Nizamabad District News
-
ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి
● ఏపీలో ముగిసిన తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ పర్యటన డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ఎన్ఆర్ఐ సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్దామని తెలంగాణ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ పేర్కొంది. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం తదితర అంశాలపై అధ్యయనం కోసం నియమించబడిన తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటన గురువారం ముగిసింది. కమిటీ చైర్మన్ డాక్టర్ బీఎం వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, ఇతర కమిటీ సభ్యుల నేతృత్వంలో పర్యటన సాగింది. తొలిరోజు ఏపీ ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో భేటీ అయిన కమిటీ సభ్యులు రెండో రోజు ఏపీ పోలీస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. ఏపీ సీఐడీ చీఫ్ డాక్టర్ రవిశంకర్ అయ్యనార్తోపాటు ఇతర అధికారులు.. ఎన్ఆర్ఐ సెల్ అందిస్తున్న సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కమిటీ సభ్యులు తమ సందేహాలను తెలుపగా, ఏపీ పోలీస్ ఎన్ఆర్ఐ సెల్ అధికారులు నివృత్తి చేశారు. కమిటీ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అంధకారం నుంచి అగాధంలోకి..
చూపు లేదు.. పిలిస్తే పలికేవారు వెళ్లిపోయారు ● తల్లి, సోదరుడిని కోల్పోయి ఒంటరిగా మిగిలిన స్వప్న ● తల్లడిల్లుతున్న అంధురాలు బోధన్రూరల్: చూపు లేకున్నా తల్లి కళ్లతో లోకాన్ని చూసింది. తండ్రిలా కంటికి రెప్పలా కాపాడే అన్న ఉన్నాడన్న మనోధైర్యంతో జీవించింది. ఇప్పుడు ఆ ఇద్దరూ లేక అంధకారం నుంచి అగాధంలోకి జారింది. తల్లిని, అన్నను కోల్పోయి తల్లడిల్లుతున్న స్వప్న కథ ఇది.. భర్తను కోల్పోయిన బోధన్ మండలం ఖండ్ గావ్ గ్రామానికి చెందిన పద్మినీబాయి(70) కొడు కు సునీల్దేవ్ (30), కూతురు స్వప్న(25)తో కలి సి జీవిస్తోంది. సునీల్దేవ్కు పెళ్లయినప్పటికీ భా ర్యతో విభేదాల కారణంగా భార్య వెళ్లిపోయింది. స్వప్నకు పుట్టుకతో ఒక కన్ను కనిపించకపోగా, రెండేళ్ల క్రితం మరో కన్ను పోవడంతో అంధురాలిగా మారింది. పద్మినీబాయి కొడుకు, కూతురు తో కలిసి జీవిస్తోంది. మంగళవారం రాత్రి ముగ్గు రూ కలిసి భోజనం చేసి నిద్రించారు. పద్మినీబా యి నిద్రలోనే చనిపోగా, అర్ధరాత్రి నిద్రలేచిన సునీల్ తల్లి మృతి చెంది ఉండడాన్ని గమనించి మనస్థాపానికి గురై ఇంట్లోని దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం నిద్రలేచిన స్వప్న తల్లిని, అ న్నయ్యను పిలవగా ఎంతకూ స్పందన లేకపోవడంతో భయంతో గట్టిగా రోదించింది. స్వప్న ఏడుపు విన్న చుట్టు పక్కల వారు వారి వచ్చి చూడగా పద్మినీబాయి, సునీల్దేవ్ విగతజీవులు గా కనిపించారు. తన తల్లి, అన్నకు ఏమైందని స్వప్న గట్టిగా రోదిస్తూ ప్రశ్నిస్తుండడంతో అక్కడు న్న వారు సమాధానం చెప్పలేక కన్నీరుమున్నీరయ్యారు. విషయం అర్థమైన స్వప్న తనకు దిక్కెవరంటూ రోదించడం అక్కడివారిని కలిచివేసింది. గ్రామస్తులు తల్లీకొడుకుల అంత్యక్రియలను పూర్తి చేశారు. గురువారం గ్రామస్తులతోపాటు బాధిత కుటుంబ బంధువులు స్వప్న సంరక్షణపై చర్చించారు. ఇద్దరు మేనత్తలు స్వప్న సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. అంధురాలైన స్వప్నకు పింఛన్ రావడం లేదని ప్రభుత్వం స్పందించి పింఛన్ అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జీల నియామకం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్ఎస్ సభ్య త్వ నమోదు ప్రక్రియ కోసం పార్టీ నాయకత్వం గురువారం ఇన్చార్జీలను నియమించింది. ఉమ్మడి జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాలకు ఇన్చార్జీలు వీరే.. ఆర్మూర్ : కాంతారెడ్డి తిరుపతిరెడ్డి, బోధన్ : డి విఠల్రావు, జుక్కల్ : మాటం భిక్షపతి, బాన్సువాడ : తోట ఆగయ్య, ఎల్లారెడ్డి : దఫేదార్ రాజు, కామారెడ్డి : షేరి సుభాష్రెడ్డి, నిజామాబాద్ అర్బన్ : రవీందర్సింగ్, నిజామాబాద్ రూరల్ : గిర్ధావర్ గంగాధర్, బాల్కొండ : దావా వసంత. డొంకేశ్వర్(ఆర్మూర్): తమ గ్రామంలోనికి హి జ్రాలు రావొద్దని డొంకేశ్వర్ మండలం తొండాకూర్ గ్రామ పంచాయతీ గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. గ్రామంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఇతర శుభ కార్యాలు జరిగితే సమాచారం తెలుసుకుని గుంపులుగా వచ్చి డబ్బుల కోసం ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తు ల నుంచి ఫిర్యాదుల వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ అల్లారి గంగాధర్ తెలిపారు. ఈ తీర్మానాన్ని ఉల్లంఘించి హిజ్రాలు ఊరిలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులు పెడితే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పాలకవర్గ సభ్యులు స్పష్టం చేశారు. ● సిగరెట్లు, గుట్కాలు విక్రయిస్తే జరిమానా ● ఎడపల్లి జీపీ పాలకవర్గం తీర్మానాలు బోధన్: ఎడపల్లి గ్రామంలో గంజాయితోపాటు సిగరెట్లు, గుట్కాల నిషేధానికి గ్రామ పంచాయతీ పాలక వర్గం కఠిన చర్యలు తీసుకుంటోంది. గ్రామంలో ఎవరైనా గంజాయి అమ్మినా, తాగినట్టు తెలిసినా సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల బహుమతి అందిస్తామని, అలాగే సిగరెట్లు, గుట్కాలు విక్రయిస్తే రూ.10వేల జరిమానా విధించడంతోపాటు సమాచారం అందించిన వారికి రూ.5వేల బహుమతి ఇవ్వాలని పాలకవర్గం తీర్మానాలు చేసింది. సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లను గోప్యం ఉంచుతామని ప్రకటించింది. డ్రగ్స్ సేవించడం జీవితాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనమని సర్పంచ్ కందగట్ల రాంచందర్ అన్నారు. గ్రామ యువత, పిల్లల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని పంచాయతీ పాలక వర్గం తీర్మానాలు చేసినట్లు తెలిపారు. -
విద్యాశాఖలో బదిలీలు
ఖలీల్వాడి : జిల్లా కేంద్రంలోని సమీకృత క లెక్టరేట్లోని అదనపు కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జూనియర్ ఆసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, రికార్డు ఆసిస్టెంట్లకు బదిలీలు నిర్వహించారు. డీఈవో పార్శి అశోక్ పర్యవేక్షణలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బదిలీలను చేశారు. ఈ బదిలీల్లో 14 మంది జూనియర్ ఆసిస్టెంట్లు, ఆరుగు రు ఆఫీస్ సబార్డినేట్లు, ఇద్దరు రికార్డు ఆసిస్టెంట్లు ఉన్నట్లు డీఈవో తెలిపారు. బదిలీ అ యిన ఉద్యోగులు ఈనెల చివరి వరకు ఆయా స్థానంలో జాయిన్ కావాలన్నారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు ● పెరిగిన వేడి గాలుల తీవ్రత నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత పది రోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వేడిగాలుల తీవ్రత ఉంటోంది. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. జిల్లాలో గురువారం బాల్కొండ కేంద్రంలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నిర్మల్ జిల్లాలోని దిల్వార్పూర్లో 46.5, హన్మకొండలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. జిల్లాలో ప్రజలు ఎవరు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని అధికారులు పేర్కొంటున్నారు. వేడి గాలుల తీవ్రత వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. స్వేచ్ఛగా ఎక్కడైనా పనిచేసుకోవచ్చు ఆర్మూర్టౌన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి చొరవతో బానిస బతుకుల నుంచి విముక్తులైన ఆలూర్ మండలం దే గాం ఇట్టుక బట్టీ కార్మికులు ఇక ఎక్కడైనా స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. ఆర్మూర్లోని బాలుర పాఠశాలలో గురువారం 22 మంది బాధితు లకు బాండెంట్ లేబర్ రిలీజ్ సర్టిఫికెట్తో పాటు ప్రభుత్వ కార్మిక శాఖ నుంచి రూ.30 వేల చొప్పున అందజేశారు. ఆమె మాట్లాడు తూ ఇటుక బట్టీ కార్మికుడు బాబు చేసిన ధై ర్యం వల్లే 112 కుటుంబాలు బానిస బతుకు ల నుంచి బయట పడ్డాయని, భవిష్యత్తులో ఏ కార్మికులకు కూడ ఇలాంటి గతి పట్టకుండా కార్మిక చట్టాల ద్వారా బట్టీల యజమానులపై అన్ని రకాల చర్యలు తీసుకుంటామ న్నారు. తమిళనాడుకు వెలుతున్న బాధితుల కు రోటరీక్లబ్సభ్యులు భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అ భిగ్యాన్ మాల్వియ, డిప్యూటీ కమిషన్ ఆఫ్లే బర్ యాదయ్య, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రావణి, తహసీల్దార్ సత్యనారాయణ, ఎస్హెచ్వో సత్యనారయణగౌడ్ పాల్గొన్నారు. -
జక్రాన్పల్లిలో రెండో సోలార్ ప్లాంట్
● నేటి నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం జక్రాన్పల్లి: సౌర విద్యుత్ ఉత్పత్తికి జక్రాన్పల్లి మండలం కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. రాష్ట్రంలోనే మొదటి సోలార్ ప్లాంట్ను జక్రాన్పల్లి విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కలిగోట్ సబ్స్టేషన్ పరిధిలో మరో ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. మండలంలోని మనోహరాబాద్ శివారులో పడకల్కు చెందిన రైతు మగ్గిడి సుదర్శన్రెడ్డి తనకున్న 6 ఎకరాల భూమిలో పీఎం కుసుమ్ ప్రాజెక్టులో భాగంగా రెడ్కో ఆధ్వర్యంలో 2 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ ప్లాంటును ఏర్పాటు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు సహకారంతో రూ.7 కోట్ల వ్యయంతో సుదర్శన్రెడ్డి ప్లాంట్ను ఏర్పాటు చేయగా, 25 ఏళ్ల వరకు యూనిట్కు రూ.3.13 చొప్పున చెల్లించేందుకు ఎన్పీడీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాంట్ను ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాజేశ్వర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. -
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
● రూ. లక్ష జరిమానా విధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కామారెడ్డి టౌన్ : ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పదో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (రేప్ – పోక్సో కేసుల విచారణ కోర్టు) జిల్లా న్యాయమూర్తి డాక్టర్ సీహెచ్ వీవీఆర్ వరప్రసాద్ గురువారం సంచలన తీర్పు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తాడ్వాయి గ్రామానికి చెందిన 20 ఏళ్ల మహమ్మద్ అబ్దుల్ రహీం 2022 ఆగస్టు 5న స్కూల్కు వెళ్తున్న బాలికను మాయమాటలతో కామారెడ్డి రైల్వే స్టేషనన్కు రప్పించి, అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తమ కూతురు ఆచూకీ లభించడం లేదని తల్లిదండ్రులు తాడ్వాయి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సాంకేతిక ఆధారాలతో ఆచూకీ కనిపెట్టిన పోలీసులు బాలికను తీసుకొచ్చారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పటి డీఎస్పీ ఏ. శ్రీనివాసులు, ప్రస్తుత డీఎస్పీ ఎస్. శ్రీనివాస్రావు నేతృత్వంలో పోలీసులు పకడ్బందీగా సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను సేకరించి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పక్కా ఆధారాలు సేకరించి, నిందితుడికి శిక్ష పడేలా అంకితభావంతో పనిచేసిన డీఎస్పీలు శ్రీనివాసులు, శ్రీనివాస్ రావు, ఏపీపీలు శేషు, సూర్యప్రసాద్, తాడ్వాయి ఎస్హెచ్వో వై. నరేశ్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్ఐ రామేశ్వర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ టి సాయిబాబును ఎస్పీ రాజేశ్చంద్ర ప్రత్యేకంగా అభినందించారు. నిజామాబాద్ లీగల్: మామను చంపిన అల్లుడికి పదేళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మహిళా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీరజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ నుంచి నవీపేట్ మండలం అనంతగిరికి వలస వచ్చిన రాజేశ్ దుర్వే తరచూ తన భార్య గోమతితో గొడవ పడేవాడు. 2025 ఏప్రిల్ 27వ తేదీన గొడవ పడుతుండగా అక్కడే ఉన్న మామ భీమ్సింగ్ నిలదీయడంతో రాజేశ్ తన చేతిలోని ఇటుకతో మామ తలపై కొట్టగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. నేరం రుజువు కావడంతో రాజేశ్ దుర్వేకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. -
పిల్లలకు డిజిటల్ సెలవులు ఇద్దాం
● తల్లిదండ్రులే వారికి మార్గదర్శులు ● పెద్దలు క్రమశిక్షణ పాటించాలి ● ఆటలు, శిక్షణ శిబిరాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి ఎల్లారెడ్డి: వేసవి సెలవుల్లో పిల్లలను డిజిటల్ తెరల నుంచి కొంత దూరంగా ఉంచడం ఎంతో అవసరం. ప్రస్తుతం ఏ మాత్రం అవకాశం దొరికినా పిల్లలు సెల్ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, ట్యాబ్, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్లు చూడటంతో పిల్లల్లో ఏ పని మీద శ్రద్ధ, ధ్యాస పెట్టే ఆలోచన ఉండటం లేదు. దీంతో పిల్లలు క్షణికావేశాలకు లోనవుతున్నారని, కంటి సమస్యలు, నిద్రలేమి, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. సహజ ఆలోచన శక్తి తగ్గిపోయి భవిష్యత్లో ఎదగాల్సిన చిన్నారులు సెల్ఫోన్లకు బందీ అవుతున్నారు. ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు సెల్ఫోన్లను బలవంతంగా లాక్కుంటే హింసాత్మకంగా మారుతున్నా రు. కొంతమంది ఒంటరిగా గదిలో కూర్చుంటున్నా రు. స్కూళ్లలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు ఎక్కువ కాలం వారికి గుర్తుండటం లేదు. ఇవి పిల్లలలో మొండి లక్షణాలు కావు. డిజిటల్ వ్యసనాల తీవ్రతకు ఇవి గుర్తులు. వారంలో కనీసం ఒకరోజైనా పిల్లలను డిజిటల్ స్క్రీన్లకు దూరంగా ఉంచాలని వైద్యుల సలహా ఇస్తున్నారు. ● పాతతరం వారు ఎక్కువ సమయం కబడ్డీ, కోతి కొమ్మచ్చి, బొంగరాలు, గోళీలాటలు వంటి ఆటలను మైదానాల్లో ఆడేవారు. ఈ ఆటలతో వారు శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండేవారు. ఇప్పటి రోజుల్లో పిల్లలు ఎంతసేపూ సెల్ఫోన్లు, ల్యాప్ట్యాప్లతోనే గడుపుతూ కాలు బయటపెట్టడం లేదు. ● పిల్లలు సెల్ఫోన్లకు బానిసలు కావడానికి తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రధానంగా ఉంది. పసిప్రాయంలో తినకుండా మారాము చేస్తుంటే బొమ్మలు వస్తున్నాయంటూ వారికి సెల్ఫోన్లను ఇవ్వడం అలవాటు చేస్తున్నారు. సెల్ఫోన్లు వాడకుండా నిరోధించాల్సిన తల్లిదండ్రులే వారి ముందే గంటల తరబడి సెల్ఫోన్లలో గడపడం మరో కారణం. సెల్ఫోన్లు, ల్యాప్ట్యాప్లకు అతుక్కుపోయిన పిల్లలు పిల్లలను డిజిటల్ తెరలకు దూరంగా ఉంచే మార్గాలు పిల్లలకు రోజూవారీ టైంటేబుల్ తయారు చేయాలి. చదువు, ఆటలు, విశ్రాంతి, కుటుంబసభ్యులతో గడపడం ఇలా ఒక షెడ్యూల్ పెట్టాలి. ఖాళీ సమయం ఎక్కువైతే పిల్లలు మొబైల్ వైపు ఆకర్షితులవుతారు. బయట ఆటలకు ప్రోత్సహించాలి. క్రికెట్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, ఈత వంటి శారీరక క్రీడలపై ఆసక్తి పెంపొందించాలి. యోగా శిక్షణ ఇప్పిస్తే మరీ మంచిది. పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి. పిల్లలకు కథలు, కామిక్స్, బాలల పత్రికలు, జ్ఞానం, తెలివి అందించే పుస్తకాలు ఇవ్వాలి. కుటుంబసభ్యులు కలిసి ఆడే క్యారమ్, చెస్, అష్టాచెమ్మ లాంటి పల్లె ఆటలు, కథలు చెప్పడం వంటి కార్యక్రమాలో పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహించాలి. డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం వంటి హాబీలను ప్రోత్సహించాలి. డిజిటల్ స్క్రీన్ టైమ్కు పరిమితి పెట్టాలి. రోజుకు ఎంతసేపు మొబైల్ లేదా టీవీలను చూడాలో ముందుగానే నిర్ణయించాలి. వేసవి శిబిరాల్లో చేర్పించాలి. సమ్మర్ క్యాంపులు, క్రీడాశిక్షణ శిబిరాలు, ఆర్ట్స్ క్లాసులలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. నిద్రకు ముందు కనీసం గంట పాటైనా స్క్రీన్లకు దూరంగా ఉండేలా చూడాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు సెల్ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. పిల్లలకు ప్రేమగా చెప్పి అలవాట్లు మార్చితే మంచి ఫలితాలు వస్తాయి. -
ఎల్సీ లేకుండా మరమ్మతులు.. విద్యుత్ షాక్తో ఒకరి మృతి
మద్నూర్(జుక్కల్): విద్యుత్ సంస్థకు సంబంధం లేని వ్యక్తి స్తంభంపైకి ఎక్కి మరమ్మతులు చేస్తూ షాక్ తగిలి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తడిహిప్పర్గ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగురావ్(50) చిన్నచిన్న విద్యుత్ పనులు చేస్తూ లైన్మెన్ మహేశ్కు సహాయంగా ఉండేవాడు. గురువారం ఉదయం కరెంట్ లేకపోవడంతో గ్రామ పంచాయతీ వద్ద ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి పని చేస్తుండగా దానిపైనే ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్కి కుడి చేయి తగలడంతో నాగురావ్ స్తంభంపైనే ప్రాణాలు విడిచాడు. ఆయన మృతదేహం తలకిందులుగా స్తంభానికి వేలాడింది. అయితే ఎల్సీ లేకుండానే నాగురావ్ను విద్యుత్ స్తభంపైకి ఎవరు ఎక్కమన్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మృతుడి ఫోన్ను పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయంటున్నారు. మృతుడి కుమారుడు దత్తు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. -
హాలీడే ట్రిప్
హలో ఫ్రెండ్స్...నా పేరు అర్వి న్. విజయ్ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాను. ఈ వేసవి సెలవుల్లో నానమ్మ కృపారాణి, టూర్ ప్లానర్స్ అత్త ఉజ్వల, మామయ్య ప్రేమ్సాగర్, బంధువులతో కలిసి టూర్కు వెళ్లాం. బాపట్ల బీచ్లో శాండ్ బైక్ రైడింగ్ చేశాను. చీరాల బీచ్లో ఎంతో ఆసక్తికరమైన, లైఫ్ టైమ్ గుర్తుండిపోయే పారా గ్లైడింగ్ చేశాను. ఊటీలో టీ తోటలు, ఆహ్లాదకరమైన ప్రదేశాలను సెలవుల్లో ఆస్వాదించాను. నల్లముడి వ్యూవ్ పాయింట్లో లోయలోకి మేఘాలు దిగివచ్చినట్టు ఉండే ప్రకృతి అద్భుతాలను ఆనందించాను. -
జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ఇన్
89777 51940 / 99594 12852జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామితో సాక్షి ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విషయం: వానకాలం పంటలకు సన్నద్ధత, వరిలో ఏయే రకాలను సాగు చేస్తే బోనస్ వర్తిస్తుంది. ఖరీఫ్ సీజన్కు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయా.. ఎండల తీవ్రత నేపథ్యంలో వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం ఉంటుందా. ఉంటే ఎప్పటి నుంచి నారు మడులు సిద్ధం చేసుకోవాలి. విత్తనాలు ఎప్పుడు విత్తుకోవాలి. తదితర అంశాలపై రైతులు ప్రశ్నలు అడగవచ్చు.తేది : 23–05–2026 (శనివారం)సమయం: ఉదయం 10.00 గంటల నుంచి 11.00 వరకుఫోన్ చేయాల్సిన నంబర్: -
ట్రాన్స్జెండర్లపై నిషేధం వద్దు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పెళ్లిళ్లు, పేరంటా లు, గృహ ప్రవేశాలు, ప్రారంభోత్సవాలు, ఇత ర శుభకార్యాల సమయంలో ట్రాన్స్జెండర్లు ని ర్దేశిత మొత్తంలో డబ్బులు వసూలు చేయడం సాధారణం. అయితే కొంతకాలంగా జిల్లాలోని చాలా గ్రామాల్లోకి వస్తున్న ట్రాన్స్జెండర్లు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ, అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నారని గ్రామీణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రామాల్లోకి ట్రాన్స్జెండర్ల రాకను నిషేధిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లె క్సీల ఏర్పాటులో వీడీసీలదే కీలకపాత్ర. దీంతో తమ హక్కులకు భంగం కలుగుతోందంటూ ట్రాన్స్జెండర్లు ఇటీవల కలెక్టరేట్ వద్ద ధర్నా, ని రసన కార్యక్రమాలు చేశారు. అయినప్పటికీ ఇంకా పలు గ్రామాల్లోకి ట్రాన్స్జెండర్లు రావద్దంటూ పంచాయతీ పాలకవర్గాలు తీర్మానాలు చేస్తున్నాయి. తాజాగా డొంకేశ్వర్ మండలంతొండాకూర్ పంచాయతీ పాలకవర్గం ట్రాన్స్జెండర్లకు ప్రవేశం లేదంటూ తీర్మానం చేసింది. ఈ క్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం రాష్ట్రంలోనే మొదటిసారిగా గ్రామాల సర్పంచ్ లు, ట్రాన్స్జెండర్లతో సమావేశం నిర్వహించారు. మానవతా దృక్పథంతో చూడాలి ట్రాన్స్జెండర్ల విషయంలో ప్రజలు మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని సమావేశంలో క లెక్టర్ సూచించారు. కాగా సిరికొండ మండలం మైలారం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనతో పాటు మరికొన్ని గ్రామాల్లో జరిగిన ఉదంతాలపై కలెక్టర్ ఇరువర్గాల వాదనలు విన్నారు. ట్రాన్స్జెండర్లు గ్రామాల్లోకి వచ్చి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అడిగినంత ఇవ్వకపోతే అనుచితంగా ప్రవర్తిస్తున్నారని సర్పంచ్లు కలెక్టర్కు తెలిపారు. ట్రా న్స్జెండర్ల వేషధారణలో కొందరు నకిలీలు వ స్తున్నారని తెలిపారు. గ్రామస్తుల ఏకాభిప్రా యం మేరకే నిషేధం విధిస్తూ తీర్మానాలు చేసి నట్లు తెలిపారు. అయితే ఈ బహిష్కరణలతో తమ గౌరవానికి భంగం కలుగుతోందని, జీవనోపాధి కోల్పోతున్నామని ట్రాన్స్జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నకిలీల కారణంగా తమపై ఆంక్షలు భావ్యం కాదన్నారు. వాదనలు విన్న కలెక్టర్ నకిలీల బెడదను ని వారించేందుకు ట్రాన్స్జెండర్లను జిల్లా సంక్షేమ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నా రు. ట్రాన్స్జెండర్లు బలవంతపు వసూళ్లతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దన్నారు. సమాజంలో ట్రాన్స్జెండర్లను శివసత్తులుగా కొలుస్తూ, తమ కు తోచిన మేరకు డబ్బులు ఇస్తుంటారన్నారు. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ట్రా న్స్జెండర్లపై ఉందన్నారు. ట్రాన్స్ జెండర్లు అంగీకరించడంతో బహిష్కరణలను ఉపసంహరించుకుంటామని సర్పంచ్లు అంగీకరించారు. అ యితే వీడీసీలు డామినేట్ చేసే గ్రామాల్లో భవి ష్యత్తులో ఈ సయోధ్య నిలిచేనా అనే చర్చ సై తం జరుగుతోంది. డీపీవో శ్రీనివాసరావు, ఏసీ పీ ప్రకాష్యాదవ్, డీడబ్ల్యూవో పద్మ, ఏవో రా జబాబు, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మునిపల్లి చిన్నసాయిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, డీఎల్పీవో పాల్గొన్నారు.హాజరైన సర్పంచ్లు, ట్రాన్స్జెండర్లుఅడిగిన డబ్బులు ఇవ్వకపోతే శుభకార్యానికి వ చ్చి ఆటంకం కల్పిస్తు న్నారు. ఏదైనా మాట్లాడితే మితిమీరి ప్రవర్తిస్తు న్నారు. సంతోష సమయంలో అవమానకరమైన చర్యలకు పూనుకుంటున్నారు. శాపనార్థా లు పెడుతున్నారు. లేదంటే బట్టలు విప్పుకుంటామని బెదిరిస్తున్నారు. శుభ సమయంలో సంతోషం కంటే బాధే ఎక్కువవుతోంది. శుభకార్య విషయం వారికి ఎలా తెలుస్తుందో ఎవరు చెబుతున్నారో తెలియదు.వచ్చి మరీ ఇబ్బంది పెడుతున్నారు. –మల్యాల సుభాష్గౌడ్, కమ్మర్పల్లి. ఇంటి ముందర టెంట్ కనిపిస్తే చాలు హిజ్రాలు ఆటోలో వచ్చి రూ. వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. వారు అడిగినంత ఇవ్వకపోతే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తనతో ఇంట్లో పిల్లలు, పెద్దలు, మహిళల ముందు తలదించుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెళ్లి పందిట్లో కూర్చోని పనులకు ఆటంకం కల్పించడం లాంటి పనులు చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే బూతు మాటలు తిడుతూ అవమాన పరుస్తున్నారు. –మోర్తాడ్ లింబాద్రి, బడా భీమ్గల్, భీమ్గల్ మండలంఎక్కడ శుభ కార్యాలు జరిగినా అక్కడికి వచ్చి, అడిగినన్ని డబ్బులు ఇచ్చే వర కు అసభ్యకరమైన చేష్టలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి హిజ్రాలకు ఏదైన ఉపాధి కల్పించాలి. అప్పుడే శుభకార్యాలు జరుపుకునే వారికి ఉపశమనం లభిస్తుంది. – పవన్ కళ్యాణ్, ఆలూర్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్రంలోనే మొదటిసారి సర్పంచ్లు, ట్రాన్స్జెండర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహణ నకిలీల బెడద నివారించేందుకు గుర్తింపు కార్డుల జారీకి నిర్ణయం అన్ని గ్రామాల్లో వీడీసీలు అంగీకరిస్తాయా.. జిల్లాలో చర్చ -
రేబిస్ టీకాలు అందుబాటులో ఉంచాలి
సుభాష్నగర్ : కుక్కకాటుతో రేబిస్ వ్యాధి వస్తే ఆ వ్యక్తి తిరిగి కోలుకోలేడని, వ్యాధి సోకకముందే అరి కట్టాలని ప్రభుత్వ వైద్య కళాశాల (మెదక్) కమ్యూనిటీ మెడిసిన్ హెచ్వోడీ, ప్రత్యేకాధికారి డాక్టర్ వినోద్ పేర్కొన్నారు. వ్యాధి నివారణకు అవసరమైన ఏఆర్ఐ టీకా మందు, ఇమ్యూనోగ్లోబులిన్ అన్ని పీహెచ్సీల్లో నిల్వ ఉంచుకోవాలన్నారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం పీహెచ్సీ, సీహెచ్సీల డాక్టర్లు, నర్సింగ్ అధికారులకు ‘కుక్క కాటు – నిర్వహణ, ఏఆర్వీ’పై శిక్షణనిచ్చారు. 0, 7, 28 రోజుల్లో టీకా ఇవ్వాలని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాలున్నా ముందు జాగ్రత్తగా ఏఆర్ఐ టీకా ఇవ్వాలని సూచించారు. డీఎంహెచ్వో రాజశ్రీ, డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్వోలు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ గురువారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాతా శిశు ఆరోగ్య సేవలు, గర్భిణుల నమోదు, పీఎం సురక్షణ మాతా అభియాన్, జీవనశైలి వ్యాధులు తదితర కార్యక్రమాలపై కమిషనర్ వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రాజశ్రీ, డీటీసీవో దేవీ రాజేశ్వరి, డీఐవో అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వోలు తదితరులు పాల్గొన్నారు. -
నల్లమట్టి పక్కదారి!
● వాహనాలకు ‘క్యూఆర్’ నిబంధన ఉట్టిమాటే ● ‘మామూలు’గానే అధికారుల తీరు డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో తవ్వుతున్న నల్లమట్టి పక్కదారి పడుతోంది. వ్యాపారులు రైతుల పేరు చెప్పి ఇతర అవసరాలకు తరలిస్తున్నారు. వాహనాలకు క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్ నిబంధనను సైతం పాటించడం లేదు. డొంకేశ్వర్ మండలం అన్నారం, సిర్పూర్, నికాల్పూర్ ప్రాంతాల్లో నల్లమట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పంట పొలాలకు కాకుండా ఇతర అవసరాలకు పక్క దారి పట్టకుండా రెవెన్యూ ఉన్నతాధికారులు ‘క్యూ ఆర్ కోడ్’ నిబంధన పెట్టారు. తవ్వకాలు జరిగే చోట జీపీవోలను పెట్టి క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను వాహనాల అద్దాలకు అతికిస్తున్నారు. స్టిక్కర్లో రైతు పేరు, సర్వే నంబరు, ఊరు పేరు నమోదై ఉంటుంది. సంబంధిత రైతుకు కాకుండా వేరే చోట నల్లమట్టి పోస్తే వెంటనే తెలిసిపోతుంది. అయితే, గత కొన్ని రోజులుగా వాహనాలకు క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లు కనిపించడం లేదు. తవ్వకాలు జరిగే చోట జీపీవోలు ఉండడం లేదు. అధికారులతోపాటుగా జీపీవోలకు ముడుపులు అందడంతోనే నల్లమట్టి క్యూఆర్ నిబంధనలు తుంగలో తొక్కి నల్ల మట్టిని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తెర వెనుక వీడీసీల పాత్ర నల్లమట్టి తవ్వకాల వెనుక వీడీసీల పాత్ర కనిపిస్తోంది. ఓ గ్రామంలో వీడీసీ ఏకంగా వేలం నిర్వ హించగా వ్యాపారులు రూ.4లక్షలు వీడీసీకి చెల్లించి తవ్వకాలు చేస్తున్నారు. మరో వీడీసీ సభ్యులు ట్రిప్పు లెక్కన డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో వ్యాపారులు అధిక ధరలకు నల్లమట్టిని విక్రయిస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. నల్లమట్టి తరలించే వాహనాలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఉండాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. క్యూ ఆర్ కోడ్ లేకుండా వాహనాలు ఎలా బయటకు వస్తున్నాయో తెలుసుకుంటా. రైతుల పొలాలకు కాకుండా వేరే అవసరాలకు తరలించినా, కోడ్ స్టిక్కర్ లేకపోయినా ఆ వాహనాలను సీజ్ చేస్తాం. – ప్రసాద్, తహసీల్దార్, డొంకేశ్వర్ -
క్రైం కార్నర్
పెళ్లికావడం లేదని ఆత్మహత్య నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పెళ్లి కావడం లేదని మనస్తాపంతో నాగిరెడ్డిపేటకు చెందిన బూర్గుపల్లి కృష్ణ(38) బుధవారంరాత్రి గ్రామశివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణ బుధవారంరా త్రి తన బైక్పై ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రా లేదు. గ్రామశివారులోని చెట్టుకు కృష్ణ ఉరేసుకుని ఆ త్మహత్య చేసుకున్నట్లు గురువారం ఉదయం గ్రా మస్తులు గుర్తించారు.మృతుడి తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుఇన్చార్జిఎస్సైసుబ్రమణ్యచారి తెలిపారు. -
సుప్రీం తీరు్పతో ఊరట!
నిజామాబాద్● కుక్కకాటు బాధితుల మనోగతం ● వాటి దాడులు ఆగుతాయని ఆశాభావం ● జీజీహెచ్కు రోజూ కుక్కకాటుతో 10 మంది రాకనల్లమట్టి పక్కదారి! ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో తవ్వుతున్న నల్లమట్టి పక్కదారి పడుతోంది. రైతుల పేరు చెప్పి ఇతర అవసరాలకు తరలిస్తున్నారు.శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026– 8లో uనిజామాబాద్అర్బన్ : తరుచూ జనాలపై దాడులు చేస్తున్న వీధి శునకాలకు కారుణ్య మరణాలు చేపట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు సబబేనని, ఊరట కలిగిస్తోందని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. జిల్లాలో కుక్కల దాడులతో అనేక మంది గాయాల పాలయ్యారు. మరణాలు సంభవించాయి. మాక్లూర్ మండలం కల్లెడి గ్రామంలో 2023లో నిహన్ అనే ఐదేళ్ల బాలుడు తన తాతతో కలిసి బయటకు వెళ్లాడు. అంతలోనే విధి కుక్కలు దాడి చేయడంతో మరణించాడు. ● నగరంలోని గాయత్రి నగర్లో గతేడాది సెప్టెంబర్లో ఐదుగురు పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ● జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ప్రతి రోజు 10 నుంచి 15 మంది వరకు కుక్కకాటు బాధితులు వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వారం రోజుల్లో 3 నుంచి 4 వరకు కేసులు వరకు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో అనేక ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కుక్కల పట్ల జాగ్రత్త ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. కుక్కలతొ పొంచి ఉన్న ప్రమాదం జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతకు కుక్కలు సైతం తమ స్వభావాన్ని మార్చుకుంటున్నాయని, కుక్కల్లో విపరీతమైన ఇరిటేషన్ వచ్చి దాహం ఎక్కువై దాడులకు దిగబడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. గత నెలలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి కుక్కకాటుకుతో 250 నుంచి 300 మంది వరకు చికిత్స కోసం వచ్చారు. ఈ నెలలో ఇప్పటికు 267 మంది కుక్కకాటు బాధితులు ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. ● మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ఇటీవల గాయత్రి నగర్, సీతారాంనగర్ కాలనీలో విద్యార్థులపై కుక్కలు దాడులు చేశాయి. ● బోధన్ డివిజన్లోని రుద్రూర్, కోటగిరి మండల కేంద్రాల్లో కొత్త గ్రామ పంచాయతీ పాలక వర్గం వీధి కుక్కల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. రుద్రూర్లో నెల రోజుల క్రితం 50 వరకు వీధికుక్కలను పట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలించారు. వీధికుక్కల భయానికి చెక్ ఆర్మూర్టౌన్ : ఆర్మూర్ మున్సిప ల్ పరిధిలో సుమారు 1400 పైన వీధికుక్కలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 257మంది కుక్కకాటుకు గురయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కుక్క కాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి. -
కిరికిరి లేని జీపీలకే మొగ్గు!
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లాలో నాలుగేళ్ల సు దీర్ఘ కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శులకు నాలుగైదు రోజుల్లో సాధార ణ బదిలీలు జరగనున్నాయి. ఐతే, ఇటీవల ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఆప్షన్ల న మోదు ప్రక్రియలో క్షేత్రస్థాయి సమీకరణల ను బేరీజు వేసుకుని మరీ మొత్తం 171 మంది తమ ఐచ్చికాలను సమర్పించారు. నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరూ ఐదు జీపీలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకునే అవకాశం లభించగా, మెజారిటీ కార్యదర్శులు వివాదా ల్లేని స్థానాల కోసమే వెతికారు. గతంలో స ర్పంచులతో వచ్చిన విభేదాలు, స్థానిక రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చాలా జాగ్రత్త పడ్డారు. నిరంతరం సర్పంచ్లు లే దా స్థానిక నేతలతో ఘర్షణలు జరిగే పంచాయతీల జోలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. ఎలాంటి విభేదాలు లేని, అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండే మంచి పాలకవర్గం ఉన్న గ్రామ పంచాయతీలను ప్రత్యేకంగా వెతికి పట్టుకుని మొదటి ప్రాధాన్యతగా ఆప్షన్లు ఇచ్చుకున్నారు. కాగా పాలకవర్గంతో పాటు ఆర్థిక వనరులు కూడా కార్యదర్శుల ఎంపికలో కీలకపాత్ర పోషించాయి. సొంత ఆదాయ వనరులు బాగుండి, నిధుల కొరత లేని జీపీలను కార్యదర్శులు ఎక్కువగా ఎంచుకున్నారు. ఆదాయం బాగుంటే గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా చేయవచ్చని, ఎలాంటి పెండింగ్ బిల్లుల సమస్యలు రావనే ఉద్దేశంతో మంచి ఆదాయమున్న జీపీలకే జై కొట్టారు. అదే విధంగా చాలా కాలం పాటు ఇబ్బందికరమైన గ్రామాల్లో పని చేసి విసిగిపోయిన వారు ఈ బదిలీలను ఒక మంచి అవకాశంగా భావించారు. రవాణా సౌకర్యాలు బాగుండి తమ నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండే జీపీలను కూడా ఐదు ఆప్షన్లలో చేర్చుకున్నారు. కావాల్సిన జీపీలను దక్కించుకోవడానికి కొందరైతే ముడుపులు సైతం సిద్ధం చేసుకుని పైరవీలకు సైతం తెరలేపారు. మొత్తానికి ఈ బదిలీల ఆప్షన్ల సరళిని గమనిస్తే... కార్యదర్శులు ఒత్తిడి లేని పని వాతావరణం, ప్రశాంతమైన పాలకవర్గం వైపే మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది. ఆచితూచి బదిలీ ఆప్షన్లు పెట్టుకున్న పంచాయతీ కార్యదర్శులు వివాదాలు, గొడవలున్న గ్రామాలకు దూరం మంచి పాలకవర్గం, నిధులున్న పంచాయతీలపైనే దృష్టి -
జిల్లా స్థాయి ‘ప్రజా పాలన’ కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 22న నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ బుధవారం తన చాంబర్ లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలు, ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి జాబితాలు, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించేందుకు వీలుగా సమగ్ర వివరాలతో నివేదికలను అందించాలని ఆదేశించారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన పురోగతిని సమగ్రంగా ప్రదర్శించేలా నివేదికలు ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, శాఖల వారీగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, సీపీవో రతన్, డీపీఆర్వో ఎన్ పద్మశ్రీ, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ డేను వినియోగదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షులు వీఎన్ వర్మ మాట్లాడుతూ.. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యమిస్తామన్నారు. వ్యాపారాలు సరళీకృతంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పడుతున్న సవరణల కారణంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ నామమాత్రమవుతున్నా తూనికలు, కొలతల్లో వినియోగదారులు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అనంతరం డీఎస్వో కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, ఏఎస్వో అరవింద్రెడ్డి, వినియోగదారుల ఫోరం జిల్లా కోశాధికారి మహాదేవుని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఏడీఏను ఇవ్వాలని, జనవరి ఒకటవ తేదీ నుంచి పెండింగ్లో ఉన్న ఏడీఏను వెంటనే చెల్లించాలని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆల్ యూనియన్ అండ్ అసోసియేషన్స్ (ఏయూఏబీ) పిలుపు మేరకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, ఎన్ఎఫ్టీఈ ఉద్యోగులు, ఎస్ఎన్ఈఏ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు బుధవారం నగరంలోని గాంధీచౌక్లో ఉన్న సంచార్ భవన్ వద్ద ధర్నా, మానవహా రం నిర్వహించారు. బీఎస్ఎన్ఎల్లో అఫెర్టబిలిటీ కండిషన్ను తొలగించాలని డిమాండ్చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్బాబు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కే రామ్మోహన్రావు, డి సాయిలు, సాయన్న, చంద్రశేఖర్, రాజేందర్, సందీప్ రాటి, అనురాధ, లత, సుభాష్, రిటైర్డ్ ఉద్యోగులు మధుసూదన్, బాల దుర్గయ్య, గంగాధర్, పాండురంగం తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నారైల సంక్షేమానికి ప్రాధాన్యత
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): తెలంగాణలో కొత్త ఎన్నారై విధివిధానాల రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ పర్యటన కీలకంగా మారనుందని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఆంధ్రప్రదేశ్కు చేరుకుంది. మొదటి రోజు అడ్వైజరీ కమిటీ చైర్మన్ బీఎం వినోద్కుమార్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి నాయకత్వంలో ఏపీ ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కమిటీ భేటీ అ య్యింది. ఎన్టీఆర్ జిల్లా తాడేపల్లిలో ఉన్న ఏపీఎన్ఆ ర్టీ సొసైటీ కార్యాలయంలో ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్ఆర్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేమూరు విజయ్ కుమా ర్, సీఈవో కృష్ణమోహన్తో ఎన్నారై విధానాలు, పలు కీలక అంశాలపై చర్చించారు. రాబోవు రోజుల్లో తెలంగాణలో ఎన్నారై సంక్షేమానికి విధివిధానాల రూపకల్పనకు తమ పర్యటన ఎంతో దోహదపడుతుందని భూపతిరెడ్డి అన్నారు. గల్ఫ్ కార్మికులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. సమావేశంలో తెలంగాణ ఎన్నారై కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేశ్రెడ్డి, నంగి దేవేందర్రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్రావుతోపాటు ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, ప్రొఫెసర్లు జునుగురు శ్రీనివాస్, విజయ్ కొర్రా, ప్రవాసీ ప్రజావాణి కో ఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ షాపుల బంద్ విజయవంతం
నిజామాబాద్ రూరల్: ఆన్లైన్ ఫార్మసీల (ఇ–ఫార్మసీ) విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు బుధవారం చేపట్టిన మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 1400 వరకు మెడికల్ షాపులను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. నిజామాబాద్ నగరంలో పరిధిలోనే దాదాపు 700 ఔషధ దుకాణాలను మూసివేశారు. మెడికల్ షాపులు బంద్ కావడంతో ఉదయం వేళల్లో రోగులు, వారి బంధువులు మందుల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ప్రజల అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా డ్రగ్స్ కంట్రోల్ విభాగం ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏ ర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఫార్మసీల నిర్వాహకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్స్ అసోసి యేషన్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూ..ఇ–ఫార్మసీల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఆన్లైన్ సంస్థలు ఇష్టారాజ్యంగా ఇస్తున్న భారీ డిస్కౌంట్ల కారణంగా చిన్న, మధ్య తరహా మెడికల్ షావుల మనుగడ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ప్రిస్క్రిప్షన్లతో ఆన్లైన్ మందులు విక్రయించడం వల్ల యువత ప్రాణాల మీదకు వస్తోందని హెచ్చరించారు. కరోనా సమయంలో మందుల హోమ్ డెలివరీ కోసం తెచ్చిన తాత్కాలిక జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.సుధాకర్, కోశాధికారి మొర సాయిలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
‘చీతా ఫోర్స్’ మెరుపు దాడి
● ఇసుక అక్రమ రవాణాపై కొరడా ● ఒక జేసీబీ, ఐదు ట్రాక్టర్లు స్వాధీనం నందిపేట్/నవీపేట్ : ఇసుక అక్రమరవాణాపై చీతా ఫోర్స్ కొరడా ఝుళిపించింది. నందిపేట మండలంలోని తల్వేద – నవీపేట మండలం నాళేశ్వర్ మధ్య వాగులో ఇసుక తోడుతున్న ఒక జేసీబీతోపాటు తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సీజ్ చేశారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటైన చీతా టీమ్ పక్కా సమాచారం మేరకు బుధవారం దాడులు నిర్వహించింది. వాహనాలను నందిపేట్ పోలీస్స్టేషన్లో అప్పగించారు. అక్రమ ఇసుక రవాణా, ప్రకతి వనరుల దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. -
క్రైం కార్నర్
నిజాంసాగర్(జుక్కల్): ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి ఆత్మహత్యాయత్నం చేసిన మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన కుర్మ సత్యం(35) అనే వ్యక్తి మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం పురుగుల మందు సేవించిన సత్యంను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించారు. చికిత్స పొందుతున్న సత్యం పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు వద్ద వ్యక్తి ..ఎల్లారెడ్డి రూరల్: ఎల్లారెడ్డి పట్టణంలోని కో ఆపరేటివ్ బ్యాంకు వద్ద ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై రాజు బుధవారం తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని స్థానికులు సమాచారం అందించగా, ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతుడి ఫొటోను స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశామన్నారు. చివరకు మృతుడిని అడివిలింగాల గ్రామానికి చెందిన సాయిలుగా గుర్తించి బంధువులకు సమాచారం అందించినట్లు ఎస్సై తెలిపారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు భావిస్తున్నామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
క్యూ ఆర్ కోడ్ ద్వారా బస్ టికెట్ బుకింగ్ ..
● టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలో ఏర్పాట్లు నిజామాబాద్ రూరల్: టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలో డిపో బుకింగ్ కౌంటర్లలో ఇకపై క్యూ ఆర్ కోడ్ ద్వారా టికెట్లు బుకింగ్, బస్ పాస్ క్యూఆర్ కోడ్ సదుపాయం అందుబాటులోకి తీసుకచ్చినట్లు జిల్లా రీజనల్ మేనేజర్ జోస్నా బుధవా రం తెలిపారు. ఆమె మాట్లాడుతూ ప్రయాణికులు, విద్యార్థులు నగదు చెల్లింపులతో పాటు గూగుల్ పే, ఫోన్పే , పేటీఎం వంటి యూపీఐ యాప్ల ద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా టికెట్లు పొందవచ్చనన్నారు. ఈ విధానం ద్వారా చిల్లర సమస్యలు తగ్గడంతో పాటు వేగవంతమైన సేవలు అందించవచ్చన్నారు. నిజామాబాద్ రీజియన్లోని ప్రతి డిపో బుకింగ్ కౌంటర్ వద్ద క్యూ ఆర్ కోడ్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజర్ కోరారు. -
ఇటు పరిజ్ఞానం
అటు కాలక్షేపం.. బోర్లంలోని గ్రంథాలయంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు బాన్సువాడ రూరల్ : వేసవి సెలవుల్లో కొంతమంది విద్యార్థులు సరదాగా గడుపుతుంటే, మరికొంత మంది విద్యార్థులు కంప్యూటర్ విద్యపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కంప్యూటర్ శిక్షణ తీసుకుంటూ సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన మన్నె అనిల్ అనే యువకుడు గ్రామంలోని గ్రంథాలయంలో గ్రామపెద్దల సహకారంతో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో సుమారు 80 నుంచి 100 మంది విద్యార్థులు ఉదయం, సాయంత్రం బ్యాచుల వారీగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందుతున్నారు. మండల కేంద్రాలకు వెళ్లి వేలాది రూపాయలు ఫీజలు చెల్లించలేని పేద విద్యార్థులకు గ్రామంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రం వరంలా మారింది. మన్నె అనిల్ ట్రైనర్గా కంప్యూటర్ బేసిక్స్, కంప్యూటర్ స్కిల్స్, ఎం.ఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఫొటోషాప్, టైప్రైటింగ్లో శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ శిక్షణ కోసం ప్రతిరోజు ఉదయం బ్యా చ్ లో వస్తున్నా. కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ నేర్చుకుంటున్నా. ప్రస్తుతం కంప్యూటర్ పరిజ్ఞానం తప్పని సరైంది. ఉన్నత చదువుల కోసం కంప్యూటర్ కోర్సులు వచ్చి ఉండాలి. – ఎం. లోహిత మాలాంటి నిరుపేద విద్యార్థులకు అనిల్ సార్ ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ వరం లాంటింది. వేలాది రూపాయలు ఫీజు చెల్లించలేని నాలాంటి వారు ఎందరో ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఓపికతో కంప్యూటర్ జ్ఞానాన్ని అందిస్తున్నారు. – బి.షాణ్విత్ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం ఆనందంగా ఉంది. సర్పంచ్ మన్నె రమేశ్, గ్రామపెద్దల సహకారంతో శిక్షణ కొనసాగుతోంది. భవిష్యత్తులో స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ కూడా ఏర్పాటు చేస్తా. – మన్నె అనిల్, ట్రైనర్ గ్రామంలో వేసవి సెలవు లను దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరం. సెలవులను కంప్యూటర్ శిక్షణకు వెచ్చిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా. కేంద్రంలో ఏర్పాట్లు బాగున్నాయి. – కొత్త సహస్ర కంప్యూటర్ విద్యపై ఆసక్తి చూపుతున్న విద్యార్థులు ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మన్నె అనిల్ -
వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం
● కాపాడిన హోంగార్డు.. వృద్ధాశ్రమానికి తరలింపు తంగళ్లపల్లి(సిరిసిల్ల): జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు య త్నించిన ఓ వృద్ధురాలిని హోంగార్డు కాపాడి ఆశ్రమానికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లోని బోయిరగల్లీకి చెందిన జంబూక రాజగంగ(62) వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ ధర్మగుండం వద్ద బుధవారం ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గమనించిన హోంగార్డు పద్మ కాపాడి వేములవాడ చారిటబుల్ ట్రస్ట్, స్థానిక పోలీసులకు సమా చారం అందించారు. వారు వృద్ధురాలికి కౌన్సెలింగ్ ఇచ్చి తంగ ళ్లపల్లి మండలం ఓబు లాపూర్లో గడ్డం తిరుమల శ్రీనివాస్ నిర్వహిస్తున్న ‘అమ్మ అనాథ వృద్ధాశ్రమం’లో చేర్పించారు. -
పసిడి పంట ఆయిల్పామ్
36 నెలల తర్వాత.. ఆర్మూర్: వరి,మొక్కజొన్న, పసుపు వంటి సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్పా మ్ సాగు జిల్లా రైతాంగానికి కొత్త ఆశలు రేపుతోంది. ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ గ్రామంలో వజ్రం రెడ్డి అనే రైతు తన 5.20 ఎకరాల తోటలో బుధవారం మొదటి గెలల కోత పండుగలా నిర్వహించారు. హార్టికల్చర్ ఆఫీసర్ సంధ్య రాణి, ఆయిల్పామ్ క్లస్టర్ ఆఫీసర్ పురుషోతం, స్థానిక రైతులు పాల్గొని కొత్త సాగుదారులకు స్ఫూర్తినిచ్చారు. జిల్లాలో ఆయిల్పామ్ సాగు నాలుగేళ్ల్ల ప్రస్థానం.. జిల్లాలో 2022–23 సంవత్సరంలో ఆయిల్పామ్ సాగు మొదలైంది. కేవలం నాలుగేళ్ల్లలోనే రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపడంతో ఇప్పటివరకు 6,200 ఎకరాలకు విస్తరించింది. ఇందులో 1,540 ఎకరాలు ఇప్పటికే కోత దశకు చేరి, 2,200 మెట్రిక్ టన్నుల ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ దిగుబడి సాధించారు. అంతర పంటలు... ఆయిల్పామ్లో మొదటి మూడు, నాలుగేళ్ల్లు పసుపు, కూరగాయలు, బొప్పాయి, అరటి, పూల మొక్కలు, ఇతర ఆరుతడి పంటలను అంతర పంటగా వేసి అదనపు ఆదాయం పొందవచ్చు. పశుపోషణ: తోటలో కోళ్లు, మేకలు, గొర్రెలు పెంచుకోవచ్చు. వాటి నుంచి వచ్చే ఎరువును సేంద్రియ ఎరువుగా వాడుకుంటే ఖర్చు తగ్గి, నేల సారం పెరుగుతుంది. ఆయిల్పామ్ పండించడానికి ఆసక్తి ఉన్న కొత్త రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలను కల్పిస్తోంది. ఆయిల్పామ్ మొక్కలపై 90 శాతం సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్పై ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ, బీసీలు, చిన్న, సన్నకారు రైతులకు 80 శాతం సబ్సిడీని ఇవ్వనున్నారు. నిర్వహణ, అంతర పంటల కోసం మొదటి నాలుగేళ్లు ఎకరానికి రూ.4,200లను అందించనున్నారు. ఒకసారి నాటితే 25–30 ఏళ్ల పాటు ఆదాయం ఇస్తుంది. ప్రతి నెలా కోత ఉంటుంది కాబట్టి నెల నెలా రైతుకు డబ్బులు చేతికొస్తాయి. – సంధ్యారాణి, హార్టికల్చర్ ఆఫీసర్, ఆర్మూర్ ఆయిల్పామ్ మొక్క నాటిన 36 నెలలు నిండిన తర్వాత కోతకు వస్తుంది. ఆ తర్వాత ప్రతి నెలా ఒకసారి గెలల కోత తీసుకోవచ్చు. అంటే సంవత్సరం పొడుగునా రైతుకు ఆదాయం ఇచ్చే పంట ఇది. జిల్లాలో ఈ ఏడాది ఎకరాకు 4 నుంచి 7 మెట్రిక్ టన్నుల గెలలను తీసిన రైతులు ఉన్నారు. సరైన యాజమాన్యం పద్ధతులు పాటిస్తే 10–12 టన్నుల వరకు దిగుబడి సాధ్యమని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది మార్చిలో టన్నుకు రూ. 14,392 ఉన్న ధర, కేంద్రం పామాయిల్ దిగుమతి సుంకం 27.5%కి పెంచడంతో క్రమంగా పెంచింది. దీంతో ప్రస్తుత నెలలో టన్ను ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ ధర రూ.23,501 కి చేరింది. ఇదే ఇప్పటి వరకు వచ్చిన అధికమైన ధర. రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరను రూ.25 వేలకు పెంచాలని కేంద్రాన్ని కోరుతోంది. ఎకరంలో పంట పండించడానికి మొక్కలు, డ్రిప్, ఎరువులను కలుపుకొని సుమారుగా రూ.40 వేల ఖర్చు అవుతోంది. దీంట్లో సబ్సిడీ పోను రైతులకు ఆర్థిక భారం తగ్గుతుంది. జిల్లాలోని రైతుల చేతిలో ‘నల్ల బంగారం’ ఆయిల్పామ్పై 90 శాతం సబ్సిడీ.. నెల నెలా ఆదాయం జిల్లాలో నాలుగేళ్లలో 6,200 ఎకరాల్లో విస్తరణ.. టన్నుకు రూ.23,501 రికార్డు ధర ఆర్మూర్ మండలం ఫత్తేపూర్లో మొదటి గెలల కోతలు ప్రారంభించిన హార్టికల్చర్ ఆఫీసర్ -
ఊపిరి పీల్చుకున్న ఇటుకబట్టీ కార్మికులు
పెర్కిట్(ఆర్మూర్): జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి చొరవతో ఆలూర్ మండలం దేగాం, ఆర్మూర్ మండలం మగ్గిడి ఇటుక బట్టీలో పని చేస్తున్న కార్మికులకు విముక్తి లభించింది. కొన్ని సంవత్సరాలుగా ఇటుక బట్టీ నిర్వాహకుల దాష్టికానికి గురైన కార్మికులు ఎట్టకేలకు విముక్తి లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి ఆధ్వర్యంలో పోలీస్, లేబర్, రెవెన్యూ శాఖ అధికారులు మంగళవారం ఇటుక బట్టీలపై తనిఖీలు నిర్వహించి 112 కుటంబాలకు చెందిన సుమారు 548 కార్మికులను ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలోని ఫంక్షన్ హాల్కు తరలించారు. అనంతరం 481 మంది కార్మికులను అదే రోజు రాత్రి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు తరలించారు. నెల్లూరుకు చెందిన 37 మంది, తమిళనాడుకు చెందిన 30 మంది కార్మికులకు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వసతి కల్పించారు. బుధవారం ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్సైలు కార్మికుల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. బట్టీలో కార్మికులు అనుభవించిన కష్టాలు, యజమానులు హింసించే తీరును అధికారులకు వివరించారు. కార్మికుల వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యానారయణ గౌడ్ తెలిపారు. అలాగే ఆర్మూర్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి కార్మికులు వసతి పొందుతున్న పాఠశాలకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకుల ఆకృత్యాలు అంతా ఇంతాకాదు.. ఇటుక బట్టీల్లో యజమానులు తిరుపతి రెడ్డి, కిరణ్ రెడ్డి, మళ్లికార్జున్ రెడ్డిలు వేకువ జామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వెట్టి చాకిరీ చేయించేవారని కార్మికులు గోడు వెల్లబోసుకున్నారు. ఇటుకల తయారీలో లక్ష్యం చేరుకోక పోతే తీవ్రంగా హింసించేవారన్నారు. చేసిన కష్టానికి ప్రతి సోమవారం రూ.300 నుంచి 500 వెల కడుతూ చీటి రాసి ఇచ్చేవారని, డబ్బులు మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. కిరాణ, కూరగాయల వ్యాపారులకు చీటిని చూపిస్తే సరిపడా సరుకులు ఇచ్చేవారని తెలిపారు. ఎప్పుడు లెక్కలను తారుమారు చేస్తూ కార్మికులే అప్పుగా ఉన్నట్లు చూపించే వారన్నారు. దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తే కొట్టేవారన్నారు. అలాగే తాము పారిపోకుండా ప్రతిరోజు ఒక కుటుంబం నుంచి ఒకరిని ఇతర చోట బందీగా ఉంచేవారన్నారు. కార్మికులకు విముక్తి లభించడంతో దేగాంలో ఖాళీగా కనిపిస్తున్న గుడారాలు ఇటుక బట్టీ కార్మికుల నుంచి ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు నిర్వాహకులపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు.. కార్మికులను బానిసలుగా చేసుకుని ఇటుక బట్టీ వ్యాపారం చేస్తున్న తిరుపతి రెడ్డి, కిరణ్ రెడ్డి, మళ్లికార్జున్ రెడ్డిలపై బాల కార్మికుల వినియోగ చట్టం, బాండెడ్ లేబర్ అబాలిషన్ చట్టం వంటి పలు కేసులు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయన గౌడ్ తెలిపారు. అనారోగ్యంతో ఉన్నా పని చేయాల్సిందే.. అనారోగ్యానికి గురైనా బలవంతంగా పని చేయించే వారు. ఇటుకల తయారీ ఆలస్యమైతే పైశాచికంగా హింసించేవారు. లెక్కలు తారు మారు చేస్తూ ఎప్పుడూ బాకీల కిందే ఉంచుతూ పని చేయించేవారు. కుటుంబానికి ఒకరిని నిర్బంధించి బానిసలుగా పని చేయించారు. అధికారుల చొరవతో సొంత రాష్ట్రం వెళ్తుండడం ఆనందంగా ఉంది. – కన్యప్పన్, దేగాం ఇటుక బట్టీ కార్మికుడు, తమిళనాడు కార్మికులను నెల్లూరుకు తరలించిన అధికారులు మిగతా వారి ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు -
జనగణన ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్అర్బన్: జన గణనలో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా గంగస్థాన్ ఫేజ్ –1 లో పద్మజ అనే మహిళ ఇంటిని సందర్శించారు. ఎన్యుమరేటర్గా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగిని భారతి గుర్తింపు కార్డును తనిఖీ చేశారు. జన గణన కోసం వెళ్లే సందర్భంలో ప్రతి ఎన్యుమరేటర్ క్యూ.ఆర్ కోడ్ తో జారీ చేయబడిన ఐడీ కార్డును తప్పనిసరిగా ధరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంటి యజమానులు, కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే తమ ఇళ్లకు జన గణన కోసం వచ్చే ఎన్యుమరేటర్ ఐడీ కార్డును పరిశీలించిన తరువాతే అనుమతించాలని కలెక్టర్ సూచించారు. ఎన్యుమరేటర్ అడిగే వివరా లను తెలిపి సహకరించాలని కోరారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నగర పాలక సంస్థ ఈఈ శ్రీకాంత్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు ఉన్నారు. -
విద్యాశాఖలో బదిలీలు
ఖలీల్వాడి: జిల్లా విద్యాశాఖలో ఉద్యోగుల బదిలీ లు జరగనున్నాయి. క్షేత్రస్థాయి నుంచి అధికారుల వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. ఈనెల 31లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నిజామాబాద్ కలెక్టరేట్ సమీకృత భవనంలో ఉదయం 11 గంటల నుంచి బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. వివిధ పోస్టుల్లో బదిలీలు.. విద్యాశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్టినేటర్లకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్లు, సూపరిన్టెండెంట్లు, వివిధ ఉద్యోగులు వరంగల్లోని ఆర్జెడీలో దరఖాస్తు చేశారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేయనున్నారు. ఆలాగే జిల్లా స్థాయి పోస్టుల్లో ఉన్న అధికారులు హైదరాబాద్లోని పాఠశాల డైరెక్టరేట్లో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 25 వరకు కౌన్సెలింగ్ పూర్తి చేశారు. వీరి బదిలీలు ఆన్లైన్లో జరగనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మొత్తం ఉద్యోగుల్లో 40 శాతం మందిని మాత్రమే బదిలీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ఈనెల 15 వరకు ఉద్యోగుల నుంచి ఐదు ఆప్షన్లతో దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 16 నుంచి 24 వరకు దరఖాస్తుల పరిశీలన, కౌన్సెలింగ్ నిర్వహణ ఉంటుంది. ఈనెల 25 నుంచి 31 వరకు బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారు. ఉత్తర్వులు విడుదలైన మూడు రోజుల్లో బదిలీ అయిన ఉద్యోగులు పోస్టింగ్ ప్రదేశాల్లో విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. బదిలీలకు అర్హతలివే.. ఉద్యోగ కనీస సర్వీసు: ఈ ఏడాది జనవరి 1 నాటికి ఒకే చోట కనీసం మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి. గరిష్ఠ సర్వీసు: ఒకే చోట నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగిని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. మినహాయింపు: వచ్చే ఏడాది మే 31లోగా ఉద్యోగ విరమణ పొందేవారు అభ్యర్థిస్తే తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రాధాన్యత: భార్యాభర్తలైన (స్పౌజ్కేసులు) ఉద్యోగులు, 70 శాతం వైకల్యం పైబడిన దివ్యాంగులు, వితంతువులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు బదిలీలలో ప్రాధాన్యం ఉంటుంది. -
ప్రభుత్వ శాఖలలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 34 నుండి 44 ఏండ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం సరైంది. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. వయో పరిమితి పెంచడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా ప్రతి ఏడాది ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఆలస్యం చేయడం వలన కోచింగ్ సెంటర్స్ లలో లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయి. – కె.మనోజ్, పీజీ పూర్తి అయింది -
..............
నిజామాబాద్వెట్టిచాకిరిని వాతావరణంఉదయంనుంచే భానుడి ప్రతాపం మొదలవుతుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత కొనసాగనుంది. వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది.ఎన్నారైల సంక్షేమానికి..కొత్త ఎన్నారై పాలసీ విధివిధానాల రూపకల్పనలో ఏపీ పర్యటన కీలకంగా మారనుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026– 8లో uభారతలక్ష్మి,న్యాయమూర్తి● ఎప్పుడో బ్రిటిష్ కాలంనాటి మాదిరిగా నిషేధిత వెట్టిచాకిరి చేయించే పరిస్థితులు ఇప్పుడు ఉండటం విచారకరం. అలాంటి వ్యవహారాలు చేస్తే ఎంతటివారైనా శిక్షార్హులే. జిల్లా కేంద్రానికి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఆలూర్ మండలం దేగాం, ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామాల్లో ప్రధాన రహ దారి పక్కనే ఇటుక బట్టీల్లో నీటి, వసతి, మరెలాంటి సౌకర్యాలు లేకుండా కార్మికులను నిర్బంధించి పని చేయిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు ఫిర్యాదులు వెళ్లాయి. న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు తాజా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాం. ఇటుక బట్టీల నిర్వాహకులతో స్థానిక పోలీసు, రెవెన్యూ, కార్మిక శాఖల అధికారులు మిలాఖత్ కావడంతో ఎవరికీ చెప్పకుండా ఈ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.రేకుల గదుల్లో బంధించేవారు..ఇటుక బట్టీల్లో ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనులు చేయిస్తున్నారు. కార్మికులు పారిపోకుండా ఉండేందుకు గాను వారి పిల్లలను గాలి, వెలుతురు లేని ఇరుకై న రేకుల గదుల్లో బంధించారు. తాగునీరు లేదు. తగిన ఆవాసం లేకపోవడంతో ప్లాస్టిక్ కవర్ల డేరాల్లో ఉంటున్నారు. ఇక తల్లిదండ్రులను పిల్లలతో పడుకోన్విరు. పైగా క మ్యూనికేషన్ లేకుండా ఫోన్లు లాక్కున్నారు. ఆధార్ కార్డులు తీసుకున్నారు. పిల్లలతో పనులు చేయిస్తున్నారు. చిన్నారులకు విద్య సౌకర్యం లేదు. పెద్దల కు, పిల్లలకు వైద్యం చేయించరు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ పనులు చేయిస్తున్నారు. ఆస్పత్రికి వెళి తే నిఘా పెడుతున్నారు. పిల్లలతో పనులు చేయించి వారానికి కేవలం రూ.500 మాత్రమే ఇస్తున్నారు.రక్తం వచ్చేలా కొట్టేవారు..భార్యాభర్తలు కలిసి రోజుకు 2 వేల ఇటుకలు తయారు చేస్తే వారానికి రూ.3 వేలు మాత్రమే వేతనంగా ఇస్తున్నారు. ఐదు రోజుల బాలింతతో సైతం పనులు చేయించారు. గత ఐదేళ్లుగా తమ పిల్లలను తమ గ్రామాల్లోని బంధువులు చూడలేదని కార్మికులు ఆవేదన చెందారు. వాలి, కల్పన, అంజయ్య, వెంకటేష్ అనే మేసీ్త్రలు తమను రక్తం వచ్చేలా కొట్టేవారని బాధిత కార్మికులు చెప్పడం బాధ కలిగించింది.● ప్రతివారం ఒక మహిళ వస్తే ఆమె వద్ద మాత్రమే కూరగాయలు, సరుకులు కొనాల్సిన పరిస్థితి కల్పించారు. స్థానిక పోలీసులతో యాజమాన్యాలకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఏమీ చేయలేక కార్మికులు భయపడ్డారు. ఇక ఇటుక బట్టీల్లో పనులు లేని సమయంలో సమీప పొలాల్లో పనులు చేయించి ఆ వచ్చిన డబ్బులను ఇటుక బట్టీల నిర్వాహకులే తీసుకునేవారు.పిల్లలను చంపేస్తామని బెదిరింపులు..పనులు చేయకుండా పారిపోతే పిల్లలను చంపేస్తామని బెదిరించారు. ఇప్పటికీ ఆ బట్టీల్లో నలుగురు మరణించారు. మరణించివాళ్లలో ఒక బాలుడు ఉన్నాడు. మరణించిన వాళ్ల మృతదేహాలు ఏమి చేశారో కూడా ఇప్పటికీ తెలియని పరిస్థితి. అన్ని అంశాలపై పూర్తి వివరాల కోసం తహసీల్దారును విచారణకు ఆదేశించాం. ఎలాంటి విషయంలోనైనా సరే బాధితులు తమ సమస్యలు పరిష్కారం కాకుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఫిర్యాదులు చేయవచ్చు. ఇప్పటికే జిల్లాలో అనేక వీడీసీల బాధితుల సమస్యలు పరిష్కరించాం.కార్మికులకు విముక్తి కల్పించడంసంతోషంగా ఉంది..రెస్క్యూ ఆపరేషన్ చేసి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 474 మందిని విముక్తం చేయడం సంతోషంగా ఉంది. ఈ ఆపరేషన్ రెస్క్యూను జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. వందల మందికి వెట్టిచాకిరి నుంచి విముక్తి కలిగించడం చాలా సంతృప్తినిచ్చింది. బాధితులందరినీ ఆర్మూర్కు తరలించి పూర్తి వివరాలు సేకరించి, కలెక్టర్ సహకారంతో ప్రత్యేకంగా ఏడు ఆర్టీసీ బస్సుల్లో వారి స్వస్థలాలకు తరలించాం. ఆయా రాష్ట్రాల్లోని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలకు పూర్తి వివరాలు పంపించి వీళ్ల పునరావాసం కోసం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తోంది.మూడు ఇటుక బట్టీల్లో వెట్టి నుంచి బాధితులను విముక్తి చేయడంతో మరో ఇటుక బట్టీ నుంచి మరో 150 మంది కార్మికులు బయటకు వచ్చారు. జిల్లాలోని మిగిలిన ఇటుక బట్టీల్లో వెట్టి చాకిరి చేస్తున్న వారిని సైతం వాళ్ల స్వస్థలాలకు పంపిస్తాం. 20 మందికి కార్మిక శాఖ నుంచి లైసెన్సులు తీసుకుని వందలు, వేలమందితో పనులు చేయిస్తుండడం దారుణం. ఇదిలా ఉండగా ఒక సర్వే నంబరులోని పట్టా భూముల్లో అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూముల్లో బట్టీలు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వీటిపై దృష్టి సారించాల్సి ఉంది.అధికార యంత్రాంగం పట్టించుకోకపోతే న్యాయసేవాధికార సంస్థకుఫిర్యాదు చేయొచ్చుఇటుక బట్టీల్లో రెస్క్యూ ఆపరేషన్నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిది474 మంది వెట్టిచాకిరి బాధితులను వాళ్ల స్వస్థలాలకు పంపించాంప్రభుత్వ భూముల్లోనే ఇటుకబట్టీలు నిర్వహిస్తున్న వైనంజిల్లా న్యాయసేవాధికార సంస్థచైర్పర్సన్, జిల్లా జడ్జి భారతలక్ష్మితో ‘సాక్షి’ ఇంటర్వ్యూప్రస్తుత కాలంలో వెట్టిచాకిరిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి స్పష్టం చేశారు. మంగళవారం ఆర్మూర్, ఆలూర్ మండలాల్లోని ఇటుక బట్టీల్లో భారతలక్ష్మి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 474 మంది వెట్టిచాకిరి కార్మికులకు విముక్తి కల్పించారు. ఈ నేపథ్యంలో ఆమె ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే..– సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
ఉద్యోగార్థులకు ఊరట
● క్రమబద్ధంగా నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్లుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంచడంపై అత్యధిక మంది ఉద్యోగార్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అయితే నోటి ఫికేషన్లు వెంటనే ఒక క్రమపద్ధతి ప్రకారం ఇవ్వా లని కోరుతున్నారు. వయోపరిమితి పెంచడంతో ఒకవైపు సంతోషం ఉన్నప్పటికీ ఏటా కొత్తగా వస్తున్న ఉద్యోగార్థుల నుంచి తమకు మరింత పోటీ ఎదురవుతుందని ఇప్పటికే ఏళ్లతరబడి ప్రిపేరవుతున్న నిరుద్యోగులు అంటున్నారు. కొత్తగా వస్తున్న పట్టభద్రులు సైతం తమకు మరింత పోటీ ఉంటుందంటున్నారు. త్వరగా జాబ్ నోటిఫికేషన్లు వేయాలి ప్రభుత్వ ఉద్యోగాలకు వ యోపరిమితి పెంచడం మంచిదే కానీ, ఉద్యోగా ల నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నేళ్ళు వయో పరిమి తి పెంచితే ఏం లాభం? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాన న్న ఉద్యోగాల విషయం ఏమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు వేయకపోవడం వల్లనే నిరుద్యోగుల వయో పరిమితి దాటిపోతోంది. – బి.శివ, తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్. ఉద్యోగ అర్హత వయసు పెంచడం ఒక వరమే ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే వారి అర్హత వయ సు 44 వరకు పెంచడం ఒక వరమే. ఎంతోమంది డిగ్రీ పేజీలు చదివి నోటి ఫికేషన్ లేక ఇంటి వద్ద ఉంటూ పనులు చేసుకుంటున్నారు వారికి అదృష్టం పరీక్షించుకునే అవకాశం దక్కింది. – జక్కం అశోక్, మోర్తాడ్ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ నియామాకాల్లో వయో పరిమితిని పదేళ్ల పాటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయం. పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం రాక పోవడంతో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వయో పరిమితి దాటిన నిరుద్యోగ యువతీ యువకులకు మంచి అవకాశం లబిస్తుంది. – మాగిడి రాఘవేందర్, నిరుద్యోగి నిరుద్యోగులకు భరోసా కల్పించాలి వయోపరిమితి పెంచడమే కాకుండా నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా నిరుద్యోగ భృతి నెలకు రూ.4000 ఇవ్వాలి. ఇప్పటికే పిల్లల్ని కుటుంబాన్ని వదిలి కోచింగ్ సెంటర్ల వైపు వెళ్లటం లక్షలాది రూపాయలు ఖర్చు అవుతోంది. సమయానికి నోటిఫికేషన్లు విడుదల చేయాలి. – ప్రియాంక, బీఎడ్ కంప్లీట్ -
మా పదేళ్ల కుమారుడిని బంధించారు..
● ఉప్పాల సీనమ్మ, లక్ష్మయ్య దంపతులు నెల్లూరు జిల్లా ఎడవలూరు మండలం ఊటుకురుకు చెందిన ఉప్పాల సీనమ్మ, లక్ష్మయ్య దంపతులు మాట్లాడుతూ ఇలా చెప్పారు. మేము రూ. 60 వేల అడ్వాన్సు తీసుకుని తిరుపతి రెడ్డికి చెందిన ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నాము. మేము ఎక్కడికి పారిపోతామోనని తిరుపతి రెడ్డి మనుషులు మా పదేళ్ల కుమారుడు శ్రీనును వారికి చెందిన దేగాం గ్రామంలో ఉన్న మరో ఇటుకల బట్టిలో పనికి పెట్టుకున్నారు. మా కుమారున్ని మా వద్దకు రానివ్వడం లేదు. మా కుమారుడిని మాకు అప్పగించండి. -
వేర్వేరు కారణాలతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
ఎల్లారెడ్డి: అనారోగ్య కారణాలతో మనస్థాపానికి గురైన వృద్ధుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన రైతు ఏముల చిన్న లింగయ్య (71) కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని పస్క పోచమ్మ ఆలయ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పురుగుల మందు సేవించి.. నవీపేట : మండలంలోని బినోల గ్రామానికి చెందిన పాతర్ల నవీన్ (28) అనే యువ రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. బినోల శివారులోని తన పొలంలో మ ధ్యాహ్న సమయంలో మద్యం సేవించిన తర్వాత తాను పురుగుల మందు తాగినట్లు సోదరుడు శ్రీధర్కు నవీన్ ఫోన్ లో సమాచారమిచ్చాడు. హుటాహుటిన నవీన్ వద్దకు వెళ్లిన శ్రీధర్ అపస్మారకస్థితిలో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సాయంత్రం మృతి చెందాడు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి కుమారుడు వర్షిత్(4), కూతురు పురక్షిత(3) ఉన్నారు. -
ఉపాధి కూలీలకు పంచాయతీల అండ!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు భానుడి భగభగలు పెరిగిపోతుండడంతో ఏకంగా 45 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పనులకు వెళ్లే కూలీల ఆరోగ్యరక్షణ కోసం గ్రామ పంచాయతీలు, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టా రు. జిల్లాలో 545 గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ పనులు కొనసాగుతుండగా.. నిత్యం 67 వేల మంది కూలీలు పనులకు వస్తుండగా, వారి తో పూడికతీత పనులు చేయిస్తున్నారు. ఉదయం 9 గంటలకే భానుడు ప్రతాపం మొదలవుతోంది. దీంతో ఉదయం 6 గంటలకే పనులకు వచ్చినా రెండో ఫొటో కోసం కూలీలు మధ్యాహ్నం 12గంటల వరకు ఉండాల్సి వస్తోంది. దీంతో ఎండదెబ్బ తగలకుండా కూలీలను కాపాడేందుకు పనులు జరిగే ప్రాంతాల్లో తాత్కాలిక నీడ కోసం ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీల తరఫున సర్పంచులు ప్రత్యేక చొరవ తీసుకుని కూలీల కోసం చల్లని తాగునీరు, మజ్జిగను అందుబాటులో ఉంచుతున్నారు. ఎండ తీవ్రతకు కూలీలు నీరసపడకుండా ఉండేందుకు కొందరు సర్పంచులు స్వ చ్ఛందంగా కూల్ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. అదే విధంగా వడదెబ్బ తగలకుండా కూలీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. దాహం వేసినా, నీరసంగా అనిపించినా వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు. వడ దెబ్బబారిన పడకుండా సర్పంచులు, అధికారులు స్పందించి తమకు అన్ని వసతులు కల్పిస్తుండడంపై ఉపాధి కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీడ వసతితోపాటు చల్లని మజ్జిగ, అల్పాహారం అందిస్తుండడంతో తాము ధైర్యంగా పనులకు రాగలుగుతున్నామని కూలీలు అంటున్నారు. కూలీల రక్షణకు ప్రాధాన్యత కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధిహామీ పని ప్రదేశాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎండ తీవ్రత 45 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో కూలీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఉదయం పూటనే పనులు త్వరగా ముగించేలా పని వేళల్లో మార్పులు చేశాం. గ్రామ పంచాయతీలు, సర్పంచులు ముందుకు వచ్చి చల్లని మజ్జిగ, కూల్డ్రింక్స్, అల్పాహారం అందజేస్తుండడం అభినందనీయం. – బూక్యా లింగం, ఎంపీడీవో, డొంకేశ్వర్ పని ప్రదేశాల్లో నీడనిచ్చే షెడ్ల ఏర్పాటు కూలీలకు మజ్జిగ, బిస్కెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ ఎండ తీవ్రత నేపథ్యంలో సర్పంచులు, అధికారుల చర్యలు -
వేర్వేరు చోట్ల గుర్తుతెలియని మృతదేహాలు..
ఆర్మూర్టౌన్: పట్టణంలోని గుండ్ల చెరువు పక్కన ఉన్న గుట్ట ప్రాంతంలోని ఖాళీ స్థలంలో గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ మంగళవారం తెలిపారు. స్థా నికులు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలాన్ని ప రిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ లో భద్రపరిచామన్నారు. మృతి వయస్సు 40 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై బూడిద కలర్ చొక్కా, నీలం రంగుప్యాంటు, జాజు కలర్ బూట్లు ఉన్నాయని వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. కామారెడ్డి క్రైం: పట్టణంలోని రైల్వే ప్లాట్ఫామ్ సి మెంట్ బల్లపై పడుకున్న గుర్తుతెలియని మహిళ (యాచకురాలు) అక్కడే మృతి చెందింది. మృతదే హం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, మృతురాలి వయస్సు 25 నుంచి 30 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై నీలి రంగు పంజాబీ డ్రెస్ ఒంటిపై ఉందని రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నామన్నా రు. మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మా ర్చురీకి తరలించామని, మృతురాలి వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు. రాంచంద్రాపల్లి శివారులో.. మాక్లూర్: మండలంలోని రాంచంద్రాపల్లి శివారులో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై రాజశేఖర్ మంగళవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 60 ఏళ్లు ఉంటుందని, మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతుడి సంబంధీకులు ఉంటే 87126 59846, 87126 59731 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
నిజామాబాద్
ఎన్సీఎస్ఎఫ్ను బెల్లం ఫ్యాక్టరీగా మార్చేందుకు కృషి వాతావరణం ఉదయంనుంచే భానుడి ప్రతాపం మొదలవుతుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత కొనసాగనుంది. వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది. ఫిర్యాదు అందిన వెంటనే.. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలని సీపీ సాయి చైతన్య అన్నారు. బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026– 8లో uమగ్గిడి గ్రామంలోని ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు.. నిజామాబాద్ లీగల్: జిల్లాలోని గోదావరి నది ఒడ్డున ఉన్న ఆలూరు మండలం దేగాం, ఆర్మూరు మండలం మగ్గిడి గ్రామాలు అవి. ఈ గ్రామాల్లోని ఇటుక బట్టీల్లో కొన్నేళ్లుగా సుమారు వెయ్యి మంది కార్మికులు వెట్టి చాకిరీ చేస్తూ కట్టు బానిసలుగా బతుకుతున్నారు. ఈ కష్టాలకు తాళలేక ఎవరైనా కా ర్మికులు ఎదురు ప్రశ్నిస్తే వారిపై పైశాచికంగా దాడి చేయడం, ఆడా, మగా, పిల్లలు అన్న తేడా లేకుండా మట్టిలో వేసి పశువులను కొట్టినట్టుగా కొట్టడం చేస్తూ వారి పిల్లలను మరో బట్టిలో తమ వద్ద బానిసలుగా పెట్టుకుంటారు. ఈ దాష్టికాలను స్థానిక పో లీసు, లేబర్, రెవెన్యూ, మైన్స్ అధికారులకు ఫిర్యా దు చేస్తే వారికి సైతం లంచాలు ఇచ్చి బట్టీ యజ మానులు తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు. తిరిగి లేబర్లను వారితోనే భయపెట్టిస్తారు. దీంతో కార్మికులు యజమానులకు భయపడి గొడ్డుచాకిరీకి అలవాటు పడిపోయారు. ఇంత చేసినా వారికి రెండు పూటల తిండి దక్కేది కాదు. చివరికి బాబు అనే కార్మికుడు ధైర్యం చేసి తెలంగాణ హై కోర్టులోని రాష్ట్ర లీగల్ సర్వీసు అథారిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో కార్మికులందరీ వెట్టి చారికీ విముక్తి కలిగింది. జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి అధికారుల బృందంతో మంగళవారం దేగాం, మగ్గిడి గ్రామాల్లోని ఇటుక బట్టీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు ఐదారువందల కార్మికులకు విముక్తి కల్పించారు. ఆర్మూర్ కు చెందిన తిరుపతి రెడ్డి, కిరణ్ రెడ్డి, మల్లిఖార్జున రెడ్డిలు ఇట్టుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల నుంచి దాదాపు వెయ్యి మంది వరకు లేబర్లను తీసుకువచ్చి వారితో తెల్లవారు మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 20 గంటల పాటు పనిచేయిస్తున్నారు. వారికి ఎటువంటి సదుపాయాలు కల్పి ంచడం లేదు. ఈ తనిఖీల్లో నెల్లూరు జి ల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్మికులు తమ కష్టాలను జిల్లా జడ్జితో పాటు అధికారులకు విన్నవించారు. తాము ఈ ఇటుకబట్టీల్లో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, ఏటా శీతాకాలంలో వచ్చి ఎండకాలం చివరి వరకు ఇటుక తయారీ పనిచేస్తున్నామని తెలిపారు. ఇక్కడి యాజమాన్యాలు తమ కు అడ్వాన్సులు ఇచ్చి ఇక్కడికి తీసుకువచ్చి తక్కువ వేతనాలకు పనిచేయించుకుంటున్నారని వాపోయారు. తమ హక్కులపై మాట్లాడితే ప్రాణాలు తీ స్తున్నారని, ఇప్పటి వరకు ఇక్కడ దాదాపు నలుగురు కార్మికులు ఇక్కడే చనిపోయారని, వారి శవాలను సైతం ఏమిచేసారో తెలియదని బాబు వాపోయాడు. దీంతో జిల్లా జడ్జి ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యు, కార్మిక శాఖ అధికారుల బృందం ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న అక్కడ ఉన్న ఐదారు వందల కార్మికులకు విముక్తి కల్పించారు. కార్మికులకు ఆ ర్మూర్లోని ఓ ఫంక్షన్ హాలులో వసతి కల్పించారు. వేతనాలు ఇప్పించి వారి స్వగ్రామాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. తనిఖీల్లో ఆర్మూర్ సబ్–కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి టి శ్రీదేవి, ఆర్మూర్ ఏసీపీ మధుసూదన్రెడ్డి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రావణి పాల్గొన్నారు. కాలాపానీలా.. జిల్లాలో ఇటుక బట్టీల్లో చాలీచాలని కూలీలతో వెట్టిచాకిరీ చేస్తున్న సమారు ఐదారు వందల మంది కార్మికులకు జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి విముక్తి కల్పించారు. మగ్గిడి, ఆలూర్ గ్రామాల్లో ఇటుక బట్టి యాజమానులు, కార్మికులతో 20 గంటల పాటు పనిచేయించుకుని చాలీచాలని కూలీలను వారికి ఇస్తున్నారు. కార్మికులు తిరగబడితే వారిని గొడ్డునుబాదినట్టు బాదేవారు. వారి పిల్లలను తమకు సంబంధించిన ఇతర బట్టీల్లో నిర్బంధించారు. ఓ కార్మికుడు రాష్ట్ర న్యాయసేవ సంస్థను ఆశ్రయించడంతో చివరికి వారికి విముక్తి కలిగింది. ఇటుక బట్టీల్లోని ఐదారువందల కార్మికులకు విముక్తి అధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా జడ్జి భారత లక్ష్మి పదిహేనేళ్ల్లుగా బానిసలుగా బతుకుతున్న నెల్లూరు జిల్లా కార్మికులు రోజుకు ఇరవై గంటలు పని చేయాల్సిందే.. ప్రశ్నిస్తే బంధించి పాశవికంగా దాడులు.. ఆడా, మగా, పిల్లలని కనికరం చూపకుండా మట్టిలో వేసి కొట్టి హింసించడం నలుగురు కార్మికులు చనిపోయారు.. వారి శవాలను ఏం చేశారో..: కార్మికుల ఆవేదన మానవ హక్కులను కాలరాస్త్తున్నారు ఇటుకబట్టీల్లో యాజమాన్యా లు మానవహక్కులను కాలరాస్తూ లేబర్లతో ఇష్టారీతిన పనిచేయించుకుంటున్నారు. ఇరవై మందికి లేబర్ లైసె న్సు తీసుకుని వెయ్యి మందితో పనిచేయింటుకుంటున్నారు. ఇక్కడి బట్టీల్లో కార్మికులకు సరైన ఆహారం, వైద్యం, వసతి సదుపాయం లేదు. గర్భిణులు, పిల్లలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. వీరికి కనీస సదుపాయాలు లేవు. – భారతలక్ష్మి, జిల్లా జడ్జి జీవీఎన్ -
చక్కని నైపుణ్యాలు
చిట్టి చేతులు..బీబీపేట : వేసవి సెలవులు వృథా కాకుండా విద్యార్థుల్లోని నైపుణ్యాలు, వారిలోని సృజనాత్మకతను బయటికి తీసేందుకు బీబీపేట టీఎస్ఎన్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల వేదిక అయింది. పాఠశాలలో అగస్థ్యా ఫౌండేషన్ వేసవి కాల ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా రాణి అనే టీచర్ను నియమించి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతోపాటు ఇతర పాఠశాలల విద్యార్థులూ తరగతులకు హాజరవుతున్నారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు పలు రంగాలలో ప్రావీణ్యం పొందుతున్నారు. విద్యార్థులకు కావాల్సిన సామగ్రి సైతం పాఠశాల తరఫున సమకూరుస్తున్నారు. పేయింటింగ్, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కంప్యూటర్, చెస్, క్యారం, డిజైనింగ్ తదితర వాటిపై శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు వాటిపై మక్కువ పెంచుకొని టీచర్ చెప్పే సలహాలతో నేర్చుకుంటున్నారు. ఎండలు మండుతున్న వేళలో విద్యార్థులు ఇంటి దగ్గర ఎండలో ఆడుకుంటూ ఇబ్బందులు పడకుండా ప్రత్యేక శిబిరానికి పంపించేందుకు తల్లిదండ్రులు సైతం ఇష్టపడుతున్నారు.శిక్షణలో పాల్గొంటున్న విద్యార్థులు సృజనాత్మకత పెంపొందేలా ‘అగస్థ్య’ వేసవి శిక్షణ శిబిరం బీబీపేట టీఎస్ఎన్ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహణ డ్రాయింగ్, పేయింటింగ్, కంప్యూటర్లో ప్రత్యేక కోర్సులు -
గాలివాన బీభత్సం..
● నేలవాలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు ● పలు చోట్ల దెబ్బతిన్న ఇళ్లు, లేచిపోయిన రేకులు డిచ్పల్లి (మోపాల్)/ధర్పల్లి/ నిజామాబాద్ రూరల్ : ధర్పల్లి మండలంలో, మోపాల్ మండలంలోని మంచిప్ప, భైరాపూర్ గ్రామాల్లో మంగళవారం సా యంత్రం వర్షం, భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గ్రామాల్లోని భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రెండు గ్రామాల్లో కలిపి దాదాపు 15 ఇళ్లు కూలిపోగా, పలుచోట్ల పైకప్పు రేకులు గాలిలో లేచి పడ్డాయి. 50 పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మంచిప్ప, భైరాపూర్లో 11కేవీ లైన్ తీగలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. భారీగా వీచిన ఈదురు గాలులకు రేకులు లేచిపోవ డంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వారికి ప్రభుత్వ భవనాలు, బంధువులు ఇళ్లలో సర్పంచులు కెతావత్ శాంత వసంత్, తూర్పు రాజమణి, అధికారులు పునరావాసం కల్పించారు. అక్కడ క్కడా స్వల్పంగా కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసింది. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే.. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బయల్దేరిన ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి విషయం తెలిసిన వెంటనే విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. మంచిప్ప సర్పంచ్ గంగామణిరాజేశ్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్తులు ఆందోళన చెందొద్దని, నష్టపోయిన వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
బాన్సువాడ రూరల్: ఎండవేడిమి తట్టుకోలేక స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్ళిన ఓ యువకుడు నీటికుంటలో మునిగి ఊపిరాడక మృతి చెందిన ఘటన సోమేశ్వర్ గ్రామంలో చోటుచేసుకుంది. కోటగిరి మండలం హంగర్గాఫారం గ్రామానికి చెందిన యువకుడు షేక్ అయాన్(22) జీవనోపాధికోసం ప్రతి రోజు బాన్సువాడలో సెంట్రింగ్ పనులకు వస్తుంటాడు. మంగళవారం బాన్సువాడకు వచ్చిన అయాన్ స్నేహితులైన ఎండీ ముఖ్తార్, ఎండీ రెహాన్, ఎండీ సోహెల్తో కలిసి సోమేశ్వర్ శివారులోని స్టోన్క్రషర్ల వద్ద మైనింగ్ కోసం తీసిన గుంతలో స్నానానికి వెళ్లాడు. కుంటలో ఈతకొడుతూ లోతైన ప్రాంతానికి వెళ్లిన అతడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు, చుట్టుపక్కల వారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రెస్క్యూటీం సహాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడి తండ్రి చాంద్పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 275 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత బోధన్ టౌన్ (బోధన్) : పట్టణంలోని శ్రీనివాస నగర్ కాలనీ లో ఉన్న సాయి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మి ల్లుపై పోలీసులు మంగళవారం రాత్రి పోలీసులు దాడి చేసి 275 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. రెండు డీసీఎంలలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించామని పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. బియ్యంతోపాటు వాహనాలను సీజ్ చేశామన్నారు. -
తెగిన వెట్టి సంకెళ్లు..
న్యాయసేవ సంస్థకు ఫిర్యాదు చేసిన కార్మికుడు బాబు ఇటుక బట్టీల్లోని ఐదారువందల కార్మికులకు విముక్తి అధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా జడ్జి భారత లక్ష్మి పదిహేనేళ్ల్లుగా బానిసలుగా బతుకుతున్న నెల్లూరు జిల్లా కార్మికులు రోజుకు ఇరవై గంటలు పని చేయాల్సిందే.. ప్రశ్నిస్తే బంధించి పాశవికంగా దాడులు.. ఆడా, మగా, పిల్లలని కనికరం చూపకుండా మట్టిలో వేసి కొట్టి హింసించడం నలుగురు కార్మికులు చనిపోయారు.. వారి శవాలను ఏం చేశారో..: కార్మికుల ఆవేదన -
బోధన్వాసికి అమెరికా పీహెచ్డీ
బోధన్: పట్టణంలోని గంజ్ ప్రాంతానికి చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కామేపల్లి సత్యనారాయణ, నాగవర్ధిని దంపతుల కుమారుడు సాయికృష్ణ అమెరికా దేశంలోని కొలంబియా యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ పొందారు. నాలుగు రోజుల క్రితం కొలంబియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పట్టా అందుకున్నారు. ‘వ్యాపార సంస్థల నిర్ణయాలు–ఒక దేశం ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాలు’ అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించారు. సాయికృష్ణ బోధన్లోని విజయ సాయి హైస్కూల్లో పదోతరగతి, హైదరాబాద్లో ఐఐటీ రామయ్య అకాడమీలో ఇంటర్ విద్యను పూర్తి చేశారు. ముంబైలో ఐటీ చదివి, 2016లో అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేశారు. ‘ఆరోగ్య మహిళ’ను పక్కాగా నిర్వహించాలి నిజామాబాద్ రూరల్: ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం పక్కాగా నిర్వహించాలని డీఎంహెచ్ రాజశ్రీ అన్నారు. నగరంలోని సీతారాంనగర్ కాలనీలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులకు రక్తహీనత, పోషకాహరంపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఎండకాలం నేపథ్యంలో వడదెబ్బ కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నారని సిబ్బందిని అభినందించారు. వైద్యాధికారిణి ప్రత్యూష , పీహెచ్ఎన్ ప్రమీలారాణి, ఏఎన్ఎంలు, ఆశాలు ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష ఇందల్వాయి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మిట్టపల్లి గ్రామానికి చెందిన ఒకరికి న్యాయస్థానం ఏడు రోజుల జైలుశిక్ష విధించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తిని జిల్లా స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట మంగళవారం హాజరు పర్చగా న్యాయమూర్తి అహ్మద్ సదరు వ్యక్తికి శిక్ష విధించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. -
అత్యవసర మందులు లభించే ప్రదేశాలు
నిజామాబాద్ రూరల్ : మెడికల్ దుకాణాల బంద్ నేపథ్యంలో బుధవారం అసోసియేషన్ భవనంలో అత్యవసర మందుల సరఫరాకు ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. సంప్రదించాల్సిన నంబర్లు.. బి.గంగాధర్ 9848390388 బి.మురళి 9381741474 పెంటి రాజు 9885255801 పి.రాజేందర్ 9440577140 కిరణ్ 9948502161 గంగోత్రివేణు 8686799766 ఎండీ జయిమ్ 8341053588 ఇప్తాకర్ 7893202273 ఏపీ వెళ్లిన ఎన్నారై కమిటీ డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): గల్ఫ్ ఎన్నారై పాలసీ రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు బయల్దేరింది. సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ యాత్రను ప్రారంభించారు. కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఈ బృందానికి నాయకత్వం వహించారు. కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించి గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం అమలుచేస్తున్న కార్యక్రమాలపై అధ్యయనం చేస్తుంది. ఏపీ వెళ్లిన వారిలో కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావుతోపాటు ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, వలంటీర్ కర్రి పద్మారాణి, ప్రొఫెసర్లు జునుగురు శ్రీనివాస్, విజయ్ కొర్రా, ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. పీహెచ్సీల్లో ఎన్సీడీ పరీక్షల సంఖ్యను పెంచాలి డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ (ఎన్సీడీ) పరీక్షలు చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 50 శాతం కన్నా తక్కువగా నిర్వహించారని, వీహెచ్ఆర్లో లేని జనాభాకు సైతం ఎన్సీడీ పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్వో సిబ్బందిని ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలోని జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలతో జాతీ య ఆరోగ్య కార్యక్రమాలపై డీఎంహెచ్వో మంగళవారం జూమ్ ద్వారా సమీక్షించారు. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్తో బాధపడే రోగుల డాటాను సేకరించి వ్యా లిడేషన్ చేయాలన్నారు. అధికారులందరూ సమయపాలన పాటిస్తూ కిందిస్థాయి సిబ్బంది సమయపాలన పాటించేలా చూ డాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలు, జీవనశైలి వ్యాధుల పరీక్షలు తదితర వారిపై ప లు సూచనాలు చేశారు. జిల్లాలో క్షయ రహి త గ్రామాల సంఖ్యను పెంచాలన్నారు. డీటీసీవో దేవి నాగేశ్వరి, డీఐవో అశోక్, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ సికిందర్ నాయక్, వైద్యులు సమత, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. విచారణకు హాజరయ్యేనా? కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో దాఖలైన పరువునష్టం కేసు బుధవారం విచారణకు రానుంది. అయితే ఆయన విచారణకు నేరుగా హాజరవుతారా లేదా అన్న అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన పరువుకు భంగం కలిగించేలా ఎమ్మెల్యే కేవీఆర్ అసత్య ఆరోపణలు చేశారంటూ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తనయుడు మహమ్మద్ ఇలియాస్ ఇటీవల హైదరాబాద్లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం.. విచారణ నిమిత్తం మే 20వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. బుధవారం కేసు విచారణ ఉండడంతో నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. -
బాట్లకు తుప్పు.. కాంటాల ట్యాంపరింగ్
● తూనికలు, కొలతలపై అధికారుల నామమాత్రపు తనిఖీలు ● నేడు అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ డేనిజామాబాద్ రూరల్: కిరాణా దుకాణం నుంచి బంగారం షాపు వరకు ప్రతీది తూకం వేసిన తర్వాతే వినియోగదారులు కొనుగోలు చేస్తుంటారు. సాంకేతికత పెరిగినా... పలుచోట్ల ఇంకా పాత పద్ధతిలోనే తూనికలు, కొలతలు కొనసాగుతున్నాయి. డిజిటల్ తూకాలు వచ్చినా అరిగిన తూకం బాట్లు, రాళ్లు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. దీంతో వినియోగదారులు మోసపోతున్నారు. నేడు అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. నకిలీ తూకాలు, ఎలక్ట్రానిక్ కాంటాల ట్యాంపరింగ్, సున్నితమైన ఎలక్ట్రానిక్ కాంటాల వాడకంతో అవకతవకలకు అవకాశం ఉంది. ఎక్కువ వాడకంతో తూకం బాట్ల అరుగుదల, గాలి తేమతో తుప్పుపట్టడం, కావాలనే కొందరు వ్యాపారస్తులు అరుగు తీయడం, ఎలక్ట్రానిక్ కాంటాల ట్యాంపరింగ్తో తక్కువ తూకాల్ని ఎక్కువగా చూపడంతో వినియోగదారులు మోసపోతున్నారు. తనిఖీలు తప్పనిసరి.. వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు లీగల్ మెట్రా లజీ ఇన్స్పెక్టర్లు ప్రతి సంవత్సరం తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. కిరాణ, బంగారం, కూరగాయలు తదితర విక్రయాలు నిర్వహించే తూకాలను పరిశీలించి స్టాంపింగ్ వేయాలి. కానీ, అధికారుల తనిఖీలు అంతంత మాత్రంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొనుగోలుదారులు సైతం సరైన తూకం ఉంటేనే వస్తువులు తీసుకోవాలి. అనుమానం వస్తే వెంటనే లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులను లేదా వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది.అమ్మకందారులు నమ్మకంగా వ్యవహరించాలి. బాట్లకు బదులు రాళ్లు వేసి తూకం వేస్తున్నారు. అవి సరైన బరువు ఉన్నాయో లేదో తెలియదు. వినియోగదారులను మోసం చేస్తే సహించం. నిజాయితీగా అమ్మకాలు చేపట్టాలి. –సాంబరాజు చక్రపాణి (వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి) -
చికిత్స పొందుతూ ఒకరు మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై మహేందర్ సోమవారం తెలిపారు. ఈ నెల 15న రాత్రి గాంధారికి చెందిన పత్తి దేవేందర్ (38), పనుకంటి భాస్కర్ సదాశివనగర్ మండలం బొపల్లిలో హమాలీ పనులు ముగించుకొని బైక్పై గాంధారికి వస్తుండగా పెట్రోల్ బంకు సమీపంలో కామారెడ్డి వైపు నుంచి గాంధారి వైపు వస్తున్న తూపాన్ వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో దేవేందర్కు బలమైన గాయాలు కాగా భాస్కర్కు చేతికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా, దేవేందర్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి దేవేందర్ మృతి చెందాడు. మృతుడి తండ్రి పత్తి నారాయణ ఫిర్యాదు మేరకు డ్రైవరు రమేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
కామారెడ్డి క్రైం: భారీ చోరీ కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రూ. 42.50 లక్షల వి లువైన సొత్తు రికవరీ చేయడంతోపాటు 32 కేసు లు, హిస్టరీ షీట్ కలిగిన నేరస్తుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర వివరాలు వె ల్లడించారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాల నీలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో రాజంపేట ఎంపీడీవో అడ్డగుల్ల బాలకృష్ణ నివాసం ఉంటున్నారు. గత నెల 11 న వైద్య పరీక్షల నిమిత్తం కుటుంబంతో కలిసి ఫ్లాట్కు తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా ఇంట్లో దొంగలు పడ్డారు. అల్మారాలో భద్రపరిచిన 33 తు లాల బంగారు ఆభరణాలు, 10.290 కిలోల వెండి వస్తువులు, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ చోరీ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు.. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నిందితుడిని కరీంనగర్ జిల్లా అశోక్ నగర్ కాలనీకి చెందిన ఠా కూర్ జగన్ సింగ్ అలియాస్ దినేశ్ సింగ్ అలియాస్ డీజే డానీ అలియాస్ దినేశ్ రాజ్ పురోహిత్గా గుర్తించారు. దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయివేటు బస్సులో వెళ్తున్నాడనే సమాచారంతో కామారెడ్డి టౌన్, సీసీఎస్ పోలీసులు దాడులు చేపట్టి జాతీయ రహదారిపై చాకచక్యంగా అదుపులోకి తీ సుకున్నారు. నిందితుడు కామారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, గోవా, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ, తాళం వేసి ఉన్న ఇళ్లను అదను చూసి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి నుంచి రూ.42.50 లక్షల విలువైన 145 గ్రాముల బంగారం, 5.700 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. 32 కేసులు, హిస్టరీ షీట్.. నిందితుడు ఠాకూర్ జగన్సింగ్ పాత నేరస్తుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 32 ఆస్తి దొంగతనం కేసులలో ప్రమేయం ఉన్న హిస్టరీ షీటర్ అని తేలింది. ఇతనికి 11 మంది సహచర నేరస్తులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో అనేకసార్లు అరెస్ట్ అయి జైలుశిక్ష అనుభవించినప్పటికీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను కరిగించి గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా విక్రయించడం లేదా ఫైనాన్స్ సంస్థల్లో కుదువ పెట్టి డబ్బు పొందేవాడు. ఆ డబ్బును వ్యసనాలకు ఖర్చు చేసేవాడు. నిందితుడిపై కరీంనగర్లో 15, సైబరాబాద్లో 10, వరంగల్లో 4, నిజామాబాద్లో 1, రామగుండం కమిషనరేట్లో 1, సంగారెడ్డిలో 1 కేసులు ఉన్నాయి. కేసు చేధించిన డీఎస్పీ మధుసూదన్, టౌన్ ఎస్హెచ్వో నరహరి, సీసీఎస్ సీఐ రామన్, ఎస్సైలు నాగరాజు, ఉస్మాన్, ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది రంగారావు, కమలాకర్, సంపత్, రాజు, గణపతి, రాజేందర్, రవి, శ్రీనివాస్, చేతన్, రాజ్వీర్, లక్ష్మీకాంత్ను ఎస్పీ అభినందించారు. భారీ చోరీ కేసును ఛేదించిన కామారెడ్డి పోలీసులు రూ. 42.50 లక్షల విలువైన సొత్తు రికవరీ నిందితుడిపై 32 కేసులు, హిస్టరీ షీట్ వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్ర -
హాలీడే ట్రిప్
ఎస్.సహస్ర ప్రకృతి 1వ తరగతి, గ్రామం: దోమకొండ, జిల్లా : కామారెడ్డి హలో ఫ్రెండ్స్... నా పేరు యశ్వర్ధన్. మాది వినాయక్నగర్, నిజామాబాద్. నేను ప్రెసిడెన్సీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ఈ వే సవి సెలవుల్లో నాన్న ప్రవీణ్లాల్, అమ్మ అనిత, తమ్ముడితో కలిసి హైదరాబాద్ సందర్శించాను. స్నో వరల్డ్, వండర్లాకు వెళ్లి ఎంజాయ్ చేశాం. అనంతరం బిర్లా టెంపుల్ సందర్శించాము. సాయంత్రం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూశాను. వేసవి సెలవుల్లో ఆట విడుపుగా ఈ చిన్నారులు ఇంజినీర్లు అయ్యారు. నైన్టీస్ కిడ్స్ అప్పట్లో పిట్టె గూళ్లు కడితే.. వీళ్లు ఏకంగా చిన్నపాటి బిల్డింగ్నే కట్టి మన్ననలు పొందుతున్నారు. ధర్మోర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదివిన సాయిబాబా ఒక చిట్టి ఇంటిని నిర్మించాడు. మట్టితో చుట్టూ ప్రహరీ, ఇల్లు, మరుగుదొడ్డి నిర్మించడమే కాకుండా ఆకర్షించేలా టైల్స్ వేశాడు. -
టూరిజం వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్అర్బన్ : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 23 వరకు టూరిజం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో సోమవారం వా రోత్సవాల పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.సంస్కృతి, సంప్రదాయాల కు, చారిత్రక ప్రదేశాలకు జిల్లా నెలవన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 23 వరకు వారోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, డీఆర్డీవో సాయాగౌ డ్, జెడ్పీ సీఈవో సాయన్న పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: రెడ్క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్పర్సన్, కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని ఎన్ఐసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెడ్క్రాస్ సభ్యత్వ నమోదు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రెడ్క్రాస్ సంస్థ సమాజ సేవలో విశిష్ట పాత్ర పోషిస్తోందని, ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతర రక్త మార్పిడి సేవలను అందిస్తూ అండగా నిలుస్తోందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సేవా సంస్థలు ముందుకు వచ్చి రెడ్క్రాస్ సభ్యత్వం తీసుకొని సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని కోరారు. సభ్యత్వ నమోదు కోసం www. redcross. cgg. gov. in వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ బుస్స ఆంజనేయులు, అదనపు కలెక్టర్లు కిరణ్కుమార్, దిలీప్కుమార్, డీఆర్వో గీత, డీఆర్డీవో సాయన్న, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డిప్యూటీ లేబర్ కమిషనర్ యాదయ్య, రెడ్క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ● ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కవితారెడ్డి సుభాష్నగర్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచడం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కవితారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక ఇంధన ధరలు పెంచడం రాజకీయ లబ్ధి కోసమే చేసిన కుట్ర అని ఆరోపించారు. డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో రవాణా చార్జీలు పెరిగి, దాని ప్రభావం నిత్యావసర సరుకుల ధరలపై పడుతుందని తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు సామాన్య ప్రజల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ కవితారెడ్డి కోరారు. నిజామాబాద్ రూరల్ : జిల్లాను స్మార్ట్ సిటీగా ప్రకటించకపోవడంలో ఎంపీ అర్వింద్ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మూడు అగ్రికల్చర్ యూనివర్సిటీలు మంజూరు చేస్తే అందులో నిజామాబాద్ జిల్లాకు ఒకటి కేటాయించారన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పట్టుదల, కృషితోనే జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల వచ్చినట్లు పేర్కొన్నారు. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చొరవతో రూ.600 కోట్లతో మూడు యంగ్ ఇండియా స్కూళ్లు మంజూరైనట్లు గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు 12 సంవత్సరాలలో జిల్లాకు ఏం తీసుకువచ్చారని ప్రశ్నించారు. ఎంపీగా అర్వింద్ నిజామాబాద్కు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంటులో పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పెండింగ్లో ఉన్నాయని విమర్శించారు. డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి గ్రామానికి చెందిన పంగెర గంగవ్వ (80) రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న సాయంత్రం పింఛన్ డబ్బుల కోసం ఇంటి నుంచి పోస్టాఫీసుకు వెళ్తూ రోడ్డు దాటుతోంది. అదే సమయంలో డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అతివేగం, నిర్లక్ష్యంతో గంగవ్వను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన గంగవ్వను జిల్లా కేంద్రంలోని ప్రగతి హాస్పిటల్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడు పంగెర భూకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చలో.. క్రికెట్ ఖేలో..
ఆర్మూర్ పట్టణంలోని మోడల్ స్కూల్ మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్ కోసం వచ్చిన విద్యార్థులు ఆర్మూర్ : రోజూ సాయంత్రం 5 గంటలు అయ్యిందంటే చాలు ఆర్మూర్ పట్టణంలోని మోడల్ స్కూల్ మైదానం క్రికెట్ స్టేడియంలా మారిపోతోంది. క్రికెట్ బ్యాట్లు, బాల్లు, 60 మంది పిల్లల అరుపులతో హోరెత్తుతోంది. ఈ సందడికి కారణం రతన్ వినోద్ వారి కొడుకులు. రతన్న్ వినోద్కు రతన్ వర్షిత్, రతన్ విజ్ఞాన్ కొడుకులు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న వీరు ఏడేళ్ల క్రితం కరోనా సమయంలో సెల్ఫోన్, టీవీకి బానిసలైపోయారు. వారిని చూసి భయపడ్డ రతన్ వినోద్ ఒకరోజు ఇద్దరి చేతిలోంచి ఫోన్ లాక్కొని, పాత బ్యాట్ తీసి ‘రండి, ఆడుకుందాం‘ అని గ్రౌండ్కు తీసుకెళ్లాడు. పిల్లలిద్దరూ మొదట మారం చేశారు. రెండు రోజులయ్యాక బ్యాటింగ్ కిక్ నచ్చింది. సిక్స్ కొడితే వచ్చే ఆనందం ముందు పబ్జీ గేమ్ దిగదుడుపే అని వారిద్దరికీ అర్థమైంది. వారి తర్వాత కాలనీలోని పిల్లలందరూ ఒక్కొక్కరుగా చేరడంతో ఆ తండ్రి కాస్తా క్రికెట్ కోచ్గా మారిపోయాడు. ఇప్పుడు 60 మందికి పైగా పిల్లలకు క్రికెట్ నేర్పిస్తున్నాడు. 5 ఏళ్ల పిల్లాడి నుంచి 20 ఏళ్ల టీనేజర్ వరకు శిక్షణ పొందుతున్నారు. ఫిట్నెస్ వచ్చింది సెల్ఫోన్ను వీడి గ్రౌండ్లో ఆడుతూ ఫిట్నెస్తో ఉన్న తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు సైతం సంతోషపడుతున్నారు. కోచ్ రతన్ వినోద్ దగ్గర కోచింగ్ సర్టిఫికెట్ లేదు. కానీ యూట్యూబ్లో చూసి బేసిక్స్ నేర్పిస్తాడు. పిల్లలు గ్రౌండ్లో ఉంటే డ్రగ్స్, చెడు అలవాట్ల వైపు వెళ్లరని అతని నమ్మకం. ఆయన వేసిన అడుగు 60 మంది పిల్లల జీవితాలను మార్చేసింది. సెలవులు రాగానే ఫ్రెండ్స్ అంతా ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారు. కానీ నాకు గ్రౌండ్లో బ్యాట్ పట్టుకోవడమే ఇష్టం. పొద్దున 6 గంటలకు లేచి ప్రాక్టీస్కు వెళ్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఫోన్ చూస్తే కళ్లు నొప్పి, క్రికెట్ ఆడితే సంతోషాన్నిస్తోంది. – గౌతం గణేశ్ సింగ్, 9వ తరగతి, ఆర్మూర్ కొవిడ్ లాక్డౌన్లో కళ్ల ముందే పిల్లలు చెడిపోతుంటే చూస్తూ ఊరుకోలేక గ్రౌండ్కు తీసుకొచ్చా. వాళ్లతోపాటు కాలనీలోని మరికొంత మంది పిల్లల్ని కూడా పిలిచా. ఇప్పుడు రోజూ 60 మంది పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. సెల్ఫోన్ను మరిపించినందుకు సంతోషంగా ఉంది. – రతన్ వినోద్, క్రికెట్ కోచ్నేను చిన్న క్లాసే. అయినా ఇక్కడ అన్నయ్యలతోపాటు ప్రాక్టీస్కు వస్తున్నా. టీవీలో కార్టూన్లు చూసే బదులు, నే నే హీరోలా బ్యాటింగ్ చేయా లని ఉంది. అమ్మ ఫోన్ ఇవ్వబోతే ‘వద్దు, బాల్ ఇవ్వు’ అని అడుగుతా. క్రికెట్ ఆడితే నిద్ర కూడా బాగా పడుతుంది. – వొద్దాజి రోహన్ సూర్య, 6వ తరగతి, ఆర్మూర్ పదో తరగతికి వచ్చాను కదా అని ఫోన్న్లోనే ఉంటారని అమ్మ అనుకుంది. నేను మాత్రం కిట్ బ్యాగ్ భుజాన వేసుకొని గ్రౌండ్కు వెళ్తున్నా. స్క్రీన్ టైమ్ కంటే గ్రీన్ గ్రౌండ్ పైనే నాకు ప్రాణం. చెమట కాయలు కాసినా సరే, సెంచరీ కొట్టాలన్న కల కోసం కష్టపడుతున్నా. – రతన్ విజ్ఞాన్, 10వ తరగతి, ఆర్మూర్ అమ్మాయిలు క్రికెట్ ఏంటి అన్నారు. కానీ నేను రోజూ ప్రాక్టీస్కు వస్తున్నా. డిగ్రీ చదువుతూ క్రికెట్ ఆడుతున్నా. ఇంట్లో వాళ్లు సీరియల్స్ చూస్తుంటే నేను గ్రౌండ్లో సిక్సర్లు కొడుతున్నా. ఫోన్ లో టైమ్పాస్ కన్నా క్రికెట్లో గోల్ రీచ్ అవ్వడం ముఖ్యం అనిపించింది. – మాదిరే హాసిని, డిగ్రీ, ఆర్మూర్ మా ఇంట్లో అందరూ టీవీ సీ రియల్స్ చూస్తారు. నేను మా త్రం కోహ్లీ బ్యాటింగ్ వీడియోలు చూసి, మరుసటి రో జు నెట్స్లో ట్రై చేస్తా. ఇంటర్నెట్లో రీల్స్ చూసే టైమ్ను బౌలింగ్ ప్రాక్టీస్కు కేటాయించా. సమ్మర్ అయిపోయేలోపు బౌలింగ్ పర్ఫెక్ట్గా వేయడం నేర్చుకోవాలన్నదే నా టార్గెట్. – మూసాల శషున్, 9వ తరగతి, ఆర్మూర్ ఆర్మూర్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న చిన్నారులు ఒకరితో మొదలై.. నేడు 60 మంది పిల్లలకు కోచింగ్ -
కొడుకు పుట్టిన నాలుగు రోజులకే తండ్రి మృతి
బాన్సువాడ రూరల్ : కొడుకు పుట్టాడనే సంతోషంలో ఉన్న తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన బీర్కూర్ మండలం అన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండలం పొతంగల్ ఖుర్దు గ్రామానికి చెందిన చాకలి శేఖర్(28) బీర్కూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన చాకలి కృష్ణవేణి ఇంటికి ఇల్లరికం వచ్చాడు. మృతుడికి భార్య లావణ్య, ఏడాదిన్నర కూతురు ఉండగా నాలుగు రోజుల క్రితమే కుమారుడు జన్మించాడు. సొంతూరు పొతంగల్ ఖుర్దుకు వెళ్లి ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై అత్తారింటికి వస్తుండగా కొల్లూర్ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా ఎదురుగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో చాకలి శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అత్త కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
సన్నద్ధతను చాటిన మాక్ ఎక్సర్సైజ్
సుభాష్నగర్: వరదలు, విపత్తులు సంభవించిన సమయాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా సోమవారం చేపట్టిన మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా కొనసాగింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమాలు విపత్తుల నిర్వహణలో అన్ని విధాలుగా సమాయత్తమైన విషయాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించాయి. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్, ఖిల్లా రఘునాథ చెరువు వద్ద ఏకకాలంలో విపత్తుల నిర్వహణపై మాక్ ఎక్సర్సైజ్ చేపట్టారు. రఘునాథ చెరువు వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ ఇ లా త్రిపాఠి స్వయంగా పర్యవేక్షించారు. జీజీహెచ్ లో నిర్వహించిన మాక్ ఎక్సర్ సైజ్ను ఆర్డీవో రా జేంద్రకుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ నాగమోహన్ తదితరులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించి జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిరణ్కుమార్, దిలీప్కుమార్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, 7వ పోలీస్ బెటాలియన్ అధికారి సత్యనారాయణ, మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఆంజనేయ స్వామి, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్కుమార్, ఆర్అండ్బీ ఈఈ రంజిత్, శివకుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. పర్యవేక్షించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి జీజీహెచ్, రఘునాథ చెరువు ప్రాంతాల్లో కొనసాగిన మాక్ డ్రిల్ సేవలు అందించిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్సీసీ, ఆపదమిత్ర వలంటీర్లు -
బాల భవన్లో జాదూ సందడి
అబ్బుర పరచిన ఇంద్రజాలం నిజామాబాద్ రూరల్ : వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా జిల్లా బాల భవన్ ప్రాంగణంలో సోమవారం జాదూ యుగంధర్ రంగనాథ్ ఇంద్రజాల ప్రదర్శన చిన్నారులందరినీ మాయలోకంలోకి తీసుకుపోయింది. చప్పట్లు కేరింతలతో బాల భవన్ కోలాహలంగా మారిపోయింది. ప్రదర్శన ఆరంభం నుంచి చివరి వరకు నవ్వులు, అరుపులతో దద్దరిల్లింది. చేతిలో ఆస్ట్రిచ్ పసుపురంగు ఈకతో వేదిక మీదికి వచ్చిన జాదూ రంగనాథ్ దాన్ని మ్యాజిక్ స్టిక్గా మార్చటం, రంగురంగుల కర్చీఫ్ నుంచి రకరకాల పూలను సృష్టించాడు. వివిధ రూపాల్లో మ్యాజిక్ చేస్తూ చిన్నారులను ఆకట్టుకున్నారు. అనంతరం బాల భవన్ సూపరింటెండెంట్ మల్లాది ఉమాబాల ఇంద్రజాలికుడు రంగనాథ్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ పర్యవేక్షకుడు ప్రభాకర్, వెంకటలక్ష్మి, పుష్పలత, మాధవి, శ్వేత, రిచ, మాధవి, నవీన్, రాంచందర్, గణేశ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూ చించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదా య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 150 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు కిరణ్కుమార్, దిలీప్కుమార్, డీఆర్వో గీత, డీఆర్డీవో సాయన్న, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా ఈ నెల 22న నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. నిజామాబాద్అర్బన్: నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పో లీస్ ప్రజావాణికి 42 ఫిర్యాదులు వచ్చినట్లు సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు తరలి వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. -
రూ.1265.98 కోట్లు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలోని స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలకు ఈ ఏ డాది దండిగా రుణాలు అందనున్నాయి. మహిళ లు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో సెర్ప్ అధికారులు ఈసారి 21,473 సంఘాలకు రూ.1265,98కోట్ల రుణాలు ఇవ్వాలని భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ వార్షిక రుణ ప్ర ణాళిక ఖరారు కాగా, మండలాల వారీగా కూడా లక్ష్యాలను నిర్ధేశించారు. గతేడాది రూ.1,228 కోట్లకు గాను లక్ష్యానికి మించి రూ.1,260 కోట్ల రుణాల పంపిణీ అలాగే రికవరీ చేయడంలో నిజామాబాద్ జిల్లాకు స్టేట్ ఫస్ట్ అవార్డు లభించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఏకంగా రూ.37 కోట్లను అదనంగా పెంచారు. దీంతో ప్రతి సంఘానికి గతంలో కన్నా ఎక్కువ మొత్తం చేతికి అందే అవకాశం లభించింది. పెరిగిన నిధులతో మహిళలు కొత్త ఉపాధి మార్గాలను ఎంచుకోవడానికి, ఉ న్న వ్యాపారాలను మరింత విస్తరించుకోవడానికి వీలు పడనుంది. ఏర్గట్ల 327 18.13నందిపేట్ 1,260 75.31మోపాల్ 816 46.72జక్రాన్పల్లి 855 44.15 సిరికొండ 974 56.41నవీపేట్ 1,201 65.55రుద్రూర్ 467 34.01మోస్రా 322 26.56ఎడపల్లి 938 65.06మాక్లూర్ 1,078 69.85ఇందల్వాయి 652 36.53ఆర్మూర్ 967 55.45కమ్మర్పల్లి 843 47.49భీమ్గల్ 1,112 63.61మండలం సంఘాలు లక్ష్యం (రూ.కోట్లలో) చందూర్ 212 10.70వర్ని 701 55.23బాల్కొండ 634 36.76ముప్కాల్ 407 21.72మోర్తాడ్ 671 35.34కోటగిరి 919 51.66ధర్పల్లి 861 49.66వేల్పూర్ 962 55.68 ని.రూరల్ 641 35.56రెంజల్ 797 50.27మెండోరా 453 24.94బోధన్ 1,299 73.40డిచ్పల్లి 1,104 60.09ఈ ఏడాది బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యం ఖరారు గతేడాదితో పోలిస్తే రూ.37 కోట్లు అదనం మండలాల వారీగా టార్గెట్ కేటాయింపువందశాతం అందజేస్తాం గత ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలను అందజేసి స్టేట్ ఫస్ట్ వచ్చాం. అదే ఉత్సాహాంతో ఈ ఏడాది కూడా అందరి సహకారంతో బ్యాంకు లింకేజీ రుణాలను నూరుశాతం అందజేస్తాం. – సాయన్న, డీఆర్డీవో, నిజామాబాద్ -
జిల్లా అభివృద్ధిపై సీఎంకు చిత్తశుద్ధి లేదు
సుభాష్నగర్: మున్సిపల్ ఎన్నికల సమయంలో జి ల్లాకు రింగ్ రోడ్డు మంజూరు చేస్తానని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చినా.. తీసుకురాలేని చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులని ఎంపీ అర్వింద్ ధర్మపురి ఘాటుగా విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఏం ముఖం పెట్టుకుని తిరుగుతున్నా రని ప్రశ్నించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వా గ్దానాల అమలు, అభివృద్ధి చేయకపోతే మార్పు ఈ ప్రాంతం నుంచే ప్రారంభమవుతుందన్నారు. దేవుళ్లను మోసం చేసిన చరిత్ర రేవంత్రెడ్డిదని, రైతులు, ప్రజలను మోసం చేయడం ఆయనకు ఈజీ అని ఎద్దేవా చేశారు. ఆందోళనలకు సిద్ధం కావాలి జిల్లాకేంద్రంలో చేపడుతున్న యూజీడీ పను లు ఇప్పటివరకు 25 శాతం కూడా పూర్తి కాలేదని అర్వింద్ అన్నారు. రూ.162.50 కోట్లకుగాను కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో కేవలం రూ.10.04 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు యూజీడీ ఎప్పటికీ పూర్తి కాదన్నారు. యూజీడీ, ఓఆర్ఆర్ సా ధించుకునే వరకూ ఆందోళనలు చేపట్టాలని, అధి కార పార్టీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ప్రకటించి పసుపు రైతులకు ప్లాట్ఫాం ఇచ్చినప్పటికీ.. కార్యాలయం కోసం స్థలాన్ని కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వి మర్శించారు. ఈ విషయంలో ఉద్యమానికి సిద్ధమై న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డికి ఫోన్ చేసి స్థ లం కేటాయిస్తామని చెప్పారని, కానీ ఇంతవరకూ పురోగతి లేదన్నారు. స్థలం కేటాయించకపోతే మళ్లీ ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు. -
‘వ్యవసాయ పాలిటెక్నిక్’ను తరలించొద్దు
రుద్రూర్ : మండలంలోని అక్బర్నగర్ శివారులో ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను జగిత్యాల జిల్లా పొలాస కళాశాలలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అఖిలపక్షం నా యకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు గౌతంకుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను జగిత్యాల పొలాస కళాశాలలో విలీనం చేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రొసిడింగ్స్ జారీ చేయడం బాధాకరమని, జిల్లా విద్యార్థులకు అన్యాయం చేసే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్, తరగతి గదులు, ప్రాక్టికల్స్కు అవసరమైన వ్యవసాయ భూమి, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు తదితర అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కళాశాలను తరలించేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. వి ద్యాభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తు తం ఉన్న కళాశాలలను మూసివేసి సాంకేతిక విద్యను విద్యార్థులకు దూరం చేస్తోందని విమర్శించారు. అక్బర్నగర్ సర్పంచ్ సీతారామరాజు, ఉపసర్పంచ్ హబీబ్ ఖాన్, అంబం సర్పంచ్ గంగాధర్, జహీరాబాద్ పార్లమెంట్ దిశా కమిటీ సభ్యుడు నడిపింటి నగేశ్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు కార్తీక్, ఏఎంసీ మాజీ చైర్మన్ బి సంజీవులు, మాజీ సర్పంచ్ రామాగౌడ్, మాజీ ఉపసర్పంచ్ నీరడి శంకర్, బీఎస్పీ మండల అధ్యక్షుడు గౌతమ్, బీజేపీ నాయకులు కృష్ణంరాజు, చిన్న సాయిలు, బీఆర్ఎస్ నాయకుడు ఎండీ మతీన్, నాయకులు, విద్యార్థి సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ఏడేళ్లలో ఎంపీగా జిల్లాకు తెచ్చిందేమీ లేదు
డిచ్పల్లి : ఏడేళ్లు నిజామాబాద్ ఎంపీగా, 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ బీజేపీ పాలనలో జిల్లాకు గాడిద గుడ్డు కూడా ఇవ్వలేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఖండించారు. ఈ మేరకు సోమ వారం ఆయన ‘సాక్షి’తో మా ట్లాడారు. జిల్లాకు రింగ్ రోడ్ అనేది ఎన్నికల హామీ కాద ని.. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇక్కడి పార్టీ నాయకులు విన్నవిస్తే.. తప్పకుండా రింగ్ రోడ్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. త్వరలోనే జిల్లాకు రింగ్ రోడ్ రావడం ఖాయమన్నారు. దానిని వక్రీకరించి బీజేపీ దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ పదవి ఊడితే దానిని పొందడానికి ఎంపీ అర్వింద్.. ప్రధాని మోడీని ఇంప్రెస్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ విస్తీర్ణంలో నిజామాబాద్ కన్నా చిన్నదైనప్పటికీ స్మార్ట్ సిటీ అయ్యిందని, మరి జిల్లా ఎందుకు కాలే దో ఎంపీ చెప్పాలని ప్రశ్నించారు. జిల్లాకు తెచ్చిన పసుపు బోర్డు ఇప్పటికీ సొంత భవనానికి నోచుకోలేదన్నారు. బీసీ బిడ్డకు అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీ ఓర్వలేకే అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో దాదాపు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. -
ఆదర్శం పిలుస్తోంది..
● మోడల్ స్కూళ్లలో 1,600 ఇంటర్ సీట్లు ● కార్పొరేట్ తరహా విద్య.. ● 25వ తేదీ వరకు దరఖాస్తు గడువు ● బాలికలకు హాస్టల్ వసతి డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్మీడియట్ చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తెలంగాణ మోడల్ స్కూళ్లు/కళాశాలలు వరంలా మారాయి. మోడల్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాల్లో చక్కని ప్రతిభ కనబరుస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి ఉత్తీర్ణులైన బాలబాలికల తల్లిదండ్రులు ఆదర్శ పాఠశాలల వైపు మొగ్గు చూపుతుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తుల స్వీకరణకు ఆహ్వానిస్తున్నారు. ఒక్కో కోర్సులో 40 సీట్లు జిల్లాలో పది తెలంగాణ మోడల్ స్కూళ్లు ఉన్నాయి. డిచ్పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్పల్లి, ఆర్మూర్, బాల్కొండ, నందిపేట్, నవీపేట్, రెంజల్, వర్ని మండలాల్లో ఈ మోడల్ స్కూళ్లు/కళాశాలలున్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఏసీఈ (అక్కౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్) కోర్సులున్నాయి. ఒక్కో కోర్సులో 40 చొప్పున మొత్తం 1,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఉన్న ఎంఈసీ కోర్సును తొలగించిన ప్రభుత్వం కొత్తగా ఏసీఈ కోర్సును ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభిస్తోంది. ఈ సీట్లను భర్తీ చేసేందుకు పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం ఎంపిక చేయనున్నారు. 100 మంది బాలికలకు హాస్టల్ వసతి సైతం కల్పించనున్నారు. చుట్టు పక్కల గ్రామాల్లో కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే 9, 10, ఇంటర్ చదివే బాలికలకు భోజనం వసతి కల్పిస్తారు. తెలంగాణ మోడల్ స్కూల్/కళాశాల డిచ్పల్లి రిజర్వేషన్ల వారీగా సీట్ల వివరాలు సద్వినియోగం చేసుకోవాలి తెలంగాణ మోడల్ స్కూల్/కళాశాలలో క్రమశిక్షణతో కూడిన కార్పొరేట్ తరహా విద్యనందిస్తున్నాం. చదువుతోపాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా సిద్ధం చేస్తున్నాం. కార్పొరేట్ తరహా విద్యనందిస్తున్నాం. ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇస్తున్నాం. – పి దశరథ్, ప్రిన్సిపాల్, తెలంగాణమోడల్ స్కూల్, డిచ్పల్లికార్పొరేట్ తరహా విద్య ఎంపికై న విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఉ చిత విద్య, 100 మంది బాలికలకు బాలికల హా స్టల్లో ఉచిత ప్రవేశం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు అందజేస్తారు. అలాగే కార్పొరేట్ తరహాలో విద్యార్థులకు ఈఏపీసెట్, నీట్ కోచింగ్, జేఈఈ కోచింగ్, ఫిజిక్స్వాలా అండ్ ఖాన్ అ కాడమీ వంటి డిజిటల్ ఫ్లాట్ఫామ్లకు ఉచిత ఆ న్లైన్ యాక్సెస్ ఇస్తారు. కెరీర్ కౌన్సెలింగ్, మీడి యా అండ్ ఎంటర్టైన్మెంట్, హెల్త్కేర్ రంగాలలో వృత్తివిద్యాకోర్సులు, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్లు, పని వేళల తర్వాత వివిధ సహ పాఠ్య కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలు కల్పిస్తారు. -
నిజామాబాద్
● అధికార పార్టీ ప్రజాప్రతినిధులను నిలదీయాలి ● ఎంపీ అర్వింద్ ధర్మపురి ● ఎంపీ అర్వింద్ చిల్లర మాటలు మానుకో ● కరీంనగర్ను స్మార్ట్ సిటీ చేస్తే.. నిజామాబాద్ సంగతేంటి ● ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026ఏపీ పర్యటనకు ఎమ్మెల్యే భూపతిరెడ్డిడిచ్పల్లి: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, విధివిధానాలపై అధ్య యనం చేసేందుకు 14 మందితో కూడిన ఎన్ఆర్ఐ సలహా కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అడ్వైజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ వినోద్కుమార్ (రిటైర్డ్ ఐఎఫ్ఎస్), వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సైతం ఈ నెల 20, 21వ తేదీల్లో ఏపీలో పర్యటించనున్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ముఖ్యంగా రూ.10 లక్షల ప్రమాద బీమా (ప్రవాసాంధ్ర భరో సా బీమా), ఎన్నారై విభాగం ద్వారా 24 గంటల హెల్ప్లైన్ అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఇసుక వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ నిజామాబాద్ అర్బన్: జీపీఎస్ ట్రాకింగ్ వ్య వస్థ ద్వారా ఇసుక లోడ్ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోందని ఆన్లైన్లో టీజీఎండీసీ ప్రధాన కార్యాలయం నుంచి గమనిస్తారని, నిబంధనల మేరకు రవాణాకు అ నుమతులు జారీ అవుతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ సో మవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించబోమని, ఇసుక అక్రమ రవాణాకు అవకాశం లే కుండా సంబంధిత శాఖల ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పర్యావరణ అనుమతులు లభించిన తరువా తే పొతంగల్ మండలం హంగర్గా గ్రామ శివారులోని మంజీరా నది నుంచి ఇసుక రవాణాకు అనుమతిస్తామని తెలిపారు. వే బిల్లులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక వాహనాలకు అనుమతిస్తున్నారని చేశారు. జిల్లాలోని మిగతా ఇసుక రీచ్ల నుంచి ‘మన ఇసుక వాహనం’ ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా ట్రాక్టర్లలో ఇసుక రవాణాకు అనుమతించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని యూత్ కాంగ్రెస్ జాతీయ సెక్రెటరీ, తెలంగాణా ఇన్చార్జి రోష్ని జైస్వాల్ అన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో సోమవారం యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రోష్ని జైస్వాల్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్గౌడ్ మట్లాడుతూ.. ప్రతి కార్యకర్త యూత్ కాంగ్రెస్ బలోపేతం దిశగా అడుగులు వేయాలని, గ్రామ, మండ ల, అసెంబ్లీ కమిటీలకు ఆశావహుల పేర్లు ప్రతిపాదించాలని అన్నారు. జాతీయ అధికా ర ప్రతినిధి రాణి రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షు డు అద్నాన్, ఆదిత్య పాటిల్, గడుగు రోహి త్, కార్తీక్ యాదవ్, మహేందర్, బైండ్ల ప్ర శాంత్, మెయిన్ యూనిస్, ముబాసిర్, దినే ష్, మతీన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నంబర్ వన్సాక్షిప్రతినిధి, నిజామాబాద్: యాసంగి సీజన్ ధా న్యం సేకరణలో రాష్ట్రస్థాయిలో జిల్లా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ శరవేగంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో ఎన్ని ఇబ్బందులను, అడ్డంకులు ఎదురైనా అధికారులు వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ ఏడాది యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 4.24 లక్షల ఎకరాల్లో వరి సాగుకాగా, సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు పంట దిగుబడి సైతం పెరిగింది. ధాన్యం సేకరించేందుకు సహకార సొసైటీల ఆధ్వర్యంలో 428 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ 262, డీసీఎంఎస్ 32, మెప్మా 10 ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. సెంటర్లకు ధాన్యం పోటెత్తడంతో అందు కు తగ్గట్లుగా గన్నీ సంచులు, లారీలను ఏర్పాటు చే శారు. మధ్యలో కొంత ఆటుపోట్లు ఎదురైనా సింహభాగం ధాన్యాన్ని కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ చే యిస్తూ వెంటవెంటనే మిల్లులకు తరలించారు. జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి కొనుగోలు కేంద్రాలను రోజువారీగా పరిశీలించింది. కొనుగోళ్లను వేగవంతం చేసి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించారు. అలాగే ధాన్యం విక్రయించిన రైతులకు వెనువెంటనే చెల్లింపులు చేస్తూ వచ్చారు. దీంతో చెల్లింపుల విషయంలో రైతుల నుంచి ఎక్కడ కూడా అసంతృప్తి రాలేదు. దొడ్డు రకాలను కూడా 60,951 మెట్రిక్ టన్నులు సేకరించారు. లక్ష్యాన్ని చేరుకుంటాం యాసంగిలో నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం ధాన్యాన్ని సేకరిస్తాం. పక్షం రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయి. ధాన్యం విక్రయించిన రైతులకు వెంటవెంటనే డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అందరి సహకారంతోనే ఇబ్బందులను తట్టుకొని ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని సేకరించాం. – శ్రీకాంత్రెడ్డి, డీఎస్వో, నిజామాబాద్కొనుగోలు కేంద్రాలు 740 సేకరించిన ధాన్యం 6.08లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం విక్రయించిన రైతులు 73,016 మంది చెల్లించిన సొమ్ము రూ.1,227.29 కోట్లు (65,746 మంది రైతులకు) గతేడాది కూడా మనమే టాప్ ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా ముందుంటోంది. గతేడాది యాసంగిలో 8లక్షల మెట్రిక్ టన్నులు, వానకాలంలో 7లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఈ రెండు సీజన్లలో కూడా నిజామాబాద్ జిల్లా స్టేట్లో టాప్లో నిలిచింది. తద్వారా అధికారులకు ప్రశంసలు అందాయి. అదే ఉత్సాహంతో ఈ ఏడాది యాసంగిలో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో సేకరణ కూడా పూర్తి కానుంది. మరో లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే అవకాశం ఉంది. అలాగే పక్క జిల్లా నుంచి కూడా ధాన్యం తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ఇప్పటి వరకు 6,08,055 మెట్రిక్ టన్నుల సేకరణ సమస్యలను అధిగమిస్తూ ముందుకెళ్లిన జిల్లా యంత్రాంగం -
భగ్గుమన్న బాల్కొండ కాంగ్రెస్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: బాల్కొండ నియోజక వర్గ కాంగ్రెస్ శ్రేణులు ఇన్చార్జి సునీల్రెడ్డిపై భగ్గుమంటున్నాయి. సునీల్రెడ్డికి, పార్టీలోని సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నా యి. తాజాగా చేపట్టిన మండల అధ్యక్ష పదవుల నియామకంపై ఆగ్రహించిన సీనియర్లు.. సునీల్తో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. భీమ్గల్ లో ఆదివారం సునీల్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే మెండోరా, ముప్కాల్ మండలాల కు చెందిన సీనియర్ నాయకులు సోమవారం హైదరాబాద్కు వెళ్లి సుదర్శన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ను సైతం కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన మండలాల నాయకులు, కార్యకర్తలు సైతం పార్టీ నాయకత్వాని కి, కీలక నేతలకు ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన తమను కాదని, కొత్తగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు పార్టీ పదవులు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినాయకత్వాన్ని తప్పుదోవ పట్టించి కొత్తగా వచ్చినవాళ్లకు పదవులు ఇచ్చారంటున్నారు. నాయకుల నుంచి కార్యకర్తల వరకు.. బాల్కొండ నియోజకవర్గంలో సునీల్రెడ్డికి, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు మానాల మోహన్రెడ్డికి, ఈరవత్రి అనిల్కు, సుంకెట అన్వేష్రెడ్డితో సమన్వయం లేదనేది అందరికీ తెలిసిందే. దీంతో గత స్థానిక ఎన్నికల్లో కీలకమైన మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూ ర్, బాల్కొండ, ఏర్గట్ల మేజర్ గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ చేజార్చుకుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ చొరవ తీసుకుని సమన్వయం చేయడంతోనే భీమ్గల్ మున్సిపాలిటీలో అతికష్టం మీద కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సైతం మహేశ్గౌడ్, సుదర్శన్రెడ్డి చొరవ తీసుకుని సమన్వయం చేసి సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తేనే పార్టీ ముందుకు నడుస్తుందని కార్యకర్తలు అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చినవారికి పార్టీ పదవులు ఇవ్వడంపై సీనియర్ల గుర్రు భీమ్గల్లో నియోజకవర్గ ఇన్చార్జి సునీల్రెడ్డి దిష్టిబొమ్మ దహనం తాజాగా సుదర్శన్రెడ్డికి ఫిర్యాదు తాడోపేడో తేల్చుకుంటామంటున్న నాయకులు, కార్యకర్తలు -
భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులదే..
● సమాజంలో గురువులకు గొప్పస్థానం ● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ● ఘనంగా విద్యా విజయోత్సవం సుభాష్నగర్: విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్ త రాలను తీర్చిదిద్దే బాధ్యతను ఉపాధ్యాయులు సమ ర్థవంతంగా నిర్వర్తించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. విద్యా వారోత్సవాల ముగింపును పురస్కరించుకు ని ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యా విజయోత్సవ దినోత్సవాన్ని నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే, కలెక్టర్ ఇలా త్రిపాఠితోపాటు రా ష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యాశాఖ ప్రగతిని డీఈవో అశోక్ వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చక్కటి భవిష్యత్ను అందించాల్సిన బాధ్యత గురువులదేనని, అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవం, గొప్ప స్థానం ఉందన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్న ఫలితంగా ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తున్నాయన్నారు. జిల్లాలో ప్రభు త్వ బడుల విద్యార్థులు సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరి జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమన్నారు. భవిష్యత్లో స్థిరపడేందుకు పదోతరగతి తర్వాత ఎంచుకునే మార్గం ఎంతో కీలకమని, ఇష్టమైన సబ్జెక్టులతో కూడిన కోర్సుల్లో చేరాలన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ తన స్వీయ అనుభవాలను గుర్తు చేసుకుంటూ, అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా నిరంతర కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు నర్సయ్య, కృష్ణవేణి, డీపీఆర్వో ఎన్ పద్మశ్రీ, డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, జీఈసీవో భాగ్యలక్ష్మి, ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఆల్ఫోర్స్ విజయదుందుభి
ఖలీల్వాడి: నిజామాబాద్ ఆల్ఫోర్స్ విద్యార్థులు ఎప్సెట్ ఫలితాల్లో విజయఢంకా మోగించినట్లు కాలేజీ ప్రిన్సిపల్ విఠల్రావు తెలిపారు. ఆదివారం విడుదలైన ఎప్సెట్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు వివిధ కేటగిరిలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారన్నారు. ప్రత్యేక తరగతులు, అధ్యాపకుల కృషితో మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపా రు. సాయిబా సమ్రాన్ (5627), సీహెచ్. ప్రణవి (7921), డి.అక్షయ (8758), శ్రీవర్షిణి (9511), ఎం.యోగేష్ (10934), టి.లకిత (12227), జె.గోపిక (14202), పి.శ్రీహిత (14512), జి.లోక్య (17436), ఆర్ అపర్ణ (18552) ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి అభినందించారు. -
పరవశింపజేసే అందాలు..
ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తీరం ప్రకృతి అందాలతో అలరిస్తోంది. సాయంకాలానికి ముందు నీరు, పచ్చికబయళ్లు, నిలువెత్తున నిలిచిన తాటి చెట్లతో అలరించిన ఆ ప్రాంతం.. సూర్యాస్తమయ సమయానికి ఇలా సిందూర వర్ణంలోకి మారింది. అస్తమిస్తున్న భానుడి కిరణాలు నిశ్చలమైన నీటిలోపడగా ఆ ప్రాంతం బంగారు వర్ణంతో మెరిసిపోయింది. ఈ సుందరమైన దృశ్యాలను డొంకేశ్వర్ మండలం పాత జీజీ నడ్కుడలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వద్ద ‘సాక్షి’ కెమెరాలో బంధించింది. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
కూనలమ్మలు
కూచిపూడిఆర్మూర్: వేసవి సెలవులను వృథా చేయకుండా ఆర్మూర్లోని నటరాజ నృత్యనికేతన్ లో చిన్నారులు ఆంధ్రానాట్యం, కూచిపూడి నేర్చుకుంటున్నారు. మాడవేడి నారాయణ స్థాపించిన నటరాజ నృత్య నికేతన్లో నాట్య గురువు డాక్టర్ బాశెట్టి మృణాళిని శిష్యరికంలో సమ్మర్ క్యాంప్లో మువ్వల సవ్వడి, అభినయం, లయలతో వేదికలను ఉర్రూతలూగిస్తున్నారు. పట్టణంలోని గంగా ఆస్పత్రి సమీపంలో కళాకారులను బ్యాచులుగా విభజించి నేర్పిస్తున్నారు. చిన్నారులు గజ్జె కట్టి అబ్బురపరిచే నృత్యరీతులతో మెప్పిస్తున్నారు. నేను చాలా చిన్నదాన్ని కాబట్టి మొదట్లో భయం వేసేది. గురువు గారు ప్రోత్సహించారు. ఇప్పుడు స్టేజ్ ఎ క్కితే భయం లేదు.అందరూ నవ్వుతూ చూస్తారు. అ మ్మ ఫో న్లో వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టింది. మా చుట్టా లు అందరూ నన్ను ‘డ్యాన్సర్’ అని పిలుస్తున్నారు. – శ్రీవర్షవేసవిలో ఫ్రెండ్స్తో కలిసి ఆడదామనుకున్నా. కానీ అమ్మా, నాన్న ఆంధ్ర నాట్యం గురించి చెప్పారు. తెలిసిన వాళ్లు డ్యాన్స్ క్లాస్కు వెళ్తుంటే నేను కూడా చేరా. ఇప్పుడు నాకు డ్యాన్సే ప్రాణం అయిపోయింది. – నైనిత యూట్యూబ్లో డ్యాన్స్ వీడియోలు చూసి ఇంట్లోనే స్టెప్పులు వేసేదాన్ని. మేడమ్ దగ్గర చేరాక తప్పు, ఒప్పు తెలిసింది. ఇప్పుడు ఆంధ్ర నాట్యంలో మెళకువలు నేర్చుకుంటున్నాను. వేదికలపై నాట్యం చేసి అందరి మన్ననలు పొందాలని ఉంది. – సహస్రకూచిపూడి, ఆంధ్ర నాట్యం రెండూ వేరు అని మేడమ్ చెప్పేవరకు నాకు తెలియదు. ఇప్పుడు రెండూ వచ్చు. స్కూల్స్ ఉన్నప్పుడు రోజూ చదువులు, పరీక్షలతో గడిచి పోయేది. ప్రస్తుత వేసవి సెలవులు నృత్యంతో తెలియకుండా గడిచిపోతున్నాయి. – సుదీప్తినేను చిన్న క్లాస్. కానీ గురువు గారి సూచనల మేరకు నా ట్యం చేయడం నేర్చుకున్నా. మొదట భయమేసింది. ఇప్పుడు హాయి గా చేస్తున్నా. సెల్ఫోన్లో రీల్స్ చేయడం కాదు, స్టేజ్పైన రియల్ డ్యాన్స్ చేయా లని మేడమ్ చెప్పారు. అమ్మ, నాన్న కూడా హ్యాపీ. – సాయినేత్ర అడుగుల సవ్వడిలో ఆంధ్ర నాట్యం ఆర్మూర్లో నటరాజ నృత్యనికేతన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు ఆంధ్రనాట్యం, కూచిపూడి నేర్చుకుంటున్న చిన్నారులు -
ఆధునిక భారత్ నిర్మాణానికి రాజీవ్గాంధీ కృషి
నిజామాబాద్ రూరల్: ఆధునిక భారత దేశ నిర్మాణానికి రాజీవ్గాంధీ కృషి చేశారని, ఆ యన దూరదృష్టి నేటి యువతకు ప్రేరణగా నిలుస్తోందని డీసీసీ, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు నగేష్రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఇటీవల తమిళనాడులోని చైన్నె నుంచి బయల్దేరిన రాజీవ్ మెమోరియల్ జ్యోతియాత్రకు ఆదివారం వారు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగేశ్రెడ్డి మా ట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలను దేశం గ ర్వంగా స్మరించుకుంటోందని, ఆయన తన పాలనలో టెలికమ్యూనికేషన్, సాంకేతిక విజ్ఞానం, విద్యా రంగాల్లో కీలక సంస్కరణ లు చేపట్టి ఆధునిక భారత నిర్మాణానికి బ లమైన పునాది వేశారన్నారు. యువత సాధికారత, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాష్ట్ర గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ శేఖర్గౌడ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, డీసీసీ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్, రఘు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి టూరిజం వీక్ సెలబ్రేషన్స్ సుభాష్నగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు టూరిజం వీక్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటకశాఖ అధికా రి పవన్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎక్స్ఫ్లోర్ తెలంగాణ – ఎక్స్పీరియన్స్ ది వరల్డ్’ అనే నినాదంతో నిర్వహించనున్న వారోత్సవాల ద్వారా తెలంగా ణ రాష్ట్ర పర్యాటక వైభవం, వారసత్వ సంప ద, ప్రకృతి సౌందర్యం, పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను ప్రజలకు పరిచయం చేయ డం లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నా మని పేర్కొన్నారు. 18న యువ టూ రిజం క్లబ్ల ఏర్పాటు, పోస్టర్ విడుదల, 19న ప ర్యాటక అవగాహన ర్యాలీ, ప్రచార కార్యక్రమం, 20న హెరిటేజ్ వాక్, 21న టూ రిజం ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లతో సమావే శం, 22న స్వచ్ఛతాకార్యక్రమాలు, 23న బ్రాండ్ కిట్ పోస్టర్ విడుదల కార్యక్రమం ని ర్వహిస్తామన్నారు. పర్యాటక అభిమానులు, విద్యార్థులు, యు వత, ట్రావెల్ బ్లాగర్లు, యూట్యూబర్లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పవన్కుమార్ కోరారు. యోగా విజేతలకు బహుమతులు సుభాష్నగర్: ఎన్ఎస్సీఎన్పీఎల్ ఆధ్వర్యంలో ఇటీవల నగరంలోని కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాసన పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. నగరంలోని సుభాష్నగర్లో ఉన్న ఆరోగ్య రక్ష యోగా నేచర్ కేర్ సెంటర్లో ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించగా.. ముఖ్యఅతిథిగా ఎన్ఎస్సీఎన్పీఎల్ ప్రతినిధులు హి తిన్ బీమాని, సీహెచ్ రజినీకాంత్, డీవైఎస్వో పవన్కుమార్, ఆరోగ్య రక్ష నిర్వాహకులు డాక్టర్ ఐశ్వర్య కాలే, సీహెచ్ గంగాధ ర్, యోగా గురువులు కమలవాణి, గాయ త్రి, లోహిదాస్ హాజరయ్యారు. పోటీలకు 250 మందికిపైగా హాజరయ్యారని, రెండు విభాగాల్లో పోటీలు నిర్వహించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశామని యోగా అసోసియేషన్ సెక్రెటరీ గంగాధర్ తెలిపారు. క్రీడాకారులు, యోగా గురువులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఉల్లాసంగా... ఉత్సాహంగా
● వేసవి శిబిరంలో విద్యార్థుల ఆటపాటలు దోమకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవికాల శిబిరంలో విద్యార్థులు ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సందడి నెలకొన్నది. ఆటపాటలు, చిత్రలేఖనం, యోగా తదితర విద్యార్థి మనో వికాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 100 మంది విద్యార్థులు రోజూ వస్తున్నట్లు ఉపాధ్యాయులు చెప్తున్నారు. యోగా, మెడిటేషన్, ఇండోర్ గేమ్స్, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు అల్పాహారం అందిస్తున్నారు. గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్, చెలిమి కార్యక్రమ ఇంచార్జి ఎస్. వెంకటేశ్వర్లు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇంచార్జిగా నవీన్, ఆర్ట్స్ ఇంచార్జిగా నర్సింలు, యోగా మెడిటేషన్ ఇంచార్జిగా త్రివేణి, పాటలు సాంస్కృతిక కార్యక్రమాల ఇంచార్జిగా కమలాకాంత్ వ్యవరిస్తున్నారు. మనోహరాబాద్లోని వ్యవసాయ కుండీలో స్నానం చేస్తున్న పిల్లలు జక్రాన్పల్లి: భానుడి భగభగ మంటున్నాడు. ఎండలు తీవ్రత మరింత పెరిగింది. జనాలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో పిల్లలు వ్యవసాయ కుండీలలో స్నానాలు చేయడానికి పరుగులు పెడుతున్నారు. గ్రామాల్లోని రైతులు నీటి నిల్వ కోసం వ్యవసాయ పంట పొలాల వద్ద ఏర్పాటు చేసుకున్న కుండీల్లో జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్...నా పేరు మద్దికుంట చారుశ్రీ. టేక్రియాల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న జిల్లా యో గా భవన్లో నిర్వహించిన కళలు–సాంస్కృతిక కార్యక్రమంలో జానపద నృత్యం ప్రదర్శించాను. నా నృత్య ప్రదర్శనను మెచ్చి డీఈవో సార్ ప్రథమ బహుమతి అందజేసి ప్రశంసించారు. -
ఎప్సెట్లో జిల్లా విద్యార్థుల సత్తా
ఖలీల్వాడి: ఎప్సెట్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఫలితాలు ఆదివారం విడుదలకాగా, వెయ్యిలోపు ర్యాంకులను ఇద్దరు కై వసం చేసు కున్నారు. ఎస్ఆర్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థి జక్క గురుమోహన్చరణ్ 369వ ర్యాంకు, జెట్టి శ్వేత అగ్రి, ఫార్మ విభాగంలో 351వ ర్యాంకు సాధించారు. అలాగే ఆరుగురు విద్యార్థులు ఐదువేల లోపు ర్యాంకులు సాధించారు. కాకతీయ విద్యార్థులు ఇద్దరు, వెక్టార్ కళాశాల విద్యార్థులు ముగ్గురు 5వేల లోపు ర్యాంకులు సాధించారు. ఆల్ఫోర్స్ విద్యార్థులు వివిధ కేటగిరిల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఎలక్ట్రిక్ వాహనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సుభాష్నగర్: ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలనే ఉద్దేశంతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదివారం ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్)లో ప్రయాణించారు. నగరంలోని పలు కార్యక్రమాలకు ఈవీ కారులోనే హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణ నేపథ్యంలో క్రూడ్ ఆయి ల్ ధరలు పెరుగుతున్నాయని, వాటిని ని యంత్రించేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారన్నారు. మనదేశం 85 శాతం పెట్రోల్, డీజిల్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రధాని పి లుపును పాటించాలని ధన్పాల్ కోరారు. శ్వేత (351వ ర్యాంకు – అగ్రి, ఫార్మా)గురుమోహన్చరణ్ (369వ ర్యాంకు) -
గల్ఫ్లో గతి తప్పుతున్న జీవితాలు
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలోని డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లికి చెందిన మొద్దు గంగాధర్ స్టీల్ ఫిక్సర్గా పని చేసేందు కు ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన దుబాయికి వెళ్లాడు. ఈనెల 4న కనిపించకుండా పోయిన అతడి ఆచూకీ 7వ తేదీన లభించింది. గంగాధర్ దుబాయికి వెళ్లక ముందు డైజోఫాం, క్లోరోఫామ్, అల్ప్రా జోలం వంటి మత్తు పదార్థాలు కలిపిన కల్లును సేవించేవాడని తెలిసింది. ఉన్నట్టుండి కల్లుకు దూరం కావడంతో మానసిక అస్థిరతకు గురయ్యాడు. ప్రస్తుతం అతడు దుబాయిలో సొంత బావమరిది భానుచందర్ సంరక్షణలో ఉన్నాడు. పనిచేసే పరిస్థితిలో లేని గంగాధర్ను తిరిగి ఇంటికి పంపిస్తే డీ అడిక్షన్ సెంటర్కు తీసుకువెళ్లి చికిత్స చేయించుకుంటామని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ పరిస్థితి ఒక్క గంగాధర్కు ఎదురైంది కాదు. ఎంతో మంది స్వగ్రామంలో ఉన్నప్పు డు మత్తు పదార్థాలు కలిపిన కల్లును సేవిస్తూ గల్ఫ్ దేశాలకు వెళ్లిన తరువాత మానసిక అస్థిరతకు గురవుతున్నారు. పనిచేసే చోటు లేదా ని వాసం ఉన్న చోటు నుంచి కనిపించకుండా పో తున్నారు. మరి కొందరైతే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నా రు. ఇటువంటి కేసులు వందల సంఖ్యలో న మోదవుతున్నాయి. ఇక్కడ మత్తుకు బానిసలై గల్ఫ్ వెళ్లిన తరువాత వారి జీవితాలు గతి తప్పుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, ని ర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన వందలాది మంది కొన్ని రోజులపాటు కనిపించకుండా పోవడం, మరికొందరు ఏదో ఒక విధంగా మరణించడం వంటి ఘటనలు చోటు చేసు కున్నాయి. గల్ఫ్ వెళ్లే ముందు మెడికల్ టెస్టులు చేయించుకుంటున్నా తమలోని లోపాలను బయటపడనివ్వకుండా కొంత మంది మేనేజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు విధా నం వల్ల వలస కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్వగ్రామంలో కల్తీ కల్లుకు అలవాటుపడి గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు మానసిక అస్థిరతకు గురై తప్పిపోతున్న వారు కొందరు.. బలవన్మరణాలకు పాల్పడుతున్న ఇంకొందరు -
ప్రజల కోసం పని చేస్తేనే ఆదరణ
● కోర్ కమిటీ సమావేశంలో ఎంపీ అర్వింద్ ● నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ తీరుపై అసహనం? సుభాష్నగర్: ‘ప్రజా సమస్యలపై ప్రభుత్వ తీరు ను నియోజకవర్గ నాయకులు ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమా లు మచ్చుకు కూడా నిర్వహించడం లేదు. ప్రజల కోసం పని చేసినప్పుడే వారి ఆదరణ దక్కుతుంది. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు ఆశించిన మేరకు జరగడం లేదు’ అని ఎంపీ అర్వింద్ ధర్మపురి కోర్ కమిటీ సమావేశంలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆదివారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పా ర్టీ కార్యక్రమాల నిర్వహణపై అర్వింద్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. ప్రజల ఆదరణ పొందినవారే వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా ఎంపికయ్యే అవకాశం ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, కోర్ కమిటీ సభ్యులు, ఆయా నియోజకవర్గాల నాయకులు వడ్డి మోహన్రెడ్డి, ఏలేటి మల్లికార్జున్రెడ్డి, కంచెట్టి గంగాధర్ పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
వర్ని: మండలంలోని జలాల్ పూర్ గ్రామ శివారులో గిరిజన రైతు సఖి( 52) కరెంట్ షాక్తో మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. సిద్దాపూర్ గ్రామానికి చెందిన సఖి జలాల్పూర్ శివారులో సొంత పొలంతోపాటు సుమారు 20 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలు చేస్తున్నారు. ఆదివారం పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గడ్డిమందు సేవించిన వృద్ధుడు..జక్రాన్పల్లి: మండలంలోని సికింద్రాపూర్ గ్రా మానికి చెందిన పతిపాకల నడ్పి రాజన్న (70) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై మ హేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న రెండేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ ఒంటరిగా తన పాత ఇంట్లో నివసిస్తున్నాడు. కుమార్తె, కోడలు అవసరమైన సేవలు అందిస్తూ చికిత్స చేయిస్తున్నారు. ఈ నెల 12న రాజన్న గడ్డి మందును సేవించి అపస్మారక స్థితిలో ఉండగా కుటుంబసభ్యులు నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆదివారం చికిత్స పొందుతూ రాజన్న మృతి చెందినట్లు తెలిపారు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిజామాబాద్
మంచి మామిడిని.. బండ్ల మీద పసుపు రంగు మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి. కానీ మంచి మామిడిని గుర్తించాల్సిన అవసరం ఉంది. సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026– 8లో uజిల్లా కేంద్రంలోని మ్యూజియం భవనం ధ్వంసమైన కాకతీయుల కులౖదైవ విగ్రహం ఇందూరు చరిత్రకు మూలాధారం జైనతీర్థంకరుల విగ్రహంవందల సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయ కళాతోరణం సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మనదైన ఘన చరిత్రను ప్రజలకు, భవిష్యత్ తరాలకు ప్రత్యక్షంగా పరిచయం చేయాల్సిన జిల్లా కేంద్రంలోని మ్యూజియానికి తాళం పడింది. సుమారు పది సంవత్సరాలకుపైగా కాల నుంచి మ్యూజియం ఆదరణకు నోచుకోవడం లేదు. కనీసం సందర్శనకు కూడా అవకాశం లేకుండా మూసి ఉంటోంది. దేశంలోనే ఇందూరుకు సుదీర్ఘమైన చారిత్రక నేపథ్యం ఉండగా, జిల్లా కేంద్రంలోని పురావస్తు పరిశోధన శాఖ మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం ఏమిటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పురావస్తు పరిశోధన శాఖలో ఉద్యోగులు లేకపోవడం, మ్యూజియం నిర్వహణకు ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో చివరకు తాళం పడింది. ఎంతో అమూల్యమైన శిల్ప సంపద, చారిత్రక ఆధారాలు ధ్వంసమవుతున్నాయి. అలాగే బోధన్ నగరానికి సుమారు 2వేల సంవత్సరాలకు పైగా చారిత్రక నేపథ్యం ఉండగా, ఎన్నో పుస్తకాల్లో ఆధారాలు సైతం ఉన్నాయి. ఆయా ఆధారాల్లో ముఖ్యమైన జైన తీర్థంకరుడి విగ్రహం మ్యూజియం బయట నిర్లక్ష్యంగా పెట్టబడి ఉన్నది. మ్యూజియం వెనకాల ఏర్పాటు చేసిన విగ్రహాలు ఆకతాయిల చేతిలో ధ్వంసమవుతున్నాయి. అదే విధంగా జిల్లాలోని ఎన్నో చారిత్రక ప్రదేశాల్లో పలు తవ్వకాలలో లభించిన అతి పురాతన విగ్రహాలు, పనిముట్లు, చారిత్రక ఆధారాలు మ్యూజియంలో లోపల ఉన్నాయి. కానీ వాటి సందర్శన భాగ్యం ప్రజలకు కలగకపోవడం బాధాకరమని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర తెలుసుకోని జాతికి భవిష్యత్ ఉండదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను అనుసరించి కనీసం ఇకనైనా ప్రభుత్వం చొరవ చూపి మ్యూజియం తెరిపించాలని, పురావస్తు పరిశోధన శాఖలో రెగ్యులర్ ఉద్యోగులను నియమించి చరిత్రకు పూర్వవైభవం తీసుకురావాలని ప్రజలు, చరిత్ర పరిశోధకులు కోరుతున్నారు. చరిత్రను తెలియజెప్పాల్సిన మ్యూజియం మూతపడింది. ఇందూరు ఘన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియకుండా పోతోంది. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న మ్యూజియం మూతపడినా పట్టించుకునే వారు కరువయ్యారు. ఆరుబయట ఉన్న విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో దశాబ్దకాలంగా మ్యూజియానికి వేసిన తాళం అలాగే ఉంది. -
ఇందూరు చరిత్ర మ్యూజియంలోనే..
చరిత్రక నగరాల్లో ఇందూరు ప్రధానమైంది. వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవ జీవన ఆనవాళ్లు ఉన్నాయి. అంతేకాకుండా అతి పురాతనమైన జైన ఆలయాలూ నిర్మించబడ్డాయి. ఉన్నతమైన చరిత్ర కలిగిన జిల్లాలో ఉన్న పురావస్తు పరిశోధన శాఖ కార్యాలయం మూతబడడం, విశేష చారిత్రక ఆధారాలతో ఉన్న మ్యూజియం ప్రజలకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మ్యూజియాన్ని తెరిపించాలి. – కలువకోట నరేశ్కుమార్, విశ్రాంత చరిత్ర విభాగాధిపతి, గిరిరాజ్ కళాశాల మ్యూజియాన్ని తెరవాలి.. చరిత్ర మనకి ఎన్నో పాఠాలను నేర్పుతుంది. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని జాతికి భవిష్యత్ ఉండదని ఎంతోమంది చరిత్రకారులు చెప్పారు. ఎంతో ప్రత్యేకమైన ఇందూరు జి ల్లా చరిత్ర ప్రస్తుత విద్యార్థులకు, యువతకు పరిచయం లేకుండా పోయింది. ఈ కారణంగానే ఇందూరు జిల్లా చారిత్రక పరంగా వెనుకబడిపోయింది. ఈ దుస్థితి నుంచి ఈ జిల్లాను బయటకు తీసుకురావాలి. మూసి ఉన్న మ్యూజియాన్ని తెరిపించాలి. – డాక్టర్ మర్రిపల్లి భూపతి, హిస్టరీ ప్రొఫెసర్ -
ఎస్ఆర్ విజయఢంకా
ఖలీల్వాడి: ఎప్సెట్లో ఫలితాల్లో నిజామాబాద్ ఎస్ఆర్ కాలేజీ విద్యార్థులు విజయభేరి మోగించినట్లు ఎస్ఆర్ డీజీఎం గోవర్ధన్రెడ్డి, జోనల్ ఇంచార్జి శ్రీకాంత్ తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో జె.గురుమోహన్చరణ్ (369), ఎం.నివాస్(2,824), ఆర్.అభినయ్ (3194), ఎ.చరణ్తేజ(3200), డి. వర్షత్ (4114), బి.వాగ్మీ (4181)లు సాధించగా 5 వేల ర్యాంకులు ఆరుగురు విద్యార్థులు, 10 వేల ర్యాంకులు 17 మంది, 15 వేల ర్యాంకులోపు 71 మంది, 20 వేల లోపు ర్యాంకులు 139 మందికి వచ్చినట్లు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో జె.శ్వేత(351), పి.సాయిరుద్రాతేజ(1677), పి.హన్మిత(2182), పి.రాహుల్ ఆదిత్య(2491), జి.సరిత(4303), ఆర్. రిషిక్(4308), ఎల్. సిమిలిత(4623) సాధించగా 5 వేల లోపు ఏడుగురు, 10 వేల లోపు 17 మంది, 15 వేల లోపు 64 మంది, 20 వేల లోపు 102 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ఎప్సెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. అనంతరం ఎస్ఆర్ డీజీఎం గోవర్ధన్రెడ్డి, జోనల్ ఇంచార్జి శ్రీకాంత్ మాట్లాడుతూ అధ్యాపకుల ద్వారా అప్డేట్ మెటీరియల్తోపాటు ప్రత్యేక క్లాసులు తీసుకోవడంతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ఎస్ఆర్ చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి, సీఈవో సురేందర్రెడ్డి విద్యార్థులను అభినందించారు. అకడమిక్ డీన్ రాంబాబు, ప్రిన్సిపాళ్లు ఆగేందర్రెడ్డి, హన్మంత్రా వు, శ్రీధర్రెడ్డి, దేవేందర్రెడ్డి, మహిపాల్ రెడ్డి, ము రళీధర్, నర్సింహారెడ్డి, జోనల్ అకౌంటెంట్ ఆఫీసర్ రమేశ్రెడ్డి, తల్లిదండ్రులు, లెక్చరర్లు పాల్గొన్నారు. -
ఎప్సెట్లో ‘కాకతీయ’ ప్రభజనం
రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులుఖలీల్వాడి: ఎప్సెట్ ఫలితాలలో కాకతీయ కాలేజీ విద్యార్థులు తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన స్టేట్ ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల చైర్పర్సన్ విజయలక్ష్మి, డైరెక్టర్ రజినీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తరగతులు, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, వీక్లీ, మంత్లీ పరీక్షలు నిర్వహించడంతోపాటు లెక్చరర్లతో ప్రత్యేకంగా సిలబస్ చెప్పడం ద్వారా ఉత్తమ ఫలితాలు వచ్చాయని అన్నారు. కాకతీయ రెసిడెన్షియల్ కాలేజ్ విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం అభినందించారు. ఎప్సెట్లో అబ్దుల్ షాహిద్ (3406), ఆత్రిజ్ (3862), ఎ. వచన్ (4974), భవకీర్తన్ (5963), లోక సమీక్ష (6085), ఈ. శరత్చంద్ర (7003), సిద్ధి వినాయక్ (7350), మైరతైతెల్ (7390), సదియా ఫిర్దౌస్ (7830), సుజానా(8450), తుబా ఫాతిమా (9666), ఐషా ఆలం(10990) ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. -
‘ల్యాబ్ టెక్నీషియన్’కు దరఖాస్తులు ఆహ్వానం
సుభాష్నగర్ : నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఏఆర్టీ సెంటర్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ(డీఎంఎల్టీ) పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 18 నుంచి 21 వరకు జీజీహెచ్లోని ఏఆర్టీ సెంటర్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులను పొందాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అందించాలని సూపరింటెండెంట్ తెలిపారు. మాక్లూర్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి ఆధ్వర్యంలో మాక్లూర్ సొసైటీ పాలకవర్గ సభ్యులు శనివారం కలిశారు. రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ధాన్యం కొనుగోళ్లను ముమ్మరంగా చేపట్టి తుది దశకు తీసుకొచ్చామని మంత్రికి వివరించారు. దీంతో పాలకవర్గాన్ని మంత్రి తుమ్మల అభినందించారు. వచ్చే వర్షాకాలం సీజన్లోనూ రైతులకు ఇబ్బందులు కలగకుండా పనిచేయాలని సూచించా రు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వెల్మల్ గోపి, మాక్లూర్ సొసైటీ చైర్మన్ బూరోల్ల అశోక్, మాజీ చైర్మన్, ప్రస్తుత డైరెక్టర్ దయాకర్రావు, వైస్చైర్మన్ గుండారం శేఖర్,డీకంపల్లి సర్పంచ్ మచ్చర్ల చిన్న య్య,డైరెక్టర్లు కాశీనాథ్రావు, మచ్చర్ల రమేశ్, ప్రసాద్రావు, అశోక్ తదితరులు ఉన్నారు. సుభాష్నగర్: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియ విజయవంతమైనట్లు జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ రావు తెలిపారు. సింకోపల్ అటాక్స్తో బాధపడుతున్న యాదయ్యకు శనివారం జీజీహెచ్లో యాంజియోగ్రామ్ నిర్వహించారు. కార్డియాలజీ, వైద్య బృందం సమష్టి కృషితో ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆధునిక గుండె వైద్యసేవల బలోపేతానికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రి నిరంతరం కృషి చేస్తుందని నాగమోహన్ రావు పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో 169 డ్రంకెన్డ్రైవ్ కేసులు నమోదైనట్లు సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏడుగురు నిందితులకు కోర్టు వారం రోజులపాటు జైలు శిక్ష, మిగిలిన వారికి రూ.10,80,000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ : ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ శివారులో శనివారం పేకాట స్థావరంపై టాస్క్ఫోర్సు సిబ్బంది దాడి చేశారు. పేకాడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి, రూ.1,25,344 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఆరో టౌన్ పోలీసులకు అప్పగించారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని కుప్రియాల్ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు శుక్రవారం రాత్రి దుర్మరణం చెందాడు. మండల కేంద్రానికి చెందిన అనంతసేన కృష్ణ(36) ద్విచక్ర వాహనంపై కామారెడ్డి నుంచి స్వగ్రామమైన సదాశివనగర్కు వస్తున్నాడు. అదే సమయంలో కుప్రియాల్ నుంచి వడ్ల లోడ్తో వస్తున్న లారీ కామారెడ్డికి వెళ్లేందుకు యూటర్న్ అవుతుండగా లారీకి తాకడంతో ద్విచక్రవాహనంతో లారీ కిందికి దూసుకెళ్లాడు. దీంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. డీసీఎం బోల్తా ● డ్రైవర్ దుర్మరణం కామారెడ్డి క్రైం: ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొని డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గాంధారికి చెందిన సుప్పని నవీన్ (30) డీసీఎం డ్రైవర్గా పని చేస్తున్నాడు. మక్కల లోడ్ను అన్లోడ్ చేసుకొని హైదరాబాద్ వైపు నుంచి గాంధారి వైపు తిరిగి వస్తుండగా డీసీఎం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. దీంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
దోమల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి
● డీఎంహెచ్వో రాజశ్రీ ● జాతీయ డెంగీ దినోత్సవ అవగాహన ర్యాలీ సుభాష్నగర్ : దోమల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని డీఎంహెచ్వో రాజశ్రీ తెలిపారు. శనివారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా నగరంలోని చంద్రశేఖర్ కాలనీ పట్టణ ఆరో గ్య కేంద్రం పరిధిలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఐక్యత, ఆచరించు, నిర్మూలించు అనే నినాదంతో ఏడాది పొడవునా డెంగీ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జి ల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వో సికందర్ నాయక్,ప్రోగ్రాం అధికారులు వెంకన్న,సుప్రియ,మెడికల్ ఆఫీసర్ కీర్తి, వైద్యసి బ్బంది,ఏఎన్ఎంలు,ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. మాతృ మరణాలపై సమీక్ష.. నగరంలోని కలెక్టరేట్లో డీఎంహెచ్వో రాజశ్రీ మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. గర్భిణుల పేర్లను 12 వారాల్లోపు నమోదు చేయడమే కాకుండా నాలుగుసార్లు వైద్యులతో పరీక్షించేలా చూడాలని తెలిపారు. ధనుర్వాతం రాకుండా టీకాలు ఇప్పించాలని, ప్రమాదకర లక్షణాలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్వోలు రవీందర్, సికందర్ నాయక్, సమత తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీస్తున్న బాల భవన్
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● ‘కళావైభవం– కలర్స్ ఆఫ్ చైల్డ్ హుడ్’ నిర్వహణ నిజామాబాద్ రూరల్: చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ, వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు బాల భవన్ ఆధ్వర్యంలో వేసవిలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు ఉపయుక్తంగా నిలుస్తున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసించారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నగరంలోని బాల భవన్లో శనివారం ‘కళా వైభవం – కలర్స్ ఆఫ్ చైల్డ్ హుడ్‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాల భవన్లో శిక్షణ పొందుతున్న బాలబాలికలు తమ సృజనను చాటుతూ అందంగా ఆకట్టుకునే రీతిలో తయారు చేసిన కళాకృతులు, గీసిన కళాకృతులను ఆసక్తితో తిలకించారు. పేరిణి, కోలాటం నృత్యాలతో అలరింపజేసిన చిన్నారులను, వెంట్రిలాక్విజంతో ఆకట్టుకున్న జాదూ యుగంధర్ రంగనాథ్ను కలెక్టర్ ప్రశంసించారు. చిన్నారుల మధ్యకు వెళ్లి న కలెక్టర్ ఆయా అంశాలపై ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. చిన్నారులకు చాక్లెట్లు పంచుతూ, బహుమతులు అందజేశారు. చిన్నారులు వేసవి సెలవుల ను సద్వినియో గం చేసుకునే లా తల్లిదండ్రు లు తమ పిల్లలను బాల భవన్లో చేర్పించా లని కలెక్టర్ సూచించారు. వేస వి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అ న్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. మే యర్ ఉమారాణి మాట్లాడుతూ నేటి చదువులు ఎంతో ఒత్తిడితో కూ డుకుని ఉంటున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో బాల భవన్ అందిస్తున్న వేసవి శిక్షణ కార్యక్రమాలు చిన్నారులకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తూ, వారిలో సృజనాత్మకతను, నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, బాలభవన్ సూపరింటెండెంట్ ఉమాబాల,మాజీ పర్యవేక్షకుడు ప్రభాకర్, రాఘవేందర్, వెంకటలక్ష్మి, పుష్పలత, శ్వేత,సోనాలి,రిచా,మాధవి,గణేశ్,రాంచందర్, పవన్, నవీన్, మాధవి తదితరులు పాల్గొన్నారు. పేరిణి నృత్యం ప్రదర్శిస్తున్న విద్యార్థినులు -
రేపటి నుంచి యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్
కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో కార్యక్రమ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలపై ఆసక్తి, నాయకత్వ లక్షణాల పెంపు కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తామన్నారు. 18న ఫిట్ అండ్ యాక్టివ్ పేరిట రాజారాం స్టేడియంలో మారథాన్, 19న కెరీర్ నైపుణ్యాభివృద్ధిపై శివాజీనగర్లోని ఏటీసీలో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 20న ఏటీసీలో నాయకత్వ లక్షణాలపై అవగాహన, 21న జిల్లా స్థాయిలో స్పోర్ట్స్ డే, 22న స్వచ్ఛ తెలంగాణ, 23న జాబ్మేళాలో ఉద్యోగం సాధించిన వారికి నియామక పత్రాలు, క్రీడా పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్ పాల్గొన్నారు. బీఎల్ఏల నియామకానికి తక్షణ చర్యలు బూత్ లెవెల్ ఏజెంట్ల(బీఎల్ఏ) నియామకానికి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బీఎల్ఏల జాబితాను నిర్ణీత ఫార్మాట్ ప్రకారం అందించాలని రాజకీయ పార్టీలను మరోమారు లిఖిత పూర్వకంగా కోరాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అమలు తీరుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీఈవో దృష్టికి తెచ్చారు. అర్బన్ నియోజకవర్గంలో సైతం మ్యాపింగ్ ప్రక్రియలో ఆశించిన పురోగతి వచ్చిందన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ జూన్ 15వ తేదీ లోపు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మ్యాపింగ్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఆర్వో గీత, నిజామాబాద్, బాన్సువాడ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రవీందర్, డీఆర్డీవో సాయన్న, సీపీవో రతన్ తదితరులు పాల్గొన్నారు. -
ఫారెస్ట్ వారియర్స్!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో భానుడి భగభగలకు 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. సాధారణ జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నూ జిల్లా అటవీ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది యూనిఫామ్ వేసుకుని అడవిబాట పడుతున్నారు. అడవుల రక్షణతోపాటు వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు కాలినడకన పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎండలో అడవుల్లో తిరుగుతూ విధులను నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో 86,871.45 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. అడవులను సంరక్షించేందుకు మొత్తం ఏడు రేంజ్లు ఉండగా, కమ్మర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, వర్ని రేంజ్లలో ఎక్కువగా అడవులు ఉన్నాయి. ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్, నవీపేట్ మండలాల్లో గుట్టలు కూడా ఉన్నాయి. తీవ్రమైన ఎండల కారణంగా సహజసిద్ధమైన వాగులు, వంకలు, చెరువులు ఎండిపోయాయి. దీంతో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అడవుల్లో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటలు (సాసర్ పిట్స్), సోలార్ బోర్వెల్స్ ద్వారా నిరంతరం నింపుతున్నారు. ఎండలు మండిపోతున్నా లెక్క చేయకుండా సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. అటవీ భూములు కబ్జాకు గురి కాకుండా గస్తీకాస్తున్నారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతను లెక్కచేయకుండా పెట్రోలింగ్ జనం ఇళ్లు దాటని వేళ.. అటవీబాట పట్టిన ఫారెస్ట్ ఆఫీసర్లు అడవులకు అంటిన కార్చిచ్చు ఆర్పేందుకు సాహస చర్యలు వన్యప్రాణుల దాహార్తి కోసం భగీరథ ప్రయత్నం -
త్వరలో పీఎం రాహత్ స్కీం అమలు
సుభాష్నగర్: కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న పీఎం రాహత్ స్కీం త్వరలో జిల్లాలో అమ లు కానుందని డీఎంహెచ్వో రాజశ్రీ , ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. ఈ మేరకు శనివారం నగరంలోని ఐఎంఏ మీటింగ్ హాల్ లో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు, వైద్యులకు పీఎం రాహత్ స్కీంపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ స్కీంలో ప్రతి యాక్సిడెంట్ బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షల వరకు లేదా ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స ఉంటుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 38 ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయని, ఈ ఆస్పత్రుల సహకారం ఉండాలన్నారు. ఈ – దార్ మేనేజర్ వర్షా నిహంత్ మాట్లాడుతూ.. పీఎం రాహత్ స్కీంలో పోలీస్, వైద్యారోగ్య విభాగం సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి మధు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విశాల్, కార్యదర్శి సృజన్, జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ శశాంక్రెడ్డి, వివిధ ఆస్పత్రుల సిబ్బంది పాల్గొన్నారు. డీ–54 కాలువ ఆక్రమణలను తొలగించాలి సుభాష్నగర్: నిజామాబాద్ నగరంలోని డీ–54 కాలువ ఆక్రమణలను వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ ఆదేశించారు. నగరంలోని 18, 33వ డివిజన్లలో శనివారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ వర్కర్ల అ టెండెన్స్, శానిటేషన్ పనులు, తాగునీటి సరఫరా, డ్రెయినేజీలు, యూజీడీ పనులను పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభం కాను న్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తచర్యల్లో భాగంగా డీ–54 కాలువను పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్లు, నాయకులు ఆయనను కలిసి సమస్యలను వివరించారు. భారీ వర్షా లు కురిసిన సమయంలో నీటి ప్రవాహం పెరిగి ఇళ్లల్లోకి నీరు రావొచ్చని, డీ–54 కెనా ల్ ఆక్రమణల తొలగింపులో రాజీ పడొద్దని కమిషన్ సూచించారు. కార్పొరేటర్లు, నాయకులు సహకరించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్లు, కాలనీవాసులు ఉన్నారు. 443 మంది విద్యార్థుల గైర్హాజరు ఖలీల్వాడి: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. నాల్గో రోజైన శనివారం ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్షలకు మొత్తం 443 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 7,922 మంది విద్యార్థులకు గాను 7,577మంది హాజరుకాగా, 345మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే సెకండియర్ పరీక్షలకు 2,227 మంది విద్యార్థులకు గాను 2,129మంది హాజరుకాగా, 98 మంది గైర్హాజరయ్యారని వివరించారు. -
శని అమావాస్య పూజలు
● భక్తులతో కిటకిటలాడిన జాన్కంపేట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ● అష్టముఖి కోనేరులో పుణ్యస్నానాలు బోధన్: శని అమావాస్యను పురస్కరించుకుని ఎడపల్లి మండలంలోని జాన్కంపేట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం భక్తులతో శనివారం కిటకిటలాడింది. తెల్లవారుజాము నంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. అష్టముఖి కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఉద్యోగులు, అర్చకులు, గ్రామపెద్దలు ఎ మ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నీడ కోసం టెంట్లు వేశారు. తాగునీరు, మజ్జిగ, గుట్టకింద ప్రాంతంలో అల్పాహారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ సుంచనకోట అనురాధ రాధాకిషన్గౌడ్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకుడు విజయకుమార్గౌడ్, ఆలయ ఈవో వేణు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.స్వామివారి దర్శనానికి క్యూలైన్లో వెళ్తున్న ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి అష్టముఖి కోనేరు చుట్టూ భక్తుల సందడి -
మూడు దశాబ్దాలుగా
శిక్షణ పొందినవారితో ఎంపీ అర్వింద్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు నగరంలోని మాధవ స్మారక సేవాసమితి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలతో అనేకమంది వ్యక్తిత్వ వికాసం పొందుతుండడంతోపాటు నైపుణ్య అభివృద్ధి శిక్షణ పొందుతున్నారు. తద్వారా ఉపాధికి మార్గాలూ లభిస్తున్నాయి. ‘మానవసేవే మాధవ సేవ‘ అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ‘మాధవ స్మారక సేవాసమితి’ యువత కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా మహిళల స్వయం సమృద్ధి కోసం ఎక్కువగా పాటుపడుతోంది. ఇందులో భాగంగా వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులతోపాటు వివిధ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. టైలరింగ్, జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ, మెహందీ ఆర్ట్స్, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జ్యూట్ బ్యాగుల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థులు జ్యూట్ బ్యాగులు వాడేలా ప్రోత్సహిస్తున్నారు. ప్లాస్టిక్ వాడడం వల్ల తలెత్తే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. 1995 నుంచి వేలాదిమందికి వివిధ అంశాలు, విభాగాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి మార్గాలను చూపిస్తున్నారు. ముఖ్యంగా నిరుపేద, దిగువ మధ్యతరగతి వర్గాల మహిళలకు కుట్టు మిషన్, జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యూటీషియన్, మెహందీ డిజైన్ ఆర్ట్ప్, ఎంబ్రాయిడరీ శిక్షణ సైతం ఇస్తున్నారు. రెండు నుంచి మూడు నెలలపాటు ఒక్కో అంశంలో శిక్షణ నిర్వహిస్తున్నారు. విశేష నైపుణ్యం కలిగిన శిక్షకులతో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా శిక్షణ పొందిన పలువురు వివాహాది శుభకార్యాలకు ఆర్డర్లు తీసుకుని అలంకరణ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఇందులో పలువురు మహిళలు తాము ఉపాధి పొందుతుండడంతో పాటు పలువురికి ఉపాధి కల్పించే స్థాయి వరకు వెళ్లారు. పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ వాడకంతో కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా జ్యూట్ బ్యాగులను వినియోగాన్ని పెంచాలని ప్రచారం చేయడమే కాకుండా ఉచితంగా జ్యూట్ బ్యాగుల పంపిణీ సైతం చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు జ్యూట్ బ్యాగుల శిక్షణ (ఫైల్) శిక్షణ పొందుతున్న యువతులు, మహిళలుసేవలు విస్తరిస్తాం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కుకునే సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ఉచితంగా అందజేసేందుకే మాధవ స్మారక సేవాసమితి విశేషంగా కృషి చేస్తోంది. స్వయం శక్తితో సాధారణ కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా పూర్తిస్థాయిలో నిలదొక్కుకునేలాగా దోహదం చేస్తోంది. సమాజంలోని అన్ని రంగాల ప్రజలకు, యువతకు, మహిళలకు, పిల్లలకు వేర్వేరుగా సేవా కార్యక్రమాలను యోజన చేస్తూ అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. భవిష్యత్లో మరిన్ని విశేష సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – మర్రి కృష్ణారెడ్డి, అధ్యక్షులు, మాధవస్మారక సేవా సమితి, ఇందూరు ‘మానవ సేవే మాధవ సేవ’ లక్ష్యంగా మాధవ స్మారక సేవాసమితి సేవలు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం నిరంతర కార్యక్రమాలు కొవిడ్ విపత్తు వేళ సేవలు.. పర్యావరణ పరిరక్షణకు కృషి -
జీవన్రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డిని విమర్శించే అర్హత ఆ ర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి లేదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. జీవన్రెడ్డి నీచ రాజకీయాలకు మారుపేరన్నారు. సుదర్శన్రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోర న్నారు. ఇక మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వే ముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రైతుల ముసుగులో పచ్చ కండువాలు వేసు కుని ధర్నాలు చేయడం హాస్యాస్పదమన్నారు. సీఎం రేవంత్రెడ్డి రైతులకు ఇచ్చిన ప్రతి హా మీని నెరవేర్చేలా ముందుకెళ్తున్నారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లాకు 70 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలుకు అనుమతి వస్తే ఇప్పటికే 50 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారన్నా రు. అలాగే 32 కొనుగోలు కేంద్రాల ద్వారా 38,556 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసి నట్లు తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దన్నా రు. సుదర్శన్రెడ్డి, మహేష్కుమార్గౌడ్, భూపతిరెడ్డి నిరంతరం కలెక్టర్తో, ప్రభుత్వ అధికారులతో సమీక్షలు చేస్తూ ఇబ్బందులు లేకుండా చూస్తున్నార న్నారు. డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, ఉపాధ్యక్షు లు కౌడపు శరత్ కుమార్, రత్నాకర్గౌడ్, జిల్లా ప్రఽ దాన కార్యదర్శి ప్రవీణ్గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రాజనరేందర్గౌడ్, జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ రఘు, రమేష్ పాల్గొన్నారు. సామాన్యులపై పెట్రో భారం నిజామాబాద్ రూరల్: పెట్రోల్, డిజిల్ ధరలను పెంచి సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం భారం మోపిందని నగేశ్రెడ్డి విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిత్యావసరాల ధరలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. సుదర్శన్రెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదు ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి -
కార్చిచ్చు అంటుకోకుండా..
వేసవి కాలంలో అడవులకు అతిపెద్ద ముప్పు గా పరిణమించే కార్చిచ్చును (ఫారెస్ట్ ఫైర్స్) అరికట్టడం అధికారులకు అతిపెద్ద సవాల్. ఇందుకు ఫైర్ వాచర్లు, బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, రేంజ్ అధికారులు అడవులకు నిప్పు అంటుకోకుండా నిఘా పెట్టారు. ముందు జాగ్రత్త చర్యగా ఫైర్లైన్స్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ గుర్తు తెలియని వ్యక్తుల చర్యల కారణంగా అడవులు, గుట్టలకు నిప్పు అంటుకుంటోంది. శాటిలైట్ అలర్ట్స్ ఆధారంగా నిప్పు అంటుకున్న ప్రాంతాలకు సిబ్బంది వెళ్లి వెంటనే బ్లోయర్ల సహాయంతో మంటలను ఆర్పేస్తున్నారు. ఎర్రటి ఎండలో సైతం మంటలను అదుపు చేస్తున్నారు. జిల్లా అటవీ శాఖ సిబ్బంది, అధికారుల కర్తవ్య దీక్షపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. -
ఎరక్కపోయి.. ఇరుక్కున్నాడు
● పాత్రలో చిక్కుకుపోయిన బాలుడునిజామాబాద్ అర్బన్: నగరానికి చెందిన ఓ బాలుడు ఇంట్లోని పాత్రలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆటోనగర్లోని అబ్దుల్ రహీం అనే ఆరు సంవత్సరాల బాలుడు ఓ పాత్రలో కూర్చోగా, తిరిగి బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా రెండు కాళ్లు ఇరుక్కుపోయాయి. తల్లి ఉజ్మా బేగం బాలుడిని పైకి లాగితే రాలేదు. తండ్రి అబ్దుల్ రహీం అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే వచ్చి ఇరుక్కున్న పాత్రను యంత్రంతో కట్ చేసి బాలుడిని బయటికి తీశారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రజా సేవలకులమని మరవొద్దు
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజాసేవకులమనే విషయాన్ని మరవొద్దని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును సమాచార హక్కు చట్టం ద్వారా వారికి కల్పించడిందని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ జి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే ఆర్టీఐ యాక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. సమాచార హక్కు చట్టం – 2005పై పీఐవోలకు, ఏపీఐవోలతోపాటు అన్ని శాఖల అధికారులకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా, సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాస్రావు, దేశాల భూపాల్ హాజరయ్యారు. సమాచార హక్కు చట్టంలోని 2 షెడ్యూళ్లు, 6 చాప్టర్లు, 31 సెక్షన్ల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రశేఖర్రెడ్డి అవగాహన కల్పించారు. దరఖాస్తులకు సంబంధించి పీఐవోలు, ఏపీఐవోల సందేహాలను నివృత్తి చేశారు. పౌరులు కోరినప్పుడే సమాచారం ఇవ్వడం కాకుండా, సమాచార హక్కు చట్టం, సెక్షన్ 4(1)బి ప్ర కా రం స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చేలా సమాయ త్తం కావాలని సూచించారు. సమాచారాన్ని కోరే హక్కు ప్రతి పౌరునికి ఉండడంతోపాటు రికార్డుల ను, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించే అధికారం కూడా ఉందన్నారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చే దరఖాస్తులు అనగానే అనేక మంది ఆందోళన కు గురవుతారని, అనుమానాలు, అపోహలకు గురి కాకుండా దరఖాస్తుదారు కోరిన మేరకు రికార్డులలో ఉన్న సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు పెండింగ్ కేసులను ఆర్టీఐ కమిషన్ చీఫ్ కమిషనర్, కమిషనర్లు పరిశీలించి పరిష్కరించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు కిరణ్కుమార్, దిలీప్కుమార్, డీఎఫ్వో సిద్ధార్థ్ విక్రమ్సింగ్, అదనపు డీసీపీ ప్రకాశ్, డీఆర్వో బి గీత, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రశ్నించే హక్కును ప్రజలకు సమాచార హక్కు చట్టం కల్పించింది రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి ఆర్టీఐ చట్టంపై పీఐవో, ఏపీఐవోలకు అవగాహన సదస్సు -
రేషన్ దుకాణాల ద్వారా పసుపు పంపిణీకి కృషి
● సీఎంతో మాట్లాడి సరఫరాకు చర్యలు ● వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు రాయితీపై పసుపు పంపిణీ చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ స భ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. జక్రాన్పల్లి మండలంలోని మనోహరాబాద్లో ఉన్న జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ (ఎఫ్పీవో)ను గడుగు శుక్రవారం సందర్శించి యంత్రాలను పరిశీలించారు. పసుపునకు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలు దేశంలోనే పేరుగాంచా యని అన్నారు. పసుపు రైతులకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ప్రయత్నం చే యడం లేదని, పసుపును కొనుగోలు చేయడం లేద ని విమర్శించారు. త్వరలో సీఎం రేవంత్రెడ్డిని కలి సి రేషన్ దుకాణాల ద్వారా రాయితీపై ప్రజలకు పసుపు అందించేందుకు తగినవిధంగా నివేదిక స మర్పిస్తానన్నారు. ఆయన వెంట జేఎంకేపీఎం ఎఫ్పీవో చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిజామాబాద్ నగర అధ్యక్షుడు సుభాష్జాదవ్, మనోహరాబాద్ ఉప సర్పంచ్ అ ల్లూరి లింబారెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్, ఉద్యాన శాఖ డివిజన్ అధికారులు రోహిత్, రాజుగౌడ్, ఏవో దేవిక, ఏఈవోలు శుభస్య, శివ, భాస్కర్, శ్రీకాంత్, పసుపు రైతులు పుప్పాల నాగేశ్, చిన్నయ్య, శ్రీధర్ తదితరులు ఉన్నారు.పసుపు తయారీ, కొమ్ములను పరిశీలిస్తున్న వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ -
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి
● ఓఆర్ఆర్, బైపాస్ రోడ్డు మంజూరు చేయించడంలో విఫలం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారిసుభాష్నగర్: నిజామాబాద్కు స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, బైపాస్ రోడ్డు హామీని అమలు చేయించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం హామీ అమలు కాకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ కార్యాలయం కోసం నగర నడిబొడ్డున స్థలాన్ని కేటాయించుకున్న వారు.. ప్రజలకు ఉపయోగపడే బస్టాండ్ కోసం మాత్రం స్థలాన్ని గుర్తించలేకపోయారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మధ్య కమీషన్ల బేరసారాలు కుదరకనే నిజామాబాద్ ఓఆర్ఆర్ ఫైలును పక్కన పడేశారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి ఇందూరు గడ్డపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్లు, మేయర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్కుమార్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, కార్పొరేటర్లు మహేందర్, ఎర్రం సుధీర్, మల్లేష్ యాదవ్, వేణుగోపాల్, శ్రీనివాస్రెడ్డి, చిరంజీవి, బద్దం కిషన్, ఆమంద్ విజయ్కృష్ణ, బోడ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కంప్యూటర్పై పట్టు
వేసవిలో● శిక్షణ పొందుతున్న విద్యార్థులు ● నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలకు దోహదంబోధన్లోని ఎస్ఆర్ కంప్యూటర్స్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులుబోధన్: సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పు నేపథ్యంలో కంప్యూటర్ విద్య పట్ల మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. వేసవి సెలవుల సమయాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండటం అత్యంత అవసరమైన నైపుణ్యమని నిపుణులంటున్నారు. కంప్యూటర్ విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్యల పరిష్కారానికి నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతాయి. సాలూర మండల కేంద్రానికి చెందిన కంప్యూటర్ మాస్టర్ కృష్ణప్రసాద్ బోధన్ పట్టణ కేంద్రం, సాలూర మండల కేంద్రాల్లో ఎస్ఆర్ కంప్యూటర్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ రెండు కేంద్రాల్లో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. డీసీఏ, పీజీడీసీఏ, జేవోసీ, డీటీపీ, ఫొటోషాప్, ఇంటర్నెట్, ఇతర కోర్సుల్లో శిక్షణనిస్తున్నారు. 30 నుంచి 45 రోజుల వ్యవధితో కోర్సులను నామమాత్రపు ఫీజుతో అందిస్తున్నారు. -
అగ్ని ప్రమాదంలో ధాన్యం బస్తాలు దగ్ధం
మోపాల్ : మండలంలోని కంజర్ శివారులో సొసైటీ ఆధ్వర్యంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు శుక్రవారం దగ్ధమయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. షేక్ దావూద్ అనే రైతు బస్తాలు మూడు రోజుల క్రితం తూకం వేశారు. గుర్తు తెలియని రైతు తన పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు రోడ్డు వరకు వ్యాపించాయి. ఈ క్రమంలో ధాన్యం బస్తాలకు అంటుకున్నాయి. గ్రామస్తులు గమనించి వెంటనే బస్తాల్లో నుంచి ధాన్యం కింద పారబోసి మంటలను అదుపులోకి తెచ్చారు. గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా మంటలను పూర్తిగా ఆర్పేశారు. అగ్ని ప్రమాదంలో సుమారు 5 బస్తాల ధాన్యం దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. -
పని చేసి పరేషాన్
మోర్తాడ్(బాల్కొండ): భీమ్గల్ మండలంలోని ముచ్కూర్ గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ రకాలైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ.15 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అయితే బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసన తెలుపుతూ కొందరు కాంట్రాక్టర్లు పంచాయతీ కార్యాలయానికి ఇటీవల తాళం వేశారు. మోర్తాడ్ మండలం సుంకెట్లో గతంలో సర్పంచ్గా పని చేసిన కడారి శ్రీనివాస్కు రూ.18లక్షల బిల్లు విడుదల కావాల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైనా ఆయనకు బిల్లు మంజూరు చేయలేదు. ఇది ఒక్క ముచ్కూర్, సుంకెట్ పంచాయతీలలో నెలకొన్న సమస్య కాదు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పాత బిల్లుల బకాయిలు పేరుకపోయి సంకటంగా మారింది. పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యులు లేని సమయంలో నిధులు విడుదల కాలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికై న ప్రజాప్రతినిధులు కొలువదీరిన తరువాత బకాయి పడిన నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో కొంత భాగమైనా పాత బిల్లుల చెల్లింపులకు కేటాయించాలని గతంలో సర్పంచ్లుగా పని చేసిన వారు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. పునర్విభజనకు ముందు జిల్లాలో 535 గ్రామ పంచాయతీలు ఉండగా మెజార్టీ పంచాయతీల్లో పాత బిల్లుల చెల్లింపులు అలాగే ఉన్నాయి. దాదాపు రూ.15 కోట్ల చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ కేవలం రూ.3 కోట్లు అక్కడక్కడ చేశారు. ఇంకా రూ.12 కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటాగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేయకపోవడంతో పంచాయతీల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. 15వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేసే విధానంలో ఎన్నో మార్పులు జరిగాయి. పన్ను ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆశలు పెట్టుకోగా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఫలితంగా పంచాయతీలకు ఆర్థికభారం తప్పడం లేదు. అధికారుల మౌనం సంకటంగా మారిన పాత బిల్లులు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైనా చెల్లింపులపై నోరుమెదపని గ్రామ పంచాయతీ పాలకవర్గాలు జిల్లాలో పేరుకుపోయిన బకాయిలు రూ.12 కోట్లకు పైమాటే.. కొన్ని చోట్ల తక్కువ మొత్తంలో చెల్లింపులు పూర్తి పంచాయతీల ద్వారా మాజీ సర్పంచ్లకు చెల్లించాల్సిన బిల్లు బకాయిలు వెంటనే చెల్లించాలి. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లింపులు సాగక వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి వస్తోంది. అప్పు తీసుకువచ్చి పనులు చేశాం. ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోతే మేము ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి పంచాయతీ బిల్లు బకాయిలు వెంటనే మంజూరు చేయించాలి. – కడారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్, సుంకెట్ బిల్లుల బకాయిలకు చెల్లింపుల విషయంలో జిల్లాలోని పంచాయతీ ఉన్నతాధికారులు మౌన వ్రతం పాటిస్తున్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించి ఎంబీల రికార్డింగ్, పనులకు సంబంధించిన తీర్మాణాలు సక్రమంగా చేసి ఉంటే బిల్లుల చెల్లింపులు తక్షణమే పూర్తి చేయాల్సి ఉంది. అధికారులు మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మౌనం పాటిస్తూ గతంలో సర్పంచ్లుగా పని చేసినవారిని ఎలాంటి ప్రయోజనం కల్పించే చర్యలు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులకు చెప్పి పనులు చేసినా బిల్లు బకాయిల విషయంలో పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. -
ఫీజులో రాయితీ!
● గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ గాలం ● పది పాసైనోల్లు టార్గెట్ ● నమ్మించి రూ.లక్షలు దండుకుంటున్న వైనం ఆర్మూర్ : కార్పొరేట్ కళాశాలల ఏజెంట్లు గ్రామాల బాటపట్టారు. ఫ్రీ సీటు, హాస్టల్, ఫీజులో రాయితీ పేరిట విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేస్తున్నా రు. మాయమాటలు చెప్పి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. జిల్లాలోని ప్రయివేటు కళాశాలలతోపాటు హైదరాబాద్లోని కార్పొరేట్ కళాశాలల ఏజెంట్లు స్థానికంగా అద్దె గదుల్లో నివాసముంటూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వల విసురుతున్నారు. మరికొన్ని కళాశాలల యాజమాన్యాలు టెలీకాలర్లను నియమించుకొని తల్లిదండ్రులకు రోజుకు పదుల సంఖ్యలో ఫోన్లు చేయిస్తూ మభ్యపెడుతున్నాయి. బాండ్పై సంతకాలు.. పదో తరగతి ఫలితాలు రాగానే కార్పొరేట్ కాలేజీల ఏజెంట్లు మార్కుల జాబితాలతో గ్రామాల్లో వాలా రు. 500లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థు ల ఇళ్లకు వెళ్లి మీ అబ్బాయి చాలా తెలివైనో డు, మా కాలేజీలో ఫ్రీ సీటు.. ఫీజులో రాయితీ అంటూ నమ్మబలుకుతున్నారు. గిఫ్ట్లు ఇచ్చి తల్లిదండ్రుల ను ఆకర్షిస్తున్నారు. కొందరు ఏజెంట్లు అయితే అడ్వాన్స్గా రూ.10 వేలు చేతిలో పెట్టి సదరు విద్యార్థి పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని సీటు కన్ఫర్మ్ అని బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకుంటున్నారు. అడ్మిషన్ తీసుకుంటే అంతే.. ఒకసారి అడ్మిషన్ తీసుకున్నాక అసలు కథ మొదలవుతోంది. ట్యూషన్ ఫీజు ఫ్రీ, కానీ బిల్డింగ్ ఫండ్, స్పెషల్ కోచింగ్, మెటీరియల్, యూనిఫాం పేరు తో ఏడాదికి రూ.1.20 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన నారాయణ తన కొడుకును ఫ్రీ అని నమ్మి జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పిస్తే ఇప్పుడు రూ.1.10 లక్ష కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిబంధనలు గాలికి.. ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం అడ్మిషన్ల సమయంలో అదనపు ఫీజులు వసూలు చేయడం నేరం. కానీ కార్పొరేట్ కాలేజీలు యాజమాన్య కోటా పేరుతో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. గ్రామీణ విద్యార్థులు, తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రూ. లక్షలు దండుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఏం చేయాలి.. ఏ కాలేజీ ఏజెంట్కూ అడ్వాన్స్గా ఫీజు డబ్బులు, పదో తరగతి సర్టిఫికెట్లు ఇవ్వొద్దు. ఫ్రీ అని చెబితే రాతపూర్వకంగా తీసుకోవాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని గుర్తించాలి. అక్రమ వసూళ్లపై టోల్ ఫ్రీ నంబర్ 1800–425–3533కు ఫిర్యాదు చేయాలి. ముందస్తుగా డబ్బులు కట్టొద్దు కార్పొరేట్ కాలేజీలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. గ్రామాల్లో ఏజెంట్లతో అడ్మిషన్లు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. తల్లిదండ్రులు ముందస్తుగా ఎవరికీ డబ్బులు కట్టొద్దు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – రవికుమార్, డీఐఈవో -
రైతులు ఆందోళన చెందొద్దు
సాక్షి ప్రతినిధి నిజామాబాద్: రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందొద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి అన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు అవసరమైన గోదాముల పరిశీలనలో భాగంగా శుక్రవారం వేల్పూర్లోని సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న గోదామును సుదర్శన్రెడ్డి శుక్రవా రం పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లా డి వారి సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఆయనవెంట రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కే నగేశ్రెడ్డి, అమీనాపూర్ సర్పంచ్ నవీన్, వెంకటాపూర్ సర్పంచ్ సుజాత, లక్కోరా సర్పంచ్ అపర్ణ రాజు ఉన్నారు. రైతులను రెచ్చగొట్టే రాజకీయాలు.. పెర్కిట్: చివరి గింజ వరకూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి అన్నారు. ఆలూర్ మండల కేంద్రంతోపాటు మిర్దాపల్లిలోని కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కడ్తా, తరుగు అంటూ ఇబ్బందులకు గురిచేస్తే కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించా రు. బీఆర్ఎస్ నాయకులు ఉద్రిక్తతలు సృష్టించి రై తులను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. -
జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు భేష్
● అన్ని శాఖలు సమర్థవంతంగా పని చేస్తున్నాయి ● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి నిజామాబాద్ అర్బన్: జిల్లాలో ధాన్యం, మొక్క జొ న్న కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్రెడ్డి సంతృప్తి వ్య క్తం చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో ఆ యా శాఖలు ధాన్యం, మొక్కజొన్న సేకరణలో సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సమీక్షాసమావేశం నిర్వహించారు. సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గం మినహా, జిల్లాలోని మిగతా అ న్ని చోట్ల ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యా యని తెలిపారు. బాల్కొండ సెగ్మెంట్లో పంట కో తలు కొంత ఆలస్యమయ్యాయన్నారు. మరో మూ డు రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరించేందుకు యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందన్నారు. అకాల వర్షాలు కురిస్తే రైతులు నష్టపోకుండా పెద్ద సంఖ్యలో హమాలీలను, వాహనాలను సమకూరుస్తూ, ప్రతి రోజూ సగటున 15 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరిస్తూ రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. ప్రభుత్వ గోదా ముల్లో స్థలం లేకపోవడంతో ప్రైవేట్ గిడ్డంగులను అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. మొ క్కజొన్న సేకరణ సైతం తుది దశకు చేరిందన్నారు. పంట దిగు బడుల కొనుగోలు విషయంలో విమర్శలు చేస్తున్న వారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనేది గమనించి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. కలెక్టర్తోపాటు అధికారులు పాల్గొన్నారు. -
శుభ ముహూర్తాలకు బ్రేక్
నిజామాబాద్ రూరల్: అధిక జ్యేష్ఠమాసం కారణంగా శుభ ముహూర్తాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. బాజాబజంత్రీలు మోగాలంటే నెలరోజులు ఆగాల్సిందేనని పండితు లు చెబుతున్నారు. ఈనెల 18 నుంచి జూన్ 18వ తేదీ వరకు అధిక జ్యేష్ఠ మాసం (మూఢం) కావడంతో ఎలాంటి ముమూర్తాలు లేవంటున్నారు. జూన్ 19 నుంచి మళ్లీ శుభముహుర్తాలు ప్రారంభవుతాయి. ఈనెల 13వ తేదీ పెళ్లి ముహూర్తాలకు చివరి రోజు కావడంతో జిల్లాలో దాదాపు 500కు పైగా వివాహలు జరిగాయి. జూన్ 18 వరకు గృహ ప్రవేశాలు, నూతన వ్యాపారాల ప్రారంభం వంటి శుభకార్యాలకు బ్రేక్ పడింది. పురోహితులు, కేటరింగ్, ఫొటోగ్రఫీ, ఫంక్షన్ హాళ్లు, బ్యాండ్ వారికి నెలరోజులపాటు ఉపాధి కరువు కానుంది. -
నిజామాబాద్
శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026– 8లో uఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం కార్పొరేట్, ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు ఆఫర్లు, రాయితీల పేరిట మభ్యపెడుతున్నాయి. పదో తరగతి పాసైన గ్రామీణ ప్రాంత విద్యార్థులే లక్ష్యంగా చేసుకొని వారి ఏజెంట్లను పంపుతున్నాయి. బహుమతులు, అడ్వాన్స్లు అందజేస్తూ అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. తీరా అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్లు చెప్పే వివిధ ఫీజుల వివరాలు తల్లిదండ్రులను షాక్కు గురి చేస్తున్నాయి. ఫ్రీ సీటు.. -
వనమహోత్సవానికి సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వనమహోత్సవం–2026 కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సన్నద్ధమవుతోంది. జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో మొత్తం 26.11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం 530 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో 42 లక్షల మొక్కలను పెంచుతున్నారు. గత సంవత్సరం ఒక్కో నర్సరీలో 8 వేల చొప్పున మొక్కలను పెంచగా, గతేడాదికి సంబంధించిన మొక్కలు ఉండడంతో ప్రస్తుతం ఒక్కో నర్సరీలో 2,600 చొప్పున మొక్కలను పెంచుతున్నారు. నాటేందుకు మొక్కలు సిద్ధం కావడంతో జూన్ మొదటి వారం నుంచి ఉపాధి కూలీలతో గుంతలు తవ్వించి జూలైలో వేగవంతంగా మొక్కలను నాటించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ●ప్రధానంగా నీడనిచ్చే కానుగ, చింత, వేప, తెల్లమద్ది, పెల్ట్రోఫాం, డెకోమా చెట్లతో పాటు జామ, సీతాఫలం, అల్లనేరెడు, ఉసిరి, సపోటా, ఈత, ఖర్జూర, బాదం, నిమ్మ, దానిమ్మ తదితర పండ్ల మొక్కలు నాటనున్నారు. గన్నేరు, గులాబీ, మల్లె, మందార, కరివేపాకు తదితర మొక్కలను ఇంటికి ఐదు చొప్పున పంపిణీ చేయనున్నారు. ●రహదారుల వెంబడి, చెరువుగట్లు, కమ్యూనిటీ స్థలాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైతుల భూముల్లో, దేవాలయ, అటవీ భూముల్లో, శ్మశాన వాటి కలు, తదితర ప్రాంతాల్లో అవసరమైన చోట్ల మొక్కలను నాటనున్నారు. లక్ష్యాన్ని పూర్తి చేస్తాం ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వనమ హోత్సవాన్ని నిర్వహించనున్నాం. నిర్ధేశిత లక్ష్యాన్ని ప్రణాళికతో పూర్తి చేస్తాం. మొక్కలు నాటడానికి త్వరలో గ్రామా ల్లో ఉపాధి కూలీలతో గుంతలు తవ్వించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెడతాం. – సాయన్న, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి గ్రామీణాభివృద్ధిశాఖ ప్రణాళికలు జిల్లా వ్యాప్తంగా 26.11 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం 520 నర్సరీల్లో 42 లక్షల మొక్కల పెంపకం -
సెలవుల్లో సరదాగా..
మాలోత్ ఇందు 5వ తరగతి గ్రామం: తిమ్మారెడ్డి తండా మండలం: ఎల్లారెడ్డి జిల్లా: కామారెడ్డి బి.కళ్యాణ్ప్రసాద్ నిజామాబాద్. ఎల్లారెడ్డిరూరల్: వేసవి సెలవులను చిన్నారులు ఆనందంగా గడుపుతున్నారు. మండలంలోని వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో చిన్నారులు చెట్ల కింద గోళీలాడుతూ, టైర్లతో గ్రామంలో తిరుగుతూ కనిపించారు. చెట్టు కింద గోళీలు, ఉదయం, సాయంత్రం టైర్లతో ఆడుతూ సంతోషంగా గడుపుతామని చిన్నారులు చెప్తున్నారు. -
విద్యతోనే సమాజంలో మార్పు
రెంజల్(బోధన్): విద్యతోనే సమాజంలో మార్పు, మనుగడ సాధ్యపడుతుందని వక్తలు పేర్కొన్నారు. మండలంలోని కందకుర్తి గ్రామంలో గురువారం ఎస్బీఐ సహకారంతో కేశవ శిశు విద్యామందిర్, కోల్ ఇండియా సహకారంతో కేశవ నైపుణ్య వికా సం కేంద్రం నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కేశవ శిశు మందిర్తోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని యువత, విద్యార్థులు, రైతులకు ఉపయోగపడేలా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. విద్య, వికాసంతో యువ త అన్ని రంగాల్లో రాణించడంతోపాటు ప్రతి ఒక్క రు విద్యావంతులైనప్పుడు అంటరానితనం, కుల వ్యవస్థలు నిర్వీర్యమవుతాయని పేర్కొన్నారు. కేశవ శిశుమందిర్ విద్యాలయాలు నిరుపేద విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తూనే ఇతర రంగాల్లోని వ్యక్తులకు శిక్షణ అందిస్తూ ఆర్థికంగా రాణించేలా చేస్తున్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో రాష్ట్రీయ సేవా భారతి అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి రేణుక పాఠక్, కేశవ సేవా సమితి అధ్యక్షుడు చామకూర సుధాకర్రెడ్డి, కేదార్నంద మహరాజ్, సీతారాం త్యాగి మహరాజ్, సేవా భారతి తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రెడ్డి, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ పర్వీన్, ప్రాజెక్టు మేనేజర్ ఇప్సిత దత్త, జిల్లా సేవాభారతి అధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతనలో బాలలు
మోర్తాడ్ మండలం సుంకెట్లోని శ్రీకృష్ణ మందిరంలో భగవద్గీత పారాయణం చేస్తున్న భక్తులు, పాల్గొన్న చిన్నారులు మోర్తాడ్(బాల్కొండ): ప్రపంచంలోనే అత్యంత ప్రామాణిక, ధార్మిక గ్రంథంగా కీర్తింపబడుతున్న భగవద్గీతను పారాయణం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారీ చిన్నారులు. వేసవి సెలవులను కాలక్షేపం కోసం కాకుండా ధార్మిక సేవపై దృష్టి సారించిన మోర్తాడ్ మండలం సుంకెట్ చిన్నారులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేయడంతోపాటు అవగాహన పెంపొందించుకుంటున్నారు. శ్రీకృష్ణ మందిరంలో రోజూ సాయంత్రం గీతా పారాయణ కార్యక్రమాన్ని భక్తులు రాజేందర్, కత్తి గంగాధర్, గోవర్దన్ నిర్వహిస్తుండగా గ్రామంలోని చిన్నారులు భాగస్వాములు అవుతున్నారు. భగవద్గీత ప్రాముఖ్యత గురించి ఎందరో మహానుభావులు గొప్ప గా వర్ణించారు. అందుకే తాము చదవలేకపో యినా మా చిన్నారులైనా శ్లోకాలను పఠించి అందులోని పరమార్థాన్ని గ్రహిస్తే తాము ఎంతో భా గ్యవంతులమైనట్లే అని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు.చిన్న వయస్సులోనే గీతా శ్లోకా లను కంఠస్థం చేయడం, అవగాహన పెంపొందించుకోవడంపై దృష్టి సారించిన చిన్నారుల ను అభినందించాల్సిందే. రోజుకు కొన్ని శ్లోకాలను చదువుతూ అర్థం తెలుసుకుంటున్నాం. మాకు అర్థం అయ్యేలా శ్లోకాల పూర్తి వి వరాలను చెబుతున్నారు. గీ తా పారాయణం ఎంతో బా గుంది. పోటీ పడి శ్లోకాలను కంఠస్థం చేస్తున్నాం. – శ్రీవాణి రోజూ సాయంత్రం ఎప్పుడెప్పుడవుతుందీ.. గీతా పారాయణానికి వెళ్లాలనే కాంక్ష మాలో బలంగా ఉంది. మాకు గీతా శ్లోకాలను చెప్పేవారు ఆలయం వద్దకు వెళ్లకముందే మేమే వెళుతున్నాం. గీతా గ్రంథాలను చదువుతున్నాం. – మాన్విత వేసవి సెలవులను వృథా కానివ్వకుండా గీతా శ్లోకాలను చదువుకుంటున్నాం. ఇంటివద్ద ఉన్నప్పుడు కూడా శ్లోకాలను చదువుకుంటూ అ ర్థం తెలుసుకుంటున్నాం. మా గ్రామంలో గీతా శ్లో కాలు చదివే కార్యక్రమం ఎంతో బాగుంది. – వర్షిత గీతా శ్లోకాలపై పోటీలను నిర్వహిస్తే మేము తప్పకుండా పాల్గొంటాం. రోజు కొన్ని శ్లోకాలను నేర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. – శ్రీనిత గీతా పారాయణంతో చదువుపై ఆసక్తి పెరిగింది. గీతలో శ్రీకృష్ణుడు ఎన్నో గొప్ప విషయాలను చెప్పడం అదంతా మన జీవితంతో ముడిపడి ఉందనే విషయాన్ని తెలుసుకున్నాం. చేసే పనిపై పట్టు సంపాదించడానికి గీతా పారాయణం తోడ్పడుతుంది. – హరిగ్న భగవద్గీత శ్లోకాలను పాఠశాలల్లోనూ నేర్పించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ గ్రంథం ఎంతో కీలకమైంది. గీతా పారాయణంతో మాకు ఎంతో అవగాహన వచ్చింది. మొదట్లో కొంత ఇబ్బంది అనిపించినా ఇప్పుడు సంతోషంగా ఉంది. – ప్రణవి ప్రతి ఒక్కరూ గీతా శ్లోకాలను చదువుకోవాలి. మనిషి జీవితం మొత్తం ఈ గ్రంథంపైనే ఆధారపడింది. మేము ఆటలాడుకోవడం కన్నా గీతా శ్లోకాలను నేర్చుకోవడంపైనే ఆసక్తిని పెంపొందించుకున్నాం. – వరునిత సెలవుల్లో గీతా పారాయణం భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేస్తున్న చిన్నారులు ఆదర్శంగా నిలుస్తున్న సుంకెట్ విద్యార్థులు -
చట్టాన్ని అతిక్రమించొద్దు
ఇందల్వాయి: గన్నారం గ్రామంలోని 853 సర్వే నంబర్ స్థల వివాదంపై ఏసీపీ ప్రకాశ్, ఆర్డీవో రాజేంద్రకుమార్ తహసీల్ కార్యాలయంలో గ్రామస్తులతో గురువారం సమావేశమయ్యా రు. వీడీసీ సభ్యులు, మాదిగ కులస్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాదాస్పద స్థలంపై రెవెన్యు అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ స్థలంలో గ్రామస్తులెవరూ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని సూచించారు. చట్టాన్ని అతిక్రమించి, అధికారుల ఆదేశాలను ధిక్కరిస్తే సహించబోమని తెలిపారు. సమావేశంలో డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై సందీప్, తహసీల్దార్ బాలయ్య, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: ఆలిండియా యూనివర్సిటీ ఉషూ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి ఫరియాకనమ్ కాంస్య పతకం సాధించింది. జమ్మూ కశ్మీర్లో ఈ నెల 4 నుంచి 9 వరకు పోటీలు జరిగాయి. ఫరియాకనమ్ గతంలో రుమోనియా, రష్యా దేశాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించింది. ఉషూ కోచర్ అబ్దుల్ఉమెర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటుంది. నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్, కార్యవర్గ పదవులకు జిల్లా పరిశీలకుడు చుక్కా శ్రీనివాస్ నగరంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో శ్రీనివాస్తోపాటు కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ లింగం, నగర చైర్మన్ వినయ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్, రాజ్ గగన్, రాజేశ్, దేగాం ప్రమో ద్, శాంతి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ● బక్రీద్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ● ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి క్రైం: బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతి భ ద్రతలకు ఎలాంటి విఘా తం కలగకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం తెలిపారు. జిల్లాలో 6 ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వాహనాలు ఆపడం, తనిఖీలు చేయ డం లాంటి అధికారాలు కేవలం ప్రభుత్వ విభాగాలకు మాత్రమే ఉంటాయన్నారు. వ్యక్తులు గానీ, సంస్థలు గానీ తనిఖీలకు దిగడం నిషేధమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ద్వేషపూరిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టు లు పెట్టినా చర్యలు తప్పవన్నారు. అలాంటి వాటిపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందన్నారు. ప్రజలందరూ సోదరభావంతో మెల గాలని కోరారు. ఎక్కడైనా శాంతికి విఘాతం కలిగించే అంశం ఏదైనా ఉంటే వెంటనే పోలీసుల(హెల్ప్లైన నంబర్– 87126 86133 )కు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేగానీ చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. మహిళాసంఘాల ద్వారా పసుపు విక్రయించండి నిజామాబాద్అర్బన్: పసుపును మహిళా సంఘాల ద్వారా ప్రతి ఇంటికి విక్రయించా లని పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం చై ర్మన్ తిరుపతిరెడ్డి గురువారం డీఆర్డీవో సా యన్నకు విన్నవించారు. సంఘం ఆధ్వర్యంలో తయారు చేసిన పసుపు ప్యాకెట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెమికల్స్ లేకుండా తయారు చేసిన పసుపు ప్రతి ఇంటికి అందిదే బాగుంటుందన్నారు. త్వరలోనే పసుపు పరిశ్రమను సందర్శించి మహిళా సంఘాల ద్వారా కల్తీలేని కె మికల్ లేని పసుపును ప్రతి కుటంబానికి చే రడానికి సహకరిస్తామని డీఆర్డీవో అన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నిజాంసాగర్(జుక్కల్): మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను గురువారం ఉదయం పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. మండలంలోని మాగి, అచ్చంపేట గ్రామ శివారుల్లోని మంజీరా నది నుంచి నిజాంసాగర్కు ఇసుకను తరలిస్తుండగా ట్రాక్టర్లను పట్టుకున్నామని చెప్పారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు వారిపైన కేసు నమోదు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల అనుమతుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ● ఇద్దరికి గాయాలు రుద్రూర్: కోటగిరి మండలం ఎత్తొండ గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కోటగిరికి చెందిన సాత్విక్, సాయిలు కారులో ప్రయాణిస్తుండగా ఎత్తొండ క్యాంపు సమీపంలో అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. -
క్షయ నిర్ధారణ పరీక్షలు పెంచాలి
డీఎంహెచ్వో రాజశ్రీ గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణకు హెచ్పీవీ వ్యాక్సిన్ సుభాష్నగర్: క్షయ రహిత సమాజమే అందరి లక్ష్యమని, వ్యాధి నిర్ధారణ పరీక్షలను పెంచి సిబ్బంది లక్ష్యాన్ని చేరుకోవాలని డీఎంహెచ్వో రాజ శ్రీ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో క్షయ నియంత్రణ విభాగం పనితీరు, లక్ష్యాల సాధనపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఆర్మూర్, బోధన్ ప్రాంతాల్లో పెండింగ్లో చాలా కేసులు ఉన్నాయని, వాటన్నింటిని నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల వారీగా క్షయ నిర్ధారణ శిబిరాలను నిర్వహిస్తూ నూతన కేసులను గుర్తించాలన్నారు. క్షయ రహిత గ్రామాల సంఖ్యను పెంచాలన్నారు. సర్పంచుల సహకారంతో లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. నిజామాబాద్ పట్టణంలో డివిజన్ల వారీగా క్షయ నిర్ధారణ శిబిరాలను నిర్వహించి, నూతన కేసులను గుర్తించడానికి ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. హెచ్ఐవీ, హెచ్బీఎస్ ఏజీ, వైడల్, హెచ్బీ, బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరీ, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, డీపీసీ లక్ష్మణ్, నరేశ్, రవిగౌడ్, వినోద్ సిబ్బంది పాల్గొన్నారు. సుభాష్నగర్: పద్నాలుగేళ్లు పూర్తి చేసుకున్న బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్పీవీ వ్యాక్సిన్ రక్షణగా నిలుస్తుందని డీఎంహెచ్వో రాజ శ్రీ తెలిపారు. నగరంలోని మాలపల్లి, అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని కార్పొరేటర్లు, మత పెద్దలతో హెచ్పీవీ వ్యాక్సిన్పై గురువారం చర్చించారు. ఈ సందర్భంగా వారికి అవగాహన కల్పించారు. మహిళల్లో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా బాలికలకు హెచ్పీవీ టీకాలు ఇస్తున్నామని తెలిపారు. డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్ మాట్లాడుతూ మైనార్టీ ఏరియాలోని ప్రతి బాలికకు హెచ్పీవీ టీకాను ఇప్పించడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అశోక్, డాక్టర్ అజ్మల్, డాక్టర్ అజ్మతున్నీసా బేగం, డిప్యూటీ డీఎంహెచ్వోలు సికందర్ నాయక్, రాణా ప్రతాప్, నవ్య, కార్పొరేటర్లు షకీల్, ఇంతియాజ్, రియాజ్, అమన్ ఫారూఖీ, ఆదిత్య, ముజీబ్, ఆజాద్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
డేంజర్ డంపర్లు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ నుంచి నల్లమట్టిని తరలిస్తున్న టిప్పర్లు, డంపర్లు యమదూతల్లా దూసుకొస్తున్నాయి. ఎక్కడి నుంచి ఏ టిప్పర్ తమపైకి వస్తుందోనని మండల ప్రజలు భయపడుతున్నారు. భారీ వాహనాల అతివేగానికి ప్రాణభయంతో రోడ్లు ఎక్కడానికే జంకుతున్నారు. డొంకేశ్వర్ మండలంలోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో అన్నారం, సిర్పూర్ గ్రామాల శివారు ప్రాంతాల్లో నల్లమట్టి తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. పంటల సాగు కోసం ఈ మట్టిని రైతుల పొలాలకు తరలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... మట్టిని తరలిస్తున్న టిప్పర్లు, డంపర్లతో పశువులకు, ప్రజలకు, చిన్న పిల్లలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇరుకురోడ్లు కలిగిన గ్రామాల మీదుగా భారీ వాహనాలను నిర్దిష్ట వేగంతో వెళ్లకుండా ఓవర్ స్పీడ్తో నడుపుతున్నారు. నిబంధనలకు ఉల్లఘించి రాత్రుల్లో కూడా రవాణా చేస్తున్నారు. దీంతో వాహనాల శబ్దం, దుమ్ముతో కాలుష్యం అవుతుతోంది. ఓవర్ లోడ్తో రోడ్లు ధ్వంసం అవుతున్నారు. రోడ్లకు దగ్గరగా ఆడుకునే చిన్నారులకు ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. నిమ్మకు నీరెత్తిన అధికారులు ఈ నెల 13న సాయంత్రం డొంకేశ్వర్ మీదుగా డంపర్లు అతివేగంగా వెళ్లడంతో ప్రమాదాలు జరిగాయి. సాయంత్రం సమయంలో ఒక డంపర్ వాహనం పశువులపైకి దూసుకెళ్లింది. ఓ గేదే తీవ్రంగా గాయపడింది. పక్కనే ఉన్న రైతు కండెల రాజన్న త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానిక రైతులు, గ్రామస్తులు టిప్పర్ను అడ్డుకొని డ్రైవర్ను పట్టుకున్నారు. అంతకు ముందురోజు డంపర్ కారణంగా విద్యుత్ వైర్ తెగిపోయి రోడ్డుపై పడిపోయింది. స్థానికంగా ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అనుభవం లేని వారితో నల్లమట్టి టిప్పర్లు నడిపిస్తున్నారని, కొంతమంది మద్యం సేవించి ఇష్టానుసారంగా తోలుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సాయంత్రం గేదెలను తీసుకొని ఇంటికి వస్తుండగా వేగంగా వస్తున్న టిప్పర్ పశువులపైకి దూసుకొచ్చింది. ఒకదానికి తీవ్రంగా దెబ్బ తగిలి రక్తం కారింది. పక్కనే నేను కూడా ఉన్నా, కొంచెం అయ్యి ఉంటే నా ప్రాణం కూడా పోయేది. నల్లమట్టి టిప్పర్ల మూలంగా రోడ్లపైకి రావాలంటేనే అందరికీ భయంగా ఉంది. – కండెల రాజన్న, బాధిత రైతు, డొంకేశ్వర్ పొలాలకు నల్లమట్టిని రవాణా చేసే విషయంలో రైతులందరం సానుకూలంగానే ఉన్నాం. కానీ, భారీ టిప్పర్లు, డంపర్లను అనుభవం లేని డ్రైవర్లు నడుపుతున్నారు. మద్యం సేవించి అతివేగంతో వెళ్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఏ అధికారి పట్టింపు లేకుండా ఉంటున్నారు. – గోక గంగారెడ్డి, రైతు, డొంకేశ్వర్ మితిమీరిన వేగంతో వెళ్తున్న నల్లమట్టి టిప్పర్లు డొంకేశ్వర్లో పశువులపైకి దూసుకెళ్లిన వాహనం రైతుకు త్రుటిలో తప్పిన ప్రమాదం మద్యం మత్తులో నడుపుతున్న అనుభవం లేని డ్రైవర్లు! చూసీచూడనట్లుగా ఉంటున్న అధికారులు, పోలీసులు -
రైతులను దోపిడీ చేయొద్దు
● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ● నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల పరిశీలనమోర్తాడ్(బాల్కొండ): ధాన్యం సేకరణ ప్రక్రియలో తరుగు పేరుతో రైతులను నిలువుదోపిడీ చేయొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి అన్నారు. తమ హయాంలో తరుగు అనే పదం లేకుండా ధాన్యం సేకరించి రైతులకు ఎంతో న్యాయం చేశామని పేర్కొన్నారు. బా ల్కొండ నియోజకవర్గంలోని దూద్గాం, రెంజర్ల, నాగంపేట్, చౌట్పల్లి, పిప్రి కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన సందర్శించారు. గన్నీ సంచులు లేకపోవడంతో ధాన్యం ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో కలెక్టర్ త నకు స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయి లో మాత్రం ధాన్యం అలాగే ఉందని ఆరోపించారు. అలాగే మక్కల కొనుగోళ్ల విషయంలో నూ నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. జిల్లా సరిహ ద్దు గ్రామమైన దూద్గాంపై నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. నిర్లక్ష్యాన్ని వీడకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
పనులను వేగవంతం చేయాలి
రుద్రూర్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని బోధన్ ఆర్డీవో విజయకుమారి సిబ్బందిని ఆదేశించారు. పోతంగల్ మండలం పీఎస్ఆర్ నగర్ (రాంగంగా నగర్) శివారులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన పనులను గురువారం ఆమె పరిశీలించారు. పనుల పురోగతిపై కాంట్రాక్టర్లు, గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ సమయంలో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కోటగిరి ఏఎంసీ చైర్మన్ గైక్వాడ్ హన్మంతు, తహసీల్దార్లు విష్ణు, గంగాధర్, రెవెన్యూ, హౌసింగ్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
వీడని పింఛన్ ఫికర్
● కొత్త పెన్షన్లకు లభించని మోక్షం ● 2022లో నిలిచిన ప్రక్రియ మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం సుంకెట్ కు చెందిన రమ్య భర్త గంగాధర్ అనారోగ్యంతో ఐ దేళ్ల క్రితం మరణించాడు. ఇంటి పెద్దదిక్కును కో ల్పోయిన రమ్య.. పిల్లలను బతికించుకోవడానికి వ్యవసాయ పనులకు వెళ్తోంది. రోజూ కష్టపడితేనే తిండిదొరికే పరిస్థితి ఆ కుటుంబానిది. వితంతు పింఛన్ కోసం రమ్య ఐదేళ్లుగా గ్రామ పంచాయతీ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇలా ఎంతో మంది అర్హులైన వితంతులు, వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ కోసం ఎదురు చూస్తూ నే ఉన్నారు. 2022లో పింఛన్ల మంజూరు ప్రక్రి య నిలిచిపోగా.. గతేడాది బడ్జెట్ ప్రసంగంలో డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నూతన పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. అయినప్పటికీ కొత్త పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాలేదు. పింఛన్లకు సంబంధించిన వెబ్సైట్ను హోల్డ్లో పెట్టారు. కొత్త పింఛన్ల విష యంలో ఏదో ఒక సందర్బంలో మంత్రులు ప్రకటనలు చేస్తున్నా మార్గదర్శకాలు మాత్రం జారీ కావ డం లేదు. కేవలం స్పౌజ్ ఆప్షన్ మాత్రమే పని చే స్తోంది. జిల్లాలో ప్రస్తుతం 2.69 లక్షల వివిధ రకాల పింఛన్లు అందుతుండగా, గతంలో ఆన్లైన్ చేసిన దరఖాస్తులు సుమారు 25వేల వరకు పెండింగ్లో ఉన్నాయి. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య 40 వేలకుపైగా ఉండొచ్చని అంచనా. కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేస్తే గ్రామ పంచాయతీల వారీగా దరఖాస్తులను సేకరిస్తాం. వెబ్ ఆప్షన్ ఇస్తే నే ఆన్లైన్లో నమోదు చేయడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకూ వేచి ఉండాలి. – తిరుమల, ఎంపీడీవో మోర్తాడ్ -
ఆలయాల భూములను పరిరక్షించాలి
నిజామాబాద్ రూరల్: ఆలయాల భూముల ను పరిరక్షించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని ఉమ్మడి జిల్లా దేవాదా య శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు అన్నారు. నగరంలోని సర్వే నంబర్ 341,342లో నీలకంఠేశ్వర ఆలయ భూము ల సర్వేను గురువారం చేపట్టారు. 3ఎకరా ల 9గుంటల భూమిలో ఆక్రమణలు ఉన్న ట్లు ప్రాథమికంగా గుర్తించామని విజయరామారావు తెలిపారు. కంఠేశ్వర్ దేవస్థాన భూ ములను భవిష్యత్లో లీజుకు ఇవ్వడం లేదా ప్రజ్రాయోజనార్థం, ఫంక్షన్ హాల్ తదితర నిర్మిణాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, దేవాదాయ శాఖ సర్వేర్ అనిల్, ఆలయ ఈవో రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన, ఒత్తిడి లేని విద్య మోపాల్(నిజామాబాద్రూరల్): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, ఒత్తిడి లేని విద్య ల భిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ విద్యావారోత్సవాల్లో భాగంగా గురువారం నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ లో బడిబాటపై ప్రత్యేకంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ ని ర్వహించారు. ప్రభుత్వం విద్యావ్యవస్థలో చే పట్టిన కార్యక్రమాలు, కల్పించనున్న సౌకర్యాలు డీఈవో వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కార్పొరేటర్ యాదల నరేశ్, మండల స్పెషల్ ఆఫీసర్ తిరుమల ప్రసాద్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు కల్లెడ అశోక్ ప్రసంగించారు. మూడేళ్లుగా పాఠశాలల్లో వి ద్యార్థుల నమోదు, విద్యాస్థితి, వివిధ అంశా ల్లో పాఠశాల చేపట్టిన కార్యక్రమాలను ఆడి యో, విజువల్ రూపంలో పాఠశాల హెచ్ఎం శంకర్ తల్లిదండ్రులకు వివరించారు. అంతకుముందు విద్యార్థులకు ప్రశంసాప త్రాలు అందించారు. అమ్మ ఆదర్శ పాఠశా ల కమిటీ అధ్యక్షుడు జమున పాల్గొన్నారు. రోడ్డు ఆక్రమణ తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ బోధన్: నిజామాబాద్ – బోధన్ ప్రధాన రో డ్డు వెంబడి ఎడపల్లి మండలంలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు పోలీస్ శాఖ ఆ ధ్వర్యంలో గురువారం స్పెషల్ డ్రైవ్ చేపట్టా రు. మండలంలోని జానకంపేట, ఎంఎస్సీ ఫారం, సాటాపూర్ గేట్, మండల కేంద్రంలోని మంగళ్పహాడ్ క్రాసింగ్ వద్ద రేకుల షె డ్డులను పొక్లెయిన్లతో తొలగించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ.. బోధన్– నిజామాబాద్ మధ్య, జానకంపేట నుంచి బాసర వెళ్లే 163 నంబర్ జాతీయ రహదారి వెంబడి ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, రోడ్డు స్థలం ఆక్రమణల కారణంగా ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందన్నారు. ఆక్రమణ తొలగింపునకు సహకరించాలన్నారు. బోధన్ రూర ల్ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై ము త్యాల రమ, సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ ఆకస్మిక తనిఖీలు సుభాష్నగర్: నిజామాబాద్ నగరంలోని 12, 41వ డివిజన్లలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. శానిటేషన్ కార్యక్రమాలతోపాటు తాగునీటి సరఫరాను పరిశీలించారు. తాగునీటి సరఫరాపై స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, ప్రజలతో మా ట్లాడిన ఆయన.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. నాణ్యమైన నీటిని సరఫరా చేయాలని, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఆయన వెంట కార్పొరేటర్లు, నాయకులు, మున్సిప ల్ ఈఈ పీర్ రాజు, డీఈలు, ఏఈలు, శానిటేషన్ సిబ్బంది, కాలనీవాసులు ఉన్నారు. -
నిజామాబాద్
వాతావరణం ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతుంది. మధ్యాహ్నం వడగాలులు వీస్తాయి. ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి నిర్మలంగా ఉంటుంది. డేంజర్ డంపర్లు ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ నుంచి నల్లమట్టిని తరలిస్తున్న టిప్పర్లు, డంపర్లు యమదూతల్లా రోడ్లపైకి దూసుకొస్తున్నాయి. శుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026– 8లో uభానుడి ఎఫెక్ట్ -
సీఎం గారు..?
హామీ మరిచారాసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే నిజామాబాద్కు రింగురోడ్డు నిర్మిస్తామని గత ఎన్నికల సభలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి దాన్ని మరిచిపోయారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పాలకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ ఇచ్చిన హామీని పట్టించుకోకపోవడమేమిటని నిట్టూర్పులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి తాజాగా రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, కరీంగనర్ నగరాల చుట్టూ రింగురోడ్లు నిర్మించేందుకు నిర్ణయించి, నిజామాబాద్ రింగురోడ్డు విషయాన్ని పట్టించుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రతిపాదించిన జక్రాన్పల్లి విమానాశ్రయాన్ని అటకెక్కించారని, మరోవైపు డ్రైపోర్టు అంశాన్ని పక్కకు పెట్టారని, హైదరాబాద్–నాగ్పూర్ పారిశ్రామిక కారిడర్ విషయాన్ని మరిచారని జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఽడాక్టర్ భూపతిరెడ్డి నగరం చుట్టూ ఔటర్ రింగ్రోడ్ కోసం రూ.2వేల కోట్లతో ప్రతిపాదనలు, గుండారం వద్ద 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్ కోసం ప్రతిపాదనలు పంపారు. వరంగల్ తర్వాత పెద్ద నగరంగా ఉన్న నిజామాబాద్పై ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇందూరుకు రింగ్ రోడ్డు నిర్మిస్తామని సీఎం ఇచ్చిన హామీని నగర ప్రజలు గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర నగరాలకు రింగ్ రోడ్ ప్రకటించి జిల్లాకు మొండిచేయి చూపడంపై అసహనం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సీఎం ఇచ్చిన హామీలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇందూరుకు రింగ్ రోడ్ ఎప్పుడు? గత మున్సిపల్ ఎన్నికల్లో సీఎం ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్న ప్రజలు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్లు జక్రాన్పల్లి విమానాశ్రయం, డ్రైపోర్టు, హైదరాబాద్–నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడర్లు సైతం అటకెక్కించడంపై జనాల్లో అసహనం -
జిల్లాకు చేరుకుంటున్న జీలుగ
● 50 శాతం సబ్సిడీపై సొసైటీల ద్వారా త్వరలో పంపిణీ ● వ్యవసాయశాఖకు అందిన ఉత్తర్వులుడొంకేశ్వర్(ఆర్మూర్) : వానకాలం సాగు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ జిల్లాకు అవసరమైన జీలుగ, జనుము విత్తనాలను తెప్పిస్తోంది. 10 వేల క్వింటాళ్లకుగాను ప్రస్తుతం 1310 క్వింటాళ్లు జిల్లాకు చేరుకున్నాయి. మిగతావి కూడా విడతల వారీగా తెప్పించే పనిలో ఉన్నారు. పంటలకు అధిక దిగుబడులనిచ్చే పచ్చి రొట్ట విత్తనాలను సొసైటీల ద్వారా 50శాతం సబ్సిడీపై రైతులకు త్వరలో పంపిణీ చేయనున్నారు. ఇందుకు రైతు ఆధార్, పట్టా పాస్పుస్తకం చూపాల్సి ఉంటుంది. 30 కిలోలు ఉండే ఒక జీలుగ బస్తా ధర రూ.4,904 ఉండగా, సబ్సిడీ పోను రైతులు రూ.2,452 చెల్లిస్తే సరిపోతుంది. అలాగే 44 కిలోల జనుము బస్తా ధర రూ.6,220 కాగా, రైతులు రూ.3,100 చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు దీని సంబంధిత ఉత్తర్వులు వ్యవసాయ శాఖకు అందాయి. లాభాలివే.. ● జీలుగను కలియదున్నడం వలన ఎకరానికి సుమారు 8 నుంచి 10 టన్నుల సేంద్రియ పచ్చిరొట్ట లభిస్తుంది. ఇది మట్టిని సారవంతం చేసి మేలు చేస్తుంది. ● చౌడు, లవణ గుణాలు ఎక్కువగా ఉన్న నేలలకు జీలుగ అత్యంత అనుకూలమైంది. ఇది నేల పీహెచ్ స్థాయిని తగ్గించి, చౌడును విరిచేందుకు సహాయపడుతుంది. ● నేల గుల్లబారి గాలి ప్రసరణ పెరుగుతుంది. ఫలితంగా భూమికి నీటిని, పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్ధ్యం బాగా పెరుగుతుంది. ● జీలుగ మొక్కలు వేగంగా పెరిగి పొలమంతా దట్టంగా అల్లుకుపోవడం వల్ల కలుపు మొక్కలు పెరగడానికి అవకాశం ఉండదు. వరి పంట దిగుబడి 20శాతం వరకు పెరుగుతుంది.ఎకరానికి 12 నుంచి 15 కిలోల జీలుగ విత్తనా లు అవసరమవుతా యి. విత్తనాలు విత్తిన 40 నుంచి 45 రోజుల వ్యవధిలో పూత దశకు రాగానే నీరు పెట్టి పొలంలోనే కలియదున్నాలి. ఆ తర్వాత పది రోజులు కుళ్లనిచ్చి తదుపరి పంటను వేయాలి. త్వరలోనే సొసైటీల ద్వారా వి త్తనాలను సబ్సిడీపై అందజేస్తాం. – మధుసూదన్, మండల వ్యవసాయాధికారి, డొంకేశ్వర్ -
కలసికట్టుగా పోరాడాలి..
జిల్లా అభివృద్ధి కోసం ప్రజలంతా కలసికట్టుగా ప్రజాప్రతి నిధులు, నాయకులపై ఒత్తిడి తీసుకురావాలి. సీఎం ప్రకటించిన వాటిలో ఒక్క నిజామాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులు తప్ప ఇతర అన్ని జిల్లాలవి ఉన్నాయి. నిజామాబాద్ రింగురోడ్డు హామీ నిలబెట్టుకోకపోగా, ప్రకటించిన టెంపుల్ కారిడర్లు, టూరిజం కారిడర్లలో సైతం జిల్లా ప్రస్తావనే లేదు. ఇది శోచనీయం. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్రెడ్డి ఇచ్చిన రింగురోడ్డు హామీ అలాగే వదిలేశారు. ఇక 2009లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రతిపాదించిన జక్రాన్పల్లి ఎయిర్పోర్టు విషయాన్నీ తర్వాత ప్రభుత్వాలు వదిలేశాయి. ఇక కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ నగరానికి 50 బస్సులను కేటాయించి, సిటీ బస్సు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో 10 ఎకరాల స్థలం చూపించమంటే దాన్నీ పెండింగ్లో పెట్టడం సరికాదు. ఖమ్మం, కరీంనగర్ కంటే పెద్దదైన నిజామాబాద్ నగరానికి రింగురోడ్డు ఇవ్వకపోవడం సరికాదు. జనాభా, ఓటర్లు, విస్తీర్ణం పరంగా పెద్దదైన నిజామాబాద్ను వదిలేసి ఆ నగరాలకు మాత్రం రింగురోడ్డులు ఇస్తే జిల్లా నాయకులు మాత్రం స్పందించకపోవడం శోచనీయం. – రేకులపల్లి చంద్రశేఖర్రెడ్డి, అధ్యక్షుడు, జిల్లా అభివృద్ధి సంస్థ -
మొక్కజొన్నను గోదాములకు తరలించాలి
మోపాల్(నిజామాబాద్రూరల్): మొక్కజొన్న రైతులకు ఏ దశలోనూ అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత అధికారులదేనని, సేకరించిన పంట దిగుబడిని గోదాములకు తరలించి భద్రపర్చాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మండలంలోని శ్రీరాంనగర్ తండాలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. మొక్కజొన్న నాణ్యత, తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించిన కలెక్టర్.. ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషన్ ద్వారా తూకం సరిగా చేస్తున్నారా..? లేదా? అని గమనించారు. ఎన్ని క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు పూర్తయ్యింది.. ఇంకా ఎంత మేరకు పంట దిగుబడి సేకరించాల్సి ఉందనే వివరాలు అడిగి తెలుసుకుని అధికారులకు సూచనలు చేశారు. అనంతరం శ్రీనగర్లోని గోదామును కలెక్టర్ సందర్శించారు. మొక్కజొన్న అన్ లోడింగ్ తీరు, బస్తాలు భద్రపరుస్తున్న విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి బస్తాలను త్వరితగతిన తరలించేందుకు తగినన్ని లారీలు, ఇతర రవాణా వాహనాలు వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రేఖానాయక్, ఎంపీడీవో రాములునాయక్, మార్క్ఫెడ్ సిబ్బంది భాస్కర్, సొసైటీ సీఈవో నర్సయ్య, స్థానిక సిబ్బంది, రైతులు ఉన్నారు. -
నిరాశ మిగిల్చిన నువ్వు
● మద్దతు ధరను మించినా లాభం లేదంటున్న రైతులు ● క్వింటాల్ ధర గతంలో రూ.16 వేలు.. ప్రస్తుతం రూ.10 వేలు దాటని వైనంమోర్తాడ్(బాల్కొండ): నువ్వు సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు రూ.8,200 కాగా, ప్రస్తు తం మార్కెట్లో రూ.10వేల వరకు వ్యా పారులు చెల్లిస్తున్నారు. మద్దతు ధరకన్నా రూ.1800 వరకు ఎక్కువ లభిస్తున్నా తమకు నష్టమేనని రైతులు వాపోతున్నారు. గతంలో క్వింటాల్ ధర రూ.16 వేలకు పైగా పలికింది. అయితే అదే ట్రెండ్ కొనసాగుతుందని ఆశించి నువ్వు సా గు చేసిన రైతులకు నిరాశ ఎదురైంది. రెండు మూడేళ్ల క్రితం క్వింటాల్ ధర రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు ఉండడంతో యాసంగి సీజన్లో సజ్జకు పత్యామ్నాయంగా నువ్వునే సాగు చే స్తున్నారు. ఈ సీజన్లో దాదాపు 6 వేల ఎకరాల్లో నువ్వు సాగు చేశారు. క్వింటాల్కు రూ.15వేల వరకు ధర లభిస్తేనే ఎంతోకొంత ప్రయోజనం ఉండేదని రైతులు అంటున్నారు. వర్షం కారణంగా పంట దిగుబడి తగ్గిందని వాపోతున్నారు. దిగుబడి ఎక్కువ వచ్చిన చోట్ల ధర ఎలా ఉన్నా ఆదాయం పరవాలేదంటున్నారు. దిగుబడి తగ్గిన చోట మాత్రం నష్టం తప్పలేదంటున్నారు. -
బస్తాకు బైబై!
నానో యూరియా వినియోగానికి రైతుల మొగ్గు● తక్కువ ఖర్చు.. మంచి దిగుబడులు ● ఎరువు కొరతను తాము ఎదుర్కోలేదంటున్న రైతులుడొంకేశ్వర్(ఆర్మూర్): యూరియా బస్తాలకు క్రమంగా రైతులు దూరమవుతున్నారా? అంటే అవుననే చెప్పొచ్చు. రసాయనిక ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతింటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం, ఇఫ్కో వంటి సంస్థలు నానో యూరియాను అందుబాటులోకి తెచ్చాయి. మొదట్లో నానో యూరియా వినియోగానికి అంతగా ఆసక్తి చూపని రైతులు క్రమంగా దాని ప్రధాన్యతను తెలుసుకుంటున్నారు. గతంలో 45కిలోల బస్తాలను మోయలేక ఇబ్బంది పడిన వారు ఇప్పుడు కేవలం ఒక బాటిల్తోనే పని పూర్తి చేసుకుంటున్నారు. నానో యూరియా అందుబాటులోకి రావడంతో ఎరువుల కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని అంటున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసినప్పటికీ రానున్న వానకాలం సీజన్లో బస్తాల ఎరువు కొరత ఏర్పడే అవకాశాలున్న నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో అధిక లాభాలను తెచ్చే ‘నానో యూరియా’నే ప్రత్యామ్నాయంగా వినియోగించాలని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 10వేలమంది రైతులు 50వేల ఎకరాలకు పైగా నానో యూరియా, నానో డీఏపీ వినియోగించి పంటలు సాగు చేస్తున్నారు. మంచి ఫలితాలు సాధించిన పలువురు రైతులు వీరే.. -
రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీ
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ ప్రాంతంలో ఉన్న రైస్ మిల్లులను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లక్ష్మీబాలాజీ, శ్రీ సిద్ధి రామేశ్వర రైస్ మిల్లులను సందర్శించిన కలెక్టర్.. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం వచ్చింది? దిగుమతి చేసుకున్నారా? ఎక్కువగా ఏ రకం ధాన్యం వస్తోంది? ఎంత పరిమాణంలో మిల్లింగ్ పూర్త య్యింది? మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు.. తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిల్లుల వద్ద ఏమైనా తరుగు తీస్తున్నారా అని ఆరా తీశా రు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంటవెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. అవసరమైతే ఎక్కువ సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ధాన్యం నిల్వ చేసేందుకు సమీపంలోని రైతు వేదికలను వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం ప్రవీణ్, రైస్ మిల్లుల నిర్వాహకులు వి మోహన్రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులున్నారు. ప్రశాంతంగా పాలిసెట్ ఖలీల్వాడి: జిల్లాలో పాలిసెట్ బుధవారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొ త్తం 6490 మంది విద్యార్థులకు గాను 5,984 మంది హాజరుకాగా.. 506 మంది గైర్హాజరయ్యారు. ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వారిలో బాలురు 2,808 మంది, బాలికలు 3176 మంది ఉన్నారు. బాలురు 239 మంది, బాలికలు 267 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షాకేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అయితే ముందస్తు సూచనలు చేయకుండానే చాలా సెంటర్ల వద్ద విద్యార్థుల ఆధార్కార్డు అడగడంతో వారు ఇబ్బందులు పడ్డారు. దగ్గరలోని ఇంటర్నెట్ సెంటర్లకు, ఇళ్లకు పరుగులు తీశారు. సెంటర్లకు వచ్చిన తరువాత ఆధార్ కార్డు అడుగుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం ఖలీల్వాడి: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మొదటి రోజైన బుధవారం ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఒకేషనల్లో జనరల్ ఫౌండేషన్ కోర్స్ పరీక్షలు జరిగాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్లలో పరీక్షలు కొనసాగగా, ఫస్టియర్ విద్యార్థులు 4,009 మందికిగాను 3,752 మంది, సెకండియర్ విద్యార్థులు 1401 మందికిగాను 1319 మంది హాజరైనట్లు డీఐఈవో వివరించారు. కలెక్టర్ను కలిసిన డీఆర్వో నిజామాబాద్అర్బన్: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా బి గీత బుధవారం బాధ్యత లు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ను మ ర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. పలు అంశాలపై వారిద్దరు చర్చించారు. -
చెట్టు కొమ్మ విరిగి వాహనదారుడికి గాయాలు
మోపాల్: మండలంలోని బోర్గాం(పి) శివారులో చెట్టు కొమ్మ విరిగి పడి మంచిప్ప గ్రామానికి చెందిన వాహనదారుడు భూమన్నకు బుధవారం గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. బోర్గాం శివారులో వరి కొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. రాత్రంతా కాలిన మంటలు కాస్త రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు అంటుకున్నాయి. నిజామాబాద్ నుంచి బైక్పై భూమన్న వెళ్తుండగా అదే సమయంలో చెట్ల కొమ్మలు ఆయనపై పడ్డాయి. ప్రమాదంలో భూమన్నకు గాయాలు కాగా 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. -
క్రైం కార్నర్
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్ర సమీపంలోని పెద్దవాగులో ప్రమాదవశాత్తు వాగులో పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మంద అనిల్కుమార్(28) ఫిట్స్తో బాధపడుతున్నాడు. ఈ నెల 11న ఉదయం ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. బుధవారం ఉదయం పెద్దవాగులోని గుర్రం మడుగులో అనిల్కుమార్ మృతదేహం నీటిపై తేలడాన్ని స్థానికులు గమనించి సమాచారం అందించారు. భార్య భవానీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. గల్ఫ్లో రాజంపేట యువకుడు.. భిక్కనూరు: రాజంపేట మండల కేంద్రానికి చెందిన యువకుడు గల్ఫ్లో మృతి చెందినట్లు గ్రామస్తులు బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన జొన్నల బాలకృష్ణ (24) కొన్నేళ్లుగా గల్ఫ్ దేశానికి వలస వెళ్తున్నాడు. ఆరు నెలల క్రితం రాజంపేటకు వచ్చి తిరిగి బహ్రెయిన్ దేశానికి వెళ్లి పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం తోటి మిత్రులు బాలకృష్ణ్ణను నిద్రలేపడానికి ప్రయత్నించగా లేవలేదు. నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబీకులకు సమాచారం అందించారు. -
ప్రతి సోమవారం ధర్మవాణి
● ఎండోమెంట్ ఆస్తులను పరిరక్షించాలి ● ఉమ్మడి జిల్లా ఈవోల సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ విజయరామారావునిజామాబాద్ రూరల్: దేవాలయాల సిబ్బంది సమస్యలను పరిష్కరించడంతోపాటు భక్తుల నుంచి దేవాదాయశాఖకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించేందుకు ప్రతి సోమవారం ‘ధర్మవాణి’ నిర్వహిస్తామని దేవాదాయ ధర్మాదాయశాఖ ఉప సంచాలకులు విజయరామారావు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహణ అధికారులతో బుధవారం ప్రత్యేక స మావేశం నిర్వహించారు. దేవాలయాల భూము లు, ఆస్తుల పరిరక్షణ, ఆదాయ వృద్ధి, ఆలయాల నిర్వాహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా విజయరామారావు మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీ నుంచి ధర్మవాణి ప్రారంభమవుతుందన్నారు. ఆలయాల భూముల సర్వే పూర్తికాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కమిషనర్ ఉత్తర్వుల మేరకు సర్వే, ల్యాండ్ రికార్డుల వారికి లేఖ పంపించామన్నారు. భూముల సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఆలయాల్లో బంగారం, వెండి ఆభరణాల వెరిఫికేష న్ చేపట్టాలని, సంబంధిత అధికారులతో సమన్వ యం చేసుకొని ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాల ఆవరణలో తడకలు, పందిళ్లు వేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆలయాల ఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఢిల్లీలో జిల్లా యువకుడి ఆత్మహత్య
ఇందల్వాయి: మండలంలోని రూప్లనాయక్ తండాకి చెందిన విశాల్ నాయక్ (23) ఢిల్లీలో బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విశాల్ ఓ ప్రైవేట్ సంస్థలో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. గురువారం రూప్లానాయక్ తండాలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానికులు తెలిపారు. మహిళ ..బోధన్ రూరల్: మండలంలోని కల్దుర్కి గ్రామానికి చెందిన లక్ష్మి(58) అనారోగ్యం, మతిస్థిమితం సరిగాలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. బుధవారం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. -
కొనుగోళ్లు వేగవంతం చేస్తాం
● బోధన్ ఆర్డీవో విజయకుమారి ● హున్సాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పరిశీలన బోధన్: రైతులు పండించిన మొక్కజొన్న కొనుగో లు ప్రక్రియను మరింత వేగవంతంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటామని బోధన్ ఆర్డీవో విజయకుమారి భరోసా ఇచ్చారు. సాలూర మండలంలోని హున్సా ప్రాథమిక వ్యవసాయ సహకారం అ ధ్వర్యంలో మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన మొ క్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ డీఎం క్రాంతి, మండల అధికారులతో కలిసి బుధవారం ఆమె పరిశీలించారు. రైతువేదిక భవనం ఆవరణలో ని కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిల్వ చేసిన మొ క్కజొన్న దిగుబడులను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రవాణా, పాత గోనె సంచుల సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల క్రితం హున్సా సహకార సంఘం చైర్మన్ రవి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి మొక్కజొన్న రైతుల ఇబ్బందులను తెలిపారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని కలెక్టర్తో మాట్లా డారని చైర్మన్ తెలిపారు. సహకార సంఘం చైర్మన్ మందర్నా రవి, తహసీల్దార్ నవాజ్, ఏవో శ్వేత, సొసైటీ సీఈవో హన్మంత్రావు, రైతులు ఉన్నారు. -
రైతన్నా.. నన్ను కాల్చకు..
నేలతల్లి రోదన: డొంకేశ్వర్(ఆర్మూర్): ఓ రైతన్నా! ఆరుగాలం కష్టపడి నన్ను నమ్ముకున్న నిన్ను... కన్న బిడ్డలా సాకి అన్నం పెట్టాను. పంట కోసిన తర్వాత నా ఒడిలో మిగిలిన వ్యర్థాలకు నిప్పు పెట్టి ఎందుకు కాల్చుతున్నావు? ఆ మంటలు నా శరీరానికి తగిలి నేను తల్లడిల్లిపోతున్నాను. అగ్గి గాయాలతో మండిపోతున్నాను. నాలోని సారాన్ని, నాకు మేలు చేసే సూక్ష్మజీవులను అగ్నికి ఆహుతి చేయకు. నేను బలహీన పడితే రేపు నీకు నాణ్యమైన పంటను ఎలా ఇవ్వగలను? ఇకనైనా మార్పు తెచ్చుకో... దయచేసి నన్ను రక్షించు. పచ్చని చెట్ల ఆవేదన: నాడు మీకు ప్రాణవాయువునిచ్చి నిలిపాను. నేడు ప్రాణమున్న శవమై మిగిలా ను.పచ్చని ఆకులతో బాటసారికి నీడనిచ్చా.. కానీ, నీ స్వార్థపు సెగలో నేను కాలిపోతున్నా. అన్నదాతా నీ పంట కోసం వేసిన మంట నా పచ్చని బతుకును బుగ్గిపాలు చేసింది. రెమ్మలన్నీ కాలిపో యాయి.. కొమ్మలన్నీ మాడిపోయాయి.. నీవు పెట్టిన ఈ చిచ్చు ప్రకృతి మాత గుండెకు తగిలిన మంట కాదా? నా నీడలో సేద తీరిన పక్షులు ఇళ్లు కోల్పోయాయి. నా నుంచి వచ్చే గాలి కలుషితమైపోయింది. రేపు నేను లేకపోతే నీ పిల్లలకు నీడ ఎక్కడిది? ఊపిరి ఎక్కడిది? -
రాజకీయ లబ్ధి కోసం ప్రశాంత్రెడ్డి ప్రయత్నాలు
● రైతులు బీఆర్ఎస్ నాయకుల మాయమాటల్లో పడొద్దు ● రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజకీయ లబ్ధి కోసం బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే మోర్తాడ్లో రైతు ధర్నా పేరుతో కార్యక్రమం నిర్వహించారని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మిల్లర్ల దోపిడీ పెరిగిందంటున్న ప్రశాంత్రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో, తాము అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో మిల్లర్ల దోపిడీపై చర్చకు సిద్ధ మా అని సవాల్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై గత రెండు వారాలుగా సుదర్శన్రెడ్డి, మహేశ్కుమార్గౌడ్, భూపతిరెడ్డి నిరంతరం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారన్నారు. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో, వ్యవసాయ శాఖ సెక్రెటరీతో, పౌరసరఫరాల శాఖ అధికారుల తో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ వస్తున్నారన్నారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా తాము చేస్తున్న ప్రయత్నాలు ప్రశాంత్రెడ్డికి తెలియకపోవడం దురదృష్టమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు మాత్రం కొవిడ్ విపత్తు సమ యంలో మిల్లర్లను దోచుకున్నారని ఆరోపించారు. పేరు గొప్ప కోసం మిల్లర్ల వద్ద బియ్యం తీసుకుని మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ నాయకులదేనన్నారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. -
పదిలో ముందస్తు రైడ్స్
రుద్రూర్: పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు ముందు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ని ర్వహిస్తుంటారు. కానీ, ఈ స్వచ్ఛంద సంస్థ మా త్రం తొమ్మిదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ను పదో తరగతి కోసం సన్నద్ధం చేస్తోంది. వేసవి సెలవులను పిల్లలు వృథా చేయకుండా ప్రతి రోజు ఉదయం మూడు గంటలపాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోందీ రుద్రూర్లోని రైడ్స్ స్వచ్ఛంద సంస్థ. మండల కేంద్రానికి చెందిన పూర్వ విద్యార్థులు రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ (రైడ్స్) ఆధ్వర్యంలో రెండేళ్లుగా నిష్ణాతులైన ఉపాధ్యాయుల సహకారంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. గత నెల 27న ప్రారంభమైన తరగతులు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. ప్రతి ఉదయం 8 నుంచి 11 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 108 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా, ప్రతిరోజూ సుమారు 80 మంది హాజరవుతున్నారు. గత ఏడాది శిక్షణ పొందిన విద్యార్థులు మంచి మార్కులు సాధించడంతో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఏడాది సమీప గ్రామాల నుంచి విద్యార్థులు హాజరవుతున్నారు. వీరికి వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన 17 మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బోధిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యాబోధనతోపాటు యోగా, ఆరోగ్యంపై కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ దాతల సహకారంతో విద్యార్థులకు అల్పాహారం అందజేస్తున్నారు. 1995–96 ఎస్సెస్సీ బ్యాచ్కు చెందిన రైడ్స్ సభ్యులు విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. -
వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఉచిత వేసవి క్రికెట్ కోచింగ్ క్యాంప్ బుధవారం ప్రారంభమైంది. కౌన్సిలర్ అర్కల ప్రభాకర్ యాదవ్, జిల్లా క్రీడా అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ ఎంతో ఖర్చుతో కూడుకున్న క్రీడ అని, గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికే హెచ్సీఏ ఉచిత శిక్షణను అందిస్తోందని తెలిపారు. అండర్–15, అండర్–19, ఓపెన్ కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జిల్లా, రాష్ట్రస్థాయి సెలక్షన్లలో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. క్రీడలు యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి, మానసిక ధైర్యా న్ని, ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని తెలిపారు. కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోజాం అలీ ఖాన్, కోచ్లు రామకృష్ణ, రియాజ్, క్రీడాకారులు పాల్గొన్నారు. నేను గీసిన చిత్రం● చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే ఆ వంకర టింకరవి ఏమి కాయలని అడిగిందట! (కొద్దిగా సంపద రాగానే తన గతాన్ని, మూలాలను మరిచిపోయి, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు నటించే వారి అహంకారాన్ని ఈ సామెత ఎత్తి చూపుతుంది.) ● ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు! (ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం ఎంత కష్టమో అనుభవిస్తే తెలుస్తుంది.) మాలోత్ పల్లవి, 6వ తరగతి గ్రామం : తిమ్మారెడ్డి తండా, మం : ఎల్లారెడ్డి, జిల్లా : కామారెడ్డి. -
110 గ్రాముల గంజాయి పట్టివేత
బోధన్టౌన్/బోధన్: పట్టణంలోని కొత్త బస్టాండ్లో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకొని 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన మిర్జా జుబేర్ బేగ్ బోధన్కు వస్తున్నట్లు ఈగల్ టీం సమాచారం మేరకు కొత్త బస్టాండ్లో పట్టుకున్నామన్నారు. నిందితుడిని విచారించగా మిర్జా జుబేగ్ బేగ్ గంజాయి సరఫరా చేస్తాడని, ఈ నెల 11న అరెస్టయి జైలులో ఉన్న ధనుష్కు నాందేడ్లో 1 కేజీ 660 గ్రాముల గంజాయి విక్రయించినట్లు తెలిపారు. మిర్జా జుబేగ్ బేగ్పై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు. గంజాయి పట్టుకున్న ఎస్సై హబీబ్ ఖాన్, సిబ్బంది మహేశ్, గంగారాం, వరుణ్, ఈగల్ ఆర్ఎస్సీసీ టీం నిజామాబాద్ ఇన్స్పెక్టర్ పూర్ణేశ్వర్, సిబ్బందిని సీపీ అభినందించినట్లు సీఐ తెలిపారు. -
డివైడర్ను ఢీకొన్న బైక్
● భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు పిట్లం(జుక్కల్): మండలంలోని గద్దగుండు తండా శివారు జాతీయ రహదారిపై బుధవారం మధ్యా హ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొడప్గల్ మండల కేంద్రానికి చెందిన మారేపల్లి హన్మాండ్లు తన భార్య లక్ష్మి(48)తో ఎల్లారెడ్డి మండలం కళ్యాణిలో నిర్వహిస్తున్న బంధువుల వివాహానికి బైక్పై వస్తున్నారు. గద్దగుండు తండా సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న లక్ష్మి కిందపడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. హన్మాండ్లుకి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలి తల్లి మేత్రి సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పడి లేచిన సోయా ధర
● క్వింటాల్కు రూ.4,500 నుంచి రూ.7,200కు.. ● అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ● అన్ సీజన్లో పెరిగిన రేటుమోర్తాడ్(బాల్కొండ): సోయా గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఏర్పడటంతో ధర గణనీయంగా పెరిగింది. క్వింటాల్ ధర ఏకంగా రూ.7,200 పలుకుతోంది. సీజన్లో వ్యాపారులు రూ.4,500 లోపు ధర చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేశారు. గతంలో జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల వరకు విస్తీర్ణంలో రైతులు సోయా సాగు చేశారు. అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతిని దిగుబడి తగ్గడం, మార్కెట్లో ఆశించిన ధర లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపడంతో సోయా సాగు విస్తీర్ణం 30వేల ఎకరాలకే పరిమితమైంది. సీజన్లో రూ.5వేలు దాటని ధర ఇప్పుడు భారీగా పెరగడంతో స్టాక్ ఉంచిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో సోయా ధర అనూహ్యంగా పెరిగింది. వచ్చే వర్షాకాలం సీజన్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. -
లారీలను అందుబాటులో ఉంచాలి
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్పల్లి: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తరలించేందుకు లారీలను అందుబాటులో ఉంచాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండలంలోని కోనసముందర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. కల్లాల వద్ద ఉన్న రైతులతో మాట్లాడి, ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచే ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు. ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం వస్తున్న రెండు లారీలు సరిపోవని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కలెక్టర్ మాట ఇచ్చిన విధంగా 8 రోజుల్లోగా సేకరణ పూర్తి చేయాలని అన్నారు. బషీరాబాద్ కేంద్రంలో ఇప్పటి వరకు కేవలం 20 శాతం ధాన్యం మాత్రమే లిఫ్ట్ అయిందని, మిగిలిన 80 శాతం ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. లారీల రాకను పెంచాలని జేసీకి సూచించారు. వర్షాల ముప్పు పొంచి ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన ధాన్యం తరలింపు చేపట్టాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడు శ్రీనివాస్ గురువారం జిల్లాకు రానున్నారు. కాంగ్రెస్ భవన్లో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్ష పదవితోపాటు ఇతర కార్యవర్గానికి సంబంధించి ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడి నియమాకం నిర్వహించనున్నారు. నిజామాబాద్ రూరల్: ఆర్టీసీ నిజామాబాద్ డి పో–1లో ఈ నెల 16న కార్గో పార్సిల్స్కు సంబంధించిన వస్తువుల వేలంనిర్వహించనున్న ట్లు మేనేజర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆస క్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలని కోరారు. ● అధికారులకు అప్పగింత నిజామాబాద్ అర్బన్: నగరంలోని బాలసదనం నుంచి పారిపోయిన బాలికను పోలీసులు పట్టుకొని అధికారులకు అప్పగించారు. మంగళవారం ఉదయం ముగ్గురు బాలికలు బాలసదనంలో ఉండటం ఇష్టం లేక తప్పించుకొని ఇంటికి పారిపోయారు. ఇద్దరు బాలికలు అదే రోజు సాయంత్రం పోలీసులకు పట్టుబడ్డా రు. మూడో బాలిక బుధవారం బాసరలో పట్టుబడింది. మూడో టౌన్ పోలీసులు బాలికను బాలసదనం అధికారులకు అప్పగించారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని వినాయక్నగర్ నాగా టవర్స్లో బుధవారం దుండగులు చోరీకి పాల్పడ్డారు. 204 ప్లాట్ నంబర్లో నందిపేటలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తించే కొత్తూరు వనజ నివసిస్తున్నారు. ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. 5 తులాల బంగారం, 15 తులాల వెండి, రెండు ఉంగరాలు అపహరణకు గురైనట్లు 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్హెచ్వో సతీశ్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. అపార్ట్మెంట్లో సీసీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు ప్లంబర్ పని ఉందని అపార్ట్మెంట్లోకి వచ్చినట్లు గుర్తించారు. -
శాంతి భద్రతలపై దృష్టి సారించాలి
నిజామాబాద్అర్బన్: బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. బుధవారం డీజీపీ వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా ప్రార్థన స్థలాలు, ఈద్గాలు, మసీదులు, ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని సూచించారు. పండుగ రోజు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు వ్యాప్తి చెందకుండా సైబర్ మానిటరింగ్ను మరింత బలోపేతం చేయాలన్నారు. శాంతి కమిటీ సభ్యులతో ముందస్తు సమావేశాలు నిర్వహించాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సున్నిత ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి డ్రోన్, సీసీ కెమెరాలు పర్యవేక్షణలో భద్రత చర్యలను కట్టుదిట్టం చేయాలన్నారు. అన్ని చెక్పోస్టులలో 24 గంటలు విధులు నిర్వహించాలన్నారు. రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాటాపూర్ వద్ద జరిగే పశువుల సంతలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీసీలో సీపీ సాయి చైతన్య, అదనపు డీసీపీ శుభం ప్రకాష్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్కుమార్, ఆర్మూర్, నిజామాబాద్, బోధన్ ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ తదితరులు పాల్గొన్నారు. వీసీలో పాల్గొన్న సీపీ సాయిచైతన్య, ఇతర పోలీసు అధికారులు -
ధాన్యం తరలింపును వేగవంతం చేయాలి
పెర్కిట్(ఆర్మూర్): కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అకాల వర్షం కురిస్తే ధాన్యం తడిసి పోయే అవకాశం ఉంటుందని, తరలింపును వేగవంతం చేయాలని సూచించారు. టార్పాలిన్లను అందుబాటులో ఉంచాల న్నారు. అలాగే రైస్ మిల్లుల్లో వెంటవెంటనే ధాన్యం అన్లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పౌరసర ఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సకాలంలో బిల్లుల చెల్లింపు పూర్తయ్యేలా ట్యాబ్లో ఎంట్రీని వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఆర్డీవో సాయన్న, డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం ప్రవీణ్, డీసీవో ఎన్ శ్రీనివాస్రావు, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు
● పంట సాగు అంచనా నివేదిక విడుదల చేసిన వ్యవసాయ శాఖ ● జిల్లా వ్యాప్తంగా 5.30 లక్షల ఎకరాల్లో సాగవనున్న పంటలు డొంకేశ్వర్(ఆర్మూర్): 2026–వానకాలం (ఖరీ ఫ్) సీజన్కు సంబంధించిన పంట ప్రణాళిక ఖా రైంది. జిల్లా వ్యాప్తంగా 5.30లక్షల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగవుతాయని వ్యవసా య శాఖ అంచనా వేసింది. అత్యధికంగా 4.38 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరి సాగయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే, గతేడాది ఖరీఫ్తో పోలిస్తే ఈసారి కొంతమేర సాగు విస్తీర్ణం పెరగనుంది. తొల కరి చినుకులు కురవగానే రైతులు జూన్ మొదటి, రెండో వారం నుంచి సాగు పనుల ను ప్రారంభించనున్నారు. వరి తర్వాత మొక్కజొన్న, సోయాబీన్, పసుపు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపే అవకాశముంది. ఎరువులు, విత్తనాలు! ఖరీఫ్ పంటలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులకు కూడా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. వరికి 1.10 లక్షల క్వింటాళ్లు, మొక్కజొన్నకు 4,400 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా వేసింది. అలాగే సోయాబీన్కు 10,268 క్వింటాళ్లు, కందికి 40 క్వింటాళ్లు, పత్తికి 8 క్వింటాళ్లు అవసరం అవుతాయని ప్రతిపాదనలు తయారు చేసింది. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి డిమాండ్ను బట్టి ఖరీఫ్ పంటల అంచనా ప్రతిపాదనలు రూపొందించాం. విత్తనాలు, ఎరువులలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. పంటలు సాగు చేసేముందు రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని. సలహాలు, సూచనల కోసం స్థానికంగా ఏఈవోలను సంప్రదించాలి. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి ఎరువుల అంచనా (మెట్రిక్ టన్నులు) -
ధాన్యం కొనుగోలుకు ఆటంకాలు కలిగిస్తే చర్యలు
● ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ పై కేసు నమోదు ● మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశంనిజామాబాద్ అర్బన్: వరి ధాన్యం కొనుగోలు ప్ర క్రియకు ఆటంకాలు కలిగేలా వ్యవహరిస్తున్న వారి ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ధాన్యం రవాణాకు లారీలు సమ కూర్చని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం రైస్ మిల్ల ర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో ప్రభుత్వ సలహాదారు, కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పలు చోట్ల రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. బాల్కొండ సెక్టార్ లో కొనుగోలు కేంద్రాలకు వాహనాలను సమకూర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తీరును తీవ్రంగా పరిగణిస్తూ, సదరు కాంట్రాక్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ కు లిఖిత పూర్వకంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశా రు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా రైస్ మిల్లర్లు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. కడ్తా, తరుగు పేరుతో ఎవరైనా రైతులను నష్టపరిచే చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. అవసరమైతే నిజామాబాద్ మా ర్కెట్ యార్డులో పని చేస్తున్న హమాలీ కార్మికుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రైతులు శుభ్రపరచిన ధాన్యాన్ని తేవాలి కొనుగోలు కేంద్రాలకు రైతులు శుభ్రపరచిన ధా న్యాన్ని తరలించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కోరారు. ఈసారి రబీలో ఆశించిన దానికంటే ఎక్కువగా మొక్కజొన్న, వరి ధాన్యం దిగుబడులు వచ్చాయన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేస్తున్నామన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవ హరిస్తున్నారని సుదర్శన్ రెడ్డి దుయ్యబట్టారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మ న్ ముప్ప గంగారెడ్డి, డీఎస్వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీవో శ్రీనివాస్, వ్యవసా య అధికారి వీరస్వామి, అధికారులు పాల్గొన్నారు. -
బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నం చేయ డం శోచనీయమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేము ల ప్రశాంత్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ మధ్య ఫెవికాల్ బంధం ఉందన్నారు. సిట్ విచారణ పేరిట సంజయ్ కొడుకు భగీరథ్ను కాపాడేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్నా రు. కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మైనర్ బాలికకు డ్రగ్స్, మద్యం ఇచ్చి అఘాయిత్యం చేసినట్లు ఆరోపణలు ఉంటే పోలీసులు మూడు నెలల పాటు ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందన్నారు. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత గత్యంతరం లేక పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక చెప్పేదే కీలకమన్నారు. ఇలాంటి కేసులో బాధితురాలికి రక్షణ కల్పించాల్సింది పోయి, నిందితుడు ఆమైపెనే తిరిగి ’హనీ ట్రాప్’ పేరిట కేసు పెట్టడం దారుణమన్నారు. మైనర్ బాలిక హనీ ట్రాప్ చేస్తుందా అన్నారు. బాధితురాలిపైనే రివర్స్ కేసులు పెట్టడం చూస్తుంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకటేనని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఇద్దరూ కలిసి వ్యాపారాలు, భూమి కుంభకోణాలు చేస్తున్నా రు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు సైతం దీనిపై స్పందించకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటన్నారు. ప్రతిరోజూ కేసీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ మీద, హరీశ్రావు మీద విషం చిమ్మే బండి సంజయ్ తన కొడుకు చేసిన నేరంపై ఏం సమాధానం చెబుతారన్నారు. సంజయ్ తన కొడుకుపై వచ్చిన ఈ పోక్సో కేసుపై నైతిక బాధ్యత వహించాలన్నారు. భగీరథ్ను అరెస్ట్ చేసి నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు. బాధిత మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ మధ్య ఫెవికాల్ బంధం సిట్ విచారణ పేరిట నిందితుడిని కాపాడే ప్రయత్నం బాలికపై అఘాయిత్యం జరిగితే మూడు నెలలపాటు ఫిర్యాదు తీసుకోలేదెందుకు? బాధితురాలిపైనే ఎదురు కేసులు పెట్టడం దుర్మార్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
ఇబ్బంది పడుతున్నాం..
నీట్ పరీక్ష రద్దుతో ఇబ్బందులు పడుతున్నాం. నీట్ కోసం ప్రిపేర్ అయి మంచిగా పరీక్ష రాశాం. ఈ పరీక్షలో మంచి ర్యాంకు వస్తుందని భావిస్తున్నాం. మళ్లీ నీట్ పరీక్ష కోసం చదవాల్సి వస్తుంది. పరీక్షల పూర్తి తర్వాత రిలాక్స్ ఆవుతామని భావిస్తే, మళ్లీ పరీక్ష కోసం సిద్ధం కావాల్సి వస్తుంది. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనతో విద్యార్థుల ఆశలు నిరాశ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల లీక్ చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. – హిమాన్షి, నిజామాబాద్ -
రీజియన్ పరిధిలో 82 ఓపీఆర్ఎస్ సర్వీసులు
నిజామాబాద్ రూరల్: రీజియన్ పరిధిలోని ఆయా డిపోల నుంచి 82 ఓపీఆరీఎస్(ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం) ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్ఎసం జ్యోత్స్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆయా డిపోల నుంచి రాష్ట్రంలోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఎయిర్పోర్టు(హైదరాబాద్), తిరుపతి, విజయవాడ, భద్రాచ లం తదితర ప్రాంతాలకు రాజధాని, సూ పర్లగ్జరీ, ఈ – సూపర్ లగ్జరీ, లహరి ఏసీ, లహరి నాన్ ఏసీ వంటి సేవలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ప్ర యాణికులు ముందస్తుగా టికెట్ బుకింగ్ కోసం ఆర్టీసీ వెబ్సైట్ www.tgsrtcbus. in, మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. డిప్యూటీ సీఎంను కలిసిన డీఎఫ్వో డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా అటవీశాఖ అధి కారి (డీఎఫ్వో) సిద్ధార్థ్ విక్రమ్సింగ్ ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్కను మంగళవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లాలో అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వ విత్తనాలనే వినియోగించాలి సిరికొండ: తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాణ్యమైన రాయితీ విత్తనాలనే వినియోగించాలని తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్రెడ్డి రైతులకు సూచించారు. సీడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించే విత్తనాలపై మండలంలోని కొండూర్లో రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. సంస్థ ద్వారా బీపీటీ 5204, కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048 రకం వరి విత్తనాలు అందుబాటులో ఉన్నా యని అన్వేష్రెడ్డి తెలిపారు. ప్రైవేట్ సంస్థల విత్తనాల వాడకాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన పంటలను సాగు చేయకుండా పంట మార్పి విధానాన్ని పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఆయిల్ పామ్, పప్పు దినుసుల సాగు చేపడితే లాభాలు ఉంటాయన్నారు. పీఏసీఎస్ చైర్మన్ చెల్లెం గంగాధర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బా కారం రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎర్ర న్న, టీఎస్ సీడ్స్ డీఎం రఘు, సర్పంచ్ నర్మల లతాభాస్కర్రెడ్డి, మండల వ్యవసాయాధికారి నర్సయ్య, రైతులు పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఇందల్వాయి: పశువులు అక్రమ రవాణా కాకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన అంతర్జిల్లా చెక్పోస్టును ఆయన మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అనుమానాస్పద వాహనాలను తప్పకుండా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. తనీఖీల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పశువుల అక్రమ రవాణా సమాచారం తెలిసే పోలీసులకు అందించాలని ప్రజలకు సూచించారు. ఆయనవెంట డిచ్పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి ఎస్సై సందీప్ ఉన్నారు. -
ధాన్యం సేకరణలో రాష్ట్రంలో మొదటి స్థానం
● మొక్కజొన్న కొనుగోళ్లు 88 శాతం పూర్తి ● వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డికి కలెక్టర్ ఇలా త్రిపాఠి నివేదికనిజామాబాద్ అర్బన్: ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని, మొక్కజొన్న కొనుగోళ్లు 88 శాతం పూర్తయ్యిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకొతెచ్చా రు. కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరిస్తున్నామన్నా రు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లు, వరి ధాన్యంపై ముఖ్యమంత్రి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్, జూపల్లి కష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు తదితర ఉన్నతాధికా రు లు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని ప్ర భుత్వం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధా న్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాల ని ఆదేశించారు. ధాన్యం రవాణాకు అవసరమైన లారీలను ఒప్పందం మేరకు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గోదాముల కొరత ఉన్న ప్రాంతాల్లో రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లను తాత్కాలిక నిల్వ కేంద్రాలుగా వినియోగించాలన్నారు. అకాల వర్షాలకు ధా న్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా రైతులను ముందస్తుగానే అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియ మించాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించాలని, ప్రతి రైస్ మిల్లు వద్ద ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, పౌర సరఫరాల శాఖ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం క్రాంతి, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగుబాయి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, రవాణా శాఖ డీటీసీ దుర్గా ప్రమీల, ఎంవీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పశువుల అక్రమ రవాణా నిరోధానికి చర్యలు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య ● జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై సమన్వయ కమిటీ సమావేశం నిజామాబాద్ అర్బన్: పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. బక్రీద్ నేపథ్యంలో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. పశువు ల అక్రమ రవాణా నిరోధం, జంతు సంక్షేమ నియమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, సీపీ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అధికారులు సమన్వయంతో పని చే యాలని, జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలను ఉల్లంఘించకుండా చూడాలని అన్నారు. గోవ ధపై నిషేధం ఉందని, అలాగే మన రాష్ట్రంలో ఒంటెలను సైతం వధించకుండా నిషేధం అమలులో ఉందని తెలిపారు. పశువులను తరలించడానికి, వాటిని వధించడానికి ముందు తప్పనిసరిగా పశు వైద్యాధికారి నుంచి ధ్రువీకరణ పొందాలని స్పష్టం చేశారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోని కందకుర్తి, సాలూర, పొతంగల్, ఖండ్గావ్ వద్ద అంతర్ర్రాష్ట్ర చెక్ పోస్టులతోపాటు సాటాపూర్, యంచ, ఇందల్వాయి, ఉమ్మెడ, జన్నేపల్లి, మామిడిపల్లి తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏ ర్పాటు చేస్తున్నామని సీపీ తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, నిజామాబాద్, ఆర్మూర్ ఏసీపీలు ప్రకాశ్యాదవ్, వెంకటేశ్వర్రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల, ఎంవీఐ లు శ్రీనివాస్, కిరణ్, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గంగాధరయ్య, పోలీస్, రెవెన్యూ, పశు సంవర్ధక, పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలి
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని శంకర్ భవన్ పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించిన కలెక్టర్.. వారి అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని, డాన్స్, సింగింగ్, ఇండోర్ గేమ్స్ వంటి వాటిలో మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు పలు అంశాలపై ప్రశ్నలు వేశారు. సమాధానాలు ఇచ్చిన చిన్నారులకు కలెక్టర్ బహుమతులు, చాక్లెట్లు అందజేశారు. కలెక్టర్ వెంట డీఈవో పి అశోక్, ఎంఈవోలు సాయిరెడ్డి, అరవింద్గౌడ్, హెచ్ఎం సాయన్న తదితరులు ఉన్నారు. రుద్రూర్: తమకు అవసరం లేకున్నా నానో యూరియాను ఎరువులతోపాటు బలవంతంగా అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పొతంగల్ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్డొలిలో ఎరువుల విక్రయ కేంద్రానికి రైతులు మంగళవారం తాళం వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గతంలో తీసుకున్న నానో యూరియా లిక్విడ్ ఇంకా మిగిలి ఉండగానే మళ్లీ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మూడు సంచుల ఎరువులు తీసుకుంటే ఒక లిక్విడ్ బాటిల్ తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధన విధించడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో అదనపు భారం మోపడం తగదన్నారు. వ్యవసాయాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నందిపేట్(ఆర్మూర్): మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలోకి హిజ్రాల రాకను నిషేధిస్తూ గ్రామాభివృద్ధి కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల సమయంలో హిజ్రాలు వచ్చి వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వారి అంగీకారం మేరకు హిజ్రాల ఆగడాలను శాశ్వతంగా అరికట్టేందుకు గ్రామాభివృద్ధి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హిజ్రాలను గ్రామంలోకి రానివ్వొద్దని తీర్మానించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని సుభా ష్నగర్లో ఉన్న బాలసదనం నుంచి ముగ్గురు బాలికలు మంగళవారం అదృశ్యమయ్యారు. వార్డెన్కు చెప్పకుండా బాలికలు బయటికి వెళ్లిపోయారు. సదనం ఇన్చార్జి సౌందర్య మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇద్దరు బాలికలను గుర్తించి బాలసదనంలో అప్పగించారు. మరో తొమ్మిదేళ్ల బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
సంస్కృతికి పెద్దపీట
తెలంగాణ సామెతలు మోర్తాడ్(బాల్కొండ): వేసవి సెలవులంటే కాలక్షేపం కోసం కాదు.. ఏదో ఒక కళలో ప్రావీణ్యం పొందేందుకు సద్వినియోగం చేసుకోవాలని నిరూపిస్తున్నారు ఈ చిన్నారులు. ఆ చిన్నారులను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు మోర్తాడ్కు చెందిన సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ శ్రీహర్షిణి. చిన్నారులకు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజెప్పేందుకు కూచిపూడి నృత్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని స్థానిక చిన్నారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎంసీఏ చదివిన శ్రీహర్షిణి నాంది ఫౌండేషన్, మహేంద్ర ప్రైడ్ సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్లో ట్రైనర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరోవైపు నృత్యశిక్షకురాలిగా రాణిస్తున్నారు. తాను నేర్చుకున్న విద్యను పదిమందికి నేర్పాలనే ఉద్దేశంతో మోర్తాడ్లో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు. ఈనెలాఖరు వరకూ శిక్షణ తరగతులను కొనసాగిస్తానని శ్రీహర్షిణి తెలిపారు. ఒక అబ్బాయికి క్లాసికల్ డ్యాన్స్లో ఒక గంట పాటు ప్రత్యేక శిక్షణ కొనసాగిస్తుండటం గమనార్హం. సెలవులను కాలక్షేపం కోసం కాకుండా నృత్య శిక్షణతో సద్వినియోగం చేసుకుంటున్న ఈ చిన్నారులు ఎంతో మందికి స్పూర్తి అని చెప్పొచ్చు. ● మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయినట్లు (ఎక్కువ మంది జోక్యం చేసుకుంటే పని సరైన దారిలో సాగకుండా గందరగోళంగా మారుతుంది.) ● సిగ్గులేదా జీడి గింజా అంటే.. నల్లగున్నా నాకేమి సిగ్గు అనిందట. (తన తప్పును లేదా లోపాన్ని సమర్థించుకుంటూ, ఏమాత్రం సిగ్గు పడకుండా ఎదురు సమాధానం చెప్పడం) వేసవి సెలవులను వృథా కానివ్వడం లేదు. నృత్యంలో శిక్షణ పొందడానికి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా తల్లితండ్రులు, మా శిక్షకురాలు ఇచ్చే ప్రోత్సాహంతో ముందుకు సాగుతాం. – హన్విక, దొన్కల్ మోర్తాడ్లో మేము పొందుతున్న నృత్య శిక్షణ ఎంతో బాగుంది. వేసవి సెలవులను ఎలా గడపా లని ఆలోచించాం. మోర్తాడ్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలియగానే మా తల్లిదండ్రులు శిక్షణ తరగతులకు పంపిస్తున్నారు. – విహాన్షి, రామన్నపేట్ కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందుతున్న చిన్నారులు కళలో ప్రావీణ్యానికి సెలవులు సద్వినియోగం సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా రాణిస్తూనే నృత్య శిక్షణ ఇస్తున్న శ్రీహర్షిణి మోర్తాడ్లో ప్రతిరోజూ వేసవి శిక్షణ తరగతులు -
ప్రైవేట్ ఆస్పత్రిలో బాలుడి మృతి
నిజామాబాద్ రూరల్: నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. జక్రాన్పల్లి మండలం పడకల్ తండాకు చెందిన బదావత్ లత, నరేశ్ దంపతులు తమ కుమారుడు నిక్షిత్(16 నెలలు) ఆరోగ్యం బాగా లేకపోవడంతో సోమవారం ఉదయం ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యుడు మందులు రాసిచ్చి ఇంటికి పంపించారు. పరిస్థితి మెరుగుకాకపోవడంతో రాత్రి వేళ మళ్లీ బాబును ఆస్పత్రికి తీసుకురాగా, ఆస్పత్రి సిబ్బంది అడ్మిట్ చేసుకున్నారు. చికిత్స ప్రారంభించి సైలెన్లు పెట్టారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మంగళవారం ఉదయం స్కానింగ్కు రిఫర్ చేశారు. స్కానింగ్ చేయించి బాబును ఆస్పత్రికి తీసుకు వచ్చిన కొద్దిసేపటికి మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడని తల్లిదండ్రులతోపాటు వారి బంధువులు ఆందోళనకు దిగారు. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి సిబ్బందితో కలిసి ఆస్పత్రికి చేరుకుని వారిని సముదాయించారు. ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ ● ఆస్పత్రి ఎదుట ఆందోళన -
క్రైం కార్నర్
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి జక్రాన్పల్లి/నిజామాబాద్ రూరల్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్కు గ్రామానికి చెందిన జైడి పెద్దోళ్ల నర్సయ్య (70) మంగళవారం 44వ నంబర్ జాతీయ రహదారి దాటుతుండగా.. కామారెడ్డి వైపు నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. గాయాలపాలైన నర్సయ్యను చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో తాపిమేస్త్రి.. నిజామబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గూపన్పల్లి క్రాసింగ్ వద్ద బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో తాపిమేస్త్రి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నగరంలోని హస్మీ కాలనీకి చెందిన షేక్ షాకీర్(28) మాక్లూర్ మండల బోర్గాం(కే)లో మేస్త్రి పని చేస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం పని పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఎప్పటిలాగే మంగళవారం ఉదయం బోర్గాం(కే) గ్రామంలో మేస్త్రి పని పూర్తయిన అనంతరం మధ్యాహ్నం తిరిగి వస్తుండగా గూపన్పల్లి క్రాసింగ్ బైక్ను లారీ ఢీకొట్టగా షాకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి షబ్బీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. కామారెడ్డి క్రైం: భార్యతో గొడవల కారణంగా మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. మహ్మద్ హుస్సేన్ (35) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ప్రతి రోజూ భార్యతో గొడవలు జరిగేవి. కొద్ది రోజుల క్రితం అతడి భార్య గౌసియా బేగం పిల్లలతో కలిసి హైదారాబాద్లోని తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. కామారెడ్డికి రావాలని హుస్సేన్ పలుమార్లు అడిగినా ఆమె రాకపోవడంతో మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్వో నరహరి తెలిపారు. ఆర్మూర్టౌన్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను ఆర్మూర్, మోర్తాడ్లో చీత ఫోర్స్ మెరుపుదాడులు నిర్వహించి మంగళవారం పట్టుకుంది. సీపీ సాయిచైతన్య అదేశాల మేరకు సీసీఎస్ ఇన్చార్జి ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీత ఫోర్స్ సిబ్బంది ప్రత్యేక నిఘా సారించి ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు భారీ లారీలను సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. -
రూ.1.56 కోట్లతో భవిత కేంద్రాల అభివృద్ధి
● నేడు మాక్లూర్, నిజామాబాద్ నార్త్లో నూతన భవనాల ప్రారంభోత్సవం ఆర్మూర్: ప్రత్యేక అవసరాలు గల పిల్లల (దివ్యాంగుల)కు నాణ్యమైన విద్య, థెరపీ, పునరావాస సేవలు అందించేందుకు సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం జిల్లాలోని భవిత కేంద్రాలను బలోపేతం చేస్తోంది. కొత్త భవనాల నిర్మాణం, మరమ్మతులు, రెనొవేషన్ పనుల కోసం జిల్లాలో మొత్తం రూ.1,55,64,000 ఖర్చు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సోమవారం మాక్లూర్, నిజామాబాద్ నార్త్ మండలాల్లో నిర్మించిన భవిత కేంద్రాలను ప్రారంభించనున్నారు. కొత్త భవనాలకు రూ.64.74 లక్షలు జిల్లాలో ఆరు కొత్త్త భవనాల నిర్మాణాలకు రూ. 64.74 లక్షలు కేటాయించారు. ఒక్కో కేంద్రానికి రూ.10.79 లక్షల చొప్పున మాక్లూర్ (మాదాపూర్), నిజామాబాద్ నార్త్, మోపాల్, రుద్రూర్, భీమ్గల్, నవీపేట్ మండలాల్లో నూతన భవిత కేంద్రాలను నిర్మిస్తున్నారు. మాక్లూర్, నిజామాబాద్ నార్త్ భవనాల నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.41.55 లక్షలతో మరమ్మతు పనులు జిల్లాలో ఇప్పటికే పక్కా భవనాలు ఉన్న ఏడు మండల కేంద్రాల్లో మరమ్మతుల కోసం రూ.41.55 లక్షలు మంజూరు చేశారు. ఆర్మూర్, బోధన్, మోర్తాడ్, నందిపేట్, నిజామాబాద్ సౌత్, సిరికొండ, ఎడపల్లి మండలాల్లో పనులు పూర్తయ్యాయి. 15 కేంద్రాల్లో రెనోవేషన్ పనులు పక్కా భవనాలు లేని మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక గదిని కేటాయించారు. 15 కేంద్రాల్లో ఒక్కోదానికి రూ.3.29 లక్షల చొప్పున మొత్తం రూ.49.35 లక్షలు మంజూరు చేశారు. బాల్కొండ, చందూర్, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, కమ్మర్పల్లి, కోటగిరి, మెండోరా, మోస్రా, ముప్కాల్, రెంజల్, వేల్పూర్, వర్ని, ఏర్గట్ల మండలాల్లో రెనోవేషన్ పనులు పూర్తయ్యాయి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 4,857 పాఠశాలల్లో చేరిన పిల్లలు 4,707 స్పెసిఫిక్ లర్నింగ్ డిజేబిలిటీ 1,782 లో విజన్ 1,333 ఎర్లీ ఇంటర్వెన్షన్ 150 ఫిజియోథెరపీ 426 ఐఈఆర్పీలు 29 ఫిజియోథెరపిస్టులు 19 -
శ్రీనగర్లో దొంగల బీభత్సం
● మూడు ఇళ్లలో చోరీ వర్ని: మండలంలోని శ్రీనగర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన వజ్రమ్మ, రమణ, శ్రీనివాసరావు ఇళ్లలో చొరబడిన దుండగులు నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మూడు ఇళ్లలో కలిపి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల నగదు అపహరణకు గురైనట్లు ఎస్సై తెలిపారు. మరో నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా తీసుకొని దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాసరావు, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ పరిశీలించారు. వేసవికాలంలో డాబాల మీద పడుకున్న, ఇతర ప్రాంతాలకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. -
దివ్యాంగ విద్యార్థులకు చేయూత
ఆర్మూర్: జిల్లాలో ఉన్న దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు అవసరమైన ఉపకరణాల పంపిణీ శిబిరాన్ని తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 11న నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి దివ్యాంగ విద్యార్థులను పరీక్షించారు. గుర్తించిన వారిలో 393 మంది చిన్నారులకు 565 సహాయ పరికరాలు మంజూరయ్యాయి. ఒక్కో చి న్నారికి అవసరాన్ని బట్టి ఒకటి లేదా అంతకంటే ఎ క్కువ ఉపకరణాలు అందిస్తున్నారు. ఈ పరికరాల కొనుగోలు ఖర్చు రూ.34 లక్షల 70 వేల 247 కాగా 60 శాతం ఏడీఐపీ పథకం ద్వారా, 40 శాతం స మగ్ర శిక్ష ద్వారా భరించనున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు డీఈవో అశోక్, సహిత విద్యా విభాగం జిల్లా కోఆర్డినేటర్ పడకంటి శ్రీని వాస్రావు పర్యవేక్షణలో ఆర్టిఫీషియల్ లింబ్స్ మా న్యూఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్కో) సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శారీరక వైకల్యం, మానసిక వైకల్యం, వినికిడి లోపం, అంధత్వంతో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన వీల్ చైర్స్, చంక కర్రలు, ట్రై సైకిళ్లు, రొలేటర్స్, హియరింగ్ ఎయిడ్స్, బ్రెయిలీ కిట్, బ్రెయిలీ ప్లేట్స్, బ్రెయిలీ కిట్, ఎమ్మార్ కిట్లతో పాటు కృత్రిమ అవయవాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్బోర్డు కాలనీలో గల ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పంపిణీ శిబిరాన్ని నిర్వహించనున్నారు. శిబిరానికి వచ్చే దివ్యాంగ విద్యార్థులకు ట్రావెలింగ్ అలవెన్స్, భోజన సదుపాయాన్ని అధికారులు కల్పించనున్నారు. ఎంపికై న లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, యూఐడీ నంబర్, వైట్ రేషన్ కార్డు లేదా ఇన్కం సర్టిఫికెట్ జిరాక్స్లతో పాటు రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు తీసుకొని శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుంది. శిబిరం వేదిక : ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్, బైపాస్ రోడ్డు, న్యూ హౌజింగ్బోర్డు కాలనీ, నిజామాబాద్ సమయం : ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లబ్ధిదారులైన దివ్యాంగ విద్యార్థులు : 393 మంది మంజూరైన మొత్తం ఉపకరణాలు : 565 మొత్తం వ్యయం : రూ.34.70 లక్షలు లబ్ధిదారులకు ఉచితంగా ఉపకరణాలు ప్రత్యేక క్యాంపుల్లో గుర్తించిన ప్రతి చిన్నారికి అవసరమైన పరికరం అందేలా చర్యలు తీసుకున్నాం. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వైకల్యాలతో బాధపడుతున్న పిల్లలకు ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. – పడకంటి శ్రీనివాస్ రావు, సహిత విద్యావిభాగం జిల్లా కోఆర్డినేటర్, నిజామాబాద్ విద్యతోపాటు జీవన నైపుణ్యాలు అందిస్తాం దివ్యాంగులైన పిల్లలకు విద్యతో పాటు జీవన నైపుణ్యాలు అందించడమే మా లక్ష్యం. ఈ ఉపకరణాలు వారి రోజువారీ జీవితాన్ని, చదువును సులభతరం చేస్తాయి. ఎంపిక చేసిన దివ్యాంగులు ఈ పరికరాలను తీసుకొని సద్వినియోగం చేసుకోవాలి. – అశోక్, జిల్లా విద్యాధికారి, నిజామాబాద్ నేడు జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో శిబిరం నిర్వహణ పరికరాలు ఉచితంగా అందించనున్న సమగ్ర శిక్ష, అలిమ్కో ప్రతినిధులు -
పేలిన ట్రాక్టర్ టైర్
● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు ఆర్మూర్టౌన్: ట్రాక్టర్ టైర్ పేలి డ్రైవర్ మృతి చెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై రజినికాంత్ తెలిపిన వివరాల ప్రకారం..కత్తి బాలకృష్ణ(40) అనే వ్యక్తి ఆర్మూర్ మండలం మగ్గిడిలోని ఇటుక బట్టిలో పనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం అంకాపూర్ గ్రామంలో ట్రాక్టర్ ఇటుకలోడ్ను దించి తిరిగి మగ్గిడికి వెళ్తుండగా ఆర్మూర్ బృందావన్ టాకీస్ వద్ద టైర్ పేలిపోవడంతో ముందున్న డివైడర్ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ బాలకృష్ణ టైర్ కిందపడగా, మరో ఇద్దరు రోడ్డుపై పడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణ ఆస్పత్రిలో మృతిచెందగా, మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య పెంచులమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఖాళీ స్థలంలో చెలరేగిన మంటలు
డిచ్పల్లి : డిచ్పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని సుద్దపల్లి రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం సాయంత్రం నిప్పు పెట్టారు. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఎండిపోయిన గడ్డి, పిచ్చి మొక్క లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించా యి. సమీపంలో ఇళ్లు ఉండటం, మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు ఫైర్ స్టే షన్కు సమాచారం అందించారు. ఘటనా స్థ లానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అరగంటపా టు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చా రు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. -
చిత్రకళతో సృజనాత్మకత
● బోధన్లో మూడేళ్లుగా వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరం బోధన్: చిత్రలేఖనమంటే బొమ్మలు గీయడ మే మాత్రమే కాదు.. మనస్సుతో మాట్లాడే భా ష అని చిత్రకారులంటున్నారు. తమ ఊహాశక్తితో పౌరాణిక, జానపద, ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరిస్తారు. చిత్రలేఖనం పిల్ల ల్లో ఏకాగ్రతను పెంపొందించడంతోపాటు సృజనాత్మకతకు పదును పెడుతుంది. సాలూర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు లింబూరు లక్ష్మణ్ తేజ క్రియేటివ్ కిడ్స్ డ్రాయింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మూడేళ్లుగా బోధన్ పట్టణంలో వేసవి చిత్రలేఖన ప్ర త్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో ఈ ఏడాదీ శిబిరం ప్రారంభమైంది. ప్రస్తుతం శిబిరంలో 15 మందికి పైగా విద్యార్థులు చిత్రలేఖనంలో మెలకువలు నేర్చుకుంటూ అద్భుత ప్రతిభ చాటుతున్నారు. పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారిణి ఎర్రొల్ల అవంతి విద్యార్థులకు బోధిస్తున్నారు. పెన్సిల్ డ్రాయింగ్, షేడింగ్స్, కలర్ పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. కామారెడ్డి అర్బన్: హరేరామ హరేకృష్ణ ఇస్కాన్ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 24 వరకు సంస్కృతి వేసవి శిబిరం నిర్వహిస్తున్నట్టు ఇస్కాన్ కామారెడ్డి కేంద్రం ప్రతినిధి వెంకటదాసు ప్రభు ఒక ప్రకటనలో తెలిపారు. భగవద్గీత శ్లోకాలు, తబలా, చిత్రలేఖనం, నైతిక, పౌరాణిక, నీతి కథలు, ధ్యానం, కీర్తనలు, నృత్యం, రుచికర సహజ వంటల తయారీ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల 5 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులు రామారెడ్డి రోడ్డు లోని మెడికల్ అసోసియేషన్ భవనంలోని ఇస్కాన్ కేంద్రంలో లేదా 99129 16108, 99596 02551 నంబర్లకు సంప్రదించవచ్చన్నారు. మేము గీసిన చిత్రాలు ఇంటి కోడికి ఒకటే కాలు.. పొరుగు కోడికి మూడు కాళ్లు ( మన దగ్గర ఉన్నదాని కన్నా పక్కవాడికి ఉన్నదే గొప్పగా భ్రమపడటం) గాడిద సోపతి తన్నులకే.. ( చెడ్డవాళ్లతో, మూర్ఖులతో స్నేహం చేస్తే మంచి కాకుండా నష్టం, అవమానం, ఇబ్బందులు వస్తాయి.) నాకు బొమ్మలు గీయడమంటే ఎంతో ఇష్టం. మూ డో తరగతి నుంచి బొమ్మ లు గీయడంపై ఆసక్తి పెంచుకున్నాను. ఇంటి వద్దనే బొమ్మలు గీసేదానిని. బోధన్లో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటైనట్లు తెలుసుకొని నేను, తమ్ముడు చేరాం. ప్రతి రోజు వచ్చి డ్రాయింగ్ నేర్చుకుంటున్నాం. – భవ్య, 7వ తరగతి విద్యార్థిని, బోధన్ డ్రాయింగ్ నేర్చుకునేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతున్నారు. బొమ్మలు గీయడం ఎంతో సులభమో విద్యార్థులకు మెలకువలు నేర్పుతున్నాం. రంగులపై అవగాహన కల్పిస్తూ, విద్యార్థులు సొంతంగా బొమ్మలు గీసేలా ప్రొత్సహిస్తున్నాం. – ఎర్రొల్ల అవంతి, ప్రముఖ చిత్రకారిణి -
క్రైం కార్నర్
పాముకాటుతో మహిళ మృతి నవీపేట : మండలంలోని ధర్మారం(ఎ) గ్రామానికి చెందిన పల్లపు నర్సమ్మ(57) పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి కుటుంబసభ్యులతో భోజనం చేశాక ఆరుబయట పడుకుందని పేర్కొన్నారు. రాత్రి సమయంలో కట్లపాము కాటువేయగా 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారని తెలిపారు. మృతురాలి సోదరి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని కొల్లూర్ గ్రామానికి చెందిన బండారి సాయిలు(48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట మొరందుబ్బ ప్రాంతంలో సాయిలు ఉరేసుకొని మృతి చెందాడనే సమాచారం మేరకు పోలీసులు పరిశీలించారు. రెండు రోజుల క్రితమే చనిపోయినట్లు గుర్తించారు. మృతుడి భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొన్న బైక్ ● ఒకరి మృతి ఆర్మూర్టౌన్: చెట్టును ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం గోవింద్పేట్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై యాసిర్ ఆర్ఫాత్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట్ గ్రామానికి చెందిన సీతానగర్ దాకయ్య(50) గోవింద్పేట్ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పనుల నిమిత్తం గోవింద్పేట్ గ్రామం నుంచి ఆర్మూర్కు వస్తుండగా గ్రామ శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో దాకయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
బడి బాగుకు కసరత్తు
‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యా వారోత్సవాలకు ఎంతో ప్రాధాన్యత చేకూరింది. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో బడి బాగుకు కృషి చేయనున్నారు. ప్రతిరోజూ వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఖలీల్వాడి: విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు లక్ష్యంగా నేటి (సోమవారం) నుంచి ఈనెల 17వ తేదీ వరకు విద్యాశాఖ విద్యా వారోత్సవాలను నిర్వహించనుంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించింది. సర్పంచ్లతో చర్చలు 13వ తేదీన నియోజకవర్గ స్థాయిలో సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించనున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, బడిబాట తదితర అంశాలపై చర్చించనున్నారు. బడిబాటలో భాగంగా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి నోట్ప్యాడ్, పెన్, బ్యాగ్లతో కూడిన కిట్, భోజన వసతి ఏర్పాటు చేయనున్నారు. ప్రతిభావంతులకు బహుమతులు 17వ తేదీన విద్యా విజయోత్సవం నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, క్రీడల్లో జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.10వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. ‘విద్యలో అత్యుత్తమ ప్రతిభను వేడుకగా జరుపుకోవడం’ అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. శిథిలావస్థ భవనాలపై ప్రత్యేక చర్యలు జిల్లాలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను గుర్తించనున్నారు. వాటిని తక్షణమే సీజ్ చేసి విద్యా కార్యకలాపాలకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోనున్నారు. నిబంధనల ప్రకారం వాటిని కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటారు. బడిబాటతో చైతన్యం 14వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గ్రామాలు, వార్డుల్లో ర్యాలీలు చేపట్టి విద్యపై అవగాహన కల్పించనున్నారు. తల్లిదండ్రులతో సమావేశాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నారు. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు వంట పోటీలు నిర్వహిస్తారు. ఉత్తమ హాజరు ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి చేయనున్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతపై.. 15వ తేదీన గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ‘గ్రంథాలయాలు–జ్ఞాన హదయం’ అనే నినాదంతో పుస్తక ప్రదర్శనలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా డిజిటల్ కేటలాగ్ ప్రారంభం, ఉత్తమ పాఠకులకు గుర్తింపు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రాథమిక 769 ప్రాథమికోన్నత 132 ఉన్నత 255 మొత్తం విద్యార్థులు సుమారు లక్షా 50వేలు నేటి నుంచి విద్యా వారోత్సవాలుజిల్లాలో పాఠశాలలు 17వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణ విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి విద్యార్థుల ప్రతిభావికాసం, పాఠశాలల అభివృద్ధే లక్ష్యం


