breaking news
Nizamabad District News
-
ముందున్నయి విపత్తులు.. మరువకు జాగ్రత్తలు..
● అన్నదాతలకు ప్రకృతి వైపరీత్యాలు, రసాయనాల స్ప్రే, విద్యుత్ రూపంలో పొంచివున్న ప్రమాదాలు ● అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతులుబోధన్రూరల్: ఈ ఏడాది వానాకాలం సీజన్లో వర్షాలు లేటుగా కురవడంతో ఇప్పుడిప్పుడే రైతన్నలు పంటల సాగు పనులు ముమ్మరం చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పొలాల్లోనే శ్రమిస్తూ అన్నదాతలు, వ్యవసాయ కూలీలు పంటల సాగులో నిమగ్నమవుతున్నారు. ఈక్రమంలో వారికి అనుకోకుండా సంభవించే ప్రకృతి వైపరీత్యాలు, క్రిమికీటకాలు, విద్యుత్ మరమ్మత్తులు, మందుల పిచికారి వంటి పనుల్లో ప్రమాదాలు పొంచిఉంటున్నాయి. అప్రమత్తతంగా లేకపోవడం, నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తతతో వ్యవహరిస్తే ప్రమాదాలను నివారించవచ్చ ని వ్యవసాయ శాఖ అధికారులు, నిపుణులు పే ర్కొంటున్నారు.వారి సలహాలు, సూచనలు ఇలా.. క్రిమికీటకాలు.. వర్షాకాలంలో పాములు, తేళ్లు, విషపురుగులు, కీటకాల సంచారం కూడ ఎక్కువగా ఉంటుంది. పంటపొలాల్లోని గట్ల వెంబడి పాములు, విష కీటకాలు, పురుగులు సంచరించడంతోపాటు కాటు వేసే అవకాశం ఉంది. కావున రైతులు గట్లు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పంటల సాగు పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి తప్పిదాలతో ప్రమాదాలకు గురవుతుంటారు. అజాగ్రత్త, నిర్లక్ష్యంతో ప్రాణాలకే ముప్పు. వానాకాలం సీజన్లో ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్ మరమ్మతుల సమయాల్లో రైతులు, కూలీలు ప్రమాదాలకు గురవుతుంటారు. అప్రతమత్తత, జాగ్రత్తతో వ్యవహరిస్తే ప్రమాదాలకు గురవకుండా ఉండవచ్చు. – శ్రీనివాస్, వ్యవసాయ డివిజన్ అధికారి (ఏడీఏ), బోధన్ -
ఆ కల్లు తాగితే అంతే...
● రసాయనాలతో తయారైన కల్లు తాగి ప్రాణాలు కోల్పోతున్న జనం ● మత్తుకు బానిసవుతున్న మరికొందరు ● పట్టించుకోని ఎౖకై ్సజ్ శాఖ నిజామాబాద్అర్బన్: రసాయనాలతో తయారైన కృత్రిమ కల్లు ప్రజల ప్రాణాలను తీస్తోంది. మరికొందరు ఆ మత్తుకు బానిసై తమ ఆరోగ్యంతోపాటు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అయినా అధికారులు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. ఎకై ్సజ్ శాఖ ప్రతినెల మాముళ్లకు అలవాటు పడి విచ్చలవిడిగా కృత్రిమ కల్లు విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో మూడు డిపోలు.. జిల్లా కేంద్రంలో మూడు కల్లు డిపోలు కొనసాగుతున్నాయి. రోజుకు లక్షకు పైబడి లీటర్ల కృత్రిమ కల్లు తయారవుతుంది. చుట్టుపక్కల ఈతవనాలు లేకపోవడంతో రసాయనలతోనే కల్లు తయారువుతుంది. ఇందులో అల్ఫ్రాజోమ్, డైజోఫామ్, శాక్రిమ్, కుంకుడు రసం తదితర రసాయనాలతో ఈ కల్లును తయారు చేస్తున్నారు. 280 మంది సభ్యులు కలిగి ఉన్న ఒకటి, రెండు డిపోల పరిధిలో 11 దుకాణాలు ఉన్నాయి. కేవలం 60 మంది సభ్యులు మాత్రమే కలిగి ఉన్న మూడో డిపో మూడులో ఏకంగా 23 దుకాణాలు కొనసాగుతున్నాయి. మరో 6 అనధికారిక దుకాణాలు ఉన్నాయ ని సమాచారం. ఇందులో ప్రతిరోజు 70 వేల నుంచి లక్ష లీటర్ల కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. ఎన్నో అనర్థాలు.. కృత్రిమ కల్లు మనుషులను మానసిక స్థితిని చెరిపేస్తుంది.ఈ కల్లు సేవించిన వారు ప్రాణాలు కో ల్పోతున్నారు. గతంలో జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కల్లు తాగి కల్లు డిపోలో ని కాంపౌండులో మరణించాడు. ఇలా అనేక ప్రాంతాల్లోనూ పలువురు ప్రాణాలు కోల్పోయారు. కల్లు కు అలవాటు పడి మతిస్థిమితం లేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు సైతం ఉన్నాయి. కొందరు కల్లు లేనిదే ఒక్కరోజు కూడా ఉండడం లే దు. గల్ఫ్ దేశాలు వెళ్తున్నవారికి అక్కడ కల్లు దొరక్క తప్పిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లాలో కొనసాగుతున్నా.. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అ ధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.కల్లు డిపోలో తయారీ విధానంపై ఎకై ్సజ్ శాఖ అధికారులు తరుచు తనిఖీలు చేపట్టాలి. కల్లు తయారీలో ఎలాంటి వాటిని ఉపయోగిస్తున్నారో పరిశీలించాలి. నిబంధనలకు విరుద్ధంగా కల్లు తయారు చేస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ సంబంధిత అధికారులు తనిఖీలను మరవడంతో నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. నిషేదిత పదార్థాలను వినియోగించి, కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి కృత్రిమ కల్లు తయారుచేసే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కృత్రిమకల్లు విక్రయాలను నిలిపివేయించాలని ప్రజలు కోరుతున్నారు. రసాయనాలతో తయారు చేసే కల్లు వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మఖ్యంగా మెదడు మొద్దుబారి ఫిట్స్ రావడం, నరాలు తీవ్రంగా దెబ్బతినడం, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అకస్మాత్తుగా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. గర్భిణులకు కల్లు తాగించడం వల్ల బుద్ధిమాంద్యం గల పిల్లలు పుడుతున్నారు. – విశాల్, మానసిక వైద్యనిపుణుడు, జీజీహెచ్ నిజామాబాద్ కల్లు తయారీ కేంద్రల్లో తనిఖీలు చేపడతాం. తయారీ కేంద్రాల్లో రసాయనాలు, నిషేధిత పదార్థాలు లభిస్తే, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎట్టిపరిస్థితుల్లో కృత్రిమ కల్లు విక్రయించడానికి వీలులేదు. కల్లు డిపో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలి. –నందగోపాల్, సూపరింటెండెంట్, జిల్లా ఎకై ్సజ్ శాఖ, నిజామాబాద్ -
షోకాజ్ నోటీస్ జారీ!
ఖలీల్వాడి: ఉద్యోగుల సర్వీస్ బుక్ల మాయంపై జిల్లా కేంద్రంలోని నేషనల్ టెక్ట్స్ బుక్ ఆఫీస్ మేనేజర్ శ్రీనివాస్కు డీఈవో పార్శి అశోక్ ఇటీవల షోకాజ్ నోటీసులు అందించినట్లు తెలిసింది. ఇద్దరు ఉద్యోగుల సర్వీస్ బుక్ల మాయంపై జూన్ 16న ‘సాక్షి’లో సర్వీస్ బు క్లు మాయం..! అనే శీర్షికపై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. నెల రోజుల క్రితం మిర్చికంపౌండ్లోని నేషనల్ టెక్ట్స్ బుక్ ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగుల సర్వీస్ బుక్లు మాయమయ్యాయి. దీంతో మేనేజర్ను సదరు ఉద్యోగులు నిలదీయగా స్పష్టమైన సమాధానం రాలేదు. అనంతరం వారు కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఈవో అశోక్కు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో సదరు మేనేజర్ శ్రీనివాస్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలాగే విద్యాశాఖ అధికారులు నాలుగైదు రోజుల క్రితం మేనేజర్ శ్రీనివాస్కు షోకాజ్ నోటీసులు అందించగా, సమాధానం అందించలేదని తెలిసింది. దీంతో మేనేజర్ శ్రీనివాస్పై ఆర్జెడీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు విద్యాశా ఖ అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. సుభాష్నగర్: నగరంలోని గాంధీగంజ్లో తోపుడు బండ్ల వ్యాపారులకు పండ్ల విక్రయాల కోసం అనువైన స్థలం కేటాయించాలని ఎంఐఎం నాయకులు కోరారు. ఈమేరకు వారు తోపుడు బండ్ల వ్యాపారులతో కలిసి ఆదివారం ఆందోళనకు దిగారు. అనంతరం వ్యాపారులు మాట్లాడుతూ.. పండ్ల బండ్లను గంజ్లోని మూత్రశాలల వైపు పెట్టుకోవాలని అధికారులు ఆదేశించడంతో తమ వ్యాపారం సక్రమంగా జరగడం లేదన్నారు. తోపుడు బండ్ల వ్యాపారాన్ని అడ్డుకోవడం సరికాదని, వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని చైర్మన్, అధికారులను ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ కోరారు. వారికి న్యాయం చేయని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నగర అధ్యక్షుడు షకీల్, కార్పొరేటర్ అమర్, షాబాజ్, తోపుడు బండ్ల వ్యాపారులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి: మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన సైదు అయాన్స్ సైనిక్ పాఠశాలకు ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన సైదు రాము, జ్యోతి దంపతుల కుమారుడు అయాన్స్ ఇటీవల సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష రాయగా, ప్రతిభ చూపి జిల్లా టాపర్గా, రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా అయాన్స్ను సర్పంచ్ లోక స్వప్న, ఉపసర్పంచ్ పురుషోత్తంరెడ్డి, వీడీసీ చైర్మన్ అంకం రాజేందర్, సైదు లక్ష్మణ్, సుదర్శన్, వరుణ్ తేజ్ తదితరులు అభినందించారు. కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలోగల ఓ ఇంట్లో ఆదివా రం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలి పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సమాచారం అందుకున్న కామారెడ్డి అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. -
మారిన నిబంధనలు.. తప్పిన తిప్పలు
● విద్యుత్ కనెక్షన్ ఇక సులభం ● డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే 1కి.మీలోపు ఉచితంగా ఓవర్హెడ్ లైన్ఆర్మూర్: విద్యుత్ కనెక్షన్ కోసం ఇన్నాళ్లూ రైతులు, సామాన్యులు తిప్పలు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టీజీఎన్పీడీసీఎల్ కొత్త నిబంధనలతో జిల్లాలో విద్యుత్ కనెక్షన్ ప్రక్రియ పూర్తిగా సులభతరం అయిపోయింది. గృహ, వాణిజ్య, వ్యవసాయ కనెక్షన్ కావాలంటే మీ–సేవా కేంద్రంలో దరఖాస్తు చేసి, కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు, సర్వీస్ లైన్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్ కడితే సరిపోతుంది. గతంలో మాదిరిగా కిలోమీటర్ల కొద్దీ ఓవర్హెడ్ లైన్ ఖర్చును వినియోగదారుడి నెత్తిన వేసే పద్ధతికి స్వస్తి చెప్పారు. కిలో మీటర్ వరకు ఓవర్హెడ్ లైన్ను విద్యుత్ శాఖనే ఉచితంగా వేసి సదరు వినియోగదారుడు దరఖాస్తు చేసుకున్న మీటర్ను బిగించి ఇవ్వనున్నారు. నిజామాబాద్ విద్యుత్ సర్కిల్ పరిధిలో ఫిబ్రవరి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దీంతో జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ విద్యుత్ డివిజన్ల పరిధిలో కొత్త కనెక్షన్ కోసం చేసుకున్న దరఖాస్తులు త్వరగా క్లియర్ అవుతున్నాయి. రైతులకు ఉపయోగకరం.. జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల కోసం గతంలో ఒక కనెక్షన్కు రూ. పది వేల నుంచి రూ. లక్ష దాకా లైన్ ఖర్చు అంచనా వేసేవారు. దీంతో ఆర్థిక భారం తగ్గించుకోవడం కోసం ముగ్గురు, నలుగురు రైతులు కలిసి దరఖాస్తు చేసుకొనే వారు. అధికారులు వచ్చి అంచనాలు తయారు చేసేసరికి సీజన్ అయిపోయేది. ఇప్పుడు ఆ తిప్పలు లేవు. దగ్గర్లో కిలోమీటర్ లోపు ట్రాన్స్ఫార్మర్ ఉంటే చాలు, డిపాజిట్ కట్టిన వెంటనే లైన్ వేసి కనెక్షన్ ఇస్తారు. అక్రమ వసూళ్లకు చెక్.. ఈ కొత్త విధానంతో క్షేత్రస్థాయిలో జరిగే అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎంత దూరం లైన్ ఉంది, ఎన్ని పోల్స్ కావాలి అనే తిప్పలు వినియోగదారుడికి లేవు. దరఖాస్తు చేసుకున్న మీటర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కిలో మీటర్ దూరం ఉండి, డాక్యుమెంట్లు సరిగ్గా ఉండి అర్హత ఉంటే వారంలో కనెక్షన్ ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. కొత్త విధానం వల్ల క్షేత్రస్థాయిలో పారదర్శకత పెరిగింది. ఆర్మూర్ డివిజన్లోనే నాలుగు నెలల్లో దరఖాస్తు చేసుకున్న వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం. ఇంతకుముందు లైన్ ఎక్స్టెన్షన్ చార్జీల పేరుతో రైతులకు ఆర్థిక భారం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వమే ఆ ఖర్చు భరిస్తోంది. అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుడికి ఏడు రోజుల్లో కనెక్షన్ ఇవ్వడమే మా లక్ష్యం. అనవసరంగా ఎవరూ మధ్యవర్తులను నమ్మొద్దు. నేరుగా సెక్షన్ ఆఫీస్లో లేదా మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. –రఘు,డీఈ, ఆర్మూర్ డివిజన్, టీజీఎన్పీడీసీఎల్ -
పిడుగుపాటు.
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సమయంలో ఉన్నటుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువడం సర్వసాధారణం. ఈ సమయంలో వర్షంలో తడవకుండా ఉండేందుకు రైతులు చెట్ల కిందకు వెళ్లి తలదాచుకుంటారు. ఇటువంటి సమయాల్లో పిడుగుపాటు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసినప్పుడు ఎట్టి పరిస్థితిల్లో చెట్ల కిందకు వెళ్లకూడడు ● విద్యుత్ ప్రసరించే వస్తువులు, కరెంట్ తీగాలకు దూరంగా ఉండాలి ● వర్షంలో తడవకుండా ఉండేందుకు రెయిన్ కోట్లను ధరించి, చెట్లు, విద్యుత్ తీగాలకు దూరంగా పొలాల గట్లపై ఉండాలి -
క్రీడలు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి
సుభాష్నగర్: క్రీడలు పిల్లల్లో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. నగరంలోని బస్వాగార్డెన్లో అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు కలర్ బెల్టులు, సర్టిఫికెట్ల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈను అసోసియేషన్ ప్రధానకార్యదర్శి, కోచ్ మనోజ్కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. బెల్టు ప్రమోషన్ పరీక్షల్లో అర్హత సాధించిన సుమారు 150 మంది క్రీడాకారులకు జిల్లా యువజన, క్రీడల అధికారి పవన్కుమార్, క్రీడా సంఘాల ప్రతినిధి బొబ్బిలి నర్సయ్యతో కలిసి బస్వా లక్ష్మీనర్సయ్య బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు అభినందనీయులన్నారు. ప్రతిరోజూ క్రీడామైదానంలో సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలితోపాటు విద్యారంగంలో కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం చిన్నారులు ఫోన్లు, టీవీలు, ఇతర డిజిటల్ పరికరాలకు బానిసలు అవుతున్నారని, వారిని క్రీడల్లో పాలుపంచుకోవడం వల్ల వారి భవిష్యత్ మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు. కోచ్ మనోజ్కుమార్, గంగాధర్, నాగరాజ్, శివకుమార్, నితిన్, సిద్ధార్థ, గోపికృష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ మరమ్మతులు..
వర్షాకాలంలో పొలాల్లో ఉన్న కరెంట్ మోటార్లలో వర్షపు నీరు చేరి సమస్యలు వస్తుంటాయి. వీటిని సరిచేసేందుకు రైతులు జాగ్రత్తలు పాటించకుండా మోటార్లను ముట్టుకోవడం వల్ల విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ● మోటార్ బోర్డులు, స్టార్టర్లు వర్షానికి తడవకుండా ప్లాస్టిక్ డబ్బాలను అమర్చుకోవాలి ● మోటార్లను ఆన్, ఆఫ్ చేసే సమయాల్లో చేతులు తడిగా లేకుండా చూసుకోవాలి ● చేతులకు గ్లౌవ్స్లను వాడటం వల్ల విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చు ● రైతులు ఎప్పుడు వెంట టెస్టర్ను, కాళ్లకు పాదరక్షలు ఉంచుకుంటే మంచిది ● ట్రాన్స్ఫార్మర్లు, బోరు మోటార్ల సమస్యలు వస్తే విద్యుత్ శాఖ సిబ్బందితోనే మరమ్మతులు చేయించుకోవాలి. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
● బాధితులను ఆస్పత్రికి తరలించిన ప్రభుత్వసలహాదారు షబ్బీర్అలీ భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలోని టోల్ప్లాజా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడగా, అటుగా వెళ్తున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ క్షతగాత్రులను గమనించి, అంబులెన్స్లో కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డిలో ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. భిక్కనూరు సమీపంలో షబ్బీర్ అలీ కాన్వయ్ ముందు వెళ్తున్న ఓ కారు టైరు పేలి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని దంపతులతోపాటు ఓ చిన్నారికి గాయాలయ్యాయి. వెంటనే షబ్బీర్ అలీ ప్రమాదాన్ని గమనించి, తన వాహనాన్ని నిలిపి, క్షతగాత్రుల వద్దకు వెళ్లారు. వారిని బయటకు రప్పించి, వివరాలు తెలుసుకున్నారు. వెంటనే అంబులెన్స్ను రప్పించి వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వైద్యులకు ఫోన్ చేసి వైద్యం వెంటనే అందించాలని సూచించారు. దీన్ని గమనించిన అక్కడి ప్రజలు షబ్బీర్అలీని అభినందించారు. -
తాగునీటి తంటాలు
● వారం రోజులుగా ‘పాత పట్టణం’లో ప్రజల ఇబ్బందులు ● పట్టించుకోని అధికారులు కామారెడ్డి టౌన్ : వారం రోజులుగా తాగునీటి కోసం కామారెడ్డి పాత పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆరు వార్డుల పరిధిలో నీటి సరఫరా నిలిచిపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. గడి రోడ్లోని వాటర్ ట్యాంకర్ వద్ద పంపు మోటారు చెడిపోవడంతో కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో 26, 27, 28, 45, 46, 47 వార్డుల పరిధిలో చుక్క నీరు రాక ప్రజల తంటాలు పడుతున్నారు. కాలనీవాసులు స్థానిక కౌన్సిలర్లను నిలదీస్తున్నారు. దీంతో కౌన్సిలర్లు సొంత ఖర్చులతో ట్యాంకర్లను తెప్పించి నీటిని సరఫరా చేయిస్తున్నారు. సమస్యపై బల్దియా అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి మోటారు రిపేరు చేయించకపోతే, కాలనీవాసులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నాకు దిగుతామని ఆయా వార్డుల కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు.26, 27వ వార్డులో ట్యాంకర్ ద్వారా నీటిని పట్టుకుంటున్న ప్రజలు -
పురాతన ట్యాంకు కూల్చివేత
బాన్సువాడ : పట్టణంలోని పాత బాన్సువాడ సంగమేశ్వర చౌరస్తా వద్ద శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకును ఆదివారం కూల్చివేశారు. సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంక్ ద్వారా పాత బాన్సువాడకు తాగునీటిని సరఫరా చేశారు. కొన్ని నెలల క్రితం ట్యాంకు లోపల పెచ్చులూడిపడుతుండటంతో నీటిని సరఫరా నిలిపివేశారు. నేరుగా పైపులైను ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకుతో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండటంతో మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. కాగా, పాత బాన్సువాడ మసీద్ వెనుక అమృత్ 2.0 పథకం కింద నూతనంగా ట్యాంకును నిర్మిస్తున్నారు. -
కరెంట్షాక్తో మెకానిక్ మృతి
ఆర్మూర్టౌన్: బోరు మోటారుకు మరమ్మతులు చేస్తుండగా ఓ మెకానిక్ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్కు చెందిన పన్నీరు శ్రీనివాస్(46) బోర్మెకానిక్గా పనిచేస్తుండేవాడు. పెర్కిట్లోని అల్లూరి నాగరాజు పొలంలో ఆదివారం శ్రీనివాస్ బోరు మోటారును రిపేరు చేయడానికి వెళ్లాడు. మోటారుకు మరమ్మతులు చేస్తుండగా అతడికి సర్వీస్వైరు ప్రమాదవశాత్తు తగలంతో కరెంట్ షాక్కు గురైయ్యాడు. పక్కనే ఉన్న నాగభూషణం అనే వ్యక్తి కర్ర సహాయంతో శ్రీనివాస్ను కాపాడి వెంటనే ఆర్మూర్ ప్రభుత్వ అస్పత్రికి తీసుకువెళ్లాడు. వైద్యులు పరిశీలించగా మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. నిజామాబాద్ రూరల్: నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిలయన్స్ మార్ట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయినట్లు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి వెళ్లి, పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని పోలీసులు తెలిపారు. మృతుడు బైపాస్ వద్ద భిక్షాటన చేస్తుండేవాడని స్థానికులు తెలిపారన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. మృత దేహన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
కాళేశ్వరం జలాలతో రిజర్వాయర్లు నింపాలి
● లక్ష క్యూసెక్కుల జలాలు వృథా అవుతున్నాయి ● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డివేల్పూర్: కాళేశ్వరం జలాలతో రిజర్వాయర్లను నింపి రైతులనుఆదుకోవాలని, వెంటనే కన్నెపల్లి పంప్హౌస్ మోటార్లను ఆన్ చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. మోర్తాడ్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ది అంతా అసత్య ప్రచారమేనని అన్నారు. కేసీఆర్పై కోపంతో రైతుల కడుపు కొట్టొద్దని హితవు పలికారు. మీకు చేతగాకుంటే కేసీఆర్కు అప్పజెప్పాలని, ఆయన 15 రోజుల్లో నీటిని నింపి చూపిస్తారని అన్నారు. సీఎం రేవంత్రెడ్డికి మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ పేరుతో నిధులు దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు సాగునీరందించడంలో లేదన్నారు. తమ పోరాటానికి రైతులు కలసి రావాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు శేఖర్రెడ్డి, కల్లెడ ఏలి యా, నాగధర్రెడ్డి, బద్దం ప్రవీణ్రెడ్డి, రాజాపూర్ణానందం, బద్దం రవి, బద్దం అశోక్, ఆర్మూర్ మ హే శ్, ఏలేటి రమేశ్, బోగ ఆనంద్, పర్శ దేవన్న, పాపా యి పవన్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతోంది సర్
నిజామాబాద్జిల్లాలో వేగవంతమవుతున్న ప్రక్రియ ● ఇంటింటికీ వెళ్తున్న బీఎల్వోలు, అధికారులు ● 3వ తేదీ నాటికి ఏడు మండలాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి ఆ కల్లు తాగితే అంతే... రసాయనాలతో తయారైన కృత్రిమ కల్లు ప్రజల ప్రాణాలను తీస్తోంది. మత్తుకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సోమవారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2026– 8లో uనిజామాబాద్అర్బన్: జిల్లాలో సర్ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈనెల 3వ తేదీ నాటికి ఏడు మండలాల్లో ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ వందశాతం, 22 మండలాల్లో సుమారు 99 శాతం పూర్తయ్యింది. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాలు, గ్రామాల్లో బీఎల్వోలు, రెవెన్యూ అధికారులు ఇంటింటికీ వెళ్తూ అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన లేక ఇక్కట్లు ఎన్యుమరేషన్ ఫామ్లను నింపడంపై అవగాహన లేక చాలామంది ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పాత ఓటర్ల జాబితా నుంచి కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను తీసుకొని ప్రస్తుతం ఇంట్లో ఉన్న వారి వివరాలను ఏమాత్రం తప్పు లేకుండా పూర్తి చేయాల్సి ఉంది. దీనికి గుర్తింపు కార్డులను కూడా జత చేయాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో బీఎల్వోలు ఫారాలు తిరిగి తీసుకునేందుకు ఇంటింటికి వెళ్తుండగా పూరించినవి ఉండడంతో లేదు. దీంతో వారే వివరాలను సేకరించి ఫామ్లను నింపుతున్నారు. ఈ ప్రక్రియ మరింత సమయం తీసుకుని అవకాశం ఉంది. గడువులోగా పూర్తి చేయాల్సిందే.. ఎన్యుమరేషన్ ప్రక్రియను ఈనెల 24వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, 1,565 మంది బీఎల్వోలు, 160 మంది సూపర్వైజర్లు, తహసీల్దార్లు పని చేస్తున్నారు. ఆదివారం వరకు మాక్లూర్, డొంకేశ్వర్, ధర్పల్లి, నవీపేట, రెంజల్, చందూర్, మోపాల్, జక్రాన్పల్లి, ముప్కాల్, వర్ని మండలాల్లో వందశాతం ఫామ్ల పంపిణీ పూర్తయ్యింది. ఈనెల 31వ తేదీన ముసాయిదా జాబితాను ప్రచురించి, ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1వ తేదీన విడుదల చేస్తారు.జిల్లాలో ఈనెల 3 నాటికి ‘సర్’ ఇలా..జిల్లాలో సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ పూర్తయినా.. వాటిని పూరించడంపై ఓటర్లకు అవగాహన లేక నెమ్మదిస్తోంది. బీఎల్వోలే వివరాలు సేకరించి ఫామ్లు నింపాల్సిన పరిస్థితి ఉంది. -
పట్టాలెక్కిన ఎవుసం!
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎల్నినో ప్రభావంతో జూన్ లో వర్షాలు కురవకపోవడంతో ఆగమైన ఎవుసం ఇప్పుడు పట్టాలెక్కింది. ఈ నెల ప్రారంభం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. వరినారు ఎదగడంతో జిల్లా వ్యాప్తంగా నాట్లు జోరందుకున్నాయి. ఒక పక్క ట్రాక్టర్లతో పొలాన్ని దమ్ము చేయిస్తూ మరో పక్క కూలీలతో వెంట వెంట నాట్లు వేయిస్తున్నారు. పసుపు, సోయా విత్తనాలు విత్తడం దాదా పు పూర్తి కాగా, మక్క విత్తనాలు విత్తుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఆయా పంటలు మొత్తం 5.30 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 2లక్షల ఎకరాల వరకు పంటలు సాగులోకి రాగా.. ఇందులో వరి విస్తీర్ణం 1.15 లక్షల ఎకరాలుగా ఉంది. సరిగ్గా వారం రోజుల క్రితం 21 వేల ఎకరాల్లోనే వరినాట్లు పూర్తికాగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరినాట్లు పూర్తయిన విస్తీర్ణం ఏకంగా 94వేల ఎకరాలకు పెరగడం గమనార్హం. మరో పది రోజుల్లో పనులు మరింత ఊపందుకోనుండగా, జూలై నెలంతా వరినాట్లు వేయనున్నారు. వరినాట్లు వేసేందుకు ఏపీ, బీహార్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూలీలు జిల్లాకు వచ్చారు. కాగా, ప్రభుత్వం ఏడు రకాల సన్నాలకే బోనస్ ఇస్తామని చెప్పడంతో రైతులంతా అవే రకాలను సాగు చేస్తున్నారు. వేరే రకాల జోలికి అసలే పోలేదు. సమయానికి ‘భరోసా’ ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయనే ఆనందంలో ఉన్న రైతన్నలు సరైన సమయంలో ప్రభుత్వం రైతుభరోసా జమ చేసిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.6 వేలు ఇవ్వడంతో కూలీలకు చెల్లించేందుకు, ఇతర ఖర్చులకు ఉప యోగపడుతున్నాయి. జిల్లాలో శనివారం నాటికి ఆరెకరాల వరకు 2,68,177మంది రైతులకు రూ.280.56 కోట్లు జమయ్యాయి. ఎప్పుడు కావాలంటే అప్పు డు యాప్లో యూరియా లభిస్తోంది. ఇప్పటి వరకు 1,98,782మంది రైతులు 6,63లక్షల బస్తాలను కొనుగోలు చేయగా, జిల్లా లో ఇంకా 1.91లక్షల బస్తాలు అందుబాటులో ఉన్నాయి. పంట వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు అంచనా సాగులోకి వచ్చింది వరి 4,38,521 1,15,000మొక్కజొన్న 55,000 42,019సోయా 34,227 23,457కంది 994 430పెసర 37 55మినుము 65 52పత్తి 993 610జిల్లాలో పంటల సాగు అంచనా.. సాగులోకి వచ్చిన విస్తీర్ణంకురుస్తున్న వర్షాలు.. జోరందుకున్న సాగు పనులు బిజీగా మారిన రైతన్న వారంలోనే 91 వేల ఎకరాల్లో నాట్లుమొత్తం సన్నరకాలే వేస్తున్నా వర్షాలు కురుస్తుండ డంతో వరి సాగు పనులు మొదలు పె ట్టా. సన్నాలకే ప్రభు త్వం బోనస్ ఇస్తామ ని చెప్పడంతో ఏడు ఎకరాల్లో సన్నాలే సాగు చేస్తున్నా. ప్రస్తుతం మూడెకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. సరైన సమయంలో ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందించడంతో ఖర్చులకు ఆసరా అయ్యింది. – అల్లారి నవీన్, తొండాకూర్ -
సాలూర ఎత్తిపోతలకు మళ్లీ తాళం
● పేరుకుపోయిన నీటి పన్ను బకాయిలు ● నిధులు లేక నిస్సహాయ స్థితిలో నిర్వహణ కమిటీ బోధన్: మంజీర నదిపై సాలూర శివారులో నిర్మించిన ఎత్తిపోతల పథకానికి నిధులు లేక మళ్లీ తాళం పడింది. గత వానాకాలం సీజన్కు మూడు నెలల ముందు ఎత్తిపోతల పథకం ప్రధాన పంప్హౌజ్లో ఎలక్ట్రికల్ ప్యానెల్బోర్డుతోపాటు ఇతర సామగ్రిని దుండగులు ఎత్తుకెళ్లారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల సహకారంతో నిధులు సమకూర్చి పథకాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది సిబ్బంది వేతన బకాయిలు, పైప్లైన్ లీకేజీ మరమ్మతులు, ఇతర పనులకు నిధులు లేకపోవడంతో తాళం వే శారు. పథకం పరిధిలోని రైతులు మెట్ట భూమి ఎక రానికి రూ.800, మాగాణికి రూ.వెయ్యి చొప్పున చెల్లించాల్సి ఉండగా సుమారు రూ.10 లక్షల వరకు బకాయిలు పేరుకుపోయాయి. గత రెండు నెలలకాలంలో బకాయిల వసూళ్లు, పథకం నిర్వహణపై మూడు సార్లు రైతులతో సమావేశాలు నిర్వహించా రు. బకాయిల వసూళ్ల కోసం కమిటీ ప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో రూ.3 కోట్లు మంజూరు చేయగా పథకం రూపుదిద్దుకుంది. 2006–07లో పనులను పూర్తిచేసి 1,600 ఎకరాలను స్థిరీకరించారు. బకాయిలు చెల్లించి సహకరించాలి ఆయకట్టు రైతులు నీటి ప న్ను బకాయిలు చెల్లించి సహకరించాలి. ప్రస్తుతం పథకం ప్రారంభానికి నిధుల కొరత ప్రధాన సమస్యగా ఉంది. సిబ్బందికి వేతనాలు, పైప్లైన్ లీకేజీ మరమ్మతులు, ఇతర పనులకు నిధులు అవసరం. రైతుల సహకారం ఉంటేనే పథకం నిర్వహణ సాధ్యమవుతుంది. – శివకాంత్ పటేల్, ఎత్తిపోతల పథకం నిర్వహణ కమిటీ చైర్మన్ -
తీరనున్న కల!
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న కామారెడ్డి – మెదక్ జిల్లాల మధ్య రోడ్డు పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. వెంకపల్లి– ముద్దాపూర్ మధ్యలో మంజీర నదిపై నిర్మించిన వంతెన అవతలి వైపు అప్రోచ్ రోడ్డుకు ప్ర భుత్వం రూ.22.50 కోట్లు మంజూరు చేసింది. కా మారెడ్డి జిల్లా ధర్మారెడ్డి నుంచి మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపూర్ వరకు రోడ్డు, ఇరు జిల్లాల మధ్య మంజీరా నదిపై వంతెన నిర్మాణానికి 2015 లో అప్పటి ప్రభుత్వం రూ.33 కోట్లు మంజూరు చేసింది. వీటిలో సుమారు రూ.12 కోట్లతో మంజీర నదిపై వంతెన నిర్మాణం, కామారెడ్డి జిల్లా పరిధిలో రోడ్డు పనులను పూర్తిచేశారు. అయితే, వంతెన అవతలి వైపు మెదక్ జిల్లా పరిధిలో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. మంజీరా నదికి అవతలి వైపు అప్రోచ్ రో డ్డు పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ఇరుజిల్లాల ప్రజలు పలుమార్లు ఎల్లారెడ్డి, మెదక్ ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, మై నంపల్లి రోహిత్రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధు లు మంజూరు చేసింది. ఈ నిధులతో మెదక్ జిల్లా పరిధిలోని పాపన్నపేట వరకు 2.9 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించనున్నారు. ● కామారెడ్డి – మెదక్ జిల్లాల మధ్య అప్రోచ్ రోడ్కు నిధులు మంజూరు -
హామీలను నెరవేరుస్తున్నాం
ధర్పల్లి: ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి అన్నారు.ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ఆదివారం ధర్పల్లి మండల కేంద్రంలో ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రతినిధు లు సర్లో భాగస్వాములు కావాలని, అర్హు ల ఓట్లు తొలగిపోకుండా చూడాల్సిన బాధ్య త నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఓటర్లు సర్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో ఎన్యుమరేషన్ పత్రాలను నింపడానికి వలంటీర్లను నియమించిన సర్పంచ్ను ఆయన అభినందించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజు, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, నాయకులు మనోహర్రెడ్డి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ● కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర ఎల్లారెడ్డి: యువత జూదానికి దూరంగా ఉండాలని, అది కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేస్తుందని ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం రాత్రి ఎల్లారెడ్డి శివారులో పేకాడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసి రూ.21,350 నగదు, ఐదు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. యువత తమ సమయాన్ని విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు వెచ్చించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. జూదం, గేమింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం నేరమని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు సమాచారం అందించి సహకరించాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రూరల్ ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీరాజ్ ఎస్ఈ నిజామాబాద్ రూరల్: పంచాయతీరాజ్ ఎస్ఈగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శంకర్నాయక్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్లో ఉన్న క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను ఆయన ఆదివారం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేతో పలు అంశాలపై చర్చించారు. విధినిర్వహణలో అంకితభావంతో పని చేయాలని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. -
తర‘గతి’ ఏదీ..?
● అసౌకర్యాల బడులు.. తీరని అవస్థలు ● శిథిలావస్థకు చేరిన తరగతి గదులు.. ● మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు వేల్పూర్ మండలం రామన్నపేటలోని ఉన్నత పాఠశాలలో తొమ్మిది గదులు ఉండగా, మూడు గదులు మాత్రమే బోధనకు అనుకూలంగా ఉన్నాయి. స్లాబు పెచ్చులూడుతున్న ఒక గదిని మధ్యాహ్న భోజనం అవసరాలకు వాడుతుండగా, ఒకటి హెడ్మాస్టర్, మరోటి ఉపాధ్యాయు లు, సిబ్బంది వాడుకుంటున్నారు. శిథిలావస్థకు చేరి కూలిపోయే ప్రమాదం ఉన్న మరో మూడు గదులకు తాళం వేశారు. మిగిలిన మూడు గదుల్లో తరగతులను కొనసాగిస్తున్నారు. ‘మన – ఊరు మనబడి’ కింద ఐదు గదుల నిర్మాణానికి గత ప్రభుత్వం రూ. 75 లక్షలు మంజూరు చేసింది, కానీ నిధులు సరిపోవని కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదు. కొత్త తరగతి గదుల నిర్మాణం జరగలేదు. దీంతో పాఠశాలలో బోధన కోసం గదుల కొరత ఏర్పడింది.రెంజల్ మండలం కందకుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిలిచిన మరుగుదొడ్డి పనులు సాలూరా క్యాంప్ పాఠశాల వరండాలో మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులుబోధన్/ఖలీల్వాడి/కమ్మర్పల్లి: జిల్లాలో మొత్తం 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 5,292 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 40 స్కూళ్లు ‘పీఎం శ్రీ’ కి ఎంపికయ్యాయి. రేషనలైజేషన్లో భాగంగా 33 స్కూళ్లు మూతపడ్డాయి. 270 స్కూళ్లలో 507 మూత్రశాలల నిర్మాణానికి అనుమతి రాగా కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్ని చొట్ల పనులు జరగడం లేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు మరో 103 స్కూళ్లలో మూత్రశాలల నిర్మాణం చేపట్టనున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఒక్కొక్క స్కూల్కు రూ.2 లక్షలు కేటాయించారు. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు నెలకొని విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఏళ్లు గడిచినా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పలు పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. గదులు, ఉపాధ్యాయుల కొరత, సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలల లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. సాలూర మండల కేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో 6 నుంచి 10వ తరగతి వరకు 270 మంది విద్యార్థులుండగా, 9 గదులు మాత్రమే ఉన్నాయి. గదుల కొరత వల్ల డైనింగ్ హాల్, కంప్యూటర్, సైన్స్ల్యాబ్, లైబ్రరీ గదులు, పాఠశాల వరండాలో, చెట్టు కింద తరగతులు కొనసాగుతున్నాయి. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 125 మంది విద్యార్థులుండగా, నాలుగు గదులు ఉన్నాయి. గదుల కొరత కారణంగా వరండాల్లో రెండు తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పాఠశాలకు ప్రీప్రైమరీ స్కూల్ మంజూరైంది. ఉర్దూమీడియం ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఏడు తరగతులకు నాలుగు గదులున్నాయి. ఒక గదిలో రెండు తరగతులను కొనసాగిస్తున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి ఉర్దూమీడియం జెడ్పీహెచ్ఎస్లో 173 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులున్నారు. ఓ ట్రస్ట్ తరఫున మరో ముగ్గురు విద్యావలంటీర్లను నియమించారు. నీటి సౌకర్యం లేక మరుగుదొడ్డి, మూత్రశాలలు వినియోగంలో లేవు. బాలికల కోసం చేపట్టిన మరుగుదొడ్డి నిర్మాణ పనులు ఏడాది నుంచి అర్ధంతరంగా నిలిచిపోయాయి. కందకుర్తి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 167 మంది విద్యార్థులకుగాను ఇద్దరు ఎస్జీటీలు ఉన్నారు. బోధన్ పట్టణంలోని శక్కర్నగర్ మధుమలాంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 268 మంది విద్యార్థులుండగా, ఇందులో 103 మంది బాలికలున్నారు. ఇక్కడా సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం లేదు. రుద్రూర్లోని జవహార్ నగర్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అసలు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. హరిజన వాడ ఎంపీఎస్ భవనం శిథిలావస్థకు చేరింది.రోడ్డు విస్తరణ పనుల్లో పాఠశాల మరుగుదొడ్లు, మూత్రశాలలను కూల్చి వేశారు. కోటగిరి మండలంలోని లింగాపూర్, పొతంగల్ మండలంలోని కొల్లూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు సొంత భవనాలు లేక గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తరగతుల వారీగా గదులు లేకపోవడంతో వరండాల్లో, చెట్ల కింద విద్యాబోధన సాగుతోంది. ఒకే వరండాలో వేర్వేరు తరగతుల వారు కూర్చుంటుండడంతో వారి పాఠాలు వీరికి.. వీరి పాఠాలు వారికి.. అన్నట్లుగా ఉంటోంది పరిస్థితి. జిల్లాలోని 194 ప్రభుత్వ బడుల్లో 444 గదులు శిథిలావస్థకు చేరుకోగా, వాటిని కూల్చివేయాల్సి ఉంది. అలాగే 19 స్కూళ్లలో 55 గదుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 282 పాఠశాలల్లోని 602 గదులకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. సాలూర క్యాంప్ మండల పరిషత్ ప్రాథ మిక పాఠశాలలో 16 మంది విద్యార్థులు, ఒక టీచర్ ఉన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకటో తరగతిలో అసలు విద్యార్థులు లేకపోగా, రెండో తరగతిలో నలు గురు, మూడో తరగతిలో ఆరుగురు, నాల్గో తరగతిలో ఇద్దరు, ఐదో తరగతిలో నలుగురు విద్యార్థులు ఉన్నారు. -
ఖరీఫ్ సాగుకు తోడ్పాటునందించాలి
● ప్రజారోగ్య పరిరక్షణకు సమన్వయంతో పని చేయాలి ● వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిజామాబాద్ అర్బన్: ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులకు ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయిలో తోడ్పాటునందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు అన్నారు. వ్యవసాయం, విత్తనాలు, ఎరువులు, ప్రజారోగ్యం, పంటల మార్పిడి, ఫార్మర్ రిజిస్ట్రి, తాగునీరు, ఇరిగేషన్, విద్య, వాతావరణ మార్పులు, ఉద్యానవనం, సూక్ష్మ సాగునీరు, ఆయి ల్ పామ్ విస్తరణ, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వానాకాలం సీజన్కు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, నకి లీ విత్తనాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నా రు. జూలై నెలకు అవసరమైన ఎరువులను ముందస్తుగా నిల్వ ఉంచాలని, యూరియా అక్రమ రవా ణా, అధిక ధరలకు విక్రయాలు, నిల్వలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, నానో యూరియా వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి, జి ల్లా, డివిజన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను సిద్ధంగా ఉంచాలని అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ లో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతోపాటు ప్రత్యామ్నాయ పంటల సాగులో అవసరమైన మెలకువలు అందించడం జరుగుతోందన్నారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని, తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని సీఎస్కు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను ఎప్పటికప్పు డు సందర్శిస్తున్నామన్నారు. సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, అధికారులు పాల్గొన్నారు. -
ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ తప్పనిసరి
● ఆహార భద్రత అధికారిణి సవిత ● హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలుసుభాష్నగర్: నిజామాబాద్ నగరంలోని పలు ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో జిల్లా ఆహార భద్రత అధికారిణి సవిత శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వంటశాలలు, పాత్రలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తనిఖీల్లో తమ దృష్టికి వచ్చినట్లు ఆమె తెలిపారు. కృత్రిమ రంగు వేసిన మాంసం విక్రయిస్తున్నారని, కలుషిత ఆహారాన్ని పారేశామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్టం 2006 సెక్షన్ 32 ప్రకారం నోటీసులు ఇచ్చామని, 14 రోజుల్లో లోపాలను సరి చేయని వారికి జరిమానాలు విధించి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లైసెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఆమె వెంట జిల్లా ఆహార భద్రతశాఖ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించండి
● నేరాల నియంత్రణకు కృషి చేయాలి ● బాసర జోన్ డీఐజీ భాస్కరన్ ● నాలుగు జిల్లాల పోలీస్బాస్లతో సమీక్షనిజామాబాద్అర్బన్: ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి శాఖపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందించాలని బాసర జోన్ డీఐజీ భాస్కర్ అన్నారు. నేరాల నియంత్రణ కు కృషి చేయాలన్నారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల్, ఆదిలాబాద్ జిల్లాల పోలీస్ అధికారులతో శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. రేంజ్ పరిధిలోని జిల్లాల్లో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ, కే సుల దర్యాప్తు, మహిళలు, చిన్నారుల భద్రత, సై బర్ నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మాదకద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లాల వారీ గా నమోదవుతున్న నేరాల తీరు, విచారణలో పురో గతి, తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ప్రజల ఫిర్యాదులను సకాలంలో స్వీకరించడంతో పాటు పారదర్శకంగా విచారణ చేపట్టి త్వరి తగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి సైబర్ నేరాలను అరికట్టాలని, మహిళలు చి న్నారులపై జరిగే నేరాల కేసుల్లో వేగవంతమైన ద ర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూ డాలని ఆదేశించారు. అనంతరం రేంజ్ పరిధిలోని ఆయా జిల్లాల పోలీస్ అధికారులు, యూనిట్ ఇన్చార్జీలు తమ జిల్లాలకు సంబంధించిన పనితీరు, నేరల నియంత్రణ చర్యలు, ఎదురవుతున్న సమస్యలను డీఐజీకి వివరించారు. సీపీ సాయి చైతన్య, నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్, అదనపు ఎస్పీలు, ఏసీపీలు, సీఐలు రిజర్వ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
ఒకరి ఆత్మహత్య నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మద్యానికి బానిసైనా ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగిరెడ్డిపేట మండలం తాండూర్లో చోటుచేసుకుంది. ఎస్సై భార్గవ్గౌడ్ కథనం ప్రకారం.. తాండూర్ చెందిన ధారబోయిన నాగరాజు(30) మద్యానికి బానిసై ఇంట్లో గొడవపడి శనివారం వేకువజామున ఇంటి నుంచి బయటికివెళ్లాడు. గ్రా మ శివారులోని నాగనయ్య చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య వినోదతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. న్యాల్కల్లో మరొకరు.. మోపాల్ : మండలంలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన మోస్ర పోశెట్టి (47) శుక్రవారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోశెట్టి మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాగుడుకు బానిసైన పోశెట్టి దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో కలత చెందిన పోశెట్టి క్షణికావేశానికి గురై ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య రమ, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మద్నూర్(జుక్కల్): సలాబత్పూర్ వద్ద శనివారం జాతీయ రహదారి 161 దాటుతున్న వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. ఎస్సై మోహన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సలాబత్పూర్ గ్రామానికి చెందిన ఇబిత్వార్ ప్రకాశ్(44) శనివారం రాత్రి జాతీయ రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందాడు. మృతదేహాన్ని మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపుదాడి
● పట్టుబడిన పది మంది ● రూ.58,490 స్వాధీనం డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం నూత్పల్లి శివారులో పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ పోలీసు బృందం శనివారం మెరుపుదాడి నిర్వహించింది. ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో ఈ ఆకస్మిక దాడి జరుగగా, పేకాట ఆడుతున్న బడా గ్యాంగ్ పట్టుబడింది. పోలీసుల కథనం ప్రకారం... నూత్పల్లి శివారులోని ఓ గెస్ట్హౌస్ను అడ్డాగా చేసుకొని కొంతమంది పేకాట ఆడుతున్నారు. నిఘా ఉంచిన పోలీసులు పక్కా సమాచారంతో శనివారం చీతా ఫోర్స్ మెరుపుదాడి చేయగా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.58,490 నగదుతోపాటు పది సెల్ఫోన్లు, ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు, నగదు, వాహనాలు, ఫోన్లను నందిపేట్ పోలీసులకు అప్పగించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని ఎస్సై వినయ్కుమార్ తెలిపారు. -
రైతు బాగుంటేనే.. రాజ్యం బాగుంటుందనే స్ఫూర్తితో పాలన
● జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ ● శ్రద్ధానంద్ గంజ్లో రూ.6.56 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సుభాష్నగర్: తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. రైతాంగ ప్రయోజనాలు కాపాడటమే ధ్యేయంగా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. నిజామాబాద్ నగరంలోని మార్కెట్ కమిటీ (శ్రద్ధానంద్ గంజ్) ఆవరణ లో రూ.6.56 కోట్లతో చేపట్టనున్న షెడ్ల నిర్మాణా లు, మడిగెలు, సోలార్ విద్యుత్, తదితర అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ ఉమారాణితో కలి సి సీతక్క శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే.. రాజ్యం బాగుంటుందనే స్ఫూర్తితో ప్రభుత్వం పాల న చేపడుతోందన్నారు. రైతుల సంక్షేమం కోసం రు ణమాఫీ, రైతు భరోసా, బోనస్, తదితర అనేక పథకాలు అమలు చేస్తోందని గుర్తుచేశారు. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా యాసంగి సీజన్ లో పెద్ద ఎత్తున పంటలు సాగుచేశారన్నారు. ప్రతి పంటకు పూర్తిస్థాయిలో మద్దతు ధర చెల్లిస్తూ, చివ రి గింజ వరకు ప్రభుత్వమే పంట దిగుబడులను కొనుగోలు చేసి రైతులను ఆదుకుందని అన్నారు. యార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తా.. నిజామాబాద్ మార్కెట్ యార్డులో మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు వీలుగా సీఎంతోపాటు వ్యవసాయశాఖ మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డులోని అర్హులైన హమాలీలకు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేసేలా చొరవ చూపుతానన్నారు. హమాలీల కోసం ప్రత్యేకంగా బోర్డు, కనీస వేతన చట్టాన్ని సీఎం ఇటీవల ప్రకటించారని గుర్తుచేశారు. పూర్వవైభవం తీసుకొస్తున్నాం.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మార్కెట్యార్డును నిర్లక్ష్యం చేశారని, కనీసం పాల కవర్గాన్ని నియమించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో పాలకవర్గాన్ని ప్రకటించామని, మార్కెట్యార్డుకు పూర్వవైభవం తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. గంజ్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు రైతుల కోసం గంజ్లో కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యే క ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేయాలని, కూ రగాయల హోల్సేల్ మార్కెట్లో మరో 20 మడిగెల నిర్మాణానికి, మార్కెట్ కమిటీ కార్యాలయ ని ర్వహణ కోసం ప్రతినెలా నిధులు కేటాయించేలా చ ర్యలు చేపట్టాలని మంత్రికి విన్నవించారు. అనంత రం మంత్రి సీతక్కకు మార్కెట్ కమిటీ పాలకవర్గం పట్టుచీరను అందించి ఘనంగా సత్కరించింది. మంత్రితోపాటు రూరల్ ఎమ్మెల్యేను రైస్మిల్, మర్చంట్ అసోసియేషన్, కూరగాయల హో ల్సేల్, రిటైల్ మార్కెట్ అసోసియేషన్, గుమాస్తా, దడువాయిలు, హమాలీలు, చాటా కార్మికుల అసోసియేషన్ తరఫున ఘనంగా సన్మానించారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగిటి రాంచందర్, డీఎంవో గంగు, సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ విజయ్కిశోర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేశ్రెడ్డి, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, కెతావత్ యాదగిరి, చిన్న సాయిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, ఆయా మండలాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. త్వరలో మాస్టర్ ప్లాన్ నిజామాబాద్ నగర సర్వతోముఖాభివృద్ధి కోసం త్వరలోనే మాస్టర్ ప్లాన్ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని, తద్వారా నగర ప్రజలకు అనేక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, విరివి గా నిధులు మంజూరు అవుతాయని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో పయనింపజేసేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రంతోపాటు రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఇన్చార్జి మంత్రి సీతక్క ఇందల్వాయి మండలం తిర్మన్పల్లిలోని గిరిజన బాలికల సంక్షేమ కళాశాలలో అదనపు వసతిగృహ సముదాయం, కిచెన్, డైనింగ్ హాల్ను విద్యార్థులతో కలిసి ప్రారంభించారు. అలాగే కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. – ఇందల్వాయి -
ప్రజల భాగస్వామ్యంతోనే నేరరహిత సమాజం
కామారెడ్డి క్రైం: పోలీసులు, ప్రజల భాగస్వామ్యంతోనే నేరరహిత సమాజం నిర్మాణం అవుతుందని ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో శనివారం వేకువజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం 160 మంది పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. 11 వాహనాలు నంబర్ ప్లేట్లు లేనివి సహా మొత్తం 121 బైక్లు, 36 ఆటోలు, 2 కార్లు, 18 బీర్ బాటిళ్లు, 12 క్వార్టర్ మద్యం బాటిళ్లు, ఒకరి వద్ద నుంచి తల్వార్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములను చేయడమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో కత్తులు, తల్వార్లు, ఇతర మారణాయుధాలతో ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి యువతను రెచ్చగొట్టేలా, ప్రజల్లో భయాందోళనలు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, నిల్వ, విక్రయం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. చెడు వ్యసనాలకు బానిస కాకుండా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహాలు, రోజువారీ అలవాట్లను గమనించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, దొంగతనాలు, గంజాయి లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్న్కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడే ఉన్న కొందరు అనుమానితులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యలు, జీవనశైలిని తెలుసుకున్నారు. నేరాలకు దూరంగా ఉండి మంచి ప్రవర్తన కనబరిస్తే నిబంధనల మేరకు షీట్ల తొలగింపును పరిశీలిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్, పట్టణ ఎస్హెచ్వో నరహరి, రూరల్ సీఐ శ్రీధర్, భిక్కనూర్ సీఐ నరేశ్, ఆర్ఐలు సంతోష్, నవీన్, కృష్ణ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎస్పీ రాజేశ్చంద్ర రాజీవ్నగర్లో కార్డన్ సెర్చ్ 121 బైక్లు, 36 ఆటోలు, 2 కార్లు, ఒక తల్వార్, మద్యం బాటిళ్లు స్వాధీనం -
మెరుగైన విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యత
బోధన్: వినియోగదారులుకు, వ్యవసాయానికి మరింత మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు క్షేత్రస్థాయిలో విద్యు త్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటివరుణ్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన ఎడపల్లిలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ను సందర్శించారు. ఎడపల్లి సబ్ డివిజన్ పరిధిలోని అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. జైతాపూర్, పోచారం ఫీడర్స్ ప్రాంతాల్లో 11 కేవీ లైన్ దూరంగా ఉందని, బాపునగర్ వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరగా.. సానుకూలంగా స్పందించిన సీఎండీ.. ప్రతిపాదనలు పంపించాలని ఎస్ఈ, డీ ఈలను ఆదేశించారు. 35 ఏళ్ల క్రితం నిర్మించిన ఎడపల్లి సబ్ స్టేషన్ను మరో 20 ఏళ్లు పటిష్టంగా ఉండేలా అభివృద్ధి చేసిన సివిల్, ఆపరేషన్ విభాగాలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న ఇనుప స్తంభాలను తొలగించి వాటిస్థానంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ కనెక్షన్స్ విధానంలో లైన్ ట్రాన్స్ఫార్మర్స్ను శాఖా పరంగా ఎలాంటి రుసుము లేకుండా సమకూరుస్తున్నామని తెలిపారు. ప్రాణం అమూల్యమైందని, భద్రత నియమాలు పాటిస్తూ పని చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయనవెంట ఎస్ఈ పీవీ రాజేశ్వర్, డీఈ ఆపరేషన్ (బోధన్) ముక్తార్, కన్స్స్ట్రక్షన్ డీఈ వెంకటరమణ, తోట రాజశేఖర్, ఏడీఈ ఆపరేషన్ ఎడపల్లి సబ్ డివిజన్ ప్రభాకర్, ఏఈ కిశోర్ రెడ్డి, ఈఈ సివిల్ స్వామి, ఏఈ కన్స్స్ట్రక్షన్ సుమిత, ఎడపల్లి, రెంజల్ ,బోధన్ మండలాల సిబ్బంది పాల్గొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి చేయాలి బోధన్రూరల్ / నవీపేట : నిరంతర విద్యుత్ సరఫరా, వినియోగదారుల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన బోధన్ సబ్ స్టేషన్, డివిజన్ కార్యాలయం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం నవీపేట మండలంలోని హనుమాన్ ఫారం గ్రామ శివారులో జరుగుతున్న 33/11 కేవీ నూతన సబ్స్టేషన్ పనులను సీఎండీ వరుణ్రెడ్డి పరిశీలించారు. సబ్స్టేషన్ పనులు ప్రారంభించాలి డొంకేశ్వర్(ఆర్మూర్): తమ గ్రామానికి మంజూరైన సబ్స్టేషన్ పనులు త్వరగా ప్రారంభించాలని డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామస్తులు సీఎండీ వరుణ్రెడ్డిని కోరారు. శనివారం కలెక్టరేట్లో కలిసి ఆయనకు వినతిపత్రం అందజేశారు. నికాల్పూర్ గ్రామానికి లో వోల్టేజ్ సమస్య తీర్చేందుకు ప్రభుత్వం సబ్స్టేషన్ కోసం రూ.2.53 కోట్లు మంజూరు చేయగా, ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు టెండర్లు పూర్తి కాకపోవడంతో పనులు మొదలు కాలేదన్నారు. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎండీని కోరారు. సుమన్, సుభాష్, శ్రీధర్రెడ్డి, నవీన్, శ్రీధర్ ఉన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం ఇనుప స్తంభాల స్థానంలో సిమెంట్ స్తంభాలు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి -
ప్రగతి పరిశీలనకు పరీక్షలు
● 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు.. ● ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహణ ● మొబైల్ యాప్లో పరీక్ష ఖలీల్వాడి : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో వి ద్యా ప్రమాణాలు పెంచేందుకు, విద్యార్థుల్లో అభ్య సన సామర్థ్యాలను పరిశీలించేందుకు విద్యాశాఖ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్)ను అమలుచేస్తోంది. తరగతులకు తగినవిధంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెంచే లక్ష్యంతో గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూ డా ప్రభుత్వ బడుల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఏడాదిలో మూడుసార్లు విద్యార్థుల అభ్య సన సామర్థ్యాలపై అధ్యయనం చేస్తారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో మొదటిసారిగా బేస్లైన్ పరీక్ష, నవంబరులో రెండోసారి టెస్ట్, చివరిలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెలలో నిర్వహించనున్న బేస్లైన్ పరీక్షలో జిల్లా వ్యాప్తంగా సుమారు 36 వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. సామర్థ్యం గుర్తించేలా.. ప్రాథమిక స్థాయిలో ధారళంగా చదవడం, రాయడం, చదివింది అర్థం చేసుకోవడం పిల్లలకు తప్పనిసరి. వీటన్నింటినీ నిర్ణీత సమయంలో పూర్తిచేసే విద్యార్థికి సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తిస్తారు. ఈ విద్యా సంవత్సరంలో జూలై 1 నుంచి 29 వరకు పరీక్షలను పూర్తి చేయాలని మొదటగా బేస్లైన్ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ నెల 8, 9వ తేదీల్లో 2, 3, 4, 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. యాప్లోనే పరీక్ష... తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ ద్వారానే పూర్తిగా బేస్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల నమోదు, టీచర్ల సంఖ్య మేరకు పరీక్ష ఉంటుంది. తరగతిలోని టీచర్లు ఒక్కో విద్యార్థిని పిలిచి తెలుగు, ఇంగ్లిష్, గణితం సంబంధించిన ప్రశ్నలను అడిగి వారు ఇచ్చే సమాధానాలను ఫోన్లోని యాప్లో నమోదు చేస్తారు. విద్యార్థులు భాష, గణితంలో వెనుకబడి ఉంటే వారికి ప్రత్యేకంగా బోధన చేసి సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేయనున్నారు. పాఠశాలలు, విద్యార్థుల వివరాలు ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు బేస్లైన్ పరీక్షను నిర్వహిస్తోంది. పరీక్ష ద్వారా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. – బాలకృష్ణ, కోఆర్డినేటర్, నిజామాబాద్ -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
● భర్తను హత్య చేసిన భార్య ● ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం ● నిందితురాలు సహా సహకరించిన ఇద్దరు రిమాండ్ మోపాల్(నిజామాబాద్రూరల్): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది ఓ భార్య. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి నిందితులను అ దుపులోకి తీసుకున్నారు. సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్ (35) జూన్ 27న సౌదీ అరేబియా నుంచి న్యాల్కల్కు తిరిగొచ్చాడు. అప్పటికే భార్య సంధ్య నగరంలోని ఇంద్రాపూర్కు చెందిన మిరుగూరి అనిల్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భర్త రావడంతో సంధ్య, అనిల్కు మింగుడు పడలేదు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించారు. హ త్యకు పక్కా ప్రణాళిక రచించారు. కుట్రలో భాగంగా న్యాల్కల్కు చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి సహకారం కోరగా అంగీకరించాడు. 29న వెంకటసాయి, ప్రశాంత్ కలిసి ఇంట్లోనే మ ద్యం సేవించారు. ఫుల్గా మద్యం తాగిన తర్వాత సంధ్య సహకారంతో ప్రశాంత్ను డాబాపైకి తీసుకెళ్లి కిందికి తోసేశారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సంధ్య, వెంకటసాయి కలిసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి అనిల్ సైతం రాగా, అదేరాత్రి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చి అనిల్ ప్రోత్సాహంతో సంధ్య ముందుగా దాచిన మత్తు ఇంజెక్షన్లు, మత్తు మాత్రలతో తయారు చేసిన ఇంజెక్షన్, టాయిలెట్ క్లీనర్ను ప్రశాంత్కు కాన్యూలా ద్వారా ఎక్కించారు. ఆ తర్వాత మంచంపై నుంచి కిందకు తోసి హత్య చేశారు. తొలుత ప్రమాదంగా.. ప్రశాంత్ చనిపోయాడని నిర్ధారించుకున్న సంధ్య పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి ప్రమాదంగా కేసు నమోదు చేసే క్రమంలో కొడుకు మరణవార్త తెలుసుకున్న మృతుడి తల్లి.. కోడలు సంధ్యపై అనుమానం వ్యక్తంచేసింది. తల్లి శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొడుకు గల్ఫ్ నుంచి వచ్చిన విషయం, మృతి చెందిన విషయం కూడా తనకు తెలియలేదని ఫిర్యాదులో పేర్కొంది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న ఎస్సై జాడె సుస్మిత మృతుడి భార్య సంధ్య, వెంకటసాయి (బంటి)ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు, నిందితులు విచారణలో నేరాన్ని అంగీకరించారు. సంధ్య, వెంకటసాయి, అనిల్ను రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఎస్సై జాడె సుస్మిత పాల్గొన్నారు. -
నాలుగు కేటగిరీలు.. 318 రకాల పనులు
జిల్లాలో జాబ్ కార్డులు 2.51 లక్షలు సభ్యులు 4.58 లక్షలు యాక్టివ్ జాబ్ కార్డులు 1.56 లక్షలు యాక్టివ్ కూలీలు 2.31 లక్షలు డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్’ (వీబీ – జీ రామ్ జీ) చట్టం ఈనెల 1 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. అయితే, దీనిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూనే తప్పదనట్లుగా అమలుకు గెజిట్ను విడుదల చేసింది. దశాబ్దాలుగా సాగుతున్న మహా త్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం (ఈజీఎస్–2005) స్థానాన్ని ఈ కొత్త చట్టం భర్తీ చేయనుంది. ఇందులో పనులు, కూలీల పనిదినాలు మారాయి. మొన్నటి వరకు ఉపాధిహామీ కింద ఏడాదికి కేవలం 100 రోజులు మాత్రమే పని క ల్పించేవారు. కానీ, కొత్త చట్టం ప్రకారం ప్రతి గ్రా మీణ కుటుంబానికి ఏడాదికి కనీసం 125 రోజుల ఉపాధిని కల్పించనున్నారు. అదే విధంగా ఇప్పటికే ఈ – కేవైసీ పూర్తయిన పాత ఉపాధిహామీ జాబ్ కార్డుల స్థానంలో కొత్తగా డిజిటల్ భద్రతా ఫీచర్లతో కూడిన కార్డులను ఇవ్వనున్నారు. నిధుల విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాల ఖర్చుల వాటా 60:40 నిష్పత్తిలో ఉండనుంది. పని పూర్తి చేసిన పక్షం రోజుల్లోనే కూలీలకు వేతనాలు అందనున్నాయి. వీబీ – జీ రామ్ జీ చట్టంపై ఇప్పటికే జిల్లా నుంచి పలువురు ఎంపీడీవోలు హైదరాబాద్లో శిక్షణ పొంది వచ్చారు. నీటి భద్రత పనులు, జీవనోపాధి మౌలిక వసతులు ● భూగర్భ జలాలను పెంపొందించడానికి చెక్ డ్యామ్ల నిర్మాణం, కొత్త చెరువుల తవ్వకం, పాత చెరువుల్లో పూడికతీత, వర్షపు నీటిని నిల్వ చేసే ఇంకుడు గుంతల నిర్మాణాలు ఉంటాయి. అలాగే, వ్యవసాయానికి నీరందించే చిన్న కాలువల నిర్మాణాలు, నిర్వహణ. ● మహిళా సంఘ భవనాలు, ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీ భవనాలు, వర్క్షెడ్ల నిర్మాణం, రైతు లు పంట దిగుబడులను నిల్వ చేసుకునేందుకు గోదాములు, కోల్ట్ స్టోరేజీలను నిర్మించుకోవచ్చు. స్థానిక ఉత్పత్తుల అమ్మకాల కోసం సంతల వేదికలు (రూరల్ హాట్స్), జీవనోపాధిని పెంచుకోవడానికి పశువుల షెడ్లు, మత్స్య సంపదకు మౌలిక వసతులు అలాగే మొక్కల పెంపకం కేంద్రాలు, సేంద్రియ ఎరువుల యూనిట్లు కట్టుకోవచ్చు. ● పొలాలకు వెళ్లే దారులు, వీధుల్లో అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, మట్టి రోడ్లు నిర్మించుకోవచ్చు. అలాగే పంట ఉత్పత్తులను ఆరబోసేందుకు సీసీ కల్లాలు కట్టుకోవచ్చు. వరద నీరు ఊళ్లోకి రాకుండా డ్రైనేజీ కాల్వల నిర్మాణం, భూసార పరిరక్షణ పనులు చేసుకోవచ్చు. చాలా రకాల పనులున్నాయి ప్రభుత్వం రూపొందించిన వీబీ – జీ రామ్ జీ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. నాలుగు కేటగిరీల్లో మొత్తం 318 రకాల పనులున్నాయి. ఇకపై కొత్త చట్టం ప్రకారం గ్రామాల్లో పనులు, నిధుల చెల్లింపులు జరుగుతాయి. – సాయన్న, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ‘వీబీ–జీరామ్జీ’లో చేర్చిన కేంద్ర ప్రభుత్వం 125 రోజులకు పెరగనున్న కూలీల పనిదినాలు చట్టంపై ఇప్పటికే హైదరాబాద్లో శిక్షణ పొందిన ఎంపీడీవోలు -
పవర్ హౌజ్లో ఆకస్మిక తనిఖీలు
● ఉదయం 7గంటలకే ప్రత్యక్షమైన సీఎండీ వరుణ్రెడ్డి ● హడలెత్తిన అధికారులు, సిబ్బందిసుభాష్నగర్: జిల్లా కేంద్రంలోని పవర్హౌజ్ కంపౌండ్లో టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయం 7 గంటలకే సాధారణ వ్యక్తిలా వచ్చిన సీఎండీ.. ఏడీఈ స్టోర్స్, ఏఈ అవుట్డోర్, ఇండోర్తోపాటు స్టోర్ అంతా కలియతిరిగారు. సీఎండీ వచ్చిన విషయం తెలుసుకున్న ఎస్ఈ, డీఈలు, ఏడీఈలు, ఏఈలు హుటాహుటిన అ క్కడికి చేరుకున్నారు. ఆకస్మిక తనిఖీలతో ఉద్యో గులు, సిబ్బందిని సీఎండీ ఉరుకులు, పరుగులు పెట్టించారు. ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు, డీఈలు శ్రీనివాస్రావు, వెంకటరమణ, ఏడీఈ లు, ఏఈ లతో కలిసి పవర్హౌజ్ ఆవరణంతా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎస్ఈ కార్యాలయాన్ని సందర్శించి ఉద్యోగులు, సిబ్బందితో ఇంటరాక్ట్ అ య్యారు. ప్రతిఒక్కరిని ఆప్యాయతతో పలకరించి సమస్యలను తెలుసుకున్నారు. సంస్థ అభివృద్ధి కోసం పని చేయాలని సూచించారు. ఈసందర్భంగా ప్రమోషన్ల గురించి ఇంజినీర్లు, స్టాఫ్ సీఎండీ వరుణ్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వారి వెంట ఏడీఈలు తోట రాజశేఖర్, చంద్రశేఖర్, ప్రసాద్రెడ్డి, వినోద్, ఏఈలు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. -
వన్టైమ్ చాన్స్ డిగ్రీ పరీక్షలు ప్రారంభం
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ల బ్యాక్లాగ్ (2016, 2017, 2018, 2019, 2020 ) బ్యాచ్ల వన్టైమ్ చాన్స్ పరీక్షలు శనివారం ప్రారంభమైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షకు 47 మంది విద్యార్థులకు 43 మంది హాజరుకాగా నలుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాన్ని వర్సిటీ కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. బిచ్కుంద(జుక్కల్) : పట్టణంలోని సబ్రిజిస్టర్ కార్యాలయంలో శనివారం బిచ్కుందకు చెందిన ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యుల ఆస్తి పంపకాలు జరగలేదని, తమకు రావాల్సిన వాటా ఇవ్వకుండా చిన్నాన్న కొడుకు అమ్ముకుంటున్నాడని ఆరోపించాడు. రిజిస్ట్రేషన్ చేయవద్దని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు పెట్రోల్ బాటిల్ను లాక్కొని పోలీసులకు సమాచారం అందించారు. కార్యాలయానికి చేరుకున్న పొలీసులు ఇరువర్గాలను సముదాయించారు. ● అదుపులోకి తీసుకున్న పోలీసులు భిక్కనూరు: మద్యం మత్తులో యువకులు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను ఎత్తుకెళ్తూ జీపీ ప్రహరీ, బోరు మోటార్లను ధ్వంసం చేసిన ఘ టన మండలంలోని పెద్దమల్లారెడ్డిలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉ న్నాయి. గ్రామానికి చెందిన నలుగురు యువకులు శుక్రవారం రాత్రి మద్యం సేవించి అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామ పంచాయతీ వద్ద ఉన్న ట్రాక్టర్ను స్టార్ట్ చేసి మత్తులోనే నడు పుతూ ప్రహరీని, తాగునీటి బోరుమోటార్లను ధ్వంసం చేశారు. అనంతరం గ్రామంలోని ఎ స్సీ కాలనీలో ట్రాక్టర్ను నిలిపేసి ఇళ్లకు వెళ్లిపోయారు. శనివారం ఉదయం విషయం తెలుసుకున్న సర్పంచ్ సాయాగౌడ్ ఓ యువకుడిని తీసుకొచ్చి ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాన్సువాడ : పట్టణంలోని పాత బాన్సువాడ బ్రిడ్జి వద్ద శనివారం సాయంత్రం విద్యుత్ షాక్ తగిలి రెండు గేదెలు మృతి చెందాయి. పాత బాన్సువాడలోని కుర్మ సాయిగొండకు చెందిన రెండు గేదెలు మేతకు వెళ్లి ఇంటికి వస్తుండగా ఇనుప స్తంభానికి తలగడంతో షాక్ తగిలి మృతి చెందాయి. దీంతో సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు సాయిగొండ తెలిపారు. విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేశారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన సింగరాయపల్లి రమేశ్ అనే వ్యక్తి లక్కీ డ్రా ద్వారా భూమిని విక్రయిస్తున్నట్లు చేస్తున్న ప్రచారంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ శనివారం తెలిపారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.999 చొప్పున వసూలు చేసి రశీదులు సైతం ఇస్తున్నాడనే సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నామన్నారు. లక్కీ డ్రాకు అనుమతులు లేవని పేర్కొన్నారు. -
సర్పంచుల జీతాలకు అడ్డుగా ‘జీరో’
● సాంకేతిక కారణాలతో 52 మందికి అందని వేతనాలు ● తొలి వేతనాన్ని అందుకోలేక పోయిన ప్రథమ పౌరులుడొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో సర్పంచుల వేతనాల పంపిణీకి సాంకేతిక కారణాలు అడ్డుగా మారాయి. జీరోతో మొదలయ్యే బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ నంబర్ల కారణంగా 52 మందికి వేతనాలు నిలిచిపోయాయి. సర్పంచులుగా గెలిచిన తర్వాత మంజూరైన తొలి వేతనాన్ని అందరితోపాటు తాము అందుకోలేకపోయామనే బాధలో ఉన్నారు. జిల్లాలో 545 మంది సర్పంచులు ఉండగా, వీరికి రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో 5 నెలల 10రోజుల కాలానికి సంబంధించిన వేతనాలను విడుదల చేసింది. ట్రెజరీ ద్వారా జీతాలు జమ చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారులు సర్పంచుల బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించారు. 545 మందికిగాను 493 మంది బ్యాంకు ఖాతాల్లో పక్షం రోజుల క్రితం వేతనాలు జమయ్యాయి. మిగిలిన 52 మందికి సంబంధించిన యూనియన్ బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎఫ్సీ కోడ్ భిన్నంగా ఉండడంతో వేతనాలకు బ్రేక్ పడింది. ట్రెజరీ సాఫ్ట్వేర్ విధానంలో జీరోతో మొదలయ్యే ఖాతా నంబర్లు ప్రాసెస్ కాకపోవడమే ఇందుకు కారణం. సహచర సర్పంచులందరికీ వేతనా లు జమ కాగా, తమకు మాత్రమే మొండి చేయి ఎదురుకావడంతో బాధిత సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా కార్యాలయంలో సంబంధిత అధికారిని ‘సాక్షి’ వివరణ కోరగా, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కరించి సర్పంచుల ఖాతాల్లో వేతనాలు జమయ్యేలా చూస్తామని అన్నారు. -
గిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
● రాష్ట్ర మంత్రి సీతక్క ● ఇందల్వాయిలో అభివృద్ధి పనుల ప్రారంభంఇందల్వాయి: గిరిజనులతోపాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు. ఇందల్వాయి మండలంలో ఆమె శనివారం పర్యటించారు. వెంగల్పాడ్ నుంచి డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామం వరకు రూ.5.48 కోట్ల తో చేపడుతున్న బీటీ రోడ్డు పనులు, కేకే తండా నుంచి మెఘ్యనాయక్ తండా వరకు రూ.2.94 కోట్ల తో రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. తిర్మన్పల్లి గ్రామంలో గిరిజన బాలికల సంక్షేమ క ళాశాలలో అదనపు వసతిగృహ సముదాయాన్ని మంత్రి ప్రారంభించి కళాశాల ఆవరణలో మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, కల్లుగీత కార్మికుల సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మ న్ తాహెర్బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, డీపీవో శ్రీనివాస్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, తిర్మన్పల్లి సర్పంచ్ చింతల కిషన్ పాల్గొన్నారు. -
చోరీ కేసులలో నిందితుల అరెస్ట్
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో జరిగిన రెండు వేర్వేరు చోరీ కేసులను కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుల వివరాలను డీఎస్పీ మధుసూదన్ శనివారం వెల్లడించారు. పెళ్లి వేడుకలో ఆటో డ్రైవర్ చేతివాటం.. పెద్దపల్లికి చెందిన విద్యార్థిని వోలెల్ల నందిని గత నెల 29న కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కన ఉన్న వైశ్య భవన్కు ఓ శుభకార్యం కోసం వచ్చారు. గది లో ఉంచిన ఆమె బ్యాగు నుంచి గుర్తుతెలియని వ్య క్తి 12 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు జిల్లా కేంద్రంలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మొహమ్మద్ అప్సర్ అలీగా గుర్తించి అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆర్థిక ఇబ్బందుల వల్లే దొంగతనానికి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకోగా, అతని నుంచి నగలను రికవరీ చేశారు. అత్త ఇంట్లో అల్లుడు చోరీ.. జిల్లా కేంద్రంలోని గంజ్ రోడ్కు కొత్తూరి పద్మ ఇంట్లో గత నెల 28న బీరువా తాళాలు తీసి, 3 తులాల బంగారు ఆభరణాలు ఓ వ్యక్తి అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు హరిజనవాడకు చెందిన చింతకింద బాలమురళీకృష్ణను అరెస్ట్ చేశారు. వరుసకు అత్త అయ్యే పద్మ ఇంటి తాళాలు గతంలో తన వద్ద ఉండటం, నగల ఉంచే స్థలం తెలియడంతోనే ఈ చోరీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. దొంగిలించిన నగలను ఐఐఎఫ్ఎల్, కాప్రి గోల్డ్ లోన్స్లో తాకట్టు పెట్టగా, వాటితోపాటు తన టిఫిన్ సెంటర్లో దాచిన మూడు పుస్తెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి తదితరులున్నారు. వైశ్యభవన్ వద్ద దొంగతనంలో ఆటో డ్రైవర్.. గంజ్ రోడ్లో అత్త ఇంటిని దోచిన అల్లుడు అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ మధుసూదన్ -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
నిజామాబాద్ అర్బన్: నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ వెంకటేష్ శుక్రవారం తెలిపారు. నగరంలోని పూలాంగ్ సమీపంలో, బోధన్ బస్టాండ్లో గంజాయి విక్రయిస్తున్న షేక్ సమీర్, మహమ్మద్ రిజ్వాన్ను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల ఎండు గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కరెంట్ షాక్తో మేక మృతి రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్లో కరెంట్ షాక్ తగిలి మేక మృతిచెందింది. సాటాపూర్ గ్రామానికి చెందిన పెద్దసాయి భాగ్యలక్ష్మీ మేకల పెంపకం చేపడుతున్నారు. సాటాపూర్లోని పెట్రోల్ బంకు వద్ద ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తీగలకు మేక తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న స్థానిక పశువైద్యాధికారి విఠల్ మృతిచెందిన మేకను పరిశీలించారు. మేక విలువ సుమారు రూ. 13 వేల వరకు ఉంటుందన్నారు. అధికారులు న్యాయం చేయాలని కోరారు. -
భూభారతి రీ సర్వేకు సహకరించాలి
● సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ శ్రీనివాసులు నందిపేట్ (ఆర్మూర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూముల రీసర్వే ప్రక్రియకు ప్రజలు సహకరించాలని జిల్లా సర్వే అండ్ ల్యాండ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు కోరారు. నందిపేట మండలం మల్లారం గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం భూభారతి రీసర్వే పైలట్ గ్రామంగా మల్లారంను ఎంపిక చేసిందని, 15 రోజుల తర్వాత ఫీల్డ్ సర్వే ప్రారంభిస్తామన్నారు. ఇళ్లు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూముల వివరాలను నిర్ణయిచారని తెలిపారు. అనంతరం సర్వే నంబరు ప్రకారం సర్వే చేస్తారని పేర్కొన్నారు. రైతులు మోకాపై ఉన్న భూములను చూయించి, సర్వే సిబ్బందికి పట్టాపాసు బుక్కు జిరాక్స్ పత్రాలు అందజేయాల్సి ఉంటుందన్నారు. సర్వే అనంతరం జా బితాను గ్రామ పంచాయతీ, తహసీల్ కార్యాలయా ల్లో ప్రచురిస్తార ని వివరించారు. అభ్యంతరాలుంటే 60 రోజుల్లోపు అప్పీలు చేసుకునే అవకాశం కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మలైకా తబుస్సుం, తహసీల్దార్ సంతోష్ రెడ్డి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జగన్నాథం, సర్వేయర్లు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
మోపాల్: మండలంలోని సిర్పూర్ గ్రామంలో ఓ వృద్ధురాలు చెరువులో పడి మృతిచెందినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ఈర్ల నర్సవ్వ (76) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదు. ఈక్రమంలో ఈనెల 2న ఇంట్లో నుంచి ఆమె బయటికి వెళ్లి, తిరిగి రాలేదు. 3న ఉదయం మోపాల్ చెరువులో మృతదేహం కన్పించింది. స్థానికుల సమాచారం మేరకు చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు పంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమార్తె గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సుస్మిత తెలిపారు. నిచ్చెన నుంచి జారిపడి ఒకరు.. నవీపేట: మండల కేంద్రంలోని ధర్యాపూర్ కాలనీలో ఓ వ్యక్తి నిచ్చెన ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. రెంజల్ మండలంలోని నీలా గ్రామానికి చెందిన కూలి షేక్ అహ్మద్ పాషా(40) శుక్రవారం ధర్యాపూర్ కాలనీలోని ఓ పెంకుటిళ్లు పైకప్పును సరి చేసేందుకు వెళ్లాడు. నిచ్చెన సహాయంతో పైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. తల వెనుక భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి.. నవీపేట: మండలంలోని ఫకీరాబాద్– యంచ గ్రామాల మధ్య గుర్తుతెలియని రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి(50) జారిపడి మృతిచెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ శుక్రవారం తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ ఒకరు.. నవీపేట: మద్యంతోపాటు పురుగుల మందు తాగిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని అభంగపట్నం గ్రామానికి చెందిన మంత గంగాధర్(36) అబ్బాపూర్(ఎం) శివారులోని ఎఫ్సీఐ గోదాములో వాచ్మెన్గా పని చేసేవాడు. కొంతకాలంగా అతడు మద్యానికి బానిసయ్యాడు. గురువారం అభంగపట్నం గ్రామ శివారులో మద్యంతోపాటు పురుగుల మందుతాగాడు. నొప్పి భరించలేక కేకలు వేయడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నాణ్యమైన ఆహార పదార్థాలను విక్రయించాలి
కమ్మర్పల్లి(భీమ్గల్): వినియోగదారులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహార పదార్థాలను విక్రయించాలని భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ దుకాణాదారులకు సూచించారు. భీమ్గల్ పట్టణంలోని పలు తినుబండారాల దుకాణాలను శుక్రవారం ఆయన సందర్శించి, వర్షాకాలంలో ఆహార పదార్థాల పరిశుభ్రతపై యజమానులకు అవగాహన కల్పించారు. హోటల్, స్వీట్హోమ్, ఫాస్ట్ఫుడ్ సెంటర్, బేకరీ, ఇతర తినుబండారాల దుకాణాదారులు విక్రయించే తినుబండారాలపై ఈగలు, దోమలు, ఇతర క్రిమీకీటకాలు వాలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దుకాణాల నుంచి వెలువడే చెత్తను, చికెన్, మటన్ సెంటర్ల నుంచి వెలువడే వ్యర్థాలను రోడ్ల పక్కన పడవేయకుండ, మున్సిపల్ చెత్త వాహనాలకు అందించాలన్నారు. లేదంటే దుకాణాదారులకు జరిమానా విధించడంతోపాటు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాగ్రత్తలను తెలియజేస్తూ పలు దుకాణాదారులకు నోటీస్లను అందజేశారు. వార్డు ఆఫీసర్లు రాజేశ్వర్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. ● రైళ్ల రాకపోకలకు అంతరాయం నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని గంజి ప్రాంతంలో శుక్రవారం ఓ లారీ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గోడకు ఉన్న గేటు పడిపోగా, దానికున్న ఇనుప గేటు రాడు సమీపంలోని రైల్వే విద్యుత్ వైర్లను బలంగా తాకింది. దీంతో విద్యుత్ వైర్లు తెగిపోయి, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు కొన్ని గంటల పాటు విద్యుత్ వైర్లను పునరుద్ధరించగా, రైళ్ల రాకపోకలు జరిగాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కామారెడ్డి టౌన్/కామారెడ్డి అర్బన్: మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో మృతిచెందిన తండ్రికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన వడ్ల బాలయ్య శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు కాగా, కొడుకులు లేరు. తండ్రి ఇక లేరన్న వార్త ఒకవైపు గుండెను పిండేస్తుంటే.. కొడుకు లేడనే కారణంతో తండ్రి కడసారి సంస్కారాలకు ఎలాంటి లోటు రాకూడదని ఆ చిన్న కూతురు జ్యోతి గుండె నిబ్బరం చేసుకుంది. సమాజంలోని పాత ఆచారాలను పక్కనబెట్టి, తానే కొడుకై ముందు నిలిచింది. తలకొరివి పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేసింది. కూతురే కొడుకై తండ్రి రుణం తీర్చుకున్న ఈ దృశ్యం అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది. -
వర్షాలకు చెరువులను తలపిస్తున్న రోడ్లు
ఆర్మూర్ పట్టణంలో.. నగరంలోని రహదారులు వర్షాపునీరు నిండి చెరువులను తలపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి నగరంలోని పలు రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. దీంతో మురికినీరు కూడా బయటకు వచ్చి రోడ్లపై నిలిచాయి. వాహనదారులు, పాదచారులు వర్షపు నీటిలోనే నడుచుకుంటు ఇబ్బందులు పడుతూ ప్రయాణాలు సాగించారు. చిన్నపాటి వర్షానికే ప్రధాన రోడ్లపై వర్షపునీరు అగితే భారీ వర్షాలకు రోడ్లు జలమయంగా మారుతాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ వర్షపు నీటిలో నడుచుకుంటూ వస్తున్న మహిళలు ఆర్మూర్టౌన్: పట్టణంలోని హుస్నాబాద్ కాలనీలో రహదారి పూర్తిగా అధ్వాన్న స్థితికి చేరింది. వర్షం పడితే చాలు రోడ్డంతా నీరు నిలిచిపోతూ, బురదమయంగా మారుతోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే అంబేడ్కర్ చౌరస్తా వద్ద వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. -
బాలికలు క్రీడల్లో రాణించాలి
● సీపీ సాయిచైతన్య ● నగరంలో సబ్ జూనియర్ గర్ల్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభంనిజామాబాద్ అర్బన్ : బాలికలు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నా రు. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో తెలంగాణ సబ్ జూనియర్ గర్ల్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ చాంపియన్షిప్ పోటీలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ క్రీడలు ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి మంచి పేరు తీసుకురావాలన్నారు. గెలుపొటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ఆడాలన్నారు. క్రమశిక్షణ తో వ్యవహరించడం ద్వారా ఉన్నత శిఖరాలను అధి రోహించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు. పోటీలలో నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, మె దక్, నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూ బ్నగర్, వనపర్తి, వరంగల్ తదితర జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, జిల్లా క్రీడల శాఖ అధికారి పవన్కుమార్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
క్షణికావేశం.. శాశ్వత నష్టం
● కామారెడ్డి జిల్లాలో పెరుగుతున్న బలవన్మరణాలు ● చిన్నచిన్న కారణాలతోనే తమ జీవితాలను ముగించుకుంటున్న జనం రామారెడ్డి(ఎల్లారెడ్డి): నిమిషం ఆవేశం.. క్షణికావేశం.. చిన్నపాటి మనస్పర్థలు.. వెరసి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. జీవితం విలువ తెలిసిన వారు సైతం అతి చిన్న కారణాలతో మృత్యువు ఒడిలోకి చేరుతుండటం జిల్లాలో ఆందోళనకరంగా మారింది. జీవితం అనేది ఎన్నో ఆశల సమాహారం. సమస్యలు రావడం సహజం, కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే నిజమైన జీవన పోరాటం. సమస్య ఏదైనా, పరిష్కారం కోసం ఆలోచించకుండా ఆత్మహత్యే మార్గంగా ఎంచుకోవడం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.. ఆరు నెలల్లోనే 213 మంది.. జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్యల పరంపర అగడం లేదు. జనవరి 2026 నుంచి జూలై 2 వరకు సుమారు 213 మంది వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడారు. ప్రధానంగా రామారెడ్డి పోలీస్స్టేషన్ పరిధిలో గత ఏడాది (2025) సుమారుగా 18 మంది చిన్నచిన్న కారణాలతోనే తమ జీవితాలను ముగించుకున్నారు. ప్రస్తుత ఏడాది ఇప్పటివరకు సుమారు 10 మంది ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం. ఈ ఏడాది ప్రాణాలు తీసుకుంటున్న వారిలో వృద్ధులు ఎక్కువగా ఉండటం సమాజంలో నెలకొన్న అభద్రతా భావాన్ని, ఒంటరితనాన్ని ప్రతిబింబిస్తోంది. 18 ఏళ్ల నిండిన యువత నుంచి పండు ముసలి వరకు అందరూ ఈ విషవలయంలో చిక్కుకోవడం విచారకరం. అవగాహన సదస్సులు అవసరం.. సమాజంలో ‘ఆత్మహత్యల మహమ్మారి’ని అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నా, అటు పోలీసు యంత్రాంగం గానీ, ఇటు స్వచ్ఛంద సంస్థలు గానీ ఇప్పటివరకు ఎటువంటి అవగాహన సదస్సులు నిర్వహించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా పోలీస్ యంత్రాంగం గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. అలాగే యువత, వృద్ధులకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చేందుకు నిపుణులతో కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలంటున్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో గతంలో పక్కింటి వారితో వాకిలి శుభ్రం చేసే విషయంలో జరిగిన చిన్నపాటి గొడవను మనసులో పెట్టుకుని ఓ మహిళ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. మండలంలోని మరో గ్రామంలో ఆటో రిపేరు కోసం తల్లి డబ్బులు ఇవ్వలేదన్న చిన్నపాటి అసహనంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ వెలుగుచూస్తున్నాయి. తొందరపాటుతో తప్పుడు నిర్ణ యాలు తీసుకోవద్దు. సమా జం తనను దూరం చేసిందనే భావనలో ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. అలాంటి వారి లో మార్పులు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించాలి. –రమణ, జిల్లా మానసిక వైద్యాధికారి పోలీస్ కళాబృందాల ద్వారా గ్రామాలలో ఆత్మహత్యలపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నాం. రామారెడ్డి మండలంలో మరింత ఎక్కువగా ఆత్మహత్యలపై అవగాహన సదస్సులను నిర్వహిస్తాం. –శ్రీధర్గౌడ్, రూరల్ సీఐ, కామారెడ్డి -
కల్లులో మద్యం కలుపుకొని తాగి ఒకరి మృతి?
మరొకరి పరిస్థితి విషమం.. బోధన్ టౌన్(బోధన్): పట్టణ శివారులో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా, ఘ టన స్థలంలో కల్లు, మద్యం బాటిళ్లు ఉండటంతో రెండు క లుపుకొని తాగి మృతిచెందిన ట్లు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన నీరడి విఠల్(45), అదే గ్రామానికి చెందిన జుడలి లక్ష్మయ్య ఇద్దరు వ్యవసాయ కూలీ పని చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కలిసి శుక్రవారం మధ్యాహ్నం నర్సాపూర్ గేట్, నిజామాబాద్ మెయిన్ రోడ్డు పక్కన గల కల్లు దుకాణంలో కల్లు తీసుకొని సమీపంలోని చెట్ల చాటున కూర్చొని తాగారు. కొద్దిసేపటికి విఠల్, లక్ష్మయ్య అపాస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గమనించి వారిని పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి విఠల్ మృతి చెందాడని, లక్ష్మయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్లోని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అక్కడ కల్లు సీసాలతో పాటు మద్యం బాటిళ్లు ఉన్నాయి. దీంతో కిక్కు కోసం వారు కల్లులో మద్యం కలుపుకొని తాగారా, లేక ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుమారుడు విలాస్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. -
ఏఐపై అవగాహన.. బోధన
● ప్రభుత్వ బడుల్లో వారంలో రెండు రోజులు క్లాసులు ● డిగ్రీ విద్యార్థులతో టీచింగ్ ఖలీల్వాడి: ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను పరిచయం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘అన్న–అక్క మెంటార్షిప్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. ఏఐ సాయంతో విద్యను విద్యార్థులకు సులభంగా అందుబాటులోకి తెచ్చారు. లెక్చరర్లు, డిగ్రీ విద్యార్థులకు శిక్షణ.. జిల్లాలోని డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులతో పాటు లెక్చరర్లకు ఇటీవల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వారితో స్థానికంగా ఉన్న ప్రభుత్వ బడుల్లోని 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్ టీచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఏఐ బోధనలో విద్యార్థులకు స్నేహంగా ఉంటూనే మార్గనిర్ధేశకం చేసేందుకు డిజిటల్ పాత్రలను రూపొందించారు. పాఠాలను చదవడమే కాకుండా యానిమేషన్లు, ఫోటోలు(చిత్రాలు), కథలు, వీడియోల ద్వారా విద్యార్థులకు సులభంగా బోధిస్తున్నారు. బోధకులకు క్రెడిట్ పాయింట్లు.. డిగ్రీ విద్యార్థులు సుమారు 30 గంటల తరగతులు బోధించాల్సి ఉంటుంది. నెల నుంచి రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకు గాను డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్ పాయింట్లు కేటాయించనున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు.. విద్యార్థులకు కంప్యూటర్పై అవగాహనతోపాటు సాంకేతిక నైపుణ్యాలు పెరిగేందుకు ఏఐ ఉపయోగ పడుతుంది. విద్యార్థులకు సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, డిజిటల్ అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన వంటి నైపుణ్యాలు పెరుగుతాయి. పాఠ్యంశాలు, విద్యార్థుల ప్రగతిని, అదనపు అభ్యాసనకు ఏఐ సహాయపడుతోంది. పాఠశాలల్లో ఇంటర్నెట్, డిజిటల్ పరికరాలు, విద్యుత్ సదుపాయాలు కల్పిస్తే కార్యక్రమంతో విద్యారంగం అద్బుతంగా రాణిస్తుంది. ‘అన్న–అక్క మెంటర్షిప్’ కార్యక్రమం కింద జూలై 1 నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు దగ్గరలో ఉండే స్కూళ్లకు వెళ్లి ఏఐ ద్వారా పాఠాలను బోధిస్తారు. ఏఐపై అవగాహన కల్పిస్తారు. దీంతోపాటు డిజిటల్ లిట్రసీ, కంప్యూటర్పై అవగాహన, కోడింగ్తోపాటు వివిధ అంశాలను బోధిస్తారు. –బాలకృష్ణ, కోఆర్డినేటర్, నిజామాబాద్ -
ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో ఆయిల్ పామ్ సా గు విస్తీర్ణం పెంపొందేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ సీజన్లో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ ల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీ నిర్వాహకులైన ప్రీ–యునిక్ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ స మీక్ష నిర్వహించారు. నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పా టుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటను సేకరించే సెంటర్లను రైతులకు అనువైన ప్రాంతాలలో అందుబాటులో ఉంచాలని ప్రీ–యునిక్ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, ప్రధానంగా మాక్లూర్, డొంకేశ్వర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, సిరికొండ మండలాలపై దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఒక్కో మండలంలో కనీసం 100 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా చూడాలన్నారు. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వ రాయితీలు, మద్దతు ధర, ఏటేటా సమకూరే రాబడి, అంతర పంటల సాగు తదితర అంశాలను వివరించాలన్నారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ సురేశ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి, ప్రీ–యునిక్ కంపెనీ ఏరియా మేనేజర్ సాయికిరణ్ పాల్గొన్నారు. -
వందశాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలి
నిజామాబాద్ అర్బన్ : చదువు నేర్చుకోలేని, చదు వు మధ్యలో మానేసిన వయోజనులను గుర్తించి, వారికి చదువు ప్రాముఖ్యతను వివరించి అక్షరాస్యులుగా మార్చాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నా రు. జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘ఉల్లా స్ – అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బందికి ఉల్లాస్ యాప్పై శుక్రవారం ఓరియంటేషన్ తరగతులు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిజామాబాద్ను 100 శాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. ఇప్పటికే గుర్తించిన 6,776 మంది నిరక్షరాస్యులు, 497 వాలంటీర్ టీచర్లను ఉల్లాస్ యాప్లో నమోదు చేసి, లిటరసీ లెర్నింగ్ సెంటర్ల ద్వారా వారికి బోధన అందించి రానున్న ఎఫ్ఎల్ఎన్ఏటీ/ఎన్ఐవోఎస్ పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ పురుషోత్తం, ఎంఈపీఎంఏ డీఎంసీ మాధురి, అకౌంట్స్ ఆఫీసర్ విజయ, ఏపీవోటీ అరుంధతి, జిల్లా ఇన్చార్జి, రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్లు ఎం.సుమన్, ఎ. సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మూడో విడతలో 16,759 మంది రైతులకు ‘భరోసా’
● ఐదెకరాల వరకు డబ్బులు జమ చేసిన ప్రభుత్వం డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో మూడో విడతగా మరో 16,759 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం (రైతు భరోసా) అందింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ.44.3 కోట్లు బ్యాంకు ఖాతాల్లో శుక్రవా రం జమ అయినట్లు వ్యవసాయ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 2,62,709 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.262.45 కోట్లు విడుదల చే సింది. గురువారం వరకు 4 ఎకరాల వరకు రైతులకు పెట్టుబడి సాయం అందగా, శుక్రవారం ఐదెకరాల వరకు విడుదల చేసింది. స్కానింగ్ సెంటర్ యజమానికి టోకరా ● రూ.70 లక్షలు కాజేసిన ఉద్యోగులు నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడీలోగల ఓ స్కానింగ్ సెంటర్ యజమానికి అందులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు రూ.70 లక్షలకు టోకరా వేశారు. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాక్లూర్ మండలంలోని మాణిక్బండార్కు చెందిన సత్యనారాయణతోపాటు మీనా అనే మహిళ నగరంలోని ఓ స్కానింగ్ సెంటర్లో పనిచేస్తున్నా రు. వీరు కొన్నేళ్లుగా నకిలీ నగదు రసీదులు సృష్టించి యాజమాన్యాన్ని మోసం చేస్తున్నారు. రోగులకు అసలు రసీదులు ఇస్తు న్నా.. దాని రికార్డు కాపీలో మాత్రం పరీక్షల వివరాలు, రుసుమును తక్కువగా చూపిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. దీనిని గుర్తించిన స్కానింగ్ సెంటర్ యాజమాన్యం ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరేళ్లలో సుమారు రూ. 70 లక్షలకుపైగా న గదు కాజేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ డబ్బులతో సత్యనారాయణ అతడి భార్య పేరుతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకుని నిందితుడు సత్యనారాయణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్హెచ్వో తెలిపారు. ఈ కేసులో మీనాతోపాటు మరో మహిళ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. పోలీసుల ప్రతిష్ఠ పెంచాలి కమ్మర్పల్లి(బాల్కొండ): పోలీసుల ప్రతిష్ఠ పెంచేలా విధులు నిర్వర్తించాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య సిబ్బందికి సూ చించారు. మెండోరా పోలీస్ స్టేషన్ను ఆయ న శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలిస్తూ విచారణలో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల ఛేదనకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రతి కేసులో నాణ్యమైన విచారణ చేయాలని ఎస్సై సుహాసినికి సూ చించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకం కావాలని, గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని పేర్కొన్నారు. సీపీ వెంట ఆర్మూర్ రూరల్ సీఐ జాన్రెడ్డి ఉన్నారు. -
ఏకమై.. చెరవిడిపించారు
మోపాల్(నిజామాబాద్రూరల్): సాగు భూమికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ, ఇరిగేషన్, తదితర విభాగాల పడావు భూమిని క్రమంగా సాగులోకి తీసుకు రావడం పరిపాటే. ఎవరికీ అభ్యంతరం లేనన్నాళ్లు పండించుకుంటారు. అధికారులు స్వాధీనం చేసు కుంటామనే సమయంలో రైతులు గగ్గోలు పెట్టడం, వివాదాలు సృష్టించడం, పోలీస్ బందోబస్తు, ఘర్షణలు.. తోపులాటలు.. అడ్డగింతలు.. కేసులు.. అరెస్టులు.. ఇలా అనేక సంఘటనలు చోటుచేసుకుంటాయి. కానీ మోపాల్ మండలం కులాస్పూర్లో గ్రామస్తులు ఇందుకు భిన్నంగా సాగు చేస్తున్న చెరువు భూమిని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అప్పగిస్తున్నారు. వివాదాలు, ఘర్షణలకు తావులేకుండా ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామస్తులంతా ఏకమై.. గ్రామంలో ఊర చెరువు, కుందెనపల్లి చెరువు, కొచ్చెరువు ఉన్నాయి. చెరువును ఆనుకొని ఉన్న రైతులు కొన్నేళ్లుగా చెరువు భూమిని సాగుచేసుకుంటున్నారు. కొంతకాలంగా గ్రామంలోని చెరువు భూముల సాగుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గ్రామాభివృద్ధి, సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చారు. చెరువు భూ మి, గ్రామంలో భూగర్భజలాలు పరిరక్షణే ముఖ్యమనుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్డీవో రాజేంద్రకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వారి సహకారంతో సాగు చేస్తున్న రైతులను పిలిపించి ఒప్పించారు. రైతులు సైతం గ్రామ పంచాయతీ, వీడీసీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి భూమి అప్పగించేందుకు ముందుకొచ్చారు. సరిహద్దుల్లో కందకాలుగ్రామస్తులంతా ఏకతాటిపైకి రావడం, అధికారులు పచ్చజెండా ఊపడంతో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేపట్టారు. మూడు చెరువుల్లో కలిపి సుమారు 70 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకునే పనిలో గ్రామాభివృద్ధి కమిటీ, అధికార యంత్రాంగం నిమగ్నమైంది. సర్వే ప్రకారం చెరువు సరిహద్దులో కందకం తీస్తున్నారు. ఈ నిర్ణయంతో సర్పంచ్ గుడి జనార్దన్ రెడ్డి, ఉపసర్పంచ్ కోర్వ మహిపాల్, గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు రాజారెడ్డి, కోర్వ సాయిలు, గ్రామపెద్దలు చెన్నూరు గంగారెడ్డి, దిలావర్ హుస్సేన్, ఆకుతోట సాయన్న, బూస మహిపాల్, గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేశారు. శుభపరిణామం గ్రామాభివృద్ధి కమిటీ, సర్పంచ్ ఆధ్వర్యంలో చెరువు భూమిని స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయించడం హర్షిస్తున్నాం. గ్రా మంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. చెరువుల్లో నీరు నిల్వ ఉండటం లేదు. నీటి కొరత ఏర్పడుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గ్రామమంతా ఏకమై తీసుకున్న నిర్ణయానికి రైతులుసైతం మద్దతు పలి కారు. ఇది శుభపరిణామం. – బూస మహిపాల్, రైతుగ్రామస్తుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నా చెరువు భూమిలో కొన్నేళ్లుగా సాగు చేసుకున్నా ను. గ్రామస్తులంతా కలిసి ఆ భూమిలో సాగు చేయొద్దని, చెరువులో కలపా లని నిర్ణయించారు. వారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. స్వచ్ఛందంగా చెరువు భూమిని అప్పగిస్తున్నాను. ఎలాంటి అభ్యంతరం లేదు. – గూండ్ల మేకల పెద్ద సాయిలు, రైతు 70 ఎకరాలకుపైగా భూమి రైతుల నుంచి స్వాధీనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన అన్నదాతలు మూడు చెరువుల్లో ఇరిగేషన్, రెవెన్యూ జాయింట్ సర్వే ఆదర్శంగా నిలిచిన కులాస్పూర్ గ్రామం -
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
● ప్రతి బస్సును తనిఖీ చేసిన తర్వాతే వినియోగించాలి ● ఆర్టీసీ జోనల్ ఈడీ సోలమన్ ● నిజామాబాద్–2 డిపో, బస్టాండ్ల తనిఖీనిజామాబాద్ రూరల్ : ప్రయాణికుల భద్రతకు ఆర్టీ సీ అత్యంత ప్రాధాన్యమిస్తోందని జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ పేర్కొన్నారు. నిజామాబాద్ బస్టాండ్, డిపో–2ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిపో పరిధిలోని ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఆపరేషన్, ఛార్జింగ్ వ్యవస్థ భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షించారు. రీజియన్లోని బోధన్, ఆర్మూర్, కా మారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్–1, 2 డిపోల పరిధిలో 89 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా, ప్రస్తుతం 35 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని అధికారులు వివరించా రు. సాంకేతిక సమస్యలతో ఇటీవల కరీంనగర్ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి బస్సును పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన అనంతరమే ప్రయాణికుల సేవలకు వినియోగించాలని, బ్యాటరీ, వైరింగ్, ఛార్జింగ్ వ్యవస్థ, ఉష్ణోగ్రత నియంత్రణ తదితర అంశాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం నిజామాబాద్ బస్ స్టేషన్లో ప్రయాణికులకు అందుతున్న సౌక ర్యాలు, బస్సుల రాకపోకలు, సమాచార బోర్డులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈడీ వెంట నిజామాబాద్ డిప్యూటీ ఆర్ఎం జ్యోతి, డిపో మేనేజర్లు, అధికారులు ఉన్నారు. -
మంత్రివర్యా.. సమీక్షించరూ!
నిజామాబాద్ అర్బన్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులతో సమీక్షించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లోని రైతులు యూరియా యాప్తో పడుతున్న ఇబ్బందులపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన విత్తనా లను అందుబాటులో ఉంచడం, పంటల సాగు పై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించాలి. వర్షా లు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణపై సమీక్షించాలి. ప్రధానంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి సూపరింటెండెంట్ అందు బాటులో లేరు. ఇన్చార్జి సూపరింటెండెంట్ నాగమోహన్ ఇటీవల హైదరాబాద్కు బదిలీ కా గా, ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితోపాటు ప్రా థమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, టీచర్ల కొరత, విద్యా బోధనను మెరుగుపర్చేందుకు అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే ఇందల్వాయి : రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శుక్రవారం ఇందల్వాయి మండలం తిర్మన్పల్లిలో పర్యటించారు. రూ.5 కోట్లతో నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారుల ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల కిషన్ ఉన్నారు. నేడు జిల్లాకు ఇన్చార్జి మంత్రి సీతక్క రాక ఇందల్వాయితోపాటు నగరంలో పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి -
కాంగ్రెస్ పాలనలో సుభిక్షం
● సీఎం, టీపీసీసీ అధ్యక్షులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోం ● జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని, అభివృద్ధిని చూసి బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులకు ధైర్యం ఉంటే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేసి చూపించాలన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెనుకేసుకు వస్తున్నారని అన్నారు. సీఎంను విమర్శించే స్థాయి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డికి లేదని మండిపడ్డారు. ఆర్మూర్ మున్సిపాలిటీని కై వసం చేసుకోలేని ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి , టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ను రాజీనామా చేయాలని సవాల్ విసరడం విడ్డూరమన్నారు. మహేశ్కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కై వసం చేసుకుందని గుర్తుచేశారు. జిల్లాకు మూడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంజినీరింగ్ కాలేజీ, అగ్రికల్చర్ కళాశాల తీసుకువచ్చి జిల్లాను అభివృద్ధి బాటపట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్, నుడా చైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని ఏకచక్రనగర్ చౌరస్తా వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాలు ఇలా.. బోధన్లో నివాసం ఉంటున్న షేక్ హుస్సేన్ (62) ఏకచక్ర నగర్ చౌరస్తా నుంచి నడుచుకుంటు వస్తుండగా ఓ టిప్పర్ బాబా గార్డెన్ నుంచి బోధన్ వైపునకు వస్తోంది. ఏకచక్రనగర్ చౌరస్తా వద్ద హుస్సేన్ను టిప్పర్ వెనుక నుంచి వచ్చి ఢీకొనగా, అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే తన తండ్రి మృతి చెందినట్లు మృతుడి కొడుకు షేక్అమీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. రుద్రూర్: మండల కేంద్రంలో రహదారిపై ఓ వ్యక్తికి ఫిట్స్ రావడంతో బోర్లపడి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బోధన్ పట్టణంలోని ఉద్మీర్గల్లీకి చెందిన సంజీవ్ కుమార్ (44) గత ఏడేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. గురువారం ఉదయం మండల కేంద్రంలోని హైస్కూల్కు వెళ్లే దారిలో సంజీవ్ కుమార్ ఫిట్స్ వచ్చి బోర్లపడి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. జక్రాన్పల్లి: మండలంలోని సికింద్రాపూర్ గ్రామ శివారులో 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. జక్రాన్పల్లి ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. సికింద్రాపూర్ గ్రామ పరిఽధిలోని జాతీయ రహదారి డివైడర్లో కార్మికులు గార్డెనింగ్ పనులు చేస్తున్నారు. ఈక్రమంలో కామారెడ్డి నుంచి నాగ్పూర్ వెళ్తున్న లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి రహదారిపై రోడ్డు పనులు చేస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. ఈ ఘటనలో వర్కర్లు బదవత్ నరేష్, లింబాద్రి, శ్రీకాంత్లకు గాయాలయ్యాయని ఎస్సై తెలిపారు. వీరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బదవత్ నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మారుమూల గ్రామాల్లోని బడుల అభివృద్ధికి కృషి
పెర్కిట్(ఆర్మూర్): కేంద్ర ప్రభుత్వం మారు మూ గ్రామాల్లో ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే నిధులను కేటాయిస్తున్నట్లు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. ఆలూర్ మండలం దేగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు మొత్తం రూ.13 లక్షల 50 వేలతో ఏర్పాటు చేసిన సైన్సు ల్యాబ్ను గురువారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ విద్యను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సర్పంచ్ ఇట్టెడి లింగారెడ్డి, ఎంపీడీవో గంగాధర్, ఎంఈవో నరేందర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పెర్కిట్(ఆర్మూర్): పెర్కిట్లోని ఓ ప్రయివేట్ పాఠశాలకు డీఈవో అశోక్ కుమార్ గురువారం షో కాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు పాఠశాలలో అనుమతి లేకుండా ఉర్దూ బోధన చేయించినందుకు నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్ ఎంఈవో రాజ గంగారాం యాజమాన్యానికి నోటీసులను అందజేశారు. మాక్లూర్: మండలంలోని దాస్నగర్ వద్దగల విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 6న పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్లు ఇవ్వనున్నట్టు కళాశాల చైర్మన్ నరేంధర్రెడ్డి గురువారం తెలిపారు. కంప్యూటర్ సైన్స్ (సీఎస్ఈ), ఎలక్ట్రానిక్స్ (ఈసీఈ), ఎలక్ట్రికల్ (ఈఈఈ), సివిల్ కోర్సులు అందుబాటులో ఉన్నా యని వాటిని స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో నేరుగా కళాశాలలో హాజరుకావాలన్నారు. మరిన్న వివరాలకు 99492 07789ను సంప్రదించాలన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం యూజీసీ అఫైర్స్ డైరెక్టర్గా అర్థశాస్త్ర విభాగం అధ్యాపకుడు పాత నాగరాజు నియామకమయ్యారు. వీసీ యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ యాదగిరి నియామక ఉత్తర్వులు జారీ చేయగా, గురువారం నాగరాజుకు వారు అందజేశారు. ఈసందర్భంగా నాగరాజుకు తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) అధ్యక్ష, కార్యదర్శులు పున్నయ్య, మోహన్ బాబు, సభ్యులు, పలువురు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య!
కామారెడ్డి క్రైం:రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీ వద్ద గురువారం ఉదయం జరిగింది. రైలుపట్టాలపై మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచా రం ఇచ్చారు. రై ల్వే ఎస్సై లింబాద్రి, సిబ్బంది ఘట నా స్థలా న్ని పరిశీలించి విచారణ జరిపారు. మృతు డి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. కుడి చేతి కి వెండి కడియం, చేతిపై జె.నర్సింలు అని పచ్చబొ ట్టు, మెడలో రాగి తాయత్తు ఉన్నా యి. వయస్సు సుమారు 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు కామారెడ్డి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని ఓ అద్దె ఇంట్లో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. పిట్లం మండలంలోని అంభం గ్రామానికి చెందిన ఇందూరి సన్నీ (17) మండల కేంద్రంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ, స్థానికంగా ఉన్న ఓ టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. గురువారం అతడు అద్దె ఇంట్లో తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి సవిత తన కుమారుడి మృతిపై ఎలాంటి అనుమానం లేదని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి
● నేరాలు, రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి ● ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి క్రైం: పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల వివరాలు, విచారణ, పురోగతి, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కోర్టులలో చార్జిషీట్లను సకాలంలో దాఖలు చేయడం ద్వారా నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని సూచించారు. సీసీటీఎన్ఎస్ 2.0 అమలులో భాగంగా నమోదైన ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను గడువులోగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అంతేకాకుండా వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలు, మట్కా, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో బస్సులు, అనుమానాస్పద వాహనాలు, కీలక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. వర్షాకాలం నేపఽథ్యంలో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు కలగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ .. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్పై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వరదకాలువల్లో నీళ్లు నింపి ఆయకట్టుకు అందించాలి
వేల్పూర్: వరదకాలువలో నీళ్లు నింపి వరదకాలువ ఆయకట్టుకు అందించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఇరిగేషన్ అఽధికారులను కోరారు. వేల్పూర్లోని తన క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఆయన జిల్లా ఇరిగేషన్ ఈఈ లాల్సింగ్తో ఫోన్లో మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో గాండ్లపేట్ వద్ద వరద కాలువ మరమ్మతులు దాదాపు పూర్తయినందున రివర్స్ పంపింగ్ ద్వారా ఆయకట్టు రైతాంగానికి సకాలంలో సాగునీరందించాలని కోరారు. దెబ్బతిన్న వరదకాలువ మరమ్మతు పనులు పూర్తయినందున సబ్ కాంట్రాక్టర్ల మధ్య నెలకొన్న చిన్నపాటి ఇబ్బందిని కాంట్రాక్టర్లతో మాట్లాడి పరిష్కరించాలన్నారు. అవసరమయితే తాను కూడా స్వయంగా పెద్ద కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని వారు హామీ ఇచ్చారు. అలాగే ఈ సీజన్లో రైతులకు ఎలాంటి సాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని గణేష్ భావర్ ఫంక్షన్హాల్లో శుక్రవారం రైతు ఉత్పత్తిదారుల 2వ వార్షికోత్సవ సమావేశం నిర్వహించనున్నట్లు రైతు ఉత్పత్తిదారుల గౌర అధ్యక్షుడు కొండెల సాయిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ నర్సింగరావు, చైర్మన్ వీఎఫ్పీసీఎల్ జైపాల్రెడ్డి, వాసుదేవరావు పీహెచ్పీసీఎల్ డైరెక్టర్లు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతు ఉత్పతిదారులు, రైతులు హాజరు కావాలని ఆయన కోరారు. -
నాలుగు జాతులే ప్రమాదకరం..
మన ప్రాంతంలో దాదాపు 40 రకాల పాములు కనిపిస్తుంటాయి. వీటిలో 60 శాతం విషపూరితం కానివే (జెర్రిపోతు, నీటి పాము, పసరిక పాము, ఇసక పొడపాము మొదలైనవి) ఉంటాయని వైద్యులు అంటున్నారు. అయితే అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాములుగా బిగ్ ఫోర్ అని పిలువబడే నాలుగు జాతులు మన ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తుంటాయి. త్రాచుపాము: అత్యంత విషపూరితమైనది, పడగ విప్పి భయపెడుతుంది. మన ప్రాంతంలో తరుచుగా ఈ పాము కాటుకే ప్రజలు బలవుతారు. విషం నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కట్ల పాము: అత్యంత ప్రమాదకరమైన పాము, నాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే విషాన్ని కలిగి ఉంటుంది. రాత్రి వేళల్లో ఎక్కువగా సంచరిస్తుంది. ఈ పాము కాటు వేసినప్పుడు మొదట నొప్పి తక్కువగా ఉంటుంది. రక్తపింజర: ఇది చాలా విషపూరితమైన పాము, శరీరంపై గొలుసు ఆకారపు మచ్చలు ఉంటాయి. పెద్దగా బుసలు కొడుతుంది. ఈ పాము కాటుతో రక్తం గడ్డకట్టే వ్యవస్థ దెబ్బతింటుంది. పొలాలు, గడ్డి ప్రాంతాల్లో కనిపిస్తుంది పొడపాము లేదా సుడి జెముడు: ఇది చాలా చి న్నగా కనిపిస్తుంది. గ్రామాలలో దీనిని పొ డపాము అంటా రు. ఇది చాలా విష పూరితమైనది. పొడి ప్రాంతాల్లో, మైదానాల్లో, బంజరు భూముల్లో కనిపిస్తుంది. -
సేంద్రియ సాగుపై దృష్టిసారించాలి
● రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందజేస్తున్నాం ● జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్రావు నిజామాబాద్ రూరల్: రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని సాగుచేయాలని జిల్లా కో–ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్రావు అన్నారు. మండలంలోని మాధవనగర్ వ్యవసాయ సహకార సంఘంలో గురువారం ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. గత నెల 29 నుంచి ఈనెల 6 వరకు సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సహకార సంఘాల బలోపేతానికి జిల్లాలో అనేక గిడ్డంగులు నిర్మాణం చేపట్టామన్నారు. నాబార్డు నిధులతో జిల్లాలో 100 నుంచి 200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగుల నిర్మాణం చేపట్టి రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లాగా పేరుపొందామన్నారు. 2500 నుంచి 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గిడ్డంగుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయానికి మొగ్గుచూపాలని, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మాధవనగర్ సహకార కోఆపరేటివ్ సంఘానికి ఎఫ్పీవో (రైతు ఉత్పిత్తదారుల సంస్థల ప్రోత్సహం) గుర్తింపు రావడం అభినందనీయమన్నారు. చైర్మన్ నాగేశ్వరరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సరస్వతి, మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, అజయ్ కుమార్, ఉప్పలపు పోతారెడ్డి, కేశపూర్ సర్పంచ్ తేకుర్తి గంగారెడ్డి, సంఘ కార్యదర్శి వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
కాటు కాలం.. అప్రమత్తత అవసరం
● వర్షాకాలంలో తరచూ తారసపడుతున్న సర్పాలు ● కాటువేస్తే బాధితులను ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటున్న వైద్యులు ఎల్లారెడ్డి/ఆర్మూర్: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పాముల సంచారం పెరుగుతోంది. వర్షాలు పడ్డప్పుడు వాన నీళ్లతో అవి నివాసముండే పుట్టలు, బొరియలు నిండిపోవడంతో అవి బయటకు వస్తాయి. పొడి, వెచ్చని ప్రదేశాల కోసం వెతుకుతుంటాయి. అందువల్ల ఇవి నివాస ప్రాంతాలు, పొదలు, ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం ఉంది. పొలాలు, గడ్డి కుప్పలు, చెరువుల వద్ద, ఇళ్ల సమీపంలోని పొదల్లో పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈక్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పాము కాటు ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. నాటువైద్యం వద్దు.. గ్రామీణ ప్రజలు పాము కరిస్తే మంత్రం వేసే వారి వద్దకు పరుగులు తీస్తుంటారు. కొందరైతే మంత్రగాడి పేరు తలచుకుని పాము కరిచిన చోట గట్టిగా కట్టు కడుతుంటారు. ఇలా మూఢ నమ్మకాలను నమ్మి ప్రాణాలను కోల్పోవద్దని పాము కరిస్తే తక్షణం ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు అంటున్నారు. ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రి పరిధిలో గత మార్చి 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు 68 పాముకాటు కేసులు వచ్చాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పాము కరిస్తే.. ● పాము కరిచిన చోట తీవ్రమైన వాపు, నొప్పి ఉంటుంది. ● మాట తడబడటంతోపాటు మత్తు రావడం, కళ్లు భారంగా అనిపించడం. ● శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ● ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారడం చేయకూడనివి.. ● పాము కాటు వేసిన చోట కోయడం లేదా గాయం చేయడం ● పాము కరిచిన చోట నోటితో విషం పీల్చే ప్రయత్నం చేయడం ● పాము కరిచిన చోటుకు కొద్దిగా పైన గట్టిగా తాడుతో కట్టడం ● మంత్రాలు, మూఢ నమ్మకాలపై ఆధారపడటం ● తెలిసిన మందులు ఇవ్వడం, మద్యం తాగించడం చేయాల్సినవి.. ● బాధితుడిని ప్రశాంతంగా ఉంచాలి. గాభరా పెట్టవద్దు ● కాటు వేసిన అవయవాన్ని ఎక్కువగా కదలకుండా చూడాలి ● కాటు వేసిన అవయవంపై ఉంగరాలు, గాజులు, గడియారాలు ఉంటే తీసివేయాలి ● చికిత్స నిమిత్తం తక్షణం ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. రైతులు జాగ్రత్త.. ప్రజలు ముఖ్యంగా రైతులు పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పాము కాట్లకు ఎక్కువగా పొలాల్లో తిరిగే రైతులే బలవుతుంటారు. పాము కాటు బారిన పడకుండా రైతులు పొలాల్లో పనిచేసేటప్పుడు బూట్లు ధరించాలి. రాత్రి వేళల్లో టార్చ్లైట్ ఉపయోగించాలి. గడ్డి కుప్పలు, రాళ్ల కింద చేతులు పెట్టే ముందు జాగ్రత్త వహించాలి. పరిసరాల్లో చెత్త, ఎలుకల నివాసాలు లేకుండా చూడాలి. పాము కరిస్తే సొంత వైద్యాలు చేస్తూ, మంత్రాలు వేయిస్తూ సమయం వృథా చేయవద్దు. బాధితులను తక్షణం ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. గత సంవత్సరం ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రిలో 68 పాముకాటుకు గురైన వ్యక్తులకు చికిత్స చేసి ప్రాణాలు రక్షించాం. ఆస్పత్రిలో పాము కాటు చికిత్సకు సరిపడ మందులు అందుబాటులో ఉన్నాయి. –డాక్టర్ రవీంద్రమోహన్, సూపరింటెండెంట్, ఎల్లారెడ్డి ఆస్పత్రి పాము కాటు, తేలు కాటు కేసుల్లో మొదటి 30 నిమిషాలు చాలా కీలకం. చాలా మంది భయంతో పరుగెత్తుతారు, ఇలా చేయవద్దు. రైతులు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండాలి. స్వీయ వైద్యం ప్రాణాలకు ప్రమాదం. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలి. ప్రథమ చికిత్సపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. –డాక్టర్ అమృత్రామ్రెడ్డి,ప్రభుత్వ ఆస్పత్రి, ఆర్మూర్ -
రీడింగ్ రూం ప్రారంభం
ఖలీల్వాడి: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం నగరంలోని పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో ప్రత్యేక రీడింగ్ రూమ్ను జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతరెడ్డి రాజిరెడ్డి, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పండరినాథ్, కార్యదర్శి గంగా కిషన్ ప్రారంభించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి అనుబంధంగా గ్రంథాలయానికి సమీపంగా ఉన్న ఈ భవనాన్ని పాఠకుల కోసం కేటాయించినందుకు పెన్షనర్ అసోసియేషన్ కార్యవర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెన్షనర్ అసోసియేషన్ సలహాదారులు రాజారామ్, గ్రంథాలయ సిబ్బంది ఉన్నారు. -
ప్రతి కుటుంబానికి ఆర్థికాభివృద్ధిపై అవగాహన కల్పించాలి
డిచ్పల్లి: ప్రతి కుటుంబానికి ఆర్థికాభివృద్ధిపై అవగాహన కల్పించాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) రాష్ట్ర ప్రాజెక్ట్ మేనేజర్ నరసింహ స్వామి సూచించారు. డిచ్పల్లిలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో గురువారం ఐకేపీ సీఆర్పీ అభ్యర్థులకు ఇస్తున్న శిక్షణ తీరును ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సంఘాల సమావేశాలకు వెళ్లి ఆర్థిక అక్షరాస్యత గురించి మహిళలందరికీ అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సంస్థలో శిక్షణ పొందుతున్న టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీ పార్లర్ కోర్సుల అభ్యర్థులతో మాట్లాడి శిక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. సంస్థ డైరెక్టర్ రవికుమార్, డీపీఎం సంధ్యారాణీ, ఏపీఎం రవీందర్ రెడ్డి, సీసీలు, శిక్షణ బృందం రామకృష్ణ, భాగ్యలక్ష్మీ, నవీన్, లక్ష్మీనారాయణ, ఫరీదా, నాగలక్ష్మి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. -
ఒకటికి మించి ఓట్లు ఉంటే నేరం
నిజామాబాద్అర్బన్ : ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉండటం, తప్పుడు సమాచారం ఇవ్వడం శిక్షార్హమైన నేరాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒకటి కన్నా ఎక్కువ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకోవడానికి అర్హుడు కాదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణ, పేర్ల నమోదు లేదా తొలగింపుల సమయంలో తప్పుడు సమాచారాన్ని, లిఖితపూర్వక డిక్లరేషన్ను సమర్పిస్తే, అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందన్నారు. అలాంటి వారికి సంవత్సరం వరకు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా ఈ రెండూ విధించబడతాయని తెలిపారు. ఓటర్లందరూ చట్టపరమైన నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉంటే ఫారం–7 ద్వారా తొలగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్యుమరేషన్ ఫారంను అందజేసిన కలెక్టర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం తన ఎన్యుమరేషన్ ఫారంను బీఎల్వోకు అందజేశారు. జూన్ 25న బీఎల్వో, సూపర్వైజర్లు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎన్యుమరేషన్ ఫారం అందజేసిన విషయం తెలిసిందే. వాటిని పూర్తి చేసిన అనంతరం కలెక్టర్ గురువారం సాయంత్రం బీఎల్వోకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణలో అందరూ పాల్గొనాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినయ్సాగర్, బీఎల్వో రుక్మిణి, సూపర్వైజర్ హరీశ్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రీ ప్రైమరీ పోస్టుల భర్తీ ఎన్నడు?
● ఇన్స్ట్రక్టర్ పోస్టులకు 3,404.. ఆయాలకు 750 దరఖాస్తులు ● ఆశగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఖలీల్వాడి: జిల్లాలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభమైనప్పటికీ టీచర్లు (ఇన్స్ట్రక్టర్లు), ఆయాల నియామకం ఆలస్యమవుతోంది. జూన్ 15వ తేదీ నుంచే పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా 18 రోజులవుతున్నా ఇంత వరకు పోస్టుల నియామకం పెండింగ్లోనే ఉంది. జిల్లాలో కొత్తగా 112 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీని ప్రారంభిస్తూ విద్యాశాఖ మే 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్స్ట్రక్టర్కు రూ.8 వేలు, ఆయాలకు రూ.6 వేలు వేతనం చెల్లించాలని నిర్ణయించి విద్యార్హతలను సైతం స్పష్టం చేశారు. ఇన్స్ట్రక్టర్ పోస్టులకు 3,404 మంది, ఆయా పోస్టులకు 750 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపిక ప్రక్రియను కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎంపికకు తుది గడువు లేకపోవడంతో నియామకాలు ఎప్పటికి పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా కేంద్రానికి ఒకటి లేదా రెండు దరఖాస్తులే? ఇన్స్ట్రక్టర్ పోస్టులకు ఒక్కో చోట వందలాది దరఖాస్తులు అందగా, ఎంఈవోలు ఒకరిద్దరి పేర్లను మాత్రమే జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున సిఫారసులు, ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో ఇంటర్ మార్కుల ఆధారంగా, మరికొన్ని జిల్లాల్లో డీఈడీ, బీఈడీ, మరికొన్ని చోట్ల ప్రీ ప్రైమరీ కోర్సులు చేసిన వారిని నియమిస్తామని చెబుతుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. పాఠశాల విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. డీఈవో పార్శి అశోక్ను వివరణ కోరగా త్వరలోనే ప్రీప్రైమరీ స్కూళ్లలో పోస్టులను నియామకం చేపడతామన్నారు. -
నిజామాబాద్ అభివృద్ధి వద్దా?
● మహేశ్కుమార్గౌడ్ ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నారు ● తన పదవి పోతుందనే భయంతో రేవంత్ ఉన్నారు ● మీడియాతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి సుభాష్నగర్ : జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా.. అని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ప్రశ్నించారు. ఆయన పైరవీకారుడని, పైరవీ చేసి పదవి కొనుక్కున్నాడని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులు, పరిశ్రమలు, రూ.వేల కోట్ల నిధులు కేవలం మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకే మళ్లిస్తున్నారన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూడికతీత, కెనాల్ ఆధునీకరణ, జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ తదితర అనేక అంశాలపై సీఎం రేవంత్రెడ్డిని తాను కలిశానని గుర్తుచేశారు. తెలంగాణ యూనివర్సిటీని ఏం అభివృద్ధి చేశారన్నారు. మహేశ్గౌడ్ ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నారని, కొనుక్కున్న పదవిని జిల్లా అభివృద్ధి కోసం ఉపయోగించాలని హితవుపలికారు. తాను 3 నెలల్లో ఎమ్మెల్యేగా గెలిచానని, 30 ఏళ్లయినా మహేశ్గౌడ్ ఒక్కసారి కూడా గెలవలేవ లేదని విమర్శించారు. దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని, తాను కూడా రాజీనామా చేస్తానని, ఎన్నికల బరిలోకి దిగుదామని సవాల్ విసిరారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, సిద్దులగుట్ట అభివృద్ధికి రూ.30కోట్లు ఇవ్వాలని, ఆర్మూర్, బోధన్లో మున్సిపల్ భవనాలు లేవని పేర్కొన్నారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, లక్కంపల్లి సెజ్లో కంపెనీలు ఏర్పాటుచేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు ఓడిపోయిన ఈరవత్రి అనిల్ నోరు అదుపులో పెట్టుకోవాలని, బీసీల పేరుతో రాజకీయం చేయడం సరికాదన్నారు. ‘సీఎం పదవి మూడునాలుగు రోజుల్లో పోతుందనే భయం రేవంత్రెడ్డికి పట్టుకుందని, ఇటీవల కర్నాటకలో మార్చిన నేపథ్యంలో తెలంగాణలో కూడా మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోందన్నారు. సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతుల శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాదాసు స్వామి యాదవ్, వేణుగోపాల్, శ్రీనివాస్రెడ్డి, ఆమంద్ విజయ్, మఠం పవన్ తదితరులు పాల్గొన్నారు. -
చిక్కినా.. చింత లేదు!
నిజామాబాద్● ఓ వైపు ఏసీబీ దూకుడు.. ● మరోవైపు కొనసాగుతున్న విచారణ ● ఏడాదిన్నరలో 12 కేసులు ● ఒక్క కేసులోనూ ఖరారు కాని శిక్షలు● జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠికాటు కాలం.. అప్రమత్తత అవసరం ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పాము కాటు ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026– 8లో uమరో 26వేల మంది రైతులకు ‘భరోసా’ ● నాలుగు ఎకరాల వరకు అందజేసిన ప్రభుత్వం డొంకేశ్వర్(ఆర్మూర్):జిల్లాలో మరో 26,058 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం (రైతు భరోసా) అందింది. వీరికి ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ.53.92 కోట్లు బ్యాంకు ఖాతాల్లో గురువారం జమయ్యాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఇప్పటి వరకు జిల్లాలో 2,45,950 మంది రైతులకు గాను రూ.218.15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు రైతులకు పెట్టుబడి సాయం అందగా, ఆపైబడిన ఎకరాలకు కూడా విడతల వారీగా ప్రభుత్వం ఇవ్వనుంది. 13 నుంచి అల్బెండజోల్ మాత్రలు పంపిణీ ● డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ సుభాష్నగర్: జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈ నెల 13 నుంచి జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ తెలిపారు. నులి పురుగుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని గురువారం జిల్లా కేంద్రం నుంచి జూమ్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రా లు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళా శాలలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, కళాశాలల్లో, వసతిగృహాల్లో అల్బెండజోల్ మాత్రలు అందిస్తారని పేర్కొన్నారు. పిల్లలందరికీ మాత్రలు వేయించాలని సూ చించారు. ఎవరైనా పిల్లలు అనారోగ్యం, మరేతర కారణాలతో మాత్రలు వేసుకోకపోతే మలి విడత ఈ నెల 20న తప్పనిసరిగా వేయించుకోవాలని తెలిపారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ నవ్య, డిప్యూటీ డీఎంహెచ్వో సికందర్ నాయక్, ప్రోగ్రాం అధికారులు శిఖర, నవ్య, శ్రావ్య, ఆర్బీఎస్కే మేనేజర్ సచిన్, డీపీవో విశాలరాణి, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భూముల రీ సర్వేకు సహకరించాలి డొంకేశ్వర్(ఆర్మూర్): భూముల రీ సర్వేకు సహకరించాలని జిల్లా సర్వే ల్యాండ్ ఏడీ శ్రీనివాసులు కోరారు. మండలంలోని కోమట్పల్లిలో భూముల రీ సర్వేపై రెవెన్యూ, స ర్వే ల్యాండ్ అధికారులతో కలిసి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రా మాల్లో వందేళ్ల క్రితం నిజాంకాలం నాటి స ర్వే రిపోర్టుల ఆధారంగా మ్యాపులు, సర్వే నంబర్లు ఉన్నాయని, వీటిని ఆధునికరించేందుకు ప్రభుత్వం రీ సర్వే చేయనున్నట్లు తెలిపారు. ముందుగా గ్రామ సరిహద్దును నిర్ణయిస్తామని, ఆ తర్వాత ఇళ్లు, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, వ్యవసాయ, ఆబాది భూములకు సర్వే చేస్తామన్నారు. త్వరలో ప్రారంభం కానున్న సర్వేకు గ్రామస్తులు, రైతులు సహకరించాలని కోరారు. సర్పంచ్ సుమలత, తహసీల్దార్ ప్రసాద్, ఆర్ఐ నితీశ్, సర్వేయర్లు పాల్గొన్నారు.నిజామాబాద్ అర్బన్ : లంచావతారాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఏసీబీ.. అదే దూకుడుతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతున్న వారిపైనా నిఘా సారించింది. సుమారు ఏడాదిన్నర కాలంలో ఏడు ప్రభుత్వ శాఖలపై దాడులు చేసి 12 కేసులు నమోదు చేసింది. అయితే ఏసీబీకి చిక్కిన సమయంలో నెలకొన్న హడావుడి ఆ తరువాత కనిపించడం లేదు. కేసు పరిధి ఏసీబీ నుంచి కోర్టుకు చేరిన తరువాత సాక్ష్యాధారాలు సమర్పించడం, నేరాన్ని రుజువు చేయడంలో నిబంధనలకు అనుగుణంగా వెళ్లే క్రమంలో కొంత ఆలస్యం జరుగుతుండడంతో అవినీతి అధికారులు ‘చిక్కినా చింత లేదు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కొంత మందైతే జైలు నుంచి బయటికి వచ్చి తమ పలుకుబడిని ఉపయోగిస్తూ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారనే ఆరోపణలున్నాయి. లంచం, ఆదాయానికి మించి ఆస్తుల కేసులు రుజువు చేసేందుకు సుమారు ఏడాది నుంచి మూడేళ్లు పడుతోందని ఓ అధికారి అన్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో 2025 జనవరి నుంచి ఈ ఏడాది జూన్ వరకు 12 ఏసీబీ కేసులు నమోదయ్యా యి. లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన కేసుల్లో ఇప్పటివరకు రూ.3,59,500 నగదు స్వాధీనం చేసుకు న్నారు. అలాగే ఇటీవల ఏసీబీ అధికారులు ఎకై ్స జ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంటితోపా టు కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి రూ.1.33 లక్షలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. లింగంపేట పోలీస్స్టేషన్లో ఇద్దరు ఎస్సై లు, బిచ్కుంద ఎకై ్సజ్ సీఐ ఏసీబీకి చిక్కారు. అలాగే వర్ని ఎస్సై, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. తనిఖీలతో హడల్.. లంచం డిమాండ్ చేస్తున్న అధికారులను వల వేసి పట్టుకుంటున్న ఏసీబీ అధికారులు ప్రభుత్వ కా ర్యాలయాల్లో తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రెండుసార్లు తనిఖీలు ని ర్వహించారు. కొన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాలతోపాటు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. అలాగే విద్యాశాఖ పరిధిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయా ల్లో నిధుల దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు రావడంతో వివరాలు తెలుసుకున్నారు. మీ సేవ కేంద్రాలు, రైస్ మిల్లుల్లోనూ తనిఖీలు చేశారు.మల్లారెడ్డి లాకర్లో కిలో బంగారంనిజామాబాద్ అర్బన్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి బ్యాంక్ లాకర్ నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు ఎకై ్సజ్ కార్యాలయంతోపాటు నిజామాబాద్ నగరంలోని మల్లారెడ్డి ఇంట్లో గత నెలలో సోదాలు నిర్వహించి రూ.3 కోట్లకుపైగా ఆస్తులను గుర్తించారు. రెండు రోజుల క్రితం మూడు లాకర్లను తెరిచి కిలో బంగారం, 70 తులాల వెండిని గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపారు.అవినీతి నిరోధకశాఖ లంచావతరాలను, దోచుకుంటూ దాచుకుంటున్న వారిని వలపన్ని పట్టుకుంటున్నా కేసు నేర నిరూపణ దశకు చేరుకునేందుకు చాలా సమయం పడుతోంది. ఏసీబీకి పట్టుబడి జైలుకు వెళ్లి బయటికి వచ్చిన వారు కొందరు తమ పలుకుబడిని ఉపయోగించి కేసులను సాగదీయడం, సాక్షులు మాట మార్చడం, దర్యాప్తులో జాప్యం, ప్రభుత్వం నుంచి అనుమతులు వంటి కారణాలు నిందితులకు శిక్ష ఖరారుకావడంలో ఆలస్యానికి కారణమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు ఏడాదిన్నర కాలంలో 12 కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు ఒక్కరికి కూడా శిక్ష ఖరారు కాలేదు. -
లహరి బస్సుకు కొత్త బోర్డింగ్ పాయింట్లు
● ఆర్ఎం ఎస్వీజీ కృష్ణమూర్తినిజామాబాద్ రూరల్ : నిజామాబాద్–హైదరాబాద్–బెంగళూరు లహరి ఏసీబస్సు సర్వీసుకు కొత్త బోర్డింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని టీజీఎస్ఆర్టీసీ రీ జినల్ మేనేజర్ ఎస్వీజీ కృష్ణమూర్తి పేర్కొన్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగళూరు ప్ర యాణికుల అభ్యర్థన మేరకు హైదరాబాద్ నగరంలో లహరి బస్సు సర్వీసుకు మేడ్చల్, కోంపల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్, ఆరాంఘర్ ‘ఎక్స్’ రోడ్, శంషాబాద్ ప్రాంతాలను కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేశామన్నారు. బెంగళూరు నుంచి నిజామాబాద్ వచ్చే సర్వీసుకు పిణ్య, యశ్వంత్పూర్, ఆనంద్ రావు నగర్, ప్యాలెస్ గుట్టహళ్లి, సీబీఐ–జంక్షన్, బెంగళూరు– విమానాశ్రయం ఎక్స్ రోడ్లను కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా లహరి సర్వీసును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. సంస్థ వెబ్సైట్ www.tgs rtcbus.in ద్వారా లేదా రిజర్వేషన్ కౌంటర్లో ముందస్తుగా టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు. -
ఎన్నారైల సంక్షేమానికి పెద్దపీట
నిజామాబాద్అర్బన్: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలంటేనే భయాందోళనకు గురికావొద్దని, ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. టామ్కామ్ సౌజన్యంతో జిల్లా శిక్షణ ఉ పాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విదేశీ ఉద్యోగ మేళాను ఎమ్మె ల్యే జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం స్కిల్ యూనివర్సి టీని సైతం ఏర్పాటు చేసిందన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం నూతన పాలసీని రూపొందించనుందన్నారు. నిజామాబాద్లో భారీ స్థాయిలో విదేశీ ఉద్యోగ మేళా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నగర మేయర్ ఉమారాణి, ఉపాధి కల్పన శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియా మక పత్రాలు అందజేశారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి వేల్పుల విజేత, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్కుమార్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 7,500 మంది.. ఉద్యోగ మేళాకు 7,500 మంది యువత హాజరైనట్లు ఉపాధికల్పన అధికారి విజేత తెలిపారు. 42 మంది విదేశీ ఉద్యోగాలకు ప్రా థమికంగా ఎంపిక కాగా, 1750 మంది స్థానిక ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు వివరించారు. విదేశీ ఉద్యోగ మేళా నిర్వహణ అభినందనీయం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి హాజరైన ఉపాధి కల్పన శాఖ డైరెక్టర్ కాంతి, కలెక్టర్ ఇలా త్రిపాఠి -
జీజీ కాలేజీలో ‘అన్న–అక్క మెంటార్షిప్’
ఖలీల్వాడి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘అన్న–అక్క మెంటార్ షిప్’ కార్యక్రమాన్ని నగరంలోని గిరిరాజ్ కాలేజీలో ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 1 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కార్యక్రమం అమలవుతుందని, రాష్ట్రంలోని 150 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన 53 వేల మంది డిగ్రీ మూడో సంవత్సరం విద్యార్థులు (మెంటార్లుగా) 9 వేల పా ఠశాలల్లో విద్యార్థులకు 30 గంటలపాటు శిక్షణ ఇస్తారని తెలిపారు.కార్యక్రమ కళాశాల సమన్వయకర్తలు కిరణ్ కుమార్గౌడ్, వివేకానంద, సుమన్, మాట్లాడుతూ.. డిగ్రీ కళాశాలల విద్యార్థులను ‘మెంటార్లు’గా మార్చి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సరికొత్త సాంకేతికతను అందించడం ‘అన్న–అక్క మెంటార్షిప్’ కార్యక్రమ ముఖ్య ఉద్దే శమన్నారు. మెంటార్షిప్లో విజయవంతంగా బోధన పూర్తి చేసిన డిగ్రీ విద్యార్థులకు అకడమిక్స్ లో రెండు ప్రత్యేక క్రెడిట్లను కేటాయిస్తారని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ ఎస్ రంగరత్నం, వినయకు మార్, దండు స్వామి, రామస్వామి పాల్గొన్నారు. -
నిజామాబాద్
ప్రతి పనికి వాట్సాప్.. విధినిర్వహణ ఫొటోలు వాట్సాప్లో పంపించాలనే నిబంధనతో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విసిగిపోతున్నారు. గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026– 8లో uరావుట్ల సెక్షన్లోని అటవీ భూమి చుట్టూ పొక్లెయిన్ తో కందకాలు తవ్విస్తున్న అటవీ అధికారులు జిల్లాలో అటవీ భూమిని అయినకాడికి ఆక్రమిస్తున్నారు. సిరికొండ, కమ్మర్పల్లి రేంజ్ల పరిధిలో ఆక్రమణకు అధికారులు సహకరించారని ఫిర్యాదులు రావడం, విచారణలు చేపట్టడం గమనార్హం. తాజాగా సిరికొండ రేంజ్ పరిధిలోని రావుట్ల సెక్షన్లో 55 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు మిగతా ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపడతారోననే చర్చ సాగుతోంది. -
బీజేపీ అనుబంధ సంస్థగా ఎన్నికల కమిషన్
రుద్రూర్(బోధన్)/పెర్కిట్(ఆర్మూర్)/బాన్సువాడ: కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ విమర్శించారు. బుధవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించిన ఆయన రుద్రూర్ మండలం ఎత్తొండ, ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాన్సువాడలో ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయా చోట్ల ఆయన మీడియాతో మా ట్లాడారు. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో బీజే పీ తమ వ్యతిరేకులనే కారణంతో ఎస్ఐఆర్ ప్రక్రి య ద్వారా లక్షలాది మంది ఓట్లను తొలగించి ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపించారు. తెలంగాణలో అలా జరగకుండా కాంగ్రెస్ ఎస్ఐఆర్ను పర్యవేక్షిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్తో కుమ్మక్కు కావడం వల్లే 8 ఎంపీ స్థానాలు వచ్చాయి తప్పా తెలంగాణలో బీజేపీకి ప్రజాదరణ లేదన్నారు. గ్రామ దేవతల ఉత్సవాలకు ప్రాధాన్యం గ్రామాల్లో ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించే గ్రామ దేవతల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎత్తొండలోని రేణుకాఎల్లమ్మ దేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ సురేశ్షెట్కార్, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార కార్పొరేషన్ చంద్రశేఖర్గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు మంత్రి వెంట ఉన్నారు. ఆర్టీసీ విలీనం అప్పుడే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. యూనియన్లు, ఆర్టీసీ అధికారులతో చర్చించి విధి విధానాలు ఖరారు చేశాకే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. -
కల్లుసీసాతో యువకునిపై దాడి
మాచారెడ్డి: మద్యం మత్తులో కల్లుసీసాతో ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి పాల్వంచ మండలం ఫరీద్పేట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై అనిల్ తెలిపిన ప్రకారం.. ఫరీద్పేట గ్రామానికి చెందిన శ్రీకాంత్, నరేందర్ దోమకొండ మండలం అంబారీపేట్ మైసమ్మ ఆలయం వద్ద విందులో పాల్గొన్నారు. మధ్యలో ఇద్దరు గొడవపడి ఎవరి దారినవారు ఇంటికి వెళ్లారు. అదే రోజు రాత్రి కల్లు దుకాణం వద్ద శ్రీకాంత్ను పిలిచిన నరేందర్ అంబారీపేటలో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని కల్లు సీసాతో దాడి చేశాడు. దీంతో శ్రీకాంత్ మెడ, పొట్టపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే శ్రీకాంత్ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
బాలలను సంరక్షించాలి
● అదనపు డీసీపీ శుభం ప్రకాశ్ ● ఆపరేషన్ ముస్కాన్–12 ప్రారంభం నిజామాబాద్అర్బన్: తప్పిపోయిన, నిరాశ్రయులైన, వీధి బాలలను గుర్తించి చట్టపరమైన సంరక్షణ కల్పించాలని అదనపు డీసీపీ శుభం ప్రకాశ్ పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం శ్రీఆపరేషన్ ముస్కాన్–12శ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి 31 వ తేదీ వరకు నెలరోజులపాటు పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, బాలల సంరక్షణ విభాగం, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా రైల్వేస్టేషన్, బస్ స్టేషన్లు, మార్కెట్లు, హోటళ్లు, దాబాలు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, గ్యారేజీలు, వర్క్షాపులు, నిర్మాణ ప్రాంతాలు, ధార్మిక క్షేత్రాలు, పర్యాటక తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలన్నారు. బాల కార్మికులు, నిరాశ్రయులు, వీధి బాలలు, తప్పిపోయిన చిన్నారులను గుర్తించి పునరావాసం కల్పించాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోపాటు ప్రతి చిన్నారికి విద్య, భద్రత, ఆరోగ్యం రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. చిన్నారులను పనులలో పెట్టుకోవడం నేరమన్నారు. అలాంటి ఘటనలు కనిపించిన వెంటనే సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్ కోసం నిజామాబాద్ డివిజన్ ఇన్చార్జి ఎస్సై 87125 78236, ఆర్మూర్ డివిజన్ ఇన్చార్జి ఎస్సై 8712659863, బోధన్ డివిజన్ ఇన్చార్జి ఎస్సై 99 85197899 నంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు. సమావేశంలో సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పాండేరావు, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, మహిళా, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సౌందర్య, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ చైతన్య, జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రభుదాస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కల్పన తదితరులు పాల్గొన్నారు. -
బాబ్లీ 14 గేట్ల ఎత్తివేత
కమ్మర్పల్లి(బాల్కొండ): గోదావరి నదిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకాలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు బుధవారం తెరుచుకున్నాయి. పోచంపాడ్ డివిజన్ నుంచి ఏఈఈలు కొత్త రవి, ఎన్. శ్యామ్కుమార్, ఎస్ విన్యాస్రెడ్డి ఉదయం బాబ్లీ ప్రాజెక్టు వద్దకు చేరుకోగా, వారి సమక్షంలో మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులు గేట్లను ఎత్తి నీటిని వదిలారు. గురువారం సాయంత్రానికి ఎస్సారెస్పీలోకి నీరు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 28 వరకు ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఏడాది జూలై 1 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు గేట్లను తెరిచి ఉంచుతారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 15.149 టీఎంసీల(1064.30 అడుగులు) నీరు నిల్వ ఉండగా, గతేడాది ఇదే రోజున 15.672 టీఎంసీల (1064.70 అడుగులు) నీరుంది. కోర్టు భవన నిర్మాణ పనుల పరిశీలన కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న కోర్టు భవనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి బుధవా రం పరిశీలించారు. పనులను వీలైనంత త్వ రగా పూర్తి చేస్తే ప్రారంభోత్సవ తేదీని హైకోర్టుకు నివేదిస్తామని న్యాయమూర్తి అన్నారు. ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, ఎంపీడీవో సంతోష్కుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ చందర్, ట్రెజరర్ రాజేందర్, న్యాయవాదులు శ్యామ్, సంజీవ్, కిరణ్, చైతన్య, నాగేందర్ తదితరులు ఉన్నారు. భూభారతి రీ సర్వేకు సహకరించాలి పెర్కిట్(ఆర్మూర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీ సర్వేకు రైతులు, ప్రజలు సహకరించాలని జిల్లా భూ మి, కొలతల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కోరారు. ఆర్మూర్ మండలం రాంపూర్లో బుధవారం భూభారతి రీ సర్వేపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాంపూర్ గ్రా మాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని రీ సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. రాంపూర్ గ్రామ శి వారులోని వివిధ సర్వే నంబర్లలో ఉన్న భూ మిని పది రోజుల్లో సర్వేయర్లు రీ సర్వే చేస్తారని, రైతులు సహకరించాలని కోరారు. ని జామాబాద్ హెడ్ క్వార్టర్స్ డీఐ జగన్నాథం, ఆర్మూర్ డీఐ శేఖర్ వర్మ, బోధన్ డీఐ దత్తు, సర్వేయర్ రత్నాకర్, సర్పంచ్ శూలం లావణ్య, జీపీవో తదితరులు పాల్గొన్నారు. -
55 ఎకరాల భూమి స్వాధీనం
● సిరికొండ రేంజ్లో కొరడా ఝుళిపించిన ఫారెస్ట్ అధికారులు ● భారీ పోలీసు బందోబస్తు నడుమ భూమి చుట్టూ ట్రెంచింగ్సిరికొండ: ఆక్రమణకు గురైన అటవీ భూమిని ఆ శాఖ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య బుధవారం స్వాధీనం చేసుకున్నారు. సిరికొండ రేంజ్ రావుట్ల సెక్షన్ పరిధిలోని రావుట్ల, జంగిలోడితండాల వద్ద అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. 10 పొక్లెయిన్ లను తీసుకువచ్చి ఆక్రమిత భూమి చుట్టూ కందకం తవ్వించారు. నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్యాదవ్ నేతృత్వంలో పది మంది సీఐలు, 26 మంది ఎస్సై లు వందలాది మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో ఎటు చూసినా పోలీసులే కనిపించారు. ఆర్మూర్ ఎఫ్డీవో చంద్రశేఖర్రావు భూముల స్వాధీన ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ సూచనల మేరకు అటవీభూమిని పరిశీలించి ఆక్రమణకు గురైన 55 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆక్రమణదారులకు వారం రోజుల క్రితం నోటీసులు జారీ చేశామని, వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నోటీసులకు తిరిగి సమాధానం ఇవ్వలేదన్నారు. సిరికొండ ఎఫ్ఆర్వో నర్సింగ్రావు, ధర్పల్లి సీఐ భిక్షపతి, సిరికొండ ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
4 నుంచి ఐఎంబీఏ ఆరో సెమిస్టర్ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 4 నుంచి 13 వరకు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (ఐఎంబీఏ) ఆరో సెమిస్టర్ థియరీ రెగ్యులర్ పరీక్షలు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే సంపత్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. కొనసాగుతున్న బీఈడీ, బీపెడ్ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న బీఈడీ, బీపెడ్ నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు 1,354 మంది విద్యార్థులకు 1,330 మంది హాజరుకాగా 24మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఖలీల్వాడి: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’ ద్వారా షెడ్యూల్డ్ కులానికి చెందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షలు స్కాలర్షిప్ అందిస్తున్నట్లు జిల్లా ఎస్సీ వేల్ఫేర్ ఆఫీసర్ రజిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారై ఉండాలని, సంవత్సర ఆదాయం రూ. 5 లక్షలకు మించకూడదని, గ్రాడ్యుయేషన్లో 60 శాతం కన్నా ఎక్కువ మార్కులు వచ్చి, టోఫెల్, ఈలెట్స్, జీఆర్ఈ, జీమెట్లో ఎక్కువ శాతం అర్హత కలిగి ఉండాలన్నారు. ఒక్క కుటుంబం నుంచి ఒకరు మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్లో పనిచేసి ఉద్యోగ విరమ ణ పొందిన పలువురిని అధికారులు సన్మానించారు. కామారెడ్డి జోనల్ ఇన్స్పెక్టర్ మొయినుద్దీన్, ఏఎస్సై వడ్ల బ్రహ్మం, హోంగార్డు చక్రధర్ బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. నిజామాబాద్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రీజినల్ ఇంటెలిజెన్స్ అధికారి రఘుచందర్,జోనల్ ఇన్స్పెక్టర్ సాజిద్, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సంజీవ్ రావు, ఇతర సిబ్బంది వారికి శాలువా, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కామారెడ్డి, నిజామాబాద్ ఇంటెలిజెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. పెర్కిట్(ఆర్మూర్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందజేస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖా ధికారిణి రాజశ్రీ సూచించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలో ఉన్న బస్తీ దవాఖాను డీఎంహెచ్వో బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అనంతరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య సిబ్బంది డీఎంహెచ్వో రాజశ్రీతోపాటు డిప్యూటీ డీఎంహెచ్వో రవీందర్, వైద్యాధికారిణి శ్రేయను ఘనంగా సన్మానించారు. వైద్య సిబ్బంది కృష్ణమూర్తి, సాయి, శంకర్, దత్తాత్రి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ 95 శాతం పూర్తి
● ఓటర్లకు సహకరించేందుకు వీలుగా హెల్ప్డెస్క్లు ● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● హెల్ప్ డెస్క్ ఆకస్మిక తనిఖీ సుభాష్నగర్: జిల్లావ్యాప్తంగా ఎన్యుమరేషన్ ఫామ్ ల పంపిణీ 95 శాతం పూర్తికాగా, నిజామాబాద్ నగరంలో 65 శాతం పూర్తయ్యిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే ప్రక్రియ కొనసాగుతుందని, ప్రతి ఓటరు గ డువులోపు ఫారాలు పూరించి బీఎల్వోలకు అందించాలని అన్నారు. నిజామాబాద్ నగర కార్పొరేషన్ పరిధిలోని కంఠేశ్వర్ జోన్ –4 కార్యాలయంలో కొనసాగుతున్న హెల్ప్డెస్క్ కేంద్రాన్ని బుధవారం సా యంత్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీచేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్, వివరా ల నమోదు విషయంలో ఓటర్లకు ఈ కేంద్రం ద్వా రా అందిస్తున్న సేవలు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్ర క్రియకు ప్రతి ఓటరు సహకరించాలని సూచించా రు. ఆన్లైన్లో ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా కూడా ఓటర్లు తమ వివరాలు పరిశీలించుకోవచ్చన్నారు. కాగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ప్ర జలు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని, ఎన్యుమరేషన్ ఫారంలో వివరాలు సరిగా లేని వారికి సైతం ఈనెల 24 తర్వాత ఈఆర్వోలు నోటీసులు అందించి హియరింగ్ నిర్వహిస్తారని తెలిపారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి అర్హత కలిగిన వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చను న్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ఆ యా రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు తమవంతు సహకారం అందించాలని సూచించారు. ఓటర్ల నుంచి బీఎల్ఏలు ప్రతిరోజు 50 వరకు ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించి బీఎల్ఓలకు అందించవచ్చని అన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, అధికారులు ఉన్నారు. -
మహిళా సంఘాలకు వడ్డీ వాపస్!
● జిల్లాకు రూ.44.23 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వండొంకేశ్వర్(ఆర్మూర్): మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ వాపస్ చేసింది. ఈ మేరకు జిల్లాలో 19,291 సంఘాలకు కలిపి రూ.44.23 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులను మండలాల వారీగా ఆయా ఎస్హెచ్జీ గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయన్న తెలిపారు. గ్రామీణ మహిళలు ఎస్హెచ్జీ సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ వ్యాపారాలు, ఇతర ఆర్థిక అవసరాల కోసం రుణాలు పొందుతూ ప్రతి నెలా వాయిదాల రూపంలో తిరిగి రుణాలను వడ్డీతో కలిపి చెల్లిస్తున్నారు. మహిళలకు వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం తిరిగి వడ్డీ డబ్బులను వారికి అందజేస్తోంది. అయితే.. చివరి సారిగా 2025 జనవరి వరకు వడ్డీ డబ్బులు వాపస్ చేసింది. ప్రస్తుతం 2025 ఫిబ్రవరి నుంచి 2025 నవంబర్ వరకు కలిపి మొత్తం పది నెలల వడ్డీని మహిళా సంఘాలకు అందజేసింది. త్వరత్వరగా వడ్డీ డబ్బులు ప్రభుత్వం వాపస్ చేయడంతో మహిళా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. -
రైతు ఆశీర్వాద సభకాదు.. శాపనార్థాల సభ
వేల్పూర్: సీఎం రేవంత్రెడ్డిని రైతులు ఎందుకు ఆశీర్వదించాలని.. రుణమాఫీ చేయనందుకా, రైతుబంధు ఎగ్గొట్టినందుకా, యూరియా ఇవ్వనందుకా? దేనికి రైతులు ఆశీర్వదించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుంటే సీఎం రేవంత్రెడ్డి మాత్రం కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని విమర్శించారు. శిల్పకళా వేదికలో మంగళవారం నిర్వహించింది రైతుల ఆశీర్వాద సభ కాదని, అది శాపనార్ధాల సభ అని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క హామీనైనా సంపూర్ణంగా అమలు చేయకపోవడం మాట తప్పడం కాదా అని నిలదీశారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆర్భాటాలు, వృథా ఖర్చులు లేకుండా కేవలం ఒక్క ప్రెస్మీట్ ద్వారా 11 సీజన్లలో రూ.73 వేల కోట్ల రైతుబంధు నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు. నాయకులు రేగుంట దేవేందర్, జైడి నాగధర్రెడ్డి, కల్లెడ ఏలియా, ఆర్మూర్ మహేశ్, బద్దం చిన్నారెడ్డి, రేగుల్ల రాములు, బద్దం అశోక్, కుంట ప్రతాప్రెడ్డి, పవన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
● డీఈవో అశోక్కుమార్ మాక్లూర్: మండలంలోని ధర్మోరా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను డీఈవో అశోక్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకున్నారు. విద్యార్థుల సమాధానాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో ఇటీవల ఒకే రోజు 50 మంది పిల్లలు చేరికపై డీఈవో హర్షంవ్యక్తం చేశారు. పిల్లలను ప్రయివేటు స్కూళ్లలో చేర్పించకుండా స్థానికంగా ఉన్న ప్రభుత్వ బడిలో చేర్పించిన జీపీ పాలకవర్గం, గ్రామస్తులను అభినందించారు. విద్యార్థులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సరైన విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. డీఈవో వెంట సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగేశ్, కాంప్లెక్స్ హెచ్ఎం అశోక్, పాఠశాల హెచ్ఎం శంకర్, ఉపాధ్యాయుడు కపిల్దేవ్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఉన్నారు. -
క్రైం కార్నర్
మోపాల్ : మండలంలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయని ప్రశాంత్ (35) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్సై జాడె సుస్మిత బుధవారం తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. ప్రశాంత్ ఇటీవల సౌదీ అరేబియా నుంచి స్వగ్రామానికి వచ్చాడు. జూన్ 29న సాయంత్రం బంటి అనే వ్యక్తితో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆయన భార్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఇంటికి తీసుకురాగా, పరిస్థితి విషమించి 30న సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తల్లి దాయని శ్యామల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పాముకాటుతో మరో యువకుడు ..బోధన్రూరల్: మండలంలోని అమ్దాపూర్ గ్రామానికి చెందిన అంబం శ్రీకాంత్ (19) ఇంట్లో పాముకాటు వేయగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. బుధవారం మృతుడి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్అర్బన్: వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో పీ శ్రీనివాస్ అనే వ్యక్తి పేరిట నకిలీ అక్రెడిటేషన్ కార్డు చెలామణి అవుతున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎన్.పద్మశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. సదరు కార్డు సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా కార్యాలయం నుంచి జారీ చేయబడలేదని స్పష్టం చేశారు. అయితే, ఆ వ్యక్తి కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కార్డును తయారు చేసినట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఎవరైనా నకిలీ, బోగస్ అక్రెడిటేషన్ కార్డులు తయారు చేయడం, వినియోగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రతి పనికి వాట్సాప్ ఫొటో!
ఆర్మూర్:వైద్యారోగ్యశాఖలో పనిచేసే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి విధి నిర్వహణలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, సదరు ఉద్యోగి క్షేత్రస్థాయికి వెళ్లగానే విధులు నిర్వహించడం కన్నా పక్కనే ఉన్న వారిని పిలిచి తనను ఫొటో దింపమని బతిమిలాడుకోవాల్సి వస్తోంది. ఇలా దిగిన ఫొటో ను జిల్లాస్థాయి పర్యవేక్షణ అధికారి రూపొందించిన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తే గానీ ఆ రోజు హాజరుపడని దుస్థితి నెలకొంది.కాంట్రాక్టు ఉద్యోగి చేస్తు న్న పనితీరు ఆధారంగా కాకుండా వాట్సాప్ ఫొటో ఆధారంగా పనితీరును నిర్ధారించుకునే సంస్కృతిని అధికారులు కొనసాగించడంపై తీవ్ర వ్యతిరేకత వ స్తోంది. జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు అసలు ప నికన్నా ఫొటో పని ఎక్కువైపోయింది. రెవెన్యూ, వై ద్య ఆరోగ్య, విద్య, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఐసీడీఎస్ లాంటి వివిధ శాఖల్లో ఉన్నతాధికారులు ప్రతిరోజూ డ్యూటీ చేస్తున్న ఫొటోలు వాట్సాప్ గ్రూ పుల్లో పెట్టాలంటూ ఒత్తిడి చేస్తుండటంతో కాంట్రా క్ట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మ హిళా ఉద్యోగులకు ప్రతిరోజు ఫొటోలు దిగడం కా స్త ఇబ్బందికరంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల పరిధిలో వేధింపులు అధికం..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉపాధి హామీ, సమగ్ర శిక్ష, ఐసీడీఎస్, ఐకేపీ లాంటి పథకాల్లో ఈ వాట్సాప్ ఫొటోల వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో ఎక్కువగా రాష్ట్ర, జిల్లా స్థా యి అధికారులు డిప్యూటేషన్పై వచ్చిన రెగ్యులర్ ఉద్యోగులు కాగా మండలస్థాయితోపాటు జిల్లా కార్యాలయం సిబ్బంది మొత్తం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే. దీంతో రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నతాధికారులకు తమ పనితనం చూపించుకొనే క్రమంలో కిందిస్థా యి కాంట్రాక్టు ఉద్యోగులపై ఫొటో వేధింపుల కు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. బ యోమెట్రిక్, ఎఫ్ఆర్ఎస్ లాంటి హాజరునమో దు ప్రక్రియలు కొనసాగుతున్నప్పటికీ వాట్సా ప్ ఫొటోల గోల మాత్రం తప్పడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులకు ఇలాంటి ఆంక్షలు లేకపోవడం కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో అసహనం రేపుతోంది. అయితే వాట్సాప్ ఫొటోకు సంబంధించి ఉన్నతాధికారులు ఇప్పటి వరకు మౌఖిక ఆదేశాలే తప్ప అధికారికంగాా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం. వేధింపులతో విసిగిపోతున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉత్తర్వులు లేకపోయినా అధికారుల ఆదేశం ఇబ్బందిపడుతున్న మహిళా ఉద్యోగులు -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
నిజామాబాద్ అర్బన్: మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని మెడికల్ కౌన్సిల్ రాష్ట్ర చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాలు ఆరోగ్యమే కాకుండా భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్ధంగా చదివి ప్రతిభ చాటాలన్నారు. కార్యక్రమంలో మహిళా కళాశాల లెక్చరర్లు, విజయ్ పబ్లిక్ స్కూల్ చైర్పర్సన్ అమృతలత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
నిజామాబాద్ రూరల్ : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని, ఫీజు బకాయిలు చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ డిమాండ్ చేశారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాలతో మద్దతుతో గురువారం ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ తదితర కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉద్యమానికి సంపూర్ణంగా సహకరించాలని కాలేజీల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీంను యథావిధిగా అమలు చేయాలని, బకాయిలు చెల్లించాలని, ర్యాంకు నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం సభ్యులు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, చంద్రకాంత్, శ్రీలత, బగ్గలి అజయ్, లక్ష్మణ్ గౌడ్, రేఖ, అవుసుల రాము తదితరులు పాల్గొన్నారు. ● బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ ● నేడు కళాశాలల బంద్కు పిలుపు -
ఐడీవోసీలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు
నిజామాబాద్ రూరల్ : భూగర్భ జలాలను పెంపొందించేలా జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను నిర్మించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న జిల్లా పంచాయతీ రీసోర్స్ సెంటర్ భవనంలోని రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఏ మేరకు భూగర్భ జలాలు వృద్ధి చెందాయి, నిర్మాణానికి అయిన వ్యయం ఎంత తదితర వివరాలను ఆరా తీశారు. ఇదే తరహాలో ఐడీవోసీలోనూ అనుకూలమైన చోట రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల వల్ల వర్షపు నీరు వృధా కాకుండా భూగర్భ జలాలు ఎంతో వృద్ధి చెందుతాయని అన్నారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సాయాగౌడ్ తదితరులు ఉన్నారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
● ఐదుగురికి గాయాలు డిచ్పల్లి : మండలంలోని సాంపల్లి శివారు 44వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాల య్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూరు మండలం రాంచంద్రాపల్లి గ్రామాని కి చెందిన మహిళలు ఆటోలో ఇందల్వాయి మండలం వచ్చి సాయంత్రం తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. సాంపల్లి క్రాస్రోడ్డు వద్దకు రాగానే ముందు వెళుతున్న బైక్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. దీంతో బైక్ను తప్పించబోయి ఆటో రహదారిపై ఉన్న డివైడర్ను ఢీకొని పక్కకు ఒరిగింది. దీంతో ఆటోలో ఉన్న మహిళల్లో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి సైతం గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ : నగరంలోని 5వ టౌన్ పోలీస్స్టేషన్ పరిధి రేణుకానగర్ కాలనీ కట్టమైసమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో చొరబడిన దొంగలు హుండీలోని రూ. 6000, నగలు, అమ్మవారి రోల్డ్ గోల్డ్ నగలు అపహరించినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. ఆలయ చైర్మన్ నరేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఉర్దూ పాఠాలపై కొనసాగుతున్న విచారణ
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణం పెర్కిట్లోని ఓ ప్రయివేటు పాఠశాలలో ఉర్దూ బోధన అంశంపై విచారణ కొనసాగుతోంది. మండల విద్యాధికారి రాజగంగారాం బుధవారం పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు. విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, యాజమాన్యాన్ని విచారించారు. ఈ ఘటనపై ఇప్పటికే యాజమాన్యం, ఒక వర్గానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై పోలీసు కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఒకే భవనంలో ఒక పేరుతో అప్పర్ ప్రైమరీ స్కూల్, మరో పేరుతో హైస్కూల్కు అనుమతులు తీసుకొని పాఠశాలలు నిర్వహిస్తున్న తీరుపై సైతం ఎంఈవో విచారణ చేపట్టారు. పూర్తి నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామని ఎంఈవో రాజగంగారాం తెలిపారు. -
రైతు ఖాతాలో భరోసా
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో చిన్న, సన్న కారు రైతాంగానికి ఖరీఫ్ సీజన్ పంట పెట్టుబడి సాయం అందింది. రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. తొలి విడతగా మూడెకరాల లోపు భూమి కలిగిన రైతులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఈ నిధులను విడుదల చే సింది. బుధవారం వరకు ఎకరానికి రూ.6వేల చొప్పున జిల్లా వ్యాప్తంగా 2,19,892 మంది రైతుల ఖాతాల్లో రూ.164.23 కోట్ల నిధులు డిజిటల్ పద్ధతిలో (డీబీటీ) జమ అయినట్లు జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి వెల్లడించారు. భరోసా నిధులు జమ అయినట్లు సెల్ఫోన్లకు సందేశాలు వస్తుండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రస్తు తం ఖరీఫ్ సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో పంట పెట్టుబడి సాయం అందడంపై సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విత్తనా లు, ఎరువుల కొనుగోళ్లకు, కూలీల ఖర్చులకు ఆర్థి కంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, అ ప్పుల బాధల నుంచి కొంత ఉపశమనం లభించిందని జిల్లా రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మూడెకరాలు పైబడిన వారికి కూడా ప్రభు త్వం విడతల వారీగా భరోసా నిధులు ఇవ్వనుంది. నియోజకవర్గాల వారీగా వివరాలు మూడు ఎకరాల వరకు అందిన పెట్టుబడి సాయం జిల్లాలోని 2,19,892 మంది అన్నదాతలకు.. రూ.164.23 కోట్లు జమ -
ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి
● కలెక్టరేట్ ఎదుట ధర్నా నిజామాబాద్అర్బన్: నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్, న్యూడెమో క్రసీ, ఆరెస్పీ పార్టీల ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ిపీ సుధాకర్, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ నగర కార్యదర్శి ఎంసుధాకర్ మాట్లాడుతూ నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి, గుడిసెలు లేని రాజ్యం తెస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడం లేదన్నారు. బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుందని విమర్శించారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు ఓమయ్య, రఘురాం, లింగం, విఠల్, పెద్ది వెంకటరాములు, సుజాత, శివరాజ్, గంగారెడ్డి, అనిల్, నరేశ్, అమూల్య, రఫీక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
రివర్స్ సింగింగ్లో నవీన్ దిట్ట
● దాదాపు 75కి పైగా పాటలు పాడిన గాయకుడు ● అవార్డులు, పురస్కారాలతో సత్కరించిన పలువురు నిజామాబాద్ రూరల్: సాధారణంగా గాయకులు పాటలను ఆలపిస్తారు. కానీ ఒక పాటను మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు రివర్స్లో, అదే లయ, అదే భావంతో ఆలపించడం అత్యంత అరుదైన కళ. అలాంటి కళలో నిజామాబాద్లోని వినాయక్ నగర్కు చెందిన నవీన్ విశిష్ట ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపుపొందాడు. రివర్స్ గేర్ నవీన్ ప్రాచుర్యం పొందాడు. ‘నీలి నీలి ఆకాశం’ పాట, ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘పొలంగట్టు దుమ్ములోన’, మగధీరలోని ‘పంచదార బొమ్మ’, రంగస్థలంలోని ‘రంగమ్మ మంగమ్మ’, వంటి పాటలను రివర్స్లో ఆలపించి విశేష ఆదరణ పొందారు. హిందీలో ‘కజరారే’, ‘ఖైకే పాన్ బనారస్ వాలా’ వంటి పాటలను సైతం అద్భుతంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. భాషపై పట్టు.. ఇది కేవలం వినోదం కాదు. అపారమైన జ్ఞాపకశక్తి, భాషపై పట్టు, సంగీతంపై అవగాహన, గంటల తరబడి సాధన ఉంటేనే సాధ్యమయ్యే కళ. పలు టెలివిజన్ ఛానళ్లలో తన ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. కళారంగంతోపాటు విద్యారంగం.. కళాకారుడిగానే కాకుండా జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యాసంస్థల్లో గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకోవడం ఆయన విద్యాసేవలకు నిదర్శనం. అదేవిధంగా భగవద్గీత ప్రవచనకర్తగా, యోగ ప్రచారకుడిగా సమాజంలో విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. నవీన్ కుమార్కు ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య విశ్వకీర్తి–విశ్వస్ఫూర్తి పురస్కారం లభించింది. నేషనల్ ప్రీమియర్ అవార్డ్స్ 2021–22, 2023–24,2024–25లో అందుకున్నారు. 32 సార్లు ఉగాది పురస్కారాల గ్రహీత, అలాగే స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు 2025 పొందారు. 80కి పైగా కవి సమ్మేళనాలలో సన్మానాలు పొందారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. ప్రతిభను వెలికితీసిన ప్పుడే వ్యక్తి గొప్పదనం బయటపడుతుంది. అప్పుడే సమాజంలో ఆ వ్యక్తి ఉన్నతంగా, ఆదర్శంగా నిలుస్తాడు. అలాగే జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడతాడు. ప్రతిభ అనేది ఎవ్వరి సొత్తుకాదు. ప్రయత్నిస్తే ప్రపంచంలో ఏ పని అయినా సులభంగా చేయగలం. – నవీన్, నిజామాబాద్ -
అయినకాడికి ఆక్రమణ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని వర్ని అటవీ రేంజ్ పరిధిలో ఉన్న చందూర్, మోస్రా, నిజామాబాద్ సౌత్ రేంజ్లోని కాల్పోల్, మంచిప్ప ప్రాంతాలతోపాటు మోపాల్, ఇందల్వాయి అటవీ రేంజ్ పరిధిలో విచ్చలవిడిగా అటవీ భూముల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. సిరికొండ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రావుట్ల సెక్షన్లో అటవీ భూముల ఆక్రమణపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. అటవీ భూములను సంరక్షించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కలెక్టరేట్ ఎదుట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రావుట్ల సెక్షన్లో ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీ అధికారులు బుధవారం రంగంలోకి దిగి ఆపరేషన్ను పూర్తి చేశారు. ఉద్రిక్తతకు అవకాశం లేకుండా ఏకంగా 200 మందికిపైగా పోలీసులు, అటవీశాఖ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. 55 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అటవీ కందకాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం రావుట్ల సెక్షన్ పరిధిలో ఆక్రమణలపై దృష్టి సారించి చర్యలు తీసుకున్న అధికారులు జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో భూముల సంరక్షణకు ఏ విధంగా ముందుకు వెళ్తారనేదానిపై చర్చ సాగుతోంది. అధికారుల కుమ్మక్కుతో.. రావుట్ల సెక్షన్ పరిధిలో అటవీ భూముల ఆక్రమణల వెనుక స్థానిక అటవీ అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎకరం, రెండు ఎకరాల చొప్పున పోడు భూములు ఉన్న రైతులకు సరిహద్దులోని మరింత భూమిని ఆక్రమించేందుకు ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అందినకాడికి దండుకుని బోర్లు తవ్వి విద్యుత్మోటార్లు ఏర్పాటు చేసుకునేందు అనధికార అనుమతులు ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతానికే చెందిన పోలీసు సిబ్బందిలో ఒకరు అటవీ అధికారులతో కుమ్మకై ్క పెద్ద ఎత్తున అటవీ భూముల ఆక్రమణలు ప్రోత్సహించారని ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే కమ్మర్పల్లి అటవీ రేంజ్ భీమ్గల్ మండల పరిధిలో అటవీ భూముల ఆక్రమణలను ప్రోత్సహించినందుకు అటవీ శాఖ అధికారిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. అటవీ భూముల రక్షణకే చర్యలు.. అటవీ భూముల్లో అక్రమంగా సాగుచేసుకుంటున్న, ఆక్రమణలపైనే చర్యలు తీసుకుంటున్నాం. సిరికొండ మండలంలోని రావుట్ల రేంజ్లో ఇప్పటికే 55 ఎకరాల వరకు స్వాధీనం చేసుకున్నాం. ఈ మేరకు అటవీ భూముల్లో యంత్రాలతో ట్రెంచింగ్ పనులు పూర్తిచేశాం. పట్టా పాస్బుక్కులు, పోడు హక్కులు లేని భూముల్లోనే కందకాల తవ్వకం చేపట్టాం. – చంద్రశేఖర్రావు, ఎఫ్డీవో, ఆర్మూర్ఏళ్లుగా సాగులో ఉన్నాం.. మేం పదేళ్లకు పైగా భూమిని సాగు చేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో సాగుచేసుకున్నవి కావు. ఈ ఎకరం తప్ప మాకు ఎక్కడా భూమి లేదు. ఏళ్లుగా ఈ భూమినే నమ్ము కుని బతుకుతున్నాం. అటవీ అధి కారులు బుధవారం ఉన్న భూమిని లాక్కోవడంతో మాకు జీవనోపాధి లేకుండా పోయింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని, మాకు హక్కులు కల్పించాలి. – రంగయ్య, జంగిలోడి తండా, సిరికొండ మండలం యథేచ్ఛగా అటవీ భూముల కబ్జా సంరక్షణకు చర్యలు చేపడుతున్న ఫారెస్ట్ అధికారులు సిరికొండ రేంజ్ రావుట్ల సెక్షన్లో 55 ఎకరాల భూమి స్వాధీనం జిల్లాలోని మిగతా చోట్ల ఆక్రమణలపైనా చర్యలుంటాయా? -
నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి
సిరికొండ: నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని నిజామాబాద్ సీపీ సాయిచైతన్య అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం సీపీ వార్షిక తనిఖీలు నిర్వహించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసు ల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేషన్లో అమలవుతు న్న 5ఎస్ విధానం తీరును సమీక్షించి, ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అ ధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తె లిపారు. సిరికొండకు సరిహద్దులో ఉన్నటువంటి జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారులపై నిఘా పటిష్టపరచాలని తెలిపారు. సిబ్బంది 24/7 స్థానికంగా అందుబాటులో ఉండాలని తెలిపారు. అనంతరం స్టేషన్ ఆవరణలో సీపీ మొక్క నాటారు. నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్యాదవ్, ధర్పల్లి సీఐ భిక్షపతి, సీసీఆర్బీ సీఐ అంజయ్య, స్థానిక ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు. ● సీపీ సాయిచైతన్య ● సిరికొండ పోలీస్స్టేషన్ తనిఖీ -
అతుక్కుపోయారు
నిజామాబాద్కుర్చీలకు నిఘా వ్యవస్థ.. నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని నిజామాబాద్ సీపీ సాయిచైతన్య అన్నారు.బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026– 8లో uడిచ్పల్లి(నిజామాబాద్రూరల్): జక్రాన్పల్లి మండలం అర్గుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి జూలై 2009 నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. 16 సంవత్సరాల 10 నెలలు గడిచినా ఆయనను ప్రభుత్వం బదిలీ చేయలేదు. వేల్పూర్ మండలం రామన్నపేట్ సహకార సొసైటీ కార్యదర్శి రణవీర్ గత 31 సంవత్సరాలుగా అదే సొసైటీలో పని చేస్తున్నారు. జిల్లాలో సింహభాగం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఏళ్లుగా ఒకేచోట కొనసాగు తున్న సొసైటీ కార్యదర్శులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత మే నెలలో జీవో నెంబరు 82 తీసుకొచ్చినా సహకార సంఘాల కార్యదర్శుల బదిలీల ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. ● జిల్లాలో 89 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. అత్యధిక సొసైటీల్లో కార్యదర్శు లు సంవత్సరాలుగా కుర్చీలకు అతుక్కుపోయారు. దశాబ్దాలుగా అక్కడే పని చేయడం వల్ల కార్యదర్శులపై విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు కార్యదర్శులు రాజకీయాలలో సైతం జోక్యం చేసుకుంటూ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా కీలకపాత్ర పోషిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. కొన్ని సహకార సంఘాలు నష్టాల్లో నడవడానికి కార్యదర్శులే కారణమవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల 204–25 ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి 5లక్షల నిధుల దు ర్వినియోగం జరిగినట్లు ఆడిట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా జక్రాన్పల్లి మండలం అర్గుల్ సొసైటీ గత కొన్నేళ్లుగా నష్టాల్లో నడుస్తోంది. సొసై టీ 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 21.31 లక్షల నష్టం చవిచూసింది. గతంలో వేల్పూర్ మండలం పడగల్, కోటగిరి మండలం ఎత్తోండ, తాళ్ల రాంపూర్ సొసైటీ లతోపాటు మాక్లూర్ సొసైటీల్లో పలు అవినీతి, అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు, ఎరువుల పంపిణీ, నకిలీ రుణాలు, రుణాల రికవరీలో చేతివాటం, తాకట్టులో ఉన్న బంగారం మాయం తదితర అక్రమాలతో సొసైటీల్లో అక్రమాలకు పాల్పడ్డారు.జిల్లాలోని అత్యధిక సొసైటీల్లో కార్యదర్శులు బదిలీలు కాకుండా దశాబ్దాల తరబడి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పడగల్, ఎత్త్తొండ, తాళ్ల రాంపూర్, మాక్లూర్ సొసైటీల్లో అక్రమాలు జరిగాయి. ధాన్యం కొనుగోలు, ఎరువుల పంపిణీ, నకిలీ రుణాలు, రుణాల రికవరీలో చేతివాటం, తాకట్టులో ఉన్న బంగారం మాయం తదితర అక్రమాలు వెలుగు చూశాయి. జిల్లాలోని జక్రాన్పల్లి, ధర్పల్లి, వేల్పూర్, సిరికొండ, ఆర్మూర్ వ్యవసాయ సహకార సంఘాలలో రైతుల సభ్యత్వం, వాటాధనం ఎక్కువగా ఉంటుంది. ఈ మండలాల పరిధిలో సొసైటీ కార్యదర్శులు ఏళ్లుగా అక్కడే తిష్ట వేశారు. వేల్పూర్ మండలం రామన్నపేట సొసైటీ కార్యదర్శి 31 ఏళ్లుగా, పడగల్ సొసైటీ కార్యదర్శి 15 ఏళ్లుగా, వేల్పూర్ సొసైటీ కార్యదర్శి 13 ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారు. ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ సొసైటీ కార్యదర్శి 15 ఏళ్లుగా, డిచ్పల్లి మండలం రాంపూర్ సొసైటీ కార్యదర్శి అత్యధికంగా 37 ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ సొసైటీ కార్యదర్శి 33 ఏళ్లుగా అక్కడే పని చేస్తున్నారు. ఇలా జిల్లాలో 25 మంది సొసైటీ కార్యదర్శులు దశాబ్దాలుగా ఒకే చోట పని చేస్తూ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న సొసైటీ కార్యదర్శులు జీవోనెంబర్ 82 అమలు చేయని వైనం కార్యదర్శులపై పలు అవినీతి ఆరోపణలు ఫలితంగా నష్టాల్లో నడుస్తున్న సొసైటీలు -
అధికారుల పనితీరులో మార్పు రావాలి : ఎమ్మెల్యే ధన్పాల్
నగర పాలక సంస్థలో ఆయా విభాగాల అధికారుల్లో మార్పు రావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. కార్పొరేటర్లు ఫోన్ చేసినా, నేరుగా కలిసి విన్నవించినా కొందరు అధికారులు స్పందించడంలేదని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. స్పెషల్ ఫండ్ లేకపోవడంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కళాభారతి తదితర పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయన్నారు. నిజామాబాద్కు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. యూడీఎఫ్ కింద రూ.400 కోట్లు వచ్చే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించి డీపీఆర్ తయారు చేయించామన్నారు. కేంద్ర పథకం కింద రూ.200 కోట్ల కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో యూజీడీ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయన్నారు. -
భూమి సంరక్షణ చర్యలు చేపట్టాలి
మోపాల్: రైతులు భూమి సంరక్షణ చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా ఎరువుల వాడకం యూరియా, డీఏపీ వినియోగం తగ్గించాలని ఆత్మ పీడీ తిరుమల ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. ఎల్నినో కారణంగా వర్షపాతం తక్కువ నమోదవుతుందని నీటి సదుపాయాలను బట్టి ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ హిందూధర్రెడ్డి, ఎంపీడీవో రాములునాయక్, ఎంపీవో కిరణ్కుమార్, ఏఈవో రంజిత్, ఆత్మ బీటీఎం, అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడికి పంపితే ఇంటి పన్ను రద్దు
● జీజీ నడ్కుడ గ్రామ పంచాయతీ తీర్మానం డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి డొంకేశ్వర్ మండలంలో మరో గ్రామ పంచాయతీ ముందుకొచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలకు పంపితే రెండేళ్ల పాటు ఇంటి పన్నును రద్దు చేస్తామని జీజీ నడ్కుడ గ్రామ పంచాయతీ ప్రకటించింది. ఈమేరకు సర్పంచ్ బట్టు సంజీవ్రాజ్, ఉప సర్పంచ్ కోరొళ్ల మహిపాల్, కార్యదర్శి మౌనిక, వార్డు సభ్యులు కలిసి మంగళవారం జీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి తీర్మానించారు. పిల్లలను పంపకపోతే మన ఊరి బడి తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిని కాపాడుకునే బాధ్యత ఊరి ప్రజలందరిపై ఉందన్నారు. కావునా ప్రభుత్వ పాఠశాలకే పిల్లలను పంపి రెండేళ్ల పాటు ఇంటి పన్ను రద్దు ఆఫర్ను పొందాలని సర్పంచ్ కోరారు. అయితే, ఇలాంటి నిర్ణయమే ఇటీవల మండలంలోని తొండాకూర్ గ్రామ పంచాయతీ కూడా తీసుకుంది. -
రాజకీయాలకు అతీతంగా..
● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి రాజకీయాలకు అతీతంగా నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని భూపతిరెడ్డి తెలిపారు. టీయూఎఫ్ఐడీసీ, నుడాకు సంబంధించిన రూ.91 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ప్రజలకు మెరుగైన, మౌలిక వసతుల కల్పనకు నగర పాలక సంస్థ దృష్టిసారించాలని పేర్కొన్నారు. నిజామాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు, స్మార్ట్సిటీ, పట్టణ ప్రణాళిక రూపకల్పనపై చేసిన తీర్మానాలకు నగర పాలక సంస్థ ఆమోదం తెలిపిందని భూపతిరెడ్డి పేర్కొన్నారు. -
భూభారతి రీ సర్వేకు ప్రజలు సహకరించాలి
● సర్వే అండ్ లాండ్స్ ఏడీ శ్రీనివాస్ డిచ్పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూముల రీసర్వే ప్రక్రియకు గ్రామస్తులందరూ సహకరించాలని జిల్లా సర్వే అండ్ లాండ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కోరారు. మంగళవారం డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం భూభారతి రీసర్వే పైలట్ గ్రామాలుగా డిచ్పల్లి మండలంలోని కమలాపూర్, ఆరేపల్లి గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ముందుగా గ్రామ సభ నిర్వహించి 15 రోజుల తర్వాత ఫీల్డ్ సర్వే ప్రారంభిస్తామన్నారు. మొదటి విడత గ్రామంలోని ఇండ్లు, తర్వాత గ్రామ కంఠం, ప్రభుత్వ భూముల వివరాలను నిర్ణయిస్తారని తెలిపారు. అనంతరం సర్వే నంబరు ప్రకా రం ఎంజాయ్మెంట్ సర్వే చేస్తారని తెలిపారు. రైతులు తమ మోకాపై ఉన్న భూములను చూయించి, సర్వే సిబ్బందికి పట్టాపాసుబుక్కు జిరాక్స్ ప త్రాలు అందజేయాల్సి ఉంటుందన్నారు. క్షేత్రస్థా యి సర్వే పూర్తి చేసిన అనంతరం జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రచురిస్తారని వివరించారు. అ భ్యంతరాలుంటే 60 రోజుల్లోపు అప్పీలు చేసుకునే అవకాశం కల్పిస్తారని తెలిపారు. గ్రామానికి చెంది న రైతులు, గ్రామస్తులు సహకరించాలని విన్నవించారు. గ్రామ సర్పంచ్ రుత్విజ, తహసీల్దార్ కే.సతీ ష్రెడ్డి, సర్వేయర్ సూర్యప్రకాష్, డిప్యూటీ ఇన్స్పెపెక్టర్ ఆఫ్ సర్వే జగన్నాధం, సూపరింటెండెంట్ జగదీష్, సర్వేయర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సంఖ్య మరింత పెంచాలి
● విద్యాశాఖ ఆర్జేడీ ఉషారాణి మోపాల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఉషారాణి తెలిపారు. మంగళవారం నగరశివారులోని బోర్గాం(పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీఈవో, సెక్టోరియల్ ఆఫీసర్లు, ఎంఈవోలతో విద్యార్థుల ఎన్రోల్మెంట్పై సమీక్ష నిర్వహించారు. మండలాలవారీగా గతేడాది కంటే ఎంతమేరకు విద్యార్థుల సంఖ్య పెరిగిందని అడిగి తెలుసుకున్నారు. డీఈవో అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు మరింత కృషి చేయాలని సూచించారు. గతేడాది కంటే అదనంగా పదిశాతం సంఖ్య పెంచిన ప్రధానోపాధ్యాయులను సత్కరించారు. మొక్క నాటిన ఆర్జేడీ.. బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ను తనిఖీ చేసిన ఆర్జేడీ ఉషారాణి పాఠశాల ఆవరణలో డీఈవో అశోక్తో కలిసి మొక్కను నాటారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 1080 ఉన్నందుకు అభినందనలు తెలియజేశారు. పాఠశాలలో ఇంకా అడ్మిషన్లు పెరిగే అవకాశముందని హెచ్ఎం శంకర్ తెలిపారు.హెచ్ఎంలను సన్మానించిన ఆర్జేడీ ఉషారాణి -
దేశ ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేసే సీఏలు
ఆర్మూర్: వైద్యులు మానవ శరీరానికి చికిత్స చే స్తే.. చార్టర్డ్ అకౌంటెంట్లు దేశ ఆర్థిక వ్యవస్థకు చికి త్స చేస్తారు. భారత ఆర్థిక రంగానికి వీరు వెన్నె ముక వంటివారు. నేడు జాతీయ ’చార్టర్డ్ అకౌంటెంట్ల’ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. 1949 జూలై 1న పార్లమెంట్ చట్టం ద్వారా ’ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ (ఐసీఏఐ) ఏర్పడింది. ఐసీఏఐ స్థాపన రోజును పురస్కరించుకుని ఏటా జూలై 1న ’సీఏ డే’ జరుపుకుంటున్నాం. 2026 నాటికి దేశంలో 4 లక్షల మందికి పైగా సీఏలు ఉన్నట్లు అంచనా. జి ల్లాలో సుమారు 40 మంది ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అ కౌంటెంట్లు ఉన్నారు. జిల్లా ఐసీఏఐ బ్రాంచ్ పరిధి లో సుమారు వంద మందికి పైగా సీఏ విద్యా ర్థులు శిక్షణ పొందుతున్నారు. సీఏలు టాక్స్ ఫై లింగ్ మాత్రమే కాదు. కంపెనీ ఆడిట్, బ్యాంకు లోన్ ప్రాజెక్ట్ రిపోర్టులు, స్టార్టప్లకు ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫోరెన్సిక్ ఆడిట్, ప్రభుత్వ శాఖలకు కన్సల్టెన్సీ. ఒక మాటలో చెప్పాలంటే దేశంలో ’బ్లాక్ మనీ’ని ’వైట్’గా మార్చేది, ’వైట్ మనీ’ని కాపాడేది సీఏలే. ‘టాక్స్ కట్టడం దేశభక్తి. కానీ చట్ట ప్రకారం కట్టాల్సిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ కట్టొద్దు. అదే మా డ్యూటీ‘ అని సీఏలు పేర్కొంటున్నారు. ఇలా దేశ ప్రగతి కోసం పాటుపడే చార్టర్డ్ అకౌంటెంట్లకు ఈరోజు సెల్యూట్ చేద్దాం. -
యూజీడీ, అమృత్ పనులు వేగిరం చేయాలి
● ప్రమోద్కుమార్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్లీడర్ నగరంలో రూ.160 కోట్లతో చేపడుతున్న యూజీడీ పనులు, రూ.217 కోట్లతో చేపడుతున్న అమృత్ పనుల్లో వేగవంతం చేయాలని ప్రమోద్కుమార్ డిమాండ్ చేశారు. యూజీడీ వర్క్లు కేవలం 9 శాతం, అమృత్ పనులు 20 శాతం మాత్రమే పూర్తయ్యాయని, గడువులోపు పూర్తి చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మాధవనగర్ ఆర్వోబీకి కేవలం రూ.15 కోట్లు వెచ్చిస్తే పూర్తవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావడంలేదన్నారు. రూ.15 కోట్లు వెచ్చించని ప్రభుత్వం ఫ్యూచర్సిటీని నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. -
చికిత్స పొందుతూ ఉపాధ్యాయురాలు మృతి
ఆర్మూర్టౌన్: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. పెర్కిట్లోని కేవీఆర్ కాలనీకి చెందిన గౌతమి(37) ప్రభుత్వ ఉ పాధ్యాయురాలుగా విధులు నిర్వహించేది. కొన్ని రో జులుగా మానసిక ఒత్తిడి కారణంగా అనారోగ్యాని కి గురైంది. ఎన్ని ఆస్పత్రుల్లో చూయించినా ఆమె ఆరోగ్యంలో మార్పు రాలేదు. ఈక్రమంలో ఈనెల 28న ఽమధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేనిసమయంలో ఆమె యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. భర్త రాజు ఆమె ను వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాగ మంగళవారం చికిత్స పొందుతూ ఉదయం మృతిచెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
రైతు భరోసా విడుదల చేసిన సీఎం
● నడిపల్లి రైతు వేదికలో రైతులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించిన కలెక్టర్డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని శిల్పకళా వేదిక నుంచి ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను మంగళవారం లాంఛనంగా విడుదల చేశారు. సుమారు 73.32 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.9 వేల కోట్లలను తొమ్మిది రోజుల వ్యవధిలోనే జమ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు వేదికల నుంచి రైతులు ఆసక్తితో వీక్షించా రు. ఇందులో భాగంగా డిచ్పల్లి మండలం నడిపల్లి రైతు వేదిక నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి తదితరులు స్థాని క రైతులతో కార్యక్రమాన్ని తిలకించారు. కార్యక్రమంలో డిచ్పల్లి తహసీల్దార్ సతీష్రెడ్డి, రూరల్ ఏడీఏ కృష్ణ, ఏవో ఆంజనేయులు, సర్పంచులు కులాచారి అశ్విని, వాసుబాబు, భాస్కర్, శ్రీనివాస్, శాంతిలా ల్, లక్ష్మణ్, రవి, ఏఎంసీ డైరక్టర్ గంగారెడ్డి, సొసై టీ చైర్మన్ రామకృష్ణ పాల్గొన్నారు. -
అనుమతిలేని విద్యాసంస్థ సీజ్
డిచ్పల్లి: మండలంలోని బర్ధిపూర్ శివారులోగల కే శాపూర్ రోడ్డులో ఇటీవల ఏర్పాటు చేసిన ఓ ప్ర యివేట్ స్కూల్/కళాశాలను అనుమతి లేదంటూ ఎంఈవో నరేష్ సీజ్ చేశారు. అంతకుముందు టీ జీవీపీ, యూఎస్ఎఫ్ఐ, ఏఐఎఫ్డీఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సదరు విద్యాసంస్థను ముట్టడించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యా సంస్థను నడిపిస్తున్నారని పేర్కొంటూ ధర్నా నిర్వహించారు. విద్యాసంస్థ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న డిచ్పల్లి ఎస్సై ఆరీఫ్ తన సిబ్బందితో పాఠశాలకు చేరుకుని వి ద్యార్థి సంఘాల నాయకులను సముదాయించా రు. ఈవిషయమై ఎంఈవోకు ఫిర్యాదు చేయగా, అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తే చ ర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించినట్లు తెలిపారు. అలాగే జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవికుమార్ సైతం ఎలాంటి అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు కళ్యాణ్, సూరి, రాజశేఖర్, నాగరాజు, మహేష్, కెవిన్, వినోద్ పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాల స్టోర్ రూమ్.. వర్ని: చందూర్ మండల కేంద్రంలోని శ్రీ సాయి హైస్కూల్ లో స్టోర్ రూమ్ ను మంగళవారం మండల విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్, టై, బెల్టు లు విక్రయిస్తున్నారని ఏబీవీపీ నాయకుల ఫిర్యాదు మేరకు పాఠశాలలో తనిఖీలు నిర్వహించి స్టోర్ రూమ్ ను సీజ్ చేశారు. నాయకులు దర్శనం ప్రవీణ్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
తెల్లకోటు దేవుళ్లకు వందనం
● ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లు దైవంతో సమానం ● నేడు జాతీయ వైద్యుల దినోత్సవంఆర్మూర్ : ‘దేవుడు కనిపించడు కాబట్టి డాక్టర్లను పంపాడు’ అనే మాట అక్షర సత్యం. తల్లిదండ్రు లు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. ఎవరైనా అ నారోగ్యానికి గురైనా, ప్రమాదంలో గాయపడినా, అత్యవసర పరిస్థితులో ఉన్నా.. తెలిసిన వెంటనే తమ గురించి పట్టించుకోకుండా తక్షణ చికిత్స అందిస్తారు డాక్టర్లు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్లైన్ వారియర్స్గా సేవలందించి లక్షలాది మందిని కాపాడారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతి రెండూ జూలై 1నే. పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా, గొప్ప వైద్యుడిగా ఆయన చేసిన సేవలకు గుర్తుగా 1991 నుంచి జూలై1 రోజును ’నేషనల్ డాక్టర్స్ డే’గా జరుపుకుంటున్నాం. ఈ రోజు కేవలం వైద్యులకు శుభాకాంక్షలు చె ప్పుకునే రోజు కాదు. ప్రతి డాక్టర్ జీవితంలోని కనిపించని కోణాన్ని తెలుసుకునే రోజు. జిల్లాకేంద్రంలోని ఓ వైద్యుడు రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపీ చూసి, ఇంటికి వెళ్తాడు. రాత్రి భోజనం చేస్తుండగా ఎమర్జెన్సీ కాల్ రావడంతో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుర్రాడికి వేకువజాము వరకు శస్త్రచికిత్స చేసి, కాపాడుతాడు. మర్నాడు ఉద యం మళ్లీ ఓపీకి వస్తాడు. ‘డాక్టర్ అయ్యాక నిద్ర మనది కాదు సార్. పేషెంట్ ప్రాణం మనది‘ అని నవ్వుతూ చెప్పారాయన. వైద్య వృత్తి కారణంగా కుటుంబ పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ అలుపెరగకుండా ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలాంటి వైద్యులకు తప్పకుండ వందనం చేయాల్సిందే. -
నగరాభివృద్ధికి కట్టుబడి..
● పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ సుభాష్నగర్: నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి మనిషికి మౌలిక వసతుల కల్పన, అర్హులకు సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నగర మేయర్ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. అభివృద్ధి పనుల కోసం ఒక్కో డివిజన్కు రూ.20లక్షలు మంజూరు చేస్తామని ఆమె ప్రకటించారు. మంగళవారం నిజామాబాద్ నగర పాలక సంస్థ మొదటి కౌన్సిల్ సమావేశం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మేయర్ ఉమారాణి అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ ఎజెండా అంశాలను తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా ఇటీవల రూ.70 లక్షలతో నగరంలో చేపట్టిన మురు గు కాల్వలు, డ్రెయినేజీ నిర్వహణ, పారిశుధ్య పనులను వివరించారు. చేపడుతున్న అభివృద్ధి పనులను తెలిపారు. చెత్త సేకరణ, పారిశుధ్య కార్మి కుల కొరత, శానిటేషన్పై బీజేపీ కార్పొరేటర్లు నిల దీయగా, మేయర్, మున్సిపల్ కమిషనర్, ఆయా విభాగాల అధికారుల బుజ్జగింపులతో కౌన్సిల్ సమావేశం సాదాసీదాగా ముగిసింది. సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, బీజేపీ ఫ్లోర్లీడర్ ప్రమోద్కుమార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. సమస్యలపై నిలదీత.. కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు ఎజెండాకు ముందు తమ సమస్యలను వినాలంటూ పట్టుబట్టారు. దీంతో ప్రతి కార్పొరేటర్కు రెండు నిమిషాలచొప్పున మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ప్రధానంగా మురుగుకాల్వల పరిస్థితి, వాటర్ వర్క్స్, వీధిలైట్ల సమస్యలపై మాట్లాడారు. ఏఈలు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడంపై అధికారులను నిలదీశారు. శానిటేషన్ చాలా పెద్ద సమస్యగా మారిందని, ఒక్కో డివిజన్కు రూ.50 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీతోపాటు ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్లు అడిగిన పలు ప్రశ్నలు, లేవనెత్తిన అంశాలపై మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ సమాధానమిచ్చారు. కౌన్సిల్ తీర్మానాలు.. ● నగరంలోని కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్సులన్నింటికీ కొత్తగా టెండర్లు పిలవాలి. ● పారిశుధ్య కార్మికుల కొరత కారణంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను వెనక్కి పంపించాలి. ● ఒక్కో డివిజన్లో అభివృద్ధి పనులకు రూ.20 లక్షలు మంజూరు.. ● ఔటర్ రింగ్ రోడ్, స్మార్ట్సిటీ కోసం ప్రతిపాదనలు ● మాస్టర్ ప్లాన్కు అనుమతి ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. ● అర్బన్ చాలెంజ్ ఫండ్ కోసం డీపీఆర్లు సిద్ధం చేయాలి.మాట్లాడుతున్న నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతున్న మహేశ్కుమార్గౌడ్ కౌన్సిల్సమావేశానికి హాజరైన కార్పొరేటర్లు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతి నిధులు సమన్వయంతో పని చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సూచించారు. నగరాభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, డ్రెయినేజీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు శానిటేషన్ సిబ్బంది, డ్రెయినేజీల నిర్వహణ, రోడ్లు, వాటర్ సప్లయ్, తదితర విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. డివిజన్కు రూ.20 లక్షలు మంజూరు నగర మేయర్ కూరగాయల ఉమారాణి బీజేపీ కార్పొరేటర్ల నిలదీతలు.. అధికారుల బుజ్జగింపులు సాదాసీదాగా ముగిసిన ఎన్ఎంసీ కౌన్సిల్ సమావేశం -
ఆర్మూర్లో ఉద్రిక్తత
నిజామాబాద్ప్రజావాణికి ప్రాధాన్యమివ్వాలి ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్ట ర్ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2026– 8లో uఆర్మూర్ : ఆర్మూర్ పట్టణం పెర్కిట్లోని ఓ ప్రవేయిట్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు ఒక వర్గానికి చెందిన మత ప్రార్థనలు చేయించడంపై మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మత మార్పిడికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు పాఠశాలలో శనివారం ఆందోళన చేయడం, ఉపాధ్యాయులపై చేయి చేసుకోవడంతో హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన ఆ వర్గం నాయకులు ఆదివారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ముట్టడి చేసారు. సోమవారం విద్యా సంస్థల బంద్ పాటించి ఉపాధ్యాయులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేసారు. ర్యాలీ, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు. మరో వైపు బీజేపీ నాయకులు కూడా పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో ఆర్మూర్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు చర్యలో భాగంగా భారీ పోలీసు బలగాలను మోహరించారు. ర్యాలీలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి ఆర్మూర్కు వస్తున్న ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డిని భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పోలీసులను తప్పించుకొని ఆర్మూర్ పట్టణానికి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, మండల విద్యాధికారి రాజగంగారాంకు వేరు వేరుగా వినతి పత్రాలు సమర్పించి పాఠశాల యాజమాన్యం, మత ప్రార్థనలు చేయించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. జిల్లా సీపీ సాయి చైతన్య ఆర్మూర్ పట్టణంలో బీఎన్ ఎస్ 163ను మంగళవారం వరకు విధించారు. ఈ సెక్షన్ను అనుసరించి రెండు రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐదుగురు మించి గుంపులుగా ఉండటం ని షేధం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అనుమానితులను అదుపులోకి తీసుకొనే అవకాశం ఉంది. ఆర్మూర్ పట్టణంలోని పాఠశాలలో వివాదానికి సంబంధించి ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఆర్మూర్ తహసీల్దార్ స త్యనారాయణ ఫిర్యాదు మేరకు ప్రయివేట్ పాఠశా ల కరస్పాండెంట్, ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు న మోదు చేసారు. అదేవిధంగా బీజేపీ పట్టణ నాయ కులపై బీఎన్ఎస్ కింద వేరు వేరుగా కేసులు నమో దు చేసారు. రెండు ఘటనలపై ఆర్మూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు ఆర్మూర్ మండలం అంకాపూర్లోని ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి నివాసంలో బీజేపీ నాయకుడిని ఆర్మూర్ సీఐ సత్యనారాయణ తన పోలీసు బలగాలతో అదుపులోకి తీసుకున్నారు. సీపీ సాయి చైతన్య పెర్కిట్లోని ప్రయివేట్ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి ఆర్మూర్ టౌన్ : ఆర్మూర్ పట్టణం పెర్కిట్లోని ప్రయివేట్ పాఠశాలలో ఓ వర్గానికి చెందిన మత ప్రార్థనలు చేయించారని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ మీదుగా ఆర్మూర్ ఏసీపీ కార్యాలయం వరకు ర్యాలీలో సాగింది. అనంతరం ఏసీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్నా దినేష్ మాట్లాడారు. అనంతరం ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అక్కడి నుంచి ఆర్మూర్ మండల విద్యాధికారి కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించి ఎంఈవో రాజగంగారాంకు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో బీజేపీ నాయకులు కంచెట్టి గంగాధర్, పొల్కం వేణు, యామాద్రి భాస్కర్ పటేల్, కలిగోట ప్రశాంత్, దోండి ప్రకాష్, ద్యాగ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు అందించాలి
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డినిజామాబాద్ అర్బన్ : భారత ఎన్నికల సంఘం నిర్దేశిత కార్యాచరణ ప్రకారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్వోలు, ఎఈఆర్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, వివరాల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, పూరించిన తర్వాత సేకరించాలని, ఫారాల పంపిణీ ప్రక్రియను జూలై 1 నాటికి పూర్తి చేసి ప్రతి రోజూ పురోగతి నివేదికలను సమర్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే 72 శాతం ఎన్యూమరేషన్ ఫారంల పంపిణీ పూర్తయ్యిందన్నారు. జిల్లాలో మొత్తం 14,39,734 మంది ఓటర్లకు గాను 10,33,033 మంది ఓటర్లకు ఫారాల పంపిణీ జరిగిందని, మరో రెండు మూడు రోజులలో మిగతా 4,06,701 మంది ఓటర్లకు కూడా ఫారాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అర్బన్ ఏరియాలోనూ ఎస్ఐఆర్ అమలును వేగవంతం చేస్తామన్నారు. బీఎల్వో లు ఇంటింటికి తిరిగి ఫారంలు అందజేస్తున్నారని, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుపుతున్నారని అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, బీఎల్ఏలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ వి భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి రెండు సీట్లే
నిజామాబాద్ అర్బన్/నందిపేట్(ఆర్మూర్) : బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని కలలు కంటోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ ఎద్దేవా చేశారు. బీజేపీ ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలువదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒకటి, రెండు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. సర్ పేరిట బీజేపీ కుట్రలు, కుతంత్రాలను తెలంగాణలో సాగనివ్వమన్నారు. ఓట్ల చోరీని అడ్డుకుంటామన్నారు. సోమవారం మహేశ్ గౌడ్ నిజామాబాద్లో ఒలింపిక్ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో, నందిపేటలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పై బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు పేరు నమోదు చేయడంతో పాటు అనర్హుల పేర్లు తొలగించేలా బీఎల్ఏలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కేటీఆర్ హరీశ్రావులు కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పది సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేసి చూపించిందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులు, పేద ప్రజల నడ్డి విరిచి ఎరువులు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందని విమర్శించారు. అయోధ్య పై కోట్ల వ్యాపారం చేసిందని బీజేపీని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి వచ్చినా కాంగ్రెస్ పార్టీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్కు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మట్లాడుతూ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి దేశ నిర్మాణంలో యువతను భాగస్వాములుగా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు దానికి భిన్నంగా బీజేపీ రాజ్యాంగం కల్పించిన హక్కును తొలగిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నాయకులు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి, తాహెర్ బిన్ హందాన్, కేశ వేణు, మానాల మోహన్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, కవితా రెడ్డి, ఆకుల లలిత, శేఖర్ గౌడ్, రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, స్థానిక సర్పంచ్ ఎర్రం లింగం, మండల పార్టీ అధ్యక్షుడు దూడ వెంకటేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ అర్హుడైన ప్రతి ఓటరు పేరు జాబితాలో చేర్చాలి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ -
పోలీస్ ప్రజావాణికి 39 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్ : పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో సీపీ సాయిచైతన్య 39 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను సీపీ ఆదేశించారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్/మే 2026లో జరిగిన డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షల రీవాల్యుయేషన్ దరఖాస్తుల స్వీకరణకు జూలై 8వ తేదీ తుది గడువుగా కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రీవాల్యుయేషన్ ఫీజు ఒక్కో పేపర్కు రూ.500, ధరఖాస్తు ఫారానికి రూ.25లు చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు త మ కళాశాలలో రీవాల్యుయేషన్ ఫారాలు పొంది, మార్కుల మెమో జిరాక్స్ జతచేసి నిర్ణీత ఫీజుతో సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని 2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్ల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ, బీపెడ్ 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు సోమవారం ప్రారంభమైనట్లు అ కడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 1,354 మంది విద్యార్థులకు 1,229 మంది హాజరు కాగా 125 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ అధికారులు డిగ్రీ విద్యార్థుల వద్ద అడ్మిషన్ రోజే ఫీజు కట్టించుకోవడం సిగ్గుచేటని ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్ విమర్శించారు. సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో తెయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జీవో ప్రకారం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేశాక వారం రోజుల్లోపు ఫీజులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దోస్త్ అలాట్మెంట్ ఆర్డర్లో పొందుపర్చిన నిబంధనలను వర్సిటీ అధికారులు పరిగణలోకి తీసుకుని విద్యార్థుల నుంచి ఒక్క రూపాయి వసూలు చేయవద్దని డిమాండ్ చేశారు. లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వర్సిటీ ఏబీవీపీ కార్యదర్శి సమీర్, ప్రాంత వనవాసి కన్వీనర్ అశోక్, నాయకులు శివ, మనోజ్, భార్గవ్, దుర్గ దాస్, విజయ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
తాత్కాలిక ఉపాధ్యాయ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక అధ్యాపక / ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారిణి జి.విజయలలిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా సంస్థల వారీగా ఖాళీలను ప్రకటించారు. ధర్మారం (బి) బాలికల గురుకులంలో బోటని(1), జూవాలజీ (1), కెమిస్ట్రీ (1), సోషల్ స్టడీస్ (1), లైబ్రేరియన్(1), కంజర బాలికల గురుకులంలో తెలుగు లెక్చరర్ (1), టీజీటీ హిందీ (1), ఇంగ్లిష్(1), ఫిజికల్ సైన్సు(1), బయో సైన్సు (1), పోచంపాడ్లో జువాలాజీ(1), కెమిస్ట్రీ(1), సుద్దపల్లి గురుకులంలో ఫిజికల్ సైన్సు పీజీటి (1), సోషల్ స్టడీస్ (1), నవీపేటలో సోషల్ స్టడీస్ (పీజీటీ) (1), బోధన్ బాలుర గురుకులంలో మ్యాథ్స్ లెక్చరర్ (1), హెల్త్ సూపర్వైజర్ (1), ఆర్మూర్ బాలికల డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్(1), కామర్స్ (2), ఫిజికల్ డైరెక్టర్ (1) పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. జూనియర్ లెక్చరర్కు సంబంధిత సబ్జెక్టులో పీజీ 50 శాతం మార్కులతోపాటు బీఈడీ, డిగ్రీ లెక్చరర్కు పీజీ 55శాతం మార్కులతో పాటు నెట్/సెట్ ఉత్తీర్ణత తప్పనిసరని, బాలికల విద్యాలయాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. డిగ్రీ లెక్చరర్కు రూ.32,500, జూనియర్ లెక్చరర్కు రూ.23,400, పీజీటీ, టీజీటీలకు రూ.18,200 గౌరవ వేతనం చెల్లించబడుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 5వ తేదీలోగా సంబంధిత కళాశాలలో సమర్పించాలని పేర్కొన్నారు. జూలై 7న డెమో క్లాసులు ఉంటాయని వివరించారు. -
పంటలకు ఊరట
వేల్పూర్: వేల్పూర్ మండలంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షం పంటలకు ఊరటనిచ్చింది. మండలంలో 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నీరందక వాడిపోతున్న దశలో ఉన్న మొక్కజొన్న, పసుపు, సోయాబిన్ పంటలకు ప్రాణం పోసినట్లయ్యింది. మండలంలోని వివిధ గ్రామాల్లో ఖరీఫ్ సీజన్లో మెట్ట భూములతోపాటు బోరుబావుల కింద పసుపు, మొక్కజొన్న, సోయాబిన్ పంటలు సాగుచేస్తున్నారు. వర్షాలు లేక బోరుబావుల్లో సైతం నీటి నిల్వలు తగ్గిపోయి. సాగునీరందక రైతులు నిత్యం ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో కురిసిన భారీ వర్షం రైతుల్లో సంతోషం నింపింది. -
పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరి
సుభాష్నగర్: ఐదేళ్లలోపు పిల్లలందరికీ పల్స్ పోలి యో చుక్కలు తప్పనిసరి అని కార్యక్రమ రాష్ట్ర పరిశీలకులు వెంకటరమణ అన్నారు. నగరంలోని వినాయక్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని మురికివాడల్లో సోమవారం పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలను చిన్నారులకు అందజేయాలని ప్రభుత్వం సూచించిందన్నారు. ఈమేరకు పంపిణీని ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. పట్టణారోగ్య కేంద్ర వైద్యాధికారి అనిల్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి అశోక్, డీహెచ్ఈలు వేణుగోపాల్, వెంకటేశ్వర్లు, హెచ్ఈవోలు వెంకట్ రవి, వినోద్, ఆశాకార్యకర్తలు, నర్సింగ్ వలంటీర్లు ఉన్నారు. 99శాతం పల్స్పోలియో.. పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా రెండోరోజు 11,282 మంది చిన్నారులకు 9,264 మంది చిన్నారులకు చుక్కల మందు వేసినట్లు డీఎంహె చ్వో రాజశ్రీ తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు చిన్నారులు 1,91,883 మంది ఉండగా ఆది, సోమవారాల్లో 1,88,760 (99శాతం) మందికి పోలియో చుక్కలు వేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన ఒక శాతా న్ని మూడోరోజు పోలియోచుక్కలు వేసి విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. -
ఇద్దరు ఏఈలకు పదోన్నతులు
సుభాష్నగర్ : టీజీఎన్పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ పరిధిలో ఇద్దరు ఏఈలకు ఏడీఈలుగా పదోన్నతులు కల్పిస్తూ కంపెనీ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ డివిజన్ కార్యాలయంలో కమర్షియల్ ఏఈగా పని చేస్తున్న రాజేందర్రెడ్డి, డీ–7 సెక్షన్లో ఆపరేషన్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న బాబా శ్రీనివాస్కు ఏడీఈలుగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగులు ఇచ్చారు. రాజేందర్రెడ్డికి భీంగల్ ఆపరేషన్ విభాగంలో ఏడీఈగా, బాబా శ్రీనివాస్కు డీపీఈలో ఏడీఈగా పోస్టింగ్ ఇచ్చారు. వారు త్వరలోనే విధుల్లో చేరనున్నారు. నిజామాబాద్ అర్బన్ : పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. ట్రాఫిక్లో పనిచేస్తున్న జీ లింగం, రుద్రూరు పోలీస్స్టేషన్లో చేస్తున్న శివకుమార్గౌడ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. వీరిని సోమవారం సీపీ తన కార్యాలయంలో అభినందించారు. డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రభుత్వ బడుల బలోపే తం కోసం గ్రామాలు చైతన్యం అవుతున్నాయి. సోమవారం మారంపల్లికి వచ్చిన ప్రయివేటు పాఠశాల బస్సులను అడ్డుకున్నారు. ప్రయివేటు పాఠశాలలకు పంపుతున్న విద్యార్థులను బస్సుల్లోంచి దింపేసి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. సర్పంచ్ గంగాధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్, వీడీసీ పెద్దలు కలిసి పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారితో మాట్లాడారు. ప్రభుత్వ బడిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలకే పంపాలని కోరారు. ప్రయివేటు యాజమాన్యాలు కూడా సహకరించాలని సూచించారు. -
క్రైం కార్నర్
ధర్పల్లి: పిడుగుపాటుతో ఒకరు మృతి చెందిన ఘటన ధర్పల్లి మండలం కర్నల్ తండాలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. కర్నల్ తండాకు చెందిన ధరావత్ దేవీసింగ్ (50) ఆదివారం సాయంత్రం పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పొలంలో పనిచేస్తున్న ధరావత్ దేవీసింగ్పై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రయినా దేవీసింగ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే విగత జీవిగా పడి ఉన్నాడు. మృతుడి భార్య రూక్కి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోసాన్పల్లి గ్రామ శివారు ముర్సు కుంటలో ఆదివారం చేపలు పట్టేందుకు వెళ్లిన బేస్త సాయిలు(58) ప్రమాదవశాత్తు గల్లంతైన విషయం తెలిసిందే. సాయిలు కోసం అగ్నిమాపక శాఖ సిబ్బంది వెతకగా సోమవారం మృతదేహం లభ్యమైంది. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రైతుల సంక్షేమంలో సహకార రంగం పాత్ర కీలకం
● ఎన్డీసీసీబీ జనరల్ మేనేజర్ అనుపమ సుభాష్నగర్ : గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమం, మహిళా సాధికారతలో సహకార సంఘం పాత్ర ఎంతో కీలకమని ఎన్డీసీసీబీ జనరల్ మేనేజర్ అనుపమ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని ఎన్డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార పతాకాన్ని ఆమె ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం బ్యాంకు సిబ్బందితో కలిసి బ్యాంకు సేవలు, సహకార రంగం విశిష్టతను ప్లకార్డులు ప్రదర్శిస్తూ నగరంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం సహకార శాఖను ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. సహకారమే సమృద్ధి అను నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. సహకార సంఘాలు, సహకార బ్యాంకులు గ్రామీణాభివృద్ధికి జీవనాడులని కొనియాడారు. ఐదేళ్లలో సహకార వ్యవస్థ విజయాలను స్ఫూర్తిగా తీసుకొని మరింత మెరుగైన సేవలు అందించేందు కు ప్రతి సహకార వాది కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు ఉప జనరల్ మేనేజర్లు శ్రీధర్రెడ్డి, సుమమాల, లింబాద్రి, సహాయ జనరల్ మేనేజర్లు గజానంద్, శ్రీధర్, సుమన్, అజయ్ రెడ్డి, భీమ్రావు, డీసీవో శ్రీనివాస్రావు, నాబార్డు డీడీఎం ప్రవీణ్కుమార్, కార్యాలయ సిబ్బంది, సహకార సంఘాల సిబ్బంది పాల్గొన్నారు. -
మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలి
● టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ● నగరంలో ఒలింపిక్ డే రన్ నిజామాబాద్ అర్బన్: యువత క్రీడల్లో పాల్గొని మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఒలింపిక్ డే రన్లో ఆయన పాల్గొన్నారు. పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఒలింపిక్ క్రీడల స్ఫూర్తి అయిన క్రమశిక్షణ, ఐక్యత, శాంతి, ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, దేశానికి కీర్తి తీసుకురావాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో జిల్లా ఒలింపిక్ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అంతకుముందు ఆర్ఆర్ చౌరస్తాలో ఒలింపిక్ డే రన్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో క్రీడాకారులకు వసతులు లేకున్నా ఆయా క్రీడాంశాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు. ఒలింపిక్స్ అంటే కేవలం క్రీడలు మాత్రమే కాదని, ప్రపంచ దేశాల మధ్య స్నేహం, శాంతి, బాధ్యతకు ప్రతీక అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. జిల్లాలో సరైన సౌకర్యాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్టేడియం నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే అనేకసార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు భక్తవత్సలం, బొబ్బిలి నరసయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, బీజేపీ కార్పొరేటర్లు నాగోల లక్ష్మీనారాయణ, బట్టు రాఘవేందర్, మల్కాయి మహేందర్, జ్యోతి మురళి పాల్గొన్నారు. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
● డీఆర్డీవో సాయన్న డిచ్పల్లి: స్వయం సహాయక సంఘాలలో సభ్యులైన ప్రతి మహిళా ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని డీఆర్డీవో సాయన్న తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో జిల్లాలోని పది మండలాలకు చెందిన ఐకేపీ సీఆర్పీలకు ఆర్థిక అక్షరాస్యతపై నిర్వహించే ఆరు రోజుల శిక్షణ తరగతులను సోమవారం డీఆర్డీవో ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో మహిళలు డబ్బులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం, కుటుంబ పోషణ, పిల్లల చదువులు తదితర అంశాలపై శిక్షణలో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఐకేపీ డీపీఎం సంధ్యారాణి, ఆర్ఎస్ఈటీ డైరెక్టర్ రవికుమార్, సిబ్బంది రామకృష్ణ, భాగ్యలక్ష్మి, నవీన్, లక్ష్మీనారాయణ, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి ప్రాధాన్యమివ్వాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● 122 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులునిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు 122 ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, నగర పాలకసంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో సాయన్నకు అర్జీలు సమర్పించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో మండల ప్రత్యేక అధికారులు, విద్యాధికారులు క్షేత్రస్థాయిలో విధిగా సందర్శిస్తూ సౌకర్యాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలపై చర్యలు తీసుకోవాలి బలవంతంగా ఉర్దూ భాషను విద్యార్థులకు బోధిస్తున్న ఆర్మూర్లోని ఓ ప్రయివేటు హైస్కూల్పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కై రి శశిధర్ అదనపు కలెక్టర్ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు. కోటార్మూర్ ప్రాంతంలోని హైస్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, చెర్రీ, కుల్వంత్, సౌరభ్, దీపాన్, సిద్దు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్ స్కూల్కు స్థలం కేటాయించాలి బోధన్లోని నర్సింగ్ స్కూల్కు ప్రభుత్వ స్థలం కేటాయించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. అసౌకర్యాలు ఉన్న బోధన్ ఆస్పత్రిలో నర్సింగ్ స్కూల్ కొనసాగుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, జిల్లా కమిటీ సభ్యులు సుజిత్, అక్షయ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని, కేంద్రమంత్రి రాజీనామా చేయాలి
నిజామాబాద్ రూరల్ : నీట్ పేపర్ లీక్పై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు రాజీనామా చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్చార్జి రోషిని జైస్వాల్ అన్నారు. ఆదివారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ భవన్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్చార్జి రోషిని జైస్వాల్ మాట్లాడారు. నీట్ పేపర్ లీక్తో ఎంతో మంది యువకులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రోడ్లపైకి వచ్చే నిరసనలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదన్నారు.20 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధకరమన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యువకుల పక్షాన ఛాత్రో కి గుంజ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీకి మద్దతు ఉందామన్నారు.కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్చార్జి వినోద్ ఎర్రంశెట్టి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, ఉపాధ్యక్షులు అద్నాన్, ప్రధాన కార్యదర్శి ఆదిత్య పాటిల్, ఇర్ఫాన్, రాజు గౌడ్, అసెంబ్లీ అధ్యక్షులు మహేందర్, మోయిన్ యూనిస్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీకాంత్, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
చేపలవేటకు వెళ్లి జాలరి గల్లంతు
ఎల్లారెడ్డిరూరల్: చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ జాలరి గల్లంతైన సంఘటన ఎల్లారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని పోసాన్పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా .. పోసాన్పల్లికి చెందిన బేస్త సాయిలు(58) ఆదివారం చేపలు పట్టేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అతడు తిరిగి రాకపోవడంతో సాయిలు కుటుంబ సభ్యులు గ్రామ శివారులోని ముర్సుకుంట వద్ద గాలించారు. కుంట ఒడ్డున సాయిలు దుస్తులు, చెప్పులు కనిపించాయి. వెంటనే అగ్నిమాపకశాఖ సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది ఎంత వెతికినప్పటికి సాయిలు ఆచూకీ తెలియరాలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపి వేశారు. సాయిలు గల్లంతు కావడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిజామాబాద్ అర్బన్: నగరంలోని కసాబ్గల్లీలో చరణ్, శ్రీనివాస్ అనే వ్యక్తులు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. ఇరువురి మధ్య బైక్ పార్కింగ్ విషయమై శనివారం రాత్రి గొడవ జరిగింది. ఫిర్యాదు మేరకు ఇద్దరిపై ఆదివారం కేసు నమోదు చేశామని రెండో టౌన్ ఎస్సై యాదగిరగౌడ్ తెలిపారు. కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ 1995–96 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యా ర్థులు తమ తోటి విద్యార్థి ఎం.డీ యూసుఫ్ఖాన్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం యూసుఫ్ఖాన్ ఇంటికి వెళ్లి రూ. 40 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. -
కాంగ్రెస్తోనే ప్రజా సంక్షేమం సాధ్యం
● నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మోపాల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మోపాల్లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా నియోజకవర్గంలోని మోపాల్, నిజామాబాద్ రూరల్, ఇందల్వాయి మండలాలకు రూ.2.25 కోట్లచొప్పున తహసీల్దార్ కార్యాలయాలను మంజూరు చేసినందుకు మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేష్కుమార్ గౌడ్కు ఆయా మండలాల ప్రజలు, కాంగ్రెస్ నాయకుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మోపాల్ మండలంలోనే రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. సమావేశంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కూచన్పల్లి జలంధర్రెడ్డి, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు ఎల్లోళ్ల సాయిరెడ్డి, ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రామాగౌడ్, సర్పంచులు, నాయకులు రాకేష్ యాదవ్, గుడి ప్రవీణ్రెడ్డి, సాయినాథ్రెడ్డి, భూమయ్య, మల్లయ్య, నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు రూ.30 వేల కోట్లు ఇవ్వాల్సిందే..
బాన్సువాడ : రైతులకు రూ.30 వేల కోట్ల రైతుభరోసా నిధులు ఇచ్చిన తర్వాతే సీఎం రేవంత్రెడ్డి మాట్లాడాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్స్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై కార్యకర్తలు, బీఎల్ఏలకు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు పంటలకు కలిపి రూ.55 వేల కోట్ల రైతుభరోసా నిధులు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.25 వేల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారని, ఇంకా రూ.30 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళకు ప్రతి నెల రూ.2500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ నిధులు ఇంకా రూ.20 వేల కోట్లు ఇవ్వాలని, బోనస్ ప్రస్తావనే తీయడం లేదని అన్నారు. ‘పోచారం’ను రానిచ్చే ప్రసక్తే లేదు.. ప్రస్తుతం సర్వేలన్నీ మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదట బాన్సువాడలో బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు తేల్చినట్లు పేర్కొన్నారు. రూ. వేల కోట్లు ఇచ్చి బాన్సువాడను అభివృద్ధి చేసిన మాజీ సీఎం కేసీఆర్ గుండెలపై తన్ని కాంగ్రెస్ గూటికి చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డి మళ్లీ బీఆర్ఎస్లోకి వస్తానంటే రానిచ్చే ప్రసక్తే లేదని కేటీఆర్ చెప్పారని ఆయన కార్యకర్తలకు వివరించారు. ప్రస్తుతం పోచారం వెంట ఉన్న నాయకులు సైతం కేటీఆర్కు ఫోన్ చేసి పార్టీలోకి వస్తామని చెబుతున్నారని, కానీ, కష్టకాలంలో పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని అన్నారు. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి ఆగయ్య, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, జీవన్రెడ్డి, జాజాల సురేందర్, హన్మంత్సింధే, గణేశ్ గుప్తా, జెడ్పీ మాజీ చైర్మన్లు దఫేదార్ రాజు, దాదన్నగారి విఠల్రావు, నాయకులు రత్నకుమార్, అంజిరెడ్డి, జుబేర్, శ్రీనివాస్రావు, చందూర్ సర్పంచ్ మాధవరెడ్డి, అక్బర్, శ్రీనివాస్, మక్బుల్, ఖలీల్, ఇషాక్, రమేశ్ యాదవ్, శివసూరి తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాతే సీఎం రేవంత్ మాట్లాడాలి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్తున్నాయి బాన్సువాడలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి -
పోలియో చుక్కలు @ 94శాతం
సుభాష్నగర్: ప్రజల సహకారంతో పోలియో రహిత సమాజాన్ని నిర్మిస్తామని జిల్లా వైద్యారో గ్యశాఖాధికారిణి రాజశ్రీ అన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని దుబ్బ పట్టణ ఆరోగ్య కేంద్రంలో అదనపు కలెక్టర్ భుజంగరావు ప్రారంభించారు. పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో డీఎంహెచ్వోతోపాటు మేయర్ కూరగాయల ఉమారాణి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 94 శాతం మందికి చుక్కల మందు వేశారు. మిగిలిపోయిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో మందు వేస్తారు. నగరంతోపాటు గ్రామాలు, ప్రధాన బస్టాండ్లు, రైల్వేస్టేషన్, రద్దీప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 1,91,883 మంది ఉండగా మొదటిరోజు 1,80,601 (94శాతం) మందికి పోలియో చుక్కలు అందించామని డీఎంహెచ్వో తెలిపారు. మిగిలినవారిని వైద్యారోగ్య సిబ్బంది గుర్తించి చుక్కల మందు వేస్తారన్నారు. డీఐవో అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వో సికిందర్ నాయక్, డీహెచ్ఈలు, హెచ్ఈవోలు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. 1,80,601 మంది చిన్నారులకు మందు వేసిన వైద్యసిబ్బంది సోమ, మంగళవారాల్లో మిగిలిపోయిన వారికి.. పోలియోరహిత సమాజాన్ని నిర్మిస్తాం : డీఎంహెచ్వో రాజశ్రీ -
శభాష్ శ్రీనివాస్..
మాక్లూర్ : మండలంలోని ధర్మోరా సర్పంచ్ పందిరి శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయంతో 16 మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రస్తుతం 72 మందితో కళకళలాడుతోంది. ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న తన కూతురు శ్రీహితను సర్పంచ్ పందిరి శ్రీనివాస్ ‘బడిబాట’లో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఆ తరువాత గ్రామస్తులకు అవగాహన కల్పించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించారు. ఉపాధ్యాయులు సర్పంచ్ కృషిని అభినందించారు. ఒక దశలో మూతపడుతుందన్న పాఠశాల జీవం పోసుకుంది. -
దంచికొట్టిన వాన
● జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం ● ఎడపల్లిలో 72.8 మి.మీ. వర్షపాతం నమోదునిజామాబాద్అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి విస్తారంగా వర్షం కురిసింది. సీజన్ ప్రారంభమైన తరువాత ఇదే భారీ వర్షం. రైతులు ఆందోళన చెందుతున్న వేళ కురిసిన భారీ వర్షం ఊరటనిచ్చింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా మబ్బులు కమ్ము కుని బోధన్, నిజామాబాద్ డివిజన్లలో సు మారు రెండుగంటలపాటు భారీ వర్షం కురిసింది. ఎడపల్లిలో అత్యధికంగా 72.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. మోస్రాలో 70, నవీపేటలో 54.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆర్మూర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదైంది. ఏదిఏమైనా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కురిసిన భారీ వాన రైతుల్లో ఆనందాన్ని నింపింది. రుద్రూర్: పొతంగల్ మండలం టాక్లి గ్రా మంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు రెండు గేదెలు మృత్యువాతపడ్డాయి. భారీ వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడడంతో ప్రకాశ్రావ్కు చెందిన రెండు గేదె లు మృతి చెందాయి. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని నికాల్పూర్ గ్రామంలో బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ముగ్గురు బాధితులకు కలిపి రూ. 45 వేల చెక్కులను అందించారు. గ్రామ సర్పంచ్ అనితాసుమన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాపురావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు బట్టు సంజీవ్, మోతె సాయన్న, దశాగౌడ్ ఉన్నారు. కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణంలో బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఐదుగురు బాధితులకు కలిపి రూ.1.55 లక్షల చెక్కులను అందించారు. కౌన్సిలర్లు మామరి సందీప్, అంజుమ్ అలీ, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు పర్స అనంతరావు, వాకా మహేష్, సాయిబాబా, భూషణ్, దినేష్, మహేష్, కిరణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్: మండలంలోని రాణంపల్లి గ్రామానికి చెందిన గాండ్ల సాయిలుకు మంజూరైన రూ.60వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆదివారం సర్పంచ్ కొండల్వాడీ శంకర్ అందజేశారు. రాయకూర్ విండో వైస్ చైర్మన్ తోట అరుణ్కుమార్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు తోట సంగయ్య, మాజీ ఎంపీటీసీ బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
రైతులకు రూ.30 వేల కోట్లు.. రైతులకు రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఇచ్చిన తర్వాతే సీఎం మాట్లాడాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2026– 8లో uఉమ్మెడలో సర్పంచ్ భోజేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న విద్యార్థులు (ఫైల్)మన ఊరి బడిని మనమే బతికించుకుందాం.. అంటూ ప్రజాప్రతినిధులు ముందుకు సాగుతున్నారు. ప్రచారానికే పరిమితం కాకుండా తమ పిల్లలను ముందుగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాలకవర్గాలు, వీడీసీల సహకారంతో పలు తీర్మానాలు చేస్తూ అమలు చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకూ ఆర్థికభారం తగ్గుతోంది. ప్రజాప్రతినిధులతోపాటు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామాల్లోని యువత పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తుండడంతో పల్లెల్లోని ప్రభుత్వ బడులకు జీవం వచ్చింది. -
సూక్ష్మసేద్యంపై చిన్నచూపు
● దరఖాస్తులు కొండంత.. నిధులు గోరంత ● డ్రిప్ పరికరాల కోసం రైతులకు ప్రోత్సాహం కరువు ఇందల్వాయి : రైతులు ఆరుతడి పంటలు సాగు చే యాలని ప్రభుత్వం సూచిస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు తగిన విధంగా కార్యాచరణ అమలుచేయడం లేదని వ్యవసాయరంగ నిపుణులు, రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం సూక్ష్మ సేద్య ప్రాజెక్టు ద్వారా 80 శాతం నుంచి రాయితీపై అందించాల్సిన సూక్ష్మ బిందుసేద్యం పరికరాలకు తగినన్ని నిధులు మంజూరు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఆరుతడికి ప్రోత్సాహం కీలకం ఎల్నినో మూలంగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వరి సాగును తగ్గించి ఆరుతడి పంటలైన సోయాబీన్, మొక్కజొ న్న, కందులు, అపరాల సాగు వైపు రైతులను మ ళ్లించాల్సిన ఆవసరం ఎంతో ఉందని కేంద్ర వ్యవ సాయ శాఖ, భారత వ్యవసాయ పరిశోధన మండలి సంయుక్తంగా స్పష్టం చేసి జిల్లాల వారీగా కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు డ్రిప్ పరికరాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయిల్ పామ్కే అధిక ప్రాధాన్యం మంజూరైన కొద్దిపాటి నిధులను ఆరుతడి పంటలకు కాకుండా ఆయిల్పామ్ తోటలకు కేటాయించడంతో ఆరుతడి పండించే రైతులకు ప్రతీసారి నిరీక్షణ తప్పడం లేదు. అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసి ఆయిల్ పామ్తోపాటు ఆరుతడి పంటలకు కూడా జాప్యం లేకుండా డ్రిప్ పరికరాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో గతేడాది సుమారు 6,476 హెక్టార్లలో సూక్ష్మ బిందుసేద్యం లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 62.74 హెక్టార్లకే డ్రిప్ పరికరాలను అందించారు. సుమారు రూ.30 కోట్ల వరకు నిధులు అవసరం కాగా.. కేవలం రూ.6 కోట్ల వరకే నిధులు మంజూరైనట్లు ఉద్యాన అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం 2,600 ఎకరాలకు డ్రిప్ పరికరాలు అందించడం లక్ష్యమని అన్నారు.ఆరుతడి, ఆయిల్పామ్ తేడా లేకుండా దరఖాస్తు చేసు కున్న ప్రతి రైతుకు బిందుసేద్యం పరికరాలు అందించాలి. ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభు త్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. అధికారుల నివేదిక ప్రకారం నిధులు విడుదల చేయాలి. – పాట్కూరి తిరుపతిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు డ్రిప్ పరికరాలు అవసరమై రైతులు తమకు నచ్చిన కంపెనీని ఎంచుకొని మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, ఐదు ఎకరాలకు తక్కువగా ఉన్న రైతులకు 80 శాతం, ఐదు ఎకరాలకు పైన ఉన్న రైతులకు 70 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తుంది. ఈ సంవత్సరం సుమారు 2,600 ఎకరాలకు డ్రిప్ అందించడమే లక్ష్యంగా ఉద్యానశాఖ కార్యాచరణ రూపొందించింది. – జయ, డీడీ, జిల్లా ఉద్యానశాఖ -
జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆరాధ్యరెడ్డి
కామారెడ్డి అర్బన్: జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారిణి ఎంపికయ్యారు. హైదరాబాద్లోని మణికొండ ఆదిరా బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2026 పోటీల్లో కామారెడ్డికి చెందిన ఆరాధ్యరెడ్డి విజేతగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఆరాధ్యరెడ్డి అండర్–19 బాలికల డబుల్స్ విభాగంలో బంగారు, మిక్స్డ్ డబుల్స్లో రన్నరప్గా నిలిచి వెండి పతకం సాధించినట్లు కామారెడ్డి ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే సందీప్ గౌడ్ తెలిపారు. 48వ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (సౌత్జోన్) పోటీల్లోనూ ఆరాధ్యరెడ్డి విజేతగా నిలిచి జిల్లా క్రీడాకారులకు స్ఫూర్తిగా ఉండాలని క్రీడాకారులు, అభిమానులు అభినందించారు. -
ఎన్యుమరేషన్ ఫామ్ నింపి ఇవ్వాల్సిందే!
● వివరాల్లో తప్పులు లేకుండా చూడాలి ● బీఎల్వోల వద్ద రసీదు తీసుకోవడం మరువొద్దుడిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ప్రతి పౌరుడికి ఓటుహక్కు కల్పించడం, ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. ఈ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియ ఈ నెల 25న ప్రారంభమైంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వో) మీ ఇంటికి వచ్చి తెలుగు, ఇంగ్లి్ష్లో ఉండే ‘ఎన్యుమరేషన్ ఫారం’ అందిస్తారు. ఫారంను సరైన వివరాలతో నింపి, మళ్లీ బీఎల్వోలకు ఇస్తేనే మీ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదవుతుంది. చాలామంది ఫారాన్ని నింపడానికి ఇబ్బంది పడుతుంటారు. అధికారుల సూచన ప్రకారం.. ఈ ఫారం ఎలా నింపాలో తెలుసుకుందాం.. ఎన్యుమరేషన్ ఫారం అంటే?.. ఓటరు జాబితాను ధ్రువీకరించడానికి, కొత్త ఓటరు వివరాలను సేకరించడానికి ఎన్నికల సంఘం ఉపయోగించే ప్రాథమిక పత్రం ఎన్యుమరేషన్ ఫారం. మీ ఇంట్లో ఉన్న ఓటర్ల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవడానికి ఒక వేదిక. ఫారంలో వివరాలు రాసేటప్పుడు తప్పులు లేకుండా, స్పష్టమైన అక్షరాలతో రాయాలి. ఫారంలో మూడు విభాగాలు.. పైభాగం: మీ పేరు, మీ ఓటరు ఫొటో గుర్తింపు కార్డు నంబర్, చిరునామా, అసెంబ్లీ పేరు, తదితర వివరాలు, పాత ఫొటోతో ముందుగా ముద్రించి ఉంటాయి, అక్కడ పక్కన మీ లేటెస్ట్ ఫొటో అతికించాలి. రెండవ భాగం: రెండోభాగంలో రెండు భాగాలుగా విభజించి ఉంటుంది. 2002లో ఓటు ఉన్నవారి కోసం ఒక బాక్స్, 2002లో ఓటు లేనివారి కోసం మరో బాక్స్ ఉంటుంది. ఈ రెండు అంశాల్లో ఒకదానిని మీ పరిస్థితి ఆధారంగా నిర్ణయించుకుని వివరాలు నమోదు చేయాలి. మూడో భాగం: మూడోభాగంలో ఓటరు ప్రస్తుత వివరాలు నింపాలి. పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, సంరక్షకుడి పేరు, సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నంబర్, తల్లిపేరు, తల్లి ఓటరు గుర్తింపు కార్డు నంబర్, పెళ్లి అయితే మీ భాగస్వామి పేరు, ఆమె ఓటరు గుర్తింపు కార్డు నంబర్, పెళ్లి అవ్వకపోతే ఖాళీగా వదిలేయాలి. జాగ్రత్తలు మరువకండి.. వ్యక్తిగత వివరాలు: కుటుంబ సభ్యులందరి పేర్లు, వయసు, లింగం వంటి వివరాలను ఆధార్ కార్డులో ఉన్న విధంగానే నమోదు చేయాలి. చిరునామా ధ్రువీకరణ: మీరు ఉంటున్న ఇంటి నంబర్, వీధి పేరు, పోస్ట్ ఆఫీస్ వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. ఆధార్ అనుసంధానం: ఓటర్ ఐడీ కార్డును ఆధార్ అనుసంధానించడానికి అవసరమైన వివరాలను అందించాలి. ఫొటో, సంతకం: ఫారం చివరలో అవసరమైన చోట సంతకం చేయడం లేదా వేలిముద్ర వేయడం మర్చిపోవద్దు.ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్పోర్టు, పదో తరగతి సర్టిఫికెట్, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, అటవీహక్కుల ధ్రువీకరణపత్రం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం, ఇంటి అద్దె రసీదు లేదా కరెంటు బిల్లు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. సరైన వివరాలు అందించడంతో భవిష్యత్లో ఓటరు జాబితాలో పేరు గల్లంతు కాకుండా ఉంటుంది. అలాగే ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడటం ద్వారా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఓటు వేయవచ్చు.2002లో మీకు ఓటు హక్కు లేకపోతే.. మీ తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలలో ఎవరో ఒకరి వివరాలు 2002 ఓటర్ల జాబితా వివరాల ప్రకారంగా ఈ భాగం పూరించాలి. పేరు అనేచోట తండ్రి, తల్లి తాతయ్య, నాయనమ్మలో ఎవరిదైనా పేరు రాసి, వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్ వేయాలి. బంధువు అనేచోట తండ్రి లేదా భర్త పేరు రాయాలి. 2002 ఓటర్ల జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య పోలింగ్ స్టేషన్ నంబర్ (భాగం సంఖ్య), క్రమసంఖ్య అంటే ఓటర్ జాబితాలో మీ సీరియల్ నంబర్ ఎంత అనేది వేయాలి. మొత్తంగా 2002లో మీకు ఓటు లేకపోవడంతో, మీ బంధువుల్లో ఉన్న వారివివరాలను ఈ బాక్స్ నింపాలి. చేయాల్సినవి: ప్రతి కాలమ్ను జాగ్రత్తగా చదివి నింపాలి. పేరు స్పెల్లింగ్ అన్ని పత్రాల్లో ఒకేలా ఉందో చూసుకోండి. పుట్టిన తేదీ అన్ని పత్రాల్లో సరిపోతుందో నిర్ధారించుకోండి. ఫారం సమర్పించిన తర్వాత రసీదు లేదా అంగీకార పత్రం తీసుకోవాలి. సందేహాలు ఉంటే బూత్ లెవల్ ఆఫీసర్ను సంప్రదించాలి. అవసరమైన పత్రాల స్పష్టమైన కాపీలు జతచేయాలి. మొబైల్ నంబర్, చిరునామా వంటి వివరాలు లేటెస్ట్వి ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ఖాళీ కాలమ్లు వదిలేయకూడదు ఇతరుల పత్రాలు ఉపయోగించకూడదు. పత్రాలపై మార్పులు చేసి సమర్పించకూడదు. తొందరపాటుతో చదవకుండా సంతకం చేయకూడదు. ఒకే వ్యక్తికి సంబంధించిన విభిన్న వివరాలు ఇవ్వకూడదు.2002 ఓటరు జాబితా వివరాల ఆధారంగా ఈ భాగం పూరించాలి. ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్, సంరక్షకుడి పేరు, అతడితో మీకు ఉన్న బంధుత్వం వివరాలు నింపాలి. 2002 ఓటరు జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య. పోలింగ్ స్టేషన్ నంబరు (భాగం సంఖ్య), శ్రమసంఖ్య.. అంటే ఓటరు జాబితాలో మీ సీరియల్ నంబర్ ఎంత అనేది వేయాలి. -
నేడు ఇందూరు తిరుమలలో ఏరువాక పౌర్ణమి
మోపాల్: మండలంలోని నర్సింగ్పల్లిలోగల ఇందూరు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రంలో సోమవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి నర్సింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం, అభిషేకం, అలంకరణ పూర్తి కాగానే జ్యేష్ఠ మాసంలో నిర్వహించే వరుణ యాగం ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఎద్దులు, నాగళ్లు, అన్ని వ్యవసాయ ఉపకరణాలను గౌరవించుకుని ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతినెల పౌర్ణమి రోజు గర్భిణులకు అందించే దివ్యౌషధాన్ని సాయంత్రం 6 నుంచి 8.30 గంటలలోపు అందిస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు, గర్భిణులు, భక్తులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నర్సింహారెడ్డి కోరారు. కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్పల్లికి బెస్ట్ యాక్టివిటీస్ అవార్డు దక్కింది. క్లబ్ స్థాపించిన ఏడాదిలోనే పలు సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు బెస్ట్ యాక్టివిటీస్ అవార్డుతో పాటు బెస్ట్ సెక్రెటరీ అవార్డును సొంతం చేసుకున్నట్లు క్లబ్ అధ్యక్షుడు లుక్క గంగాధర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన లయన్స్ క్లబ్ దిల్ సే కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ చేతుల మీదుగా బెస్ట్ యాక్టివిటీస్ అవార్డుతో పాటు, బెస్ట్ సెక్రటరీ అవార్డును అందుకున్నారు. ఈకార్యక్రమంలో లుక గంగాధర్, తెడ్డు రమేష్, చింత ప్రదీప్, రేవతి గంగాధర్, లక్మ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ సోమవంశీయ సహస్రార్జున క్షత్రియ సమాజ్ నూతన అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది గటడి ఆనంద్ ఆదివారం ఎన్నికయ్యారు. పట్టణంలో ఎస్ఎస్కే సమాజ్ అధ్యక్ష పదవికి నిర్వహించిన ఎన్నికల్లో గటడి ఆనంద్ అధ్యక్షుడిగా, అలాగే కార్యదర్శిగా డీకే రాజేశ్ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులకు ఈ సందర్బంగా ఎస్ఎస్కే సమాజ్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్ఎస్కే సమాజ్ సభ్యులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వద్దు.. నేడే పల్స్ పోలియో
● జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 1,91,883 ● 1,007 బూత్ల ద్వారా పంపిణీ ● ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య, ఆరోగ్యశాఖపోలియో రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం ఆదివారం నుంచి మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. – సుభాష్నగర్జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 1,91,883 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 27 పీహెచ్సీలు, 10 యూపీహెచ్సీలు, 275 సబ్ సెంటర్లు ఉన్నాయి. చిన్నారులకు పోలియో చుక్క లు వేసేందుకు 1,007 బూత్లను సిద్ధం చేశారు. 241 పట్టణ ప్రాంతాల్లో, 766 గ్రామీణ ప్రాంతాల్లో, 37 ట్రాన్సిట్, 27 మొబైల్ బూత్లను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు జరిగే పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో 101 మంది పర్యవేక్షణ అధికారులు, 4277 మంది బూత్ సభ్యులు, 428 మంది ఆరోగ్య కార్యకర్తలు, 1,112 ఆశా కార్యకర్తలు, 1,501 అంగన్వాడీ కార్యకర్తలు విధులు నిర్వర్తించనున్నారు. మొత్తం 2,11,100 పోలియో డోస్లను అందుబాటులో ఉంచారు. ఉదయం 7 గంటల నుంచే.. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం 28న ఉదయం 7 గంటల నుంచే పోలియో చుక్కలు వేసేందుకు సర్వం సిద్ధం చేసింది. 29, 30 తేదీల్లో తప్పిపోయిన వారి ఇంటింటికీ తిరిగి పోలి యో చుక్కలు వేస్తారు. ప్రధానంగా అటవీ ప్రాంతాలు, గిరిజన పల్లెలు, మారుమూల గ్రామా లు, ప్రధాన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్లు, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. -
సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు బాలసభలు
మోపాల్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీయడానికి, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, సభా భయం పోగొట్టడానికి బాలసభలు ఎంతగానో దోహదపడతాయని సిర్పూర్ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వి సత్యనారాయణ తెలిపారు. శనివారం మండలంలోని సిర్పూర్ హైస్కూల్లో బాలసభను నిర్వహించారు. ఈసందర్భంగా సుమారు 50 మంది విద్యార్థులు పద్యాలు, కవితలు, పాటలతోపాటు కథలు చదవడం, కథలు చెప్పడం వంటి వాటిని వేదికపై నిర్భయంగా చెప్పారు. 9వ తరగతి విద్యార్థులు పి లతిక, ఆర్ ప్రణూష వ్యాఖ్యాతలుగా నిర్వహించిన బాలసభలో ఉపాధ్యాయులు మోహన్, గాయత్రి, స్పందన, అక్బర్ బాషా, డాక్టర్ హజారే శ్రీనివాస్, డాక్టర్ కాసర్ల నరేష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
జీజీ కాలేజీ హౌస్ ఫుల్!
ఖలీల్వాడి : జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో అ డ్మిషన్లు పూర్తిగా అయినట్లు ప్రిన్సిపాల్ రాంమోహ న్ రెడ్డి తెలిపారు. కళాశాలకు మంజూరైన 1860 సీ ట్లకు 1860 మంది విద్యార్థులు ఇప్పటికే ఆప్షన్ చేసుకొని కేటాయించబడ్డారని, శనివారం 350 మంది వి ద్యార్థులు కళాశాలలో ప్రవేశం పొందారని ప్రిన్సిపా ల్ తెలిపారు. జులై 4 వరకు అడ్మిషన్స్ జరుగుతాయని, ఒరిజినల్ సర్టిఫికేట్స్తోపాటు, జిరాక్స్ కాపీ లు తీసుకొని రావాలని విద్యార్థులకు సూచించారు. కోర్సుల వారీగా ఇలా.. బీ.ఏ. (తె.మీ)60, ఉర్దూ మీడియం 60, రెగ్యులర్ 300, రీస్ట్రక్చర్ పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్లో 60 మొ త్తం బీఏలో 480 విద్యార్థులు చేరారన్నారు. అలాగే ఉపాధి ఆధారిత(ఏఈడీపీ) కోర్సులు బీకాం విభాగంలో బీఎఫ్ఎస్ఐ –60, సైన్స్ విభాగంలో హెల్త్ కే ర్ మేనేజ్ మెంట్ 60, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్సు ల్లో 60, బీకాం సీఏ 180, ఫైనాన్స్ 60, టాక్సేషన్ 60, అనాలైటిక్స్ 60, బీసీఏ 60, బీబీఏ 60 మంది విద్యార్థులు చేరారన్నారు. బీఎస్సీ లైఫ్ సైన్స్లో 300, ఫిజికల్ సైన్స్ 360, ఆనర్స్ 60 మంది వి ద్యార్థులు ప్రవేశాలు పొందారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్ రంగరత్నం, అడ్మిషన్ కన్వీనర్లు రమేష్ గౌడ్, రామస్వామి, దండు స్వామి, వినయ్ కుమార్, రంజిత, ఉమాకిరణ్, జయ ప్రసాద్, నహీదా బేగం, రాజేశ్, రామక్రిష్ణ, కిరణ్ కుమార్ గౌడ్, అధ్యాపకులు షేక్ చాంద్, దీపక్, రాహుల్, రజిత, వెంకటేష్ గౌడ్, అనసూయ, ముత్తెన్న, చంద్రశేఖర్, వేణుగోపాల్, అనసూయ, తదితరులు పాల్గొన్నారు. -
‘ఎస్ఐఆర్’తో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత
● మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ సుభాష్నగర్: సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్ఐఆర్)తో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత పటిష్టవంతంగా అమలుకు అవకాశం ఉంటుందని బీజేపీ శాసనసభా పక్ష మాజీ నేత యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఎస్ఐఆర్లో భాగంగా నగరంలోని శ్రీనగర్ కాలనీలోగల తన నివాసానికి విచ్చేసిన ఎన్నికల సంఘం ప్రతినిధులకు తన వ్యక్తిగత, కుటుంబ ఓటు వివరాలను ఆయన అందజేశారు. బీఎల్ఓలు ఇచ్చిన ఎస్ఐఆర్ పత్రాన్ని పూర్తి వివరాలతో నమోదు చేసి అందించారు. ఈసందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు స్వామి యాదవ్ ఉన్నారు. మోపాల్ మండలం కులాస్పూర్, కంజర్, మోపాల్, బోర్గాం(పి) గ్రామాల్లో పోలింగ్ బూత్ వారీగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని తహసీల్దార్ ఎన్ రేఖ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఓటరుకు ఈఎఫ్ ఫారం చేరాలని, ఒక్కో ఇంటికి మూడు, నాలుగు సార్లు వెళ్లాలని తహసీల్దార్ సూచించారు. సర్పంచులు జనార్దన్రెడ్డి, రాకేష్, రవికుమార్, జీపీవోలు దేవన్న, వేణుగోపాల్రావు, బీఎల్వోలు ఉన్నారు. ఎస్ఆర్ ప్రక్రియను తనిఖీ చేసిన ఆర్డీవో ఇందల్వాయి/జక్రాన్పల్లి : ఇందల్వాయి మండలం మల్లాపూర్, లోలం, ఎల్లారెడ్డిపల్లి, అన్సాన్పల్లి, జక్రాన్పల్లి మండలంలో పలు గ్రామాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని శనివారం ఆర్డీవో రాజేంద్రకుమార్ తనిఖీ చేశారు. సికింద్రాపూర్లో ఓటర్లకు ఫామ్స్ పంపిణీ చేశారు. తహసీల్దార్లు కిరణ్మయి, బాలయ్య రెవెన్యూ ఇస్పెక్టర్ ప్రవీణ్, లోలం సర్పంచ్ రామకృష్ణ గౌడ్, మల్లాపూర్ సర్పంచ్ మోహన్, అన్సాన్పల్లి సర్పంచ్ మౌనిక నిఖిల్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
మడులు తడపని బోర్లు
ఆర్మూర్: ‘నాకున్న పది ఎకరాల వ్యవసాయ భూమికి నాలుగు బోరుబావులున్నాయి. అయితే, బోరుబావులకు వర్షం తోడైతేనే పొలంలో నీరు నిలిచి నాట్లు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటి వరకు సరైన వర్షాలు లేకపోవడంతో కేవలం రెండు ఎకరాల్లోనే వరి సాగు చేసేందుకు సిద్ధమయ్యాను. మిగిలిన ఎనిమిది ఎకరాల్లో ఏం చేయాలో పాలుపోవడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన రైతు కాపు సుధాకర్. వరి పండించేందుకు ఎక్కువ నీరు అవసరం. సరిపడా భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా లేకపోవడంతో వరి పంట పండించే రైతులకు కష్టకాలం అని చెప్పొ చ్చు. తొలకరి కురవని కారణంగా సోయాబీన్ విత్తుకోవడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. బోరు బావులపై ఆధారపడి మొక్కజొన్న విత్తుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మొక్కజొన్న కూడా చేతికి వచ్చే అవకాశం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసం తంటాలు..కమ్మర్పల్లి : బాల్కొండ నియోజకవర్గ రైతాంగం బోరుబావులపై ఆధారపడ్డారు. బాల్కొండ, వేల్పూ ర్, భీమ్గల్, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో రై తులు ప్రధానంగా మొక్కజొన్న, పసుపు, సోయాబీ న్ పంటలను సాగు చేస్తున్నారు. వరి నారు దశలో ఉన్నది. తొలకరికే విత్తనాలు వేసుకున్నప్పటికీ వాటి ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతున్నప్పటికీ డ్రిప్ తో పంటలకు నీటిని అందిస్తున్నారు. -
అనుమతి లేకుండా ఉర్దూ భాష బోధన
● తల్లిదండ్రుల ఆగ్రహం● పాఠశాలను సీజ్ చేయాలని బీజేపీ నాయకుల డిమాండ్పెర్కిట్: పెర్కిట్లోని భరత్చంద్ర పాఠశాలలో అనుమతులు లేకుండా ఉర్దూ బోధనతోపాటు ప్రార్థన సమయంలో నమాజ్ చేయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శనివారం వారు పాఠశాలను ముట్టడించి కరస్పాండెంట్ మల్లయ్యతో వాగ్వాదానికి దిగారు. స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టి, వెంటనే పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో తల్లిదండ్రుల ఆరోపణలు వాస్తంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. విచారణ నివేదికను ఉన్నాతాధికారులకు పంపించనున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు. కరస్పాండెంట్ మల్లయ్యను, ప్రిన్సిపాల్ అమీర్ఖాన్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. మైనారిటీ విద్యార్థులను ఆకర్షించడానికే స్కూల్ యాజమాన్యం ఉర్దూ భాష బోధన ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
రావయ్యా.. వాన దేవుడా..
ఆర్మూర్: మృగశిర కార్తె మొదలై 20 రోజులు దా టింది. ఆకాశం మబ్బు పట్టి మొండికేసింది. వాన కురవనంటోంది. దుక్కి దున్నిన నేల నెర్రెలు బారింది. రైతు గుండె చెరువైంది. ఎల్నినో ప్రభావమని వాతావరణ శాఖ చెప్తున్నా పల్లె జనం మాత్రం తమకు తెలిసిన భాషలో వాన దేవుడికి విన్నపాలు పంపుతున్నారు. ‘త్వరగా రా వాన దేవుడా.. నీవు వస్తేనే పుష్కలంగా పంటలు పండుతాయి.. మా పొట్టలు నిండుతాయని పాటల రూపంలో వేడుకుంటున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వర్షాల కోసం కప్పల పెళ్లి, గ్రామ దేవతలకు జలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. 101 బిందెల కన్నీరు.. వేల్పూర్ మండలం పడగల్లో గోదావరి జలాలతో గంగపుత్రులు గ్రామ దేవతలకు అభిషేకాలు చేశా రు. కమ్మర్పల్లి మండలం ఉప్లూర్లో గ్రామస్తులు 101 బిందెలతో గ్రామదేవతల గుడికి చేరారు. ‘‘అమ్మా, నీ కాళ్లు కడుగుతున్నాం. మా కన్నీళ్లు తుడువమ్మా’’ అనే ఆర్తనాదం. జలా భిషేకం తర్వా త ఉప్పు, మిరపకాయలు పోసి ‘‘మా బతుకులు ఉప్పగా, కారంగా అయిపోయినయ్. తీపి చేయ మ్మా’’ అని మొక్కుకున్నారు. ‘‘గతేడాది ఇలాగే చేస్తే మూడు రోజులకు కుండపోత వాన పడింది’’ అని 60 ఏళ్ల నర్సయ్య నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘పల్లె’ జనం విన్నపాలు కప్పల పెళ్లిళ్లు, గ్రామ దేవతలకు జలాభిషేకాలు జూన్ ముగిసినా కురవని వర్షాలు.. ఆందోళనలో రైతన్నలు -
ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి
జక్రాన్పల్లి : మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్ నిఖిల్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ పాఠశాలను పీడీఎస్యూ నాయకులు సందర్శించి మాట్లాడారు. అనంతరం టీచర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఈవో, పాఠశాల ప్రధానోపా ధ్యాయుడు శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి సరిగా చదవకపోవడంతో టీచర్ బాగా చదవాలని మందలించి కొట్టాడని ఎంఈవో తెలిపారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని అహ్మద్పుర కాలనీలో శనివారం రాత్రి సీసీఎస్ పోలీసులు 25 క్వింటాళ్ల రేషన్ బియ్యంను పట్టుకున్నారు. కాలనీకి చెందిన సిరాజొద్దీన్ వద్ద రేషన్ బియ్యం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. రెండో టౌన్ పోలీస్స్టేషన్లో అతడి ని అప్పగించగా, కేసు నమోదు అయింది. -
నదీ తీరం.. ఆగమాగం
బోధన్: బోధన్ నియోజకవర్గంలో ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగు ఆగమాగమైంది. బోధన్ అర్బన్, రూ రల్, సాలూర, ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో ప్రధానంగా వరి సాగు చేస్తారు. రెండోస్థానంలో సోయా ఉంటుంది. వర్షాభావ పరిస్థితితో ప్రస్తు తం బోరు బావుల వద్దనే స్వల్ప విస్తీర్ణంలో వరి నా ట్లు వేశారు. నియోజకవర్గంలో లక్షా 10 వేల ఎక రాల సాగు భూమి ఉండగా, 90 వేల ఎకరాల వరకు వరి సాగవుతుంది. ప్రస్తుతం బోరుబావుల వద్ద 15 వేల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేసినట్లు అంచనా. వాగులు, చెరువులు అడుగంటి పో యాయి. మంజీర, గోదావరి నదుల జలాధారంతో నిర్మించిన సాలూర, రెంజల్ మండలంలోని కందకుర్తి, తాడ్బిలోలి, నవీపేట మండలంలోని నందిగా మ, నిజాంపూర్, నాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు నదుల్లో నీళ్లు లేక వట్టిపోతున్నాయి. అలీసాగర్ ఎత్తిపోతల పథకం కింద 53 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ లిఫ్ట్ పనిచేయడం లేదు. నిజాంసాగర్ నీటిపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. -
ఫీజు రీయింబర్స్మెంట్ రద్దుకు ప్రభుత్వం కుట్ర
● జూలై 2న కళాశాలల బంద్కు పిలుపు ● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్నిజామాబాద్ రూరల్: రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీ యింబర్స్మెంట్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చే స్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా జూలై 2న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగా ణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేసింది బహుజన వ ర్గాలేనని, త్యాగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేస్తే ప్ర త్యే క రాష్ట్రం ఫలాలను అగ్రకులాలు అనుభవిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అగ్రకులాల అధిపత్యం నడుస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ జులై 2న కాలేజీల బంద్ చేపడుతామని, 15న వేలాదిమంది విద్యార్థులతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల సత్తాను ప్రభుత్వానికి చూ పిస్తామని వెల్లడించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, దర్శనం దేవేందర్, బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, కరిపే రవీందర్, కొయ్యడ శంకర్, శ్రీలత, బగ్గలి అజయ్, చంద్రకాంత్, సత్యప్రకాష్, చంద్రమోహన్, అపర్ణ, రేఖ, గంగాధర్, శ్రీనివాస్, జయ, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
నిజామాబాద్ లీగల్ : యువత మత్తుపదార్థాలకు బానిస కావొద్దని న్యాయసేవ సంస్థ డ్రగ్స్ కమిటీ సభ్యులు మాణిక్ రాజు తెలిపారు. శనివారం నిజామాబాద్ యాంటి డ్రగ్స్ కమిటీ ఆధ్వర్యంలో ఓ ప్రయివేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన చైతన్య సదస్సులో న్యాయసేవ సంస్థ సభ్యులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ పిల్లలు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన చాక్లెట్ లాంటి వాటిని తీసుకోవద్దని సూచించారు. . న్యాయసేవ సంస్థ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, న్యాయసేవ సంస్థ సభ్యులు జగన్మోహన్ గౌడ్, హైకోర్టు న్యాయవాది సరళా మహేందర్ గౌడ్, పాఠశాల అధ్యాపకులు, విధ్యార్థులు, న్యాయసేవ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం డిచ్పల్లి: డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామ సర్పంచ్ పానుగంటి రూప అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ – 4 ఆధ్వర్యంలో శనివారం డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి వలంటీర్లు ఫ్లకార్డులు, బ్యానర్లు చేతబట్టి ‘డ్రగ్స్ వద్దు.. బతుకు ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డ్రగ్స్కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్రెడ్డి, ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సయ్య, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తించాలని వినతి
మోపాల్/నిజామాబాద్ రూరల్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నానని, తనను ఉద్యమకారుడిగా గుర్తించి ప్రభుత్వం తరపున లబ్ధి చేకూర్చాలని బోడ మహేందర్ కోరారు. ఈమేరకు శనివారం జిల్లాకు విచ్చేసిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను మండలంలోని ముదక్పల్లి గ్రామానికి చెందిన మహేందర్ కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు కోనేరుసాయికుమార్ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యమకారులను గుర్తించి వారిని గౌరవించేందుకు ప్రభుత్వం కే కేశవరావు అధ్యక్షతన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. -
డ్రగ్స్కు దూరంగా ఉండాలి
తెయూ(డిచ్పల్లి): డ్రగ్స్ వల్ల యువత భవిష్య త్ నాశనమవుతుందని, ప్రతిఒక్కరూ డ్రగ్స్కు దూరంగా ఉండాలని తెలంగాణ యూనివర్సి టీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు అన్నా రు. తెయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎన్ఎస్ఎస్ యూనిట్–4 ఆధ్వర్యంలో శనివారం డ్రగ్స్ వ్య తిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కా ర్యక్రమానికి ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా హాజ రై, మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు. ‘డ్రగ్స్ వద్దు–బతుకు ముద్దు’ అ నే నినాదంతో విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు డ్రగ్స్కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఎన్ఎస్ఎస్ యూనిట్–4 ఆఫీసర్ నర్స య్య, వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నార్త్ త హసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న రాహుల్పై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ రికార్డుల (పహాణీల) లో అక్రమంగా మార్పులు చేయడం, రికార్డుల తారుమారు, విధి నిర్వహణలో అవకతవకల కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా పాలనాధికారి కఠిన చర్యలకు ఉపక్రమించారు. సదరు ఉద్యోగిని సస్పెండ్ చేయడంతోపాటు, శాఖాపరమైన విచారణకు ఆదే శించారు. నిజామాబాద్ నార్త్ మండలం పరిధి లోని కంఠేశ్వర్ ప్రాంతంలో సర్వే నంబర్లు 291/ఏ, 291ఏఏ, 292లకు సంబంధించిన రె వెన్యూ రికార్డుల్లో టాంపరింగ్ జరిగినట్లు వచ్చి న ఆరోపణలపై కలెక్టర్ స్పందించి, ప్రాథమిక విచారణ జరిపించారు. టాంపరింగ్ వాస్తవమేనని విచారణలో వెల్లడవడంతోపాటు పలు ఆరోపణలు రావడంతో రాహుల్ను సస్పెండ్ చేశారు. అలాగే శాఖాపరమైన విచారణ అనంతరం సమగ్ర నివేదికను అనుసరిస్తూ తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని రాకాసీపే ట్ కాలనీలో రోడ్డు గుంతలమయం కావడంతో బీజేపీ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపా రు. సదరు రోడ్డులోని గుంతల్లో నిలిచిన నీటి లో శనివారం వారు నాట్లు వేస్తూ, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసులోటి గోపి కి షన్, 11వ వార్డు కౌన్సిలర్ రేణుకా బాలరాజు మాట్లాడుతూ.. రాకాసీపేట్లోని అయ్యప్ప స్వామి కమాన్ నుంచి ఆటో స్టాండ్ వరకు గల రోడ్డు గుంతలమయంగా మారిందని, వర్షం నీ రు నిలిచి వాహనాల రాకాపోకలకు తీవ్ర ఇ బ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సమస్య ను అధికారులకు విన్నవించినా పరిష్కరించ డం లేదన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డుపై గుంతలు పూడ్చి ప్రజల ఇబ్బందులు తీర్చాలని లేనిపక్షంలో ఆందోళన చేస్తా మని హెచ్చరించారు. నాయకులు గుంత గంగాధర్, గొడుకు ధర్మపురి, పప్పుల వేణు, మా సిని వినోద్, ఽమిర్జాపూర్ అర్వింద్, పవన్ తదితరులు ఉన్నారు. నవీపేట: మండలంలోని సిరన్పల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న పేకాట స్థావరంపై ఛీతా ఫోర్స్, నవీపేట పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడిలో పేకాడుతున్న 8 మందిని పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.లక్షకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 5 ద్విచక్ర వాహనాలతోపాటు 8 మొబైల్ ఫోన్లను స్వాధీ నం చేసుకున్నారు. సిరికొండ: మండలంలోని న్యావనంది గ్రామంలో చౌట్పల్లి సరితకు మంజూరైన రూ. 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును శనివారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు.ఎమ్మెల్యే భూపతిరెడ్డి చెక్కును మంజూరు చేయించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మామిడికింది నరేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రిక్క ముత్తెన్న, మాజీ ఎంపీటీసీ ముష్కిల్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకాశం వైపు అన్నదాత చూపు
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, మోపాల్, నిజామాబాద్ రూరల్, జక్రాన్పల్లి మండలాల్లో ప్రధానంగా వరి సాగు చేస్తారు. రెండో స్థానంలో మొక్కజొన్న పండిస్తారు. బో రు బావుల్లో తగినంత నీళ్లున్న రైతులు మాత్రం ట్రాక్టర్ల ద్వారా దమ్ము చేసి నా రుమడుల కోసం పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్లో 69,930 ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా నిర్ణయించగా, ప్రస్తుతం బోరుబావుల వద్ద 1,013 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. మొక్కజొన్న 221 ఎకరాలు, సోయా 184 ఎకరాలు, ఇతర పంటలు 1,418 ఎకరాల్లో వేశారు. జూలై చివరి వారం వరకు వర్షాలు కురవక పోతే పంటల సాగు ప్రశ్నార్థకంగా మారనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
యూరియా యాప్ను తొలగించాలి
పెర్కిట్(ఆర్మూర్): ప్రభుత్వం యూరియా యాప్ను తొలగించాలని ఆర్మూర్ మండలం గోవింద్పేట్ సొసైటీ ఎదుట రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యాప్తో యూరియా లభించక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వ్యవసాయం చేసుకునే రైతులకు సాంకేతిక పరిజ్ఞానం లేక పోవడం వల్ల యాప్లో బుక్ చేసుకోలేక పోతున్నామన్నారు. దీంతో ఖరీఫ్లో సాగు పనులు ఆలస్యమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ చైర్మన్ బంటు మహిపాల్ మాట్లాడుతూ రైతులందరికి యూరియా లభించేలా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. -
కప్పలకు తాళి కట్టిన పల్లెలు..
టెక్నాలజీ ఎంత పెరిగినా, వాతావరణ శాఖ ఎన్ని చెప్పినా, పల్లె ప్రజలు మాత్రం వాన కోసం అనాదిగా వస్తున్న ఆచారాలనే నమ్ముకుంటారు. ఇది కేవలం ఆచారం కాదని, ఎండిన నేల తడవాలని కోరుకునే కోటి గొంతుకల ఆరాటమని చెప్తున్నారు. దీంతో పలు పల్లెల్లో కప్పల పెళ్లికి ముహూర్తాలు ఖరారు అయ్యాయి. చెరువు గట్టున, కాలువ పక్కన రెండు కప్పలని పట్టుకొచ్చి డప్పు చప్పుళ్లతో ఊరేగిస్తున్నారు. ప్రతి ఇంటి ముందు కప్పల బుట్టను దించి, మహిళలు నీళ్లు చల్లి, అక్షింతలు వేసి ‘‘వాన పడాలి, పంట పండాలి’’ అని మొక్కుకున్నారు. -
‘వీబీ జీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి’
నిజామాబాద్ రూరల్: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే వీబీ జీ రామ్జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వెంటనే ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడారు. జూలై 1వ తేదీ నుంచి ఈచట్టాన్ని కేంద్రం అమలు చేయాలని చూస్తోందన్నారు. ఇందుకు దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేవేందర్ సింగ్, ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకటేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, ఏ రమేష్ బాబు , ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రాములు, ఏషాల గంగాధర్, ఐద్వా సంఘం జిల్లా అధ్యక్ష – కార్యదర్శులు ఏ అనిత, బి సుజాత, వృత్తి సంఘాల నాయకులు ఇడగొట్టి సాయిలు, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు సిర్పలింగం లు పాల్గొన్నారు. -
నిజమైన ఉద్యమకారులను గుర్తించడమే లక్ష్యం
● ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ● నగరంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిజామాబాద్ రూరల్: నిజమైన ఉద్యమకారులను గుర్తించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ ప్రొ ఫెసర్ కోదండరాం అన్నారు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో శనివారం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమం నిజాయితీపరులతో జరిగిందన్నారు. 12 ఏళ్లలో తెలంగాణ ఉ ద్యమకారులు గుర్తింపునకు నోచుకోలేదని, వారి కు టుంబాలు దీనస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా ముందుకు వెళతామన్నారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఎ లాంటి సూచనలు చేయాలో కమిటీ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల వివరా లు ఆన్లైన్ వెబ్సైట్లో ఏర్పాటు చేయనున్నామన్నారు. పార్టీలకతీతంగా ఉద్యమకారుల గుర్తింపు ఉంటుందన్నారు. కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అంతకుముందు కళాకారులు ఆటపాటలు, తెలంగాణ ఉద్యమ గేయాలతో ఆలరించారు. ఉర్దూ అకాడమి చైర్మన్ తా హెర్ బిన్ హందాన్, ప్రభాకర్, గైని గంగారాం, మా జీ జెడ్పీ చైర్మన్ విఠల్రావు, సూరి, తెలంగాణ శంక ర్, పుల్గం మోహన్, కోనేరు సాయికుమార్, ఆదె ప్రవీణ్, ఉద్యమకారులు తదితరులున్నారు. -
భక్తిశ్రద్ధలతో మొహర్రం
ఆర్మూర్టౌన్/రుద్రూర్/బోధన్టౌన్: జిల్లాలో శుక్రవారం పలుచోట్ల మొహర్రం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆర్మూర్లో రాంమందిర్ పాఠశాల ఎదుట పీరీలను ఏర్పాటు చేశారు. పలు కాలనీల్లో పీరీల ఊరేగింపు నిర్వహించారు. గోల్ బంగ్లా ప్రాంతంలో బాజన్న దర్గాలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈకార్యక్రమంలో 29వ వార్డు కౌన్సిలర్ తిరుమల సుమన్, సూర్య సమాజ్ ఆరె కటిక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బోధన్లో శక్కర్నగర్ కాలనీలో, పాన్గల్లీ ప్రాంతాల్లో పీరీల ఊరేగింపు నిర్వహించారు. పీరీలకు స్వాగతం పలుకుతూ ప్ర త్యేక పూజలు నిర్వహించి మిఠాయిలు పంచి పెట్టా రు. అనంతరం సమీపంలోని చెరువులో పీరీలను నిమజ్జనం చేశారు. మొహర్రం పండుగ సత్యం, త్యాగం, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని మత గురువు మొహమ్మద్ అబ్దుల్ బారీ ఖాద్రి అన్నారు.రుద్రూర్ మండలం అక్బర్నగర్ గ్రామంలో మొహర్రం సందర్భంగా హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహమ్మద్ అబ్దుల్ హది ఖాద్రి, అహ్మద్ జబ్రతుల్లా ఖాద్రి, షేక్ మొహమ్మద్, పాషా, సత్తార్, షేక్ జావీద్, లతీఫ్, ఫహీం , ఇర్ఫాన్ పాల్గొన్నారు.అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ బోధన్: ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామ అంగన్వాడీ కేంద్రానికి శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు మీటరు బిగించి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు.ఈ సందర్భంగా విద్యుత్ శాఖ నిజామాబాద్ ఏడీఈ తోట రాజశేఖర్ మాట్లాడుతూ ఎడపల్లి మండలంలోని 11 అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. తాజాగా పోచారం, ధర్మారం, వడ్డెపల్లి, బాపునగర్, నెహ్రునగర్, ఠాణాకలాన్, కుర్నాపల్లి గ్రామాల అంగన్వాడీ కేంద్రాలకు కనెక్షన్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. పోచారం గ్రామ సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్, ఉపసర్పంచ్ పూజిత, వార్డు సభ్యులు మమత, దండెం సాయిలు,వీడీసీ కోశాధికారి లక్ష్మినారాయణ,నవీన్, శంకర్, ప్రేమానంద్,గోపి, యశ్వంత్ పాల్గొన్నారు. రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి రెంజల్/రుద్రూర్/వర్ని: ప్రభుత్వం అందించే పె ట్టుబడి సాయం రైతు భరోసాకు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని రెంజల్, కోటగిరి, రుద్రూ ర్, పోతంగల్, వర్ని మండల వ్యవసాయాధికారు లు సిద్ధిరామేశ్వర్, రాజు, సాయికృష్ణ, నిశిత రాజశేఖర్ తెలిపారు. 2025–26, 2026–27 సంవత్సరాలకు సంబంధించి ఇప్పటివరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోని వారు రైతువేదికల్లో ఆయా గ్రామాల ఏఈవోలకు ఈ నెల 30 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి రుద్రూర్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోటగిరి ఎస్సై శ్రీనివాస్ సూచించారు. పోతంగల్ మండలం కొడిచర్ల గ్రామంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మన ఉరు, మన భద్రత,మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడి, ప్రజలతో ప్రతిజ్ఞ చేశారు. సర్పంచ్ కవిత ఈర్వంత్ , ఏఎస్ఐ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో విజయవంతం చేయాలి బోధన్టౌన్(బోధన్): డివిజన్ పరిధిలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో విజయవంతం చేయాలని జిల్లా ఉప వైద్యాఽధికారి విద్యా రణ్వాలక్కర్ శుక్రవారం తెలిపారు. డివిజన్లో 284 పల్స్ పోలియో బూత్లు ఏర్పాటు చేశామని, 0–5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ప్రజల రుణం తీర్చుకుంటా రెంజల్(బోధన్): ఓటు వేసి సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానని నీలా సర్పంచ్ క్యాతం యోగేష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతు తనపై, తన ఆధ్వర్యంలో ని పాలకవర్గంపై తప్పుడు ఆరోపణలు చేస్తు గ్రా మాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. సస్పెన్షన్కు గురైన కార్యదర్శి సాయిలు అవి నీతి,అక్రమాలనుఅడ్డుకునేప్రయత్నం చేశానన్నారు. ఉచిత వైద్య శిబిరం నవీపేట: మండలంలోని నాగేపూర్ గ్రామంలో హోప్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉచితంగా ఈసీజీ, రక్త పరీక్షలను నిర్వహించారు. నరాలు, ఎముకలు, కంటి, దంత, పిల్లల వైద్య నిపుణులు 207 మంది రోగులను పరీక్షించి, ఉచితంగా మందులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఆస్పత్రి వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సంక్షిప్తం -
ప్రజాపంథా నేత డీవీకేకు ఘన నివాళి
బోధన్/ఆర్మూర్: సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా సి ద్ధాంతకర్త, అమరుడు డీవీ కృష్ణ 4 వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం బోధన్లోని హెడ్పోస్టాఫీస్ వద్ద పార్టీ నాయకులు, ప్రజాసంఘాల స భ్యులు డీవీకే చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. జిల్లాలో బీడీకార్మికులను సంఘటితం చేసి, వారి సమస్యల పరిష్కారం, హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించడంలో ఆయన కృషి చిరస్మరణీయమన్నారు. పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి బీ.మల్లేశ్, మండల కార్యదర్శి పడాల శంకర్, నాయకులు, సభ్యులు ఎండీ ఇర్షాద్, బొంతల సాయిలు, పోశెట్టి, దేవయ్య, లాలయ్య, గంగారాం, సాయిబాబా,శ్రీను, లక్ష్మణ్, నాగేశ్వర తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆర్మూర్లోని కు మార్ నారాయణ భవన్లో బీ.కృష్ణ నాలుగో వర్ధంతి సభను నిర్వహించారు. ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బీ.దేవరాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్య క్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు వీ.ప్రభాకర్ ఎర్రజెండాను ఆవిష్కరించి, మాట్లాడారు. నివాళి అర్పించిన వారిలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ముత్తన్న, సీనియర్ జ ర్నలిస్టు కొంగర శ్రీనివాస్, డివిజన్ నాయకులు ఎస్.సురేష్, జీ.కిషన్, కే.రాజేశ్వర్, వీ.సత్తెవ్వ, బీ.కిషన్, ఎం.నరేందర్, యూ.రాజన్న, నడిపన్న, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.


