breaking news
Nizamabad District News
-
ఎస్సారెస్పీకి తగ్గిన వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం ప ట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి 21,954 క్యూ సెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించారు. గోదావరిలోకి 4 వరద గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీటి ని వదులుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, ఎస్కెప్ గే ట్ల ద్వారా 8వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూ ర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులతో నిండుకుండలా ఉంది. బాల్కొండ: ముప్కాల్లోని భూదేవి ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఎస్జీఎఫ్ జిల్లాస్థా యి బాలబాలికల కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఇందులో జోనల్స్థాయి కబడ్డీ జట్లు పా ల్గొనగా, పోటీలు రసవత్తరంగా సాగాయి. అంతకుముందు పోటీలను కబడ్డీ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు లింగయ్య, ప్రధాన కార్యదర్శి గంగాధర్ ప్రారంభించారు. నాయకులు ము స్కు మోహన్, ముస్కు నర్సయ్య, శ్రీనివాస్, పీడీ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: డిచ్పల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి వి స్లావత్ సిద్ధు ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అండర్–17 వెయిట్ లిఫ్టింగ్ (65 కేజీల విభాగం) పోటీల్లో మొదటి స్థానం సాధించి జాతీ యస్థా యి పోటీలకు ఎంపికయ్యారు. ఈసందర్భంగా క్రీడాకారుడిని మంగళవారం జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్లోగల డీఈవో కార్యాలయంలో డీ ఈవో అశోక్ సన్మానించారు. డీసీఈబీ సెక్రెటరీ, హెచ్ఎం సీతయ్య, పీడీ స్వప్న, ఎంఈవో శ్రీనివాస్రెడ్డి, మోహన్రెడ్డి పాల్గొన్నారు. వరద నీటిలో మునిగిన వడ్ల ట్రాక్టర్ ● డ్రైవర్ను కాపాడిన గ్రామస్తులునిజాంసాగర్/బిచ్కుంద: బిచ్కుంద మండలం చిన్నదేవాడ శివారులోని వాగులో ధాన్యం త రలిస్తున్న ట్రాక్టర్ మునిగి పోగా.. డ్రైవర్ను గ్రా మస్తులు కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొందరు రైతులు మంగళ వారం సాయంత్రం గ్రామ శివారు నుంచి ట్రా క్టర్లో వడ్లను ఇంటికి తరలిస్తున్నారు. ఈ క్ర మంలో వాగు దాటుతుండగా ఒక్కసారిగా వర ద ప్రవాహం పెరిగింది. దీంతో వరద నీటిలో ట్రాక్టర్ మునిగింది. తాడు సహాయంతో గ్రామస్తులు ట్రాక్టర్ డ్రైవర్ను వాగులో నుంచి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఎలాంటి స మాచారం ఇవ్వకుండానే కౌలాస్నాలా ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారని రైతులు ఈ సందర్భంగా ఆరోపించారు. బిచ్కుందలోని గోపన్పల్లి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. నీటి ప్రవాహంలో ట్రాక్టర్లో వడ్లు, ట్రాక్టర్కు నష్టం వాటిల్లిందని, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు పోయేపరిస్థితి వచ్చిందని రైతులు ఆ గ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ వేణుగోపా ల్ రైతుల వద్దకు చేరుకుని విషయాన్ని ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, పరిహారం వచ్చేలా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. -
విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చూడాలి
డిచ్పల్లి: ఇంటర్లో విద్యార్థుల హాజరుశాతం పెరిగేలా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ ప్రత్యేకాధికారి ఒడ్డెన్న అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్పై అధ్యాపకులతో సమీక్షించారు. విద్యార్థుల హాజరుశాతం పెంచడంతో పాటు వివిధ ప్రవేశ పరీక్షలకు వారిని సన్నద్ధం చేయాలని సూచించారు. అందుకు అధ్యాపకులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రిన్సిపాల్ చంద్రవిఠల్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కేదారీశ్వర ఆశ్రమంలో జాతర
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండల కేంద్రానికి సమీపంలోగల కేదారీశ్వర ఆశ్రమం కార్తీక పౌర్ణమి సందర్బంగా జాతరకు ముస్తాబయింది. ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ గత 40 సంవత్సరాలుగా ప్రతియేటా దసరా పర్వదినాన దీక్ష బూని కార్తీక పౌర్ణమి రోజున విరమించడం ఆనవాయితీ. ఈయేడు కూడా దసరా రోజున దీక్ష చేపట్టిన స్వామీజీ నేడు దీక్ష విరమించనున్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆశ్రమంలో జాతర, భక్తులకు అన్నదానం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆశ్రమ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. -
సమయపాలన పాటించాలి
బోధన్టౌన్(బోధన్): అధ్యాపకులు, సిబ్బంది సమయపాలన పాటించాలని డీఐఈవో తిరుమలపుడి రవికుమార్ అన్నారు. బోధన్లోని పలు జూనియర్ కళాశాలలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా వినాలని సూ చించారు. అధ్యాపకులు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. రానున్న వార్షిక పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించేందుకు ప్రత్యేక తరగతుల ను నిర్వహించాలని, వెనకబడిన విద్యార్థులపై ప్ర త్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందిని ఆదేశించారు. కా ర్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘సాక్షి స్పెల్బీ’తో విజ్ఞానం పెరుగుతుంది
ఖలీల్వాడి: ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్పెల్బీ, మ్యాథ్స్బీ పోటీ పరీక్షల ద్వారా వి ద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందని ఎస్ఎస్ఆర్ వి ద్యాసంస్థల చైర్మన్, తెయూ మాజీ పాలకవర్గ స భ్యుడు మారయ్యగౌడ్ అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభతోపాటు సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం స్పెల్బీ, మ్యాథ్స్బీ ప్రాథమిక స్థాయి పరీక్షలను జిల్లా కేంద్రంలోని మాధవనగర్లోగల ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు స్కూల్ వి ద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై, ప్రతిభను పరీ క్షించుకున్నారు. ఈసందర్భంగా మారయ్యగౌడ్ మా ట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభాపాటవాలను వెలికితీయడంలో ‘సాక్షి’ ఎప్పుడు ముందంజలో ఉంటుందన్నారు. ఇలాంటి పోటీపరీక్షలో ఇతర పాఠశాలలు పాల్గొనాలనే ఆసక్తి ఉంటే 95055 14424ను సంప్రదించాలని సాక్షి బ్రాంచ్ మేనేజర్ మహేష్ తెలిపారు. ప్రిన్సిపాల్ బాలరాజు, టీచర్లు ఉన్నారు. ‘సాక్షి’ స్పెల్బీ పరీక్షను మొదటిసారి రాస్తున్నా. నాకు చాలా ఆనందంగా ఉంది. మా టీచర్ చాలా బాగా నేర్పించారు. నేను జిల్లా స్థాయికి ఎంపిక అవుతానని ఆశిస్తున్నా. – దివ్యాన్స్, 6వ తరగతి, ఎస్ఎస్ఆర్ డిస్కవరీ, నిజామాబాద్ -
పాఠశాలల నిర్వహణ మెరుగుపడాలి
నిజామాబాద్అర్బన్/ఖలీల్వాడి: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు మరింత మెరుగుపడేలా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎంఈవోలతో విద్యా శాఖ పనితీరుపై కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు ఉండేలా చొరవ చూపాలన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు విద్యను బోధిస్తూ, ఫలితాలు గణనీయంగా మెరుగుపడేలా చూడాలని, ప్రత్యేకించి పదో తరగతిలో ఉత్తీర్ణత మెరుగుపడాలన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. యూడైస్లో వివరాలను నమోదు చేయడంతోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ఎఫ్ఆర్ఎస్ పద్ధతిలో శత శాతం అమలు చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ జలాలను అందిచాలని, లైబ్రరీ, కిచెన్ గార్డెన్ నిర్వహించాలని అన్నారు. విద్యుత్ సదుపాయం, కంప్యూటర్ల మరమ్మతులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రభుత్వ బడులతోపాటు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు అపార్ జనరేట్ అయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. భవిత కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించంతోపాటు కస్తూర్బా విద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేస్తూ, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఐఈవో రవికుమార్, డీఈవో అశోక్, కాంప్లెక్స్ పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. అపార్, యూడైస్ పనులు పూర్తి చేయాలి ఎండీఎం ఏజెన్సీల నిర్వాహకులకు ఆరోగ్య పరీక్షలు.. సమీక్షాసమావేశంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -
జిల్లా నేతల జూబ్లీ బాట
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో హోరాహోరీగా జరుగుతు న్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారంలో ఇందూరు జిల్లా నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలి వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరుగనున్న నే పథ్యంలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికలను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్ట్త్మాకంగా తీసు కున్నాయి. దీంతో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలకు ఆయా పార్టీలు కీ లకమైన ప్రచార బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యేల నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులు తమకు అప్పగించిన ప్రాంతాల్లోనే తిష్ట వేసి ప్రచారంలో తిరుగుతున్నారు. అక్కడే మకాం వేసి తీరిక లేని షెడ్యూల్తో బిజీబిజీగా గడుపుతున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో తమకు సన్నిహితులైనవారి ఇళ్లలో జరి గే శుభకార్యాలకు సైతం హాజరు కాకుండా ప్ర చారంలో పార్టీ తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ● కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మె ల్యే డాక్టర్ భూపతిరెడ్డికి ఎర్రగడ్డ డివిజన్లో ప్రచార బాధ్యతలు అప్పగించారు. భూపతిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలందరూ ప్రచారంలో ఉన్నారు. మరోవైపు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు మానాల మోహన్రెడ్డి, సుంకేట అన్వేష్రెడ్డి, తాహెర్బిన్ హందా న్, ఈరవత్రి అనిల్, నుడా చైర్మన్ కేశ వేణు సమ న్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇక పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మ న్ ముప్ప గంగారెడ్డి, వెల్మ భాస్కర్ రెడ్డి, మోపా ల్ సాయిరెడ్డిలు ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నారు. బూత్ల వారీగా ప్రతి ఓటరును కలిసే లా ప్లాన్ చేసుకున్నారు. ● బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి షేక్పేట డివిజన్ ఇన్చార్జిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్గానూ ప్రచారం చేస్తున్నా రు. ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది క్లస్టర్ ఇ న్చార్జులు పనిచేస్తున్నారు. ఈ క్లస్టర్ ఇన్చార్జు ల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. అదేవిధంగాా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే లు షకీల్, గణేశ్ గుప్తా, జీవన్రెడ్డి, సురేందర్ ఉ న్నారు. షకీల్ భార్య ఆయేషా ఫాతిమా సైతం ప్రచారంలో ఉన్నారు. బూత్ల వారీగా లెక్కలే సుకుని ప్రచారం చేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువమంది ఓటర్లు పోలింగ్లో పాల్గొని ఓటుహక్కు వినియోగించుకునేవిధంగా ప్రశాంత్రెడ్డి మోటివేట్ చేస్తున్నారు. ● బీజేపీ నుంచి ఎంపీ ధర్మపురి అర్వింద్ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా రహమత్నగర్ డివిజన్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లా అ ధ్యక్షుడు కులాచారి దినేష్ షేక్పేట డివిజన్లోని శక్తికేంద్రం సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. తీరికలేని షెడ్యూల్తో హోరాహోరీగా మూడు పార్టీల నాయకుల ప్రచారం ఎమ్మెల్యేల నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల వరకు అక్కడే తిష్ట సన్నిహితుల శుభకార్యాలకు సైతం హాజరు కాకుండా బిజీబిజీగా.. -
ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి
● జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి నిజామాబాద్ లీగల్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి సూచించారు. లోక్ అదాలత్ నిర్వహణ నేపథ్యంలో మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్లో జడ్జిలు, న్యాయవాదులతో ప్రత్యేక సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక లోక్ అదాలత్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ఆలోచనల నుంచి ఉద్భవించిందని అన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో లోక్ అదాలత్లో పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. రాజీ పడదగిన కేసులు పేరుకుపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వాటిని లోక్ అదాలత్ పరిష్కరించడమే మేలని జడ్జి తెలిపారు. ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయడంలో న్యాయవాదుల సహకారం చాలా అవసరమని అన్నారు. న్యాయవాదుల ప్రమేయం లేకుండా కేసులను రాజీ చేయబోమని, పోలీసు శాఖ కూడా స్పెషల్ లోక్ అదాలత్కు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని జడ్జి పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు శ్రీనివాస్, ఆశాలత, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయారెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ, జూనియర్ సివిల్ జడ్జిలు కుష్బూ ఉపాధ్యాయ, గోపికృష్ణ, హరికుమార్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సురేశ్, కోశాధికారి నారాయణ దాసు తదితరులు పాల్గొన్నారు. -
చలో నింబాచలం
నిజామాబాద్నగర మార్కెట్లో కార్తీక.. నిజామాబాద్ నగర మార్కెట్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. ఉసిరికొమ్మలు, పండ్లు, పూల విక్రయాలు జోరుగా సాగాయి.బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025– 8లో uమోర్తాడ్/కమ్మర్పల్లి : దక్షిణ బద్రినాథ్గా కొలిచే నింబాచలం కొండపై ప్రతి యేటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు, రథోత్సవం, జాతర నిర్వహిస్తుండగా, ఈ ఏడాది సైతం వైభవంగా కొనసాగుతున్నాయి. లింబాద్రిగుట్టపై బుధవారం రథోత్సవం, జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధర్మకర్తలు, ఆలయ కమిటీ, ఆయా శాఖల అధికారులు, పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గతేడాది రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో పోలీసుశాఖ ఈ ఏడాది అప్రమత్తమైంది. భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పొన్నం సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో దేవస్థానం పురోహితులతో చర్చించి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వన్ వే ద్వారా వాహనాల రాకపోకలను అనుమతించాలని నిర్ణయించారు. భీమ్గల్ నుంచి పురాణీపేట్ మీదుగా లింబాద్రి గుట్టకు చేరుకోవాల్సి ఉండగా, తిరిగి వెళ్లే భక్తులు గుట్టపై నుంచి పల్లికొండ, లింగాపూర్, సిద్ధపల్లె మీదుగా భీమ్గల్ చేసుకోవాలి. తిరిగి వెళ్లే భారీ వాహనాలు పల్లికొండ, పిప్రి, ముచ్కూర్, బెజ్జోర గ్రామాల మీదుగా భీమ్గల్ చేరుకోవాల్సి ఉంటుంది. సర్కిల్ పరిధిలోని పోలీసులతోపాటు ఇతర స్టేషన్ల నుంచి సిబ్బందిని బందోబస్తు కోసం లింబాద్రిగుట్టకు తరలించారు. అలాగే ప్రత్యేక పోలీస్ బలగాలను రప్పించారు. ముగ్గురు ఏసీపీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 400 మంది కానిస్టేబుళ్లు, ప్రత్యేక పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. రథోత్సవం, దైవదర్శనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. నేడు లింబాద్రిగుట్టపై రథోత్సవం, జాతర భారీ సంఖ్యలో తరలిరానున్న భక్తజనం ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసుల రూట్మ్యాప్ ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీప్రత్యేక బస్సులు ఆర్మూర్టౌన్ : ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి లింబాద్రి గుట్ట జాతరకు ప్రత్యేక బస్సులు నడుపు తున్నట్లు మేనేజర్ రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని, పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.40 బస్సు చార్జీ ఉంటుందని తెలిపారు. ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
భక్తిశ్రద్ధలతో డోలోత్సవం
● పరవశించిన భక్తజనం కమ్మర్పల్లి (భీమ్గల్) : నింబాచలం (లింబాద్రిగుట్ట)పై మంగళవారం రాత్రి స్వామి వారి డోలోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లక్మీనృసింహుని డోలోత్సవ మధుర ఘట్టాన్ని తిలకించిన భక్తజనం ఆనంద పరవశంలో మునిగితేలింది. స్వామి వారి ఆలయానికి పశ్చిమ వైపున ఉన్న జోడు లింగమునకు వెళ్లే దారిలో ఉన్న సీతానగరంలోని నాలుగు స్తంభాల రాతి మందిరంలో డోలో త్సవం చేపట్టారు. లక్ష్మీనరసింహ ఉత్సవ మూర్తులను పల్లకీలో వేద మంత్రోచ్ఛారణ ల నడుమ భాజా భజంత్రీలు మేళతాళాలతో మండపానికి తీసుకువచ్చి కార్యక్రమం జరిపారు. తిరుగు ప్రయాణంలో జోడులింగాలకు ఎదురుగా నిలిపి శ్రీలక్ష్మీనరసింహుని నుంచి జోడు లింగముల దర్శనం చేసుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన నిజామాబాద్అర్బన్ : జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా గోదాముకు వెళ్లిన ఆయన సీల్లను పరిశీలించారు. పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్రెడ్డి ఉన్నారు. జిల్లాకు కొత్తగా నలుగురు ఎంపీవోలు సుభాష్నగర్ : జిల్లాకు నలుగురు మండల పరిషత్ అధికారులను (ఎంపీవో) ప్రభు త్వం కేటాయించింది. ఇటీవల విడుదలైన గ్రూప్–2 పరీక్షల్లో పాసై ఎంపీవోలుగా సెలె క్ట్ అయిన వై వేణు, ఎన్ అజయ్కుమార్, పి బాలమణి, ఎం అరవింద్కుమార్ను జిల్లాకు కేటాయించారు. కాగా జిల్లాలో మాక్లూర్, రు ద్రూర్, నందిపేట్, బోధన్ మండలాల్లో ఎంపీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రుణాల రికవరీపై దృష్టి సారించాలి ● డీఆర్డీవో సాయాగౌడ్ డొంకేశ్వర్(ఆర్మూర్) : మహిళా సంఘాల స భ్యులకు రుణాలు అందించడం ఎంత ము ఖ్యమో, రికవరీ చేయడం కూడా అంతే ము ఖ్యమని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికా రి సాయాగౌడ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని జిల్లా కార్యాలయంలో జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. బ్యాంకు లింకేజీలో రూ.1,228 కోట్ల లక్ష్యానికి గాను రూ. 767.48 కోట్ల రుణాలు అందజేసినట్లు తెలిపారు. సీ్త్రనిధిలో రూ.246 కోట్లకు గాను రూ. 107.37 కోట్లు ఇచ్చామన్నారు. లోన్ బీమా, ప్రమాద బీమా పొందిన సభ్యులు ఇప్పటి వరకు 389 మంది మరణిస్తే 27మందికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఖాతాల్లో బీ మా డబ్బులు వేశామన్నారు. ఐకేపీ ద్వారా జిల్లాలో 266 సెంటర్లలో వడ్ల కొనుగోళ్లు జ రుగుతున్నట్లు తెలిపారు. ఏపీడీ మధుసూదన్, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు. శ్రీరామసాగర్కు 47 ఏళ్లు.. ● 1978లో పేరు మార్చిన నాటి సీఎం మర్రి చెన్నారెడ్డి బాల్కొండ: పోచంపాడ్ ప్రాజెక్టు పేరును శ్రీ రామసాగర్గా మార్చి బుధవారంతో 47 ఏ ళ్లు పూర్తయ్యింది. 48వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న శ్రీరామసాగర్ ప్రాజెక్టు పేరు మొదట పోచంపాడ్గా ఉండేది. 1978 నవంబర్ 5వ తేదీన ప్రాజెక్టును సందర్శించేందు కు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వ చ్చారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీలో ని వాసం ఉండే ఉద్యోగులు మర్రి చెన్నారెడ్డితో మాట్లాడుతూ.. సాగు, తాగునీటిని అందిస్తు న్న అతి పెద్ద ప్రాజెక్ట్ను పోచం‘పాడ్’గా పిలవడం బాగొలేదన్నారు. పవిత్ర గోదావరి తీ రాన శ్రీరామాలయం నెలకొల్పినందున శ్రీరామసాగర్గా పేరు పెట్టాలని కోరారు. స్పందించిన చెన్నారెడ్డి పోచంపాడ్ పేరును శ్రీరామసాగర్గా మారుస్తున్నట్లు ప్రకటించా రు. అలాగే ప్రాజెక్ట్ నుంచి నీటిని సరఫరా చేసే ప్రధాన కాలువల పేర్లను సైతం మా ర్చారు. హైలెవల్ కాలువ పేరును లక్ష్మి కాలువగా, దక్షిణ కాలువగా పిలిచే కాలువ పేరును కాకతీయ కాలువగా, ఉత్తర కాలువ గా పిలుచుకునే కాలువ పేరును సరస్వతి కాలువగా మార్చారు. -
మక్క రైతుకు మంచి కబురు
● కొనుగోలు పరిమితిని పెంచిన ప్రభుత్వం ● ఎకరానికి 25 క్వింటాళ్లు సేకరించాలని ఆదేశాలు ● జిల్లా కలెక్టర్ రాసిన లేఖకు స్పందన డొంకేశ్వర్(ఆర్మూర్) : మొక్కజొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి కబురు చెప్పింది. మక్క కొనుగోళ్లపై విధించిన పరిమితిని ఎత్తివేసింది. ఇది వరకు ఎకరానికి 18.5 క్వింటాళ్లు మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేయగా, ఇప్పుడు ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు సేకరించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం తమకు ఆదేశాలు అందినట్లు మార్క్ఫెడ్ డీఎం దాసోజు మహేశ్ తెలిపారు. ఆదేశాలు అందిన వెంటనే కొనుగోళ్లు చేపడుతున్న సొసైటీలకు అధికారులు సమాచారం చేరవేశారు. మక్క కొనుగోలు పరిమితి పెంచే విషయంలో కలెక్టర్ వినయ్ కృష్టారెడ్డి చేసిన కృషి ఫలించిందని చెప్పొచ్చు. కొనుగోలు కేంద్రాలను ఆయన పర్యవేక్షిస్తున్న సమయంలో ప్రభుత్వం విధించిన సీలింగ్ కారణంగా పంటను పూర్తిగా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతుల మేలు కోసం కలెక్టర్ గత నెల 25న ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎకరానికి 28 క్వింటాళ్లు సేకరించేలా అనుమతులు ఇవ్వాలని కోరారు. లేఖ రాసిన పది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి 25 క్వింటాళ్లకు అనుమతి ఇచ్చింది. పరిమితి పెంపుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కలెక్టర్కు కృతజ్ఞలు తెలుపుతున్నారు. అయితే జిల్లాలో మక్కల కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే చేపడుతున్న నేపథ్యంలో మక్కల సేకరణ త్వరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఏర్పాటు చేసిన 33 సెంటర్ల ద్వారా 15వేల మెట్రిక్ టన్నుల మక్కలను 4,500మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. 25వేల మెట్రిక్ టన్నుల సేకరణ మార్క్ఫెడ్ అధికారుల లక్ష్యంగా కాగా, పరిమితి పెంచడంతో 30వేల మెట్రిక్ టన్నులు దాటే అవకాశముంది. అయితే దళారులు కోల్డ్ స్టోరేజీల్లో ఉంచిన మక్కలను రైతుల పేరుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించకుండా అధికారులు కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతుల శ్రేయస్సు కోసం మక్కల కొనుగోలు పరిమితిని పెంచాలని ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ రాసిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు పెంచడం సంతోషంగా ఉంది. దీని వల న కష్టపడి పంట పండించిన రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఇందుకు రైతులందరి తరఫున కలెక్ట ర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. – బార్ల భరత్రెడ్డి, సొసైటీ చైర్మన్, డొంకేశ్వర్ -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి : భార్యకు గాయాలుబాన్సువాడ రూరల్: కామారెడ్డి జిల్లా బా న్సువాడ మండలంలోని కొయ్యగుట్ట తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెంద గా, భార్య తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నాగధార్ మండలం గరుకుచెట్టుతండాకు చెందిన కెతావత్ వసూరాం (52), తన భార్య దూరిబాయితో కలిసి టీవీఎస్ ఎక్సెల్పై మంగళవారం కామారెడ్డి వైపు బయలుదేరారు. కొయ్యగుట్ట తండా మూలమలుపు వద్ద వారి వాహనాన్ని ఓ కారు ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టింది. అనంతరం కారు స్తంభాన్ని ఢీకొట్టి నిలి చిపోయింది. ఈ ఘటనలో వసూరాం అక్కడికక్కడే మృతి చెందాడు. దూరిబా యి తీవ్రంగా గాయపడగా, బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం నందిపేట్(ఆర్మూర్): మండలంలోని బజార్ కొత్తూర్ గ్రామ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయినట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. బజార్ కొత్తూర్ గ్రామ శివారులో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని అన్నారు. మృతుడు బ్లూ, రెడ్, వైట్ కలర్ చెక్స్ షర్ట్, బ్లూ కలర్ షార్ట్ ధరించాడన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
హెల్మెట్ ఆవశ్యకతపై షార్ట్ ఫిల్మ్
● చిత్రీకరించిన ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్ ● ఆవిష్కరించిన సీపీ సాయిచైతన్య మోర్తాడ్(బాల్కొండ): ద్విచక్ర వాహనం నడిపేవారికి హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేస్తూ ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ షార్ట్ ఫిల్మ్ను రూపొందించారు. హెల్మెట్ ధరిస్తే ఎంత మేలు జరుగుతుందో అందరికి అర్థమయ్యేలా ఎస్సై స్వీయ నిర్మాణంలో స్థానిక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో 5 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ను రూపొందించారు. హెల్మెట్ వినియోగంపై చిన్నారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే వారి ఇంట్లోని వారు బైక్లపై ఎటూ వెళ్లినా హెల్మెట్ ధరిస్తారని దీనివల్ల ప్రాణాపాయం లేకుండా చేయవచ్చని ఎస్సై తెలిపారు. ఆయన రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్ను ఇటీవల సీపీ సాయి చైతన్య ఆవిష్కరించి, ఎస్సై చూపిన చొరవను అభినందించారు. హెల్మెట్ అనే టైటిల్తో ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుండటం విశేషం. -
లింబాద్రిగుట్టపై పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక చర్యలు
మోర్తాడ్: లింబాద్రి గుట్ట జాతర, రథోత్సవం బుధవారం నిర్వహించనున్న నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి భీమ్గల్ మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పని చేస్తూ, ప్రత్యేక చర్యలు చేపట్టాయి. మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఎంపీడీవో సంతోష్కుమార్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర ఉద్యోగులతో కలిసి గుట్టను మంగళవారం సందర్శించారు. చెత్తను ఎప్పటికప్పుడు ఎత్తి తరలించడానికి మున్సిపల్ ట్రాక్టర్లతోపాటు మండలంలోని వివిధ పంచాయతీల ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి సిబ్బంది రాత్రింబవళ్లు పని చేస్తారని అధికారులు వెల్లడించారు. సిరికొండ: భీంగల్లోని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ కార్యాలయంలో వివిధ కేసులలో పట్టుబడిన రెండు ద్విచక్ర వాహనాలను బుధవారం వేలం వేస్తున్నట్లు ఎ కై ్సజ్ సీఐ వేణుమాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు ఈ వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల వారు భీంగల్లోని కార్యాలయానికి ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సీఐ కోరారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మంగళవారం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకంపై ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సుదర్శన్రెడ్డికి ఆమె అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, పారుపల్లి గంగారెడ్డి ఉన్నారు. -
హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు శిక్ష
నిజామాబాద్ లీగల్/నవీపేట: నవీపేట్ మండలం లింగాపుర్లో ఒకరిపై హత్యాయత్నం చేసిన ఇద్దరు వ్యక్తులకు నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి జైలు శిక్ష విధించారు. వివరాలు ఇలా.. లింగాపుర్ గ్రామంలోని కేశాపురం గంగారాం, గంగోనే హనుమాండ్లు అనే రైతుల పొలాలు పక్కపక్కనే ఉంటాయి. గంగారాం పొలంలో నీరు పారే భాగాన్ని అమ్మాలని హనుమాండ్లు అతని కొడుకు నవీన్ గతంలో అడిగారు. అందుకు గంగారాం అతని కుమారుడు మహేష్ నిరాకరించారు. దీంతో వారిపై నవీన్, హనుమాండ్లు కక్ష పెంచుకున్నారు. 2020 ఫిబ్రవరి 25న మహేష్పై నవీన్, హనుమాండ్లు గొడవ పడి, పారతో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకొని కోర్టులో హాజరు పర్చారు. జడ్జి విచారణ చేపట్టి నిందితులకు శిక్ష ఖరారు చేశారు. నవీన్కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, హనుమాండ్లుకు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.500 చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో చెరో నెల రోజుల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. ఆరు వాహనాలు సీజ్ ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో మంగళవారం ఎంవీఐ రాహుల్కుమార్ వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని ఒక పాఠశాల బస్సు, 5 ట్రాన్స్ఫోర్ట్ వాహనాలను సీజ్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాల పత్రాలు అన్ని సరిగా ఉంటేనే రోడ్డుపై తీయలన్నారు. లేకుండా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. -
నగర మార్కెట్లో ‘కార్తీక’ సందడి
నిజామాబాద్ రూరల్: నగర మార్కెట్లో కార్తీక పౌ ర్ణమి సందడి నెలకొంది. ప్రతీ కార్తీక పౌర్ణమి రోజు న మహిళలు తులసీ గద్దెలకు పందిరి వేసి పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక దీ పాలు వెలిగిస్తారు. అనంతరం ముత్తైదువులకు వా యినాలు ఇచ్చి, వారి ఆశ్వీర్వాదం తీసుకుంటారు. ఈక్రమంలో తులసీ పూజకు కావాల్సిన సామగ్రి కో సం ప్రజలు జిల్లాకేంద్రానికి మంగళవారం భారీగా తరలివచ్చారు. దీంతో పూలు, పండ్లు, ఉసిరిగాయ లు, ఉసిరిచెట్లకు, మామిడికొమ్మలకు గిరాకీ పెరిగింది. నగరంలోని ప్రధాన చౌరస్తాల్లో ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేయగా, కొనుగోలుదారులతో దారులన్నీ కిటకిటలాడాయి. ముస్తాబైన ఆలయాలు.. నగరంలోని నీలకంఠేశ్వరాలయం, శంభులింగేశ్వర ఆలయం, మార్కండేయ మందిరంలో కార్తీక పౌ ర్ణమి వేడుకలకు ముస్తాబయ్యాయి. నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస చతుర్దశిని పురస్కరించుకొని జ్వాలాతోరణం నిర్వహించారు. -
యువత ఆదర్శవంతంగా ఎదగాలి
నిజామాబాద్ నాగారం: యువత చెడు మార్గంలో పయనించకుండా దేశానికి ఆదర్శవంతంగా ఎదగా లని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో మంగళవారం జిల్లాస్థాయి యువజన ఉత్సవ పోటీలు జిల్లా యు వజన క్రీడల అధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి కిరణ్ కుమార్ హాజ రై, మాట్లాడారు. జిల్లాస్థాయి పోటీలలోని విజేతలు రాష్ట్ర స్థాయిలో కూడా అదే ప్రతిభను కనబర్చాలన్నారు. అనంతరం విజేతలకు పవన్ కుమార్ బ హుమతులు ప్రదానం చేశారు. న్యాయనిర్ణే తలుగా సిర్ప లింగం, ఉమాబాల, పాయల్, భుజంగం, కా సర్ల నరేష్, నాగరాజు, పుష్పలత, శ్వేతరెడ్డి, ప్రశాంత్, సురేష్, గంగాదాస్ పాల్గొన్నారు. విజేతలు వీరే: జానపద నృత్యం (గ్రూప్)– శైలజ, జానపద గీతం (గ్రూప్)– హరిత, కథ రచన– అమేయ, ద్వితీయ–శ్రీనిధి, పెయింటింగ్–వేణు కుమార్, ద్వితీయ–పూజ, డిక్లమేషన్/ఎల్యుకేషన్–ధరణి, ద్వితీయ –అయిష బేగం, కవిత్వ రచన – శ్రేష్ఠ, ద్వితీయ– అక్షర, ఇన్నోవేషన్ –విజితెంద్రియ, ఎ.రాజ్ కరణ్, ద్వితీయ– సిద్దు. -
యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు
● సీపీ సాయిచైతన్య ● ముగిసిన వాలీబాల్, కబడ్డీ టోర్నీ ఆర్మూర్టౌన్: యువత, విద్యార్థులు డ్రగ్స్, సైబర్ క్రైమ్కు దూరంగా ఉంటేనే జీవితం ప్రశాంతంగా ఉంటుందని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాల క్రీడా మైదానంలో డ్రగ్స్ వద్దు.. క్రీడలు ముద్దు అనే నినాదంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు కొనసాగిన వాలీబాల్, కబడ్డీ టోర్నీ సోమవారం ముగిసింది. కార్యక్రమానికి హాజరైన సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ డ్రగ్స్తో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. శత్రుదేశాలు మన దేశాన్ని బలహీనపర్చడానికి డ్రగ్స్, స్మగ్లింగ్, సైబర్ క్రైమ్ మార్గాన్ని ఎంచుకుంటున్నాయని, వీటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. మన దేశం బలంగా ఉండాలంటే చెడు అలవాట్లకు లొంగకూడదన్నారు.యువత గంజాయి, డ్రగ్స్ జో లికి వెళ్లొద్దని సీపీ పిలుపునిచ్చారు.అనంతరం విజే త జట్లకు సీపీ సాయిచైతన్య బహుమతులు ప్రదా నం చేశారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్, ఎస్సై రమేశ్, ఎంఈవో రాజాగంగారాం, క్రీడల కన్వీనర్ లక్ష్మీనర్సయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఒకే షిఫ్ట్లో పనిచేయించండి
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఒకే షిఫ్ట్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు గతవారం వరకు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకే షిఫ్ట్లో పని చేయించేవారని అన్నారు. ఇటీవల ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్ల్లో పనిచేయించాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. -
కొనసాగుతున్న నీటి విడుదల
బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతుండటంతో ఎస్సారెస్పీ వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతోంది. 56,513 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, ప్రాజెక్ట్ 16 వరద గేట్ల ద్వారా 47 వేల క్యూసెక్కులు అవుట్ ఫ్లో అవుతోంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 573 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి నిండుకుండలా ఉంది. 36.65 మెగావాట్ల విద్యుదుత్పత్తి.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద జల విద్యుదుత్పత్తి కేంద్రంలో నాలుగు టర్బాయిన్ల ద్వారా సామర్థ్యానికి మించి 36.65 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. సోమవారం రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి జరగడంపై జెన్కో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 68.30 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. -
బకాయిలు చెల్లించే వరకు కాలేజీలను తెరవం
● ప్రయివేటు కళాశాలల అసోసియేషన్ వెల్లడి ఖలీల్వాడి:ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు కాలేజీలను తెరిచే ప్రసక్తి లేదని టీయూ ప్రయివేటు కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఒక ఏడాది ఫీజులను మరో సంవత్సరం చెల్లించడంతో చాలా ఇబ్బందులుపడ్డామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించామని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా పాత బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలపై ప్రభుత్వానికి ఎన్నోసార్లు అభ్యర్థించామని గుర్తుచేశారు. గతంలో కాలేజీలు బంద్ చేయడంతో యాజమాన్యాలతో ప్రభుత్వం మాట్లాడి బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ, ఇంత వరకు బకాయిల్లో నుంచి కనీసం 10 శాతం కూడా చెల్లించలేదని తెలిపారు.కాలేజీల నిర్వహణ కోసం రుణా లు,బంగారు నగలు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి నరాల సుధాకర్, మార య్య గౌడ్, దాసరి శంకర్, సూర్య ప్రకాశ్, దత్తు శ్రీనివాస్, బాలకృష్ణ, శంకర్, నరేశ్ పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్లో జిల్లా నేతల ప్రచారం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్యాదవ్ తరఫున జిల్లాకు చెందిన పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు జీవన్నాయక్, రోహిత్రెడ్డి ఎర్రగడ్డ డివిజన్లోని 318 బూత్లో ప్రచారం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నట్లు శేఖర్గౌడ్ తెలిపారు. నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, మోపాల్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కెతావత్ మోహన్, తూర్పు రాజేశ్ ప్రచారంలో పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి జైలు శిక్ష, మరో 21 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ తెలిపారు. ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయగా ఎల్లమ్మగుట్టకు చెందిన బండి శ్రీకాంత్, వడ్డెర కాలనీకి చెందిన రమేశ్ తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. 21 మందికి సెకండ్క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ రూ.40 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. డయల్ 100 దుర్వినియోగం కేసులో..ధర్పల్లి: డయల్ 100ను దుర్వినియోగం చేసిన వ్య క్తికి రెండు రోజుల జైలు శిక్ష పడినట్లు ధర్పల్లి ఎస్సై కళ్యాణి సోమవారం తెలిపారు. భీమ్గల్ మండలం దేవక్కపేట్ గ్రామానికి చెందిన రాజు ధర్పల్లి మండలం హోన్నాజిపేట్లోని బంధువుల ఇంటికి వచ్చా డు. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి మద్యం మత్తు లో డయల్ 100కు పలుమార్లు ఫోన్ చేసి అధికారు ల సమయాన్ని వృథా చేశాడు. రాజుపై కేసు నమో దు చేసి సోమవారం కోర్టులో హాజరుపరచగా రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు. -
కారు, బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గేట్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఎదురెదురుగా వస్తున్న కారు, బైక్ ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్ నడుపుతున్న వెంకంపల్లికి చెందిన మాసిని సంగయ్యతోపాటు కారు డ్రైవర్ సంగు తీవ్రంగా గాయపడ్డారు. సంగయ్య బైక్పై స్వగ్రామం నుంచి గోపాల్పేట వైపు వెళ్తుండగా, అదే సమయంలో గోపాల్పేట నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న కారు తాండూర్ గేట్ వద్ద ఒకదానినొకటి ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన ఇరువురిని 108 అంబులెన్స్లో ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని ప్రముఖ డెంటల్ వైద్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఓ మహిళ సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేసింది. వీడియోకాల్స్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యా దులో పేర్కొంది. వారి వేధింపులను తట్టుకోలేక ఉద్యోగం మానేశానని, అయి నా తరచూ కాల్స్ చేసి వేధిస్తున్నారని తెలిపింది. ఫిర్యాదును సీపీ సాయిచైతన్య 4వ టౌన్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. ఒకరి అదృశ్యం వర్ని: మండలంలోని హుమ్నాపూర్ గ్రామానికి చెందిన కొడిచెర్ల హన్మాండ్లు(48) అదృశ్యమైనట్లు వర్ని ఎస్సై మహేశ్ తెలిపారు. ఈ నెల 1న ఇంటి నుంచి వెళ్లిన హన్మాండ్లు తిరిగి రాలేదని, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు సోమవారం ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
మాక్లూర్: రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అదనపు కలెక్టర్ కిరణ్కుమార్తో కలిసి మాక్లూర్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో సమావేశమై మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. వాతావరణ మార్పులతో వర్షాలు కురుస్తున్నాయని, దీంతో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఫలితంగా రైతులకు టార్పాలిన్లు, కూలీల ఖర్చు తడిసిమోపెడవుతుందని తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆరిన ధాన్యం ఆరినట్టు కొనుగోలు చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని రైతులకు సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోలు విషయమై రైతులు ఆందోళన చెందొద్దని తెలిపారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు రైస్మిల్లర్లతో మాట్లాడుతూ సమయానికి గన్నీ బ్యాగులు, లారీలను పంపిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస్రావు, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్రెడ్డి, డీఎస్వో అర్వింద్రెడ్డి, జేడీఏ గోవింద్నాయక్, తహసీల్దార్ శేఖర్, ఏవో పద్మ, మాక్లూర్ సొసైటీ ప్రత్యేక అధికారి స్వప్న, కాంగ్రెస్ మండల నాయకులు గంగాధర్గౌడ్, రవిప్రకాశ్, వెంకటేశ్వర్రావు, సొసైటీ మాజీ చైర్మన్లు బూరోల్ల అశోక్, దయాకర్రావు, మాజీ సర్పంచులు రాజేందర్, రాజ్మల్లయ్య, మాజీ జెడ్పీటీసీ జంగిడి సతీశ్, పీర్సింగ్, మోతే రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పసుపు పరిశ్రమ సందర్శన
జక్రాన్పల్లి: మండలంలోని మనోహరాబాద్ గ్రా మంలో ఉన్న జేయం కేపీఎం పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘాన్ని యూనియ న్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జయకృష్ణ, మేనేజర్ వైభవ్, స్థానిక యూనియన్ బ్యాంక్ మేనేజర్ సుమలత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో ఉత్పత్తులను పరిశీలించారు. ఐదు గ్రామా ల రైతులు కలిసి ఎంఎస్ఎంఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో సొసైటీగా ఏర్పాటు చేసుకొని కంపెనీ యా క్ట్లో రిజిస్టర్ అయ్యి మారుమూల ప్రాంతంలో పరి శ్రమను స్థాపించడం గొప్ప విషయమని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో పసు పు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డి, డైరెక్టర్ అల్లూరి సంతోష్ రెడ్డి, రైతు బుచ్చిరెడ్డి, సూపర్వైజర్ రొడ్డ రుత్విక్ పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
బాల్కొండ: చిట్టాపూర్ గ్రామానికి చెందిన తూం రాజనారాయణ(40) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజనారాయణ ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ గ్రామంలో ఆదివారం వివాహానికి హాజరై తిరిగి చిట్టాపూర్ గ్రామానికి వెళ్తూ జాతీయ రహదారి 44 దాటుతుండగా నిర్మల్ నుంచి ఆర్మూర్ వైపు అతివేగంగా వెళ్తున్న కారు ఢీ కొట్టింది. తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పేర్కొన్నారు. లక్ష్మాపూర్లో ఒకరు.. వర్ని: చందూర్ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన బొంతల సాయిలు (45)చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వర్ని ఎస్సై మహేశ్ తెలిపారు. భార్య రాధా ఇంటి నుంచి వెళ్లిపోయిందనే మనస్తాపంతో సాయిలు నాలుగు నెలల క్రితం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఐఎంఏకు రాష్ట్రస్థాయి పురస్కారాలు
నిజామాబాద్ నాగారం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 9వ రాష్ట్ర మహాసభల్లో జిల్లా ఐఎంఏ రెండు అవార్డులను అందుకున్నది. కరీంనగర్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అజ్జ శ్రీనివాస్, డాక్టర్ విక్రమ్రెడ్డి ఉత్తమ అధ్యక్ష విశిష్ట పురస్కారాన్ని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా అందుకున్నారు. ఐఎంఏ రాష్ట్ర మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ కన్వీనర్, ప్రొఫెసర్ డా.విశాల్ ఆకుల ఉత్తమ మానసిక ఆరోగ్య విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో ఐఎంఏ నేషనల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవీంద్ర రెడ్డి, ఐఎంఏ నిజామాబాద్ ప్రతినిధులు, డాక్టర్లు కవితారెడ్డి, జీవన్రావు, అనుమల్ల సత్యనారాయణ, నీలి రాంచందర్, దామోదర్ రావు, కౌలయ్య, రమణేశ్వర్ పాల్గొన్నారు. -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ అంకిత్ ● ప్రజావాణికి 128 ఫిర్యాదులు నిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 128 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్తోపాటు డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాగా, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని నెలలుగా నాకు పెన్షన్ రావడం లేదు. అధికారుల చుట్టూ తి రుగుతున్నా పట్టించుకోవడం లేదు. నా భర్త నడవడానికి ఇబ్బందికరంగా ఉంది. గతంలోనూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశా అంటూ బోధన్కు చెందిన శకుంతల తన భర్తతో కలిసి అధికారులకు ఫిర్యాదు చేసింది. బోరున విలపిస్తూ తమను ఆదుకోవాలని వేడుకున్నది. పరిశీలించిన అధికారులు సదరం సర్టిఫికెట్ గ డువు ముగిసిందని, రెన్యువల్ చేసిన తర్వాత పెన్షన్ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు. -
కళాశాలల నిరవధిక బంద్
ఖలీల్వాడి/డిచ్పల్లి : ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను యాజమాన్యాలు బంద్ పాటిస్తున్నాయి. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం కళాశాలల ఎదుట బంద్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. కళాశాలలు మూసి ఉంచడంతో విద్యార్థులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఉమ్మడి జిల్లాలో 50 డిగ్రీ, 11 పీజీ కాలేజీలు ఉండగా, సుమారు రూ.350 కోట్ల ఫీజు బకాయిలు రావాల్సి ఉంది. అలాగే నిజామాబాద్ జిల్లాలోని 14 బీఈడీ, ఒక బీపెడ్, మూడు ఇంజినీరింగ్ కళాశాలలను సైతం యాజమాన్యాలు మూసివేశాయి. మూడు ఇంజినీరింగ్ కళాశాలలకు సుమారు రూ.20 కోట్ల వరకు బకాయిలు విడుదల కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలు నిర్వహించలేని స్ధితిలో ఉన్నామని కళాశాలల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేసే వరకు కళాశాలలను తెరిచే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. కళాశాలల నిరవధిక బంద్ కొనసాగితే సిలబస్ విషయంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలని నిరసన జిల్లాలో మూతపడిన ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు కాలేజీల ఎదుట బ్యానర్ల ఏర్పాటు -
కార్తీక కాంతిలో నీలకంఠుని సన్నిధి
కార్తీక దీపాల వెలుగులో నీలకంఠేశ్వరాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పవిత్ర కార్తీకమాసంలో రెండో సోమవారాన్ని పురస్కరించుకుని మహిళలు పెద్ద సంఖ్యలో నగరంలోని నీలకంఠేశ్వరాలయానికి తరలివచ్చారు. ఆలయ, కోనేరు ప్రాంగణాల్లో దీపాలను వెలిగించారు. అర్చకులు పుష్కరిణికి హారతి ఇచ్చారు. అలాగే చిరంజీవాచార్యుల హరికథను శ్రద్ధగా విన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పల్లకీ సేవ నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి శ్రీరాం రవీందర్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. – నిజామాబాద్ రూరల్ -
గర్భిణులకు అన్ని రకాల సేవలందించాలి
గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులునిజామాబాద్ నాగారం: తమకు కేటాయించిన కేంద్రాల్లో మార్పు సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు అన్ని రకాల సేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారిణి బి రాజ్యశ్రీ ఆదేశించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య సంక్షేమ కార్యక్రమాలపై సోమవారం తన కార్యాలయంలో డీఎంహెచ్వో సమీక్ష నిర్వహించారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని, డ్రాప్ అవుట్లను గుర్తించాలని అన్నారు. డెంగీ ప్రబలకుండా చేపడుతున్న చర్యలు, టీబీ ముక్త్భారత్ తదితర అంశాలపై చర్చించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల నూతన భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను కేటాయించేలా గ్రామాభివృద్ధి కమిటీలు లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని ఆదేశించారు. అలాగే నిర్మాణం పూర్తయిన పల్లె దవాఖానలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వోలు రమేశ్, డాక్టర్లు సమత, అశ్విని, ప్రోగ్రాం అధికారులు తుకారాం రాథోడ్, వైద్యులు రాజు, అశోక్, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీలపై సమీక్ష ప్రైవేట్ ఆస్పత్రులు తనిఖీ చేసే బృందాల విధులపై డీఎంహెచ్వో రాజశ్రీ సమీక్షించారు. తనిఖీలకు వెళ్లినప్పుడు నమోదు చేసే అంశాలు, రిజిస్టర్ల నిర్వహణపై సూచనలు చేశారు. డాక్టర్ శిఖర, వైద్యాధికారులు, డీహెచ్ఈ వేణుగోపాల్, సురేశ్ పాల్గొన్నారు. -
నింబాచల గోవిందా
స్వామి వారి సుదర్శన చక్రం పల్లకీ సేవలో ఆలయ పండితులు, భక్తులుకమ్మర్పల్లి(భీమ్గల్): నింబాచల గోవిందా.. మోక్ష ప్రదాత గోవిందా.. అంటూ భక్తజనం లింబాద్రిగుట్టపై పులకించింది. భీమ్గల్ లింబాద్రి గుట్టపై స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగు తున్నాయి. సోమవారం గిరిప్రదక్షిణ నిర్వహించగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గోవింద నా మస్మరణ చేస్తూ గిరి చుట్టూ ప్రదక్షిణ చేశారు. పల్లకీలో స్వామివారి సుదర్శన చక్రాన్ని ఉంచి గిరిప్రదక్షిణ నిర్వహించారు. తెల్లవారుజామునే పారణ త్ర యోదశి, వైకుంఠ చతుర్ధశి, ప్రభోదోత్సవం కార్యక్రమాలు నిర్వహించి, తులసి – విష్ణుమూర్తి వివా హోత్సవం (తులసి వివాహం) కన్నుల పండువగా నిర్వహించారు. భీమ్గల్ సీఐ పొన్నం సత్యానారాయణగౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఎస్పై సందీప్తోపాటు సిబ్బంది విధులు నిర్వర్తించారు. -
ఆర్వోబీ వద్ద ఆగమాగం
● గంటపాటు ట్రాఫిక్ జామ్ ● ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలునిజామాబాద్ రూరల్ : నగర శివారులోని మాధవనగర్ ఆర్వోబీ రైల్వే బ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం ఆరు గంటలకు సుమారు గంటపాటు ట్రాఫిక్జామ్ అయ్యింది. రోడ్డు అధ్వానంగా ఉండడంతోపాటు కనీసం అక్కడ విద్యుత్ దీపాలు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే గేటు రెండుసార్లు దించి ఎత్తడంతో రోడ్డుకు ఇరువైపులా అర కిలోమీటరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. అసలు ట్రాఫిక్ను క్లియర్ చేసే వారు లేకపోవడంతో ఎవరికి వారే ఇష్టారీతిన వాహనాలను ముందుకు తీయడంతో సమస్య తీవ్రమైంది. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులతోపాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా పట్టించుకునే వారు లేకుండాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్లపై గుంతలను పూడ్చడంతోపాటు ఆర్వోబీ వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. -
బాన్సువాడలో వివాహిత ఆత్మహత్య
బాన్సువాడ: పట్టణంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు. వివరాలు ఇలా.. పట్టణానికి చెందిన గొడుగు కాశీనాథ్కు, కంగ్టి మండలానికి చెందిన అపర్ణకు(30) 2019లో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆదివారం ఉదయం అపర్ణకు ఆమె అత్త సాయవ్వకు మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో అపర్ణ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుంది. వెంటనే స్థానికులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు నిజామాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. కానీ బాన్సువాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు తీవ్రంగా శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. అపర్ణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన ఒడుసుల చిరంజీవి(30) కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ప్రతిరోజు మద్యం సేవిస్తున్నాడు. కుటుంబ సభ్యులు మద్యం మానుకోవాలని సూచించారు. దీంతో గత నెల 31న పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
నిజామాబాద్అర్బన్: చోరీ చేసిన సొత్తును విక్రయించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా..నగరంలోని కొజా కాలనీకి చెందిన అతర్ బేగ్,షేక్ అజ్మద్ అనే ఇద్దరు గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతుండేవారు. అక్టోబర్ 31న నగరంలోని అశోక్ నగర్లోగల ఓ ఇంటిలో రూ.1500 నగదు, ఒక సెల్ఫోను, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. కాగా ఆదివారం గంజ్ ప్రాంతంలో బంగారం విక్రయించేందుకు రాగా అనుమానం వచ్చి వారిని పోలీసులు విచారించారు. దీంతో వారు చోరీ చేసినట్లు అంగీకరించారు. అనంతరం వారివద్దనుంచి చోరీ సొత్తును రికవరీ చేసి, వారిని అరెస్టు చేశారు. వారిలో అతర్బేగ్ నెలన్నర క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడని, మళ్లీ చోరీ కేసులో అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు, బోధన్ పట్టణంలో ఇద్దరు.. బోధన్టౌన్(బోధన్): ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. వివరాలు ఇలా.. పట్టణంలోని అంబేడ్క ర్ చౌరస్తాలో ఎస్ఐ హబీబ్ఖాన్, మనోజ్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించారు. పోలీసులు వెంటనే వారిని వెంబడించి పట్టుకొని, విచారించారు. వారిని నిజామాద్కు చెందిన షేక్ మహ్మద్ జాహెద్, బోధన్కు చెందిన సయ్యద్ ఇక్బాల్గా గుర్తించారు. ఇద్దరు కలిసి బోధన్, ఆర్మూర్ ప్రాంతాల్లో బైక్లను చోరీ చేసి, నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసి, బైక్లను మహారాష్ట్రలో అమ్ముతున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి బుల్లెట్, పల్సర్తో పాటు నఖిలీ ఆర్సీలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
వర్ష ప్రభావం.. వరి కోతలకు భారం..
● వర్షాలకు నేలవాలిన పొలాల్లో టైర్ యంత్రాలు వెళ్లలేని పరిస్థితి ● చైన్ యంత్రాలకు ఎక్కువ అద్దెలతో ఇబ్బందులు పడుతున్న రైతులు మోర్తాడ్(బాల్కొండ): ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరి పంట నేలకూలింది. పంట కోతలకు రావడంతో రైతులు కోత యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. పంట నేలవాలడంతో టైర్ యంత్రాలు పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో చైన్ యంత్రాల వైపు రైతులు మొగ్గుచూపడంతో వాటికి డిమాండ్ ఏర్పడింది. కానీ వాటి అద్దె భారం ఎక్కువగా ఉండటంతో అన్నదాతలు మోయలేకపోతున్నారు. టైర్ యంత్రాలకు అద్దె ఒక గంటకు రూ.1,540గా, చైన్ యంత్రాలకు మాత్రం గంటకు రూ.2,950 చెల్లించాలని గతంలోనే తీర్మానించారు. టైర్ యంత్రాలతో వేగంగా వరి కోతలు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. చైన్ యంత్రాలతో వరి కోతలు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అద్దె ఎక్కువగానే ఉండటం, వరి కోతలకు సమయం ఎక్కువ తీసుకుంటుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వర్ష ప్రభావం వరి కోతలపై ఆర్థిక భారం మోపడంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. వరి కోతలు సకాలంలో పూర్తి చేయకపోతే వాతావరణ పరిస్థితులలో మార్పులు వచ్చి మరింత నష్టం వాటిల్లుతుందేమోననే సందేహం రైతులను వెంటాడుతుంది. ఏదేమైనా వర్ష ప్రభావం వల్ల వరి కోతల కోసం ఆర్థిక భారం అధికంగా మోయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. సాధారణ యంత్రాలతో వరి కోతలు పూర్తి చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వరి కోతల సమయంలో వర్షాల వల్ల పంట నేలకూలడంతో చైన్ యంత్రాలను వినియోగించాల్సి వస్తుంది. రైతులకు గత్యంతరం లేకపోవడంతో వాటి అద్దె భారం మోయక తప్పడం లేదు. – కే. చిన్న రాజేశ్వర్, రైతు, మోర్తాడ్ -
ప్రారంభోత్సవానికి సిద్ధమైన శ్రీవారి ఆలయం
● కుక్కలగుట్ట వేంకటేశ్వర ఆలయంలో ఈనెల 5నుంచి ఉత్సవాల నిర్వహణ పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లోగల కుక్కలగుట్ట వేంకటేశ్వర ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇటీవల ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో పెర్కిట్ గ్రామాభివృద్ధి కమిటీ వారు నూతన ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించారు. దీంతో భక్తులు రూ.కోటి 20 లక్ష లు విరాళంగా ఇవ్వగా వీడీసీ వారు రూ.60 లక్షలు వ్యయం చేశారు. అలాగే ఆలయ ప్రాంగణాన్ని సుందరీకరించడానికి, తుది మెరుగులకు మరో రూ.20 లక్షల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉంది. మూ డున్నర ఎకరాల సువీశాల స్థలంలో వేంకటేశ్వర మందిరంతోపాటు శివాలయం, నవగ్రహ ఆలయా న్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం పూర్తవడంతో వీడీసీ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 7వరకు విగ్రహాల పున:ప్రతిష్ఠాపన ఉత్సవాలను నిర్వహించనున్నారు. కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన శ్రీ గురు మధనానంద సరస్వతీ పీఠాధిపతి మాధవా నంద సరస్వతి స్వామి, నందిపేట కేదారీశ్వర ఆశ్ర మ వ్యవస్థాపకుడు బాలయోగి మంగి రాములు మహారాజ్, ఆదిలాబాద్ బ్రహ్మశ్రీ ఆగస్త్య శాసీ్త్ర, పెర్కిట్ మోహన్ రావు జోషి వేద మంత్రోచ్చరణల మధ్య విగ్రహాలను పున:ప్రతిష్ఠించనున్నారు. -
నేటి నుంచి డిగ్రీ కాలేజీల బంద్
● తెయూ ప్రయివేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ నిర్ణయం ● ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను ప్రభుత్వం ఇవ్వకపోవడమే కారణం తెయూ(డిచ్పల్లి)/ఖలీల్వాడి: తెయూ పరిధిలోని ఉమ్మడి జిల్లాలోగల ప్రయివేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను నేటి (సోమవారం) నుంచి బంద్ చేయనున్నారు. ఈమేరకు తెయూ ప్రయివేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ ఇటీవల తెయూ వీసీ, రిజిస్ట్రార్లకు వినతిపత్రాలను సైతం అందజేసింది. ప్రభుత్వం మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పెండింగ్లో పెట్టడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. భారంగా కాలేజీల నిర్వహణ.. మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాలకు కాలేజీల నిర్వహణ భారంగా మారింది. కనీసం కాలేజీలో పని చేసే అధ్యాపకులు, సిబ్బందికి ప్రతినెల వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. బకాయిలు విడుదల కోసం సెప్టెంబర్ 16 నుంచే కళాశాలల బంద్ పాటించేందుకు ప్రయివేట్ కాలేజీల యాజమాన్య అసోసియేషన్ సిద్దపడింది. కానీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు రాష్ట్ర కమిటీతో సమావేశం నిర్వహించి నిధులు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోవడంతో నవంబర్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక బంద్ పాటించాలని ప్రయివేటు కాలేజీల యాజమాన్య అసోసియేషన్ నిర్ణయించింది. వీటితోపాటు ప్రయివేట్ బీఈడీ, ఎంసీఏ, నర్సింగ్, బీటెక్ కళాశాలల యాజమాన్యాలు కూడా బంద్ పాటించనున్నాయి. తెయూ పరిధిలోనే గత మూ డు సంవత్సరాలుగా ఫీజు రీ యింబర్స్మెంట్ బకాయిలు సుమారు రూ.350 కోట్లకు పై గా పేరుకుపోయా యి. ప్రభు త్వం దృష్టికి ఎన్ని సార్లు నివేదించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రయివేట్ కళాశాలలు నిరవధిక బంద్ పాటిస్తున్నాం. ప్రభుత్వం నిధులు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుంది. ఇందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలి. –జైపాల్రెడ్డి, తెయూ ప్రయివేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ అధ్యక్షుడు -
తెగుళ్లకు బెడ్తో చెక్
● పసుపును బెడ్ విధానంలో సాగు చేసిన ముప్కాల్ రైతు ● అధిక వర్షాలు కురిసినా పంటకు సోకని తెగుళ్లు బాల్కొండ: పసుపు పంటను బెడ్ విధానంలో సాగు చేయడంతో తెగుళ్లకు చెక్ పెట్టవచ్చని ఉద్యావన శాఖ అధికారి రుద్ర వినాయక్ తెలిపారు. ముప్కాల్లో రైతు లోక నరేష్రెడ్డి బెడ్ విధానంలో సాగు చేసిన పంటలో ఎలాంటి తెగుళ్లు లేకుండా, ఎపుగా పెరిగిందన్నారు. దీంతో రైతులు బెడ్ విధానంలో పసుపు సాగుచేసుకోవాలని వారు ఒక ప్రకటనలో పేర్కొంటున్నారు. పసుపు పంటను విత్తే ముందు సదరు రైతు ఎకరానికి 5 ట్రాక్టర్ల కోళ్ల పేడ ఎరువుతో పాటు వర్మి కంపోస్ట్ నేలలో వేశాడు. మీటర్ వెడల్పు, 20 సెంటీ మీటర్ల ఎత్తు, 30 సెంటీమీటర్లు దూరంతో బెడ్ను తయారు చేసుకున్నాడు. బెడ్కు రెండు వైపులా పసుపు పంటను విత్తాడు. ప్రస్తుతం అధికంగా వర్షాలు కురిసినా ఈ విధానంతో పంటలో నీరు నిల్వ లేకుండా పోయింది. దీంతో పసుపు పంటకు ఎలాంటి చీడలు వ్యాపించలేదు. పంట పచ్చగా ఏపుగా ఉండటంతోపాటు పసుపు కర్రలు దృఢంగా, పసుపు కొమ్ములు కూడ భూమి పగిలి బయటకు వస్తున్నాయి. దీంతో భారీ దిగుబడి వస్తుందని అధికారులు అంచన వేస్తున్నారు. పసుపు పంటకు తెగుళ్లు సోక కుండ ఆరోగ్యంగా ఉండటంపై రైతు ఆనందం వ్య క్తం చేస్తున్నారు. బెడ్ విధానంలో సాగు చేసుకోవడంతో సాధా రణం కంటే 20 శాతం అధికంగా దిగుబడి వస్తుందని అధికారులు తెలిపారు. -
సమాజాన్ని చైతన్యపరిచే రచనలు అవసరం
మాక్లూర్: సమాజాన్ని చైతన్యపరిచే రచనలు అవసరమని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి కన్వీనర్ డాక్టర్ మృణాళిని అన్నారు. రచనలు ఎంత గొప్పగా ఉంటే సమాజంలో రచయితలకు అంత గొప్ప గౌరవం దక్కుతుందన్నారు. మండలంలోని అడవి మామిడిపల్లి శివారులోగల అపురూప వెంకటేశ్వర కల్యాణమండపంలో ఆదివారం రచయిత్రి, విద్యావేత్త డాక్టర్ అమృతలత ఆధ్వర్యంలో నెల్లుట్ల రమాదేవి సభాధ్యక్షతన అమృతలత జీవన సాఫల్య పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మృణాళిని ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రచనలు చేయటం ఒక ఎత్తయితే చేసిన రచనలు సమాజానికి ఎంత మేరకు ఉపయోగపడ్డాయనేది కూడ రచయిత గుర్తేరుగాలన్నారు. అనంతరం నిర్వాహకులు మృణాళిని, ప్రతిమ, రాజగోపాల్రావు, రాజ్యలక్ష్మి, శాంతి నారాయణ, వల్లీశ్వర్, నలిమెల భాస్కర్, వెంకటకృష్ణ, పెద్దింటి అశోక్కుమార్, శంకర్, లక్ష్మణ్, స్వయం ప్రకాష్, విజయ కిషన్రెడ్డి, కుసుమలతరెడ్డి, వసంత వివేక్, నరసింహరెడ్డి, సుజాత, సుమిలాశర్మ, బోస్కర్ ఓంప్రకాష్ను సన్మానించి అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను అందజేశారు. కవిత దివాకర్, కాసర్ల నరేష్, బాలాజీ, కళాగోపాల్, శ్రీనివాస్, వెంకటరమణ, నాగభూషణం, తిరుపతి, కిరణ్బాల, శ్రీరాం, ప్రభాదేవి, నారాయణచారి, రజిత, రాజేశ్వర్, శారద హన్మాండ్లు, తారాచౌదరి, ప్రభాదేవి, కళాగోపాల్, సునిత, స్వాతి, రాజేంధర్, నరేందర్రెడ్డి, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్ని: మోస్రా మండలంలోని ఓ గ్రామంలో యువకుడు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితురాలు వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 19 సంవత్సరాల యువకుడు తనను ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని ఆరోపిస్తూ ఆదివారం వర్ని పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. నిజామాబాద్ నాగారం: తైక్వాండో క్యూరియస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం క్రీడాకారులకు బెల్టుల పరీక్ష నిర్వహించారు. కోచ్ వినోద్ నాయక్ ఆధ్వర్యంలో వైట్, ఎల్లో, రెడ్, ఆరంజ్, గ్రీన్, బ్లాక్ తదితర విభాగాల్లో పరీక్షలు నిర్వహించి క్రీడాకారులకు బెల్టులు, సర్టిఫికెట్లను అందజేశారు.అనంతరం పోటీల్లోగెలుపొందిన క్రీడాకారులను తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అజ్మత్ ఖాన్ అభినందించారు. నిజామాబాద్ నాగారం: హైదరాబాద్లో ఈ నెల 8, 9వ తేదీల్లో నిర్వహించే రాష్ట్ర పౌర హక్కుల సంఘం(సీఎల్సీ) తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని సీఎల్సీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ కోరారు. నగరంలోని శ్రీనగర్కాలనీలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సభకు సంబంధించిన కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను ప్రభుత్వం అణచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 19, 21 ఆర్టికల్ ప్రకారంగా ప్రజలకు జీవించే, ప్రకటనా స్వేచ్ఛ హక్కును రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలపై ఉందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి జలేంధర్, ఉపాధ్యక్షులు గుర్రం జలంధర్, భాస్కర్ స్వామి, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టాలను ఎదుర్కొన్నా నష్టాల పాలే!
డొంకేశ్వర్(ఆర్మూర్) : కష్టాలను ఎదుర్కొంటూ ఖరీఫ్ పంటలు సాగు చేసిన రైతన్నకు చివరకు నష్టాలే మిగిలే దుస్థితి వచ్చింది. ఈ సీజన్ రైతలకు ఏ మాత్రం కలిసిరాలేదు. సాగు పనులు మొదలు పెట్టిన నాటి నుంచి పంట కోసే దాకా అధిక వర్షాలు అల్లాడించాయి. వారానికో వాయుగుండం, నెలకో తుపాను వచ్చి పంటలను పాడు చేయగా, వాటి తెగుళ్లు తోడయ్యాయి. ఫలితంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దిగుబడులు తగ్గాయని మొత్తుకుంటున్న రైతులను ఇటీవల ‘మోంథా’ తుపాను మరిన్ని కష్టాల పాలు చేసింది. నాలుగు నెలలు కష్టించి పండించిన పంటలు నేలపాలయ్యాయి. వర్షానికి వడ్లు, మక్కలు పూర్తిగా తడిసిపోయాయి. చాలా చోట్ల వరద నీటిలో కొట్టుకుపోయాయి. రంగుమారి విత్తనాలు మొలకెత్తాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబోసేందుకు పడరాని కష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ, తాలుతోపాటు రంగుమారిందంటూ కొర్రీలు పెడుతున్నారని రైతులు దు:ఖాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేం కాలమంటూ వాపోతున్నారు. మొత్తం మీద ఈ ఏడాది ఖరీఫ్లో పంటలు సాగు చేసిన రైతులు కష్టాలను ఎదుర్కొని, నష్టాల పాలయ్యారు. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులను చూస్తున్న రైతులు భవిష్యత్లో వ్యవసాయం చేయాలా? వద్దా? అనే ఆలోచనకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ ఖరీఫ్ సీజన్లో ఎకరం వ్యవసాయ భూమిలో మక్క సాగు చేశాను. ఎకరానికి 28 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 20 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. వాతావరణంలో మార్పులు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా నష్టపోయాం. – నాగరాజు, రైతు, డొంకేశ్వర్ నాలుగు ఎకరాల్లో సాగు చేసిన వరిని పది రోజుల క్రితం కోయగా ఆరున్నర ట్రాక్టర్ల దిగుబడి వచ్చింది. ఇటీవల భారీ వర్షం కురవడంతో ఒక ట్రాక్టర్ వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. అసలే దిగుబడి లేక ఇబ్బందులు పడుతుంటే వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. – బుజ్జవ్వ, మహిళారైతు, తొండాకూర్, డొంకేశ్వర్ మండలం ఈ ఫొటోలో తడిసిన ధాన్యాన్ని చూపుతున్న మహిళా రైతు పేరు సావిత్రి. ఈమెది డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ గ్రామం. సుమారు నాలుగెకరాల్లో వరి సాగు చేసిన సావిత్రి రెండు వారాల క్రితం పంటను కోసింది. ఎనిమిది ట్రాక్టర్ల ధాన్యం దిగుబడి రావాల్సి ఉండగా ఆరు ట్రాక్టర్లు మాత్రమే వచ్చింది. అరకొరగా వచ్చిన ధాన్యాన్ని కల్లంలో ఆరబోయగా ఇటీవల మోంథా తుపాను కారణంగా తడిసిపోయి మొలకలు వచ్చాయి. ఇలాంటి కాలాన్ని తానెప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది సావిత్రి. రైతన్నకు కలిసిరాని ఖరీఫ్ ఈ ఏడాది అధిక వర్షాలతో పాడైన పంటలు సీజన్లో వారానికో వాయుగుండం, నెలకో తుపాను.. తోడైన తెగుళ్లు, చీడపీడల దాడి గణనీయంగా తగ్గిపోయిన పంటల దిగుబడిఖరీఫ్లో సాగైన పంటల దిగుబడిని పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా సక్రమంగా రాలేదు. 4,36,695 ఎకరాల్లో వరి సాగైతే ఎకరానికి 28 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 20 నుంచి 22 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఎకరానికి దాదాపు ఐదారు క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. 52,093 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఎకరానికి 32 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా 25 నుంచి 28 క్వింటాళ్లే వచ్చింది. అదే విధంగా సోయా 33,603 ఎకరాల్లో సాగవగా, సాధారణంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ, ఎకరానికి ఐదారు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇంతగా దిగుబడులు తగ్గిపోవడానికి అధిక వర్షాలు, తెగుళ్లే కారణమని రైతులు చెబుతున్నారు. పెట్టుబడి పోను ఎకరానికి ఐదారు వేల ఆదాయం మాత్రమే వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్తమ ఫలితాలకు కసరత్తు
ఖలీల్వాడి : పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టీచర్ల బోధన, పరీక్షలపై దృష్టి సారించింది. ప్రతి సబ్జెక్టులో విద్యార్థులు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా కార్యాచరణ అమలు చేస్తోంది. గతేడాది ప్రత్యేక తరగతులు, పరీక్షలు, ప్రీఫైనల్తోపాటు పదో తరగతి పరీక్షలపై అవగాహన కల్పించేందుకు అదనంగా పరీక్ష (గ్రాండ్ టెస్ట్) నిర్వహించారు. అయితే, ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ముందుగానే ప్రత్యేక తరగతులకు రూపకల్పన చేశారు. సాధారణ బోధనతోపాటు సాయంత్రం వేళల్లో అదనంగా ఒక గంట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 342 జడ్పీ, ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 12,722 మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 6 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం ఎస్ఏ (సమ్మెటీవ్ అసెస్మెంట్) పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో పదో తరగతి విద్యార్థులు సైతం పరీక్షలు రాస్తున్నారు. అయితే, రోజు ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.15 వరకు పాఠశాల పని చేస్తుండగా.. ప్రత్యేక ప్రణాళికలో భాగంగా సాయంత్రం 4.15 నుంచి 5.15 వరకు గంటపాటు తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకోసం రోజుకో సబ్జెక్ట్ టీచర్ చొప్పున సాయంత్రం వేళల్లో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులకు మరింత అవగాహన కల్పిస్తూనే వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్షలు సిద్ధం చేస్తున్నారు. సంవత్సరం పరీక్ష రాసిన ఉత్తీర్ణులైనవారు ఉత్తీర్ణత జిల్లా ర్యాంకు విద్యార్థులు శాతం 2021–2022 22243 20651 92.84 18 2022–2023 21592 18810 87.12 21 2023–2024 21858 20486 93.72 14 2024–2025 22694 21928 96.62 16ఈ ఏడాది ఉత్తమ ఫలితాల సాధన కోసం ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మార్పు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. పాఠ్యప్రణాళికను పక్కాగా బోధించడంతోపాటు ప్రత్యేక తరగతులను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఎస్ఏ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను మూడు కేటగిరీలుగా ఏర్పాటు చేస్తాం. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు వెసులుబాటు కలుగుతుంది. – పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు పాఠాలు సులభంగా అర్థం చేసుకునేలా ప్రత్యేక అభ్యాస దీపికలను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఇందులో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలాజీ, సోషల్ వంటి వాటిని రూపొందించారు. వీటిని పాఠశాలలకు అందజేసినట్లు తెలుస్తోంది. పదో తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన పద్ధతులను అభ్యాస దీపికలో వివరించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రతిరోజు సాయంత్రం అదనంగా గంటపాటు క్లాసుల నిర్వహణ ఉత్తీర్ణత శాతం పెరుగుదలకు విద్యాశాఖ కసరత్తు -
చదువుతోపాటు తైక్వాండో అవసరం
నిజామాబాద్ నాగారం: పిల్లలకి చదువుతోపాటు తైక్వాండో వంటి విద్య ఎంతో అవసరమని తైక్వాండో అసోసియేసన్ చైర్మన్ బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. తైక్వాండో నేర్చుకోవడం ద్వారా క్రమశిక్షణ కలిగి ఉండడంతోపాటు శారీరికంగా, మానసికంగా ముందుంటారని పేర్కొన్నారు. అమెచ్యూర్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ను నగరంలోని బస్వాగార్డెన్లో ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బస్వా లక్ష్మీనర్సయ్య క్రీడాకారులకు బెల్ట్లు, సర్టిఫికెట్లు అందజేశారు. కోచ్ మనోజ్, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తూనికలు, కొలతల అధికారుల తనిఖీలు బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణంలోని సంతలో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లోని వెయిట్ మిషన్లను పరిశీలించి స్టాంపింగ్ చేయించని వారికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా తూనికలు, కొ లతల శాఖ ఇన్స్పెక్టర్ సందీప్ మాట్లాడుతూ.. బోధన్ పట్టణంలో జరిగే సంతలో ఏ ర్పాటు చేసిన 30 దుకాణాల్లో వెయిట్ మిష న్లను తనిఖీ చేశామని, అన్ని దుకాణాల్లోని వెయిట్ మిషన్లకు స్టాంపింగ్ లేక పోవడంతో జరిమాన విధించామన్నారు. వ్యాపారు లు తప్పనిసరిగా వెయిట్ మిషన్లకు స్టాంపింగ్ చేయించాలని స్పష్టం చేశారు. తనిఖీల్లో సిబ్బంది కిషన్, నరేశ్ పాల్గొన్నారు. టీపీడీఈఏ ఎస్ఈఎస్గా రాజశేఖర్ సుభాష్నగర్ : తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి(ఎస్ఈఎస్)గా నిజామాబాద్ ఏడీఈ (కన్స్ట్రక్షన్) తోట రాజశేఖర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశాన్ని ఆదివారం యాదగిరిగుట్టలో నిర్వహించారు. అనంతరం రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన ఎన్నికకు సహకరించిన కంపెనీ రాష్ట్ర, జిల్లా నాయకులకు రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు రాజశేఖర్ను అభినందించారు. -
మళ్లీ తడిసిన ధాన్యం..
మోపాల్(నిజామాబాద్రూరల్): అన్నదాతల ఆశలతో వర్షం చెలగాటమాడుతోంది. ఆదివారం సాయంత్రం అరగంటకుపైగా జిల్లాలోని ఎడపల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, మాక్లూర్, నవీపేట తదితర మండలాల్లో వాన దంచికొట్టింది. ఉన్నట్టుండి జోరువాన కురవడంతో రైతులు ఉరుకులు పరుగులు తీశారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైతులు ప్రస్తుతం ఆరబోస్తున్నారు. తేమశాతం పరీక్షించి కుప్ప వేయాలనుకునేలోపే మళ్లీ ధా న్యం తడిసింది. చాలా చోట్ల ధాన్యం నీటిలో కొట్టుకుపోగా, మరి కొన్నిచోట్ల కల్లాల్లోకి వర్షపు నీరు చేరింది. తడిసిన ధాన్యం మొలకెత్తకుండా ఉప్పు నీరు చల్లాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని, తరుగు లేకుండా ధాన్యం దించుకునే విషయంలో రైస్మిల్లర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని అడి షనల్ కలెక్టర్ కిరణ్కుమార్ తెలిపారు.బాపునగర్లో కల్లంలోకి చేరిన వర్షపు నీరు -
జోరువానలో పథ సంచలన్
సుభాష్నగర్ : ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా కోటగల్లి ఉపనగర శాఖ స్వయం సేవకులు ఆదివారం పట్టణంలో పథ సంచలన్ నిర్వహించారు. కోటగల్లి మార్కండేయ మందిరం నుంచి శివాజీనగర్, పెద్దబజార్, కసాబ్గల్లి, గోల్ హనుమాన్, జండా బాలాజీ మందిరం మీదుగా తిరిగి మార్కండేయ మందిరం వరకు కార్యక్రమం సాగింది. భారీ వర్షంలోనూ స్వయం సేవకులు ఈ పథ సంచలన్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ సత్యం, సహ కార్యవాహలు సుమిత్, వెంకటేశ్, ఉపనగర కార్యవాహలు భార్గవ్, రామకృష్ణ, దత్తు, రామన్న తదితరులు పాల్గొన్నారు. -
కమిటీవి తప్పుడు సంకేతాలు
● దివంగత కానిస్టేబుల్ ప్రమోద్పై ఆరోపణలు తగదు ● మీడియాతో మాలమహానాడు, ప్రజాసంఘాల నాయకులునిజామాబాద్ నాగారం: దివంగత కానిస్టేబుల్ ప్రమోద్పై తప్పుడు ఆరోపణలు చేసిన నిజనిర్ధారణ కమిటీ(ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ) ఎవరి కోసం త ప్పుడు సంకేతాలు ఇస్తోందని మాలమహానాడు, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆదివారం సమావేశమయ్యారు. మాల మహానాడు నాయకుడు కిష న్ మాట్లాడుతూ.. ప్రమోద్ను హత్య చేసిన రియాజ్పై 61 కేసులు, రెండు హత్యాయత్నం కేసులు ఉంటే ఏవిధంగా రికవరీ ఏజెంట్ అయ్యా డని ప్రశ్నించారు. పరారీలో ఉన్న రియాజ్ను పట్టుకునేందుకు వెళ్లినప్పుడు కానిస్టేబుల్ ప్రమోద్ ను అతడు హత్య చేసిన విషయం ప్రపంచానికి తెలుసన్నారు. కమిటీ ఎక్కడో కూర్చుని విచారణ చే యడం సరికాదన్నారు. ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించకపోగా తప్పు డు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కమిటీకి చట్టబద్ధత ఉందా అని ప్రశ్నించారు. ప్రజాసంఘాలు, మాలమహానాడు నాయకులు రమేశ్బాబు, దండి వెంకటి, బంగారు సాయిలు, చొక్కం దేవీదాస్, అనంపల్లి ఎల్లయ్య, రాంచందర్ గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
లక్ష్యానికి మించి విద్యుదుత్పత్తి సోమవారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2025బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జల విద్యుదుత్పత్తి కేంద్రం లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 67 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని లక్ష్యంగా జలసౌధ విధించగా, ఇప్పటి వరకు 67.40 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. దీంతో జెన్కో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో నాలుగు టర్బయిన్లు ఉన్నాయి. ఒక్కో టర్బయిన్ ద్వారా 9 మెగావాట్ల చొప్పున 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే సామర్థ్యం ఉంది. కానీ ప్రస్తుత సంవత్సరం సామర్థ్యానికి మించి 36.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి వరకు జరిగింది. ప్రాజెక్ట్ నీటిమట్టం నిండుకుండలా ఉండటంతోపాటు నీరు వేగంగా రావడం ద్వారా సామర్థ్యానికి మించి విద్యుదుత్పత్తి సాధ్యమైంది. ప్రస్తుతం రోజుకు 0.87 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి జల విద్యుదుత్పత్తి అనంతరం ఎస్కెప్ గేట్ల ద్వారా నిరంతరం విద్యుదుత్పత్తి జరుగుతుంది. గతంలో కేంద్రం విద్యుదుత్పత్తి లక్ష్యం 90 మిలియన్ యూనిట్లుగా ఉండేది. కానీ కాలక్రమేణ లక్ష్యాన్ని అధికారులు తగ్గిస్తూ వస్తున్నారు. -
సమష్టిగా రాణించారు
పరాజయాల నుంచి విజయం వస్తుందని మన మహిళా జట్టును చూస్తే అర్థమవుతోంది. టోర్నీ ప్రారంభంలో అద్భుతంగా రాణించి, మధ్యలో ఒడిదుడుకులు ఎదురైనా అందరూ సమష్టిగా రాణించి విజేతలుగా నిలిచారు. – దుబాక హాసిని, వికెట్ కీపర్మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్లో సౌతాఫ్రికాజట్టుతో పోరాడిన భారత జట్టు విజేతగా నిలవడంతో జిల్లా క్రీడాభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. 47 ఏళ్లుగా ట్రోఫీ కోసం కలలు కంటూనే ఉన్న క్రీడాభిమానులు సంబురాల్లో మునిగి తేలారు. భారతజట్టు రెండుసార్లు ఫైనల్స్కి వెళ్లినప్పటికీ రన్నర్గానే నిలిచింది. మూడోసారి ఫైనల్కి వెళ్లగా జట్టు క్రీడాకారిణులు సత్తాచాటి చాంపియన్లుగా నిలిచారు. భారత మహిళా జట్టు వన్డే ప్రపంచకప్ సాధించడంపై పలువురు క్రీడాకారిణులు తమ అభిప్రాయాలు పంచుకున్నారిలా.. – నిజామాబాద్ నాగారంవరల్డ్ కప్లో రాణించడం చాలా కష్టం. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని పక్కా ప్రణాళికతో మన జట్టు సభ్యులు రాణించారు. జట్టును ప్రపంచ విజేతగా నిలిపి అందరి హృదయాలను గెలిచారు. – టి హర్షిణి, ఆల్ రౌండర్ రెండుసార్లు ఫైనల్స్కి వెళ్లినప్పటికీ రన్నర్గానే మిగిలిపోవడం ఒకింత నిరాశకు గురి చేసింది. మూడోసారి ఫైనల్స్కు వెళ్లిన జట్టును క్రీడాకారిణులు తమ దృఢసంకల్పంతో గెలిపించారు. చాంపియన్లుగా నిలిచారు. – సాన్విరెడ్డి, ఆల్ రౌండర్ ప్రపంచ కప్ వన్డే టోర్నమెంట్లో భారత మహిళా జట్టు రాణించడం అభినందనీయం. ఎన్నో ఏళ్లుగా ట్రో ఫీని కై వసం చేసుకోవడానికి శ్రమిస్తున్నారు. ఎట్టకేలకు క్రీడాకారుల కల నెరవేరడం సంతోషం. – హేమలత, అండర్–19 క్రికెట్ క్రీడాకారిణి మహిళల వన్డే ప్రపంచ కప్ కై వసం కప్పుకొట్టి సత్తా చాటిన భారత జట్టు క్రీడాకారిణులు రెండుసార్లు ఫైనల్స్ పోరాడి ఓడిన మహిళా జట్టు హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా క్రీడాభిమానులు.. పలుచోట్ల సంబురాలు -
యూడైస్లో వివరాలు నమోదు చేయాలి
● వీసీలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణానిజామాబాద్ అర్బన్: పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థుల వివరాలను యూడైస్లో నమోదు చేయాలని విద్యాశాఖ రాష్ట్ర కార్యదర్శి యోగితారాణా సూచించారు. పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్యాశాఖల పురోగతిపై శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. యోగితారాణా మాట్లాడుతూ ముఖగుర్తింపు విధానం (ఎఫ్ఆర్ఎస్) ద్వారా విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, సిబ్బంది హాజరు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సమగ్రశిక్షా పథకం కింద మంజూరైన నిధులను పరిశుభ్రత, చిన్నచిన్న మరమ్మతులు, మరుగుదొడ్లు, వంటగది షెడ్లు వంటి అవసరాలకు వినియోగించాలన్నారు. మౌలిక వసతులతోపాటు నిరంతరం ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా కలిగి ఉండాలని సూచించారు. ఫిజిక్స్వాలా, ఖాన్ అకాడమీ వంటి ఆన్న్లైన్ కోచింగ్ వనరులను జేఈఈ, సీఎల్ఏటీ, నీట్ వంటి పరీక్షల కోసం పరిశీలించాలన్నారు. పీఎం పోషణ పథకం కింద వంటగది షెడ్లు, ప్రహరీలు నిర్మించాలని, విద్యార్థుల ఆధార్, అపార్ నమోదు సమయానుసారం పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రత, ఆహార ప్రమాణాలు నిరంతరం పరిశీలించాలని సూచించారు. పదో తరగతి ఫలితాలు మెరుగుపడేలా సమగ్ర ప్రణాళికతో కృషి చేయాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరిశుభ్రత, నిర్వహణ పనులను పర్యవేక్షించాలని సూచించారు. వీసీలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఐఈవో రవికుమార్, డీఈవో అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
795 ఎకరాల పంట నష్టం
● ప్రాథమిక అంచనా వేసిన వ్యవసాయ శాఖడొంకేశ్వర్(ఆర్మూర్): రెండ్రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి జిల్లాలో 795 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. చాలా మండలాల్లో పొలాల్లోనే వరిపైరు నేలకొరిగి నీట మునగగా, 33 శాతానికి మించి జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయాధికారులు పరిగణలోకి తీసుకున్నారు. అత్యధికంగా కమ్మర్పల్లిలో 595, జక్రాన్పల్లిలో 200 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. డిచ్పల్లి, డొంకేశ్వర్, నందిపేట్, ఆలూర్ మండలాల్లో కూడా పంట నష్టం జరిగినా 33 శాతానికి తక్కువగా ఉండడంతో వాటిని లెక్కలోకి తీసుకోలేదు. పంటనష్టం వివరాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించినట్లు జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ తెలిపారు. కాగా, శుక్రవారం ఎండ వాతావరణం ఏర్పడడంతో తడిసిన ధాన్యాన్ని కల్లాలు, రోడ్లపై ఆరబోసేందుకు రైతులు తీవ్రంగా శ్రమించారు.డిచ్పల్లి మండలం ధర్మారంలో మొలకలు వచ్చిన ధాన్యాన్ని చూపుతున్న రైతు -
కమనీయం.. శ్రీలక్ష్మీనృసింహుల కల్యాణం
పట్టువస్త్రాలు సమర్పించిన సర్వ సమాజ్ కమిటీ ● నింబాచలంపై భక్తుల సందడికమ్మర్పల్లి(భీమ్గల్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నింబాచలం (లింబాద్రి గుట్ట) వార్షిక బ్రహ్మో త్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా సాగింది. అ ఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుని కల్యాణా న్ని తిలకించిన భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించారు. ఉదయం గర్భాలయంలో ప్రధా న యాగ్నికులచే స్వామివారి కల్యాణం జరిపించారు. అనంతరం స్వర్ణాలంకార భూషితులైన శ్రీలక్ష్మీనృసింహుని ఉత్సవ విగ్రహాలను మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణతో గర్భాలయం నుంచి కల్యాణ మండపానికి పుష్పాలతో అలంకరించిన పల్లకిలో తీసుకొచ్చారు. ఉత్సవంలో భాగంగా కలశ పూజ, విశ్వక్సేన పూజ నిర్వహించి శ్రీలక్ష్మీనృసింహుడికి రక్షాబంధనం చేశారు. శ్రీలక్ష్మీనృసింహుడి దోసిలిపై శ్రీలక్ష్మీ దేవి దోసిలిని ఉంచి అర్చకులు కన్యాదానం చేశారు. స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, బంగారు బాషింగాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, పురోహితులు మాంగళ్యం తంతునానేనా అంటూ శ్రీవారి కల్యాణం జరిపించారు. భీమ్గల్ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనృసింహ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. -
సర్దార్ పటేల్ మహోన్నత వ్యక్తి
నిజామాబాద్అర్బన్: జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ‘రన్ ఫర్ యూనిటీ– (2కె రన్)’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్వాతంత్య్ర పోరాటంలో దేశ సమగ్రత కోసం, దేశంలో అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. సీపీ మాట్లాడుతూ ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి భావంపై అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని కొనియాడారు. అనంతరం రన్లో ప్రతిభచాటిన సాయికిరణ్, నాగేందర్, రాజేశ్, ధరణి, గోదావరి, నికిత తదితరులకు కలెక్టర్, పోలీస్ కమిషనర్లు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వారెడ్డి, శ్రీరామ్ చందర్రావు, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, తిరుపతి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
పటేల్ జీవితం యువతకు ఆదర్శం
తెయూ వీసీ యాదగిరిరావు తెయూ(డిచ్పల్లి): ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశానికి పునాదులు వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత జాతి ఐక్యతకు గుర్తుగా నిలిచిపోతారని, ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని తెయూ వీసీ టి.యాదగిరిరావు అన్నారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు శుక్రవారం తెయూ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త అపర్ణ ఆధ్వర్యంలో సర్దార్ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా నిర్వహించారు. కంప్యూటర్ సైన్స్ కళాశాల నుంచి పరిపాలనా భవనం వరకు ఎన్ఎస్ఎస్ వలంటీర్లతో ఐక్యత పరుగును నిర్వహించారు. అనంతరం వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ.. భారతదేశంలోని 562 సంస్థానాలను ఏకీకృతం చేయడంలో ఆయన చూపిన ధైర్యం చాతుర్యము, ధృడనిశ్చయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, అధ్యాపకులు, సిబ్బంది ఐక్యత ప్రమాణం చేశారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రవీణ్ మామిడాల, ప్రొఫెసర్ ఆరతి, కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు స్రవంతి, స్వప్న, అలీం ఖాన్, సంపత్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశ సమగ్రతలో కీలకపాత్ర డిచ్పల్లి: భారతదేశ సమగ్రతలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కీలక ప్రాత పోషించారని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్, డిచ్పల్లి అడిషనల్ కమాండెంట్ సీహెచ్ సాంబశివరావు అన్నారు. సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకొని బెటాలియన్లో ఏక్తాదివస్ కార్యక్రమం నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసులతో కలిసి ఐక్యత ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ కేపీశరత్కుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రైతులు ఆందోళనకు గురికావొద్దు
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఇందల్వాయి: అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులు ఆందోళనకు గురికావొద్దని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులను కలిసి కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితి, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించే వివరాలతో కూడిన ట్రక్ షీట్ రిపోర్ట్ను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందుగా తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిన ఆదేశించారు. అనంతరం పలువురు రైతులకు టార్పాలిన్లను పంపిణీ చేశారు. అలాగే గన్నారం శివారులో నిర్మాణ దశలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాలను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. వీరి వెంట నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీఎస్వో అరవింద్రెడ్డి, డీసీవో శ్రీనివాస్, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ గోపి, తహసీల్దార్ వెంకట్ రావు, ఎంపీడీవో అనంత్ రావు, అధికారులు, రైతులు ఉన్నారు. రైతులు అధైర్య పడొద్దు జక్రాన్పల్లి: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు సూచించారు. శుక్రవారం జక్రాన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యం తేమ 17 శాతం రాగానే వెంటనే తూకం వేయాలన్నారు. ఆయన వెంట ఏఈవో భాస్కర్, అర్గుల్ సొసైటీ కోశాధికారి సాగర్, రైతులు ఉన్నారు. -
పరిహారం ఇప్పించండి సారూ..!
మోర్తాడ్: బహ్రెయిన్లో మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎ క్స్గ్రేషియా మంజూరు కాలేదు. నిబంధనలు అడ్డుపడటంతో మృతుడి భార్య, నలుగురు కూతుళ్లు ఆందోళన చెందుతున్నారు. మానవతా థృక్పథంతో వ్యవహరించి ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్గ్రేషియా మంజూరూ చేయాలని వారం రోజుల క్రితం ప్రవాసీ ప్రజావాణి ద్వారా సీఎం రేవంత్రెడ్డిని బాధిత కుటుంబసభ్యులు వేడుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2024 మార్చి 3న బాల్కొండ మండల కేంద్రానికి చెందిన కవ్వ శంకర్(52) బహ్రెయిన్లో మరణించాడు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారం కోసం మృతుడి భార్య దరఖాస్తు చేసుకుంది. అయితే, శంకర్ బహ్రెయిన్కు కంపెనీ వీసాపైనే వెళ్లినా అక్కడ పనిసరిగా లేకపోవడంతో కల్లివిల్లి కార్మికుడిగా మారాడు. శంకర్ వద్ద ఒరిజినల్ పాస్పోర్టు లేకపోవడం, వర్క్ పర్మిట్ 2019 ఏప్రిల్ 6తోనే ముగిసిపోయింది. మరణించిన సమయంలో బహ్రెయిన్ నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం తేల్చింది. ఎక్స్గ్రేషియా మంజూరు కావాలంటే నిబంధనల ప్రకారం మృతుడి ఒరిజినల్ పాస్పోర్టు జిరాక్సు, వర్క్ పర్మిట్ వివరాలను దరఖాస్తుతో జత చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అవుట్ పాస్పోర్టు ద్వారానే శంకర్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించారు. శంకర్ బహ్రెయిన్లో మరణించాడనే ఆధారాలు మాత్రమే ఉండగా ఒరిజినల్ పా స్పోర్టు, వర్క్ పర్మిట్ లేకపోవడంతో ఎక్స్గ్రేషియా మంజూరు కాలేదు. 13 ఏళ్లకు శవమై వచ్చిన శంకర్.. ఉపాధి కోసం 2010, 2011 మధ్యకాలంలో బహ్రెయిన్ వెళ్లిన శంకర్ 13 ఏళ్ల తర్వాత శవమై ఇంటికి వచ్చాడు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో అక్కడ కల్లివిల్లి కార్మికుడిగానే ఉన్నాడు. శంకర్పై అతని భార్య నర్సు(లక్ష్మిబాయి), కుమార్తెలు అర్చన, రచన, రుచిత, తన్విష ఆధారపడి ఉన్నారు. ఎక్స్గ్రేషియా ఇప్పించాలని ప్రవాసీ ప్రజావాణిలో ఎన్నారై అడ్వయిజరీ బోర్డు వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఎమిగ్రెంట్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్లకు వినతిపత్రం అందజేశారు. గల్ఫ్ బాధితుడి కుటుంబ సభ్యుల వేడుకోలు మృతుడి ఒరిజినల్ పాస్పోర్టు, వర్క్ వీసా పర్మిట్ లేకపోవడంతో మంజూరు కాని ఎక్స్గ్రేషియా -
బురదలో దిగబడిన స్కూల్ వ్యాన్
నందిపేట్: మండల కేంద్రంలోని బర్కత్పుర కాలనీలో శుక్రవారం స్కూల్ వ్యాను బురదలో దిగబడింది. దీంతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. ఉదయం బర్కత్పుర కాలనీ పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లేందుకు టాటా ఏసీ వ్యాను కాలనీ గుండా వెళ్తుండగా బురదలో దిగబడింది. దీంతో వ్యానులో ఉన్న విద్యార్థులను కిందికి దించడంతో ప్రమాదం తప్పింది. అశోక్నగర్లో చోరీ నిజామాబాద్ అర్బన్: నగరంలోని అశోక్నగర్లో ఉన్న ఓ ఇంట్లో శుక్రవారం తెల్లవారు జామున చోరీ జరిగినట్లు ఒకటో టౌన్ పోలీసులు తెలిపారు. కాలనీకి చెందిన బాలరాజు రాత్రి తన ఇంటికి గడియ వేయకుండా ఇంట్లో నిద్రించాడు. దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న తులం బంగారాన్ని దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిట్టీ వ్యవహారంలో తగాదా.. నగరంలోని వినాయక్నగర్లో ఉన్న ఓ మహిళ నెలవారి చిట్టీలు కొనసాగిస్తున్నారు. గడువు ముగిసినా డబ్బులు ఇవ్వడం లేదని కొందరు బాధితులు మహిళతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఫిర్యాదు లేకున్నా పోలీసులు జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం బయటపడకుండా పోలీసులు జాగ్రత్త వహించారని ఆరోపణలు ఉన్నాయి. -
నివాస గుడిసె దగ్ధం
సిరికొండ: మండలంలోని సర్పంచ్ తండాలో మెగావత్ సరోజకు చెందిన నివాసపు గుడిసె ప్రమాదవశాత్తు శుక్రవారం దగ్ధమైనట్లు ఎమ్మారై నాగన్న, మాజీ సర్పంచ్ సర్యనాయక్ తెలిపారు. గుడిసెలో నుంచి పొగలు రావడం గమనించిన తండా వాసులు మంటలను ఆర్పివేశారు. విద్యుత్షాక్తో జరిగిన ప్రమాదంలో నిత్యావసర సరుకులు, వంట సామగ్రి, ఇతర వస్తువులు కాలిపోయినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎమ్మారై నాగన్న సందర్శించి రూ. లక్షా యాభై వేల ఆస్తి నష్టం సంభవించినట్లు పంచనామా నిర్వహించారు. డొంకేశ్వర్: మండలంలోని దత్తాపూర్–మారంపల్లి గ్రామాల మధ్య వడ్ల లారీ బోల్తా పడింది. శుక్రవారం మారంపల్లి నుంచి వడ్ల బస్తాలను లోడ్ చేసి వేరే ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. లారీ పంట పొలాల్లో బోల్తా పడగా డ్రైవర్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. నాగిరెడ్డిపేట: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగిరెడ్డిపేట మండలం చీనూర్లో చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్హెచ్వో మనోహర్రావు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల అంజవ్వ(52) కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తితో గురువారం రాత్రి గ్రామశివారులోని హనుమాన్ ఆలయ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమారుడు మేకల కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్హెచ్వో తెలిపారు. -
క్రైం కార్నర్
● తల్లికి తీవ్ర గాయాలు ఆర్టీసీ బస్సు ఢీకొని కొడుకు మృతి నందిపేట్: ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలపాలైన ఘటన నందిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్యాంరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుద్వాన్పూర్ గ్రామానికి చెందిన బ్యాగరి పోశెట్టి(29) పని నిమిత్తం తన తల్లి లక్ష్మితో బైక్పై నిజామాబాద్కు శుక్రవారం ఉదయం బయలుదేరాడు. నందిపేట సమీపంలోని బంగారు మైసమ్మ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి వీరిని ఢీకొన్నది. ప్రమాదంలో పోశెట్టి తలకు బలయమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై కూర్చున్న తల్లి లక్ష్మికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోశెట్టి మృతి విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో చేశారు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని ఆర్టీసీ అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. మృతుడి భార్య రూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మరొకరు..బోధన్రూరల్: సాలూర మండల కేంద్రంలో మహమ్మద్ పాషా(52) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి శుక్రవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహమ్మద్ పాషా చిన్నప్పటి నుంచి ఎడమ కాలికి పోలియోతో బాధపడుతున్నాడు. అతనికి పెళ్లికాకపోవడంతో ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో పడుకున్నచోటే చనిపోయి ఉండగా కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తమ్ముడు అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అయ్యో.. అన్నదాత
● రంగు మారి మొలకలు వస్తున్న ధాన్యం ● లబోదిబోమంటున్న రైతులు రెంజల్/ డిచ్పల్లి: అకాల వర్షాలు, తుపాను ప్రభావం రైతులను అతలాకుతలం చేసింది. రెండు రోజులుగా తుపాను ప్రభావంతో పట్టాల కింద కప్పి ఉంచిన ధాన్యాన్ని శుక్రవారం ఆరబోసేందుకు కుప్పలను తెరువగా కింది భాగంలో ధాన్యానికి మొలకలు వచ్చాయి. రైతులు అప్పటికప్పుడు కూలీలను ఏర్పాటు చేసుకుని మొలకలను ధాన్యం నిల్వల నుంచి వేరు చేయించారు. మరి కొందరు రైతులకు చెందిన ధాన్యం రంగు మారింది. ఓ పక్క దిగుబడులు సగానికి పైగా తగ్గిపోగా..మరో పక్క అకాల వర్షాలతో తడిసి ముద్దయిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అదనంగా కూలీలను ఏర్పాటు చేసుకుని నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
ఇందల్వాయి: భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిబ్బందిని ఆదేశించారు. ఇందల్వాయి తహసీల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్వ ప్రక్రియ అమలుపై సమీక్ష చేపట్టారు. నిర్ణీత గడువు లోగా అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఆయా కేటగిరిల వారిగా మ్యాపింగ్ నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించి, బీఎల్వో, సూపర్వైజర్లు, బీఎల్వోలకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకట్రావు ఉన్నారు. -
అత్యాచార నిందితుడి అరెస్ట్
కామారెడ్డి క్రైం: నాలుగు రోజుల క్రితం పాల్వంచ మండలం ఫరీదుపేట సమీపంలో పొలం పనులకు ఒంటరిగా వెళ్తున్న మహిళపై రైస్ మిల్లులో పనిచేసే ఓ బిహార్ కూలీ దాడి చేసి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని పోలీసులు మహారాష్ట్రలో గుర్తించి పట్టుకున్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. ఈ నెల 26న ఓ మహిళ పొలం పనులకు వెళ్తుండగా ఓ యువకుడు వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. ఆమెను సమీపంలోని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితుడిని ఈ ప్రాంతంలో ఉండే శ్రీ మణికంఠ రైస్మిల్లులో పనిచేసే బిహారీ కూలీ రాహుల్ కుమార్గా గుర్తించారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకోడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. నిదింతుడిని పట్టుకోవడంలో విశేషంగా కృషి చేసిన సీఐలు రామన్, శ్రీనివాస్, రాజారెడ్డి, నరేశ్, ఎస్సైలు అనిల్, రంజిత్, ఆంజనేయులు, రాజు, సిబ్బంది శ్రీనివాస్, గణపతి, రవి, శ్రీను లను అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
కాంక్రీట్ క్వారీ, క్రషర్పై న్యాయసేవా సంస్థ విచారణ
నిజామాబాద్ లీగల్: అనుమతులు లేకుండా క్రషర్ నడుపుతూ, ప్రభుత్వం కేటాయించిన కాంక్రీట్ క్వారీలో నిర్దేశించిన పరిమితికి మించి 15 రెట్లు అక్రమంగా తవ్వకాలు జరపడంపై చర్యలు తీసుకోవాలని వచ్చిన పిటిషన్పై జిల్లా న్యాయసేవా సంస్థ శుక్రవారం విచారణ చేపట్టింది. రెవెన్యూ, గనుల శాఖ అధికారులను విచారించి, నెలాఖరుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి. జక్రాన్పల్లి మండలం లక్ష్మాపూర్లో ఓ వ్యక్తి అనుమతులు లేకుండా క్రషర్ నడుపుతున్నాడని పర్యావరణవేత్త కేఆర్ సుదర్శన్రెడ్డి కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాడు. గనులు, రెవెన్యూ, ఇతర శాఖలను సంప్రదించి సమాచారహక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించాడు. మనోహర్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వం పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో కాంక్రీట్ క్వారీ పర్మిషన్ తీసుకొని అనుమతికి మించి 15 రెట్లకు పైగా తవ్వకాలు జరిపాడని, క్వారీకి అనుబంధంగా నడుస్తున్న క్రషర్కు సరైన అనుమతులు లేవని సుదర్శన్ రెడ్డి ఆర్మూర్ సబ్కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, గనుల శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో చర్యలు చేపట్టాలని ఆర్మూర్ ఆర్డీవో జక్రాన్పల్లి తహసీల్దార్ను ఆదేశించినా తగిన చర్యలు చేపట్టకపోవడంతో ఆయన సెప్టెంబర్ 17న జిల్లా న్యాయసేవా సంస్థను ఆశ్రయించాడు. అయితే, కార్యదర్శి ఉదయభాస్కర్ రావు శుక్రవారం జక్రాన్పల్లి తహసీల్దార్ కిరణ్మయి, గనుల శాఖ సూపరింటెండెంట్ గోవర్ధన్ను సంస్థ కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. ఆర్డీవో ఆదేశించినా క్వారీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, నాలా కన్వర్షన్ జరపకుండా క్రషర్ ఎలా నడుపుతున్నారని తహసీల్దార్ కిరణ్మయిని ప్రశ్నించారు. తదుపరి విచారణ వరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గనుల శాఖ అధికారులు సైతం అక్రమ క్వారీపై చర్యలు తీసుకోవాలని సూచించారు. -
రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
సిరికొండ: రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు సిరికొండ జెడ్పీహెచ్ఎస్కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు పీడీ అబ్బయ్య, పీహెచ్ఎం సతీశ్కుమార్ తెలిపారు. నవీపేట్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన జి. మణిచరణ్, కె. లిఖిత్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. వీరు ఈ నెల 2 నుంచి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు. జి రాకేశ్, సీహెచ్ రాజు, జి రాములు ఎంపిక పోటీల్లో మెడల్స్ సాధించారని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులను శుక్రవారం అభినందించారు. బాల్కొండ: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పోచంపాడ్లోని గోదావరికి భక్తులు శుక్రవారం పోటెత్తారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచారించారు. అనంతరం గోదావరికి దీపాలు ముట్టించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేయక పోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతోంది. దీంతో గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఉన్నతాధికారులు స్పందించి గోదావరి వద్ద భద్రత ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. నిజామాబాద్ సిటీ: ప్రయాణికుల కోసం ఆర్టీసీ సంస్థ నూతన విధానం ప్రవేశపెట్టినట్లు రీజనల్ మేనేజర్ జ్యోత్స్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ల జారీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత డ్రైవర్ లేదా కండక్టర్ వద్దనున్న క్యూఆర్ కోడ్ను మొబైల్ నుంచి నేరుగా స్కాన్ చేసి టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఈ సదుపాయంతో ప్రయాణికులకు సమయం ఆదాతోపాటు ఆర్థిక అవకతవకలకు అవకాశం లేకుండా పోతుందని పేర్కొన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం గ్రామంలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేయడానికి హాజరైన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డికి నిరసన సెగ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్పార్టీలో చేరిన పోచారం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని, అంగన్వాడీ భవనం నిర్మాణం, పాఠశాల ప్రహరీ నిర్మాణం ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పాలంటూ ప్లకార్డు లు ప్రదర్శించారు. నిరసన కారులను పోలీసు లు అడ్డుకుని అరెస్టు చేశారు. నాయకులు మన్నె అనిల్, మమ్మాయి లక్ష్మణ్, బోడ చంద ర్, వెంకటి గంగారాం, హన్మంతు, దొంతుల నర్సింలు, రాజ్కుమార్, దివాకర్ ఉన్నారు. -
సునీతాదేవికి డాక్టరేట్
తెయూ(డిచ్పల్లి): తెయూ ఆంగ్ల విభాగంలో పరిశోధక విద్యార్థిని ఉప్పు సునీతాదేవి పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ సవీన్ పర్యవేక్షణలో సునీతాదేవి ‘విమెన్ ఎస్ ఓవర్ కమర్స్ ఇన్ ద సెలెక్ట్ నావెల్స్ ఆఫ్ షాప్ శశి దేశ్పాండే అండ్ మంజు కపూర్’ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. శుక్రవారం తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సెమినార్ హాల్లో నిర్వహించిన మౌఖిక పరీక్షకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (హైదరాబాద్) ప్రొఫెసర్ రాజు నాయక్ ఎక్స్టర్న ల్ ఎగ్జామినర్గా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ లావణ్య, హెచ్వోడీ కేవీ రమణ చారి, బీవోఎస్ చైర్మన్ సమత, అధ్యాపకులు స్వా మి, జ్యోత్స్న, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. పీహెచ్డీ సాధించిన సునీతాదేవీని వీసీ టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం.యాదగిరి, కంట్రోలర్ ప్రొఫె సర్ సంపత్కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. రుద్రూర్: పశువులకు తప్పనిసరిగా గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాఽధికారి రోహిత్ రెడ్డి సూచించారు. మండలంలోని బొప్పాపూర్, కోటగిరి మండలం రాంపూర్ గ్రామాల్లో పశువులకు ఇస్తున్న టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి వచ్చి టీకాలు వేసే వెటర్నరీ సిబ్బందికి సహకరించాలని రైతులను కోరారు. టీకాల వల్ల కలిగే ప్రయోజనాలను గూర్చి వివరించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారులు సురేశ్కుమార్, సంతోష్రెడ్డి, వెటర్నరి సిబ్బంది, రైతులు ఉన్నారు. బోధన్టౌన్(బోధన్): బోధన్ మున్సిపాలిటీకి శనివారం వరంగల్ మున్సిపల్ రీజినల్ డైరక్టర్ షాహిద్ మసూద్ రానున్నారు. మూడేళ్ల క్రితం బోధన్ మున్సిపాలిటీలో వాటర్ వర్క్స్ విభాగంలో నిధులను దుర్వినియోగం చేశారని, సమగ్ర విచారణ జరపాలని ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు జునైద్ ఆహ్మద్ సీడీఎంఏకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మున్సిపల్ ఆర్డీ రానున్నట్లు సమాచారం. -
వాతావరణానికి అనుగుణంగా పంటలు సాగు చేయాలి
బోధన్: వాతావరణ ఆధారిత సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని రుద్రూర్ ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ కె. పవన్ చంద్రారెడ్డి రైతులకు సూచించారు. బుధవారం ఈ పరిశోధన కేంద్రం దత్తత గ్రామమైన సాలూర మండలంలోని హున్సా గ్రామ రైతు వేదిక భవనంలో యాసంగి సీజన్ పంటల సాగు పై రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరిశోధన కేంద్రం అధిపతితో పాటు దత్తత గ్రామ ఇన్చార్జి, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రమ్య రాథోడ్, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొని పంటల సాగు, సంబంధిత అంశాలపై మాట్లాడారు. యాసంగి సీజన్లో సాగుకు అనువైన వరి విత్తనం రుద్రూర్ 1162 రకం లక్షణాలు, సాగువిధానం అంశాలను శాస్త్రవేత్త రమ్యరాథోడ్ వివరించారు. కీటక శాస్త్రవేత్త ఎం. సాయి చరణ్ వివిధ పంటల్లో ఆశించే చీడ పీడల నివారణ, విత్తన శుద్ధి చేసే విధానం, వరి, శనగ పంటల సాగుకు రసాయన ఎరువుల వినియోగం, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అవగాహన కల్పించారు. నాణ్యమైన విత్తనంసాగుతో లాభదాయకమైన పంట దిగుబడి సాధ్యమవుతుందని సూచించారు. శాస్త్రవేత్త రాకేశ్ పరిశోధన కేంద్రం నుంచి విడుదలైన చెరకు–81 రకం గుణగణాలు, మరో శాస్త్రవేత్త కృష్ణ చైతన్య పంటల సాగులో వినియోగించాల్సిన ఎరువుల మోతాదు, చౌడు భూయుల్లో పంటల సాగు జాగ్రత్తలను తెలిపారు. శాస్త్రవేత్త వైఎస్ పరమేశ్వరీ వరి, శనగ పంటల్లో కలుపు నివారణ అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం రుద్రూర్1162 రకం వరి విత్తనం, ఎన్బీఈజీ 452 రకం శనగ విత్తనాలను పది మంది రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఏఈవో సంధ్య, రైతులు పాల్గొన్నారు. -
టేకు దుంగలు స్వాధీనం
ఇందల్వాయి: ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ధర్పల్లి మండలం రామడుగు గ్రామ శివారులోని పట్టా భూమి నుంచి టేకు చెట్లను నరికి అక్రమంగా తరలిస్తుండగా మంగళవారం రాత్రిపెట్రోలింగ్ స మయంలో స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఆర్వో రవి మోహన్ భట్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న టేకు దుంగలను, వాటిని తరలిస్తున్న వాహనాన్ని ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశామన్నారు.పట్టా భూమిలోని చెట్ల ను నరికే ముందు అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా అటవీ చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తుకారం రాథోడ్, సెక్షన్ ఆఫీసర్లు అతిఖ్, భాస్కర్, బీట్ ఆఫీసర్లు ఉదయ్, ఖాదీర్, ప్రవీణ్, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని నాగాపూర్ క్రాస్ రోడ్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. నాగాపూర్ నుంచి కమ్మర్పల్లికి ప్రయాణికులతో వస్తున్న ఆటో ను మెట్పల్లి వైపునకు వెళ్తున్న తుఫాన్ వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో ఆటో నడుపుతున్న డ్రైవర్ ఖాదర్కు తీవ్ర గాయాలు కాగా, ఆటోలో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్తానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రెంజల్: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి బోధన్ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శేష తల్పసాయి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై చంద్రమోహన్ బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం సాటాపూర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా ఇద్దరు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారిని పీఎస్కు తరలించి కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఒక రోజు జైలు శిక్షను విధించినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు న్యూసెన్స్ కేసులో మరో ఇద్దరికి జడ్జి రెండు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానాను సైతం విధించినట్లు ఎస్సై తెలిపారు. లింగంపేట: మండలంలోని కోమట్పల్లిలో పేకాటస్థావరంపై దాడిచేసినట్లు ఎస్సై దీపక్ కుమార్ బుధవారం తెలిపారు. పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన నలుగురు పట్టుబడగా వీరి నుంచి రూ. 5,530 నగదు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు. -
తప్పిపోయిన చిన్నారుల అప్పగింత
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో తప్పిపోయిన బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. పట్టణంలోని గౌడ్స్ కాలనీకి చెందిన శౌర్యగౌడ్ మంగళవారం రాత్రి ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చి రోధించాడు. ఆ దారి గుండి వెళ్తున్న ఆటోడ్రైవర్ రాములు బాలుడిని గుర్తించి పోలీసులకు అప్పగించాడు. కొద్దిసేపటికి వాట్సాప్లో తమ కుమారుడు పోలీస్స్టేషన్లో ఉన్నట్లు గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే పీఎస్కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. దీంతో ఎస్సై–2 సుబ్రహ్మణ్యచారి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. పిట్లం:పిట్లం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో తప్పిపోయిన ఓ చిన్నారిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.మండల కేంద్రంలోని బుడగ జంగం కాలనీకి చెందిన బేతయ్య దంపతులు కుమార్తె వరలక్ష్మి తో కలిసి బుధవారం ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. చి న్నారిని వారు అక్కడే మరిచిపోయి ఇంటికి చేరుకున్నారు. దీంతో చిన్నారి అక్కడే ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తమ చిన్నారి పోలీస్స్టేషన్లో ఉన్నట్లుగుర్తించిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను సంప్రదించారు. పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
సబ్సిడీ చెల్లింపులను సులభతరం చేయాలి
సుభాష్నగర్/ జక్రాన్పల్లి: క్యూజీ బీజీ(క్వాలిటీ గ్యాప్ బ్రిడ్జింగ్ గ్రూప్) పథకం కింద స్పైసెస్ బోర్డు ఇస్తున్న 90శాతం సబ్సిడీ చెల్లింపులను సులభతరం చేయాలని జేఎం కేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పాటుకూరి తిరుపతిరెడ్డి కోరారు. ఈమేరకు పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని కలవడానికి రాగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో మేనేజర్ రాణి, ఆఫీస్ అసిస్టెంట్ జవహార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. స్పైసెస్ బోర్డు కింద అమలవుతున్న ఈజీబీజీ పథకంలో 90శాతం సబ్సిడీపై ఎఫ్పీవోలకు పసుపు పంట కోసిన తర్వాత అవసరమయ్యే టార్పాలిన్ షీట్స్, ఇతర సదుపాయాలు అందజేస్తుందని తెలిపారు. రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ముందుగా పూర్తి మొత్తాన్ని చెల్లించి, ఆ తర్వాత సబ్సిడీ మొత్తాన్ని తిరిగి పొందడం కష్టతరంగా మారుతోందన్నారు. వీరికి ఆర్థికభారం తగ్గించడానికి, కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి స్పైసెస్బోర్డు నేరుగా 90శాతం సబ్సిడీ మొత్తాన్ని వెండర్కు చెల్లించి, మిగతా 10శాతాన్ని ఎఫ్పీవోలు బోర్డు ఖాతాలో జమ చేసేందుకు అనుమతించాలని కోరారు. తద్వారా రైతు ఉత్పత్తి సంస్థలకు తక్షణ ఆర్థికభారాన్ని తగ్గించవచ్చని, పరికరాల సరఫరా వేగవంతంగా జరుగుతుందన్నారు. స్పైసెస్ బోర్డు సబ్సిడీ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కొరటికల్, ఆదిలాబాద్ రైతుల ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు సామల భీమారెడ్డి, ధనూరి రాజారెడ్డి, పి.సంతోష్రెడ్డి, సీఈవో సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు
నిజామాబాద్అర్బన్: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో బైక్ల చోరీకి పాల్పడిన ఇద్దరి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని వీక్లీ మార్కెట్లో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వస్తుండగా వారిని ఆపి వాహన ధ్రువీకరణ పత్రాలను చూయించాలని పోలీసులు అడుగగా వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకొని విచారించగా బైక్ దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. న్యాల్కల్ రోడ్డు సమీపంలో ఉన్న హనుమాన్నగర్కు చెందిన గాజబారే నగేశ్ హనుమంత్, మోహన్ అనే ఇద్దరు వ్యక్తులు ఎలాంటి పనులు చేయకుండా జల్సాలకు అలవాటు పడ్డ వీరు బైకు దొంగతనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఖలీల్వాడిలోని మహాలక్ష్మి ఆస్పత్రి ఎదుట ఉన్న బైక్, ప్రభుత్వ ఆస్పత్రిలో మరో బైకును దొంగతనం చేసి వాటిని వినాయక్నగర్లో ఉన్న షేక్ గౌస్ అనే వ్యక్తికి విక్రయించినట్లు నిందితులు తెలిపారు. అలాగే ఆర్యనగర్లో, వీక్లీ మార్కెట్లో రెండు బైక్లను దొంగిలించినట్లు వారు విచారణలో ఒప్పుకున్నారు. ఇద్దరు నిందితులతో పాటు దొంగ బైక్ అని తెలిసి కూడా కొనుగోలు చేసిన షేక్గౌస్పై కూడా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
సాగుకు వర్షం ఆటంకం
● నిత్యం కురుస్తున్న వాన ● యాసంగి సాగుకు తిప్పలు బాల్కొండ: నిత్యం కురుస్తున్న వర్షాలతో యాసంగి సాగుకు తిప్పలు తప్పడం లేదు. పంటల సాగుకు నేల సిద్ధం చేసుకోలేపోతున్నామంటు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల నుంచి నిత్యం వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పంట భూ ముల్లోకి వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం యాసంగిలో మక్క,సోయా పంటలను సాగు చేసిన నేలల్లో ఎర్రజొన్న, మక్క పంటలను సాగు చేస్తారు. మక్క పంటలకు కోతలు కోసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నేలను సిద్ధం చేసుకోలేదు. ప్రస్తుతం వరి పంటలు కోతకు రాగా నిత్యం కురుస్తున్న ముసురు వర్షంతో కోత కోసేందుకు జంకుతున్నారు. వరి పంటను కోసి ఆరబెట్టిన వారు వాటిని ఎండ బెట్టలేక తిప్పలు పడుతున్నారు. రైతులకు ప్రస్తుత వర్షం అన్ని రకాల ఆటంకాలను కలిగిస్తోంది. యాసంగిలో ప్రధానంగా ఎర్రజొన్న, మక్క పంటను సాగు చేస్తారు. కానీ నేలలను దుక్కి దున్నాలంటే తేమ శాతం ఎక్కువగా ఉండొద్దు. వర్షం కురుస్తుండడంతో పంట భూమిలో అధికంగా నీరే ఉంటోంది. దీంతో ట్రాక్టర్తో దుక్కి దున్నే పరిస్థితి ఉండటం లేదు. దుక్కి దున్ని రైతులు పంటలను సాగు చేస్తారు. ఇలా మరో వారం రోజుల పాటు వర్షం కురిస్తే నేలలను సిద్ధం చేసుకునే అవకాశం లేదంటున్నారు. నవంబర్ మొదటి వారం వరకు అయినా విత్తనాలను విత్తుకోవాలి. కానీ తుపాన్ మరో నాలుగు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో పంటల సాగు ఆలస్యమవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రకృతి వైపరిత్యం వల్ల రైతులు ఆనేక అవస్థలు పడుతున్నారు. వరుణుడు కరుణించి వర్షం నిలిస్తే పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. బాల్కొండలో వర్షం కురవడంతో సాగు చేయని పంట భూమి నిత్యం కురుస్తున్న వర్షాలతో భూములను దుక్కి దున్ని సిద్ధం చేయలేక పోతున్నాం. యాసంగి పంటలను కనీసం వచ్చే నెల మొదటి వారం వరకు అయినా విత్తుకోవాలి. ఇలా నిత్యం వర్షం పడితే పంటలను విత్తడం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. సాగు ఆలస్యంగా చేపడితే దిగుబడిపై ప్రభావం చూపుతుంది. – బుల్లెట్ రాంరెడ్డి, రైతు, రెంజర్ల -
నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యం
బోధన్ రూరల్: నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా తమ లక్ష్యమని ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్ అన్నారు. బోధన్ మండలంలోని 33/11 కేవీ చెక్కి క్యాంపు విద్యుత్ ఉపకేంద్రానికి పెంటకుర్దు ఫ్లీడర్ నుంచి నూతన లైన్ ద్వారా విద్యుత్ సరఫరాను బుధవారం అనుసంధానం చేశారు. సీఎండీ వరుణ్రెడ్డి ఆదేశాలతో ప్రతి విద్యుత్ ఉప కేంద్రానికి ప్రత్యామ్నాయంగా 33 కేవీ విద్యుత్ సరఫరా లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 33/11 కేవీ విద్యుత్ను చెక్కి క్యాంపు విద్యుత్ కేంద్రానికి రూ.35 లక్షల వ్యయంతో ప్రత్యామ్నాయ ఫీడర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈలు ముక్తార్, డి. వెంకటరమణ, ఏడీలు తోట రాజశేఖర్, కె.నగేశ్ కుమార్, ఏఈలు ఆర్ సుమిత, జె. కల్యాణ్, స్థానిక ఫోర్మన్ డేవిడ్, లైన్ఇన్స్పెక్టర్ గఫార్, కాంట్రాక్టర్ రవి యాదవ్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
టార్పాలిన్లు ఇవ్వాలని రాస్తారోకో
రుద్రూర్: తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షం నుంచి ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవసరమయ్యే టార్పాలిన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండల కేంద్రంలో బుధవారం రై తులు రాస్తారోకో చేశారు. టార్పాలిన్లు ఇవ్వడంలో చిన్న, సన్నకారు రైతుల పట్ల వివక్ష చూపుతున్నా రని ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. వాన కురిస్తే ధాన్యంపై పట్టాలు కప్పేందుకు అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు టార్పాలిన్లు ఇవ్వడంలో పెద్ద రైతులకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులకు టార్పాలిన్లు ఇవ్వాలని మంత్రులు ప్రకటనలు చేస్తున్నా అధికారులు అమలు చేయడం లేదన్నారు. తడిసిన ధాన్యా న్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశా రు. సుమారు గంటపాటు రైతులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు, స్థానిక నాయకులు నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. -
క్రైం కార్నర్
పాముకాటుతో చిన్నారి మృతి బాన్సువాడ రూరల్: పాముకాటుతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన బాన్సువాడ మండలం కాలునాయక్ తండాలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన చౌహాన్ శ్రీకాంత్ కుమార్తె సరస్వతి(3) మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోయింది. బుధవారం ఉదయం 6 గంటలకు చిన్నారి నోటి నుండి నురుగులు రావడాన్ని గుర్తించిన కుటుంబీకులు పాముకాటు వేసినట్లు గుర్తించారు. వెంటనే వారు బాన్సువాడకు తరలించగా మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తండ్రి శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి మృతితో తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. చేపల వేటకు వెళ్లి ఒకరు..నస్రుల్లాబాద్: చేపల వేటకు వెళ్లి ఒకరు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నెమ్లి గ్రామానికి చెందిన కర్రె హన్మాండ్లు(30) ఈ నెల 27న రాత్రి స్థానిక చెరువులో చేపల వేట కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హన్మాండ్లు కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటి మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్తో మరొకరు..రుద్రూర్: కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందినట్లు కోటగిరి ఏఎస్సై బన్సీలాల్ బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎత్తొండ గ్రామానికి చెందిన తాళ్ల శ్రీనివాస్(47) మంగళవారం రాత్రి మూత్ర విసర్జన కోసం బాత్రూమ్కు వెళ్తుండగా తన ఇంటికి ఉన్న ఇనుప మెట్లను తాకిన సమయంలో విద్యుత్షాక్కు గురయ్యాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా శ్రీనివాస్ మృతి చెందినట్లు నిర్ధారించారు. బాత్రూమ్కు సంబంధించిన విద్యుత్ తీగలు తెగి ఇనుప మెట్లపై పడడంతో విద్యుత్ షాక్కు గురైనట్లు గుర్తించారు. మృతుడి భార్య లలిత ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్తో గేదె..బాన్సువాడ: బీర్కూర్ శివారులో బుధవారం విద్యుత్ షాక్తో గేదె మృతి చెందింది. బీర్కూర్ కామేశ్వర్రావుకు చెందిన గేదెలను మేత కోసం శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. కురుస్తున్న వర్షాలతో పంట పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మేత కోసం వెళ్లిన గేదెకు విద్యుత్ షాక్ తగలడంతో గేదె అక్కడికక్కడే చనిపోయింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోవడంతోనే గేదెకు విద్యుత్ షాక్ తగిలి చనిపోయిందని, అధికారులు స్పందించి అందించాలని రైతు కామేశ్వర్రావు కోరారు. నవీపేట: కుటుంబ కలహాలతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నవీపేట మండలం లింగాపూర్లో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన గంధం సాయిలు(36)కు ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన కవితతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కవిత పుట్టింటికి వెళ్లింది. దీంతో జీవితంపై విరక్తితో సాయిలు ఈనెల 27న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం సాయిలు మృతదేహం గ్రామ శివారులోని చెరువులో లభ్యమైంది. మృతుడి తల్లి గంధం గంగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న సబ్ కలెక్టర్
వేల్పూర్: మండలంలోని పచ్చలనడ్కుడ పెద్దవాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లు, పొక్లెయిన్ను ఆర్మూర్ సబ్కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, వేల్పూర్ తహసీల్దార్ శ్రీకాంత్ బుధవారం పట్టుకున్నారు. పచ్చలనడ్కుడ సొసైటీలో ధాన్యం కొనుగోలు వివరాలను పరిశీలించిన అనంతరం వేల్పూర్కు వెళ్తుండగా మార్గమధ్యలో పెద్దవాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ట్రాక్టర్లు, పొక్లెయిన్ను పట్టుకొని కేసు నమోదు చేసి, వేల్పూర్ పోలీస్స్టేషన్కు తరలించారు. మాక్లూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను ఆసరాగా చేసుకొని వల్లబాపూర్కు చెందిన ఇద్దరు వ్యక్తులు వారి ట్రాక్టర్లతో మరోచోటికి తరలిస్తుండగా తహసీల్దార్ శేఖర్ బుధవారం రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ధర్మోరా, గంగరమంద గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వల్లబాపూర్, చిక్లీ క్వారీ నుంచి వే బిల్లులు ఇచ్చారు. ఆర్ఐ షఫీ, జీపీవో సృజన్ల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఇసుక క్వారీల నుంచి ఇసుక రవాణా ప్రారంభమైంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక పక్కదారి పడుతుందన్న విషయం తెలుసుకున్న తహసీల్దార్ శేఖర్ చిక్లీ ఇసుక క్వారీకి 4 ట్రాక్టర్లు, వల్లభాపూర్ ఇసుక క్వారీకి 7 ట్రాక్టర్లు మొత్తం 11 ట్రాక్టర్ల ద్వారా 52 ట్రిప్పుల ఇసుక తరలించటానికి అనుమతి ఇచ్చారు. దీంతో వల్లభాపూర్ ఇసుక క్వారీ నుంచి ఇద్దరు అనుమతి ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు కాకుండా మరో చోటికి తరలించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన తహసీల్దార్ పోలీసు సిబ్బందితో హుటాహుటిన రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని పీఎస్కు తరలించారు. ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుకను పక్కదారి పట్టిస్తే సహించేది లేదని తహసీల్దార్ హెచ్చరించారు. -
సర్వే గడువు పొడిగింపు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్ అర్బన్: రాష్ట్రాన్ని రానున్న రోజులలో అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ పేరిట రూపొందిస్తున్న డాక్యుమెంట్ సర్వేలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. సర్వేలో పాల్గొనేందుకు నవంబర్ 1 వరకు గడువు పొడిగించారని తెలిపారు. భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో మీ ఆలోచనలు పంచుకోవాలని సూచించారు. అక్టోబర్ 10న ప్రారంభమైన ఈ సర్వేలో ఇప్పటికే ఉద్యోగులు, ప్రజలు, ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతి పౌరుడు భాగస్వామ్యమై సిటిజన్ సర్వేలో పాల్గొని తెలంగాణాకు దిశను నిర్ణయించాలన్నారు. http//www. telangana.gov.in/ telanganarising/ వెబ్సైట్ ద్వారా సర్వేలో పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. మోడల్ సోలార్ గ్రామంగా కోటగిరి నిజామాబాద్ అర్బన్: మోడల్ సోలార్ గ్రామంగా జిల్లాలోని కోటగిరి ఎంపికై నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో బుధవారం మోడల్ సోలార్పై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ కోటగిరిని ‘సూర్య ఘర్ మఫ్త్ బిజిలి’ యోజన కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. దీంతో కోటగిరి గ్రామంలోని ప్రభుత్వ భవనాలపై కేంద్ర ప్రభుత్వ నిధులతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. పీఎం సూర్య ఘర్ మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టు నివేదిక తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డీపీఆర్ ఆమోదం పొందిన సంవత్సరంలోపు ప్రాజెక్టులు పూర్తిగా అమలయ్యేలా చూసుకోవాలన్నారు.కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య మోడల్ సోలార్ విలేజ్ పథకంలో భాగంగా జిల్లాకో మోడల్ సోలార్ గ్రామాన్ని స్థాపించడమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి ● ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కోరిన ఎంపీ అర్వింద్ సుభాష్నగర్: జిల్లాలో కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న ఆర్వోబీల బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి కోరారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను హైదరాబాద్లోని కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని మాధవనగర్, అర్సపల్లి, అడవి మామిడిపల్లి ఆర్వోబీలకు సంబంధించి సుమారు రూ.13.5 కోట్లు తక్షణమే విడుదల చేయాలన్నారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు నెమ్మదిగా చేపడుతున్నారని, దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీ విజ్ఞప్తిపై మంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. పెండింగ్ బిల్లులను సత్వరమే విడుదల చేస్తానని హామీనిచ్చినట్లు ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలిపారు. -
కేబినెట్ బెర్త్ దక్కేనా?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి ఇందూరు జిల్లాకు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న కేబినెట్ పదవి ఈసారైనా దక్కుతుందా లేదా అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. రేపు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది. కాగా బోధన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి కేటాయించే విషయంలో ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతోంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు జిల్లాలోని వివిధ వర్గాల్లోనూ నైరాశ్యం నెలకొంది. అదిగో విస్తరణ.. ఇదుగో విస్తరణ అంటూ కాలయాపన చేస్తుండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాక రాష్ట్రంలో కేబినెట్ బెర్తులు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. నిజామాబాద్ జిల్లాతో పాటు ఆదిలా బాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు కేటాయించలేదు. అయితే కొన్ని నెలల కిందట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్కు మంత్రి పదవి కేటాయించారు. తాజాగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి అజారుద్దీన్కు మంత్రి పదవి కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముస్లిం మైనారిటీ వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ అజారుద్దీన్కు బెర్త్ కేటాయించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ సైతం బలంగా ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీ ట్లను బీజేపీ మంచి అధిక్యతతో గెలుచుకుంది. స్థా నిక సంస్థల ఎన్నికల్లో నిజామాబాద్ నగరపాలక సంస్థలో పాగా వేయడంతో పాటు, పరిషత్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ సైతం మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో పునర్వైభవం సాధించేందుకు కృషి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కీలకమైన ఈ జిల్లాకు మంత్రి పదవి కేటాయించాలని డిమాండ్లు వస్తున్నాయి.మిగిలింది నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలే..ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాకు కేబినెట్ మంత్రి పదవిని కేటాయించారు. దీంతో ఇక మిగిలింది నిజామాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు మాత్రమే. హైదరాబాద్ జిల్లాకు బెర్తు కేటాయించిన నేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లా చుట్టూ విస్తరించి ఉండటం కొంత కంటితుడుపుగా ఉందని అంటున్నారు. అయితే కీలకమైన, రాజకీయంగా చైతన్యం కలిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మాత్రం మంత్రి పదవి కేటాయించలేదు. ఉమ్మడి జిల్లాకు చరిత్రలో గత కొన్ని దశాబ్దాలుగా మంత్రి పదవి లేకుండా ఉన్న పరిస్థితి లేదు. రెండేళ్లుగా జిల్లా నుంచి కేబినెట్ మంత్రి లేకపోవడంతో జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నుంచి కేబినెట్ మంత్రి లేకపోవడంతో అభివృద్ధి పనులు అనుకున్నంతగా ముందుకు సాగడం లేదంటున్నారు. జిల్లాలో అనధికారిక మంత్రిగా వ్యవహరిస్తున్న సుదర్శన్ రెడ్డికి బెర్తు కేటాయిస్తే అభివృద్ధి పరుగులు పెట్టించే అవకాశం ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. అజారుద్దీన్కు మంత్రి పదవి కేటాయించిన నేపథ్యంలో చర్చ సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కోసం నెలకొన్న ఆశలు తాజా విస్తరణలో జిల్లాకు న్యాయం చేస్తారా ? లేదా అనే ఉత్కంఠ ! -
కల్లాల్లోనే కష్టమంతా..
నిజామాబాద్వాతావరణానికి.. వాతావరణ సూచనలకు అనుగుణంగా పంటలు వేయాలని రుద్రూర్ వరి పరిశోధన కేంద్రం అధిపతి పవన్ చంద్రారెడ్డి సూచించారు. గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025– 8లో uడొంకేశ్వర్(ఆర్మూర్): మోంథా తుపాను జిల్లా రైతులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా కల్లాలు, రోడ్లపైనే ఉండటంతో వర్షం ఎప్పుడేం చేస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. బుధవారం సైతం రోజంతా మేఘాలు కమ్ముకొని ఉండడంతో వడ్లను కుప్పలు చేసి టార్పాలిన్లు కప్పేసి ఉంచారు. ఉరుములు, మెరుపులకు టార్పాలిన్లు తీసేందుకు రైతులు సాహసించలేదు. కొన్నిచోట్ల చిరుజల్లులు పడగా, వాన నీరు అడుగు భాగానికి చేరకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వాతావరణ మార్పులతో వడ్లలో తేమశాతం ఎక్కడ మారిపోతుందన్న ఆందోళన అందరిలో నెలకొంది. ఇటు వ్యవసాయాధికారుల సూచన మేరకు రైతులు పంట కోతలను వాయిదా వేశారు. కొన్ని కోట్ల విలువైన ధాన్యం కల్లాలు, రోడ్లపై ఉండడంతో జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాలుగా చర్యలు చేపట్టింది. అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆగిన కాంటాలు.. జిల్లాలో 400 పైగా కేంద్రాలను సహకార శాఖ, ఐకేపీ ద్వారా 222 కేంద్రాలను మహిళా సంఘాలు నిర్వహిస్తూ రైతుల నుంచి పంటను సేకరిస్తున్నాయి. తుపాను కారణంగా జిల్లా అంతటా వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం చేయడం లేదు. మంగళవారం నాటికే లారీలన్నీ లోడ్ చేసి మిల్లులకు పంపించేశారు. రెండు రోజులుగా కాంటాలు నిలిపివేశారు. దీంతో రైతులు పంటను అమ్ముదామన్నా తీసుకునే పరిస్థితి లేదు. వర్షాలు తగ్గుముఖం పట్టి ఎండ వాతావరణం ఏర్పడితే మళ్లీ కాంటా చేయడం ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు చెప్తున్నారు. అప్పటి వరకు రైతులు ఓపిక పట్టాలని, కుప్పలపై టార్పాలిన్లు కప్పి ఉంచాలని కోరుతున్నారు. డొంకేశ్వర్ మండలం గాదేపల్లిలో వడ్ల కుప్పలపై కప్పిన టార్పాలిన్లు డిచ్ పల్లిలో వడ్లు కుప్పచేస్తున్న రైతు జిల్లాపై కొనసాగుతున్న మోంథా తుపాను ప్రభావం ఎక్కడికక్కడ వడ్లను కుప్పలు చేసిన రైతులు వర్షభయంతో టార్పాలిన్లు కప్పేసిన వైనం కాంటా చేయని సొసైటీలు, మహిళా సంఘాలు -
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
● కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన అన్ని మండలాల విద్యాశాఖాధికారులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. టాయిలెట్స్, నీటి వసతి, విద్యుత్ సదుపాయం వంటి వసతులన్నీ ప్రతి బడిలో అందుబాటులో ఉండాలన్నారు. బాలబాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ లేనిచోట వెంటనే నిర్మాణాలు జరిపించేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మంజూరైన పనులు సత్వరమే చేపట్టేలా చూడాలని, అవసరమైన వాటికి మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రోజూ వంద శాతం విద్యార్థుల హాజరును ఎఫ్ఆర్ఎస్ ద్వారా చేయాలని, విద్యార్థుల ఆధార్ను ఎన్రోల్ చేయించి యూడైస్ పోర్టల్లో తప్పనిసరిగా వివరాలు నమోదు చేయాలన్నారు. అన్ని యాజమాన్యాలు ఆధార్, అపార్ జెనరేట్ చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. అపార్ జెనరేట్ చేయని పాఠశాలలకు నోటీసులు జారీ చేసి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. ఏకరూప దుస్తుల స్టిచింగ్ సకాలంలో పూర్తయ్యేలా చొరవ చూపాలని, ఎక్కడైనా సివిల్ వర్క్స్ పెండింగ్లో ఉంటే యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తూ, నాణ్యతతో కూడిన విద్యను బోధించాలన్నారు. భవిత కేంద్రాల నిర్వహణ, వయోజన విద్య అమలు తీరు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఎంఈవోలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఐఈవో రవికుమార్, డీఈవో అశోక్, ఎంఈవోలు పాల్గొన్నారు. పశు సంవర్ధక శాఖ సేవలను మెరుగుపర్చాలి జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉంటూ పశు సంవర్ధక శాఖ సేవలను మరింతగా మెరుగుపర్చాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్సు హాల్లో బుధవారం ఆయన పశు సంవర్ధక శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పశు సంపద కలిగిన రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు పశు వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెటర్నరీ డాక్టర్లు లేనిచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా సర్దుబాటు చేయాలని, పశువులకు సకాలంలో వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్, వైద్య సేవలు అందేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. సంచార పశువైద్య వాహనం 1962 ద్వారా రైతుల వద్దకే వెళ్లి పశువులకు అవసరమైన చికిత్సలు అందేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ రోహిత్ రెడ్డి, పశు వైద్యాధికారులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద
● 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ● 16 గేట్ల ద్వారా గోదావరిలోకి 50 వేల క్యూసెక్కుల నీటి విడుదలబాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరద నీరు పోటెత్తింది. దీంతో గోదావరిలోకి నీటి విడుదలను పెంచారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రాజెక్ట్లోకి 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 16 వరద గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో వరద మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను నిలిపివేశారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మి కాలువ ద్వారా 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. 573 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం రాత్రికి అంతేస్థాయిలో నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి.. ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల చేపడుతుండటంతో జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నాలుగు టర్బాయిన్ల ద్వారా 36.30 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 64 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని జెన్కో అధికారులు తెలిపారు. -
రక్తదానం.. ప్రాణదానం
● సీపీ సాయిచైతన్యనిజామాబాద్అర్బన్: రక్త దానం అత్యవసర సమయంలో ఇతరులకు ప్రాణదానం అవుతుందని పో లీస్ కమిషనర్ సాయిచైతన్య పేర్కొన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ ప్రమా దాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలన్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నిర్వహించిన రక్తదాన శిబిరాల ద్వారా 177 యూనిట్ల రక్తా న్ని సేకరించినట్లు తెలి పారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సీపీ హె ల్మెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రామచంద్రరావు, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకటరెడ్డి ట్రాఫిక్ ఏసీబీ మస్తాన్ అలీ, పోలీస్ యూనిట్ ఆఫీసర్ సరళ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీశ్, శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు డాక్టర్ ఇమ్రాన్ అలీ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఆఖరి బిల్లు అందేదెప్పుడో?
● రెండు నెలల క్రితమే పూర్తయిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణండొంకేశ్వర్(ఆర్మూర్): ఈ చిత్రంలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లు వద్ద కనిపిస్తున్న మహిళ పేరు చిలుక సునీత. డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుంది. బేస్మెంట్ లెవల్ రూ.1 లక్ష, గోడల స్థాయిలో మరో రూ.1 లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.2 లక్షలు మొత్తం రూ.4 లక్షలు ప్రభుత్వం అందజేసింది. అయితే, ఇంటి నిర్మాణం పూర్తయి రెండు నెలలై గృహ ప్రవేశం కూడా జరిగింది. కానీ, రావాల్సిన ఆఖరి బిల్లు రూ.1 లక్ష ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రాలేదు. చివరి బిల్లు కోసం ఈమె అధికారుల చుట్టూ తిరిగినా వస్తాయనే సమాధానమే చెప్తున్నారు. మండలంలో ప్రారంభం కాని ఇళ్లు 170... డొంకేశ్వర్ మండలానికి మొత్తం 293 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 170 ఇళ్ల పనులు ప్రారంభం కాగా ఇంకా 170 ఇళ్లు అసలే మొదలు కాలేదు. లబ్ధిదారులకు సకాలంలో డబ్బులు రావడం లేదనే కారణంతో చాలా మంది నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఇటీవల పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లతో సమీక్ష నిర్వహించామని, బిల్లులు రాని వారికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని ఎంపీడీవో బుక్య లింగం ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. -
నేడు సాఫ్ట్బాల్ క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్ నాగారం: సాఫ్ట్బాల్ జిల్లాస్థాయి సీనియర్ క్రీడాకారుల ఎంపికలు బుధవారం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి ప్రభాకర్ రెడ్డి, మర్కంటి గంగామోహన్ తెలిపారు. ఆర్మూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల క్రీడా మైదానంలో పు రుషులు, సుద్దపల్లి సాంఘిక సంక్షేమ మహిళా కళాశాలలో మహిళలకు మధ్యా హ్నం 3 గంటలకు ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పాల్గొనే క్రీడాకారులు జిల్లా కోచ్లు నరేశ్, మౌనికకు రిపోర్ట్ చేయాలని సూచించారు. 4న జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిజామాబాద్ నాగారం: జిల్లా స్థాయి యువజనోత్సవాలను వచ్చే నెల 4న నగరంలోని తిలక్గార్డెన్ ఆవరణలోని న్యూ అంబేడ్కర్ భవన్లో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి పవన్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జానపద నృత్యం (బృందం), జానపద గీతాలు (బృందం), కథ రచన, పెయింటింగ్, వక్త్తృత్వ, కవిత్వ రచన, ఇన్నోవేషన్ (ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా) అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని పేర్కొ న్నారు. జిల్లాకు చెందిన 15 నుంచి 29 సంవత్సరాలలోపు యువత పాల్గొనాలని కోరా రు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని, అక్కడ ప్రథమ స్థానంలో నిలిచిన వారిని జాతీయస్థాయికి పంపనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల యువత dyso nizamabad@gmail.com మెయిల్ ద్వారా లేదా 97011 77144, 99596 49574 వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. అర్హులకే ఉజ్వల పఽథకం ● అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్అర్బన్: జిల్లాలోని అర్హులైన వారిని ఉజ్వల పథకానికి ఎంపిక చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అన్నా రు. మంగళవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఉజ్వల పథకానికి సంబంధించి నోడల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఉజ్వల పథకానికి 18 సంవత్సరాలు నిండిన, దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన మహిళలు అర్హులన్నారు. ఒకే కుటుంబంలో మరొక ఎల్పీజీ కనెక్షన్ ఉండొద్దని తెలిపారు. పన్ను చెల్లించే పరిధిలో ఉండకూడదని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా పాసుబుక్, మొబైల్ నెంబర్, పాస్పోర్టు సైజ్ ఫొటోతో ఆన్లైన్, గ్యాస్ ఏజెన్సీల వద్ద దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో బీపీసీఎల్ జిల్లా నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రాక్టికల్స్కు సిద్ధం కావాలి ● ఇంటర్ బోర్డు జిల్లా ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన్న బోధన్: వచ్చే నెలలో ఇంటర్ విద్యార్థులకు సంబంధించి సిలబస్ పూర్తి చేసుకొని ప్రాక్టికల్స్కు సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్బోర్డు జిల్లా ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన్న జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. బోర్డు కేటాయించిన నిధులను వినియోగించుకొని సివిల్, ఎలక్ట్రికల్, ఫర్నిచర్ ఇతర మరమ్మతు పనులు పూర్తి చేసుకోవాలన్నారు. మంగళవారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని బోధన్, వర్ని, కోటగిరి, మధుమలాంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలను డీఐఈవో రవికుమార్తో కలిసి తనిఖీ చేశారు. ఆయా కళాశాలల్లో ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో సమావేశమై మాట్లాడారు. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఐఈవో మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల యూడైస్, అపార్ ఐడీ నంబర్ నమోదును వెంటనే పూర్తి చేయాలన్నారు. నవంబర్ మొదటి వారంలోనే ఇంటర్ పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటిస్తుందన్నారు. గతేడాది అమలు చేసిన 90 రోజుల ప్రణాళికను ఈసారి కూడా అమలు చేసే అవకాశం ఉందన్నారు. సమావేశాల్లో కళాశాలల ప్రిన్సిపాళ్లు కల్పన, కౌసర్ పాషా, నిఖత్ కౌసర్, జాఫర్ , అధ్యాపకులు పాల్గొన్నారు. -
రేవంత్రెడ్డి డైరెక్షన్లోనే కవిత జనంబాట
సుభాష్నగర్: సీఎం రేవంత్రెడ్డి, కల్వకుంట్ల కవిత బిజినెస్ పార్ట్నర్స్ అని, ఆయన డైరెక్షన్లోనే కవిత జనంబాట చేపడుతోందని ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. నిజామాబాద్ నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో చిట్చాట్ నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఫీజు రీయింబర్స్మెంట్ ఆపిందెవరని, వారు చదువుకుంటే జీర్ణంకాని కుటుంబం కల్వకుంట్ల కుటుంబమని ఆరోపించారు. తెలంగాణ రాక ముందు ఫీజు రీయింబర్స్మెంట్ రెగ్యులర్గా వచ్చేదని, కేసీఆర్ పాలనలో పదేళ్లు ఫీజు రీయింబర్స్మెంట్ రాక యా జమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేశా యని గుర్తుచేశారు. గ్రూప్స్ పరీక్షలను అటకెక్కించారని, బీ సీ, ఎస్సీ, ఎస్టీలకు విద్యా, ఉద్యోగాలు వస్తే కేసీఆర్ కుటుంబం జీర్ణించుకోలేకపోయిందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కూడా తానేం చేయాలో కవి త చెప్తుందా అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అన్నిరంగాల్లో వెనకబడటానికి కారణం బీఆర్ఎస్ అన్నారు. కవతను కన్న తండ్రి, సొంత అన్ననే పార్టీ, ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని, ఇక ప్రజలు ఏం ఆదరిస్తారని ఎద్దేవా చేశారు. భవిష్యత్లో కవితతో సీఎం రేవంత్రెడ్డి పార్టీ పెట్టిస్తారని, ఆమెకు రాష్ట్రంలో ఏవర్గం కూడా ఓట్లు వేయదన్నారు. ప్రజలేం అమాయకులు కాదని, అన్ని గమనిస్తున్నారని, కుల రాజకీయాలు మానుకోవాలని సూచించారు. 80 శాతం కేంద్రం నిధులే.. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో యూజీడీ, తాగునీటి పథకాల కోసం ఇటీవల విడుదలైన నిధుల్లో 80 శాతం కేంద్రానివేనని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. రూ.169.3 కోట్లలో రూ.135 కోట్లు కేంద్రానివని, రూ.34 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానివన్నారు. ఈ నిధులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకుంటుందన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్కు నిధుల విషయంలో ఏం తెలియదని, సబ్జెక్టు లేదని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నాయకులు వడ్డి మోహన్రెడ్డి, కంచెట్టి గంగాధర్, న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రదీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎదిగితే జీర్ణించుకోలేని కల్వకుంట్ల కుటుంబం సీఎంతో రాజీనామా చేయిస్తే బీసీ రిజర్వేషన్లు ఎంపీ అర్వింద్ ధర్మపురి -
మోంథా గుబులు!
● తుపాను ప్రభావంతో జిల్లాలో మారిన వాతావరణం ● కోసిన పంట మొత్తం కల్లాలు, రోడ్లపైనే.. ● కాపాడుకునేందుకు రైతుల అష్టకష్టాలు డిచ్పల్లి మండలం సుద్దపల్లి ధాన్యం కల్లంలో చేరిన వర్షపునీరుడొంకేశ్వర్(ఆర్మూర్): ఆంధ్రప్రదేశ్ను అల్లాడిస్తున్న ‘మోంథా’ తుపాన్ తెలంగాణలోకి ప్రవేశించడంతో రైతులకు గుబులు పట్టుకుంది. మంగళవారం వాతావరణం మారిపోయి జిల్లా వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. చినుకులు కూడా పడటంతో పంట దిగుబడులు తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన మక్కలు, వడ్లను కుప్పలు చేసి టార్పాలిన్లు కప్పేశారు. వారం రోజులుగా ఆరబోసిన ధాన్యం కాంటాకు వచ్చిన సమయంలో వర్షాలు రావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ పంట తడిస్తే దానిని ఆరబోయడానికి నాలుగైదు రోజులు శ్రమించాల్సి వస్తుందని అంటున్నారు. ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా వరి 4.34 లక్షల ఎకరాలకు పైగా సాగైంది. మొక్కజొన్న 52,093, సోయా 33,603 ఎకరాల్లో వేశారు. ప్రస్తుతం మక్క, సోయా పంట కోతలు పూర్తి కాగా దిగుబడులు సగం మేర ప్రయివేటు వ్యాపారులకు విక్రయించారు. ఇటీవల ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు తెరవడంతో మిగిలిన పంటను కల్లాలు, రోడ్లపై ఆరబోసి ఉంచారు. ఇప్పుడు సమస్య వచ్చిందల్లా వరికే. వరి కోతలు 70 శాతం వరకు పూర్తయ్యాయి. పంట మొత్తాన్ని కల్లాలు, రోడ్లపై ఆరబోసి ఉంచారు. తుపాను కారణంగా వరి గింజలు ఎక్కడ పొలాల్లోనే రాలిపోతాయోననే భయంతో కోతలు త్వరత్వరగా చేసేస్తున్నారు. ధాన్యం కుప్పలపై కప్పేందుకు టార్పాలిన్లను కొనుగోలు చేస్తున్నారు. మరో రెండు రోజుల వరకు తుపాను ప్రభావం ఉండడంతో రైతులు కల్లాలు, వడ్ల కుప్పల వద్దే కావలి కాస్తున్నారు. తడిసిన ధాన్యం.. నిజామాబాద్అర్బన్: మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో అడపాదడపా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దవుతోంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు తీవ్రమైన ఎండ ఉండగా, ఆ తర్వాత ఒక్కసారిగా వర్షం కురిసింది. ప్రధానంగా నందిపేట్, మాక్లూర్, ఆర్మూర్, నిజామాబాద్, డిచ్పల్లి, సిరికొండ, జక్రాన్పల్లి, వేల్పూర్, బాల్కొండ ,భీమ్గల్, నవీపేట ప్రాంతాలలో కురిసిన వర్షానికి వడ్లు తడిసిపోయాయి. మోపాల్లో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. నందిపేటలో ఆరబోసిన ధాన్యం తడిసింది. రైతన్నా.. బీ అలర్ట్సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రస్తుతం కురుస్తు న్న వర్షాలతో రైతులు నష్ట పోకుండా ఉండేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. వరి కోయకుండా ఉంచితే స మస్య ఉండదని, హడావుడిగా కోసి ఆరబెడితే మాత్రం మొదటికే మోసం వచ్చి ధాన్యం వర్షార్ప ణమయ్యే పరిస్థితి నెలకొంటుందని చెప్తున్నారు. ఈ క్రమంలో రైతులు వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలనే అభిప్రాయాలు వస్తున్నాయి. అదేవిధంగా రైతులు ధాన్యంలో తేమ శాతం 17 లోపే ఉండేలా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే, జిల్లాలోని చాలా చోట్ల నుంచి ధాన్యం తేమ శాతం ఎక్కువగా వస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో తప్పని పరిస్థితుల్లో కాంటాలు పెడుతున్నారు. దీంతో ఆ ధాన్యాన్ని మిల్లర్లు తిరస్కరిస్తున్నారు. తేమశాతం ఎక్కువగా ఉంటే నూక శాతం పెరగడంతోపాటు గింజ నల్లగా మారే అవకాశం ఉంటుందంటున్నారు. జిల్లాలోని బోధన్ డివిజన్లో ముందుగానే వరికోతలు పూర్తయినప్పటికీ ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో మాత్రం కోతలు నడుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల సమయం తీసుకొని వరికోతలు చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,15,124 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది. -
ముసాయిదా మాస్టర్ ప్లాన్పై సమీక్ష
● ఆర్మూర్, బోధన్ టౌన్ప్లానింగ్ అధికారులతో సమావేశం ● వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశంనిజామాబాద్ సిటీ : అమృత్ 2.0లో భాగంగా జిల్లాలోని బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మంగళవారం బల్దియా కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్తోపాటు వర్క్షాప్పై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరుస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. అధికారులు నిర్ణీత నమూనాలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు నివేదిక సిద్ధం చేయాలన్నారు. మున్సిపాలిటీలలో డ్రోన్ సర్వే, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల పరిశీలన పూర్తయ్యిందన్నారు. రానున్న 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, సంబంధిత శాఖలు అందించే వివరాలను క్రోడీకరిస్తూ ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగాక, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఏవైనా అభ్యంతరాలు వస్తే, వాటిని పరిష్కరించి తుది మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆమోదం నిమిత్తం ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఇప్పటికే నిజామాబాద్ నగర ముసాయిదా మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వానికి పంపామని తెలిపారు. పట్టణాల భవిష్యత్ అభివృద్ధి, తాగునీటి సరఫరా మెరుగుదల, పార్కుల అభివృద్ధి వంటి వాటికి మాస్టర్ ప్లాన్ ఏవిధంగా ఉపకరిస్తుంది అనే అంశాలను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ డైరెక్టర్ రష్మీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, బోధన్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్లు జాదవ్, రాజు, మున్సిపల్, రెవెన్యూ, పబ్లిక్ హెల్త్, జిల్లా పరిశ్రమలు, జాతీయ రహదారులు, రోడ్లు–భవనాలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మెప్మా, రైల్వే, ఆర్టీసీ, రవాణా, పోలీస్, టూరిజం, ట్రాన్స్కో, విద్య, వైద్యం, వ్యవసాయం, గనులు, కాలుష్య నియంత్రణ మండలి తదితర అధికారులు పాల్గొన్నారు. -
సోయా కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
● వెంటనే ప్రారంభించాలని మార్క్ఫెడ్ సూచన ● జిల్లాలో 10 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుబోధన్: ఈ ఏడాది వానకాలం సీజన్లో జిల్లాలో రైతులు పండించిన సోయా కొనుగోళ్లకు మార్క్ఫెడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంపిక చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మార్క్ఫెడ్ జిల్లా అధికారులు మంగళవారం సమాచారం అందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సేకరణ చేపట్టాలని సూచించింది. బోధన్ మండలంలోని కల్దుర్కి, సాలూర, హున్సా, మావందికుర్ధు, కోటగి రి మండలం పోతంగల్, రెంజల్ మండలం నీలా, వర్ని మండలం జాకోరా(పైడిమల్), ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్, కమ్మర్ పల్లి, డొంకేశ్వర్ పీఏ సీఎస్లలో కొనుగోళ్లకు మార్క్ఫెడ్ అనుమతి ఇచ్చింది. జిల్లాలో 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సోయా క్వింటాలుకు మద్దతు ధర రూ.5,328 ప్రభుత్వం చెల్లిస్తుంది. జిల్లాలో 30వేల ఎకరాల్లో సోయా.. జిల్లాలో 30 వేల ఎకరాలకు పైగా సోయా పండించారు. ఎకరానికి గరిష్ట దిగుబడి 10 నుంచి 12 క్వింటాళ్ల మేరకు ఉంటుంది. అధిక వర్షాలు, వరదలతో దిగుబడి పడిపోయింది. ఎకరానికి 7 క్వింటాళ్ల చొప్పున దిగుబడితో లెక్కిస్తే 2 లక్షల 10 క్వింటాళ్ల మేరకు ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నాఫెడ్ నుంచి 25 శాతం మేరకు సేకరణ చేపట్టాలని సూచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్క్ఫెడ్ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంటుంది. పక్షం రోజులుగా కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఆశ గా ఎదురు చూస్తున్న సందర్భంలో మార్క్ఫెడ్ నుంచి అనుమతి లభించడంతో ఊరట లభించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియల్లోనే సహకార సంఘాలు సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఓ వైపు వరి, మరో వైపు సోయా కొనుగోళ్లు ఏకకాలంలో కొనసాగించడం ఏమేరకు సాధ్యమవుతుందోనని నిర్వాహకులు తర్జనభర్జన పడుతున్నారు. -
పారదర్శకంగా కేసులను విచారించాలి
● సీపీ సాయి చైతన్యనిజామాబాద్అర్బన్: కేసుల విచారణ పూర్తి పారదర్శకంగా చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. పోక్సో, గ్రేవ్ కేసులలో త్వరగా విచారణ జరిపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి అధికారికి సీసీటీఎన్ఎస్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతోపాటు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను సమీక్షిస్తూ కేసుల సంఖ్య తగ్గించేలా అధికారులు పనిచేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైన్ బోర్డుల ను ఏర్పాటు చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్లపై దృష్టిసారించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, మాదకద్రవ్యాలు, జూదం, రేషన్ బియ్యం అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు కోసం నివేదిక పంపాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకటరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సతీశ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న సీపీ సాయి చైతన్య, పాల్గొన్న పోలీసులు -
చట్టాలు ప్రజలకు నేస్తాలు
నిజామాబాద్ లీగల్: శాసన వ్యవస్థలు చేసే చట్టాలు, ప్రజలకు నేస్తాలుగా నిలుస్తాయని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు. నగరంలోని ‘వర్డ్‘ (వుమెన్ ఆర్గనైజేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్) స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వారికి ప్రజా సమస్యలు తెలుస్తాయని, వాటిలో ఎక్కువ శాతం చట్టం పరిధిలో పరిష్కరించే అవకాశలే ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, వర్డ్ సిబ్బంది రాణి, కిరణ్మయి, విజయ్,ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. వాల్పోస్టర్ల ఆవిష్కరణ నిజామాబాద్ లీగల్: నగరంలోని జిల్లా న్యాయసేవ సంస్థ కార్యాలయంలో మంగళవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చెకుముకి సైన్స్ సంబురాలు–2025’ వాల్పోస్టర్లను జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్ రావు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. వేదిక కార్యదర్శి పులి జైపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రయివేట్ బడుల్లోని 8, 9, 10వ తరగతి విద్యార్థులకు నవంబర్ 7న పాఠశాల స్థాయిలో, నవంబర్ 21న మండల స్థాయిలో, 28న జిల్లా స్థాయిల్లో సైన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేదిక ప్రతినిధులు ఖాజా ఉమర్ అలీ, బాస రాజేశ్వర్, శ్రీహరి ఆచార్య, కరిగె పండరి, న్యాయవాదులు అశోక్, ప్రదీప్, కిరణ్,మల్లాని శివకుమార్ పాల్గొన్నారు. -
ఐక్యతకు మారుపేరు సర్దార్ వల్లభాయ్ పటేల్
● నిజాం మెడలు వంచి ‘హైదరాబాద్’ను విలీనం చేశారు ● ఎంపీ అర్వింద్ ధర్మపురిసుభాష్నగర్: ఐక్యతకు మారుపేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, నిజాం మెడలు వంచి హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వతంత్య్ర భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఆయనదేనని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. నగరంలోని సుభాష్నగర్లోగల నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సర్దార్ వలభా య్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ‘మై భారత్’ యూనిటీ మార్చ్ జిల్లాస్థాయి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాల పోస్టర్ను ఎంపీ ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు జిల్లాస్థాయి పాదయాత్రలు నిర్వహించాలని, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని జిల్లాలను కలుపుకుని 3 రోజులపాటు 8 నుంచి 10 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాలన్నారు. అంతకుముందు విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6 వరకు జాతీయ మార్చ్ ఉంటుందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎన్వైకే కో ఆర్డినేటర్ శైలీ బెల్లాల్ పాల్గొన్నారు. -
6నుంచి పీజీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల 7, 9వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నవంబర్ 6 నుంచి 17వరకు కొనసాగుతాయని కంట్రోలర్ సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు. కామారెడ్డి రూరల్: అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, సెర్ప్ టీం సభ్యులతో కలసి మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను కలిశారు. పూలమొక్కను అందజేశారు. మండల సమాఖ్యలు, గ్రామ సంస్థల బలోపేతం కోసం సెర్ప్–టీజీ–ఐబీ యూనిట్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2025–26 సంసిద్ధతలో భాగంగా ఈ నెల 29 నుంచి స్టేట్ టీమ్ జిల్లాలో పర్యటన సందర్భంగా కలెక్టర్ను కలిసి కార్యక్రమం వివరాలను వివరించినట్లు వారు తెలిపారు. -
ఆర్మూర్లో పోలీసుల తనిఖీలు
ఆర్మూర్టౌన్: పట్టణంలో మంగళవారం రాత్రి నిషేధిత మాదక ద్రవ్యాలపై ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని పాతబస్టాండ్లో ప్రయాణికుల బ్యాగులను, హోటల్స్లలో, పాన్షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్ధాల, ఇతర చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు శిక్షణ పొందిన స్నిఫర్ కుక్కల ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఎవరైన నిషేధిత మత్తు పదార్థలు వాడితే చర్యలు తప్పవన్నారు. నవీపేట: మద్యం తాగి న్యూసెన్స్ చేసిన ఒకరికి జిల్లాకోర్టు వారంరోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. వివరాలు ఇలా.. నవీపేట శివారులో ఇటీవల పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మానవత్ కృష్ణ అనే రౌడీషీటర్ మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో న్యూసెన్స్ చేశాడు. దీంతో అతడిపై కేసు నమోదుచేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చారు. జడ్జి విచారణ జరిపి అతడికి వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి శివారులో పండ్ల లోడ్తో వెళుతున్న మినీ ట్రక్కు బోల్తాపడింది. వివరాలు ఇలా.. ఉన్నాయి.. నారింజ పండ్ల లోడుతో మినీ ట్రక్కు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. సోమవా రం అర్ధరాత్రి ట్రక్కు మండలంలోని నడిపల్లి శివారులోని పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే ముందు టైరు పేలి ఒక్కసారిగా పల్టీలు కొట్టి రోడ్డు కిందకు దూసుకుపోయింది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. మంగళవారం ఉదయాన్నే సంబంధిత వ్యక్తులు ఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడిన ట్రక్కు నుంచి పండ్లను మరో వాహనంలోకి మార్చారు. క్రేన్ సాయంతో బోల్తా పడిన ట్రక్కును తరలించారు. ఈవిషయమై డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ను సంప్రదించగా ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ
వర్ని (మోస్రా): మండలంలోని గోవూరు శివారులో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. నాలుగు ట్రాన్స్ఫార్మర్ల నుంచి మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, అందులోని కాపర్ కాయిల్స్ను దొంగలించారు. చోరీకి గురైనం కాయిల్స్ విలువ సుమారు రూ.4లక్షల వరకు ఉంటుందని లైన్ ఇన్స్పెక్టర్ స్వామి వెల్లడించారు. విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి పంచనామా నిర్వహించారు. రెంజల్(బోధన్): ఎల్జీ(లక్కీ జనరల్) యాప్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు పిట్ల మధు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇటీవల ‘ఎల్జీ’ మోసాలు, బాధితులపై ‘సాక్షి’ పత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలపై ఎస్బీ(స్పెషల్ బ్రాంచ్) పోలీసులు ఆరా తీశారు. బాధితుల వివరాలను సేకరించి జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు. అలాగే స్థాని క న్యాయవాది స్పందించి, బాధితులతో మాట్లాడి ఇటీవల స్థానిక ఠా ణా లో ఫిర్యాదు చేయించారు. ఈమేరకు ఎస్బీ పోలీసులు అందించిన వివరాలతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నిజాంసాగర్(జుక్కల్): బైండోవర్ ఉల్లంఘన చట్టం కింద నిందితుడికి మంగళవారం నిజాంసాగర్ తహసీల్దార్ బిక్షపతి రూ. 5వేల జరిమానా విధించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. వివరాలు ఇలా.. మండలంలోని మాగి గ్రామ శివారులోని బేడీల మైసమ్మ దాబాలో ఎటువంటి అనుమతుల లేకుండా మద్యం సిట్టింగ్ నిర్వహిస్తుండటంతో ఫిబ్రవరిలో పోలీసులు దాడులు చేశారు. దాబా నిర్వాహకుడు చింతకింది శేఖర్ను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. మళ్లీ ఈనెల 10న సదరు దాబాలో మద్యం సిట్టింగ్ నడుపుతుండటంతో ఎస్సై దాడులు చేసి, శేఖర్పై కేసు నమోదు చేశారు. కేసును తహసీల్దార్ భిక్షపతి దృష్టికి తీసుకువెళ్లగా బైండోవర్ ఉల్లంఘన కింద నిందితుడికి రూ. 5వేల జరిమానా విధించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. మోపాల్: మండలంలోని తాడెం (తానాకుర్దు) గ్రామంలో కల్లులో కలిపేందుకు తీసుకెళ్తున్న 580 గ్రాముల అల్ప్రాజోలంను పట్టుకున్నట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. తాడెం గ్రామంలో కల్లులో కలిపేందుకు మత్తుపదార్థాలు తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో మంగళవారం ప్రవీణ్ గౌడ్, సాగర్ గౌడ్ అల్ప్రాజోలం తీసుకుని తాడెం వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 580 గ్రాముల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించినట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి రూరల్: పాస్పోర్టు విచారణలో నిర్లక్ష్యం వహించిన భిక్కనూర్ ఏఎస్సై నర్సయ్య, రామారెడ్డి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న వెంకట్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు ఇన్చార్జి డీఐజీ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్సై నర్సయ్య గతంలో డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్లో పనిచేసినప్పుడు ఒక పాస్పోర్టు దరఖాస్తుపై విచారణ చేపట్టాల్సిన బాధ్యతలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. వెంకట్రెడ్డి కూడా డీఎస్బీలో పని చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తుల పాస్పోర్టు దరఖాస్తు విచారణలో బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించారు. ఈ విషయం ఎస్పీ రాజేష్ చంద్ర దృష్టికి రావడంతో విచారణ జరిపిన ఎస్పీ తన నివేదికను ఇన్చార్జి డీఐజీకీ పంపించారు. ఆయన నిర్లక్ష్యాన్ని సీరియస్గా పరిగణించి ఇద్దరిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
గోల్డెన్ అవర్లో చికిత్స.. ప్రాణాలను కాపాడే క్షణం
● బ్రెయిన్స్ట్రోక్ వచ్చిన వెంటనే రోగికి వైద్యం అందించడం ఎంతోముఖ్యం ● నేడు వరల్డ్ బ్రెయిన్స్ట్రోక్ డేనిజామాబాద్నాగారం: బ్రెయిన్ స్ట్రోక్ రోగికి వెంటనే వైద్య చికిత్స అందించడంతో ప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. నేడు ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా ‘బ్రెయిన్ స్ట్రోక్– గోల్డెన్ అవర్ చికిత్సపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. స్ట్రోక్ అనేది మెదడులో రక్తప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల సంభవించే అత్యవసర వైద్య పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 సెకన్లకూ ఒక వ్యక్తి స్ట్రోక్కు గురవుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి 4 నుంచి 5 గంటలు ‘గోల్డెన్ అవర్’ అని పిలుస్తారు. ఈ సమయంలో రోగికి సరైన చికిత్స అందితే మెదడు నష్టాన్ని గణనీయంగా తగ్గించి, రోగి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆలస్యం జరిగిన ప్రతి నిమిషం వేల మెదడు కణాల నష్టానికి దారితీస్తుంది. లక్షణాలు: ● రోగి ముఖం వంగిపోవడం, చేయి బలహీనపడటం, మాట తడబడటం వంటి లక్షణాలు కనిపించగానే వెంటనే స్ట్రోక్గా గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ● స్ట్రోక్ను గుర్తించడానికి ‘బీఈ ఫస్ట్’ పద్ధతి: ● బీ–అకస్మాత్తుగా సంతులనం కోల్పోవడం ● ఈ–కన్నుల చూపు తగ్గిపోవడం ● ఎఫ్–ముఖం ఒక వైపుకు వంగిపోవడం ● ఎ – చేయి బలహీనపడటం ● ఎస్– మాట తడబడటం లేదా స్పష్టంగా మాట్లాడలేకపోవడం ● టీ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంరక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, పొగతాగడం వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. యాంత్రీకరణ జీవనంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలి. – శ్రీకృష్ణాదిత్య, మెడికవర్ ఆస్పత్రి న్యూరో సర్జన్ -
పసుపు పంటలో తెగుళ్లతో జాగ్రత్త..
● ప్రధానంగా రెండు రకాల శిలీంధ్రాల ద్వారా వ్యాప్తి ● నివారణ చర్యలు చేపట్టాలంటున్న వ్యవసాయశాఖ అధికారులుబాల్కొండ: పసుపు పంటలో ఆకు తెగుళ్లతో జాగ్రత్త అంటూ బాల్కొండ ఉద్యావన శాఖ అధికారి రుద్ర వినాయక్ రైతులను హెచ్చరిస్తున్నారు. ఈమేరకు తెగుళ్ల లక్షణాలు– నివారణ చర్యలను ఒక ప్రకటనలో వివరించారు. పసుపు పంటలో ప్రధానంగా సోకే ఆకు తెగుళ్లు రెండు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి తాటకు మచ్చ తెగుళ్లు (మర్రాకు తెగుళ్లు), రెండవది ఆకు మాడు తెగుళ్లు పసుపు పంటను ఆశిస్తాయి. తాటాకు మచ్చ తెగులు( మర్రాకు తెగులు): తాటాకు మచ్చ తెగులు కొల్లెటోట్రై కమ్ క్యాప్సిసి అనే శిలీంద్రం ద్వారా పంటకు సోకుతుంది. వర్షాకాలంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం ఆకుల మీద సోకుతుంది. ప్రధానంగా అక్టోబర్ చివరిలో ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది. లక్షణాలు: ఈ శిలీంధ్రం సోకినప్పడు ఆకులపై పెద్దపెద్ద అండాకారపు మచ్చలు ఏర్పడి (4–15 సెంటీమీటర్లు) సైజులో ముదురు గోదుమ రంగులో ఉంటాయి. మచ్చ చుట్టు పసుపు రంగు వలయం ఏర్పడుతుంది. ఈ మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకు మాడిపోతుంది. నివారణ: లీటరు నీటికి 1 మిల్లీ లీటర్ల ప్రొపికోనజోల్ లేదా గ్రాము కార్బండిజమ్, 1.5 గ్రాముల మాంకోజెబ్ను కలిపి ఎకరానికి 200 లీటర్ల నీటిని కలిపి పిచికారి చేయాలి. లేదా 1 మిల్లీ లీటరు అజోక్సిస్ట్రోబిన్ లీటరు నీటికి కలుపుకుని పిచికారి చేసుకోవాలి. ఆకు మాడు తెగులు: ఆకు మాడు తెగులు టాప్రిన్మాక్యులాన్స్ అనే శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం ఎక్కువగా వ్యాపిస్తుంది. లక్షణాలు: ఈ తెగుళ్ల వలన ఆకులపై ముందుగా చిన్నచిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడుతాయి. ఈ మచ్చలు క్రమంగా అండాకారంగాను చతురస్రాకారంగాను ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పాడుతాయి. ఈ మచ్చలు క్రమేపి ఆకులంతా వ్యాపించి, ఆకు మాడిపోతుంది. నివారణ: లీటరు నీటికి 1 మిల్లీలీటరు ప్రొపికొనజోల్ లేదా 1 గ్రాము థయోఫినెట్ మిథైల్ లేదా 1 గ్రాము కార్బండిజమ్, 1.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 1 మిల్లీలీటరు అజోక్సిస్ట్రోబిన్ కలిపి ఎకరానికి 200 లీటర్ల నీటిని పిచికారి చేయాలి.మర్రాకు తెగులు సోకిన పసుపు ఆకు మాడు తెగులు సోకిన పసుపు -
రికార్డుల నిర్వహణ సమగ్రంగా ఉండాలి
● సీపీ సాయిచైతన్య ● పోలీస్ స్టేషన్ల రైటర్స్కు శిక్షణనిజామాబాద్అర్బన్: పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణలో సమగ్రంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం ఆయన పోలీస్ స్టేషన్ రైటర్స్కు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రికార్డుల నిర్వహణలో నైపుణ్యం పెంపొందించడం, పారదర్శకత, సమయపాలన, పోలీస్ వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమైన అంశాలన్నారు. రైటర్స్ కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని వారం రోజులపాటు ఇస్తామన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో ఏవిధంగా ఉండాలో కేసులు నమోదు అయితే ఏ విధంగా సత్వర చర్యలు తీసుకోవాలో తెలియజేశారు. నమోదైన కేసులలో సాంకేతిక పద్ధతులు ఏవిధంగా ఉపయోగించాలని తెలియజేశారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, పోలీస్ శిక్షణ కేంద్రం ఏసీపీ రాజశేఖర్, సీఐ శివరాం తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది అంకితభావంతో పని చేస్తున్నారు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బంది వివిధ విభాగాలలో అంకితభావంతో, నిబద్ధతతో పనిచేస్తున్నారని సీపీ సాయి చైతన్య అన్నారు. నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం వివిధ విభాగాలలో పనిచేస్తూ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి పతకాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ పథకాలకు సిబ్బందిని ఎంపిక చేసి పంపుతామన్నారు. పథకాలు కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదనొ, సేవ స్ఫూర్తికి కష్టపడి పనిచేసే నిబద్ధతకు ప్రతీక అన్నారు. అదనపు డీసీపీ రామచంద్రరావు, సిబ్బంది ఉన్నారు. -
భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యం వద్దు
● వెంటవెంటనే అర్జీలను పరిష్కరించాలి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిడిచ్పల్లి(నిజామాబాద్రూరల్): భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యం చేయవద్దని, వెంటవెంటనే అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. డిచ్పల్లి తహసీల్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ సతీష్రెడ్డి, ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష జరిపారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదాబైనామా, పీఓటీల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటవెంటనే నోటీసులు జారీ చేస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, తహసీల్దార్ సతీష్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ సంతోష్ ఉన్నారు. -
దేశాన్ని బీజేపీ అమ్మకానికి పెట్టింది
● రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబం ● నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిమోపాల్(నిజామాబాద్రూరల్): పలు ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్మేసిందని, దేశాన్ని సైతం అమ్మకానికి పెట్టిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి విమర్శించారు. మండలకేంద్రంలోని మోపాల్ సొసైటీలో మంగళవారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు టార్పాలిన్లను పంపిణీ చేశారు. అలాగే ధాన్యం చెన్నీ పట్టే యంత్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను పదేళ్ల పాటు కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. కాంగ్రెస్ను విమర్శించే అర్హత బీఆర్ఎస్కు లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి పోడు భూముల గురించి ఊసెత్తని ఎమ్మెల్సీ కవిత.. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు జనం బాట పేరుతో జాగృతి తరపున ఊర్లల్లో తిరుగుతుందని భూపతిరెడ్డి విమర్శించారు. తెలంగాణ పునర్నిర్మాణం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. నియోజకవర్గంలో పండించిన ధాన్యం మొత్తం కేంద్రాల ద్వారానే కొనుగోలు చేస్తామన్నారు. మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని, రైతులు వరి కోతలు నిలిపేయాలని, కోసిన ధాన్యాన్ని తడవకుండా ఆరబెట్టుకోవాలని సూచించారు. సొసైటీల ద్వారా 5వేల టార్పాలిన్లు పంపిణీ చేశామని, మరో నాలుగు వేలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్, సొసైటీ చైర్మన్లు గంగారెడ్డి, మోహన్రెడ్డి, సాయిరెడ్డి, గోర్కంటి లింగం, గంగాప్రసాద్, నారాయణ, సతీష్రెడ్డి, ప్రతాప్సింగ్, రాజలింగం, ఎంపీడీవో రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
లక్కు.. కిక్కు..
నిజామాబాద్● రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ● అకాల వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలపై అధికారులతో వీసీలో సమీక్షసమాజ శ్రేయస్సుకు.. బిగాల బ్రదర్స్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025– 8లో uలక్కీడ్రాలో టోకెన్ తీసి చూపిస్తున్న కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డిపాఠశాల నిర్వహణ గ్రాంట్ విడుదల కమ్మర్పల్లి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల నిర్వహణ గ్రాంట్ను అధికారులు విడుదల చేశారు. రాష్ట్ర సమగ్ర శిక్ష అభి యాన్ కింద ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, విద్యాశాఖ అధికారుల అలసత్వం కారణంగా హెచ్ఎం బ్యాంక్ ఖాతాలో డబ్బులు జ మ కాలేదని ‘నిర్వహణ భారం’ పేరిట సాక్షి జిల్లా పేజీలో సోమవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నుంచి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కు రూ. 29,74,42500 గ్రాంటు విడుదల చేశారు. త్వరలోనే ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి బ్యాంక్ ఖాతాలో గ్రాంటును జమ చేయనున్నారు. నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు ● ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు..నిజామాబాద్ సిటీ: టీఎస్ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగియనుంది. సంస్థలో వెయ్యి డ్రైవర్ ఉద్యోగాలు, 800 శ్రామిక్ (క్లీనర్) పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు సమీప బస్ డి పోల్లో దరఖాస్తు చేసుకోవాలి. డ్రైవర్ పోస్టు కు 22 నుంచి 35 ఏళ్ల వయోపరిమితి, శ్రామి క్ ఉద్యోగానికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వ యస్సువారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీలకు చెందిన అభ్యర్థులకు 5 ఏళ్ల మినహాయింపు ఉంది. డ్రైవర్లకు హెవీ మోటారు వెహికిల్ డ్రైవింగ్ లైసెన్సు పొంది ఉండాలి. నేడు నగరంలో కరెంట్ కోత సుభాష్నగర్: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనున్నట్లు ఏడీఈ ఆర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ తీగల మరమ్మతులు, లైన్ల పెంపు పనులు నిర్వహించనుండటంతో కరెంట్ కోత ఉండనున్నట్లు పేర్కొన్నారు. గాయత్రినగర్, ఆకుల పాపన్న రోడ్, పుట్ట మైసమ్మ, విశ్వ వికాస్ స్కూల్, కాశీనగర్, సాయిప్రియనగర్, చింతచెట్టు మైసమ్మ, బీమరాయ టెంపుల్ ప్రాంతంలో నేడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నామని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. గోదావరిలోకి నీటి విడుదల బాల్కొండ: ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి పోమవారం ఉదయం మళ్లీ వరద పెరగడంతో ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదలను ప్రారంభించారు. ఎగువ ప్రాంతాల నుంచి 22,154 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి 4 వరద గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మికాలువ ద్వారా 200, ఆవిరి రూపంలో 573, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. టోకెన్లను డబ్బాలో వేసి దరఖాస్తుదారులకు చూపుతున్న ఎక్సైజ్ అధికారినిజామాబాద్అర్బన్: 2025–27 నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలో దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నగర శివారులోని భారతీ గార్డెన్లో సోమవారం లాటరీ పద్దతిలో వైన్ షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది. 102 దుకాణాలు.. 2786 దరఖాస్తులుమద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం జిల్లా ఎక్సైజ్ శాఖ గత నెల 24 నుంచి ఈనెల 23 వరకు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని 102 మద్యం షాపులకు గాను మొత్తం 2786 దరఖాస్తులు దాఖలయ్యాయి. గతంలో కంటే ఈ ఏడాది తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్లను అందరికీ చూపిస్తూ, పారదర్శకంగా డ్రా నిర్వహించారు. డ్రా ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి వరకు ఫొటో, వీడియో చిత్రీకరణ చేశారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారు లు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారినే లోనికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ సాయి చైతన్య పోలీసు బందోబస్తును పర్యవేక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. లక్కీడ్రాలో వైన్ షాపులు కేటాయించబడిన వారు లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ముగియడంతో లక్కీ డ్రాలో లక్కు–కిక్కు వరించిందెవరికో తెలిసిపోయింది. జిల్లాలోని 102 మద్యం దుకాణాలను డ్రా పద్ధతిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కేటాయించారు. నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి దరఖాస్తుదారులు భారీగా తరలివచ్చారు. పోలీసులు, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగా ప్రక్రియ ముగిసింది. భార్యాభర్తలకు.. బాల్కొండలో సోమిరెడ్డి లక్ష్మణరావు 67వ షాపుకు దరఖాస్తు చేసుకోగా లక్కీ డ్రాలో అతనికి షాపు లభించింది. అతడి భార్య సోమిరెడ్డి కృష్ణవేణి పేరిట 69వ దుకాణాన్ని దరఖాస్తు చేసుకోగా అక్కడ కూడా డ్రా గెలిచారు. భార్యాభర్తలకు అదే ప్రాంతంలో రెండు చోట్ల మద్యం దుకాణాలు రావడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. రెంజల్ మండలంలో రాంపూర్, సాటాపూర్ ప్రాంతాలలో ఆవుల నాగార్జున రెడ్డికి రెండు దుకాణాలు (52, 54) లక్కీ డ్రాలో కేటాయించబడ్డాయి. అలాగే ఏర్గట్ల్లకు అత్యధికంగా 96 దరఖాస్తులు రాగా పోటాపోటీ నెలకొంది. కాగా గతంలో మద్యం దుకాణం నిర్వహించిన అనుగు శ్రీధర్కు మళ్లీ లక్కీ డ్రాలో మద్యం షాపు వరించడం నిజంగా లక్కే. విజేతల్లో 19మంది మహిళలు.. మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రాలో 19 మద్యం దుకాణాలు మహిళలకు దక్కాయి. జిల్లా వ్యాప్తంగా 102 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా తీయగా ఇందులో 19 మంది మహిళలు ఉన్నారు. కొత్త మద్యం దుకాణాలు ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి నవంబర్ 30, 2027 వరకు కాలపరిమితి ఉన్నట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. రైతులు నష్టపోకుండా చూడాలి -
కనుల పండువగా పల్లకీ సేవ
నిజామాబాద్అర్బన్: తుపాను ప్రభావం వల్ల రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సోమవారం సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం నిల్వలతోపాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంటలు వర్షానికి తడవకుండ రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. రానున్న మూడు రోజుల పాటు అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కాగా, కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని, వెంటవెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు. కాగా, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. బీఎల్వో సూపర్వైజర్లు ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్దిష్ట గడువు లోపు పకడ్బందీగా జరిపించాలన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, కిరణ్మయి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, బీఎల్వో సూపర్వైజర్లు, బీఎల్వోలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ నింబాచలం(లింబాద్రి గుట్ట) బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవా రం లక్ష్మీనరసింహస్వామి పల్లకీ సేవను భక్తులు కనుల పండువగా నిర్వహించారు. అంతకుముందు గ్రామాలయంలో ఉత్సవమూర్తులకు లింబాద్రిగుట్ట పురోహితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజ లు నిర్వహించారు. పుష్పాలంకృతుడైన లక్ష్మీనరసింహస్వామిని పల్లకీలో కొండపైకి చేర్చారు. పట్టణంలోని నందిగల్లీ, నందీశ్వరాలయం, హరిజనవాడ, ముచ్కూర్ రోడ్, పురాణీపేట్ మీదుగా పల్లకీసేవ సాగింది. ఈసందర్భంగా భక్తుల కోలాటాలు వీక్షకులను అలరించాయి. -
ఎకో టూరిజం ఏర్పాట్లలో ముందడుగు..
● గాదేపల్లిలో కాటేజీలు, రిసార్ట్ల డిజైన్ కోసం అర్కిటెక్చర్ పరిశీలన ● మ్యాప్ వచ్చిన వెంటనే పనులు మొదలు డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఎకో టూరిజం ఏర్పాట్లలో కదలిక వచ్చింది. కాటేజీలు, రిసార్ట్లు, వాచ్ టవర్ల డిజైన్ కోసం అటవీ అధికారులు ఇటీవల అర్కిటెక్చర్ను పిలిపించారు. ఎకో టూరిజానికి కేంద్ర బిందువైన డొంకేశ్వర్ మండలం గాదేపల్లి శివారులో ఎస్సారెస్సీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని వారు సందర్శించారు. అర్కిటెక్చర్ డిజైన్ తయారు చేసి ఇచ్చిన వెంటనే పనులు మొదలు పెట్టేందుకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం రూ.1.4కోట్ల వరకు నిధులు సైతం కేటాయించిన విషయం తెలిసిందే. మూడు చోట్లలో గాదేపల్లినే ప్రధానం... ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం 64 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు గుర్తించింది. జిల్లాలో డొంకేశ్వర్ మండలం గాదేపల్లి, నందిపేట్లో ఉమ్మెడ, బాల్కొండలో జలాల్పూర్ను ఎకో టూరిజం ప్రాంతాలుగా గుర్తించింది. అందులో పచ్చదనంతో విదేశీ పక్షులు, జింకలు సందడి ఎక్కువగా ఉండే గాదేపల్లి ప్రాంతాన్నే బాగా అభివృద్ధి చేయనున్నారు. తొలుత గాదేపల్లి వద్ద స్థల సేకరణకు ఇబ్బందులు ఏర్పడగా, ఇటీవల గ్రామస్తుల సహకారంతో వేరేచోట రెండెకరాల స్థలాన్ని గుర్తించారు. అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అర్కిటెక్చర్తో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. డిజైన్ పూర్తయిన వెంటనే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. పక్షం రోజుల్లో జిల్లాకు సఫారీ వాహనాలు.. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించిన సందర్భంగా ప్రభుత్వం జిల్లాకు మూడు సఫారీ వాహనాలను కేటాయించింది. ఇందుకోసం రూ.45లక్షల నిధులను కూడా కేటాయించింది. ఒక్కో వాహనాన్ని రూ.15లక్షలు వెచ్చించి తయారు చేయిస్తున్నారు. ఇందుకోసం టెండర్లు పిలిచారు. ఇవి ఈ నెలాఖరుకు లేదా నవంబర్ మొదటి వారంలో జిల్లాకు వచ్చే అవకాశాలున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా ‘సాక్షి’కి తెలిపారు. గాదేపల్లి వద్ద ఎకో టూరిజం పనులు త్వరలో మొదలయ్యే అవకాశం ఉందన్నారు. -
ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దు
● ఎంపీ అర్వింద్ ధర్మపురి ● కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పరామర్శసుభాష్నగర్: ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గన్కల్చర్ వంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించవద్దని ఎంపీ అర్వింద్ ధర్మపురి సూచించారు. అమరుడైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను సోమవారం నగరంలోని వారి నివాసంలో ఎంపీ అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.2లక్షల చెక్కును అందజేశారు. ఈసందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ ప్రమోద్పై రౌడీషీటర్ రియాజ్ కత్తితో దాడి చేసి హత్య చేయడం బాధాకరమన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులకే హైదరాబాద్ శివారులో గోరక్షక్ సోనుసింగ్పై తుపాకీతో కాల్పులు జరిపారని గుర్తుచేశారు. గత పదేళ్లలో దొంగ పాస్పోర్టులు, గన్కల్చర్ పెరిగిపోయిందని, ఓట్ల కోసం లాఅండ్ ఆర్డర్ను వాడుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. రౌడీషీటర్ రియాజ్ను పట్టుకునే క్రమంలో గాయపడ్డ రాంనగర్కు చెందిన సయ్యద్ ఆసిఫ్ను తన నివాసంలో ఎంపీ అర్వింద్ ధర్మపురి, ఎమ్మెల్యే ధన్పాల్ పరామర్శించారు. రూ.50వేల చెక్కులను ఎంపీ, ఎమ్మెల్యే కలిసి అందజేశారు. నాయకులు న్యాలం రాజు, సుధా, బైకన్ మధు, తదితరులు ఉన్నారు. -
ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
● మీ మార్పు కుటుంబానికి, సమాజానికి ఎంతో గర్వకారణం ● రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రానిజామాబాద్అర్బన్: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, వారిలోని మార్పు కుటుంబానికి, సమాజానికి ఎంతో గర్వకారణమని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా అన్నారు. జిల్లా జైల్లో సోమవారం తేనెటీగల పెంపకం, నివృత్తి డీ–అడిక్షన్ సెంటర్, ఫ్యూయల్ ఔట్లెట్ కార్యక్రమాలను ఆమె ప్రారంభించింది. ఈసందర్భంగా డీజీ మాట్లాడుతూ.. ఖైదీలకు ఉపాధి కల్పించడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఆర్థిక స్వావలంబన పెంపు లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఖైదీలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ వృత్తిని కొనసాగించవచ్చన్నారు. ప్రభుత్వం నుంచి సహాయం పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. జైళ్ల శాఖ ఐజీ ఎన్ మురళి బాబు మాట్లాడుతూ.. జిల్లా జైలు పరిధిలో మూడు కార్యక్రమాలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఫ్యూయల్ అవు ట్ లెట్, తేనెటీగల పెంపకం, నివృత్తి డీ–అడిక్షన్ సెంటర్ ఇవన్నీ ఖైదీల పునరవాసానికి మైలురాళ్లుగా నిలుస్తాయన్నారు. జైళ్ల శాఖ డీఐజీ సంపత్ మాట్లాడుతూ.. చర్లపల్లి, సంగారెడ్డి జిల్లాలో తేనెటీగల పెంపకం యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయని, మై నేషన్ బ్రాండ్ కింద తయారవుతున్న తేనెకు మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. సీపీ సాయిచైతన్య, సైకాలజిస్ట్ శ్రావ్య, ప్రకృతి ఎన్జీవో కల్పన, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, శ్రావణ్ కుమార్, వెంకట కార్తీక్, జైల్ సూపరింటెండెంట్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించాలి
నిజామాబాద్అర్బన్: ధాన్యం కొనుగోలు ప్రక్రియ ను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి సోమవా రం ఆయన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలి సి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్ట ర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాలు, వ్య వసాయ, గ్రామీణ అభివృద్ధి, రవాణా శాఖల అధికా రులతో ధాన్యం, కొనుగోళ్లు, అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ.. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున వరి, పత్తి కొనుగోలు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు ఏ ర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అ నంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తుపాను తీవ్రత అధికంగా ఉన్నందున అధి కార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్ర భుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టినట్లు తెలిపారు. సోయాబీన్ రైతుల సౌకర్యార్థం మంగళవారం 12 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామ న్నారు. కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ కిరణ్ కు మార్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. -
రేపే ‘బాబ్లీ’ గేట్ల మూసివేత
● సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయనున్న త్రిసభ్య కమిటీ ● ఇన్ఫ్లో వస్తుండటంతో గేట్లను మళ్లీ తెరిచే అవకాశం బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బుధవారం త్రిసభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో మూసివేయనున్నారు. కానీ ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. దీనికితోడు ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో దిగువకు నీటి విడుదల చేపడుతున్నారు. కావున గేట్లను మూసివేసే అవకాశం లేదని ఎస్సారెస్పీ అధికారులు అంటున్నారు. సుప్రీం తీర్పును అమలు చేయాలి కాబట్టి త్రిసభ్య కమిటీ సభ్యులు బాబ్లీ ప్రాజెక్ట్కు చేరుకుని సంతకాలను చేయనున్నట్లు తెలిపారు. సంతకాలు చేయడంతో వరద తగ్గిన వెంటనే బాబ్లీ గేట్లను మూసివేసుకునే అవకాశం నాందేడ్ ఇరిగేషన్ అధికారులకు ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న.. సుప్రీం తీర్పు ప్రకారం బాబ్లీ గేట్లను ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న మూసి, జూలై 1న తెరవాలి. ఎస్సారెస్పీ ఎగువన గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిలిచిన నీరుకు బదులుగా మార్చి 1న బాబ్లీ గేట్లు ఎత్తి 0.6 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీకి వదలాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. అక్టోబర్ 28న అర్ధరాత్రి దాటకనే గేట్లను మూసివేయాలి. కానీ ఆ సమయంలో త్రిసభ్య సమిటీ సభ్యులు వెళ్లడం ఇబ్బందిగా ఉండటంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ఉదయం గేట్లను మూసి వేస్తున్నారు. త్రిసభ్య కమిటీలో సభ్యులుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారులు, నాందెడ్ ఇరిగేషన్ అధికారులు, సీడబ్ల్యూసీ అధికారులు ఉన్నారు. నీటి విడుదల కొనసాగుతుంది.. బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుంది. ప్రస్తుతం బాబ్లీ గేట్లు మూసి వేసే పరిస్థితి లేదు. కానీ సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలి. కాబట్టి త్రిసభ్య కమిటీ సభ్యులు బాబ్లీ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి గేట్లను మూసి వేస్తున్నట్లు సంతకాలు చేయడం జరుగుతుంది. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ -
బంగారు దుకాణంలో చోరీ
నవీపేట: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న వైష్ణవి బంగారు దుకాణంలో దొంగలు ఆదివారం అర్ధరాత్రి బీభత్సం సష్టించారు. నల్లని దుస్తులు, మాస్కులు ధరించిన ముగ్గురు దుండగులు పల్సర్ బైక్పై వచ్చి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. దుకాణానికి ఇరువైపులా ఉన్న నివాస గృహాలకు గొలుసులు వేశారు. దుకాణం ముందు భాగంలోని ఇనుప గేటుకు వేసిన తాళాలను ఎలక్ట్రిక్ కట్టర్తో కట్ చేశారు. ఇద్దరు దుండగులు లోపలికి ప్రవేశించి లోపల ఉన్న వెండి, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అదే ప్రాంతంలో అద్దెకు ఉన్న బిహారి కూలీలు దొంగతనం జరుగుతున్నట్లు గుర్తించి వారిపై రాళ్లు విసిరారు. ఈ చోరీలో రూ.10 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలను దుండగులు చోరీకి పాల్పడినట్లు దుకాణ యజమాని పవన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెంట్రల్ క్రైమ్ సెల్ ఏసీపీ నాగేంద్ర చారి, సీఐ సాయినాథ్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై తిరుపతి ఘటన స్థలాన్ని, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
‘ఉపాధి’లో పారదర్శకతకు ఈ–కేవైసీ
● ఈ నెల 31 చివరి తేదీ ● జిల్లాలో 75 శాతం పూర్తి రెంజల్: గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ–కేవైసీని అమలు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో వలసలను నివారించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహమీ పథకంలో జరుగుతున్న అక్రమాలను నివారించేందుకు సంస్కరణలను తీసుకు వస్తున్నా అవినీతి చోటు చేసుకుంటోంది. దీంతో కేంద్రం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఈ–కేవైసీని అమలు చేస్తోంది. దీని కోసం జిల్లాలోని క్షేత్ర సహాయకులు కూలీల చిత్రాలను మొబైల్లో తీసి ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానటరింగ్ సిస్టం) యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. క్రియాశీలకంగా పనిచేస్తున్న కూలీలను ఎంపిక చేసుకుని క్షేత్ర సహాయకులు ముమ్మరంగా గ్రామాల్లో దండోరా వేయించి ముందుకు సాగుతున్నారు. ఇది పూర్తయితే కూలీల హాజరు నమోదులో పారదర్శకత ఉంటుంది. అక్రమాలు జరుగుతున్నాయిలా.. గ్రామాల్లో జరిగే ఉపాధి హామీ పథకంలో ఒకరికి బదులు మరొకరు హాజరు కావడం, గ్రామాల్లో లేని వారికి జాబ్కార్డులు జారీచేయడం, పనుల్లో ఎక్కువ మంది కూలీలు వచ్చినట్లు చూపడం, పనులకు రాని వారికి హాజరు వేసి క్షేత్ర సహాయకులు చెరిసగం పంచుకోవడం, బోగస్ మస్టర్లు తదితర అక్రమాలు సాగుతున్నాయి. సామాజిక తనిఖీల్లో బట్టబయలవుతున్నా చర్యలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ–కేవైసీ ఉంటేనే ఉపాధి పనులు కల్పించాలని నిర్ణయించింది. పనులకు రాకున్నా వారికి హాజరు వేయడంతో వచ్చిన వారికి తక్కువ మొత్తంలో గిట్టుబాటుకాని కూలీ రావడంతో అనేక సందర్భాల్లో కూలీలు రోడ్ల పై నిరసనలు వ్యక్తం చేశారు. నకిలీ హాజరుకు చెక్ పెట్టి పనులు చేసిన వారికే కూలీ సొమ్మును అందించేందుకు ఈ–కేవైసీతో అవకాశం ఉంటుంది. జిల్లాలో ఈ–కేవైసీ వివరాలు ఉపాధి కూలీలు ఈ–కేవైసీ పూర్తయిన వారు 2,37,473 1,70,879 పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఈ–కేవైసీని ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తాం. ఇప్పటికే జిల్లాలో 75 శాతం పూర్తయింది. క్రియాశీలకంగా జిల్లాలో పని చేస్తున్న వారినే గుర్తించి ముందుకు సాగుతున్నాము. – సాయాగౌడ్, డీఆర్డీవో -
ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విశేష స్పందన
● కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ హైదరాబాద్లో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ , పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నాయకులు నిజామాబాద్రూరల్: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని వారు అన్నారు. సోమవారం హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల సీజ్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎలాంటి అనుమతులు లేకుండా లింగంపేట మండలం నుంచి నాగిరెడ్డిపేట మండలానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను ఆదివారంరాత్రి పట్టుకొని సీజ్ చేసినట్లు స్థానిక ఎస్సై భార్గవ్గౌడ్ సోమవారం తెలిపారు. లింగంపేట మండలంలోని పర్మళ్లకు చెందిన రెండు ట్రాక్టర్లలో, శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఒక ట్రాక్టర్తోపాటు నాగిరెడ్డిపేట మండలంలోని పల్లెబోగుడతండాకు చెందిన ఒక ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా నాగిరెడ్డిపేట మండలంలోని జప్తిజాన్కంపల్లికి తరలిస్తుండగా పట్టుకున్నామని ఆయన చెప్పారు. ట్రాక్టర్లను సీజ్చేసి నాగిరెడ్డిపేట పీఎస్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముగ్గురిపై కేసునమోదు కానిస్టేబుళ్ల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు వారిని ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేస్తామని బెదిరించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. లింగంపేట మండలంలోని పర్మళ్ల నుంచి ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న కానిస్టేబుళ్లు గంగారాం, సందీప్ను ఆదివారం రాత్రి పర్మళ్లకు చెందిన రమావత్ లింబ్యాతోపాటు అతని సోదరులు పరమేశ్, రమేశ్పై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వాధికారుల విధులకు ఆటంకం కలిగించేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. రాజంపేట: మండలంలోని అన్నారం తండాలో వీధి కుక్కల దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. తండాకు చెందిన మాలోత్ దీప్లా, సంగీత, వినోద్, ధర్మిల పై కుక్కలు దాడి చేశాయి. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు 108 అంబులెన్స్లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ అంకిత్ ● ప్రజావాణిలో 104 దరఖాస్తుల స్వీకరణనిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల స ముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 104 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో సాయాగౌడ్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేసి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు నిరసన తెలిపారు. 2024 ఏప్రిల్ 1 నుంచి రిటైర్ అయిన పెన్షనర్లకు ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదన్నారు. జీపీఎఫ్ బిల్లులు అందించాలని, ఏరియల్స్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సుఖుమ్, శ్రీధర్, బన్సీలాల్ రాజేందర్, శంకర్ గౌడ్, పూర్ణచంద్రారావు, హనుమాండ్లు, కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగుల నాయకులు పాల్గొన్నారు, సెల్ టవర్ పనులను నిలిపివేయండి ముబారక్నగర్ ఏకశిలానగర్లోని నివాస ప్రాంతాల్లో చేపడుతున్న సెల్ టవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని దీని వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్థానికులకు తెలియకుండా గుత్తేదారు ఇళ్ల మధ్య టవర్ నిర్మాణం చేపడుతున్నారని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి ఇటీవల తుఫాన్వల్ల కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని వాటిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆర్ఎస్పీ పార్టీనగర కన్వీనర్ రాములు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పోలీస్ ప్రజావాణిలో 11 ఫిర్యాదులు.. నిజామాబాద్అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదులను సీపీ సాయి చైతన్య స్వీకరించారు. ఫిర్యాదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు. -
శివాలయాల్లో ప్రత్యేక పూజలు
నిజామాబాద్ రూరల్: కార్తీక మాసం తొలి సోమ వారం సందర్భంగా భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని నీలకంఠేశ్వర, శంభు లింగేశ్వర, ఉమామహేశ్వర, కోటగల్లిలోని భక్తమార్కండేయ ఆలయాల్లో, లలితా దేవి ఆశ్రమాలయం, జన్మభూమి రోడ్డు వద్ద ఉన్న శివాలయాల్లో భక్తులు అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. నీలకంఠేశ్వరాలయంలో ఉదయం నుంచి భక్తుల సందడి నెలకొంది. సాయంత్రం పిండి దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయాలు సందడిగా మారాయి. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీరామ రవీందర్, ఆలయ కమిటీ చైర్మన్ సిరిగిరి తిరుపతి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శంభు లింగేశ్వర ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.రాములు, చైర్మన్ బింగి మధు, కిశోర్, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన ఫర్నిచర్ను విక్రయిస్తున్నాం
నిజామాబాద్ రూరల్: నగరంలోని వినాయక్నగర్లో ఉన్న త్రిమూర్తి ఎంటర్ ప్రైజెస్ షోరూంలో నాణ్యమైన ఫర్నిచర్ను విక్రయిస్తున్నట్లు సంస్థ స్థాపకులు కొండ వీరశేఖర్ గుప్తా తెలిపారు. సోమవారం షోరూంలో 50 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. షోరూంలో ప్రత్యేక పూజలు చేశారు. 1975లో దేవీరోడ్డులో స్థాపించామని, 2009లో వినాయక్నగర్లో అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు తక్కువ ధరల్లోనే ఫర్నిచర్ను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కొండ శ్రవణ్, పవన్, నగర ప్రముఖులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెక్యూరిటీ కౌన్సిల్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రాంతాల్లో అభివృద్ధికి కృషి చేసినటువంటి పద్ధతులను జిల్లాలో కూడా తీసుకురావాలని ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యాలయాన్ని జిల్లా పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్లు పాల్గొన్నారు. పాఠశాలలో ఆకతాయిల వీరంగం వేల్పూర్: మండలంలోని జాన్కంపేట్ ప్రైమరీ స్కూల్లో ఆదివారం అర్ధరాత్రి ఆకతాయిలు మద్యం సేవించి వీరంగం సృష్టించారని స్థానిక వీడీసీ సభ్యులు పేర్కొన్నారు. ఆకతాయిలు స్కూలు వరండాలో మద్యం సేవించి, విచ్చలవిడిగా మద్యం సీసాలు పగుల గొట్టారన్నారు. సోమవారం ఉదయం స్కూలుకు వెల్లిన టీచర్లు, విద్యార్థులు వరండాలో మద్యం సీసీలు చూసి బెదిరిపోయారన్నారు. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి
మాక్లూర్: బిగాల బ్రదర్స్ స్ఫూర్తితో సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్థికంగా, రాజకీయంగా బలపడి ఉన్నవారేందరో ఈ సమాజంలో ఉన్నా బిగాల బ్రదర్స్ వలే ఆలోచించకపోవటం విచారకరమని అన్నారు. సోమవారం మాక్లూర్ మండల కేంద్రంలో ప్రారంభించిన నూతన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నూతన పాఠశాల భవనానికి ప్రభుత్వం ఇచ్చిన రూ. 4 కోట్ల 70 లక్షల నిధులకు తోడు, స్థానికులైన బిగాల గణేశ్ గుప్తా, మహేశ్ గుప్తా రూ. ఒక కోటి విరాళం అందించడం అభినందనీయమని అన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఎంత ఉన్నత స్థితికి చేరుకున్న స్వగ్రామాన్ని మరిచిపోకుండా గ్రామ అభివృద్ధికి పాటుపడటం బిగాల సోదరులకే దక్కుతుందన్నారు. వారి సేవాగుణం వెల కట్టలేనిదన్నారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మాట్లాడుతూ.. మాక్లూర్ గ్రామాన్ని భవిషత్తులో మరింత అభివృద్ధి చేయటమే కాకుండా విద్యావంతుల గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, జాయింట్ కలెక్టర్ కిరణ్కుమార్, డీఈవో అశోక్, ఎంఈవో సత్యనారాయణ, ఎంపీడీవో బ్రహ్మానందం, ఎంపీవో శ్రీనివాస్, నిజామాబాద్ మాజీ మేయర్ దండు నీతూకిరణ్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ అంటేనే ఆ త్మగౌరవమని.. అవకాశం, అధికారం ఆత్మగౌరవమే తమ విధానమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్లో ఆమె మీ డియాతో మాట్లాడారు. తెలంగాణలో అందరికీ మంచి జరగాలని ‘జనంబాట’ పట్టామన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావడమే ముఖ్యమని, అవసరమైతే రాజకీయపార్టీ పెడతామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేలే ఓడించారని ఆరోపించారు. ఆడబిడ్డలకు సీఎం రేవంత్రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సమాన అవకాశాలు లేకుండా ప్రభుత్వం అణచివేస్తోందని, ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ అధికారంలో వాటా కొన్ని వర్గాలే అనుభవిస్తున్నాయన్నారు. అధికారంలో మహిళల వాటా ఐదు శాతం కూడా లేదన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలకు భాగస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు రైతులకు పరిహారం ఇవ్వాలి గోదావరి వరద ముంపు ప్రాంతమైన యంచ గ్రామం పరిధిలో పంట పొలాలను తాము పరిశీలించామని, అక్కడి పరిస్థితి దారుణంగా ఉందని కవిత అన్నారు. పంట నష్టపోయిన రైతులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. నవీపేట మండలంలోని 5వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. మక్కలకు బోనస్ ఇస్తామని ప్రకటించి ఇవ్వడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడమే మక్కరైతులు పంట దిగుబడిని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారన్నారు. అలాగే జిల్లాలో బీడీ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు కొట్లాడాలన్నారు. సమావేశంలో జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సామాజిక తెలంగాణ సాధన ద్వారానే అది సాధ్యం ఆడబిడ్డలకు సీఎం రేవంత్ అన్యాయం చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలే నన్ను ఓడించారు మీడియాతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత -
ఆధునిక హంగులతో అందమైన భవనం..
● రూ. 5.70 కోట్ల వ్యయంతో మాక్లూర్లో నిర్మాణం ● నేడు ప్రారంభించనున్న కలెక్టర్, ఎమ్మెల్యేమాక్లూర్: మండల కేంద్రంలో రూ.5 కోట్ల 70 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా ఈఈ ప్రతాప్, స్థానిక ఎంఈవో సత్యనారాయణ తో కలిసి జిల్లా విద్యాధికారి అశోక్ ఆదివారం నూతన భవనాన్ని పరిశీలించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై నూతన భవనాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 4 కోట్ల 70 లక్షలు మంజూరు చేయగా, మాక్లూర్ వాసి, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, ఆయన సొదరుడు మహేశ్గుప్తా కలిసి రూ.కోటి విరాళం అందజేశారు. మొత్తం రూ.5 కోట్ల 70 లక్షలతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నూతన భవనాన్ని నిర్మించారు. -
స్వగ్రామానికి చేరిన మృతదేహం
భిక్కనూరు: సౌత్ ఆఫ్రికాలో ఈనెల 20న మృతి చెందిన బత్తుల శ్రీనివాస్ మృతదేహం ఆదివారం భిక్కనూరుకు చేరుకుంది. బతుకుదెరువు కోసం ఇటీవల సౌత్ ఆఫ్రికాకు వెళ్లిన శ్రీనివాస్ కానరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబీకులు, బందుమిత్రుల రోదనలు మిన్నంటాయి. మృతదేహన్ని చూసిన వారందరూ కన్నీటి పర్యంతమయ్యారు. సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో ప్రజలు పాల్గొని శ్రీనివాస్కు కన్నీటి వీడ్కోలు పలికారు. పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని విఠల్వాడీ తండాకు చెందిన పవర్ సవితపై అనుమానంతో గురువారం రాత్రి భర్త పవర్ కిషన్ హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆదివారం నిందితుడు కిషన్ను పట్టుకొని, రిమాండ్కు తరలించినట్లు ఎస్సై అరుణ్ కుమార్, సీఐ రవికుమార్ తెలిపారు. పిట్లం(జుక్కల్): తండ్రికి సేవలు చేయలేక అడ్డు తొలగించుకున్నడో కొడుకు. మండలంలోని గౌ రారం తండాలో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాలు ఇలా.. గౌరారం తండాకు చెందిన కేతావత్ వామన్ తన తండ్రి దశరథ్ (58)కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొంతకాలం నుంచి సపర్యలు చేస్తున్నాడు. తండ్రికి భోజనం పెట్టడం, బట్టలు ఉతకడం, స్నానం చేయించడం, మలమూత్ర విసర్జన ఎత్తిపోయడం వంటి పనులు అతడు భారంగా భావించాడు. దీంతో తండ్రికి సేవలు చేయలేక హతమార్చాలనుకున్నాడు. ఈనెల 24న రాత్రి తండ్రికి కల్లులో గుర్తుతెలియని పురుగుల మందు తాగించి, హత్యచేశాడు. అందరికి సాధారణ మృతిగా నమ్మించాడు. కానీ దశరథ్ చిన్న కొడుకు కేతావత్ శ్రీకాంత్ తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వామన్ను పట్టుకొని విచారించగా, తానే తండ్రిని హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు వామన్ను ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని అంజని గ్రామ శివారులో శనివారం రాత్రి పేకాడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి, వారిని పట్టుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వారి నుంచి రూ.12,750 నగదు, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు వివరించారు. బొమ్మా–బొరుసు ఆడుతున్న 8మంది.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బాణాపూర్ గ్రామ శివారులో బొమ్మా, బొరుసు(చిత్తు,బొత్తు) ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై దీపక్కుమార్ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బొమ్మా–బొరుసు కేంద్రంపై దాడి చేసి, వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 5 ద్విచక్ర వాహనాలు, 5 ఫోన్లు, రూ. 3400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి గ్రామ శివారులోగల డిచ్పల్లి – నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి ఓ కారు అదుపుతప్పి సమీపంలోని పెట్రోల్ బంక్ దిమ్మెను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారు పెట్రోల్ పంపు లోపలికి వెళ్లివుంటే పెను ప్రమాదం సంభవించేదని, బంక్ దిమ్మె వద్దనే నిలిచిపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాదంపై బంకు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
కరెంట్షాక్తో యువ రైతు మృతి
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని ఆరేడ్ గ్రామంలో ఓ యువరైతు కరెంట్ షాక్తో మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గాండ్ల బసప్ప(38) అనే యువ రైతు ఆదివారం సాయంత్రం గ్రామశివారులోని పొలానికి వెళ్లాడు. నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఉన్న కరెంట్ మోటార్ ఆన్ కాకపోవడంతో కేబుల్ వైర్ పట్టుకొని ప్రాజెక్టు నీళ్లల్లోకి దిగాడు. కేబుల్ వైర్తోపాటు మోటార్ వద్దకు చేరుకున్న బసప్ప కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. బసప్ప తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలం వద్దకు వెళ్లారు. అక్కడ అతడి కోసం గాలించగా కరెంట్ మోటార్ వద్ద నీటిలో అతడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పదస్థితిలో ఒకరు.. రాజంపేట: మండలంలోని మూడుమామిళ్ల తండాలో ఒకరు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని శేర్శంకర్ తండా పరిధిలోని మూడుమామిళ్ల తండాకు చెందిన ముద్రిచ్చ లాల్య(38) ఆదివారం ఉదయం ఇంటి నిర్మాణ విషయంలో పక్కవారితో గొడవపడ్డాడు. అనంతరం తన ఇంట్లోకి వచ్చి నీరు తాగి, మళ్లీ బయటకు వెళ్లగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై తెలిపారు. -
రమణీయ ప్రకృతి
నిర్వహణ భారంకమ్మర్పల్లి: పాఠశాల నిర్వహణ గ్రాంట్ల వ్యవహా రం ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదు’ అన్న చందంగా మారింది. పాఠశాలలు ప్రారంభమైన ఐదు నెలలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజారు చేసినప్పటికీ విద్యాశాఖ అధికారుల అల సత్వం కారణంగా ప్రధానాపాధ్యాయుల ఖాతాల్లో ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదు. దీంతో చాక్పీస్లు కొందామన్నా పైసలు లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, చిన్నచిన్న మరమ్మతులను పట్టించుకోవడమే మరిచారు. జిల్లాలో ప్రస్తుతం 122 ప్రాథమిక, 633 ప్రాథమికోన్నత, 263 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 1.04 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యాసంవత్సరం జిల్లాలో 3 వేల మంది విద్యార్థుల అడ్మిషన్లు అదనంగా పెరిగాయి. పాఠశాలల అభివద్దికి కృషిచేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఈ నెల 10న రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉతర్వులు జారీ చేసినప్పటికీ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంకా నిధులు ప్రధానోపాధ్యాయుల ఖాతాలో జమకాలేదు. మరోపక్క 81 పాఠశాల కాంప్లెక్స్లకు రావలసిన రూ. 26.73 లక్షలు, అలాగే 33 ఎమ్మార్సీలకు రావలసిన రూ. 26.40 లక్షలు ఇంకా రాలేదు. ఎరుపు వర్ణంలోకి మారిన ఆకాశం.. ఆకుపచ్చ తివాచీ పరుచుకున్నట్లుగా ఉన్న నేల ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్దులను చేసింది. సూర్యాస్తమయం వేళ భూమ్యాకాశాలు చూపరులను ఆకట్టుకుంటుండగా పచ్చని చెట్లు సాక్షులుగా నిలిచినట్లు ఉన్న ఈ రమణీయ దృశ్యాన్ని డొంకేశ్వర్ శివారులో ‘సాక్షి’ ఆదివారం సాయంత్రం క్లిక్మనిపించింది. చల్లని సాయంకాలం ఆహ్లాదాన్ని నింపింది. – డొంకేశ్వర్(ఆర్మూర్) ఖర్చుల భారంపాఠశాలలకు నిధుల మంజూరు ఇలా.. ఇంకా విడుదల కాని పాఠశాల గ్రాంట్లు ఇబ్బందులు పడుతున్న ప్రధానోపాధ్యాయులు చాక్ పీస్ల కొనుగోలు.. పారిశుద్ధ్య నిర్వహణకు తిప్పలు కష్టమవుతోంది ప్రభుత్వ పాఠశాలకు వచ్చే నిధులు సకాలంలో రాక పాఠశాల నిర్వహణ కష్టమవుతోంది. పాఠశాల ప్రారంభమై ఐదు నెలలు గడిచినా మొదటి విడత నిధులు కూడా రాలేదు. ప్రభుత్వం నిధులను వెంటనే విడుదల చేయాలి. – సురేశ్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడునిధులను పెంచాలి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తున్న నిధులు సరిపోవడం లేదు. విద్యార్థుల సంఖ్య పరంగా కాకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఏడాదికి రూ.50 వేలు కేటాయించాలి. విద్యార్థుల సంఖ్య 100 దాటితే లక్ష రూపాయలు కేటాయించాలి. – రచ్చ మురళి, పీఎస్హెచ్ఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపాఠశాల విద్యా సంవత్సరం సగం గడిచిపోనప్పటికీ మొదటి విడత గ్రాంట్ హెచ్ఎంల ఖా తాల్లో జమకాలేదు. దీంతో ప్రధానోపాధ్యాయులకు ఖర్చులు తలకు మించిన భారమవుతున్నా యి. సొంత డబ్బులు వెచ్చించి స్టేషనరీ, శానిటైజర్లు, చాక్పీస్లు, ఫినాయిల్ తదితర సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. పాఠశాలల్లో చిన్న చిన్న మరమ్మతులకు నిధులు లేక ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. అలాగే కాంప్లెక్స్ పాఠశాలలకు వచ్చే గ్రాంట్ రాక కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు అదనపు ఆర్థిక భారంగా మారింది. అలాగే ఎమ్మార్సీలకు కూడా రావాల్సిన నిధులు రాక కంప్యూటర్ నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులు, గుండు సూది నుంచి తెల్ల కాగితాల వరకు కొనుగోలు ఖర్చులు ఎంఈవోలకు భారంగా మారాయి. -
మార్గం సుగమం..!
● ‘స్థానిక’ ఎన్నికల్లో సంతానం నిబంధన ఎత్తివేతకు మంత్రివర్గ ఆమోదం ● పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు ● ఆయా స్థానాల్లో పెరగనున్న పోటీ మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉండొద్దనే నిబంధన ఎత్తివేతకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపడంతో ఆశావహుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేవారికి పరిమితి సంతానం నిబంధనను గత ప్రభుత్వం ఎత్తివేసింది. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో మాత్రం అదే నిబంధన అమలులో ఉండటంతో అనేక మంది ఔత్సాహికులు పోటీకి దూరమయ్యారు. జనాభా నియంత్రణ కోసం.. జనాభా నియంత్రణలో భాగంగా 1995లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండరాదనే నిబంధన అమలులోకి తీసుకొచ్చింది. 1995 జూన్ 1 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా అప్పటి ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో 1995 జూన్ తర్వాత జరిగిన అన్ని స్థానిక సంస్థల, సహకార సంఘాల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు పోటీకి దూరమయ్యారు. తాజాగా ఆ నిబంధన ఎత్తివేయడం ఔత్సాహికులకు ఎంతో ఊరట కలిగించే విషయం. పెరగనున్న పోటీ.. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తే 545 సర్పంచ్ పదవులు, 5,022 వార్డు సభ్యుల స్థానాలు, 307 ఎంపీటీసీ, 31 జడ్పీటీసీ స్థానాలకు చాలా మంది పోటీ చేసే అవకాశం ఉంది. గతంలో పరిమిత సంతానం నిబంధనతో పోటీ తగ్గగా ఈసారి నిబంధన ఎత్తివేయడంతో స్థానికల్లో పోటీ పెరిగే అవకాశం ఉంది. చాలాకాలంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారిలో ఉత్సాహం నెలకొంది. -
కానిస్టేబుళ్లకు పదోన్నతి
నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. వరప్రసాద్, సీహెచ్శేఖర్ (కమ్మర్పల్లి), శ్రీనివాస్(భీమ్గల్), కే యాదవ్(మాక్లూర్), ఎండీ ఆరిఫుద్దీన్(టూ టౌన్), చిన్నయ్య(కోటగి రి), జి శ్రీనివాస్రావు(నవీపేట), లింబాద్రి, రాంచందర్(రెంజల్), గణేశ్(నిజామాబాద్ రూరల్) ప్రమోషన్లు పొందినవారిలో ఉన్నారు. పదోన్నతి పొందిన వారిని జగిత్యాల జిల్లాకు కేటాయించారు. ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబర్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్కుమా ర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డి గ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, 2, 4, 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ (2021, 2022, 2023, 2024 బ్యాచ్)లకు చెందిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని ఆయన సూచించారు. రూ.100 అపరాధ రుసుముతో నవంబర్ 6వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం www. telanganauniversity.ac.in వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు. రీవాల్యూయేషన్కు దరఖాస్తు చేసుకోండి..తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 2021వ బ్యాచ్ బీఈడీ, బీపీఎడ్ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ థియ రీ పరీక్షల ఫలితాల రీవాల్యూయేషన్ కోసం నవంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసు కోవాలని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్కుమార్ సూచించారు. ఒక్కో పేపర్కు రూ.500, దరఖాస్తు పత్రానికి రూ.25 చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ www.telanganauniversity.ac.in ను సంప్రదించాలని సూచించారు. నింబాచల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కమ్మర్పల్లి(భీమ్గల్): జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భీమ్గల్ నింబాచలం(లింబాద్రి గుట్ట) బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో 13 రోజులపాటు సాగనున్న బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు గుట్టపై నుంచి నంబి వంశస్తులు, గ్రామస్తులు మంగళ వాయిద్యాలు, మేళాతాళలతో గ్రామాలయానికి ఊరేగింపుగా వెళ్లారు. క్షేత్రదేవి చండికా దేవీ(పెద్దంగంటి ఎల్లమ్మతల్లి)కి పురోహితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి సారె సమర్పించారు. గ్రామ పెద్దలు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బెస్ట్ అటెండెన్స్ స్కూల్గా బెజ్జోర జెడ్పీహెచ్ఎస్ కమ్మర్పల్లి(భీమ్గల్): రాష్ట్రంలో ఉత్తమ హాజరు(అటెండెన్స్) పాఠశాలగా భీమ్గల్ మండలం బెజ్జోర జెడ్పీహెచ్ఎస్ నిలిచింది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంలో 2025–26 వి ద్యా సంవత్సరానికి గాను గెజిటెడ్ హెడ్మాస్టర్స్ విభాగంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు అధికంగా ఉండడంతో బెజ్జోర పాఠశాలను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎంపిక చేశారు. ఆదివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి వనరుల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో బెజ్జోర జెడ్పీహెచ్ఎస్ గెజిటెడ్ హెచ్ఎం ఎండీ హఫీజొద్దీన్ను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. -
ప్రకృతి సేద్యంతోనే ఆరోగ్య భాగ్యం
బోధన్: ప్రకృతి సేద్యంతోనే సంపూర్ణ ఆరోగ్య భాగ్యం లభిస్తుందని ఆదర్శ రైతు కరుటూరి పాపారావు, పలువురు వక్తలు అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఆదివారం పాపారావు తన సూర్యోదయ సహజ వ్యవసాయ క్షేత్రంలో సహజ వ్యవసాయ సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా పాపారావు మాట్లాడుతూ.. సేంద్రియ ఎరువులతో పండించిన ఆహార ఉత్పత్తుల ప్రాముఖ్యతను అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా కార్తీక మాసంలో రైతులు, వినియోగదారులకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తనకు వ్యాపార దృక్పథం లేదని, ఆరోగ్యమైన, నాణ్యమైన ఆహార ఉత్పత్తులపై అందరికి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాన్నారు. అలాగే పశుసంవర్ధక శాఖ విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ రెడ్డి, ఆత్మా జిల్లా విశ్రాంత పీడీ రవీందర్, నందిపేట ఎంపీడీవో శ్రీనివాస్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ రాంగోపాల్ రెడ్డి, రైతు విఠల్రెడ్డి, ప్రసాద్తోపాలు పలువురు వక్తలు తమ అభిప్రాయాలను సదస్సులో వివరించారు. గోకృపామృతం, జీవామృతం సేంద్రియ ఎరువులు, వివిధ కషాయాలతో చేసే ప్రకృతి వ్యవసాయ సాగుపై రైతులు దృష్టిపెట్టాలన్నారు. పాపారావు ప్రకృతి వ్యవసాయం చేస్తు అందరికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. అంతకుముందు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లోని వివిధ మండలాల నుంచి ప్రకృతి ప్రేమికులు, సేంద్రియ వ్యవసాయ సాగుదారులు, వినియోగదారులు అధిక సంఖ్యలో హాజరై, పాపారావు వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు. -
అటవీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమోపాల్(నిజామాబాద్రూరల్): ఏళ్లుగా పోడు భూ ములు సాగు చేస్తున్న రైతుల పట్ల అటవీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తె లంగాణ జాగృతి జనం బాటలో భాగంగా మండలంలోని వెంకట్రాంనాయక్ తండాలో ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు రామావత్ ప్రకాశ్ కు టుంబ సభ్యులను ఆదివారం ఆమె పరామర్శించారు. అంతకుముందు అటవీ అధికారులు ధ్వంసం చేసిన పంట భూమిని పరిశీలించారు. అలాగే బైరాపూర్ పో చమ్మ తల్లి, వెంకట్రాంనాయక్ తండాలోని జగదాంబ మాతా ఆలయంలో పూజలుచేశారు. గిరిజనులతో క లిసి నృత్యాలు చేశారు. అనంతరం కవిత మాట్లాడు తూ.. మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనప్పు డు పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలి కదా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంచిప్ప చుట్టుపక్కల ఉన్న రైతులను అటవీ అధికారులు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు శ్రీనివాస్ గౌడ్, నరేష్ నాయక్, ప్రేమ్దాస్, జలంధర్, ఇందల్ నాయక్, స్థానిక రైతు లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పరామర్శ నిజామాబాద్ అర్బన్: అమరుడైన కానిస్టేబుల్ ప్రమో ద్ కుటుంబ సభ్యులను ఆదివారం నగరంలో కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ప్రమోద్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళ్లు అర్పించారు. అలాగే ప్రమో ద్ హత్య నిందితుడు రియాజ్ను పట్టుకునేక్రమంలో గాయపడిన ఆసిఫ్ను కవిత పరామర్శించారు. -
కుండీల్లోనే ముగిసిన కథ!
● వంద రోజులు దాటినా పంపిణీకి నోచుకోని చేపపిల్లలు ● ఎన్ని బతికున్నాయో చెప్పలేమంటున్న అధికారులుబాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తి చేసిన చేపపిల్లల పంపిణీ కథ కంచికే అన్నట్లుగా తయారైంది. చేపపిల్లలను ఉత్పత్తి చేసి వంద రోజులు దాటినా ఇప్పటి వరకు పంపిణీపై ఎలాంటి నిర్ణయం లేదు. ఈ ఏడాది కేవలం 54 లక్షల చేపపిల్లలను మాత్రమే ఉత్పత్తి చేసి కుండీల్లో నిల్వ ఉంచారు. అయితే, 20 రోజుల క్రితం కుండీల్లోని చేపపిల్లలు సగం మృత్యువాత పడినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్ని చేపపిల్లలు ఉన్నాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని అధికారులు చెపుతున్నారు. కుండీల్లో ఫంగస్ వచ్చి చనిపోయి ఉంటాయనే అనుమానం వ్య క్తం చేస్తున్నారు. సరైన సమయంలో పంపిణీ చేయకపోవడంతో ప్రభుత్వ సొమ్ము వృథాగానే పోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం ఉత్పత్తి చేసిన చేపపిల్లల వయస్సు 100 రోజులు దాటింది. ఇప్పటి వరకు ఎన్ని ప్రాణంతో ఉన్నాయో చెప్పలేం. 54 లక్షల చేపపిల్లలను ఉత్పత్తి చేశాం. ప్రస్తుతం చేపపిల్లలను పంపిణీ చేసినా ప్రయోజనం ఉండదు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిపాం. – దామోదర్, మత్స్యఅభివృద్ధి అధికారి, శ్రీరాంసాగర్ -
దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్ధ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులకు స్వయం ఉపాధి కోర్సులలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 3న సీసీ టీవీ ఇన్స్టాలేషన్ (13రోజులు), వెజిటబుల్ నర్సరీ (35రోజులు), పాపడ్, ఊరగాయల తయారీ (10 రోజులు), తేనెటీగల పెంపకం (20 రోజులు), పుట్టగొడుగుల పెంపకం (10 రోజులు), నవంబర్ 17న మగ్గం వర్క్ (31రోజులు), నవంబర్ 18న (టైలరింగ్ (31రోజులు), నవంబర్ 19న బ్యూటీపార్లర్ (35రోజులు) కోర్సుల్లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజన, హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రం అందిస్తామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని 19–45 సంవత్సరాల వయస్సు కలిగిన గ్రామీణ ప్రాంత యువతీయువకులు దరఖాస్తులకు అర్హులన్నారు. ఆసక్తిగల వారు తమ ఆధార్కార్డు, రేషన్కార్డు, 10వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, బ్యాంకు ఖాతా జిరాక్స్ వెంట తెచ్చుకుని నేటినుంచి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం డిచ్పల్లిలోని ఎస్బీఐ శిక్షణ కేంద్రంలో లేదా 08461–295428 నెంబరును సంప్రదించాలని ఆయన సూచించారు. ఆర్మూర్టౌన్: బీజేపీ కార్యాకర్తలు, నాయకులు పార్టీ అభివృద్ధి కోసం కృషిచేయాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లెగంగారెడ్డి అన్నారు. ఆర్మూర్లోని 16వ వార్డులో ఆదివారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి పీఎం మన్కీబాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగురవేయ్యాలన్నారు. నాయకుడు భూపతిరెడ్డి, కంచెట్టి గంగాధర్, మందుల బాలు, సుంకరి రంగన్న, కలిగొట ప్రశాంత్, ఉదయ్గౌడ్ పాల్గొన్నారు. మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరీద్పేట శివారులో ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ శివారులోని పత్తి చేనులో పనిచేస్తున్న 45 సంవత్సరాల మహిళపై ఆదివారం సాయంత్రం బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కూలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు తీవ్ర రక్తస్రావమై, అస్వస్థతకు గురికావడంతో స్థానికులు గుర్తించి, చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూలీల కొరత.. నిలిచిన కాంటా..
● ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సాగని పనులు ● బీహార్ నుంచి వచ్చే కూలీల సంఖ్య తగ్గిపోవడమే కారణం మోర్తాడ్(బాల్కొండ): ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూలీల కొరత వేధిస్తోంది. బీహార్ నుంచి రావాల్సిన కూలీలు పూర్తిస్థాయిలో రాకపోవడంతో ధాన్యం కొనుగోళ్లకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. స్థానికంగా ఉన్న హమాలీలతో ధాన్యం తూకం వేసే పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో కూలీల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో కొన్నేళ్లుగా బీహార్ నుంచి వలస వచ్చే కూలీలపైనే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆధారపడుతున్నారు. ఒకవేళ మిల్లర్లు ధాన్యంను తూకం వేయించినా వారు కూడా బీహార్ కూలీలపైనే ఆధారపడుతున్నారు. బీహార్ నుంచి కూలీలను తరలించడానికి ప్రతి గ్రామంలో మధ్యవర్తులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న సహకార సంఘాలు, సమాఖ్యల ప్రతినిధులు ఈ మధ్యవర్తులను ఆశ్రయించి వారి సహకారం కోరుతున్నారు. దసరా, దీపావళి తర్వాత బీహార్ వారికి ప్రత్యేక పండుగలు ఉండటంతో కూలీలు తరలిరావడానికి ఆటంకం ఏర్పడుతుందనే వాదన వినిపిస్తోంది. కొన్ని చోట్లనే అందుబాటులో.. జిల్లాలో సహకార సంఘాలు, మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో సుమారు 676 కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే 550కిపైగా కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ప్రారంభించారు. మిగిలిన కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ కొన్ని కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తూకం వేయడానికి కూలీలు ఉన్నారు. అనేక చోట్ల రెండు, మూడు రోజుల్లో కూలీలు వస్తారని, వారు రాగానే ధాన్యం తూకం వేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కో కాంటా నిర్వహించే చోట ఏడుగురు నుంచి 10 మంది వరకూ కూలీలు అవసరం. వారే ధాన్యం తూకం వేసి లారీల్లో లోడ్ చేస్తారు. ఇప్పటికే బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో వరి కోతలు చివరి దశకు చేరుకున్నాయి. అక్కడ కొనుగోళ్లు పూర్తయితే అక్కడ పని చేస్తున్న కూలీలు బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు తరలివచ్చే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు బాగలేకపోవడంతో కూలీలు తొందరగా వస్తేనే ధాన్యం తూకం వేగంగా సాగుతుందని రైతులు చెబుతున్నారు.మోర్తాడ్లోని కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కుప్పలు వరి కోతలు పూర్తి చేసి ధాన్యంను కుప్పగా పోసి వారం అవుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. కానీ తూకం వేయడం లేదు. అదేమిటి అంటే కూలీలు రాలేరు అంటున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. తూకం వెంటనే వేయాలి. – గోపిడి సత్యనారాయణ, రైతు, మోర్తాడ్ కూలీలను రప్పించాలని మధ్యవర్తిని కోరాం. కానీ బీహార్లో పండుగ ఉందని, అందుకే వారు రావడం ఆలస్యమవుతుందని చెబుతున్నారు. కూలీల సంఖ్య తక్కువగా ఉండటంతో అన్ని చోట్ల తూకం ప్రారంభించలేకపోతున్నాం. కూలీల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తున్నాం. రైతులు ఆందోళన చెందవద్దు. – కాశీరాం, సీఈవో, మోర్తాడ్ పీఏసీఎస్ -
రామేశ్వర్పల్లిలో ఒకరి ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్పల్లిలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. రామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన మల్లిని రమేష్ (35)కు అదే గ్రామానికి చెందిన అనిలతో పదహారేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య ముగ్గురు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో రమేష్ తాగుడుకు బానిసగా మారాడు. ఈనెల 24న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి కొద్దిసేపు ఉండి మళ్లీ బయటకు వెళ్లి, తిరిగి రాలేడు. గ్రామంలోని ఆపారం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని రమేష్గా గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భార్య కాపురానికి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
చికిత్స పొందుతూ ఒకరు..
జక్రాన్పల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. జక్రాన్పల్లి ఎ స్సై మాలిక్ రహమాన్ తెలిపిన వివరా లు ఇలా.. మండలంలోని అర్గుల్ గ్రా మానికి చెందిన ఆరెళ్ల కాశీరాం (60) ఈనెల 24న రాత్రి అర్గుల్ నుంచి హెచ్ పీ పెట్రోల్ పంపు వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో వెనుక నుంచి వచ్చిన బైక్ కాశీరాంను ఢీకొట్టింది. ఈ ఘటనలో కాశీరాంకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆర్మూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుమారుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బోధన్ పట్టణంలో.. బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని ఓ వ్యక్తి ఇటీవల ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కవిలేశ్వర్ శివకృష్ణ (35) ఫోటో స్టూడియోతోపాటు మిల్క్ డెయిరీ, బేకరీ బిజినెస్ చేసేవాడు. వ్యాపారాల నిమిత్తం అతడు మిత్రు ల వద్ద, బంధువుల వద్ద అప్పులు చేశాడు. దీంతో అప్పులు చెల్లించలేక జీవితంపై విరక్తి చెంది అతడు గురువారం రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే భార్య సంధ్యారాణి గమనించి అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని సీఐ వెల్లడించారు. ఖాజాపూర్లో జీపీ కార్మికుడు.. బోధన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన జీపీ కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. సాలూర మండలంలోని ఖాజాపూర్ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ శేరే నాగ్నాథ్(39) శుక్రవారం రాత్రి రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించుకునేక్రమంలో పక్కనున్న కాలువలో పడి గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపారు. అంత్యక్రియల కోసం గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.10వేల నగదు సహాయాన్ని ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మద్దిలేటి, పంచాయతీ కార్యదర్శి శైలజ మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు. -
ఐకేపీ సిబ్బందికి ఆడిట్పై అవగాహన
డొంకేశ్వర్(ఆర్మూర్): ఐకేపీ సిబ్బందికి శనివారం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆడిట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్తోపాటు కామారెడ్డి, నిర్మల్ జిల్లాల ఐకేపీ ఉద్యోగులు హాజరయ్యారు. హైదరాబాద్ సెర్ప్ నుంచి వచ్చిన చీఫ్ ఆడిట్ ఆఫీసర్ ఎంవీ క్రిష్ణ సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామ సంఘం, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యకు ఏవిధంగా చేస్తే సంస్థల ఆర్థిక పరిస్థితి, రికవరీ, అడ్వాన్స్లు వస్తాయో వివరించారు. ఆడిట్లో వచ్చిన అభ్యంతరాలను డీఆర్డీవోకు ప్రతి నెలా పంపాలని సూచించారు. మూడు జిల్లాల డీఆర్డీవోలు సాయాగౌడ్, విజయలక్ష్మి, సురేంధర్, ఏపీడీ మధుసూదన్, ఫైనాన్స్ డీపీఎం కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ ఇళ్ల’కు పూర్తి సహకారం అందిస్తాం
● బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ● జైతాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు బోధన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు పూర్తి సహకారం అందిస్తామని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లను శనివారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్మహతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ, ఐకేపీ, మెప్మా శాఖల ద్వారా రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ తోడ్పాటును అందిపుచ్చుకుని ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిని పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. గ్రామంలో పది మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్నారని, మరో 60 ఇళ్ల నిర్మాణాలు స్లాబ్ దశలో ఉన్నాయని తెలిపారు. గ్రామ ఆరోగ్య ఉపకేంద్రానికి విద్యుత్ సౌకర్యం, మహిళా శక్తి భవనానికి టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, గృహ నిర్మాణ శాఖ జిల్లా పీడీ పవన్ కుమార్, తహసీల్దార్ దత్తాద్రి, ఎంపీడీవో శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలోకి కొనసాగుతున్న నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను చేపడుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 22154 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి 4 వరద గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కాకతీయ కా లువ ద్వారా 4వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 4వేల క్యూసెక్కులు, సరస్వతి కా లువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మికాలువ ద్వారా 200 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు)అడుగులతో నిండుకుండలా ఉంది. డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని దత్తాపూర్లో రైతులు సాగు చేస్తున్న ఆర్డీఆర్–1200 రకం వరి పంటలను శనివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశీలించారు. క్షేత్ర సందర్శనలో భాగంగా వారు గ్రామాన్ని సందర్శించి ‘నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ సర్పంచ్ నాగరాజు సాగు చేసిన వరి పొలాన్ని పరిశీలించారు. ఆర్డీఆర్–1200 రకం వరి సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వచ్చిన దిగుబడిని విత్తనాలుగా కూడా ఉపయోగించవచ్చన్నారు. రైతులు అడిగిన సందేహాలకు శాస్త్రవేత్తలు సమాధానాలిచ్చారు. శాస్త్రవేత్తలు రమ్య రాథోడ్, చంద్రకళ, ఎంఏవో మధుసూదన్, ఆదర్శరైతు చిన్న భూమన్న ఉన్నారు. నిజామాబాద్అర్బన్: అమరుడైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని శనివారం బోఽ దన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఎవరైన పోలీసులపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. నుడా చైర్మన్ కేశవేణు, నాగేష్రెడ్డి, నరాల రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు. -
బాగ్దాద్లో ప్రమాదవశాత్తు ఆలూర్ వాసి మృతి
పెర్కిట్(ఆర్మూర్): ఇరాక్ దేశ రాజధాని బాగ్దాద్లో ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో ఆలూర్ మండల కేంద్రానికి చెందిన ఒకరు మృతిచెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. ఆలూర్కు చెందిన కుర్మె బీజ చిన్న రాజేష్(45) ఉపాధి నిమిత్తం బాగ్దాద్లోని ఒక నిర్మాణ కంపెనీలో కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. కాగా గురువారం బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో క్రేన్ ప్రమాదవశాత్తు రాజేష్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న అతడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి చేర్చేందుకు కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ఆలూర్కు చెందిన నాయకులు కళ్లెం భోజారెడ్డి రాజేష్ సంప్రదించారు. మృతుడికి భార్య సునీత, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెర్కిట్లో యాచకుడు.. ఆర్మూర్టౌన్: పెర్కిట్లోని హైవే కూడలి వద్ద ఓ యాచకుడు ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వివరాలు ఇలా.. మామిడిపల్లికి చెందిన బెల్లంపల్లి శివ(48) అనే యాచకుడు కొన్ని సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఆర్మూర్తోపాటు మామిడిపల్లి, పెర్కిట్ గ్రామాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి సమయంలో పెర్కిట్ హైవే కూడలిలోని సిమెంటు దిమ్మైపె నిద్రిస్తుండే వాడు. కాగా శుక్రవారం ఉదయం సిమెంటు దిమ్మె వద్ద మృతి చెంది ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు ధరించిన టీషర్టు సిమెంటు దిమ్మెకు గల ఇనుప చువ్వకు తట్టుకుని గొంతుకు బిగుసుకుపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుమారుడు విజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
మఠంరాళ్ల తండాలో ఆదిమానవుల ఆనవాళ్లు !
మీకు తెలుసా.. మాచారెడ్డి: మండలంలోని ఎల్లంపేట పరిధిలోని మఠంరాళ్ల తండాలో ఆదిమానవుల ఆనవాళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అందరినీ అబ్బురపరుస్తున్నాయి. గుహలో రాళ్లపై ఎరుపురంగులో చిత్రాలున్నాయి. ఈ తండా వాసి, కాకతీయ యూని వర్సిటీ పరిశోధక విద్యార్థి లింగం, మరో పరిశోధక విద్యార్థి జైనథ్కుమార్ ఈ రాతి చిత్రాలను చూసి బయటి ప్రపంచానికి పరిచయం చే శారు. అంతకుముందు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడైన కేపీఆర్ ఆ గుహ ను సందర్శించారు. గుహలో ఉన్న రాతిపనిము ట్లు, చిత్రాలను ఫోటోలు తీసుకువెళ్లారని స్థాని కులు తెలిపారు. అనంతరం కొత్త తెలంగాణ చ రిత్ర బృందం సభ్యులు రామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, సహాయకుడు నాగరాజుతోపాటు కవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకర్ లు ఆదిమానవులు వాడిన పాత రాతి యుగపు పనిముట్లను పరిశీలించారు. ప్రభుత్వం స్పందించి ఆదిమానవుల కాలం నాటి ఆనవాళ్లను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
గడ్డిమందు డబ్బాలో నీళ్లు పోసి తాగిన చిన్నారులు
● చికిత్స అందిస్తున్న వైద్యులు రాజంపేట:ఖాళీగా ఉన్న గడ్డిమందు డబ్బాలో చిన్నారులు నీళ్లు పోసి తాగిన ఘటన మండలంలోని అన్నారం తండాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. తండాకు చెందిన సరోజ–వికాస్ దంపతుల కుమారుడ్ విగ్నేష్ (6), శ్రీను–లలిత దంపతుల కుమారులు ప్రజ్వల్(6), శ్రీజన్(4) ముగ్గురు కలిసి శనివారం ఇంటి ముందు ఆవరణలో ఆడుకుంటున్నారు. ఈక్రమంలో ఓ ఇంటి ముందు పంట పొలానికి సంబందించిన గడ్డిమందు ఖాళీ డబ్బాలు కనిపించాయి. దీంతో ముగ్గురు చిన్నారులు ఆ డబ్బాలను తీసుకొని వాటిలో నీటిని పోసి తాగారు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి, వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. నిజామాబాద్అర్బన్: నగరంలోని గంజ్ మార్కెట్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. గంజ్ మార్కెట్లోని గోల్డ్ షాపు వద్ద మహిళ మృతదేహం ఉండటంతో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని, పరిశీలన చేశారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని పోలీసులు తెలిపారు. ఆమె వయస్సు సుమారు 45–50 ఏళ్లు ఉంటాయన్నారు. మెరున్ కలర్ ప్లవర్స్ డిజైన్ సారీ, ఎరుపు రంగు స్వెటర్ ధరించిఉందన్నారు. ఎడమ చేయిపైన గంగమ్మ అని పచ్చబొట్టు ఉందన్నారు. మృతురాలి వివరాలు ఎవరికై న తెలిస్తే 87126 59714 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ముస్తాపూర్ గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన సాయిలు శనివారం బైక్పై కామారెడ్డికి బయలుదేరాడు. ముస్తాపూర్ శివారులో అతడి బైక్, లింగంపేట వైపునకు వస్తున్న కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాయిలు కాలు విరిగినట్లు తెలిపారు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్అర్బన్: నగరంలో వినాయక్నగర్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. డిచ్పల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆకాష్ కొన్నిరోజులుగా వినాయక్నగర్లో అద్దెకు ఉంటున్నాడు. అతడు ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగించడం, ప్రేమ విఫలం కావడంతో ఇంట్లో గొడవలు జరగాయి. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది, శనివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కంటైనర్ బోల్తా డిచ్పల్లి: మండలంలోని ధర్మారం (బి) వద్ద ఓ కంటైనర్ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి పార్సిళ్ల లోడ్తో కంటైనర్ నిజామాబాద్కు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున మండలంలోని ధర్మారం (బి) వద్ద డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. -
38 బడులకు ఫైవ్స్టార్ రేటింగ్
కమ్మర్పల్లి: స్వచ్ఛతకు పెద్దపీట వేసేందుకు కేంద్రప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి అవగాహన కా ర్యక్రమాలను ప్రోత్సహిస్తోంది. ఈక్రమంలో స్వచ్ఛతలో మెరుగ్గా ఉండే బడులకు ‘స్వచ్ఛ ఏవమ్ హరి త విద్యాలయ రేటింగ్(ఎస్హెచ్వీఆర్)’ పేరుతో ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం జిల్లా లోని సుమారు 1812 ప్రభుత్వ, ప్రయివేటు బడులు ఆన్లైన్ ప్రక్రియలో పాల్గొనగా, 38 పాఠశాలలు ఫైవ్స్టార్ రేటింగ్ సాధించాయి. 6 విభాగాలు.. 60 ప్రశ్నలు.. స్వచ్ఛతకు సంబంధించిన ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుని అందులోనుంచి 60 ప్రశ్నలను ఆన్లైన్ ప్రక్రియలో ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రయివేట్ బడుల హెచ్ఎంలు తాగునీరు, మరుగుదొడ్లు, చేతు ల శుభ్రత, బడి ఆవరణ శుభ్రత నిర్వహణ, ప్రవర్తన మార్పు, మంచి అలవాట్లు, విద్యార్థుల నడవడిక, ఎకో క్లబ్ ఏర్పాటు లాంటి ఆరు విభాగాల్లోని 60 ప్రశ్నలకు ఆన్లైన్ ద్వారా సమాధానాలు సమర్పించారు. ఇందుకు అవసరమైన ఫోటోలు అప్లో డ్ చేశారు. వాటిల్లో మెరుగ్గా ఉండే వాటికి మార్కు ల ఆధారంగా కేంద్రం వాటిని ఎంపిక చేసింది. జాతీయస్థాయిలో 200 పాఠశాలలు.. జిల్లాల్లో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ప్రత్యేక బృందం భౌతిక పరిశీలన చేసి ప్రతి జిల్లా నుంచి 8 పాఠశాలల(గ్రామీణ ప్రాంతం నుంచి ఆరు, పట్టణ ప్రాంతం నుంచి రెండు)ను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి 20 పాఠశాలలను జాతీయస్థాయికి ఎంపిక చేశారు. జాతీయ స్థాయిలో 200 పాఠశాలలను ఎంపిక చేసి అవార్డు అందజేస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికై న పాఠశాలలకు దేశ రాజధాని ఢిల్లీలో అవార్డులను ప్రదానం చేస్తారు. రూ. 1లక్ష స్కూల్ గ్రాంట్గా ఇస్తారు. 200 ఉత్తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులను జాతీయస్థాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు ఎక్స్పోజర్ విజిట్(క్షేత్ర సందర్శన)కు తీసుకెళ్తారు. కోనాపూర్ జెడ్పీహెచ్ఎస్ స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్లో కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఫైవ్ స్టార్ రేటింగ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎకో క్లబ్ సభ్యులు ప్రతిరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతారు. ఉపాధ్యాయులు, గ్రామస్తుల నిరంతర సహకారంతో రేటింగ్ సాధ్యమైంది. రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక కావడానికి కృషి చేస్తున్నాం. – రామ్ప్రసాద్, హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, కోనాపూర్ స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్ ద్వారా విద్యార్థుల్లో పర్యావరణం పట్ల పూర్తి అవగాహన పెరుగుతుంది. ఫోర్, త్రీ స్టార్ రేటింగ్ పొందిన పాఠశాలలు లోపాలను సవరించుకొని వచ్చే విద్యా సంవత్సరంలో ఫైవ్ స్టార్ రేటింగ్ రావడం కోసం కృషి చేయాలి. జిల్లాలో 1812 పాఠశాలలు ఆన్లైన్లో స్వీయమదింపు చేసుకోగా, 38 పాఠశాలకు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చింది. – అశోక్, డీఈవో నిజామాబాద్ జిల్లాలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన బడులు ఇవే.. జెడ్పీహెచ్ఎస్ కోనాపూర్, గీతాంజలి హై స్కూల్ గోన్గొప్పుల, జెడ్పీహెచ్ఎస్ సుద్దపల్లి, ఎంపీపీఎస్ లింగాపూర్, ఎంపీయూపీఎస్ ఎంఎస్సీ ఫారం, ఎంపీపీఎస్ పత్తేపూర్, ఎంపీపీఎస్ మావండికలాన్, ఎంపీపీఎస్ వివతండా, ఎంపీపీఎస్ శాంతినగర్, కృషి హైస్కూల్ భీమ్గల్, జెడ్పీహెచ్ఎస్ దోన్కల్, జెడ్పీహెచ్ఎస్ కోమన్పల్లి, చైతన్య ఒకేషనల్ జూనియర్ కళాశాల బోధన్, లిటిల్ నేషనల్ స్కూల్ ఆర్మూర్, ఎంపీయూపీఎస్ అంబం(ఆర్), ప్రెసిడెన్సీ హైస్కూల్ నిజామాబాద్ నార్త్, విశ్వశాంతి విద్యానికేతన్ నిజామాబాద్, ఎంపీపీఎస్–గాంధీనగర్ సిర్నాపల్లి, కేజీబీవీ నందిపేట్, పీఎంశ్రీ టీజీడబ్ల్యూఆర్ఈఐఎస్ నిజామాబాద్, క్రిష్ణవేణి హైస్కూల్ భీమ్గల్, విజ్ఞాన్ హైస్కూల్ నిజామాబాద్, జెడ్పీహెచ్ఎస్ బోర్గాం(పి), జెడ్పీహెచ్ఎస్ మోస్రా, ఎంపీపీఎస్ జక్రాన్పల్లి, పీఎంశ్రీ టీజీఎంఎస్ ధర్పల్లి, పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ జానకంపేట్, ఎంపీపీఎస్ ఆరేపల్లి, ఎంపీపీఎస్ నవనాథపురం, ఎంపీపీఎస్ సుర్భిర్యాల్, నెహ్రూ యూపీఎస్ నిజామాబాద్, పీఎంశ్రీ టీజీఎంఎస్ సిరికొండ, శ్రీజాహ్నవి హైస్కూల్ బోధన్, వివేక్ యూపీఎస్ నిజామాబాద్ నార్త్, ఎంపీపీఎస్ చేంగల్, ఎంపీపీఎస్ మల్లాపూర్, ఎంపీపీఎస్ మినార్పల్లి, ఎంపీపీఎస్ ఏర్గట్ల. స్వచ్ఛతలో మెరుగైన ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లకు స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్ ప్రకటించిన కేంద్రం ఇటీవల ఆన్లైన్ ప్రక్రియలో పాల్గొన్న జిల్లాలోని 1812 పాఠశాలలు -
రాష్ట్రంలో పాలన పడకేసింది
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత నందిపేట్ (ఆర్మూర్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వ పాలన పడకేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మండలంలోని సీహెచ్ కొండూరు గ్రామంలోగల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం కవిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడిసి కొట్టుకుపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. జిల్లాలో పండుతున్న పంటలపై పాలన అధికారికి అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తొలి ఆశీర్వాదం జిల్లా ప్రజలు ఇవ్వాలని ఉద్దేశంతో జనం బాట ఇక్కడి నుంచి ప్రారంభించానని పేర్కొన్నారు. మాజీ జెడ్పీటీసీ ఎర్రం యమున ముత్యం, మనోజ్ రావు, నాయుడు రామారావు తదితరులు పాల్గొన్నారు. కవితకు ఘన స్వాగతం.. డిచ్పల్లి: మండలంలో జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు శనివారం ఘన స్వాగతం లభించింది. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆమె ఇందల్వాయి టోల్ప్లాజా మీదుగా బయలుదేరి మధ్యాహ్నం బర్ధిపూర్ శివారులోని బైపాస్ రోడ్డు వద్దకు కవిత చేరుకున్నారు. జాగృతి మహిళా కార్యకర్తలు బతుకమ్మలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. యువకులు బైక్ ర్యాలీగా ముందు రాగా వాహనంలో ఆమె జిల్లా కేంద్రానికి తరలి వెళ్లారు. -
నా ఓటమి ఓ కుట్ర..
నిజామాబాద్అర్బన్: ‘ఇరవై ఏళ్లుగా కేసీఆర్ కోసం.. టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశా.. కుట్ర చేసి నన్ను బయటికి పంపారు. ఎంపీ ఎన్నికల్లో నా ఓటమి ఓ కుట్రనా? కాదా? నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలె. ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చా.. ఇది నా గడ్డ. ఎప్పటికై నా ఈ గడ్డలోనే కలిసిపోతా..’ అని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శనివారం ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆమెకు జాగృతి నాయకులు ఇందల్వాయి వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని కవిత ఇంటి వరకు తెలంగాణ విద్యార్థఇ సంఘం నాయకుడు శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఇంటి వద్ద అభిమానులు, మహిళలనుద్దేశించి కవిత ప్రసంగించారు. అన్ని భావజాలాలకు మద్దతునిస్తూ ముందున్న జిల్లా మనదని, బీఆర్ఎస్ నుంచిమొదటిసారి నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ను గెలిపించారని గుర్తుచేశారు. మీ బిడ్డనైన తనను పార్లమెంట్కు పంపించారని, గతంలో బీఆర్ఎస్ పార్టీని దీవించి అన్ని సీట్లు గెలిపించారన్నారు. తాను బీ ఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయలేదని, కానీ కుట్ర చేసి బయటికి పంపించారని ఆవేదన వ్యక్తంచేశారు. రూ. 50 వేల పరిహారం ఇచ్చే వరకు ఉద్యమిస్తాం.. నవీపేట: గోదావరి తీర ప్రాంత ముంపు బాధిత రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో భాగంగా నవీపేట మండలం యంచ గ్రామంలో శనివారం సాయంత్రం ముంపు రైతులతో ఆమె సమావేశమయ్యారు. అనంతరం కవిత మాట్లాడుతూ చేతికొచ్చిన పంట మునిగి నెలలు గడుస్తున్నప్పటికీ ఇంత వరకు ఎలాంటి పరిహార చెల్లింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, రైతులతోపాటు ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఇక్కడి రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. 9 గ్రామాలలో 5 వేల ఎకరాలు నష్టపోతే అధికారులు తప్పుడు లెక్కలు చూపారని, కలెక్టర్ చొరవ తీసుకుని మరో సారి సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత రైతులకు రూ. 50 వేల పరిహారం చెల్లించేవరకు ఉద్యమిస్తామన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. అనంతరం రూ. 50 లక్షల ఎమ్మెల్సీ నిధులతో చేపట్టిన విఠలేశ్వరాలయం సీసీ రోడ్డును పరిశీలించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి, బీఆర్ఎస్ నాయకులు నర్సింగ్రావ్, న్యాలకంటి అబ్బన్న, దొంత ప్రవీణ్, లాలూయాదవ్, సంజీవ్, కృష్ణమోహన్రావ్, నాగారావ్, శ్యామ్, నరహరి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో మాట్లాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితయంచలో మాట్లాడుతున్న కల్వకుంట్ల కవితప్రభుత్వం సిగ్గుపడాలె.. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, హాస్టళ్లలోని విద్యార్థులను ఎలుకలు కొరకడం, విద్యార్థినులపై లైంగిక దాడులు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. విద్యార్థులకు కనీస భద్రత, ఆహారం పెట్టలేని రేవంత్రెడ్డి ప్రభుత్వం సిగ్గుపడాలని విమర్శించారు. సరైన విద్యా, వైద్యం, ఉద్యోగాలు అందించలేకపోతున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి పరిస్థితి దయనీయంగా మారిందని, దీనిపై జిల్లాకు చెందిన పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్గౌడ్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న రూ.2500 పెన్షన్ కోసం పిడికిలి బిగించి కొట్లాడుదామని పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లలో కొంత సాధించుకున్నాం.. కానీ అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి అమరవీరుడి కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు. జనంబాటలో భాగంగా మేధావులు, విద్యార్థులతో సహా అన్నివర్గాలతో మాట్లాడతానని తెలిపారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు పాల్గొన్నారు. ఎప్పటికై నా ఈ గడ్డలోనే కలిసిపోతా.. కుట్ర చేసి బయటికి పంపారు.. మీ ఆశీర్వాదం కోసం వచ్చా.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘జాగృతి జనంబాట’ ప్రారంభం -
మత్తు పదార్థాల నిరోధానికి కృషి
నిజామాబాద్అర్బన్: మాదక ద్రవ్యాలు, మత్తు ప దార్థాల నిరోధానికి సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ అధ్యక్షతన నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సీపీ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులు, కమిటీ ప్రతినిధులు పాల్గొని, జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై చర్చించా రు. కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా, వినియోగం పెనుసవాలుగా మారిందని అన్నారు. యువత, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న మత్తు పదార్థాలు రవాణా, వినియోగం జరుగకుండా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగాల బాధ్యత అని భావించకుండా సమాజంలోని వివిధ వర్గాల వారందరూ మా దకద్రవ్యాల నిరోధానికి తమవంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల రవాణా, వినియోగం గమనిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. టో ల్ ఫ్రీ నెంబర్ 14446కు కాల్ చేసి సమాచారం తెలుపవచ్చని సూచించారు. అనంతరం నషా ముక్త్ భా రత్ అభియాన్ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సామూహిక ప్రతిజ్ఞ కోసం రూపొందించిన క్యూఆర్ కోడ్ను విడుదల చేశారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిణి రసూల్ బీ, డీఐఈవో రవికుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పాల్గొన్నారు. -
వర్షం.. రైతు ఆగం
రెంజల్ శివారులో తడిసిన ధాన్యం కుప్ప నుంచి వర్షపు నీటిని తొలగిస్తున్న రైతులుఎడపల్లి మండలంలోని మంగల్పాడ్ శివారులో వడ్ల కుప్పల చుట్టూ వర్షపు నీరుబోధన్/ రెంజల్/ జక్రాన్పల్లి: చేతికొచ్చిన పంట విక్రయించే దశలో వర్షం రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జిల్లాలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వరి నూర్పిళ్లు పూర్తి చేసుకొని ఖాళీ ప్రదేశాలు, కొనుగోలు కేంద్రాల ఆవరణలో ఆరబోసిన ధాన్యం పలుచోట్ల వర్షానికి తడిసింది. బోధన్, సాలూర, ఎడపల్లి, నవీపేట, రెంజల్ మండలాల్లో వర్షం కురిసింది. మూడు, నాలుగు రోజులుగా ఆరబెట్టిన ధాన్యం ఒక్క రోజులో తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్, వివేక్నగర్, పడకల్ తండా తదితర గ్రామాల్లో వరి పంట నేలవాలింది. రోడ్లపై, కల్లాల్లో ఆరబోసిన మక్కలు, వడ్లు తడిసిముద్దయ్యాయి. తడిసిన ధాన్యం, మక్కలను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తడిసిన వడ్లు, మక్కలు -
పొరపాట్లు లేకుండా ఎస్ఐఆర్ చేపట్టాలి
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్అర్బన్: ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి శనివారం వీసీలో కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్వోలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు. అన్ని కేటగిరీలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల 33 లక్షల ఓటర్లను మ్యాపింగ్ చేశామన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ బీఎల్వోలు, బీఎల్వో సూపర్వైజర్లకు శిక్షణ ఇస్తామని తెలిపారు. మొదట కేటగిరి ఏ ఓటరు జాబితాను బీఎల్వో యాప్ ద్వారా నిర్ధారించిన తర్వాత కేటగిరి సీ, డీలను కేటగిరి ‘ఏ’ కు లింక్ చేస్తామన్నారు. పొరపాట్లకు తావు లేకుండా, దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో 50 శాతం మ్యాపింగ్ పూర్తయ్యిందని, ప్రతి రోజూ ఎస్ఐఆర్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, హౌసింగ్ పీడీ పవ న్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వా ల్, సిబ్బంది సాత్విక్, జితేందర్ పాల్గొన్నారు. -
ఈ వంటలక్కలు
ట్రెండ్ సెట్టర్స్..ఫంక్షన్ ఏదైనా.. ఎన్ని వేల మందికై నా సరే.. మాంసాహారమైనా.. కూరగాయలైనా ఒంటిచేత్తో వండేస్తామంటూ ముందుకొస్తున్నారు వంటలక్కలు. కుటుంబ పోషణ కోసం పెట్టుబడి లేకుండా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నారు. వంటలు చేస్తూ భోజనప్రియుల మన్ననలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్న ఆర్మూర్ అతివలపై ఆదివారం ప్రత్యేక కథనం.. ఫంక్షన్ హాల్లో వంటలు చేస్తున్న పెద్దగొండ పుష్పఆర్మూర్: పెళ్లి విందు.. పుట్టినరోజు పార్టీ.. శ్రీమంతం.. నామకరణ మహోత్సవం..గుళ్లలో సత్రాలు.. ఏదైనా సరే.. వంటలు రుచికరంగా ఉన్నాయని నలుగురూ అన్నారంటే ఆ ఫంక్షన్ సక్సెస్ అయినట్లే. నోరూరించే వంటకాలు చేయడంలో ఆర్మూర్ ప్రాంతానికి చెందిన మగవారు సిద్ధహస్తులుగా ఉండేవారు. క్రమంగా వారు కనుమరుగవుతున్నారు. అయితే, ఇటీవల పాకశాస్త్ర ప్రవీణ్యులుగా తెరపైకి వస్తున్నారు కొందరు ఆర్మూర్ మహిళలు. సర్వం పనులు.. గ్రూపులో ఇద్దరే ఆర్మూర్ ప్రాంతంలో సుమారు 40 మందికి పైగా మహిళలు వంటలు చేయడాన్ని స్వయం ఉపాధిగా ఎంచుకున్నారు. యాదృచ్ఛికంగా ఎవరికి వారే ఇద్దరు మహిళల చొప్పున 20 గ్రూపులు ఏర్పడ్డాయి. వండే వంటకాలు, భోజనం చేసే వారి సంఖ్య మేరకు ఇద్దరు మహిళలే ధర మాట్లాడుకొని ఫంక్షన్ హాళ్లు, ఇళ్లు, గుళ్లలో వంటలు చేస్తూ ఆత్మగౌరవంతో నిలుస్తున్నారు. వంటకం రుచి విషయంలో సైతం నలభీములను మించి పోతున్నారు. మగవారు వంట వాళ్లుగా వస్తే వారికి ఒక అసిస్టెంట్తోపాటు కూరగాయలు కోసేందుకు, వంట పాత్రలు శుభ్రం చేయడానికి, వడ్డించడానికి క్యాటరింగ్ వారు వేర్వేరుగా కూలీలను తీసుకొని రావడంతో ఫంక్షన్ చేసే వారికి ఆర్థిక భారమయ్యేది. ఈ జంట వంటలక్కలు మాత్రం తాము మాట్లాడుకున్న ధరలో వంట చేసేముందు పాత్రలను శుభ్రం చేయడం, కూరగాయలు కోసుకోవడం, వంట చేయడం, భోజనాలు పూర్తయిన తర్వాత పాత్రలను యథావిధిగా కడిగి వెళ్లడం, అవసరమైతే వడ్డించడం కూడా చేస్తున్నారు. తక్కువ ధరలో వంటలక్కల సేవలు అందుబాటులో ఉండటంతో అందరూ వీరినే సంప్రదిస్తున్నారు. వీరి సేవలు కేవలం ఆర్మూర్ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా క్రమంగా విస్తరిస్తున్నాయి. చుట్టు పక్కల పట్టణాలు, గ్రామాలతోపాటు హైదరాబాద్లో స్థిరపడ్డ ఈ ప్రాంతం వారు సైతం తమ ఇళ్లలోని ఫంక్షన్లకు వంట చేసేందుకు వీరిని ప్రత్యేకంగా పిలిపించుకుంటున్నారు. కేవ లం మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే వీరికి వంటల కాంట్రాక్టులు లభిస్తున్నాయి. పాలకుల నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందకున్నా స్వశక్తితో ఉపాధి పొందుతూ శెభాష్ అనిపించుకుంటున్నారు. స్వశక్తితో స్వయం ఉపాధి ఫంక్షన్లలో వంటలు చేస్తూ రాణిస్తున్న అతివలు నలభీములను తలపించే వంటల రుచి పెద్ద వంటలన్నీ ఒంటి చేత్తో చక్కబెడుతూ.. -
75 వేలకుపైగా పశువులకు టీకాలు
● జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రోహిత్రెడ్డి మోపాల్(నిజామాబాద్రూరల్): జిల్లాలోని 1.80 లక్షల గేదెలు, ఆవులు, దూడలు, లేగలకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కొనసాగుతోందని, ఇప్పటి వరకు 75 వేలకుపైగా పశువులకు టీకాలు వేసినట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రోహిత్రెడ్డి పేర్కొన్నారు. మోపాల్ మండలం ముదక్పల్లిలో నిర్వహిస్తున్న గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోహిత్రెడ్డి మాట్లాడుతూ పాడి రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిజామాబాద్ను గాలికుంటువ్యాధి రహిత జిల్లాగా మార్చాలన్నారు. టీకాలతో పశువులు ఆరోగ్యంగా ఉండి పాల దిగుబడి, మాంసం దిగుబడి పెరుగుతుందన్నారు. టీ కాల పంపిణీ పూర్తిగా ఉచితమని, ఎవరైనా సిబ్బంది క్షేత్రస్థాయిలో డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. నవంబర్ 14 వరకూ టీకాల పంపిణీ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శిరీష, లైవ్స్టాక్ అసిస్టెంట్ సురేశ్, గోపాలమిత్రలు రాజశేఖర్, రజనీకాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. మక్క కొనుగోలు పరిమితి పెంచండి ● ఎకరానికి 28 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతివ్వండి ● ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ డొంకేశ్వర్(ఆర్మూర్): ఖరీఫ్లో పండించిన మొక్కజొన్న పంట కొనుగోలుపై విధించిన పరిమితిని ఎత్తివేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎకరానికి 28 క్వింటాళ్లు కొనేలా అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలు త్వరగా వస్తే మక్క రైతులకు ఊరట కలుగనుంది. ఖరీఫ్ సీజన్లో రైతులు 52,093 ఎకరాల్లో మక్కను సాగు చేయగా 1.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో మక్కలు కొనుగోలు చేసే బాధ్యత మార్క్ఫెడ్కు అప్పగించగా ప్రభుత్వం ఇటీవల కొనుగోళ్లను ప్రారంభించింది. 32 సెంటర్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 2,500 మెట్రిక్ టన్నుల వరకు మక్కలను కొనుగోలు చేశారు. అయితే ఎకరానికి 18.5 క్వింటాళ్లు మాత్రమే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీంతో రైతులు పండించిన పూర్తి పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎకరానికి 38–40 క్వింటాళ్ల మక్కలు ది గుబడి రాగా ప్రభుత్వం ఎకరానికి 18.5 క్వింటాళ్లే తీసుకోవడంతో మిగిలిన పంటను వ్యాపారులకు విక్రయించాల్సి వచ్చింది. ఈ సమస్యను రైతులు కలెక్టర్తోపాటు వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారుల దృష్టికి తె చ్చారు. సీలింగ్ లేకుండా పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని కోరారు. రైతుల మేలుకోరి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం త్వర గా అనుమతివ్వాలని కోరుతున్నారు. -
మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మద్యానికి బానిసైన ఓ యువకుడు జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగిరెడ్డిపేట మండలం తాండూర్లో చోటు చేసుకుంది. ఎస్సై భార్గవ్గౌడ్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాండూర్కు చెందిన దాకమొల్లి సంగయ్య, ఎల్లవ్వకు ఇద్దరు కుమారులు నాగరాజు, కుమార్(18) ఉన్నారు. పెద్దకుమారుడైన నాగరాజు హైదరాబాద్లో ఉంటుండగా చిన్నాకుమారుడు కుమార్ గ్రామంలో తల్లితండ్రులతో కలిసి ఉంటున్నాడు. కొంత కాలంగా కుమార్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వ్యవసాయ కళాశాల జిల్లాకు వరం
● ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి సుభాష్నగర్: అన్నపూర్ణ జిల్లాగా పేరున్న నిజామాబాద్కు వ్యవసాయ కళాశాల వరమని, ఈ కళాశాల ఏర్పాటుతో వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చినట్లు అవుతోందని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకు వ్యవసాయశాఖ మంజూరు చేసినందుకుగాను రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ఆయన గురువారం హైదరాబాద్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందులోభాగంగానే జిల్లాకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే జిల్లాలో అన్నదాతలు పండిస్తున్న పసుపు, వరి, సోయా, మొక్కజొన్న, ఎర్రజొన్నలు, తదితర పంటలు వేరే జిల్లాలు, రాష్ట్రాలతోపా టు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా రైతులు, విద్యార్థులు రుణపడి ఉంటారని మంత్రికి తెలిపారు. -
పసుపు రైతుల అభ్యున్నతికి విజ్ఞానయాత్రలు అవసరం
సుభాష్నగర్: పసుపు రైతుల అభ్యున్నతికి విజ్ఞానయాత్రలు ఎంతో అవసరమని జాతీయ పసుపు బో ర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదే శ్ రాష్ట్రంలోని గుంటూరు, నంద్యాల జిల్లాల నుంచి రైతులు పసుపు రైతుల నైపుణ్యాల అభివృద్ధిపై వి జ్ఞాన యాత్రలో భాగంగా నగరంలోని జాతీయ ప సుపు బోర్డు కార్యాలయాన్ని గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు.పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉత్పత్తి వ్యయం, మార్కెట్లో ధరల అస్థిరత, పంట సంరక్షణలో ఎదురయ్యే సవాళ్లు వంటి అంశా లపై చర్చించి, వాటికి సరైన పరిష్కార మార్గాలపై చర్చించారు. అనంతరం పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు రైతుల సంక్షేమం కోసం బోర్డు నిరంతరం పని చేస్తుందన్నారు. శాసీ్త్రయ పద్ధతుల్లో పసు పు పంట ఉత్పత్తిని పెంచాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. పసుపు పరిశోధన కేంద్రం సందర్శన కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా మహానంది ప్రాంత రైతులు గురువారం సందర్శించారు. పరిశోధన స్థానంలో చేపడుతున్న పరిశోధనలు, పసుపు రకాలు, యంత్రాల గురించి రైతులకు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ వివరించారు. పసుపు సాగు గురించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. పసుపు రకాలు, కుర్కుమిన్ శాతం, దిగుబడి, పంట కాలపరిమితి, యాజమాన్య పద్ధతులను వివరించారు. సాగవుతున్న వివిధ రకాల పసుపు పంటలను, సాగుకు వినియోగించే యంత్రాలను పరిశీలించి, వాటి పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది, రైతులు ఉన్నారు. -
పెళ్లికి ముందే కల్యాణలక్ష్మి అందిస్తే బాగుంటుంది
నస్రుల్లాబాద్ : పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ముందే కల్యాణలక్ష్మి సాయం అందిస్తే బా గుంటుందని, తల్లిదండ్రులకు అప్పుల బా ధ తప్పుతుందని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో లబ్ధిదారులకు పోచారం గురువారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పె ళ్లికి మందే కల్యాణలక్ష్మి చెక్కులు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తాను తీసుకెళ్తానని, అధికారులు సైతం ఉ న్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూ చించారు. వర్ని మండలానికి చెందిన 40 మందికి, నస్రుల్లాబాద్ మండలానికి చెందిన 26 మందికి ఆయన చెక్కులను అందజేశా రు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజు, తహసీల్దార్ సువర్ణ, ఏఎంసీ చైర్మన్ శ్యామల, నాయకులు పెర్క శ్రీనివాస్, పాల్త్య విఠల్, రాము, ప్రతాప్, పు రం వెంకటి, కంది మల్లేశ్, మంగలి సాయి లు, సక్రు, పవన్గౌడ్, ప్రభాకర్రెడ్డి తదితరు లు పాల్గొన్నారు. పంట మొత్తాన్ని కొనుగోలు చేసేలా చూస్తాం డొంకేశ్వర్(ఆర్మూర్): రైతులు పండించిన మొక్కజొన్న పంటను పూర్తిగా కొనుగోలు చే సేలా ప్రభుత్వాన్ని కోరుతామని జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవిందు అన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని మక్కల కొ నుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. నాణ్యమైన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూ చించారు. పూర్తి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఎకరానికి 18 క్వింటా ళ్ల 50 కిలోలు మాత్రమే తీసుకుంటున్నారని రైతులు డీఏవో దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఏవో మధుసూదన్ తదితరులు ఉన్నారు. బీజేపీ నేతల పరామర్శ.. సుభాష్నగర్: నగరంలోని అమరుడైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పరామర్శించారు. ప్రమోద్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. అంతకుముందు ప్రమోద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, నాయకులు బీఆర్ శివప్రసాద్, పద్మారెడ్డి, మాస్టర్ శంకర్, కలిగోట్ గంగాధర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు నగరానికి రానున్న డివిజనల్ రైల్వే మేనేజర్ నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ రైల్వే స్టేషన్కు శుక్రవారం రైల్వే డివిజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ రానున్నారు. రైల్వే స్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగుతున్న పనులపై విలేకరులతో సమావేశం నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (ఐపీఈ, ఐపీసీహెచ్) 7, 9వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు తెలంగాణ యూనివర్సి టీ వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. -
కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి
● ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తహసీల్దార్లదే బాధ్యత ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● జిల్లా అధికారులతో వీసీలో సమీక్షనిజామాబాద్అర్బన్ : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తహసీల్దార్లదే బాధ్యతని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల పనితీరుపై గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లు, ఏపీఎంలు, ఏ వోలు, ఏఈవోలు, ఐకేపీ కేంద్రాల ఇన్చార్జులు వీసీ లో పాల్గొనగా, మోస్రా తహసీల్దార్ కార్యాలయం నుంచి వీసీలో ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. ధా న్యం కొనుగోళ్ల కోసం జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ కలెక్టర్ను అభినందించారు. రుద్రూర్ మండలంలో కొన్ని కొనుగోలు కేంద్రాలకు రైస్మిల్లులతో అనుసంధానం చేయలే దని ప్రస్తావించగా, గురువారం టాగింగ్ చేశామని కలెక్టర్ తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. సంబంధిత శాఖలతో సమన్వయాన్ని పెంపొందించుకుని ధాన్యం విక్రయంలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం ఆరబెట్టుకునేందుకు వీలుగా అనువైన ఖాళీ స్థలాలను గుర్తించి రైతులకు తెలియజేయాలన్నారు. వచ్చే రెండ్రోజు ల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని నిర్దేశిత ప్రాంతాలలో ధా న్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని ఆదేశించా రు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్రెడ్డి, మార్కెటింగ్ ఏడీ గంగుబాయి, డీసీవో శ్రీనివాస్, డీఏవో గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం
నిజామాబాద్అర్బన్: ఇటీవల నేరస్తుడు రియా జ్ చేతిలో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నా రు. నగరంలోని బాధిత కుటుంబాన్ని గురువా రం వారు పరామర్శించారు. కాంగ్రెస్ తరఫు న రూ.2లక్షలు అందించారు. ఈసందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయగలం కానీ, మానసికంగా జరిగిన గాయాన్ని ఎవరు పూడ్చలేదన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు నివారించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. -
నియామకం సక్రమమేనా?
నిజామాబాద్నాగారం: ఆరోగ్య శ్రీ ట్రస్ట్లో ఇటీవల డిస్ట్రిక్ మేనేజర్ పోస్టును కనీస నిబంధనలు పాటించకుండా భర్తీ చేసినట్లు ఆరోపణ లు వస్తున్నాయి. నియామక తతంగాన్ని రహస్యంగా నడపడంతో పోస్టు భర్తీ సక్రమంగానే జరిగిందా అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. మొదట రెండు.. తర్వాత నాలుగు.. నిజామాబాద్ డీఎం పోస్టు ఖాళీ ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్లోని ఆరో గ్యశ్రీ ట్రస్ట్కు ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. వారి లో అర్హత ఉన్న ఒకరితో పోస్టు భర్తీ చేయాలని నిజామాబాద్ కలెక్టరేట్కు ట్రస్ట్ నుంచి మే నెలలో ఆదేశా లు వచ్చాయి. అయితే కలెక్టరేట్లో పని చేసి రిటైర్డు అయిన ఉద్యోగి ఒకరు తనకు సంబంధించిన వారి కి పోస్టు ఇవ్వడానికి చక్రం తిప్పినట్లు సమాచారం. దీంతో భర్తీ ప్రక్రియను 5 నెలల వరకు పెండింగ్లో పెట్టి మరో రెండు దరఖాస్తులను తీసుకున్నారు. మొత్తం 4 దరఖాస్తులు ఉండగా, అభ్యర్థులకు కనీసం రాత పరీక్ష లేకుంటే, ఇంటర్వ్యూ అయినా చేపట్టి డిస్ట్రిక్ట్ కమిటీ నియామకం చేయాల్సి ఉంటుంది. కాగా ఎవ్వరిని కూడా పిలిచిన సందర్భాలు లేవు. ఏ విషయాలు పరిగణనలోకి తీసుకొని నియామకం పూర్తి చేశారో కూడా తెలియడంలేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఆరోగ్య శ్రీ ఇన్చార్జి కో–ఆర్డినేటర్ స్వప్నను ఫోన్లో సంప్రదించగా, డీఎం పోస్టును డిస్ట్రిక్ట్ కమి టీ ద్వారా కలెక్టరేట్లోనే భర్తీ చేశామన్నారు. ఏదైనా ఉంటే కలెక్టర్ సీసీతో మాట్లాడి చెబుతానన్నారు.● ఇటీవల ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో జిల్లా మేనేజర్ పోస్టు భర్తీ ● కనీస నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు -
ఉపాధ్యాయుల లెర్నింగ్ టూర్!
● వినూత్న విద్యాబోధనపై అధ్యయనం ● ఐదు రోజుల పర్యటన ● 16 మంది దరఖాస్తు ● జిల్లా నుంచి ముగ్గురి ఎంపిక ఖలీల్వాడి: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను ప్రవేశపెట్టేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యతను పెంపొందించేలా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలను, విద్యాశాఖ అధికారులను విదేశాలకు పంపించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కన్వీనర్ డాక్టర్ నవీన్ నికోలస్ టీచర్లకు ఫారిన్ టూర్కు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఇటీవల జారీ చేశారు. ‘గ్లోబల్ లెర్నింగ్ టూర్’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 160 మందిని ఎంపిక చేసి నాలుగు బృందాలుగా విభజించి సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్ వంటి దేశాలకు నవంబర్లో పంపించనున్నారు. ఎంపికై న వారు ఆయా దేశాల్లో ఐదు రోజులు విద్యా విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీంతో తెలంగాణలో ఎడ్యుకేషన్లో సమూల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు విద్యావేత్తలు భావిస్తున్నారు. జిల్లా నుంచి ముగ్గురిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇందులో ఒకరు ప్రధానోపాధ్యాయులు, మరొకరు స్కూల్ అసిస్టెంట్, ఇంకొకరు ఎస్జీటీ ఉంటారు. వీరి దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ పరిశీలించి, జాబితాను సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. నాలుగు దేశాల్లో.. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ హై స్కూళ్లు 1156 ఉండగా ఇందులో 5292 మంది హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు పని చేస్తున్నారు. ఎంపికై న వారు రాష్ట్రస్థాయి బృందంతో కలిసి జపాన్, ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం దేశాల్లో పర్యటించి అక్కడి బోధన విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఎంపిక ఇలా.. బోధనలో కనీసం పదేళ్ల అనుభవం, 55 ఏళ్ల లోపు, పాస్పోర్టు కలిగి ఉన్నవారిని కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సీనియర్ అధికారులు అర్హులైన ముగ్గురిని ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే టీచర్లను వాళ్ల మూడేళ్ల పనితీరును జిల్లా కమిటీ పరిశీలిస్తుంది. అంతేకాకుండా ఈ ఎంపికయ్యే టీచర్లు విద్యార్థులను స్కూల్లో చేర్పించడానికి తీసుకున్న చొరవ, అభ్యసనకు సామర్థ్యం, వినూత్న బోధన పద్ధతులు, స్కూల్ అభివృద్ధి, ఇంగ్లిష్లో మాట్లాడటం, గతంలో పొందిన పురస్కారాలు కలిగిన టీచర్లను జిల్లా కమిటీ పరిగణలోకి తీసుకుంటుంది. కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ.. జిల్లా నుంచి ఫారిన్ లెర్నింగ్ టూర్కు బుధవారం చివరి తేదీ కావడంతో హెచ్ఎంలు ముగ్గురు, ఎస్జీటీలు ఇద్దరు, స్కూల్ అసిస్టెంట్లు పదకొండు మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఇందులో ముగ్గురిని ఎంపిక చేస్తుంది.మూడు నెలలకు ఒకసారి టీచర్లను విదేశాలకు పంపిస్తే బాగుంటుంది. అక్కడి విద్యా విధానాన్ని ఇక్కడి పరిస్థితులకు అనుకూలంగా మల్చుకొని విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఫారిన్ లెర్నింగ్ టూర్ను ఏర్పాటును స్వాగతిస్తున్నాం. ఇది ప్రతి పాఠశాల నుంచి టీచర్లు వెళ్లే విధంగా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది. – శ్రీకాంత్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎంపికై న టీచర్లు ఫారిన్ విద్యా విధానాలు, అక్కడి బోధన పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా కొత్త విషయా లు తెలుసుకుంటారు. దీంతో ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా వాటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంటుంది. – యానం విజయ్, ఎస్సీ, ఎస్టీ యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు


