురైనట్లు గుర్తించి, గ్రామస్తులకు తెలిపారన్నారు. చోరీ విషయం సిరికొండ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించారని గ్రామస్తులు తెలిపారు. -
హైవేపై సేఫ్టీ కోన్స్ ధ్వంసం
వేల్పూర్: మండలంలోని అంక్సాపూర్ గ్రామంలో 63వ నంబరు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సేఫ్టీ కోన్లు ధ్వంసమయ్యాయి. హైవేపై ప్రమాదాలు జరిగే స్పాట్లను ఇటీవల సీపీ సాయిచైతన్య గుర్తించి, నివారణ చర్యలు చేపట్టారు. అందులోభాగంగా వేల్పూర్ మండలం వేల్పూర్ క్రాస్రోడ్డు వద్ద, అంక్సాపూర్ వద్ద సేప్టీ కోన్స్ ఏర్పాటు చేశారు. వేల్పూర్ క్రాస్రోడ్డు వద్ద బాగుండగా, అంక్సాపూర్ గ్రామంలో వాహనాలు ఢీకొంటూ వెళ్లడం వల్ల పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంక్సాపూర్లో జాతీయ రహదారికి ఇరువైపులా గృహాలు ఉండడం, వ్యవసాయ పనుల కోసం గ్రామస్తులు రెండు వైపులా అధికంగా వెళ్తుంటారు. సేప్టీ కోన్లు ఉండడం వల్ల వాహనాలు తక్కువ వేగంతో జాగ్రత్తగా వెల్లేవి. సేప్టీ కోన్స్ ధ్వంసం కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు వేగంగా వెళ్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ● బాధిత కుటుంబానికి రూ.11 లక్షల ఆర్థిక సాయం అందజేత డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఖతార్ దేశంలో ఇటీవల మృతిచెందగా, బాధిత కుటుంబానికి ఖతార్ తెలుగు స మాజం ఆర్థికసాయం అందించింది. వివరాలు ఇలా..మండలంలోని నర్సింగ్పూర్(కొత్తపేట్) గ్రామానికి చెందిన సుంకే మల్లేష్ (46) ఖతార్ దేశంలో డ్రైవర్గా పనిచేస్తూ జూలై 23న గుండెపోటుతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఖతర్లోని ఆంధ్ర కళావేదిక, తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ సహకారంతో మృతదేహాన్ని స్వదేశానికి పంపించారు. తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ గల్ఫ్సమితి తదితర సంఘాలు స్పందించి మృతుడి కుటుంబానికి బాసటగా నిలిచారు. గల్ఫ్ సంఘాల ఆధ్వర్యంలో రూ.11 లక్షల విరాళాలు పోగుచేసి మృతుడి కుటుంబానికి పంపించారు. డిచ్పల్లి మాజీ ఎంపీపీ గద్దె భూమన్న ఆదివారం నర్సింగ్పూర్ గ్రామానికి వెళ్లి బాధి త కుటుంబానికి ఖతర్ నుంచి వచ్చిన విరాళాన్ని అందజేశారు. బాధిత కుటుంబసభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నర్సింగ్పూర్ సర్పంచ్ శోభ, సొసైటీ మాజీ చైర్మన్ చిన్నయ్య, మాజీ సర్పంచ్ నల్లవెల్లి సాయిలు, బీజేపీ నాయకులు వెంకటరమణ, కుందేటి బాలయ్య, సాయిలు, నర్సయ్య ఉన్నారు. మాచారెడ్డి: మాచారెడ్డి మండలం రాజఖాన్ పేట గ్రామానికి చెందిన జోగులు కుటుంబ సభ్యులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అయితే ఇంటి గేటు ముందే విద్యుత్ స్తంభం ఉండడంతో ఇంటి నిర్మాణాకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులకు విన్నవించినా స్పందించడంలేదని వాపోయాడు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. -
‘సలాం సైనికా’ కవితా సంకలనం ఆవిష్కరణ
బోధన్: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర సైనికులతోపాటు వీరసైనికుల త్యాగాల విశిష్టతపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన అక్షరయాన్ కవయిత్రుల బృందం అధినేత్రి అయినంపూడి శ్రీలక్ష్మి నేతృత్వంలో మూడు భాషలతో ఒకే పుస్తకంలో ముద్రించిన సలాం సైనికా కవితా సంకలనాన్ని శనివారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద ఆవిష్కరించారు. 25 మందితో కూడిన అక్షరయాన్ కవయిత్రుల బృందంలో బోధన్కు చెందిన ప్రముఖ కవయిత్రి కాట్రగడ్డ భారతి ఉన్నారు. మొదట తెలుగు భాషలో కవితా సంకలనాన్ని ముద్రించామని, కార్గిల్ దివస్ రోజు నిర్వహించిన కార్యక్రమంలో కవితలు వినిపించగా, ఆర్మీ మేజర్ శ్రీనివాస్ తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కవితా సంకలనం తీసుకొస్తే అన్ని సైనిక్ స్కూల్స్, సైనికులకు అందిస్తామని తెలిపినట్లు భారతి పేర్కొన్నారు. అధికారుల కోరిక మేరకు తెలుగు నుంచి హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కవితలను అనువదించినట్లు తెలిపారు. 80 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్మీ అధికారులతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. -
ఉత్తమ సేవలకు ప్రశంసలు
స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రశంస పత్రాలను అందజేశారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో శనివారం నిర్వహించిన వేడుకల్లో ఉన్నతాధికారులు ఉద్యోగుల సేవలను అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, సీపీ సాయిచైతన్య తదితరులు పాల్గొన్నారు. – నెట్వర్క్డా.పి.రామకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ జీజీ కళాశాల నిఖిత, ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్, డిచ్పల్లి రాజలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్, డీటీసీ స్రవంతి, జూనియర్ అకౌంటెంట్, డీటీవో డాక్టర్ వెంకటేశ్, మెడికల్ ఆఫీసర్, ఆయూష్ డాక్టర్ డి.చంద్రశేఖర్, హెచ్వోడీ, జీఎంసీఆశన్సల్మాన్, ఏఈఈ, మోర్తాడ్, ఏర్గట్ల బుద్ధిరాజ్, ప్రిన్సిపల్, జీజేసీ గర్ల్స్,నిజామాబాద్ రామ్మోహన్, డీఈఈ, ఆర్అండ్బీ, బోధన్ భాస్కర్రావు, ఎకై ్సజ్ సీఐ, బోధన్ పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు వీరే..గంగామోహన్, హోంగార్డు,నార్త్ రూరల్ డి.నరేశ్, ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయన్న, ఎస్సై, సీఎస్బీ రాంమూర్తి, హోంగార్డు, 3వ టౌన్ నిలేశ్, కానిస్టేబుల్ కె.శంకర్, ట్రాఫిక్ కానిస్టేబుల్ గంగాధర్గౌడ్, సీఎస్బీ, నిజామాబాద్ ఎస్.కె.నజుమా, ట్రాఫిక్ ఉమెన్ పీఎస్ శంకర్, సీపీవో ఆఫీస్, నిజామాబాద్ కోటేశ్వరరావు, ఏఆర్ ఎస్సై ట్రాఫిక్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రదర్శించిన జిల్లా వ్యవసాయ శాఖ, రగ్రామీణాభివృద్ధి శాఖల శకటాలు -
గ్రామాల్లో జీవవైవిధ్య కమిటీలు
● ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేస్తున్న అధికారులు ● జీవ వనరుల సంరక్షణ కోసం చర్యలు ● గ్రామ సర్పంచే కమిటీకి చైర్మన్ డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రకృతి ప్రసాదించిన జీవ సంపదను కాపాడుకునేందుకు గ్రామ పంచాయతీల్లో ‘జీవ వైవిధ్య యాజమాన్య కమిటీ’లు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు జిల్లా వ్యాప్తంగా 545 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలో సర్పంచ్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. జీవ వనరుల సంరక్షణతోపాటు వాటిని భవిష్యత్ తరాల కోసం సుస్థిరంగా వినియోగించుకునేలా చూసే పూర్తి బాధ్యత ఈ కమిటీలకే అప్పగించారు. జీవవైవిధ్య యాజమాన్య కమిటీ చట్టాన్ని 2002 సంవత్సరంలో చేయగా, 2004లో దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీనిని మళ్లీ 2023లో సవరించారు. ఏడుగురు సభ్యుల్లో సర్పంచ్ చైర్మన్గా, జీపీ సెక్రెటరీ సభ్య కార్యదర్శిగా ఉంటారు. సభ్యులుగా ఇద్దరు మహిళలు, మిగతా ముగ్గురు సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు ఉంటారు. ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తుంది. ప్రభుత్వం నుంచి కొంత నిధులు కూడా కేటాయిస్తారు. కమిటీ ప్రధాన విధులు, బాధ్యతలు... ● సహజ వనరులు, వనమూలికలు, వన్యప్రాణులు, పక్షులను కాపాడుకుంటూ ప్రకృతికి నష్టం కలగకుండా చూసుకోవాలి. జీవ సంపదను అక్రమంగా తరలించడం, దుర్వినియోగం చేస్తే వెంటనే అడ్డుకోవాలి. ● వాణిజ్య, వ్యాపార ప్రయోజనాల కోసం స్థానిక జీవ వనరులు సేకరించే వివిధ సంస్థల నుంచి నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేసే అధికారం ఉంటుంది. ● స్థానిక వనమూలికలు, జీవ వనరులను ఉపయోగిస్తూ వైద్యం చేసే నాటు వైద్యుల వివరాలను సేకరించి పెట్టుకోవాలి. ● మంజూరైన జీవ వనరులు, సంప్రదాయక పరిజ్ఞానం, వసూలైన ఫీజులు, వాటి ద్వారా లభించిన ప్రయోజనాల పంపిణీ వివరాలతో కూడిక ప్రత్యేక రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలి. ● జాతీయ, రాష్ట్ర జీవవైవిధ్య మండలి అందించే మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహారాలను అమలు పరుస్తూ, స్థానిక జీవవైవిద్య నిధిని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి. ● వివిధ ప్రత్యేక సందర్భాలలో జీవవైవిధ్య అంశాలపై నేరుగా రాష్ట్ర జీవవైవిధ్య మండలికి, జాతీయ ప్రాధికార సంస్థకు ఈ కమిటీలు తమ నివేదికలు, అభిప్రాయాలను సమర్పించవచ్చు. ఏఐ సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం -
ఎత్తొండలో ప్లాస్టిక్ నిషేధం
రుద్రూర్: పర్యావరణాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించేందుకు సర్పంచ్ శ్వేత సూర్యకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక తీర్మానం చేసింది. ఈ మేరకు శనివారం గ్రామంలోని హోటళ్లకు స్టీల్ గ్లాసులను అందజేశారు. ఇక మీదట గ్రామంలోని హోటళ్లలో ప్లాస్టిక్ టిఫిన్ ప్లేట్లు, ప్లాస్టిక్ టీ గ్లాసులు వాడొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. వ్యాపారులు కేవలం స్టీల్ గ్లాసులు, పళ్లాలను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఎత్తొండను తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్, వార్డు సభ్యులు షేక్ మస్తాన్, రమేశ్, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో అడ్డదారి
● చోరీకి పాల్పడి కటకటాల పాలుకామారెడ్డి క్రైం: ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కేందుకు అడ్డదారిని ఎంచుకుని చోరీకి పాల్పడిన వ్యక్తి ని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని దేవునిపల్లి విద్యుత్నగర్ కాలనీకి చెందిన ట్రాన్స్కో ఉద్యోగి సురేశ్ కుటుంబం ఈనెల 7 న ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 16 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, రూ.90 వేలు నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. దేవునిపల్లికి చెందిన వడ్ల శ్రీనివాస్ను నిందితుడిగా గుర్తించి శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా నేరం ఒప్పుకున్నాడని ఎస్పీ తెలిపారు. గతంలో నిందితుడు శ్రీనివాస్కు చెందిన ఇల్లు, దుకాణం అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. అప్పులతో ఆర్థిక ఇబ్బందుల పాలయ్యాడు. దీంతో తేలికగా డబ్బులు సంపాదించాలని భావించి దొంగతనానికి ఒడిగట్టాడు. నిందితుడి వద్దనుంచి 16 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేలు నగదు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసు చేదనలో విశేషంగా కృషి చేసిన డీఎస్పీ మధుసూదన్, రూరల్ సీఐ శ్రీధర్గౌడ్, సీసీఎస్ సీఐ రామన్, ఎస్సైలు రంజిత్, మహేష్, సిబ్బంది రాజేందర్, రవి, శ్రీనివాస్, లక్ష్మీకాంత్, కిరణ్లను అభినందించారు. -
క్యాంప్ కార్యాలయంలో జెండావిష్కరణ
నిజామాబాద్ అర్బన్: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ భవే శ్ మిశ్రా క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ట్రెయినీ కలెక్టర్ సురేశ్, ట్రెయినీ ఆర్డీవో సందీప్, కలెక్టరేట్ ఏవో బాలరాజు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఎస్సెస్సీ టాపర్కు అరుదైన గౌరవం ● ఆ గ్రామంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేది వారే.. ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి గ్రామస్తులు పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించినవారికి అరుదైన గౌరవాన్ని ఇస్తున్నారు. స్వాతంత్య దినోత్సవం సందర్భంగా టాపర్తో జాతీయ పతాకాన్ని ఎగురవేయిస్తున్నారు. శనివారం నిర్వహించిన వేడుకల్లో పదో తరగతి గ్రామ టాపర్ అయిన హర్షిత జెండా ఎగురవేశారు. విద్యార్థులలో చదవా లన్న పట్టుదలను పెంచేందుకు మూడేళ్లుగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నామని సర్పంచ్ చింతల కిషన్ తెలిపారు.పాఠశాలకు ఏడాది గౌరవ వేతనం బోధన్: ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ అభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్ కందగట్ల రాంచందర్ తన ఏడాది వేతనం మొత్తం రూ.78 వేలు విరాళంగా అందజేశారు. శనివారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ విరాళం చెక్కు ను హెచ్ఎం రవికుమార్కు అందించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కు లు సాధించిన పాఠశాల విద్యార్థిని శ్రీనిధికి ప్రోత్సాహకంగా రూ.11,111 నగదును అందజేశారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన ఖైదీలు నిజామాబాద్ అర్బన్: జిల్లా జైలులోని 15 మంది ఖైదీలు పదో తరగతిలో ఉత్తీర్ణ సాధించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా ఖైదీల కోసం ప్రత్యేకంగా విద్యాభ్యాసం కొనసాగుతుండగా.. 16 మంది ఖైదీలు పరీక్షలు రాశారు. గతేడాది మేలో జిల్లా జైలులో ఎన్ఐవోఎస్ ద్వారా తరగతులను ప్రారంభించారు. జైలులోనే ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జైలు సూపరింటెండెంట్ అశోక్ శనివారం ప్రకటనలో తెలిపారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్: నిజామాబాద్ నగరంలోని డీ–1 సెక్షన్ పవర్హౌజ్ కంపౌండ్ సబ్స్టేషన్లో పరిధిలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–1 ఏడీఈ ఆర్ చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పవర్హౌజ్ కంపౌండ్ సబ్స్టేషన్లో కొత్త 33 కేవీ బ్రేకర్ బిగించనున్న కారణంగా.. మాలపల్లి, శాంతినగర్, బాబన్సాహెబ్పహాడ్, ఖిల్లా రోడ్, గాజుల్పేట్, లైన్గల్లీ, హతాయిగల్లీ తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు సహకరించాలని ఏడీఈ కోరారు. -
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర వేడుకలు శనివారం ఘనంగా సాగాయి. జిల్లా యంత్రాంగం విస్తృత ఏ ర్పాట్లు చేయగా.. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభు త్వ సలహాదారు సుదర్శన్రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పుర ప్రముఖులను, అధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. వ్యవసా య, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, డెయిరీ, పశు సంవర్ధక, అటవీ, విద్య, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, నీటి పారుదల, సమగ్ర శిక్ష అభియాన్ తదితర శాఖల ఫొటో ఎగ్జిబిషన్ స్టాల్స్ను సందర్శించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి, ఆర్టీసీ, విద్యుత్, పౌరసరఫరాలు, హౌ సింగ్ తదితర శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, పోలీసులకు మెడల్స్ను సుదర్శన్రెడ్డి అందజేశారు. స్వాతంత్య్ర సమర యోధులతోపాటు వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఆయా పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలు కొనసాగాయి. కంజర రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, విశ్వ వికాస్ హైస్కూల్, నవీపేట్ బాలికల జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు, టైం స్కూల్ చిన్నారులు సాంస్కృతిక గేయాలపై చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్ భూపతిరె డ్డి, పైడి రాకేశ్రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీఖ్ అన్సారీ, పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, అదనపు డీసీపీ శుభం నగ్రా లే, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ ది లీప్కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకు మా ర్, ట్రెయినీ ఆర్డీవో సందీప్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయో ధులు, ప్రజలు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సుదర్శన్రెడ్డి ఆకట్టుకున్న శకటాలు.. సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు పోలీసులకు మెడల్స్ స్వాతంత్య్ర సమరయోధులకు ఘన సన్మానం -
నేడు బిచ్కుందకు సీఎం రాక
● ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కూతురు వివాహ విందులో పాల్గొననున్న రేవంత్రెడ్డి ● భారీభద్రతా ఏర్పాట్లుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వెనకబడిన ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందకు ఆదివా రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారు. ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు కూతురు వివాహ విందులో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి హోదా లో రేవంత్రెడ్డి తొలిసారిగా జుక్కల్ నియోజకవర్గానికి వస్తుండడంతో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశాలున్నా యి. సీఎం పెళ్లి వేడుకలో పాల్గొనడానికే వస్తున్నప్పటికీ నియోజకవర్గంపై వరాల జల్లులు కురిపిస్తారన్న ఆశలో జనం ఉన్నారు. ప్రజలు ఏం ఆశిస్తున్నారంటే.. నియోజకవర్గంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు ఉన్నా ఈ నియోజకవర్గానికి పెద్దగా ఉపయోగపడదు. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో సింగి తం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ కొట్టుకుపోయింది. తాత్కాలిక మరమ్మతులతోనే నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి పనులు దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నాగమడుగు ఎత్తిపోతల పథకం మొదట్లోనే ఆగిపో యింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల కు దూరాన ఉన్న జుక్కల్ ప్రాంతంలో ఉన్నత విద్యావకాశాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పీజీ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా కేంద్రానికి వెళ్లా లంటే సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. బస్ డిపో ఏర్పాటు చే స్తే మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం మె రుగుపడుతుంది. ఈ ప్రాంతంలో అపరాలు ఎ క్కువగా సాగవుతాయి. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు లేకపోవ డంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించలేకపోతున్నారు. ఆయా పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
అభివృద్ధి, సంక్షేమంలో ముందంజ
నిజామాబాద్● స్వాతంత్య్రం అంటే ప్రతి పౌరుడికి కనీస సౌకర్యాలు ● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి వాతావరణం ఉదయం ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయి. ఉత్తమ సేవలకు ప్రశంసలు ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు స్వాతంత్య్ర వేడుకల్లో ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 8లో uనిజామాబాద్ అర్బన్: అభివృద్ధి, సంక్షేమంలో జిల్లా ముందంజలో పయనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్ర అంటే ప్రతి పౌరుడు కనీస సౌకర్యాలైన కూడు, గుడ్డ, గూడు లభించేలా తమ కాళ్లపైతాము స్వేచ్ఛాయుతంగా ఎదగడమన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో జిల్లా సాధించిన ప్రగతిని వివరించారు. సుదర్శన్రెడ్డి ప్రసంగం సాగిందిలా.. వ్యవసాయం 2026 వానాకాలం సీజన్కు గాను ఇప్పటి వరకు 3.87 లక్షల ఎకరాల్లో వరి, 52 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 35 వేల ఎకరాల్లో సోయా, 900 ఎకరాల్లో కంది సాగవుతోంది. రైతులకు 42,983 మెట్రిక్ టన్నుల యూరియా, 11,554 డీఏపీ, పొటాష్ 1,913, కాంప్లెక్స్ ఎరువులు 38,067 మెట్రిక్ టన్నులు సరఫరా చేశాం. పౌర సరఫరాలు జిల్లాలో 4,77,780 ఆహార భద్రత కార్డుల ద్వారా 16,09,447 మంది లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతేడాది ఏప్రిల్ నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ అవుతోంది. ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించి, అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేశాం. విద్యుత్ గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 2,72,300 కుటుంబాలకు ప్రతి నెలా జీరో బిల్లులు జారీ చేసి రూ.296 కోట్ల 25 లక్షల సబ్సిడీని అందించాం. గ్రామీణాభివృద్ధి సంస్థ 28 మండల సమాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం బస్సులను మంజూరు చేసింది. ఆర్టీసీ ఇప్పటి వరకు మండల సమాఖ్యలకు రూ.80 లక్షల 83 వేల అద్దె జమ చేసింది. జిల్లా సమాఖ్యకు ప్రతి నెలా రూ.69,468 జమవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజీ ద్వారా 400 స్వయం సహాయక సంఘాలకు రూ.46 కోట్ల 49 లక్షల 85 వేల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. విద్య జిల్లాలోని 1,159 పాఠశాలల్లో 97,720 విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. స్కూళ్లలో అదనపు గదులు, మరుగుదొడ్లు, మంచి నీటి సదుపాయం కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద జిల్లాకు రూ.42 కోట్ల 23 లక్షల 58 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రూ.24 కోట్ల 27 లక్షల 93 వేలు విడుదల చేసి పనులు పూర్తి చేయడం జరిగింది. జిల్లాలోని నాలుగు చోట్ల కొత్త యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనులు పురోగతిలో ఉన్నాయి. రహదారులు, భవనాలు 2024–25 సంవత్సరంలో రూ.63 కోట్ల రూపాయలతో 12 పనులు మంజూరు కాగా వాటిలో మూడు పనులు పూర్తయ్యాయి. మరో ఎనిమిది పనులు పురోగతిలో ఉన్నాయి. మిగతా ఒక పని టెండర్ దశలోగుంది. ఆయా పనుల కోసం ఇప్పటి వరకు రూ.26 కోట్ల 12 లక్షలు ఖర్చు చేశాం. 2025–26 సంవత్సరంలో రూ.96 కోట్ల 46 లక్షల రూపాయలతో 17 పనులు మంజూరు కాగా.. పనులు అభివృద్ధి దశలో ఉన్నాయి. 2026–27 సంవత్సరంలో మూడు పనులు రూ.4 కోట్ల 4 లక్షలతో మంజూరు కాగా.. అందులో 2 పనులు అగ్రిమెంట్ దశలో, ఒక పని టెండర్ దశలో ఉన్నాయి. హ్యామ్ రోడ్స్ పథకం కింద 17 పనులు 256.63 కిలో మీటర్లు రూ.389 కోట్ల 94 లక్షలతో మంజూరు చేయడం జరిగింది.కంజర టీఎస్డబ్ల్యూఆర్ఎస్ విద్యార్థినుల నృత్యం..వైద్యారోగ్యం జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లాలో 2025–26 సంవత్సరానికి రూ.27 కోట్ల 28 లక్షల నిధులను వివిధ ఆరోగ్య సేవల కోసం ఖర్చు చేయడం జరిగింది. బోధన్ మున్సిపాలిటిలో చావిడి వద్ద రూ.13 లక్షలతో మంజూరు చేసిన బస్తీ దవాఖానను జనవరిలో ప్రారంభించాం. తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్లో ప్రస్తుతం 134 రకాల పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతోంది. 2026 జనవరి నుంచి 2,96,774 శాంపిళ్లను సేకరించి 5,98,708 పరీక్షలు చేయడం జరిగింది. -
ఒక్క బియ్యం గింజ పక్కదారి పట్టొద్దు
సుభాష్నగర్: పేద కుటుంబాలు కూడా మూడు పూటల అన్నం తినాలనే ఆశయంతో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొ ద్దుటూరి సుదర్శన్రెడ్డి అన్నారు. పేదల కోసం పంపిణీ చేస్తున్న ఒక్క బియ్యపు గింజ కూడా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నగరశివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో శనివారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. సుదర్శన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం అందించిన దొడ్డు బియ్యం తినడానికి ఉపయోగపడక 70 శాతం అమ్ముకునే వారని, పీడీఎస్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిపోయేవని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంతో పేదలకు ఆహార భద్రత భరోసా ఏర్పడిందన్నారు. డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత, జవాబుదారీత నం తీసుకువచ్చిందని తెలిపారు. కలెక్టర్ భవేశ్ మి శ్రా, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్పాల్, రాకేశ్ రెడ్డి, మేయర్ ఉమారాణి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడు గు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, ఏఎంసీ చైర్మ న్ ముప్ప గంగారెడ్డి, డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ రేషన్ కార్డులతో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి పండుగ వాతావరణంలో స్మార్ట్ కార్డుల పంపిణీ -
ప్రారంభమైన పీజీ 2వ సెమిస్టర్ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలో పీజీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. క్యాంపస్లోని పరీక్షా కేంద్రాన్ని వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి సందర్శించి తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో మాల్ప్రాక్టీస్కు పాల్పడిన ఒక విద్యార్థి డిబార్కు గురైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ తెలిపారు. పరీక్షలకు మొత్తం 2,052 మందికి 1,908 మంది హాజరు కాగా 144 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. కొనసాగుతున్న పీజీ 4వ సెమిస్టర్..తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న పీజీ 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు మొత్తం 1,096 మందికి 1,071 మంది హాజరు కాగా 25 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్అర్బన్: జిల్లాలోని ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి లభించింది. శుక్రవారం వీరిని తన కార్యాలయంలో సీపీ సాయిచైతన్య అభినందించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న శ్రీనివాస్, అబ్బులు ఇద్దరికీ హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. -
బాసరలో ఉమ్మడి జిల్లాల డీటీసీ పూజలు
బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతిని అమ్మవారి బాలాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రవాణా శాఖ ఉప కమిషనర్ రవీందర్కుమార్గౌడ్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. సర్పంచ్ తీగల వెంకటేశ్గౌడ్, కిష్టగౌడ్ ఉప కమిషనర్ దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఆలయ ఈవో అంజనీదేవి, ఏఈవో గంగా శ్రీనివాస్, సూపరింటెండెంట్లు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు వారికి జిల్లా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రమ్యరాణి, తిరుపతి, రజనీకాంత్ ఘనంగా స్వాగతం పలికారు. -
వారికి చేతకాక నిధులు తెచ్చుకోలేదు
● బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం వర్ని: ‘కేసీఆర్ హయాంలో శ్రీనివాస్రెడ్డి ఎక్కువ నిధులు ఎలా తెచ్చాడు.. మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు తేలేదు అంటే వారికి చేతకాక తెచ్చుకోలేదు, నాకు చేతనై తెచ్చుకున్నాను’ అని బాన్సువాడ ఎ మ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన చందూరు మండలం మేడిపల్లి లక్ష్మా పూర్ రోడ్డుపై కోటి రూపాయలతో నిర్మించిన వంతెన, రూ. 70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, మేడిపల్లిలో రూ. 25 లక్షలతో నిర్మించిన గ్రామపంచా యతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే బాన్సువాడలో ఎక్కువ అ భివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పోడు భూముల పంపిణీ, రైతులకు నూరు శాతం సాగునీరు అందించిన ఘనత తనదేనన్నారు. నియోజకవర్గంలో 1.48 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించానన్నారు. తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా నియోజకవర్గంలో 2,670 మంది గిరిజనులకు 4,600 ఎకరాల పోడు పట్టాలు ఇప్పించానని పేర్కొ న్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ప్రజలకు సూచించారు. అనంతరం లబ్ధి దారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, మేడిపల్లి సర్పంచ్ శ్రావణి రవి, లక్ష్మాపూర్ సర్పంచ్ ఉమా సంజీవ్, చందూర్ సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్, మాజీ సర్పంచులు సత్యనారాయణ, నరేందర్రెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు. -
ఉద్యోగి వేతనం.. ఏఎస్వోల జేబులోకి!
● మూడు నెలల వేతనాలు లాక్కున్న వైనం ● జనగణన అవుట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్ల ఆవేదన నిజామాబాద్అర్బన్: జనగణన ప్రక్రియలో పాల్గొ న్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను ఏఎస్వో(అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్)లు అక్రమంగా తీ సుకున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. డబ్బులు ఇవ్వకుంటే ఉద్యోగం పోతుందని భయభ్రాంతులకు గురిచేసి మరీ మూడు నెలల వేతనా లు లాక్కున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. 38 మంది వేతనాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది ప్రారంభమైన జనగణన ప్రక్రియలో భాగంగా రెవెన్యూ శాఖలోని పలువురు అధికారులకు ఏఎస్వోలుగా బాధ్యతలు అప్పగించారు. వీరితోపాటు మండలానికి ఒకరు చొప్పున 34 మందిని, ఇతర పనుల కోసం మరో నలుగురిని టెక్నికల్ అసిస్టెంట్లుగా ఓ ఏజెన్సీ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. వీరి నియామకాలను జనవరిలోనే పూర్తి చేయగా, విధుల్లోకి మాత్రం ఏప్రిల్లో తీసుకున్నారు. అయితే, మూడు నెలలపాటు జనగణనకు సంబంధించి మ్యాపింగ్ ఇతర కార్యక్రమాలను ఏఎస్వోలు నిర్వహించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫిబ్రవరి, మార్చి నెలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, ఏప్రిల్ నుంచి క్షేత్రస్థాయి విధుల్లోకి పంపించారు. ప్రస్తుతం ఏఎస్వోలు, టెక్నికల్ అసిస్టెంట్లు కలిసి జనగణన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా, టెక్నికల్ అసిస్టెంట్లకు నెలకు రూ.25 వేలు వేతనంగా కేటాయించి జనవరి నుంచి మంజూరు చేశారు. దీంతో ‘మీరు జనవరి నుంచి విధుల్లోకి రాలేదు.. ఏప్రిల్ నుంచి విధుల్లోకి వచ్చారు కాబట్టి మూడు నెలల వేతనాలు మాకే ఇవ్వాలి’ అని ఏఎస్వోలు టెక్నికల్ అసిస్టెంట్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఒక్కో ఉద్యోగికి మూడు నెలల వేతనం రూ.75 వేలు ఇటీవల వారి ఖాతాలో జమ కాగా, ఆ డబ్బులను తమకు ఇవ్వాలంటూ మండలాల్లోని టెక్నికల్ అసిస్టెంట్లను అడుగుతున్నట్లు తెలిసింది. జిల్లాలో ఇప్పటి వరకు 20 మంది టెక్నికల్ అసిస్టెంట్ల నుంచి రూ.60 వేల నుంచి రూ.70 వేల చొప్పున స్థానిక ఏఎస్వోలు తీసుకున్నట్లు సమాచారం. వేతనాలు ఇచ్చేందుకు కొందరు టెక్నికల్ అసిస్టెంట్లు ససేమిరా అనగా, ఉన్నతాధికారులతో ఒత్తిళ్లు తీసుకొచ్చి బలవంతంగా తీసుకున్నట్లు తెలిసింది. డిచ్పల్లి సమీపంలోని ఓ మండలంలో టెక్నికల్ అసిస్టెంట్ ఖాతాలో పడిన డబ్బులను ఆమె ఇంటికి వెళ్లి స్థానిక అధికారి ఒకరు బలవంతంగా తీసుకున్నట్లు తెలిసింది. ఆర్మూర్ డివిజన్లోని ఓ మండలంలో టెక్నికల్ అసిస్టెంట్ను ఆర్మూర్ బస్టాండ్కు పిలిపించుకొని ఆన్లైన్ ద్వారా రూ.60 వేలు వసూలు చేసినట్లు సమాచారం.కలెక్టర్ను కలిసేందుకు సిద్ధం తమకు వచ్చిన వేతనాలను ఏఎస్వోలు తీసుకోవడంతో జిల్లాలోని 38 మంది టెక్నికల్ అసిస్టెంట్లు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. జనవరిలో నియామకమైన తాము శిక్షణలో పాల్గొన్నామని, ఏప్రిల్లో ఫీల్డ్లోకి వెళ్లినట్లు చెప్తున్నారు. ఏఎస్వోలు ఉద్యోగం తీసేస్తామని భయపెట్టడంతోనే డబ్బులు ఇచ్చినట్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
నగరంలో చైన్ స్నాచింగ్లు
నిజామాబాద్ అర్బన్: నగరంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న గొలుసు చోరీలు కలకలం రేపాయి. వివరాలు ఇలా ఉన్నాయి. తాడెం గ్రామానికి చెందిన మానస తన కూతురితో కలిసి పనినిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చింది. తిరుమల థియేటర్ చౌరస్తాలో నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో ని రెండు తులాల బంగారు చైన్ను లాక్కెళ్లారు. దీంతో మానస కిందపడిపోగా తన కూతురు తీవ్ర భ యాందోళనతో బైక్ను వెంబడించినా అత్యంత రద్దీ ప్రాంతం కావడంతో పట్టుకోలేకపోయింది. అదే సమయంలో నగర శివారులోని మాధవనగర్ క్యా న్సర్ ఆస్పత్రి వద్ద చైన్స్నాచింగ్కు యత్నించగా, మ హిళ అప్రమత్తం కావడంతో దుండగులు పారిపోయారు. వరుస చోరీ ఘటనలతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. -
అభివృద్ధి.. ఉపాధి
ఖలీల్వాడి: స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టడమే లక్ష్యంగా ‘వికసిత్ భారత్’ దిశగా అడుగు లు పడుతున్నాయి. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశ ప్రధాన థీమ్గా ‘యువశక్తి’ని చాటిచెబుతున్న నేపథ్యంలో ‘2047 నాటికి నిజామాబాద్ జిల్లా స్వరూపం ఎలా ఉండాలి? దేశ ప్రగతిలో యువత పాత్ర ఏమిటి?’ అనే అంశంపై జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక డిబేట్ నిర్వహించింది. ఈ చర్చా వేదికలో విద్యార్థులు తమ ఆలోచనలను, ఆకాంక్షలను నిర్భయంగా పంచుకున్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, రవాణా రంగాలు మెరుగుప డి యువతకు ఉపాధి అవకాశాలు పెరిగితే జిల్లా అభివృద్ధి చెందుతుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలలోపు ప్రగతిలో ముందుండాలి విద్య, వైద్యం, వ్యవసాయ, రవాణా రంగాలు మెరుగవ్వాలి ‘సాక్షి’ ప్రత్యేక డిబేట్లో ‘ఎస్ఎస్ఆర్’ డిగ్రీ కళాశాల విద్యార్థుల మనోగతం -
పంద్రాగస్టు వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్ అర్బన్: జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నేడు నిర్వహించనున్న 80వ స్వా తంత్య్ర దినోత్సవాల కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉదయం 9.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను కలెక్టర్ భవేశ్మిశ్రా, సీపీ సాయి చై తన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు శుక్రవారం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎ లాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ప్రదర్శన ఆకట్టుకునే రీతిలో ఉండాలని అన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ట్రైనీ ఆర్డీవో సందీప్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ తదితరులు ఉన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి.. మోపాల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. నగర శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈనేపథ్యంలో కలెక్టర్ భవేశ్మిశ్రా శుక్రవారం అధికారులతో కలిసి భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. -
తిరంగా ర్యాలీతో గుండె నిండా దేశభక్తి
సుభాష్నగర్: తిరంగా ర్యాలీతో జిల్లా ప్రజల గుండె నిండా దేశభక్తి ఉప్పొంగిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుంచి గాంధీచౌక్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంతో దేశభక్తి పెంపొందడమే కాకుండా స్వాతంత్ర సమరయోధుల చరిత్ర తెలిసే అవకాశం ఉంటుందన్నారు. తిరంగా ర్యాలీ అంటే చేతిలో జెండా పట్టుకొని నడవడం మాత్రమే కాదని, ప్రతిఒక్కరి హృదయంలో దేశభక్తి, మన ఆలోచనల్లో జాతీయత, చేతల్లో దేశ నిర్మాణాన్ని నింపుకోవడం అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి మాట్లాడుతూ యువత స్వాతంత్ర సమరయోధుల పాఠ్యాంశాలను చదవాలని పేర్కొన్నారు. చిన్న వయస్సులో దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, ఉద్దం సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, అబ్దుల్ కలాం తదితరుల చరిత్రను తెలుసుకోవాలన్నారు. తిరంగా ర్యాలీ ఆద్యంతరం హుషారుగా కొనసాగింది. ర్యాలీలో 150 మీటర్ల త్రివర్ణపతాకం ఆకట్టుకుంది. కార్యక్రమంలో జాతీయ పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, బీజేపీ ఫ్లోర్లీడర్ ప్రమోద్, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మోర్చాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి ఇందూరులో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం -
బడి తోట ఆరోగ్య బాట
నందిపేట్(ఆర్మూర్): రసాయనాలు లేకుండా కూరగాయలు సాగు చేయడంపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు వారు సాగు చేసిన కూరగాయలను వారే తినేందుకు ఉద్దేశించిన ‘కిచెన్ గార్డె న్’లు నందిపేట మండలంలో సక్సెస్ఫుల్గా సాగవుతున్నాయి. ఖాళీ సమయంలో పాఠశాలల ఆవరణలోని కిచెన్ గార్డెన్లో విద్యార్థులు కూరగాయల సాగు పనులు చేస్తున్నారు. చేతికందిన కాయగూరలను మధ్యాహ్న భోజనానికి వినియోగించుకుంటున్నారు. మండలంలోని ఆయా స్కూళ్లలో ప్రధానోపాధ్యాయుల చొరవ, ఉపాధ్యాయుల తోడ్పాటు, విద్యార్థుల కృషి ఫలితంగా బడితోటలు కళకళలాడుతున్నా యి. బాద్గుణ, వెల్మల్, అయిలాపూర్, కంఠం పాఠశాలలతోపాటు మరి కొన్ని స్కూళ్లలో ఆకు కూరలతోపాటు కూరగాయలతో రోజుకో రకమైన వంటకాలను అందిస్తూ విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. అలాగే పసుపు, అరటి తోటలను సైతం పండిస్తున్నారు. సాగుకోసం గ్రీన్నెట్ షెడ్లను నిర్మించడం గమనార్హం. నిత్యం ఇలా తోటలోని టమాట, బీరకాయ, మిర్చి, వంకాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకు కూరలు తెంపి వంటకు వినియోగిస్తున్నారు. సాగుకోసం విద్యార్థులతో కిచెన్ గార్డెన్ కమిటీలను వేశారు. పాఠశాలల ఆవరణలో కూరగాయల సాగు సేంద్రియ విధానాన్ని అవలంబిస్తున్న విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వినియోగం -
ఝార్ఖండ్ సీఎం దిష్టిబొమ్మ దహనం
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీ పీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ అధ్యక్షుడు సమీర్ మాట్లాడుతూ.. ఝార్ఖండ్ రాష్ట్రంలో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పేపర్ లీకేజీలపై గత 19 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం లాఠీచార్జి చేయడం, భాష్పవాయుగోళాలు, వాటర్ కెనాన్స్ ప్రయోగించడం సిగ్గు చేటన్నారు. విద్యార్థులు తమ సమస్యలను అసెంబ్లీ దాకా విన్పించేందుకు చేపట్టిన ‘విధానసభ ఘోరా వ్’ కార్యక్రమంపై పోలీసులు లాఠీచార్జీ చేయడం హేయమైన చర్య అన్నారు. విద్యార్థులు వారి న్యా యమైన డిమాండ్స్ కోసం ఉద్యమిస్తుంటే సీఎం హేమంత్ ప్రభుత్వం వారిని అణచివేయడానికి యత్నిస్తుందని ఆరోపించారు.పేపర్ లీకేజీకి బా ధ్యులైన అధికారులను, లాఠీచార్జికి కారణమైన పో లీసులను గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నేతలు వనవాసి అశోక్,అనిల్,లెనిన్, మహేశ్, కార్తీక్, కిరీటి, విఘ్నే ష్, చరణ్, టిల్లు, ప్రీతం, నిఖిల్ పాల్గొన్నారు. -
జాబ్మేళాలో 80 మంది ఎంపిక
ఖలీల్వాడి: నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల (బాయ్స్)లో గురువారం నిర్వహించిన జాబ్ మేళాలో 80 మంది ఎంపికై నట్లు జిల్లా ఐటీఐ కన్వీనర్ జి. యాదగిరి తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ జాబ్ మేళాను నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి 24 ప్రముఖ కంపెనీలు హాజరయ్యాయని, వివిధ ట్రేడ్లకు చెందిన మొత్తం 306 మంది అభ్యర్థులు హాజరై ఉద్యోగాలు, అప్రెంటిస్ షిప్ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు పాల్గొన్నారు. కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు, పనితీరు తదితర అంశాలను పరిశీలించి ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఎంపిక ప్రక్రియ అనంతరం 150 మంది అభ్యర్థులు అప్రెంటిస్ షిప్ కు ఎంపిక కాగా, మరో 80 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికై న అభ్యర్థుల్లో 46 మందికి జాబ్ మేళా వేదిక పైనే కంపెనీల ప్రతినిధులు ఆఫర్ లెటర్లను అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి ఐటీఐ ప్రిన్సిపాళ్లు, అభ్యర్థులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పని చేయాలి
● స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, పంద్రాగస్టు వేడుకలపై కలెక్టర్ భవేశ్ మిశ్రానిజామాబాద్ అర్బన్ : స్వాతంత్య్ర దినోత్సవా లు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురు వారం సమీక్షా సమావేశం నిర్వహించారు. స్మా ర్ట్ రేషన్కార్డుల పంపిణీ జిల్లాస్థాయి కార్యక్రమా న్ని నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో ని ర్వహించనున్నారు. ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రేషన్డీలర్లు, రేషన్ లబ్ధిదారులు స్మార్ట్ కార్డుల పంపిణీకి హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ అ న్నారు. ఎక్కడా గందరగోళానికి తావుండొద్దని సూచిస్తూ సంబంధిత శాఖల అధికారుల కు బాధ్యతలు పురమాయించారు. అలాగే పోలీ స్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే స్వాతంత్య్ర దినో త్సవాలకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్ర భుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన పు రోగతిని సమగ్రంగా తెలిపేలా ముఖ్య అతిథి ప్ర సంగం నివేదిక ఉండాలన్నారు. స్వాతంత్య్ర స మరయోధులతోపాటు వారి కుటుంబీకులను ఘనంగా సత్కరించేలా ఏర్పాట్లు చేయాలన్నా రు. అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో బి గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ట్రెయినీ ఆర్డీవో సందీప్, డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, డీఆర్డీవో సాయన్న, సీపీవో కిషన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సర్పంచ్ భర్తపై విచారణ
డిచ్పల్లి: మండలంలోని సుద్దులం గ్రామ సర్పంచ్ తీనేటి హేమలత భర్త లక్ష్మణ్రెడ్డి పంచాయతీ పాలనలో జోక్యం చేసుకుంటున్నారని ఉప సర్పంచ్ చెవిటి నరేశ్ జిల్లా పంచాయతీ అధికారికి ఇటీవల ఫిర్యాదు చేశారు. డీపీవో ఆదేశాల మేరకు గురువారం నిజామాబాద్ డీఎల్పీవో శ్రీనివాస్ సుద్దులం గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టారు. సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ పాలకవర్గం సభ్యులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. విచారణ నివేదికను డీపీవోకు అందజేస్తానని డీఎల్పీవో తెలిపారు. ధర్పల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్ మాలావత్ సరస్వతి అన్నారు. మండలంలోని గుడి తండా గ్రామపంచాయతీ పరిధిలో వన మహోత్సవంలో భాగంగా సర్పంచ్ అధికారులతో కలిసి మొక్కలను గురువారం నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరస్వతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటింటికి మొక్కలు నా టాలన్నారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ఉప సర్పంచ్ మోహన్ నాయక్, కానిస్టేబులు సునీల్, నరేష్, నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి: సిర్నాపల్లిలోని జానకీబాయి గడీని, చెరువు వాటర్ ఫాల్స్ని జిల్లా పర్యాటక శాఖ అధికారి పవన్ కుమార్ గురువారం సందర్శించారు. ఈ సంధర్భంగా ఆయన వాటర్ ఫాల్స్ వద్ద పర్యాటకులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సిర్నాపల్లిలోని చారిత్రాత్మక ప్రదేశాలను, ప్రకృతి అందాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ కృషి చేస్తుందని అన్నారు. వాటర్ ఫాల్స్ వద్ద పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్పంచ్ అనిత, వీడీసీ సభ్యులు ఉన్నారు. ధర్పల్లి: మద్దుల్ తండాలో సర్పంచ్ అరుణ అధ్యక్షతన గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో జలసిరిపై ప్రజలకు అధికారులు వివరించారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలన్నారు. వ్యర్ధాల నిర్వహణ నిబంధనలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై చర్చించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంపీవో శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు. సుభాష్నగర్: విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాలో భాగంగా నిజామాబాద్ సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు 43 ఇంటర్ లింక్ లైన్లు ఏర్పాటు చేశామని ఎన్పీడీసీఎల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పీవీ రాజేశ్వర్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 33కేవీ ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థ అనగా.. ఒక 33/11కేవీ సబ్స్టేషన్ నుంచి మరొక 33/ 11కేవీ సబ్స్టేషన్కు, అలాగే ఒక 33/11కేవీ సబ్స్టేషన్ నుంచి మరో 132/33 కేవీ సబ్స్టేషన్కు, 33కేవీ లైన్ నుంచి మరో 33 కేవీ లైన్కు మధ్య అనుసంధానంగా ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందజేయడం ఇంటర్ లింక్ లైన్ల ముఖ్య ఉద్దేశమన్నారు. నిజామాబాద్ సర్కిల్ పరిధిలోని 218 33/11కేవీ సబ్ స్టేషన్లలో 97 33కేవీ లైన్లలో ఇంటర్ లింకింగ్ వ్యవస్థను చేపట్టినట్లు వివరించారు. -
అటవీశాఖపై విజిలెన్స్ కన్ను!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా అటవీ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై రాష్ట్ర శాఖకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతున్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్, విజిలెన్స్ టీమ్లు జిల్లాకు వచ్చి ఆరోపణలున్న అధికారులు, సిబ్బందిపై విచారణ చేస్తుండడంపై అటవీ శాఖలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఒకదాని వెంట ఒకటి వరుస సంఘటనలు చోటు చేసుకోవడం శాఖను కుదిపేస్తున్నాయి. అయితే, జిల్లాలో పని చేసి బదిలీపై వెళ్లిన ఒక రేంజ్ ఆఫీసర్ మీద రెండు నెలల క్రితం ఫ్లయింగ్ స్క్వాడ్ విచారణ చేపట్టారు. అదే అధికారిపై విజిలెన్స్ అధికారులు వారం కిందట జిల్లాకు వచ్చి విచారణ చేశారు. సదరు అధికారి పని చేసిన రేంజ్లో విలువైన అటవీ భూముల కబ్జాకు సహకరించి భారీగా డబ్బులు దండుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై పీసీసీఎఫ్కు ఫిర్యాదులు వెళ్లడంతోనే విజిలెన్స్ బృందం ఇటీవల రంగంలోకి దిగి లోతైనా విచారణ చేపట్టారు. అలాగే గతంలో పని చేసిన ఓ డిప్యూటీ ఎఫ్ఆర్వో మీద కూడా ఇలాంటి ఆరోపణలు ఉండడంతో ఆయన పని చేసిన పరిధిలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. ఎఫ్ఆర్వో, డీఆర్వోలు చేతులు కలిపి అటవీ భూముల కబ్జాల విషయంలో అవినీతికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. బొగ్గు బట్టీ విషయంలోనూ.. నిజామాబాద్ నార్త్ రేంజ్లో రెంజల్ మండలం నీల గ్రామ శివారులో నిబంధనలు అతిక్రమించి బొగ్గుబట్టీని నిర్వహిస్తున్న విషయంలోనూ పీసీసీఎఫ్కు ఫిర్యాదులు వెళ్లాయి. వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు బొగ్గుబట్టీని, జానకంపేట్లో ఉన్న బొగ్గు గోదామును తనిఖీ చేశారు. బొగ్గు బట్టీలో నిబంధనలకు విరుద్ధంగా పది రకాల కలప ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే పరిమితికి మించి కట్టె డంపులు ఉండటాన్ని గమనించారు. బొగ్గుబట్టీని నిర్వహిస్తున్న వారిలో ఇద్దరు వ్యక్తులను పట్టుకోగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, వ్యాపారులతో చేతులు కలిపిన స్థానిక అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లుగా సమాచారం. చెట్లను అడ్డగోలుగా నరికివేస్తూ బొగ్గు బట్టీకి వినియోగిస్తున్నా స్థానిక అటవీ అధికారులు ఎందుకు పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ మహారాష్ట్ర నుంచి రవాణా జరిగితే చెక్ పోస్టుల్లో ఎందుకు అడ్డుకోలేదు, బట్టీలోకి వచ్చిన తర్వాత ఎందుకు తనిఖీ చేయలేదనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. జిల్లా నుంచి రాష్ట్ర శాఖకు వెళ్లిన ఫిర్యాదులు గతంలో పని చేసిన ఓ రేంజ్ ఆఫీసర్పై ఇటీవల విచారణ అటవీ భూముల్లో అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు -
అధ్వానంగా రహదారులు
● భారీ గుంతలతో వాహనదారులకు అవస్థలు ● పట్టించుకోని అధికార యంత్రాంగం సిరికొండ: మండలంలోని కొండాపూర్ నుంచి ముషీర్నగర్ మీదుగా జిల్లా కేంద్రం వైపు వెళ్లే రోడ్డు అత్యంత అధ్వానంగా మారింది. బీటీ రోడ్డుపై తారు, కంకర లేచిపోయి పెద్ద పెద్ద గుంతలతో దర్శనమిస్తోంది. ఈ గుంతల రోడ్డుతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొండాపూర్ వడ్డెర కాలనీ నుంచి గడ్డమీది తండా, మెట్టుమర్రి తండా, ముషీర్నగర్ మీదుగా కార్నర్ తండా వరకు ఐదు కిలోమీటర్లకు పైగా గల ఈ రోడ్డులో అడుగు అడుగు ఒక గుంత దర్శనమిస్తోంది. గుంతలమయంగా మారిన ఈ మార్గంలో ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. గుంతల్లో వాన నీళ్లు నిలిచి రోడ్డు చెరువును తలపిస్తున్నాయి. ఈ రోడ్డు మీదుగా ప్రయాణం నరకం కనిపిస్తుందని వాహనదారులు వాపోతున్నారు. గుంతలు అడుగు లోతు కంటే ఎక్కువగా ఉండటంతో భారీ వాహనాలతో పాటు కార్లు, వ్యాన్లు లాంటి వాహనాల అడుగు భాగం నేలకు తగులుతున్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు. వాహనాల అడుగు భాగం నేలకు తగిలి వాహనాలు చెడిపోతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకాల, గోప్యనాయక్ తండా, వర్జన్ తండా, తూంపల్లి, గోప్య తండా, సర్పంచ్ తండా, కొండాపూర్ గ్రామాల ప్రజలతో పాటు మరో ఐదారు తండాలకు చెందిన ప్రజలు జిల్లా కేంద్రం వైపు ఈ మార్గంలోనే నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడిన కనీస మరమ్మతులు చేయకపోవడం పట్ల సంబంధిత అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతల్లో కంకర నింపి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. -
ఈనెలలో అదనంగా సదరం క్యాంపులు
డొంకేశ్వర్(ఆర్మూర్): దివ్యాంగులకు వైకల్య శాతాన్ని నిర్ధారించేందుకు అధికారులు ప్రతి నెలా నిర్వహించే సదరం క్యాంపుల సంఖ్య ను పెంచారు. ఇదివరకు నెలకు రెండు సార్లు మాత్రమే నిర్వహించే క్యాంపులను ఈ నెల లో ఆరుకు పెంచినట్లు ఐకేపీ పింఛన్ల విభా గం డీపీఎం రాజేశ్వర్ గురువారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకుంటున్న నేపథ్యంలో స దరం సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్న ట్లు వెల్లడించారు. సదరం క్యాంపుల కోసం జిల్లా వ్యాప్తంగా 1,500మంది వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని వేచి ఉన్నారని, వారి కోసం రానున్న పక్షం రోజుల్లో క్యాంపులు నిర్వహిస్తామన్నారు. వికలాంగత్వ నిర్ధారణ ధ్రువపత్రాలు నిర్ణీత సమయానికి అందజేస్తామని, అర్హులైన దివ్యాంగులు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సదరం క్యాంపుల సమాచారం మొబైల్ ఫోన్లకు వస్తుందని, సూచించిన తేదీల్లో క్యాంపునకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం ఖలీల్వాడి : జిల్లా విద్యాశాఖ పరిధిలోని స మగ్ర శిక్ష, డీపీవోలో ప్లానింగ్ కో ఆర్డినేటర్, క్వాలిటీ కో ఆర్డినేటర్, జెండర్ ఈక్విటీ కో ఆ ర్డినేటర్, ఐఈ, సీఎంవో, మీడియా–ఓఎస్సీ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కో ఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు డీఈవో పార్శి అశోక్ గురువారం తెలిపారు. ప్రభుత్వ, జి ల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన గెజిటెడ్ హెడ్ మాస్ట ర్లు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ఆన్లైన్లో ద రఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్దేశిత అర్హతలు, ఇతర అర్హత ప్రమాణాల ను పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాల కోసం www.sch ooledu.telangana.gov.inను సంప్రదించాలని సూచించారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రఘురాం ఖలీల్వాడి : అఖిల భా రత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉ మ్మడి జిల్లాకు చెందిన బానోత్ రఘురాంనాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంస్థ 90 వ వార్షికోత్సవాలను ఈ నెల 12, 13 తేదీల్లో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నుకున్న జా తీయ కార్యవర్గంలో రఘురాంకు చోటుదక్కింది. బాన్సువాడ మండలం రాంపూర్తండాకు చెందిన రఘురాం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స హాయ కార్యదర్శిగా విద్యార్థి ఉద్యమాల్లో క్రి యాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా రఘురాం జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వి ద్యార్థుల అభివృద్ధి, ప్రభుత్వ విద్యారంగ బలోపేతమే లక్ష్యంగా పోరాటం కొనసాగుతుందన్నారు. ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రార్థన సమయానికి హాజరుకాని ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. సదాశివనగర్ మండలం ధర్మారావ్పేట్ ఉన్నత పాఠశాలను ఈ నెల 7న స్థానిక సర్పంచ్ ఉమర్ తనిఖీ చేయగా, ప్రార్థన సమయంలో ఇద్దరు ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. ఈ విషయమై ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉపాధ్యాయులకు గురువారం షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ఎంఈవో యోసెఫ్ తెలిపారు. -
డబ్బులు సొంతానికి వాడుకుంటే క్రిమినల్ కేసులు
● డీఆర్డీవో సాయన్న సుభాష్నగర్: సీ్త్రనిధి రికవరీ డబ్బులు ఎవరైనా ఆర్పీలు సొంతానికి వాడుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డీఆర్డీవో సాయన్న ఆదేశించారు. గురువారం నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో మెప్మా సిబ్బంది, ఆర్పీలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి లింకేజీ, రికవరీ, కొత్త సంఘాల ఏర్పాటు, తదితర అంశాలపై సమీక్షించారు. అలాగే మన సీ్త్రనిధి యాప్, డైరెక్ట్ ఎస్హెచ్జీల ద్వారా సీ్త్రనిధికి రికవరీ చేయడం, ఎస్ఎల్ఎఫ్ వారీగా ఆర్పీల లక్ష్యం, ప్రగతిని డీఆర్డీవో అడిగి తెలుసుకున్నారు. లక్ష్య చేధనలో వెనకబడిన సిబ్బంది వారం రోజుల్లో రికవరీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. విధులపై ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని, సీ్త్రనిధి యాప్ను ప్రతిఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మెప్మా ఏవో విజయలక్ష్మి, డీఎంసీ మాధురి, సీ్త్రనిధి ఆర్ఎం రాందాస్, మేనేజర్లు మురళీకృష్ణ, చిరంజీవి, సుగుణ, టీఎంసీలు, సీవోలు, ఆర్పీలు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్వో రాజశ్రీ సుభాష్నగర్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. గురువారం నగరంలోని కలెక్టరేట్లో ఉన్న డీఎంహెచ్వో కార్యాలయంలో ఆమె సీజనల్, జీవనశైలి వ్యాధులు, క్షయ, వ్యాధి నిరోధక టీకాలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను తొలగించాలని, ఖాళీ ప్లాట్లు, మురుగునీరు నిల్వల్లో ఆయిల్ బాల్స్ వదలాలని సూచించారు. డెంగీ బారిన పడ్డ వారి ఇంటి చుట్టూ 50 ఇళ్ల వరకు స్ప్రే చేయాలని, ఇంటింటికీ జర సర్వే చేపట్టి ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడేగా నిర్వహించాలని, సీజనల్ వ్యాధులపై ప్రజల్లో, పాఠశాలల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు. జీవనశైలి వ్యాధుల్లో భాగంగా 30ఏళ్లపైబడిన వారికి హైపర్ టెన్షన్, మధుమేహం, క్యాన్సర్, తదితర నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీటీసీవో దేవి నాగేశ్వరి, పీవోడీటీ అంజన, డిప్యూటీ డీఎంహెచ్వో సికందర్ నాయక్, ప్రోగ్రాం అధికారులు వెంకన్న, వెంకటేశ్, శ్రావ్య, పీహెచ్సీల సీహెచ్వోలు, హెచ్ఈవోలు, హెచ్ఈవోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
నిజం నిగ్గుతేలేనా..?
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో 13 ఏళ్ల నుంచి కొనసాగుతున్న వివాదాస్పద నియామకాలపై జాతీయ ఎస్టీ కమిషన్ శుక్రవారం హైదరాబాద్లో విచారణ చేపట్టనుండడంతో ఉత్కంఠ నెలకొంది. కమిషన్ ఎదుట తెయూ ఉన్నతాధికారులు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, నియామకాలపై కమిషన్ను ఆశ్రయించిన బాధితుడు హాజరు కానున్నారు. అధ్యాపకుల నియామకాల్లో కనీస నిబంధనలు పాటించలేదని, రోస్టర్ పాయింట్ల గందళగోళం వల్ల తనకు అన్యాయం జరిగిందని వెంకట్నాయక్ అనే వ్యక్తి అందజేసిన ఫిర్యాదు మేరకు జాతీయ ఎస్టీ కమిషన్ ఈ నెల 3వ తేదీన నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 2012 (2013–14) నాటి నియామక ప్రక్రియపై ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ, రిటైర్డ్ జడ్జ్ సీవీ రాములు నివేదికలు, తెలంగాణ హైకోర్ట్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు, పాలకమండలి తీర్మానాలు, ఇతర వివరాలను వర్సిటీ ఉన్నతాధికారులు ఎస్టీ కమిషన్ కమిషనర్కు చూపిస్తారా.. లేదా గోప్యంగా ఉంచుతారా అనేది వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నియామకాల రోస్టర్ పాయింట్లో తేడా కారణంగా అన్యాయం జరిగిందని వెంకట్నాయక్ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, కాలేజియేట్ కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 14న హైదరాబాద్లో విచారణకు హాజరు కావాలని జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసు జారీ చేసింది. కేవలం సమాధాన పత్రాలు పంపడం కాకుండా, 2013 నాటి నియామక నోటిఫికేషన్, రోస్టర్ పాయింట్ రిజిస్టర్లు, ఎంపిక జాబితాలు, మెరిట్ లిస్ట్లతో సహా.. అన్ని సంబంధిత అసలు రికార్డులను తీసుకొని విచారణకు హాజరుకావాలని కమిషన్ నోటీసులో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద ఉండటం, ఇదే సమయంలో జాతీయ ఎస్టీ కమిషన్ స్వయంగా జోక్యం చేసుకోవడం, పైగా అధికారులను నేరుగా హాజరు కావాలని ఆదేశించడంతో ఈ విచారణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విచారణ తర్వాత వర్సిటీ నియామకాలపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెయూలో వివాదాస్పద నియామకాలపై నేడు విచారణ జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట హాజరు కానున్న వర్సిటీ ఉన్నతాధికారులు యూనివర్సిటీవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ -
ఎన్సీఎస్ఎఫ్ను తెరిపించాలి
నిజామాబాద్ రూరల్ : మూతపడిన నిజాం కో ఆపరేటీవ్ షుగర్ ఫ్యాక్టరీ (సారంగాపూర్)ని పునః ప్రారంభించి రైతు ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్సీఎస్ఎఫ్ ఆవరణలో సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాపయ్య మాట్లాడుతూ.. సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలోని వేలాది మంది రైతులు, కార్మికులకు దశాబ్దాలపాటు జీవనాధారంగా నిలిచిందన్నారు. ఫ్యాక్టరీని మూసివేయడంతో రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూతపడిన తర్వాత చెరకు సాగు తగ్గిపోయిందని, రైతులు ఇతర పంటలసాగు వైపు మళ్లారన్నారు. ఎన్సీఎస్ఎఫ్ను బెల్లం ఫ్యాక్టరీగా మార్చి ప్రభుత్వమే నడపాలని కోరారు. ఫ్యాక్టరీని తెరవాలని కోరుతూ మూడు తీర్మానాలు చేసి ఎండీ రవికి అందజేశారు. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు ఆర్ పృథ్విరాజ్, పాల్దా రాజారెడ్డి, బి లక్ష్మారెడ్డి, వై సంతోష్, టేక్మల్ లక్ష్మణ్, కొట్టే గంగాధర్, సిర్ప నాగయ్య, బి సాయిలు, ఎర్రన్న, అర్సపల్లి గోపాల్, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడపాలి చెరుకు ఉత్పత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ ఆకుల పాపయ్య -
నిజామాబాద్
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026● ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామ శివారులోని శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ వరద కాలువలో వ్యాన్ బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘ టన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. సా నిటరీ పైపుల లోడ్తో హైదరాబాద్ వైపు వెళ్తున్న వ్యా న్ 44 నంబరు జాతీయ రహదారిపై వంతెనను ఢీకొ ట్టి కాలువలో పడిపోయింది. సమాచారం అందుకు న్న పోలీసులు వెంటనే రెస్క్యూ టీమును రప్పించి వ్యాన్ను వరద కాలువ నుంచి బయటకు తీయించా రు. చాలా సేపు గాలించిన తర్వాత మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్కు చెందిన డ్రైవర్ సుధాం మృతదేహం లభించింది. – వేల్పూర్(ముప్కాల్) ● ఆర్మూర్ మండలం గోవింద్పేట్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన వారు రెండు టూరిస్ట్ బస్సుల్లో హైదరాబాద్ వెళ్తుండగా.. ఒక బ స్సు పంక్చర్ అయ్యింది. దీంతో రెండు బస్సులను ఒక దాని వెనకాల ఒకదానిని నిలిపివేశారు. ఒక బస్సు లోని టూరిస్టులు కిందికి దిగి డివైడర్పై కూర్చు న్నారు. కొంతసేపటికి వేగంగా దూసుకొచ్చిన ట్రక్.. బస్సును వెనుక నుంచి ఢీకొట్టడంతో బస్సు డివైడర్పై కూర్చున్న వారిపైకి దూసుకెళ్లింది. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. – ఆర్మూర్ టౌన్ -
హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ఇందల్వాయి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాపై గౌరవం, దేశభక్తి, జాతీయ ఐక్యతను ప్రజల్లో పెంపొందించేందుకు ఇందల్వాయి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్ ఘర్ తిరంగా పేరు మీద బైక్ ర్యాలీని మండల కేంద్రంలో గురువారం నిర్వహించారు. ఆగస్టు 15న ప్రజలందరు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగుర వేయాలని వారు పిలుపునిచ్చారు. నల్లవెల్లి సర్పంచ్ కన్నె రాజేందర్, కిసాన్ మోర్చ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు నాయిడి రాజన్న, మోహన్ రెడ్డి, జగత్ సింగ్, మఠంల శేఖర్, సక్కి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ: మండల కేంద్రంలో బీజేపీ నాయకులు హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని గురువారం నిర్వహించారు. అంగడి బజార్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు జాతీయ జెండాలను పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ.. జాతీయ జెండా కేవలం ఒక పతాకం కాదని, దేశ ఐక్యత, సమగ్రత, త్యాగాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ భక్తిని చాటాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు సంజీవ్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, ప్రధాన కార్యదర్శులు బాబురావు, మహేందర్, గోవింద్, లింబాగౌడ్, గోపి, లింబాద్రి, ప్రభాకర్, గంగాధర్, నారాయణ, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక మాసం.. శ్రావణం
● ప్రతి రోజు ప్రత్యేకం● ప్రత్యేక వ్రతాలు, పూజలతోపాటు పండుగల సందడి ● కిటకిటలాడనున్న ఆలయాలుఆర్మూర్: భక్తికి, పూజలకు, పండుగలకు ప్రతీక అయిన శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసం అంతా శివుడు, విష్ణువు, వరలక్ష్మి, నాగదేవత ఆరాధనలతో జిల్లాలోని ఆలయాలు ఆధ్యాత్మికతతో కళకళలాడనున్నాయి. మహిళలు ప్రత్యేక పూజలు, వ్రతాలతో ఈ మాసాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఒక నెల రోజుల పాటు భక్తి, భజనలు, బంధాలతో ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొననుంది. ఈసారి ఆలయాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. సోమ, శుక్రవారాలు ప్రత్యేకం.. శ్రావణంలో ప్రతి సోమవారం శివ పూజ, ప్రతి మంగళవారం మంగళగౌరి పూజ, ప్రతి శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఈ ఏడాది శ్రావణ శుక్రవారాలు 4 ఉన్నాయి. సోమవారాల్లో జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ కంఠేశ్వర్, చక్రేశ్వరాలయం, శంభుని గుడి, మార్కండేయ మందిరాల్లో రుద్రాభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంగళవారాల్లో నూతన వధూవరులు, ముత్తైదువులు అమ్మవారి ఆలయాల్లో మంగళగౌరి పూజలు నిర్వహిస్తారు. శనివారాల్లో ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బోధన్ పట్టణంలోని శివాలయాలతో చక్రేశ్వరాలయంతోపాటు ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధల గుట్ట, వేంకటేశ్వర స్వామి ఆలయం, కుక్కల గుట్ట వేంకటేశ్వరాలయాల్లో వేకువజాము నుంచే మహిళలు పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణంలో ఉపవాసాలు, దానాలు, పురాణ పఠనం చేస్తే విశేష పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. గతేడాది కంటే ఈసారి పూలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, వాయినాల కోసం వస్తువులను వ్యాపారులు అమ్మకానికి సిద్దం చేసుకున్నారు. శ్రావణ మాసంలోనే ప్రధాన పండుగలు సైతం వస్తున్నాయి. వీటిలో ఈ నెల 17న సోమవారం నాగ పంచమి, 21న శుక్రవారం వరలక్ష్మి వ్రతం, 28న శుక్రవారం రాఖీపౌర్ణమి, సెప్టెంబర్ 4న శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగలు ఉన్నాయి.ఏఐతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం శ్రావణ మాసంలో వివాహాది శుభ కార్యాలకు మంచి రోజులు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ఫంక్షన్ హాళ్లు, మందిరాలు కళకళలాడనున్నాయి. ఈ మాసంలో 16, 20 నుంచి 28వ తేదీ వరకు, 30వ తేదీ, వచ్చే నెలలో 1, 3, 4, 5వ తేదీల్లో మంచి రోజులు ఉండటంతో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. -
ప్రమాదంలో ప్రాణం
నిజామాబాద్అర్బన్ : జిల్లా మీదుగా 44, 63వ నంబర్ జాతీయ రహదారులు వెళ్తుండగా.. ఆయా ప్రాంతాల్లో 26 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఈ ఏడాది జూలై 30వ తేదీ వరకు జిల్లాలో 63 రోడ్డు ప్ర మాదాలు చోటు చేసుకోగా.. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 42 మంది గాయాలపాలయ్యారు. జిల్లాలోని ఆయా రోడ్లపై గతేడాది 780రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 276 మంది మృతి చెందారు. వీరిలో 83 మంది హైవేలపై ప్రాణాలు కోల్పోగా, 193 మంది రాష్ట్ర, అంతర్గత రోడ్లపై మరణించారు. 715 మంది గాయపడ్డారు. జాతీయ రహదారుల వెంబడి 223 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సంబంధిత అధికారులు గుర్తించిన బ్లాక్ స్పాట్లలోనే కాకుండా గ్రామీణ ప్రాంత రోడ్లపైనా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మూలమలుపులు, జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లపైకి నేరుగా దూసుకురావడం వంటి కారణాలతో తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల డిచ్పల్లి వద్ద చోటు చేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు యువకులు మృతి చెందారు. రుద్రూర్ వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యయి. డిచ్పల్లి వద్ద హైవేపై ప్రైవేట్ బస్సు బోల్తా పడగా నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యయి. శుక్రవారం బడాపహాడ్ వద్ద బస్సు బోల్తా పడడంతో పలువురికి గాయాలయ్యయి. ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై ఆపి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, అలాగే జక్రాన్పల్లి మండలం పడకల్ వద్ద ట్రాక్టర్ను కంటైనర్ వెనకాల నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఇలా రోజూ ఏదో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్ హైవే 44 వెంబడి డిచ్పల్లి సీఎంసీ వద్ద, ఇందల్వాయి, గన్నారం, పెర్కిట్, బాల్కొండ చిట్టాపూర్ , జక్రాన్పల్లి మండలం పడకల్, డిచ్పల్లి పోలీస్ బెటాలియన్ తదితర ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, బోధన్, నందిపేట్, మల్లారంగండి, ఆర్మూర్, డిచ్పల్లి రోడ్లపై ఏదో ఒక ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు శా ఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమా లు నిర్వహిస్తున్నా ఫలితం కనిపించడం లేదు! వా హనదారులు ఎవరివారు రోడ్డు నిబంధనలను పా టించాలనే స్పృహ కలిగి ఉంటేనే రోడ్డు ప్రమాదాల ను అరికట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఆందోళనకు గురిచేస్తున్న రోడ్డు ప్రమాదాలు అతివేగం.. అవగాహనా రాహిత్యం హైవేలతోపాటు అంతర్గత రోడ్లపై యాక్సిడెంట్లు అవగాహన కల్పిస్తున్నా కనిపించని ఫలితం -
ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ఔదార్యం
● అనారోగ్యంతో మృతి చెందిన సహచర మిత్రుడి కుటుంబానికి అండ ● రూ. 4.54 లక్షలుఆర్థికసాయం ఆర్మూర్: ఉపాధి కోసం ఇజ్రాయిల్ దేశం వెళ్లి అక్కడ ఒక యూనిటీగా ఏర్పడిన ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తమ సహచర మిత్రుడు వడ్ల సందీప్ కుటుంబానికి అండగా నిలిచారు. వివరాలను అసోసియేషన్ అధ్యక్షుడు బానాల గంగాధర్, కోశాధికారి తిమ్మాపూర్ శ్రీనివాస్ గౌడ్ గురువారం తెలిపారు. మాక్లూర్ మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన సందీప్ రెండేళ్ల క్రితం ఉపాధి కోసం ఇజ్రాయిల్కు వచ్చాడు. అక్కడే అనారోగ్యం పాలవడంతో ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధుల సహకారంతో ఫిబ్రవరి 27న దుబాయి మీదుగా హైదరాబాద్కు చేరుకున్నాడు. హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 3వ తేదీన మరణించాడు. దీంతో ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు సందీప్ కుటుంబానికి అండగా నిలవాలనే సంకల్పంతో రూ. 4లక్షల54 వేలు విరాళాలను సేకరించారు. సందీప్ కుమారులిద్దరి పేరిట చెరి రెండు లక్షల రూపాయలు తొమ్మిదేళ్ల కోసం డిపాజిట్ చేయించారు. మిగిలిన రూ. 54 వేల నగదును మృతుడి భార్య సౌందర్యకు అందజేశారు. -
క్యాంపస్ కబుర్లు
కొనసాగుతున్న బీటెక్ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెయూ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ సీఎస్ఐ, ఏఐ 2వ సెమిస్టర్ రెగ్యులర్, 1వ సెమిస్టర్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు 56 మందికి 55 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు. పీజీ బ్యాక్లాగ్ పరీక్షల్లో 84 మంది గైర్హాజరు తెయూ పరిధిలో కొనసాగుతున్న పీజీ 1, 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో గురువారం 84 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు మొత్తం 449 మందికి 365 మంది హాజరు కాగా 84 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. దరఖాస్తుల ఆహ్వానం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్ధ ఆధ్వర్యంలో నీట్ 2027 ఉచిత లాంగ్టర్మ్ ధీర్ఘకాలిక శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ జోనల్ ఆఫీసర్ (బాసర జోన్2) ఎస్.యుగంధర లక్ష్మి గురువారం తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరానికి హైదరాబాద్ చిలుకూరు ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)లో బాలురకు, మహేంద్రహిల్స్ ఫౌండేషన్ (సీవోఈ)లో బాలికలకు చెరో వంద సీట్ల చొప్పున మొత్తం 200 సీట్లకు ఉచితంగా ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2025–26లో ఇంటర్లో బైపీసీ పూర్తి చేసి నీట్–2026 రాసిన ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఇందుకు అర్హులని తెలిపారు. ఎలాంటి దరఖాస్తు రుసుము లేని ఈ శిక్షణ కోసం విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి ఫారం డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 22వ తేదీలోగా సంబంధిత జిల్లా కోఆర్డినేటర్కు సమర్పించాలని జోనల్ ఆఫీసర్ సూచించారు. -
పాఠశాలలో నీటి సౌకర్యం కల్పించాలి
మోపాల్: బోర్గాం(పి) ప్రాథమిక పాఠశాలలో వి ద్యార్థులకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని సీపీఐ జి ల్లా కార్యదర్శి పి.సుధాకర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ ప్రచార యాత్రలో భాగంగా బుధవారం నగరశివారులోని బోర్గాం(పి) ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భో జన పథకాన్ని సీపీఐ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి నాయకులు భోజనాలు చేశారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకా న్ని సెంట్రలైజ్డ్ కిచెన్ పేరుతో హరే రామ హరే కృష్ణ అనే స్వచ్ఛంద సంస్థకు కేటాయించడం అన్యాయమన్నారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 54,200 మంది మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు రోడ్డు న పడే అవకాశం ఉందన్నారు. నాయకులు ఓమయ్య, రంజిత్, అలీ, రమేష్ ఉనారను. -
తెయూలో ఘనంగా బోనాల పండుగ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం క్యాంపస్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏబీవీపీ ఇందూర్ విభాగ్ ప్రముఖ్ రేంజర్ల నరేష్ హాజరై, ఉత్సవాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. అనంతరం విద్యార్థినులు బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో పోతురాజుల విన్యాసాలు అలరించాయి. డీజే పాటలకు అనుగుణంగా విద్యార్థులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ శివ, వర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు సమీర్, మోహన్, నాయకులు సాయికుమార్, శివ, మనోజ్, ప్రవీణ్, అశోక్, శివ, రమణ పాల్గొన్నారు. -
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం
రుద్రూర్: డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య ఆదేశించారు. బోధన్ డివిజన్లోని పోలీస్ అధికారులతో కోటగిరి పోలీస్స్టేషన్లో సీపీ బుధవారం సమావేశమై పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు. డ్రగ్స్, గంజాయి, పేకాట, గుట్కా, ఇసుక అక్రమ రవాణాపై నిరంతర దాడులు నిర్వహించాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆన్లైన్ మో సాల బాధితులకు తక్షణ సాయం అందించాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులపై నిఘా సారించాలని, పెట్రోలింగ్, వాహన తనిఖీలను ము మ్మరం చేయాలన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్స్పాట్లను గుర్తించి సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏసీపీ పి శ్రీనివాస్, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, సీఐలు, ఎస్హెచ్వోలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గుత్ప ఎత్తిపోతలు ఆదుకునేనా?
ఆర్మూర్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రతి ఏటా వృథాగా పోతున్న లక్షల క్యూసెక్కుల వరద నీటిని ఆర్మూర్ ప్రాంత రైతుల కోసం మళ్లించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అర్గుల్ రాజా రాం (గుత్ప) ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. మొ దటి సారి అధికారంలోకి రాగానే రూ.204 కోట్ల కేటాయించి త్వరితగతిన పనులు పూర్తి చేయించారు. ఎస్సారెస్పీలోని గోదావరి నది జీరో పాయింట్ నుంచి 17 కిలో మీటర్ల దూరంలోని నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ శివారులో నాలుగు మో టార్లతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. మాక్లూ ర్ మండలం లక్ష్మాపూర్ శివారులో రెండో దశ పంప్హౌజ్ నిర్మాణం చేట్టారు. 2008 మార్చి 18న వైఎస్ రాజశేఖరరెడ్డి తన స్వహస్తాలతో అర్గుల్ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఎస్సారెస్పీ జలాలు 22.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆర్మూర్ ప్రాంత వ్యవసాయ భూములకు అందుతుండటంతో ఇక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో పంటలు సాగు చేశారు. మూడు దశాబ్దాలుగా సాగునీరందక బీళ్లు వారిన నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆర్మూర్లో సాగునీటి గలగలలతో రైతాంగం పులకించింది. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎస్సారెస్పీలో ఈ ఏడాది నీటి నిలువ ఆశాజనకంగా లేదు. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. బుధవారం సాయంత్రానికి కేవలం 1079.40 అడుగుల (43.371 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఎగువన ఉన్న మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఆశించిన మేర వరద రాకపోకగా.. స్థానికంగా సాధారణ వర్షపాతం కూడా నమోదు కావడం లేదు. దీంతో ఎస్సారెస్పీలోకి ఆశించిన మేర నీరు చేరలేదు. ఈ పరిస్థితుల్లో పాలకులు రాజకీయాలను పక్కన పెట్టి కాళేశ్వరం నీటినైనా ఎస్సారెస్పీకి చేరుస్తారేమోనని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాలకులు స్పందించి గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేసి తమ గ్రామాల చెరువులను నింపాలని కోరుతున్నారు. పరిగెత్తే నీటికి నడక నేర్పాలి.. నడిచే నీటికి నిలకడ నేర్పాలి.. నిలిచిన నీటిని సాగుకు వినియోగించి రైతుల అభ్యున్నతికి తోడ్పడాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞ ఫలం గుత్ప (అర్గుల్ రాజారాం) ఎత్తిపోతల పథకం. అయితే ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకం ప్రశ్నార్థకంగా మారుతోంది.గుత్ప ఎత్తిపోతలే దిక్కు ఆర్మూర్ ప్రాంత రైతులు పంటలు పండించాలంటే గుత్ప ఎత్తిపోతల పథకమే దిక్కు. చెరువులు నిండితేనే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాలతో సంబంధం లేకుండా ఎత్తిపోతల నీటితో చెరువులు నింపడానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి. – నాగం నాగన్న, రైతు, పిప్రి, ఆర్మూర్ మండలంముందుగానే చెరువులు నింపాలి ఆర్మూర్ ప్రాంతం తలాపునే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉన్నా ఈ ప్రాంత రైతులు ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఇక్కట్లు పడ్డారు. ఎల్నినో ఎఫెక్ట్ గురించి అధికారులకు ముందుగానే సమాచారం ఉంది కాబట్టి గుత్ప ఎత్తిపోతల నీటితో ఆర్మూర్ ప్రాంత చెరువులను ముందుగానే నింపాలి. – ఏపీ గంగారాం, రైతు, పిప్రి, ఆర్మూర్ మండలం ఆయకట్టు రైతుల్లో ఆందోళన ఎస్సారెస్పీలోకి ఆశించిన మేర చేరని వరద నీరు ప్రస్తుతం నిల్వ ఉంది 43.371 టీఎంసీలే.. ఖరీఫ్తోపాటు యాసంగి సాగూ ప్రశ్నార్థకమే? -
పుట్టుకొచ్చిన సర్టిఫికెట్లు
1969కి ముందు జన్మించిన వారికి ధ్రువీకరణపత్రాలుతేలనున్న మొక్కల లెక్కలు!గురువారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 8లో uసీజనల్ వ్యాధులపై షార్ట్ ఫిల్మ్ విడుదల సుభాష్నగర్: జిల్లాలోని గోవింద్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మానస ఆధ్వర్యంలో ‘మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే’ అనే శీర్షికతో కోకిల నాగరాజు రచించి రూపొందించిన షార్ట్ ఫిలింను డీఎం అండ్ హెచ్వో రాజశ్రీ బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూ పొందించిన షార్ట్ ఫిల్మ్ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. దీని ద్వారా ప్రజల్లో అవ గాహన కలుగుతుందని తెలిపారు. అనంత రం షార్ట్ ఫిల్మ్లో నటించిన విద్యార్థినులు, ఆశ కార్యకర్తలు, వైద్యాధికారి, ఉపాధ్యాయుడు కోకిల నాగరాజును డీఎంహెచ్వో సన్మానించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సారెస్పీకి స్వల్ప ఇన్ఫ్లో వేల్పూర్(మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి స్వల్ప ఇన్ఫ్లో వస్తోంది. బుధవారం ఉదయం 4,250 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. సాయంత్రం వరకు 2580 క్యూసెక్కులకు తగ్గిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 43.371 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తుండగా.. 482 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో పోతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. 16న చెస్ ఎంపిక పోటీలు నిజామాబాద్ అర్బన్: ఈ నెల 16వ తేదీన నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు జరుగుతాయని చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆకుల రమేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ – 17 బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని, మిగతా వివరాలకు 94400 07004 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఇంజినీరింగ్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్ ఈ, ఏఐ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులను ఆ హ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈనెల 16 తర్వాత వెలువడే యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్లో టీజీఈఏపీ సెట్– 2026లో అర్హత పొందిన లేదా పొందని విద్యార్థులు లేదా ఇంటర్మీడియెట్ ఎంపీసీతో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్అర్బన్: జనన, మరణాల నమోదు చట్టం వచ్చింది 1969లో.. జనన ధ్రువీకరణపత్రాలు (బర్త్ సర్టిఫికెట్) జారీ అవుతోంది 1970 ఏప్రిల్ 1వ తేదీ నుంచి జన్మించిన వారికి. కానీ జిల్లా కేంద్రంలో 1969కి ముందు జన్మించిన వారికి ఈజీగా బర్త్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. అదీ.. ఒకే ఆధార్ సెంటర్ నుంచి ఒకే రోజున 113 మందికి జనన ధ్రువీకరణ పత్రాలు అందాయి. ఈ వ్యవహారంపై ట్రెయిన్ కలెక్టర్ విచారణ చేపట్టి కలెక్టర్కు నివేదిక అందజేశారు. ఈ ఏడాది జూన్లో ఒకేరోజు 113 బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు నిజామాబాద్ నగరం పరిధిలోని సౌత్ మండల, మున్సిపల్ కార్యాలయ రికార్డుల్లో నమోదైంది. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. 1950లో జన్మించిన ముజాహిద్నగర్, మాలపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు, 1956లో జన్మించిన పాటిగల్లీకి చెందిన వ్యక్తి, 1967లో జన్మించిన ముజాహిద్నగర్కు చెందిన వ్యక్తి, 1961లో జన్మించిన ఫులాంగ్కు చెందిన వ్యక్తి, 1966లో జన్మించిన ముస్తాయిద్నగర్కు చెందిన వ్యక్తి జనన ధ్రువీకరణపత్రాలు పొందిన వారిలో ఉన్నారు. అయితే వీరందరికీ ఏఏ ధ్రువీకరణపత్రాలను పరిశీలించి బర్త్ సర్టిఫికెట్లు జారీ చేశారు? క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగిందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ● ఎస్ఐఆర్ గడువు పొడిగింపు తరువాత నగరానికి చెందిన ఓ కార్పొరేటర్ ఒకేరోజు 60 మందికి జనన ధ్రువపత్రాలు జారీ చేయించినట్లు సమాచారం. అయితే సర్టిఫికెట్లు పొందిన వారు ఎక్కడి వారు.. ఒకే రోజు అంతమందికి ధ్రువపత్రాలు ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ● ఈ ఏడాది జనవరి 26న ఒకేరోజు సౌత్ మండలం కార్యాలయం నుంచి 36 జనన ధ్రువపత్రాల జారీకి అనుమతి లభించినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ సెలవు దినమైన జనవరి 26న సర్టఫికెట్లు ఎలా మంజూరు చేశారనేది అంతుచిక్కని ప్రశ్న. కుమ్మక్కయ్యారా? జనన ధ్రువపత్రాల జారీలో కొందరు అధికారులు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు న్నాయి. ఇద్దరు కార్పొరేటర్లు, రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క ఆధార్ సెంటర్ నిర్వాకుడి ని మచ్చిక చేసుకుని సర్టిఫికెట్లు జారీ చేయించార ని సమాచారం. ఒక్కో జనన ధ్రువపత్రం జారీ కోసం ఆధార్ సెంటర్ నిర్వాహకుడికి రూ.25 వేల స మర్పించారని, రెవెన్యూ అధికారులకూ భారీ మొ త్తంలో ముట్టజెప్పారని విశ్వసనీయంగా తెలిసింది. 2025 డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ 20 వరకు 1925 బర్త్సర్టిఫికెట్లు జారీ అయినట్లు తెలుస్తోంది.డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఈ ఏడాది వన మ హోత్సవం కింద నాటిన మొక్కలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. గ్రామ పంచాయతీల వారీగా నాటిన ప్రతి మొక్కను పరిశీలించడానికి ప్రత్యేక అధికారుల బృందాలను త్వరలో ఏర్పాటు చేయనున్నా రు. రెండు రోజుల క్రితం ఎంపీడీవోలు, ఎంపీవో లు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సమీక్ష నిర్వహించి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీలోగా జిల్లా వ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటే ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. మొక్క లు నాటడం పూర్తయిన వెంటనే గ్రామాల్లో అధికారులు తనిఖీలను ప్రారంభించనున్నారు. అయితే, మొక్కల లెక్కింపులో పారదర్శకత కోసం ఇతర మండలాలకు చెందిన మండల స్థాయి అధికారులను తనిఖీ అధికారులుగా నియమించే అవకాశం కనిపిస్తోంది. ఈ అంతర్గత తనిఖీల అనంతరం ‘థర్డ్ పార్టీ’ విచారణ జరగనున్నట్లు తెలిసింది. తప్పుడు లెక్కలు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు నిధులు రికవరీ చేయిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీవోలు, ఎంపీడీవోలకు భయం పట్టుకుంది. మొక్క ల లెక్కల్లో తేడా రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 26.11 లక్షల మొక్కలు నాటాలని గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యం పెట్టుకుంది. ఇందులో ఇప్పటి వరకు 545 గ్రామ పంచాయతీల్లో ఇళ్లకు అందజేసిన పూల మొ క్కలతో కలిపి 23.03లక్షల (88.22శాతం) మొక్క లు నాటారు. కలెక్టర్ సమీక్షించిన మరుసటి రోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఏకంగా 1,08,611 మొక్కలు నాటేశారు. సిరికొండ, సాలూరా, ఎడపల్లి, చందూర్, మాక్లూర్, రెంజల్, కమ్మర్పల్లి, మండలాలు మొక్కలు నాటడంలో వెనుకబడి ఉండగా.. వేగవంతం చేయకపోతే చర్యలుంటాయని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయన్న సైతం సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వంద స్తంభాల ఆలయానికి ఫెన్సింగ్ బోధన్టౌన్: పట్టణంలోని చారిత్రక కట్టడం వంద స్తంభాల ఆలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, వాచ్మెన్ను నియమిస్తామని పురావస్తు శాఖ అధికారులు అన్నారు. వంద స్తంభాల ఆలయాన్ని రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు బుధవారం సందర్శించారు. అసిస్టెంట్ డైరెక్టర్ సాగర్, యోగ్ధారణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉదయ్ మహరాజ్, న్యా యవాది సాయిప్రసాద్, మాజీ కౌన్సిలర్ ధర్మపురి ఉన్నారు. ఆలయానికి చెందిన ఎకరం 10 గుంటల భూమి ఉందని స్థానికులు అధికారులకు తెలిపారు. భూమి ఆక్రమణకు గురై ఉంటే సంబంధిత శాఖల అధికారులు సమగ్ర సర్వే చేపట్టి భూమిని రక్షించాలని తాము కోరగా.. అధికారులు సానుకూలంగా స్పందించారని స్థానికులు తెలిపారు. ఎస్ఐఆర్ కోసమేనా? త్వరలో ‘వన మహోత్సవం’ తనిఖీలు మండల స్థాయిలో అధికారులతో క్రాస్ వెరిఫికేషన్ రంగం సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగంఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లుగా గుర్తింపు పొందేందుకు కొందరు విదేశీయులకు జనన పత్రాలను హుటాహుటిన జారీ చేయించారనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని ముజాహిద్నగర్, మాలపల్లి, ధర్మపురి హిల్స్, ఆటోనగర్, అర్సపల్లి ప్రాంతాల్లో అక్రమంగా నివాసముంటున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు ఓటు హక్కు కల్పించేందుకు జనన ధ్రువపత్రాలు జారీ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఓ పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు జనన ధ్రువపత్రాల జారీలో అక్రమాలకు తెరలేపినట్లు తెలిసింది. సర్లో ఓటు హక్కు కోసం లేదా అక్రమంగా పాస్పోర్ట్ల కోసం ఈ పత్రాలు జారీచేశారని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో బోధన్లో బంగ్లాదేశీయులకు, రోహింగ్యాలకు అక్రమంగా పాస్పోర్టులను జారీ చేసి అడ్డంగా దొరికిపోయారు. జిల్లా కేంద్రంలో కూడా ఇదే తరహా అక్రమాలు చేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. గుర్తింపును పరిశీలించాం 1950లో పుట్టిన వారికి జనన ధ్రువపత్రాలు జారీలో గుర్తింపు పత్రాలను పరిశీలించడం జరిగింది. పాస్పోర్టులు కలిగి ఇతర గుర్తింపు పత్రాలు ఉన్నట్లు పరిశీలించాకే జననపత్రాల ప్రొసిడింగ్లు జారీ చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో శిక్షణ కలెక్టర్ ఇదివరకే విచారణ పూర్తి చేసి నివేదికను కలెక్టర్కు అందజేశారు. – రాజేంద్రకుమార్, ఆర్డీవో జూన్లో ఒక్క రోజే 113 బర్త్ సర్టిఫికెట్లు జారీ ఆ తరువాత ఒకసారి 60.. మరోసారి 36 జారీ అయినవన్నీ ఒకే ఆధార్ సెంటర్ నుంచి విచారణ చేపట్టిన ట్రెయినీ కలెక్టర్ -
సనాతన ధర్మంపై అవగాహన కల్పించాలి
నిజామాబాద్ రూరల్: మాతృమూర్తులు సనాతన ధర్మంపై అవగాహన కల్పించాలని, సమాజంలో ఎటువంటి సమస్యనైనా దీటుగా ఎదుర్కొని సమాధానం చెప్పే శక్తిగా ఎదగాలని ప్రాంత సహ సంయోజక పద్మశ్రీ, శ్రీవాణి పేర్కొన్నారు. బుధవారం విశ్వహిందూ పరిషత్ ఇందూరు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో మాతృ శక్తి దుర్గావాహిని మహిళా పరిచయవర్గ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృ శక్తి సంయోజక ప్రముఖ వక్త పద్మశ్రీ, దుర్గా వాహిని మహిళామూర్తుల పరిచయ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పద్మశ్రీ , వాణిశ్రీ లు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని వారి స్వశక్తితో తమ జీవితాల్లో స్థిరపడాలని సూచించారు. జిల్లా మాతృశక్తి ఇందూరు జిల్లా సంయోజికగా గాయత్రి, జిల్లా సహ సంయోజికగా జమున, నగర సంయోజికగా అర్చన, సహ సంయోజికగా లాస్య, సత్సంగ్ ప్రముఖ్గా సుశీల, బాల సంస్కార కేంద్ర ప్రముఖ్గా భాగ్య, సేవా ప్రముఖ్గా శ్యామల బాధ్యతలు స్వీకరించిచారు. -
ముళ్లపొదల్లో నవజాత శిశువు
మోపాల్(నిజామాబాద్రూరల్): మండలకేంద్రంలోని బీసీ వసతిగృహం వద్దగల ముళ్లపొదల్లో బుధవారం నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. ముడి వేసి ఉన్న బ్యాగులోనుంచి శిశువు ఏడుపులు రావడంతో అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులు, అంగన్వాడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉందని, బుధవారమే జన్మించినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. శిశువును ఎవరు వదిలి వెళ్లారనే విషయాలను వైద్య, ఆరోగ్యసిబ్బంది ఆరా తీస్తున్నారు. అలాగే మండలంలో నేడో, రేపో ప్రసవ తేదీలు కలిగిన గర్భిణుల వివరాలు సేకరిస్తున్నారు. మానవత్వం మంటగలిసేలా కన్న తల్లి పేగుబంధాన్ని మర్చిపోయి అప్పుడే పుట్టిన బిడ్డను వదిలించుకోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. -
పెన్షన్లో కోత వద్దు
నిజామాబాద్ రూరల్: ప్రయివేట్, కార్పొరేట్ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకోకుండానే మూడు నెలలుగా పెన్షన్లో 1.5 శాతం కోత విధించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఆల్ పెన్షనర్– రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్(నిజామాబాద్) గౌరవాధ్యక్షులు కె. రామ్మోహన్రావు పేర్కొన్నారు. బుధవారం పెన్షనర్స్ భవన్లో ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు శిర్ప హనుమాండ్లు, ప్రధాన కార్యదర్శి ఈవిల్ నారాయణ, నాయకులు ప్రసాదరావు, పురుషోత్తం రావు, చంద్రశేఖర్, రాజేశ్వర్, సాంబశివరావు, లంకా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 18న ‘ సేవాస్ఫూర్తి అవార్డ్స్’ నిజామాబాద్ రూరల్: మానవతా సేవలకు అంకితమై పనిచేస్తున్న సేవకులను గుర్తించి, వారి సేవలకు గౌరవం అందించాలనే మహోన్నత సంకల్పంతో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 18న నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సేవాస్ఫూర్తి అవార్డ్స్–2026 ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. మద్దుకూరి సాయిబాబు తెలిపారు. బుధవారం సంస్థ కార్యాలయంలో సేవా స్ఫూర్తి అవార్డ్స్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. ‘బొడ్లె సంచి’ పుస్తకావిష్కరణ ఖలీల్వాడి: జక్రాన్ పల్లి మండలం మనోరాబాదు గ్రామానికి చెందిన పాట్కూరు తిరుపతి రెడ్డి రచించిన బొడ్లె సంచి అన్న పుస్తకాన్ని జి ల్లా ప్రధాన గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఉప గ్రంథపాలకులు గ్రేడ్ వన్ ఆఫీసర్ రాజిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ నూర్ సింగ్, రాజిరెడ్డి, కంచరి చిన్న భూమేశ్వర్, లైబ్రరియన్ తారకం తదితరులు పాల్గొన్నారు. వార్డెన్పై చర్యలు తీసుకోవాలి ఖలీల్వాడి: చందూర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులపై దాడి జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక(టీవీయూవీ) నగర అధ్యక్షులు సుభాష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని బీసీ సంక్షేమ అధికారి కార్యాలయంలో ఏబీసీడబ్ల్యూవో భాగ్యవతికి బుధవారం వినతిపత్రం అందించారు. నాయకులు నిశ్వాంత్, విజయ్, అనిల్, సచిన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఏఐఎస్ఎఫ్ దినోత్సవం ఖలీల్వాడి: ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లోని జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో బుధవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్ పతాకావిష్కరణ చేశారు. కుశాల్ మాట్లాడుతూ.. 1936 ఆగస్టు 12న విద్యార్థుల హక్కుల కోసం ఏర్పడిన ఏఐఎస్ఎఫ్, దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థి ఉద్యమానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నాయకులు ఈశ్వర ప్రసాద్, శ్రీకాంత్, నితిన్, రాజేందర్, చందు, సాయిచరణ్ పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ : యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు 5 రోజుల పని దినాల డిమాండ్ను వెంటనే అమలు చే యాలని కోరుతూ బుధవారం నగరంలోని ధ ర్నా చౌక్ వద్ద బ్యాంకు ఉద్యోగులు, అధికారు లు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ను ప్రభు త్వం ఇంకా నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో నిరవధిక సమ్మెకు సైతం వెనుకాడబోమని వారు హెచ్చరించారు. తమ సంఘీభావాన్ని ప్రకటించారు. బ్యాంకు అధికారులు రమేశ్, రాజేశ్వర్, గురునాథ్, శ్రీనివాస్, రాజు, సింగారావు, సునీల్, సతీశ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
‘హర్ ఘర్ తిరంగా’ను విజయవంతం చేయాలి
● నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ● నగరంలో జాతీయ జెండాల పంపిణీసుభాష్నగర్: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ప్రతిఒక్కరు త్రివర్ణ పతాకాలను తమ ఇంటిపై ఎగు రవేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. బుధవారం నగరంలోని గాంధీచౌక్లో ఆయన త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రధాని మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. ఈనెల 14న నగరంలో నిర్వహించే హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరా రు. నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం సునీత రాజు, బెల్లాల్ శశాంక్, ఎర్రం సుధీర్, బంటు రాము, బంటు ప్రీతి, శ్యామల, మల్కాయి మహేందర్, బొబ్బి లి వేణు, ఇప్పకాయల కిషోర్, మురళి, నాయకులు పురుషోత్తం, ఆమంద్ విజయ్ పాల్గొన్నారు. ‘వందేమాతరం’ దేశభక్తులను తయారు చేసింది నిజామాబాద్ రూరల్: వందేమాతరం గేయం దేశభక్తులను తయారు చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో 150 వసంతాల వందేమాతరం గీత వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, డ్రాయింగ్, నృత్య ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. -
ఈ నెలాఖరు వరకే చాన్స్!
డొంకేశ్వర్(ఆర్మూర్): కొత్తగా చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరును గడువు తేదీగా నిర్ణయించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో దరఖాస్తుదారుల హడావుడి మొదలైంది. అయితే, దరఖాస్తుకు అవసరమైన పత్రాల కోసం మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. దరఖాస్తుదారులకు అవసరమైన ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా జారీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అలాగే వితంతులు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలు లోకల్ ఎంకై ్వరీ రిపోర్ట్, గీత కార్మికులు ఎకై ్సజ్ శాఖ సర్టిఫికెట్, చేనేత కార్మికులు జౌళి ఽశాఖ సర్టిఫికెట్, దివ్యాంగ, ఫైలేరియా బాధితులు వైద్యారోగ్య శాఖ సర్టిఫికెట్లను సంపాదించే పనిలో నిమగ్నమయ్యారు. పక్కాగా క్షేత్రస్థాయి పరిశీలన ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, పట్టణాల్లో వార్డు అధికారులు కొత్త పింఛన్ల దరఖాస్తులు అందాయి. జిల్లా వ్యాప్తంగా వందల్లో అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే, దరఖాస్తును పంచాయతీ కార్యదర్శి/వార్డు ఆఫీసర్ పరిశీలించిన తర్వాత, ఎంపీడీవో/మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుంది. అక్కడ మరోసారి పరిశీలన చేసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత అధికారులు స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను క్షుణ్ణంగా పరిశీస్తారు. ఈ పరిశీలన పూర్తయిన తర్వాతే పారదర్శకమైన తుది జాబితాను కలెక్టర్ ఆమోదం కోసం పంపుతారు. కలెక్టర్ క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే ఆన్లైన్ ద్వారానే నేరుగా మంజూరు పత్రాలు జనరేట్ అవుతాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని లబ్దిదారులకు అందజేయనున్నారు. చేయూత పింఛన్లకు గడువు విధించిన ప్రభుత్వం జిల్లాలో మొదలైన దరఖాస్తుల సందడి అవసరమైన ధ్రువపత్రాల కోసం హడావుడి -
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
డిచ్పల్లి/సిరికొండ:ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో డిచ్పల్లిలోని తహసీల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సతీష్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అలాగే సిరికొండలో తహసీల్దార్ రవీందర్రావుకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి
సుభాష్నగర్: ప్రతిఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితా న్ని గడపాలని, ఎలాంటి వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ భు జంగరావు సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖలో ని ఎయిడ్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు నెలలపా టు నిర్వహించే అవగాహన కార్యక్రమాలను కలెక్టరేట్లోని తన చాంబర్లో అడిషనల్ కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. ఎయిడ్స్పై ఐఈసీ (తీవ్రతరమైన విజ్ఞాన సమాచారం–అవగాహన) కార్యక్రమం, ప్రమాదకర పరిస్థితిని తెలుసుకునే క్యూఆర్ కోడ్ పోస్టర్ను డీఎంహెచ్వో రాజశ్రీతో కలిసి ఆవి ష్కరించారు. హెచ్ఐవీ ఎయిడ్స్ నివారణలో భాగంగా విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో ఈ కార్యక్రమం రెండు నెలలపాటు కొనసాగుతుందన్నారు. ఎంపిక చేసిన 200 గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని డీ ఎంహెచ్వో తెలిపారు. విద్యార్థులకు జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు, యువతకు అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. టీబీ నియంత్రణ అధికారి దేవీ నాగేశ్వరి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సికిందర్ నాయక్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు వెంకటన్న, సుప్రియ, స్నేహ సొసైటీ కార్యద ర్శి సిద్ధయ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులున్నారు. -
క్రైం కార్నర్
ఖలీల్వాడి: చందూర్ హాస్టల్ వార్డెన్కు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ ఉపసంచాలకులు రజిత బుధవారం తెలిపారు. చందూర్లోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులను వార్డెన్ చితకబాధిన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సిగరెట్లు తాగుతున్నారని ఆరోపిస్తూ వార్డెన్ కల్పలత ఆదివారం పదిమంది విద్యార్థులను కర్రతో చితకబాధినట్లు విద్యార్థులు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన సంక్షేమ శాఖ అధికారులు నివేదికను ఎస్సీ జిల్లా సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రజితకు అందించారు. దీంతో వార్డెన్కు షోకాజ్ ఇచ్చారు. విచారణ చేసిన నివేదికను ఇన్చార్జి కలెక్టర్కు అందించినట్లు తెలిసింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి మరి. ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి గ్రామానికి జూనియర్ లైన్మన్ హిమాద్కి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలోని ఓ రైతు పొలంలో బుధవారం ఆయన ట్రాన్స్ఫార్మర్ను బాగు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అరచేయి కాలిపోయిందని, ట్రాన్స్ఫార్మర్ నుంచి కింద పడటంతో తలకు గాయాలైనట్లు తెలిపారు. గాయపడ్డ లైన్మన్ని చికిత్స నిమిత్తం రైతులు వెంటనే నిజామాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందించగా అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. హిమాద్ సబ్ స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకున్నా అక్కడ విద్యుత్ నిలిపివేసే క్రమంలో ఒక ఫేజ్కి సంబందించిన వైరు పూర్తిగా తెరుచుకోకపోవడంతో కరెంట్ సరఫరా జరిగినట్లు అధికారులు తెలిపారు. -
బాలికల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి
● అధికారులతో కలెక్టర్ భవేశ్ మిశ్రా ● ఎడపల్లి కస్తూర్బా, బాలికల గురుకులం సందర్శన బోధన్: నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంతోపాటు బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎడపల్లి శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, తెలంగాణ బాలికల గు రుకు పాఠశాల/కళాశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కస్తూర్బా స్కూల్లో మరమ్మతులకు నోచుకోక నిరూపయోగంగా ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్, సొలార్ హీటర్లకు మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలతోపాటు వంటగది, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. స్కూల్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని, విశాలమైన ఖాళీ స్థలాన్ని అన్నీ వసతులతో కూడిన క్రీడా మైదానంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. కేజీబీవీలో బాలికల సంఖ్య తక్కువ ఉన్నందున ఇతర విద్యార్థినుల ప్రవేశం కోసం రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడుతానని అన్నారు. అనంతరం తెలంగాణ బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. కళాశాల ఆవరణలో వరి, కూరగాయల సాగును పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. రెండు విద్యా సంస్థల్లోనూ పదో తరగతి విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. పలు ప్రశ్నలు వేసి వారి అభ్యసన సామర్ాధ్యలను పరిశీలించారు. తన వెంట తీసుకొచ్చిన బహుమతులను అందజేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాద్రి, ఎంఈవో శివలింగ్ గాలప్ప, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ దీపిక, బాలికల గురుకుల కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సురేఖ తదితరులు ఉన్నారు.పదోతరగతి విద్యార్థినులతో మాట్లాడుతున్న కలెక్టర్ భవేశ్ మిశ్రా బాలికల గురుకులం పరిసరాలను పరిశీలిస్తున్న కలెక్టర్ భవేశ్ మిశ్రా -
సరైన ఆలోచనలతోనే దేశాభివృద్ధి
నిజామాబాద్ రూరల్: ప్రపంచంలో అత్యధిక యువ జనా భా ఉన్న దేశం భారతదేశం ఒక్కటేనని ఇందూర్ విభాగ ప్రచారక్, తెలంగాణ ప్రాంత సహబౌద్ధిక్ ప్రముఖ్ నర్రా వెంకట శివ కుమార్జీ పేర్కొన్నారు. బుధవారం ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడు కలలో భాగంగా కోటగల్లి, గాజులపేట ఉపనగరాల యువ సమ్మేళనం టీటీడీ కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన వక్తగా ఆయన మాట్లాడుతూ.. యువత సరైన ఆలోచనలతో ముందుకు వెళితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. సత్యం, సుమిత్, రామకృష్ణ శరత్, బున్ని నవీన్, భా ర్గవ్, మణితేజ, రంజిత్, శ్రావణ్ పాల్గొన్నారు. -
యువతే దేశానికి వెన్నెముక
సుభాష్నగర్: యువతే దేశానికి వెన్నెముక అని, వారు మత్తుపదార్థాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకుల పేర్కొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో నగరంలోని ఖలీల్వాడిలో గల డాక్టర్ విశాల్ డీ–ఆడిక్షన్ సెంటర్లో యువతకు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, మత్తు పదార్థాల దుష్ఫ్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు యువత మద్యం, సిగరెట్లు, పొగాకు, గుట్కా, గంజాయి వంటి మత్తుపదార్థాలకు అలవాటు పడి డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలకు గురై ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనించి, అవసరమైతే వెంటనే మానసిక వైద్యులను సంప్రదించాలని కోరారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి హరీష్ స్వామి, వైద్యులు జీవన్రావు, రమణేశ్వర్, ఫరీదా బేగం పాల్గొన్నారు.● ఐఎంఏ అధ్యక్షుడు ఆకుల విశాల్ -
అధ్యాపకులకు శిక్షణ తరగతులు
ఖలీల్ వాడి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులకు ఓరియంటేషన్ శిక్షణా తరగతులతో వృత్తి నైపుణ్యం పెరుగుతోందని, దీంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి(డీఐఈవో) తిరుమలపుడి రవికుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కోటగల్లీ బాలికల జూనియర్ కాలేజీలో శిక్షణ తరగతులను డీఐఈవో పరిశీలించారు. అధ్యాపకులకు రెండో స్పెల్లో కామర్స్, ఫిజిక్స్, హిస్టరీ, జువాలజీ సబ్జెక్ట్ శిక్షణ ముగింపు సందర్భంగా సభకు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గంధం బుద్దిరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అధ్యాపకుడు విద్యార్థులను భావితరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి విద్యార్థిపైన వ్యక్తిగత శ్రద్ధ వహిస్తూ విద్యా బోధన చేయాలని సూచించారు. జిల్లా ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు చిన్నయ్య, అబ్జర్వర్ ధర్మపాల్, జిల్లా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు నర్సయ్య తదిరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలి
డిచ్పల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని డిచ్పల్లి ఖిల్లా గ్రామ సర్పంచ్ లొక్కిడి యాదగిరి పేర్కొన్నారు. బుధవారం జీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు డ్రైనేజీలు మూసుకుపోయి మురుగు నీటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. పశువులు ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వల్ల వాటి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు బదులుగా గుడ్డ సంచులు, కాగితపు సంచులను వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉప సర్పంచ్ దోర్నాల సౌజన్య, వార్డు మెంబర్లు రాణి, దేవదాస్, పంచాయతీ కార్యదర్శి అజయ్కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రితో ఎంపీ భేటీ
● దివ్యాంగుల సంక్షేమానికి శిబిరాలు విస్తరించాలని వినతిసుభాష్నగర్: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్రకుమార్ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి బుధవారం న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో కలిశారు. నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం, సాధికారతపై చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. దివ్యాంగుల సమస్యలు, సంక్షేమ పథకాలు, సహాయక పరికరాల పంపిణీ, ప్రభుత్వ సేవల సులభతరంపై ఎంపీ అర్వింద్ కేంద్రమంత్రికి వివరించారు. వీల్చైర్లు, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాల కోసం అంచనా శిబిరాలు విస్తరించాలని కోరారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు పెంచడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను మెరుగుపర్చాలని విజ్ఞప్తిచేశారు. నియోజకవర్గంలో కేంద్ర పథకాలు అర్హులందరికీ చేరేలా పనిచేస్తున్నామని ఎంపీ తెలిపారు. దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఆయన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందిస్తూ దివ్యాంగుల సంక్షేమానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రామాయంపేట(మెదక్) : రామాయంపేట వద్ద జాతీయ రహదారిపై వై జంక్షన్వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్కు చెందిన జూపల్లి వెంకట్రావు(49) హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. రాత్రి స్కూటీపై తన స్వగ్రామానికి వస్తున్న క్రమంలో జంక్షన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు రిషి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి.. నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ మామిడిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. ఈనెల 10న కరీంనగర్–నిజామాబాద్ ప్యాసింజర్ రైలు ఓ వ్యక్తిని ఢీకొనగా తీవ్రగాయాలయ్యాయి. అతనిని చికిత్స కోసం అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మంగళవారం మృతిచెందినట్లు పేర్కొన్నారు. అతని నుదిటిపై జై భీమ్ అనే టాటూ ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్ను సంప్రదించాలని అన్నారు. -
అర్గుల్ సొసైటీలో అవకతవకలు
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): జిల్లాలోని 89 సహకార సంఘాల పరిధిలో గత మూడేళ్లలో రూ.3.71 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగింది. ఎత్తొండ, పడగల్, మాక్లూర్ సహకార సంఘాల్లో వెలుగు చూసిన అవినీతి, అక్రమాలను మరువకముందే జక్రాన్పల్లి మండలంలోని అర్గుల్ సొసైటీలో అవకతవకలు బయటపడ్డాయి. ఖర్చు, జమాపద్దుల లెక్కల్లో తేడాలు, రైతు రుణాల్లో భారీ వ్యత్యాసాలు సొసైటీని దివాలా తీయిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు పేరిట పాతకూలీలకు అడ్వాన్స్ ఇవ్వడం, కొత్త కూలీలకు పెద్దమొత్తంలో ఖర్చుచేయడం, నూతన ఫర్నిచర్, ఇతర వస్తువుల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టడంతో సొసైటీ నష్టాల బాట పట్టింది. 2024–25 అడిట్ నివేదికలో అవతవకలు వెలుగు చూశాయి. సొసైటీలో అర్గుల్, జక్రాన్పల్లి, పడకల్, కేశ్పల్లి, సికింద్రాపూర్ గ్రామాలకు చెందిన 5,393 మంది రైతులు సభ్యత్వం కలిగి ఉండగా, సొసైటీ వాటాధనం రూ.1.20 కోట్లుగా ఉంది. సొసైటీ కార్యదర్శిగా ఒక అధికారి దీర్ఘకాలం ఇక్కడ పని చేయడం, పాలకవర్గం ఇష్టానుసారంగా వ్యవహ రించడంతో 2024–25 ఆడిట్ నివేదిక ప్రకారం సొసైటీకి రూ. 21.31 లక్షల నష్టం వాటిల్లింది. వడ్డీ లెక్కల్లో వ్యత్యాసం, పలు రిజిస్టర్లు నిర్వహించక పో వడం, అధిక ధాన్యం కొనుగోలు, రవాణా ఖర్చుల పై అభ్యర్థులు వచ్చాయి. రుణాల విషయానికి సంబందించి సీసీబీ కి సంబంధించిన రుణ బకాయి, సభ్యుల నుంచి రావాల్సిన రుణాలకు రూ.1.74 కోట్ల భారీ వ్యత్యాసం వెలుగుచూసింది. రైతుల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తున్నట్లు ఆడిట్ నివేదిక ద్వారా తేటతెల్లమైంది. అలాగే నూతన భవనంలో ఫర్నిచర్ పేరిట రూ.7.97 లక్షలు ఖర్చు చేశారు. ఇలా విచ్చలవిడిగా ఖర్చులు చేసి సొసైటీని నష్టాల బాట పట్టించారని రైతులు విమర్శిస్తున్నా రు. గతంలో ఎస్పీఎస్, పీఎల్ రుణాలు తీసుకుని పలువురు రైతుల మృతి చెందగా.. వారి వారసులకు రిజర్వ్బ్యాంకు నిబంధనల ప్రకారం సంవత్సరాల తరబడి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రస్తుతం వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.21.31 లక్షల నష్టం ఫర్నిచర్ కొనుగోళ్లలో భారీగా ఖర్చులు రుణ బకాయిలు, వసూళ్లలో భారీ వ్యత్యాసాలు ఆడిటింగ్కు కీలక రికార్డులు చూపని వైనం -
రైలులో ఆరు కిలోల గంజాయి స్వాధీనం
కామారెడ్డి క్రైం : రైలులో తరలిస్తున్న ఆరు కిలోల గంజాయిని ఎకై ్సజ్, రైల్వే పోలీసులు మంగళవారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంభాల్పూర్ నుంచి మహారాష్ట్ర లోని నాందేడ్ వెళ్తున్న నాగవళ్లి ఎక్స్ప్రెస్ రైలు కామారెడ్డికి రాగానే ఎకై ్సజ్, రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఓ ప్యాకెట్లో నింపిన ఆరు కిలోల ఎండు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎవరనేది తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎకై ్సజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ సుందర్ సింగ్, ఎస్సైలు విక్రమ్ కుమార్, శ్రీనివాస్రావు, శరత్ కుమార్, ట్రెయినీ ఎస్సైలు అనిల్, మధు, సిబ్బంది పాల్గొన్నారు. పొతంగల్లో గంజాయి పట్టివేత? రుద్రూర్: పొతంగల్ మండలంలోని చెక్పోస్ట్ వద్ద భారీ మొత్తంలో గంజాయి పట్టుబడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి పట్టుబడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన గంజాయి పరిమాణం, నిందితుని వివరాలు, గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు తదితర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్ అర్బన్: నగరంలోని కోటగల్లికి చెందిన విద్యప్రసాద్(54) అదృశ్యమైనట్లు రెండో టౌన్ ఎస్సై యాదగిరిగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. విద్యాప్రసాద్కు మానసిక స్థితి బాగాలేదని గతంలో కూడా పలుమార్లు ఇంటినుంచి వెళ్లి తిరిగిరాలేదని కుటుంబీకులు తెలిపారు. భార్య వేదవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు బోధన
ఖలీల్వాడి : సాంకేతిక పరిజ్ఞానంతో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు బోధన చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లి జూనియర్ కళాశాల అధ్యాపకులకు రెండవ స్పెల్ రెండు రోజుల ఓరియంటేషన్ శిక్షణ తరగతులను డీఐఈవో మంగళవారం పరిశీలించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట చూపే విధంగా అధ్యాపకులు బోధన చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న అన్ని వర్గాల విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా బోధన చేపట్టాలని సూచించారు. ప్రిన్సిపాల్ బుద్ధిరాజ్, జిల్లా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు నర్సయ్య తదితరులు ఉన్నారు. -
విద్యార్థులను చితకబాదిన వార్డెన్
వర్ని : చందూర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులను హాస్టల్ వార్డెన్ చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సిగరెట్లు తాగుతున్నారని ఆరోపిస్తూ వార్డెన్ కల్పలత ఆదివారం పదిమంది విద్యార్థులను కర్రతో చితకబాదినట్లు విద్యార్థు లు ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకపోయినా వార్డెన్ తిడుతూ కొడుతోందని, మోకాళ్లపై కూర్చోబెడుతోందని, స్నాక్స్ కరెక్ట్గా ఇవ్వ డం లేదని, గుంజీలు తీయిస్తోందని ఆరోపించారు. విషయం తెలుసు కున్న తల్లిదండ్రులు హాస్టల్కు వచ్చి వార్డెన్ను నిలదీశారు. విద్యార్థు లు సిగరెట్లు తాగడం వల్లే కొట్టానని ఇకముందు ఇలా జరగకుండా చూస్తానని తల్లిదండ్రులకు వార్డెన్ హామీ ఇచ్చారు. ఈ విషయమై వార్డెన్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. -
పోచారం.. అసహనం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై మరోమారు అసహనం వ్యక్తం చేశారు. సీఎం చెప్పినా బిల్లులు రాకపోవడం, మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ‘కేసీఆర్ను మోసం చేసిపోవడం ఇష్టం లేకుండే.. అన్నం పెట్టినోళ్లను మరిచిపోతమా’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. బీర్కూర్ మండల కేంద్రానికి సమీపంలో మంగళవారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏడాదిన్నర కాలంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోనూ సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించడానికి వెళ్లిన పోచారం నీటిపారుదల శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేసిన వీడియో సంచలనం కలిగించింది. ఇప్పుడు మరోమారు పోచారం అదే రీతిలో స్పందించారు. ఈ సమ్మేళనంలో పోచారం మాట్లాడిన వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. పెండింగ్ బిల్లుల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి పొంగులేటిలకు బాధ్యత అప్పగించాడని, వారు ఫోన్ చేస్తే స్పందించడం లేదని పేర్కొన్నారు. బిల్లుల విషయమై సీఎంను మరోసారి కలిసి రూపాయి కూడా రాలేదని చెబితే వేం నరేందర్రెడ్డికి బాధ్యత అప్పగించి మార్చి లోపు మూడు విడతల్లో బిల్లులు ఇప్పించమన్నాడన్నారు. ఆయన కూడా తెల్లారి నుంచి ఫోన్ లేపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాబై సార్లు ఫోన్ చేసినా ఫలితం లేదన్నారు. రాజకీయాల్లో సంచలనం... పోచారం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించాయి. కేసీఆర్ను మోసం చేసి వెళ్లడం ఇష్టం లేకున్నా, అభివృద్ధి కోసమే కండువా మార్చాల్సి వచ్చిందని పోచారం పేర్కొనడంతో ఆయన దారెటు అన్న చర్చ కూడా మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పోచారం ఒక్కరే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బాన్సువాడ కాంగ్రెస్ ఇన్చార్జీగా వ్యవహరించిన ఏనుగు రవీందర్రెడ్డి పట్టు సాధించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా, ఐదేళ్లు స్పీకర్గా నియోజక వర్గంలో తిరుగులేని నేతగా ఉన్న పోచారం శ్రీనివాస్రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇబ్బందులు పడ్డారు. అప్పటికే జరిగిన అభివృద్ధి పనులు, డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన బిల్లుల కోసం ఇబ్బందులు తలెత్తాయి. స్వయంగా సీఎం ఇంటికి వచ్చి పార్టీలో చేరాలని ఆహ్వానించడంతో పోచారం కండువా కప్పుకున్నారు. అయితే ఆరు నెలల్లో అన్ని జరుగుతాయని ఆశించిన పోచారం శ్రీనివాస్రెడ్డికి నిరాశే ఎదురైంది. అంతర్మథనం... కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పోచారం శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన అంతర్మథనంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఏళ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో పనులు ఆగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్, ఆస్ప్రత్రి భవనాల నిర్మాణాలకు సంబంధించి రూ. వందల కోట్లు రావాల్సి ఉంది. ఈ విషయాన్ని పలుమార్లు సీఎంకు చెప్పినా పని జరక్కపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ను మోసం చేసి వెళ్లాలని లేకుండే. అభివృద్ధి కోసం తప్పలేదు’ అన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లోనూ మన జెండానే గెలుస్తుందన్న ఆయన పేర్కొనడంతో ఏ పార్టీ అన్న చర్చ జరుగుతోంది. సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి సీఎం చెప్పినా బిల్లులు రాలేదని ఆవేదన ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారిన వ్యాఖ్యలు అధికార పార్టీ నేతల్లో చర్చ -
అర్హులైన దివ్యాంగులకు పింఛన్ ఇవ్వాలి
బోధన్ : అర్హులైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ అందించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని రాకాసీపేట గ్రామాభివృద్ధి కమిటీ హనుమాన్ మందిరం ఫంక్షన్ హాల్లో వేదిక జిల్లా స్థాయి సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బోధన్లో వచ్చే నెల 1 నుంచి 3 వరకు దివ్యాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలు అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు రమేశ్ బాబు, ప్రెసిడెంట్ గైని రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత, ప్రధాన కార్యదర్శి యేశాల గంగాధర్, ప్రతినిధులు షేక్నజీర్, లక్ష్మి, భాను, సాయిలు, సాయమ్మ, బీరుగొండ, దేవదాస్, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
13న ఐటీఐలో జాబ్ మేళా
ఖలీల్వాడి : జిల్లా కేంద్రంలోని ఐటీఐలో ఈనెల13న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్ యాదగిరి తెలిపారు. జాబ్ మేళాకు ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని, వివిధ రంగాలకు చెందిన సుమారు 20 రకాల కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని అన్నారు. ఐటీఐలో వివిధ ట్రేడ్లలో ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ అసలు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, బయోడేటా, ఇతర ధ్రువపత్రాలతో జాబ్ మేళాకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9948195654 నంబర్ను సంప్రదించాలన్నారు. వేల్పూర్: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను జిల్లా ప్యానల్ కమిటీ సభ్యులు మంగళవారం పర్యవేక్షించారు. జిల్లా కమిటీ సభ్యులు చిన్నయ్య, గంట అశోక్, కోకిల నాగరాజు, ఇతర సబ్జెక్టుల నిపుణులు రికార్డులు, మధ్యాహ్న భోజనం, కిచెన్ను పరిశీలించారు. తరగతులు, పాఠ్యాంశాల వారిగా పరిశీలించి విద్యార్థుల పురోగతిని తెలుసుకున్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా ఎలా నేర్చుకోవాలో వివరించారు. స్థానిక హెచ్ఎం రాజన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బురద రోడ్డుపై వరినాట్లు ఇందల్వాయి: మండలంలోని లింగాపురంలో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద రోడ్డుకు ఇరువైపులా గుత్తేదారు మట్టి పోసి వదిలేశాడు. దీంతో ఆ ప్రాంతమంతా కురుస్తున్న వర్షాలకు బురదమయంగా మారింది. బురద రోడ్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటు స్థానిక రైతు రోడ్డుపై మంగళవారం వరినట్లు వేసి నిరసన తెలిపాడు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని వెల్లుట్లపేట శివారులో ఉన్న చెనింగ రాజరాజేశ్వరాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి, గ్రామస్తులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు హుండీలో ఉన్న నగదును దొంగిలించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఐదేళ్లలోపు పిల్లల మరణాలు తగ్గించాలి
● డీఎంహెచ్వో రాజశ్రీ సుభాష్నగర్ : ఐదేళ్లలోపు పిల్లల మరణాలు తగ్గించేలా వైద్యులు, సిబ్బంది చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్లో గల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలపై డీఎంహెచ్వో సమీక్ష నిర్వహించారు. గర్భిణులు, చిన్న పిల్లల్లో ప్రమాదకర వ్యాధి లక్షణాలను ముందే గుర్తించాలని, బాలింతలను క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. సీపీఆర్పై అందరూ అవగాహన కలిగి ఉండాలని, మదర్ ఇన్, మదర్ ఔట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. ఎంసీహెచ్ కార్డును తూ.చ తప్పకుండా అనుసరిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. శాశ్వత, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. పోచంపాడ్, నందిపేట్, రెంజల్, బినోల, చంద్రశేఖర్ కాలనీ, రుద్రూర్, జక్రాన్పల్లి, ముదక్పల్లి, వేల్పూర్, మోస్రా పీహెచ్సీల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలతో సమీక్షించారు. కార్యక్రమంలో డీఐవో ఎం అశోక్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తెయూ సమాచారం..
తెయూలో రెడ్ క్రాస్ సొసైటీ క్లబ్ ప్రారంభం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ క్లబ్ను ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ చక్రవర్తి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ నోడల్ అధికారి లావణ్య మాట్లాడుతూ.. యువత బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కే అపర్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు అతీక్, హలీమ్ఖాన్, శ్రీనివాస్, భ్రమరాంబిక, ఎన్ స్వామి, పీఆర్వో కేవీ రమణాచారి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పీజీ బ్యాక్లాగ్ పరీక్షల్లో ఒకరి డిబార్ తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న పీజీ 1, 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షక్షల్లో మంగళవారం మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 490 మందికి 405 మంది హాజరు కాగా 85 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ పరీక్షా కేంద్రంలో ఒకరు డిబార్ అయినట్లు తెలిపారు. క్యాంపస్లో 17 నుంచి 25 వరకు తీజ్ తెయూలో ప్రతి ఏటా నిర్వహించే తీజ్ ఉత్సవాలను ఈ సారి కూడా జరుపుకొంటామని నిర్వాహకులు తెలిపారు. బంజారాల పవిత్రమైన పండుగగా భా వించే తీజ్ ఈ నెల 17 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. వర్సిటీ బంజారా బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు తెయూ ఇంజినీరింగ్ కళాశాలలోని బీటెక్ సీఎస్ఈ, ఏఐ 2వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలకు 70 మందికి అందరు విద్యార్థులు హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ తెయూ ఏబీవీపీ కమిటీ ఆధ్వర్యంలో హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు. లాసెట్ 2026 ద్వారా తెలంగాణ యూనివర్సిటీ లా కాలేజ్లో ప్రవేశాలు పొందడాని కి వచ్చిన విద్యార్థులకు హెల్ప్డెస్క్ ద్వారా అవసర మైన సాయం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీ పీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శివకుమార్రెడ్డి, రాష్ట్ర వనవాసి కన్వీనర్ అశోక్, వర్సిటీ ఉపాధ్యక్షులు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు దోస్త్ ధ్రువపత్రాల పరిశీలన తెయూ పరిధిలోని దోస్త్ 2026 ద్వారా 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం నిర్వహించనున్నట్లు తెయూ దోస్త్ కోఆర్డినేటర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలవరకు తెయూ అడ్మిషన్స్ డైరెక్టరేట్ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. పీహెచ్, సీఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులమ్ ఆక్టివిటీస్ కేటగిరి విద్యార్థులు ఈ వెరిఫికేషన్కు హాజరు కావాలని ఆయన సూచించారు. అభ్యర్థులు తమ వెంట ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. -
మత్తు వద్దు.. దేశం ముద్దు
● మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ● ఆర్మూర్ నుంచి లద్దాఖ్ వరకు యువకుడి సైకిల్ యాత్రఆర్మూర్: దేశభక్తి, ఆ ధ్యాత్మికతను నినాదంగా మలుచుకున్న ఓ యువకుడు సైకి ల్పై సాహస యాత్ర కు శ్రీకారం చుట్టా డు. ఆర్మూర్ పట్టణానికి చెందిన షేర్ ఓంకార్ ‘దేశం కోసం.. దైవం కోసం‘ అనే స్ఫూర్తిదాయక నినాదంతో యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దంటూ అవగాహన కల్పిస్తూ ఆ ర్మూర్ నుంచి లద్దాఖ్ వరకు సైకిల్ యాత్ర చేస్తు న్నాడు. ఓంకార్ ఉపాధి కోసం గల్ఫ్లోని ఖతర్ దే శానికి వలస వెళ్తూ వస్తున్నాడు. ఈ ఏడాది సైతం మూడు నెలల సెలవులపై 20 రోజుల క్రితం ఆర్మూర్కు వచ్చాడు. యువత గంజాయి, డ్రగ్స్, మద్యం లాంటి మత్తు పదార్థాలకు బానిస కావొద్దని అవగాహన కల్పిస్తూ తనదైన శైలిలో సైకిల్ యాత్ర నిర్వహించాలని సంకల్పించాడు. ఈ నెల 4న ఆర్మూర్ నుంచి ప్రారంభమైన యాత్ర మంగళవారం నాటికి సుమారు 700 కిలో మీటర్లు పూర్తి చేసుకొని మధ్యప్రదేశ్లోని కంటి ప్రాంతానికి చేరుకున్నాడు. 44వ నంబర్ జాతీయ రహదారిపై 2,348 కిలో మీటర్ల భారీ లక్ష్యాన్ని ఏ ర్పాటు చేసుకొని ప్రతీ రోజు వంద కిలో మీటర్ల లక్ష్యంతో సైకిల్ యా త్రను కొనసాగిస్తున్నాడు. తన సైకిల్ యాత్రను ఆ ద్యంతం ఇన్స్ర్ట్రాగామ్లో వీడియోల రూపంలో పో స్టు చేస్తున్నాడు. -
నిజామాబాద్
● నిజామాబాద్ అర్బన్లో అత్యధిక సంఖ్యలో ఓట్ల తొలగింపు!ఐదేళ్లలోపు పిల్లల.. ఐదేళ్లలోపు పిల్లల మరణాలను నివారించేందుకు వైద్యులు, సిబ్బంది చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 8లో uస్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను పట్టణ ప్రాంత ఓటర్లు లైట్గా తీసుకున్నారా? అంటే.. అవుననే నిరూపిస్తున్నాయి గణాంకాలు. నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో ఏకంగా 49,317 మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్లను నింపి బీఎల్వోలకు అందజేయకపోవడం గమనార్హం. వీరిలో అత్యధికంగా 42,015 మంది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో శక్తిమంతమైన ఆయుధంగా పేర్కొనే ఓటును పట్టణ ఓటర్లు పట్టించుకోలేదు!స్వచ్ఛమైన పసుపు కొనుగోలుకు కృషి జక్రాన్పల్లి: స్పైసెస్ బోర్డు ద్వారా వచ్చే సీజన్లో స్వచ్ఛమైన పసుపు కొనుగోలు జరిగేలా కృషి చేస్తామని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యూశ్ అన్నారు. స్పైసెస్ బోర్డ్, రైతు ఉత్పత్తిదారుల సంఘంలోని ఐదు గ్రామాల పసుపు రైతులతో మండలంలోని మనోహరాబాద్ లో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యూశ్ మాట్లాడుతూ.. ఎటువంటి పురుగు మందులు వాడకుండా పసుపు సాగు చేయాలని, క్లోరోపైరిఫాస్ ఫార్ములా ఉన్న మందును ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని సూచించారు. రసాయన ఎరువులు వాడితే పసుపు ఎగుమతి సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. భవిష్యత్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మార్కెట్ లింకేజ్ ప్రోగ్రాంను కొనసాగించడానికి ఎగుమతిదారు వెంకటకృష్ణతో చర్చించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పాట్కూరి తిరుపతిరెడ్డి, మనోహరాబాద్ సర్పంచ్ అల్లూరి లక్ష్మీలింబారెడ్డి, స్పైసెస్ బోర్డ్ అధికారులు రాజమాణిక్యం, రాణి, స్థానిక ఏఈవో వంశీకృష్ణ, డైరెక్టర్లు రాజు, అల్లూరి సంతోష్, పుప్పాల నాగేశ్, సామ గంగారెడ్డి, రైతులు పాల్గొన్నారు. 11 రోజుల్లో 40 ఎకై ్సజ్ కేసులు నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 1 నుంచి 11వ తేదీ వరకు 40 కేసులు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అరుణ్కుమార్ మంగళవారం ఒక ప్రటకనలో తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్గల్, మోర్తాడ్, స్టేషన్ల పరిధిలో దాడులు చేపట్టినట్లు పేర్కొన్నారు. దాడుల్లో 10 లీటర్ల గుడుంబా, 25 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవడంతోపాటు 20 కల్లు శాంపిళ్లు తీసుకున్నామని తెలిపారు. ఆయా కేసుల్లో 20 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఎస్సారెస్పీకి తగ్గిన ఇన్ఫ్లో వేల్పూర్(మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో తగ్గింది. మంగళవారం వేకువజామున 12,604 క్యూ సెక్కుల ఇన్ఫ్లో రాగా.. సాయంత్రానికి 3,430 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 43.091 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జాతీయస్థాయి లగోరిలో ప్రతిభ వేల్పూర్: మండలంలోని అంక్సాపూర్ హై స్కూల్ విద్యార్థులు జాతీయస్థాయి లగోరి ఆటలో ప్రతిభ కనబర్చినట్లు హెచ్ఎం మల్లీశ్వరి, పీడీ దేవసుకన్య తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిని అభినందించారు. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు విశాఖపట్టణంలో కొనసాగిన జాతీయస్థాయి లగోరి ఆటలో బాలురు ప్రథమస్థానంలో, బాలికలు ద్వితీయస్థానంలో నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవిచందర్, రఘునాథ్, శ్రీదేవి, రాజేంద్ర, సదాశివ్, దేవరాజ్, వినోద్, శ్రీలక్ష్మి, యమున, జాన్సన్, వేణుగోపాల్రెడ్డి, రాజు, సీఆర్పీ కృష్ణమూర్తి పాల్గొన్నారు. పట్టణాల్లో పట్టింపేది సర్నిజామాబాద్ అర్బన్: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో పట్టణ ప్రాంత ఓటర్ల నిర్లక్ష్యం వైఖరి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఓటు వేయడంలో వెనుకబడే పట్టణ ప్రాంతాల వారు తమ విలువైన ఓటు హక్కును కాపా డుకోవడంలోనూ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి అందజేసిన ఎన్యుమరేషన్ఫామ్లను నింపి తిరిగి ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. దీంతో జి ల్లాలోని పట్టణ ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో ఓటు తొ లగిపోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,11,864 ఓట్లు తొలగింపు జాబితాలో ఉండగా.. ఇందులో నిజామాబాద్ కార్పొరేషన్తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్, బాన్సువాడ మున్సిపాలిటీల పరిధిలో మృతి చెందిన, వసల వెళ్లిన వారితోపాటు డబుల్ ఓట్లు మొత్తం 1,25,710 ఉన్నాయి. పట్టణాల్లో 49,317 మంది ఓటర్లు సర్ ప్రక్రియలో పాల్గొనలేదు. ఎన్యుమరేషన్ ఫామ్లు అందచకపోవడం, బీఎల్వోలు ఇంటికి వెళ్లినా అందుబాటులో లేకపోవడంతో 49వేల మందికిపైగా ఓటర్లను అధికారులు ఆబ్సెంట్ కాలమ్లో చేర్చారు. ● ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 94,488 మంది ఓటర్లు ఉండగా, 79,478 ఎన్యుమరేషన్ ఫామ్ల (84.11 శాతం) డిజిటలైజేషన్ పూర్తయ్యింది. ఇక్కడ ఒక్క దరఖాస్తును మాత్రమే బీఎల్వోలు పరిశీలించలేదు. మరణించిన వారి ఓట్లు 3288, వలస వెళ్లిన వారి ఓట్లు 5,257 ఉండగా, డబుల్ ఓట్లు 4,926 ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ 1,483 మంది ఓటర్లు బీఎల్వోలకు అందుబాటులోకి రాలేదు. 56 మంది ఓట్లను ఇతరుల కాలమ్లో చేర్చారు. ఆర్మూర్ పట్టణంలో మొత్తం 15,010 ఓట్లు తొలగిపోనున్నాయి. ● బోధన్ మున్సిపాలిటీలో 98,440 ఓట్లు ఉండగా, 83,782 ఎన్యుమరేషన్ ఫామ్ల (85.11 శాతం) డిజిటలైజేషన్ పూర్తయ్యింది. మరణించిన వారి ఓట్లు 2,329, వలస వెళ్లిన వారి ఓట్లు 6,800 ఉండగా, 1,521 డబుల్ ఓట్లను గుర్తించారు. బోధన్ పట్టణంలో 4004 మంది ఓటర్లు బీఎల్వోలకు అందుబాటులోకి రాలేదు. ఇతరుల ఓట్లు నాలుగు ఉండగా, మొత్తం 14,658 ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. ● బాన్సువాడ పట్టణంలో 398 మంది సర్కు దూరంగా ఉన్నారు. ఇక్కడ మొత్తం 52,470 మంది ఓటర్లు ఉండగా 46,590 ఎన్యుమరేషన్ఫామ్ల డిజిటలైజేషన్ పూర్తయ్యింది. 5,880 ఓట్లు తొలగిపోనున్నాయి. ● భీమ్గల్ మున్సిపాలిటీలో 53,771 ఓటర్లు ఉండగా.. 47,038 ఎన్యుమరేషన్ ఫామ్ల(87.48 శాతం) డిజిటలైజేషన్ పూర్తయ్యింది. మరణించిన వారి ఓట్లు 1,248, వలస వెళ్లిన వారి ఓట్లు 2,014 ఉండగా, 2,046 ఓట్లను డబుల్ ఓట్లుగా గుర్తించారు. 1,417 మంది ఓటర్లు సర్కు దూరంగా ఉన్నారు. ఇక్కడ ఇతరులు 8 మంది ఉండగా, 6733 ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. ప్రజాభద్రతకు సీసీ కెమెరాలు అవసరం జక్రాన్పల్లి: సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయి చైతన్య సూచించారు. ‘మన ఊరు, మన భద్రత, మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా జక్రాన్పల్లిలో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలను సీపీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని, ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. పోలీస్ శాఖ చేపడుతున్న క మ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామంలో 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించిన గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు. ఏసీపీ ప్రకాశ్, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, డిచ్పల్లి సీఐ తిరుపతి, స్థానిక ఎస్సై మహేశ్, సర్పంచ్ బండి పద్మ సత్యం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం సంజయ్, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని నార్త్ మండలంలో 1,51,385 మంది ఓటర్లు ఉండగా, 1,10,884 ఎన్యుమరేషన్ ఫామ్ల (73.25 శాతం) డిజిటలైజేషన్ పూర్తయ్యింది. 29 దరఖాస్తులను బీఎల్వోలు పరిశీలించలేదు. చనిపోయిన ఓటర్లు 2,584 మందిని, ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారిని 5,966 మందిని, 6,022 మంది డబుల్ ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించారు. అయితే 21,723 మంది ఓటర్లు బీఎల్వోలకు అందుబాటులోకి రాలేదు. 4,206 మంది ఓటర్లను ఇతరుల కాలమ్లో చేర్చారు. ఇక్కడ మొత్తం 40,501 ఓట్లు తొలగిపోనున్నాయి. నిజామాబాద్ సౌత్ మండలంలో 1,56,876 ఓటర్లు ఉండగా 1,13,948 ఫామ్ల డిజిటలైజేషన్(72.64 శాతం) పూర్తయ్యింది. 107 ఫామ్లను బీఎల్వోలు పరిశీలించలేదు. 2,800 మంది ఓటర్లు మృతి చెందినట్లుగా, 9141 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిగా, 6145 మంది డబుల్ ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఈ మండలంలో 20,292 మంది బీఎల్వోలకు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. 4,550 ఓటర్లను ఇతరుల కామల్లో చేరారు. సౌత్ మండలంలో 42,928 మంది ఓట్లు తొలగిపోనున్నాయి. ఈ లెక్కన అర్బన్ నియోజకవర్గంలో మొత్తం 83,429 ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. మున్సిపాలిటీల్లో ఎన్యుమరేషన్ ఫామ్లు అందజేయని 49వేల మంది -
ఎకో టూరిజంపై ఇన్వెస్టర్ల నజర్
● పబ్లిక్ – ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు చేపట్టే అవకాశం ● ఇటీవల ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ ప్రాంతాలను పరిశీలించిన ఇన్వెస్టర్లు డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రకృతి రమణీయతకు నిలయమైన ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతం త్వరలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డొంకేశ్వర్ మండలంలోని చిన్నయానం, గాదేపల్లి గ్రామాల వద్ద పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో ఎకో టూరిజం పనులు చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా పర్యాటకులను ఆకర్షించేలా అత్యాధునిక కాటేజీలు, రిసార్టులు, వాచ్ టవర్లను నిర్మించేందుకు ప్రైవేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఇక్కడి టూరిజం ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన హైదరాబాద్కు చెందిన పలువురు ప్రముఖ ఇన్వెస్టర్లు ఇటీవల ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని సందర్శించారు. చిన్నయానం, గాదేపల్లి పరిసరాల్లో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక అటవీశాఖ అధికారులతో ప్రత్యేక భేటీ అయ్యారు. స్థానిక అటవీ, ప్రాజెక్టు భూములు, నిబంధనలు, వన్యప్రాణుల సంచారం, భౌగోళిక పరిస్థితులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంతో భాగస్వామ్యమై ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎకో టూరిజం అభివృద్ధి ద్వారా స్థానిక గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇదివరకే అటవీ శాఖ ఆధ్వర్యంలో చిన్నయానం, గాదేపల్లి గ్రామాల నుంచి 10 మంది యువకులు హైదరాబాద్కు వెళ్లి శిక్షణ పొంది వచ్చిన ఈ విషయాన్ని అటవీ అధికారులు ఇన్వెస్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. హోటల్ మేనేజ్మెంట్, గైడ్లు, బోటింగ్ నిర్వహణ రంగాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఇన్వెస్టర్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే నిజామాబాద్ జిల్లా పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ప్రైవేట్ – పబ్లిక్ పార్టనర్షిప్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఇన్వెస్టర్లు ముందుకు రావడం హర్షణీయం. ప్రభుత్వంతో ఒప్పందమై ఈ ప్రాజెక్టు పనులు మొదలైతే పర్యావరణ పరిరక్షణతోపాటు స్థానిక గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు గైడ్లు, కాటేజీల నిర్వహణలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – చంద్రశేఖర్, ఎఫ్డీవో, ఆర్మూర్ -
జీతాల కోసమే పని చేయొద్దు
నిజామాబాద్ అర్బన్: జీతాల కోసమే పని చేయొద్దని, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టునూ వృథా కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తెరిగి అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా హితవు పలికారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల సిరి’ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చే శారు. జలసిరి, హౌసింగ్, వన మహోత్సవం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మున్సిప ల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. లక్ష్యానికి అనుగుణంగా ఫాంపాండ్స్, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేప ట్టని మండలాల ఎంపీడీవోలపై కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. వా రం రోజుల్లో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చొరవ చూపాలన్నారు. అలసత్వం వహిస్తే స రెండర్ చేస్తానని హెచ్చరించారు. వన మహోత్స వంలో భాగంగా ఆయా శాఖలు నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటి సరక్షించాలని, ఇప్పటికే నాటిన మొక్కలను ఈ నెల 29వ తేదీన ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మొక్క లు నాటకుండా తప్పుడు నివేదికలు సమర్పించిన వారి నుంచి నిధులు రికవరీ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని సెప్టెంబర్ 15లోగా సాధించాలని గడువు విధించారు. అదనపు కలెక్టర్ వి భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, తదితరులు పాల్గొన్నారు. జనగణన హ్యాండ్బుక్ రూపకల్పనకు.. జిల్లా జనగణన హ్యాండ్బుక్ (డీసీహెచ్బీ) రూపకల్పన కోసం కచ్చితత్వంతో కూడిన నాణ్యమైన సమాచారం అందించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, ఆయా రంగాల ప్రముఖులతో జనగణన–2027కు సంబంధించి జిల్లా స్థాయిలో రూపొందించే హ్యాండ్బుక్ కు అందించాల్సిన సమాచారంపై చర్చించి సూచనలు చేశారు. ‘జలసిరి’ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఈ నెల 29న వనమహోత్సవం మొక్కలను పరిశీలించండి సమీక్షా సమావేశంలో అధికారులతో కలెక్టర్ భవేశ్ మిశ్రా -
భార్య కాపురానికి రావడం లేదంటూ..
● హోర్డింగ్ ఎక్కి నిరసనఎల్లారెడ్డి: భార్య కాపురానికి రావడం లేదంటు ఓ వ్యక్తి హోర్డింగ్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థా నికులు తెలిపిన వివరాల ప్ర కారం.. లింగారెడ్డిపేట గ్రా మానికి చెందిన వడ్ల సత్యనారాయణకు భార్యకు గొడ వలు జరగడంతో కాపురానికి రావడం లేదు. దీంతో అతను సోమవారం రాత్రి పట్టణంలోని బస్టాండ్ ఎదు రుగా ఉన్న హోర్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా స్థానికులు గమనించి పోలీసుల కు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థ లానికి చేరుకొని సత్యనారాయణను స ముదాయించి కిందికి దిగేలా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీ ల్చుకున్నారు. భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్పల్లి శివారు లో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దుండగులు మంగళవారం ధ్వంసం చేశారు. అందులో ఉన్న కాపర్ కాయిల్స్ను దొంగిలించారు. వరుసగా వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసానికి గురవుతుండడంతో పంటలు ఎలా పండించాలంటు రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
● 14న తిరంగా ర్యాలీలో పాల్గొనండి ● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపుసుభాష్నగర్: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని బస్టాండ్ వద్ద త్రివర్ణ పతకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో దేశ ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు ప్రతి సంవత్సరం ‘హర్ ఘర్ తిరంగా‘ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. కేవలం స్వాతంత్య్ర దినోత్సవం ఒక్కరోజు జెండా ఎగురవేయడమే కాకుండా ఇంటిపై నిత్యం రెపరెపలాడాలన్నారు. అలాగే ఈ నెల 14న నిర్వహించే తిరంగా ర్యాలీలో దేశభక్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, జిల్లా ప్రధానకార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్లీడర్ ప్రమోద్, మోర్చాల ప్రతినిధులు వంశీగౌడ్, మాదాసు స్వామి యాదవ్, బొబ్బిలి వేణు, వెల్మ గంగారెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అటవీ శాఖలో కొత్త టాస్క్ఫోర్స్
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లా అటవీ అధికారి (డీఎఫ్వో)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ బాజీరావు పాటిల్ శాఖలో ప్రక్షాళన ప్రారంభించారు. ఇన్ని రోజులు పని లేక నీరసించిన టాస్క్ఫోర్స్ విభాగంలో కొత్తవారిని నియమించి పునర్జీవం పోశారు. కేవలం ఇద్దరికే పరిమితమైన టాస్క్ఫోర్స్ బృందంలో అత్యంత చురుకై న 9మంది బీట్ ఆఫీసర్లను చేర్చి టీమ్ను బలోపేతం చేశారు. ఇందులో ప్రతి ముగ్గురు బీట్ ఆఫీసర్లను కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేయగా, వీరిపైన ఒక ఎఫ్ఆర్వో, సెక్షన్ అధికారి ఉన్నారు. వీరంతా నేరుగా డీఎఫ్వో కనుసన్నల్లో పని చేయనున్నారు. డీఎఫ్వో ఆదేశాలతోనే ఈ టీమ్ రహస్య ఆపరేషన్లలోకి దిగనుంది. అటవీ ప్రాంతాల్లో కదలికలపై నిఘా పెట్టడం, ఎక్కడికక్కడ లాకస్మిక తనిఖీలు నిర్వహించడమే బృందం పని. అడవుల్లో జరిగే ఉల్లంఘనలు, అక్రమ రవాణాపై క్షేత్రస్థాయిలో లోతుగా విచారణ జరిపి, ఎప్పటికప్పుడు డీఎఫ్వోకు నివేదికలు సమర్పించనున్నారు. అయితే, ఇదివరకు పని చేసిన డీఎఫ్వోలు టాస్క్ఫోర్స్ విభాగాన్ని నిర్లక్ష్యం చేసి అసలు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అధికారులు, సిబ్బందిలో వణుకు! నూతన డీఎఫ్వోగా ప్రశాంత్ బాజీరావు పాటిల్ రావడంతోనే శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విధులకు రాకుండా ఉన్న ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. రెంజల్ మండలం నీలా వద్ద బొగ్గుబట్టీ విషయంలోనూ అధికారులపై సీరియస్గా ఉన్నారు. దీనికి తోడు తాజాగా నూతన టాస్క్ఫోర్స్ బృందం ఏర్పాటుతో శాఖలోని కొందరు అవినీతి, నిర్లక్ష్యపు అధికారుల గుండెల్లోనూ వణుకు పుట్టిస్తోంది. డీఎఫ్వో ఆదేశిస్తే.. క్షేత్రస్థాయిలో అటవీ అధికారులు, సిబ్బంది పనితీరును కూడా ఈ టీమ్ నిశితంగా పరిశీలించనుంది. విధుల్లో అలసత్వం వహించినా, అక్రమార్కులకు సహకరించినా ఎవరినీ వదిలిపెట్టబోమని సంతేకాలు ఇవ్వడంతో అటవీ శాఖలో అందరికీ గుబులు పట్టుకుంది. పలువురు ఎఫ్ఆర్వోలు, డీఆర్వోలు, జిల్లా నుంచి బదిలీ చేసుకుంటేనే బతికి బయటపడుతామనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 9మంది బీట్ ఆఫీసర్లతో ఏర్పాటు డీఎఫ్వో కనుసన్నల్లో పని చేయనున్న ప్రత్యేక బృదం ఆకస్మిక తనిఖీలు.. విచారణ నివేదికలు ఇవ్వడమే టీమ్ పని -
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
డిచ్పల్లి: నేషనల్ హైవే 44 వెంబడి డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి పరిధిలో వ్యాపారులు హోటళ్లు, దాబాల యాజమానులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ ప్రకాశ్ సూచించారు. డిచ్పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్లో సోమవారం మూడు మండలాల వ్యాపారులు, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీతో కలిసి ఏసీపీ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రత, ఇష్టారాజ్యంగా పార్కింగ్, లిక్కర్ అమ్మకం, గంజాయి వాడకం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసరంలో సీసీ కెమెరాలు ఉంటేనే విచారణ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సైలు ఆరిఫ్, మహేశ్, సుమలత, ఐఆర్ఏడీ మేనేజర్ వర్ష, తదితరులు పాల్గొన్నారు. -
42 టీఎంసీలకు చేరిన ఎస్సారెస్పీ నీటి నిల్వ
వేల్పూర్(మెండోరా) : శ్రీరాంసాగర్ ప్రాజె క్టులోకి ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం సమయానికి 12,604 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5 టీఎంసీలు) కాగా.. ప్ర స్తుతం 1079.10 అడుగుల(42.534 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 462 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో పోతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. సోమవారం సాయంత్రానికి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1400.55 అడుగుల (11.949 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాల నుంచి 1,358 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. పోచారానికి తగ్గిన ఇన్ఫ్లోనాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,472 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తోంది. 100 క్యూసెక్కుల నీరు పోచారం ప్రధాన కాలువలోకి విడుదలవుతుండగా, 1,372 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లోగా వెళ్తోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈవీఎం గోదాము పరిశీలన ● బందోబస్తుపై సూచనలునిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్లో ఉన్న ఈవీఎం గోదాము ను కలెక్టర్ భవేశ్మిశ్రా, అదనపు కలెక్టర్ వి భుజంగరావు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఈవీఎం గోదాముకు వెళ్లిన కలెక్టర్.. పోలీసు బందో బస్తు, సీల్లను పరిశీలించారు. బందోబస్తు పై పలు సూచనలు చేశారు. వారి వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్రెడ్డి, అగ్ని మాపక అధికారి శంకర్ ఉన్నారు. ● కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందంలో చోటు కామారెడ్డి టౌన్ : జిల్లాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పైడి ఎల్లారెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఈ నెల 24 నుంచి 28 వరకు జపాన్ దేశంలో పర్యటించనున్న ‘ఇండియన్ బిజినెస్ డెలిగేషన్’ బృందంలో ఆయనకు చోటు దక్కింది. ఈ మేరకు భారత పరిశ్రమల సమాఖ్య ఆయనకు అధికారికంగా లేఖను అందించింది. భారత్ – జపాన్ వాణిజ్య బంధం బలోపేతంలో భాగంగా ఇరుదేశాల మధ్య నూతన పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యంపై జపాన్ అగ్రగామి కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు పైడి ఎల్లారెడ్డి ‘సాక్షి’తో తెలిపారు. -
2,11,864
ఓట్ల తొలగింపు!● ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియ ● ఈనెల 17 నుంచి అభ్యంతరాల స్వీకరణ ● అక్టోబర్ 15 వరకు పరిష్కారం ● 19న తుది ఓటరు జాబితానిజామాబాద్ అర్బన్: జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో సోమవారంతో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 2,11,864 ఓట్లు తొలగిపోనున్నాయి. 1,565 మంది బీఎల్వోలు 14,39,734 ఓట్లకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తికి గత నెల 24 చివరి తేదీగా ముందు నిర్ణయించినప్పటికీ.. ఆ తరువాత ఈనెల 3వ తేదీ వరకు, మళ్లీ 10వ తేదీ వరకు పొడిగించారు. ఎన్యుమరేషన్ ఫామ్ల పరిశీలన, డిజిటలైజేషన్ పూర్తి కావడంతో ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ మొదటి రోజు నుంచి మొదలుకుని అక్టోబర్ 15వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరిస్తారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 19వ తేదీన ప్రకించనున్నారు. నిజామాబాద్ అర్బన్లోనే అత్యధిక సంఖ్యలో ఓట్లు తొలగిపోనున్నాయి. అర్బన్లో 42,015 మంది అందుబాటులో లేరు. జిల్లా వ్యాప్తంగా 147 ఎన్యుమరేషన్ ఫామ్లను బీఎల్వోలు పరిశీలించలేదు. ఇతర ఓటర్ల జాబితాలో చేర్చిన వారి నుంచి అభ్యంతరాలు వస్తే నోటీసులు అందజేసిన తరువాత పరిశీలించి ఓటరు జాబితా నుంచి తొలగింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పూర్తిగా తొలగిపోనున్న ఓట్ల సంఖ్యలో కొద్దిమేర మార్పులు ఉండే అవకాశం ఉంది. (ఏఐ సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం)నియోజకవర్గాల వారీగా రద్దు కానున్న ఓట్లునియోజకవర్గం మొత్తం మరణించిన అందుబాటులో ఇతర ప్రాంతాలకు డబుల్ ఇతర తొలగనున్న ఓటర్లు ఓటర్లు లేనివారు వెళ్లిన వారు ఓటర్లు ఓటర్లు ఓట్లు ఆర్మూర్ 215186 6185 1648 9918 7925 61 25,737 బోధన్ 223152 5397 4593 13003 4821 21 27,835 బాన్సువాడ 196331 3962 843 9881 5156 43 19,885 అర్బన్ 308261 5384 42015 15107 12167 8756 83,429 రూరల్ 264723 6902 1093 14,368 8722 66 31,151 బాల్కొండ 232081 5882 1590 9321 7003 31 23,827 మొత్తం 14,39,734 33,712 51,782 71,598 45,794 8978 2,11,864 -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ ● కామారెడ్డి, తిప్పాపూర్ పీఏసీఎస్ల ప్రమాణస్వీకారంకామారెడ్డి రూరల్/ భిక్కనూరు : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్అలీ పేర్కొన్నారు. సహకార సంఘాలు కేవలం రాజకీయ పదవులు కాకుండా రైతుల సంక్షేమానికి పనిచేసే వేదికలుగా మారాలని ఆకాంక్షించారు. కామారెడ్డి పీఏసీఎస్ చైర్మన్ గూడెం శ్రీనివాస్రెడ్డి, భిక్కనూర్ మండలం తిప్పాపూర్ పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డితోపాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సోమవారం నిర్వహించారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మహమ్మద్ షబ్బీర్అలీ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అంటే రైతులు.. రైతులు అంటే కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలిచి, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు. పాలకవర్గాలు సమన్వయంతో పనిచేసి సొసైటీలను మరింత బలోపేతం చేయా లని సూచించారు. కార్యక్రమాల్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఇలియాస్, జిల్లా సహకార శాఖ అధికారి రాంమోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, డీసీసీ మాజీ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్రావు, మండల అధ్యక్షులు రాజాగౌడ్, నరేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, లక్ష్మీ, బాల్రాజు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు. -
మోడల్ సీబీఎస్ఈ స్కూల్స్!?
● రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు ● వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలయ్యే అవకాశం ఎల్లారెడ్డిరూరల్: మోడల్స్కూల్స్ను బలోపేతం చేసేందుకు గాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే 2027–28 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. దీనిద్వారా సంబంధిత పాఠశాలలు సీబీఎస్ఈ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపును పొందవలసి ఉంటుంది. జిల్లాలో ఆరు మోడల్స్కూల్స్.. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, నిజాంసాగర్(అచ్చంపేట్), బాన్సువాడ(కొత్తాబాది), నాగిరెడ్డిపేట(గోపాల్పేట్), మద్నూర్(మేనూర్), సదాశివనగర్లలో మోడల్స్కూల్స్ ఉన్నాయి. ప్రతి మోడల్స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 500 మంది, ఇంటర్మీడియట్లో 320 మంది విద్యార్థులకు అడ్మిషన్లు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం నాగిరెడ్డిపేటలో 778, సదాశివనగర్లో 742, బాన్సువాడలో 735, నిజాంసాగర్లో 728, ఎల్లారెడ్డిలో 684, మద్నూర్లో 656 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి మోడల్స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యార్థినుల కోసం వంద మందికి హాస్టల్ వసతిని కల్పిస్తున్నారు. జాతీయస్థాయి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించే అవకాశం.. జాతీయ స్థాయి కాంపీటీటివ్ పరీక్షలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్తో కూడిన పరీక్షా విధానం ఉంటుంది. దీనివల్ల సీబీఎస్ఈ విధానంతో చదువుకున్న విద్యార్థులు ఆయా పరీక్షల్లో ప్రతిభ చూపి మంచి ర్యాంకులను సాధించి మంచి కళాశాలల్లో సీట్లను సాధిస్తున్నారు. స్టేట్ సెలబస్తో చదువుకున్న విద్యార్థులు కాంపిటీటివ్ పరీక్షలలో వెనకబడడంతో మంచి ర్యాంకులు రాక మంచి కళాశాలల్లో సీట్లు లభించక చదువులో వెనకంజలో ఉంటున్నారు. మోడల్స్కూల్స్లో సీబీఎస్ఈ విధానం అమలైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం జాతీయస్థాయి కాంపిటీటివ్ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధించి మంచి కళాశాలల్లో సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. ఎల్లారెడ్డి మోడల్ స్కూల్ -
మద్యంమత్తులో వ్యక్తి హల్చల్
వేల్పూర్(మెండోరా): మెండోరా మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం రాత్త్రి మద్యం మత్తులో కాకతీయ కాలువలో దిగి మునుగుతూ, తేలుతూ హల్చల్ చేశాడు. గ్రామస్తులు, పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు ఎస్సై సుహాసిని ఘటన స్థలానికి వచ్చి అతడికి నచ్చజెప్పి కాలువ ఒడ్డుకు చేర్చారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాలువలో తక్కువ ప్రవాహం ఉండడంతో పూర్తిగా మునిగిపోకుండా ప్రాణాపాయం తప్పింది. బోధన్రూరల్: సాలూర మండలంలోని హున్సా శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ సోమవారం తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.7,400లు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. నిజామాబాద్ అర్బన్: ప్రతి ఆటో డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సీఐ ప్రసాద్ అన్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో సోమవారం ఆయన ఆటోడ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రద్దీగా ఉన్నచోట ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలన్నారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఒకటో టౌన్ పరిధిలోగల ఫ్రూట్ మార్కెట్లో ఇటీవల కొందరి యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా, ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మూడో వ్యక్తి షేక్రహీమ్ పరారీలో ఉండగా, సోమవారం అతడిని అరెస్టు చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం ఆంధ్రనగర్ గ్రామ సమీపంలో ఓ వ్యానులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సోమవారం సాయంత్రం నందిపేట పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆంధ్రానగర్లోని ఒక బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో మొత్తం 57 సంచులలోని 31క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అట్టి బియ్యానికి ఎటువంటి ఆధారాలు వారివద్ద లేకపోవడంతో వాటిని నందిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ ఖలీమ్తోపాటు ఓనర్ మాక్లూర్కు చెందిన ఇమ్రాన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ వెల్లడించారు. -
మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి.. అనంతలోకాలకు..
పెద్దకొడప్గల్(జుక్కల్): ఆషాఢ మాసం సందర్భంగా మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వాగు వద్దకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అనంతలోకాలకు చేరుకున్న విషాద ఘటన మండలంలోని చిన్నతక్కడ్పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై అరుణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. బిచ్కుంద గ్రామానికి చెందిన మిట్టపల్లి లక్ష్మణ్ (25)అనే యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి పెద్దకొడప్గల్లో కొన్ని రోజులుగా పాత ఇనుప సామానుకు వస్తువులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి అతడు ఆదివారం మొక్కులు తీర్చుకునేందుకు చిన్నతక్కడ్పల్లి గ్రామ శివారులోని వాగు వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులు వంట కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా లక్షణ్ మధ్యాహ్నం సమయంలో స్నానం చేసేందుకు వాగులోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. సాయంత్రం వాగులో గాలింపు చేపట్టగా, లక్ష్మణ్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం మృతుడి తల్లి సాయవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేయించామని ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. -
సోయాకు తెగుళ్లు.. సస్యరక్షణ ఇలా..
● నివారణ చర్యలు సూచించిన వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణఆర్మూర్: సోయాబీన్కు సోకిన తెగుళ్లను రైతులు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సుమారుగా 35,166 ఎకరాల్లో సోయా పంటను రైతులు పండిస్తున్నారు. వేరుకుళ్లు, లద్దె పురుగులతో పంట నష్టపోవడాన్ని రైతులు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఈక్రమంలో ఆర్మూర్ మండలంలోని పలు గ్రామాల్లో సోయాబీన్ పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించి తెగులు నివారణకు రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏవో హరికృష్ణ మాట్లాడుతూ.. సోయాబీన్లో వేరుకుళ్లు నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లు తడిచే విధంగా పోయాలన్నారు. ● పొగాకు లద్దె పురుగు ఆశించడం గమనించినట్లయితే నివారణకు 1మీ.లీ నోవాల్యురాన్ లేదా 0.3 మి.లీ క్లోరాంట్రనిలీప్రోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ● సోయా ఆకులపై రంధ్రాలు గమనిస్తే, నివార ణకు ఐదు కిలోల తవుడు, ఒక కిలో బెల్లం, 400 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్ను కలిపి ఉండలుగా చేసి సాయంత్రం పూట పొలంలో చల్లాలి. పగలు నేలలో ఉండి సాయంత్రం పూట బయటకు వచ్చే లద్దె పురుగులు వీటిని తిని చనిపోతాయి. ● సోయా ఆకులను సెమిలూపర్ అనే గొంగలి పురుగు తినేసి పంటను నష్టం కలిగిస్తుంది. ఈ పురుగును నివారించడానికి 350 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ను 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరం పొలంలో పిచికారి చేయాలి. ● సోయాబీన్ ఆకులు, కాయలను పచ్చ పురుగు తిని పంటను నష్టం కలిగిస్తుంది. ఈ పురుగును నివారించడానికి 125మిల్లీలీటర్ల రిమాన్ను 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరంలో పిచికారి చేయాలి. ● సోయా మొక్క కాండం లోపల కాండం ఈగ (స్టెమ్ ఫ్లె) ఆహార పదార్థాన్ని తినివేస్తుంది. దీంతో సోయా మొక్క వాడిపోయి ఎండిపోతుంది. ఆ మొక్కను చీల్చి చూస్తే ఎర్రని ఎండిన పదార్థం కనిపిస్తుంది. ఈ కాండం ఈగ నివారణకు 300 గ్రాముల ఎసిఫెట్ పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరం సోయ పంటపై పిచికారి చేయాలి. ● సోయా పంట వద్దకు పురుగులు రాకుండా నివారణ చర్యకు వేపనూనె 1,500 పీపీఎంను 300 నుంచి 500 మిల్లీ లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరంలో పిచికారి చేయాలి. రైతులు ఈ విధంగా చేస్తే తెగుళ్లను నివారించవచ్చు. సోయాబీన్ పూత, పిందె రాలకుండా, కాయగట్టితనానికి 19:19:19ని ఒక కిలో తీసుకొని నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేయాలి. సోయాబీన్ పంటను పండిస్తున్న రైతులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సోయాలోని ఆకులు, కాయలు, కాండాన్ని రైతులు పరిశీలించాలి. తెగుళ్లు సోకినట్లు భావిస్తే వెంటనే మందులను పిచికారి చేయాలి. తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించాలి. – హరికృష్ణ, వ్యవసాయాధికారి, ఆర్మూర్ మండలం -
ఎస్సారెస్పీపై పర్యాటకుల సందడి
వేల్పూర్(మెండోరా): బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై పర్యాటకుల సందడి నెలకొంది. వరుసగా రెండవ శనివారం, ఆది, సోమవారం సెలవులు రావడంతో తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు శ్రీరాంసాగర్కు వచ్చి ప్రాజెక్టు అందాలను తిలకించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్ల ప్రాజెక్టు నీటిమట్టం సగం కంటే ఎక్కువగా పెరిగింది. జిల్లా వాసులే కాకుండా ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ప్రాజెక్టులోకి చేరిన నీటిని చూస్తూ ఆనందించారు. ప్రాజెక్టుపై ఉన్న గుర్రపు సవారీలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రాజెక్టుకు భారీగా పర్యాటకులు తరలి రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్యామ్ దిగువ భాగానికి, ప్రమాదకర ప్రాంతాల వైపు వెళ్లకుండా మైకుల ద్వారా హెచ్చరించారు. -
క్రైం కార్నర్
అదుపుతప్పి ఆటో బోల్తా ● ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు వేల్పూర్(మెండోరా): మెండోరా మండలంలో సోమవారం మధ్యాహ్నం ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడగా, ఒకరు మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ సాయికుమార్ తన సొంత ప్యాసింజర్ ఆటోలో ముప్కాల్ నుంచి మెండోరా మండలానికి ఏడుగురు ప్రయాణికులను తీసుకెళ్తున్నాడు. మెండోరా శివారులోని కాకతీయ కాలువ సమీపంలో ఆటోను అజాగ్రత్తగా వేగంగా నడపడం వల్ల ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో కోడిచెర్ల గ్రామానికి చెందిన వేల్పూర్ దేవాయి(58)కి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మిగతా ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా, వారి కుటుంబీకులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మృతురాలి కుటుంబీకులు ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ● డ్రైవర్కు తీవ్ర గాయాలు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రం గోపాల్పేటలో ఆటోను కారు ఢీకొనడంతో ఆటోడ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గోపాల్పేటకు చెందిన షాహీద్ ఆఫ్రీదీ తన ఆటోలో స్థానిక పెట్రోల్బంకులో డీజీల్ పోయించుకొని ఇంటికి బయలుదేరాడు. అదేసమయంలో ఎల్లారెడ్డి వైపు నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఓ కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నడుపుతున్న షాహీద్ ఆఫ్రీదీ తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం మొదట మెదక్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. వర్ని: మోస్రా మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో ఉన్న శివకేశవ మందిరంలో గుర్తుతెలియని వ్యక్తులు రాధాకృష్ణ విగ్రహాలను ధ్వంసం చేశారు. సోమవారం ఆలయానికి వెళ్లిన భక్తులు విగ్రహాల ధ్వంసాన్ని గమనించి, గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
తాడ్వాయి : గ్రామాల్లో సైబర్ మోసాలపై అప్రమ త్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు సూచించారు. మండలంలోని చిట్యాల గ్రామంలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే మోస పూరిమైన ఫోన్కాల్స్ను నమ్మవద్దన్నారు. ప్రస్తుతం జాబ్ నోటిఫికేషన్ విడుదలయిందని, ఈ నోటిఫికేషన్ను యువకులు వినియోగించుకోవాలని సూచించారు. డ్రగ్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామంలో సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ద్విచక్రవాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలన్నా రు. అత్యవసర సమయంలో 112 నంబరుకు డ యల్ చేయాలన్నారు. ఎస్ఐ నరేశ్, గ్రామపోలీసు యాదగిరి, సర్పంచ్ రంజిత్రెడ్డి పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుడికి కరెంట్షాక్.. పట్టించుకోని అధికారులు!
కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ ఎస్సీవాడ 2వ వార్డులో వీధిదీపాల కోసం విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ప్రమాదవశాత్తు మున్సిపల్ కార్మికుడు రాజు కింద పడిపోయారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. బల్దియా అధికారులకు సమచారం ఇచ్చినా, ప్రమాదం జరిగి రెండు రోజు గడుస్తున్నా మున్సిపల్ ఏఈ, అధికారులు కనీసం స్పందించకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ తీరుపై ఆందోళనలకు దిగుతామని మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు సోమవారం హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్: మండలంలోని కాలూరు చెందిన గంధక్వాడ్ సాయినాథ్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ సోమవారం తెలిపారు. గంధక్వాడ్ మారుతి అతని కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, నాయిగావ్ నుంచి వచ్చి కొన్ని సంవత్సరాలుగా రూరల్ మండలంలోని కాలూరులో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మారుతి కుమారుడు సాయినాథ్ ఈనెల 2న హోటల్కు సంబంధించిన వస్తువులను తీసుకురావడానికి జిల్లాకేంద్రానికి వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. దీంతో సాయినాథ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఏటీఎం చోరీకి యత్నం.. నిందితుడి అరెస్టు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో చోరీకి యత్నించిన నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్సై దీపక్కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. గాంధారికి చెందిన శశికుమార్ అనే వ్యక్తి లింగంపేట మండలం లింగంపల్లి శివారులోని వాటర్ ప్లాంట్లో ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. శశికుమార్ సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఎస్బీఐ ఏటీఎంకు ఆటోలో వచ్చాడు. ఆటోను ఓ ఇంటి పక్కన సందులో నిలిపి ఏటీఎంలోకి చొరబడ్డాడు. ఏటీఎంలోని నగదును దోచుకునేందుకు ఏటీఎంను ధ్వంసం చేస్తుండగా శబ్ధం రావడంతో ఇంటి యజమాని పంబళ్ల శ్రీనివాస్ నిద్రలోనుంచి లేచి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్సై దీపక్కుమార్ తన సిబ్బందితో ఏటీఎం వద్దకు చేరుకొని చోరీకి యత్నిస్తున్న శశికుమార్ను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఉదయం ఏటీఎం కేంద్రం వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పేగుబంధంపై ప్రేమతో..
● తల్లిదండ్రుల పాలరాతి విగ్రహాల ఆవిష్కరణ ● చాట్ల నర్సయ్య సాహితీ సేవలు కొనియాడిన రచయితలు, కవులురామారెడ్డి(ఎల్లారెడ్డి): బతికుండగానే తల్లిదండ్రులను వదిలేస్తున్నారు కొందరు... అంత్యక్రియలకు కూడా హాజరుకాకుండా వీడియో కాల్స్లోనే చివరి మజిలీ పూర్తి చేస్తున్నారు మరికొందరు పిల్లలు. అలాంటిది మరణించిన తల్లిదండ్రులను నిత్యం గుర్తు చేసుకునేలా పాలరాతి విగ్రహాలు చేయించి ఆదివారం ఆవిష్కరించారు. రామారెడ్డి మండలం పోసానిపేటలోని వ్యవసాయ క్షేత్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి చాట్ల నర్సయ్యగంగామణి విగ్రహాలను కొడుకు చాట్ల జయకృష్ణ, చాట్ల విద్యుల్లత ప్రతిష్టించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రి చాట్ల నర్సయ్య చరిత్ర పరిశోధకుడిగా, కళాకారుడిగా, రంగస్థల నటుడిగా, కవిగా, రచయితగా సాహితీ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. అనంతరం తెలంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ చాట్ల నర్సయ్య తన పరిశోధనలతో కామారెడ్డి జిల్లా కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేశారని గుర్తుచేశారు. ఉత్తమ అధ్యాపకుడిగా ఎంతోమంది శిష్యులను సమాజానికి ఉపయోగపడే మేటి పౌరులుగా తీర్చిదిద్దారని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ గజల్ కవి సూరారం శంకర్, డాక్టర్ జి.లచ్చయ్య, గంగాప్రసాద్, పీతాంబర్, నాగభూషణం, సుప్పని సత్యనారాయణ, సీహెచ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
● సీపీ సాయిచైతన్య నిజామాబాద్ రూరల్: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని సీపీ సాయిచైతన్య అన్నారు. నగరంలోని ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన 130 మంది విద్యార్థులకు ఒకొక్కరికి రూ. పది వేల చొప్పున అందించిన స్కాలర్షిప్లను సీపీ సాయిచైతన్య ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతిభగల విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్స హించాలనే ఉద్దేశంతో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. జీవితంలో విజయం సాధించాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించే వరకు నిరంతరం కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకుడు శివారెడ్డి, ట్రస్ట్ కో–ఫౌండర్ శిరీష, ఎస్సై సాయన్న, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
వాహ్ ‘తీజ్’వాతావరణం ఉదయం ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి.కేజీబీవీ టీచర్లకు బదిలీల.. కేజీబీవీల ఉపాధ్యాయులకు రెగుల్యర్ బదిలీలు లేకపోవడం సమస్యగా మారుతోంది. ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నారు.సోమవారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 8లో uఇందల్వాయి మండలం దేవీతండాలో తీజ్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులుగాండ్ల పట్టణ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్లో నిర్వహించిన పండుగలో బోనమెత్తిన మేయర్ ఉమారాణిగిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన తీజ్ను వైభవంగా నిర్వహించారు. గిరిజన పల్లెలు, తండాల్లో యువతులు, మహిళలు గోధుమ మొలకల బుట్టలను పూజించి ఊరేగించారు.ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బోనం.. వైభవం -
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి పోరాటం
రుద్రూర్: దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెన్షన్దారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు నిర్వహిస్తామని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఏశాల గంగాధర్ తెలిపారు. పొతంగల్ మండలం సోంపూర్ గ్రామంలో ఆదివారం ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు గైని రాములు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11న బోధన్ పట్టణంలోని రాకాసిపేట్లో జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో దివ్యాంగులకు సంబంధించిన చట్టాలు, సంక్షేమ పథకాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించి, వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సదస్సును దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవదాస్, మేత్రి చిన్న గంగారాం, శరత్ పవర్, నగేశ్, మహేశ్, గంగాసాగర్, సావిత్రి, హన్మంత్ రావు, గంగారాం పటేల్, బాజీరావు, సాయిలు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
‘సాగర్’లోకి 6,367 క్యూసెక్కులు..
కులబహిష్కరణ విధించడం నేరం. ఎక్కడైనా అలాంటి ఘటనలు జరిగితే మా దృష్టికి వచ్చిన వెంటనే కేసులు నమోదు చేస్తున్నాం. బాధితులు ఎవరైనా భయపడకుండా నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ఏసీపీ, బోధన్ నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్లోకి వరద నీరు వస్తోంది. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 6,367 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1400.45 అడుగుల (11.838 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగితం వాగులో వరద ప్రవహిస్తోంది. మహమ్మద్నగర్ మండలం సింగితం గ్రామ రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. 15 రోజులుగా వాగులో వరద కొనసాగుతుండగా, వాగు దాటేందుకు తెప్పలను ఆశ్రయిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగుకు రెండు వైపులా తాడుకట్టి తెప్పపైన ప్రయాణిస్తున్నారు. వాగుపైన బ్రిడ్జి నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతోనే తెప్ప కష్టాలు తప్పడం లేదని రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వ పాలకులు, అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.తెప్పపై సింగితం వాగు దాటుతున్న రైతులు, కూలీలు -
హమ్మయ్య.. గట్టెక్కినట్లే!
నిజాంసాగర్ : ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 1.15 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. జీరో డిస్ట్రీబ్యూటరీ నుంచి అలీసాగర్ రిజర్వాయర్ 49 డిస్ట్రీబ్యూటరీ వరకు అనధికారికంగా 1.5 లక్షల ఎకరాల వరకు ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటితో పంటలు గట్టెక్కుతున్నాయి. అయితే, ఎల్నినో ప్రభావంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసే ప్రసక్తి లేదని అధికారులు, ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయినా ఆయకట్టు ప్రాంత రైతులు వరుణుడిపై భారంతో ఆయకట్టు కింద పంటలను సాగు చేశారు. వరినాట్లు పూర్తవుతున్న తరు ణంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఆయకట్టు పంటలకు భరోసా కలిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు వరద నీటి ప్రవా హం నెలకొన్నాయి. చెరువులు, కుంటలతోపాటు ప్రధాన జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. ఆదుకున్న పోచారం, ఘనపురం ఆనకట్ట ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తడంతో జిల్లాలోని పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. మెదక్ జిల్లాలోని ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతుండటంతో మంజీర నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. పోచారం, ఘనపురం ఆనకట్ట ద్వారా వరద నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో ప్రా జెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత నెలాఖరు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 5 టీఎంసీల మేర వరద వచ్చి చేరింది. వరద నీటి చేరికతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంత రైతులకు ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయనే భరోసా ఏర్పడింది.నీటి విడుదలకు తీర్మానంప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 11.182 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలకు మూడు విడతల్లో 4 టీఎంసీల నీటి విడుదలకు డీఐబీ సమావేశంలో తీర్మానం చేశారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా నీటిపారుదల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి సమక్షంలో చేసిన తీర్మాన పత్రాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఒకటి, రెండు విడుతల్లో 1.2 టీఎంసీల చొప్పున మూడో విడుతలో 1.6 టీఎంసీల మేర నీటి విడుదలకు ప్రతిపాదించినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. అయితే, దీనిపై ఈ నెలాఖరున హైదరాబాద్లో రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కీవం) సమావేశంలో నిర్ణయం వెలువడనున్నది. ఖరీఫ్కు ‘సాగర్’ భరోసా కరుణించిన వరుణుడు ఖరీఫ్ పంటల సాగుకు ఢోకా లేదు ఆయకట్టుకు మూడు విడుతల్లో 4 టీఎంసీల నీరు -
బీసీసీ యూత్ నూతన కమిటీ ఎన్నిక
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని భారత్ క్రికెట్ క్లబ్ యూత్ ఫెడరేషన్ పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జరిగిన ఎన్నికలో గౌరవ అధ్యక్షుడిగా చిటిమెల్లి ప్రేమ్కుమార్, గోనెల జగన్నాథం, అధ్యక్షుడిగా పార్లపల్లి ప్రసాద్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా నారెడ్డి శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దుబ్బాక ప్రసాద్, ఉప కార్యదర్శిగా తోట ప్రవీణ్కుమార్, కోశాధికారిగా వెంకటరాజం, సలహాదారులను ఎన్నుకున్నారు. కామారెడ్డి అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు సెప్టెంబర్ 9 వరకు గడువు పొడిగించినట్టు కామారెడ్డి అధ్యయన కేంద్రం సమన్వయకర్త సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశానికి ఇంటర్ సమాన పరీక్ష, పీజీ ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో సంప్రదించాలని సూచించారు. తాడ్వాయి: మండలంలోని పల్లెగడ్డా తండా శివారులో నిర్వహించిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. వివరాలిలా ఉన్నాయి. గత 50 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో రుక్మాయి అనే గ్రామం ఉండేదని, ఆ గ్రామ సమీపంలో ఉన్న గడి ప్రాంతంలో గుప్త నిధుల కోసం తరచూ తవ్వకాలు జరుగుతుండేవని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఆ గడి స్థలానికి సంబంధించి భూవివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. భూవివాదం విషయంలో ఎవరో కావాలనే క్షుద్ర పూజలు చేశారా.. లేదా భయపెట్టడానికి చేసి ఉంటారా అని తండావాసులు చర్చించుకుంటున్నారు. పోలీసు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
క్రైం కార్నర్
బాన్సువాడ: పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఆదివారం ఉదయం జరిగిన కుక్కల దాడిలో సితార అనే చిన్నారికి తీవ్ర గాయలయ్యాయి. రోడ్డు–2లో అమ్మమ్మతో కలిసి చెత్త వేసేందుకు వెళ్లిన సితారపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో సితార పెదవిపై తీవ్ర గాయలయ్యాయి. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సితార ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కక్కుల బెడదను నివారించాలని బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. పలు కాలనీల్లో కుక్కలను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇంకా చాలా కుక్కలు పట్టణంలో విహరిస్తూ చిన్నారులపై దాడులు చేస్తూనే ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం బాన్సువాడ: పట్టణంలోని జామా మజీద్ ఎదురుగా ఉన్న కాంప్లెక్స్లో ఆదివారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. మృతుడి వయస్సు 45 ఏళ్ల వరకు ఉంటుందని, సుమారు 5 అడుగుల ఎత్తు, కోల ముఖం, నలుపు రంగు గడ్డం, గోధుమ రంగు ప్యాంటు వేసుకుని ఉన్నాడని అన్నారు. మృతుడు కొంత కాలంగా బాన్సువాడలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన 8712686167, 8712666243 నంబర్లను సంప్రదించాలని అన్నారు. -
హైవేపై డేంజర్ యూటర్న్..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి యూటర్న్ ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ కళాశాల, పాఠశాలలు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నాయి. రోజూ వెయ్యి మందికి పైగా విద్యార్థులు రోడ్డు దాటేందుకు జూనియర్ కళాశాల వద్ద యూటర్న్ ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి కావడంతో వాహనాలు వేగంగా వెళుతుంటాయి. ఇదే సమయంలో విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని యూటర్న్ దాటుతున్నారు. రహదారిపై వాహనాలు అదుపుతప్పితే పెను ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం గతంలో ప్రతిపాదనలు తయారు చేసినా.. నిర్మాణం కలగానే మిగిలింది. -
హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్లో దారుణం
● కామారెడ్డి విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి ● తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరికకామారెడ్డి టౌన్ : హైదరాబాద్ దమ్మాయిగూడలోని ఓ కార్పొరేట్ హైస్కూల్లో దారుణం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. వివరాలు.. కామారెడ్డిలోని స్నేహపురి కాలనీకి చెందిన కిరణ్, శోభ దంపతుల కుమారుడు అభిషేక్ దమ్మాయిగూడలోని ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. పాత కక్షలను మనసులో ఉంచుకొని శనివారం సుమారు 8 నుంచి 12 మంది తోటి విద్యార్థులు గుంపుగా చేరి అభిషేక్పై దాడికి తెగబడ్డారు. కర్రలు, ప్లేట్లతో కొడుతూ బూట్లతో ముఖంపై తొక్కుతూ గాయపరిచారు. కాగా, మెట్లపై నుంచి కింద పడిపోవడంతో అభిషేక్కు గాయాలయ్యాయని పాఠశాల యాజమాన్యం నమ్మించే ప్రయత్నం చేస్తూ అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు తమ కుమారుడిని కామారెడ్డికి తీసుకొచ్చి ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తోటి విద్యార్థులే తనపై దాడి చేశారని అభిషేక్ తెలిపినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన విద్యార్థులపై, నిజాన్ని దాచిపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సార్ రాకుంటే స్కూల్ బందే!
● జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 71 ● కుంటుపడుతున్న ప్రాథమిక విద్య ● ఆందోళనలో తల్లిదండ్రులు ఖలీల్వాడి: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యానికి టీచర్ల కొరత అడ్డంకిగా మారుతోంది. జిల్లాలో 71 ప్రభుత్వ ప్రాథమిక, ప్రా థమికోన్నత పాఠశాలలు ఏకోపాధ్యాయులతో న డుస్తున్నాయి. ఒకే టీచర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధన చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు పాఠశాల నిర్వహణ, ప్రభుత్వ కార్యక్రమాలు, వి ద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు, మధ్యాహ్న భోజన పథకం తదితర వాటిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందే పరిస్థితి లేకపోవడంతో జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు కనీసం రాయడం, చదవడం, అక్షరాలు గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఉన్న ఒక ఉపాధ్యాయుడు సెలవు పెట్టినా.. శాఖాపరమైన శిక్షణ కార్యక్రమాలకు వెళ్లినా విద్యార్ధులకు ఆ రోజు సెలవే! విధులకు హాజరైన ఉపాధ్యాయుడు ఒక తరగతికి పాఠం చెబుతున్నప్పుడు మిగతా నాలుగు తరగతుల విద్యార్థులు వారికి వారే పాఠాలు చదువుకుంటున్నారు. బోధన కన్నా విద్యార్థులను పర్యవేక్షించేందుకే ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుందని టీచర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులకు బోధనతోపాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాల బాధ్యతలు అప్పగిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా.. ప్రభుత్వ పాఠశాలలోపై తల్లిదండ్రులకు విశ్వాసం పెరగడంతో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. అయితే మరోవైపు పాఠశాల్లో టీచర్ల సంఖ్య సరిపడా లేక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఒకే ఉపాధ్యాయుడితో విద్యా ప్రమాణాలు ఎలా పెరుగుతాయనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఏకోపాధ్యాయులు సెలవు పెడితే ఎంఈవో, స్కూ ల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు తప్పనిసరిగా సమాచా రం ఇవ్వాలి. వెంటనే సీఆర్పీని కానీ లేదంటే టీచర్ను అడ్జెస్ట్ మెంట్ చేస్తాం. – పార్శి అశోక్, డీఈవో కృత్రిమ మేధతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం విద్యార్థి జీవితానికి ఎంతో ప్రధానమైనది ప్రాథమిక విద్య. అక్షరాలు రాయడం, చదవడం, గణిత నైపుణ్యాలు, అర్థం చేసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉంటుంది. ఒకే ఉపాధ్యాయుడితో ఐదు తరగతులను నిర్వహించడంతో విద్యార్థిపై వ్యక్తిగత దృష్టి పెట్టడం సాధ్యం కాదు. దీంతో విద్యార్థుల్లో అభ్యసన లోపాలు పెరిగి ఉన్నత తరగతుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోంది. -
కేజీబీవీ టీచర్లకు బదిలీల కష్టాలు
ఆర్మూర్: కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రెగుల్యర్ బదిలీలు లేకపోవడం సమస్యగా మారుతోంది. ఏళ్ల తరబడి ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తమకు కూడా సాధారణ బదిలీల అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం రిక్వెస్ట్ బదిలీల ద్వారా మాత్రమే కొంతమందికి స్థానచలనం కలుగుతుండగా.. సాధారణ బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారు మాత్రం నిరాశకు గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా బాలికా విద్యను ప్రోత్సహించడానికి కేజీబీవీలను 2011లో ప్రారంభించారు. ఉపాధ్యాయుల(సీఆర్టీ) ను నియమించినప్పటికీ పాఠశాలను నిర్వహించే బాధ్యతలను తొలినాళ్లలో పదవీ విరమణ పొందిన మండల విద్యాధికారులకు అప్పగించారు. 2013 నుంచి కాంట్రాక్టు పద్ధతిపై స్పెషల్ ఆఫీసర్ల నియామకం జరిగింది. 2011లో జిల్లాలో 19 కేజీబీవీలను ప్రారంభించగా ప్రస్తుతం కొత్త మండలాలు ఏర్పాటవడంతో కేజీబీవీల సంఖ్య 27కు పెరిగింది. ఈ ఏడాది 11 కేజీబీవీల్లో ఇంటర్ వరకు 16 కేజీబీవీల్లో పదో తరగతి వరకు 7,160 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీటిల్లో మొత్తంగా 27 మంది స్పెషల్ ఆఫీసర్లతో పాటు సుమారు 135 మంది సీఆర్టీలు, 77 మంది పీజీ సీఆర్టీలు, 24 మంది పీ ఈటీలు, 26 మంది ఏఎన్ఎంలు, 212 మంది ఆపరేటర్లు, వాచ్మన్లు, కుకింగ్ స్టాఫ్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే 15 ఏళ్లుగా కేజీబీవీల్లో సాధారణ బదిలీల ప్రక్రియ జరగడం లేదు. నాలుగేళ్ల నుంచి రిక్వెస్ట్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు మాత్రం చేశారు. 15 ఏళ్లుగా ఒకే చోట విధులు.. కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్ అంటే ప్రధానోపాధ్యాయురాలు, వార్డెన్ రెండు బాధ్యతలు కలిపి ఒకే వ్యక్తి చూడాలి. ఉదయం నుంచి రాత్రి వరకు పాఠశాల అడ్మినిస్ట్రేషన్, విద్యార్థుల చదువులు, హాస్టల్ మెనూ, సరుకులు, అటెండెన్స్, ఆర్థిక లెక్కలు అన్నీ వీరే చూసుకోవాలి. 15 ఏళ్లుగా ఒకే చోట విధులు నిర్వహించడం వల్ల కొందరు అనుభవంతో బాగా రాణిస్తున్నా, మరికొందరిలో నిర్లక్ష్యం, ఏకపక్ష నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్వోలతో పాటు సీఆర్టీలు, పీజీ సీఆర్టీలకు రెగ్యులర్ బదిలీలు లేని కారణంగా సానుకూల, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏళ్ల తరబడి ఒకే ఉపాధ్యాయులు చదువు చెప్ప డం వల్ల ఆ సబ్జెక్టుపై విద్యార్థుల ఇంట్రెస్టు తగ్గిపో యే ప్రమాదం లేకపోలేదు. ఇక ఎస్వోలకు పనిభా రం విపరీతంగా ఉంది. అలాగే ప్రధానోపాధ్యా యురాలు, వార్డెన్ పోస్టులను వేరు చేయాలి. లేకుంటే బాలికల భవిష్యత్తు అనే నినాదంతో ప్రారంభించిన కేజీబీవీల లక్ష్యం నీరుగారే ప్రమాదం లేకపోలేదు. బదిలీలు లేక స్తంభించిపోయిన ఈ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఉపాధ్యాయ సంఘాల వారు రాష్ట్ర ప్రభుత్వాని కి సమయానుకూలంగా విన్నవించుకుంటూనే ఉన్నారు. కృత్రిమ మేధతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం రిక్వెస్ట్ బదిలీలే దిక్కు.. రెగ్యులర్ బదిలీలకు ఎదురుచూపులు ఏళ్లుగా ఒకే చోట విధులు బదిలీ విధానం అమలు చేయాలని ఉపాధ్యాయుల విజ్ఞప్తి -
పాత ఫోన్.. కొత్త మోసం
● వ్యక్తిగత డేటా దుర్వినియోగంతో సైబర్ నేరాలు ● ఆర్థిక మోసాలకు అవకాశం సదాశివనగర్: పాత ఫోన్లకు ప్లాస్టిక్ సామన్లు ఇస్తామంటూ ఊరూరా జరుగుతున్న ఈ వ్యాపారం వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉంటోంది. ప్రజలకు చిన్న పాటి ప్లాస్టిక్ సామన్లు ఎరవేసి పాత ఫోన్లను కొత్త నేరాలకు కేటుగాళ్లు వాడుకుంటున్నారు. తక్కువ మొత్తం డబ్బుకు ఆశపడి పాత ఫోన్లను అప్పగించడం చేస్తే నేరాల వలలో చిక్కే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాత ఫోన్ల కొనుగోలు, విక్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతికి.. పల్లెలు, పట్టణాల్లో సేకరించిన పాత ఫోన్లను చాలా వరకు ఝార్ఖండ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల అడ్డాలకు వీటిని తరలిస్తారు. మరమత్తులు చేసి నకిలీ పేర్లతో తీసుకున్న సిమ్ కార్డులను అందులో వేసి మోసాలకు పాల్పడుతారు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని పాత ఫోన్లకు సేకరించిన వారికి కమీషన్గా చెల్లిస్తున్నారు. ఆర్థిక మోసాలకు అవకాశం పాడైన ఫోన్లలో సిమ్కార్డు మర్చిపోయినా, డేటాను ఫార్మాట్ చేయకపోయినా ఇబ్బందులు తప్పవు. వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు నంబర్లు నేరగాళ్లకు చిక్కితే వారి నుంచి ఆర్థిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉంది. పాత ఫోన్లలో బ్యాంకింగ్ యాప్లు, చెల్లింపుల వివరాలు కనిపిస్తే ఆర్థిక పరమైన మోసాలు జరగవచ్చు. ప్రతి ఫోనుకు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిడీ(ఐఎంఈఐ) నంబరు ఉంటుంది. సైబర్ నేరం జరిగినప్పుడు పోలీసులు ఈ నంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తారు. పాత ఫోన్ అమ్మిన వ్యక్తిని అపరాధిగా తేలుస్తారు. అసలు నేరం చేసిన వారు తప్పించుకుంటారు. వివరాలు నమోదు చేసుకోవాలి ఎవరైనా వ్యక్తికి, డీలర్కు ఫోన్ విక్రయిస్తే వారి చిరునామా, ఆధార్, వివరాలు సేకరించాలి. ఫోన్ అమ్మినట్లుగా(ఐఎంఈఐ) నంబరు, విక్రయించిన తేదీ, పేర్కొంటు రసీదు పొందాలి. విక్రయించారనే సమాచారం ఉంటే భవిష్యత్తులో ఆ ఫోన్ ద్వారా నేరం జరిగినా పోలీసు దర్యాప్తు నుంచి సురక్షితంగా బయటపడవచ్చు. పాత ఫోన్లను గుడ్డిగా కొనడం, విక్రయించడం చేయొద్దు. అవసరమైతే తప్ప గుర్తుతెలియని వారి నుంచి పాత ఫోన్లను కొనుగోలు చేయొద్దు. గ్రామా ల్లో తిరుగుతూ పాత ఫోన్లను తీసుకుని వస్తువులు ఇచ్చే వారిని నమ్మొద్దు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. – సంతోష్కుమార్, సీఐ, సదాశివనగర్


