Nizamabad District News
-
నేలకొరిగిన ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు
● విద్యుత్ సంస్థకు రూ.1.20 కోట్లకుపైగా నష్టం!సుభాష్నగర్: గాలివాన బీభత్సానికి జిల్లాలోని పలు చోట్ల 220 కేవీ టవర్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యు త్ స్తంభాలు నేలకొరిగాయి. డిచ్పల్లి మండలం యానంపల్లి, సుద్దాపల్లి, లింగ సముద్రం గ్రామాల శివార్లలో ఉన్న నాలుగు 220 కేవీ విద్యుత్ టవర్లు నేలకొరిగాయి. భారీ గాలులకు 10కిపైగా ట్రాన్స్ఫార్మర్లు, 200 వరకు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. యానంపల్లిలోని 400 కేవీ సబ్స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని 220 కేవీ టవర్లు నేలకొరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బోధన్, సాలూర, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, తదితర మండలాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. గాలివాన సృష్టించిన బీభత్సంతో ట్రాన్స్ కో, డిస్కమ్కు కలిపి రూ.1.20 కోట్లకుపైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. రాత్రంతా శ్రమించి.. విద్యుత్ అందించి.. గాలి వాన బీభత్సం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు రాత్రి 11.30 గంటల నుంచే రంగంలోకి దిగారు. అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఒకటి, రెండు గ్రామాలు మినహా అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు శ్రమించి విద్యుత్ సరఫరా చేశారు. తెలంగాణ యూనివర్సిటీ, లింగసముద్రం గ్రామాలకు ఆదివారం మధ్యాహ్నం వరకు విద్యుత్ను పునరుద్ధరించారు. పరిశీలించిన ఎస్ఈ యానంపల్లి 400కేవీ సబ్స్టేషన్ సమీపంలో నేలకొరిగిన 220 కేవీ విద్యుత్ టవర్లను ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. ఏడీఈలు, ఏఈలు, లైన్మెన్ల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఈ హరిచంద్, ట్రాన్స్ కో సీఈ పాపారావు, ట్రాన్స్ కో ఎస్ఈ బీఎస్ రావు ఉన్నారు. -
రైతు కష్టంపై రాళ్లు
బీభత్సం సృష్టించిన వడగండ్ల వాన● సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి, సాలూర మండలాల్లో తీవ్ర ప్రభావం ● భారీగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు ● జిల్లా వ్యాప్తంగా 6,088 ఎకరాల్లో పంటనష్టం రైతు కష్టంపై రాళ్లు పడ్డాయి. పచ్చగా అలరారుతూ ఎన్నో ఆశలు రేకెత్తించిన పంట వడగండ్ల దెబ్బకు నేలవాలింది. పంట చేతికొచ్చిన సమయంలో తమకు ఇదేం పరిస్థితి అంటూ రైతులు గుండెలు బాదుకుంటున్నారు. శనివారం రాత్రి కురిసిన వడగండ్లు బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో బీభత్సం సృష్టించాయి. వరి, మొక్కజొన్న పంటలతోపాటు అరటితోటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. డిచ్పల్లి మండలం సుద్దపల్లి, లింగసముద్రం, యానంపల్లి శివారులో హైటెన్షన్ విద్యుత్ టవర్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. సుమారు ఆరు రోజుల వ్యవధిలోనే వడగండ్లు రెండుసార్లు రైతులను దెబ్బకొట్టాయి. ఇప్పటి వరకు సుమారు 9 వేల ఎకరాల విస్తీర్ణంలో 4వేల మందికిపైగా రైతులు పంటలను నష్టపోయారు. అధికారులు పంట నష్టంపై అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను పంపారు. – డిచ్పల్లి/బోధన్/ధర్పల్లి/సిరికొండ డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో శనివారం కురిసిన వడగండ్ల (రాళ్ల వాన) వర్షం బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈదురు గాలులకు రాళ్లవాన తోడు కావడంతో వరి గింజలు పొలాల్లోనే నేలరాలాయి. మొక్కజొన్న చేనులోనే వాలిపోయింది. మామిడి కాయలు రాలిపోగా, అరటి చెట్లు దెబ్బతిన్నాయి. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి, సాలూర మండలాల్లో అధికంగా పంటలకు నష్టం వాటిల్లగా.. జిల్లాలోని 22 గ్రామాల్లో 6,088 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించింది. కాగా 3,985మంది రైతులు తమ పంటలను నష్టపోయినట్లుగా అధికారులు గుర్తించారు. అత్యధికంగా 5,065 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లి రైతులను పూర్తిగా దెబ్బతీసింది. మొక్కజొన్న 826, మామిడి 138, అరటి, కూరగాయలు 10 ఎకరాల్లో నష్టపోయాయి. అలాగే కోతకోసి కల్లాల్లో ఆరబోసిన వడ్లు, మక్కలు తడిసిపోయాయి. బాధిత రైతులు లబోదిబోముంటున్నారు. ఇటు జిల్లాకు వర్షసూచన ఉండడంతో రైతులు ముందస్తు కోతలకు వెళ్తున్నారు. మార్చి 31న కురిసిన అకాల వర్షానికి 2,559 ఎకరాల్లో జరిగిన పంట నష్టాన్ని మరువపోకముందే శనివారం వడగళ్ల బీభత్సంతో పంట నష్టం మరింత రెట్టింపు అయ్యింది. -
జగ్జీవన్ రామ్ సేవలు ఆదర్శనీయం
ఖలీల్వాడి: దేశ భవిష్యత్ కోసం, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బాబూ జగ్జీవన్రామ్ అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అర్బన్ ఎ మ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భా రత మాజీ ఉపప్రధాని జగ్జీవన్ రామ్ జయంతిని జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే, కలెక్టర్తోపాటు నగర మేయ ర్ ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడు గు గంగాధర్, ఆర్డీవో రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రత్యేకించి యువతరం, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని వక్తులు అన్నారు. మహనీయుల గొప్పతనాన్ని, వారు చేసిన కృషిని భావితరాలకు తెలియజేస్తూ, వారిలో స్ఫూర్తిని నింపేందు కు ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతుల ను అధికారికంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. మహనీయుల జీవిత విశేషాలను తెలుసుకొని, వా రి అడుగుజాడల్లో పయనించాలని యువతకు పిలుపునిచ్చారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి రాజ్ గంగారాం, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్, ఆయా సంఘాల ప్రతినిధులు పా ల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన ప్రముఖ దళిత నేత సిద్ధిరాములును స్మరిస్తూ, రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. మహనీయుల గొప్పతనాన్ని భావితరాలకు తెలపాలి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి -
సెల్ఫోన్ కొనివ్వలేదని గడ్డిమందు తాగిన యువకుడు
● చికిత్స పొందుతూ మృతి వేల్పూర్(బాల్కొండ): సెల్ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మెండోరా మండలం సోన్పేట్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోన్పేట్ గ్రామానికి చెందిన పిండి మధు(19) తల్లిదండ్రులు సెల్ఫోన్ కొనివ్వలేదని మార్చి 30న గడ్డిమందు తాగాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చికిత్స కోసం నిజామాబాద్లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మధు మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుహాసిని తెలిపారు. నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సుభాష్నగర్: నిజామాబాద్ నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఉదయం 9.45 గంటలకు పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ముఖ్యఅతిథులుగా ఎంపీ అర్వింద్ ధర్మపురి, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని లక్ష్మీనారాయణ కోరారు. నేడు, రేపు కలెక్టరేట్లో ఎన్సీడీ స్క్రీనింగ్ సుభాష్నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలోభాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగుల సౌకర్యార్థం నగరంలోని సమీకృత కలెక్టరేట్లో 6, 7 తేదీల్లో ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో రాజశ్రీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇతర క్యాన్సర్ల నిర్ధారణ, క్షయ వ్యాధి స్క్రీనింగ్, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని గ్రౌండ్ఫ్లోర్లోని ఎన్ఐసీ రూం, ఎన్ఐసీ వీసీ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బంది కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా, ఆరోగ్య సేవలను వినియోగించుకునేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. స్క్రీనింగ్కు హాజరయ్యేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని ఆమె సూచించారు. పీఏసీఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా షేక్ బాబా బోధన్రూరల్: ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘం (పీఏసీఎస్) యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా బోధన్ మండలంలోని పెంటాకాలన్ సొసైటీ సీఈవో షేక్ బాబా ఎన్నికయ్యారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో పీఏసీఎస్ సీఈవో సమావేశం నిర్వహించి అధ్యక్షుడిగా షేక్ బాబా, ప్రధాన కార్యదర్శిగా మోహిద్ పాషా, టెజ్రరర్గా వంశీకృష్ణను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా షేక్ బాబా మాట్లాడుతూ పీఏసీఎస్ యూనియన్ బలోపేతానికి, సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన యూనియన్ సభ్యులకు, సీనియర్లకు ధన్యవాదాలు తెలిపారు. -
ఇంటి పన్ను @ 98.09 శాతం
● రూ.30.03 కోట్లకు రూ.29.46 కోట్లు వసూలు ● 262 గ్రామాల్లో వందశాతం పూర్తి సుభాష్నగర్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 2025–26వ ఆర్థిక సంవత్సరానికి ఇంటి, కుళాయిల పన్నుల వసూళ్లలో పంచాయతీ అధికారులు లక్ష్యానికి చేరువయ్యారు. ఏకంగా 98.09 శాతం వసూలు చేసి జిల్లాను రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిపారు. మార్చి నెలలో డీపీవో శ్రీనివాస్రావు డీఎల్పీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో నిత్యం సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేక దృష్టి సారించారు. 100 శాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా ముందుకుసాగారు. 45 శాతం గ్రామాల్లో వంద శాతం జిల్లా వ్యాప్తంగా 262 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేశారు. అంటే దాదాపు 45 శాతానికిపైనే గ్రామాల్లో వంద శాతం చెల్లింపులు పూర్తయ్యాయి. పన్నుల వసూళ్లలో వెనుకబడి ఉన్న మండలాలు, గ్రామాలపై నిత్యం పర్యవేక్షణ చేపట్టారు. వసూళ్లలో మందకొడిగా ఉన్న గ్రామాలను ఎంపిక చేసి పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వసూలు చేపట్టారు. దీంతో కొంతమేర సత్ఫలితాలు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో మిగతా గ్రామాల్లో కూడా వంద శాతం లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు కృషి చేయాలని డీపీవో శ్రీనివాస్రావు తెలిపారు. కాగా, వందశాతం పన్నులు వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మిగిలింది రూ.57.27 లక్షలే.. జిల్లాలోని 31 మండలాల్లో 545 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మొత్తం రూ.30.03 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మార్చి 31వ తేదీలోపు వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి నిత్యం సమావేశాల ద్వారా ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.29.46 కోట్లు (98.09 శాతం) వసూలు చేశారు. కేవలం రూ.57.27 లక్షల వరకు వసూలు కావాల్సి ఉంది. -
ఆదుకుంటాం
డిచ్పల్లి: వడగండ్లు, అకాలవర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణ చర్యల నిమిత్తం ఇప్పటికే వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో అకాల వర్షం, వడగండ్లు, గాలివాన బీభత్సం కారణంగా ఆయా ప్రాంతాల్లో గుడిసెలు కోల్పోయిన వా రిని సైతం గుర్తించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, నేలకొరిగిన చెట్లతొలగింపు ఇతరత్రా నష్టాలను సైతం గుర్తించి తగు చర్యలు తీసుకుంటామ ని స్పష్టం చేశారు. తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి వెంట తప్పకుండా ఉంటామని పేర్కొన్నారు. -
రోడ్డుపై ధాన్యం.. ప్రాణ సంకటం
● రాత్రి సమయంలో ప్రమాదాలు ● కల్లాలు లేక రోడ్లపై ధాన్యం ఆరబోస్తున్న రైతులు రేడియం స్టిక్కర్లు పెట్టాలి.. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోస్తున్నప్పుడు కర్రలు ఏర్పాటు చేసుకొని వాటికి రేడియం స్టిక్కర్లను అతికించుకోవాలి. దీంతో వాహనదారులు వాటిని గుర్తించి జాగ్రత్తపడతారు. ఒక్కో స్టిక్కరు ఖరీదు రూ.250 వరకు ఉంటుంది. రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసుకోవాలని మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులకు అవగాహన కల్పించాం. ఒక్కో సర్పంచ్ పది స్టిక్కర్లు కొనుగోలు చేసి రైతులకు అందించాలని సూచించా. తాను పది స్టిక్కర్లకు ఆర్డర్ చేశా. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు జరిగితే కేసులు నమోదు చేస్తాం. – చంద్రమోహన్, ఎస్సైరెంజల్(బోధన్): జిల్లాలో యాసంగి సీజన్ వరి కోతలు ఊపందుకున్నాయి. అయితే, వరి పొలాల్లో ధాన్యం ఆరబెట్టుకునేందుకు వసతులు లేక రైతులు ధాన్యాన్ని రోడ్లపై పోస్తున్నారు. రహదారులపై సగం వరకు ధాన్యంతో కప్పేయడంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట రెంజల్ మండలం సాటాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇరువురికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కల్లాలు లేకపోవడంతో రైతులు రోడ్లను ఆశ్రయిస్తుండగా వాహనదారులకు మాత్రం ప్రాణ సంకటంగా మారింది. రాత్రివేళల్లో వాహనదారులు జారిపడుతున్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కమ్మర్పల్లి (మోర్తాడ్): మోర్తాడ్లోని వివేకానంద విద్యాలయానికి చెందిన 2009–10 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గ్రామంలోని ఓ ఫంక్షన్హాల్లో కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఆనాటి విద్యార్థులందరూ తరలివచ్చారు. ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులందరూ మళ్లీ ఒక్కచోట కలుసుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆనాటి హెచ్ఎం నంబుల గిరితోపాటు ఉపాధ్యాయులు లావణ్య, షైక్ అహ్మద్, సురేష్, సవీన్, స్వామి తదితరులను కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానించారు.అనంతరం వారంతా సహాపంక్తి భోజనాలు చేశారు. -
నేలకూలిన చెట్లు.. స్తంభాలు
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కురిసిన వడగళ్ల వర్షం కారణంగా డిచ్పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో 3,238 ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి ధాన్యం గింజలు నేలరాలిపోయాయి. పొలాల వద్దకు వెళ్లిన రైతులు రాలిపోయిన వడ్ల గింజలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. సుమారు రూ.10 కోట్ల వరకు నష్టం కలిగినట్లు ప్రాథమిక అంచనా. భారీ ఈదురు గాలుల కారణంగా డిచ్పల్లి మండలం సుద్దపల్లి, లింగసముద్రం, యానంపల్లి శివారులో హైటెన్షన్ విద్యుత్ టవర్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్థంబాలు నేలకూలాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మామిడి కాయలు రాలిపోయాయి. స్తంబాలు నేలకూలడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది అర్ధరాత్రి రంగంలోకి దిగి తెల్లవారుఝాము వరకు తీవ్రంగా శ్రమించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికంది వచ్చే సమయంలో నేలపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇందల్వాయి మండలంలో రోడ్లపై ఆరబోసిన వడ్లు వర్షంలో తడిసిపోయాయి. నాకు సొంతంగా ఉన్న నాలుగెకరాలతో పాటు 16ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 20 ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. శనివారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు కోతకు వచ్చిన వరి పంట పూర్తిగా దెబ్బతింది. వరి ధాన్యం గింజలు మొత్తం నేలరాలిపోయి, గడ్డి మాత్రమే మిగిలింది. పశువుల మేతకు తప్ప దేనికి పనికిరాదు. సుమారు రూ.10 లక్షల నష్టపోయాను. –పానుగంటి లక్ష్మణ్రెడ్డి, రైతు, సుద్దపల్లి -
చేపల వేటకు వెళ్లి ఒకరు..
సిరికొండ: మండలంలోని సర్పల్లి తండాలోగల కొత్తకుంట చెరువులో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. సర్పల్లి తండాకు చెందిన మాలావత్ రమేష్(29) అనే యువకుడు ఆదివారం మద్యం మత్తులో తండా శివారులోని కొత్త కుంట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఇటీవల ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పత్తిపాకల రాజన్న (59)కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుమారులకు వివాహాలు జరిగాయి. కొంతకాలంగా రాజన్న అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాల కారణంగా మనస్థాపం చెందాడు. దీంతో గత నెల 31వ తేదీన అతడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి పెద్దకొడుకు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రశాంతంగా పేరిణి నాట్య పరీక్షలు
నిజామాబాద్ రూరల్: నగరంలోని విశ్వవికాస్ హైస్కూల్లో ఆదివారం ‘పేరిణి నాట్య ప్రవేశిక లెవెల్స్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. బోర్డు ఫర్ ప్రమోషన్ భారత్ కల్చర్ అండ్ ట్రెడీషనల్ ఆర్ట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్ గవర్నమెంట్ అఫ్ తెలంగాణ, నటరాజ కళాకృష్ణ నృత్య జ్యోతి అకాడమీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు పేరిణి నాట్య గురువు తోట ప్రశాంత్, శ్రీ సమ్మోహన నాట్యాలయం వ్యవస్థాపకులు నట్టువంగం సహకరించారు. చతరాజు నవ్యజ, పేరిణి నాట్య అధ్యాపకురాలు ‘విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, హన్మకొండ’కు చెందిన యాజమాన్యం పరీక్షలను నిర్వహించారు. వినాయక నగర్, అర్సపల్లి, డిచ్పల్లి, నారాయణ్ఖేడ్ సహా తదితర ప్రాంతాల నుంచి సుమారు 60 మంది ఈ పరీక్షలలో పాల్గొన్నారు. గజ్జెల రంజిత్ కుమార్ వరంగల్ చీఫ్ ఎక్సామినర్గా విధులు నిర్వహించారు. పల్నాటి శ్రీజ, బండారి వైష్ణవి, పేరిణి నాట్య బోధకులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేల్పూర్: ప్రస్తుత కాలంలో ప్రతి మనిషికి ఆధ్యాత్మిక శిక్షణ ఎంతో అవసరమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మండలంలోని మండలం మోతె గ్రామానికి చెందిన అల్లపుల్ల గంగారెడ్డి తన తండ్రి రాజులు స్మృతిలో సంపాదకత్వం వహించి రూపొందించిన ‘లోపలిదారి’ పుస్తకాన్ని ఈటల రాజేందర్ ఆదివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చదివిన సైఫాబాద్ సైన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి గంగారెడ్డి ఆధ్యాత్మిక పుస్తకానికి సంపాదకత్వం వహించి పబ్లిష్ చేయడం, దానిని తాను ఆవిష్కరించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. మోతకు చెందిన గంగారెడ్డి తన తండ్రి స్మారకార్థం గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు రూ. 10 లక్షలు విరాళం ప్రకటించిన విషయం విదితమే. కార్యక్రమంలో నాగరాజు, గంగారెడ్డి, రమేశ్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ చోరీకి గురైంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని వాంబే కాలనీలో నివాసం ఉంటున్న బీఆర్ఎస్ పట్టణ నాయకుడు షౌకత్ అలీ శనివారం రాత్రి తన వాహనాన్ని ఇంటి ముందు పార్కింగ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ వాహనాన్ని ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు చోరీని గుర్తించి, పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. -
సనాతన ధర్మ రక్షణకు జాగృతం కావాలి
● గుడిమెట్ మహాదేవ్ ధర్మపీఠం సద్గురు మహదేవ్ స్వామీజీ ● సాలూరలో హిందూ సమ్మేళనం బోధన్: సనాతన ధర్మ రక్షణకు హిందూబంధువులంతా జాగృతం కావాలని గుడిమెట్ మహాదేవ్ ధర్మ పీఠం సద్గురు మహాదేవ్ స్వామీజీ అన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్ల ప్రస్థానం నేపథ్యంలో ఆదివారం రాత్రి సాలూర మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి మహాదేవ్ స్వామీజీ, మల్లారం ఆశ్రమ పీఠం స్వామి బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్, ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ కార్యవాహ ముత్యం విచ్చేశారు. ముందుగా జ్యోతిప్రజ్వలన, అనంతరం హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మహాదేవ్ స్వామీజీ మాట్లాడుతూ.. పురాతన కాలం నుంచి హిందూ ధర్మ రక్షణ కోసం ఎంతో మంది మహానీయులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. ప్రతి ఇంట్లో భగవద్గీత గ్రంథం తప్పనిసరిగా ఉండాలన్నారు. తమ పిల్లలను ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మిబాయి, అహల్య బాయిలా తయారు చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రజ్ఞశ్రీ హైస్కూల్, వాగ్ధేవి విద్యానికేతన్, నీలా జెడ్పీహెచ్ఎస్ విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. హిందూ జనజాగరణ సమితి అధ్యక్షుడు ముట్టెన్ ప్రకాశ్, నిర్వాహణ కార్యదర్శి నీలకంఠరావు తదితరులు పాల్గొన్నారు. హిందూ సమాజ సంఘటితమే దేశ అభ్యున్నతికి మార్గం మాక్లూర్: హిందూ సమాజాన్ని సంఘటితంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ మల్లారం లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకుడు పిట్ల కృష్ణ మహరాజ్ అన్నారు. రాష్ట్రీయ స్వ యం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ధి ఉత్సవా ల్లో భాగంగా ఆదివారం మండలంలోని అడవి మామిడిపల్లి శివారులోని వంజరి సంఘ కల్యాణ మండపంలో హిందూ సమ్మేళన సమితి అధ్యక్ష, కా ర్యదర్శులు చౌడ లక్ష్మణ్, బాశెట్టి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తల్లితండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే హిందూ మార్గం గురించి చెప్పాలన్నారు. సమ్మేళనంలో వక్తలు శుభ దేశ్పాండే, మధన్గుప్తా, నర్రవెంకట శివకుమార్, సర్పంచ్ కూన లత, స్థానిక హిందూ ధర్మ రక్షకులు గంగోనే సంతోష్, చింత ప్రవీణ్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వడగళ్ల విధ్వంసం
● మందర్నా, హున్సా, ఖాజాపూర్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం ● దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయాధికారులు బోధన్: మంజీర నది తీరంలో శనివారం సాయంత్రం వడగళ్ల వాన విధ్వంసం సృష్టించింది. సాలూర మండలం మందర్నా, హున్సా, ఖాజాపూర్ గ్రామాల శివారులో భారీ ఈదురుగాలులు, వడగళ్ల వర్షానికి చేతికందిన వేలాది ఎకరాల వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. వరి పంట 75 శాతం పైగా గింజరాలి పూర్తిగా నష్టం వాటిల్లింది. మామిడి కాయ నేలరాలగా, అరటి కొమ్మలు విరిగిపోయాయి. భారీ ఈదురుగాలులకు పంట పొలాలు, రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగిపడ్డాయి. కాగా, సాలూర మండలం మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర గ్రామాల శివారులో పంట నష్టం ప్రాథమిక అంచనాలను మండల వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. హున్సా శివారులో ఏఈవోలు, రైతులతో కలిసి దెబ్బతిన్న పంటలను ఏవో శ్వేత పరిశీలించారు. నాలుగు గ్రామాల్లో వరి పంట 1,650, మొక్కజొన్న 820, అరటి 49, మామిడి పంట 58 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు ఏవో తెలిపారు. -
జగ్జీవన్రామ్ ఆశయసాధనకు కృషి చేయాలి
డిచ్పల్లి: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ అన్నారు. మండలంలోని బెటాలియన్ లో ఆదివారం జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కమాండెంట్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, న్యాయం, సేవాభావంతో పని చేయాలని సిబ్బందికి సూచించారు. బెటాలియన్ అధికారులు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలో.. నిజామాబాద్అర్బన్: నగరంలో ఆదివారం మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బరికుంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. ఈసందర్భంగా కంఠేశ్వర్ కమన్ వద్ద గల ఆయన విగ్రహనికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో బాబు జగ్జీవన్రామ్ చిత్రపటానికి డీసీపీ బస్వారెడ్డి, అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
ట్రాక్టర్ అదుపుతప్పి రైతు మృతి
కమ్మర్పల్లి (భీమ్గల్): భీమ్గల్ మండలం బెజ్జోర గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి ఓ రైతు మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బెజ్జోర గ్రామానికి చెందిన సూల్ల శ్రీనివాస్ (44) అనే రైతు ఆదివారం వరి ధాన్యాన్ని ట్రాక్టర్లో నింపుకొని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో శ్రీనివాస్ ట్రాక్టర్ కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
● రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు.. ● కరెంట్ షాక్తో ఒకరు చందూరు మండలంలో.. వర్ని: చందూరు మండలం ఘన్పూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. ఘన్పూర్ గ్రామానికి చెందిన రమేష్, లక్ష్మణ్లు బైక్పై హుమ్నాపూర్ వెళ్లగా శనివారం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఘన్పూర్ శివారులో వారి బైక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పడంతో ఇద్దరు కిందపడ్డారు. ఈ ఘటనలో రమేష్(38) అక్కడికక్కడే మృతిచెందగా, లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు లక్ష్మణ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోటగిరి మండలంలో.. రుద్రూర్: మండలంలోని సులేమాన్ ఫారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. కోటగిరి మండల కేంద్రానికి చెందిన మస్కల లింగయ్య (32) అనే యువకుడు పని నిమిత్తం ఈ నెల 2న సాయంత్రం తన టీవీఎస్ ఎక్స్ఎల్పై బయటకు వెళ్లాడు. సులేమాన్ ఫారం మార్గమధ్యలో అతడి వాహనం అదుపుతప్పి పోలం సమీపంలో ఉన్న గుంతలో పడిపోయాడు. ఈ ఘటనలో లింగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. శనివారం అటువైపుగా వెళ్లిన వారు అతడి మృతదేహన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతుడి భార్య సంధ్యారాణి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ఓ రైతు ప్ర మాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డికి చెందిన మర్లు రామకిష్టయ్య (60) అనే రైతు శనివారం పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు అతడికి విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో పలువురు మృతిచెందారు. చందూరు, కోటగిరి మండలాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత చెందగా, ఎల్లారెడ్డిలో ఓ రైతు కరెంట్షాక్తో మరణించాడు. అలాగే ధర్పల్లి మండలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువకుడి మృతదేహం లభ్యమైంది. -
సీఎం రేవంత్ రెడ్డిది బోగస్ ప్రచారం
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఇక్కడ అమలు చేయకపోగా కేరళలో మళ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ అమలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి బోగస్ ప్రచారం చేస్తున్నారని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2500, వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింది తులం బంగారం, 2 లక్షల ఉద్యోగాల కల్పన, పేదలకు ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీని పట్టణ ప్రాంతంలో, ఎస్సీ, ఎస్టీలకు దళిత బంధు కింద పది లక్షలు ఇలాంటి హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఆదర్శంగా పనిచేస్తుందని, దళితులకు, అణగారిన వర్గాల వారిని పూజారులుగా నియమించిన ఏకై క రాష్ట్రం కేరళ అని గుర్తు చేశారు. దళితులు క్రిస్టియన్లోకి మారినా వారిపై వివక్ష పోవడం లేదని, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. దేశంలో మతం మారడం సాధ్యమవుతుంది కానీ కులం మారడం మాత్రం సాధ్యం కావడం లేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో పసుపు తదితర పంటలకు నష్టం వాటిల్లిందని, వాటికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు వెంకట్, బుర్రి ప్రసాద్, ఆశన్న రమేష్బాబు, పెద్ద వెంకట రాములు, పల్లపు వెంకటేష్, శంకర్ గౌడ్, గంగాధర్, సుజాత, శిల్ప లింగం, రాజు, అంజయ్య, అనిత, శ్రీదేవి, ఓడ్డెన్న, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు తాడ్వాయి (ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమా దంలో ఒకరికి తీవ్ర గాయా లు అయ్యా యని గ్రామస్తులు తెలిపా రు. వివరాలు ఇలా.. జగన్రెడ్డి అనే వ్యక్తి శనివారం తన భార్యను బైక్పై ఎక్కించుకొని ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి వైపు బయలుదేరాడు. తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామిలో ఇన్చార్జీ ఏపీవోగా పనిచేస్తున్న తిరుపతి తన కారును నడుపుతూ చేసుకుంటే చిట్యాల రోడ్డు నుంచి కార్యాలయానికి బయలుదేరాడు. తాడ్వాయిలోని ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిపై బైక్ను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళుతున్న జగన్రెడ్డికి తీవ్రగాయాలు కాగా భార్యకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులుఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు కోటగిరిలో యువకుడి ఆత్మహత్యాయత్నం ● సీపీఆర్ చేసి, ప్రాణాలు కాపాడిన పోలీసులు రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలోని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు కాపాడారు. వివరాలు ఇలా.. కోటగిరిలోని వినాయకనగర్కు చెందిన పిల్లి సంజీవ్ (30) కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో శనివారం అతడు తన ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ ఇలియాస్, హోంగార్డు సుధాకర్ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లో ఉరి తాడుకు వేలాడుతున్న సంజీవ్ను వెంటనే తాడు తీసివేసి కిందకు దించారు. అనంతరం అతడికి సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడారు. పోలీసుల అప్రమత్తతతో యువకుడి ప్రాణాలు నిలిచాయని స్థానికులు వారిని అభినందించారు. -
అదృశ్యమైన యువకుడు అనుమాన్పాద స్థితిలో..
ధర్పల్లి: మండలంలో ఐదు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు గ్రామ శివారులోని ఓ సెల్ టవర్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని రేకులపల్లి గ్రామానికి చెందిన కాత్రాజి రాజశేఖర్ (30) గత నెల 31న పని నిమిత్తం ఇంటి నుంచి ఉదయం వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. బంధువులు, చుట్టుపక్కల ఎంత వెతికిన అతడి ఆచూకీ లభించలేదు. దీంతో ఈనెల 1న తన అన్న కనిపించడం లేదని మృతుడి తమ్ముడు శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామ శివారులోని ఓ సెల్ టవర్ పక్కన శనివారం రాజశేఖర్ మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ భిక్షపతి, సిరికొండ ఎస్సై రామకృష్ణ ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని సీఐ తెలిపారు. -
పేద కుటుంబాన్ని ఆదుకోరూ..
● రోడ్డు ప్రమాదంతో ఏళ్లుగా మంచానికే పరిమితమైన భర్త ● కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న భార్య ● ఉదార స్వభావులు సాయం చేయాలంటూ వేడుకోలు మాక్లూర్: కుటుంబ పెద్దదిక్కయిన భ ర్త రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితం కావడంతో ఆ కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో భార్యనే కుటుంబానికి పెద్దదిక్కుగా మారి కూలి పని, బీడీలు చుడుతూ రాత్రింబవళ్లు కష్టపడుతోంది. వచ్చిన చాలీచాలని డబ్బులు తన భర్త చికిత్సకు, ముగ్గురు ఆడపిల్లల పోషణకు ఏమా త్రం చాలకపోవడంతో ఆ పేద కుటుంబం ఏళ్లు గా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వివరాలు ఇలా.. మండలంలోని ధర్మోరా గ్రా మానికి చెందిన హన్మాండ్లుకు భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం హన్మాండ్లు సౌదీ దేశానికి వెళ్లగా, నెలరోజులకే అక్కడ రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. అతడు కోమాలోకి వెళ్లగా అక్కడి కంపెనీ స్వదేశానికి పంపించేసింది. అతడి భార్య ఎకరం భూ మిని విక్రయించి చికిత్స చే యించింది. అయినా డబ్బు లు సరిపోక సుమారు రూ.8 లక్షల వరకు అప్పులు చేసింది. అయినా అతడి రెండు కాళ్లు పని చేయక, వెన్నుపూ స విరిగి, ఒక కిడ్ని చెడిపో యి జీవచ్చవంలా 11ఏళ్లుగా మంచానికే పరిమి తమయ్యాడు. అతడి నెలవారి మందులకు రూ: 8వేలు కావాల్సి ఉంటుంది. భార్య కవిత మా త్రం ఆత్మస్థైర్యం వీడకుండా కూలిపని, బీడీలు చుడుతూ చాలీచాలని డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. దీంతో ఇటీవల బతుకు భారమై తన కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి అలిసిపోయింది. ఉధార స్వభావులు ఎవరైన ముందుకు వచ్చి ఆదుకుంటారేమోనని ఎదురు చూస్తోంది. సా యం చేయదలచిన దాతలు 91001 92092కు ఫోన్పే చేయాలని ఆమె వేడుకుంటున్నారు. -
పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ● పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం రుద్రూర్: బాన్సువాడ నియోజక వర్గంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం, ముదిరాజ్ ఫంక్షన్హాల్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్తపల్లి ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో టాయిలెట్స్ నిర్మాణానికి రూ. ఐదు లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఇప్పటికే 11వేల ఇళ్లు నిర్మించి దేశంలోనే ఆదర్శంగా నిలిచినట్టు పేర్కొన్నారు. మిగిలిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. గ్రామాల్లో అభివృద్ధికి అందరు ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పోతంగల్ మండల కేంద్రంతోపాటు కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, ఏఎంసీ చైర్మన్ హన్మంతు, తహసీల్దార్ గంగాధర్, డిప్యూటి డీఎంహెచ్వో సమత, జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కరాటే రమేష్, ముదిరాజ్ సంఘ నాయకులు నీరడి గంగాధర్, బీమా సాయరెడ్డి, కప్ప గణేష్, సుదర్శన్, సర్పంచ్లు గంగారాం, సంధ్య, విండో ఇన్చార్జిలు రియాజుద్దీన్, పుష్ప, ఏవోలు నిశిత, రాజు, ఎంపీడీవో చందర్, ఎంఆర్ఐ సయ్యద్ హుస్సేన్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
25ఏళ్లుగా రోడ్లపైనే తిరిగిన మానసిక వైకల్య వ్యక్తి
● కలెక్టర్ చొరవతో కుటుంబాన్ని కలుసుకున్న వైనం కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణంలో రోడ్ల వెంట తిరుగుతున్న మానసిక వైకల్యంగల వ్యక్తి 25 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నారు. పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి (50) మానసిక వైకల్యంతో రోడ్ల వెంబడి తిరుగుతున్న విషయం ఇటీవల కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన స్పందించి జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించడంతో శనివారం అతన్ని వృద్ధాశ్రమానికి తరలించి వైద్యసేవలు, ఆహారం అందించారు. తాను జగిత్యాల జిల్లాకు చెందిన వాడినని చెప్పడంతో అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు కామారెడ్డికి రాగా, అధికారులు అతడిని అప్పగించారు. 25ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుడిని కలుసుకోవడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా కలెక్టర్ ఆదేశం ప్రకారం మానసిక వైలక్యం వ్యక్తి వివరాలు, కుటుంబసభ్యుల వివరాలు గోప్యంగా ఉంచారు. రుద్రూర్: కోటగిరి మండల కేంద్రానికి చెందిన దున్నె సుజాత (66) అనే వృద్ధురాలు అదృశ్యమైనట్టు పోలీసులు తెలిపారు. సుజాత శనివారం తెల్లవారుజామున ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, సన్నిహితుల వద్ద వెతికినప్పటికీ ఆమె ఆచూకీ భించలేదు. దీంతో సుజాత కుమారుడు ప్రవీణ్ పోలీసులకు ఫి ర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
● కామారెడ్డి కొత్త బస్టాండ్లో ఘటన● రెండు నెలలకు పోలీసులకు చిక్కిన నిందితుడు కామారెడ్డి క్రైం: రెండు నెలల కిత్రం సెల్ఫోన్, నగదు కాజేసే క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తిపై దాడి చేసి హత్య చేసి, పరారైన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి కొత్త బస్టాండ్లోని ఎంక్వయిరీ కౌంటర్ వద్ద ఫిబ్రవరి 12న రాత్రి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల మధ్య ఫోన్ విషయంలో వాగ్వాదం మొదలైంది. ఓ వ్యక్తి సెల్ఫోన్, నగదు కాజేసే ఉద్దేశంతో మరో వ్యక్తిపై అందరూ చూస్తుండగానే దాడి చేశాడు. బాధితుడికి ముఖం, ఛాతీపై తీవ్రమైన గాయాలు కావడంతో కిందపడిపోయి మృతి చెందాడు. వెంటనే మృతుడి వద్దనున్న సెల్ఫోన్, రూ.300 నగదును దోచుకుని నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా నిందితుడి ఆనవాళ్లు కనిపించాయి. కానీ హత్యకు గురైన, హత్యకు పాల్పడిన ఇద్దరి వివరాలు లభించలేదు. కొద్దిరోజులకు మృతుడిని ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. అతడు కొంత కాలంగా కామారెడ్డిలో కూలీపనులు చేసకుంటూ జీవించేవాడని తేలింది. కామారెడ్డి రైల్వే స్టేషన్ ప్రాంతంలో శనివారం నిందితుడి కదలికలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని మహారాష్ట్రలోని అర్నితలోక్ యవత్మాల్ జిల్లా పంగిడి గ్రామానికి చెందిన ఆకాష్ నాగూరావ్ కోవెగా గుర్తించామన్నారు. నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడిని పట్టుకున్న పట్టణ ఎస్హెచ్వో నరహరి, ఏఎస్సై రంగారావు, కానిస్టేబుళ్లు కమలాకర్, రాజు, సంపత్లను, నిందితుడి సమాచారం ఇచ్చిన షేక్ సద్దాం అనే వ్యక్తిని అభినందించారు. కామారెడ్డి క్రైం: నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో జరిగిన ఓ దారి దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో శనివారం ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ నెల 1న పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన గోలి సుదీప్ కుమార్ రామారెడ్డి రోడ్డులోని చర్చి సమీపం నుంచి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో ఓ వ్యక్తి బైక్పై వచ్చి అతడిని అడ్డగించాడు. కత్తితో బెదిరించి రూ.2వేలు లాక్కున్నాడు. అంతేకాకుండా ఫోన్పే ద్వారా మరో రూ. 8వేలు అతడి ఖాతాకు బదలాయించుకుని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. నిందితుడిని అదే కాలనీకి చెందిన శివరాత్రి నవీన్గా గుర్తించారు. శనివారం అతడిని గంజ్ గేటు వద్ద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అలాగే అతడి వద్ద నుంచి ఓ బైక్, కత్తి, మొబైల్ ఫోన్, రూ.8వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. మాక్లూర్: పెళ్లి అయిన నెలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడకు చెందిన అఖిల (25)కు ఆలూర్ మండలం కల్లేడ గ్రామానికి చెందిన శ్రీకాంత్తో మార్చి 5న వివా హం జరిగింది. శనివారం ఉదయం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అఖిల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు. పూర్తివివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. జక్రాన్పల్లి: జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులోగల పేకాట స్థావరంపై శనివారం సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులు దాడిచేశారు. పేకాడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు వా హనాలు, మూడు సెల్ఫోన్లు, రూ. 10,940 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించారు. అనంతరం బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై మహేష్ తెలిపారు. -
పన్ను కట్టు.. బహుమతి పట్టు
ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ పూర్తిస్థాయిలో పన్ను వసూలు కాకపోవడంతో వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు వినూత్న ఆలోచన చేశారు. తాజా బకాయిలతోపాటు మొండి బకాయిలు చెల్లించిన వారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి పన్ను చెల్లించే వారి పేర్లతో జూన్ 26న లక్కీ డ్రా తీయనున్నారు. మొదటి బహుమతిగా గ్రాము బంగారం, రెండో బహుమతిగా స్మార్ట్ఫోన్, మూడో బహుమతిగా ఫ్రిడ్జ్, నాలుగో బహుమతిగా మిక్సీ గ్రైండర్, ఐదో బహుమతిగా పట్టుచీర అందిస్తామని ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా బ్రోచర్లు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. వందశాతం పన్ను వసూలైతేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో లక్కీ డ్రా తీస్తున్నామని సర్పంచ్ బేల్దారి నవీన్ తెలిపారు. – వేల్పూర్ ● దేశాంతర ప్రేమ వివాహం నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ మండలంలోని లింగి తండాాకు చెందిన బొంత వెంకటేశ్, శ్రీలంకకు చెందిన ఉమేక తారుషి ల వివాహం లింగి తండాలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో శనివారం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి తండా పెద్దలతో పాటు శ్రీలంకకు చెందిన అమ్మాయి బంధువులు హాజరయ్యారు. ఎల్లలు దాటిన వీరి ప్రేమ వివాహానికి మండల ప్రజలు సైతం హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా వరుడు వెంకటేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా దుబాయ్లోని ఒకే కంపెనీలో పనిచేస్తున్నామని, అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి చేసుకున్న వివాహం తనకు ఎంతో సంతోషానిచ్చిందని అన్నారు. పెళ్లికి పెద్ద సంఖ్యలో తండాావాసులు పాల్గొన్నారు. -
క్రమక్రమంగా కిందకు..
జిల్లాలో నెలకు మీటరు చొప్పున తగ్గుతున్న భూగర్భ జలాలు ● మార్చిలో నీటి మట్టం 11.67 మీటర్లు ● అయినా గత ఏడాదితో పోలిస్తే బెటరే!డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో నెలకు మీటరు చొప్పున కిందికి వెళ్లగా.. ప్రస్తుతం 11.67 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయి. ఇది 2025 ఫిబ్రవరి నెలతో (13.45మీటర్లు) పోలిస్తే కొంచెం మెరుగైన పరిస్థితి. ఇటీవల గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు జిల్లాలో 82 పరిశీలక బోరు బావుల (ఫీజో మీటర్లు) ద్వారా జనవరి నెలకు సంబంధించిన నీటి లెక్కలను తీశారు. ఇందులో 36 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. అలాగే 36 ఫీజో మీటర్లలో 10 నుంచి 20 మీటర్ల లోపు భూగర్భ జలాలున్నాయి. అదే విధంగా 10 ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఆరోగ్యకర నీటి మట్టాలు 56శాతం విస్తీర్ణంలో ఉన్నాయి. భీమ్గల్, సిరికొండ, డిచ్పల్లి, మోపాల్, నవీపేట్ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో వేగంగా నీటి మట్టాలు తగ్గుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో మోటార్లకు నీరందక బోర్లు ఎత్తిపోతున్నాయి. ప్రజలు, రైతులు భూగర్భ జలాలు తగు మోతాదులో వాడుకోవాలని, రానున్న రోజు ల్లో నీటి ఎద్దటి రాకుండా వృథా నీరు భూమిలోకి చేరేలా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని జిల్లా భూగర్భజల శాఖ అధికారి శ్రీనివాస్బాబు కోరారు. నెలల వారీగా భూగర్భ జలాలు (మీటర్లలో..) -
ధర్మపురి సంజయ్కి న్యాయం చేయాలి
● అభిమానులు, అనుచరుల నిరాహార దీక్ష ● విరమింపజేసిన కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు రామకృష్ణసుభాష్నగర్: నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్కి తగిన పదవి ఇచ్చి న్యాయం చే యాలని డీఎస్ అభిమానులు, అనుచరులు డి మాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని గాంధీచౌక్లో శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ సంజయ్కి మద్దతుగా నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి మాజీ మంత్రి డీఎస్ సమాధి వద్ద ధర్మ పురి సంజయ్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్న సంజయ్కి తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. దీక్షా శిబిరంలో సంజయ్ అభిమానులు ఆకుల చిన్న రాజేశ్వర్, పుప్పాల విజయ, ఆమంద్ వెంకటేష్, కపిల్, పుప్పాల బాజన్న, సందీప్, రణధీర్, బగ్గాలి అజయ్, తదితరులు కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సందర్శించి సంజయ్ అభిమానులతో మాట్లాడారు. కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సమ న్యాయం జరుగుతుందని, పార్టీ కోసం పని చేసిన వారికి సరైన సమయంలో గుర్తించి పదవులు ఇస్తారన్నారు. సంజయ్కి తగిన గుర్తింపు, న్యాయం జరిగేలా చూస్తామని రామకృష్ణ హామీనిచ్చి అభిమానుల దీక్షను చెరుకురసం ఇచ్చి విరమింపజేశారు. కాంగ్రెస్లో మున్నూరుకాపులకు అన్యాయం జరుగుతోందని సంజయ్ అభిమానులు అనుకోవవద్దని, తనకు కార్పొరేషన్ డీసీసీ పదవి ఇచ్చారని, అలాగే రాంభూపాల్ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారని గుర్తు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ ఎలాంటి పనులు చేయొద్దని, డీఎస్ అనుచరులుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు నడవాలని కోరారు. 2029 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించుకునే విధంగా అందరం కలిసి నడుద్దామని, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట నాయకులు సాయి బసవ, తదితరులు ఉన్నారు. -
ఇక బహిరంగ వేలమే!
సుభాష్నగర్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లు ఇక బహిరంగ వేలం పద్ధతిలోనే కొనసాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా మార్కెట్లలో తీసుకొచ్చిన ఈ–నామ్ 2.0లో సాంకేతిక లోపాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ–నామ్ 1.0ను అప్డేట్ చేయకుండా సాఫ్ట్వేర్ను పూర్తిగా మార్చడం, 2.0పై మార్కెట్ సిబ్బంది శిక్షణ ఇవ్వకపోవడం, ముఖ్యంగా నిజామాబాద్ వంటి పెద్ద మార్కెట్లలో పసుపు సీజన్లో ఈ సాఫ్ట్వేర్ను అమలు చేయడంతో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. లాట్ నంబర్లు ఇవ్వడంలో జాప్యం కారణంగా కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. తద్వారా పసుపు రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఇక నుంచి నిజామాబాద్ మార్కెట్యార్డులో బహిరంగ వేలం పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక లోపాలు శ్రద్ధానంద్ గంజ్లో ఈ–నామ్ 2.0ను అమలు చేయాలని ఢిల్లీ నుంచి ఇక్కడికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులు వచ్చారు. గతంలో తలెత్తిన సాంకేతిక లోపాలను మార్కెట్ కమిటీ ఉద్యోగులు వారి దృష్టికి తీసుకెళ్లారు. వారు వాటిని నోట్ చేసుకుని సరి చేస్తామని చెప్పారు.ఈ క్రమంలోనే మార్చి 31న ఈ–నామ్ 2.0 అమలు చేయాలని మార్కెట్ కమిటీకి ఆదేశాలు అందాయి. దీంతో చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అధికారులు, కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులతో సమావేశమై.. రైతుల వివరాలు సేకరించి కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. 3వ తేదీన 30వేల బస్తాలు (సుమారు 5వేల లాట్స్) వచ్చాయి. మధ్యాహ్నమైనా సాంకేతిక కారణాల వల్ల కేవలం 1435 లాట్నంబర్లు మాత్రమే జారీ చేశారు. జారీ చేసిన లాట్ నంబర్లకు బ్రిడ్ క్రియేషన్లోనూ లోపాలు తలెత్తాయి. ఈ ప్రక్రియతో వ్యాపార లావాదేవీల వల్ల తీవ్ర జాప్యం జరుగుతోందని గ్రహించి బహిరంగ వేలం చేపట్టారు. ఢిల్లీ నుంచి కంపెనీ ప్రతినిధులు వచ్చినా సాంకేతిక లోపాలు కొలిక్కి రాలేదు. లోపాలు అధిగమించే వరకూ.. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఈ–నామ్ 2.0లో సాంకేతిక లోపాలు అధిగమించే వరకూ బహిరంగ వేలం పద్ధతిలోనే పసుపు కొనుగోళ్లు చేపట్టనున్నారు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత మార్కెట్లో మళ్లీ ఓపెన్ ఆక్షన్ వైపు అడుగులు పడుతున్నాయి. సాఫ్ట్వేర్ను అమలు చేస్తే వ్యాపార లావాదేవీల్లో తీవ్ర జాప్యం జరిగి రైతులు రోజుల తరబడి మార్కెట్లలో ఉండాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా బహిరంగ వేలం ద్వారా కొనుగోళ్లు చేపడితే నష్టపోతామని మరికొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ మార్కెట్లో అటు రైతులు.. ఇటు అధికారుల్లో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కత్తి మీద సాము..జిల్లాకేంద్రంలోని గంజ్లో ఈయేడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈ–నామ్ 2.0ను అమలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. పసుపు సీజన్లో సాఫ్ట్వేర్ను పూర్తిగా మార్చేసి అమలు చేయడమంటే ఉద్యోగులు, సిబ్బందికి కత్తి మీద సాములా మారింది. ఉద్యోగులు, సిబ్బంది పూర్తిగా 2.0 అమలుపైనే దృష్టి సారించారు. అయినప్పటికీ కొలిక్కి రాలేదు. రెండు రోజులైనా పసుపు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఎంపీ అర్వింద్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి తాత్కాలికంగా 1.0లోనే కొనుగోళ్లకు అనుమతులు తీసుకుని కొనసాగించారు. బహిరంగ వేలం ద్వారానే కొనుగోళ్లు మార్కెట్యార్డుకు భారీ ఎత్తును పసుపు వస్తోంది. ఈ సమయంలో ఈ–నామ్ 2.0 అమలు కష్టతరంగా మారింది. వ్యాపార లావాదేవీల్లో తీ వ్ర జాప్యం జరుగుతోంది. అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నా.. సాంకేతిక లోపాలను అధిగమించలేకపోతున్నాం. రైతు సోదరులు అసౌకర్యానికి గురవుతున్నారు. వ్యాపారులు, రైతు సోదరుల విజ్ఞప్తి మేరకు ఈ–నామ్ 2.0 సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసేవరకూ మార్కెట్ కమిటీలో బహిరంగ వేలం ద్వారానే కొనుగోళ్లు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చాం. – ముప్ప గంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, నిజామాబాద్ పసుపు కొనుగోళ్లకు పాతపద్ధతి ఈ–నామ్ 2.0లో తరచూ సాంకేతిక సమస్యలు ఢిల్లీ ప్రతినిధులు వచ్చినా.. కొలిక్కి రాని లోపాలు 1.0ను పూర్తిగా నిలిపేసిన కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ మార్కెట్ యార్డులో రైతులకు తప్పని తిప్పలు -
మంజీర తీరంలో రాళ్ల వాన
● వరి, మొక్కజొన్న, అరటి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం ● ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భీతావహ వాతావరణం బోధన్: బోధన్ రెవెన్యూ డివిజన్లోని మంజీర నది తీరంలో సాలూర మండల కేంద్రం, ఖాజా పూర్, హున్సా, మందర్నా గ్రామాల్లో శనివారం సాయంత్రం భారీ ఈదురు గాలులు, వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ నాలుగు గ్రామాల్లో యాసంగి సీజన్లో వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న సాగు చేశారు. పంటలు కోత దశకు చేరాయి. సాలూరలో వరి కోతలు ప్రారంభం కాగా ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. హున్సా గ్రామ రైతులు వంద ఎకరాలకు పైగా అరటి సాగు చేశారు. వరి, మొక్కజొన్న, అరటి, కూరగాయల పంటలకు అకాల వర్షం వల్ల తీవ్ర నష్టం వాటిల్లినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతు సేవా కేంద్రం ఆవరణలో, అంతర్రాష్ట్ర బైపాస్ రోడ్డు మార్గం, ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది. వర్షం నుంచి రక్షణకు ఆరబెట్టిన ధాన్యంపై పాలిథిన్ కవర్లు కప్పుతూ రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈదురు గాలులకు మొక్కజొన్న నేలవాలింది. వరి పంటకు గింజ రాలిపోయింది. నాడు వరదలు.. మంజీర తీర గ్రామాలను ప్రకృతి వైపరీత్యాలు ప్రతిసారి వెంటాడుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో మంజీర నదికి భారీ వరద పోటెత్తి మందర్నా, హున్నా, ఖాజాపూర్, సాలూర, తగ్గెల్లి గ్రామాల శివారులో కోత దశకు చేరిన సోయా, వరి, అరటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులకు తీరని నష్టం కలిగింది. వరద దెబ్బ నుంచి క్రమంగా కోలుకుని, యాసంగి సీజన్ పంటలు సాగు చేసి కొండంత ఆశలు పెట్టుకున్న రైతులకు ప్రస్తుతం అకాల వర్షం దెబ్బ పడింది. శనివారం రాత్రి సమయంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షం కురిసింది. మరో నాలుగు రోజులు భారీ ఈదురు గాలులు, వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. సాలూర శివారులో నేలకొరిగిన వరిని చూపుతున్న రైతు దార్మె శంకర్ -
అసంతృప్తి
రగులుతున్న సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తుండగా.. ఇప్ప టికీ నామినేటెడ్ పదవులు దక్కని ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. తమకు ఆశించినమేర న్యాయం జరగడంలేదంటూ పలువురు సీనియర్ నాయకులు బాహాటంగానే తమ ఆగ్రహావేశాలను వెలిబుచ్చుతున్నారు. వారంలోనే నా మినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తామంటూ గత ఏడాదిన్నర కాలంగా చెబుతూ వస్తున్న పార్టీ నాయక త్వం తమను మభ్యపెడుతూ కాలం గడిపిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు నాయకులు తమ సన్నిహితుల వద్ద తీవ్రంగా బాధపడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదిగో పదవుల పందేరం అంటూ పార్టీ పలుసార్లు ప్రకటించిన సందర్భాల్లో ఆశావహులు హైదరాబాద్లో మకాం వేసి మరీ తమ తమ స్థాయిల్లో అనేకసార్లు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు పదవుల భర్తీ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుండడంతో నిర్వేదంలోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఇది తీవ్రమైన అసంతృప్తి వైపు మళ్లుతోంది. ● నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో కలకలం కలిగించింది. అనేక పరిణామాల అనంతరం జీవన్రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయమవుతోంది. జీవన్రెడ్డి ఏ పార్టీలో చేరతారనే విష యమై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా నిజామాబాద్ నగరం నుంచి జీవన్రెడ్డికి సన్నిహితమైన ధర్మపురి శ్రీనివాస్ కుటుంబం నుంచి మాజీ మేయర్ సంజయ్ మనసులో ఉన్న అసంతృప్తి పెల్లుబికింది. తనకు ముఖ్య నేతలు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలాయని, పార్టీ అధిష్టానానికి విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేదని సంజయ్ ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కీలకమైన మున్నూరుకాపులకు అన్యాయం చేస్తున్నారంటూ, కాంగ్రెస్ పార్టీలో చెబుతున్నవిధంగా బీసీలకు ఏమాత్రం న్యాయం చేయడంలేదంటూ ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల్లోని బీసీలకు జరిగినంత న్యాయం కూడా కాంగ్రెస్ పార్టీలో జరగడంలేదని చెబుతుండడం గమనార్హం. తాజాగా శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదర, సోదరీమణుల పేరిట నిజామాబాద్ నగరంలో పలు చోట్ల జస్టిస్ ఫర్ సంజయ్ శ్రీనివాస్ అంటూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివిధ వర్గాల్లో చర్చను రేకెత్తించింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జీవన్రెడ్డి ఎపిసోడ్ వెంటే తాజాగా ధర్మపురి సంజయ్ ఎపిసోడ్ తెరమీదకు రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జిల్లా నుంచి సీనియర్ నాయకుడు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మార చంద్రమోహన్రెడ్డి తాజాగా డీసీసీ పీఠం ఆశించి విఫలమయ్యారు. చంద్రమోహన్రెడ్డి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి రేసులో ఉన్నారు. అదేవిధంగా మరో సీనియర్ నాయకుడు బా డ్సి శేఖర్గౌడ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. ఇక మాజీ డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్రెడ్డి మరోసారి ఈ పదవిని ఆశిస్తున్నారు. సహకార పదవులు సైతం నామినేటెడ్ పద్ధతిలో ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, పురన్రెడ్డి సైతం నామినేటెడ్ రేసులో ఉన్నారు. దివంగత పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ సైతం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఇక వెల్మ భాస్కర్రెడ్డి, బాస వేణుగోపాల్ యాదవ్, నరాల రత్నాకర్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కాటిపల్లి నరేందర్రెడ్డి పదవుల రేసులో ఉన్నారు. అధికార పార్టీపై పెల్లుబుకుతున్న నిరసనలు జగిత్యాల జీవన్రెడ్డి ఎపిపోడ్ తరువాత నిజామాబాద్ నుంచి సంజయ్ పార్టీ హైకమాండ్కు చెప్పుకున్నప్పటికీ ఫలితం లేదని ఆవేదన జిల్లాలో కీలకమైన మున్నూరుకాపులకు అన్యాయం చేస్తున్నారంటూ టాక్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదర సోదరీమణుల పేరిట జస్టిస్ ఫర్ సంజయ్ అంటూ నగరంలో ఫ్లెక్సీలు -
జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేయాలి
నిజామాబాద్అర్బన్ : క్రీడారంగంలో జిల్లా అద్వితీయ ప్రతిభను కలిగి ఉండటం ఎంతో గర్వించదగ్గవిషయమని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన హుస్సాముద్దీన్, గుగులోత్ సౌమ్య, యెండల సౌందర్య, నిఖత్ జరీన్ వంటి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నిజామాబాద్కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారని కొనియాడారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడాకారులు ముందుకుసాగాలని, జిల్లా ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చీఫ్ మినిస్టర్ కప్–2025 క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. వివిధ అంశాలలో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ అభినందిస్తూ, వారికి మెడల్స్, బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన అనేకమంది క్రీడాకారులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. తాను కూడా కళాశాలలో చదివే రోజుల్లో స్విమ్మింగ్లో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. క్రీడా సదుపాయాల మెరుగుదలకు, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంల ఏర్పాటు కోసం జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక కృషి చేస్తామని, వీటి ఏర్పాటు ఆవశ్యకతను ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. సీఎం కప్ క్రీడాపోటీల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో గ్రామీణస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 31,353 మంది క్రీడాకారులు వివిధ దశలలో పాల్గొనడం ద్వారా జిల్లాను మొదటి స్థానంలో నిలిపారని అన్నారు. 2700 మంది జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో 53 పతకాలు సాధించారన్నారు. దీంతో రాష్ట్రస్థాయిలో టాప్–5లో జిల్లా నిలిచిందని అభినందించారు. కోచ్లు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపాలని కలెక్టర్ ఉద్బోధించారు. చదువుతోపాటు క్రీడల్లో ప్రతిభ చూపితే, అద్భుత అవకాశాలు దక్కుతాయని, ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని సూచించారు. అనంతరం అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత హుస్సాముద్దీన్, భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ గుగులోత్ సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఘనంగా సత్కరించారు. కోచ్లు, ఆయా పాఠశాలల వ్యా యామ ఉపాధ్యాయులు, సిబ్బంది, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీవైఎస్వో పవన్ కుమార్, డీఈవో అశోక్, స్టేట్ గేమ్స్ ఫెడ రేషన్ కార్యదర్శి నాగమణి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ బొబ్బిలి నర్సయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పుష్కర ఘాట్ మంజూరుకు కృషి
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డినవీపేట: మండలంలోని యంచ శివారులోని గోదా వరి నది ఒడ్డున పుష్కర ఘాట్ మంజూరుకు కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి అన్నా రు. నిర్మల్ జిల్లా బాసరలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు సీఎం రేవంత్రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించేందుకు శుక్రవారం అక్కడికి వెళ్లారు. పుష్కర ఘాటు ఏర్పాటు చేయాల ని ఇటీవల యంచ గ్రామస్తులు ఆయనను కలవడంతో మార్గమధ్యలో యంచ తీరాన్ని పరిశీలించారు. వచ్చే ఏడాది దక్షిణ భారతదేశంలో నిర్వహించే గో దావరి పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో ఘాట్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. యంచ తీరంలో ప్రశాంత వాతావరణం ఉందని, పుష్కర ఘాటు ఏర్పాటుకు అను కూలంగా ఉందన్నారు. కలెక్టర్తో మాట్లాడి పుష్కర ఘాటు మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీసీ అఽ ద్యక్షుడు నగేశ్రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్గౌడ్, ఎంపీపీ రాజేందర్గౌడ్, ధర్మాజీ ఉన్నారు. -
తుంగిని పుష్కర ఘాట్ పరిశీలన
నవీపేట: మండలంలోని తుంగిని గోదావరి నది తీరాన ఉన్న పుష్కర ఘాట్ను కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య శుక్రవారం సాయంత్రం సందర్శించారు. గతంలో నిర్మించిన పుష్కర ఘాట్ పూర్తిగా మట్టితో పేరుకుపోవడాన్ని పరిశీలించారు. గతంలో కన్నా ఈసారి ఎక్కువగా భక్తుల తాకిడి పెరుగుతుందని, ఏర్పాట్లు అదనంగా చేపట్టాలని అభిప్రాయపడ్డారు. రోడ్డు సౌకర్యం ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని పేర్కొన్నారు. సీపీ వెంట నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్, సర్పంచ్ బీర్కూర్ కాంతారావ్, ఉప సర్పంచ్ భూమేశ్ తదితరులు ఉన్నారు. -
9
నిజామాబాద్లక్ష్యం@క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న.. క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహించిందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026– 8లో uలక్షలధాన్యం సేకరణకు 669 కొనుగోలు కేంద్రాలుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రస్తుత యాసంగి సీ జన్కు సంబంధించి జిల్లాలో 9 లక్షల మెట్రిక్ ట న్నుల బియ్యం సేకరించేందుకు పౌర సరఫరాల శా ఖ రంగం సిద్ధం చేసింది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,27,825 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. సాధారణ సాగు 3,92,408 ఎకరాల కంటే ఇది ఎక్కువ. ప్రస్తుతం సాగు చేస్తున్న వరిలో అత్యధికంగా సన్నరకం 3,67,991 ఎకరాలు ఉండగా, దొడ్డు రకం 59,834 ఎకరాలు మాత్రమే ఉంది. ● ఎకరానికి సగటున 2.785 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, కాగా సన్నధాన్యం ఎకరానికి 2.774 మెట్రిక్ టన్నులు, దొడ్డు ధాన్యం ఎకరానికి 2.860 మెట్రిక్ టన్నులు వస్తుందని అధికారులు లెక్కలు వేశారు. ● ఇందుకు సంబంధించి సన్నధాన్యం 10,20,691 మెట్రిక్ టన్నులు, దొడ్డు ధాన్యం 1,71,145 మెట్రిక్ టన్నులు మొత్తం 11,91,836 మెట్రిక్ టన్నులు ది గుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 9 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా సన్నధాన్యం 7,28,855 మెట్రిక్ టన్నులు, దొడ్డు ధాన్యం 1,71,145 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 64 పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు, 212 రా రైస్ మిల్లులకు ధాన్యం ఇవ్వనున్నారు. మొత్తం 276 మిల్లులకు సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం ఇవ్వనున్నారు. పారా బాయిల్డ్ మిల్లుల సామర్థ్యం 4 లక్షల మెట్రిక్ టన్నులు, రా రైస్ మిల్లులకు 5,59,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. ఇంకా 6 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లర్ల వద్ద ఉంది. దీంతో సేకరించిన ధాన్యం నిల్వ చేసేందుకు నెలకొన్న సమస్య అధిగమించేందుకు ఈ నెలలో రేషన్ కోటా కింద ఇచ్చే బియ్యాన్ని ఒకేసారి మూడు నెలలకు ఇవ్వనున్నారు. ఇలా మూడు నెలల బియ్యం రేషన్ కార్డుదారులకు ఇస్తే గోదాముల్లో 1.20 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఖాళీ ఏర్పడుతుంది. గోదాములు చాలకపోతే ఇతర జిల్లాల గోదాములను సైతం వాడుకునేందుకు పౌరసరఫరాల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ధాన్యం సేకరణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు డీఎస్వో శ్రీకాంత్రెడ్డి తెలిపారు.తెలంగాణ పోరాటంలో కొమరయ్య పాత్ర కీలకం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ధాన్యం సేకరణ కోసం జిల్లాలో 669 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కేంద్రాలు 408 ఉన్నాయి. ఐకేపీ ద్వారా 224 కొనుగోలు కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా 24 కేంద్రాలు, ఇతర విభాగాల ద్వారా మరో 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తగి న ఏర్పాట్లు చేశారు. అయితే, ధాన్యం సేకరణకు సంబంధించి 2.25 కోట్ల గన్నీ బ్యాగులు అవస రం కాగా, ప్రస్తుతం 72,74,264 బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరో 1,52,25,736 గన్నీ బ్యాగులు సమకూర్చాల్సి ఉంది. క్రీడాకారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు సీఎం కప్ విజేతలకు అభినందన సభ అంతర్జాతీయ క్రీడాకారులు సౌమ్య, హుస్సాముద్దీన్లకు సత్కారం సన్నధాన్యం 7,28,855 మె.ట, దొడ్డు ధాన్యం 1,71,145 మె.ట. ఈ నెలలోనే ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం గోదాములు ఖాళీ అయితే సేకరించిన ధాన్యం సర్దుబాటుకు ప్రణాళికలు -
నిర్లక్ష్యం వీడితే.. ప్రాణాలు పదిలం
● కలవరపెడుతున్న రోడ్డు ప్రమాదాలు ● మద్యం, నిద్ర మత్తుతోనే యాక్సిడెంట్లు ● జరిమానా విధించినా తీరు మార్చుకోని వాహనదారులునిజామాబాద్అర్బన్ : జిల్లాలో వరుస రోడ్డు ప్రమా దాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట జరుగుతున్న ప్రమాదంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అయితే, రోడ్డు ప్రమాదాలకు మద్యం మత్తులో వాహనాలు నడపటం, రాంగ్ రూట్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్ చేయటం వంటివి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. తరచూ ప్రమాదాలు.. జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బ్లాక్ స్పాట్ ప్రాంతాలే కాకుండా జిల్లా రోడ్లు, గ్రామీణ ప్రాంత రోడ్లపై సైతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో వాహనదారుల నిర్లక్ష్య వైఖరి ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల రుద్రూర్ వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. డిచ్పల్లి వద్ద జాతీయ ర హదారిపై ప్రయివేటు బస్సు బోల్తా పడటంతో న లుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. తాజాగా శుక్రవారం బడాపహాడ్ వద్ద బ స్సు బోల్తా పడటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా అనేక ప్రాంతాలలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా జిల్లాలోని జాతీయ రహదారి వెంబడి డిచ్పల్లి సీఎంసీ వద్ద, ఇందల్వా యి మండలం గన్నారం, ఆర్మూర్ పట్టణంలోని పె ర్కిట్, బాల్కొండ చిట్టాపూర్ , జక్రాన్పల్లి మండ లం పడకల్ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటితో పాటు బోధన్–నిజా మాబాద్, నిజామాబాద్ –నందిపేట్, నిజామాబాద్–మల్లారం గండి, నిజామాబాద్–ఆర్మూర్ రహ దారుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండలి. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. సెల్ఫోన్ డ్రైవింగ్ మానుకోవాలి. మద్యం సేవించి వాహనం నడుపొద్దు. భద్రతను దృష్టిలో పెట్టుకొని వాహనాలను నెమ్మదిగా నడపాలి. – మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఏసీపీకనిపించని మార్పు.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టీసీ, పోలీ స్ శాఖ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లకు ఆరు నెలలకు ఒకసారి డ్రైవింగ్ నిబంధనలు ట్రా ఫిక్ నిబంధనలను తెలియజేస్తున్నారు. వీటితోపా టు ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు ని ర్వహిస్తున్నారు. రోడ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహి స్తూ హెల్మెట్ ధరించేలా వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నా మార్పు కనిపించడం లేదు. ఈ ఏడాది మార్చి నెల వరకు జిల్లాలో 31 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 28 మంది ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడ్డారు. గతేడాది జిల్లాలో 780 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 276 మంది మృతి చెందగా, 715 మంది గాయపడ్డారు. జిల్లాలోని జాతీయ రహదారుల వెంబడి సుమారు 223 ప్రమాదాలు చోటుచేసుకోగా 293 మంది ప్రాణాలు కోల్పోయారు. కారణాలివే.. రోడ్డు ప్రమాదాలకు మూల కారణం నిర్లక్ష్య వైఖరితోపాటు మద్యం, మత్తు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. వాహనదారులు రోడ్డు నిబంధనలను పాటించకుండా వాహనాలకు వ్యతిరేక దిశలో వెళ్లడం. వాహనాల ఓవర్ టేక్ చేసే సమయంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. జాతీయ రహదారులపైకి వాహనాలతో నేరుగా దూసుకురావడం విందు లేదా శుభకార్యాలకు హాజరై మద్యం సేవించి వాహనాలు నడపటం. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపటం. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవటం. -
క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
నిజామాబాద్ రూరల్: క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహించిందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ బేస్బాల్ పోటీల్లో జిల్లా జట్టు విజేతగా నిలిచింది. జిల్లా కేంద్రంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా జట్టు క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించి సన్మానించారు. బేస్బాల్ బాలికల జట్టు కెప్టెన్ ఇందు నేతృత్వంలో అత్యుత్తమ ప్రదర్శనతో ఘన విజయం సాధించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కప్ ను అందుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జట్టు కోచ్ అనికేత్, బేస్బాల్ జిల్లా కార్యదర్శి వినోద్ తో పాటు సహకారం అందించిన సాఫ్ట్బాల్ జిల్లా కార్యదర్శి గంగామోహన్ ను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కళాకారుల అభ్యున్నతికి కృషి చేస్తా
నిజామాబాద్ రూరల్: కళాకారుల అభ్యున్నతికి కృషి చేస్తానని జనం పాట కల్చరల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంపూర్ సాయి అన్నారు. శుక్రవారం నగరంలోని కంఠేశ్వర్లో జనం పాట కల్చరల్ అసోసియేషన్ 2026–27 జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాంపూర్ సాయి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఇకనుంచి జిల్లా కళాకారుల అభ్యున్నతి కోసం పోరాడుతామన్నారు. 21 మంది కళాకారులతో కమిటీని రెండేళ్లకు గాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పస్క నర్సన్న, అధ్యక్షుడిగా రాంపూర్ సాయి, ఉపాధ్యక్షులుగా రాజేందర్ చిన్న, ప్రశాంత్ రెడ్డి, సవిత, ప్రధాన కార్యదర్శిగా నల్ల మహేందర్, కోశాధికారిగా గోరకంటి రాజు, కార్యనిర్వాహక కార్యదర్శిగా కర్క రమేశ్, సహాయ కార్యదర్శులుగా ఏ చిట్టిబాబు, డప్పు సంతోష్, సలహాదారులుగా ఆర్టీసీ మల్లన్న, కోకిల నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా నవీన్, సోనీ, డప్పు మహేశ్, గణేశ్, గోపాల్, ఆలెపు నరేశ్, స్రవంతి, పద్మ, సతీశ్ ఎన్నికయ్యారు. అనంతరం అధ్యక్షుడు రాంపూర్ సాయిని సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నేతకు పరామర్శ
భిక్కనూరు: పెద్దమల్లారెడ్డి సింగిల్విండో మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు రాజాగౌడ్ తల్లి బుచ్చమ్మ(75) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న విద్యా దాత తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి పెద్దమల్లారెడ్డికి వచ్చి బుచ్చమ్మ మృతదేహం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబీకులను పరామర్శించారు. బుచ్చమ్మ మరణవార్త తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ ఫోన్లో రాజాగౌడ్ను పరమర్శించి ఓదార్చారు. అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బీంరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరాం వెంకటేశ్తో పాటు పలువురు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మాజీ జెడ్పీటీసీ గ్యార లక్ష్మి కుటుంబ సభ్యులకు.. మాచారెడ్డి: మాచారెడ్డి మాజీ జెడ్పీటీసీ గ్యార లక్ష్మి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్ పరామర్శించారు. ఆమె ఇటీవల బ్రెయిన్ డెడ్కు గురికాగా.. కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే శుక్రవారం ఆమె కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం అక్కాపూర్ వెళ్లి మాజీ ఉప సర్పంచ్ ఎల్లయ్యను పరామర్శించారు. ఎల్లయ్య తల్లి మరణానికి కారణాలను తెలుసుకుని ఓదార్చారు. బీఆర్ఎస్ నాయకులు మినుకూరి రాంరెడ్డి, గోవిందరెడ్డి, రాజాగౌడ్, శ్రీకాంత్రెడ్డి ఉన్నారు. -
అనారోగ్య సమస్యలతో యువతి ఆత్మహత్య
కమ్మర్పల్లి(భీమ్గల్): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ యువతి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై సీహెచ్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. భీమ్గల్ పట్టణంలోని శ్రీరామ్నగర్ కాలనీలో మొర్రి రాజు, పుష్ప అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె ప్రళవి (23) అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. రుద్రూర్: మద్యం మత్తులో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన పొతంగల్ మండలం జల్లాపల్లి ఫారంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంతోష్ (35) అనే యువకుడు ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో గ్రామ చౌరస్తాలో ఉన్న గాంధీ విగ్రహానికి ఉన్న కర్రకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట స్థావరంపై దాడి నిజామాబాద్ అర్బన్: నగరంలోని గౌతమ్నగర్లో పేకాట స్థావరంపై మూడో టౌన్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 6,200 నగదు, ఆరు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా పేకాట ఆడితే చర్యలు తప్పవని మూడో టౌన్ ఎస్సై హరిబాబు హెచ్చరించారు. -
పశువుల ఆరోగ్యానికి ఓ టీకా
● గాలికుంటును నివారించేందుకు పశువులకు వ్యాక్సినేషన్ ● గ్రామాల్లో కొనసాగుతున్న కార్యక్రమం బిచ్కుంద(జుక్కల్): గాలికుంటు వ్యాధి నుంచి పశు వులను రక్షించుకునేందుకు ఎఫ్ఎండీ (ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) టీకా తప్పనిసరి. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రి య ప్రస్తుతం జిల్లాలో విస్తృతంగా కొనసాగుతోంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రత్యేక టీకాల కార్యక్రమానికి రైతుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. శిబిరాలకు పశువును తీసుకొచ్చి టీకాలు వేయిస్తున్నారు. టీకాలు వేసే సమయం వాతావరణంలో మార్పుల కారణంగా పశువులకు వైరల్ వ్యాధులు ఎక్కువ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే అవి మృతి చెందే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ప్రతి ఆరు నెలలకోసారి పశువులకు టీకాలు వేయించాలి. మే నెలలో గొంతువాపు, చిటిక రోగం టీకాలు, జూన్లో ముద్దచర్మ వ్యాధి నివారణ టీకాలు, జూలైలో మూతివాపు నివారణ టీకాలు, ఆగస్టు, సెప్టెంబర్లలో పీపీఆర్ టీకాలు, మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్లలో గాలికుంటు నివారణ టీకాలు, నవంబర్లో షీప్, గోట్ఫాక్స్ టీకాలు, డిసెంబర్లో బొబ్బరోగం టీకాలు, జనవరి, ఫిబ్రవరిలో కొక్కెర రోగ నివారణ టీకాలు వేయాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో ఆవులు 68,370, గేదెలు 97,670, గొర్రె లు 4,87,903, మేకలు 1,50,046 జీవాలు ఉన్నాయి. సీజనల్ వ్యాధులకు అనుగుణంగా అన్ని జీవాలకు టీకాలు వేయడమే లక్ష్యంగా పశుసంవర్ధక శాఖ అధికారులు ముందుకు వెళ్తున్నారు. ప్రతి గ్రామంలో శిబిరాలు ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నారు.సీజనల్లో వ్యాధుల బారినపడకుండా పశువులకు సమయానికి టీకాలు వేయించాలి. అన్ని రకాల టీకాలు, మందులు వెటర్నరీ వైద్యశాలలో అందుబాటులో ఉంటాయి, పశుసంవర్ధక శాఖ ద్వారా గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నాం. వ్యాధి నివారణ ఒక్కటే మార్గం. వ్యాధులు బారినపడకుండా నెల రోజు ముందు టీకాలు వేయించాలి. అనారోగ్య, వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించాలి లేకుంటే జీవాలు మరణించి పశుపోషకులు నష్టాపోతారు. – భాస్కరన్, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశువైద్యశాల, బిచ్కుందపాల దిగుబడిపై ప్రభావం వ్యాధుల బారినపడితే ఆవులు, గేదెలు నీరసంగా మారి నడవలేకపోతాయి. కడుపునిండా మేత, నీరు తీసుకోకపోవడంతో పాల దిగుబడి తగ్గుతుంది. గాలికుంటు వ్యాధి గాలి ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకు సోకే అవకాశం ఉంది. పశువుల్లో అనారోగ్య సమస్యలు, లక్షణాలు కనిపిస్తే వెంటనే వెటర్నరీ వైద్యులను సంప్రదించి చికిత్స అందించాలి. ప్రతి ఆరు నెలలకోసారి గాలికుంటు నివారణ టీకాలు వేయించడంతోపాటు పశుపాకలను శు భ్రంగా ఉంచాలని, కుంటలు, గుంతల్లోని నీరు తాగించవద్దని పశువైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో మధ్యాహ్నం సమయంలో పశువులకు నీడలో విశ్రాంతి ఇవ్వాలంటున్నారు. -
జిల్లా జైలులో మెగా ఆరోగ్య శిబిరం
నిజామాబాద్ అర్బన్: జిల్లా జైలులో శుక్రవారం జైలు సూపరింటెండెంట్ అశోక్కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా వెల్నెస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. 331 మంది ఖైదీలకు గుండె సంబంధిత, గైనిక్, ఆర్థోఫెడిక్, జనరల్ మెడిసిన్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో జైలర్ శ్రీనివాస్, డిప్యూటీ జైలర్ మన్మథ్ రావు, డాక్టర్లు ప్రశాంత్రెడ్డి, అపర్ణ, మమత తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
అనుమానాస్పదస్థితిలో ఒకరి మృతి కామారెడ్డి రూరల్: మండలంలోని రాఘవపూర్ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాఘవపూర్ శివారులో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుడి చేతిపై వీ చరణ్ అని పచ్చబొట్టుతో రాసి ఉందన్నారు. మృతుడి ఒంటి నిండా రక్తం ఉండడంతో హత్యకు గురై ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. నిందితుడి రిమాండ్ ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో బైక్ చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మహేశ్ శుక్రవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డికి చెందిన నరేశ్గౌడ్కు చెందిన బైక్ను ఈ నెల 2న రాత్రి సమయంలో కామారెడ్డికి చెందిన శౌకత్ అలీ చోరీకి పాల్పడ్డాడు. విచారణలో నిందితుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. మద్దికుంటలో చోరీ ● మూడున్నర తులాల బంగారం, రూ. లక్ష నగదు అపహరణ రామారెడ్డి: మండలంలోని మద్దికుంటలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి దుండగులు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఇందులో మూడున్నర తులాల బంగారం, రూ. లక్ష నగదు, 15 తులాల వెండి అపహరణకు గురైంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓరుగంటి రాజు విద్యుత్శాఖలో పనిచేస్తుంటాడు. శుక్రవారం ఉదయం అతను విధులకు వెళ్లిన అనంతరం కుటుంబీకులు ఇంటికి తాళం వేసి కామారెడ్డిలో ఉన్న మైసమ్మ ఆలయానికి వెళ్లారు. వారు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో దాచి ఉంచిన మూడున్నర తులాల బంగారం, రూ. లక్ష నగదు, 15 తులాల వెండిని దుండగులు అపహరించినట్లు బాధితులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పింఛన్ కోసం దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం
భిక్కనూరు: పింఛన్ కోసం ఓ దివ్యాంగుడు చెట్టెక్కి దూకుతానంటూ హంగామా చేశాడు. వివరాలిలా ఉన్నాయి. కంచర్ల గ్రామానికి చెందిన గొల్ల రాములు దివ్యాంగుడు. గతంలో అతడికి వికలాంగుల పెన్షన్ వచ్చేది. మూడేళ్లుగా అందడం లేదు. గురువారం గ్రామ సభ వద్దకు వచ్చి తన సమస్యను వివరించాడు. మూడేళ్ల క్రితం ఆన్లైన్ అయినప్పటినుంచి పింఛన్ రావడం లేదని తెలిపాడు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు చెప్పినా వినిపించుకోకుండా సమీపంలోని చెట్టు ఎక్కాడు. పింఛన్ మంజూరు చేయకపోతే దూకుతానని బెదిరించాడు. దీంతో గ్రామస్తులు సర్పంచ్ అరుణ స్వామి, వార్డు సభ్యులు రాములుకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఓ వార్డు సభ్యుడు చెట్టెక్కి రాములుతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు చెప్పడంతో రాములు చెట్టు దిగాడు. -
క్రైం కార్నర్
రుద్రూర్: హార్వెస్టర్ను శుభ్రం చేస్తుండగా ఓ డ్రైవర్ అనుమానాస్పదస్థితి మృతి చెందిన ఘటన కోటగిరిలో చోటుచేసుకుంది. ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా.. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రిషిపాల్ కోషిందర్, మనోజ్ కుమార్ (డ్రైవర్)లు హార్వెస్టర్ డ్రైవర్లుగా పనిచేయడానికి కామారెడ్డి జిల్లా బీర్కూర్కు వచ్చారు. గురువారం ఉదయం మనోజ్ కుమార్ హార్వెస్టర్ను తీసుకొని, మన్నె శ్రీకాంత్తో కలిసి కోటగిరి వచ్చారు. కోటగిరిలోని వాటర్ సర్వీస్ సెంటర్లో హార్వెస్టర్ను శుభ్రం చేస్తుండగా మనోజ్ కుమార్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై రిషిపాల్ కోషిందర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు. -
జిల్లా జైలులో రక్తదాన శిబిరం
నిజామాబాద్అర్బన్: నగరంలోని జిల్లా జైలు లో గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా 16 మంది అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. వైద్యాధికారి కావ్య మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవిలో రక్తం కొరత తీవ్రంగా ఉందని ఇలాంటి సమయంలో జైలు అధికారులు రక్తదానం చేయడం ఎంతో అభినందనీయం అన్నారు. జైలు అధికారి అశోక్ కుమార్, జైలర్ శ్రీనివాస్, డిప్యూటీ జైలర్ మన్మత్, కోఆర్డినేటర్ స్వరూప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్: ‘ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు–2026’ రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందడంపై జిల్లా సీనియర్ సిటిజన్స్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మాయావర్ రాజేశ్వర్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతం నుంచి 15 శాతం/రూ.10వేల మొత్తాన్ని కోత విధించి నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ ప్రజాప్రతినిధులకు కూడా ఈ చట్టం వర్తిస్తుందన్నారు. తల్లిదండ్రుల పోషణను పట్టించుకోని వారిపై కలెక్టర్కు దరఖాస్తు సమర్పించిన తర్వాత 60 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. ప్రభుత్వానికి జిల్లా వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘం తరపున రాజేశ్వర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలోనూ అధికారులు ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాజేశ్వర్ కోరారు. డొంకేశ్వర్(ఆర్మూర్): అధిక విషతత్వం కలిగిన ‘పారాక్వాట్’ గడ్డి మందుతోపాటు దాని సంబంధిత ఫార్ములేషన్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించినట్లు జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నం 24ను జారీ చేసిందన్నారు. పారాక్వాట్ గడ్డి మందును డీలర్లు దుకాణాల్లో అమ్మకూడదని, స్టాకు ఉంచినా కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇటు రైతులు సురక్షిత, ప్రత్యామ్నాయ కలుపు నివారణ పద్దతులను అనుసరించాలని సూచించారు. ● మాందాపూర్ గ్రామ సభలో పాలకవర్గం తీర్మానం మాక్లూర్: తమ గ్రామంలోకి ఐస్క్రీం బండ్లకు ప్రవేశం లేదంటూ గురువారం మాందాపూర్ సర్పంచ్ అల్లరి మహేష్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో వార్డు సభ్యులు, గ్రామస్తులు కలిసి తీర్మానం చేశారు. ఈసందర్భంగా గ్రామానికి ఇరువైపులా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలు, ఐస్క్రీం బండ్లతో వచ్చి గ్రామాల్లో నాసిరకం ఐస్క్రీంలు అమ్మటం వల్ల పిల్లలకు దగ్గు, జ్వరం వచ్చి ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్పంచ్ తెలిపారు. గ్రామంలో ఎవరైన ఐస్క్రీంలు విక్రయిస్తే రూ.5000 జరిమానా విధిస్తామన్నారు. అనంతరం కొనసాగిన గ్రామ సభలో నాసిరకం ఐస్క్రీంలతో కలిగే దుష్ప్రాభావాలపై అవగాహన కల్పించారు. ఉపసర్పంచ్ నగేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రజాపాలన సభలు సక్సెస్
సుభాష్నగర్: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ స భలు విజయవంతమయ్యాయి. 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం జిల్లాలోని 545 పంచాయతీల్లో గ్రామ సభలు, నిజామాబాద్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోని 146 వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో గ్రామ, వార్డు సభలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎండను దృష్టిలో ఉంచుకుని ఉదయం 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు సభలను నిర్వహించారు. ప్రతిచోట నీడ కోసం షామియానాలు, తాగునీరు, కుర్చీలు ఏర్పాటు చేసి, ఫిర్యాదుల బాక్సులు అందుబాటులో ఉంచారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సభల్లో భాగస్వాములు కాగా, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మోస్రాలో నిర్వహించిన గ్రామసభతోపాటు బోధన్ మున్సిపల్ పట్టణంలోని 26, 35 వార్డుల్లో నిర్వహించిన వార్డు సభల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లిలో, నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి నగర పాలక సంస్థ పరిధిలోని 49వ డివిజన్ కసాబ్గల్లిలో నిర్వహించిన వార్డు సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్కుమార్ మాక్లూర్ మండలం మామిడిపల్లిలో, ఇన్చార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దిలీప్కుమార్ మోపాల్ మండలం తాడెం గ్రామసభలో పాల్గొన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ సిరికొండ మండల కేంద్రంలో, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్, చౌట్పల్లిలో, మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్గౌడ్ డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామసభలో భాగస్వాములయ్యారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ ఏర్గట్ల మండలం తడ్పాకల్లో, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో రెంజల్ మండలం దూపల్లి గ్రామ సభలో పాల్గొన్నారు. పాల్గొన్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సభా ప్రాంగణాల్లో టెంట్లు, తాగునీరు, ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు -
సరైన చికిత్సతోనే ఆటిజం దూరం
సుభాష్నగర్: ఆటిజం అనేది మానసిక వ్యాధి కాదని, సరైన చికిత్సతో దూరం చేయవచ్చని ఇండియన్ పీడియ్రాటిక్ అసోసియేషన్ వైద్యులు సత్యకుమార్ స్వామి, శ్రీకాంత్, దీపక్ రాథోడ్, మానసిక వైద్య నిపుణులు ఇన్నమూరి రవితేజ, రాజేందర్ సూరినీడు అన్నారు. జిల్లాకేంద్రంలోని మారుతీనగర్లోగల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్, ఇందూరు అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో ప్రతి 50 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజం బారిన పడుతు న్నారన్నారు. 15 నుంచి 18 నెలల చిన్నారుల్లో నడవడికను గుర్తించి వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే వ్యాధిని అధిగమించవచ్చన్నారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో మాత్రమే ఆటిజం వ్యాధికి సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తున్నారని, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కూడా ఈ పత్రాన్ని ఇచ్చేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జన్యుపరంగా, మన చుట్టూ నివాసముండే పరిసరాలను బట్టి కూడా ఆటిజం వ్యాధి వస్తుందని తెలిపారు. తోటి పిల్లలతో కలిసి ఉండకపోవడం, ఒంటరిగా, మౌనంగా ఉండటం ఆటిజం లక్షణాలన్నారు. స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యో తి, సిద్ధయ్య మాట్లాడుతూ.. ఆటిజం, మానసిక దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక ప ద్ధతిలో విద్య నేర్పిస్తున్నామని తెలిపారు. అనంతరం వైద్యులను ఘనంగా స న్మానించారు. మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, కార్యవర్గసభ్యులు రమణరెడ్డి, దాతలు ముప్పాల సత్యనారాయణ, రాంరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, మానసిక దివ్యాంగులు, అంద విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. మొదటి దశలోనే గుర్తించాలి సుభాష్నగర్: ఆటిజం లక్షణాలను మొదటి దశలోనే గుర్తించి, సరైన వైద్యుడిని సంప్రదిస్తే, థెరపీలు, మందులతో పిల్లల్లో మార్పు తీసుకురావచ్చని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విశాల్ అన్నారు. ఐఎంఏ, తెలగాణ మెంటల్ హెల్త్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం డాక్టర్ విశాల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా చిన్న పిల్లల్లో వచ్చే మానసిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. ఆటిజం అనేది చిన్న పిల్లల్లో కన్పించే ఒక ప్రత్యేకమైన మానసిక సమస్య అని అన్నారు. ఈ సమస్యకు భూతవైద్యులను సంప్రదించడం సరికాదన్నారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్లు కే శ్రీశైలం, టీ జీవన్రావు, వినోద్ కుమార్ గుప్తా, రమణేశ్వర్, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కొలువుదీరిన బార్ నూతన కార్యవర్గం నిజామాబాద్ లీగల్: నూతనంగా ఎన్నికై న నిజామాబాద్ బార్ అసోసియేషన్ కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. నగరంలోని జిల్లా కోర్టులోగల డీఎల్ఎస్ఏ భవనంలో ఉన్న పీపీ గంగారెడ్డి హాల్లో గురువారం ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. నూతన కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అధికారి అమిడాల సుదర్శన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు మాట్లాడుతూ.. న్యాయమూర్తులు, న్యాయవాదుల సహకారంతో బార్ అసోసియేషన్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. ప్రధాన కార్యదర్శి సుభాష్రెడ్డి మాట్లాడుతూ.. బార్, బెంచ్ సమన్వయంతో అసోసియేషన్ను ముందుకు తీసుకువెళ్తామన్నారు. జిల్లా న్యాయమూర్తి జీవీఎన్. భారతలక్ష్మి మాట్లాడుతూ.. బార్, బెంచ్ ఒకరికొకరు సహకరించుకుంటు ముందుకు వెళ్లాలని సూచించారు. నూతన న్యాయవాదులు ఆధునిక సాంకేతికత సహాయం తీసుకుంటూ తమ సామర్థ్యాలు పెంచుకోవాలని, సీనియర్ న్యాయవాదులు సైతం జూనియర్లకు సహకరించాలని అన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం
● ప్రణాళికల రూపకల్పన, సమస్యల పరిష్కారం కోసమే వార్డు సభల నిర్వహణ ● కలెక్టర్ ఇలా త్రిపాఠి బోధన్టౌన్(బోధన్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతు న్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే విజయవంతం అవుతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగం గా గురువారం పట్టణంలోని 26, 35వ వార్డుల్లో వార్డు సభ లు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మునుముందు అమలు చేయనున్న కొత్త పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రగతి, సంక్షేమంలో ప్రజలను భా గ స్వామ్యం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. పట్టణ అభివృద్ధి కోసం అందరి అభిప్రాయా లను క్రోఢీకరించి సమగ్ర ప్రణాళిక రూపొందించడాని కి, సమస్యల పరిష్కారానికి ఈ వార్డు సభలు దోహదపడుతాయన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకా లు చేరేలా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు. పట్టణ పరిసర ప్రాంతాల శుభత్రకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని విడనాడాలని సూచించారు. పట్టణంలోని 26వ వార్డులో ఇటీవల రేఖమ్మ అనే వివాహితకు భర్త మృతి చెందాడని అమెకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరుకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని అధికారులను అదేశించా రు. మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి, వార్డు కౌ న్సిలర్ దాము, కమిషనర్ జాదవ్ కృష్ణ, ఏసీపీ శ్రీనివాస్, ట్రా న్స్కో డీఈ ముక్తార్ తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలో.. వర్ని: మోస్రా మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగితే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పథకాల ఎంపికలో ఇంకా అర్హులైన వారు మిగిలి ఉంటే విచారణ జరిపి లబ్ధి చేకూర్చుతామని భరోసా కల్పించారు. మోస్రా మండల ప్రత్యేక అధికారి రతన్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్ భూపాల్ రెడ్డి, కార్యదర్శి శ్రావణ్ పాల్గొన్నారు. -
కలుషిత నీటితో చేపల మృత్యువాత
● 15 వేల చేపలు మృతి చెంది ఉంటాయని మత్స్యకారుల ఆవేదనపెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఊర చెరువులో నీరు కలుషితం కావడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. చెరువు వద్దకు గురువారం ఉదయం చేరుకున్న మత్య్యకారులకు వేల సంఖ్యలో చేపలు మృతిచెంది నీటిలో తేలడంతో ఆందోళనకు గురయ్యారు. ఆర్మూర్ పట్టణంతోపాటు పెర్కిట్ నివాస గృహాల నుంచి మురికి నీరు చెరువులో చేరి కలుషితమవుతోంది. దీంతో ప్రతీ సంవత్సరం చేపలు మృతి చెందుతున్నాయి. గత సంవత్సరం మార్చిలో 50 వేల చేపపిల్లలను చెరువులో వదిలారు. అందులో 15 వేల చేపలు మృతిచెంది ఉంటాయని గంగపుత్రులు భావిస్తున్నారు. దీంతో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా మత్య్సశాఖ మాజీ డైరెక్టర్ బట్టు నరేందర్ మాట్లాడుతూ.. పెర్కిట్ ఊర చెరువు ఆర్మూర్తోపాటు పెర్కిట్ నివాస గృహాల నుంచి వస్తున్న మురికి నీటితో కలుషితమవుతోంది. అలా గే చికెన్ సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను చెరువులో వదిలి వెళ్తున్నారు. దీంతో నీరు కలుషితమై ప్రతి యేటా చేపలు మృత్యువాత పడుతున్నాయన్నారు. అధికారులు స్పందించి చెరువు కలుషితం కాకుండా కాపాడాలని కోరారు. -
అసెంబ్లీకి వెళ్లే అతివలు ఎందరు?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33 శాతం కోటా అమలు చేసేందుకు రంగం సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మహిళలకు ఎన్ని అసెంబ్లీ సీట్లు కేటాయిస్తారనే అంశంపై అన్ని వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పుడున్న లోక్సభ, శాసనసభ సీట్ల సంఖ్యను 50 శాతం వరకు పెంచనున్నట్లు కేంద్రం నుంచి సంకేతాలు వచ్చాయి. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో శాసనసభ స్థానాలు 119 నుంచి 182కు, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 9 అసెంబ్లీ సీట్ల సంఖ్య 13కు పెరగనున్నట్లు అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో 15,71,022 మంది, కామారెడ్డి జిల్లాలో 9,72,625 మంది జనాభా ఉంది. గత ఎన్నికల(2023) లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ ని యోజకవర్గాల్లో కలిపి మొత్తం 20,06,494 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 9,58,718 మంది కాగా, మహిళా ఓటర్లు 10,47,674 మంది, ఇతరులు 102 మంది ఉన్నారు. మహిళల ఓట్లు 88,956 ఎ క్కువ ఉన్నాయి. విడివిడిగా చూసినా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోనూ మహి ళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. అయి తే ఇతర జిల్లాలతో పోల్చినా ఉమ్మడి జిల్లాలో మహిళా జనాభా, ఓట్ల శాతం అధికంగా ఉంది. తాజాగా చేపడుతున్న జనాభా లెక్కల మేరకు సైతం ఉమ్మడి జిల్లాలో మహిళా జనాభా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన పక్షంలో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 182కు పెరిగితే మహిళలకు 60 సీట్లు దక్కనున్నాయి. ఇందులో సైతం మహిళల కోటా విషయానికి వస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గణనీయంగానే మహిళల ప్రాతినిథ్యం దక్కవచ్చని అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా జనరల్ మహిళ స్థానాలు సైతం ఇక్కడి నుంచి ఆశించిన స్థాయిలో కేటాయించే అవకాశాలు ఉన్నట్లు చర్చ నడుస్తోంది. దీంతో అన్ని పార్టీలతోపాటు మహిళా నాయకులు సైతం చట్టసభలో ప్రాతినిథ్యం కోసం లెక్కలు వేసుకుంటున్నారు. జనగణన, కులగణన తరువాత వెంటనే నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం చేస్తుండడంతో అన్నివర్గాల్లో ఈ చర్చ నడుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు (2023) నియోజకవర్గాల పునర్విభజన.. మహిళలకు 33శాతం కోటా నేపథ్యంలో చర్చ కోటా అమలైతే జిల్లా నుంచి నాలుగు సీట్లు మహిళలకే.. ఉమ్మడి జిల్లాలో మహిళల జనాభా, ఓట్ల శాతం ఎక్కువ పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 88,956 అధికం -
నిజామాబాద్
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నగరంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా కొనసాగుతున్న విజయయాత్రఆలయాల్లో భక్తుల సందడిహనుమాన్ జయంతిని గురువారం జిల్లా లో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల్లో ప్రత్యే క పూజలు, అభిషేకాలు చేశారు. జిల్లా కేంద్రంలోని సారంగాపూర్, నీరు గొండ హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నిజామాబాద్ నగరంతోపా టు ఆయా ప్రాంతాల్లో విజయయాత్రలు నిర్వహించారు. – నిజామాబాద్ రూరల్ కాషాయోత్సాహం -
తేలిన రామలింగేశ్వరాలయ శిఖరం
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీలో ముంపునకు గురైన పాత కుస్తాపురం రామలింగేశ్వర స్వామి ఆలయ శిఖరం బయటికి తేలింది. ఎండల కారణంగా ఎస్సారెస్పీలో నీటి మట్టం తగ్గుతుండడంతో శిఖరం స్వల్పంగా బయటకు కనిపిస్తోంది. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా డొంకేశ్వర్ మండలం జీజీ నడ్కుడకు చెందిన మత్స్యకారుడు చిన్న గంగారాం, మరికొందరు మత్స్యకారులు కలిసి తెప్పపై శిఖరం వద్దకు వెళ్లారు. శిఖరంపై కాషాయ జెండాను కట్టి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ ఏడాది కొంత ఆలస్యంగా అది కూడా కొద్దిగానే గుడి శిఖరం బయటకు తేలినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. -
పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి
నిజామాబాద్ రూరల్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నగరంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లోగల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ చేసిన పోరాటాలు అందరికీ స్ఫూర్తిదాయకామన్నారు. పాపన్నగౌడ్ వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి సుజయ్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి బుస్స ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా గ్రంథాలయంలో నాగుపాము కలకలం
ఖలీల్వాడి: నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నాగుపాము కలకలం రేపింది. గ్రంథాలయంలోకి మంగళవారం రాత్రి పాము రావడంతో పాఠకులు భయబ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్తో రాత్రి నుంచి పామును పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నించారు. బుధవారం ఉదయం గ్రంథాలయం మొదటి అంతస్తులోని పుస్తకవిభాగంలో నాగుపామును పట్టుకున్నారు. డబ్బా లో దానిని బంధించారు. దీంతో గ్రంథాల య సిబ్బంది, పాఠకులు ఊపిరి పీల్చు కున్నారు. గ్రంథాలయ ఆవరణ అవతలి వైపు ఉన్న బాల భవన్ ప్రాంగణం, పాత డీఈవో కార్యాలయంలోని ఖాళీ స్థలంలో చెత్తా చెదారం ఉండటంతో గ్రంథాలయ భవనంలోకి విషసర్పాలు వస్తున్నట్లు గ్రంథాలయ సిబ్బంది తెలిపారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పాఠకులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
సిరికొండ: మండలంలోని గడ్కోల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహ్మద్ రహమాన్(34) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్సై రామకృష్ణ బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ గ్రామానికి చెందిన రహమాన్ సిరికొండలో లతీఫ్ టీ పాయింట్లో పని చేస్తుంటాడు. మంగళవారం రాత్రి తన పని ముగిసిన తర్వాత బైక్పై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిజామాబాద్ లీగల్: ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపి ఇద్దరి వ్యక్తుల మృతికి కారణమైన డ్రైవర్కు నిజామాబాద్ జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి రెండేళ్ల జైలు శిక్ష, రూ. ఐదు వేల జరిమానా విధించారు. 1నవంబర్2018న నందిపేట్ నుంచి నిజామాబాద్కు వస్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంగా నడిపిన బస్సు డ్రైవర్ రాథోడ్ అశోక్ ఆంధ్రనగర్ వద్ద ఓ మోపెడ్ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో టీవీఎస్ మోపెడ్ పై ప్రయాణిస్తున్న గడ్డల సాయిలు, చందూరి రామారావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సాయిలు కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని ఆర్మూర్ కోర్టుకు తరలించారు. దర్యాప్తు చేపట్టిన ఆర్మూర్ మెజిస్ట్రేట్ కోర్టు డ్రైవర్ రాథోడ్ అశోక్కు రెండేళ్ల జైలు శిక్ష, రూ. ఐదు వేల జరిమానా విధించింది. ఆర్మూర్ కోర్టు తీర్పుపై డ్రైవర్ అశోక్ నిజామాబాద్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఆర్మూర్ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును ధ్రువీకరించిన జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి, ఆర్మూర్ కోర్టు తీర్పును యథావిధిగా అమలు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం సందర్శన తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ న్యాయశాస్త్ర వి భాగం విద్యార్థులు బు ధవారం జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కా ర్యాలయాన్ని సంద ర్శించారు. లా ఆఫ్ ప్రాపర్టీ పాఠ్యాంశంలో భాగంగా బీవోఎస్ చైర్మన్ డాక్టర్ స్రవంతి సూచన మేరకు విద్యార్థులు కార్యాలయాన్ని సందర్శించారు. సబ్ రిజిస్ట్రార్ లు రవికాంత్, సతీశ్, ప్రసాద్ తదితరులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిర్వహించే వివిధ కార్యకలాపాలను విద్యార్థులకు వివరించారు. స్థిరాస్తి రిజిస్ట్రేషన్, వాటి క్రయ విక్రయాలపై అవగాహన కల్పించారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ లను విద్యార్థులు సన్మానించారు. -
ఆపద్బాంధవులు..
కమ్మర్పల్లి: రోడ్డు ప్రమాదమైనా.. పాము కాటేసినా.. గుండెపోటుకు గురైనా... గర్భిణులు పురిటి నొప్పులు పడుతున్నా అత్యవసరంగా 108 అంబులెన్స్ సేవలను వినియోగిస్తున్నాం. ఈ సేవల్లో కీలకంగా పనిచేసేది ఈఎంటీలు(అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులు). వీరు విధి నిర్వహణలో 24 గంటలపాటు వైద్య సేవలందిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. గురువారం జాతీయ ఈఎంటీల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో అత్యవససర సేవల్లో నిమగ్నమై స్ఫూర్తిదాయకమైన వైద్య సేవలందిస్తున్న ఈఎంటీలపై ప్రత్యేక కథనం.. ఉమ్మడి జిల్లాలో గత 20 ఏళ్లుగా 108 అంబులెన్సుల్లో సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారు. అంబులెన్స్ వాహనం పైలట్తో పాటు ఈఎంటీ విధులు నిర్వహిస్తారు. అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులుగా సుశిక్షితులైన ఈఎంటీలు అత్యవసర సమయంలో రోగులను తరలిస్తూ ప్రాథమిక చికిత్సలను వాహనంలోనే అందిస్తూ ఆస్పత్రులకు చేర్చేలోపు పిలిచే మొదటి గంట (గోల్డెన్ అవర్)లో వీరి సేవలు కీలకంగా మారుతున్నాయి. అత్యవసర ప్రాథమిక చికిత్సతోపాటు, ఆపై ఆస్పత్రులకు సకాలంలో చేరుస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. వీరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ పురస్కారాలు అందజేస్తోంది. ఉమ్మడి జిల్లాలో వివరాలు ఏడాదిలో నమోదైన కేసులు: 63,431 అంబులెన్సులు: 49 నియోనాటల్ అంబులెన్సులు: 02 ఈఎంటీ ఉద్యోగులు: 102 గోల్డెన్ అవర్లో ప్రాణాలు నిలుపుతున్న 108 సిబ్బంది నేడు జాతీయ వైద్య సాంకేతిక నిపుణుల దినోత్సవం -
హనుమాన్ శోభాయాత్ర.. దారి మళ్లింపు
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో గురువా రం నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ దారి మళ్లింపు చేపడుతున్నట్లు సీపీ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదా రులు పోలీసులు సూచించిన నిబంధనలు పాటించాలన్నారు. శోభాయాత్ర వెళ్లే మార్గాల్లో దుకాణాదారులు, వ్యాపారస్తులు తమ వాహనాలను రోడ్ల పక్కన నిలిపి ఉంచరాదని పోలీసులు సూచించారు. వాహనాలు ఇలా వెళ్లాలి హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్ వచ్చి పోయే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు బస్టాండ్, జెడ్పీ క్రాస్ రోడ్, సుభాష్నగర్ రామాలయం, రవి పబ్లిక్ స్కూల్, ఎస్ఎఫ్ఎస్ పాఠశాల జంక్షన్ నుంచి చంద్రశేఖర్ కాలనీ రోడ్డు చౌరస్తా నుంచి కంఠేశ్వర్ బైపాస్ జంక్షన్ చేరుకొని హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్ వైపు వెళ్లాలి. తిరిగి ఇదే మార్గం గుండా నిజామాబాద్ బస్టాండ్కు చేరుకోవాల్సి ఉంటుంది. బోధన్ నుంచి వచ్చిపోయే వాహనాలు అర్సపల్లి రైల్వే గేట్ నుంచి కొత్త కలెక్టరేట్ నుంచి చంద్రశేఖర్ కాలనీ రోడ్డు చౌరస్తా, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ రోడ్డు జంక్షన్ నుంచి సుభాష్నగర్ రామాలయం, రవి పబ్లిక్ స్కూల్, జెడ్పీ జంక్షన్, ఎన్టీఆర్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్కు చేరుకోవాల్సి ఉంటుంది. బాన్సువాడ నుంచి వచ్చి పోయే వాహనాలు వర్ని చౌరస్తా నుంచి పులాంగ్ సర్కిల్, కోర్టు సర్కిల్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వేస్టేషన్ గుండా ఆర్టీసీ బస్డాండ్కు చేరుకోవాల్సి ఉంటుంది. ధాన్యాన్ని దళారులకు విక్రయించొద్దు ● ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి వర్ని: రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లబ్ధి పొందాలని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బుధవారం వర్ని మండలం పాత వర్ని వ్యవసాయ సహకార సంఘం, మార్కెట్ కమిటీ, నెహ్రూనగర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వర్ని ప్రాంతంలో వరి కోతలు ముందస్తుగా ప్రారంభమవుతున్న దృశ్య అధికారులతో చర్చించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వర్ని మార్కెట్ కమిటీ కార్యాలయంలో రూ. కోటి 50 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న వివిధ అభివద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మార్కెట్ కమిటీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి రూ. 60 లక్షలు, రూ. 50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, రూ. 40 లక్షలతో మురికి కాలువల నిర్మాణం చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమాల్లో వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్ బాబా, డీసీసీబీ కార్యదర్శి వెలగపూడి గోపాల్, వర్ని తహసీల్దార్ సాయిలు, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు సాయిబాబా, నేమాని వీర్రాజు, సత్యనారాయణపురం సర్పంచ్ కనకదుర్గ రవి, సర్పంచ్ బాల్ సింగ్, పీసీసీ డెలిగేట్ రాజిరెడ్డి, సహకార సంఘం సీఈవో గంగాధర్ పాల్గొన్నారు. -
గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
కామారెడ్డి క్రైం: మహారాష్ట్ర నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయించే ఓ ముఠాను దేవునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇల్చిపూర్ శివారులోని వీఐపీ వెంచర్లో రూరల్, సీసీఐ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన 9 మందిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద 1.60 కిలోల గంజాయి ప్యాకెట్లు లభించాయి. వాటి విలువ రూ.50 వేల వరకు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో గాంధారికి చెందిన మంజ్యా వెంకట్రామ్, అదే మండలంలోని చద్మల్ తండాకు చెందిన బామన్ అమర్ సింగ్, గుడిమెట్ గ్రామానికి చెందిన ఆర్ల మధుసూదన్ రావు ప్రధాన నిందితులని పేర్కొన్నారు. వారు మహారాష్ట్ర నుంచి గంజాయిని తెప్పించి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోకి మారుస్తూ కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాలు, పరిసర ప్రాంతాల్లో కొంతకాలంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. పట్టుబడిన వారిలో మిగిలిన ఆరుగురు ప్రధాన నిందితుల వద్ద గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని వెల్లడించారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన దేవునిపల్లి, సీసీఎస్ పోలీసులను అభినందించారు. -
నిజామాబాద్
రికవరీ ఇంకెప్పుడు.. మాక్లూర్ సొసైటీ పాలకవర్గం, సిబ్బంది వాడుకున్న డబ్బును ఇంకెప్పుడు రికవరీ చేస్తారని రైతులు అధికారులను నిలదీశారు. బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026– 8లో uనిజామాబాద్ మార్కెట్ యార్డులోని పసుపు కుప్పల వద్ద నీటిని తొలగిస్తున్న మహిళా రైతు అకాల వర్షం అన్నదాతను తీవ్రంగా దెబ్బతీసింది. పంట చేతికొచ్చిన సమయంలో తీరని నష్టం కలిగించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వరి, మొక్కజొన్న, నువ్వు పంట నేలవాలింది. మామిడికాయలు రాలిపోగా, కల్లాల్లోని పసుపు తడిసి ముద్దయ్యింది. రోడ్ల పక్కన చెట్లు విరిగిపడ్డాయి. -
అన్నదాతకు అకాల దెబ్బ
2,559 ఎకరాల్లో పంట నష్టం● జిల్లాలో 14 మండలాల్లో నష్టపోయిన 2,209 మంది రైతులు ● నిజామాబాద్ మార్కెట్లో తడిసిపోయిన పసుపు కుప్పలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా 14 మండలాల్లో 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి పంటకు అత్యధికంగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలు కొన్నచోట్ల దెబ్బతిన్నాయి. మరోవైపు నిజామాబాద్ మార్కెట్ యార్డులో రైతులు విక్రయించేందుకు తీసుకొచ్చిన పసుపు కుప్పలు తడిసిపోయాయి. ఉదయం నుంచి గంజ్లో 27,800 బస్తాల పసుపును రైతులు విక్రయించారు. పసుపు అధికంగా రావడంతో మరుసటి రోజు మంగళవారం తూకం వేయాల్సి ఉంది. కానీ అంతలోనే భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. గాలులకు పసుపు కుప్పలపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. తూకం వేసే సమయంలో తడిసిన పసుపు పంట నుంచి తరుగు తీయొద్దని రైతులు కోరుతున్నారు. కాగా తడిసిన పసుపును ఎండబెట్టిన తర్వాత తూకం వేయాలని, తరుగు తీసి రైతులను నష్టపర్చవద్దని నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి వ్యాపారులను ఆదేశించారు. తరుగు తీసినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ● ఆర్మూర్ పట్టణం, మండలంలో పలు గ్రామాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న దెబ్బతింది. మామిడి కాయలు నేలరాలాయి. మండల వ్యవసాయాధికారి హరికృష్ణ పిప్రి, ఫత్తేపూర్ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. మాక్లూర్ మండలం చిక్కిలి, గుంజిలి, కొత్తపల్లి గ్రామాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోయింది. మరికొన్ని చోట్ల కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. తడిసిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. నేలవాలిన వరిలో కంకులు రాలిపోతాయని రైతులు వాపోతున్నారు. సింగంపల్లి, వల్లభాపూర్, కొత్తపల్లి, చిన్నాపూర్ ప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. ● కమ్మర్పల్లి మండలం ఉప్పులూరు గ్రామంలో నువ్వుల పంట నేలకొరిగింది. కల్లాల్లో పసుపు కొమ్ములు తడిసిపోయాయి. ఇక ఎడపల్లి, రెంజల్ మండలాల్లోని పలు చోట్ల, ఎడపల్లి మండలం జాకోరాలో స్వల్ప విస్తీర్ణంలో వరి పంట నేలకొరిగింది. కొన్ని చోట్ల నూర్పిడి చేసిన ధాన్యం తడవకుండా చేసుకునేందుకు రైతులు అగచాట్లు పడ్డారు. ఎడపల్లిలో నేలవాలిన వరి పైరుమండలాల వారీగా పంట నష్టం వివరాలు -
ప్రణాళికతో పుష్కరాల పనులు చేపట్టాలి
రెంజల్(బోధన్): వచ్చే సంవత్సరం నిర్వహించే గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికతో పనులు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గతంలో జరిగిన పుష్కరాల్లో చోటు చేసుకున్న తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రాన్ని మంగళవారం సంబంధిత శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. అంతకుముందు పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ డివిజన్ స్థాయి అధికారులతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు అవసరమైన అన్ని రకాల పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వారం రోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డితో కలిసి క్షేత్రాన్ని సందర్శించిన సమయంలో అధికారులకు వివరించిన పనులు ఏ మేరకు పూర్తయ్యాయనే విషయాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించి ఆయా శాఖల అధికారులు చేపట్టిన పనుల వివరాలను ఆరా తీశారు. త్రివేణి సంగమ పుష్కరక్షేత్రానికి పర్వదినాలతోపాటు ప్రతి శుక్ర, ఆదివారాలు భక్తులు వస్తారని, పుష్కరాల సమయంలో లక్షల్లో వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పనులు దీర్ఘకాలం నిలిచేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఘాట్కు వచ్చే మార్గాలలో రహదారుల మరమ్మతులు, వంతెనల నిర్మాణ పనులు, రోడ్ల విస్తరణ పనులపై పురోగతి సాధించాలన్నారు. వీఐపీలు వచ్చే అవకాశం ఉన్నందున హెలిప్యాడ్ను నిర్మించాలన్నారు. వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు వంటి సౌకర్యాలు చేయాలన్నారు. ఘాట్ల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, స్థానిక సర్పంచ్ గయాసొద్దీన్, తహసీల్దార్ శ్రావణ్కుమార్, ఎంపీడీవో కమలాకర్, పీఆర్ డీఈ వెంకటేశ్వర్రావ్ తదితరులు ఉన్నారు. భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు రహదారులను గుర్తించి పనులు ప్రారంభించండి అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రం పరిశీలన -
విద్యార్థులకు కార్పొరేట్ వల
ఖలీల్వాడి: జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలు కొన్ని అనుమతి లేకుండానే అడ్మిషన్ల దందాకు తెరలేపాయి. రంగు రంగుల బ్రోచర్లు, ప్రధాన కూడళ్ల వద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. సీబీఎస్ఈ పేరిట అందినకాడికి దోచుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలల వ్యవహారాన్ని అడ్డుకోవడంలో జిల్లా విద్యాశాఖ విఫలమవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు చేయకుండా కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులు.. తల్లిదండ్రులు తాము పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదని ఆలోచిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకునేందుకు కార్పొరేట్ స్కూళ్లు సిద్ధమవుతున్నాయి. స్కూల్ స్థాయి నుంచే ఐఐటీ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని చెబుతున్న యాజమాన్యాలు రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. వేలల్లో ఒకరిద్దరికి వచ్చే ర్యాంకులను చూపి మాయమాటలతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. నిజమే అని నమ్మిన చాలా మంది తల్లిదండ్రులు స్థిరాస్తులను అమ్ముకొని, అప్పులు చేసి మరీ విద్యార్థులను కార్పొరేట్ స్కూళ్లలో చేరుస్తున్నారు. కలెక్టర్ దృష్టి సారిస్తేనే.. నిజామాబాద్ నగరంతోపాటు జిల్లాలో కార్పొరేట్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నగరంలో ఐదు స్కూళ్లకే సీబీఎస్ఈ అనుమతులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం స్కూళ్ల అనుమతులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, డీఈవో నుంచి అనుమతి పొందిన తర్వాత సీబీఎస్ఈ అనుమతి తీసుకోవా ల్సి ఉంటుంది. కానీ అలాంటివేమీ పట్టించుకోకుండా నేరుగా సీబీఎస్ఈ, డీజీ, ఇంటర్నేషనల్ పేరిట స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత జరుగుతు న్నా సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ దృష్టి సారించి అనుమతి లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నజరానా.. టార్గెట్లు..కార్పొరేట్ స్కూల్పై చర్యలు తీసుకోవాలి నిజామాబాద్ రూరల్లో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సీబీఎస్ఈకి ప్రభుత్వ అనుమతి లే దు. మోసపూరిత ప్రకటనలతో విద్యార్థుల నుంచి లక్షలాది రూ పాయలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని అనుమతి లేని స్కూల్పై చర్యలు తీసుకోవాలి. – జన్నారపు రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీడీఎస్యూఎంఈవోతో నోటీసులిస్తాం.. నగరంతోపాటు జిల్లాలోని ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్లకు ఎంఈవో ద్వారా నోటీసులు అందిస్తున్నాం. కేశాపూర్లోని నారాయణ స్కూల్కు నోటీసులు ఇవ్వాలని ఎంఈవోను ఆదేశించా. అనుమతులు తీసుకున్న తర్వాత, స్కూల్స్ ప్రారంభంలోనే అడ్మిషన్లు తీసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. – పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్ అనుమతులు లేకుండానే అడ్మిషన్ల దందా విద్యార్థుల ఇళ్లకు పీఆర్వోలు, టీచర్లు ఆఫర్ల పేరిట తల్లిదండ్రులకు ఎర ఆకర్షించేలా ఫ్లెక్సీలు, హోర్డింగుల ఏర్పాటు చోద్యం చూస్తున్న విద్యాశాఖ అనుమతిలేని స్కూళ్ల బోర్డులు పెట్టాలి.. అనుమతులు లేని పాఠశాలల వద్ద విద్యాశాఖ అధికారులు ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోకుండా ఉంటారు. అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహిస్తున్న కార్పొరేట్ స్కూళ్ల బోర్డులను వెంటనే తొలిగించేలా అఽధికారులు చర్యలు తీసుకోవాలి. – భట్టు వేణురాజ్, ఎన్ఎస్యూఐ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఅధికారుల నిర్లక్ష్యమే.. అనుమతిలేని కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. సీబీఎస్ఈ, ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరిట తల్లిదండ్రులను మోసం చేసి, అధిక ఫీజులు గుంజుతున్నాయి. విద్యాశాఖ అధికారులు వాటిని అదుపు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. – రాచకొండ విఘ్నేష్, ఎస్ఎఫ్ఐ, జిల్లా ప్రధానకార్యదర్శి, నిజామాబాద్విద్యా సంవత్సరం ముగియక మునుపే కార్పొరేట్ యాజమాన్యాలు అడ్మిషన్లు చేపడుతున్నాయి. పీఆర్వోలు, టీచర్లను నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ఇళ్లకు పంపుతున్నారు. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్తూ డిస్కౌంట్ల పేరిట అడ్మిషన్లు చేస్తున్నారు. ఒక్క విద్యార్థిని స్కూల్లో చేర్పిస్తే పీఆర్వోకు రూ. వెయ్యి నుంచి రూ. 5 వేల చొప్పున నజరానాగా చెల్లిస్తున్నాయి. మరోవైపు సంబంధిత స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, బోధనేతర సిబ్బంది తప్పకుండా 20 వరకు అడ్మిషన్లు తీసుకురావాలని యాజమాన్యాలు టార్గెట్లు విధించినట్లు సమాచారం. దీంతో టీచర్లు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల ఇళ్ల బాట పడుతున్నారు. -
క్రైం కార్నర్
హత్యాయత్నం కేసులో ఒకరికి పదేళ్ల జైలు నిజామాబాద్ లీగల్: నగరంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన నిందితుడికి నిజామాబాద్ మూడవ అదనపు జిల్లా జడ్జి దుర్గాప్రసాద్ పదేళ్ల జైలు శిక్ష, రూ.పదివేల జరిమావా విధించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్లోని సాయినగర్కు చెందిన లింగంపల్లి మహేష్, బొడిగం సంతోష్ స్నేహితులు. తన పిల్లలు మూగవారని మహేశ్ అనడంతో, అతడిపై సంతోష్ పగ పెంచుకున్నాడు. ఈక్రమంలో 2025 మార్చి 4న మహేశ్, తన బంధువు నాగరాజుతో కలిసి బయటకు వెళ్లగా, సంతోష్ వారివద్దకు వచ్చి కత్తితో మహేశ్పై దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకొని కోర్టుకు తరలించారు. జడ్జి కేసును విచారించి సంతోష్కు హత్యాయత్నం కింద పదేళ్ల జైలు శిక్ష, రూ.పదివేల జరిమానా విధించారు. మరో ముగ్గురికి ఐదేళ్లు.. నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ ఐదో టౌన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులపై హత్యాయత్నం కేసులో ముగ్గురు వ్యక్తులకు నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి సాయిసుధ ఐదేళ్ల జైలు శిక్ష, వంద రూపాయల జరిమానా విధించారు. వివరాలు ఇలా.. నగరంలోని హష్మి కాలనీలో నివాసం ఉంటున్న షేక్ నసీర్కు, సయ్యద్ అబ్దుల్ రిజ్వాన్కు కొంత కాలంగా గొడవలు జరుగుతుండేవి. 29 జూన్ 2020న ఇరువురి మధ్య గొడవ జరుగగా నసీర్పై రిజ్వాన్, అతని తమ్ముడు రెహన్, మహ్మద్ అజార్ దాడి చేసి, కత్తితో గాయపరిచారు. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదో టౌన్ పోలీసులు రిజ్వాన్, రెహాన్, అజార్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో జడ్జి విచారణ చేపట్టి నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, వంద రూపాయల జరిమానా విధించారు. కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఏడాది.. నిజామాబాద్ లీగల్: ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించిన ముగ్గురికి నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి తూముకుంట శ్రీనివాస్ ఏడాది జైలు శిక్ష, రూ.4500 జరిమానా విధించారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా శాబ్దీపూర్కు చెందిన మాలోత్ బాలు నాయక్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సు పూర్తిచేసి, కామారెడ్డిలో దేవి ఐకేర్ పేరుతో క్లీనిక్ నడుపుతున్నాడు. లియో ఆప్టికల్స్ యజమాని సోమ్మన్నగారి నర్సింహులు తన పక్కనే బాలు నాయక్ క్లీనిక్ నడపడం ఇష్టం లేక తరుచు గొడవపడేవాడు. 2022 ఏప్రిల్ 13న బాలు నాయక్ రోడ్డుపై నడుచుకుంటు వెళ్తుండగా, నర్సింహులు అతని అనుచరులు కులం పేరుతో దూషించడంతోపాటు క్లీనిక్ను మూసేయాలని కరెంటు కట్ చేసేందుకు యత్నించారు. 15న నర్సింహులు, శ్యాం, రాజు కత్తితో బెదిరించారు. 19న క్లీనిక్పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో బాలునాయక్ కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు నిందితులను పట్టుకొని, కోర్టులో హాజరుపర్చారు. జడ్జి విచారణ చేపట్టి ముగ్గురు నిందితులు నర్సింహులు, శ్యాం, రాజుకు ఏడాది జైలు శిక్షతోపాటు, రూ.4,500 జరిమానా విధించారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ఏఎస్సై కామారెడ్డి పోలీసు లైజన్ ఆఫీసర్ రాజేశ్వర్, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్ను ఉన్నతాధికారులు అభినందించారు. -
పరిశోధక విద్యార్థికి డాక్టరేట్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వృక్షశా స్త్ర విభాగం పరిశోధక విద్యార్థి దాసరి రఘు డాక్టరేట్ సాధించారు. తెయూ ప్రొ ఫెసర్ విద్యావర్థిని పర్యవేక్షణలో ఎన్హాన్స్మెంట్స్ ఆఫ్ క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ యీల్డ్, వయాబిలిటీ అండ్ లో జర్మినేషన్ రేట్ ఇన్ క్లియోమ్ విస్కోసా అండ్ క్లియోమ్ గైనండ్రా బై అప్లికేషన్ ఆఫ్ బ్రాస్సినోస్టిరైడ్స్’ అనే అంశంపై రఘు పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. మంగళవారం ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా కేంద్రియ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాహుల్కుమార్ పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి హలీమ్ ఖాన్, తెయూ సైన్స్ డీన్ సంపత్ కుమార్, బీవోఎస్ చైర్పర్సన్ అరుణ, అధ్యాపకులు శ్రీనివాస్, జలంధర్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ లీగల్: నగరంలో మంగళవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి గాను న్యాయవాదుల సావనీర్ను జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి ఆవిష్కరించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు, న్యాయవాదుల వివరాలతో రూపొందించిన సావనీర్ ఓ జ్ఞాపకంగా నిలిచిపోతుందని అన్నారు. సావనీర్ కమిటి అధ్యక్షుడు అమిడాల సుదర్శన్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్ రాజు, ఉపాధ్యక్షుడు రెంజర్ల సురేష్, సభ్యులు ప్రవీణ, అజీతా రెడ్డి, ఇంతియాజ్, ఆరెట్టి నారాయణ పాల్గొన్నారు. సుభాష్నగర్: హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో నిర్వహించే శోభాయాత్ర, ర్యాలీలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఒక ప్రకటనలో కోరారు. ఈమేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. ఇందూరు పోలీస్ యంత్రాంగం వివిధ నిబంధనలను సాకుగా చూపుతూ ర్యాలీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించాలన్నారు. ర్యాలీలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు తగిన బందోబస్తు ఏర్పాటు చేసేలా స్థానిక పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని దినేష్ పటేల్ కులాచారి డీజీపీని కోరారు. -
మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య ● జిల్లా స్థాయి కమిటీ సమావేశంనిజామాబాద్ అర్బన్: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి ని ఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, వాటి నిరోధానికి అవలంబించా ల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. పోలీ స్, ఎకై ్సజ్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడి పక్కాగా కృషి చేయాలన్నారు. గర్భిణులు కల్తీ కల్లు బారిన పడకుండా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను రవాణా, విక్రయిస్తున్న వారిని, వినియోగిస్తున్న వారిని పక్కాగా గుర్తిస్తూ నిఘా కొనసాగిస్తున్నామని అన్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని, ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఈవో అశో క్, డీటీసీ దుర్గాప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
24న న్యాయవాద సహకార సొసైటీ ఎన్నికలు
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ జిల్లా న్యాయవాద పరస్పర సహకార సొసైటీకి 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం కోసం ఏప్రిల్ 24న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, పులి జైపాల్ తెలిపారు. ఈసందర్భంగా మంగళవారం ఎన్నికల ప్రక్రియ వివరాలను వారు వెల్లడించారు. మొత్తం 12 మంది డైరెక్టర్లకు గాను నిజామాబాద్కు చెందిన 4 నాలుగు డైరెక్టర్ పోస్ట్ల ఎన్నికకు నామినేషన్ పత్రాల స్వీకరణ ఏప్రిల్ 15, 16 తేదీలలో నిర్వహిస్తామన్నారు. 17న నామినేషన్ పరిశీలన, 20 లోపు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుందని అదేరోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారన్నారు. 24న ఎన్నికలు నిర్వహించి, అదేరోజు పూర్తిస్థాయి సొసైటీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలోని సహకార సొసైటీ న్యాయవాద సభ్యులందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. -
ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించాలి
సుభాష్నగర్: జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్వో బీ రాజ శ్రీ పేర్కొన్నారు. కార్యాలయంలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలపై ఆమె మంగళవారం సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది మెడికల్ నాలెడ్జిని పెంచుకుంటూ వైద్య సేవలను అందించాలన్నారు. సీ్త్రలు, చిన్నపిల్లల్లో ప్రమాదకర లక్షణాలను ముందే గుర్తించాలని, బాలింతలను నిరంతరం కలుస్తూ ఆరోగ్యస్థితిని పర్యవేక్షించాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లల ప్రాణాలను కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. పిల్లల వైద్య నిపుణులు నిరూప్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించాలని, అనుబంధ ఆహారం, తల్లి పాలు, చెవి, ముక్కులో నూనె వేయడంతో కలిగే అనర్థాలను వివరించారు. సీ్త్ర వైద్యనిపుణులు రోహిణి మాట్లాడుతూ గర్భిణులకు 5 లేదా 6 గ్రాముల హెచ్బీ ఉంటే వారి పట్ల ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఐరన్ సుక్రోజ్, న్యూట్రిషన్ అందించాలన్నారు. సమావేశంలో డీఐవో ఎం అశోక్, అనస్తటిస్ట్ సుజయ్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వోలు అశ్విని, సమత, పీవోఎంసీహెచ్ శ్వేత, సీడీపీవోలు తదితరులు పాల్గొన్నారు. క్షయ రహిత నిజామాబాద్గా తీర్చిదిద్దాలి క్షయ రహిత నిజామాబాద్గా తీర్చిదిద్దడమే అందరి లక్ష్యమని డీఎంహెచ్వో రాజ శ్రీ తెలిపారు. టీబీఎంబీఏ 2.0 కార్యక్రమంపై మెడికల్ ఆఫీసర్లు, ఎంఎల్హెచ్పీలకు మంగళవారం శిక్షణనిచ్చారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో టీబీ నిర్మూలన లక్ష్యంగా ఆరోగ్య సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు రెండో విడత ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జీవనశైలి వ్యాధులపై నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తారని తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి 11 వరకూ జాతి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో కీటక జనీత వ్యా ధుల ప్రోగ్రాం అధికారి వినయ్ కుమార్, జిల్లా టీబీ అధికారి దేవి నాగేశ్వరి, మెడికల్ ఆఫీసర్ అవంతి, ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.● సీ్త్రలు, చిన్నపిల్లల్లో ప్రమాదకర లక్షణాలను ముందే గుర్తించాలి ● అధికారులతో డీఎంహెచ్వో రాజశ్రీ సమీక్ష -
ఏళ్లు గడుస్తున్నా రికవరీ ఇంకెప్పుడు చేస్తారు?
మాక్లూర్: మాక్లూర్ సొసైటీ పాలకవర్గం, అందులో పని చేసే కార్యదర్శులు, సిబ్బంది కలిసి సొంతానికి వాడుకున్న రూ. 3కోట్ల 24లక్షల డబ్బును ఏళ్లు గడుస్తున్నా ఇంకెప్పుడు రికవరీ చేస్తారని రైతులు అధికారులను నిలదీశారు. సొసైటీ కార్యాలయానికి తాళం వేసి ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలోని మాక్లూర్ సొసైటీ ప్రాంగణంలో మంగళవారం క్లస్టర్ అధికారి స్వప్న అధ్యక్షతన 84వ మహాజన సభ నిర్వహించారు. సొసైటీకి సంబంధించి జమఖర్చులను కార్యదర్శి రతన్ చదివి వినిపించారు. మొదటగా ఎవరు ఎంత బకాయి ఉన్నారనేది చదివి వినిపించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన కల్లెడికి చెందిన సంతోష్ అనే కార్యదర్శిపై రూ.1కోటి 20లక్షల బకాయి ఉండటమేమిటని అధికారులను నిలదీశారు. ఇలా గత రెండు, మూడు పాలకవర్గాలు కలిసి ఇంత పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడితే.. అధికారులుగా మీరేం చేశారని క్లస్టర్ అధికారి స్వప్న, పర్సన్ ఇన్చార్జి చైర్మన్ ఫిరోజ్ ఖాన్లను ప్రశ్నించారు. వాటిని రికవరీ చేసేవరకు ఈ సమావేశాలు వద్దంటూ వాదనకు దిగారు. కొందరు సొంతానికి వాడుకున్న రూ.3 కోట్ల 24 లక్షలను తప్పకుండ రికవరీ చేస్తామని, అందుకు ఒక ప్రొసీజర్ ఉంటుందని క్లస్టర్ అధికారి స్వప్న తెలిపారు. తరచూ ఇదే మాట చెబుతున్నారు కానీ, చేసిందేమిలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను వాకౌట్ చేశారు. సొసైటీ ప్రధాన గేటు వద్దకు వెళ్లి తాళం వేసి అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ సొసైటీ మహాజనసభలో అధికారులను నిలదీసిన రైతులు కార్యాలయానికి తాళం వేసి, ధర్నా రూ.3కోట్ల 24 లక్షలను వెంటనే రికవరీ చేయాలని డిమాండ్ -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలి
నిజామాబాద్ అర్బన్: రోడ్డు ప్రమాదాల నియంత్ర ణ కోసం కృషి చేయాలని, ఇందుకోసం విస్తృత స్థా యిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరంలోని కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ అ ధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్ర తి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటి స్తే, ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. ఈ దిశగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పా టు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా చైతన్యపర్చేందుకు కృషి చేయాలన్నారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న 55 బ్లాక్ స్పాట్ ప్రాంతాల గురించి, ప్రమాదాలకు గల కారణాలపై సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇసుక లోడ్తో కూడిన వాహనాలు తిరగకుండా నిఘా ఉంచాలన్నారు. స్కూల్ బస్సుల తని ఖీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి వాహనం తగిన ఫిట్నెస్ కలిగి ఉండాలన్నారు. వరి కోతల సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోందని, దీని ని దృష్టిలో పెట్టుకొని ఓవర్ లోడ్తో వెళ్లే వాహనా లను నియంత్రించేలా కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా, అందుకు గల కారణాలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరపాలని, త ద్వారా అలాంటి చోట్ల మరోమారు ప్రమాదాలు జ రుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. అధికారులు అంకితభావంతో కృషి చేస్తూ నిజామాబాద్ను రోడ్డు ప్రమాద ర హిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఈవో అశోక్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల, డీటీవో ఉమా మహేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, హర్ష, నేషనల్ హైవే అథారిటీ, ఆర్అండ్బీ, రవాణా శాఖ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, విద్యుత్, వైద్యారోగ్యం, మున్సిపల్ తదితర శాఖల అధికారులతోపాటు రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు, రెడ్క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టరేట్లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం -
ముగిసిన ‘ఇంటర్’ మూల్యాంకనం
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని ఖిల్లా వద్ద గల ఇంటర్మీడియట్ కార్యాల యంలో ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం క్యాంపు మంగళవారం ముగిసింది. ఈసందర్భంగా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూ ల్యాంకనం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. క్యాంపులో 3.45 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం కోసం కేటాయించారని,వాటిని పకడ్బందీగా,విజయంతంగా ఎలాంటి ఇబ్బందులు, తప్పులు దొర్లకుండా నిర్వహించడంతో ఇంటర్ విద్య పరీక్షల విభాగం నుంచి కూడా ప్రశంసించడం గర్వకారణమన్నారు. మూల్యాంకనం విజయవంతంగా పూర్తి చేయడంతో జిల్లా ప్రిన్సిపాళ్లకు, అధ్యాపకులకు డీఐఈవో కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డీఐఈవో రవికుమార్ను ఆధ్యాపకులు సన్మానం చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు జాఫర్, ప్రధాన కార్యదర్శి నారాయణ తదితరులు ఉన్నారు. బోధన్ కోర్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు బోధన్టౌన్(బోధన్): బోధన్ కోర్టు ఆవరణతోపాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా కోర్టు ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు బృంద ప్రతినిధులు తెలిపారు. -
ఊరి కోసం రూ.10 లక్షల విరాళం
వేల్పూర్: మండలంలోని మోతె గ్రామానికి ఆదివారం అదే గ్రామానికి చెందిన అల్లపుల్ల గంగారెడ్డి ఆయన తండ్రి ఏలేటి అల్లపుల్ల రాజులు స్మారకార్థం రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. వీటిలో ఇప్పటికే సుమారు మూడున్నర లక్షల రూపాయల పనులు పూర్తికాగా, ఆరున్నర లక్షలతో చేపట్టే పనులను గుర్తించారు. అందులో భాగంగా స్థానిక వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఆదివారం భవానీమాత మండపం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయనను సర్పంచ్ దొల్లరమేశ్రెడ్డి, ఉపసర్పంచ్ పరంజ్యోతి, వార్డు సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో భవానీయూత్ సభ్యులు పాల్గొన్నారు. -
నాగమడుగు ఎత్తిపోతలపై అధ్యయనం
● పనులను పరిశీలించిన ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తలు నిజాంసాగర్(జుక్కల్): మంజీరా నదిపై నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పనుల పూర్తి, భూముల ముంపు నివారణపై నిపుణుల బృందం నివేదికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆదివారం ఒడ్డేపల్లి శివారులో ఉన్న నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులను సెంట్రల్ డిజైన్ ఆర్గనైజింగ్ ఎస్ఈ జహీర్తో పాటు ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తల బృందం ఇంజినీర్లు పరిశీలించారు. ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులతో వందల ఎకరాల భూములు ముంపునకు గురవుతుండటంతో పాటు రైతుల ఆందోళనలు, నష్టపరిహారం చెల్లింపులు తదితర విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిపుణుల బృందాన్ని పంపింది. అంతేకాకుండా రీడిజైనింగ్ కోసం ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేయడంతో ఇంజినీర్లు పనులను పరిశీలించి ప్రభుత్వాని నివేదిక ఇవ్వనున్నట్లు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజింగ్ ఎస్ఈ జహీర్ తెలిపారు. బాన్సువాడ నీటిపారుదలశాఖ ఎస్ఈ దక్షిణామూర్తి, ఈఈలు సాలోమాన్, చంద్రశేఖర్, డిప్యూటీ ఈఈలు, ఏఈలు, ఇంజినీర్లు ఉన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కోసం మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి టైలరింగ్ కోర్సు (31 రోజు లు), బ్యూటీపార్లర్ (35 రోజులు), ఏప్రిల్ 10 నుంచి మగ్గం వర్క్ (31 రోజులు) కోర్సులు ప్రారంభమవుతాయన్నారు. ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజన సదుపాయం, హాస్టల్ వసతి కల్పిస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రం, టూల్ కిట్స్ అందిస్తామన్నారు. 19 నుంచి 45 సంవత్సరాల వయస్సులోపు మహిళలు అర్హులన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంతవాసులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి గలవారు తమ ఆధార్కార్డు, రేషన్కార్డు, 10వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్పోర్టు సైజ్ ఫోటోలు, బ్యాంకు ఖా తా జిరాక్స్ వెంట తెచ్చుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం డిచ్పల్లిలోని ఘన్పూర్ రోడ్లోగల వెలుగు ఆఫీస్పక్కన ఉన్న ఎస్బీఐ శిక్షణ కేంద్రంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించాలన్నారు. లేదా 08461–295428ను సంప్రదించవచ్చన్నారు. రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక మోపాల్: ఉమ్మడి జిల్లాస్థాయి కుస్తీ పోటీల్లో పలువురు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ దేవేందర్ తెలిపారు. మండలంలోని మంచిప్పలో ఆదివారం నిజామా బాద్ ఉమ్మడి జిల్లాల అండర్–20 కుస్తీ పోటీ లు నిర్వహించగా 20 మంది క్రీడాకారులు హాజరయ్యారు. హోరాహోరీగా పోటీలు జరుగగా, విజేతలను పీఈటీ అభినందించారు. గె లుపొందిన క్రీడాకారులు ఏప్రిల్ 2న కామారెడ్డి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీ డాకారులు, బాలుర విభాగంలో లక్ష్మణ్ (57 కే జీలు), మణికంఠ (55 కేజీ), యోగేష్ (60 కే జీ), జగదీష్ (55 కేజీ), కృష్ణ (70 కేజీ), బాలికల విభాగంలో.. సోనియా (50 కేజీ), సఫి యా (72 కేజీ), ప్రీతి రాజ్ (68 కేజీ) ఉన్నారు. వర్ని: మోస్రా మండల కేంద్రంలోనీ సీతారామ ఆలయంలో శనివారం రాత్రి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. -
నిరంతర విద్యుత్ సరఫరానే లక్ష్యం
● లోడ్ పెరిగే ప్రాంతాల్లో నూతన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు సుభాష్నగర్: వేసవికాలంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా ఉన్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ నుంచే అప్రమత్తమయ్యామని, ఏ విపత్తు ఎదురైనా సరఫరాను నిరంతరాయంగా అందించడానికి చర్యలు చేపట్టామన్నారు.ఇప్పటివరకు లోడ్ పెరిగే ప్రాంతాల్లో అంచనా మేరకు నూతనంగా 342 ట్రాన్స్ఫార్మర్లను ఏ ర్పాటు చేశామన్నారు. ఉపకేంద్రాల సామర్థ్యం పెంచేలా 2 సబ్స్టేషన్లు, 17 పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామ ర్థ్యం పెంచి అందుబాటులోకి తెచ్చామన్నారు. అందుబాటులో ఇంటర్ లింకింగ్.. వినియోగదారులకు నిరంతర సరఫరా అందించాలనే ఉద్దేశంతో ఇంటర్ లింకింగ్ వ్యవస్థను తీసుకొచ్చామని రాజేశ్వర్రావు అన్నారు. ఇప్పటివరకు 34 చోట్ల ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనా, ఏదైనా ఉపకేంద్రంలో సమస్య తలెత్తినా.. ఆ పరిధిలో అంతరాయం ఏర్పడినా.. పరిష్కారమయ్యే వరకు మరో కేంద్రం నుంచి సరఫరా పునరుద్దరించేందుకు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తూ, ప్రస్తుతం 137 కిలోమీటర్లకు పైగా పనులు పూర్తి చేశామన్నారు. అలాగే వినియోగదారులకు ఏ అవసరమొచ్చినా కార్యాలయాల బాటపట్టకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ వాట్సాప్ చాట్బాట్, విద్యుత్ ప్రజావాణి, 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. -
అత్తను చంపిన కోడలు
● బంగారు ఆభరణాలు అపహరణ ● నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని సీతాయిపల్లిలో వృద్ధురాలైన అత్తను కోడలు హత్య చేసి, ఆమె మెడలోని బంగారు ఆభరణాలను అపహరించింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. సీతాయిపల్లి గ్రామానికి చెందిన కావటి రుక్మవ్వ(73)కు ముగ్గురు కొడుకులు, కుమార్తె ఉండగా, వారికి వివాహాలు జరిగాయి. కొన్నేళ్ల క్రితం మొదటి ఇద్దరు కొడుకులు మృతిచెందగా, చిన్న కుమారుడు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. గ్రామంలో రుక్మవ్వ, మొదటి ఇద్దరు కోడళ్లు వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. రుక్మవ్వకు కొన్నిరోజులుగా రెండో కోడలు కోటవ్వతో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న అత్తపై రెండో కోడలు రాయితో బలంగా కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, మెడలోని బంగారు గుండ్లు, చెవి కమ్మలను కోటవ్వ అపహరించింది. అనంతరం సహజ మరణంగా బంధువులు, గ్రామస్తులను నమ్మించింది. సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా, తలకు గాయం ఉన్నట్లు బంధువులు గుర్తించి, కోటవ్వను నిలదీశారు. తానే హత్య చేసినట్లు ఆమె ఒప్పుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు పరిశీలించారు. మృతురాలి కుమార్తె కిష్టవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని, అపహరించిన ఆభరణాలను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. మోపాల్: ఆర్టీసీ బస్సు కండక్టర్పై ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటన మోపాల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గన్నారం గ్రామానికి చెందిన తెడ్డు సురేష్ ఆదివారం నిజామాబాద్ బస్టాండ్కు వచ్చాడు. నర్సింగ్పల్లిలోని తన సోదరి ఇంటికి వెళ్లేందుకు చద్మల్ వైపు వెళ్తున్న బస్సు ఎక్కాడు. నర్సింగ్పల్లి శివారులోకి బస్సు రాగానే ఆపాలని అతడు గొడవకు దిగాడు. బస్టాప్ దగ్గరే ఉంది.. అక్కడే ఆపుతానని కండక్టర్ చెప్పినా విన్పించుకోలేదు. సురేష్తో వచ్చిన మరో వ్యక్తి నడిపి బాబయ్య కండక్టర్, డ్రైవర్ను దూషిస్తూ బస్సును అడ్డుకున్నారు. మాటామాటా పెరగడంతో అప్పటికే కోపోద్రిక్తుడైన సురేష్ బస్సు ఆగిన వెంటనే కర్రతో కండక్టర్ను చితకబాదాడు. దీంతో కండక్టర్ హన్మంతు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. -
మాతృభాష పరిరక్షణకు కృషి చేయాలి
● పంపా సాహితీ పీఠం కవి సమ్మేళనంలో వక్తలు బోధన్: మాతృభాష తెలుగు పరిరక్షణకు కవులు, రచయితలు, తెలుగు భాష ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని వక్తలు అన్నారు. బోధన్లోని ఉషోదయ జూనియర్ కళాశాలలో ఆదివారం పంపా సాహితీ పీఠం ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకొని కవి సమ్మేళనం నిర్వహించారు. జ్యోతి ప్ర జ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమ్మేళానికి వచ్చిన కవులు, రచయితలు తమ స్వీయ కవితలను వినిపించారు. నిర్వాహకులు కవులకు శాలువా, జ్ఞాపిక అందించి ఘనంగా సన్మానించారు. రచయిత తొగర్ల సురేశ్ రచించిన మెరుపు తీగలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్, ఉషోదయ, విద్యా వికాస్ విద్యా సంస్థల అధిపతులు సూర్యప్రకాశ్, శ్రీనివాస్రావు, ప్రత్యేక ద్వితీయశ్రేణి న్యాయమూర్తి అబ్బరాజు శేషతల్పసాయి, బోధన్, పోతంగల్ ఎంఈవో నాగయ్య, లోల శంకర్, విశ్రాంత ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షుడురాజేశ్వర్రావు విచ్చేశారు. పంపాసాహితి పీఠం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పురాణే అజయ్కుమార్, ప్రభాకర్, ప్రతినిధులు,స భ్యులు, కవులు మొగిలిస్వామిరాజ్, పబ్బమురళి, కాట్రగడ్డ భారతి, అమరావతి,డాక్టర్ గంధం విజయలక్ష్మి, శ్రీదారం గంగాధర్, మార్కొండ సాయిలు,తొగర్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వయోజన విద్య పరీక్ష కేంద్రం తనిఖీ
వేల్పూర్: మండలంలోని అంక్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ వయోజన విద్య పరీక్ష కేంద్రాన్ని జిల్లా ప్రాజెక్టు అధికారిణి సంధ్యారాణి పరిశీలించారు. వయోజన విద్యనభ్యసించి పరీక్ష రాస్తున్న వయోజన మహిళలతో మాట్లాడారు. చదువుకు వయసుతో సంబంధం లేదని, ఎప్పుడైనా చదువుకోవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరక్ష్యరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వయోజన విద్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిందన్నారు. ఏపీఎం మాణిక్యం, సీసీలు సాయన్న, వెన్నమురళి, వీవోఏలు సుమలత, లత, రూప, స్వరూప, మహిళలు పాల్గొన్నారు. హోరాహోరీగా మల్లయోధుల పోరు నిజాంసాగర్(జుక్కల్): మత్తడి పోచమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహమ్మద్ నగర్ మండలం నర్వలో మల్లయోధుల కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. పొరుగు రాష్ట్రాల మల్లయోధులు తరలిరావడంతో పోటీలు రసవత్తరంగా సాగాయి. గ్రామానికి చెందిన ముప్పిడి రాంప్రసాద్ గుప్తా తన తండ్రి రాములు జ్ఞాపకార్థం 5 తులాల వెండి కడియాన్ని ఆఖరి కుస్తీ మల్లయోధుడికి బహూకరించారు. డీసీసీ జిల్లా కార్యదర్శి గొట్టం నర్సింలు, ఉప సర్పంచ్ చింతల దుర్గానరేశ్ గుప్తా, నాయకులు గొల్ల గోపాల్, గంగారాం, మల్లయ్య, తదితరులున్నారు. ఎల్లారెడ్డిరూరల్: అల్మాజీపూర్లో ఆదివారం కుస్తీ పోటీలు నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా కుస్తీ పోటీలను నిర్వహించినట్లు సర్పంచ్ దేవదత్తు తెలిపారు. కొబ్బరికాయ కుస్తీ నుంచి రెండున్నర తులాల వెండి కడియం వరకు కుస్తీ పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. లింగంపేట(ఎల్లారెడ్డి): భవానిపేట, బాణాపూర్ గ్రామాల్లో ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. కుస్తీ పోటీల్లో మల్లయోధులు హోరాహోరీగా తలపడ్డారు. గెలుపొందిన వారికి సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. -
క్రైం కార్నర్
ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధం సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని భూంపల్లి గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధమైనట్లు బాధితుడు సుంకరి గంగయ్య తెలిపారు. గంగయ్యకు చెందిన రెండెకరాల జొన్న పంట చేతికొచ్చే సమయంలో అగ్ని ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన జొన్న పంటను ఆర్ఐ సంతోష్ పరిశీలించి పంచనామ నిర్వహించారు. రెండు ఎకరాల్లో సుమారు రూ.లక్షా 50వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. రామాలయంలో హుండీ చోరీ మాక్లూర్: మండల కేంద్రంలోని రామాలయం హుండీని శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీ చేసి, అందులోని నగదు అపహరించుకపోయారు. మరుసటి రోజు ఆలయ కమిటీ సభ్యులు చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాక్లూర్ పోలీసులు వెంటనే ఆలయ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేయగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. కుక్క దాడిలో నలుగురికి గాయాలు రుద్రూర్: పోతంగల్ మండలం కల్లూర్ గ్రామంలో ఆదివారం ఓ కుక్క దాడి చేయగా నలుగురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో బోధన్ ఆస్పత్రికి తరలించినట్టు వారు తెలిపారు. బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని గోషాల రోడ్డులో గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసునమోదు చేసినట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. శనివారం రాత్రి పట్టణంలోని గోషాల రోడ్డులో ముగ్గురు అనుమానితులు గంజాయి సేవిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. వారిని అదుపులోకి తీసుకొని చెక్ చేయగా అందులో సాజిమ్ మంజుర్, నాగారం నరసింహా అనే ఇద్దరు గంజాయి సేవించినట్లు తేలిందన్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఐస్క్రీం బండ్లకు ప్రవేశం లేదు
● గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ధర్మోరా గ్రామస్తులు మాక్లూర్: తమ గ్రామంలోకి ఐస్క్రీం బండ్లకు ప్రవేశం లేదంటూ ధర్మోరా గ్రామస్తులు పేర్కొన్నా రు. ఈమేరకు మండలంలోని ధర్మోరా గ్రామంలో ఆదివారం గ్రామస్తులందరు కలిసి సర్పంచ్ పందిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మా ఊరిలోనికి ఐస్క్రీం అటోలకు ప్రవేశం లేదని గ్రామానికి రెండు వైపులా ఫ్లెక్సీలు పెట్టారు. అటోలలో వచ్చి నాసిరకం ఐస్క్రీంలు అమ్మడంతో వాటిని తిన్న చిన్నారుల ఆరోగ్యాలు చెడిపోతున్నాయన్న ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ఎవరైన గ్రామంలోకి వచ్చి ఐస్క్రీంలు విక్రయిస్తే రూ.5వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అనంతరం ఐస్క్రీంలు తింటే చిన్న పిల్లలకు వచ్చే జబ్బుల విషయమై గ్రామంలో అవగాహన కల్పించారు. ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
యువత సన్మార్గంలో నడవాలి
● మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ● సీపీ సాయిచైతన్య నిజామాబాద్ రూరల్: యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో ఆదివారం రూరల్ పోలీసులు నిర్వహించిన 2కే రన్ను సీపీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతే దేశానికి భవిష్యత్తు అని అన్నారు. సామర్థ్యాన్ని సరైన దారిలో వినియోగిస్తే యువత మాత్రమే కాదు, సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఇటీవల యువతలో చెడు అలవాట్లు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులు చెప్పే మంచి మాటలు వినాలని, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని అన్నారు. అనంతరం 2కే రన్లో ప్రతిభ కనబర్చిన వారికి సీపీ సాయిచైతన్య బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ(అడ్మిన్) బస్వా రెడ్డి, ఏసీపీ ప్రకాశ్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు ఎండీ షరీఫ్ , ఆనంద్ సాగర్, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
సిరికొండ రేంజ్లోకి పెద్దపులి
● జినిగాల బీట్లో సంచారం ● పాదముద్రలను గుర్తించిన అధికారులు సిరికొండ: జిల్లా సరిహద్దులోని అటవీప్రాంతంలో కొద్ది రోజుల క్రితం సంచరించి హడలెత్తించిన పెద్దపులి.. ఇప్పుడు సిరికొండ రేంజ్లోకి వచ్చింది. జినిగాల బీట్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఆర్మూర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ భవాని శంకర్, సిరికొండ, కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి నర్సింగ్రావు, రవీందర్ తమ సిబ్బందితో జినిగాల అటవీ ప్రాంతంలో ఆదివారం పర్యటించారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించినట్లు వారు తెలిపారు. అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ ఎఫ్డీవో సూచించారు. తెల్లవారు జామున, పొద్దు పోయే ముందు, రాత్రి వేళలో అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని అన్నారు. పశువులను మేత కోసం అటవీప్రాంతంలోకి తీసుకెళ్లొద్దని, అడవికి సమీపంలో వ్యవసాయ భూములు ఉన్న రైతులు పంట పొలాల వద్ద విద్యుత్ కంచెలను అమర్చవద్దని అన్నారు. పెద్దపులి పశువులు, జంతువులను చంపితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. పెద్దపులి దాడిలో చనిపోయిన పశువులకు అటవీ శాఖ ద్వారా పరిహరం చెల్లిస్తామని ఆయన తెలిపారు. పెద్దపులికి ఎలాంటి హాని తలపెట్టొద్దని, పులిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఆయన అన్నారు. గస్తీలో సిరికొండ డీఆర్వో గంగారాం, సిరికొండ, కమ్మర్పల్లి రేంజ్ల సిబ్బంది పాల్గొన్నారు. -
పిచ్చికుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు
దోమకొండ: మండల కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో శనివారం సాయంత్రం పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలైయ్యాయి. కాలనీకి చెందిన ముద్దసాని కనకయ్య, బ్రహ్మయ్యగారి వెంకవ్వ, జంగం లిల్లీ, సాయవ్వతోపాటు మరో చిన్నారిపై కుక్కలు దాడిచేసినట్లు కాలనీవాసులు తెలిపారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పది రోజుల క్రితం ఇదేవిధంగా పలువురు చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేయగా, వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తరచు కుక్కల దాడితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్కూటీ దహనం ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో గట్టడి శ్రీనివాస్ చెందిన స్కూటీని శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. శ్రీనివాస్ రోజూ మాదిరిగా తన స్కూటీని రాత్రి ఇంటి ఆవరణలో ఉంచి లోనికి వెళ్లిపోయాడు. కాగ అర్ధరాత్రి స్కూటీ దహనం అవుతున్న విషయాన్ని చుట్టుపక్కలవారు గమనించి అతడికి తెలిపారు. వెంటనే మంటలను ఆర్పడానికి వారు ప్రయత్నించినా అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. -
క్యాంపస్ కబర్లు..
ముగిసిన ఖో–ఖో శిక్షణ శిబిరం తెయూ(డిచ్పల్లి):తెలంగాణ యూనివర్సిటీలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న వర్సిటీ మహిళల ఖో–ఖో శిక్షణ శిబిరం శనివారం ముగిసినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్ తెలిపారు. ఈసందర్బంగా బాలకిషన్ మాట్లాడుతూ.. క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ శిక్షణ శిబిరం చాల ఉపయోగపడిందని తెలిపారు. వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ బీఆర్ నేత, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. 30న ఎయిడ్స్పై అవగాహన సదస్సు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) సెల్ ఆధ్వర్యంలో ఈనెల 30న హెచ్ఐవి/ఎయిడ్స్పై (రెడ్ రిబ్బన్ క్లబ్) అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిపై అపోహలను తొలగించడం, సామాజిక ముద్రను తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాల ప్రాముఖ్యతను సదస్సులో వివరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మకాలజీ విభాగం ఇన్చార్జి హెచ్వోడీ మురళీ కృష్ణ్ణ ప్రధాన వక్తగా పాల్గొంటారని ఆమె తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి ఇంటిగ్రేటెడ్ పీజీ సెమిస్టర్ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల (అప్లయిడ్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ)కు సంబంధించి 8, 10వ సెమిస్టర్ రెగ్యులర్ /బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 16 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు. కుర్ర మోహన్కు డాక్టరేట్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం పరిశోధక విద్యార్థి కుర్ర మోహన్ డాక్టరేట్ సాధించారు. వర్సిటీ ప్రొఫెసర్ బోయపాటి శిరీష పర్యవేక్షణలో ‘ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రియల్ వ్యర్థాల నిర్మూలన–ఆర్గానిక్ సింథసిస్ కోసం సమర్థవంతమైన రంధ్రాలు గల ట్రాన్సిషన్ మెటల్ ఆకై ్సడ్ ఆధారిత కాటలిటిక్ వ్యవస్థల తార్కిక రూపకల్పన’ అనే అంశంపై మోహన్ పరిశోధన పూర్తి చేసి సిద్ధాంతగ్రంథం సమర్పించారు. శనివారం తెయూలో నిర్వహించిన మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ జ్యోతి వ్యవహరించారు. పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కె.సంపత్ కుమార్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు వాసం చంద్రశేఖర్, మావురపు సత్యనారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెయూలో పుస్తకావిష్కరణ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో శనివారం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ముద్రించిన ‘సంచార జాతులు – సమగ్ర సర్వే’ అనే పుస్తకాన్ని వీసీ యాదగిరిరావు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచార, విముక్త జాతుల జీ వన విధానం, సామాజిక పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర అధ్యయనాన్ని ఈ పు స్తకం ద్వారా తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. సంచార జాతులపై సర్వే నిర్వహించడం,వారి జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన సామాజిక సమరసత వేదిక ప్రతినిధుల ను అభినందించారు. వేదిక సభ్యులు అమృత్ చారి,అశోక్, శివ,పృథ్వీ, సమీర్, మోహన్, మనోజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
నాగారం.. పొగమయం
నగరంలోని డంపింగ్ యార్డు నుంచి వచ్చే దట్టమైన పొగ, దుర్వాసనతో నాగారం 300 క్వార్టర్స్ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. డంపింగ్యార్డులో మంటలు అంటుకొని పెద్ద ఎత్తున దుర్వాసనతో పొగ వ్యాపిస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు. దీంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవికాలంలో ఇదే దుస్థితి ఉంటుందని, అయినా సిబ్బంది ఫైరింజన్లు తెప్పించకుండా మున్సిపల్ కార్మికులతో మంటలను ఆర్పుతున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
బాధిత కుటుంబానికి పరామర్శ
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలోని మాజీ జెడ్పీటీసీ మచ్చ నారాగౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. బాధిత కుటుంబాన్ని శనివారం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్గౌడ్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నారాగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఆత్మీయ మిత్రుడిని కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు నాగేష్రెడ్డి, మానాల మోహన్రెడ్డి, బాడ్సి శేఖర్గౌడ్, బొబ్బిలి రామకృష్ణ, దయాకర్గౌడ్, సర్పంచ్ మీసాల లక్ష్మినారాయణ, కుద్దూస్ పాల్గొన్నారు. -
‘ఇందూరు యువత’ సేవలు అభినందనీయం
నిజామాబాద్ రూరల్: ఇందూరు యువత స్వచ్ఛంద సేవాసంస్థ చేస్తున్న సమాజ సేవలు అభినందనీయమని సీపీ సాయిచైతన్య అన్నారు. యువత సైతం ఇలాంటి సేవాకార్యక్రమంల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సుభాష్ నగర్లోని పెన్షనర్స్ భవన్లో సంస్థ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన సేవ తత్పరత–2026 పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమాన్ని సీపీ ముఖ్య అతిథిగా హా జరై, జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. డీసీఎస్వో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సంస్థ సేవలు అమోగమన్నారు. సంస్థ ఆ ధ్వర్యంలో ఈనెల 28 నుంచి నెల రోజులపాటు అ నాథ వృద్ధులకు సపర్య సేవలు అందించనుండగా, కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు. సంస్థ ప్రతినిధులు మద్దుకూరి సాయిబాబు, బాలకిషన్, గంగాధర్, సుజాత రెడ్డి, విజయనంద్, యువి ఫౌండేషన్ ఫౌండర్ సుజన్ కుమార్, హన్మండ్లు, దర్శనం రాజు, కనకన్న, సుధాకర్, రఘు రాములు, సంతోష్, రాజ్కమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీగా ఉన్నప్పుడు ఏంచేశావ్?
సుభాష్నగర్: కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్నప్పు డు నిజామాబాద్కు ఏం చేశావు? మూతపడిన షుగ ర్ ఫ్యాక్టరీలను తెరిపించావా.. ఆర్వోబీలు తెచ్చావా... అంటూ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి ప్రశ్నించారు. అభివృద్ధిని గాలికి వదిలేసి, లి క్కర్ స్కామ్లో వందలు, వేల కోట్లు గడించింది వా స్తవం కాదా? అంటూ ఆరోపించారు. నగరంలో ని బీజేపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జ్యోతి మాట్లాడారు. నిజామాబాద్ వచ్చి తాను తెలంగాణ ఆడబిడ్డను, నిజామాబాద్ కోడలిని అని కవిత చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ఇందూరుకు వచ్చినప్పుడు, రాజకీయ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు తాను ఆడబిడ్డను, కోడలిని అన్న విషయం గుర్తుకువస్తుందన్నారు. ఎంపీ అర్వింద్ గురించి కవిత మా ట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాలో ఎంపీ అర్వింద్ 10 ఆర్వోబీలు, ఆర్యూబీలు మంజూరు చేయించారని, వాటిలో ఇప్పటికే మూడు పూ ర్తికాగా, మిగితావి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ ఇచ్చిన పైసలు తీసుకొని కొత్త పార్టీ పెడతానని చెప్పులు అరిగేలా తిరుగుతున్నావన్నా రు. ఏప్రిల్ 25న పెట్టబోయే కొత్త పార్టీకి ‘లిక్కర్ పార్టీ‘ అని పేరు పెట్టుకుంటే సెట్ అవుతుందన్నా రు. కార్పొరేటర్లు ఇప్పకాయల సుమిత్ర దేవి, చింత ప్రసున్నారెడ్డి, కల్పే అర్చన, రేవతి న్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసి, లిక్కర్ స్కామ్లో రూ.కోట్లు గడించావు కల్వకుంట్ల కవితపై బీజేపీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతి ఆరోపణలు -
క్రైం కార్నర్
జక్రాన్పల్లి: మండలంలోని మునిపల్లి గ్రామ శివారులోగల 63వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. జాతీయ రహదారిపై శనివారం వేకువజామున ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యక్తిని వాహనం ఢీకొట్టినట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, వయస్సు సుమారు 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. తెల్లని మాసిన షర్ట్, నల్లని ప్యాంట్ వేసుకున్నాడని తెలిపారు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు జక్రాన్పల్లి పోలీస్స్టేషన్లో లేదా సెల్నెంబర్ 8712659853, 8712359742ను సంప్రదించాలన్నారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగాపూర్ చెరువులో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమైనట్లు దేవునిపల్లి పోలీసులు శనివారంం తెలిపారు. చెరువులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మహిళ వయస్సు సుమారు 35–40 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా మృతురాలిని గుర్తిస్తే దేవునిపల్లి పోలీసులను సంప్రదించాలన్నారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. భీంగల్ మండలం చెంగాల్ గ్రామానికి చెందిన ముందెల రాజేశ్వర్(51)ఈనెల 24న ఆర్మూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం అడ్మిట్ అయ్యాడు. తన కుడి కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో వేలును తొలగించాలని వైద్యులు తెలిపారు. దీంతో అతడు భయపడి ఆస్పత్రి నుంచి ఈనెల 27న ఉదయం ఎవరికి చెప్పకుండ వెళ్లిపోయాడు. అనంతరం పెర్కిట్లోని విశ్వబ్రాహ్మణ సంఘ భవనం సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. నిజామాబాద్అర్బన్: నగరంలోని గాయత్రీనగర్లో వ్యభిచార గృహాలపై సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. ఇద్దరు విటులను, ఇద్దరు విటురాలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.5690 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని నాలుగోటౌన్ పోలీసులకు అప్పగించారు. నిజామాబాద్అర్బన్: నగరంలోని సారంగాపూర్లో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పట్టుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు, రూ.5300 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
బడ్జెట్ రూ.341.71 కోట్లు
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026ఙ– IIలో uసుభాష్నగర్: నిజామాబాద్ నగరపాలక సంస్థ (ఎన్ఎంసీ) 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.341.71 కోట్ల బడ్జెట్ కౌన్సిల్ ఆమో దం పొందింది. శనివారం నగర పాలక సంస్థ స మావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమా రాణి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశా రు. సమావేశానికి ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలె క్టర్ ఇలా త్రిపాఠి, ఎన్ఎంసీ కమిషనర్ దిలీప్కుమా ర్ హాజరయ్యారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్తోపాటు 2025–26 సవరించిన అంచనా బడ్జెట్ను సమావేశంలో ప్రవేశపెట్టగా, కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2026 ఏప్రిల్ 1 నాటికి ప్రారంభ నిల్వ రూ. 94.71 కోట్లు, 2026–27 సవరణ అంచనా ఆదా యం రూ.147.63 కోట్లు కలుపుకొని మొత్తం రూ. 231.88 కోట్లు బడ్జెట్లో పొందుపర్చారు. ఈ సంవత్సరపు ప్రణాళిక, ప్రణాళికేతర గ్రాంట్ల ద్వారా రూ. 99.37 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచ నా వేశారు. మొత్తం అంచనా వ్యయం రూ.341.71 కోట్ల బడ్జెట్ పద్దులో పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు పెద్దపీట వేస్తూ నిధులను సమర్థవంతంగా వినియోగించి నిజామాబాద్ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని నగర మేయర్ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఆస్తి పన్ను బకాయిల వసూళ్లకు అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకు సాగి లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా, జవాబుదారీగా వ్యవహరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. కార్పొరేటర్లు ప్రస్తావించే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేయాలన్నారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలపై చర్చించి, పరిష్కారం చూపేందుకు వీలుగా నెల రోజులలోపే మేయర్ అనుమతితో నగర పాలక సంస్థ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలన్నారు. కార్పొరేషన్కు ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు వీలుగా ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పారదర్శకంగా పరిష్కరిస్తూ అర్హత కలిగిన వారికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. సానిటేషన్ సిబ్బంది పనితీరును నిశితంగా పరిశీలించాలని కమిషనర్కు సూచించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది హాజరును ఫేషియల్ రికగ్నేషన్ విధానం ద్వారా అమలు చేయాలని ఆదేశించారు. కాగా అంతకుముందు మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ పంచరెడ్డి అనిత భర్త పంచరెడ్డి సురేశ్ అకాల మరణం పట్ల కౌన్సిల్ సంతాపం వ్యక్తం చేయాలని కార్పొరేటర్ న్యాలం సునీత ప్రతిపాదించగా, కౌన్సిల్ రెండు నిమిషాలు మౌనం పాటించింది. సమావేశంలో డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, బీజేపీ ఫ్లోర్లీడర్ వీరమాచినేని ప్రమోద్కుమార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.కార్పొరేటర్లుగా ఎన్నికై న తర్వాత మొదటి బడ్జెట్ సమావేశం కావడంతో పలువురు తమ తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి సానుకూలంగా స్పందించారు.నగర పాలక సంస్థలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం అని, దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. నగరంలో రెవెన్యూ పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రతి పార్టీ కార్పొరేటర్ ఇందుకు సహకరిస్తామన్నారు. ఇంకా రూ.100 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో పన్నుల్లో చాలా తేడా ఉందని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా నగరపాలక సంస్థ ఉద్యోగులకు, సిబ్బందికి కార్పొరేటర్లు అంటే విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యలపై సంప్రదిస్తే స్పందించడం లేదని సమావేశం దృష్టికి తెచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితమని, నిజామాబాద్ నగర అభివృద్ధే ధ్యేయంగా పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ పిలుపునిచ్చారు. నగరానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరగా, సానుకూలంగా స్పందించారని అన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో అన్ని డివిజన్లకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు ముసాయిదా మాస్టర్ ప్లాన్లో ఏవైనా సవరణలు చేయాల్సి ఉంటే కార్పొరేటర్లతో భేటీ నిర్వహించాలని సూచించారు. నగరంలో రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, స్ట్రీట్లైట్లు వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చాలన్నారు. ఎన్ఎంసీ కౌన్సిల్ ఆమోదం ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం : నగర మేయర్ ప్రతి డివిజన్కు సమ ప్రాధాన్యత ఇవ్వాలి : ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ జీతభత్యాల స్కాంపై వివరణ ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ డిమాండ్ -
పకడ్బందీగా పది పరీక్షలు
ఆర్మూర్/ఖలీల్వాడి : జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. కలెక్టర్ శనివారం జిల్లా కేంద్రంలోని బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్, ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, సీసీ కెమెరాల వ్యవస్థను పరిశీలించారు. బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్లో పలు లోపాలను గుర్తించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు ఆస్కారం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని డీఈవోను ఆదేశించారు. తక్షణమే స్కూల్ను సందర్శించి లోపాలను చక్కదిద్దాలని సూచించారు. విద్యార్థులు దగ్గర దగ్గరగా కూర్చుండి పరీక్షలు రాస్తున్నారని, మరో ఐదు అదనపు గదులను పరీక్షల నిర్వహణ కోసం వినియోగించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలన్నారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు సత్యకుమారి, ఎస్.వెంకట్రామ్ రెడ్డి ఉన్నారు. 46 మంది గైర్హాజరు పదో తరగతి వార్షిక పరీక్షలకు 46 మంది గైర్హాజరైనట్లు డీఈవో పార్శి అశోక్కుమార్ శనివారం తెలిపారు. శనివారం నిర్వహించిన గణితం పరీక్షకు 24,390 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. కలెక్టర్ రెండు, డీఈవో ఆరు, ఫ్లయింగ్ స్క్వాడ్ 37, ఏసీజీ ఈ ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్, ఆర్మూర్లో పరీక్ష కేంద్రాల తనిఖీ సీఎస్కు షోకాజ్ నోటీసులివ్వాలని డీఈవోకు ఆదేశం -
‘సీ్త్రనిధి’లో స్టేట్ ఫస్ట్
డొంకేశ్వర్(ఆర్మూర్):ఎస్హెచ్జీ మహిళలకు 2024 –25వ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి రుణాలిచ్చి వాటిని రికవరీ చేయడంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ని లిచింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో జరిగిన 13వ వార్షిక మహాసభలో మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ చేతుల మీదుగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సా యాగౌడ్ అవార్డును అందుకున్నారు. 2024–25 సంవత్సరంలో జిల్లాకు రూ.216 కోట్ల లక్ష్యం ఉండగా రూ.216 కోట్ల రుణాలను ఎస్హెచ్జీ సభ్యులకు అందజేశారు. అలాగే తిరిగి 94 శాతం రుణాలను రికవరీ చేశారు. వరుసగా గత పదేళ్లుగా నిజామాబాద్ జిల్లాకే రాష్ట్రంలో మొదటిస్థానం రావడం సంతోషంగా ఉందని డీఆర్డీవో సాయా గౌడ్ అన్నారు. రాష్ట్రంలో ఉత్తమ మండలం అవార్డు కూడా జిల్లాలోని కమ్మర్పల్లికే దక్కినట్లు వెల్లడించారు. డీఆర్డీవో వెంట సీ్త్రనిధి ఆర్ఎం రామ్దాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు హేమలత ఉన్నారు.● అవార్డు అందుకున్న డీఆర్డీవో సాయాగౌడ్ -
కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్
● మొదటి అడిషనల్ జిల్లా జడ్జి హరీష నిజామాబాద్ లీగల్: పట్టు విడుపు ధోరణితోనే కేసుల సత్వర ప రిష్కారానికి అవకాశం ఉందని, కక్షిదారులు లోక్ అదాలత్ను వి నియోగించుకొని కేసులు పరిష్కరించుకోవాలని నిజామాబాద్ ఫస్ట్ అడిషనల్ జడ్జి హరీష పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధికార సంస్థలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సాయిసుధ, మూడో అడిషనల్ జిల్లా జడ్జి డి దుర్గాప్రసాద్, అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్, డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మొదటి అడిషనల్ జిల్లా జడ్జి హరీష మాట్లాడుతూ కక్షిదారులు తమ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి మార్గమని, దీంతో సమయంతోపాటు ధనం ఆదా అవుతుందని అన్నారు. మూడో అడిషనల్ జిల్లా జడ్జి డి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవాలని సూచించారు. ఐదో స్థానంలో జిల్లా.. లోక్ అదాలత్లో జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 27,723 కేసులను పరిష్కరించారు. సివిల్ కేసులు 85, వెహికిల్ ప్రమాద కేసులు 71, సైబర్ క్రైమ్ కేసులు 76 ఉన్నాయి. యాక్సిడెంట్ కేసుల్లో రూ.6,33,52,500 పరిహారం అందజేశా రు. 77 సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.7, 79, 709 లను, 33 బ్యాంకు కేసుల్లో రూ.22 లక్షల 46 వేల 400లను రికవరీ చేశారు. -
శోభాయాత్రలో డీజేకు అనుమతి నిరాకరణ
● స్వయంగా వాహనాన్ని నడిపిన ఎమ్మెల్యే ధన్పాల్ సుభాష్నగర్: నగరంలోని హమాల్వాడి సంతోషి మాత (సాయిబాబా) ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని శోభాయాత్ర నిర్వహించారు. కానీ డీజేకు అనుమతి లేదని పోలీసులు డీజే వాహనాన్ని అడ్డుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ పోలీసులతో మాట్లాడారు. అయినా వారు వినకపోవడంతో స్వయంగా ఎమ్మెల్యేనే డీజే వాహనాన్ని నడిపారు. దగ్గరుండి శోభాయాత్రను ముందుకు నడిపించారు. -
కేంద్ర సహకారంతో రూ.10కోట్ల నిధులు తీసుకువస్తా..
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ రూరల్: ఖిల్లా రామాలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే లా చూస్తానని, రూ.10కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఖి ల్లా రామాలయంలో నిర్వ హించిన సీతారాముల కల్యాణంలో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి రాజకీయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకెళ్లాలన్నారు. రామాలయానికి రోప్వే తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేటర్లు కల్పే అర్చనా చిరంజీవి, బంటు ప్రీతి ప్రవీ ణ్, జ్యోతి మురళి, నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, కృష్ణ పాల్గొన్నారు. -
నేటి తరానికి ఆదర్శమూర్తి శ్రీరాముడు
● నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ● బోర్గాం(పి) చౌరస్తాలో ‘ధర్మ రక్ష సేనా’ శోభాయాత్ర ప్రారంభం మోపాల్(నిజామాబాద్రూరల్): ఆదర్శమూర్తి శ్రీరాముడిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. నగరశివారులోని బోర్గాం(పి)లో ధర్మ రక్షణ సేనా ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి–రమేష్ కార్యక్రమానికి హాజరై జెండా ఊపి, టెంకాయ కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరుచుకొని సన్మార్గంలో నడవాలని సూచించారు. కార్పొరేటర్లు వీరమాచినేని ప్రమోద్కుమార్, యాదాల నరేష్, నాయకులు ఈగ రమేష్రెడ్డి, రఘు, సుభాష్, కాంగ్రెస్ ఫిషర్మెన్ జిల్లా చైర్మన్ బోర్గాం శ్రీనివాస్, హన్మండ్లు, అనిల్రెడ్డి, అశోక్, లింగన్న, ధర్మరక్ష సేన నాయకులు సోమరాజు ఋషి, తదితరులు పాల్గొన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం డిచ్పల్లి: డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పా ల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాసర టెంపుల్ టూరిజంలో భాగంగా డిచ్పల్లి ఖిల్లా రామాలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మండలంలోని అమృతాపూర్ గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, తారాచంద్నాయక్, ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి చిన్న సాయిరెడ్డి, ఆలయకమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, సర్పంచ్ యాదగిరి, రాంచందర్గౌడ్, దర్మాగౌడ్, శ్యాంసన్, అంబర్సింగ్, బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
మోపాల్: మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై నాగభూషణం తెలిపారు. వివరాలు ఇలా.. సిర్పూర్ గ్రామానికి చెందిన పార్వతి లక్ష్మణ్ (68) రెండు నెలలుగా ఛాతి నొప్పి, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. భార్య లేనికారణంగా కొన్నిరోజులుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. అనారోగ్య కారణాలు, ఒంటరి జీవితంతో అతడు జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కొడుకు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఎల్లారెడ్డి: పట్టణంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన అన్నారం యాదగిరి(53) భార్య నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటినుంచి అతడు మద్యానికి బానిసయ్యాడు. గురువారం యాదగిరి మద్యం తాగి ఇంటికి వచ్చి, డబ్బులు కావాలని కుటుంబసభ్యులతో గొడవపడ్డాడు. దీంతో ఆయనను ఇద్దరు కుమారులు మందలించడంతో అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం ఎల్లారెడ్డి పెద్దచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పెద్దకుమారుడు మణికంఠచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. నిజామాబాద్ అర్బన్: నగర శివారులోని సారంగాపూర్ ప్రధాన రోడ్డులోగల పెట్రోల్ బంక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు 6వ టౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై వెంకట్రావు శుక్రవారం తెలిపారు. బంక్ వద్ద వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై ఘటన స్థలానికి వెళ్లి, విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పరిశీలించగా, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఓ బైక్ చోరీకి గురైనట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. సాయిప్రసాద్ అనే వ్యక్తి శుక్రవారం తన బైక్ను రైల్వే స్టేషన్ ఆవరణలో పార్కింగ్చేసి స్టేషన్లోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతడు తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించలేదన్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
ఖిల్లా రామాలయ అభివృద్ధికి కృషి
● టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ● వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని ఖిల్లా రామాలయం అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఖిల్లా రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేడుకల్లో మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు, నిజామాబాద్ మేయర్ ఉమారాణి, రమేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతంరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ.. రూ.1కోటితో ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం, రూ.50లక్షల నిధులతో ఆలయం వరకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. ఆలయం పరిధిలోని దాదాపు 65 ఎకరాల దేవుడి మాణ్యం భూమిని ఆలయానికి చెందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సుభాష్నగర్లో ఉన్న రామాలయంను ఆయన సతీసమేతంగా దర్శించుకొని, పూజలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, సరళ మహేంధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శోభ నవీన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టువస్త్రాలు అందజేసిన కవిత దంపతులు నిజామాబాద్ రూరల్: జిల్లాకేంద్రంలోని ఖిల్లా రామాలయం (రఘునాథ ఆలయం)లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత–దేవనపల్లి అనిల్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివార్లకు వారు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసి, పూజలు నిర్వహించారు. -
ప్రజల కోసమే కొత్త పార్టీ
● ఆవిర్భావ సభకు తరలిరండి ● అన్నివర్గాలకూ ఆహ్వానం ● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిజామాబాద్ అర్బన్: ప్రజల కోసం పనిచేసేందుకే కొత్త పార్టీ పెడుతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏప్రిల్ 25న జరిగే పార్టీ ఆవిర్భావ సభకు సబ్బండవర్ణాలు తరలిరావాలని ఆమె ఆహ్వానించారు. నగరంలోని జాగృతి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా సాధించుకోలేకపోవటం బాధాకరమన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఆ తర్వాత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా మౌలిక సదుపాయాల కోసం పోరాటం చేసే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అయ్యే వరకు ఒకలా, అయిన తర్వాత మరోలా ప్రవర్తించటం రాజకీయ ఒరవడిగా మారిందని విమర్శించారు. ఇచ్చిన మాట అమలు చేయకపోయినా సరే ప్రజలు పట్టించుకోరన్న ధైర్యం రాజకీయ నాయకుల్లో ఉందన్నారు. ఆ విధానం పోవాలంటే ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరముందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, కార్మికులు తదితర అన్నివర్గాల కోసం జాగృతి గత 20 సంవత్సరాలుగా పనిచేసిందని కవిత గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 350 మంది రైతులకు జాగృతి సంస్థ తరఫున నాలుగేళ్లపాటు నెలకు రూ. 2500 పెన్షన్ ఇచ్చామని వెల్లడించారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో నిజామాబాద్–పెద్దపల్లి రైల్వే లైన్ను మూడేళ్లలో పూర్తి చేయించానని పేర్కొన్నారు. నిజామాబాద్ వేదికగా పుట్టిన ఏ ఆలోచన అయినా సక్సెస్ అయ్యిందని, పార్టీ ఆలోచన కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోడలిగా తనకు ఇందూరు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. తెలంగాణ సోయి లేకపోవటంతోనే బీఆర్ఎస్ ఆదరణ కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరే వరకు పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో జాగృతి నాయకులు శ్రీనివాస్గౌడ్, ఎనుగందుల మురళి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నేడు మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశం
సుభాష్నగర్: నిజామాబాద్ నగర పాలక సంస్థ తొలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసినట్లు నగర మేయర్ కూరగాయల ఉమారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ 2026–27 సంవత్సరం ముసాయిదా అంచనా బడ్జెట్, 2025–26 సంవత్సరపు సవరణ బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి సభ్యులందరూ సకాలంలో హాజరుకావాలని ఆమె కోరారు. కాగా, మున్సిపల్ కార్పొరేషన్ తొలి సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు. కేశవ స్ఫూర్తి మందిర గృహ ప్రవేశం రెంజల్: కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాప కులు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ స్ఫూర్తి మందిరాన్ని శుక్రవారం లాంఛనగా ప్రారంభించారు. హెడ్గేవార్ పూర్వీకులు నివసించిన ప్రదేశంలో రూ. 30 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. పనులు తుది దశకు చేరుకున్నా యి. శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సంఘ్ అఖిల భారత వనవాసీ మార్గదర్శక్ సోమయాజులు ఈ స్ఫూర్తి మందిరంలో గృహప్రవేశం చేశారు. వచ్చేనెలలో ఆర్ఎస్ఎస్ చీఫ్ రాక వచ్చే నెల 11న ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ కందకుర్తికి రానున్నారని సంఘ్ ప్రతినిధులు తెలిపారు. హెడ్గేవార్ స్ఫూర్తి మందిర ప్రారంభోత్సవంలో ఆయన తోపాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. గృహ ప్రవేశ కార్యక్రమంలో కేశవ సేవా సమితి ప్రతినిధులు సుధాకర్రెడ్డి, మల్లికార్జున్, శ్రీధర్రెడ్డి, వాసు పాల్గొన్నారు. నిజాంసాగర్ నీరు విడుదల నిజాంసాగర్: యాసంగి పంటల సాగు అవసరాల కోసం శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో నీరందించారు. శుక్రవారం ఐదో విడత నీటి విడుదల ప్రారంభమైంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ‘ఉపాధి భద్రత కల్పించాలి’ కామారెడ్డి టౌన్ : వ్యవసాయ కూలీలకు ఉపాధి భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చొద్దని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ ఎన్నిక ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.కృష్ణ (నారాయణపేట్), ప్రధాన కార్యదర్శిగా పి.రామకృష్ణ (నిజామాబాద్), కోశాధికారిగా జి.కిషన్ (నిజామాబాద్), ఉపాధ్యక్షులుగా నాయిని రాజు(ఇల్లందు), ఎం వీరన్న (మహబూబాబాద్), కె.గంగాధర్(నిజామాబాద్), సహాయ కార్యదర్శులుగా ఎ.సలీం, బందెల వెంకయ్య, జాటోత్ కృష్ణ ఎన్నికయ్యారు. సమావేశంలో నాయకులు బి.కిశో ర్, రమేష్, ఎస్.కిశోర్, జి.ప్రభాకర్, కె.రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకు పరీక్ష
● అక్షరాస్యతలో జిల్లా వెనుకంజ ● జిల్లాలో 6.70 లక్షల మంది నిరక్షరాస్యులు ● 29న ఎన్ఐవోఎస్ ఎగ్జామ్ఖలీల్వాడి : నిరక్షరాస్యులుగా ఉన్న మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఉల్లాస్’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దానిని రాష్ట్ర ప్రభుత్వం ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం పేరిట చదువు రాని వారికి చదువు నేర్పించేందుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లోని మహిళా సంఘాల సభ్యులతో కాలనీలు, వార్డుల్లో నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరాలు నేర్పించారు. గతేడాది అక్టోబర్ 27న ప్రారంభమైన కార్యక్రమం 150 రోజులు కొనసాగింది. అయితే, ఉల్లాస్ కార్యక్రమంతో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కాగా, ఈ నెల 29న చదువుకున్న వారికి అధికారులు ఎస్ఐవోఎస్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఫలితాలు అంతంత మాత్రమే.. అక్షరాస్యతలో జిల్లా వెనుకబడే ఉన్నట్లు 2011 గణాంకాలు చెబుతున్నాయి. అక్షర్యాసతను పెంపొందించడానికి ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సత్ఫలితాలివ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ● జిల్లాలో 2,63,544మంది పురుషులు, 4,07,042 మంది మహిళలు రాయడం, అక్షరాలు గుర్తించని వారు ఉన్నారని వయోజన విద్య అధికారులు చెబుతున్నారు. జిల్లాలో నిరక్షరాస్యులు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. మహిళా సంఘాల సభ్యులు నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించారు. పరీక్షకు 29,943 మంది హాజరవుతారు. – పురుషోత్తం, డీడీ, వయోజన విద్యాశాఖ అక్షరాస్యత వివరాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా అధికారులు స్వచ్ఛందంగా చదువు చెప్పే మహిళా సంఘాల సభ్యులను గుర్తించారు. వారికి ఎలాంటి గౌవర వేతనం లేదు. దీంతో మహిళా సంఘాల సభ్యులు అంతగా స్పందించనట్లు తెలుస్తోంది. జిల్లాలో అక్షర వికాసం ద్వారా 59,049 మంది విద్యనభ్యసించారు. అయితే, వీరిలో 29,943 మంది ఎన్ఐవోఎస్ పరీక్ష రాయనున్నారు. నిర్ణీత తేదీన ప్రతి గ్రా మ పంచాయతీ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష నిర్వ హిస్తున్నట్లు వయోజన శాఖ అధికారులు తెలిపారు. మహిళలు తమకు అనుకూలంగా ఉన్న సమయంలో 3 గంటలపాటు పరీక్ష రాయాల్సి ఉంటుంది. అనంతరం వారికి సర్టిఫికెట్లను అందజేయనున్నారు. -
ధరలు పెరిగాయి
మెనూ తగ్గింది..సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కమర్షియల్ గ్యాస్ కొరత నేపథ్యంలో జిల్లాలోని హోటళ్లలో ఆహార పదార్థాల పరిమాణం తగ్గిస్తుండడంతో పాటు ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెంచేశారు. గ్యాస్ కొరతను సాకుగా చూపించి అదనపు చార్జీలు వసూలు చేయొద్దని, ధరలు పెంచొద్దని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సీసీపీఏ జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ ఇవేవీ తమకు సంబంధం లేదన్నట్లు హోటళ్ల వారు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుతుండడం గమనార్హం. ఆహార పదార్థాలకు సంబంధించి పలువురు హోటల్స్ నిర్వాహకులు ఐటమ్స్ తగ్గించారు. కొన్ని హోటల్స్లో దోశ లాంటి టిఫిన్స్ చేయడం లేదు. కాంబో ప్యాక్ టిఫిన్స్ ఇవ్వడం లేదు. సింగిల్ ఐటమ్స్ మీద సైతం ధరలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ధరలు పెరగడంతో వినియోగదారులు హోటల్స్కు రావడం తగ్గించారు. దీంతో నిజామాబాద్ నగరంలో 50 వరకు చిన్న హోటల్స్ మూతపడ్డాయి. ఇలా మూసేసిన హోటల్స్లో ఎక్కువగా సింగిల్ సిలిండర్లు ఉన్నవి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా కొందరు గ్యాస్ డీలర్లు పెద్ద పెద్ద హోటల్స్కు బ్లాక్లో లిసిండర్లు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా గురువారం నగరంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద 15 రోజుల క్రితం బుక్ చేసుకున్న గృహ వినియోగదారులు ఆందోళన చేశారు. తాము గ్యాస్ బుక్ చేసుకుంటే ఇవ్వకపోగా డెలివరీ అయినట్లు మాత్రం మెసేజ్ వచ్చిందని పలువురు గొడవ చేశారు. ఇది లా ఉండగా సరిహద్దు మహారాష్ట్ర నుంచి బ్లాక్లో గ్యాస్ తెచ్చుకుంటున్నవారు సైతం ఉన్నారు. గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్, ప్రభుత్వం పాఠశాలల్లో వంటకు గ్యాస్ సమస్య లేకుండా కలెక్టర్ ఇలా త్రిపాఠి తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో వాటిల్లో ఇబ్బందులు లేవు. అయితే ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన హాస్టల్స్లో గ్యాస్ కొరతతో కట్టెలతో వంట చేయిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో ఆయా పాఠశాలల్లో కట్టెల పొయ్యితో వంట చేసేందుకు వెనుకాడుతున్న వంట మాస్టర్లు గైర్హాజరు అవుతున్నారు. దీంతో హాస్టల్ విద్యార్థులకు ఐటమ్స్ తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వంట మనుషులు రాకపోవడంతో ఆయా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇదిలా ఉండగా పెట్రోలు, డీజిల్ విషయంలో ప్రజల్లో చాలావరకు అవగాహన వచ్చింది. ఫ్యూయల్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ధారణకు వచ్చిన జనం బంకుల వద్ద బారులు తీరడం మానేశారు. కొన్ని రకాల టిఫిన్స్ను తగ్గించిన హోటల్స్ నిర్వాహకులు గ్యాస్ కొరత ఉందంటూ రూ.10 నుంచి రూ.20 వరకు పెంపుదల సింగిల్ సిలిండర్లు ఉన్న చిన్న హోటల్స్ మూసివేత ప్రైవేటు పాఠశాలల హాస్టల్స్ నిర్వహణలో అవస్థలు గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ సమస్య లేకుండా కలెక్టర్ చర్యలు గృహ వినియోగ గ్యాస్ బ్లాక్లో అమ్ముకుంటున్న డీలర్లు ? ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్న వినియోగదారులు డొమెస్టిక్ సిలిండర్ సమస్యలుంటే చర్యలు తీసుకుంటాం : డీఎస్వో -
తైబజార్ వేలం రూ. 26.34 లక్షలు
బోధన్టౌన్(బోధన్): బోధన్ బల్దియా తైబజార్ను రూ. 26 లక్షల 34 వేలకు ఖలీం బేగ్ దక్కించుకున్నారు. బల్దియా కార్యాలయంలో 2026–2027 ఆర్థిక సంవత్సరానికి గురువారం తైబజార్ వేలం నిర్వహించారు. వేలం పాటలో 27 మంది పాల్గొనగా ఖలీంబేగ్ అందరి కంటే ఎక్కువ రూ. 26 లక్షల 34 వేలకు తైబజార్ను దక్కించుకున్నాడని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. గతంలో తైబజార్కు రూ. 23.45 లక్షలు వచ్చాయి. జంతు వధశాలకు రూ. 10.60 లక్షలు బల్దియా పరిధిలోని జంతు వధశాలకు నిర్వహించిన వేలంలో 13 మంది పా ల్గొనగా సయ్య ద్ షెహజాన్ ఖాద్రీ రూ. 10 లక్షల 60 వేలకు దక్కించుకున్నాడు. జంతు వధశాలకు గతంలో రూ. 4 లక్షల 52 వేల ఆదాయం వచ్చిందని కమిషనర్ తెలిపారు. వేలంలో మున్సిపల్ మేనేజర్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘పరిశోధనా ఫలాలు సామాన్యులకు అందాలి’
తెయూ(డిచ్పల్లి): పరిశోధనా ఫలాలు సామాన్యులకు అందినప్పుడే వాటికి సార్థకత లభిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ యరగర్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ఇన్నోవేషన్స్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ (ఐఎంసీ–2026)’ జాతీయ సదస్సు గురువారం ముగిసింది. సదస్సుకు ముఖ్యవక్తగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ సస్టెయినబుల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ సింథసిస్, బయో–యాక్టివ్ మాలిక్యూల్స్ అభివృద్ధిలో ఇమినో కీటోన్స్ ప్రాధాన్యత వహిస్తాయన్నారు. న్యూఢిల్లీ జేఎన్యూ ప్రొఫెసర్ డాక్టర్ రాజు చౌహాన్ సహజ ఉత్పత్తుల స్టీరియోసెలెక్టివ్ సింథసిస్ పద్ధతులు, ఫార్మాస్యూటికల్ రంగంలో వాటి ప్రాధాన్యతను వివరించారు. తెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదిగి నూతన ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కన్వీనర్ సాయిలు, కో–కన్వీనర్ నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు నాగరాజ్, బాలకిషన్, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బోధన్: హైదరాబాద్కు చెందిన వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి జాతీయస్థాయి పుర స్కారాలను జిల్లావాసులు అందుకున్నారు. సాలూర గ్రామానికి చెందిన రైతు కేజీ గంగారం పుడమిపుత్ర, పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ కరాటే మాస్టర్ మల్లెపూల పల్లవి ఝాన్సీ లక్ష్మిబాయి శౌర్యం, చిత్రకారణి అవంతి బాపుచిత్ర కళారత్న పురస్కారాలను గురువారం రవీంద్రభారతిలో నిర్వాహకులు అందజేశారు. నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అసోసియేషన్ అధ్యక్షుడిగా నీలకంఠరావు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి జరిగిన ఎన్నికల్లో ఆవుల నారాయణ మల్లయ్య, ఎన్.సుభాష్ రెడ్డి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు అమిడాల సుదర్శన్, మెట్టు నరేశ్ కుమార్ ప్రకటించారు. అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీగా మానస, ట్రెజరర్గా మధుసూదన్ గౌడ్, లైబ్రరి సెక్రెటరి పుణ్యరాజ్, స్పోర్ట్స్ అండ్ కల్చరర్ సెక్రెటరీగా గణేష్, లేడి రిప్రజెంటీవ్ ఝాన్సీరాణి, కార్యవర్గసభ్యులుగా దిలీప్, కవిత, రవిబాబు, సుధీర్, అనూష, అపూర్వ, జమీల్ అహ్మద్ జహీర్ అహ్మద్, ఎండీ ఖాలీద్, మహ్మద్ అబ్దుల్ జీషన్ ఎన్నికయ్యారు. -
మానవతాసదన్ పిల్లలకు ల్యాప్టాప్లు
డిచ్పల్లి: మండల కేంద్రంలోని మానవతా సదన్ పిల్లలకు అగుమెంట్ గోల్డ్ ఫర్ ఆల్ సహకారంతో పద్మపాణి సొసైటీ ఫర్ హ్యూమన్ ఎక్స్లెన్స్ స్వచ్ఛంద సంస్థ ల్యాప్టాప్లు, స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసింది. గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు, సదన్లో ఉంటూ చదువుతున్న 70 మంది బాలబాలికలకు స్కూల్ బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంస్థ ప్రతినిధులు సీఎస్ఆర్ నిధులను జిల్లాకు ఉపయోగించడం అభినందనీయమన్నారు. అనంతరం మానవతా సదన్ విద్యార్థులు తయారుచేసిన ఆర్ట్ ఫ్రేమ్ను కలెక్టర్కు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో అశోక్కుమార్, పద్మపాణి సంస్థ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అగుమెంట్ గోల్డ్ ఫర్ ఆల్ కంపెనీ జనరల్ మేనేజర్ సామ్యూల్ రాజ్, అసిస్టెంట్ మేనేజర్ కాశీనాథ్, మానవతా సదన్ లైజన్ ఆఫీసర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి: కమ్మర్పల్లి వ్య వసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వివిధ అ భివృద్ధి పనుల కోసం ప్ర భుత్వం రూ. 1.57 కోట్లు మంజూరు చేసినట్లు చైర్మన్ నర్సయ్య తెలిపారు. మా ర్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ నర్సయ్య అధ్యక్షతన గురువారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 2026–27 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను రూపొందించారు. మార్కెట్ యార్డులో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. నిధుల మంజూరు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నా గేశ్వర్ రావుకు, కృషి చేసిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. సూపర్వైజర్ రాజు మార్కెట్ కమిటీ మూడు నెలల ఆదాయ, వ్యయాలను చదివి వినిపించగా, సభ్యులు ఆమోదించారు. కార్యదర్శి మెర్సీ, వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, మార్కెట్ కమిటీ సభ్యులు మహిపాల్, లింగారెడ్డి, నవీద్, శ్రీనివాస్, జీవన్, ముత్తెన్న పాల్గొన్నారు. డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి తండాకు చెందిన బట్టు వినోద్, భార్య కవిత గురువారం ఉదయం గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై మహమ్మద్ ఆరీఫ్ తెలిపారు. బట్టు బలరాం కొడుకు వినోద్ నాలుగు సంవత్సరాల క్రితం అదే తండాకు చెందిన బదావత్ గేమ్య వద్ద ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేశాడు. ఈ ప్లాట్ విషయంలో కొంతకాలంగా గేమ్య కుటుంబంతో గొడవ జరుగుతోంది. వినోద్ ఈ ప్లాట్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బుధవారం రాత్రి బట్టు వినోద్కు సంబంధించిన ఆవు బదావత్ నాందేవ్ ప్లాట్లోకి వెళ్లింది. దీంతో నాందేవ్ అతని భార్య, ఇద్దరు కొడుకులు, కోడలు వెళ్లి వినోద్, కవితలతో గొడవ పెట్టు కున్నారు. తిరిగి గురువారం ఉదయం మళ్లీ గొడవ పెట్టుకోవడంతో మనస్థా పానికి గురైన వినోద్ అతని భార్య కవిత గుర్తు తెలియని మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన కుటుంబీకులు వెంటనే వారిని నిజా మాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, వారు తీసుకున్న మందు ఏమిటన్నదీ తెలియకపోవడంతో వైద్యులు సరైన చికిత్స అందించలేపోతున్నారని కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం దంపతుల పరిస్థి తి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వినోద్ తండ్రి బలరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పార్టీలో కష్టపడిన వారికే పదవులు
● నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సుభాష్నగర్: కాంగ్రెస్లో కష్టపడ్డ వారికి మాత్రమే పదవులు వస్తాయని నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నా రు. కమిటీలో అవకాశం రాని వారిని పార్టీ తప్ప కుండా గుర్తిస్తుందని తెలిపారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గసభ్యులుగా నియమితులైన సభ్యులకు రామకృష్ణ గురువారం నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమానికి నుడా చైర్మన్ కేశ వే ణు, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, జావి ద్ అక్రమ్ హాజరయ్యారు. అనంతరం బొబ్బిలి రా మకృష్ణ మాట్లాడుతూ పార్టీలో పదవులు పొందిన వారు కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎవరైనా పదవిని దుర్వినియోగం చేసినట్లయితే క్రమశిక్షణాచర్యలు తప్పవని అన్నా రు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అ ర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించి అధిష్టానానికి బహుమతి ఇవ్వాలని ఆకాంక్షించారు. కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులను పలు డివిజన్లకు ఇన్చార్జీలుగా నియమిస్తామని, ఎవరి డివిజన్లో వారే డివిజన్ అధ్యక్షులు, డివిజన్ కమిటీలను నియమించుకోవాలని సూచించారు. నూతనంగా నియమితులైన కార్యవర్గసభ్యులకు త్వరలోనే పీసీసీ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందని, శిక్షణకు ప్రతిఒక్కరూ హాజరుకావాలని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పదవి నుంచి తొలగిస్తామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగు లాభదాయకం
● ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ● పంటకు కోతులు, పశువుల బెడద ఉండదు ● కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్: ఆయిల్పామ్ సాగు ఎంతో లాభదాయకమని, రైతులను పంట సాగు దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతాంగం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయిల్పామ్కు కోతులు, పశువుల బెడద వంటివి ఉండవని, తక్కువ ఖర్చుతో సుదీర్ఘ కాలంపాటు సుమారు దిగుబడి పొందవచ్చని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెనన్స్ హాలులో గురువారం వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీని నిర్వహిస్తున్న ప్రీ–యునిక్ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో రైతులను ప్రోత్సహిస్తూ జిల్లాలో ఈ ఏడాది 7 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగయ్యేలా అంకితభావంతో పని చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయిల్పామ్ సాగు చేపట్టేలా విస్తృత స్థాయిలో అవ గాహన కల్పించాలని, క్షేత్రస్థాయి అధ్యయన యాత్రల ద్వారా వారి లో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మద్దతు ధర, సుదీర్ఘ కాలంపాటు ఏటేటా సమకూరే రాబడి, అంతర పంటల సాగుకు ఉన్న అవకాశాలు తదితర అంశాలను వివరించాలన్నారు. జిల్లాలో త్వరలోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందని, దీని కోసం అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 2022–23 సంవత్సరం నుంచి ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టగా, ఇప్పటివరకు 2375 మంది రైతులు 6164 ఎకరాల విస్తీర్ణంలో పంటను సాగు చేస్తున్నారని వివరించారు. సుమారు 1476 ఎకరాలలో ఆయిల్ పామ్ గెలలు కోతకు వచ్చాయని, తద్వారా రైతుల ఖాతాల్లో రూ.2.50 కోట్లు జమయ్యాయని తెలిపారు. అంకాపూర్ లో మార గంగారెడ్డి, కోటగిరి మండలం ఎత్తొండలో ఎం.రమాదేవి, అర్గుల్లో మధుసూధన్రెడ్డి, కొప్పర్గ గంగారాం తదితరలు ఇప్పటికే ఆయిల్ పామ్ సాగు ద్వారా లాభాలు పొందుతున్నారన్నారు. ఆయిల్ పామ్ సాగుకు సరిపడా మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఒక్కో మొక్క ధర 193 రూపాయలు కాగా.. రైతులు కేవలం రూ.20 లు చెల్లిస్తే, ప్రభుత్వం రూ.173 సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. అలాగే పంట సాగు కోసం నాలుగేళ్లపాటు ఎకరానికి రూ.4,200 చొప్పున ఆర్ధిక తోడ్పాటును, డ్రిప్ ఇరిగేషన్ కోసం ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, ఇతరులకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు జె.గోవిందు, వీరస్వామి, సహకార అధికారి శ్రీనివాస్ రావు, ప్రీ యునిక్ కంపెనీ ఏరియా మేనేజర్ సాయికిరణ్, ఉద్యానవన, వ్యవసాయ అధికారులు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు. -
ఐటీని విస్తరించాలి
సుభాష్నగర్: రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలని నిజామాబాద్ అర్బ న్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. ఐటీ, మున్సిపల్ అంశాలపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గత ప్రభు త్వ హయాంలో నిజామాబాద్లో నిర్మించిన ఐటీ హబ్ నిరాదరణకు గురవుతోందన్నారు. అలాగే నగరంలోని రామర్తి, బొందెం చెరువులతోపాటు పూలాంగ్ వాగు సగానికి పై గా కబ్జా అవుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రెండు చోట్ల ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేయాలని, ఫుట్పాత్ కబ్జాలపై దృష్టి సారించాలన్నారు. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే కబ్జాలను అరికట్టే అవకాశం ఉంటుందన్నారు. -
ఇరిగేషన్ పనులు పూర్తి చేయండి
వేల్పూర్/కమ్మర్పల్లి: బాల్కొండ నియోజకవర్గం పరిధిలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్కు సంబంధించిన ప్యాకేజీ 21, చిట్టాపూర్, ఫత్తేపూర్, సుర్బిర్యాల్ లిఫ్ట్ సమస్యలను సభలో లేవనెత్తారు. కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 21ఏ ద్వారా జిల్లాలో రెండు లక్షల ఎకరాకలకు నీరందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన లిఫ్ట్లు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 20 శాతం పూర్తికాగా, రెండున్నరేళ్లుగా పనులు నిలిచిపోయాయన్నారు. -
రేవంత్రెడ్డిపై అసత్య ఆరోపణలు సరికాదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్తూ సీఎం రేవంత్రెడ్డి పై, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్లో సుదీర్ఘ కాలం రాజకీయ జీవితం సాగించిన జీవన్రెడ్డి.. పార్టీని వీడి వెళ్తుండడంతో జాలితోపాటు బాధ కలుగుతోందన్నారు. తన అవసరాల కోసం పార్టీని వీడుతున్న ఆయన.. ఒకరిద్దరిపై అభాండాలు వేయాలని నిర్ణయించుకున్నారని విమర్శించారు. కేసీఆర్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఇందిరమ్మ ప్రజాపాలనకు తిరిగి నాంది పలికిన రేవంత్రెడ్డి మీద పసలేని ఆరోపణలు చేయడం అసంబద్ధమన్నారు. రేవంత్రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని జీవన్రెడ్డికి గత ఎన్నికల్లో లోక్సభ టిక్కెట్ ఇచ్చేలా ఏఐసీసీని ఒప్పించార ని తెలిపారు. పార్టీ కోసం కష్టపడుతున్న తాము సైతం ప్రస్తుతం జగిత్యాల నియోజకవర్గం మాదిరి సమస్యను ఎదుర్కొంటున్నామని, అయినప్పటికీ కలిసి ప్రయా ణం చేస్తూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నామనే విషయం అందరికీ తెలుసన్నారు. ఇవన్నీ తెలిసినప్పటికీ జీవన్రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా నిలబడి బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి మానాల మోహ న్రెడ్డి, ఈరవత్రి అనిల్ రావొద్దని చెప్పిన విషయం మరు వొద్దన్నారు. బహుశా ఆరోజు బతుకొచ్చినోళ్లకు ఇంట్లో పుట్టిన వాళ్లన్న విషయం గుర్తురాలేదా అని మానాల ప్ర శ్నించారు. ఆరోజు తమ ఇబ్బంది గుర్తించి ఉంటే తాము గర్వపడేవాళ్లమన్నారు. నాడు తాము ఎదుర్కొన్న సమస్య విషయంలో ఒకలా వ్యవహరించి, నేడు అదే సమస్య మీకు ఎదురయ్యేసరికి మరోలా మాట్లాడడం జీవన్రెడ్డి వయసుకు, విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు. టికెట్ ఇవ్వకున్నా వేం నరేందర్రెడ్డి కాంగ్రెస్ ఉన్నతి, అభివృద్ధి కోసం పని చేశారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్భూపాల్, జిల్లా ఫిషరీస్ చైర్మన్ బోర్గాం శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జగన్, సుమన్, సాయి, భాస్కర్ పాల్గొన్నారు. జీవన్రెడ్డి విజ్ఞతతో మాట్లాడాలి.. గౌరవాన్ని తగ్గించుకోవద్దు కేసీఆర్ రాక్షస పాలనపై నిరంతర పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ వేం నరేందర్రెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగానే రాజ్యసభ సభ్యత్వం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి -
అవసరానికి మించి..
అతి జాగ్రత్త్త.. అతి కొనుగోళ్లుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ గ్యాస్ పుష్కలంగా ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. కొరత వస్తుందనే వదంతుల నేపథ్యంలో అతిజాగ్రత్త పడుతున్న ప్రజలు.. ఇంధనం, గ్యాస్ ను అతిగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా జిల్లాలో కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో బంక్ల వద్ద, గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు భారీగా బారులు తీరుతున్నారు. పెట్రోల్, డీజిల్ విషయానికి వస్తే అత్యధికమంది అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ప్లాస్టిక్ టిన్నుల్లో నింపుకుంటున్నారు. దీంతో జిల్లాలో సాధారణానికి మించి విక్రయాలు జరుగుతున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల చెబుతున్నారు. కొందరు గ్యాస్ డీలర్లు మాత్రం ఇదే అదనుగా ఇష్టం వచ్చినట్లు రీఫిల్లింగ్ దందా చేస్తున్నారు. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు రెండువారాలు దాటినప్పటికీ డెలివరీ చేయకుండా బ్లాక్ మార్కెట్లో కమర్షియల్ వినియోగదారులకు రీ ఫిల్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అత్యవసరమైన గృహ వినియోగదారుల వద్ద నుంచి రూ.2,500 నుంచి రూ.3,500 వరకు వసూలు చేసిన డీలర్లు సైతం ఉండడం గమనార్హం.పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగదారు లు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు. అ పోహలు పెట్టుకుని అవసరానికి మించి ఫ్యూయల్ కొనుగోలు చేయొద్దు. ఇ లా చేయడంతో అత్యవసర వినియోగదారులకు సమస్యలు తప్పవు. ముందు జాగ్రత్త అనుకుంటూ భారీగా కొనుగోళ్లు చేసి నిల్వ చేసుకుంటే ఉపయోగం లేదు. అది ప్రమాదం కూడా. – నల్ల దినేష్రెడ్డి, తెలంగాణ పెట్రో డీలర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెట్రోల్, డీజిల్ కొరత వదంతులను నమ్మొద్దు. కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో నిరంతరం పరిస్థితిని సమీక్షి స్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 211 పెట్రో ల్ బంకుల్లో నిరంతరం పెట్రోల్, డీజిల్ అమ్మకాలు సాగుతున్నాయి. కృత్రిమ కొర త సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్రీకాంత్రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పెట్రోల్ కొరతపై సోషల్ మీడియాలో ప్రచారం, వదంతులను నమ్మొద్దు. పెట్రోల్, డీజిల్ కోసం గంటలపాటు వేచి చూడొద్దు. అదనంగా క్యాన్లు, బాటిళ్లులో నింపి నిల్వ చేసుకుంటే వేసవికాలంలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంచామని ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి. – కవిత రాజు, హెచ్పీ పెట్రోల్ బంక్ యజమాని రెండు, మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ కొరత అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఎక్కడికి వెళ్లినా బంకుల్లో పెట్రోల్, డీజిల్ దొరుకుతోంది. తప్పు డు ప్రచారాన్ని వాహనదారులు నమ్మొ ద్దు. ప్రతి రోజూ అవసరం మేరకు నా వాహనంలో పెట్రోల్ కొట్టిస్తున్నా. పెట్రోల్, డీజిల్పై వస్తున్న వదంతులను నమ్మొద్దు. ప్రమాదకరమైన ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేసుకోవద్దు. – బాలేరావు వేణుగోపాల్, వాహనదారుడు, నిజామాబాద్ అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు బంకుల వద్ద బారులు ఇదే అదనుగా కృత్రిమ కొరత అదనపు వసూళ్లకు తెరలేపిన కొందరు గ్యాస్ డీలర్లు -
ఓటరు జాబితా సవరణపై శిక్షణ
డిచ్పల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)– 2026 పై బూత్ లెవెల్ అధికారులకు బుధవారం డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ శిక్షణనిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బీఎల్వోలు నిర్వర్తించవలసిన విధులు, ఎన్యుమరేషన్ ఫారం నింపాల్సిన విధానం, క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారంతో ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో ఆదేశించారు. తహసీల్దార్ సతీష్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ లు సంతోష్, భూపతిప్రభు, పర్యవేక్షకులు, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్పై బీఎల్వోలకు శిక్షణ మోపాల్: మండలకేంద్రంలోని రైతు వేదికలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై బీఎల్ఓలు, సూపర్వైజర్లు, జీపీవోలకు బుధవారం తహసీల్దార్ ఎన్ రేఖ, ట్రైనీ ఆఫీసర్ ప్రవీణ్రెడ్డి శిక్షణనిచ్చారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా బీఎల్ఓలు పని చేయాలని, ఇందుకోసం రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల సహకారం తీసుకోవాలని తహసీల్దార్ రేఖ సూచించారు.ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. -
సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
సిరికొండ : మండలంలోని కొండాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి రూ.20 లక్షల నిధులను మంజూరు చేశారని తెలిపారు. నిధులను మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు, డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల బుచ్చన్న, శ్రీధర్, ఆకుల జగన్, చంద్రగౌడ్, ఫారుక్, సాల్మన్, ఇసాక్, నరేష్, రవీందర్ గౌడ్, బాల గంగారం తదితరులు పాల్గొన్నారు. మోపాల్: మండలంలోని బాడ్సిలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎస్ఐ జాడె సుస్మిత మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, మైనర్లు వాహనాలు నడపవద్దని తెలిపారు. వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ పరమేశ్వర్, ఉపాధ్యాయులు వెంకట నారాయణ, రాజేందర్రెడ్డి, చంద్రకళ, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి: ప్రజాపాలనలో కార్యక్రమంలో భాగంగా ఇందల్వాయికి చెందిన అగ్నిమాపక సిబ్బంది మండల కేంద్రంలోని నిహారిక చిల్డ్రన్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సును బుధవారం కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వాటిని ఆర్పే విధానాన్ని హాస్పిటల్ సిబ్బందికి వివరించారు. అగ్నిమాపక సిబ్బంది, హాస్పిటల్ యజమాన్యం నరేందర్ చందర్, వైద్యురాలు నిహారిక తదితరులు పాల్గొన్నారు. సిరికొండ : గ్రామపంచాయతీ అనుమతి లేకుండా గ్రామంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని సర్పంచ్ మల్లెల సాయిచరణ్ తాపీ మేసీ్త్రలకు సూచించారు. సిరికొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో తాపీ మేసీ్త్రలతో సర్పంచ్ సమావేశం బుధవారం నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ నూతన ఇళ్లు, ప్రహరీ గోడలు గ్రామపంచాయతీ అనుమతి ఉంటేనే నిర్మించాలని తెలిపారు. మెట్లు రోడ్లపైకి డ్రెయినేజీలపైకి వచ్చేలా నిర్మించకూడదని తెలిపారు. అనుమతి లేకుండా నిర్మించిన వాటిని కూల్చివేస్తామని సూచించారు. సమావేశంలో ఉప సర్పంచ్ గ్యామా శోభన్, పంచాయతీ కార్యదర్శి వినీల్, వార్డు సభ్యులు శంకర్, తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
● విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ● ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని హామీడిచ్పల్లి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని, దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని సుద్దులం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ విశ్వరూప అభయ వీరాంజనేయ, శ్రీ ధ్యానఆంజనేయ స్వామి విజయ గణపతి విగ్రహ ప్రతిష్ఠాన మహోత్సవ వేడుకల్లో బుధవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. హనుమద్దీక్షా పీఠాధిపతులు పూజ్య దుర్గాప్రసాద్ స్వామి పర్యవేక్షణలో వేదపండితులు నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్తులు ఐక్యంగా ఉండి ఆలయం నిర్మాణం, విగ్రహావిష్కరణ చేపట్టడం అభినందనీయమన్నారు. ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, రూరల్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు గొట్టిపాటి వాసుబాబు, సర్పంచ్ తేనేటి హేమలత లక్ష్మణ్రెడ్డి, పార్టీ నాయకులు రాంచందర్గౌడ్, శ్యాంసన్, ధర్మాగౌడ్, మాజీ ఎంపీపీ నర్సయ్య, నర్సారెడ్డి, సురేందర్రెడ్డి, అంబర్సింగ్, గంగారెడ్డి, బాలరాజు, వెంకటేశ్, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం జిల్లాలో ప్రసిద్ది చెందిన డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో శుక్రవారం జరిగే శ్రీరామనవమి వేడుకలకు హాజరు కావాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మాజీ సర్పంచ్ బూస సుదర్శన్, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వాసుబాబు తదితరులున్నారు. గడ్డి చుట్టే యంత్రం ప్రారంభం ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించిన ఎండుగడ్డి చుట్టే యంత్రం (బేలర్) ను బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రారంభించారు. డిచ్పల్లి మండలం కొరట్పల్లి గ్రామ రైతు పార్వతి గంగాధర్ ఈ గడ్డి చుట్టే యంత్రాన్ని కొనుగోలు చేశారు. బుధవారం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆ యంత్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ కార్యదర్శి డాక్టర్ జహూర్, నాయకులు శ్రీనివాస్, బాలగంగాధర్, మోహన్, శంకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు ధర్పల్లి : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి వచ్చిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ధర్పల్లికి కేటాయించినందుకు ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని ధర్పల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించి కృతజ్ఞతలను తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్, సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మహేందర్ , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
‘ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ’ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డికి సన్మానం
సుభాష్నగర్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ) గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కవితారెడ్డిని మాజీ కార్పొరేటర్ ఎం.డీ సాబేర్ అలీ ఆధ్వర్యంలో ఫులాంగ్ కాలనీవాసులు బుధవారం సన్మానించారు. భవిష్యత్లో రాజకీయంగా మరిన్ని పదవులు అలంకరించాలని సాబేర్ అలీ ఆకాంక్షించారు. జిల్లాలో సీనియర్ వైద్యురాలైన కవితారెడ్డికి ఈ అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఎం.డీ అహ్మద్, నాయకులు హకీల్ అహ్మద్, టి శ్రీనివాస్, గురు దత్త, అంబం మురళీ, మసూద్, ఇజాజ్, అసద్ హందాన్, జావిద్, రషీద్, అన్వర్ బేగ్, ఫారూఖ్, తదితరులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి : మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈవో శ్రీనివాస్ను గ్రామ ప్రజా ప్రతినిధులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ పద్మ నాగరాజ్, ఉప సర్పంచ్ తెడ్డు మైపాల్, పాఠశాల చైర్మన్ గంగ జమునమనోహర్, మండల పీఆర్టీయూ అధ్యక్షులు గోపి, ప్రధాన కార్యదర్శి రవీణ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్, కార్యదర్శి చిక్కాల భూమేశ్వర్లు ఎంఈవో శ్రీనివాస్కు పూల మాలలు వేసి శాలువా కప్పి సత్కరించారు. -
పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
నిజామాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం నగరంలోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కే. రామ్మోహన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి ఒకటికి ముందు తర్వాత పదవీ విరమణ పొందిన వారిని విభజిస్తూ వర్గీకరణ చేయడం ద్వారా 7 వ వేతన సవరణ సంఘం ప్రయోజనాలను పరిమితం చేయాలనే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెన్షనర్ల సంఘ నాయకులు ప్రతాప్ రెడ్డి, హుస్సేన్, బాల దుర్గయ్య, గంగాధర్, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు లావు వీరయ్య, చంద్రశేఖర్, డి లక్ష్మీనారాయణ, పుష్పవల్లి,మస్తాన్ వలి, తదితరులు పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని బుధవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పండరినాథ్ ఆధ్వర్యంలో పెన్షనర్ల భవనం ముందు విశ్రాంత ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్కు వెళ్లి ఏవో ప్రశాంత్కు వినతిపత్రం అందజేశారు. అధ్యక్షులు పండరినాథ్ మాట్లాడారు. జిల్లా కార్యదర్శి గంగా కిషన్, ఫైనాన్స్ కార్యదర్శి రవీందర్ రెడ్డి, స్వామిదాస్, గౌరవ అధ్యక్షులు భుజాగౌడ్, అడ్వైజర్ సాయిలు, తాలూకా అధ్యక్ష కార్యదర్శులు జగత్రెడ్డి, దయాకర్ రావు, ఫైనాన్స్ కార్యదర్శి గంగాధర్, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
హిందూ సమ్మేళనం ఆహ్వానపత్రిక ఆవిష్కరణ
సుభాష్నగర్: నగరంలోని శ్రీనివాస్నగర్ కాలనీలో హనుమాన్ మందిరంలో ఏప్రిల్ 14న నిర్వహించే హిందూ సమ్మేళనం ఆహ్వాన పత్రికను ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ అర్గుల సత్యం బుధవారం రాత్రి ఆవిష్కరించారు. ఈసందర్భంగా అర్గుల సత్యం మాట్లాడుతూ హైందవ చైతన్యమే భారత సంక్షేమమని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సమ్మేళనం నిర్వహణ కమిటీ అధ్యక్షుడు పొల్కం శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి కొల్లూరు అశోక్కుమార్, ప్రతినిధులు రాజశేఖర్రెడ్డి, బిల్లా నవీన్, నల్లా అశోక్, ప్రవీణ్రెడ్డి, హనుమంత్రెడ్డి, గణేష్, విఠల్సుమన్, తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక శిబిరాలు
రుద్రూర్: మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో సమత అన్నారు. పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవా రం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జనరల్ హస్సిటల్కు చెందిన స్పెషలిస్ట్ వైద్యులు శిభిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందు లు పంపిణీ చేశారు. ఈ శిబిరాన్ని సమత సంద ర్శించారు.జిల్లా వైద్య నిపుణులు వినూత్న, శ్రీని వాస్, పూనమ్, గౌతమి, మౌనిక, క్రాంతి, పీహెచ్సీ వైద్యుడు అలీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
భగవద్గీత చాలా గొప్పది
● ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ కాపర్తి గురుచరణం ● భగవద్గీత ఆన్లైన్ పరీక్ష విజేతలకు బహుమతుల అందజేత నిజామాబాద్ రూరల్: భగవద్గీత చాలా గొప్పదని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ కాపర్తి గురుచరణం అన్నారు. బుధవారం రాత్రి కేసీఆర్ కాలనీలోని ప్రైవేట్ గార్డెన్లో అంతర్జాతీయ ఇస్కాన్ కృష్ణ చైతన్యసమితి ఆధ్వర్యంలో ఇందూరు కంఠేశ్వర్ ప్రతినిధులు డిసెంబర్ నెలలో భగవద్గీతపై నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచం మొత్తం అశాంతి దిశగా యుద్ధాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణుడు భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యమని కంఠేశ్వర్ ఇస్కాన్ ప్రతినిధి రామానందరాయ్ ప్రభూజీ అన్నారు. ఆన్లైన్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి మొత్తం 12వేల మంది వివిధ పాఠశాలల నుంచి పాల్గొన్నారని అన్నారు. విజేతలు శివామ్ష, స్నేహిత్, ప్రవీణ్, అక్షయ్కు బహుమతులు అందజేశారు. అంతకు ముందు యువతీయువకులు కృష్ణుని పాటలపై నిర్వహించిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో వేణుగోపాల్, మదాసు స్వామియాదవ్, కంఠేశ్వర్ ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎన్నికల అధికారుల నియామకం
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల సహకార సొసైటీకి 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను నూతన డైరెక్టర్స్, కార్యవర్గం ఎన్నికకుగాను ఎన్నికల అధికారులుగా మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, పులి జైపాల్ లను నియమించారు. సొసైటీ అధ్యక్షుడు కే. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ గౌడ్ వీరికి నియామాక పత్రాలను అందజేశారు. ఎన్నికల నిర్వహణ విధివిధానాలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారని వారు తెలిపారు. సొసైటీలో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉన్నారని అందులో నలుగురి పదవికాలం ఏప్రిల్ నెలతో ముగుస్తున్నందున వాటికి ఎన్నికలు నిర్వహిస్తారు. -
ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన
ధర్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు రెడ్ రిబ్బన్ క్లబ్, ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఎయిడ్స్ నిర్మూలన అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, పోస్టర్ ప్రదర్శన పోటీలను నిర్వహించారు. మొదటి, రెండవ స్థానంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీరామ్, అధ్యాపకులు ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, రవిరాజ్, కుమారస్వామి, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షిప్తం
బీఎస్పీ నిజామాబాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా నీరడి లక్ష్మణ్ నిజామాబాద్ రూరల్: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పార్లమెంట్ ఇన్చార్జిగా డాక్టర్ నీరడి లక్ష్మణ్ను నియమించారు. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల మేరకు ముఖ్య సెక్టార్ ప్రభారి అతార్ సింగ్ రావు , మరొక ముఖ్య సెక్టార్ ప్రభారి సురేష్ ఆర్య ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్, కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ల సూచనల మేరకు నిజామాబాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా డాక్టర్ నీరడి లక్ష్మణ్ బుధవారం నియమించారు. పార్టీ ఆశయాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు పనిచేస్తానని లక్ష్మణ్ పేర్కొన్నారు. అంత్యక్రియలకు ఆర్థిక సహాయం నిజామాబాద్ రూరల్: నగరంలోని కోటగల్లి ప్రాంతానికి చెందిన అర్జన్ ఈనెల 16న రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.శ్రీలక్ష్మీచేయూత సే వా సమితి వారు విరాళాలు సేకరించి రూ.12,000 నగదు, రూ.3,000 కిరాణ సామగ్రిని కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు బంగారి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు లక్ష్మన్, శ్రీనివాస్, యాదగిరి, రవీందర్లు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత సిరికొండ : మండలంలోని గడుకోలుకి చెందిన నిమ్మ రాజుల చిన్న ఎడ్డన్నకు సీఎంఆర్ఎఫ్ చెక్కును బీజెపీ ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతకుంట రామస్వామి బుధవారం అందజేశారు.అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సహకారంతో లక్షా ఇరవై అయిదు వేల చెక్కు మంజూరైందని ఆయన తెలిపారు. దివ్యాంగుల క్షేమం కోసం పడిపూజ రెంజల్(బోధన్): దివ్యాంగుల క్షేమం కోరుతు స్నేహ సొసైటీ వ్యవస్థాపకుడు సిద్దయ్య పడిపూజ, హనుమాన్ స్వాములకు నీలా క్యాంపులో బుధవారం మండల భిక్షను ఏర్పాటు చేశారు. స్వాముల ఆశీర్వాదంతో శారీరక, మానసిక దివ్యాంగులు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఐదేళ్లుగా ఆయన హనుమాన్ స్వాములకు మండల బిక్షను ఏర్పాటు చేస్తున్నారు. పలువురు గురుస్వాములు ఆశీర్వదించారు. -
భద్రాచలానికి గోటి తలంబ్రాలు
నిజామాబాద్ రూరల్: భద్రాచల రాములవారి కల్యాణానికి నగరంలోని కోటగల్లి హనుమాన్ దేవాలయం నుంచి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం నిజామాబాద్, వివిధ గ్రామాల నుంచి భక్తులు పంపించిన గోటి తలంబ్రాలను రామకోటి రామరాజుకు అందాయి. రామరాజు మాట్లాడు తూ.. భద్రాచలం వెళ్లలేక పోయిన భక్తులు తాము ఒలిచిన తలంబ్రాలు రామయ్య కల్యాణనికి చేరవేయడం సంతోషంగా ఉందని అన్నారు. -
సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి
నవీపేట: ఆధునిక కంప్యూటర్ యుగంలో సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి సూచించారు. నవీపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను తెలుసుకున్నారు. కళాశాల వెనుక ప్రాంతంలో రూ.కోట్ల వ్యయంతో నిర్మించినప్పటికీ వృథాగా ఉన్న హాస్టల్ భవనాన్ని సందర్శించి, వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు. అనంతరం సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. నవీపేటలోని కళాశాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, వచ్చే ఏడాది అదనంగా రొబొటిక్స్, కంప్యూటర్ సైన్స్లను అందిస్తామని పేర్కొన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు మంజూరైన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేస్తామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు నిఘా ఏర్పాటు చేయాలని, కల్తీ చేసే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సూచించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు. నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు కల్తీ పదార్థాల తయారీపై నిఘా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి కలెక్టర్తో కలిసి నవీపేట పాలిటెక్నిక్ కళాశాల తనిఖీ -
పరుగులు పెట్టిస్తున్న ప్రచారం
నిజామాబాద్అర్బన్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత వస్తుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగడంతో వినియోగదారులు బంకులు, గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి నుంచి వాహనదారులు పెట్రోల్ బంకుల్లో బారులు తీరారు. వాహనాల ట్యాంకులు ఫుల్ చేయించుకోవడంతోపాటు క్యాన్లు, బాటిళ్లలు నింపుకున్నారు. కొరత లేదని అధికారులు ఎంత చెబుతున్నా బుధవారం రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. చాలా పెట్రోల్ బంకుల్లో మధ్యాహ్నం రెండు గంటలకే స్టాక్ అయిపోయింది. సోషల్ మీడియాలో వదంతుల కారణంగా వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం నుంచే గ్యాస్ ఏజెన్సీల ఎదుట వినియోగదారులు బారులు తీరారు. కొరత లేదంటున్న అధికారులు సోషల్ మీడియాలో వదంతుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతలేదని, సరఫరా కూడా సక్రమంగానే ఉందని అధికారులు అంటున్నారు. వదంతులను నమ్మొద్దని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. బంకుల వద్ద పరిమితికి మించి కొనుగోలు చేయడం మంచిది కాదని సూచించారు. వదంతులు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోల్, గ్యాస్ కొరత అంటూ వదంతులు మంగళవారం రాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో బారులు గంటల్లో పెట్రోల్ స్టాక్ ఖాళీ గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీసిన వినియోగదారులు అనవసరంగా కొనుగోలు చేశారు బుధవారం ఉదయం నుంచే చాలామంది వాహనదారు లు వచ్చారు. కొరత ఉందంటూ అధికంగా పెట్రోలు కొ నుగోలు చేశారు. కొందరు బాటిళ్లలో తీసుకెళ్లారు. రో జూలాగే అందుబాటులో ఉందని, కొరత లేదని ఎంత చెప్పినా వినలేదు. మధ్యాహ్నం వరకే బంక్ ఖాళీ అయ్యింది. – భూమయ్య, పెట్రోల్ బంక్ సిబ్బంది -
సమాజ క్షేమమే ఔషధ పరమావధి
● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తెయూ(డిచ్పల్లి): ఔషధాల తయారీ సమాజ క్షేమమే పరమావధిగా కొనసాగాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు పేర్కొన్నారు. తెయూ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘ఇన్నోవేషన్స్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సును వీసీ యాదగిరిరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔషధ తయారీలో రసాయన శాస్త్ర ప్రాముఖ్యత ఎంతో గొప్పదన్నారు. యువ శాస్త్రవేత్తలు నిబద్ధతతో తమ లక్ష్యాలను సాధించి భారత్ ఇప్పటికే సాధించిన ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. సదస్సులో ముఖ్యవక్తగా హాజరైన అరబిందో ఫార్మసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సురేశ్ మాట్లాడుతూ.. యువ శాస్త్రవేత్తలు జనరిక్ మెడిసిన్ పై లోతైన పరిశోధనలు చేసి వాటిని పేద ప్రజలకు మరింత దగ్గర చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ లింగయ్య నాగారపు, డాక్టర్ శంకరయ్య, కన్వీనర్ సాయిలు, కో కన్వీనర్ డీ నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీస్ ఏ నాగరాజు, బాలకిషన్, అధ్యాపకులు గంగా కిషన్, రాజేశ్వరి, డేనియల్, సురేశ్, నాగేశ్వరరావు, నాగేంద్రబాబు, సునీత, శర్మ, శ్రీకాంత్, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
తెయూ(డిచ్పల్లి): సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం యాదగిరి సూచించారు. పత్రికా స మాచార కార్యాలయం(పీబీఐ) హైదరాబాద్ ఆధ్వర్యంలో తెయూలో బుధవారం ‘సైబర్ హైజీన్ ప్రాక్టీ సెస్’ పై నిర్వహించిన వర్క్షాప్నకు రిజిస్ట్రార్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు, మీడియా ప్రతినిధుల్లో సురక్షిత డిజిటల్ వినియోగంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల డిజిటల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలు సైబర్ నేరాల నివారణలో ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయని తెలిపారు. పీఐబీ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ.. ఈ వర్క్షాప్ విద్యార్థులు, మీడియాను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన తొలి హైబ్రిడ్ కార్యక్రమమన్నారు. సైబర్ హైజీన్ అంటే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, నెట్వర్క్లను బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో ఉపయోగించడమని వివరించారు. నిజామాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నిత్యం జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో గతేడాది సుమారు రూ.1,600 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 2024లో రూ.16 లక్షలు, 2025 లో రూ.19 లక్షలు మోసం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాంబాబు, అధ్యాపకులు ఎన్ స్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ జీ కోటేశ్వరరావు, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శివచరణ్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చరా..
ఆర్మూర్: రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు, నిరసనలు ఉధృతం చేస్తున్నారు. 18 ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపడుతూ, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. నిరసనలో భాగంగా గురువారం చలో అసెంబ్లీ కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా తమ కష్టాలు తీరుతాయని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొని పదేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో వేచి చూసిన సమగ్ర శిక్ష ఉద్యోగులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దపు మాటలతో మోసం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 19,350 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు 2023 సెప్టెంబర్లో సమ్మెకు కూర్చోగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో హన్మకొండలోని దీక్షా శిబిరాన్ని సందర్శించిన రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తానని హా మీ ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చినా సమస్యల పరిష్కారానికి పూనుకోకపోవడంతో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఏడాది క్రితం రోడ్డెక్కి నెల రోజుల పాటు సమ్మె బాట పట్టారు. తమ విధులను బహిష్కరించి సమ్మె చేస్తుంటే వారితో సీఎం రేవంత్రెడ్డి చర్చించకపోగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సాధ్యపడదంటూ మాట మార్చారు. మరో వైపు సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతుగా వారి వెంటే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు గుప్పించిన ఉపాధ్యాయ సంఘాలు నాటి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి మొఖం చాటేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయలేని పరిస్థితి ఉంటే పదేళ్ల నుంచి సుప్రీం కోర్టు పలుమార్లు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినా ఎందుకు కాతరు చేయడం లేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభించే వరకు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తమకు పే స్కేల్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, హిమాచల్ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేశారు. ఈ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసి మమ్మల్ని సైతం విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలి. – రాజు, జిల్లా అధ్యక్షుడు, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం కేజీబీవీ బోధనేతర,బోధన సిబ్బంది 599 మంది,యూఆర్ఎస్, బోధనేతర సిబ్బంది 10, డీపీవో సిబ్బంది 9, ఎంఐఎస్ సమన్వయకర్తలు 22, సీసీవోలు 29, సీఆర్పీలు 94, ఐఈఆర్పీలు 35, మెసెంజర్లు 19, పీటీఐలు 88, సీజీవీలు 19 మొత్తం 924 మంది ఉన్నారు. కేజీబీవీ బోధనేతర, బోధన సిబ్బంది 480 మంది, యూఆర్ఎస్, బోధనేతర సిబ్బంది 10, డీపీవో సిబ్బంది 7, ఎంఐఎస్ సమన్వయకర్తలు 22, సీసీవోలు 22, సీఆర్పీలు 76, ఐఈఆర్పీలు 26, మెసెంజర్లు 18, పీటీఐలు 71, సీజీవీలు 18, మొత్తం 750 మంది ఉన్నారు. సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్ మాట ఇచ్చి పదేళ్లు పట్టించుకోని కేసీఆర్.. అధికారం రాగానే మాట మార్చిన సీఎం రేవంత్రెడ్డి నేడు చలో అసెంబ్లీకి శ్రీకారం చుట్టిన ఉద్యోగులు -
శనగ రైతుల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తాం
● పూర్తిస్థాయి కొనుగోళ్ల కోసం రెండు రోజుల్లో అనుమతి వచ్చే అవకాశం ● మార్క్ఫెడ్ డీఎం మహేశ్కుమార్ బోధన్: శనగ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్కుమార్ అన్నారు. ‘శనగ రైతులకు సెగ’ శీర్షికన ఈనెల 25వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. సాలూర, కల్దుర్కిలోని కొనుగోలు కేంద్రాలతోపాటు బోధన్ సొసైటీ పరిధిలోని మావందికుర్దూలోని కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ డీఎం బుధవారం సందర్శించారు. కొనుగోళ్ల తీరును పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయని ఆరా తీశారు. ఎకరాకు 7 క్వింటాళ్ల వరకే శనగలు కొనుగోలు చేయాలనే నిబంధన కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, సేకరణ పరిమితిని 10 క్వింటాళ్లకు పెంచాలని రైతులు కోరగా, సమస్యను వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని డీఎం అన్నారు. జిల్లాలో లక్షా 40వేల క్వింటాళ్ల శనగ దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ నివేదించిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తొలుత 24 వేల 850 క్వింటాళ్ల శనగల కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మిగిలిన శనగ నిల్వలను కొనుగోలు కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించామని, మరో రెండు రోజుల్లో అనుమతి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. డీఎం వెంట బోధన్ సొసైటీ సీఈవో ఉమాకాంత్, ఉద్యోగులు, ఆయా గ్రామాల రైతులు ఉన్నారు. -
తీరు మార్చుకోకపోతే సస్పెన్షన్లకు వెనుకాడబోం
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● ఎస్ఐఆర్పై శిక్షణకు గైర్హాజరైన బీఎల్వోలపై ఆగ్రహం నిజామాబాద్ అర్బన్: తీరు మార్చుకోకపోతే మూకుమ్మడి సస్పెన్షన్లకు సైతం వెనుకాడేది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి బీఎల్వోలకు హెచ్చరించారు. ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై నిర్వహించిన శిక్షణకు గైర్హాజరు కావడంపై మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో బుధవారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అయితే, పలువురు బీఎల్వోలు శిక్షణకు హాజరుకాకపోవడాన్ని గమనించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తరహా నిర్లక్ష్యం కారణంగానే ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందన్నారు. బీఎల్వోలు శిక్షణకు గైర్హాజరైతే మీరేం చేస్తున్నారంటూ సూపర్వైజర్లపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం బీఎల్వోలు నిర్వర్తించాల్సిన విధులు, ఎస్ఐఆర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన ధ్రువీకరణ పత్రాలు తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లు జ్ఞానేశ్వర్, సంతోష్ కుమార్ అవగాహన కల్పించారు. నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్ర సాగర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సౌత్, నార్త్ తహసీల్దార్లు శ్రీధర్, విజయ్కాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష జరిపారు. మండలాల వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు, ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలలో వెనుకంజలో ఉన్న ఆయా మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల తర్వాత మళ్లీ తాను సమీక్ష చేస్తానని, తప్పనిసరిగా పురోగతి కనిపించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, హౌసింగ్ ఇంచార్జి పీడీ గంగాధర్, ఈఈ నివర్తి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు పాల్గొన్నారు. -
రామాలయంలో ప్రత్యేక పూజలు
నిజామాబాద్ రూరల్: నగరంలోని సుభాష్నగర్లో ఉన్న రామాలయ బ్రహ్మోత్సవాలు రెండో రోజు బుధవారం ఉదయం 7 గంటలకు నిత్యారాధన, యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, వాస్తు, సోమ, సుదర్శన, కుంభస్థాపన, అగ్నిప్రతిష్ట, వాస్తు హోమం, గరుడ ప్రతిష్ట, ధ్వజారోహణం, బలిహరణం, అరగింపు, తీర్థ గోష్టి కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ చైర్పర్సన్ సరళామహేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శోభ నవీన్రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. మాచారెడ్డిలో.. మాచారెడ్డి: మండలంలోని పోలంపల్లి శాంతానంద తపోవన ఆశ్రమంలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం విశ్వశాంతి మహా యజ్ఞాన్ని నిర్వహించారు. లోక కళ్యాణార్థం విశేషాలు నిర్వహించినట్లు నిర్వాహకుడు స్వామి తెలిపారు. ఆలయ ధర్మకర్త రాజమౌళి గుప్తా దంపతులు, గ్రామస్తులు ఉన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు బుధవారం ముగిసినట్లు అకడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 29 మందికి 27 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ● సీపీ సాయిచైతన్య నిజామాబాద్ అర్బన్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ నాన్ బెయిలెబుల్ వారెంట్లను తగ్గించినట్లు సీపీ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గత కొన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఎన్బీడబ్ల్యూ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిపై ఉన్న ఎన్బీడబ్ల్యూకు సంబంధించి 3 కేసుల్లో లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో పరారీలో ఉన్న 9 మందిని, ఇతర జిల్లాల్లోని నలుగురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల్లో మొత్తం 105 కేసులను పరిష్కరించామని, పాత 55 కేసుల్లో ఎన్బీడబ్ల్యూ వారెంట్లను క్లియర్ చేసినట్లు పేర్కొన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు వర్ని: మండల కేంద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జలాల్పూర్ గ్రామానికి చెందిన గుండ్ల నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. వీక్లీ మార్కెట్ నుంచి తన టీవీఎస్ ఎక్సెల్ పై వస్తున్న నారాయణకు వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 సిబ్బంది బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. మూల మలుపుల వద్ద పండ్ల దుకాణాలు, మిర్చి బండ్లు ఉండడం వల్ల వాహనాలు కనబడక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పటిక, బెల్లం పట్టివేతధర్పల్లి: మండలంలోని దుబ్బా క గ్రామంలో టాస్క్ఫోర్స్ అధికారులు కిరాణా దుకాణాల్లో మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. అధికారుల దాడుల్లో వినాయక కిరాణా దుకాణంలో 90 కిలోల బెల్లం, 70 కిలోల పటికను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణ యజమాని గోసికొండ ప్రశాంత్పై కేసు నమోదు చేసి తహసీల్దార్ శాంత ఎదుట బైండోవర్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ విశాల్ బుధవారం తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా గుడుంబాను తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటుబాంబు కలకలం! ● అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో గేదెకు తీవ్ర గాయాలు ● వేటగాళ్ల పనే అంటున్న గ్రామస్తులు సదాశివనగర్: అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో నాటు బాంబు కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తు లు వన్యప్రాణులను పట్టుకోవడం కోసం తవుడులో నాటు బాంబును పెట్టారు. మేత మేసుకుంటూ వెళ్లిన అడ్లూర్ ఎల్లారెడ్డిలోని కుమ్మరి శ్రీనివాస్కు చెందిన గేదె.. ఆ తవుడును తినగా నాటు బాంబు పేలి తీవ్రంగా గాయపడింది. బాధితుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు. -
నిజామాబాద్
అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం నేటి నుంచి పసుపు క్రయవిక్రయాలు బంద్ గ్రామంలో ఐస్ క్రీమ్ విక్రయాలను నిషేధించాలని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐస్క్రీమ్ బండ్లను గ్రామంలోకి రానీయకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ మేరకు పంచాయతీ పాలకవర్గ మద్దతుతో సర్పంచ్ పోగుల అనిత ప్రత్యేకంగా వాల్పోస్టర్లను తయారు చేయించి గ్రామ ఎంట్రన్స్, ఊరిలో ఏర్పాటు చేయించారు. తమ గ్రామంలో ఐస్ క్రీమ్లు, కుల్ఫీల అమ్మకం నిషేధమని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.5వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. – ఇందల్వాయి గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026‘ఒక్క ఇల్లూ ఇవ్వలేదు..’ సుభాష్నగర్: తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలలో నిజామాబాద్ నగరంలో పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఇందిరమ్మ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మాట్లాడారు. నాగారం ప్రాంతంలో 396 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి నాలుగున్నరేళ్లు గడిచిందని గుర్తు చేశారు. ఆ ఇళ్లు వృథాగా ఉంటుండటంతో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయని తెలిపారు. అనేకసార్లు మంత్రులకు విన్నవించగా మరమ్మతుల కోసం రూ.1.25 కోట్లు విడుదల చేసినప్పటికీ ఇళ్లు మాత్రం కేటాయించలేదన్నారు. కలెక్టరేట్ సమీపంలో 200 డబుల్ ఇళ్ల పనులు 80 శాతం అయ్యాయని, మరో రూ.2 కోట్లు మంజూరు చేస్తే పూర్తవుతాయన్నారు. పశువులకు టీకాలు వేయించాలి నిజామాబాద్ అర్బన్: పశువులకు తప్పకుండా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వే యించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించా రు. వేసవిలో ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం లక్ష్యంగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కా ర్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను కలెక్టర్ బుధవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. పాడి రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి టీ కా లు వేసేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ వా హనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గాలి కుంటు వ్యాధితో పశువుల్లో పాల దిగుబడి తగ్గడం, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని, టీకాలు వేయించడం ద్వా రా పశువుల ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చన్నా రు. గ్రామాలకు వచ్చే పశువైద్య బృందాలకు పశుపోషకులు సహకరించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి సుభాష్నగర్: మార్కెట్యార్డులో గొడవ లు, వివాదాలు లేకుండా వ్యాపారం చేయా లని, ప్రతిఒక్కరూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీస్ కమిషనర్ సా యిచైతన్య కోరారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్యార్డు శ్రద్ధానంద్ గంజ్లో పసుపు రైతులు, వ్యాపారులతో సీపీ బుధవారం స మావేశమయ్యారు. గంజ్లో రైతులకు కల్పి స్తున్న సదుపాయాల వివరాలను అడిగి తె లుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజ్లో తప్పుడు తూకా లు, మధ్యవర్తుల మోసాలు జరగకుండా జా గ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మార్కెట్ యార్డ్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు సహకరించాలని కోరారు. సెక్యూరిటీ సిబ్బంది అన్ని గేట్ల వద్ద 24గంటల పాటు నిఘా పటిష్ట పర్చాలని, సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేయాలని, అనుమతి లేని వారిని లోనికి రానివ్వొద్దన్నారు. అనుమానాస్పద ఘటన సమయంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆయ న వెంట మూడో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై హరిబాబు, పసుపు రైతులు ఉన్నారు. ప్రమాదాల నివారణలో కన్వెక్స్ మిర్రర్ల పాత్ర కీలకం సుభాష్నగర్: రోడ్డు ప్రమాదాల నివారణలో కన్వెక్స్ మిర్రర్ల పాత్ర కీలకమని డీటీవో ఉ మా మహేశ్వర్ పేర్కొన్నారు. ఆర్టీసీ డిపో–1లోని బస్సులను ఆయన బుధవా రం పరిశీలించారు. బస్సుల్లో అమర్చిన కన్వెక్స్ మిర్రర్ల పనితీరును పర్యవేక్షించారు. అనంతరం డీటీవో మాట్లాడుతూ డ్రైవర్లకు బస్సు వెనక, పక్క దృశ్యాలను కన్వెక్స్ మి ర్రర్లు అందిస్తాయని అన్నారు. బస్సుల సాంకేతిక స్థితి, బ్రేక్ వ్యవస్థ, డ్రైవర్ క్యాబిన్, అత్యవసర భద్రతా పరికరాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డిపో–1 మే నేజర్ ఆనంద్ మాట్లాడుతూ డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించేలా చర్యలు చేపడుతామన్నారు. మరో నాలుగునియోజకవర్గాలు!సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో అంతటా అదే చర్చ సాగుతోంది. లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలను 50 శాతం మేరకు పెంచనున్నట్లు సంకేతాలు వస్తుండడంతో రాష్ట్రంలో శాసనసభ స్థానాలు 119 నుంచి 182కు, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 9 అసెంబ్లీ సీట్లు 13కు పెరగనున్నట్లు అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో జనాభా 15,71,022, కామారెడ్డి జిల్లాలో 9,72,625 ఉంది. ఇక గత ఎన్నికల(2023) లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 20,06,494 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 9,58,718 మంది, మహిళా ఓటర్లు 10,47,674 మంది, ఇతరులు 102 మంది ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం. దీంతో మహిళా కోటా శాసనసభ స్థానాలు సైతం ఉమ్మడి జిల్లా నుంచి గణనీయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పలువురు నాయకులతోపాటు మహిళా నాయకురాలు సైతం చట్టసభలో ప్రాతినిధ్యంకోసం లెక్కలు వేసుకుంటున్నారు. జనగణన, కులగణన తరువాత వెంటనే నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం చేస్తుండడంతో అన్నివర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినప్పటికీ, తాజాగా నిర్వహించే జనాభా లెక్కలు, కులగణన మేరకు చూస్తే నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 5 శాసనసభ సీట్లు 8కి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో ఒక శాసనసభ సీటు పెరిగే అవకాశం ఉంది. జనాభా ఎక్కువగా ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రం, చుట్టుపక్కల ప్రాంతాలను బట్టి నిజామాబాద్ అర్బన్ పరిధిలో నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. శాసనసభ నియోజకవర్గాలన్నీ ఒకే జిల్లా పరిధిలో ఉండనున్న నేపథ్యంలో ప్రస్తుతం బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న నిజామాబాద్ జిల్లాలోని వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్, కోటగిరి, పొతంగల్ మండలాలను సైతం నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో సర్దుబాటు చేయనున్నారు. దీంతో ఈ మండలాలు బోధన్ నియోజకవర్గం పరిధిలోకి కలుపనున్నారు. ఈ నేపథ్యంలో బోధన్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఎడపల్లి, నవీపేట, రెంజల్ మండలాలను మరో నియోజకవర్గంలో కలిపే అవకాశాలున్నాయి. అలాగే కొత్తగా భీమ్గల్, నందిపేట, నిజామాబాద్ రూరల్ స్థానంలో డిచ్పల్లి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక కామారెడ్డి జిల్లాలో దోమకొండ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ● నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ నార్త్, ఎడపల్లి మండలాలు, విలీన గ్రామాలు ● నిజామాబాద్ సౌత్: నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ రూరల్, మోపాల్, మోస్రా ● డిచ్పల్లి: డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఇందల్వాయి ● భీమ్గల్: భీమ్గల్, సిరికొండ, ధర్పల్లి, వేల్పూర్ ● బాల్కొండ: బాల్కొండ, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి ● ఆర్మూర్: ఆర్మూర్, ఆలూర్, డొంకేశ్వర్ ● నందిపేట: నందిపేట, నవీపేట, రెంజల్, మాక్లూర్ ● బోధన్: బోధన్, సాలూర, వర్ని, చందూర్, రుద్రూర్, పొతంగల్, కోటగిరి ● బాన్సువాడ: బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, మహ్మద్నగర్, నిజాంసాగర్ ● జుక్కల్: జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పెద్దకొడప్గల్, పిట్లం, డోంగ్లి ● ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, గాంధారి ● కామారెడ్డి: కామారెడ్డి, సదాశివనగర్, రాజంపేట ● దోమకొండ: దోమకొండ, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి డిచ్పల్లి: సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ పెడితే ప్రతిపక్షాలు సాకులు చెబుతూ వాకౌట్ చేయడం విడ్డూరంగా ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ అన్నివర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తుందని, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని అన్నారు. డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో తెల్ల రేషన్కార్డులు ఉన్న వారందరికీ రూ.5 లక్షల బీమా అమలు చేయడం చారిత్రకంగా నిలిచిపోతుందన్నారు. ధర్పల్లి మండలంలో 6 ఎకరాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధిని బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వాసుబాబు, సర్పంచ్ తేనేటి హేమలతలక్ష్మణ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.డొంకేశ్వర్(ఆర్మూర్): యుద్ధ పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని ఓ వైపు వాహనదారులు ఆందోళన చెందుతూ పెట్రోల్ బంక్లకు పరుగులు తీస్తుండగా.. ఎలక్ట్రిక్ వాహనదారులు మాత్రం ఏ చింతా లేకుండా రయ్రయ్మని దూసుకెళ్తున్నారు. పెట్రోల్ ధరలు పెరిగినా, కొరత ఏర్పడినా తమకు ఎలాంటి టెన్షన్ లేదంటున్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 కిలో మీటర్లు తిరుగు తామని, డబ్బులు కూడా ఆదా అవుతున్నాయని ఆనందంగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో, పట్టణంలో ఎలక్ట్రిక్ స్కూటీల సంఖ్య పెరుగుతోంది. ధరలు కూడా రూ.40 వేల నుంచి అందుబాటులో ఉండడంతో ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, విద్యార్థులు కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు ఆఫర్లు, వారంటీలు ఇస్తున్నాయి. ఇంధన ధరలు, కొరతకు చార్జింగ్తో నడిచే వాహనాలు మంచి ప్రత్యామ్నాయంగా మారాయని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లాలో ఓటర్లు (2023)మహిళా కోటాలో 33 శాతం సీట్లు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 182కి పెరిగితే 60 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జి ల్లా నుంచి శాసనసభలో మహిళల ప్రాతినిథ్యం గణనీయంగానే ఉండే అవకాశాలున్నాయి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సుభాష్నగర్: శ్రీరామనవమి సందర్భంగా మర్చంట్ అసోసియేషన్ వారి విజ్ఞప్తి మేరకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం నుంచి మూడు రోజులపాటు పసుపు క్రయవిక్రయాలు నిలిపేస్తున్నామని సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ అపర్ణ బుధవారం తెలిపారు. 26వ తేదీన తూకాలు మాత్రమే జరుగుతాయని, పసుపు బీట్ చేపట్టబోమన్నారు. 26 నుంచి 28వరకు జనరల్ బీట్లు మాత్రమే నిర్వహిస్తామని, రైతులు గమనించి మార్కెట్ కమిటీకి సహకరించాలని ఆమె కోరారు. ఎలక్ట్రిక్ బండిపై హాయిహాయిగా పెట్రోల్ ధరలు, కొరత కష్టాలకు చెక్ ఉమ్మడి జిల్లాలో 9 నుంచి 13కు పెరగనున్న శాసనసభ స్థానాలు నిజామాబాద్ జిల్లాలో 5 నుంచి 8కి.. కామారెడ్డి జిల్లాలో 4 నుంచి 5కు.. ఉమ్మడి జిల్లాలో పెరగనున్న మహిళల కోటా 2011 జనాభా లెక్కల ప్రకారం నిజామాబాద్లో 15,71,022.. కామారెడ్డిలో 9,72,625 మంది జనాభా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికం పునర్విభజనపై అన్నివర్గాల్లో జోరుగా చర్చనియోజకవర్గాల పునర్విభజన చేపడితే శాసనసభా స్థానాల స్వరూపం ఈవిధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వివిధ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి..సామాన్యులకు ఇదే బెస్ట్.. చార్జింగ్ వాహనాలు సామా న్య ప్రజలకు ఊరట కలిగిస్తున్నాయి. పెట్రోల్ వాహనాల్లో ఎక్కువ ధర కలిగిన ఇంధనాన్ని నింపుకొని ప్ర యాణించడం ఆర్థికంగా ఇ బ్బందే. తక్కువ ధరలో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటీలను కొనుగోలు చేసి చార్జింగ్ పెట్టుకుని అతి తక్కు వ ఖర్చుతో దూర ప్రయాణం సైతం చేయొచ్చు. పెట్రోల్ ధరలు పెరిగినా, కొరత ఏర్పడిన ఇలాంటి సమయాల్లో ఈవీ వాహనాలు చాలా బెటర్. – భీమ్నాయక్, నికాల్పూర్, డొంకేశ్వర్ మండలం -
జెడ్పీ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
సుభాష్నగర్: రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కమిటీ సభ్యులందరం కలిసికట్టుగా పనిచేసి జెడ్పీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని డీసీసీ అధ్యక్షుడు కాట్పల్లి నగేశ్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బుధవారం నగరంలోని కాంగ్రెస్భవన్లో ఇటీవల నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు ఆయన నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ జిల్లా కమిటీలో అన్ని వర్గాల నాయకులకు జాతీయ, రాష్ట్ర నాయకత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. ప్రతిపక్ష పార్టీల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు కమిటీ సిద్ధంగా ఉందన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని, ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్స్విప్ సాధించడం పక్కా అని, సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సూచనల మేరకే జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించామని, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత ఉత్సాహంతో ముందుకెళ్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం భక్తవత్సలం, కౌడపు శరత్, గొల్ల ఎర్రన్న, ప్రవీణ్కుమార్ గౌడ్, జయ లలిత, పైస ఎల్లయ్య, పవన్కుమార్, ముస్కు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమిటీలో అన్నివర్గాలకూ ప్రాధాన్యత పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతాం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాట్పల్లి నగేశ్రెడ్డి -
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
ఖలీల్వాడి: జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయా ల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆర్థి క సంవత్సరంలో గ్రంథాలయాల అభివృద్ధి కి రూ. 6.44 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి రూ.4కోట్లు, నందిపేట్, సిరికొండ లైబ్రరీలకు సొంత భవనాల నిర్మాణానికి రూ.44 లక్షల నుంచి రూ.45 లక్షల తో ఆమోదించినట్లు తెలిపారు. సాలూరలో శాఖా గ్రంథాల యం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతా మన్నారు. డిచ్పల్లి, వెల్మల్లలో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టేందుకు ఆమోదించినట్లు చె ప్పారు. నూతన పుస్తకాల కొనుగోలు కోసం రూ.8 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి సుభాష్నగర్: ప్రభుత్వం ప్రవేశపెట్టి న ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించా లని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఆయన పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినప్ర భుత్వం.. బడ్జెట్లో భారీగా నిధులను తగ్గించిందన్నారు. బడ్జెట్లో నిధుల కేటాయింపును తగ్గించారని, ఇప్పటి వరకు విడుదల చేసింది రూ.300 కోట్లు మాత్రమేనన్నారు. ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న వే లాది మంది ఆటో డ్రైవర్లను ఆదుకుంటామ ని ప్రకటించిన ప్రభుత్వం.. ఈ బడ్జెట్లో వారికి మొండి చేయి చూపించిందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలన్నారు. ఎస్సీ సంక్షేమానికి గత సంవత్సరంలో రూ.40 వేల కోట్లు నిధు లు కేటాయించ గా ఈసారి రూ.11 వేలకు పరిమితం చేయ డం దారుణమన్నారు. ప్రస్తుత బడ్జెట్ నిరా శ కలిగించిందని తక్షణమే సవరణ చేయా లని ధన్పాల్ అసెంబ్లీలో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి నిజామాబాద్ అర్బన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రోడ్డు భద్రత కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. రోడ్డు ఆ క్రమణలను తొలగించాలన్నారు. అటవీ ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా రిఫ్లె క్టర్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయా ల ని సూచించారు. అదనపు డీసీపీ బస్వారె డ్డి, రవాణ శాఖాధికారి ఉమా మహేశ్వర రా వు, ఆర్టీసీ డీఎం ఆనంద్, ఏసీపీలు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 20 మందికి తీవ్ర గాయాలు
● రుద్రూర్లో ఘటన ● ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీపీ సాయిచైతన్య ● బోధన్, నిజామాబాద్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు వైద్య చికిత్స రుద్రూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న లారీ రుద్రూర్ : మండల కేంద్రంలోని జవహర్నగర్ కా లనీ వద్ద మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 20 మందికి తీవ్రగా యాలయ్యాయి. బస్సు, లారీ డ్రైవర్లు, 18 మంది ప్రయాణికులు ఉన్నారు. మరి కొందరికి స్వల్ప గా యాలయ్యాయి. బస్సులో మొత్తం 31 మంది ప్ర యాణికులు ఉన్నారు. బోధన్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న డస్ట్ లోడ్ లారీని ఢీకొట్టింది. రెండు వాహనాల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై సాయన్న ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్లలో బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన లారీ కుర్నాపల్లి క్రషర్ నుంచి స్టోన్ డస్ట్ను పోతంగల్ మండలం పీఎస్ఆర్ నగర్లో ఇంటిగ్రెటేడ్ స్కూల్ నిర్మాణానికి తీసుకెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటన స్థలాన్ని పోలీసు కమిషనర్ పి సాయి చైతన్య పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు, రుద్రూర్ ఎస్సై సాయన్న, ఆర్టీసీ డీఎం, పోలీస్, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రులకు సీపీ పరామర్శ బోధన్టౌన్/నిజామాబాద్అర్బన్: బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడి బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీపీ సాయి చైతన్య పరా మర్శించారు. మెరుగైన వైద్య సేవ లు అందించాలని వైద్యులకు సూ చించారు. ప్రమాదంలో ఓ చిన్నారి, మరో ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళల ముఖాలకు గాయాలు కాగా దంతాలు దెబ్బతిన్నాయి. లారీ డ్రైవర్ కాలికి గాయం కాగా అంబులెన్స్లోనే చికిత్స అందించా రు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బాలాగౌడ్తోపాటు మరో నలుగురికి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి మెరుగ్గానే ఉందని ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. దెబ్బతిన్న ఆర్టీసీ బస్పు శనగ రైతులకు సెగ బోధన్రూరల్: జిల్లాలో శనగ దిగుబడికి, కొను గోళ్లకు పొంతన లేకపోవడంతో రైతులు ఆందోళ న చెందుతున్నారు. దీనికితోడు శనగలను విక్ర యించేందుకు తీసుకొచ్చే రైతులకు పట్టాపాస్ పుస్తకంతోపాటు బయోమెట్రిక్ తప్పనిసరి అంటుండడంతో కౌలు రైతులు కొనుగోలు కేంద్రాల కు వెళ్లలేని స్థితి నెలకొంది. ఎన్నో ఆశలతో శనగ సాగు చేసిన రైతులను కష్టాలు వెంటాడుతున్నా యి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కాగా, అక్కడ అమలవుతున్న నిబంధనలను రైతులను అయోమయానికి గురిచేస్తు న్నాయి. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా, రైతుల నుంచి ఎకరాకు 7 క్వింటాళ్ల కొనుగోలుకు మాత్రమే అనుమతించారు. యాసంగి సీజన్లో జిల్లాలో 14వేల ఎకరాలకుపైగా భూమిలో రైతులు శనగ సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 9 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్ర భుత్వం రెండు, మూడు రోజుల క్రితం మార్కె ఫెడ్ ఆధ్వర్యంలో బోధన్, కల్దుర్కి, నీలా, హున్సా, సాలూర, పొతంగల్, జాకోరా సొసైటీ ల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఒక్కో రైతు నుంచి ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్ర మే కొనుగోలు చేస్తున్నారు. మిగిలిని శనగలను తాము ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. బయోమెట్రిక్ కారణంగా కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సేకరించేది కొంతే..! సాగు, దిగుబడి అంచనా ప్రకారం రైతుల నుంచి ఎకరాకు 10 క్వింటాళ్ల శనగలను కొనుగోలు చేయాలని నాఫెడ్కు వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. నాఫెడ్, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మార్కెఫెడ్ సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభించింది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం లక్ష క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అయితే 25 వేల క్వింటాళ్ల సేకరణకు అనుమతి వచ్చిందని మార్కెఫెడ్ అధికారులు చెబుతున్నారు. మిగతా పంట దిగుబడి ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా యాంత్రంగం, ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవాలని, పూర్తి పంట దిగుబడిని కొనుగోలు చేయాలని శనగ రైతులు కోరుతున్నారు. బోధన్ మండలం కల్దుర్కిలో శనగలను కాంటా చేస్తున్న కొనుగోలు కేంద్రం నిర్వాహకులుపూర్తిస్థాయి కొనుగోలుకు చర్యలు కొనుగోలు కేంద్రాల్లో రక్షేత స్థాయిలో తలెత్తున్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి. రైతుల సమస్యలను ప్రభుత్వం, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం జిల్లాలో 25 వేల క్వింటాళ్ల శనగ సేకరణకు అనుమతులు వచ్చాయి. లక్ష క్వింటాలు సేకరణకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదనలు అందించాం. అనుమతులు రాగానే రైతులకు ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో శనగలు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – మహేశ్కుమార్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ జిల్లాలో లక్ష క్వింటాళ్లకు పైగానే పంట దిగుబడి 25వేల క్వింటాళ్ల సేకరణకే అనుమతి బయోమెట్రిక్ కారణంగా కౌలు రైతులకు ఇబ్బందులు వెంటాడుతున్న కష్టాలు -
వన్యప్రాణుల దాహార్తికి నీటి వసతులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందు కు గాను ప్రభుత్వం రూ.1.6 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత వేసవి నేపథ్యంలో వన్యప్రాణులకు నీటి సౌకర్యం కల్పించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిధులు కేటాయించింది. జిల్లా అటవీ శాఖకు మొదటి విడత గా రూ.1.6 కోట్లు ఇచ్చింది. ఏప్రిల్ నెలలో ఈ నిధులను వినియోగించనున్నారు. వచ్చే మే, జూన్ నెలలకు సంబంధించి మరో విడత లోని ధులను ఇవ్వనున్నారు. ఈ నిధులతో జిల్లాలో ని అడవుల్లో సహజ నీటి వనరులు ఎండిపోయిన చోట కృత్రిమ నీటి సౌకర్యం కల్పించనున్నారు. జిల్లాలో ఆర్మూర్, కమ్మర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, నిజామాబాద్ నార్త్, నిజామాబా ద్ సౌత్, వర్ని అటవీ రేంజ్లు ఉన్నాయి. అన్ని రేంజ్లలో కలిపి 86,871.45 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. సాధారణంగా చలికాలం, వర్షాకాలంలో అడవుల్లో నీటి వనరు లు పుష్కలంగా ఉంటాయి. వేసవి కాలంలోనే నీటి ఎద్దడి నెలకొంటుంది. దీంతో వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతుంటాయి. ఈ క్రమంలో నీటి కో సం జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడుతుంటా యి. ఇలాంటి పరిస్థితిని నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అడవుల్లో ప్రతి 9 చదరపు కిలోమీట ర్లకు ఒకటి చొప్పున 180 చోట్ల సిమెంటుతో సాసర్ పిట్లను అటవీ శాఖ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అట వీ సిబ్బంది ఆయా సాసర్ పిట్లను శుభ్రం చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. ఇందుకోసం వాచర్లను నియమించారు. ఒక్కో సాసర్ పిట్లో సుమారు 700 నుంచి 2,500 లీటర్ల వరకు నీరు నిల్వ ఉంటుంది. నీటి కుంటలు, చెలిమలు, పర్క్యులేషన్ ట్యాంకుల్లోనూ నీటి ని పట్టి ఉంచుతారు. వర్షాలు కురిసే వరకు వారానికి ఒకసారి నీటిని నింపాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ● సహజ నీటి వనరులు, విద్యుత్ సౌకర్యం లేని అటవీ ప్రాంతాల్లో సోలార్ శక్తితో పని చేసే బో రు బావులు ఏర్పాటు చేసి నిరంతరం నీటి కుంటలు నిండేలా అటవీ శాఖ చూస్తోంది. అలాగే నీటి కుంటల వద్ద జంతువుల కదలికలను గమ నించేందుకు అటవీ అధికారులు ట్రాప్ కెమెరా లు అమర్చారు. వీటి ద్వారా చిరుతలు, ఎలుగు బంట్లు, జింకలు, ఇతర వన్యప్రాణులు నీరు తాగుతు న్న దృశ్యాలను అధికారులు రికార్డు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నీటి నిల్వల గురించి తనిఖీ చేస్తున్నారు.అన్ని చర్యలు చేపడుతున్నాం వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కో సం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకు న్నాం. జంతువుల దాహార్తిని తీర్చేందుకు ప్రభు త్వం నిధులు విడుదల చేసింది. వన్యప్రాణులు నీటి కోసం రోడ్లపైకి, జనసంచార ప్రాంతాల్లోకి రాకుండా ఉండేందుకు అడవుల్లోనే కుంటలు, సాసర్ పిట్లలో నీటిని నింపి ఉంచుతున్నాం. వికాస్మీనా, జిల్లా అటవీ అధికారి రూ.1.6 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం జిల్లాలో 86,871.45 హెక్టార్ల అటవీ ప్రాంతం ఇప్పటికే 180 చోట్ల సాసర్ పిట్ల ఏర్పాటు -
వేసవిలో అప్రమత్తంగా ఉండండి
నిజామాబాద్ అర్బన్: వేసవిలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై ఆయా శాఖల వారీగా అధికారులకు బాధ్యతలను పురమాయిస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యారోగ్య, ఉపాధిహామీ, పర్యావరణ, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖలు వడదెబ్బ నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, తన నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని సైతం ఏర్పా టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వడదెబ్బ నివా రణ కోసం పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేయాలని డీఎంహెచ్వో రాజశ్రీని ఆదేశించారు. ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు ఇవీ.. ● ప్రజలు, కార్మికులు భారీ ఉష్ణోగ్రతల కారణంగా వడగాడ్పులకులోనై ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ● లేబర్ అడ్డాలు, పని ప్రదేశాలను గుర్తించి తాగునీరు అందుబాటులో ఉంచాలి. ● బస్తీ దవాఖానాలు, పీహెచ్సీ, సీహెచ్సీల్లో రెట్టింపు స్థాయిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను నిల్వ చేయాలి. ● ప్రతి ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండాలి. ● గురుకులాలు, వసతిగృహాల్లో ఎండ తీవ్రతపై అవగాహన కల్పించాలి. ● ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్ర జలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా చూడాలి. అత్యవసర సమయంలో బయటికి వచ్చే వారికి జాగ్రత్తు తీసుకునేలా అవగా హన కల్పించాలి. ● ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. ● ప్రధానంగా వ్యవసాయ, ఉపాధి కూలీలు, వివిధ పరిశ్రమలలో పని చేసే వారు, భవన నిర్మాణ రంగ కార్మికులు తదితరులకు తగి న సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలి. ● ఉపాధి పనులు కొనసాగుతున్న ప్రదేశాల్లో టెంట్లు ఏర్పాటు చేయాలి. కూలీలు తమ వెంబడి తాగునీరు తెచ్చుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలి జాగ్రత్తలను వివరిస్తూ కరపత్రాలను పంచండి ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రుణాల రికార్డ్
డొంకేశ్వర్(ఆర్మూర్): మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంతోపాటు రికవరీ చేయడంలో నిజామాబాద్ జిల్లా టాప్లో నిలిచింది. రెండు రోజుల క్రితం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో డీఆర్డీవో సాయాగౌడ్ను ప్రశంసించిన రాష్ట్ర సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్.. వార్షిక టార్గెట్ రూ.1,228కోట్ల పంపిణీని దాటి అదనంగా రూ.109 కోట్లు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. మిగతా జిల్లాలు నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఏర్గట్ల, మాక్లూర్, ఎడపల్లి, జక్రాన్పల్లి, ఆర్మూర్, కమ్మర్పల్లి, నందిపేట్, రెంజల్, వేల్పూర్, సిరికొండ, ముప్కాల్, మోపాల్, నవీపేట్, డిచ్పల్లి, మోర్తాడ్, వర్ని, భీమ్గల్, బాల్కొండ మండలాలు రుణాల పంపిణీలో వంద శాతాన్ని చేరుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,228 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను 19,969 మహిళా సంఘాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం (మార్చి) ముగింపునకు వారం రోజులు ఉండగానే టార్గెట్ను దాటి రూ.1,332 కోట్ల రుణాలను 16వేల సంఘాల వరకు అందజేసి రాష్ట్రస్థాయిలో జిల్లా ఐదో స్థానంలో ఉంది. బ్యాంకుల సహకారంతో ఐకేపీ అధికారులు సమన్వయం చేసుకుని ప్రతి సంఘానికి రుణాలివ్వడంతో టార్గెట్ను సులభంగా సాధించారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను పాడి పరిశ్రమ, చిన్న తరహా వ్యాపారాలు, కుట్టు మిషన్లు, ఇతర కుటీర పరిశ్రమల స్థాపనకు ఉపయోగించుకొని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. అలాగే తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తూ క్రమశిక్షణ పాటిస్తున్నారు. తద్వారా జిల్లాలో రికవరీ శాతం మెరుగ్గా ఉంది. ఈనాటికి జిల్లా వ్యాప్తంగా 0.38 శాతం మాత్రమే బకాయిలు ఉండడం విశేషం. కాగా ఇది రికార్డు స్థాయి అని చెప్పొచ్చు. ప్రణాళికతోనే సాధ్యమైంది... ఐకేపీ అధికారులు, సిబ్బంది కలిసి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడం వల్లే ఈ ఘనత సాధ్యమైంది. మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు ఇవ్వడం, ఎన్పీఏ బకాయిలు లేకపోవడం సంతోషంగా ఉంది. ఇదే స్పూర్తితో మున్ముందు కూడా లక్ష్యాలను దాటి రుణాలు అందజేస్తాం. – సాయాగౌడ్, డీఆర్డీవో, నిజామాబాద్పంపిణీ.. రికవరీలో నిజామాబాద్ భేష్ వార్షిక లక్ష్యానికి మించి మహిళా సంఘాలకు రుణాలిచ్చిన అధికారులు డీఆర్డీవోను ప్రశంసించిన సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ -
క్షయ రహిత సమాజమే లక్ష్యం
● డీఎంహెచ్వో రాజశ్రీ ● జీజీహెచ్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 ప్రారంభం సుభాష్నగర్: క్షయ రహిత సమాజమే లక్ష్యంగా అందరం పని చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఏడో అంతస్తులో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షయ అంటువ్యాధి అయినప్పటికీ.. పూర్తిగా నయమయ్యే వ్యాధి అని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచనల ప్రకారం పూర్తి చికిత్స తీసుకుంటే వ్యాధిని జయించవచ్చన్నారు. ప్రభుత్వం క్షయ నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, అయినప్పటికీ ప్రజల సహకారం లేకుండా ఈ లక్ష్యం సాధ్యం కాదని అన్నారు. క్షయ లక్షణాలను గుర్తించాలని, దగ్గు రెండు వారాలకుపైగా ఉంటే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. క్షయ రోగులను వివక్ష లేకుండా ఆదరించి వారికి మానసిక ధైర్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. ‘ఎస్! వీ కెన్ ఎండ్ టీబీ’అనే థీమ్ను అందరం ఆచరణలో పెట్టాలని, ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా భావించి క్షయ నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 కా ర్యక్రమాన్ని డీఎంహెచ్వో జీజీహెచ్లో ప్రారంభించారు. క్రమం తప్పకుండా మందులు వాడి టీబీని జయించిన ఇద్దరు టీబీ చాంపియన్లను సన్మానించారు. డీటీసీవో డాక్టర్ దేవినాగేశ్వరి, జీజీహెచ్ సూ పరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్రావు, పల్మనాలజీ హెచ్వోడీ ప్రశాంత్, డిప్యూటీ డీఎంహెచ్వో అశ్వినీ, వైద్యులు వెంకన్న, అవంతి, రవిగౌడ్, లక్ష్మణ్, నరేశ్, వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
● ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలి ● కలెక్టర్ ఇలా త్రిపాఠి బోధన్టౌన్(బోధన్) : ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని, ప్రజలకు ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలని కలెక్టర్ ఇలా త్రిపా ఠి అన్నారు. బోధన్లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. ఆనంతరం వైద్యాధికారులతోపాటు వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో నెలకొన్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి లో పూర్తిగా వసతులు కల్నించేలా చర్యలు చేపడు తామని, వైద్య సేవలను పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. గైనకాలజిస్టును నియమించడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు సోకకముందే జాగ్రత్తలు తీసుకోవాలని, మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాల ని ఆదేశించారు. ఆస్పత్రిలో అవసరమైన మౌలిక స దుపాయాలను, వైద్యులను, వైద్య సిబ్బందిని సమకూరుస్తామని, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, వైద్య సేవల్లో లోపాలు ఉంటే ఉపేక్షించేది లేదని సూచించారు. ఆస్పత్రుల సమన్వయ కర్త శ్రీనివాస్ ప్రసాద్, వైద్యులు రాహుల్ ఉన్నారు. -
కంటిచూపును జాగ్రత్తగా కాపాడుకోవాలి..
సుభాష్నగర్ : శరీర అవయవాలలో అత్యంత ప్రధానమైన కంటి చూపును ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా రు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్లో జిల్లా అంధ త్వ నివారణ సంస్థ ద్వారా దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దా లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి బాలబాలికలకు కంటి అద్దాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇదివరకు తాను కూడా దృష్టి లోపంతో ఇబ్బందిపడ్డానని, తగిన వ్యాయామాలు, సరైన ఆహారపు అలవాట్లతో ఆ సమస్యను అధిగమించానని వెల్లడించారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు వీలుగా జిల్లాలో సుమారు 70 వే ల మంది వరకు విద్యార్థులకు నేత్ర పరీక్షలు చే యాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 41 వేల మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయన్నారు. కంటి సంబంధిత సమస్యలకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు పలు ప్రశ్నలు వేస్తూ, సరైన సమాధానాలు చెప్పిన వా రికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకు ని టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగస్వాము లం అవుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో క లెక్టర్ మొక్కలు నాటారు.డీఎంహెచ్వో రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్వో అశ్విని, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అశోక్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ పీవో సుజాత, మెడికల్ ఆఫీసర్ అజ్మల్, హెచ్ఎం శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పరిశోధనలపై యువత ఆసక్తి చూపాలి
ఖలీల్వాడి: నేటి యువత పరిశోధనల వైపు ఆసక్తి చూపాలని, తద్వారా ఉ న్నత శిఖరాలను అధిరోహించవచ్చని సఫల ఆర్గానిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకు లు, శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ క ళాశాలలో మంగళవారం రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘నిర్మాణం నుంచి పునర్నిర్మాణం వరకు రసాయన శాస్త్రం: నూతన సంశ్లేషణను సమాజ స్థిరత్వంతో అనుసంధానం‘ అనే అంశంపై ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. రసాయన శాస్త్రం అభ్యసించినవారు ఉన్నతంగానే ఎదిగుతారని తెలిపారు. ప్రి న్సిపల్ రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు లోతైన అవగాహన, పరి శోధన అనుభవం కలిగించుటకు ఈ విద్యా సంవత్సరంలో 5 జాతీయ సద స్సులు నిర్వహించామన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచా ర్య దేవలపల్లి రామాచారి, ఐఐసీటీ హైదరాబాద్కు చెందిన సుధాకర్, తెయూ ప్రొఫెసర్ కాశీనాథ్, నాందేడ్ ప్రొఫెసర్ పట్వారీ, సాయిలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 61 పరిశోధన ప త్రాలు సమర్పించారు. దాదాపు 300 మంది రీసెర్చ్ స్కాలర్లు, విద్యా ర్థులు పాల్గొని, పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, సైన్స్ఫేర్లను నిర్వహించారు. సదస్సు కన్వీనర్ రంగరత్నం, రాజేష్, అధ్యాపకులు ర మణ, రంజిత్, రాము, హనుమాండ్లు, చంద్రకళ, శ్రీవర్ష, దండు స్వామి, రామస్వామి, రామ్ కిషన్, ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణ సజావుగా కొనసాగాలి
● రైతులకు ఇబ్బందులు తలెత్తకూడదు ● అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సుభాష్నగర్: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. రబీ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలు, ఐకేపీ సీసీలు, మెప్మా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఇబ్బందులు పడకుండా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. జిల్లాలో యాసంగిలో 4.27 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారన్నారు. సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేయగా, 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 669 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కేంద్రాలకు సమకూరుస్తామని, 2.25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం అవుతాయని అంచనా వేశామని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రతిరోజూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ చేయాలని, ఏమైనా సమస్యలు గమనించిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంటనే రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రైతు భరోసా పేరుతో ప్రభుత్వ మోసం
సుభాష్నగర్: రైతు భరోసా పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మళ్లీ మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకం మొదలుపెట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఒక ప్రకటనలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందు రైతుల భావోద్వేగాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వరంగల్ డిక్లరేషన్లో రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్.. కేవలం రూ.12వేలకే పరిమితమైందని విమర్శించారు. రైతు భరోసాను ఇప్పటికే నాలుగు విడతల్లో రైతులకు ఎగ్గొట్టిన విషయాన్ని అన్నదాతలు మర్చిపోరని, సరైన సమయంలోనే కాంగ్రెస్కు కర్రుకాల్చి వాత పెడతారని తెలిపారు. కాంగ్రెస్ చేస్తుంది రైతు సంక్షేమం కాదని, ఇది పక్కా రాజకీయ మోసమన్నారు. ప్రభుత్వం ఇకనైనా పబ్లిసిటీ నాటకాన్ని కట్టి పెట్టి.. రైతుల అవసరాలపై రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు పూర్తి డబ్బులను ఒకేసారి జమ చేయాలని, లేకుంటే రైతాంగం పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. -
దివ్యాంగులను విస్మరిస్తున్న ప్రభుత్వం
సుభాష్నగర్: దివ్యాంగులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని, వారికి ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి వెంటనే నెరవేర్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అన్ ఎంప్లాయిడ్ డిసేబుల్డ్ అసోసియేషన్ ఆఫ్ యూత్ చేపట్టిన ‘చలో అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈక్రమంలో మంగళవారం వారిని అసెంబ్లీ ముందు పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పటేల్తో కలిసి గన్పార్క్ అమరవీరుల పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని, పెన్షన్ రూ.6వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల అమలు ఎలాగో పూర్తి స్థాయిలో జరగడం లేదు, కనీసం వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. -
ఆధునిక వ్యవసాయంలో బ్రాసినో స్టెరాయిడ్స్ కీలకపాత్ర
తెయూ(డిచ్పల్లి): ఆధునిక వ్యవసాయంలో బ్రాసినో స్టెరాయిడ్స్ కీలకపాత్ర పోషిస్తాయని ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ఆచా ర్యులు సీతారాంరావు పేర్కొన్నారు. సోమవా రం తెలంగాణ యూనివర్సిటీ వక్షశాస్త్ర విభా గం ఆధ్వర్యంలో ‘ఆధునిక వ్యవసాయంలో బ్రాసినో స్టెరాయిడ్స్ పాత్ర’ అనే అంశంపై ప్రొఫెసర్ సీతారాం రావు ఆహ్వానిత ఉపన్యా సం చేశారు. అధిక పంట దిగుబడికి, ప్రతికూల వాతావరణ పరిస్థితులలో బ్రాసినో స్టెరాయిడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తక్కువ మోతాదులో బ్రాసినో స్టెరాయిడ్స్ ప్రభావవంతంగా పనిచేయడంతో ఆర్థికపరంగా, పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో బోటనీ విభాగాధిపతి అబ్దుల్ హలీం ఖాన్, బీవోఎస్ చైర్పర్సన్ అరుణ, అధ్యాపకులు విద్యావర్థిని, శ్రీనివాస్, జలందర్, విద్యార్థులు పాల్గొన్నారు. సతీశ్కు డాక్టరేట్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ బోటనీ (వృక్షశాస్త్ర) విభాగంలో పరిశోధక విద్యార్థి సతీశ్ డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ విద్యావర్థిని పర్యవేక్షణలో ‘సోలానం జాన్తోకర్పం యొక్క పెరుగుదల – దిగుబడిపై బ్రాసీనోస్టెరాయిడ్స్ –సాలిసిలిక్ యాసిడ్ ప్రభావం’ అనే అంశంపై సతీశ్ పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. సోమవారం తెయూ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన ఓపెన్ వైవావోస్కు ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ విభాగం ప్రొఫెసర్ సీతారాంరావు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వ్యవహరించారు. సతీశ్ను పలు ప్రశ్నలు అడిగారు. సమాధానాలు రాబట్టి డాక్టరేట్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెయూ బోటనీ బీవోఎస్ చైర్పర్సన్ అరుణ, విభాగాధిపతి మహ మ్మద్ అలీంఖాన్, సైన్స్ డీన్, కంట్రోలర్ సంపత్ కుమార్, విద్యావర్థిని, అధ్యాపకులు శ్రీనివాస్, జలంధర్, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ) గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కవితారెడ్డిని నగర మేయర్ ఉమారాణి రమేశ్ సోమవారం సన్మానించారు. ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ రంగాల్లో కవితారెడ్డి నాయకత్వం మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని మేయర్ విశ్వాసం వ్యక్తంచేశారు. రెడ్డి సంక్షేమ సంఘం.. ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కవితారెడ్డిని సోమవారం రెడ్డి సంక్షేమ సంఘం (369) అధ్యక్షుడు గాదారి సంజీవ్రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మోతే నవీన్ రెడ్డి, కోశాధికారి అరికెల శ్రీకాంత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వినోద్ రెడ్డి, సలహాదారులు నాగిరెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
54 ఏళ్ల తర్వాత..
నిజామాబాద్ రూరల్: నగరంలోని ఆర్యసమాజంలో రాధాకృష్ణ పాఠశాల 1972–73 ఏడో తరగతి మొదటి బ్యాచ్ విద్యార్థులు స్వర్ణోత్సవాలు ఆదివారం నిర్వహించారు. 54 సంవత్సరాల తర్వాత విద్యార్థులందరూ ఒక్కచోట కలిశారు. సమ్మేళనంలో విద్యార్థుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాధాకృష్ణ పాఠశాల అధ్యక్షుడు సూర్యప్రకాష్, కార్యదర్శి నా రాయణ, ప్రధానోపాధ్యాయులు సునీత, పాత ప్రధానోపాధ్యాయులు ఎంపీ రాజులు, ఉపాధ్యాయులు శంకర్ను సన్మానించారు. సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు -
కాపీయింగ్కు అవకాశం ఇవ్వొద్దు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాల తనిఖీ ఖలీల్వాడి: పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్కు అవకాశం ఇవ్వొద్దని, ఒకవేళ కాపీయింగ్కు ఆస్కారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని మానిక్భవన్, నలంద హైస్కూల్లోని పరీక్ష కేంద్రాలను ఆమె సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థులు, సిబ్బంది హాజరుకు సంబంధించిన వివరాలను సీఎస్ను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం, నిర్ణీత సమయంలో ప్రశ్నాపత్రాలను తెరిచారా? అని అడిగారు. సీసీ కెమెరా రికార్డింగ్ నడుమ ప్రశ్నాపత్రాల బండిళ్ల సీళ్లు తెరవాలని సూచించారు. అనంతరం సీసీ ఫుటేజీలను పరిశీలించి నిబంధనలు పాటించారా? లేదా? అని నిర్ధారణ చేసుకున్నారు. హాల్లోకి సిబ్బంది ఎవరైనా సెల్ఫోన్లతో వచ్చారా? అని కలెక్టర్ పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. పరీక్షలు ముగిసేంత వరకు అప్రమత్తతతో, పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రశ్నాపత్రాలను తప్పనిసరిగా తగిన పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించాలని తెలిపారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు శంకర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 49 మంది గైర్హాజరు పదో తరగతి వార్షిక పరీక్షలకు సోమవారం 49 మంది గైర్హాజరైనట్లు డీఈవో పార్శి అశోక్కుమార్ సోమవారం తెలిపారు. మూడో రోజు ఇంగ్లిష్ పరీక్షకు 24,395కు 24,346 మంది హాజరైనట్లు తెలిపారు. 144 పరీక్ష కేంద్రాల్లోని రెండు సెంటర్లను కలెక్టర్, తొమ్మిది డీఈవో, 38 ప్లయింగ్ స్క్వాడ్, మూడు కేంద్రాలలో ఏసీజీఈ తనిఖీలు చేపట్టారు. -
క్రైం కార్నర్
విద్యుత్షాక్తో ఒకరి మృతి దోమకొండ: మండలంలోని లింగుపల్లి గ్రామానికి చెందిన రాకుల శంకర్ (43) సోమవారం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. గ్రామంలో ప్రయివేట్ కరెంట్ హెల్పర్గా పనిచేసే శంకర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇంటికి విద్యుత్ వైర్ల కనెక్షన్ ఇచ్చే ప్రయత్నంలో విద్యుత్ స్థంభం నుంచి కిందపడ్డాడు. సీసీ రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్థులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే శంకర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య నాగమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుమారుడు రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. గాయపడిన మహిళ ..రుద్రూర్: పోతంగల్ రైస్మిల్లులో పనిచేస్తూ గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణి మొగులవ్వ (40) గత నెల 15న రైస్మిల్లులో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్ బెల్ట్ చుట్టుకొని గాయపడింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ అస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ 21న రాత్రి మృతి చెందింది. సోమవారం కోటగిరి తహసీల్దార్ గంగాధర్ సమక్షంలో కొత్తపల్లి గ్రామంలో వైద్యులు పోస్టుమార్టం ని ర్వహించారు. మృతురాలి భర్త రేణి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని మహిళ .. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు బైపాస్ రోడ్డులో ఉన్న బాగారెడ్డి నర్సరీ వద్ద గుర్తు తెలియని మహిళను ఢీకొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. బస్సును స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి సంబంధించిన బంధువులు ఉంటే తమను సంప్రదించాలని పేర్కొన్నారు. -
మహిమాన్వితం.. సుభాష్నగర్ శ్రీ రామాలయం
● జిల్లాలో ప్రాముఖ్యత గల దేవాలయం ● నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ● 27న కల్యాణం, 28న రథోత్సవంనిజామాబాద్ రూరల్: జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తోంది నగరంలోని సుభాష్నగర్ శ్రీరామాలయం. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ సమేతుడై భక్తులకు దర్శనమిస్తారు. నిత్య పూజలు, ప్రత్యేక హోమాలు, అభిషేకాలతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ప్రధానంగా శ్రీరామనవమి వేడుకలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి రామాలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 30 వరకు జరిగే విశేష పూజలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్పర్సన్ సరళామహేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శోభానవీన్రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉత్సవ కార్యక్రమాలు ఇలా.. 24 మంగళవారం ఉదయం 7 గంటలకు నిత్యారాధన, ధృవమూర్తులకు స్నపన తిరుమంజనం, పంచామృతాభిషేకం, సాయంత్రం 5 గంటలకు నిత్యారాధన, విష్ణు సహస్రనామ పారాయణం, అఖండ దీపారాధన తదితర పూజలు నిర్వహిస్తారు. 25 బుధవారం ఉదయం 7 గంటలకు నిత్యారాధన, యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, వాస్తు, సోమ, సుదర్శన, కుంభస్థాపన, అగ్నిప్రతిష్ట, వాస్తు హోమం, గరుడ ప్రతిష్ట, ధ్వజారోహణం(గరుడ వివాహము) బలిహరణం ఉంటుంది. 26 గురువారం 7 గంటలకు నిత్యారాధన, అవాహిత దేవతాపూజ, నిత్యహోమములు, సాయంత్రం 5 గంటలకు నిత్యాహోమం, పారాయణములు, మూల మంత్ర హోమం, ఆరగింపు, బలిహరణం, మంగళాశాసన తీర్థగోష్టి, ఉలుకపూజ(కొట్నం పుణ్యాహవాచనం) నిర్వహిస్తారు. 27న ఉదయం 7 గంటలకు నిత్యారాధన, అవాహిత దేవతాపూజ, నిత్యహోమం, పారాయణములు, 9 గంటలకు ఎదుర్కోలు, శ్రీ సీతారాముల కల్యాణం, సాయంత్రం నిత్యారాధన, నిత్యహోమం విశేష పూజలు ఉంటాయి. 28న ఉదయం 7 గంటలకు నిత్య పూజలతోపాటు సాయంత్రం రథోత్సవం ఉంటుంది. 29న దోపు ఉత్సవం, చక్రతీర్థం, గరుఢధ్వజ అవరోహణం, ఏకాంతసేవ, 30న స్వామివారికి మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. -
ఏఐతో ఔషధ రంగంలో అపార అవకాశాలు
తెయూ(డిచ్పల్లి): ఔషధ రంగంలో కృత్రిమ మేధ ను ఉపయోగించుకొని మరిన్ని ఎక్కువగా ఔషధ ఆవిష్కరణలు సాధించవచ్చని ఐఐటీ హైదరాబాద్ బయోటెక్నాలజీ విభాగం డీన్ ప్రొఫెసర్ నరహరి శాస్త్రి పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ బయాలజీ – నవెల్ థెరప్యూటిక్స్’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజు ల జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న నరహరి శాస్త్రి మాట్లాడుతూ సాంకేతికతలు ఔషధ ఆవిష్కరణను వేగవంతం చేయడంలో, డేటా విశ్లేషణలో, వ్యక్తిగత వైద్యంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. విజ్ఞానశాస్త్ర అభివృద్ధి కోసం ఏఐను వివేకంతో ఉపయోగించుకోవాలని సూచించారు.తెయూ నుంచి కొంతమంది విద్యార్థులను ఇంటర్న్షిప్కు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. చీఫ్ ప్యాట్రన్గా వ్యవహరించిన తెయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు మాట్లాడుతూ ఆరోగ్యరంగ అభివృద్ధికి కెమికల్ బయాలజీ కీలకమన్నారు. ముఖ్యంగా పరిశోధనలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సీఎస్ఐఆర్–ఐఐసీటీ (హైదరాబాద్) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సురేశ్బాబు మాట్లాడుతూ.. దైనందిన జీవింతో సంప్రదాయ వైద్యం ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. మూలికా ఔషధాలలో జరిగే కల్తీ ఉత్పత్తులను ఎలా గుర్తించాలనే విషయాలపై అవగాహన కల్పించారు. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అడెపు రాజు మాట్లాడుతూ కెమికల్ బయాలజీ ఆధారిత పరిశోధనలపై విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు. సదస్సుకు ఆర్గనైజింగ్ సెక్రెటరీగా డాక్టర్ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ చైర్పర్సన్గా డాక్టర్ శిరీష బోయపాటి, కన్వీనర్గా డాక్టర్ వాసం చంద్రశేఖర్ వ్యవహరించారు. సదస్సులో వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సదస్సులో ప్రముఖ శాస్త్రవేత్తలు


