breaking news
Nizamabad District News
-
ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించాలి
● డీఎంహెచ్వో డాక్టర్ రాజ శ్రీ సుభాష్నగర్: ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించేలా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో బి రాజ శ్రీ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఐ దేళ్లలోపు చిన్నారుల మరణాలపై డీఎంహెచ్వో కా ర్యాలయంలో ఆమె శుక్రవారం సమీక్ష నిర్వహించా రు. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, మెడికల్ నాలెడ్జ్ను పెంచుకుంటూ వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్వో సూచించారు. సీ్త్రలు, చిన్న పిల్లల్లో ప్రమాదకర లక్షణాలను ముందే గుర్తించాలని, బా లింతలను క్రమం తప్పకుండా ఇంటి వద్ద పర్య వేక్షించాలన్నారు. సీపీఆర్పై అందరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రతి గర్భిణి, ప్రతి బాలింతను పర్యవేక్షించి తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలన్నారు. ప్రథమ చికిత్స, ఎమర్జెన్సీ కిట్ అందరి వద్ద అందుబాటులో ఉండాలన్నారు. బిడ్డకు, బిడ్డకు మ ధ్య వ్యత్యాసం పాటించేలా అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. శాశ్వత, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై కౌన్సెలింగ్ చేయాలన్నా రు. విధుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రాణాలను కాపాడే బాధ్యత అందరిపై ఉంద న్నారు. పిల్లల వైద్య నిపుణులు శ్రీకాంత్, నవీన్ మాట్లాడుతూ చిన్నపిల్లలు ప్రతిరోజు కనీసం 20 గ్రాముల బరువు పెరగాలన్నారు. సరిపడా నిద్ర లే కపోయినా, పాలు తాగకపోయినా, మూత్రం చేయకపోయినా వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. సీ్త్ర వైద్య నిపుణులు నిషాద్, అశ్విని మా ట్లాడుతూ గర్భిణులకు సీబీపీ, హిమోగ్లోబిన్, బీపీ రికార్డు, ఎత్తు, బరువు పరీక్షించాలని తెలిపారు. సమావేశంలో డీఐవో ఎం అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వోలు అశ్వినీ, సమత, పీవోఎంసీహెచ్ శ్వేత, సీడీపీవోలు, డీహెచ్ఈలు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, మనోహర్, మెడికల్ ఆఫీసర్లు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. -
సరికొత్త అధ్యాయం
నగర పాలనలోసుభాష్నగర్: నిజామాబాద్ నగర పాలక సంస్థ లో సరికొత్త అధ్యాయం మొదలైందని, నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మేయర్ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. మేయర్గా ఉమారాణి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం కార్పొరేషన్లోని మేయర్ ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నగరంలో ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చేలా చర్యలు చేపడుతామన్నారు. పార్టీలకు అతీతంగా అందరి సలహాలు, సూచనలతో నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. తనపై నమ్మకముంచి మేయర్ పదవి బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రివర్గం, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యఅతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన మేయర్ ఉమారాణి, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్ను వారు అభినందించారు. అవినీతి రహిత పాలనే లక్ష్యం..కార్పొరేషన్ను అభివృద్ధి పథంలో నడిపిస్తాం.. రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొస్తాం మేయర్గా బాధ్యతలు స్వీకరించిన కూరగాయల ఉమారాణి వెలుగులు నింపే మార్పు.. -
చాన్స్.. ప్లీజ్!
● నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల ప్రయత్నాలు ● మార్చి 15లోగా పదవుల పంపకాలు పూర్తిచేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం గ్రీన్సిగ్నల్ ● సహకార పదవులు సైతం నామినేటెడ్ విధానంలో ఇస్తారనే వార్తలు ● ఇప్పటికే అధిష్టానానికి నివేదిక ఇచ్చిన మీనాక్షి నటరాజన్ ● డాక్టర్ కవితారెడ్డికి రాష్ట్ర కార్పొరేషన్ పదవి! ● నామినేటెడ్ రేసులో ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నామినేటెడ్ పదవుల పందేరానికి కాంగ్రెస్ అధినాయకత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మార్చి 15లోగా పదవులను భర్తీ చేయాలంటూ పార్టీ నాయకత్వం సూచించినట్లు తెలియడంతో ఆశావహులు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదవుల భర్తీ ఆలస్యం కావడంతో ముఖ్య నాయకుల్లో నిరాశ నెలకొందంటూ సీఎం, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడితో అగ్రనేతల సమావేశానికి ముందే మీనాక్షి నటరాజన్ నివేదిక ఇచ్చారు. పదవుల పంపకానికి అనుమతి వచ్చినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ చెప్పడంతో జిల్లాకు చెందిన ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా సహకార సంస్థల పదవులు సైతం నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆశావహుల సంఖ్య పెరిగింది. ● ఎమ్మెల్యేలకూ కొన్ని కీలక పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి కీలకమైన రాష్ట్ర కార్పొరేషన్ పదవి ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఆర్టీసీ, గృహనిర్మాణ, పౌరసరఫరాల కార్పొరేషన్ పదవుల్లో ఏదైనా రావొచ్చని అంటున్నారు. లేనిపక్షంలో ప్రభుత్వ విప్ పదవి ఇవ్వొచ్చని తెలుస్తోంది. అయితే నామినేటెడ్ పదవులు ఎవరికి ఇస్తే పార్టీకి ఉపయోగపడుతుందనే అంశాన్ని సైతం మీనాక్షి నటరాజన్ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. జిల్లాలవారీగా నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలో జాబితా రూపొందించి ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే నామినేటెడ్ పదవులు పొందిన నాయకుల పదవీకాలం పూర్తి అయితే వారికి పొడిగింపును ఇస్తారా లేకుంటే రొటేషన్లో భాగంగా మరికొందరు నాయకులతో భర్తీ చేస్తారా? అనే విషయంలో జిల్లాలో చర్చ జరుగుతోంది. ● ఇక 1988 నుంచి పార్టీకి సేవలందిస్తున్న మార చంద్రమోహన్రెడ్డి తాజాగా డీసీసీ పీఠం ఆశించి విఫలమయ్యారు. చంద్రమోహన్రెడ్డి నామినేటెడ్ రేసులో ఉన్నారు. అదేవిధంగా మరో సీనియర్ నాయకుడు బాడ్సి శేఖర్గౌడ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. 1983 నుంచి శేఖర్గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ వస్తున్నారు. శేఖర్గౌడ్కు గీత కార్మిక కార్పొరేషన్ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి నామినేటెడ్ రేసులో ఉన్నారు. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కాటిపల్లి నరేందర్రెడ్డి, నరాల రత్నాకర్, మాజీ డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి ఆశావహులుగా ఉన్నారు. డీసీసీ పీఠం కోసం గట్టి ప్రయత్నాలు చేసిన బాస వేణుగోపాల్ యాదవ్ నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు. సహకార సంఘాల పదవులు నామినేటెడ్ విధానంలో ఇస్తారనే వార్తల నేపథ్యంలో పురన్రెడ్డి ఆ పదవికి ఆశావహుడిగా ఉన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్రెడ్డి నామినేటెడ్ రేసులో ఉన్నారు. 1983 నుంచి పార్టీలో ఉంటూ జుక్కల్ ఎమ్మెల్యే టికెట్టు ఆశించి భంగపడిన గడుగు గంగాధర్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. తనకు వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా పదవి ఇవ్వడంపై గడుగు అసంతృప్తిగా ఉన్నారు. జిల్లా నుంచి డాక్టర్ కవితారెడ్డికి ఆరోగ్య వసతుల అభివృద్ధి కార్పొరేషన్ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు యువ నాయకులకు అవకాశాలు దక్కనున్నట్లు తెలుస్తోంది. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ ఇలా త్రిపాఠినిజామాబాద్ అర్బన్: నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా వై ద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ అ ధ్యక్షతన ఐడీవోసీలో గర్భస్త, పూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రమాణా లు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయాలన్నారు. స్కానింగ్ కేంద్రాలు రికార్డులను, రిపోర్టులను క్ర మం తప్పకుండా నమోదు చేయాలని ఆదేశించా రు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ, పీవోలు సుప్రియ, శిఖర, డిప్యూటీ డీఎంహెచ్వోలు అశ్వినీ, సమత, రెడ్క్రాస్ ప్రతినిధి బుస్స ఆంజనేయులు పాల్గొన్నారు. -
ప్రజల ఆలోచన మేరకే కాంగ్రెస్ పాలన..
ప్రజల ఆలోచన మేరకే కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని రాష్ట్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా మేయర్ పనిచేయాలని సూచించారు. రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మేయర్గా బీసీ బిడ్డకు బాధ్యతలు అప్పగించామని, అభివృద్ధిలో కాంగ్రెస్ మార్క్ కచ్చితంగా చూయిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం త్వ రలోనే సబ్ కమిటీ వేసి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం జైలుకు వెళ్లిన వారు, కేసులు ఎదుర్కొంటున్న వారు, ప్రాణాలు అర్పించిన వారందరికీ నివాళ్లర్పిస్తూ.. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మంత్రి చెప్పారు. దేశంలోనే అత్యంత చిన్న వయస్సు కలిగిన రాష్ట్రమైనప్పటికీ 2047 విజన్ పేరుతో అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచిందని, బీజేపీ ఇప్పటికై నా రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షను విడనాడాలని విజ్ఞప్తి చేశారు. మేయర్ ఉమారాణి -
నెలాఖరులోపు లక్ష్యాన్ని పూర్తిచేయాలి
● మార్కెటింగ్ శాఖ జేడీ మల్లేశంసుభాష్నగర్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ కమిటీల్లో 2025–26 సంవత్సరం లక్ష్యా న్ని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ మల్లేశం ఆదేశించారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో గల సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాలోని 17 మార్కెట్ కమిటీల కార్యదర్శులతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మా ట్లాడుతూ ఉమ్మడి జిల్లా మార్కెట్ ఫీజు వసూలు లక్ష్యం రూ.63.05 కోట్లు ఉండగా, ఇప్పటి వరకు రూ.41.30 కోట్లు వసూలైందని తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతినెల 10వ తేదీ వరకే వ్యాపారుల నుంచి బకాయిలతో సహా మొత్తం ఫీజు వసూలు చేయాలని, రైస్మిల్లులు, ఇతర మిల్లుల ప్రాంగణాలను తని ఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంవో గంగు, సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ అపర్ణ, ఉమ్మడి జిల్లా మార్కెట్ కమిటీల కార్యదర్శులు పాల్గొన్నారు. -
బాప్రే.. యూరియా యాప్
డొంకేశ్వర్(ఆర్మూర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘యూరియా బుకింగ్ యాప్’ రైతులను పరేషాన్ చేస్తోంది. జిల్లాలో ఎక్కడి నుంచైనా బుకింగ్ చేసుకునే అవకాశం ఉండటంతో కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. అధికారులు ఆన్లైన్లో స్టాక్ కేటాయించిన క్షణాల్లోనే యూరియా బస్తాలు మాయం అవుతున్నాయి. పక్క మండలాలు, గ్రామాల్లో స్టాక్ ఎక్కడ అందుబాటులో ఉందో యాప్లో చూసుకొని బుక్ చేసి వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీంతో తమకు యూరియా దొరకడం లేదని స్థానిక రైతులు ఆందోళనతో వ్యవసాయాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. ఆగ్రహంతో నేరుగా వారి కార్యాలయాలకు వెళ్తున్నారు. యాప్ విధానంతో ఇబ్బందులు పడుతున్నామని రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. గందరగోళ పరిస్థితి చూసి క్షేత్రస్థాయిలో ఉంటున్న ఏఈవోలు, ఏవోలు సైతం తలలు పట్టుకుంటున్నారు. 75,500 మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తి యాసంగి సీజన్ పంటలకు జిల్లాకు 82 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కావొచ్చని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు జిల్లాకు 77 వేల మెట్రిక్ టన్నులకుపైగా యూరియా దిగుమతి కాగా ఇందులో 75,500 మెట్రిక్ టన్నులు అమ్ముడు పోయింది. ప్రస్తుతం 1,500 మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాలో స్టాక్ ఉంది. యాసంగి సీజన్కు కావాల్సిన కోటా దాదాపు అయిపోయినప్పటికీ రైతులు ఇంకా యూరియా కొనుగోలు చేస్తున్నారు. యాప్ రావడంతో యూరియా దొరకదనే అపోహతో రైతులు వచ్చే ఖరీఫ్కు కూడా ఇప్పుడే తీసుకొని పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో యాప్ వచ్చిన పది రోజుల్లోనే 7,529 మెట్రిక్ టన్నుల (1,67,323 బస్తాలు) యూరియాను 59,174 మంది రైతులు కొనుగోలు చేసినట్లు వ్యవసాయశాఖ వివరాలు వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో యూరియా సేల్ అవడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొంటున్నారు. మార్పులు చేస్తే బెటర్.. బుకింగ్ విధానంతో కొత్త చిక్కులు కేటాయించిన వెంటనే అయిపోతున్న స్టాక్ పక్క మండలాలు, గ్రామాల నుంచి తెచ్చుకుంటున్న రైతులు స్థానిక రైతులకు దొరకడం లేదని ఆందోళన కొన్ని రోజులే ఇబ్బందులు యూరియా యాప్ విధానం ఇటీవలే ప్రభుత్వం అ మల్లోకి తేవడంతో రైతులు కొంత ఇబ్బందులు ప డుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. కొన్ని రో జుల మట్టుకే ఈ సమస్య ఉంటుంది. వేరే ప్రాంతా ల రైతులు బుక్ చేసుకోవడంతో స్థానికంగా ఉన్న వారికి దొరకడం లేదని తెలుస్తోంది. రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారిపంటలకు యూరియా వాడకం తగ్గించడంతోపాటు రైతులు సులభంగా బస్తాలు పొందడానికి ప్రభుత్వం బుకింగ్ యాప్ విధానాన్ని ఈ నెల 11 నుంచి పక్కాగా అమలు చేస్తోంది. యాప్ను స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్న రైతులు ఎకరానికి మూడు బస్తాల వరకు వారికి కావాల్సిన సొసైటీలు, డీలర్ల వద్ద పొందటానికి అవకాశం కల్పించింది. ఓటీపీలు చెప్పడం, కావాల్సిన డీలర్ల దగ్గర స్టాక్ చూపకపోవడంతో వరికి మూడో డోసు చల్లే రైతులకు యూరియా సమయానికి దొరడం లేదు. అయితే, ప్రభుత్వం బుకింగ్ విధానంలో మార్పు తేవాలని రైతులు, అధికారులు కోరుతున్నారు. మండలం, సొసైటీ పరిధిలోని రైతులు అదే ప్రాంతంలోని డీలర్ల వద్ద బుకింగ్ చేసుకునేలా యాప్లో మార్పులు చేయాలంటున్నారు. దీంతో ఒక మండలానికి చెందిన రైతులు మరో మండలంలో తీసుకునే అవకాశం ఉండదని, అప్పుడు స్థానిక రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూరియాను పొందవచ్చని చెప్తున్నారు. -
యూరియా కోసం రైతుల ధర్నా
నందిపేట్ (ఆర్మూర్): పాత పద్ధతిలోనే యూరి యా సరఫరా చేయాలని, కొత్తగా తీసుకొచ్చిన యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నందిపేట మండల కేంద్రంలో రైతులు శుక్రవారం ధ ర్నా నిర్వహించారు. వివేకానంద చౌరాస్తా వద్ద చింరాజ్పల్లి సొసైటీ పరిధిలోని తల్వేద, చింరాజ్పల్లి, నందిపేట, బజార్కొత్తూర్ గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించారు. యాప్ ద్వారా యూరి యా బుకింగ్ చేసేందుకు తమ వద్ద స్మార్ట్ ఫోన్లు లేవని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామ ని రైతులు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన రీ తిలో యూరియా సరఫరా చేయడం లేదని విమర్శించారు. ఎస్సై రాము ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. -
బాన్సువాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య భారీ స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. పట్టణంలోని ఓ మార్టులో ఓ వర్గానికి చెందిన పాటలను పెట్ట డంతో మరో వర్గానికి చెందిన వ్యక్తి ఆ పాటలు ఎందుకు పెట్టారని, అక్కడున్న ఓ బాలికతో గొడవకు దిగి, బాలిక వీడియోలు, ఫొటోలు తీయడంతో మార్టు సిబ్బంది ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం తెలుసుకున్న మరో వర్గం ప్రజలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు రావడంతో ఇంకో వర్గం జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓ వర్గం రాజీవ్ చౌరస్తా వద్ద ఉంటే మరో వర్గం ఆర్అండ్బీ గెస్ట్హౌస్ ముందు గుమ్మిగుడారు. అక్కడికి చేరుకున్న బాన్సువాడ, ఎల్లారెడ్డి డీఎస్పీలు విఠల్రెడ్డి, శ్రీనివాస్రావులు ఆందోళనలు చేస్తున్న వారిని సముదాయించే ప్రయత్నం చేసినా ఎవరూ వినకపోవడంతో పరిస్థితి చేయి దాటుతుందని జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఇరువర్గాల వారు రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. పూల దుకాణాలు, పండ్ల దుకాణాలు, బైక్లను ధ్వంసం చేశారు. దుకాణాల అద్దాలు పగులగొట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర భారీ బలగాలతో వచ్చి ఆందోళన కారులను తరమివేశారు. సుమారు 5 గంటల పాటు బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనలన వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చా రు. ఘటనలో ఓ కానిస్టేబుల్ కాలికి గాయమైంది. లాఠీఛార్జ్ అమానుషం.. బాన్సువాడలోని ఓ మార్టులో ఒక బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వర్గం వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా మరో వర్గంపై లాఠీచార్జ్ చేయడం అమానుషం అని బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ అన్నారు. షాపింగ్మార్టును ధ్వంసం చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఐదు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం భారీగా మోహరించిన పోలీసు బలగాలు రాళ్ల వర్షం కురిపించిన ఆందోళన కారులు దుకాణాలు, బైకులు ధ్వంసం -
గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్
నిజామాబాద్ అర్బన్: బాల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న యువకులను, ఏజెంట్లను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. పెర్కిట్కు చెందిన ఎండీ అంజాద్ అలీ కొన్నేళ్లుగా మహారాష్ట్రలోని కిన్వాట్ నుంచి గంజాయిని తీసుకొస్తూ ఇక్కడ విక్రయాలు చేపడుతున్నాడు. ఇతనిపై వేల్పూర్, ఆర్మూర్, నిజామాబాద్లో ఇదివరకే కేసులు నమోదయ్యాయి. నిందితుడు గత ఆరు నెలల నుంచి అతని తమ్ముడు వాహీద్ సుల్తాన్ ఆర్మూర్కు చెందిన మోసిన్ సోఫియా, ఓ బాలుడు, బాల్కొండకు చెందిన మనోజ్, గోవిందులు గంజాయి విక్రయించే ఏజెంట్లుగా నియమించుకున్నాడు. మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నాడు. ఒక్కో ప్యాకెట్టు రూ. 400కు విక్రయిస్తున్నాడు. ఏజెంట్లకు రూ.వంద చొప్పున కమీషన్ ఇస్తున్నాడు. శుక్రవారం బాల్కొండలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల పక్కన గంజాయి విక్రయించేందుకు సిద్ధం కాగా పోలీసులు పట్టుకున్నారు. కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంజాద్తోపాటుఅతని అనుచరులు, ఏజెంట్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీపీ పేర్కొన్నారు. బాలుడిని సంబంధిత అధికారుల ముందు హాజరు పరుస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఆర్మూర్ రూరల్ సీఐ జాన్రెడ్డి, బాల్కొండ ఎస్సై శైలేందర్, శంకర్, బాల్కొండ పీఎస్ కానిస్టేబుల్ భరత్, నవీన్ను సీపీ అభినందించారు. -
పరీక్షల నిర్వహణలో సీఎస్, డీవోలదే కీలక పాత్ర
డీఐఈవో రవికుమార్ ఖలీల్వాడి: ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులదే కీలక పాత్ర అని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఖిల్లాలోని బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 58 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇంటర్ బోర్డు కమిషనర్, కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సీఎస్, డీవోలు పరీక్షల నిర్వహణలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సీఎస్, డీవోలు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో వెంటనే సీసీ కెమెరాలు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు వెంటనే సమకూర్చాలని ఆదేశించారు. సెల్ఫోన్లను పరీక్ష కేంద్రంలో అనుమతించే ప్రసక్తి లేదన్నారు. పరీక్షల నిర్వహణకు ముందే ఇన్విజిలేటర్లతో సమావేశం నిర్వహించి తగిన నియమ నిబంధనలు వివరించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, విద్యాశాఖ, విద్యుత్, ఆర్టీసీ, హెల్త్, పోస్టల్, పోలీస్ అధికారులతో ఇదివరకే సమన్వయ సమావేశం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణకు ముందు, పరీక్ష జరుగుతున్న సమయంలో, పరీక్ష పూర్తయిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలను పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు నుస్రత్ జహాన్, రజీయొద్దీన్ అస్లాం, రజియా సుల్తానా వివరించారు. సమావేశంలో అధికారులు కై సర్ పాషా, చిన్నయ్య, కళాశాల ప్రిన్సిపాల్ ఖాలిక్, సీఎస్, డీవోలు ఉన్నారు. -
రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహణ మరింతగా మెరుగుపడాలి
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, భవిత కేంద్రాల నిర్వహణ తీరుతెన్నులపై కలెక్టర్ ఇలా త్రిపాఠి మండల ప్రత్యేక అధికారుల తో శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్ష జరిపారు.ఒక్కో మండలం వారీగా స్పె షల్ ఆఫీసర్లు చేపట్టిన క్షేత్రస్థాయి సందర్శనలు, ఆ యా పాఠశాలల్లో వారుగమనించిన అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా స్కూళ్లలో నెలకొ న్న స్థితిగతులు,పెండింగ్ పనులు, ఎంఎస్వో లు సందర్శించిన దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ పరిశీలించారు.క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పరిశీలనలు కొనసాగించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే అందుబాటులో ఉ న్న భవిత కేంద్రాల నిర్వహణ మరింతగా మెరుగుపడాలని, వివిధ దశలలో, ని ర్మాణాల్లో ఉన్న కేంద్రాల పనులను వేగంగా పూర్తి చేయించాలని సూ చించారు. రెసిడెన్షియల్ స్కూ ల్స్, వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం మెనూ ప్రకారం అందుతుందా లేదా అన్నది పరిశీలించాలని, మెనూ పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని క లెక్టర్ స్పష్టం చేశారు. డీఆర్డీవో సాయాగౌడ్, డీఈవో అశోక్, ఆర్సీవోలు, ఇంజినీరింగ్ అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
వేర్వేరు ఘటనలు.. విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
● బట్టలను ఇస్త్రీ చేస్తుండగా ఒకరు.. బీరువాను తాకి మరొకరు మృతి ● వడ్లం గ్రామంలో విషాదఛాయలు పెద్దకొడప్గల్: పెద్దకొడప్గల్ మండలంలోని వడ్లం గ్రామంలో రెండు వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. ఎస్సై అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మచ్కురి నాగయ్య(48) అనే వ్యక్తి కౌలాస్ ప్రాజెక్ట్లో లస్కర్ ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో బట్టలను ఇస్త్రీ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన పసుపుల లక్ష్మి(41) అనే మహిళ ఇంట్లో ఉన్న బీరువాలో వస్తువులను తీస్తుండగా పైన ఉన్న విద్యుత్తీగ బీరువాకు తగలగంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన నాగయ్య భార్య సావిత్రి, పసుపుల లక్ష్మి తల్లి సత్యవ్వ ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గ్రామంలో విద్యుత్ సమస్య ఉందని విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన కరువైందని, గ్రామంలో ఇద్దరి మృతికి విద్యుత్ శాఖ అధికారులదే బాధ్యత అని గ్రామస్తులు, మాజీ ఉససర్పంచ్ ఆరోపించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ విషయమై ట్రాన్స్కో ఏడీఈ అరవింద్ను వివరణ కోరగా గ్రామంలో ఎలాంటి విద్యుత్ సమస్య లేదని, విచారణ చేపడతామని ఆయన తెలిపారు. -
నిఘా నీడలో పరీక్ష కేంద్రాలు
● ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం ● 58 కేంద్రాలలో నిర్వహణ ● ‘సాక్షి’తో డీఐఈవో రవికుమార్ ఖలీల్వాడి: ‘ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫీజుల పేరిట హాల్టికెట్లు ఇవ్వని కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. ఇంటర్నెట్ ద్వారా పొందిన హాల్టికెట్లతోనే విద్యార్థులు పరీక్షలు రాసుకోవచ్చు.’ అని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు? జిల్లాలో మొత్తం 136 కళాశాలలు ఉండగా అందులో 133 ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పరీక్షల నిర్వహణకు మొత్తం 58 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి కేంద్రంలో తాగు నీరు, ఫ్యాన్లు, డ్యూయల్ డెస్క్ బెంచీలు, ప్రాథమిక చికిత్స చేసేలా ఒక ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలను అందుబాటులో ఉంచుతాం. ప్రత్యేక బృందాలు ఏం చేస్తాయి? జిల్లాలో పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించేందుకు నాతోపాటు 8 సిట్టింగ్ స్క్వాడ్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక హెచ్పీసీ, ముగ్గురు డీఈసీ సభ్యులు పనిచేస్తారు. సభ్యులు ఎప్పటికప్పుడు కేంద్రాలను పరిశీలిస్తారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేస్తాం. పరీక్షలకు ఎంత మంది హాజరుకానున్నారు? జిల్లాలో మొత్తం 36,963 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 16,336, ఒకేషనల్ విభాగంలో 2,963 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 14,893, ఒకేషనల్ విభాగంలో 2771 మంది పరీక్షలు రాయనున్నారు. -
ఉన్నత విద్యకు పేదలు దూరం
● ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ సిరంగరాజ్ ఖలీల్వాడి: కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్(వీబీఎస్ఏ)బిల్లు–2025తో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కానున్నారని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ రంగరాజన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పులాంగ్ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఏఐఎస్ఎఫ్ నాలుగవ జాతీయ మహాసభలు మూడో రోజు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం తన సొంత ఎజెండాను వర్సీటీలపై రుద్దేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. వీబీఎస్ఏ బిల్లు, యూజీసీ నూతన మార్గదర్శకాలు, రాజ్యంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని వెంటనే దీనిని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దేశంలో 12 ఏళ్లు అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ విద్యారంగాన్ని కార్పొరేట్, మతోన్మాద విధానాలు అమలు చేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్, ప్రైవేటు శక్తులకు అప్పజెప్పే కుట్రలు చేస్తుందని విమర్శించారు. బీజెపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ ఏ స్టాలిన్ ఆరోపించారు. కార్యక్రమంలో ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు మారయ్య గౌడ్, ప్యాట్రన్ రజినీకాంత్, ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కలపల్లి శ్రీనివాసరావు, మాజీ రాష్ట్ర నాయకులు ఈటీ నర్సింహ, జాతీయ నాయకులు బందెల నాసర్ జీ, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పీ సుధాకర్, ఏఐటియూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఇటుకెల రామకష్ణ, రఘురాం, గ్యార నరేశ్ రహమాన్, నాగజ్యోతి, గ్యార క్రాంతి, లెనిన్, రాజు, ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబోధ్, జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్, కార్తీక్, కోశాధికారి అనూష, నాయకులు హాసిని, కిశోర్, నిఖిల్, గౌతం, దిలీప్, ప్రవీణ్, సోను, రాజ్, ఆకాశ్, కృతిక్, విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు. -
అమ్మభాషతో మనో వికాసం
● అద్భుతాలు చూపించే అవకాశం మాతృభాషలోనే.. ● నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిజామాబాద్ రూరల్: భాషలు ఎన్నున్నా.. భావం వ్యక్తీకరించగలిగేది మాతృభాష ఒక్కటే. అందుకే ఎవరూ నేర్పకున్న ఎవరూ చెప్పకున్నా పుట్టిన ప్రతి శిశువు పలికే తొలిమాట ‘అమ్మ’. పుట్టిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో పట్టుదల, శ్రమ లేకుండా సహజంగా నేర్చుకునేది ఇది ఒక్కటే. శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. మన తెలుగు భాషను వర్ణిస్తూ ఎంతో మంది కవులు ఎన్నో గొప్ప మాటలు చెప్పారు. తేనె కన్న తీయనిది.. పాల మీగడ కన్న కమ్మనైనది ఇది మానసిక వికాసానికి సంపూర్ణ మూర్తిమత్వానికి తోడ్పడుతుంది. మాతృభాషపై మమకారం లేనివారు పరభాషలపై పట్టు సాధించలేరంటూ అధ్యయం చేసి మరీ నిరూపించారు భాషావేత్తలు. అంతటి గొప్పతనం ఉన్న మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాతృభాష సేవలో తరిస్తున్న వారెందరో ఉన్నారు. ముందు తరాల వారికి మాతృభాష తీయదనాన్ని పంచే క్రతువులో వీరు కర్తలుగా ఉన్నారు.మాతృభాషలోనే పుట్టి, పెరిగివారు ఆ భాషను చిన్నచూపు చూస్తున్నారు. మనిషికి వచ్చే ఏ ఆలోచనైనా మాతృభాషలోనే సమర్థవంతంగా అభివ్యక్తం చేయబడుతుంది. కుటుంబ, సమాజ సంబంధాలు అన్నీ తెలుగుభాషలోనే జీవించగల్గుతాయి. అభివృద్ధి చెందిన ఏ దేశాలైన, ప్రాంతాలైనా తమతమ మాతృభాషను కాపాడుకుంటున్నాయి. విలువలతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మాతృభాషా వినియోగంతోనే సాధ్యమవుతుంది. – డాక్టర్ కాసర్ల నరేశ్రావు, తెలుగు ఉపాధ్యాయులు, సిర్పూర్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మాతృభాష ప్రేమికులు మరోసారి భాషా విప్లవానికి పునరంకితం కావాల్సి ఉంది. ఎంతో ప్రాచీనత, అంతకుమించి సౌష్టవం కలిగిన మన తెలుగు భాష అంతరిస్తున్న మాతృభాషల బాటలో ఉండడం విచారకరం. తెలుగు భాషను రక్షించుకుందాం. తెలుగు భాషకు ఆత్మ సమానమైన సొగసులు అందించే తెలంగాణ పదజాల యుతమైన తెలుగును ముందు తరాలకు ప్రేమగా అందిద్దాం. అప్పుడే ఈ దినోత్సవానికి సార్థకత. – ఘనపురం దేవేందర్, తెలుగు ఉపాధ్యాయులు, సారంగపూర్ -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
తాడ్వాయి: ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై నరేశ్ శుక్రవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో ఈ నెల 18న రాత్రి చోరీ జరిగింది. 19న ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి సీతారాందాస్ కు ఆలయ హుండీ పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం తాడ్వాయిలో వేకువజామున పెట్రోలింగ్ నిర్వహిస్తున్న హోంగార్డు బాలాజీ, కానిస్టేబుల్ అనిల్కు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని విచారించారు. విచారణలో నిందితుడు లింగంపేట్ మండలం రాంపూర్కు చెందిన గోడండ్ల పావులు హనుమాన్ ఆలయంలో చోరీ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా గతంలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ పీఎస్ పరిధిలోని పలు ఆలయాల్లో సైతం హుండీల చోరీకి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతని వద్ద ఉన్న రూ. 200 నగదును స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. నిందితుడిని త్వరగా పట్టుకున్న హోంగార్డు, కానిస్టేబుల్ను ఎస్పీ అభినందించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట
● నగర మేయర్ కూరగాయల ఉమారాణి నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోందని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. శుక్రవారం స్థానిక డీఎస్ఏ మైదానంలో సీఎం కప్ క్రీడల ను ఆమె ప్రారంభించారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో క్రీడలకు విశేష ప్రాధాన్యత ఇస్తున్నా రని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజ మన్నారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌర వ వందనాన్ని ఆమె స్వీకరించారు. అనంతరం జిల్లా డీవైఎస్వో పవన్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తున్నాయన్నారు. పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 28 బాల, బాలికల జట్లు పాల్గొంటున్నట్లు డీవైఎస్వో తెలిపారు. కార్యక్రమంలో కరాటే రమేశ్, జిల్లా బాస్కెట్బాల్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నగేశ్, జిల్లా కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి: నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో శుక్రవారం సీఎం కప్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈసందర్భంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల జట్లతోపాటు వివిధ జిల్లాల జట్లు మార్చ్పాస్ట్ చేయగా అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ పోటీలు ఈ నెల 23 వరకు జరగనున్నాయి. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్ష ఫీజు ఈ నెల 27వరకు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి(కంట్రోలర్) సంపత్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి నెలలో నిర్వహించే ఈ పరీక్షలకు రూ. వంద అపరాధ రుసుముతో మార్చి 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అన్నారు. పూర్తి వివరాలకు తెయూ వెబ్సైట్ www. telanganauniversity. ac. in ను సంప్రదించాలని కంట్రోలర్ సూచించారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న బీటెక్ మొదటి సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. చివరి రోజు పరీక్షకు 71 మందికి 71 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. నిజాయితీ చాటిన ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ ఆర్మూర్టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు పోగొట్టుకున్న బ్యాగును తిరిగి అందజేసి ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ నిజాయితీ చాటారు. వివరాలిలా ఉన్నాయి. భీమ్గల్ నుంచి ఆర్మూర్కు వస్తున్న ఆర్టీసీ బస్సులో కోనసముందర్ గ్రామానికి చెందిన లలిత శుక్రవారం ప్రయాణించింది. ఆర్మూర్లో దిగిన ఆమె తన బ్యాగును బస్సు మరిచిపోయింది. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ రాజేశ్వర్, డ్రైవర్ విజయ్ ఆ బ్యాగును ఆర్మూర్ డిపో మేనేజర్ యాదగిరికి అందజేశారు. అందులో ఫోన్తో పాటు, రూ. పదివేల నగదు ఉన్నాయి. బ్యాగులో ఉన్న ఫోన్ ఆధారంగా ప్రయాణికురాలు వివరాలు సేకరించిన ఆర్టీసీ అధికారులు ఆమెకు అందించారు. ప్రయాణికురాలి బ్యాగును అప్పగించిన కండక్టర్, డ్రైవర్లను పలువురు అభినందించారు. లింగంపేట: మండలంలోని గాంధీనగర్ శివారులో గురువారం రాత్రి చిరుత రెండు లేగదూడలపై దాడి చేసి చంపినట్లు తండా సర్పంచ్ బాబు శుక్రవారం తెలిపారు. తండాకు చెందిన షేక్ రజాక్ అనే రైతు రోజు మాదిరిలాగే తన ఆవులు, లేగదూడలను తండా శివారులోని పశువుల కొట్టంలో కట్టేసి ఉంచాడు. రాత్రి వేళ చిరుత కొట్టంలోకి ప్రవేశించి రెండు లేగదూడలను హతమార్చింది. ఘటన స్థలాన్ని ఎఫ్ఆర్వో రామకృష్ణ, ఇన్చార్జి ఎఫ్ఆర్వో వాసుదేవ్ పరిశీలించారు. బోను ఏర్పాటు చేసి చిరుతను బంధిస్తామని హామీ ఇచ్చారు. రెండు లేగదూడల మృతితో రూ. 50వేల నష్టం జరిగిందని అధికారులు ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు. -
క్రైం కార్నర్
మహిళ మృతదేహం లభ్యం నవీపేట: మండలంలోని గోదావరి నదిలో శుక్రవారం మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతురాలిని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కర్కేలీకి చెందిన అనుసూయ దిలీప్ మోతెవాడ్(23)గా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం సాయంత్రం గోదావరి నది సమీపంలో స్థానికులకు కనిపించిన అనుసూయ గోదావరి నదిలో దూకిందన్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు. నస్రుల్లాబాద్: మండలంలోని మైలారం శివారులో ఉన్న కాలువలో గుర్తు తెలియని మహిళ(40–50) మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై రాఘవేంద్ర శుక్రవారం తెలిపారు. జీపీ సిబ్బందితో మృతదేహాన్ని బయటకు తీయించినట్లు పేర్కొన్నారు. మృతురాలిపై లేత నీలం రంగు చీర, నలుపు రంగు జాకెట్టు ధరించి ఉందని, కుడి చేతిపై అంజవ్వ అని ఉందన్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని ఎస్సై కోరారు. -
విద్యా వ్యవస్థలో మార్పు రావాలి
● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు ఖలీల్వాడి: రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పు రావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పులాంగ్ వద్ద ఉన్న ఓ ఫంక్షన్హాల్లో గురువారం ఏఐఎస్ఎఫ్ జెండాను శ్రీనివాస్రావు ఆవిష్కరించారు. పూర్వ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి శివ రామకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి పీ సుధాకర్ అమరవీరుల స్థూపం వద్ద భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రెండో రోజు నిర్వహించిన సమావేశానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి అధ్యక్షత వహించారు. ఇటీవల మృతి చెందిన వామపక్ష, అభ్యుదయవాద జాతీయ, రాష్ట్ర, జిల్లా అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ఏఐఎస్ఎఫ్ పోరాటాలు చేస్తోందని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి దినేశ్ శివలింగ రాజన్ మాట్లాడుతూ.. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీల ద్వారా ఆహార భద్రత చట్టం తీసుకొస్తే, మోదీ ప్రభుత్వం వీజీరాంజీ చట్టం పేరుతో ఆహార భద్రత లేకుండా చేస్తోందని మండిపడ్డారు. అనంతరం సౌహార్థ సందేశాన్ని ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఇటుకెల రామకృష్ణ, రఘురాం, సుబోధ్, గ్యార నరేశ్ రెహమాన్, నాగజ్యోతి, గ్యార క్రాంతి, లెనిన్, రాజు, ప్రవీణ్, బరిగల వెంకన్న, ఏఐటీయూసీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు యాసూఫ్, బాలరాజు, భూమయ్య, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి జ్యోతి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, ఎండీఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రపాణి, సీపీఐ నాయకులు రాజేశ్వర్, రాజు రెడ్డి, రాజన్న, స్వరూపరాణి, గంగామణి, జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, కార్తీక్, కోశాధికారి అనూష, నాయకులు హాసిని, కిశోర్, నిఖిల్, గౌతం, దిలీప్, ప్రవీణ్, సోను రాజ్, ఆకాశ్, కృతిక్ పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
అదృశ్యమైన మహిళ మృతి ఇందల్వాయి: మండల కేంద్రంలో అదృశ్యమైన ఓ వివాహిత చెరువులోపడి మృతి చెందినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయికి చెందిన బాలమణి(43) అలియాస్ జమున అనే మహిళ మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పీఎస్లో ఫిర్యాదు చేశారు. గురువారం గ్రామంలోని పెద్ద చెరువులో బాలమణి మృతదేహం బయటకు తేలడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి భర్త నడిపి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ధర్పల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోట రాజన్న(42) ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లి రెండేళ్ల క్రితం తిరిగి ఇంటికి వచ్చాడు. బుధవారం ఇంటి నుంచి వెళ్లిన రాజన్న తిరిగి రాలేదు. గురువారం ఉదయం చుట్టుపక్కల వెతకగా, వ్యవసాయ పొలం పక్కన ఉన్న చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బోధన్: అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్త, అత్త మామల వేధింపులు తాళ లేక ఓ వివాహిత ఆత్మహ త్య చేసుకున్న ఘటన గురువారం ఎడపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎడపల్లి ఎస్సై ము త్యాల రమ తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన పల్లపు సావిత్రి కుమార్తె శైలజకు ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన వీర్ల సతీశ్తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో శైలజ కుటుంబీకులు శక్తి మేరకు కట్నకానుకలు ఇచ్చారు. భర్త సతీశ్, అత్తమామల వెంకటేశ్, శంకరమ్మ అదనపు కట్నం కోసం ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. భర్త సతీశ్ దుబాయి వెళ్లేందుకు అదనంగా రూ. లక్ష తీసుకురావాలంటు భార్య వేధించేవాడు. దీంతో జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్మూర్టౌన్: డ్రంకెన్ డ్రెవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఇద్దరికి జరిమానా, మరొకరికి జైలు శిక్షణను ఆర్మూర్ మెజిస్ట్రేట్ విధించినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. ఆర్మూర్ పీఎస్ పరిధిలో గురువారం నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ముగ్గురిని పోలీసులు కోర్టు లో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన జడ్జి ము గ్గురిలో ఇద్దరికి రూ.10వేల చొప్పున జరిమా నా, మరొకరికి మూడు రోజులపాటు జైలు శిక్ష ను విధించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు. -
గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ సతీమణి మృతి
పిట్లం(జుక్కల్): మండలంలోని చిన్నకొడప్గల్ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి సతీమణి పుష్పలత(80) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఇంట్లో ఉన్న పుష్పలతకు ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబీకులు వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చి కిత్స పొందుతూ మృతి చెందారు. చిన్నకొడప్గల్లో శుక్రవా రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. డిచ్పల్లి: మండలంలోని ధర్మారం(బి) చర్చి సమీపంలో ఓ కారు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లడంతో ప్రహరీతో పాటు బాత్రూం పూర్తిగా ధ్వంసమైంది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారు ధర్మారం(బి) చర్చి సమీపంలోకి రాగానే డ్రైవర్ నిద్రమత్తు వల్ల అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రుద్రూర్: కోటగిరి మండలం సుద్దులం శివారులో కట్టివేసి ఉన్న రెండు గేదెలను దుండుగులు ఎత్తుకెళ్లారు. ఎస్సై సునీల్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. నాచుపల్లి తండాకు చెందిన దేవసోత్ వెంకట్ అనే వ్యక్తి ఈ నెల 14న సాయంత్రం సుద్దులం శివారులోని తన పొలంలో రెండు గేదెలను కట్టివేశాడు. మరుసటి రోజు ఉదయం వెళ్లగా గేదెలు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కొత్త పాలకవర్గాలు పాత సవాళ్లు
నిజామాబాద్లో అతీగతీ లేని భూగర్భ డ్రెయినేజీఅభివృద్ధి గాడిలో పడేనా?జిల్లాలోని నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ పట్టణాల్లో కొలువుదీరిన పాలకవర్గాలకు ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు సవాల్ విసురుతున్నాయి. ఎక్కడ చూసినా పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, రోడ్లు, డ్రెయినేజీలు అధ్వానంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ అతీగతీ లేకపోగా నగరంతోపాటు ఆయా పట్టణాల్లో అమృత్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నూతన పాలకవర్గాలు కనీస సౌకర్యాలు కల్పించి తమ కష్టాలను దూరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.భీమ్గల్లో అసంపూర్తిగా మిగిలిన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ బిల్డింగ్ పనులు -
మోర్తాడ్లో స్వల్ప ఉద్రిక్తత
● శివాజీ విగ్రహా ప్రతిష్ఠాపనను అడ్డుకున్న పోలీసులు ● మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కొనసాగిన హైడ్రామా మోర్తాడ్: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సాగిన హైడ్రామాకు పోలీసులు తెరదించారు. జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో సెంట్రల్ లైటింగ్ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యువజన సంఘాల సభ్యులు, శివాజీ అభిమానులు నిర్ణయించారు. ఇక్కడ కాకుండా మరో చోట ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. అందరికి కనిపించేలా సెంట్రల్ లైటింగ్ వద్దే ఏర్పాటు చేస్తే చేస్తామని యువజన సంఘాల సభ్యులు భీష్మించారు. పోలీసులు మాత్రం అనుమతి లేకుండా ప్రతిష్ఠిస్తే తాము అంగీకరించబోమని పట్టుబట్టారు. దీంతో జాతీయ రహదారి సమీపంలో యువజన సంఘాల సభ్యులు నిరసనకు దిగారు. మధ్యాహ్నం గ్రామంలోనే పోలీసులు విగ్రహాన్ని ఊరేగించడాన్ని అడ్డుకున్నారు. యువజన సంఘాల సభ్యులు పట్టుదలతో ఉండటంతో ఒక దశలో పోలీసులు వెనక్కి తగ్గారు. రాత్రిపూట ప్రతిష్ఠించే సమయంలోనే పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో విగ్రహా ప్రతిష్ఠాపన నిలిచిపోయింది. యువజన సంఘాల సభ్యులు, శివాజీ వీరాభిమానులను పోలీసులు చెదరగొట్టి విగ్రహాన్ని తరలించారు. విగ్రహ స్థలం వద్ద పోలీసులు పికెటింగ్ను కొనసాగిస్తున్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, భీమ్గల్ సీఐ సత్యనారాయణ, మోర్తాడ్, కమ్మర్పల్లి ఎస్సైలు రాము, అనిల్, పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
రాష్ట్రస్థాయి క్రీడల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
● చిన్నారులను అభినందించిన కలెక్టర్ నిజామాబాద్ అర్బన్: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల క్రీడా పోటీల్లో నిజామాబాద్ జిల్లాలోని భవిత కేంద్రాలకు చెందిన చిన్నారులు ప్రతిభ చాటారు. చిన్నారులు గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఆమె ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిశా రు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సాధించిన మెడల్స్, బ హుమతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులను పేరుపేరున అభినందిస్తూ, వారి తో ఫొటో సెషన్లో పాల్గొన్నారు. భవిత కేంద్రాల విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు తీర్చిదిద్దిన ఐఆర్పీలు, ఇతర అధికారులను అభినందించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించి న భవిత కేంద్రాలను పూర్తి స్థాయిలో సద్వినియో గం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. సాధారణ విద్యార్థులకు సమానంగా భవిత కేంద్రా ల్లో ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు అందుతాయన్నారు. డీఈవో అశోక్, అధికారులు ఉన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
నిజామాబాద్ రూరల్: గంజాయి విక్రేతలను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. రూరల్ ఎస్హెచ్వో కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్హెచ్వో నిందితుల వివరాలను వెల్లడించారు. రూరల్ పరిధిలోని ఖానాపూర్ చౌరస్తాలో ఉన్న ఓ టీ దుకాణం వద్ద కొంతమంది వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న నేనావత్ మోహన్(గాంధారి), అక్షయ్ (మదన్పల్లి), సిద్ధాంత్(అమ్రాద్), సిద్ధార్థ్, ప్రశాంత్(అమ్రాద్)లను అదుపులోకి తీసుకోగా వారి నుంచి 250 గ్రాముల గంజాయి లభ్యమైందని అన్నారు. విచారణలో వారు మహారాష్ట్ర, ఒరిస్సా, పలు ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగోలు చేసి జిల్లా కేంద్రంలో ఎక్కువ ధరకు విక్రయిస్టున్నట్లు ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అన్నారు. -
తెయూ ఆర్ట్స్ డీన్గా మూసా ఖురేషి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్గా ప్రొఫెసర్ మహమ్మద్ మూసా ఖురేషి నియమితులయ్యారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఎం.యాదగిరి గురువారం మూసా ఖురేషీకి నియామక ఉత్తర్వులు అందజేశారు. తెయూ ఉర్దూ విభాగంలో ప్రొఫెసర్గా పని చేస్తున్న మూసా ఖురేషీ గతంలో పలు అకడమిక్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. డీన్గా బాధ్యతలు స్వీకరించిన మూసా ఖురేషీని పలువురు అధ్యాపకులు శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ట్స్ విభాగంలో నాణ్యమైన పరిశోధనలకు తన వంతు కృషి చేస్తానన్నారు. డీన్గా బాధ్యతలు స్వీకరించిన మూసా ఖురేషీకి అభినందనలు తెలిపిన వారిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.రాంబాబు, వైస్ ప్రిన్సిపాల్ లక్షణచక్రవర్తి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, మాజీ డీన్ ప్రొఫెసర్ కె.లావణ్య, ప్రొఫెసర్ పి.కనకయ్య, అధ్యాపకులు గుల్–ఏ–రాణా, సమత, అతీఖ్ సుల్తాన్, పీఆర్వో రమణాచారి, జమీల్ అహ్మద్, బోధనేతర సిబ్బంది తదితరులున్నారు. -
కూలీల హాజరు అంతంతే..
జాబ్ కార్డుల సంఖ్య (లక్షలు) 2.51 సభ్యులు (లక్షలు) 4.58యాక్టివ్ జాబ్ కార్డులు (లక్షలు) 1.56 యాక్టివ్ కూలీలు (లక్షలు) 2.31 నిత్యం పనులకు 15-16 వస్తున్న వారు (వేలల్లో..)డొంకేశ్వర్(ఆర్మూర్) : ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో రోజుకు 90 మంది తగ్గకుండా ఉపాధి హా మీ పనులకు వచ్చేలా చూడాలని ఉన్నతాధికారుల చెప్పిన ఆదేశాలు జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. ఉపాధి హామీ సిబ్బందికి జిల్లా ఆఫీసు నుంచి టార్గెట్లు పెట్టినా కూడా లెక్క చేయడం లేదని, పైగా పనులు లేవని సాకులు చెప్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉపాధి పను లు నత్తనడకన సాగుతున్నాయి. నిత్యం 15 వేల మంది మాత్రమే కూలీలు పనులకు వస్తున్నారు. రో జుకు 10 మంది కూడా హాజరుకాని గ్రామాలు జి ల్లాలో చాలానే ఉండగా, కొన్నిచోట్ల మాత్రమే కూలీ ల హాజరుశాతం బాగుంది. జిల్లాలో 545 జీపీలు ఉండగా సుమారు 350కి పైగా జీపీల్లో కూలీల హా జరు తక్కువగా నమోదవుతోంది. చెరువుల్లో పూడికతీత, గుంతల తవ్వకం లాంటి పనులు లేకపోయి నా గ్రామాల్లో ఇతర పనులు ఉన్నప్పటికీ ఉపాధి సి బ్బంది దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. దీంతో కూలీలకు పనులు లేక ఉపాధిని కోల్పోతున్నారు. వర్ని, సాలూర, బోధన్, పొతంగల్, ఏర్గట్ల, ఎడపల్లి, రుద్రూర్, ఆర్మూర్, బోధన్, ఆలూరు మండలా ల్లో కూలీల హాజరు శాతం తక్కువగా ఉంది. జిల్లా లో 2.31 లక్షల మంది కూలీలు ఉండగా సగటున రోజుకు 30 శాతమే పనులు వస్తున్నారు. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ను ‘సాక్షి’ వివరణ కోరగా... కూలీల హాజరు పెంచాల ని కచ్చితమైన ఆదేశాలు ఇచ్చామని, నిర్లక్ష్యం ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పనులు చేస్తున్న ఉపాధి కూలీలు (ఫైల్)డొంకేశ్వర్ మండలంలో మొత్తం 13 గ్రామ పంచాయతీలు ఉడగా.. అన్ని జీపీల పరిధిలో బుధవారం కేవలం 361 మంది మాత్రమే ఉపాధిహామీ పనులకు వచ్చారు. సిర్పూర్, జీజీ నడ్కుడ, దత్తాపూర్ గ్రామాల్లో కేవలం పది మంది చొప్పున కూలీలు హాజరయ్యారు. చిన్నయానం, గాదేపల్లిలో 12 మంది చొప్పున అలాగే నూత్పల్లిలో 15 మంది మాత్రమే వచ్చారు. ఈ పరిస్థితి ఒక్క డొంకేశ్వర్ మండలానికే పరిమితం కాలేదు. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో ఉంది. ఉపాధి పనుల్లో పెరగని కూలీల సంఖ్య చాలా గ్రామాల్లో 10 మంది కూడా దాటని వైనం పనులు లేవని సాకులు చెబుతున్న సిబ్బంది -
అభివృద్ధి ఓడిపోయింది
● అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభివృద్ధి ఓడిపోయిందని, డబ్బు, మద్యం గెలిచిందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ చేసిన అభ్యర్థులు ప్రచార సరళితో ప్రజలను ఆకట్టుకున్నా.. డబ్బు, మద్యం గెలిచిందని, అభివృద్ధి ఓడిపోయిందన్నారు. ఎల్లప్పుడూ పార్టీ నాయకులకు అండగా ఉంటానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఛత్రపతి శివాజీ యువతకు ఆదర్శం
నిజామాబాద్ రూరల్: ఛత్రపతి శివాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ శివకుమార్ జీ అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా హిందూ సంఘాల సభ్యులు చేపట్టిన ర్యాలీ నగరంలోని బోర్గాం(పీ) వద్ద నుంచి పులాంగ్, నాందేవ్వాడ, కెనాల్కట్ట మీదుగా దుబ్బలో ఉన్న మైసమ్మ ఆలయం వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, భజరంగ్దళ్, హిందూ వాహిణితో పాటు హిందూ సంఘాల నాయకులు, వీహెచ్పీ తెలంగాణ విభాగ్ కృషి ప్రముఖ్ ధాత్రిక రమేశ్, ప్రజలు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ శివకుమార్ ఇందూరులో ఘనంగా శివాజీ జయంతి -
నేడు బాధ్యతలు స్వీకరించనున్న మేయర్
సుభాష్నగర్: నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్గా ఎన్నికై న కూరగాయల ఉమారాణి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు హాజరుకావాలని ఆయన కోరారు. వర్ని(మోస్రా): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు. గురువారం మండలంలోని గోవూరు గ్రామంలో రూ. 50 లక్షలతో నిర్మాణం చేపట్టిన జనరల్ ఫంక్షన్ హాల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కత్తి రవి, ఏఎంసీ చైర్మన్ సురేశ్ బాబా, వైస్ చైర్మన్ లక్ష్మణ్, తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీడీవో సాయికుమార్, విండో మాజీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, వీడీసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, హనుమంత్రెడ్డి, నాయకులు రామ్రెడ్డి, శేఖర్గౌడ్, అబ్బయ్య పాల్గొన్నారు. వర్ని: ప్రతి ఒక్కరూ దైవచింతనతో పాటు భక్తి భావనతో మెలగాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు. మండలంలోని తగిలేపల్లి గ్రామంలో రూ. 10 లక్షలతో నిర్మించిన ఆశ్రమ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఆశీర్వాదాన్ని ఎమ్మెల్యే తీసుకున్నారు. నేడు ఇంటర్ సీఎస్, డీవోల సమావేశం ఖలీల్వాడి : జిల్లా కేంద్రంలోని ఖిల్లా బాలుర కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సమావేశం శుక్రవారం నిర్వహించనున్నట్లు డీఐఈవో రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, సీఎస్, డీవోలు సమయానికి హాజరుకావాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల కస్టోడియన్లు సైతం సమావేశంలో పాల్గొనాలని పేర్కొన్నారు. -
రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలి
ఖలీల్వాడి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విద్యారంగానికి కొఠారి కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా 30శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడలోని ఎస్ఎఫ్ఐ కా ర్యాలయంలో జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో స్కాలర్షిప్, ఫీ జు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజు లు కట్టాలని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నారని, దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. బడ్జెట్లో యూనివర్సిటీల అభివృద్ధికి నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్లో గురుకులాలకు, అద్దె భవనాలలో నివసిస్తున్న హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని. సొంత భవనాలను నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు. విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దీపిక, విఘ్నేష్, నగర అధ్యక్షులు ఆజాద్, నాయకులు రాజు, రమేశ్, శ్రీ చరణ్, గణేశ్, అభి నాయకులు పాల్గొన్నారు. -
ఎర్రజొన్నపై సిండికేట్ పిడుగు
● సాగు విస్తీర్ణం తగ్గినా పెరగని ధరలు ● బైబ్యాక్ ఒప్పందానికి ముందుకు రాని వ్యాపారులు ● అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రైతులు మోర్తాడ్: ఆరుగాలం శ్రమించే రైతుకు అడుగడుగునా కష్టాలే. పండించిన పంటకు సర్కారు సహకా రం లేక వ్యాపారులు సిండికేట్గా మారి ఎర్రజొన్న రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఎర్రజొన్న సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కూడా ఆశించిన ధర లభించేలా కనిపించడం లేదు. సాగు ఖర్చులు పెరిగినా ధరలో మార్పు లేకపోవడంతో గిట్టుబాటయ్యేలా లేదని రైతులు వాపోతున్నారు. ఎర్రజొన్న సాగు చేసే రైతులు సీడ్ వ్యాపారులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకోవాలని అధికార యంత్రాంగం సూచించింది. బైబ్యాక్ ఒప్పందానికి వ్యాపారులు ముందుకు రాకపోవడం, సీజన్లో ఎక్కువ ధర చెల్లించిన వ్యాపారులకే విక్రయించడానికి రైతులు నిర్ణయించుకున్నారు. వ్యాపారులు మాత్రం సిండికేట్ కావడంతో ఎర్రజొన్నలకు ధర పెరగడం లేదని పేర్కొంటున్నారు. గత సీజన్లాగే ఈ సారి కూడా క్వింటాలుకు రూ.3,900 నుంచి రూ.4వేల వరకే ధర చెల్లిస్తామని వ్యాపారులు చె బుతున్నారు. కొన్నేళ్ల క్రితం రూ.6వేల వరకూ పలికిన ధర క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఎర్రజొన్నకు ధర గతంలో మాదిరిగా పలుకడం లేదనే ఉ ద్దేశంతో అనేక మంది రైతులు ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. అడవి పందులు, చిలుకల వల్ల ఇబ్బంది అనుకునే రైతులే ఎర్రజొన్నలను సాగు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం 30వేల ఎకరాల్లో సాగైన ఈ పంట గతేదాడి నుంచి సుమారు 8 వేల ఎకరాల విస్తీర్ణానికి పడిపోయింది. సాగు విస్తీర్ణం తగ్గడంతో ఉన్న కొద్ది పంటకు డి మాండ్ లభిస్తుందని రైతులు ఆశించారు. ధర మా త్రం పెరగకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొ రుగు దేశాల్లో గడ్డి కోసం వినియోగించే ఎర్రజొన్న కు డిమాండ్ ఉన్నా వ్యాపారులు తమ లాభాలను పెంచుకోవడం కోసం ధర లేకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సీడ్ వ్యాపారులను నియంత్రించే పరిస్థితి లేకపోవడంతో రైతులకు ఎర్రజొన్నల సాగు వల్ల లాభాలు పెరగడం లేదు. ఎర్రజొన్నలు కొనుగోలు చేసే వ్యాపారుల సిండికేట్ను కట్టడి చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. మార్కెట్లో ఎర్రజొన్నకు డిమాండ్ ఉన్నా రైతుల వద్దకు వచ్చేసరికి ధర లభించడం లేదు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. సీజన్లో ధర పెరుగుతుందనే ఆశతో రైతులు ఎర్రజొన్నలను సాగు చేస్తున్నారు. – కొమ్ముల వెంకటేశ్, రైతు, తిమ్మాపూర్ -
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు
సుభాష్నగర్ : వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, వి ధులలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చ ర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని గైనిక్ వార్డ్, ఎన్ఐసీయూ విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరు, పేషంట్ల కేస్ షీట్లను తనిఖీ చేశారు. మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని సైతం కలెక్టర్ సందర్శించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలని, అత్యవసరమైతేనే సీ సెక్షన్లు చేయాలన్నారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు ఎల్.రాములు, డా.జలగం తిరుపతి రావు తదితరులు ఉన్నారు. ● ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంపొందించాలి ● కలెక్టర్ ఇలా త్రిపాఠి -
బోధన్లో రోడ్లు, డ్రెయినేజీలు నిర్మాణమయ్యేనా?
బోధన్ టౌన్ : బోధన్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలతోపాటు శివారు కాలనీల్లో సమస్యలు తిష్ట వేశాయి. పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పట్టణాన్ని ఆనుకొని పాండుఫారం, నర్సాపూర్, ఆచన్పల్లి, శ్రీనివాసనగర్, చెక్కి క్యాంప్ గ్రామాలను బల్దియాలో విలీనం చేశారు. శివారు కాలనీలైన ఆటోనగర్, గరీబ్ కాలనీ, గౌడ్స్ కాలనీ, రాకాసీపేట్ పరిధిలోని ప్రెస్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వీలిన గ్రామాల్లో కొంత మేర సమస్యలు పరిష్కరించినప్పటికీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం లేక పోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో రోడ్లు బురదమయమవుతున్నాయి. గరీబ్ కాలనీలో తాగునీటి పైప్లైన్ లేక పోవడంతో ట్యాంకర్ ద్వారా నీటిని సఫఫరాను చేయాల్సి వస్తోంది. 15 ఏళ్లవుతున్నా ఆటోనగర్ కాలనీలో రోడ్లు,ఽ మురికి కాలువల నిర్మాణం చేపట్టలేదు. నర్సాపూర్తోపాటు పాండుఫారం, చెక్కిక్యాంప్లో రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పార్కులు లేక పోవడంతో పట్టణ ప్రజలకు ఆహ్లాదం కరువైంది. వీరేశలింగం పార్కులో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టగా, గాంధీ పార్కులో కనీస వసతులు కరువయ్యాయి. పలుచోట్ల పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడుతున్నాయి. అమృత్ 2.0లో చేపట్టిన పైప్లైన్ పనుల విస్తరణ ట్యాంక్ల నిర్మాణ పనులు వేగంగా సాగకపోవడంతో శివారు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమీకృత వెజిటేబుల్ మార్కెట్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
● హైకోర్టు తీర్పును అమలు చేసిన కామారెడ్డి జిల్లా యంత్రాంగం దోమకొండ: హైకోర్టు ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట ప్రభుత్వ పాఠశాల స్థలంలో నిర్మించిన దుకాణ సముదాయా న్ని జిల్లా అధికార యంత్రాంగం గురువారం కూల్చివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. 1968లో ము త్యంపేట ప్రభుత్వ పాఠశాల కోసం కాటిపల్లి వెంకట్రామిరెడ్డి, మెరుగు అంజయ్య 638/ఏ/1, 638/ ఏ/2, 638/ఏఏ సర్వే నెంబర్లలోని 2 ఎకరాల 11 గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. అయితే, గ తంలో ఉప సర్పంచ్గా పనిచేసిన ముత్తగారి శిరీష్ గౌడ్ అనే వ్యక్తి ఎరుకల పార్వతి పేరిట 400 గజాలతో రెండు డాక్యుమెంట్లు, మహ్మద్ జావీద్ పేరిట 200 గజాలతో ఒక డాక్యుమెంట్, మంద ఆంజనేయులు పేరిట 400 గజాలతో రెండు డాక్యుమెంట్లు, మంద నర్సారెడ్డి పేరిట 600 గజాలతో మూ డు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. తర్వాత వీళ్ల వద్ద నుంచి తన భార్య రోజా సదరు స్థలాలను కొనుగోలు చేసినట్లు సేల్ డీడ్ తయారు చేశాడు. 2020 ఆగస్టు 25న, 2022 జూన్ 29న విడతలవారీగా 1–3/ఏ1, 1–3/ఏ2, 1–3/ఏ3, 1–3/ఏ4, 1–4/ఏ5 నెంబర్లతో పంచాయతీ కార్యదర్శి రాజ్కుమార్తో కలిసి ఇంటి నెంబర్లు సృష్టించాడు. ఆ త ర్వాత నకిలీ ఓనర్షిప్ సర్టిఫికెట్లతో 6 నెలల్లోనే 12 లింక్ డాక్యుమెంట్లు సృష్టించి 2023లో దుకాణ సముదాయాన్ని నిర్మించాడు. అక్రమాలను గుర్తించిన మాజీ ఎంపీటీసీ కె.వెంకటలక్ష్మి, మాజీ ఉప సర్పంచ్ కుర్ర అంజయ్య హైకోర్టులో ప్రజాప్రయో జన వ్యాజ్యం దాఖలు చేశారు. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు గత డిసెంబర్ 18వ తేదీన తీర్పు వెలువరించింది. అప్పీలుకు 8 వారాల గడు వు ఇచ్చింది. ఈ నెల 18వ తేదీతో గడువు పూర్తయ్యింది. అక్రమాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అపరేష్కుమార్, మొహియుద్దీన్ల బెంచ్ తీర్పును వెలువరించింది. పిల్ దాఖలు చేసినవారి తరఫున హైకోర్టు సీనియర్ న్యా యవాది కాటిపల్లి మహేందర్రెడ్డి, సరళా మహేందర్రెడ్డి, రవి మహేందర్రెడ్డి వాదనలు చేశారు.దోమకొండ మండలం ముత్యంపేటలో అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తున్న పొక్లెయిన్లుఅధికారుల వింత ప్రవర్తన.. హైకోర్టు తీర్పు అమలు చేసేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ సుధాకర్, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఎస్సై ప్ర భాకర్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య గురువారం ముత్యంపేటకు చేరుకున్నారు. నిర్మాణా న్ని కూలగొట్టే విషయంలో చాలా సమయం తా త్సారం చేశారు. శాంతిభద్రతల సమస్య వస్తోందంటూ కూల్చివేత నిలిపేశారు. గ్రామస్తుల ఒత్తిడి, కలెక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో దుకాణ సముదాయాన్ని కూల్చివేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆశబోయిన అక్షర, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
సాంగ్లీకి వెళ్లినా నిరాశే..
మోర్తాడ్(బాల్కొండ): పసుపు కొమ్ములను మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్కు తీసుకెళ్తున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. నిజామాబాద్ మార్కెట్తో పోలిస్తే అక్కడ క్వింటాల్కు రూ.1500 నుంచి రూ.2వేల వరకు మాత్రమే అధికంగా ధర లభిస్తోంది. సాంగ్లీలో ఎక్కువ ధర లభిస్తుందని ఆశించిన రైతులకు ప్రస్తుతానికి నిరాశే మిగులుతోంది. రూ.15వేల నుంచి రూ.18వేల వరకు ధర లభిస్తుందనే ఆశతో జాతీయ పసుపు మార్కెట్గా ప్రసిద్ధి చెందిన సాంగ్లీ మార్కెట్కు పూర్తిగా ఎండిన పసుపును రైతులు తరలిస్తుండగా.. అక్కడ రూ.13వేల నుంచి రూ.16వేల ధర లభిస్తోంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో రవాణాచార్జీలు భరించి అక్కడికి పసుపు కొమ్ములను తీసుకెళ్లే బదులు ఇక్కడే విక్రయించేస్తేనే మేలని రైతులు భావిస్తున్నారు. ధర బాగుంటే రవాణా చార్జీలు ఎంత ఎక్కువ ఉన్నా ఫర్వాలేదని, కానీ ఇక్కడి ధరకు అక్కడి ధరకు పెద్ద వ్యత్యాసం లేదంటున్నారు. సాంగ్లీ మార్కెట్లో ఈ ప్రాంత పసుపునకు డిమాండ్ ఉండటంతో ధర ఈసారి ఎక్కువ పలుకుతుందని భావించామంటున్నారు. నిజామాబాద్ మార్కెట్లో రూ.14వేల వరకు ధర లభిస్తుండగా, నాణ్యత ఉన్న పసుపునకు రూ.15వేల వరకు ధర దక్కుతోంది. బాల్కొండ, ఆర్మూర్, రూరల్ నియోజకవర్గాలలోని కొన్ని గ్రామాల రైతులే సాంగ్లీ మార్కెట్కు పసుపును ప్రతి సీజన్లో తరలిస్తారు. ఈసారి ధరలో పెద్ద మార్పు లేక పోవడంతో మున్ముందుఎలాంటి పరిస్థితి ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. పసుపునకు దక్కని ధర క్వింటాల్కు రూ.13వేల నుంచి రూ.16వేలు.. నిజామాబాద్లో రూ.14వేల నుంచి రూ.15వేలు -
ప్రభుత్వ సలహాదారును కలిసిన ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, నాయకుడు కాటిపల్లి నరేందర్రెడ్డి గురువారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు సముచిత ప్రాధాన్యత ఇస్తామని వేం నరేందర్రెడ్డి అన్నారని కాటిపల్లి తెలిపారు. వారివెంట కాటిపల్లి రాహుల్రెడ్డి ఉన్నారు. సమర్థవంతంగా సేవలందించాలి ● జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ వై రామసుబ్బారెడ్డి బోధన్: అన్ని శాఖల అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించి, ప్రజలకు సమర్థవంతంగా సేవలందించాలని సాలూ ర మండల ప్రత్యేక అధికారి, జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ రామసుబ్బారెడ్డి పేర్కొ న్నారు. ఆచన్పల్లి పరిధిలోని సాలూర బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఆయన గు రువారం సందర్శించారు. విద్యార్థులకు త యారు చేస్తున్న వంటకాలను పరిశీలించా రు. సాలూర పీహెచ్సీని సందర్శించారు. స్థానిక జెడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈవో రాజిమంజూష, మెడికల్ ఆఫీసర్ రాజ్కుమార్, హౌసింగ్ ఏఈ శివ ఉన్నారు. కూలీలను మోసగించేందుకు కేంద్రం కుట్ర ● డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి డిచ్పల్లి : మహాత్మాగాంధీ పేరును రూపుమాపాలనే దురుద్దేశంతోపాటు ఉపాధి హా మీ కూలీలను మోసం చేయాలని కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి ఆరోపించారు. డిచ్పల్లి మండలం ముల్లంగి (ఐ) గ్రామంలో గురువారం ఉపాధి కూలీలను కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు 125 రోజులు పని కల్పిస్తామని చెబుతూనే అందులో 50 రోజుల పనివేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై మోపుతోందన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త ‘వీబీ జీ రామ్ జీ’ ద్వారా కార్పొరేట్ వ్యవస్థలా పని చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామీణ పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని నగేష్రెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముల్లంగి(ఐ) సర్పంచ్ సుదం శ్రీనివాస్, ఉపసర్పంచ్ అశోక్, మాజీ ఎంపీపీ చిన్నోల్ల నర్సయ్య, ఏఎంసీ డైరెక్టర్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నందిపేటలో దొంగల బీభత్సం
● పట్టపగలు తాళం వేసిన ఇంట్లో చోరీ ● పది తులాల బంగారు నగలు, రూ.1.50 లక్షల నగదు అపహరణనందిపేట్: నందిపేట మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలు తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న పది తులాల బంగారు నగలు, రూ. 1.50 నగదును ఎత్తుకెళ్లారు. ఎస్సై శ్యాంరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని బర్కత్పుర కాలనీలో నివాసం ఉంటున్న మహమూద్ అనే వ్యక్తి మెడికల్ షాప్ నిర్వహిస్తు జీవిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. ఇది గమనించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. 2 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అతనికి వేసిన తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ చోరీలో బీరువాలో ఉన్న పది తులాల బంగారు నగలు, రూ. లక్షన్నర నగదును దుండగులు దొంగిలించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
దైవదర్శనానికి వచ్చి మృత్యుఒడికి
నవీపేట: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై శ్రీకాంత్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ పట్టణంలోని కుమార్గల్లీకి చెందిన బోదు గణపతి(42) ఈ నెల 9న బోధన్ నుంచి బాసరకు బైక్పై వెళ్తుండగా ఫకీరాబాద్ సమీపంలో అదుపుతప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో అతని తల, చేతలకు తీవ్రగాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.మాచారెడ్డి : దైవ దర్శనానికి వచ్చిన భక్తుడు ఒకరు ప్రమాదవశాత్తు కోనేరు బావిలో పడి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మినర్సింహస్వామి ఆలయ వద్ద మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై అనిల్ కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పందిర్ల సురేశ్గౌడ్ (45) తరచుగా లక్ష్మినర్సింహస్వామి ఆలయానికి వచ్చి వెళుతుంటాడని, అదే విధంగా మంగళవారం దైవదర్శనానికి వచ్చి కాళ్లు చేతులు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతి చెందినట్టు వివరించారు. ఈ మేరకు బుధవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ఇంటి ఎదుట పార్క్ చేసిన ఓ బైక్ చోరీకి గురైంది. కాలనీకి చెందిన వడ్డె కాశీనాథ్ అనే వ్యక్తి తన బైక్ను మంగళవారం అర్ధరాత్రి ఎప్పటిలాగే ఇంటి ఎదుట పార్క్ చేసి నిద్రించాడు. బుధవారం ఉదయం బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. -
కుదిరిన అంగీకారం.. పెరిగిన కూలి
సుభాష్నగర్: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో హోల్సేల్ కూరగాయల మార్కెట్లో కూలి రేట్లపై యజమానులు, హమాలీ కార్మికుల సంఘాల ప్రతినిధులతో బుధవారం జరిపిన చర్చల్లో అంగీకారం కుదిరినట్లు ఐఎఫ్టీయూ నగర కార్యదర్శి ఎం శివకుమార్ తెలిపారు. అంగీకారం మేరకు ఒక బాక్సుకు రూ.7, సంచికి రూ.10కి పెరిగిందని పేర్కొన్నారు. అలాగే 10 కిలోల క్యారీ బ్యాగు రూ.6కు పెంచారన్నారు. పెరిగిన కూలి ధరలు మార్చి 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. సమావేశంలో ఐఎఫ్టీయూ అనుబంధ కూరగాయల నైట్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధక్షుడు మేసినేని రాజు, కార్యదర్శి మతిన్ రసూల్, అన్వర్, వసీమ్, రాజు, సలీమ్ తదితరులు పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. విగ్రహ ఏర్పాటుకు బట్టు శ్రీధర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో వీసీ టీ యాదగిరిరావును కలిసి వినతిపత్రం అందజేశారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్గా అశ్విత్, కో కన్వీనర్లుగా వినీత్, నాగేంద్ర, సాయి ప్రకాశ్, గోపీచంద్, చక్రి, శ్రీనివాస్, వంశీ, కవిత, జ్యోతి, బాలమణి, సభ్యులుగా అనిల్, శ్రీనివాస్, నిరంజన్, ఆదిత్య, పవన్, కుశాల్, వంశీ, చరణ్, నాగేశ్, నవదీప్, కొండల్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. నవీపేట: తాగిన మైకంలో ఓ యువకుడు సెల్టవర్ ఎక్కి హంగామా సృష్టించిన ఘటన నవీ పేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ని సుభాష్నగర్ కాలనీకి చెందిన పులింటి వెంకట్ భార్య యేడాది క్రిదం కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లింది. తీవ్ర మనస్థాపానికి గురైన వెంకట్ తాగుడుకు బానిసై మతిస్థిమితం కోల్పోయాడు. తాగిన మైకంలో సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని వెంకట్ను కిందకి దింపారు. మాక్లూర్: రోడ్డుపై ఘర్షణపడి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ బుధవారం తెలిపారు. మండలంలోని చిక్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఓ వర్గానికి చెందిన వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి రోడ్డుపై ఘర్షణకు దిగారు. వారు కొందరు గ్రామస్తులపై సైతం దాడికి పాల్పడి భయాందోళనకు గురిచేశారు. దాడిలో గాయపడ్డ బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ‘పీఎంశ్రీ నిధులు 23 లోపు ఖర్చు చేయాలి’ కామారెడ్డి టౌన్: పీఎంశ్రీ పాఠశాలలకు కేటాయించిన నిధులను ఈ నెల 23లోపు పూ ర్తిగా ఖర్చు చే యాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ఆదేశించారు. బుధవారం సాయంత్రం వి ద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్తో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారు లు, ఇంజినీరింగ్ అధికారులతో ఆమె వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ.. పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన అన్ని రకాల సివిల్ పనులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి నిబంధనల ప్రకారం నిధులను వినియో గించాలని సూచించారు. అధికారులు పాల్గొన్నారు. -
ఎడ్లబండిని ఢీకొన్న వ్యాన్
– రెండు ఎడ్లు మృతి, ఒకరికి గాయాలు సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల శివారులోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ఎడ్లు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. సదాశివనగర్కు చెందిన బన్నీ అనే వ్యక్తి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీకి చెరుకును ఎడ్లబండిపై తరలిస్తుండగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు అతివేగంతో వెళ్తున్న ఐచర్వ్యాన్ ఎడ్లబండిని ఢీకొన్నది. ప్రమాదంలో రెండు ఎడ్లు అక్కడికక్కడే మృతి చెందగా, బండిపై ఉన్న బన్నీకి గాయాలయ్యాయి. మృతి చెందిన గేదెల విలువ రూ. 2లక్షల వరకు ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
ఖలీల్వాడి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండలంలో బుధవారం నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. ముందుగా ఎన్టీఆర్ చౌరస్తా నుంచి టీటీడీ కల్యాణ మండపం వరకు నిర్వహించిన ర్యాలీని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ శివలింగరాజన్ జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై ఏఐఎస్ఎఫ్ అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. అన్ని విద్యార్థి సంఘాలకు మాతృ సంస్థ ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. ఎందరో నాయకులు ఈ విద్యార్థి సంఘం ద్వారా ఎదిగారని, తాను కూడా ఈ సంఘం ద్వారా నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని ఎమ్మెల్యేగా ఎదిగినట్లు చెప్పారు. మార్కుల కోసం కాకుండా జ్ఞానం పెంపొందించే దిశగా విద్యా విధానం ఉండాలన్నారు. జిల్లాలో రాష్ట్ర మహాసభలను మూడు రోజుల పాటు గొప్పగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తోందన్నారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ శివలింగరాజన్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు వేస్తున్నాయని, ఇది సరైన నిర్ణయం కాదన్నారు. కార్యక్రమంలో జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కెలపల్లి శ్రీనివాస్రావు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి బనోతు రఘురాం, జిల్లా అధ్యక్షుడు సుభోద్, రాష్ట్ర నాయకుడు కంజర భూమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పీ సుధాకర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, ఏఐఎస్ఎఫ్ ఆఫీస్ బేరర్స్ ఇటికెల రామకృష్ణ, గ్యార నరేశ్, రెహమాన్, కాసోజు నాగజ్యోతి, బరిగేలా వెంకటేశ్, రాజారెడ్డి, రాజేశ్వర్, రాజన్న, స్వరూపరాణి, విఠల్ గౌడ్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. భగత్సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు -
ఆంగ్ల భాష నైపుణ్యం ఎంతో అవసరం
● వర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాంబాబుతెయూ(డిచ్పల్లి): ప్రపంచం కుగ్రామంగా మారిన నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఆంగ్ల భాషా నైపుణ్యం ఎంతో అవసరమని తెలంగాణ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ జీ రాంబాబు పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో వర్సిటీలో పని చేస్తున్న బోధనేతర సిబ్బందికి బుధవారం ఆంగ్లంలో ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రిన్సిపాల్ రాంబాబు ప్రారంభించారు. ఆంగ్ల భాషా నైపుణ్యాలు మానవ సంబంధాలనే కాకుండా వృత్తి నైపుణ్యాలను వెలికి తీస్తాయని అన్నారు. కార్యక్రమలలో వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్ లక్ష్మణ చక్రవర్తి, సెల్ట్ డైరెక్టర్ పీ సమత, పీఆర్వో కేవీరమణాచారి, అధ్యాపకులు ఎల్ జ్యోత్స్న, ఎన్ స్వామి, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నితిన్ భాయ్ దేశాయ్కు నివాళులు
నిజామాబాద్ రూరల్ : తెలంగాణలోని లక్షల బీడీ కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపిన దేశాయ్ బ్రదర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ భాయ్ దేశాయ్ సంతాప సభను సంస్థ ఉద్యోగులు, టేకేదారులు జిల్లా కేంద్రంలోని గుజరాతి బీడీ వాలా ప్రగతి సమాజ్లో బుధవారం నిర్వహించారు. ఈనెల 8న అనారోగ్యంతో మృతి చెందిన నితిన్ భాయ్ దేశాయ్కి నివాళులు అర్పించారు. డీబీఎల్ వ్యాపార సామ్రాజ్యాన్ని ఓ పక్క విస్తరిస్తూనే.. మరో పక్క నిరుపేదల ఆర్థిక ఎదుగుదలకు నితిన్ భాయ్ విశేషంగా కృషి చేశారని పలువురు ఉన్నత ఉద్యోగులు కొనియాడారు. కార్యక్రమంలో దేశాయి బ్రదర్స్ బీడీ కంపెనీ తెలంగాణ ప్రొడక్షన్ మేనేజర్ రష్మీకాంత్ భాయ్, నిజామాబాద్, కామారెడ్డి డివిజన్ల డీఎంలు విపుల్ భాయ్, ఉమేశ్ భాయ్, ఏడీఎంలు అనిల్ భాయ్, బ్రిజేష్ భాయ్, క్వాలిటీ ఇన్చార్జిలు గంగాధర్ భాయ్, చంద్రమౌళి భాయ్, ఉమ్మడి జిల్లాలలోని రేంజ్ మేనేజర్లు, బీడీ కార్మిక సంఘాల నాయకులు, టేకేదార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బాల్కొండకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చేనా..?
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో భాగంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు మంజూరు చేసింది. అయితే, బాల్కొండ నియోజకవర్గానికి ఎప్పుడు మంజూరవుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తన సొంత గ్రామంలోని రూ.6 కోట్ల విలువైన భూమిని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రభుత్వానికి ఇచ్చానని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. భీమ్గల్ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ తన సొంత గ్రామం రహత్నగర్లో నిర్మిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పీసీసీ చీఫ్ స్థలాన్ని కేటాయించారు. జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కోసం సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 6న శంకుస్థాపన చేశారు. ఒక్కో పాఠశాల కోసం రూ.200 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, బాల్కొండ నియోజకవర్గంలో స్థలాన్ని కేటాయించినా ప్రభు త్వం నుంచి స్పందన లేకపోవడం గమనార్హం. పీసీసీ అధ్యక్షునితోపాటు మూడు కార్పొరేషన్ల చైర్మన్లు మానాల మోహన్రెడ్డి, ఈరవత్రి అనిల్, సుంకెట్ అన్వేష్రెడ్డి, సీఎంకు సన్నిహితుడైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీ ముత్యాల సునీల్రెడ్డిలు ఈ నియోజకవర్గానికి చెందినవారే. హేమాహేమీలు అంతా బాల్కొండ నియోజకవర్గంలో ఉండగా ఈ ప్రాంతానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేయకపోవడంపై విద్యాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేతలు అంతా కలిసి సీఎంను ఒప్పించి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకురావాలని కోరుతున్నారు.ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలకు ఒకే రకమైన ప్రాధాన్యతను కల్పించాలి. అన్ని చోట్లా పాఠశాలలను నిర్మించి విద్యా సౌకర్యాలను విస్తృతం చేయాలి. – నల్ల నవీన్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిల్లాలో మూడు నియోజకవర్గాల పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్లు కేటాయింపు బాల్కొండకు స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూపులు -
రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి
● మరొకరికి గాయాలుసిరికొండ: రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఎస్సై జే రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన గోనుగొప్పుల అన్వేష్(34) అనే యువకుడు తన సోదరిని భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామంలో దింపడానికి బైక్పై వెళ్తున్నాడు. అదేవిధంగా జగదాంబ తండాకు చెందిన బానావత్ మోతీలాల్ తన బైక్పై నర్సింగ్పల్లి నుంచి తండాకు వెళ్తున్నాడు. న్యావనంది చౌరస్తా – నర్సింగ్పల్లి గ్రామాల మధ్య ఈ రెండు బైక్లను ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో అన్వేష్ తలకు తీవ్రగాయాలు, మోతీలాల్కు గాయాలు కాగా 108 అంబులెన్స్లో ఇద్దరిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అన్వేష్ మృతి చెందినట్లు తెలిపారు. గాయాలైన మోతీలాల్కు చికిత్స అందిస్తున్నారు. మృతుడికి భార్య సౌజన్యతో పాటు ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
భీమ్గల్లో యువకుడి అదృశ్యం
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ మండలం మెండోర గ్రామానికి చెందిన షేక్ మునీర్(25) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై తిరుపతి బుధవారం తెలిపారు. ఈనెల 16న నిజామాబాద్లో పని ఉందని ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కోటగిరిలో వివాహిత.. రుద్రూర్: కోటగిరి మండల కేంద్రానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై సునీల్ బుధవారం తెలిపారు. ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇందల్వాయిలో.. ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై బుధవారం తెలిపారు. మతిస్థిమితం సరిగా లేని ఆమె ఈ నెల 17న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
దివ్యాంగ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● ఆర్మూర్, నందిపేట్ భవిత కేంద్రాల సందర్శన ఆర్మూర్: భవిత కేంద్రాల్లో దివ్యాంగ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, వారిని గాయపర్చే పదునైన వస్తువులు కేంద్రంలో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆర్మూర్, నందిపేట్ మండల కేంద్రాల్లో ఉన్న భవిత కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రాన్ని తనిఖీ చేసి, నిర్వహణ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి కరచలనం చేస్తూ, వారికి చాక్లెట్లు పంచి పెట్టారు. యాక్టివిటీ, థెరపీ రూమ్, టాయిలెట్స్, ఆఫీసు గదితో పాటు భవిత కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిజియోథెరపీ తరహాలో స్పీచ్ థెరపీస్టులను నియమించాలని సూచించారు. అనంతరం నందిపేట్ మండల కేంద్రంలో మరమ్మతులు చేపడుతున్న భవిత కేంద్రాన్ని సందర్శించారు. పనులు వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వి య, డీఈవో పీ అశోక్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు జీ రవి, ఉదయ్ కిరణ్, మురళి, ఆర్మూర్ ఎంఈవో రాజ గంగారాం, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో శివాజీ, ఆర్మూర్, నందిపేట్ ఐఈర్పీలు కిషన్, సురేశ్, నగేశ్ గౌడ్ తదితరులు ఉన్నారు. -
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
పెర్కిట్: ఆర్మూర్ మండలం పిప్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం నవీన్ కుమార్ బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీల్లో పాఠశాలకు చెందిన ఏ వైష్ణవి, ఎన్ అస్మిత అద్భుత ప్రతిభతో రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు హెచ్ఎం పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని అన్నారు. విద్యార్థులను హెచ్ఎం నవీన్, పీఈటీ గంగారెడ్డి, సర్పంచ్ కిరణ్, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ అభినందించారు. -
రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
● డీఏవో వీరాస్వామి డొంకేశ్వర్(ఆర్మూర్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతు ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే పీఎం కిసాన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులన్నారు. జిల్లాలో 2,91,749 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 1,74,979 మంది (60 శాతం) మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. మిగిలిన వారు త్వరగా నమోదు చేసుకోవాలన్నారు. అందుకోసం రైతులు ఆధార్ కార్డుకు లింకు కలిగిన ఫోన్ తీసుకెళ్లి స్థానిక వ్యవసాయాధికారులను లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవాలని డీఏవో కోరారు. ముగిసిన ‘మున్సిపల్’ కోడ్ సుభాష్నగర్: జిల్లాలోని నిజామాబాద్ నగరపాలక సంస్థతోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ ముగిసింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీల్లో జనవరి 27వ తేదీ నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 17వ తేదీతో ఎన్నికల కోడ్ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం నుంచి రోజూవారీ పనులతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు, ఇతరత్రా కార్యకలాపాల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మున్సిపల్లోని ఆయాశాఖల అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. కాగా, జిల్లాలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అటు పోలీసులు, ఇటు కమిషనర్లు, ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నాణ్యమైన సేవలు అందించాలి ● డీఎంహెచ్వో రాజ శ్రీ ● కీటక జనిత వ్యాధులపై సమీక్ష సుభాష్నగర్: కీటక జనిత వ్యాధుల నియంత్రణలో భాగంగా పనిచేసే సబ్ యూనిట్ అధికారులు, పర్యవేక్షక అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు వారి వారి విధుల్లో నాణ్యమైన సేవలు అందిస్తూ యాక్టివ్, పాసివ్ ఆర్డీటీని పెంచాలని డీఎంహెచ్వో రాజ శ్రీ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం డీఎంహెచ్వో కార్యాలయ స మావేశ మందిరంలో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. మలే రియా, ఫైలేరియా, డెంగీ, చికున్గున్యా, మె దడువాపు వంటి అన్నిరకాల వ్యాధులపై సమీక్షించారు. డాక్టర్ రాజ శ్రీ మాట్లాడుతూ ఐహెచ్ఐపీ మలేరియా పోర్టల్లో, ఎం4 అబ్స్ట్రాక్ట్ రిపోర్టును నిరంతరం ఎంట్రీ చే యాలన్నారు. ఫ్రైడే డ్రై డేను పకడ్బందీగా ని ర్వహిస్తూ ముందస్తు ప్రణాళిక, ప్రతి వారం నివేదికలను సమర్పించాలని సూచించారు. ప్రజలకు కీటక జనిత వ్యాధులు, సీజనల్ వ్యాధులపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఎంవో వెంకటేశ్, డాక్టర్ శ్రావ్య, ఏఎంవో షేక్ సలీం, సబ్ యూనిట్ అధికారులు, పర్యవేక్షక అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. ముగిసిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రధాన క్యాంపస్తోపాటు జిల్లా లో ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పీజీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 617 మందికి 585 మంది హాజరుకాగా 32 మంది గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. -
వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
నిజామాబాద్ అర్బన్: పదో తరగతి, ఇంటర్మీడి యట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 24,542 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 144 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు, ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 19,299 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,664 మంది, మొత్తం 36,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని వివరించారు. జిల్లాలో 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. లోటుపాట్లకు తావులేకుండా పరీక్షలు సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను సెంటర్లలో నియమించాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్న పత్రాలు, ఆన్సర్ షీట్లను తగిన భద్రత మధ్య తరలించాలని సూచించారు. కేంద్రాలలోకి సెల్ఫోన్లను అనుమతించకూడదన్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా జిల్లాకు చెడ్డ పేరు వస్తుందని, విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, అవకతవకలకు తావు కల్పించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఐఈవో రవికుమార్, డీఈవో అశోక్, ఏసీపీ మస్తాన్ అలీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. లీకేజీలు, అక్రమాలకు తావు కల్పిస్తే కఠిన చర్యలు కలెక్టర్ ఇలా త్రిపాఠి పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం -
శ్రీరస్తు.. శుభమస్తు..
● నేటి నుంచి శుభ ముహూర్తాలు ● మోగనున్న భాజాభజంత్రీలునిజామాబాద్ రూరల్: శుభ ఘడియలు వచ్చేశాయి. నేటి నుంచి వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు మంచి రోజులున్నాయి. గతేడాది నవంబర్ 26 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యమి నేపథ్యంలో శుభకార్యాలు లేకుండా పోయాయి. ఈ నెల 19 నుంచి పెళ్లి ముహూర్తాలు ఉండటంతో భాజాభజంత్రీలు మోగనున్నాయి. వచ్చే డిసెంబర్ వరకు అక్టోబర్ మినహా మిగతా అన్ని నెలల్లో సుముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనుండటంతో బట్టలు, బంగారం దుకాణాలు, ఫంక్షన్ హాళ్లు కళకళలాడనున్నాయి. భాజాభజంత్రీలు, డీజేలు, డెకరేషన్, క్యాటరింగ్, లగ్నపత్రికల ప్రింటింగ్ ప్రెస్లకు ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. సుముహూర్తాలు ఫిబ్రవరి 20, 21, 22, 25 మార్చి 5 , 6, 7, 8, 11, 12, ఏప్రిల్ 1, 2, 3, 4, 8, 10, 11, 12, 29, 30 మే 1, 3, 6, 8, 9, 10 జూన్ 20, 24, 25 జూలై 1, 2, 3, 8 ఆగస్టు 16, 20, 21, 23, 26, 27, 30 సెప్టెంబర్ 4, 6, 7 నవంబర్ 13, 14, 15, 18, 20, 21, 22, 26 డిసెంబర్ 3, 12, 13, 18, 19, 20, 31 అన్నీ మంచి రోజులే నేటి నుంచి వివాహాలకు మంచి ముహూర్తాలున్నా యి. గృహప్రవేశాలు, వివా హాలు, నూతన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. జిల్లాలో పెద్ద ఎత్తున శుభకా ర్యాలు జరుగుతాయి. – సాయి రాఘవాచార్యులు, పండితులు -
పంట వెనుక పంట
● పసుపు సాగైన భూముల్లో నువ్వు, సజ్జ సాగు ● మూడు నెలల్లో చేతికిరానున్న స్వల్పకాలిక పంటలు డొంకేశ్వర్(ఆర్మూర్): పంట వెనుక పంట సాగు చే స్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు బిజీగా ఉ న్నారు. పసుపు సాగు పూర్తి చేసిన రైతులు ఆ భూ ముల్లోనే స్వల్పకాలిక పంటలు వేస్తున్నారు. మూడు నెలల్లో చేతికొచ్చే సజ్జ, నువ్వులను సాగు చేసేందు కు ఆసక్తి చూపుతున్నారు. జొన్నలకు రేటు తక్కువ గా ఉండడంతో సజ్జ సాగు వైపు వెళ్తున్నారు. నువ్వులకు సైతం రానున్న రోజుల్లో ధర వచ్చే అవకాశం ఉందనే నమ్మకంతో రైతులు ముందుకొస్తున్నారు. కొంతమంది కర్బూజ సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 11,787 ఎకరాల్లో సజ్జ, నువ్వులు 8,239 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచ నా వేసింది. పసుపు తవ్వకాలు పూర్తి కావడంతో ప్రస్తుతం అవే భూములను సజ్జలు, నువ్వుల కోసం సిద్ధం చేస్తున్నారు. మార్చి వరకు విత్తనాలు వేసుకోవడానికి అవకాశం ఉందని వ్యవసాయాధికారు లు చెబుతున్నారు. సజ్జ, నువ్వు పంటలు జూన్ నా టికి చేతికి రానున్నాయి. పరిస్థితులు బాగుంటే సజ్జ ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అదే నువ్వుల విషయానికి వస్తే ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. సజ్జ, నువ్వు పంటలు పూర్తి కాగానే వర్షాలు కురిసే సమయానికి రైతులు సోయా సాగు చేస్తారు. అనంతరం మళ్లీ పసుపు సాగుకు సన్నద్ధమవుతారు. నాలుగు ఎకరాల్లో సజ్జ పసుపు పంట తీయగానే నా లుగు ఎకరాల్లో సజ్జ వేశాను. క్వింటాల్కు రూ.4,200 చొ ప్పున ఒప్పందం జరిగింది. నువ్వుతో పోలిస్తే వాతావరణ పరిస్థితులను సజ్జ తట్టు కుంటుంది. పంట మూడు నెలల్లో చేతికి వస్తుంది. – గజ్జల రవీందర్, రైతు, డొంకేశ్వర్ -
హిందూ సమాజాన్ని జాగృతం చేయాలి
● ప్రతిష్టిత వ్యక్తుల పాత్ర కీలకం ● ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ధర్మజాగరణ సహ సంయోజక్ ఏలే శ్యామ్కుమార్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో ప్రతిష్టిత వ్యక్తుల పాత్ర అత్యంత కీలకమైనదని ఆర్ఎస్ఎస్ అఖి ల భారతీయ ధర్మజాగరణ సహ సంయోజక్ ఏలే శ్యావ్ుకుమార్ అన్నారు. నగరంలోని శ్రీరా మ గార్డెన్స్లో బుధవారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రతిష్టిత వ్యక్తుల సమావేశం నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన శ్యామ్కుమార్ మాట్లాడుతూ భారతదేశం అన్నిరంగాల్లో ఎదుగుతుంటే ఓర్వలేని విదేశాల కుట్రల్లో భాగంగా కొన్ని సంస్థలు, దేశ విచ్ఛిన్నకర శక్తులు ఏకమై హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలకు పాల్పడుతున్నాయని అన్నారు. కుట్రలు, కుయుక్తులను సమర్థంగా తిప్పికొట్టేందుకు హిందూ సమాజం సమష్టిగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అందుకు కావాల్సిన ఐకమత్యాన్ని నిర్మాణం చేయడం కోసమే ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందన్నారు. భాష, ప్రాంతం, సరిహద్దు, కులాల పేరుతో హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. ఆ మాయల్లో పడి హిందువులు తమ స్వధర్మాన్ని మర్చిపోయి విదేశీ కుట్రలకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ స్థితి నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమాజంలోని అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులంతా తమ రంగాల్లోని ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ తన అస్తిత్వం కోసం ఏనాడూ పనిచేయలేదన్నారు. దేశభక్తి, హిందూ సమాజ సంఘటన ప్రాధాన్య తను వివరించడం ప్రస్తుత తక్షణ కర్తవ్యమ న్నారు. కేవలం హిందూ సమాజం కోసం, భారతదేశ కోసం మాత్రమే 100 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగించిందన్నారు. రానున్న కాలంలోనూ దేశం కోసమే పనిచేస్తుందని శ్యామ్కుమార్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇందూరు విభాగ్ సహ సంఘచాలక్ పాలేటి వెంకట్రావు, జిల్లా సంఘచాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం, విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్, నగర కార్యవాహ అరుగుల సత్యం, జిల్లా, నగరంలోని ప్రముఖులు పాల్గొన్నారు. -
పుస్తక పఠన సంకల్పం
● ప్రత్యేకంగా ఒక పీరియడ్ ● సుంకెట్ ఉన్నత పాఠశాలలో అమలు చేస్తున్న ఉపాధ్యాయులు ● గ్రంథాలయం ఏర్పాటు మోర్తాడ్(బాల్కొండ): సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా తదితర సామాజిక మాధ్యమాలతో నేటి యువత వ్యసనపరులవుతున్న నేపథ్యంలో ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థుల్లో పఠన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు మోర్తాడ్ మండలం సుంకెట్ ఉన్నత పాఠశాలలో వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యార్థికి పుస్తక పఠనం అలవాటు చేయాలనే సంకల్పంతో ఒక పీరియడ్ను గ్రంథాలయంలోనే కొనసాగిస్తున్నారు. పుస్తక పఠనం అబ్బితే ఉన్నత విద్య, ఉద్యోగ అర్హత పరీక్షలలో సులభంగా రాణించే అవకాశం ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు సంతోష్కుమార్ భావించారు. విజ్ఞానం అందించే ఎన్నో రకాల పుస్తకాలను పాఠశాల గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ కథల పుస్తకాలు, ప్రముఖుల జీవిత చరిత్రలతోపాటు సమాజానికి ఉపయోగపడే ఎన్నో రకాల పుస్తకాలను గ్రంథాలయంలో నిలువ చేశారు. ప్రతి తరగతి విద్యార్థులు వారంలో ఒక రోజు గ్రంథాలయంలో పుస్తక పఠనం చేసేలా షెడ్యూల్ను రూపొందించారు. తెలుగు ఉపాధ్యాయుడు నర్సింగ్దాస్ ఈ పుస్తక పఠనం పీరియడ్ను తీసుకుంటున్నారు. ప్రతి పాఠశాలలో పుస్తక పఠనానికి ఒక పీరియడ్ కేటాయించాలని నియమం ఉన్నా ఎక్కువ చోట్ల ఇది అమలు కావడం లేదు. సుంకెట్ ఉన్నత పాఠశాలలో మాత్రం ఒక ప్రత్యేక పీరియడ్ను పుస్తక పఠనం కోసం అమలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ముడుపులిస్తే.. మింగేయొచ్చు
అటవీ భూముల కబ్జాలను అడ్డుకోవాల్సిన అధికారులే అండగా నిలుస్తున్నారు. ముడుపులు తీసుకుంటూ అక్రమార్కులకు మార్గం సుగమం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ సంపాదన కోసం ఒకరికి మించి మరొకరు పోటీ పడుతున్నట్లు సమాచారం. సిరికొండ రేంజ్లో జరిగిన మాదిరిగానే కమ్మర్పల్లి రేంజ్లో మరో వ్యవహారం బయటపడింది. ● కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్లోనూ అవినీతి పర్వం! ● అధికారుల జేబులు తడిపితే అటవీభూముల కబ్జాకు గ్రీన్ సిగ్నల్ ● అన్యాక్రాంతంలో పాత్ర ఉన్న ఇద్దరు అధికారులపై చర్యలకు సిఫారసు ● మూడు నెలలైనప్పటికీ కరువైన చర్యలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అడవులను సంరక్షించాల్సిన అధికారులే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అటవీ సంరక్షణలో కేంద్ర, రాష్ట్ర చట్టాలను అమలు చేసేందుకు ప్రజాధనం జీతంగా వస్తున్నప్పటికీ అది చాలదన్నట్లు, జీతాలు తీసుకుని మరీ అడవులను కనుమరుగు చేస్తూ భారీగా దండుకుంటున్నారనే విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. పరిస్థితి ఎలా మారిందంటే తమకు ఉద్యోగం ఇచ్చి జీతాలు చెల్లించేది అక్రమ సంపాదనకు పోటీపడేందుకన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం అడవులను గుల్ల చేస్తున్న అక్రమార్కులకు అండగా నిలవడమే పనిగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకరిని మించి ఒకరు అక్రమ సంపాదన కోసం పోటీ పడుతునన్నట్లు తెలుస్తోంది. అమ్మలాంటి అడవులను కాసుల కోసం అమ్మకానికి పెడుతున్నారు. ఇటీవల సిరికొండ ఫారెస్ట్ రేంజ్లో ఓ సెక్షన్ ఆఫీసర్ ఇలాంటి ఘటనలోనే సస్పెండ్ కావడం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా కమ్మర్పల్లి అటవీ రేంజ్లో మరో వ్యవహారం బయట పడింది. ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు అధికారులపై వచ్చిన అక్రమ వ్యవహారాల ఆరోపణలు అటవీ శాఖలో చర్చనీయాంశమయ్యాయి. అటవీ భూముల ఆక్రమణల్లో పాత్ర ఉన్నట్లు తేలడంతో ఓ సెక్షన్ ఆఫీసర్, మరో బీట్ ఆఫీసర్పై చర్యల కోసం ఎఫ్ఆర్వో రవీందర్ ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఇది జరిగి మూడు నెలలు అయినప్పటికీ సదరు అధికారులపై ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పలువురు చెబుతున్నారు. ఐదు సెక్షన్లు.. 18 బీట్లు.. కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో మొత్తం 35 వేల ఎకరాలకు పైగా అటవీ విస్తీర్ణం ఉంది. ఐదు సెక్షన్లు, 18 బీట్లు ఉండగా 8 బీట్లకు అధికారులు లేకపోవడంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ రేంజ్లో పనిచేస్తున్న కొందరు అధికారులు అక్రమార్కులతో మిలాఖత్ అయి అటవీ భూములకు ఎసరు పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు సెక్షన్ అధికారి, బీట్ అధికారి పనిచేస్తున్న పరిధిలో భీమ్గల్ మండల ప్రాంతంలో 4 ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురైంది. కబ్జాదారుల నుంచి ముడుపులు తీసుకుని పూర్తి సహకారం అందించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫోన్పే ద్వారా డబ్బు లు పొందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో విచారణ చేపట్టి ఇద్దరు అధికారులపై చర్యలకు ఫైల్ సిద్ధం చేశారు. కబ్జా చేసిన వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేశారు. గతేడాది అక్టోబర్లో ఫైల్ ఆర్మూ ర్ ఎఫ్డీవోకు, తర్వాత అక్కడి నుంచి డీఎఫ్వోకు వెళ్లింది. అయితే వీళ్లపై చర్యలు తీసుకోకుండా అధి కారులపై ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. ‘మాపై చర్యలు తీసుకుంటే అందరి బాగోతం బయటపెడుతాం’ అని వారు అన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఇన్ని రోజులైనప్పటికీ వాళ్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. కమ్మర్పల్లి రేంజ్లో పనిచేస్తున్న మరొక డి ప్యూటీ ఎఫ్ఆర్వో మీద కూడా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. బయటకు పొక్కకుండా ఉన్నతాధికారు లే కాపాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటవీ అధికారులే ఆక్రమణలకు దన్నుగా నిలుస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కమ్మర్పల్లి ఎఫ్ఆర్వో రవీందర్ను ‘సాక్షి’ వివరణ కోరగా ఆరోపణలు వాస్తవమేనని, ఇద్దరి మీద నివేదిక రాసి ఉన్నతాధికారులకు పంపామన్నారు. మరొక అధికారిపై వచ్చిన ఆరోపణలు తన దృష్టికి రాలేదన్నారు. ఈ విషయమై జిల్లా అటవీ అధికారి వికాస్మీనాకు ఫోన్ చేయగా స్పందించలేదు. -
కారు అద్దాలు పగలగొట్టి రూ. 8 లక్షలు చోరీ
బాన్సువాడ: పార్కు చేసిన కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.8 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన కామారెడ్డి జిల్లా బా న్సువాడలో చోటు చేసుకుంది. బిచ్కుంద మండ లం హస్గూల్ గ్రామానికి చెందిన యాదారావు, మా ధవ్రావు అనే వ్యక్తులు మంగళవారం తమ బంధువుల ఆస్పత్రి ఖర్చుల కోసం బాన్సువాడ ఎస్బీఐ బ్యాంకులో రూ.8 లక్షల నగదును డ్రా చేశారు. అనంతరం బిస్కెట్ ప్యాకెట్లు కొనేందుకు తాడ్కోల్ చౌరస్తాలో ఉన్న ఓ మార్టుకు వెళ్లారు. అక్కడ కా రును పార్కు చేసి బిస్కెట్లు కొనేందుకు లోపలికి వెళ్లి వచ్చి చూడగా కారు అద్దం పగులగొట్టి ఉండ టాన్ని గమనించారు. వెంటనే కారు డోర్ తీసి చూ డగా వెనుక సీట్లో పెట్టిన రూ.8 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. -
రబీకి సరిపడా యూరియా నిల్వలు
వర్ని(మోస్రా): రబీ పంటకు సరిపడా జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి అన్నారు. సోమవారం యూరియా కోసం రైతులు రాస్తారోకో చేయడంతో స్పందించిన జిల్లా వ్యవసాయ అధికారి మంగళవారం మోస్రా మండలం గోవూరు సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, యూరియా నిల్వలను పరిశీలించారు. రైతులు ప్రభుత్వం సూచించిన యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలన్నారు. అక్రమ తరలింపును అడ్డుకోవడానికి ప్రభుత్వం కొత్త యాప్ విధానాన్ని తీసుకొచ్చిందని దీని ద్వారా రైతులకు సకాలంలో యూరియా అందుతుందని సూచించారు. మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్, సొసైటీ మాజీ చైర్మన్ పొట్టెంగారి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా
ఖలీల్వాడి : జేఈఈ మెయిన్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో పలు కళాశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. నగరంలోని బన్సల్ కాలేజీకి చెందిన దోడా రవితేజ(96.66), బీ నరసింహ(91.66), ఎన్ సంజీవ దత్తా(90.48), పీ త్రిషాల(89.21), పీ హాసిని(88.25), బీ దినేశ్కుమార్(87.40), ఏ వినాయక్(85.15) పర్సంటైల్ స్కోరుతో నిలిచినట్లు కళాశాల ఇన్చార్జి లక్ష్మణ్ మంగళవారం తెలిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కాలేజీ యాజమాన్య సభ్యులు సన్మానించారు. నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు ఖలీల్వాడి: జేఈఈ మెయిన్ ఫలితాల్లో నగరంలోని నారాయణ జూనియర్ కాలేజ్ విద్యార్థి ఇంజినీరింగ్ విభాగంలో సత్తా చాటినట్లు ప్రిన్సిపాల్ ఏజీఎం కుంట లక్ష్మారెడ్డి తెలిపారు. కాలేజీకి చెందిన పల్లెర్ల విరాజ్(99.73) పర్సంటైల్ స్కోరుతో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు. అలాగే ఎం విష్ణు ప్రసాద్(97.53), డీజే ప్రతీక్(96.72), బోగా శ్రీచరణ్ ఆదిత్య(96.71), బింగి వరుణ్(96.26), యెనుగుల శ్రీరామ్(95.64), ఎల్లా సాత్విక్(95.06), కే వెంకట అనీష్(94.23), ట్యాంక్ సిద్ధి(94.1), బీ ఓం సాయి మహంత(91.63), కే సాయి శ్రీఖర్(87.21), ఆర్ రాంచరణ్(85.94), కదం హాసిని(84.68), వంగ హర్షవర్ధన్(84.36), కొండపాక మోక్షద(83.98), దేశ్ముఖ్ అథర్వ్(82.65), బానోత్ క్రాంతికుమార్(82.16) పర్సంటైల్ స్కోరు సాధించారు. 22 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జీఎం కాట్రగడ్డ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ రవిగౌడ్, కోర్ డీన్ వీరాంజనేయ ప్రసాద్, కళాశాల ఏవో మేధరి శేఖర్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ నగరంలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు జేఈఈ మెయిన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 2023–24లో పదోతరగతి ఐపీఎల్ బ్యాచ్కి చెందిన చక్రాల శ్రీకర్(99.80), నల్లపు తనీశ్(99.75), బాగ్గాలి వర్షిత్(99.41), జిష్ణు(99.11), కొండా మనిమంతన్(99.07), యజ్ఞకత్ గౌడ్(98.83) పర్సంటైల్ స్కోరు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ స్వప్న, వైస్ ప్రిన్సిపాల్ ప్రదీప్ గౌడ్, ఐపీఎల్ ఇన్చార్జి శివకుమార్, డీన్ ఈశ్వర్ విద్యార్థులను అభినందించారు. -
ఏఐఎస్ఎఫ్ మహాసభలను జయప్రదం చేయండి
ఖలీల్వాడి: నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశం, రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తున్న ఏకై క విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బానోతు రఘురాం నాయక్, జిల్లా అధ్యక్షుడు సుబోద్, జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్, సంజయ్, కార్తిక్, కోశాధికారి అనూష, నాయకులు కిశోర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
అధ్యయనం–పోరాటమే ఏఐఎస్ఎఫ్ నినాదం
ఖలీల్వాడి : విద్యార్థుల సమస్యల పరిష్కారం, నా ణ్యమైన విద్య, ప్రజాస్వామ్య పరిరక్షణకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) సంఘం ని రంతరం పోరాడుతోంది. ఏఐఎస్ఎఫ్ ప్రధాన నినా దం ‘అధ్యయనం–పోరాటం’గా ముందుకు సాగు తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కారిస్తామని ప్రకటనలు చేస్తున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలో విద్యారంగ సమస్యలు, ఫీజురీయింబర్స్మెంట్, హాస్టల్లో కనీ స మౌలిక వసతుల కోసం ఏఐఎస్ఎఫ్ అనేక పోరాటాలు చేపట్టింది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏర్పడి 90 ఏళ్ల అవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగవ మహాసభలను జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి ఈనెల 20 వరకు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబోధ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం ఏర్పాట్లు చేస్తున్నారు. 1936లో ఏర్పాటు.. ఏఐఎస్ఎఫ్ సీపీఐ పార్టీకి అనుబంధగా పని చేస్తుంది. విద్యారంగ సమస్యల కోసం నిరంతర పోరాటాలు ఈ సంస్థ ద్వారా చేస్తారు. దీనిని 1936 ఆగ స్టు 12న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఏర్పాటు చేశా రు. బ్రిటీష్ పాలకుల నుంచి భారతదేశం విముక్తి కోసం ఏఐఎస్ఎఫ్ పని చేసింది. దేశ స్వాతంత్రం కోసం పోరాటంలో విద్యార్థులు ప్రాణత్యాగం చేశా రు. బుధవారం నుంచి ఈ నెల 20 వరకు తెలంగా ణ రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ నాలుగవ మహాసభలు నిర్వహిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబోద్ తె లిపారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి పులాంగ్ సమీపంలో ఉన్న టీటీడీ కల్యాణ మండపం వరకు ర్యాలీ ఉంటుందని అన్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా 500 విద్యార్థి సంఘాల ప్రతినిధులు వస్తారని, అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.టీటీడీ కల్యాణ మండం వద్ద ఏర్పాట్లు చేసిన ఏఐఎస్ఎఫ్ సభ ఫ్లెక్సీలునేడు జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మహాసభలు నరసింహారెడ్డి ప్రాంగణంగా నామకరణం రాష్ట్రవ్యాప్తంగా తరలిరానున్న విద్యార్థి సంఘాల ప్రతినిధులువిద్యారంగంలో నెలకొన్న సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తాం. జిల్లాలోని విద్యార్థులకు ఆడ్మిషన్లు, సంక్షేమ హాస్టల్లో సమ స్యలు, ప్రవేట్ స్కూళ్ల ఫీజు లు, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యల కోసం పో రాటాలు ఏఐఎస్ఎఫ్ చేస్తుంది. – రఘురాం, ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్ -
రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ డేలో ప్రతిభ
నిజామాబాద్ అర్బన్/ ఆర్మూర్: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ డేలో నిజామాబాద్ జిల్లా చిన్నారులు ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి చిన్నారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి హాజరైన దివ్యాంగ విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనగా జిల్లాకు చెందిన 35 మంది క్రీడాకారులు పలు విభాగాల్లో బహుమతులను కై వసం చేసుకున్నారు. స్పోర్ట్స్ డే మార్చ్ పాస్ట్లో అగ్రస్థానంలో నిలిచి మొదటి బహుమతిని దక్కించుకున్నారు. అదేవిధంగా ఇండోర్, అథ్లెటిక్స్లో వివిధ వయసుల్లో నిర్వహించిన పోటీల్లో పలు బహుమతులను కై వసం చేసుకున్నారు. లాంగ్ జంప్లో పునీత్(నిజామాబాద్) ద్వితీయ బహుమతి, స్పీడ్ వాకింగ్లో గంగోత్రి(కమ్మర్పల్లి) ద్వితీయ బహుమతి, ఫ్రాగ్ జంపింగ్లో విన్యశ్రీ(కమ్మర్పల్లి), అల్లూరి, మహాలక్ష్మి(జక్రాన్పల్లి) ద్వితీయ బహుమతి, తనీష్(మోర్తాడ్) స్పీడ్ వాకింగ్, మనీష్, చార్వీ (మోర్తాడ్) ఫ్రాగ్ జంపింగ్లో ద్వితీయ బహుమతులు, చార్వి లెమన్ స్ఫూన్లో తృతీయ బహుమతి, రితిక(డిచ్పల్లి) ఫ్రాగ్ జంపింగ్లో తృతీయ బహుమతి, అబ్దుల్ రజాక్(నిజామాబాద్) రన్నింగ్లో తృతీయ బహుమతి, షేక్ రూమన్ (ఇందల్వాయి) మ్యూజికల్ చైర్లో ద్వితీయ బహుమతి సాధించారు. విజేతలకు రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా బహుమతి అందజేశారు. హైదరాబాద్లో నిర్వహించిన పోటీల్లో సత్తా చాటిన జిల్లా దివ్యాంగ విద్యార్థులు మార్చ్పాస్ట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి కై వసం పలు క్రీడా పోటీల్లో బహుమతులు -
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరి మృతి
మద్నూర్లో వృద్ధురాలు.. మద్నూర్(జుక్కల్): ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన మద్నూర్లో చోటు చేసుకుంది. ఎస్సై మోహన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రేకుల్వార్ సాయవ్వ(76) అనే వృద్ధురాలు సోమవారం గ్రామ శివారులోని సోమలింగాల శివాలయానికి నడుచుకుంటు వెళ్తుండగా దారిలో ఉన్న మైసమ్మ చెరువులో కాలు కడుక్కునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి నీట మునిగింది. ఉదయం మృతదేహం బయటకు తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కోడలు సంతోషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం, మంగళవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చెరువులో పడి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.మోపాల్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం చిన్నాపూర్ గ్రామంలోని హన్మాన్ చెరువులో పడి పశువుల కాపరి పాట్రోలు మాణిక్యం (38) మృతి చెందినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామానికి చెందిన మాణిక్యం నాలుగైదు నెలల క్రితం ఉపాధి నిమిత్తం కుటుంబంతో కలిసి చిన్నాపూర్కు వచ్చాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కూలీ పనుల్లో భాగంగా మంగళవారం గేదెలు, ఆవులు మేపేందుకు చెరువు వద్దకు వెళ్లాడు. స్నానం చేసేందుకు కట్టపై బట్టలు ఉంచి నీటిలోకి దిగాడు. చెరువులోని గుంతలో పడిపోయిన మాణిక్యానికి ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. ఆయన పిల్లలు గమనించి స్థానికులకు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జాతీయ రహదారిపై కారు దగ్ధం
● ఒకరికి తీవ్రగాయాలుసదాశివనగర్(ఎల్లారెడ్డి): హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు ప్రమాదవశాత్తు మంటల్లో దగ్ధమైంది. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి సమీపంలో మంగళవారం జాతీయ రహదారి మీదుగా నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు కాగా కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు స్థానికులు తెలిపారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించారు. -
ఆరోగ్య జీవితానికి యోగా
● అర్సపల్లి ‘మైనారిటీ యోగా కేంద్రం’లో 25 ఏళ్ల ఉత్సవం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ అర్సపల్లిలోని మైనారిటీ యోగా కేంద్రంలో మంగళవారం 25 సంవత్సరాల వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ప్రముఖ యోగా గురువు అయిన ‘యోగా రత్న’ ఎక్కొండ ప్రభాకర్ ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో ఈ మైనారిటీ యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. మొదట్లో అర్సపల్లి ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం నాలెడ్జ్ పార్క్ స్కూల్లో నిర్వహిస్తున్నామని ప్రభాకర్ తెలిపారు. ప్రతిరోజూ యోగా చేస్తుండడంతో తామంతా అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడ్డామని యోగా కేంద్రం సభ్యులు, సీనియర్ సిటిజన్స్ తెలిపారు. కార్యక్రమంలో మైనారిటీ యోగా కేంద్రం అధ్యక్షుడు అబిద్ అలీ, నాలెడ్జ్ పార్క్ పాఠశాల కరస్పాండెంట్ సయ్యద్ ముజీబ్, షహీద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: రంజాన్ మాసంలో ఉర్దూ విద్యాలయాల పని వేళల్లో మార్పు ఉంటుందని డీఈవో అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉర్దూ విద్యాలయాలు పని చేస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఈనెల 23 నుంచి ఎల్ఎల్బీ సెమిస్టర్ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎల్ఎల్బీ ఐదో సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే సంపత్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ www.telanganauniversity.ac. inను సంప్రదించాలని ఆయన సూచించారు. రుద్రూర్: పొతంగల్ మండలం హంగర్గ గ్రామానికి చెందిన ఫౌజియా రైస్ మిల్ యజమాని మహ్మద్ వహీద్పై కేసు నమోదు చేసినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. ప్రభుత్వం ద్వారా రైస్మిల్కు సరఫరా చేసిన 6,62,043 క్వింటాళ్ల ధాన్యాన్ని దుర్వినియోగం చేయడంతో సివిల్ సప్లై అధికారి మంగళవారం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం విలువ రూ. 2,69,52,235 ఉంటుందన్నారు. సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పోలీస్స్టేషన్ పరిధిలో బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ మంగళవారం తన కార్యాలయంలో వారికి అందజేశారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోయిన ఫోన్లను సేకరించి బాధితులైన నిఖిల్రెడ్డి, గంగారెడ్డి, జగదీశ్కు అందించినట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని జల్దిపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి ఎనిమిది మందిని పట్టుకున్నట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. మంగళవారం గ్రామ శివారులో పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేశామన్నారు. ఈ దాడిలో 8 మందిని పట్టుకోగా వారి నుంచి రూ. 11,360 నగదు, 7 ఫోన్లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పోచారంతో బాన్సువాడ కౌన్సిలర్ల భేటీ
బాన్సువాడ: ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డిని మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో బాన్సువాడ కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిశారు. ఈ సందర్బంగా పోచారం మాట్లాడుతూ.. ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించారని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. నూతనంగా ఎన్నికై న కాంగ్రెస్ కౌన్సిలర్లకు పోచారం ప్రత్యేక అభినందనలు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మబేగం, కౌన్సిలర్లు గడుమల లింగమేశ్వర్, దొక్కంటి శ్యామల, రుక్మిణి, హకీం, జంగం రాజశేఖర్, కటికె రమేష్, నాయకులు జంగం గంగాధర్, గురు వినయ్, ఎజాస్, బాబా, బుల్లెట్ రాజు తదితరులున్నారు. -
పురాలు.. ఇక నందనవనాలు
ప్రథమ పౌరుల తొలి వాక్కులురూ. వెయ్యి కోట్లతో నగరాభివృద్ధి సాక్షి: పట్టణ శివారు కాలనీలకు తాగునీటి సరఫరా.. చైర్పర్సన్ : పట్టణంలోని శివారు కాలనీలతోపాటు అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అయ్యేలా అమృత్–2.0 పథకంలో పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే పైప్లైన్ పనుల విస్తరణ, ట్యాంక్ల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ● పలు కాలనీల్లో రోడ్లు లేవు.. స్థానికులకు ఇబ్బందులు ● నూతంగా ఏర్పాటైన పలు కాలనీల్లో రోడ్లు వేసేలా చర్యలు చేడుతాం. గతంలోనే రోడ్లు వేయిద్దామని అనుకున్నా వీలు కాలేదు. ● గతంలో టెండర్లయిన పనులు ప్రారంభించలేదు ● పట్టణంలోని ప్రధాన రహదారి అయిన శక్కర్నగర్ చౌరస్తా నుంచి తట్టికోట్ రోడ్డు మధ్యలో కల్వ ర్టు పనులు పూర్తయ్యాయి. డ్రెయి నేజీ నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. ● 2002 వివరాలతో పోలుస్తూ ప్రక్రియను వేగవంతం చేయండి ● వీడియోకాన్ఫరెన్స్లో సీఈవో సుదర్శన్రెడ్డి బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026– 8లో uఅటవీప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సిరికొండ : సిరికొండ అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న సిరిసిల్ల అటవీ ప్రాంతంలో పులి కదలికలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని ఆయా గ్రామాల ప్రజలకు సిరికొండ అటవీ రేంజ్ అధికారి కే నర్సింగరావు సూ చించారు. అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణ, పులి కదలికలపై మండలంలోని తాటిపల్లి, పందిమడుగు గ్రా మాల ప్రజలకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రేంజర్ మా ట్లాడుతూ.. ఎక్కడన్నా పులి కదలికలు కనిపిస్తే అటవీ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. అలాగే అటవీప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించే చర్యలకు పూనుకోవద్దని సూచించారు. అడవిలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే సమాచారం ఇవ్వాలని అన్నారు. డిప్యూటీ రేంజ్ అధికారి గంగారాం, శిక్షణ అధికారి కృష్ణగీత్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థినులు డిచ్పల్లి: రాష్ట్రస్థాయి బేస్బాల్ సీఎం కప్ పోటీలకు సుద్దపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల విద్యార్థినులు బి.నిశిత, డి.లిఖిత ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ టి.నళిని మంగళవారం తెలిపారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న సీఎం కప్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున ఎంపికై న క్రీడాకారిణులు పాల్గొంటారన్నారు. హైదరాబాద్కు బయల్దేరిన క్రీడాకారిణులను ప్రిన్సిపాల్ నళిని, వైస్ ప్రిన్సిపాల్ స్వప్న, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వనిత, పీఈటీ నర్మద, ఫిజికల్ డైరెక్టర్ జ్యోత్స్న, సాప్ట్బాల్ అకాడమీ కోచ్ వేముల మౌనిక మంగళవారం అభినందించారు. నేడు పీఎంశ్రీ స్కూళ్లకు కేంద్ర బృందాలు ఖలీల్వాడి: ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పాఠశాలల పరిశీలనకు కేంద్ర బృందాలు రానున్నాయి. బు ధ, గురువారాల్లో రెండు రోజులపాటు బృందాలు జిల్లాలో పర్యటిస్తాయి. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సూచన మేరకు వస్తున్న ఐఏ ఎస్ అధికారులు బృందాలుగా విడిపోయి స్కూళ్లను సందర్శిస్తారు. స్కూళ్ల నిర్వహణ, పురోగతిపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. నేషనల్ ఎడ్యేకేషన్ పాలసీలో భాగంగా తీసుకువచ్చిన పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 40 స్కూళ్లు ఉన్నాయి. ఒక్కో పాఠశాలకు రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు నిధులు కేటాయించారు. పాఠశాలల్లో ఆధునిక సాంకేతికతో కూడిన కోర్సులు, లైబ్రరీలు, లేబొరేటరీలు, డిజిటల్ బోధన విధానాలు, శానిటేషన్ తదితర అంశాలను కేంద్ర బృందాలు తనిఖీ చేయనున్నాయి. ఆ నివేదికల సంగతేమిటో..? జిల్లాలోని పీఎంశ్రీ స్కూళ్లలో నిధులు గోల్మాల్ పై ఏంఈవోలు డీఈవో కార్యాల యానికి గతంలో నివేదికలు అందించారు. కానీ విద్యాశాఖ నుంచి నిధులు గోల్మాల్ చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆ నివేదికలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్: నగరంలోని డీ–1 సెక్షన్ పరిధిలోగల పవర్హౌజ్ కంపౌండ్ సబ్స్టేషన్లో కొత్త 33 కేవీ బ్రేకర్ బిగించనున్నట్లు టౌన్–1 ఏడీఈ ఆర్ చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మాలపల్లి, శాంతినగర్, బాబన్సాహెబ్పాడ్, ఖిల్లా రోడ్, గాజుల్పేట్, లైన్గల్లీ, ఆర్ఆర్ రోడ్, నాగా రం, సాయినగర్ కాలనీ, రేడియోస్టేషన్, సీ తారాంనగర్ కాలనీలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ చైర్పర్సన్ పీఠాలను అధిరోహించిన అతివలు తమ పట్టణాలను నందనవనాలను చేస్తామంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా కౌన్సిల్ సభ్యులతోపాటు అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రగతిదిశగా అడుగులు వేస్తామంటున్నారు. ఆయా మున్సిపాలిటీల పగ్గాలు చేపట్టిన చైర్పర్సన్లను ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్తోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాలను కాంగ్రెస్ కేవసం చేసుకుంది. అటు గ్రామ పంచాయతీలు, ఇటు పురపాలకాల్లోన్ని అన్ని స్థానాలనూ స్వీప్ చేయడంతో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచి హుషారులో ఉన్నారు. జిల్లాలో ని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపుతో మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల్లోనూ భారీ విజయాలు సాధిస్తామని చెబుతున్నారు. ● సొంత జిల్లా కావడంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ 20 రోజులపాటు రెగ్యులర్గా జి ల్లాకు వస్తూ ప్రతి వ్యవహారాన్ని క్షుణ్ణంగా పర్యవే క్షించారు. అభ్యర్థుల గెలుపు కోసం అవసరమైన వ్యూహాలను అందించారు. పైగా సామాన్య కుటుంబానికి చెందిన తన శిష్యుడు కరాటే రమేష్ సతీమణి ఉమారాణిని నిజామాబాద్ మేయర్ పీఠంపై కూర్చోబెట్టడంపై మహేశ్గౌడ్ పార్టీ వర్గాల్లో సానుకూల ధృక్పథాన్ని పెంచారని పలువురు కార్యకర్తలు చెబుతున్నారు. జిల్లాపై గట్టి పట్టు సాధించిన పీసీసీ చీఫ్ ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లోనూ తిరుగులేని విజయాలు నమోదయ్యేలా చేశారు. భీమ్గల్లో గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్న పరిస్థితి నుంచి బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచే స్థితికి తీసుకొచ్చారు. జోడెద్దుల్లా పనిచేస్తామని.. వైఎస్ రాజశేఖర్రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్ మాదిరిగా పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, తాను కలిసి జోడెద్దుల మాదిరిగా పనిచేస్తామని సీఎం రేవంత్ చెప్పిన విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే జోడీ మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ పూర్తి చేయాలి నిజామాబాద్ అర్బన్: ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ ప్రక్రి య త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్రెడ్డి సూచించారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఇతర అంశాలపై హైదరాబాద్ నుంచి సీఈవో మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 2002 వివరాలతో ప్రస్తుత వివరాలను సరిపోలుస్తూ మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని మ్యాపింగ్ ప్రక్రియకు సహకారం అందించేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. 2002 ఓటర్ లిస్టు ప్రకారం కొత్త ఓటర్ లిస్టు మ్యాపింగ్ త్వరలో పూర్తి చేస్తామన్నారు. వీసీలో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, కిరణ్మయి, ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అవినీతి రహిత పాలనే లక్ష్యం పట్టణాభివృద్ధికి విజన్తో పని చేస్తాం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికే ప్రాధాన్యత అవినీతిరహిత పాలన అందిస్తా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ లహరి అవినీతి రహిత పాలన అందించడంతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను పట్టణ ప్రజలకు చేరువ చేయడానికే నా మొదటి ప్రాధా న్యత. గృహిణిగా ఉంటూనే భర్త చేసే వ్యాపారంలో చేదోడువా దోడుగా ఉంటున్న నాకు రాజకీయాల్లోకి రాగానే చైర్పర్సన్ పదవి లభించడం ఆనందంగా ఉంది. పట్టణ ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తా. – ఆర్మూర్ అవినీతి పాలనపై మా కుటుంబ సభ్యుల వ్యాపారాలు బాగున్నాయి. మాకు డబ్బుపై ఆశ లేదు. ప్రతిష్టాత్మమైన స్థానంలో కూర్చున్నాను కాబట్టి అవినీతి రహిత పాలనను అందించడమే మొదటి ప్రాధాన్యతగా భావిస్తా. మున్సిపల్ కార్యాలయంలో కానీ, పట్టణంలోని వార్డుల్లో కానీ అవినీతికి తావులేకుండా పాలన అందిస్తా. ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృద్ధి పెండింగ్ నిధులు తీసుకొస్తా మినీ స్టేడియం నిర్మాణానికి కృషి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందిస్తాం భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ బొదిరె నాగమణి ప్రతి సమస్యలను పరిష్కరిస్తాంబోధన్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా ప్రథమ లక్ష్యం. శివారు కాలనీల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అమృత్ పనులు కొనసాగుతున్నాయి. నూతన కాలనీల్లో రోడ్లు వేస్తాం. రెండో సారి చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది. పెండింగ్ పనులను పూర్తి చేయడంతోపాటు కొత్త పనులను చేపడతాం. – బోధన్టౌన్(బోధన్) పారిశుద్ధ్య నిర్వహణకు తీసుకునే చర్యలు పట్టణాభివృద్ధిలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణ జరిగేలా చూస్తా. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తా. తాగునీరు, వీధి దీపాల సమస్య తలెత్తుకుండా జాగ్రత్తలు తీసుకుంటా. పట్టణాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. బల్దియా కార్యాలయానికి సమస్యల పరిష్కరం కోసం వచ్చే వారికి సకాలంలో పనులు పూర్తయ్యేలా అధికారులను ఆదేశిస్తా.సాక్షి : అనూహ్యంగా చైర్ పర్సన్ పీఠంచైర్పర్సన్ : కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌ డ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్ వంటి ముఖ్య నాయకుల సహకారంతో చైర్ పర్సన్గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. పట్టణ అభివృద్ధికి ప్రణాళిక.. కాంగ్రెస్ అధిష్టానం నాపై నమ్మకంతో చైర్పర్సన్ అవకాశం కల్పించింది. పట్టణ అభివృద్ధితోనే ఆ పదవికి న్యాయం చేయడం అవుతుంది. ముఖ్య నాయకులను సమయానుకూలంగా కలిసి నిధుల మంజూరుకు విన్నవిస్తా. విపక్ష కౌన్సిలర్లు అడ్డుకొనే పరిస్థితి వస్తే.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు బాగుంటాయి. తర్వాత విపక్ష కౌన్సిలర్లను సైతం కలుపుకొని వెళ్తాం. వా ర్డుల్లో పర్యటి స్తూ స్థానిక స మస్యలు తెలుసుకుంటూ స మస్యల పరిష్కారానికి అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటాం. పట్టణ అభివృద్ధికి విజన్ ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను వినియోగించుకొని ఆదర్శవంతమైన, సుందరమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్ది రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుతాం. ఈ విషయంలో సీఎం రేవంత్రెడ్డి, వినయ్రెడ్డి సహకారం ఎల్లవేళలా మాకు ఉంటుందని ఆశిస్తున్నాం. మౌలిక సదుపాయాల కల్పన, పథకాల అమలు పాలకవర్గం అందించే సేవల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రధానమైనది. అలాగే అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తా. సాక్షి : నగర అభివృద్ధిపై మీ ప్రణాళిక మేయర్ : నిజామాబాద్ నగరానికి ఎంతో చరిత్ర ఉంది. నగర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కట్టుబడి ఉంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి తీరుతాం. రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే మా ముందున్న ప్రణాళిక. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని హామీనిచ్చారు. రింగ్ రోడ్డు పూర్తయితే నిజామాబాద్ దశ, దిశా మారిపోతుంది. స్మార్ట్సిటీ కోసం తీసుకునే చర్యలు నిజామాబాద్కు స్మార్ట్సిటీ పథకం కోసం కౌన్సిల్లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించేలా కృషి చేస్తాను. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటాం. స్మార్ట్సిటీ పథకం ద్వారా వచ్చే నిధులతో నగరాన్ని సుందరీకరిస్తాం. మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాం. 60 డివిజన్లలో శానిటేషన్ విభాగంతోపాటు డ్రింకింగ్ వాటర్, పబ్లిక్ హెల్త్పై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్రతి కాలనీలో రోడ్లు నిర్మిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, బైపాస్ రోడ్డు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడుతాం. మై నారిటీ కాలనీల్లో పారిశుధ్యం, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్లో కార్పొరేషన్కు అదనపు నిధులు నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం జిల్లాలోని ప్రభుత్వ పెద్దలతో కలిసి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. ప్రతిపైసా నగర అభివృద్ధికి ఖర్చు చే స్తాం. అవసరమైతే అదనపు నిధు లు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి, మంత్రులను కలుస్తాను. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాల పూర్తి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాల ప్రస్తుత పరిస్థితిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తాను. నిధుల కేటాయింపు, ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకురావాలన్న అంశాలపై సమీక్షలో నిర్ణయం తీసుకుంటాం. మొండి బకాయిల వసూళ్లు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆస్తి పన్ను, ఇతర పన్నులు కలుపుకుని సుమారు రూ.వంద కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని తెలిసింది. వీటి వసూళ్ల కోసం మున్సిపల్ సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. తప్పనిసరిగా వసూలు చేసి కార్పొరేషన్ను అభివృద్ధి చేస్తాం. ‘నిజామాబాద్ నగరాన్ని రాబోయే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తాం.. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, ఇతర ప్రభుత్వ పెద్దల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దుతాం. నా హయాంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి స్మార్ట్సిటీని సాధిస్తాం. ముఖ్యంగా నగరంలో పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తాను. కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారుల సహకారం, సమన్వయంతో ఆదర్శవంతమైన పాలనకు కృషి చేస్తాం. బైపాస్ రోడ్డు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. – సుభాష్నగర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ, టౌన్ప్లానింగ్ విభాగాల్లో ప్రక్షాళన మా హయాంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం ఉండదు. నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం. ముఖ్యమైన ఈ రెండు విభాగాలపై ప్ర త్యేక దృష్టి సారించి ప్రక్షాళన చేస్తాం. ఆదాయాన్ని సమకూర్చడంలోనూ, అనుమతులు మంజూరు చేయడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకమైన పాలన అందించేందుకు కృషి చేస్తాం. సాక్షి : పట్టణంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు చైర్ పర్సన్ : పలు చోట్ల డ్రెయినేజీ కల్వర్టులు చిన్నగా, ఇరుకుగా ఉన్నాయి. వర్షాకాలంలో చెత్తాచెదారం ఇరుక్కొని వరద నీరు ముందుకు ప్రవహించడం లేదు. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తాం. మినీ స్టేడియం లేక క్రీడాకారులకు ఇబ్బందులు పట్టణ పరిధిలో మినీ స్టేడియం కోసం పాలకవర్గంతో చర్చించి ముందుగా స్థలం గుర్తిస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు కోసం ప్రయత్నిస్తాం. తాగునీటి సమస్య పరిష్కారం పలు వార్డుల్లో తాగునీటి పైప్లైన్ ఎత్తుగా ఉండడంతో నీటి సరఫరాలో ఆటంకం ఏర్పడుతోంది. సమస్యను త్వరగా పరిష్కరిస్తాం. అదేవిధంగా అమృత్ 2.0 పథకంతో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తాం. వంద పడకల ఆస్పత్రి, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనుల పూర్తి నిధులు తెచ్చి మిగిలిపోయిన వంద పడకల ఆస్పత్రి, మార్కెట్ పనులను పూర్తి చేస్తాం. ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. పట్టణంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ దీనిపై ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా చెప్పారు. ఆగిపోయిన పనులను నిధులు తెచ్చి మూడు, నాలుగు నెలల్లో పూర్తయ్యేలా చూస్తాం. పెండింగ్ పనుల వివరాలను నియోజకవర్గ ఇన్చార్జి సునీల్కుమార్ ద్వారా పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యేలా చూస్తాం. భీమ్గల్ పట్టణాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తా. ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా. కాంగ్రెస్కు పట్టం కట్టిన ప్రజల నమ్మకాన్ని నిలబెడతా. ఆగిపోయిన పనులను నిధులు తీసుకువచ్చి మూడు నాలుగు నెలల్లో పూర్తి చేస్తా. క్రీడాకారుల కోసం మినీ స్టేడియం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాం. తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. – కమ్మర్పల్లి(భీమ్గల్) స్మార్ట్సిటీని సాధించి తీరుతాం అందరి సహకారంతో ఆదర్శవంతమైన పాలనకు కృషి పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లపై ప్రత్యేక దృష్టి నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి -
సంక్షేమం, అభివృద్ధికి ఆదరణ
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ర్పాటయ్యాక రెండేళ్లకాలంలో చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికీ చేరాయి. అభివృద్ధి విషయంలోనూ రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ, దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోంది. ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ జిల్లాలో మత రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. జి ల్లాకు ఇప్పటికే వ్యవసాయ కళాశాల, తెలంగా ణ వర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల, రూ.600 కో ట్లతో జిల్లాలో మూడు చోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను మా ప్రభుత్వం మంజూరు చేసింది. భవిష్యత్తులో నగరం చుట్టూ రింగ్రోడ్డు ఏర్పాటు చేస్తాం. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఏమీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జిల్లాకు మెడికల్ కాలేజ్, తెలంగాణ వర్సిటీ, 16 చోట్ల ఎత్తిపోతల పథకాలు, పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్ర భుత్వం వచ్చాకే జిల్లాకు అన్ని రకాల అభివృద్ధి ప్రాజెక్టులు మంజూరు అవుతున్నాయి. దీంతో ప్రజలు మరింతగా మద్దతు ఇస్తున్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కిస్తాం. ● మహేశ్కుమార్ గౌడ్, పీసీసీ చీఫ్ -
అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలి
సుభాష్నగర్: సమర్థవంతమైన పాలన అందిస్తూ పల్లెల అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాల ని మహిళా సర్పంచ్లకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నూతనంగా ఎన్నికై న మహిళా సర్పంచులకు జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో మంగళవారం శిక్షణ ప్రారంభించగా కలెక్టర్ ముఖ్య అతి థిగా హాజరై సర్పంచుల అధికారాలు, విధులు, బాధ్యతలను వివరించి అవగాహన కల్పించారు. ఐదు రోజులపాటు కొనసాగనున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిథ్యం కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళా సర్పంచులు సద్వినియోగం చేసుకుని, గ్రామాల్లో సమర్ధవంతమైన పాలనను అందిస్తూ రిజర్వేషన్లకు సార్థకత చేకూర్చాలని అన్నారు. పాలనలో కుటుంబ సభ్యుల జోక్యానికి అవకాశం ఇవ్వకుండా, గ్రామ ప్రథమ పౌరురాలిగా గౌరవాన్ని పెంచుకోవాలని, ఇది భవిష్యత్లో మరెన్నో ఉన్నత పదవులకు ఆస్కారం కల్పిస్తుందని సూచించారు. నిధులు, విధులను సక్రమంగా విని యోగిస్తూ, అందరి సమన్వయంతో గ్రామాల సమ గ్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారు లు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, కస్తుర్బా గాంధీ విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తూ, ఏవైనా లోటుపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల ప్రగతి కోసం సర్పంచ్లకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో తోడ్పాటునందిస్తుందని హామీ ఇచ్చారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన 10 మంది సర్పంచులను ఉత్తమ సర్పంచులుగా ఎంపిక చేసి సన్మానిస్తామని ప్రకటించారు. శిక్షణా తరగతుల్లో చెప్పే ప్ర తి అంశాన్ని చక్కగా ఆకళింపు చేసుకుని, గ్రామాల్లో సమర్థవంతమైన పాలనను అందిస్తూ ప్రతి ఒక్క రూ ఉత్తమ సర్పంచులుగా గుర్తింపు పొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి.శ్రీనివాస్ రావు, ఏవో రాజాబాబు, డీఎల్పీవోలు, ఆయా గ్రామాల మహి ళా సర్పంచులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. మహిళా ప్రజాప్రతినిధులు సమర్థవంత పాలన అందించాలి ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో అమలు చేయాల్సిన బాధ్యత మీపైనే.. మహిళా సర్పంచ్లకు శిక్షణలో కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నిజామాబాద్
వాతావరణం ఉదయం ఈదురు గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. పగలు ఎండ తీవ్రత పెరుగుతుంది. రాత్రి చలి తీవ్రత తగ్గుతుంది.ఫిర్యాదులను త్వరితగతిన.. ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపా ఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కాంగ్రెస్ మేయర్ అభ్యర్థికి అనుకూలంగా చేతులెత్తిన పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్గౌడ్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కార్పొరేటర్లు బీజేపీ మేయర్ అభ్యర్థి స్రవంతిరెడ్డికి అనుకూలంగా చేతులెత్తిన ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణకామారెడ్డి చైర్పర్సన్గా ఇప్ప ఉమారాణి సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్లో చేరిన 38వ వార్డు కౌన్సిలర్ ఇప్ప ఉమారాణి కామారెడ్డి ము న్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అలా గే బిచ్కుంద మున్సిపల్ చైర్పర్సన్గా సీమా షెట్కార్, బాన్సువాడ బల్దియా చైర్పర్సన్గా కాసుల విజయ, ఎల్లారెడ్డి మున్సిపాలి టీ చైర్పర్సన్గా పద్మ శ్రీకాంత్ ఎన్నిక య్యారు. జిల్లాలో నాలుగు బల్దియాలు ఉండగా.. రెండు చైర్పర్సన్ స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. అయితే మూడింటిలో మహిళలకు అవకాశం దక్కడం గమనార్హం. కామారెడ్డి, బాన్సువాడలను మహిళలకు కే టాయించగా.. అదనంగా జనరల్ స్థానమైన బిచ్కుంద సైతం వారి ఖాతాలోనే చేరింది. మరోవైపు నాలుగుచోట్లా వైస్ చైర్పర్సన్లుగా మహిళలే ఎన్నికవడం గమనార్హం. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలి నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన బా లబాలికలు తమ ప్రతిభను చాటాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు పాఠశాల వి ద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని దోమలగూడలో మంగళవారం నుంచి క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా, జిల్లా నుండి 35 మంది బాలబాలికలతో కూడిన బృందం పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం బయ ల్దేరి వెళ్లింది. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణ నుంచి బస్సు బయల్దేరగా కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు. చిన్నారులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. డీఈవో అశోక్, భవిత కేంద్రాల కో ఆర్డినేటర్ శ్రీనివాస్రావు, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. పీజీ పరీక్షలు 26కు వాయిదా తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 17 నుంచి ప్రారంభం కావాల్సిన పీజీ మొదటి సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ పీజీ (ఐఎంబీఏ) 7వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26 కు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి సంపత్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల వినతి మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. పసుపు పరిశోధన కేంద్రంలో అమెరికా ప్రొఫెసర్లు కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని అమెరికాలోని అలబామా ఉద్యాన యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ల బృందం సోమవారం సందర్శించింది. పసుపుపై కొనసాగుతున్న పరిశోధన ల గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పసుపు రకాలు, కుర్కుమిన్ శాతం, దిగుబడి, పంట కాల పరిమితి, వివి ధ రకాల సాగు ప్రయోజనాలు, యాజమా న్య పద్ధతుల గురించి అమెరికా యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాసరావు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పనిముట్లు పసుపు శుద్ధి పాలిషింగ్, నిల్వ చేసే పద్ధతులను తెలుసుకున్నారు. అమెరికాలో పసుపు సాగుపై అక్కడి రైతులు ఆసక్తి చూపుతున్నారని ప్రొఫెసర్ శ్రీనివాసరావు తెలిపారు. మహిళలే.. పురపాలికలు సుభాష్నగర్: నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పదవి కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా 49వ డివిజన్ నుంచి ఎన్నికై న కూరగాయల ఉమారాణి పేరు ను ఆ పార్టీకి చెందిన సభ్యుడు అగ్గు భోజన్న ప్రతిపాదించగా, అబుద్ బిన్ అథర్ బలపర్చా రు. బీజేపీ మేయర్ అ భ్యర్థిగా జి స్రవంతి రెడ్డి పేరును వీరమాచినేని ప్రమోద్కుమా ర్ ప్రతిపాదించగా, ఎర్రం సుధీర్ బలపర్చారు. డిప్యూటీ మే యర్ పదవి కోసం ఏఐఎంఐఎం తరఫు న సల్మా తహసీన్ (54వ డివిజన్), బీజేపీ అభ్యర్థిగా బంటు రాము పోటీపడ్డారు. అధికారులు చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక జరిపించారు. నగర పాలక సంస్థలో మొత్తం 60 కార్పొరేటర్లతోపాటు ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పి రాకేశ్రెడ్డి ఎక్స్ అఫీషియో హోదాలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. మొత్తం 65 మంది సభ్యులకుగాను 34 మంది సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థిని కూరగాయల ఉమారాణిని మేయర్గా, ఏఐఎంఐఎం అభ్యర్థిని సల్మా తహసీన్కు డిప్యూటీ మేయర్గా మద్దతు తెలిపారు. బీజేపీ అభ్యర్థులుగా పోటీ పడిన గోపిడి స్రవంతిరెడ్డి, బంటు రాములకు 31 మంది మద్దతు లభించింది. దీంతో నిజామాబా ద్ నగర మేయర్గా ఉమారాణి, డిప్యూటీ మేయ ర్గా సల్మా తహసీన్ ఎన్నికై నట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే నగర తొలి మహిళా డిప్యూటీ మేయర్గా సల్మా తహసీన్ ఎన్నికయ్యారు. నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ, వీడియో చిత్రీకరణ నడుమ పూర్తి పారదర్శకంగా ఈ ఎన్నికల ప్రక్రియను జరిపించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సరిపడా కోరం ఉందని నిర్ధారించుకున్న తర్వాతే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీవారే పాలనా పీఠాలు ఎక్కారు. నిజామాబాద్, బోధన్లలో హంగ్ నెలకొన్నప్పటికీ ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మేయర్, చైర్పర్సన్ పదవులను చేజిక్కించుకుంది. ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో సంపూర్ణ ఆధిక్యంతో కాంగ్రెస్ పీఠాలను వశం చేసుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవిని ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్గా కాంగ్రెస్కు చెందిన కూరగాయల ఉమా రాణి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా ఎంఐఎం పార్టీకి చెందిన సల్మా తహసీన్ను ఎన్నుకున్నారు. సోమవారం నిర్వహించిన ఓటింగ్లో వీరిద్దరికీ 34 మంది మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లతోపాటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక కార్పొరేటర్, ఎక్స్అఫీషియో ఓటర్లు ఎమ్మెల్సీ బొ మ్మ మహేశ్కుమార్గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఉమారాణి, సల్మా తహసీన్కు మద్దతుగా చేతులెత్తారు. దీంతో ఓట్ల సంఖ్య 34 అయింది. బీజేపీ నుంచి మేయర్ పదవికి గోపిడి స్రవంతిరెడ్డి నామినేషన్ దాఖలు చేయగా ఆమెకు మద్దతుగా పార్టీకి చెందిన 28 మంది చేతులెత్తారు. అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి స్రవంతికి మద్దతుగా చేతులెత్తారు. 34 ఓట్లు వచ్చిన కాంగ్రెస్కు చెందిన ఉమారాణి, ఎంఐఎంకు చెందిన సల్మా తహసీన్లు మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం అభ్యర్థులు వేరువేరు బస్సుల్లో ఆయా క్యాంపుల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చారు. సుభాష్నగర్: రాష్ట్రంలో 42శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వలేకపోయినా.. నిజామాబాద్ మేయర్ పదవిని బీసీలకు ఇచ్చి చిత్తశుద్ధిని చాటుకున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. మేయర్ ఎన్నిక అనంతరం కార్పొరేషన్ కార్యాలయం వద్ద, నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఉమారాణి ఎంఐఎం, బీఆర్ఎస్ మద్దతుతో మేయర్గా ఎన్నికయ్యారని, ఆమె ఎన్నిక చరిత్రాత్మకమని అన్నారు. 16 ఏళ్ల తర్వాత మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ కై వసం చేస్తుందని, 17 సీట్లు గెలిపించిన పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధే తమ ఎజెండా అని, ఎంఐఎంతో పొత్తు లోపాయికారి పొత్తు కాదని స్పష్టంచేశారు. ఎంఐఎంతో ఎన్నికల్లో పోటీ పడ్డామని, ఎన్నికలయ్యాక పొత్తు అనివార్యమైందని అన్నారు. ఈ ఎన్నిక వరకు మాత్రమే పొత్తు పరిమితమని అన్నారు. బీజేపీ మతాన్ని రెచ్చగొట్టి పోటీ చేసిందని విమర్శించారు. నిజామాబాద్ నగరాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేయాలనే తపనతోనే ఎంఐఎం, బీఆర్ఎస్ సభ్యులు మద్దతు తెలిపారని స్పష్టంచేశారు.ప్రశాంతంగా ప్రత్యేక సమావేశాలు సుభాష్నగర్: జిల్లాలోని నగర పాలక సంస్థతోపాటు బోధన్, ఆర్మూర్, భీ మ్ గల్ మున్సిపాలిటీల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రశాంతంగా ము గిశాయి. నూతనంగా ఎన్నికై న సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశాలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి మార్గనిర్దేశంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్లో ఆర్డీవో రాజేంద్రకుమార్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించగా, బోధన్, ఆర్మూర్ల సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, భీమ్గల్లో జెడ్పీ సీఈవో సా యా గౌడ్ పీవోగా బాధ్యతలు నిర్వర్తించారు. 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్టీల వారీగా సభ్యులు సమావేశపు హాళ్లలోకి చేరుకో గా, ఎన్నికై న సభ్యులతో అధికారులు తెలుగులో ప్రమాణం చేయించారు. కా ర్పొరేషన్లో ఎక్స్ అఫీషియో సభ్యులు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో పాల్గొన్నారు.‘పురం’ హస్తగతం నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్లలో రెండో టర్మ్.. బోధన్లో వరుసగా రెండోసారి చైర్పర్సన్గా తూము పద్మ నిజామాబాద్లో వరుసగా మూడోసారి మహిళా మేయర్ -
మున్సిపాలిటీలను రోల్మోడల్గా తీర్చిదిద్దుతాం
సుభాష్నగర్: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చి దేశానికే రోల్మోడల్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త మ్ కుమార్రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ప్రభు త్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండేళ్లలో రాష్ట్రంలో జరిగిన అ భివృద్ధి, సంక్షేమ పథకాల అమలు దేశంలోని ఏ రా ష్ట్రంలో జరగలేదని, ఇది తన 40 ఏళ్ల రాజకీయ అ నుభవంతో చెబుతున్నానని అన్నారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో పూడిక తీసి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచుతామని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలతోపాటు మున్సిపాలిటీల్లోనూ ప్రజ లు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. మంచిప్ప 21, 22 ప్యాకేజీలకు నిధులు కేటాయించి పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు. నాయకుడు నరేందర్రెడ్డికి సరైన గుర్తింపు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి.. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలు అభివృద్ధిని ఆదరించారని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓట్లు, సీట్లు తగ్గ డం సాధారణమేనని, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని అన్నారు. అర్వింద్.. ఫెయిల్యూర్ ఎంపీ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఫెయిల్యూర్ ఎంపీ అని, ఏడేళ్లలో ఏం చేశారో చెప్పడం లేదని, భవిష్యత్లో ఏం చేస్తారో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి విమర్శించారు. ఇప్పటికై నా మతం, దేవుడి పేర్లతో ఓట్లు అడగడం మానుకోవాలని హితవుపలికారు. అనంతరం మేయర్గా ఎన్నికై న కూరగాయల ఉమారాణిరమేశ్తోపాటు కాంగ్రెస్ కార్పొరేటర్లను సన్మానించారు. కాంగ్రెస్ భవన్ ఎదుట నాయకు లు, కార్యకర్తలు పటాకులు కాల్చి సంబరాలు చేశా రు. డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి, కార్పొరేషన్ చైర్మ న్లు తాహెర్, మానాల మోహన్రెడ్డి, వ్యవసాయ క మిషన్ సభ్యు డు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నరేందర్రెడ్డి, వైశాక్షి సంతోష్, జావిద్ అక్రమ్, ఖుద్దూస్, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామీణులతోపాటు పట్టణవాసులూ కాంగ్రెస్ వైపే.. పార్లమెంట్ పరిధిలో క్లీన్స్విప్ చేయడం సంతోషం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
మూడు చోట్ల..
●బోధన్లో ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ చైర్పర్సన్ స్థానం దక్కించుకుంది. ఇది జనరల్ స్థానం అయినప్పటికీ మళ్లీ మహిళనే చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. తూము పద్మను చైర్పర్సన్ చేశారు. పద్మ గత టర్మ్లోనూ ఇదే పదవిని నిర్వహించారు. 38 వార్డులు ఉన్న బోధన్లో మ్యాజిక్ ఫిగర్ 20. కాంగ్రెస్ 17, ఎంఐఎం 12, బీఆర్ఎస్ 5, బీజేపీ 3 వార్డులు గెలవగా, స్వతంత్రులు ఒకరు గెలిచారు. కాంగ్రెస్, ఎంఐఎం, ఇండిపెండెంట్, ఎక్స్ అఫీషియో అయిన ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఓట్లు కలిపి 31 వచ్చాయి. పద్మ చైర్పర్సన్ కాగా, ఎంఐఎంకు చెందిన మీర్ ఇలియాస్ అలీ వైస్ చైర్మన్ అయ్యారు. ● ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా గోనె లహరి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా కాటిపల్లి వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. భీమ్గల్ చైర్పర్సన్గా బొదిరె నాగమణి, వైస్ చైర్ పర్సన్గా సంటి లత ఎన్నికయ్యారు. జిల్లాలో గత టర్మ్లోనూ నలుగురు పురపాలికలు మహిళలే కావడం విశేషం. నిజామాబాద్ నగరానికి వరుసగా ముగ్గురు మేయర్లు బీసీ మహిళలే కావడం విశేషం. తెలంగాణ వచ్చాక ఇప్పటివరకు ఇందూరు నగరానికి మహిళలే మేయర్లు అవుతూ వస్తున్నారు. -
ఆ పార్టీలన్నీ ఒక్కటేనని గతంలో చెప్పా
సుభాష్నగర్: బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని, ఆ పార్టీలన్నీ ఒక్కటేనన గతంలోనే తాను చెప్పానని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. మేయర్ ఎన్నిక అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్లో కాంగ్రెస్కు 34 ఓట్లు, బీజేపీకి 31 ఓట్లు వచ్చాయని, 3 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మేయర్, ఎంఐఎం డిప్యూ టీ మేయర్ పదవిని గెల్చుకున్నాయన్నారు. బీజేపీని ఓడించేంఉదకు అనైతిక పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు. బీజేపీ ఓటమిలో కాంగ్రెస్ రంగు పూసుకుని తిరిగే పోలీసుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. నైతిక విజయం తమదేనని, ఈ టర్మ్ అయ్యేలోపు కార్పొరేషన్ను బీజేపీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. కాళేశ్వరం, ఈ కార్ రేసింగ్ తదితర కేసుల్లో కేసీఆర్, కేటీఆర్లను సీఎం రేవంత్రెడ్డి ఎందుకు కాపాడుతున్నారో ఈ రోజుతో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. ఆయన వెంట కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు. బీజేపీని ఓడించేందుకు అనైతిక పొత్తు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి టర్మ్ అయ్యేలోగా కార్పొరేషన్ను కై వసం చేసుకుంటాం మీడియాతో ఎంపీ అర్వింద్ ధర్మపురి -
నాడు రమేష్కు కరాటే గురువు
● నేడు రమేష్ సతీమణి ఉమారాణికి మేయర్ పదవి ● ఇదీ శిష్యుడి కుటుంబానికి మహేశ్గౌడ్ ఇచ్చిన విలువ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శిష్యుడి కుటుంబం నిరుపేదదైనప్పటికీ అనుబంధాన్ని మాత్రం మరింత బలోపేతం చేశారు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ గౌడ్. తన శిష్యుడు కరాటే రమేష్ సతీమణి కూరగాయల ఉమారాణిని నిజామాబాద్ మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. నగరానికి చెందిన రమేష్ (కరాటే రమేష్) 40 ఏళ్ల క్రితం మహేశ్గౌడ్ వద్దకు వచ్చాడు. కరాటేలో శిక్షకుడిగా ఉన్న మహేశ్గౌడ్ రమేష్ను కరాటేలో నిష్ణాతుడిని చేశారు. నాటి నుంచి నేటివరకు వాళ్ల గురుశిష్య బంధం మరింత బలపడుతూ వచ్చింది. కరాటే ద్వారా వచ్చిన శిష్యరికాన్ని రమేష్ రాజకీయంలోనూ కొనసాగించారు. రమేష్ పేద కుటుంబానికి చెందిన వ్య క్తి అయినప్పటికీ మహేశ్గౌడ్ మంచి విలువ ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో రమేష్ సతీమణి ఉమారాణిని కార్పొరేటర్గా నిలబెట్టి గెలిపించారు. ఇంతటితో ఆగకుండా ఉమారాణిని ఏకంగా మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. తనకు విధేయుడిగా ఉన్న రమేష్ కుటుంబం విషయంలో మహేశ్గౌడ్ చూపిన అభిమానాన్ని వెలకట్టలేమని వారిగురించి తెలిసినవారు చెబుతున్నారు. ఇప్పటికీ టైలరింగ్ పనిచేస్తున్న ఉమారాణిని మేయర్గా ప్రతిపాదించిన నేపథ్యంలో మహేశ్గౌడ్పై అనేక ఒత్తిళ్లు వచ్చాయి. ఇతరులు భారీగా డబ్బులు ఆఫర్ చేసినప్పటికీ వాటిని తిరస్కరించారు. శిష్యుడి భార్య ఉమారాణికే పట్టం కట్టారు. ఇదిలా ఉండగా తన సొంత నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపాలిటీ గెలుపు కోసం సైతం మహేశ్గౌడ్ రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
బోధన్/రుద్రూర్ : మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. సాలూర మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం, ఎడపల్లి మండలం ఠాణాకలాన్లో వీడీసీ, గ్రామ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలు రసవత్తరంగా సాగాయి. మల్లయోధులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. విజేతలకు గ్రామ ప్రజాప్రతినిధులు నగదు బహుమతులు అందజేశారు. రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామంలో తొలి సర్పంచ్ కిషన్రావు పటేల్ స్మారకార్థం కుస్తీ పోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన మల్లయోధులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. -
ఇద్దరూ బీడీ కార్మికులే..
కమ్మర్పల్లి(భీమ్గల్): ఇన్నాళ్లూ బీడీలు చుట్టిన వారిద్దరూ పురపాలకులయ్యారు. భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లుగా ఎన్నికై న బొదిరే నాగమణి, వైస్ చైర్పర్సన్ సంటి లత ఇద్దరూ బీడీ కార్మికులే. బీడీలు చుడుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. వీరిరువురి భర్తలు రాజకీయ నాయకులుగా అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల్లో కొనసాగుతున్నారు. చైర్పర్సన్ నాగమణి భర్త బొదిరే స్వామి భీమ్గల్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు, వైస్ చైర్పర్సన్ సంటి లత భర్త జేజే నర్సయ్య భీమ్గల్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి రిజర్వేషన్ అనుకూలించడంతో 6వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున కౌన్సిలర్గా గెలిచిన నాగమణి చైర్పర్సన్గా, 10వ వార్డు కౌన్సిలర్ సంటి లతను వైస్ చైర్పర్సన్గా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడంతో అదృష్టం కలిసొచ్చింది. -
పుర పాలకులొచ్చారు..
జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల పాలకులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు క్యాంపుల నుంచి పార్టీ ప్రతినిధులు, నేతలతో కలిసి బస్సుల్లో మున్సిపాలిటీలకు చేరుకున్నారు. మొదట కార్పొరేటర్, కౌన్సిలర్లుగా గెలిచిన వారందరితో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఓటింగ్ ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు, మద్దతుదారులు సంబురాలు నిర్వహించారు. – సాక్షి నెట్వర్క్ -
విపక్షాలకు నో ఎంట్రీ
ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా ఆర్మూర్ పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించిన తీరు సోమవారం వివాదాస్పదమైంది. ఆర్మూర్ ఏ సీపీ వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్(చిన్న), కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డిలు కార్లలో రాగా వారిని లోపలికి అనుమతించారు. దీంతో బీజేపీ రైతు నాయకుడు నూతుల శ్రీనివాస్రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి పొల్కొం వేణు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు అభ్యంతరం తెలుపుతూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను లోనికి అనుమతించి బీజేపీ నాయకులను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీంతో పోలీసులు ఇరువర్గాల వారిని బయటకు పంపించడంతో వివాదం సద్దుమణిగింది. -
ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం అనంతరం సోమవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జెడ్పీ డిప్యూటీ సీఈవో సాయన్నలతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 34 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని సూచించారు. సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలి మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఆయా కార్యాలయాల పనితీరును, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రధానంగా పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించి, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. బాలికల విద్యాలయాలు, హాస్టళ్లలో భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎక్కడ కూడా భోజనం కలుషితం కాకుండా చూడాలని, విద్యార్థుల ఆరోగ్యాల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేయాల ని సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు కోసం ఉద్దేశించిన భవిత కేంద్రాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయించాలని ఆదేశించారు. ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠి -
కలిసొచ్చిన అవకాశం
ఆర్మూర్: రాజకీయ నేపథ్యం లేని, సాధారణ గృహిణి ఆర్మూర్ పట్టణ ప్రథమ పౌరురాలిగా ఎంపికయ్యింది. ఏ పార్టీలోనూ సాధారణ కార్యకర్తగా సభ్యత్వం లేని ఆమె జీవితం పక్షం రోజుల్లోనే మారిపోయింది. కుటుంబంతోపాటు భర్త చేసే మెడికల్ వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండే గోనె లహరికి అనూహ్యంగా వచ్చిన ఈ పదవిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయ నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు రిజర్వేషన్ కలిసి రావడం, కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఆర్మూర్ పట్టణంలోని 15వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించింది. చైర్పర్సన్ రేసులో ఉన్న హేమాహేమీలు అనూహ్యంగా ఓటమి పాలవ్వడం గోనె లహరికి కలిసొచ్చింది. కౌన్సిలర్గా గెలిస్తే చాలు అంటూ ఎదురుచూసిన వీరికి ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల్లో చైర్పర్సన్ పీఠం లభించడం సర్వత్రా సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ● ఆర్మూర్ పట్టణ ప్రథమ పౌరురాలిగా సాధారణ గృహిణి -
క్రైం కార్నర్
బోధన్టౌన్(బోధన్): బోధన్ పటణంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఖైదీకి ద్విచక్ర వాహన చోరీ కేసులో ఏడాది జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ న్యాయమూర్తి పూజిత సోమవారం తీర్పు వెలువరించినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. పట్టణ శివారులో జైళ్ల ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్లో ఖైదీగా ఉన్న కత్రోత్ జీవన్ విధులు నిర్వహిస్తున్నాడు. జూన్ 29 2025 న పెట్రోల్ బంక్లో నిలిపి ఉన్న టీఎస్11ఈడీ2415 నెంబర్ గల జైలు వాహనంతోపాటు రూ. 16 వేల నగదును చోరీ చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడిని పట్టుకొని బోధన్ కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ. 500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిజాంసాగర్(జుక్కల్): మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి సోమవారం బాన్సువాడ సెకండ్క్లాస్ మేజిస్ట్రేట్ గోపాల్ రూ.వెయ్యి జరిమానాతోపాటు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలం కొక్కండకు చెందిన మైశయ్య మద్యం తాగి వాహనం నడపడటంతో కేసు నమోదు చేశామన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి జెడ్పీహెచ్ఎస్కు చెందిన గణతేజ, భీమ్గల్ మండలం ముచ్కూర్ జెడ్పీహెచ్ఎస్కు చెందిన నిహారిక సీఎం కప్ బేస్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీడీలు నాగభూషణం, సుజాత తెలిపారు. ఈ నెల 14న ఆర్మూర్ మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో గణతేజ, నిహారిక పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచడంతో రాష్ట్రపోటీలకు ఎంపిక చేశారన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 17 నుంచి 20వ తేదీ వరకు జరగబోయే రాష్ట్రస్థాయి బేస్బాల్ టోర్నీలో జిల్లా జట్టు తరఫున పాల్గొంటారని వివరించారు. నిజామాబాద్ లీగల్: ఎనిమిది నెలల గర్భిణిపై లైంగిక దాడి, అసభ్యకర నేరపూరిత చర్యకు పాల్పడిన ముద్దాయికి నిజామాబాద్ మహిళా కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి ధారావత్ దుర్గాప్రసాద్ ఆరేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.4 వేల జరిమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాల ప్రకారంఎడపల్లి మండలం అంబం (వై) గ్రామానికి చెందిన ఎడ్ల అరుణ్ కుమార్ నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో ఉంటూ ప్రైవేటుగా పని చేసుకునేవాడు. 2024 సెప్టెంబర్ 17న ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది నెలల గర్భిణిపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుండి పరారయ్యాడు. ఘటనపై బాధితురాలు ఆరో టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అరుణ్ కుమార్పై కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు తరలించారు. పోలీసులు కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం ఆధారంగా ఆరుగురు సాక్షులను విచారించిన కోర్టు, నేరాభియోగాలు రుజువు కావడంతో ముద్దాయి అరుణ్ కుమార్కు బీఎన్ఎస్ (సెక్షన్ 74) లైంగిక వేధింపుల నేరానికి నాలుగు సంవత్సరాల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని జడ్జి దుర్గా ప్రసాద్ ఆదేశించారు. సెక్షన్ 75(1) ప్రకారం మహిళపై అసభ్యకర, నేర పూరిత లైంగిక చర్యలకు మరో రెండు సంవత్సరాల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ● ఇద్దరికి గాయాలు నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్స్టేషన్ పరిధి బోధన్ రోడ్డులో సోమవారం కారు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఫులాంగ్కు చెందిన జాఫర్, అతని స్నేహితుడు బైక్పై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. సుభాష్నగర్: నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ ప్రకాశ్, ఇతర పోలీసు అధికారులు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో ప్రజలు గుమిగూడకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లుచేశారు. అభ్యర్థులు, ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా ఎవరినీ లోనికి అనుమతించలేదు. కాగా నగర పాలక సంస్థ కార్యాలయంలోకి ఎంపీ, ఎమ్మెల్యేలు, బీజేపీ కార్పొరేటర్లు వచ్చినా సమయానుసారంగా ఎన్నిక ప్రక్రియ నిర్వహించకపోవడంతో మున్సిపల్ అధికారులు, పీవోపై ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. అలాగే బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి వద్ద ఇటీవల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఏసీపీ ప్రకాశ్పై ఎంపీ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
అభివృద్ధి కోసమే పొత్తులు
● పొత్తులు లేకుండానే ప్రధానమంత్రి కుర్చీలో కుర్చున్నాడా? ● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి సుభాష్నగర్: రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసమే ఇతర పార్టీలు కాంగ్రెస్తో పొత్తులకు ముందుకొస్తున్నాయని బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నగరంలోని తన నివాసంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై న బండారి అనూష సతీశ్, కౌన్సిలర్లు సుదర్శన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. పొత్తులపై ప్రధానికి ఒక రూల్.. కాంగ్రెస్ పార్టీకి ఒక రూల్ ఉండదని, టీడీపీ, ఇతర రాష్ట్రాల్లోని పార్టీలతో పొత్తులు పెట్టు కుని ప్రధాని మోదీ కుర్చీలో కూర్చున్నాడని, బీజేపీ నాయకులు అనైతిక పొత్తులని పేర్కొనడంపై సుద ర్శన్రెడ్డి తనదైన శైలిలో చురకలంటించారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా విద్యావంతురాలిని ఎన్నుకున్నారని తెలిపారు. సీఎం ఇటీవల నిర్మల్ సభలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువతకు ఉ ద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. పరిశ్రమల ఏ ర్పాటుకు 10 వేల ఎకరాలు అవసరమని, ఆ బాధ్య తను మంత్రి జూపల్లి కృష్ణారావు, తనకు సీఎం అప్పగించారని గుర్తుచేశారు. చైర్మన్లు, మేయర్లుగా మహిళలు, బీసీలకు కాంగ్రెస్ అవకాశమిచ్చిందని తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జి ల్లాల్లో అత్యధిక మున్సిపాలిటీలు కాంగ్రెస్ కై వసం అయ్యాయన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డి, నాయకులు శ్రీకాంత్రెడ్డి, సుజా త, సాజిద్ ఖాన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
బీరువానే ఎత్తుకెళ్లారు..
కామారెడ్డి క్రైం: సాధారణంగా దొంగలు తాళం వేసిన ఇళ్లకు కన్నం వేసి, బీరువా తాళాలు పగలగొట్టి నగదు, నగలు దోచుకుంటారు. కానీ, జిల్లా కేంద్రంలో దొంగలు ఏకంగా బీరువానే భుజాన వేసుకొని తీసుకెళ్లిన వింత ఘటన సోమవారం వేకువజామున వెలుగుచూసింది. పాత ఎస్పీఆర్ కాలనీకి చెందిన షమీమున్నిసా అనే మహిళ తన ఇంటికి తాళం వేసి వెళ్లగా, గమనించిన ముగ్గురు ముసుగు దొంగలు సోమవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. నగలు తీయడం ఆలస్యమవుతుందని భావించారో ఏమో గానీ, ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లారు. ఉదయం ఇంటికి వచ్చి చూసిన బాధితురాలు దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పోలీసులు, కాలనీవాసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఎక్కడా బీరువా ఆచూకీ లభించలేదు. బీరువాలో దాచి ఉంచిన రెండు తులాల బంగారం, కొంత నగదు అపహరణకు గురైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. తాళం వేసిన ఇంట్లో ముగ్గురు దొంగల హల్చల్ రెండు తులాల బంగారం, నగదు అపహరణ పాత ఎస్పీఆర్ కాలనీలో ఘటన -
యూరియా కోసం రైతుల రాస్తారోకో
వర్ని (మోస్రా): సకాలంలో యూరియా అందడం లేదని ఆరోపిస్తూ మోస్రా మండలం గోవూరు గ్రామంలో రైతులు వర్ని–నిజామాబాద్ ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. సహకార సంఘంలో యూరియా వచ్చిన వెంటనే యాప్లో ఇతర ప్రాంతాల రైతులు బుక్ చేసుకుంటున్నారని, స్థానికులకు యూరియా అందడం లేదని రైతులు ఆరోపించారు. స్థానికులకే యూరియా అందజేయాలని, యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు, నిరక్షరాస్య రైతులకు యాప్లో యూరియా బుక్ చేయడం రావడంలేదని దీంతో యూరియా దొరకక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని మోస్రా మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్ రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
25.16 శాతం ఓట్లతో అధికారంలోకి కాంగ్రెస్
ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీలో మొత్తం ఓట్లు 63,972 ఉండగా ఈ నెల 11వ తేదీన నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో 43,239 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ శాతం 67.59గా నమోదైంది. ఇంకా 20,683 మంది ఓటర్లు అంటే 32.41 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. మరో వైపు ఓట్ల లెక్కింపు అనంతరం అధికారులు ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ఓట్లు లెక్కగడితే ఓటు విలువ ఏంటో అర్థం అవుతుంది. ఈ గణాంకాల ప్రకారం పట్టణంలోని 36 వార్డుల్లో కలిపి కాంగ్రెస్ పార్టీకి 16,098 ఓట్లు అంటే 25.16 శాతం, బీజేపీకి 11,979 (18.72 శాతం), బీఆర్ఎస్ పార్టీకి 7,398 (11.56 శాతం), ఎంఐఎం 992 (1.55) శాతం ఓట్లు వచ్చాయి. అత్యధిక ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తుండగా బీజేపీ రెండో స్థానంలో నిలబడగా బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి సరిపెట్టుకొంది. ఓటర్లు ఓటు హక్కుపై అవగాహన పెంచుకొని ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటే అత్యధిక ప్రజలు మెచ్చే పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 18.72 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో.. 11.56 శాతం ఓట్లకే పరిమితమైన బీఆర్ఎస్ ఎంఐఎంకు 1.55 శాతం ఓట్లు -
సేవాలాల్ బాటలో నడవాలి
డిచ్పల్లి: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన ఆధ్యాత్మిక బాటలో ముందుకు సాగాలని డిచ్పల్లి ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సీహెచ్ సాంబశివరావు సూచించారు. ఆదివారం బెటాలియన్ సమీపంలో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. భోగ్ బండార్ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ బోధించిన సత్యం, ధర్మం, సమానత్వం వంటి విలువలు నేటి తరానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో బెటాలియన్ ఆర్ఐలు శ్రీనివాస్, త్రిముఖ్, మారుతి, అధికారులు, సిబ్బంది, సేవాలాల్ మహరాజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
పరమేశ్వరుడికి ప్రణమిల్లిసోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి నామస్మరణతో జిల్లాలోని శైవక్షేత్రాలు మారుమోగాయి. ఆదివారం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తజనమంతా పరమేశ్వరుడికి ప్రణమిల్లారు. నిష్ఠతో ఉపవా సం ఉంటూ జాగరణ చేశారు. లింగోద్భవ సమయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి శివ లింగానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. – నిజామాబాద్ రూరల్ -
దుబాయిలో లక్కంపల్లి యువకుడి మృతి
నందిపేట్: బతుకు దెరువు కోసం దుబాయి వెళ్లిన నందిపేట మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన పస్కరాజు(25) గుండెపోటు తో మృతి చెందాడు. కుటుంబీకులు, గ్రామస్తులు ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పస్కరాజు తండ్రి చిన్నప్పుడే మృతి చెందాడు. దీంతో కుటుంబ బారాన్ని మోస్తూ పొట్టకూటి కోసం రెండేళ్ల క్రితం దుబాయి వెళ్లిన అతను బుధవారం ఉదయం బాత్రూంకు వెళ్లి గంట అయిన బయటకు రాకపోవడంతో తోటి పని చేసే వారు ఎంత పిలిచినా పలకకపోవడంతో వాష్రూంలు క్లీన్ చేసే వారికి సమచారం అందించారు. వారు బాత్రూం తలుపులు పగుల గొట్టి చూడగా నోటిలో బ్రష్తో కుప్పకూలి చనిపోయి ఉన్నాడు. దీంతో ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రాజు కుటుంబీకుల రోదనలు మిన్నంటుతున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని జాన్కంపల్లి ఖుర్దు గ్రామానికి చెందిన హరిచంద్(40) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. హరిచంద్ ఉపాధి నిమిత్తం నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండల శివారులో పడకల్ గ్రామానికి ఆరు నెలల క్రితం వెళ్లాడు. శనివారం రాత్రి పడకల్ గ్రామ శివారులో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఘటన స్థలిలో మృతి చెందాడు. -
ఒకరు కాకపోతే మరొకరు..
సుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దంపతులు రాణిస్తున్నారు. రిజర్వేషన్ ఆధారంగా భార్య, లేకపోతే భర్త కౌన్సిల్లో అడుగుపెడుతున్నారు. ఎవరికి అవకాశమొచ్చినా.. ప్రజా సమస్యలపై అవగాహన, పరిష్కారం, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మన్ననలు పొందుతున్నారు. మేకల విజయ మల్లేశ్ యాదవ్ దంపతులు తాజాగా 23వ డివిజన్ నుంచి నాలుగోసారి విజయం సాధించారు. అలాగే తాజాగా 20వ డివిజన్ నుంచి న్యాలం సునీత రాజు (నర్సయ్య) హ్యాట్రిక్గా గెలుపొందారు. ప్రత్యర్థి ఎవరైనా విజయం సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్న దంపతులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. వాజ్పేయి, అద్వానీ స్ఫూర్తితో.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, లాల్కృష్ణ అద్వానీ స్ఫూర్తితో మేకల మల్లేశ్ యాదవ్ 1990లో బీజేపీలో చేరారు. అయోధ్య రామమందిర రథయాత్రలో పాల్గొని బీజేపీ భావజాలాన్ని నరనరాన నింపుకొన్నారు. నాటి నుంచి నేటి వరకూ బీజేపీలోనే కొనసాగుతూ.. ఆ పార్టీ బీ ఫామ్తోనే ఎన్నికల్లో పో టీ చేస్తూ విజయం సాధిస్తున్నారు. ఇప్పటివరకు ఐ దుసార్లు పోటీ చేయగా, నాలుగు సార్లు మల్లేశ్యాదవ్ దంపతులు విజయం సాధించారు. అందులో మేకల విజయ మూడు సార్లు, మల్లేశ్యాదవ్ ఒక సారి గెలుపొందారు. 2000–05, 2005–10 వరకు మేకల విజయ, 2020–25లో మల్లేశ్యాదవ్ కార్పొరేటర్గా ఉన్నారు. తాజా ఎన్నికల్లో మళ్లీ మేకల విజయ మల్లేశ్ యాదవ్ విజయం సాధించి నాలుగోసారి కౌన్సిల్లో అడుగుపెట్టారు. 2022 నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు మల్లేశ్యాదవ్ బీఆర్ఎస్లో కొనసాగారు. నిత్యం ప్రజల తో ఉంటూ వారికి కావాల్సిన వసతులు కల్పిస్తూనే, సమ స్యల పరిష్కారంలో ముందుండటం వల్లే ఓటర్లు ఆదరిస్తున్నా రని మేకల విజయ మల్లేశ్ యాదవ్ పేర్కొంటున్నారు. కౌన్సిల్లోకి అడుగుపెడుతున్న దంపతులు రిజర్వేషన్ ఆధారంగా భర్త లేదా భార్య కార్పొరేటర్లుగా.. మేకల విజయ మల్లేశ్ యాదవ్ నాలుగోసారి విజయం మూడోసారి న్యాలం సునీత రాజు -
అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మర్రి సంగమణి(49) అనే మహిళ కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. కుమారుడు రాజు ఇటీవల ఆమెకు ఆస్పత్రిలో వైద్యం చేయించి స్వగ్రామానికి తీసుకొచ్చాడు. జీవితంపై విరక్తితో శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని సోమారం గ్రామంలో నివాసపు గుడిసె దగ్ధమైనట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన ముత్యంగారి శకుంతల శనివారం రాత్రి తన నివాసపు గుడిసెకు తాళం వేసి వేరే గ్రామానికి వెళ్లిందన్నారు. అర్ధరాత్రి ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకోవడంతో గుడిసెలో ఉన్న బియ్యం, బట్టలు, నగదు, ఇతర వస్తువులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాంలో రూ. లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
వరుస విజయాలతో..
నిజామాబాద్ కార్పొరేషన్లో ఒక హయాంలో భార్య లేదా భర్త హ్యాట్రిక్గా కార్పొరేటర్లుగా అడుగుపెట్టడం న్యాలం సునీత రాజు(నర్సయ్య) దంపతులకే సాధ్యమైంది. 2014–19 వరకు న్యాలం సునీత(4వ డివిజన్), 2020–25 వరకు న్యాలం రాజు(20వ డివిజన్) కార్పొరేటర్లుగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో 20వ డివిజన్ నుంచే న్యాలం సునీత మరోసారి ఎన్నికయ్యా రు. డివిజన్లో మైనార్టీ ఓట్లు ఉన్నప్పటికీ.. కా ర్పొరేటర్గా కుల, మత బేధం లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తూ విజయ పరంపర కొనసాగిస్తున్నారు. 2002 నుంచి బీజేపీలో కొనసాగుతున్న న్యాలం రాజు.. అంతకుముందు ఏబీవీపీలో కార్యకర్తగా ఉ న్నారు. ఆ తర్వాత బీజేవైఎం నగర, జి ల్లా అధ్యక్షుడిగా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు అని, ఆ తర్వాత ప్ర జా సేవకుడిగా ఉంటూ కాలనీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తుండడం వల్లే ఓటర్లు మూడోసారి తమను ఆదరించారని న్యాలం సునీత రాజు తెలిపారు. -
ఎవరి ప్రయత్నాలు వారివే..
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● ప్రత్యేక సమావేశం ఏర్పాట్ల పరిశీలనసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి నెలకొన్నాయి. సోమ వారం ఎన్నికకు ఏర్పాట్లను పూర్తి చేశారు. నిజామా బాద్ కార్పొరేషన్తోపాటు బోధన్, కామారెడ్డిలో హంగ్ నెలకొనడంతో ఎవరు మేయర్, చైర్పర్సన్లు అవుతారనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. బోధన్ విషయంలో కొంతమేర ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ ఆదివారం రాత్రికి కొలిక్కి వచ్చినట్లు తె లుస్తోంది. కాంగ్రెస్తో కలిసి వెళ్లేందుకు ఎంఐఎం అభ్యర్థులు వ్యతిరేకించగా, దారుస్సలాం నుంచి వ చ్చిన ఆదేశాల మేరకు అంగీకరించారు. చైర్మన్గా శరత్రెడ్డిని మొదట అంగీకరించకపోగా.. ఎంఐఎం అధినాయకత్వం సూచనల మేరకు చివరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. నిజామాబాద్ మేయర్ విషయంలో మాత్రం ఎనలేని ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్కు మేయర్, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పంచుకునేలా అంగీకా రం కుదిరింది. మేయర్ కోసం నలుగురు మహిళా ఆశావహుల మధ్య పోటీ నెలకొంది. ఎవరి స్థాయి లో వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం కలిస్తే మ్యాజిక్ ఫిగర్ వస్తున్నప్పటికీ మ్యా జిక్ ఫిగర్కు సమీపంలో ఉన్న బీజేపీ ఎలాంటి వ్యూ హం అనుసరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. కామారెడ్డి విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలకు మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో బీఆర్ఎస్ కింగ్ మేకర్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులతో చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్ చైర్మన్ పదవి తీసుకుని బీఆర్ఎస్కు వైస్ చైర్మన్ ఇచ్చేలా చర్చలు నడుస్తున్నాయి. ఇక ఆర్మూర్, భీమ్గల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు పూర్తి ఆధిక్యం ఉంది. అయితే చైర్పర్సన్లుగా ఎవరు అవుతారనే విషయమై ఆసక్తి నెలకొంది.లక్ష్యం దిశగా..ఆర్మూర్కు సీల్డ్ కవర్..!పార్టీ పోలైన ఓట్లు శాతం కాంగ్రెస్ 69,942 33.68 బీజేపీ 65,989 31.78 బీఆర్ఎస్ 18,273 8.80 ఆప్ 10 0.00 ఏఐఎఫ్బీ 750 0.36 ఏఐఎంఐఎం 37,955 18.28 ఏఐఎంఐఎం ఇంక్విలాబ్ 5 0.00 బీఎస్పీ 193 0.09 సీపీఐ 110 0.05 సీపీఎం 101 0.05 స్వతంత్రులు 9,330 4.49 జేఎస్పీ 1,127 0.54 ఎంబీటీ 496 0.24 ఎంజేజేపీ 153 0.07 ఎస్పీఐ 2 0.00 డబ్ల్యూపీఐ 59 0.03 చెల్లని ఓట్లు 2,218 1.07 నోటా 939 0.45 మొత్తం 2,07,652 100.00ఇందూరు మేయర్ ఎవరో? కొనసాగుతున్న ఉత్కంఠ కాంగ్రెస్కు మేయర్, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ ఇచ్చేలా ఒప్పందం బోధన్లోనూ కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కౌన్సిల్ ఏర్పాటుకు లైన్ క్లియర్ కామారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చర్చలు -
మేయర్, చైర్మన్ ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు
సుభాష్నగర్ : నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్తోపాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక, ప్రత్యేక సమావేశానికి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ ఇలా త్రిపా ఠి తెలిపారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ కా ర్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం కార్పొరేషన్ను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో కూడా లోటుపాట్లకు తావు లేకుండా స్పెషల్ మీటింగ్కు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుందని, నూతనంగా ఎన్నికై న కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు. పటిష్ట బందోబస్తు.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సాయి చై తన్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన కా ర్పొరేషన్లో ఏర్పాట్లను పరిశీలించారు. శాంతియు త వాతావరణంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగేలా అన్ని పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. -
క్రైం కార్నర్
● మహిళకు తీవ్ర గాయాలు రుద్రూర్: పొతంగల్ మండల కేంద్రంలోని రైస్ మిల్లులో జరిగిన ప్రమాదంలో ఓ మహిళా కూలికి తీవ్ర గాయాలైనట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణి మొగులమ్మ మిల్లులో కూలి పని చేస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మిల్లును ఊడుస్తుండగా ఆమె చీర యంత్రంలోని బెల్ట్కు చిక్కుకుంది. దీంతో ఆమె బెల్ట్పై పడిపోయి యంత్రంలోకి లాగబడింది. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లకు, కుడి చేతికి గాయాలయ్యాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆశాజనకంగా పసుపు ధర
● క్వింటాల్కు రూ.13,500 నుంచి రూ.15 వేలు ● నిలకడ ధరతో రైతులకు ఊరట మోర్తాడ్(బాల్కొండ): పసుపు ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులకు ఊరట లభిస్తోంది. మార్కెట్ ఆరంభం నుంచి ధర నిలకడగా కొన సాగుతోంది. గతంలో పసుపు పంటకు ఆశించిన ధర లేకపోవడంతో రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. కొన్నేళ్లపాటు జిల్లాలో సాగు విస్తీర్ణం 50 వేల ఎకరాల వరకూ సాగింది. ధర పడిపోవడంతో అనేక మంది రైతులు పెట్టుబడులు కూడా వెళ్లదీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. లాభాల మాట ఎలా ఉన్నా నష్టాలను మూ ట గట్టుకోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ సీజన్లో పసుపు పంటకు రూ.13,500 నుంచి రూ.15 వేల వర కు ధర లభించింది. కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉన్న పసుపును కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. పాత పసుపునకు తగ్గిన ధర.. రసాయనాల వినియోగం తగ్గిస్తేనే కుర్కుమిన్ శాతం వృద్ధి చెందుతుందని ఉద్యాన శాస్త్రవేత్తలు, అధికారులు సూచించడంతో రైతులు పసుపు సాగులో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో పసుపులో కుర్కుమిన్ శాతం వృద్ధి చెందడంతో ధర నిలకడగా ఉంది. గతంలో పాత పసుపునకు ధర ఎక్కువ ఉండేది. కానీ, ఈసారి భిన్నమైన పరిస్థితులు ఏర్పడి పాత పసుపునకు ధర తగ్గిపోతుంది. ఆరంభంలో పాత పసుపునకు క్వింటాలుకు రూ.16వేల వరకు పలికిన ధర రూ.13 వేలకు పడిపోయింది. కొత్త పంటలో కుర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు ఈ సీజన్లో తవ్వి ఉడికించిన పసుపును కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పసుపు సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, కొన్నిచోట్ల రోగాల బారినపడి దిగుబడిపై ప్రభావం చూపడంతో మార్కెట్లో పసుపు కొరత ఉందని స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఉన్న పంటకు వ్యాపారులు ధరను ఒకే విధంగా కొనసాగిస్తున్నారని రైతులు చెబుతున్నారు. సాంగ్లీ మార్కెట్తో పోల్చితే నిజామాబాద్ మార్కెట్లో ఒక్కో క్వింటాలుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 ధర తక్కువ ఉంది. సాంగ్లీ మార్కెట్లో ఎక్కువ నాణ్యత ఉన్న పసుపునే కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో కొద్దిమంది రైతులు మాత్రమే అక్కడి మార్కెట్కు పసుపును తరలిస్తున్నారు. ఈ సీజన్లో పసుపునకు ఇప్పుడున్న ధర కాకుండా కొంత పెరిగితే బాగుండేది. పెట్టుబడులకు అనుగుణంగా ధర పెరిగి ఉంటే వచ్చే సీజన్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు అవకాశం ఉండేది. ఈసారి రూ.15 వేలకు మించి ధర లభిస్తే రైతులకు ఎక్కువ లాభం జరిగేది. – బద్దం రాజశేఖర్ రెడ్డి, రైతు, తిమ్మాపూర్ సాంగ్లీ మార్కెట్కు ఇ క్కడి నుంచే పసుపు త రలిపోతుంది. అక్కడి మార్కెట్లో ఉన్న ధర ఇక్కడ కూడా లభించి ఉంటే బాగుండేది. మార్కెట్కు రైతులు నాణ్యమైన పసుపునే తరలిస్తున్నారు. సాగు మెళుకువలను పాటించి నాణ్యమైన పసుపును పండిస్తున్నారు. – ఒల్లాడపు గంగారాం, రైతు, తిమ్మాపూర్ -
యూరియా పంపిణీపై రైతుల ఆందోళన
రుద్రూర్: మండల కేంద్రంలోని సింగిల్ విండో పరిధిలోని రైతులకు యూరియా పంపిణీ చేయడంలో సహకార సంఘం సిబ్బంది పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆదివారం ఆందోళన చేశారు. కొందరు రైతులకు మాత్రమే యూరియా పంపిణిలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం విండోకు యూరియా చేరుకున్నప్పటికీ, ఆదివారం పండుగ రోజు సైట్ను తెరిచి కొందరికి మాత్రమే పంపిణీ చేయాలని ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా స్టాక్ ఉన్నట్లు శనివారం యాప్లో ఎందుకు చూపలేదని కార్యదర్శి గంగాధర్ను నిలదీశారు. సన్నిహితులకు మాత్రమే పంపిణీ చేయడానికి సెలవు రోజున కొందరిని పిలిపించి ఇస్తున్నారని మండిపడ్డారు. సుమారు రెండున్నర గంటల పాటు రైతులు ఆందోళన చేపట్టారు. కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, మండల వ్యవసాయ అధికారి తక్షణమే వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు డీలర్ల వద్దకు వెళ్తే అవసరం లేని మందులను అంట గట్టి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా యూరియా తెప్పించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. యూరియా అందని రైతులు పేర్లు నమోదు చేసుకుని మరో విడత రాగానే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అంగీకారం మేరకు రైతులు శాంతించారు. -
శంభో శంకరా..
సాక్షి నెట్వర్క్: మహాశివరాత్రి వేడుకలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. శంభో శంకరా.. ఓం నమశ్శివాయ అంటూ భక్తుల నామస్మరణతో శివాలయాలు హోరెత్తాయి. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయం, ఉమామహేశ్వర ఆలయం, శంభుని ఆలయం, నాగారంలోని నందిగుట్ట ఆలయం, ఆర్మూర్లోని సిద్ధులగుట్ట, సిరికొండలోని లొంక రామలింగేశ్వర ఆలయాలతో పాటు పలు శివాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అర్చనలు జరిగాయి. శంభు లింగేశ్వర ఆలయంలో, నీలకంఠేశ్వరాలయాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సీపీ సాయి చైతన్య ప్రత్యేక పూజలు చేశారు. పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
పల్లె ప్రకృతి వనంపై గొడ్డలి వేటు
● కలపను అమ్ముకున్న సర్పంచ్లు ● పట్టించుకోని అధికారులు ● అవెన్యూ ప్లాంటేషన్లదీ అదేగతి రెంజల్(బోధన్): పల్లెలు, పట్టణాల్లో పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచాలనే బృహత్తర ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది.ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా గ త ప్రభుత్వం హరితహారం పథకాన్ని ప్రవేశపెట్టింది.అంతటి ప్రాధాన్యం కలిగిన పథకానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు.గత పాలకవర్గాలు ప్రతి గ్రా మంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయ గా, మొక్కల సంరక్షణకు గత ప్రభుత్వం రూ. లక్ష లాది నిధులు విడుదల చేసింది. మొక్కలు ప్ర స్తుతం చెట్లుగా ఎదిగాయి. వాటిని కాపాడాల్సిన ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాలు కొన్ని పచ్చని చెట్లను నిర్ధాక్షిణ్యంగా నరికి వేస్తున్నాయి. సర్పంచ్లకు అవగాహన లేక చెట్లను నరికి కలపను అమ్ముకుంటున్నా అధికార యంత్రాంగంలో చలనం లేదు. ఆహ్లాదం అందనంత దూరం జిల్లాలోని పల్లె ప్రకృతి వనాలు చాలా వరకు గ్రా మాలకు దూరంగా ఏర్పాటు చేయడంతో నిరుపయోగంగా మారాయి. అవెన్యూ ప్లాంటేషన్లో భా గంగా రోడ్లకు ఇరు వైపులా నాటిన మొక్కలు చె ట్లుగా మారినా రహదారుల వెంట పచ్చదనం కరువైతుంది. ప్రయాణికులకు ప్రాణవాయువును అందించి వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని ని వారించే చెట్ల పాలిట విద్యుత్ తీగలు శాపంగా తయారయ్యాయి.10–15 అడుగులు పెరిగిన చె ట్లను విద్యుత్ సిబ్బంది అడ్డంగా నరికేస్తున్నారు. ప చ్చందంతో కనిపించాల్సిన చెట్లు మోడు వారికి కనిపిస్తున్నాయి.రెంజల్ మండలంలోని మౌలాలితండా, కళ్యాపూర్ గ్రామాల సర్పంచ్లు ఇటీవల ప చ్చని చెట్లను నరికి కలపను అమ్ముకున్నారు. వీరన్నగట్ట శ్మశాన వాటికలో పెరిగిన చెట్లను సైతం నరికి వేయించారు. -
పరశురాముడు ప్రతిష్ఠించిన ‘శ్రీ చక్రేశ్వర శివాలయం’
బోధన్రూరల్: పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివా లయం భక్తులు కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్విత ఆలయం ప్ర సిద్ధి చెందుతోంది. శ్రీ ఏక చక్రనగరంలో ఒకే రోజు నివసిస్తే ఏడు ముక్తిధామాలల్లో ఉన్న పుణ్యం లభిస్తుందని చరిత్రలో చెప్పబడింది. అలాంటి ప్రాంతంలో పరుశురాముడు ఆలయం నిర్మించి ప్రతిష్ఠించిన శివ లింగమే ‘శ్రీ ఏకచక్రేశ్వరుడు. తేత్రాయుగంలో పరశురాముడు బోధన్లో చెక్కి చెరువుగా పిలిచే ప్రాంతంలో అధిక సమయం గడిపేవాడని,ఆ సమయంలో ఈ చక్రేశ్వర ఆలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేసేవా రని చరి త్రలో చెప్పబడింది. కాకతీయుల కాలంలో ము ష్కరులు దక్షిణ భారతదేశ దండయాత్రకు పూనుకున్న సమయంలో రక్షించుకునేందుకు ఆలయాన్ని మట్టితో కప్పివేశారని ప్రచారంలో ఉంది. కాలక్రమంలో గుంటూరు వాసి రామిరెడ్డి అనే వ్యక్తి 1959లో బోధన్లో స్థిరపడటానికి మట్టికోటను చదును చేస్తుండగా ఈ ఆలయం బయల్పడినట్లు పూర్వీకులు చెపుతుంటారు.ఏకచక్రేశ్వర ఆలయలో ధర్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు పూర్తిచేశాం. భక్తులు ప్రశాంత వాతవరణంలో సమన్వయంతో స్వామివారిని దర్శించుకుని ఉత్సవాలను విజయవంతం చేయాలి. – రాములు, ఈవో, బోధన్ -
బంజారాల మార్గదర్శి
● నేడు సేవాలాల్ మహరాజ్ జయంతి నిజామాబాద్ రూరల్: బంజారాలలో హిందూ చైతన్యాన్ని పెంపొందించి, భక్తిని ప్రేరేపించి, సమాజాన్ని సంఘటితం చేసిన గొప్ప సంఘసంస్కర్త, బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్. ఆదివారం సేవాలాల్ మహరాజ్ జయంతిని బంజారాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయాల్లో భోగ్ బండార్, ఖీర్ (పాయసం)తో నైవేద్యం సమర్పించి ఉపవాసాలు చేస్తారు. బంజారా యువకులు సేవాలాల్ దీక్షను స్వీకరిస్తారు. సన్మార్గంలో నడిచేలా.. భీమానాయక్, ధర్మిణియాడ దంపతులకు 1739లో ఫిబ్రవరి 15న సేవాలాల్ జన్మించాడు. సేవాలాల్ మహరాజ్ దేవిమాతకు పూజలు చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు.అటవీ ప్రాంతంలో జీవిస్తున్న బంజారాలంతా భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకుంటారని,దాని కోసం ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని సూచించేవారు.బంజారాలంతా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని బోధించారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తేనే సమాజ వికాసం జరుగుతుందని చెప్పేవారు. అలా చీకటిలో ఉన్న బంజారాలను వెలుగులోకి తీసుకొచ్చిన సేవాలాల్ మహరాజ్ దైవ స్వరూపుడుగా, ఆధ్యాత్మిక చైతన్యకారుడిగా ప్రసిద్ధి చెందారు. చివరకు మహారాష్ట్రలోని పౌరాఘడ్లో స్వర్గస్తులైనట్లు పూర్వీకులు చెబుతారు. మహరాజ్ సమాధి ఉన్న వీరఘడ్ ప్రాంతం ప్రసిద్ధ బంజారా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రభుత్వం సేవాలాల్ మహరాజ్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలి. సేవాలాల్ జయంతి ఉత్సవాలకు మంజూరు చేస్తున్న నిధులను పెంచాలి. సేవాలాల్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి. – బానోత్ ప్రేమ్లాల్, బంజార కవి, రచయిత -
దాతల దయతో గట్టెక్కిన సీఎం కప్ పోటీలు!
● గ్రామ, మండల స్థాయిలో నిర్వహణకు నిధులు ఇవ్వని ప్రభుత్వం ● ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతోనే ముగించిన నిర్వాహకులు మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో దాతల దయపైనే ఆధారపడాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండ్రోజుల క్రితం నియోజకవర్గ స్థాయి పోటీలను నిర్వహించగా త్వరలోనే జిల్లా స్థా యి పోటీలు జరగనున్నాయి. పోటీలపై విస్తృత ప్రచారం నిర్వహించినా నిధుల కేటాయింపులో ప్ర భుత్వం విఫలం కావడంతో నిర్వాహకులు దాతల సహకారం కోరారు. స్పందన లేని ప్రాంతంలో కేవలం ఎంపికలతోనే క్రీడా పోటీలను మమ అనిపించారు. అయితే, మండల స్థాయిలో పోటీలను నిర్వహించడానికి కేవలం రూ.2 వేల చొప్పున నిధులను కేటాయించడం గమనార్హం. పోటీల నిర్వహణకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుంది. గ్రామ స్థాయిలోనైతే కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు ఉత్సాహంగానే క్రీడాపోటీల నిర్వహణకు ముందుకొచ్చారు. వారు సొంతంగా నిధులు ఇవ్వకపోయినా స్థానిక పంచాయతీలపై ఆర్థిక భారం పడింది. బహుమతుల ఖర్చులను మాత్రమే కొందరు సర్పంచ్లు సొంతంగా భరించారు. మరికొన్ని చోట్ల దాతలు ముందుకు వచ్చి బహుమతులను కొనుగోలు చేసి ఇచ్చారు. వచ్చే ఏడాది నిర్వహించే సీఎం కప్ పోటీల వరకై నా నిధుల విడుదలపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
ఉమ్మడి జిల్లా ఐకేపీ సీసీలకు శిక్షణ
● ఎస్హెచ్జీలకు ఆర్థిక రుణ చేకూర్పు అంశాలపై... డొంకేశ్వర్(ఆర్మూర్): నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు (సీసీలు) సెర్ప్ అధికారులు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని న్యాక్ ట్రైనింగ్ సెంటర్లో జరుగుతున్న ఈ శిక్షణకు బ్యాచ్ల వారీగా ఓరియంటేషన్ ఇస్తున్నారు. ఆర్థిక రుణ చేకూర్పు అనే అంశాలపై ఎస్హెచ్జీలకు బ్యాంకు లింకేజీ రుణాలు, రికవరీ, ఆర్థికాభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలు, పెట్టుబడులు తెలుసుకునేందుకు సీసీలకు కూలంకషంగా చెప్తున్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో వీవోఏల ద్వారా మహిళా సంఘాల వరకు తీసుకెళ్తారు. శిక్షణ పొందిన సీసీలకు డీఆర్డీవో సాయాగౌడ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 277 మందికి ఈ నెల 17 వరకు శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఏపీఎంలు కూడా ఇవే అంశాలపై ఇటీవల రాష్ట్రస్థాయిలో శిక్షణ పొంది వచ్చినట్లు డీఆర్డీవో తెలిపారు. -
క్రైం కార్నర్
డొంకేశ్వర్(ఆర్మూర్): మండల కేంద్రంలో రేఖాదేవి (32) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్యామ్రాజ్ తెలిపారు. మృతిరాలి తండ్రి మీసాలి గంగాధర్ ఫిర్యాదు మేరకు ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన రేఖాదేవికి 13 ఏళ్ల క్రితం దేవిదాస్తో వివాహం జరుగగా వీరికి ఇద్దరు పిల్లలున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన భర్త దేవిదాస్ తన భార్య గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో చనువుగా ఉండటంతో అనుమానించి నిలదీశాడు. ఈ క్రమంలో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన రేఖాదేవి గదిలోకి వెళ్లి టవల్తో ఫ్యాన్కు ఉరేసుకుంది. స్థానికులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేసరికి ఆమె అప్పటికే ప్రాణాలు విడిచింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాని ఎస్సై పేర్కొన్నారు. వర్ని: కుటుంబ కలహాలతో సొంత అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన వర్ని మండలం వడ్డేపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లికి చెందిన ఎత్తరి సాయిబాబా, రాంబాబు అన్నదమ్ములు. కొన్ని రోజుల క్రితం వీరి తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. అయితే, తల్లి మృతికి అన్న సాయిబాబే కారణమని రాంబాబు భావించినట్లు స్థానికులు తెలిపారు. శనివారం రాత్రి కర్రతో సాయిబాబా(32) తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం తన అన్న సాయిబాబాను హత్య చేసినట్లు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. వర్ని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థులకు సైకిళ్ల అందజేత
మాక్లూర్: మండలంలోని మాణిక్బండార్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ సంస్థ సభ్యులు డీఈవో అశోక్ ఆధ్వర్యంలో రూ. లక్షా 20 వేలు విలువ చేసే సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఈవో అశోక్ మాట్లాడుతూ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఉచితంగా సైకిళ్లను అందించటం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో సత్యనారాయణ, సంస్థ సభ్యులు దొడ్లె శేఖర్, సతీశ్, శ్రీనివాస్, గౌతమి, చిరంజీవి, కిశోర్, రజిని, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న విద్యార్థులకు వ్యాసరచ న, డ్రాయింగ్తోపాటు ఇతర పోటీలు నిర్వహించనున్నట్లు జేవీవీ నాయకులు కోయేడి నర్సింహులు,గుర్రం వెంకటమల్లయ్య శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు.నగరంలోని నాందేవ్వాడలో ఉన్న మల్లు స్వరాజ్యం కార్యా లయంలో ఆదివారం సాయంత్రం కార్యక్రమ నిర్వహణ,ఏర్పాట్ల గురించి సమావేశం నిర్వ హిస్తున్నామన్నారు.ప్రతినిధులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలనివారు కోరారు. మోపాల్: సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి, సెలవుదినంగా ప్రకటించాలని ఏఐబీఎస్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్ బాలు నాయక్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారా బిడ్డల ను భక్తి మార్గంలో నడిపించారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా కృషి చేశారని కొని యాడారు. పార్లమెంట్లో సేవాలాల్ మహరా జ్ గురించి మాట్లాడిన ఎంపీ అర్వింద్ ధర్మపురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 15న నిర్వహించే సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకొని పాఠశాలలు, కళాశాలలకు అధికారికంగా సెలవుదినంగా ప్రకటించా లని కోరారు. మండల ప్రధానకార్యదర్శి జలంధర్, జిల్లా గౌరవాధ్యక్షుడు నరేశ్, నాయకులు ఇందల్, ఓం సింగ్, జోర్సింగ్ పాల్గొన్నారు. -
పరమేశ్వరా..పాహిమాం
నేడు మహాశివరాత్రి ● ముస్తాబైన శైవక్షేత్రాలు ● లింగోద్భవ పూజలకు ఏర్పాట్లు జిల్లాలోని శైవక్షేత్రాలు మహా శివరాత్రిని పురస్కరించుకొని శివనామస్మరణతో మార్మోగనున్నాయి. తేజోరూపుడు, పరమేశ్వరుడు కొలువైన ముక్కంటి సన్నిధికి భక్తులు తరలిరానున్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. శివుడికి బిల్వ పత్రాల సమర్పణ, ఉపవాసం, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని పలు ప్రసిద్ధి శైవక్షేత్రాలపై ప్రత్యేక కథనం... నిత్య పూజల నీలకంఠుడు సిరికొండ: జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం సిరికొండ లొంక. మండల కేంద్రానికి 7 కిమీ.ల దూరంలోని దట్టమైన అడవుల్లో ఎత్తయిన గుట్టల మధ్య ఉన్న లొంక (లంక)లో కొలువైన నీలకంఠ రామలింగేశ్వరస్వామి భక్తుల నిత్య పూజలందుకుంటున్నారు. త్రేతాయుగంలో వనవాసం సమయంలో సీతమ్మ వెదుకుతూ వచ్చిన రాములు లొంకలో విడిది చేసి, స్వయంగా సైకత లింగాన్ని తయారు చేసి పూజలు చేశాడని ప్రతీతి. మహా శివరాత్రికి ఈ ఆలయం వద్ద మూడు రోజులపాటు జాతర జరుగుతుంది. అనారోగ్యంతో బాధపడేవారు ఇక్కడి కోనేటిలో స్నానం చేసి లింగేశ్వరున్ని పూజిస్తే రుగ్మతలన్నీ మాయమవుతాయని భక్తుల విశ్వాసం. ఆధ్యాత్మిక కేంద్రం..నవనాథ సిద్దుల గుట్ట ఆర్మూర్: ప్రకృతి రమణీయతకు అద్దం పట్టేలా విధంగా ఒకదానితో ఒకటి పేర్చినట్లుగా నల్లని రాళ్లతో విస్తరించి ఉండి చారిత్రాత్మకమైన ప్రాశస్త్యాన్ని సంతరించుకుంటోంది ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దుల గుట్ట. నవనాథులు పూజించిన సిద్దేశ్వరుని లింగాన్ని రాళ్ల గుహలో నుంచి వెళ్లి దర్శించుకోవడం ఓ చక్కని అనుభూతి. ఇక్కడి కోనేరులో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ నీళ్లుంటాయి. గుహల మధ్య సహజ సిద్దంగా ఏర్పడిన పాల గుండం, నీటి గుండం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నవనాథ సిద్దుల గుట్టపై ఉన్న శివాలయంలో ప్రతి శివరాత్రిని భక్తులు వైభవంగా జరుపుకుంటారు. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి పర్వదినాన సిద్దులగుట్ట పర్యటన ప్రతి ఒక్కరికీ అరుదైన అనుభూతిగా మిగులుతుంది. ప్రకృతి, దైవత్వం కలగలిపిన ప్రాంతం కావడంతో ఇక్కడ మానసిక ప్రశాంతత లభిస్తుంది.శివున్ని దర్శనం చేసుకున్న వారికి సకల కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో ఏటా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. – భారత్ గ్యాస్ సుమన్, సిద్దుల గుట్ట ఉత్సవ కమిటీ ప్రతినిధి, ఆర్మూర్ -
సీఎం కప్ బేస్బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఆర్మూర్టౌన్: పట్టణంలో మినీ స్టేడియం, జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల క్రీ డా మైదానంలో శనివారం సీఎం కప్ బేస్బాల్ జిల్లా మహిళ, పురుషుల జట్ల ను ఎంపిక చేసినట్లు జిల్లా క్రీడాధికారి పవన్ కుమార్ తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం జరగనున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. బేస్బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో బేస్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్, సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, సంయుక్త కార్యదర్శులు సుజాత, చిప్ప నవీన్, వ్యాయామ ఉపాధ్యాయులు నాగభూషణం, రమేశ్, స్వప్న, క్రీడాకారులు పాల్గొన్నారు. మూడు ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసం మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని లింబూర్ శివారులో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు మూడు చోట్ల ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశారు. అందులో ఉన్న ఆయిల్, కాపర్ వైర్ చోరీ అపహరణకు గురైనట్లు రైతులు పురుశోత్తం, గజానంద్, శంకర్ తెలిపారు. పోలీసులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ దుండగులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
నికాల్పూర్లో పావురాల కలకలం
● కాళ్లకు రింగ్ చూసి ఆందోళనకు గురైన గ్రామస్తులు డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో శుక్రవారం ట్యాగ్ కలిగిన పావురాలు కలకలం సృష్టించాయి. వాటి కాళ్లకు ఉన్న పసుపు రంగు ట్యాగ్ (రింగు), దానిపై నంబర్లను చూసి గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామ శివారులోని జంగం చెరువు ప్రాంతంలో మత్స్యకారులు ఉంచిన చేపల వలకు మూడు పావురాలు చిక్కుకున్నాయి. స్థానిక వ్యవసాయదారులు గమనించి పావురాలను వల నుంచి తీసే ప్రయత్నం చేశారు. కాళ్లకు ఉన్న రింగు లాంటి పరికరాన్ని చూసి ఏంటోనని ఆందోళనకుగురయ్యారు. గ్రామస్తులకు సమాచారం అందించగా వారు కూడా వచ్చి పావురాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. గూఢచారి పావురాలని ఒకరు, జీపీఎస్ ట్రాకింగ్ చేసేవని మరొకరు, రేసింగ్ పావురాలని ఇంకొకరు చర్చించుకున్నారు. పావురాల కాలికి ఉన్న రింగ్పై ‘702’ నంబరుతోపాటు కేఎల్ఆర్పీసీ, కేవోఎల్ఏఆర్ 2025–ఇండియా అని రాసి ఉంది. ఇలాంటివి సాధారణంగా రేసింగ్ పావురాలకే ఉంటాయని లేదా ప్రభుత్వాలు కూడా పావురాల కదలికలు, సంచార సమాచారం తెలుసుకోవడానికి ఇలాంటి ట్యాగ్లు కడుతారని అవగాహన కలిగిన ఒకరిద్దరు అధికారులు ‘సాక్షి’తో పేర్కొన్నారు. నికాల్పూర్ బ్యాక్ వాటర్కు ఆనుకొని ఉన్న గ్రామం కావడంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం నుంచి దారితప్పి వచ్చి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వలలో చిక్కుకున్న ఆ మూడు పావురాలను గ్రామస్తులు వదిలిపెట్టారు. -
ఉప్లూర్లో బాలరాజేశ్వరుడు..
కమ్మర్పల్లి:వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం తర్వా త రెండో పుణ్యక్షేత్రంగా కమ్మర్పల్లి మండలం ఉప్లూర్లోని శ్రీ బాలరాజేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధికెక్కింది. స్వయంభూ శివలింగం ఉన్న ఈ ఆలయం కాకతీయుల కాలంలో 12 శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. మహా శివరాత్రి రోజున నిర్వహించే ఉత్సవాలకు మహారాష్ట్ర, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. కోడె మొక్కులు, నిలువెత్తు బంగారం (బెల్లం) స్వామి వారికి సమర్పించుకుంటారు. చిన్న పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయడం, పెద్దలు తలనీలాలు సమర్పించుకుంటారు. ఉత్సవాల్లో భాగంగా రాత్రికి దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం నిశిపూజ, పంచామృత మహా రుద్రాభిషేకం, స్వామి వారి పల్లకీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులకు బాలరాజేశ్వరుడు దర్శనమిస్తాడు. -
పెద్దల ఆశీర్వాదమే ఫైనల్..!
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తం 12 వార్డులుకు గాను 8 వార్డులను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. చైర్పర్సన్ రేసులో ఉన్న మల్లెల రాజశ్రీ ఓటమిపాలు కావడంతో ఎవరి పేరు ఖరా రు చేస్తారోనన్న అంశంపై జోరుగా చర్చసాగుతోంది. ఫలితాలకు ముందే కౌన్సిలర్ అభ్యర్థులను శిబిరానికి తరలించారు. అయితే చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థి ఓడిపోవడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. బొదిరే నాగమణి (6వ వార్డు), ఆరెపల్లి శ్రీజ (ఒకటో వార్డు), సంటి లత (10వ వార్డు), పర్శ కుశలత(2వ వార్డు) చైర్మన్ పదవికోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలోని సీనియర్కే పదవి కట్టబెట్టాలా.. లేక సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలా అనే అంశంపై అగ్రనాయకులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏదిఏమై నా టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ నిర్ణయమే ఫైనల్ అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. వైస్ చైర్మన్ పదవి కోసం కూడా పోటీ నెలకొంది.ఆర్మూర్: పట్టణంలోని 36 వార్డుల్లో కాంగ్రెస్ 19, బీజేపీ 8, బీఆర్ఎస్ 5, ఎంఐఎం 1, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయం సాధించారు. పలువురు స్వతంత్రులు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతుండడంతో ఆ పార్టీ బలం మరింత పెరిగే అవకాశం ఉంది. మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ చైర్పర్సన్ పీఠం ఆశించిన ముఖ్య నాయకులు ఓటమి పాలవడంతో గెలుపొందిన అభ్యర్థుల్లో బలమైన వ్యక్తిని చైర్ పర్సన్ పీఠంపై కూర్చోబెట్టడానికి మంతనాలు కొనసాగుతున్నాయి. చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయిన విషయం తెలిసిందే. 29వ వార్డు నుంచి విజయం సాధించిన బత్నేస తిరుమల, 15వ వార్డు నుంచి విజయం సాఽధించిన గోనె లహరి చైర్ పర్సన్ పీఠాన్ని, 34వ వార్డు నుంచి విజయం సాధించిన నర్మె నవీన్ వైస్ చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి ఆశీస్సులు ఉన్న వారు మాత్రమే చైర్ పర్సన్, వైస్ చైర్మన్ అయ్యే అవకాశాలు ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మ రం చేశారు. తమకున్న రాజకీయ అనుభవం, గత ప్రభుత్వాల్లో చేపట్టిన పదవులు, వారి కుల సంఘాల ఓట్లు తదితర అంశాలను అగ్రనాయకులకు వివరిస్తున్నారు. చైర్ పర్సన్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా మిగిలిన కౌన్సిలర్లు అందుకు అనుకూలంగా ఓటు వేసే సానుకూల పరిస్థితిని ఏర్పరచడం కోసం ఆర్మూర్ నియోజకవర్గం ఇన్చార్జి వినయ్రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. నామినే టెడ్ పదవులు ఇస్తామంటూ ఆశావహులను బుజ్జగించే పనిలో ఉన్నారు. మరోవైపు పార్టీకి చెందిన చైర్ పర్సన్ ఆశావహుల ఓటమిపై ముఖ్య నాయకులు పోస్ట్మార్టం చేస్తున్నారు. ఈ పరిస్థితికి గ్రూప్ తగాదాలే కారణమంటూ ముస్లిం మైనార్టీకి చెందిన ఓ నాయకుడు పంపిన వాయిస్ మెసేజ్ వాట్సాప్లో చక్కర్లు కొడుతోంది. ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ఉత్కంఠ రెండు చోట్ల చైర్పర్సన్ రేసులో ఉన్న అభ్యర్థుల ఓటమి తెరపైకి వచ్చిన ఆశావహులు పరిగణనలోకి రాజకీయ అనుభవం, సామాజిక సమీకరణాలు! -
చిత్తడి నేలలో ప్రకృతి సోయగాలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చిత్తడి నేలల్లోని ఈ దృశ్యాలు కనురెప్ప కొట్టేందుకు వీలులేకుండా దృష్టిని కట్టిపడేస్తున్నాయి. నీలి వర్ణంతో ఆకాశం, ఆ సాగరం కలిసిపోగా.. పచ్చని ప్రకృతిలో ఎక్కడ చూసినా నిలువెత్తున నిలిచిన తాటిచెట్లు కనువిందు చేస్తున్నాయి. డొంకేశ్వర్ మండలంలోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వస్తున్న పర్యాటకులు ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్దులవుతున్నారు. ఈ దృశ్యాలను నికాల్పూర్ గోదావరి వద్ద ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
నమో నీలకంఠా..
భోళా శంకరుడు లింగరూపంలో ఉద్భవించే మహాశివరాత్రి వేడుకలకు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. పరమ పవిత్రమైన శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివుడి దర్శనం, అభిషేకంతో జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శివరాత్రి వేడుకలకు నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయం, శంభులింగేశ్వరాలయంతోపాటు జిల్లాలోని ఆర్మూర్ సిద్దులగుట్ట, సిరికొండ మండలంలోని లొంకరామలింగేశ్వరాలయం తదితర ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు, ఎండోమెంట్ అధికారులు ఏర్పాట్లు చేశారు. – నిజామాబాద్ రూరల్ -
నిజామాబాద్
16న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ● ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ, మున్సిపల్ కమిషనర్ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని కౌన్సిల్ హాల్లో ఈనెల 16న ఉదయం 11 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జర గ నుంది. ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను శని వారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ ఏర్పాట్లను పరిశీలించి బందోబస్తుపై చర్చించారు. కార్పొరేటర్లతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యులను మాత్రమేలో నికి అనుమతించనున్నట్లు తెలిసింది. మొదట కా ర్పొరేటర్ల ప్రమాణస్వీకారం, ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. 60 మంది కా ర్పొరేటర్లతోపాటు ఎంపీ, ఎమ్మెల్సీ, అర్బన్, రూర ల్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ఎక్స్అఫీ షియో ఓట్లు కలిగి ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ను సభ్యులు చేతులెత్తి ఎన్నుకుంటారు. ఎన్నికకు సంబంధించి ఇదివరకే కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులకు అధికారులు సమాచారమిచ్చారు. -
ఐదు లక్షల ఎకరాలు దాటి..
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో వరినాట్లు దాదాపు గా ముగియడంతో యాసంగి సీజన్లో సాగవు తున్న పంటల లెక్క తేలింది. 5.22లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా 5 లక్షల ఎకరాలు దాటింది. అత్యధికంగా వరి 4.25లక్షల ఎకరాల్లో సాగవుతోంది. మరో వెయ్యి ఎకరాల వరకు సాగు విస్తీర్ణం పెర గొచ్చని అధికారులు భావిస్తున్నారు. రైతులు 80 శాతం వరకు వరిలో సన్నాలే వేయగా గంగాకావేరి రకం ఎక్కువగా ఉంది. వరి తర్వాత రైతులు మొక్కజొన్నకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సీడ్కు వెళ్లారు. అలాగే బోధన్ డివిజన్లో ఎక్కువగా శనగ, పొగాకు పంటలను సాగు చేస్తున్నారు. బోర్లు లేని రైతులు జలాశయాలు, లిఫ్టుల సా గు నీటితో పంటలను పండిస్తున్నారు. వ్యవ సాయ శాఖ కూడా యాసంగికి సరిపడా ఎరువులు తెప్పించడంతో రైతులకు బయట ఎప్పటికప్పుడు యూరి యా లభిస్తోంది. ఇటు ఏఈవోలు, ఏవోలు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి రైతు వారీగా సాగు చేస్తున్న పంటల వివరాలను ఆన్లైన్లో నమో దు చేసే పనిలో నిమగ్నమయ్యారు. క్రాప్ బుకింగ్ ఆధారంగానే రైతుల నుంచి ప్రభుత్వ పంటలను కొనుగోలు చేయనుంది. జిల్లాలో సాగవుతున్న యాసంగి పంటలు అత్యధికంగా 4.25లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు జిల్లాలో చివరి దశలో నాట్లు -
ఓటర్ల తీర్పే వేరు..
● కొందరు అభ్యర్థులకు సున్నా ఓట్లు ● మరికొందరికి సింగిల్ డిజిట్..నిజామాబాద్అర్బన్: మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన కొందరు అభ్యర్థులకు ఒక్క ఓటూ పడకపోవడం గమనార్హం. మరికొందరికి సింగిల్ డిజిట్ అంకెలతో నిలిచారు. నిజామాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ ము న్సిపాలిటీల్లో ఈ పరిస్థితి కనిపించింది. ● నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్లో ఏఐఎఫ్బీ తరఫున పోటీ చేసిన రుబీనా బేగం, 30, 33, 52, 54 డివిజన్లలో ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచిన అబ్దుల్ సలాం, హైమదీ బే గం, మహమ్మద్ ఫైజల్ హైమద్, తమీమ్ కౌసిర్కు ఒక్క ఓటూ పడలేదు. వారి ఓటు వారికి వేసుకోలేదు. అలాగే కుటుంబ సభ్యులు కూడా వారికి ఓటు వేయలేదని తేలింది. ● 46, 59 డివిజన్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు అబ్దుల్ ఖాలేద్, రఫియా బేగంతోపాటు 58వ డివిజన్లో అబ్దుల్ రహీస్కు, 42వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి రాజశేఖర్కు, 33వ డివిజన్లో అంజూమ్కు, 11వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి నజియా బేగంకు ఒక్కటి చొప్పున ఓట్లు నమోదయ్యాయి. 60వ డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థి సాజిద్ కతున్తోపాటు 57వ డివిజన్లో రుమా బేగం, 55వ డివిజన్లో మౌలా ఖాన్, 46వ డివిజన్లో అబ్దుల్ ఖురేషీకి, 15, 12 డివిజన్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులు తాజ్ హైమద్, సమ్రీన్ బేగం రెండు చొప్పున ఓట్లు పడ్డా యి. అలాగే 52వ డివిజన్లో మహమ్మద్ సర్జీ పర్వేజ్కు 5 ఓట్లు, 50వ డివిజన్లో నరేందర్కు 5 ఓట్లు, 34వ డివిజన్లో సబేరా బేగంకు, 33వ డివిజన్లో జహీరా బేగంకు 4 చొప్పున, నజియా సుల్తానాకు 3 ఓట్లు పడ్డాయి. ● 17వ డివిజన్లో జనసేన అభ్యర్థి లావణ్యకు 17 ఓట్లు, 9వ డివిజన్లో ఒల్లెపు సుజాతకు 8 ఓట్లు, 5వ డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థి మేత్రి రాజశేఖర్కు 7 ఓట్లు నమోదయ్యాయి. ● భీమ్గల్ మున్సిపాలిటీలో ఒకటో వార్డులో బీఎస్పీ అభ్యర్థి అరుణ్కుమార్కు 3 ఓట్లు, 6వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి మాధవికి 7 ఓట్లు, అదేడివిజన్లో బీఎస్పీ అభ్యర్థి సావిత్రికి 6 ఓట్లు వచ్చాయి. ● ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో రెండో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి నర్సయ్యకు 8 ఓట్లు, 7వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీకాంత్కు 2 ఓ ట్లు, 8వ వార్డులో ఇండిపెండెంట్ మానసకు ఆరు, 31 వార్డులో స్వతంత్ర అభ్యర్థి సుమన్కు 3 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. -
ఇందూర్ మేయర్ ఎవరో?
హంగ్ నేపథ్యంలో ఉత్కంఠ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు నగరపా లక సంస్థ (కార్పొరేషన్) మేయర్ ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఇందూ రు నగరంలో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ బీజేపీకి అవకాశాలు లేకపోవడంతో ఎంఐఎంతో కలిసి మే యర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకుంటోంది. మేయర్ అభ్యర్థిగా ఉన్న కాటిపల్లి శమంత 19వ డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీలోనే మరికొందరు మేయర్ స్థానానికి పోటీపడుతున్నారు. 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ నుంచి గెలిచిన కూరగాయల ఉమారాణి, 41వ డివిజన్ నుంచి గెలిచిన బొంబోతుల పుజిత, 12వ డివిజన్ నుంచి గెలిచిన దూమాల అరుంధతి, అలాగే 9వ డివిజన్ నుంచి గెలిచిన కేతావత్ సురేఖలు మే యర్ రేసులో ఉన్నారు. మొత్తం ఐదురుగురు మహిళలు పోటీలో ఉండగా నలుగురు బీసీలు, ఒకరు ఎస్టీ ఉన్నారు. వీ రు కాంగ్రెస్ పార్టీ పెద్దల టచ్లోకి వెళ్లి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదుగురిలో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో ఉత్కంఠగా మారింది. దీంతో ఇందూరు నగరపాలకలో రాజకీ యం రసకందాయంలో పడింది. 60 డివి జన్లు ఉండగా.. బీజేపీకి 28, కాంగ్రెస్కు 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్కు ఒక సీటు వ చ్చింది. ఇక్కడ గతసారి మాదిరిగానే హంగ్ ఏర్పడింది. ఎంఐఎం మద్దతుతో మేయర్ చేజిక్కుంచుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ ఎస్ నుంచి గెలిచిన విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ తన క్యాంపునకు తరలించింది. ఈ కార్పొరేషన్లో బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి, కాంగ్రెస్కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నా రు. దీంతో బీజేపీకి మూడు, కాంగ్రెస్కు రెండు ఓట్లు పెరిగినట్లైంది. బీఆర్ఎస్ అభ్యర్థి ని మినహాయించినప్పటికీ కాంగ్రెస్–ఎంఐఎం కూటమికి 33 ఓట్లు అవుతాయి. కాగా బీఆర్ఎస్ అభ్యర్థి సైతం కాంగ్రెస్ ఆధీనంలోనే ఉండడం గమనార్హం. బీఆర్ఎస్ అభ్యర్థి ఓటు కలిపితే కాంగ్రెస్ వద్ద 34 ఓట్లు ఉన్నట్లే. ఇక బీజేపీకి ఎక్స్ అఫీషియోతో 31 ఓట్లు అవుతాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి కాటిపల్లి శమంత ఓటమి నేపథ్యంలో పీఠం కోసం పలువురు పలువురు పోటీ పడుతున్నారు. మేయర్ ఆశిస్తున్నవారు ఆ పదవి దక్కదనుకుంటే ఏమైనా తేడా చేస్తారా అనే ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మేయర్ కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ ఖాయమైతే సహకరించిన ఎంఐఎం పార్టీకి గెలిచిన అభ్యర్థుల్లో ఒకరికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేతావత్ సురేఖ పంచరెడ్డి లలిత బొంబోతుల పూజిత కూరగాయల ఉమారాణి దుమాల అరుంధతిబోధన్టౌన్: ఎన్నికల ఫలితాల అనంతరం బోధన్ మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. మొత్తం 38 వార్డులకు గాను కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 5, ఎంఐఎం 12, బీజేపీ 3 సీట్లు సాధించగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేదు. 17 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. స్వతంత్ర కౌన్సిలర్తోపాటు బీఆర్ఎస్కు చెందిన మరో కౌన్సిలర్ను సైతం కాంగ్రెస్ నాయకులు క్యాంప్నకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ లెక్కన కాంగ్రెస్ బలం 19కి చేరగా, ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పదవిని కై వసం చేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.బోధన్లో రసవత్తరం కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కౌన్సిల్ ఏర్పాటు కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఓటమితో పెరిగిన పోటీ -
రెండోసారి కౌన్సిలర్లుగా దంపతులు
బోధన్రూరల్: బోధన్ మున్సిపాలిటీలో తూము పద్మ, తూము శరత్ రెడ్డి దంపతులు రెండోసారి కౌన్సిలర్లుగా గెలుపొందారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి మున్సిపాలిటీ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) తరఫున తూము పద్మ (25వ వార్డు), తూము శరత్ రెడ్డి (35వ వార్డు) గెలుపొందారు. అప్పుడు మున్సిపల్ చైర్మన్ స్థానం మహిళకు రిజర్వు అవ్వడంతో తూము పద్మ మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశారు. 2024 అస్లెంబీ ఎన్నికలకు ముందు భార్యాభర్తలిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన దంపతులు విజయం సాధించారు. చైర్మన్ స్థానం జనరల్కు కేటాయించడంతో తూము శరత్రెడ్డి రేసులో ఉన్నారు. -
నాడు భర్త.. నేడు భార్య
కమ్మర్పల్లి(భీమ్గల్): 2020 జనవరిలో జరిగిన భీమ్గల్ మున్సిపల్ మొదటి సాధా రణ ఎన్నికల్లో 5వ వా ర్డు నుంచి బీఆర్ఎస్ తరఫున బొదిరే నర్సయ్య కౌన్సిలర్గా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో అదే వార్డు నుంచి ఆయన సతీమణి బొదిరే లావ ణ్య బీఆర్ఎస్ తరఫున పోటీ విజయం సాధించా రు. మున్సిపాలిటీలో వరుసగా ఒకే వార్డుకు భార్యాభర్తలు కౌన్సిలర్గా ఎన్నికవడం విశేషం. కమ్మర్పల్లి(భీమ్గల్): గత మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున గు న్నాల భగత్ కౌన్సిలర్గా గెలిచి వైస్ చైర్మన్ పీఠం కైవసం చేసుకున్నారు. ప్రసుతం జరిగిన ఎన్నికల్లో అదే వార్డు నుంచి ఆయన తల్లి గున్నాల బాలలక్ష్మి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో 4వ వార్డుకు తల్లీ, కొడుకులు వరుసగా కౌన్సిలర్లు కావడం విశేషం. -
బోధన్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు వీరే..
సబా బేగం 36వ వార్డు కాంగ్రెస్షేక్ ముషీర్ 34వ వార్డు బీఆర్ఎస్పద్మ తూము 35వ వార్డు కాంగ్రెస్సుల్తానా, 23వ వార్డు, కాంగ్రెస్ అన్సర్ అహ్మద్, 27వ వార్డు, ఎంఐఎం నసీమా బేగం, 28వ వార్డు, ఎంఐఎం వలీ ఉద్దీన్, 30వ వార్డు, ఎంఐఎం ఉజ్మబేగం, 31వ వార్డు, ఎంఐఎం సుల్తానా, 32వ వార్డు, ఎంఐఎం అబ్బవ్వ, 33వ వార్డు, బీజేపీఅంజువ్ు, 3వ వార్డు, ఎంఐఎం ఇర్ఫానా ఫిర్దోస్, 7వ వార్డు,ఎంఐఎం రజీయాబేగం, 8వ వార్డు, ఎంఐఎం పౌల్, 9వ వార్డు, కాంగ్రెస్ పోశవ్వ, 10వ వార్డు, కాంగ్రెస్ ఎండీ అనీఫ్,17వ వార్డు, కాంగ్రెస్ అఫ్రిన్, 20వ వార్డు, కాంగ్రెస్ ఆదినారాయణ 37వ వార్డు కాంగ్రెస్కౌసర్ 38వ వార్డు ఎంఐఎం -
మారని ఫలితం
రీ కౌంటింగ్.. ఆర్మూర్: ఓట్ల లెక్కింపులో గందరగోళం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు ఆర్మూర్ పట్టణంలో రీ కౌంటింగ్ కోసం పట్టుబట్టారు. 18వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ గెలుపొందినట్లు ప్రకటించగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఖాందేశ్ సంగీత రీ కౌంటింగ్ కోసం పట్టుబట్టారు. అధికారులు రీకౌంటింగ్ చేసినా ఫలితంలో మార్పు రాలేదు. ఇక 16వ వార్డులో బీజేపీ అభ్యర్థి దొండి కవిత కేవలం మూడు ఓట్ల తేడాతో విజయం సాధించడంతో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి కౌంటింగ్ కేంద్రానికి వచ్చి పోలీసులు, ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. తనను లోనికి పంపించి రీ కౌంటింగ్ చేయాలంటూ గేట్ను దూకేందుకు ప్రయత్నించగా.. ఆయనను లోనికి తీసుకెళ్లి రీ కౌంటింగ్ చేసినా ఫలితంలో మార్పు రాలేదు. -
మతవిద్వేషాలు రెచ్చగొట్టినా కాంగ్రెస్కే పట్టం
నిజామాబాద్ రూరల్: బీజేపీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మతం పేరుతో రె చ్చగొట్టినా కాంగ్రెస్కు మంచి ఫలితాలు వచ్చాయని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కు మార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధికి పట్టం కట్టడం శుభ పరిణామమన్నారు. భవిష్యత్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆకాంక్షిచారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లోనూ 100 సీట్లు గెలిచి సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షు డు నగేశ్రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రా మకృష్ణ, నుడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర సహకార లిమిటెడ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, డీసీసీ జనరల్ సెక్రెటరీ భాస్కర్రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్హుందాన్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జావిద్అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ ము న్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ను గౌరవిస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఓడినా ప్రజల పక్షాన నిలబడి హామీల సాధన కోసం బీఆర్ ఎస్ పోరాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేసిన పట్టణ ప్రజలకు, పార్టీ అభ్యర్థుల విజయం కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించిన కౌన్సిలర్లకు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొని పారదర్శకంగా సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ వృద్ధికి చర్యలు తీసుకోవాలి నిజామాబాద్ రూరల్: టీజీఎస్ఆర్టీసీ సంస్థ వృద్ధికి చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్ జోత్స్న అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆర్టీసీ సంస్థ నిజామాబాద్ రీజియన్ ఆర్థిక పరిస్థితిని, ఆదాయ వృద్ధి, వ్యయ ని యంత్రణ మార్గాలపై శుక్రవారం మేధో మ థన సమావేశం నిర్వహించారు. సంస్థ వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అకౌంట్ ఆఫీసర్ స్వరూపారాణి, పద్మజ, డి పో మేనేజర్లు, ట్రాఫిక్ మెయింటెనెన్స్ సూపర్వైజర్లు, ఏడీసీలు, డ్రైవర్లు, కండక్టర్లు, ఆ యా విభాగాధిపతులు, సిబ్బంది హాజరై త మ అభిప్రాయాలు, సూచనలను తెలిపారు. -
అధికార పార్టీదే పురం
పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్లు లెక్కిస్తున్న ఎన్నికల సిబ్బందిసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పురపాలక ఎన్నికల్లోనూ నిజామాబాద్ జిల్లాలో హస్తం హవా నడిచింది. ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చైర్పర్సన్లు కానున్నారు. నిజామాబాద్ నగరపాలకంలో హంగ్ ఏర్పడింది. ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠా న్ని కై వసం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్లో బీజేపీ 28 సీట్లతో వరుసగా రెండోసారి అ తిపెద్ద పార్టీగా నిలిచింది. 2020 ఎన్నికల్లోనూ బీజే పీ 28 సీట్లే సాధించి మేయర్ పీఠానికి సమీపంలో ఆగిపోయింది. మళ్లీ ఈసారి ఇదే పరిస్థితి నెలకొన డం గమనార్హం. నగరపాలక ఓట్ల లెక్కింపు ప్రక్రి య ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ● ఇందూరులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1,524 పోల్ కాగా ఇందులో బీజేపీ అభ్యర్థులు 755, కాంగ్రెస్ 476, ఎంఐఎం 95, బీఆర్ఎస్ అభ్యర్థులు 67 ఓట్లు సాధించారు. నోటాకు 9 ఓట్లు పడ గా, చెల్లని ఓట్లు 21 ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల నేపథ్యంలో ప్రధాన ఓట్ల లెక్కింపుపై ఆ సక్తి నెలకొంది. అయితే ప్రతి డివిజన్ విషయంలో నూ పోటాపోటీ నడవడంతో అద్యందం ఉత్కంఠభరి తం అయింది. దీంతో లెక్కింపు బాగా ఆలస్య మైంది. బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ ఎస్ ఒక చోట గెలిచాయి. 2020లో కేవలం రెండు సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు 17 సీట్లు గెలిచింది. గతంలో 13 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ ఈసారి కేవలం ఒక సీటుతో సరిపెట్టుకుంది. క్రితంసారి 16 సీట్లు గెలిచిన ఎంఐఎం ఈసారి 14 సీట్లు సాధించింది. ఇందూరు బల్దియాలో వరుసగా మూడోసారి హంగ్ నెలకొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీషియో ఓట్లపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్కు ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్యాదవ్ నిజామాబాద్లో ఓటు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీకి ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఉన్నారు. అయినప్పటికీ సమీకరణలు పరిశీలిస్తే మేయర్ పీఠం దక్కే అవకాశం లేకుండా పోయింది. గతంలో ఎక్స్ అఫీషి యో ఓట్లు తగినన్ని లేక, ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నప్పటికీ నంబర్ గేమ్లో మేయర్ పీఠానికి బీజేపీ దూరమవుతోంది. ● బోధన్లో 38 వార్డులకు కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 5, బీజేపీ 3, ఎంఐఎం 12, స్వతంత్రులు 1 చోట గెలుపొందారు. ఇక్కడ స్వతంత్ర, ఎక్స్ అఫీషియో ల ద్వారా కాంగ్రెస్ చైర్మన్ పీఠం దక్కించుకోనుంది. ఇక్కడ తూము శరత్రెడ్డికి చైర్మన్ అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. 2020 ఎన్నికల్లో శరత్రెడ్డి సతీమణి చైర్పర్సన్గా పనిచేశారు. ఇక భీమ్గల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు కాంగ్రెస్ 08, బీఆర్ఎస్ 04 చోట్ల గెలిచాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులు న్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 19, బీజేపీ 8, బీఆర్ఎస్ 5, ఎంఐఎం 1, స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. అయితే ఇక్కడ చైర్పర్సన్ ఆశావహులు ఏబీ శ్రీదేవి, ఖాందేశ్ సంగీత ఓటమిపాలు కావడం గమనార్హం. అసలు ఏమాత్రం అంచనాలు లేని మహిళ ఆర్మూర్లో చైర్పర్సన్ కానుండడం విశేసం. ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీలు ‘హస్త’గతం నిజామాబాద్లోనూ ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠంపై కాంగ్రెస్! ఇందూరులో ఓట్ల లెక్కింపులో ఆద్యంతం ఉత్కంఠభరితం ఇందూరు నగరపాలకంలో మరోసారి విలక్షణ ఫలితం బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ ఒక చోట విజయం వరుసగా రెండోసారి 28 సీట్ల వద్ద ఆగిన బీజేపీ కార్పొరేషన్లో వరుసగా మూడోసారి హంగ్ -
సమన్వయ లోపం.. కౌంటింగ్ ఆలస్యం
నిజామాబాద్అర్బన్/సుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, 9.50 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తరువాత 10.30గంటలకు సిబ్బందికి అల్పాహారం ఏర్పాటుచేశారు. ఇదే సమయంలో మరో గంటలపాటు ఆలస్యమైంది. మధ్యాహ్నం 12.30 గంటలకు లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉన్నా.. రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ ఆఫీసర్ల మధ్య సమన్వ యం లోపించింది. అన్ని డివిజన్ల కౌంటింగ్ ఒకే సారి ప్రారంభించాలని రిటర్నింగ్ అధికారులు పే ర్కొనగా.. కొన్నిటేబుళ్ల వద్ద పోలింగ్ అధికారులు ఇందుకు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల కోసం మరో గంట వేచి చూశా రు. ఇదేసమయంలో కొన్ని డివిజన్ల లెక్కింపు ప్రా రంభమైంది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ పూర్తిస్థాయిలో ప్రారంభం కావడానికి మధ్యాహ్నం 2 గంట లు దాటింది. 60 డివిజన్ల నాలుగు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటుచేశారు. ఒక్కో డివిజన్కు ఒకటి చొప్పున 60 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటుచేశారు. ఏక కాలంలో అన్ని డివిజన్లు ఒకేసారి లెక్కింపు ప్రారంభించాలని ముందస్తుగా నిర్ణయించుకున్నా.. అమలు చేయడంలో విఫలమయ్యారు. పోలైన ఓట్ల ను 25 చొప్పున బండిళ్లుగా విభజిస్తూ ఒక్కో రౌండ్ లో వెయ్యిచొప్పున ఓట్లను లెక్కించేలా నిర్ణయించారు. కానీ ఆలస్యం వల్ల సాధ్యం కాలేకపోయింది. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్లు, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతోపాటు సపోర్టింగ్ స్టాఫ్ను నియమించారు. వీరి మధ్య సమన్వయం లోపించింది. దీంతో ఓట్ల లెక్కింప ప్రక్రియ గంటల తరబడి ఆలస్యమైంది. పూర్తిస్థాయి ఫలితాలు రాత్రి 10గంటల వరకు వచ్చాయి. ఉదయం 9.50 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ఆ వెంటనే సిబ్బందికి అల్పాహారం రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ ఆఫీసర్ల మధ్య సమన్వయలోపం రాత్రి వరకు కొనసాగిన ఫలితాల ప్రక్రియ -
బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి వద్ద హైడ్రామా
● భారీ పోలీస్ బందోబస్తు ● ఇంటి చుట్టూ కాంగ్రెస్, బీజేపీ నేతల చక్కర్లు నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి ప్యాట విజయలక్ష్మి ఇంటి వ ద్ద శుక్రవారం రాత్రి హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్, ఎంఐఎంకు పూర్తి మెజార్టీ ఉన్నా.. బలం పెంచుకునేందుకు విజయలక్ష్మి మద్దతు కోసం కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అదేసమయంలో 28 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ సైతం మద్దతు కోసం చర్చలు జరుపుతోంది. దీంతో నగరంలోని దుబ్బ ప్రాంతంలోని కట్ట మైసమ్మ కెనాల్ కట్ట వద్ద ఉన్న ఆమె ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రెండు పార్టీల నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తుండగా.. విజయలక్ష్మి మద్దతు ఎవరికి ఉంటుందో వేచి చూడాల్సిందే. -
పుణ్యస్నానాల గంగ
డొంకేశ్వర్(ఆర్మూర్): తల్లి కడుపులో బిడ్డ పడినా.. పండంటి బిడ్డ పుట్టినా ముందు మొక్కేది ఆ గంగమ్మ తల్లికే. పిల్లల పుట్టు వెంట్రుకలు.. ఖుషీ తెప్పలు.. పుణ్యస్నానాలతో నికాల్పూర్ గంగ (గోదావరి)ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. జిల్లాలో పుణ్య స్నానాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో ఇదొకటి. చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలు మూలల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తుంటారు. ప్రతి శుక్ర, సోమవారాల్లో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి తెప్పలతో మొక్కులు చెల్లిస్తారు. ఏమి లేకున్నా గంగమ్మ తల్లిని మరువకూడదనే భక్తితో, ప్రేమతో ఏడాదికోసారి ఖుషీ తెప్పను వదులుతారు. ప్రతి అమవాస్య, పౌర్ణమి నాడే కాకుండా ఏటా కార్తీక పౌర్ణమి రోజుల్లోనైతే భక్తుల తాకిడి మరింత ఎక్కువ ఉంటుంది. పచ్చని చెట్లు, పరుచుకున్న గడ్డి, జల సవ్వడుల ప్రకృతి నడుమల పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేస్తారు. పుష్కర ఘాట్కు అనువైన స్థలం భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు నికాల్పూర్ గంగ (గోదావరి) ఎంతో అనువైన స్థల మని, అధికారులు స్పందించి ఘాట్ను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లాలోని పదకొండుకు పైగా ప్రాంతాల్లో పుష్కరాలను నిర్వహిస్తుండగా ప్రసిద్ధి చెందిన నికాల్పూర్ గోదావరి వద్ద కూడా నిర్వహించాలని కోరుతున్నారు. ఆధ్మాత్మిక శోభతో అలరారుతున్న నికాల్పూర్ గోదావరి ప్రతి శుక్ర, సోమవారాల్లో జనసందోహం జిల్లా నలుమూలల నుంచి రాక గోదావరి పుష్కరాలకు అనువైన ప్రాంతం -
నేడు తేలనున్న భవితవ్యం
● ఆర్మూర్లో 36 వార్డులు, 153 మంది అభ్యర్థులు బరిలో.. ● విజయం ఎవరిని వరిస్తుందో..! ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డుల్లో పోటీపడ్డ 153 మంది అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలిపోనుంది. పట్టణంలోని 36 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ నుంచి 36 మంది, బీజేపీ నుంచి 33 మంది, బీఆర్ఎస్ నుంచి 35 మంది, ఎంఐఎం నుంచి నలుగురు, ఆప్ నుంచి నలుగురు, జనసేన నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి ఒకరు, ఇతర పార్టీల నుంచి ఇద్దరు, స్వతంత్రులు 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పోరు జరిగినప్పటికీ కొన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ, స్వతంత్య్ర అభ్యర్థులు గట్టి పోటీనిచ్చారు. ఎన్నికల అధికారులు నిర్వహించనున్న కౌంటింగ్లో అభ్యర్థుల జయాపజయాలు తేలనున్నాయి. ఆర్మూర్ పట్టణ శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో ఓట్ల లెక్కింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉదయం 8 నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్, ఆర్మూర్ సబ్ కలెక్టర్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మున్సిపల్ సిబ్బంది కౌంటింగ్ నిర్వహిస్తారు. సుమారు 50 మందికి పైగా అధికారులు కౌంటింగ్లో పాల్గొంటారు. శుక్రవారం నాటి ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ సరళిని అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దాగి ఉన్న బ్యాలెట్ బాక్స్లను ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పకడ్బందీగా చేపట్టాలి ఆర్మూర్టౌన్: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిర్వహించే బ్యాలెట్ పత్రాల కౌంటింగ్ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ సూపవర్వైజర్లకు మాక్ కౌంటింగ్ నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహణ రోజు ఏజెంట్లు ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఆ ఏజెంట్ను బయటకు పంపించాలన్నారు. రికౌంటింగ్ లేకుండా ఒకేసారి జాగ్రత్తగా చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్రావు, సిబ్బంది పాల్గొన్నారు. బోధన్లో కౌంటింగ్కు..బోధన్టౌన్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగనున్నందున పట్టణంలోని విజయ మేరీ పాఠశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని 38 వార్డుల్లో పోలింగ్ జరుగగా అధికారులు బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి విజయ మేరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించి భద్ర పరిచారు. కౌంటింగ్ సూపర్ వైజర్లు 38 మంది, అసిస్టెంట్ సూపర్వైజర్లు 38 మంది ఉండగా ఏవోలు, ఏపీవోలు 26 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏసీపీ శ్రీనివాస్, కమిషనర్ జాదవ్ కృష్ణ, సీఐ వెంకట నారాయణ, తహసీల్దార్ విఠల్ ఉన్నారు. -
పకడ్బందీగా బందోబస్తు
నిజామాబాద్ అర్బన్: పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్న కౌంటింగ్కు పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని అదనపు డీసీపీ బస్వారెడ్డి పేర్కొన్నారు. గురువారం రాత్రి పాలిటెక్నిక్ కళాశాలలో సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, ఇతర సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పోలీసు జాగిలాలతో కౌంటింగ్ కేంద్రం పరిసరాలను తనిఖీలు చేశారు. ఎంట్రీ పాసులు ఉన్న కౌంటింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తమ వాహనాలను పాలిటెక్నిక్ కళాశాలలో పార్కింగ్ చేయాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు సీఎస్ఐ గ్రౌండ్లో పార్కింగ్ చేయాలని తెలిపారు. బృందావన్ కాలనీలో ● 16 తులాల బంగారం అపహరణ కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డు సమీపంలో ఉన్న బృందావన్ కాలనీలో గురువారం భారీ చోరీ ఘటన వెలుగు చూసింది. కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీలేఖ తన ఇంటికి తాళం వేసి బుధవారం రాత్రి దేవునిపల్లిలోని తన తల్లిగారింటికి వెళ్లారు. ఉదయాన్నే వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. దుండగులు చోరీకి పాల్పడినట్లు గుర్తించిన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ, సీసీఎస్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇంట్లో దాచి ఉంచిన 16 తులాల బంగారం, 5 తులాల వెండి, కొంత నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు. భిక్కనూరు: దేవాలయాల అభివృద్ధికి ప్రజలందరూ చేయూతనందించాలని సిద్ధరామేశ్వరాలయం మహంత్ సదాశివ మహంత్ అన్నారు. గురువారం తిప్పాపూర్ సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న కాకిగండి శివాలయంలో ఆయన మాట్లాడారు. శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తిప్పాపూర్ సర్పంచ్ కుంట లింగారెడ్డి, ఆలయం అభివృద్ధి కమిటీ ప్రతినిదులు తెలిపారు. సైంటిస్టు ఆకిటి రాజిరెడ్డి.. ఆలయంలో టైల్స్ వేసేందుకు రూ.43 వేలు విరాళంగా అందజేశాడన్నారు. నరకప్రాయంగా ప్రయాణం నిజామాబాద్ రూరల్: మాధవనగర్ వద్ద ఆర్వోబీ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న ఇరువైపుల రోడ్లు దెబ్బ తింటున్నాయి. కంకరతేలిన రోడ్డు ఉండడంతో పాటు దుమ్ము అధికంగా వస్తోంది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ ప్రాంతంలో వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అధికారులు స్పందించి తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
వృద్ధుడికి సపర్యలు
వృద్ధుడితో మాట్లాడుతున్న అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, సపర్యలు చేసిన స్వచ్ఛంద సంస్థ సభ్యులునిజామాబాద్ రూరల్: రోడ్డుపై నడవలేనిస్థితిలో పాకుతున్న ఓ అనాథ వృద్ధుడిని చూసి చలించి పోయిన అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి వెంటనే ఓ స్వచ్ఛంద సంస్థతో సపర్యలు చేపట్టి వైద్యం అందించేలా కృషి చేశారు. గురువారం విధి నిర్వహణలో భాగంగా కంఠేశ్వర్ ప్రాంతం గుండా పోలీస్ వాహనంలో వెళ్తున్న అడిషనల్ డీసీపీ ఓ అనాథ వృద్ధుడు నడవలేని స్థితిలో, గాయాలతో రోడ్డుపై పాకుతుండటాన్ని గమనించి చలించిపోయారు. వెంటనే తన వాహనం దిగి వృద్ధుడి వద్దకు వెళ్లి మాట్లాడారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు సమాచారం అందించాగా వారు అక్కడికి చేరుకొని వృద్ధుడికి సపర్యలు చేపట్టి చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ ప్రకాశ్, మూడో టౌన్ ఎస్సై హరిబాబు, స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు, వాల బాలకిషన్, దర్శనం రాజు, నయన్ పాల్గొన్నారు. -
పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి
● డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా నియామకమైన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పా ర్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. తన నియామకానికి కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, అబుద్ బిన్ హందాన్, ప్రీతం, ముస్తాఫా, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందూరు’పై కాషాయ జెండా ఎగరడం ఖాయం
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సుభాష్నగర్: ఇందూరు మున్సిపల్ ఎన్నికల్లో బీజే పీ అఖండ విజయం సాధించి మేయర్ పీఠాన్ని కై వ సం చేసుకోవడం ఖాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అధ్యక్షతన ము న్సిపల్ ఎన్నికల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లతో గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడు తూ మన ఇందూరు – మన మేయర్ నినాదానికి ప్రజలు మద్దతు పలికారని తెలిపారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే ప్రజల నాడి పూర్తిగా బీజేపీ వైపే ఉందని స్పష్టమవుతోందన్నారు. కార్యకర్తల కష్టానికి తగిన ఫలితం దక్కబోతోందని, నేడు వెలువడే ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతుందని తెలిపారు. ఓట్లు లెక్కించే సమయంలో ప్రతి ఓటును జాగ్రత్తగా గమనించాలని ఏజెంట్లకు సూచించారు. తేడా అనిపిస్తే, వెంటనే ‘రీ–కౌంటింగ్’ కోరాలని, కౌంటింగ్ ప్రక్రియపై అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశంచేశారు. సమావేశంలో నాయకులు, అభ్యర్థులు కందగట్ల రాంచందర్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రమోద్ కుమార్, తిరుపతిరెడ్డి, బద్దం కిషన్, బంటు రాము, పుట్ట వీరేందర్, శ్రీకాంత్, ఏజెంట్లు పాల్గొన్నారు. -
నేడే పుర తీర్పు!
నిజామాబాద్ముగ్గురికి ఏడాది జైలు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన ముగ్గురికి నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026– IIలో uమరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పోటీ చేసిన అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చైర్మన్ పీఠంపై కన్నేసిన ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు జరిగిన ప్రతి అంశాన్ని పోస్టుమార్టం చేస్తూ లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు అభ్యర్థులు చేజారకుండా క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. -
ఒక్కో రౌండ్లో వెయ్యి ఓట్లు
● లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి ● ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం ● కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి ● కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ సుభాష్నగర్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లకు శుక్రవారం ఏర్పాటుచేసిన శిక్షణాతరగతులను కలెక్టర్ సందర్శించి, ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాల్సిన విధానంపై కీలక సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున ఎంతో జాగ్రత్తతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ హితవు పలికారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తు.చ తప్పక పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా పైఅధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడిలో గందరగోళానికి గురికాకూడదని, ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించుకొని వెల్లడించాలని సూచించారు. కౌంటింగ్ హాలులోనికి ఆర్వో మినహా ఇతరులు ఎవరికీ సెల్ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక్కో డివిజన్కు.. ఒక్కో టేబుల్.. అత్యధికంగా 60 డివిజన్లు కలిగిన నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ఓట్ల లెక్కింపు కోసం పాలిటెక్నిక్ కళాశాలలో నాలుగు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని తెలిపారు. ఒక్కో డివిజన్కు ఒకటి చొప్పున 60 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశామని, ఏక కాలంలో అన్ని డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. బ్యాలెట్ బాక్సులను తెరిచి, పోలైన ఓట్లను 25 చొప్పున బండిల్స్గా విభజిస్తూ, ఒక్కో రౌండ్లో వెయ్యి చొప్పున ఓట్లు లెక్కించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ఇదే తరహాలో ఒక్కో వార్డుకు ఒకటి చొ ప్పున కౌంటింగ్ టేబుళ్లు ఉంటాయని అన్నారు. ఓ ట్ల లెక్కింపు కోసం ఒక్కో టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతోపాటు సపోర్టింగ్ స్టాఫ్ను నియమించామని అన్నారు. అ భ్యర్థులు, ఏజెంట్లు ఉదయం 7 గంటల్లోపు కౌంటింగ్ సెంటర్ల వద్దకు రావాలని కలెక్టర్ సూచించారు. ఎంట్రీ పాసులతోపాటు ఏదైనా గుర్తింపుకార్డు వెంట తెచ్చుకోవాలని తెలిపారు. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేదని స్పష్టంచేశారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఉన్నారు. కౌంటింగ్ కేంద్రాలు ఇవే..పకడ్బందీ చర్యలు శుక్రవారం ఉదయం స్ట్రాంగ్రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు చేరుస్తూ, 8 గంటల నుంచి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ వెల్లడించారు. నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభించేందుకు అన్నివిధాలుగా సన్నద్ధం చేశామన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద డివిజన్/వార్డు వివరాలు తెలిపేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని, ఎలాంటి పొరపాట్లు, గందరగోళానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. -
ఆరంభం.. ఆగమాగం
ఇందల్వాయి: ఇసుక అక్రమ రవాణా, అడ్డగోలు దోపిడీని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఇసుక వాహనం యాప్నకు ఆరంభంలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో మన ఇసుక వాహనం యాప్ విధానాన్ని అమలు చేసేందుకు పైలెట్ జిల్లాగా నిజామాబాద్ను ఎంపిక చేశారు. అందులో భాగంగా జనవరి 31న యాప్ సేవలను ప్రారంభించారు. తక్కువ ధరలో, తక్కువ సమయంలో ఇసుకను ప్రజల ఇంటికే నేరుగా అందించేందుకు వీలుగా ఈ అప్లికేషన్ని రూపొందించారు. ఉన్నతాధికారులు సైతం ఈ యాప్పై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న కొందరికి మాత్రం అందులో తమ మండలాల పేర్లు కనబడకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. రూరల్లో జక్రాన్పల్లి మాత్రమే.. మన ఇసుక వాహనం అప్లికేషన్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి జక్రాన్పల్లి మండలం మాత్రమే ఇసుక బుకింగ్కి అందుబాటులో ఉంది. మిగతా మండలాలు అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రాంతంలో ఇసుక అవసరం ఉన్నవారు ఇబ్బందులుపడుతున్నారు. అత్యవసరంగా ఇసుక అవసరం ఉన్నవారు కచ్చితంగా అప్లికేషన్ ద్వారానే అనుమతులు తీసుకోవాలని, లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం మన ఇసుక వాహనం యాప్తో కొన్ని ప్రాంతాల వారికి లబ్ధి చేకూరనుండగా మరికొన్ని ప్రాంతాల వారికి ఇసుక మరింత ప్రియం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు నిజామాబాద్ రూరల్ ని యోజకవర్గంలో కొన్ని వాగు పరీవాహక ప్రాంతా ల్లో ఇసుక ఒక ట్రాక్టర్ (3 క్యూబిక్ మీటర్)కి రూ. ఏ డు వందల నుంచి రూ.వెయ్యి లోపే ఖర్చు అవు తుండగా బుకింగ్ విధానం ద్వారా వారికి రూ. 15 వందల వరకు అయ్యే అవకాశం ఉంది. మరోపక్క వాగుకు దూరంగా ఉన్న గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్ రూ.రెండు వేల నుంచి రూ. మూడు వేల మధ్యలో ఉండగా వారికి బుకింగ్ విధానం ద్వారా రూ. రెండు వేల లోపే ట్రాక్టర్ ఇసుక అందుబాటులోకి రా నుంది. ఏది ఏమైనా మన ఇసుక వాహనం ద్వారా ఇసుక ప్రజల చెంతకు చేరడంలో ఎన్నో సవాళ్లు ఎ దురవుతాయ ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మన ఇసుక వాహనం యాప్లో కొన్ని మండలాల పేర్లు లేకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలను పైఅధికారులతోపాటు మైనింగ్ అధికారులకు విన్నవించాం. మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. అంతవరకు ఇసుకను అక్రమంగా తరలించొద్దు. సొంత ట్రాక్టర్ ఉన్న సాధారణ వినియోగదారులు 3 క్యూబిక్ మీటర్లకు రూ. 1174.97, ఇందిరమ్మ ఇళ్ల వినియోగదారులు రూ. 614.16 చెల్లిస్తే (లేబర్ చార్జీలతో కలిపి) ఇసుక ఇంటికే డెలివరీ చేస్తాం. – శాంత, ఇన్చార్జి తహసీల్దార్, ఇందల్వాయి ‘మన ఇసుక వాహనం’ యాప్తో ఇబ్బందులు అయోమయంలో వినియోగదారులు సరైన వివరణ ఇవ్వలేకపోతున్న అధికారులు -
నేటి నుంచి శివపురాణం ప్రవచనం
● పలుగుట్టలో మూడురోజులపాటు ప్రవచనాలు ● మంగి రాములు మహరాజ్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నందిపేట మండలంలోని పలుగుట్ట కేదారేశ్వర ఆశ్రమంలో ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంగి రాములు మహరాజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. గండ్ర ప్రేమ్సాగర్రావు సౌజన్యంతో చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రముఖ ప్రవచనకర్త ఆచార్య వాసుదేవ్జీ ప్రవచనాలు చెప్పనున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజులపాటు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రవచన కార్య క్రమం ఉంటుందన్నారు. ఇందులో శివమహాపురాణం ఉంటుందని వివరించారు. తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు కుటుంబాలతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకుడు సిక్కాల శంకర్కు రాజస్థాన్లోని శ్రీజగదీశ్ ప్రసాద్ జబర్మల్ టిబ్రీవాలా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. ప్రొఫెసర్ నీతుసింగ్ పర్యవేక్షణంలో ‘మేనేజిరల్ ఆన్పెక్ట్ అండ్ బయలాజికల్ స్టడీస్ ఆన్ పౌల్ట్రీఫాం ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్’ అనే అంశంపై పరిశోధన చేశారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్ సతీశ్, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ బీ సుమలత, డాక్టర్ బీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: సైబర్ మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం కాకతీయ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అభివృద్ధి చెందడంతో పాటు, సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందన్నారు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధిక లాభాలు వస్తాయని నమ్మబలికే నకిలీ వెబ్సైట్లు, యాప్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. కొద్దిపాటి పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని చెప్పి ప్రజల డబ్బును దోచుకునే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలంటే ఏ పెట్టుబడి పెట్టే ముందు ఆ సంస్థపై పూర్తి వివరాలు సేకరించాలని, అపరిచిత కాల్స్ను నమ్మకూడదని సూచించారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు, కాకతీయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
తీవ్ర ఉత్కంఠ మధ్య వెలువడనున్న ఫలితాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరపాలక, పురపాలక ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఓట్ల లె క్కింపు చేసి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరం, బోధన్, ఆర్మూ ర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లోని డివిజన్లు, వార్డులకు పోటీ చేసిన అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అందరి దృష్టి ఉన్న నిజామాబాద్ నగర పాలకం ఫలితాలపై జిల్లాలోని అన్నివర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. మేయర్ పీఠంపై కన్నేసిన ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు జరిగిన ప్రతి అంశాన్ని పోస్టుమార్టం చేస్తూ సమీకరణాల లెక్కలు వేసుకుంటు న్నాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ను వ్వా నేనా అనేలా పోటీ నడిచింది. మధ్యలో ఎంఐ ఎం తన పట్టును నిలుపుకునేలా బరిలో కొట్లాడింది. దీంతో నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందూరులో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం మద్దతు తీసుకుని మేయర్ పీఠం కై వసం చేసుకుంటుందనే అంచనాలు సైతం ఉన్నాయి. ఇంతటి పోటీ మధ్య బీఆర్ఎస్ 3 నుంచి 4 సీట్లు గెలిచినప్పటికీ కింగ్మేకర్ అయ్యే చాన్స్ ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఇక స్వతంత్రులు ఒకటి రెండు గెలుచుకుంటే మాత్రం సమీకరణలు మరింత రసకందాయంలో పడినట్లే. ఎంఐఎంకు కింగ్మేకర్ అవకాశం వస్తే కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు కింగ్మేకర్ అవకాశం వస్తే బీజేపీకి మద్దతు ఇస్తాయంటున్నారు. స్వతంత్రులు రెండుకు మించి గెలుచుకుంటే మాత్రం రాజకీయం భలేగా ఉంటుంది. పార్టీల నేతలు ఓ వైపు తామే గెలుస్తామని ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు.పాలిటెక్నిక్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన టేబుళ్లుజిల్లాలోని మున్సిపాలిటీల్లో పోలింగ్ వివరాలు.. విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్న అభ్యర్థులు మెజార్టీ స్థానాలపై ప్రధాన పార్టీల్లో ధీమా పోలింగ్ శాతం తగ్గడంతో మారనున్న అంచనాలు అందరి దృష్టి ఇందూరు కార్పొరేషన్ పైనే.. -
క్రైం కార్నర్
విద్యుత్షాక్తో వ్యవసాయ కూలీ మృతి భిక్కనూరు: విద్యుత్షాక్తో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గాంధారి మండలం జువ్వాడి గ్రామానికి చెందిన గౌనిభూమయ్య (60) భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం పొలంలో బోర్ మోటర్ను ప్రారంభించేందుకు వెళ్లాడు. అక్కడ స్టార్టర్ బాక్సుకు విద్యుత్ సరఫరా అవుతున్న విషయాన్ని గమనించని భూమయ్య దానికి తగలడంతో విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ లీగల్/ నిజాంసాగర్: కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. రెండువేల జరిమానా విధిస్తూ నిజామాబాద్ సెకండ్ క్లాస్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి (ఎస్సీ, ఎస్టీ కోర్టు) టి. శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పిప్పిరేగడి తండాకు చెందిన కేతావత్ పరశురాం, తమ గ్రామ శివారులోని హసన్పల్లిలో కురుమ భూమయ్యకు చెందిన ఎకరం ఇరవై గుంటల వ్యవసాయ భూమి కొనుగోలుకు రూ. రెండు లక్షల ఇరవై వేల నగదును మొదట బయానాగా ఇచ్చాడు. మిగతా డబ్బులు పట్టా అయ్యాక చెల్లిస్తానని ఒప్పందం కుదిరింది. ఈ వ్యవహారంలో 16.07.2021న పిప్పిరియగడి తండాకు పెద్దమనిషి ఇత్యా నాయక్ పిలుపు మేరకు పరశురాం తన మామతో కలిసి అక్కడికి వెళ్లాడు. ఈ సమయంలో భూమి అమ్మిన కురుమ భూమయ్య అల్లుడు బోయిన ప్రవీణ్కుమార్, హసన్పల్లి మాజీ సర్పంచ్ సంగమేశ్వర్గౌడ్, కురుమ భద్రయ్యలు కలిసి డబ్బులు వద్దు.. మా భూమి మాకు కావాలి అంటు వివాదం సృష్టించారు. అనంతరం పరశురాంను కులం పేరుతో దూషించి, బెదిరించి చేతులతో, చెప్పులతో దాడి చేశారు. దీంతో బాధితుడు పరశురాం తన మామతో కలిసి దాడి విషయమై నిజాంసాగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసును విచారించిన పోలీసులు, దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కేసులో సాక్షులను విచారించి, సాక్ష్యాధారాలను పరిశీలించిన నిజామాబాద్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి(ఎస్సీ, ఎస్టీ కోర్టు) టీ శ్రీనివాస్ నిందితులు కులం పేరుతో దూషించి దాడి చేసినట్లు నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. రెండు వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
క్రీడల్లో గెలుపోటములు సహజం
ఆర్మూర్టౌన్: క్రీడల్లో గెలుపోటములు సహజమని వాటిని సమానంగా తీసుకోవాలని ఆర్మూర్ బాలుర పాఠశాల హెచ్ఎం లక్ష్మీనర్సయ్య అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి సీఎం కప్ సాఫ్ట్ బాల్ టోర్నోమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర క్రీడాకారులను ఒలంపిక్స్ స్థాయిలో రాణించే విధంగా ప్రభుత్వం చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా క్రీడాధికారి పవన్కుమార్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి సీఎం కప్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్కు 8 మహిళా విభాగం జట్లు, 8 పురుషుల విభాగం జట్లు పాల్గొన్నాయన్నారు. పోటీల్లో పురుషుల విభాగాంలో ఆర్మూర్ ప్రథమ, తొర్లికొండ ద్వితీయ, కమ్మర్పల్లి జట్లు తృతీయ స్థానంలో నిలిచాయి. అలాగే మహిళా విభాగంలో సుద్ధపల్లి ప్రథమ, ఆర్మూర్ ద్వితీయ, ముచ్కూర్ జట్లు తృతీయ స్థానాల్లో నిలిచాయి. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగామోహన్, సంయుక్త కార్యదర్శి సుజాత, జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వినోద్, ఉపాధ్యాయులు, స్వప్న, అనికెత్, రాహుల్, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
మార్చిలో ఎకో టూరిజం పనులు!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ ప్రాంతంలో ఎకో టూరిజం పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అనుకున్నట్లుగా అన్ని జరిగితే రానున్న మార్చిలోనే మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. డొంకేశ్వర్ మండలం చిన్నయానం, గాదేపల్లి వద్ద బ్యాక్వాటర్ ప్రాంతాన్ని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ డైరెక్టర్ రంజిత్ నాయక్ డీఎఫ్డీవో వికాస్ మీనా, అర్కిటెక్చర్ పృథ్వీలతో కలిసి గురువారం పరిశీలించారు. వాచ్టవర్లు, రిసార్టు లు, విశ్రాంతి గదులు, పార్కింగ్ ఏరియా ఎక్కడెక్కడ పెట్టాలో మరోసారి చర్చించారు. మ్యాపులు, ప్లాన్లు అన్ని సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పనులు ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చన్నారు. స్థానిక గ్రామాలకు ఉపాధి కల్పించేలా నేచర్ గైడ్ల నియామకానికి కసరత్తు జరుగుతోందన్నారు. ఇందుకు కొంతమంది యువకులను పిలిచి వారితో మాట్లాడారు. త్వరలోనే హైదరాబాద్లో 20 రోజులపాటు శిక్షణ ఉంటుందని, ప్రభుత్వమే అన్ని వసతులు కల్పిస్తుందని తెలిపారు. పనుల్లో కూడా స్థానికులకే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. వన సంరక్షణ కమిటీలో కూడా స్థానికులనే ఉంచుతామని ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్ కలిపి మొత్తం 15 మంది సభ్యులు ఉంటారన్నారు. ఆరు నెలల్లో ఎకో టూరిజం పూర్తిగా ఏర్పడి పర్యాటకుల సందడి నెలకొంటుందని చెప్పారు. అధికారుల వెంట ఆర్మూర్ ఎఫ్డీవో భవానీ శంకర్, ఎఫ్డీసీ అధికారులు శ్రీనివాస్, శిరీష, డిప్యూటీ ఎఫ్ఆర్వో సుధాకర్, గాదేపల్లి సర్పంచ్ చిన్నారెడ్డి ఉన్నారు. కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు అధికారుల వెల్లడి గాదేపల్లి బ్యాక్వాటర్ ప్రాంతాన్ని పరిశీలించిన ఎఫ్డీసీ డైరెక్టర్ రంజిత్ నాయక్ -
స్వల్ప ఉద్రిక్తతలు
నిజామాబాద్ అర్బన్: నగరంలోని 52వ డివిజన్ పరిధిలో ఉన్న గోల్డెన్జూబ్లీ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఎంఐఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినప్పటికీ మాట వినకపోవడంతో సీపీ సాయిచైతన్య అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. స్వల్ప లాఠీచార్జి చేశారు. మరొకరి ఓటువేసేందుకు ప్రయత్నించిన ఓ యువతిని పోలింగ్ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. మరో ఇదే సెంటర్లో మరో ఇద్దరిపై దొంగ ఓటింగ్ కేసులు నమోదయ్యాయి. ● 18వ డివిజన్ పరిధిలోని ముబారక్నగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో దొంగ ఓటు వేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని పోలింగ్ ఏజెంట్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ● 19వ డివిజన్ పరిధిలోని గూపన్పల్లి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున గుమిగూడారు. పోలీసులు రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టారు. బీజేపీ నాయకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేశ్రెడ్డితోపాటు ఇతర సీనియర్ నాయకులు ఆరోపించారు. మరోవైపు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వచ్చి కాంగ్రెస్ నాయకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఇరువురు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున గూమిగుడారు. వీరిని సీపీ సాయిచైతన్య సిబ్బందితో కలిసి చెదరగొట్టారు. ● పోలీస్ కమిషనర్ సాయిచైతన్య నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు. సీపీ వెంట ఏసీపీ ప్రకాశ్, ఎస్హెచ్వో సతీశ్ తదితరులున్నారు. ● 11వ డివిజన్లోని బాబన్సాహెబ్ పహాడ్లోని పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులను ఎంఐఎం నాయకులు ప్రశ్నించగా గొడవ ప్రారంభమైంది. ఎంఐఎం అభ్యర్థి కరీంతోపాటు మరికొందరిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఎంఐఎం నాయకులు పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయారు. ఎంఐఎం అభ్యర్థి కరీం గాయాలపాలయ్యారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ● మాలపల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఎంఐఎం నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడిచేశారు. పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ నాయకులు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు దాడిచేసినట్లు తెలిసింది. ● 34వ డివిజన్ ఓటింగ్ జరుగుతున్న హరిచరణ్ మార్వాడి పాఠశాల పోలింగ్కేంద్రంలో 60 ఏళ్ల వృద్ధురాలి ఓటును 30 ఏళ్ల మహిళ వేశారని దీనిపై బీజేపీ నాయకుడు ప్రవీణ్ పోలింగ్ అధికారులను ప్రశ్నించారు. మరో నలుగురు మహిళలు ఓటువేసేందుకు రాగా వారి ఓట్లను అప్పటికే ఇతరులు వేసేశారు. నలుగురు మహిళలపై దీనిపై అధికారులను ప్రశ్నించారు. బీజేపీ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎంపీ అర్వింద్ అక్కడికి చేరుకుని అధికారులను ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థిని బయటికి పంపించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని బీజేపీ నాయకులను సముదాయించారు. ● 20వ డివిజన్లోని బీజేపీ అభ్యర్థి న్యాలం సునీత భర్త న్యాలం రాజుపై కాంగ్రెస్ అభ్యర్థి లలిత కుమారుడు దాడి చేశాడు. వాగ్వాదానికి దిగిన వారిని చెదరగొట్టిన పోలీసులు 11వ డివిజన్లో కాంగ్రెస్ – ఎంఐఎం మధ్య లొల్లి ఎంఐఎం అభ్యర్థి కరీంకు గాయాలు 20వ డివిజన్లో బీజేపీ నాయకుడిపై దాడి పలుచోట్ల దొంగ ఓటర్ల పట్టివేత ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో 30వ వార్డుకు చెందిన బ్యాలెట్ పేపర్లలో 34వ వార్డుకు చెందిన స్వతంత్ర అభ్యర్థుల గుర్తులతో బ్యాలెట్ పేపర్లు రావడంతో సిబ్బంది రెండు ఓట్లను రద్దు చేసి వారితో తిరిగి ఓటు వేయించారు. దీంతో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పోలింగ్ కేంద్రానికి వచ్చి పోలీసులు, ఎన్నికల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. -
ఓటింగ్ తీరు.. పోలింగ్ ఏర్పాట్ల పరిశీలన
నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ, పోలింగ్ ఏర్పాట్లను జిల్లా ఎ న్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించా రు. నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్, అర్సపల్లి పాఠశాల, మాలపల్లిలోని బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలతోపాటు ఆర్మూర్ పట్టణంలోని రాం మందిర్ ప్రభు త్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ హైస్కూల్, పెర్కిట్లోని జిల్లా పరిషత్ బాలుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. హెల్ప్ డెస్క్లు, మెడికల్ క్యాంపు, వీల్ చైర్ ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నా యా? అని తనిఖీ చేశారు. కలెక్టరేట్ నుంచి వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను కలెక్టర్, అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, అబ్జర్వర్ సీహెచ్ సత్యనారాయణరెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొ నసాగిందని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వే చ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రని కలెక్టర్ అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రా ల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏ ర్పాటు చేయించామన్నారు. ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్ సత్యనారాయణరెడ్డి పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తీరును పరిశీలించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి, పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్రూమ్లకు తరలించారు. కలెక్టరేట్ నుంచి వెబ్క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న కలెక్టర్ ఆర్మూర్లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి -
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ
సుభాష్నగర్: నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రా లు, స్ట్రాంగ్ రూమ్లను సీపీ సాయి చైతన్య బుధవారం పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చ ర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూ మ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద నిరంతర నిఘా కోసం అదనపు సీసీ కెమెరాలను ఏ ర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రి య ముగిసే వరకు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ అమలులో ఉంటుందని, ఐదుగు రి కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని సీపీ స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీపీ వెంట అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్, టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు, ఎన్నికల పరిశీలకులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 69.48శాతం పోలింగ్ ● బిచ్కుందలో అత్యధికం.. కామారెడ్డిలో అత్యల్పం సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : చెదురుమదురు సంఘటనలు మినహా కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో 92 వార్డులుండగా.. 447 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కామారెడ్డిలో 65.94 శాతం, ఎల్లారెడ్డిలో 79.77, బాన్సువాడలో 73.66, మొదటిసారి ఎన్నిక జరుగుతున్న బిచ్కుందలో 78.49 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ ఆయా పార్టీల మధ్య వాగ్వాదాలు జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కామారెడ్డి పట్టణంలో కవరేజీకి వెళ్లిన మీడియాకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్ల ఫొటోలు తీయడానికి అనుమతి ఇవ్వలేదు. పీహెచ్సీల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి నందిపేట్(ఆర్మూర్): గర్భిణుల వివరాలు నమోదు చేసి పీహెచ్సీ కేంద్రాలలో ప్రసవాలయ్యేలా చూడాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. నందిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె బు ధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరా లు, రికార్డులను పరిశీలించారు. అనంతరం కుద్వాన్పూర్ గ్రామంలోని పల్లె దవా ఖాన ను పరిశీలించారు. ఎంసీహెచ్, ఎన్సీడీ, షుగర్, బీపీ, క్యాన్సర్ ఉన్నవారిని గుర్తించి ఇంటింటికి వెళ్లి మందులు ఇవ్వాలని సూచించారు. ఆమె వెంట డాక్టర్ స్వాతి, సూపర్వైజర్ భాస్కర్, సిబ్బంది ఉన్నారు. -
సమ్మెను విజయవంతం చేయండి
నిజామాబాద్ రూరల్: దేశవ్యాప్తంగా నేడు జరుగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్–రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రామ్మోహన్రావు అన్నారు. నాందేవ్వాడలోని పెన్షనర్స్ భవనంలో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు రిటైర్డ్ ఉద్యోగులందరూ పాత కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చౌక్లో నేడు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు. జిల్లా ప్రతినిధులు శిర్ప హనుమాండ్లు, ఈవీఎల్ నారాయణ, రాధా కిషన్, సాంబశివరావు, ప్రసాద్రావు పాల్గొన్నారు. -
రాయకూర్ గ్రామసభలో గందరగోళం
● పోలీస్స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు రుద్రూర్: మండలంలోని రాయకూర్ గ్రామ పంచాయతీలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామసభలో కుర్చీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని మొదలైన వివాదం చివరకు పోలీస్స్టేషన్లో పరస్పరం ఫి ర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది. ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు రాయకూర్ పంచాయతీ ఆవరణలో 15వ ఆర్థిక సంఘం నిధులపై చర్చించేందుకు బుధవారం గ్రామసభ ఏర్పాటు చేశారు. సభలో టార్పాలిన్ కవర్లు వేయడంతో కుర్చీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. టెంట్, కుర్చీలు వేసి సభ ఏర్పాటు చేయా లని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో పాలకవర్గం, ప్రత్యర్థి వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి సభ గందరగోళంగా మారింది. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి ఇరువర్గాలను శాంతింపజేశారు. వివాదంపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై జీపీ పాలకవర్గ సభ్యులు ఎంపీడీవో కార్యాలయంలో సైతం ఫిర్యాదు చేయగా, మండలంలో చర్చనీయాంశంగా మారింది. -
సీసీ కెమెరాలతో గ్రామ భద్రత బలోపేతం
పెద్దకొడప్గల్): గ్రామ భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని ఎంపీడీవో అభినవ్ చందర్ పేర్కొన్నారు. కాస్లాబాద్లో గ్రామ పంచాయతీ నిధులతో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎంపీడీవో అభినవ్ చందర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చైతన్ యాదవ్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో నేరాలను నిరోధించడంతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని అన్నారు. గ్రామంలో 8 చోట్ల సీసీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి శివాజీ, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లిసంగారెడ్డిలో బుధవా రం ఉపాధి హామీ పనులను సర్పంచ్ కత్తుల లక్ష్మి ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామంలోని కూలీల కు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పనులు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కార్యదర్శి, క్షేత్రసహాయకులకు సూచించారు. కుంటలో పూడికతీత ప నులు వేగవంతం చేయాలని సూచించారు. -
కార్పొరేషన్లో 59.12 శాతం పోలింగ్
● గత ఎన్నికల కంటే 2శాతం తగ్గిన పోలింగ్ నమోదు ● ఓటేయడానికి ఆసక్తి చూపని జనంసుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో 59.12 శాతం పోలింగ్ నమోదైంది. 60 డివిజన్లలో 350 మంది అ భ్యర్థులు బరిలో నిలిచారు. 134 ప్రాంతాల్లోని 488 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 3,48,051 ఓట్లకు 1,67,461 పురుషులు, 1,80,546 సీ్త్రలు, 44 ఇతరులు ఉన్నారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో 2,05,753 మంది ఓటు వినియోగించుకున్నారు. అందులో 98,469 మంది పురుషులు, 1,07,282 సీ్త్రలు, ఇద్దరు ఇతరులు ఉ న్నారు. మొత్తం 59.12 శాతం పోలింగ్ నమోదైంది. 1,42,298 మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. నగరంలో ఎన్నికలను మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ పరిశీలించారు. సమస్యలు ఎ దురైన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని పరిష్కరించారు. ఓటేసిన ప్రముఖులు నగర పరిధిలోని గూపన్పల్లి 3వ డివిజన్లో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రజలు పెద్దఎత్తున పోలింగ్కు ముందుకు రావాలన్నారు. 45వ డివిజన్లో ఎంపీ అర్వింద్ ధర్మపురి ఓటుహక్కును వినియోగించుకున్నారు. నగరంలోని హరిచరణ్ మార్వాడి పాఠశాలలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దంపతులు ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. నగరంలో పోలింగ్ సరళిని ఎంపీ అర్వింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్పటేల్ కులాచారి పరిశీలించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి ఇందూరు కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగురవేస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్స్లు ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియగా బ్యాలెట్ బాక్సు లు స్ట్రాంగ్ రూమ్లకు చేరాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో పోలింగ్ సరళి ఆధారంగా తమ విజయావకాశాలపై అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఏ వార్డులో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయనే అంశంపై చర్చించుకుంటున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల నుంచి తాయిలాలు తీసుకున్న ఒకే ఇంట్లోని ఓటర్లు పలు చోట్ల ఒక్కో ఓటును ఒక్కో అభ్యర్థికి వేసినట్లు తెలుస్తోంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల ఓట్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నా అవి గెలిపించే ఓట్లు కాలేకపోతున్నాయి. శుక్రవారం ఓట్లను లెక్కించనుండగా.. అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. -
ఉత్సవాలకు శివరాంమందిర్ ముస్తాబు
దోమకొండ: మండల కేంద్రంలోని శివరాంమందిర్ మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. గురువారం నుంచి ఈ నెల 16 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ కొండ అంజయ్య తెలిపారు. శివుడు, రాముడు కొలువైన ఆలయంగా శివరాంమందిర్కి పేరు ఉంది. దోమకొండతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సవాలకు తరలివస్తారు. ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల కోసం ఆలయాన్ని రంగులు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. నేటి నుంచి సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలు దోమకొండ: మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న 31వ వార్షికోత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. నేడు , రేపు వివిధ పూజా కార్యక్రమాలతో పాటు అన్నదానం ఉంటుందని ఆలయ కమిటీ ప్రతినిధులు జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకంరించారు. -
పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల పరిశీలన నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొ న్నారు. పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లి ప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సా మగ్రితో సిబ్బంది తరలింపు, వెబ్ కాస్టింగ్ ఏర్పా ట్లు, పోలీసు బందోబస్తు, నిఘా బృందాల పనితీరు పర్యవేక్షణ తదితర అంశాలపై ఇప్పటికే అన్ని కసరత్తులు పూర్తి చేశామన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి వేర్వేరుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలతోపాటు బోధన్ మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా అంకితభావంతో కృషి చేయాలని ఎన్నికల సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ఎక్కడ కూడా రీపోలింగ్కు ఆస్కారం లేకుండా పక్కాగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని, ఓటింగ్ సందర్భంగా గోప్యతను కాపాడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. గడువులోపు పోలింగ్ కేంద్రంలోనికి చేరుకున్న ఓటర్లకు సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత కూడా టోకెన్లు జారీ చేసి, ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి భీంగల్, ఆర్మూర్ పట్టణాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. -
కాంగ్రెస్లో కలవని చేతులు
● ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య ఘర్షణ ● బాన్సువాడలో అర్ధరాత్రి ఉద్రిక్తత బాన్సువాడ/రుద్రూర్: హస్తం పార్టీలోని నేతల మధ్య సయోధ్య కరువయ్యింది. తన భార్యను ఓడించడానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రయత్నిస్తున్నారంటూ ఆంగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికలలో కాసుల బాల్రాజ్ భార్య విజయ 5వ వార్డునుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆమెకు చైర్ పర్సన్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఆమెను ఓడించడానికి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం జరుగుతోందని సోమవారం అర్ధరాత్రి సమాచారం అందడంతో కాసుల బాల్రాజ్ అక్కడికి బయలుదేరారు. ఎదురుగా కారులో వస్తున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ను ఆయన తన అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. చంద్రశేఖర్ కాలర్ పట్టుకుని తన భార్యను ఓడించడానికి బీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కయ్యావంటూ దుర్భాషలాడారు. అర్ధరాత్రి సమయంలో బీఆర్ఎస్ నాయకుడు యలమంచలి శ్రీనివాస్ను తాడ్కోల్లో ఎందుకు కలిశావంటూ నిలదీశారు. కారులో డబ్బులున్నాయని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం వచ్చింది. కారులో రూ. 52 వేలు లభించాయి. అయితే అవి తనవి కావని, కాసుల బాల్రాజ్ అనుచరులే పెట్టారని చంద్రశేఖర్ ఆరోపించారు. వైరల్గా మారిన వీడియోలు.. కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రశేఖర్ తాడ్కోల్లోని వెంకట్రాంరెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ నాయకుడు యలమంచలి శ్రీనివాస్తో సమావేశమై తిరిగి వెళ్తున్న సీసీ కెమెరా దృశ్యాలతోపాటు.. చంద్రశేఖర్పై కాసుల బాల్రాజ్ దాడి దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ గొడవపై ఇరువర్గాలు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలిసింది. రుద్రూర్ బంద్ ప్రశాంతం మాజీ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్పై దాడికి నిరసనగా మంగళవారం నిర్వహించిన రుద్రూర్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. అనంతరం ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కా సుల బాల్రాజు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రుద్రూర్లో 15 ఏళ్లుగా కాంగ్రెస్ జెండాను మోస్తు న్న సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ను బాల్ రాజు దుర్భాషలాడుతూ దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. బాల్ రాజును వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానాన్ని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ద్రోణపల్లి సతీశ్, కొత్తకొండ భాస్కర్, ఏఎంసీ మాజీ చైర్మన్ మాసాని శ్రీనివాస్ రెడ్డి, పాత బాలకృష్ణ, రుద్రూర్ సర్పంచ్ ఇందూర్ సునీత, ఉప సర్పంచ్ నిస్సార్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా కోఆర్డినేటర్ అంబర్సింగ్, బీసీ సెల్ అధ్యక్షుడు కర్క అశోక్, కూనిపూర్ సర్పంచ్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
బ్యాక్ వాటర్లో బ్రాహ్మిణి బాతులు
ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్కు వలస పక్షుల రాక మొదలైంది. ఈ ఏడాది కొత్తగా బ్రాహ్మిణి బాతులు (రడ్డీ షెల్డక్స్) వలస వచ్చాయి. ఇవి సాధారణంగా భారత ఉప ఖండం అలాగే మధ్య ఆసియా, ఆగ్నేయ ఐరోపాలో శీతాకాల విడిది చేస్తాయి. చిత్తడి నేలలు, నదులు, జలాశయాలు వాటి సంతానోత్పత్తికి అనుకూలం. నారింజ, గోధుమ రంగుల్లో ఆకర్షనీయంగా కనిపించే ఈ బాతులు ఇప్పుడు డొంకేశ్వర్ మండలంలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో కనువిందు చేస్తున్నాయి. – డొంకేశ్వర్(ఆర్మూర్)


