breaking news
Nizamabad District News
-
ఒకే పోర్టల్లో స్కాలర్షిప్లు
ఖలీల్వాడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లను ఒకే దగ్గర దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయిం తీసుకుంది. ఇదివరకు ఉన్న ఎన్ఎస్పీ (నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్)ను అందుకు అనుకూలంగా మార్పు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల స్కాలర్షిప్ల కోసం ఇదే పోర్టల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దరఖాస్తు చేసుకోవడం ఇలా ముందుగా ఎన్ఎస్పీ పోర్టల్లో అభ్యర్థి వన్టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెల్ఫోన్కు ఓటీపీ వస్తుంది. వచ్చిన అఫ్లికేషన్లో పూర్తి వివరాలు నమోదు చేయాలి. కుల, ఆదాయ ధ్రువపత్రాలు, విద్యార్హతలు, మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసి వాటిని అప్లోడ్ చేయాలి. ఒకటో తరగతి నుంచి పీజీ, పీహెచ్డీ వరకు చదివే అన్నివర్గాల విద్యార్థులు.. ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్, ఎంఎంఎన్ఎస్, టాప్క్లాస్ ఎడ్యుకేషన్(ఎస్సీ, ఎస్టీలకు), యూజీసీ, ఇషాన్, ఉదయ్, సింగిల్ గర్ల్ చైల్డ్, ఏఐసీటీఈ సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్షిప్ తదితర వాటన్నింటికీ ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ అక్టోబర్ 31 వరకు తెరిచి ఉంటుంది. సమాచారం.. -
ప్రకృతి సౌందర్యాన్ని పెంచే పండుగే బతుకమ్మ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ, ఇది ప్రకృతి సౌందర్యాన్ని, సీ్త్రల ఐక్యత, ప్రకృతి వనరుల సంరక్షణను సూచిస్తుందని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు అన్నారు. తెయూ ఉమెన్ సెల్ డైరెక్టర్ భ్రమరాంబిక ఆధ్వర్యంలో గురువారం ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ యాదగిరిరావు, అతిథిగా రిజిస్ట్రార్ ఎం యాదగిరి హాజరై బతుకమ్మలకు పసుపు, కుంకుమ సమర్పించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతిని ఆరాధించడమన్నారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్ఆరతి, డీన్ ప్రొఫెసర్ కే.లావణ్య, అధ్యాపకురాళ్లు శాంతాబాయి, వాణి, ప్రసన్న శీలా, రాజేశ్వరి, జ్యోతి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వర్ని: విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ప్రతి వి ద్యార్థి నిర్దేశించుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మోస్రా మండలంలోని చింతకుంట ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఏకాగ్రతతో ముందుకు సాగి తే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని సూ చించారు. అంకిత భావం, పట్టుదల, క్రమశిక్షణతో కృషి చేస్తే ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించుకోవచ్చున ని దిశానిర్దేశం చేశారు. చదువులో ఎలా రాణించాలి, పరీక్షల్లో ఎలా విజయం సాధించాలి, లక్ష్యానికి అనుకూలంగా సిలబస్ను ఏవిధంగా సకాలంలో పూర్తి చేయాలి, జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఏం చేయాలన్న దానిపై విద్యార్థులకు సలహాలు సూచనలు అందజేశారు. అంతకుముందు పాఠశాల, అంగన్వాడీల్లో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. మెనూ తప్పకుండా పాటించాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. ప్రైమరీ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని ఎంపీడీవోను ఆదేశించారు. -
అంతర్రాష్ట్ర వంతెన పైనుంచి రాకపోకల నిలిపివేత
అంతర్రాష్ట్ర వంతెన సమీపంలో రోడ్డుకు అడ్డంగా డ్రమ్ములు, బారికేడ్లురెంజల్(బోధన్) : మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడ్ ప్రాజెక్టులతోపాటు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో గోదావరి, మంజీర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కందకుర్తి త్రివేణి సంగమంలో వరద పోటెత్తుతోంది. అంతర్రాష్ట్ర వంతెనను ఆనుకుని నీరు ప్రవహిస్తుండడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. గోదావరి నది పరీవాహక గ్రామాల్లో దండోరా వేయించారు. ప్రజలు, రైతులు, బర్ల, గోర్ల కాపరులు నది ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ శ్రావణ్కుమార్, ఎస్సై చంద్రమోహన్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నా రు. పుష్కరక్షేత్రంలోని సీతారాం త్యాగి ఆశ్రమం నుంచి సీతారాం త్యాగి మహరాజ్తోపాటు ఆయ న శిష్యులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. -
వరద కాలువలో వృద్ధురాలి మృతదేహం
● మోర్తాడ్ మండల నివాసిగా గుర్తింపు మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి శివారు వరద కాలువలో ఓ వృద్ధురాలి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతదేహం మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ప్రభావతిగా మల్యాల పోలీసులు గుర్తించారు. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. కామణి ప్రభావతి (66) కొంతకాలంగా మతిస్థిమితం లేక బాధపడుతోంది. ఈ నెల 16న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బంధువులు మోర్తాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కుమారుడు శ్రీనివాస్ వెతుకుతున్నాడు. వరద కాలువలో శవం కొట్టుకురావడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. శ్రీనివాస్ను పిలిపించగా తన తల్లిగా గుర్తించాడు. కేసు నమోదు చేసినట్లు మల్యాల పోలీసులు తెలిపారు. మిలిటరీ మద్యం అమ్మొద్దు.. కొనొద్దు మాచారెడ్డి: మిలిటరీ మద్యాన్ని అమ్మినా, కొనుగోలు చేసినా నేరమేనని కామారెడ్డి ఎకై ్సజ్ సీఐ సంపత్ కృష్ణ అన్నారు. గురువారం పాల్వంచ మండలం ఆరేపల్లిలో ఒకరి ఇంట్లో నిల్వ చేసిన మిలిటరీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం నిల్వ చేసిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. ఈ దాడిలో ఎస్సైలు విక్రమ్, శ్రీనివాసరావు, సిబ్బంది పాషా, మైస రాజు, దేవాకుమార్ పాల్గొన్నారు. -
ఆరోగ్యకర ఆహారం కోసం..
జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05 అంగన్వాడీ సెంటర్లు 1501బాలింతలు 61,200గర్భిణులు 9,821చిన్నారులు 81,262నిజామాబాద్నాగారం : అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు తాజా, ఆరోగ్యకర పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో మొత్తం 1501 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 400 సెంటర్లకు సొంత భవనాలు ఉండగా.. కూరగాయల సాగు కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పోషణ్ వాటిక’ (న్యూట్రి గార్డెన్) కార్యక్రమానికి 300 సెంటర్లను ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. అంగన్వాడీ కేంద్రాల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో సెంటర్కు రూ.10 వేల చొప్పున నిర్వహణ నిధులు అందించనున్నారు. జిల్లాకు చేరిన విత్తనాలు పోషణ్ వాటికలో భాగంగా అంగన్వాడీ సెంటర్ల ఆవరణలో కూరగాయల సాగు కోసం ఇప్పటికే జిల్లాకు విత్తనాలు సరఫరా అయ్యాయి. రూ.500 ఖరీదు చేసే విత్తన ప్యాకెట్లు జిల్లా కార్యాలయానికి రాగా300 కేంద్రాలకు పంపిణీ చేశారు. ప్యాకెట్లలో పాలకూర, వంకాయ, తోట కూర, టమాట, చిక్కుడు విత్తనాలున్నాయి. సేంద్రియ పద్ధతిలో కూరగాయాలు సాగు చేయనున్నారు. ముందుగా ప్రతి సెంటర్కు రూ.2వేలు వెచ్చించి భూమి చదును చేయించనున్నారు. ఒక్కో సెంటర్కు మొత్తం రూ.10వేల వరకు ఖర్చు చేయనున్నారు. గతంలో నెరవేరని లక్ష్యం గతంలో అంగనవాడీ కేంద్రాలకు ఆకుకూరలు, కూరగాయలను కాంట్రాక్టర్లు సరఫరా చేసేవారు. సరఫరా బాధ్యతలు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యత లేని కూరగాయలు, ఆకుకూరలు అంటగట్టేవారు. దీంతో కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యం నెరవేరలేదు. అటు తర్వాతా అంగన్వాడీ టీచర్లే గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయలు కొంటూ వంట చేయిస్తున్నారు. బిల్లులు సక్రమంగా రాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. పోషణ్వాటిక పథకానికి జిల్లాలోని 300 కేంద్రాలను ఎంపిక చేశారు. ఐదు రకాల విత్తనాల ప్యాకెట్లను సరఫరా చేయడం జరిగింది. పథకం అమలు బాధ్యత అంగన్వాడీ టీచర్లే చూసుకోవాల్సి ఉంటుంది. స్థలాల కొరత కారణంగా కొన్ని కేంద్రాల్లో అమలు చేయడం లేదు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు బలవర్థక ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పథకాన్ని పక్కాగా అమలు చేస్తాం. – రసూల్బీ, జిల్లా సంక్షేమాధికారిణి నిరాసక్తత..! పోషణ్వాటిక కింద కూరగాయలు సాగు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మంచిదే అయినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని కొందరు అంగన్వాడీ టీచర్లు అంటున్నారు. సెంటర్ల చుట్టూ ప్రహరీలు లేకపోవడం, పని భారం అడ్డంకిగా మారుతుందని అంటున్నారు. కూర గాయలు, ఆకుకూరల సాగుకు ఇబ్బందులు తలెత్తుతాయని, పశువులు, కోతుల బెడదతో సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదని నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్లలో పోషణ్ వాటిక చిన్నారులు, గర్భిణులకు తాజా, నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యం జిల్లాలోని 300 కేంద్రాల్లో అమలు కేంద్రాలకు విత్తనాల పంపిణీ ఒక్కో సెంటర్కు రూ.10వేల వరకు ఖర్చు వెయ్యికిపైగా కేంద్రాల్లో స్థలాల కొరత -
మాటల తూటాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి జిల్లాలో మాటల తూటాలతో రాజకీయం గరంగరంగా మారింది. డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తాజాగా చేసిన ప్రసంగం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. బాన్సువాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి చేసిన విమర్శలకు ప్రతిగా భాస్కర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎవరేమిటో తేల్చుకుందామంటూ భాస్కర్రెడ్డి సవాళ్లు విసిరాడు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి ‘లక్ష్మీపుత్రుడు కాదు.. శని పుత్రుడు’ అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ భాస్కర్రెడ్డి విరుచుకుపడ్డారు. జీవన్రెడ్డి ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. 2018లో 36 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన జీవన్రెడ్డిని ప్రజలు గత ఎన్నికల్లో మూడోస్థానానికి నెట్టేశారన్నారు. జీవన్రెడ్డీ ఇదీ నీ బతుకు అంటూ వాఖ్యలు చేయడం గమనార్హం. నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించావు అంటూ ప్రశ్నించారు. జీవన్రెడ్డిని ఇంటరాగేట్ చేస్తే అతను చేసిన అసాంఘిక కార్యకలాపాలను కక్కేస్తాడన్నారు. భారీగా డబ్బులు సంపాదించి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ● దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖం చూసి నాడు బాన్సువాడలో ప్రజలు బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించారని భాస్కర్రెడ్డి అన్నారు. 2014, 2018 ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, ఏనుగు రవీందర్రెడ్డిలు కలిసి మంత్రి పదవిపై కన్నేసి పోచారం శ్రీనివాసరెడ్డిని ఓడగొట్టేందుకు కుట్రలు చేశారన్నారు. ఏనుగు రవీందర్రెడ్డి ఏ ఎండకా గొడు గు పడుతున్నాడన్నారు. ● వేముల ప్రశాంత్రెడ్డి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ఉండి ఏం సాధించారంటూ ఎద్దేవా చేశారు. ప్రశాంత్ రెడ్డికి నిజామాబాద్ జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యే గౌరవం ఇవ్వలేదన్నారు. కా మారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు మాత్రమే గౌ రవించారన్నారు. గత ఎన్నికల్లో కొద్ది తేడాతో ప్రశాంత్రెడ్డి గెలుపొందారన్నారు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ డీసీసీబీ చైర్మన్గా ఉన్న తనను దించేందుకు చేసిన కుట్రలో భాగస్వామి అయ్యారన్నారు. ప్రశాంత్రెడ్డి, రమేష్రెడ్డికి పదవి కట్టబెట్టేందుకు తనకు వెన్నుపోటు పొడిచారన్నారు. పోచారం తండ్రిలాంటివారని చెప్పిన ప్రశాంత్రెడ్డి, మరి పోచారం కొడుకుకే వెన్నుపోటు పొడవడమేమిటన్నారు. రమేష్రెడ్డి ప్రాతిని ధ్యం వహిస్తున్న ప్రశాంత్రెడ్డి సొంత ఊరు వే ల్పూర్ సొసైటీలో అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్నప్పటికీ పెట్టలేదన్నారు. పార్టీకి సైతం వె న్నుపోటు పొడిచారన్నారు. ఇది వాస్తవం కాదా అని భాస్కర్రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఏ గుడికి వచ్చి చెప్పమన్నా చెబుతా.. బాల్కొండ నియోజకవర్గానికి రమ్మంటావా.. బాన్సువాడ నియోజకవర్గానికి వస్తావా అంటూ భాస్కర్రెడ్డి సవా ల్ చేశారు. ఈ విషయమై హరీశ్రావు, కేటీఆర్ కు చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. వర్ని మండలం సిద్ధాపూర్ సమావేశంలో పోచారం భాస్కర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్నివర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రానున్న రోజుల్లో ఈ మాటల యు ద్ధం మరింత ముదిరే అవకాశమున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డిపై పోచారం భాస్కర్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు ప్రశాంత్రెడ్డి మంత్రిగా ఉండి పూర్తిగా విఫలమయ్యారంటూ విమర్శలు వెన్నుపోటుతో డీసీసీబీ పీఠం నుంచి తనను దించారంటూ ఆరోపణలు వైఎస్ఆర్ ముఖం చూసి బాజిరెడ్డిని గెలిపించారంటూ ఎద్దేవా.. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం
● బోధన్లో ఘటన.. బయటే వేచి ఉన్న సబ్ రిజిస్ట్రార్ ● 36 నెలలుగా అద్దె చెల్లించని వైనం ● ఉన్నతాధికారుల జోక్యంతో శాంతించిన యజమానులు బోధన్టౌన్(బోధన్): భవనం అద్దె 36 నెలలుగా చె ల్లించకపోవడంతో యజమానులు గురువారం బో ధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం వేశారు. కార్యాలయానికి తాళం వేయడంతో చేసేది లేక సబ్ రిజిస్ట్రార్తోపాటు సిబ్బంది బయటే నిలబడ్డారు. రి జిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం అద్దె నెలకు రూ. 74 వేలు కాగా.. 36 నెలలకు సంబంధించి యజమానులకు రూ.26,64,000 చెల్లించా ల్సి ఉంది. అద్దె చెల్లించాలని యజమానులు పలుమార్లు అడిగినా స్పందించకపోవడంతో గురువా రం కార్యాలయానికి తాళం వేశారు. యజమానులు ఈ నెల 8వ తేదీన సబ్ రిజిస్ట్రార్కు నోటీసు సైతం అందించారు. ఈ ఘటనపై సబ్ రిజిస్ట్రార్ సాయిబాబాను వివరణ కోరగా.. అద్దె చెల్లించాల్సిన విష యం వాస్తవమేనని, ఉన్నతాధికారులకు వివరించామన్నారు. జిల్లా ఉన్నతాధికారులు భవన యజమానులతో మాట్లాడి అద్దె బకాయి చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో చివరకు తాళం తీశారు. దీంతో యథావిధిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. -
చిన్నారులకు సరైన పోషణ అందించాలి
● డీడబ్ల్యూవో రసూల్ బీ ● అంగన్వాడీ టీచర్లకు ముగిసిన శిక్షణ డిచ్పల్లి: చిన్నారులకు సరైన పోషకాహారాన్ని అందించాలని, 0–5 సంవత్సరాల లోపు పిల్లల్లో ముందుగానే లోపాలను గుర్తించి తల్లిదండ్రులకు తగిన సలహాలు ఇచ్చి డాక్టర్కు రిఫర్ చేయాలని జిల్లా సంక్షేమాధికారిణి (డీడబ్ల్యూవో) రసూల్ బీ సూచించా రు. డిచ్పల్లి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్ల కు ‘పోషణ్ బీ–పడాయి బీ’ అనే అంశంపై మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరైన డీడబ్ల్యూవో మాట్లాడుతూ 0–3 సంవత్సరాల లోపు పిల్లలకు నవచేతన ద్వారా ప్రేరణ కలిగించాలన్నారు. 3–6 సంవత్సరాల పిల్లలకు ఆథశిల ద్వారా ప్రీస్కూల్ విద్యను నేర్పించాలన్నారు. ఎత్తుకు తగ్గ బరువులో సాధారణ బరువు వచ్చే వరకు పోషకాహారం కొనసాగించాలన్నారు. దివ్యాంగ పిల్లలకు యూడీఏడీ కార్డులు ఇప్పించాలన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతసదన్లో 92, నడిపల్లి రైతువేదిక లో 94, ధర్మారం(బి) రైతువేదికలో 97 మందికి శిక్షణ నిచ్చినట్లు సీడీపీవో జ్యోతి తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు మమత, బుజ్జి, శోభ, వరలక్ష్మి, భాగ్యలక్ష్మి, రాధలక్ష్మి, సునీత, సరిత సిబ్బంది పాల్గొన్నారు. -
లక్షల క్యూసెక్కుల వరద
● ఓ దశలో 3లక్షల క్యూసెక్కులు దాటి.. ● ఎస్సారెస్పీలోకి పోటెత్తిన ఇన్ఫ్లో ● 39 గేట్ల ద్వారా గోదావరిలోకి 1.85 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల ఎస్సారెస్పీలో ప్రస్తుత నీటి మట్టంబాల్కొండ: మహారాష్ట్రతోపాటు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 లక్షల 15 వేల క్యూసెక్కులుగా కొనసాగిన ఇన్ఫ్లో రాత్రికి లక్షా 92 వేలకు తగ్గింది. గురువారం ఉదయం 6 గంటలకు 2 లక్షల 48 వేల క్యూసెక్కులకు పెరిగింది. క్రమంగా పెరిగిన ఇన్ఫ్లో మధ్యాహ్నం సమయానికి 3 లక్షల 10 వేల క్యూసెక్కులకు చేరి సాయంత్రం వరకు అదే స్థాయిలో కొనసాగింది. రాత్రి సమయానికి 2.75లక్షలకు తగ్గింది. 39 వరద గేట్ల ద్వారా లక్షా 85 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టాన్ని అధికారులు భారీగా తగ్గించారు. వరద కాలువ ద్వారా 6,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, సరస్వతి కాలువ ద్వారా 400, లక్ష్మి కాలువ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.701 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. -
శిక్షణ పూర్తి చేసుకొని స్వయం ఉపాధి పొందాలి
● ఎస్బీఐ ఏజీఎం రంజిత్కుమార్ నాయుడు డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్ధ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని ఎస్బీఐ ఏజీఎం (ఏవో, నిజామాబాద్) రంజిత్కుమార్ నాయుడు సూచించారు. డిచ్పల్లి ఆర్ఎస్ఈటీఐను గురువారం ఆయన సందర్శించారు. మగ్గం వర్క్, టైలరింగ్, బ్యూటీ పార్లర్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో మగ్గం వర్క్, టైలరింగ్, బ్యూటీపార్లర్లకు మంచి డిమాండ్ ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు తమ గ్రామాలకు వెళ్లిన తర్వాత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా నిలబడాలని సూచించారు. ఆర్ఎస్ఈటీఐ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ రవికుమార్, ఎస్ఐబీ చీఫ్ మేనేజర్ రవికుమార్, సంస్థ సిబ్బంది రామకృష్ణ, నవీన్, భాగ్యలక్ష్మి, లక్ష్మణ్, గెస్ట్ ఫ్యాకల్టీ ఫరీదా, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
రైతులు నానో యూరియా వాడాలి
డీఏవో మేకల గోవింద్ డొంకేశ్వర్(ఆర్మూర్): రైతులంతా బస్తాల్లో లభించే యూరియా కాకుండా బాటిళ్లలో ద్రవరూపంలో ఉండే నానో యూరియాను వినియోగించాలని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ సూచించారు. గురువారం డొంకేశ్వర్ మండల కేంద్రానికి వచ్చిన ఆయన సొసైటీ గోదాములను పరిశీలించారు. ఎరువుల నిల్వలు, అమ్మకాలను రిజిస్టర్లలో తనిఖీ చేశారు. జిల్లాలో యూరియా కొరత ఏమాత్రం లేదని, రైతులు అవసరానికి మించి కొనుగోలు చేయకూడదన్నారు. యూరియాను ఎక్కువగా వినియోగించడంతో నేలకు, పంటలకు ప్రమాదమన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఎలాంటి దుష్ప్రభావాలు లేని నానో యూరియాను వాడాలని సూచించారు. ఇది రెండు బస్తాలతో సమానమని, రైతులకు శ్రమ కూడా తగ్గుతుందన్నారు. అనంతరం నూత్పల్లిలో వరి పంటను పరిశీలించారు. సరిపడా ఎరువులు సరఫరా చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గొడిశరం భూమేశ్ రెడ్డి, రైతులు కలిసి డీఏవోను సన్మానించారు. మండల వ్యవసాయాధికారి మధుసూదన్, ఏఈవోలు మౌనిక, ప్రశాంత్ ఉన్నారు. -
గొడవపడ్డ నలుగురికి రూ.20 వేల జరిమానా
ఎల్లారెడ్డి: ఇంటి విషయంలో గొడవపడిన నలుగురికి రూ.20 వేల జరిమానా విధిస్తూ ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ తీర్పు ఇచ్చినట్లు పోలీసులు గురువారం తెలిపారు. 2019లో నీల సిద్దిరాములు అనే వ్యక్తితో ఇంటి విషయంలో దండు నర్సింలు, దండు శివరాములు, దండు అంజయ్య, దండు గణేశ్ల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనపై నీల సిద్దిరాములు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై మోహన్ కేసు నమోదు చేసి చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కోర్టు కానిస్టేబుల్ వినోద్ కుమార్ చాకచక్యంగా వ్యవహరించి సాక్షులను సమయానికి హాజరుపర్చారు. సాక్ష్యాలు, వాదనలు విన్న అనంతరం, న్యాయమూర్తి నిందితులు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో నిందితులు జరిమానా మొత్తాన్ని చెల్లించారు. బోధన్: ఎడపల్లి మండలంలోని ఎమ్మెస్సీ ఫారం వద్ద బోధన్–నిజామాబాద్ ప్రధాన రోడ్లో గురువారం గ్యాస్ సిలిండర్ లోడ్తో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆర్టీసీ బస్సును ఎడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. -
అనుకూల సమయాల్లో పంటలు విక్రయించుకోవాలి
● ఐసీఎం హైదరాబాద్ ఉపసంచాలకుడు డా.ఎస్ శ్యాంకుమార్ నిజామాబాద్ రూరల్: రైతులు పండించిన పంటలను గోదాముల్లో భద్రపరచి, అనుకూల సమయంలో మార్కెట్లో విక్రయించడం ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చునని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ (ఐసీఎం) హైదరాబాద్ ఉప సంచాలకుడు డా.ఎస్ శ్యాంకుమార్ పేర్కొన్నా రు. మాధవనగర్లో గురువారం గిడ్డంగుల అభివృద్ధి, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో రైతులు, వ్యాపారులు, మిల్లర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీఎం మాట్లాడుతూ వేర్హౌస్ రసీదుల ఆధారంగా రైతులు బ్యాంకుల నుంచి రుణ సౌకర్యాన్ని పొందవచ్చని తెలిపారు. అనంతరం రైతులను నిజామాబాద్ ఏఎంసీ, శ్రద్ధానంద్గంజ్కు తీసుకెళ్లి గోదాం సదుపాయాలు, నిల్వ విధానాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఎన్ శ్రీనివాసరావు, సహాయక రిజిస్ట్రార్ సరస్వతి, సీనియర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పీఏసీఎస్ మాధవనగర్ అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పోతరెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో పట్టపగలే చోరీ
బోధన్: ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో బుధవారం పట్టపగలే తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన ప్రకారం.. కుర్నాపల్లి గ్రామానికి చెందిన తులసిగారి నరేందర్ తన సతీమణితో కలిసి అత్తగారి గ్రామం మెంట్రాజ్పల్లికి వెళ్లారు. సాయంత్రం తన బంధువు ఫోన్ చేసి ఇంటి తాళం పగుల గొట్టబడి ఉందని తెలపడంతో వెంటనే స్వగ్రామానికి వచ్చారు. దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, రూ.15 వేలు నగదు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఘటనా స్థలాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్బాబు, ఎస్సై రమ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమ తెలిపారు. -
ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ డైరెక్టర్గా సత్యనారాయణరెడ్డి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాధిపతి మావురపు సత్యనారాయణ రెడ్డి ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ డైరెక్టర్గా నియామకమయ్యారు. తెయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆదేశా ల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి గురువారం సత్యనారాయణరెడ్డికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో డైరెక్టర్గా నియమించిన వీసీ, రిజిస్ట్రార్లకు కృతజ్ఞతలు తెలిపారు. గర్ల్స్ హాస్టల్ వార్డెన్గా జ్యోత్స్న తెయూ ఇంగ్లిష్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎల్.జ్యోత్స్న గర్ల్స్ హాస్టల్ వార్డెన్గా నియామకమయ్యారు. వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ యాదగిరి గురువారం ఆమెకు నియాకమ ఉత్తర్వులు అందజేశారు. సుభాష్నగర్: జిల్లా పంచాయతీ కార్యాలయ పరిపాలనా అధికారి(ఏవో)గా రాజాబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న రాజాబాబు పదోన్నతి పొందారు. డీపీవో కార్యాలయ ఏవో పోస్టు ఖాళీగా ఉండటంతో ఆయనకు జిల్లాలోనే కేటాయించారు. రాజాబాబును డీపీవో శ్రీనివాస్రావు, డీఎల్పీవోలు శ్రీనివా స్, నాగరాజు, శివకృష్ణ, ఉద్యోగులు కృష్ణ, ఆ దిత్య, నరహరి తదితరులు అభినందించారు. బాన్సువాడ: బోర్లం క్యాంపులో నిర్వహించే జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్కు సంబంధించిన వాల్పోస్టర్లను గురువారం డీఎస్పీ విఠల్రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో వాలీబాల్ టోర్నీ కొనసాగుతుందని, జిల్లాలోని వివిధ మండలాల క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు ధరావత్ రవి తెలిపారు. మొదటి బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేల నగదుతో పాటు మెమోంటోలు అందజేస్తామని వారు తెలిపారు. -
క్రైం కార్నర్
మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య ఖలీల్వాడి: అతిగా మద్యం సేవించొద్దని భార్య మందలించినందుకు మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ పరిధి లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అర్సపల్లిలోని భగత్సింగ్ కాలనీకి చెందిన ఎనుగందులు మహేశ్(33) నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో లేబర్గా పనిచేసేవాడు. కొంతకాలం నుంచి మహేశ్ మద్యానికి బానిస కావడంతో భార్య తాగు డు మానుకోవాలని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన మహేశ్ బుధవారం అర్ధరాత్రి నిజామాబాద్–జానకంపేట్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు రాకను గమనించి అడ్డుగా వెళ్లడంతో రైలు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్లారెడ్డి: మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన బండారి సాయిలు (42) మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పా ల్పడినట్లు ఎల్లారెడ్డి ఎస్సై–2 సుబ్రహ్మణ్యచారి గురువారం తెలిపారు. మద్యానికి బానిసైన సాయిలు కుటుంబంలో బుధవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సాయిలు గురువారం వేకువజామున బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. గ్రామ శివారులోని తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కాకతీయ కాలువలో పడి యువకుడు.. బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్కు చెందిన షేక్ అస్గర్(42) ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి బుధవారం మృతి చెందాడు. ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ అస్గర్ బుధవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కాకతీయ కాలువలో దిగాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు కాలువలో గాలింపుచర్యల చేపట్టగా గల్లంతైన చోటే మృతదేహాం లభ్యమైంది. కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. బాన్సువాడ : పట్టణంలోని కల్కి చెరువులో గుర్తుతెలియని మహిళ (45– 50) మృతదేహం గురువారం లభ్యమైంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జాలర్ల సహాయంతో మహిళ మృతదేహాన్ని బయటకి తీశారు. మెరూన్ కలర్ చీర, ఆకుపచ్చని జాకెట్ ధరించి ఉందని, గుర్తు పట్టనంతగా మృతదేహం ఉబ్బిందని సీఐ అశోక్ తెలిపారు. వివరాలకు 8712686167ను సంప్రదించాలని సూచించారు. -
ప్రక్షాళన జరిగేనా!
నిజామాబాద్ఉన్నత లక్ష్యాలను.. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– 8లో uనిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ, టౌన్ప్లానింగ్ విభాగాలపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో ప్రత్యేకాధికారి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ సమీక్షలు ఏర్పాటు చేస్తూ బల్దియా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. రెవెన్యూ పెండింగ్ ఫైళ్లను బయటికి తీయించిన ఆయన.. వివరాలను ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలోనైనా బల్దియాలో ప్రక్షాళన సాధ్యమవుతుందా అని నగరవాసులు అంటున్నారు. నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని రెవెన్యూ, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలపై ప్రత్యేకాధికారి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కార్పొరేషన్కు నేరుగా వస్తూ తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి ఫైల్కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటుండడంతో బల్దియా అధికారుల వెన్నులో వణుకుపుడుతోంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల వివరాలను సైతం తెలుసుకుంటున్నారు. కార్పొరేషన్లో తరచూ రివ్యూలు నిర్వహిస్తున్న కలెక్టర్.. పెండింగ్ ఫైళ్లన్నీ బయటికి తీయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సుమారు 2వేల వరకు ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని గుర్తించిన కలెక్టర్.. వాటిని వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. బుధవారం సైతం రివ్యూ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ ఫైళ్లు పెండింగ్లో లేకపోవడంపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్.. అనుమతులు లేకుండా బిల్డింగ్ల నిర్మాణం, ఆక్రమణల ప్రోత్సాహం, టౌన్ప్లానింగ్ సూపర్వైజర్ల పనితీరుపై అదే సమయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. బల్దియా అధికారులను కలెక్టర్ పరుగులు పెట్టిస్తుండడంతో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ ఫైళ్లకు ఎట్టికేలకు మోక్షం లభిస్తోంది. సుమారు 2 వే ల ఫైళ్లను బయటికి తీసిన అధికారులు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది మొత్తం గురువారం నుంచి వారం రోజులపాటు ఈ ఫైళ్ల క్లియరెన్స్ పనిలో ఉండనున్నట్లు తెలిసింది. ట్రేడ్ లైసెన్స్ల జారీలో ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. షాపింగ్మాల్స్, పెద్ద వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్సులు తీసుకోకుండానే వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఖలీల్వాడి, హైదరాబాద్ రోడ్డు వంటి ప్రధాన ప్రాంతాల్లో కార్పొరేట్ ఆస్పత్రులను ఎన్వోసీలు లేకుండానే ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ రోడ్డులో ఇటీవల కొత్తగా వెలిసిన వస్త్రదుకాణం నుంచి ఫీజుతోపాటు మరో రూ.లక్ష అదనంగా తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్ దీనిపై దృష్టి సారిస్తే బల్దియాకు ఆదాయం సమకూరడంతోపాటు అవినీతి అధికారుల ఆటలకు అడ్డుకట్ట పడుతుందని నగరవాసులు అంటున్నారు. రెవెన్యూ విభాగంలో కొన్ని నెలలుగా ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించాం. సరైన పత్రాలున్న వాటిని క్లియర్ చేయాలని డిప్యూటీ కమిషనర్ను ఆదేశించాం. అనుమతుల్లో సమస్యలుంటే వెంటనే దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వాలని సూచించాం. బల్దియా పాలనా వ్యవహారాలను ఎప్పటికప్పుడు ప్రత్యేకాధికారి, కలెక్టర్ నోటీసులో ఉంచుతున్నాం. – దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్ పెండింగ్ ఫైళ్లను పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది (ఫైల్) రెవెన్యూలో.. బల్దియాకు గుండెకాయ వంటి విభాగమైన రెవెన్యూ సెక్షన్లో పైసలివ్వనిదే పని కావడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితిపై పలువురు ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశారు. అయితే కలెక్టర్ కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రెవెన్యూ సెక్షన్ ప్రక్షాళనకు కమిషనర్ దిలీప్ చర్యలు చేపట్టారు. ముందుగా రెవెన్యూ ఆఫీసర్ ఖయ్యూమ్ను ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్కు మార్చి ఆయన స్థానంలో సీనియర్ అసిస్టెంట్ స్వప్నను ఆర్వోగా నియమించారు. అలాగే ఆర్ఐ బాధ్యతలను సీనియర్ అసిస్టెంట్ అనురాధకు అప్పగించారు. కార్పొరేషన్లో రివ్యూలు నిర్వహిస్తూ అధికారులను పరిగెత్తిస్తున్న జిల్లా కలెక్టర్ రెవెన్యూ, టౌన్ప్లానింగ్పై దృష్టి పెండింగ్ ఫైళ్లపై ఆరా బల్దియా సిబ్బందిలో వణుకు -
కేసుల విచారణ త్వరగా పూర్తిచేయాలి
ఖలీల్వాడి: పోక్సో, గ్రేవ్ కేసుల్లో విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని సీపీ పోతరాజు సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని క మాండ్ కంట్రోల్ హాల్లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులలో పూర్తి పారదర్శకంగా విచారణ చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, ప్ర జలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేయాలని సూచించారు. గ్రామ పో లీస్ అధికారులు ప్రతి రోజు గ్రామాన్ని సందర్శించి, ప్రజలతో మమేకమవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. బ్లాక్ స్పాట్లను గుర్తించాలి ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. హైవే రోడ్లను కలుపుతూ ఉండే లింక్ రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్ వేయించడం, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించాలని తెలిపారు. నేషనల్ హైవే, స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని చెప్పారు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. దొంగతనాలు జరగకుండా పాతనేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా, క్రయవిక్రయాలు, జూదం, రేషన్ బియ్యం అక్రమరవాణా లాంటి వా టిపై ఉక్కుపాదం మోపాలన్నారు. తరచూ ఇలాంటి నేరా లకు పాల్పడేవారిపై పీడీ యాక్టు కోసం పంపాలని ఆదేశాలు జారీచేశారు. సమీక్షలో డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు రాజావెంకట్ రెడ్డి, జె. వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం ఉన్నారు. సిబ్బందికి ప్రశంసాపత్రాలు వినాయక చవితి, మిలాద్–ఉన్–నబీ పండుగలను శాంతియుతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందికి సీపీ సాయిచైతన్య అభినందనలు తెలిపా రు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన పలు వురికి ప్రశంసా పత్రాలను అందజేశారు. వచ్చే దేవీ నవరాత్రి ఉత్సవాలు, దీపావళి పండుగలను ప్రజలందరూ శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి నెలవారీ సమీక్షా సమావేశంలో సీపీ సాయిచైతన్య -
కిటికీ చువ్వలు తొలగించి దొంగతనం
● 19 తులాల బంగారం.. ● రూ.10 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీ ఎత్తుకెళ్లిన దుండగులు ● నిజామాబాద్ నగరంలో ఘటనఖలీల్వాడి: ఇంటి కిటికీ చువ్వ(గ్రిల్స్)లను స్క్రూడ్రైవర్తో తొలిగించిన దుండగులు 19 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.10 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న బాబన్సాహెబ్ పహాడ్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బాబన్ సాహెబ్ పహాడ్కు చెందిన నిషాత్ ఆఫ్రిన్ భర్త సౌదీలో ఉంటున్నాడు. తన ఇద్దరు కుమారులతో కలిసి బుధవారం రాత్రి ఇంటికి తాళం వేసి ఆఫ్రిన్ అహ్మదీబజార్లో బంధువుల ఫంక్షన్కు వెళ్లింది. రాత్రి వేళ ఇంటి కిటికీ చువ్వలను స్క్రూడ్రైవర్తో తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాను ధ్వంసం చేసి అందులోని బంగారం, విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన ఆఫ్రిన్.. కిటికీ చువ్వలు తొలగించి ఉండడంతోపాటు బీరువాను గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి చోరీ జరిగిన ఇంటికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీమ్తో ఆధారాలను సేకరించారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సీసీఎస్, ఐదో టౌన్ పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే స్థానికులే చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావాలి
సుభాష్నగర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నష్టాల్లో ఉన్న డీసీసీబీ శాఖలను లాభాల్లోకి తీసుకొచ్చేలా కృషి చేయాలని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి అన్నారు. నగరంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయా బ్రాంచీల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ.2400 కోట్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. రూ.2400 కోట్లలో రూ.787 కోట్లు డిపాజిట్లు, రూ.1613 కోట్ల రుణాలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఉద్యోగి లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిబద్ధతతో పని చేయడంతో ఈ ఘనత సాధ్యమైందన్నారు. నష్టాల్లో ఉన్న శాఖలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో శాఖాధికారులకు దిశానిర్దేశం చేస్తున్న సీఈవో నాగభూషణం వందే, ఇతర ఉన్నతాధికారులను చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. డీజీఎంలు లింబాద్రి, అనుపమ, సుమమాల, గజానంద్, ఉన్నతాధికారులు, 63 బ్రాంచీల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్ అదుపు తప్పి మామ, కోడలు మృతి
మాక్లూర్ /నందిపేట్ (ఆర్మూర్): బైక్ అదుపు త ప్పిన ఘటనలో మామ, కోడలు మృతి చెందారు. ఈ ఘటన మాక్లూర్ మండలం దుర్గానగర్ శివారు లో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నందిపేట మండలం తల్వేదకు చెందిన చింటు కు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొజన్కొత్తూర్కు చెందిన పూజ(25)తో 10 నెలల క్రిత మే వివాహం జరిగింది. బీటెక్ చదివిన పూజ పెళ్లికి ముందు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది. పెళ్లి సమయంలో ఉద్యోగం మానేసిన ఆమె మళ్లీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగానే ఇంటర్వ్యూ కోసమని హైదరాబాద్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై తమను నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద వదిలేసి రావాలని తండ్రి నారాయణ (58)ను చింటు కోరాడు. ముగ్గురూ కలిసి బైక్పై బయల్దేరారు. చింటు డ్రైవ్ చేస్తుండగా దుర్గానగర్ శివారులో బైక్ అదుపు తప్పి కిందపడిపోయారు. నారాయణ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన పూజతోపాటు చింటును అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 10 గంటల సమయంలో పూజ మృతి చెందింది. మామ కోడలు మృతితో తల్వేదలో విషాదచాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ పరిశీలించారు. -
ఎస్సారెస్పీలోకి భారీ వరద
● 1.92 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ● 38 గేట్ల ద్వారా 2.82 లక్షల అవుట్ ఫ్లోబాల్కొండ: ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి లక్షా 92వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. మంగళవారం సాయంత్రానికి లక్షా 67 వేల క్యూసెక్కులకు తగ్గిన వరద.. బుధవారం ఉదయం 7 గంటల నుంచి క్రమంగా పెరిగింది. ఉదయం 10 గంటలకు 2 లక్షల 15 వేల క్యూసెక్కులకు చేరింది. బుధవారం సాయంత్రం వరకు ఇన్ఫ్లో నిలకడగా ఉండగా రాత్రి సమయానికి లక్షా 92వేలకు తగ్గింది. 38 వరద గేట్ల ద్వారా 2 లక్షల 82 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 6500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వే లు, సరస్వతి కాలువ ద్వారా 400, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా రు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా ఆవిరి రూపంలో 701 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం రాత్రి సమయానికి 1087.06(68.04 టీఎంసీలు) అడుగులు నీరు నిల్వ ఉంది. -
బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతోందని, దీనికి బా ధ్యత వహిస్తూ కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. రైతాంగానికి సరిపడా యూరియాను తె ప్పించలేని బీజేపీ ఎంపీలు ఎందుకని ప్రశ్నించారు. వేల్పూర్లో బుధవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. నెల రోజుల నుంచి బీఆర్ఎస్ తరఫున అన్ని వేదికల నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా మన్నారు. మళ్లీ చెప్పులు, పాస్బుక్కులు లైన్లలో పెట్టే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు నిద్రాహారాలు మాని కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే.. అర్వింద్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ వద్ద పలుకుబడి ఉందని చెప్పుకునే ఆయన.. యూరియా కొరతపై ఎందుకు నోరుమెదపడం లేదన్నారు. వెంటనే ప్రధానితో మాట్లాడి యూరియా తెప్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ ఎంపీలకు ఎందుకు లేదన్న ప్రశాంత్రెడ్డి.. బడే భాయ్ కు కోపం వస్తుందా? ఆయనకు కోపం వస్తే.. చోటేభాయ్కు జైలు శిక్ష పడుతుందా అని ఎద్దేవా చే శారు. ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న ధ్యాస.. రైతులపై కాంగ్రెస్కు లేదని విమర్శించారు. యూరియా ఎటువెళ్లింది.. జిల్లాకు 75వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే 72వేల మెట్రిక్ టన్నులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారని, మరి వచ్చిన యూరియా ఎటు వెళ్లిందన్నారు. కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెట్కు తరలించారా అని ఆరోపించారు. యూరియా సరిపడా సరఫరా చేసే సత్తా లేక.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు అవగాహన లేక రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో రైతులు యూరియా కోసం లైన్ కట్టే పరిస్థితి రాలేదని, ముందు చూపుతో వ్యవహరించి సరిపడా తెప్పించారని గుర్తుచేశారు. పోలీస్స్టేషన్లో టోకెన్లు పంపిణీ చేసే పరిస్థితి ఎప్పుడైనా ఉందా..? అని ప్రశ్నించారు. యూరియా బస్తా ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. వెంటనే మంత్రులు బృందాన్ని పంపించి యూరియా సరిపడా అందుబాటులో ఉంచాలని ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. యూరియా ఇప్పించలేని కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఎందుకు? అర్వింద్కు పలుకుబడి ఉంటే యూరియా తెప్పించాలి మళ్లీ చెప్పులు, పాస్బుక్లు లైన్లో పెట్టే దౌర్భాగ్యం కేసీఆర్ ముందుచూపుతో గతంలో యూరియా కొరత రాలేదు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
అభివృద్ధి, సంక్షేమ ఫలాలు
అన్నివర్గాలకు వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి.త్వరలో జీవాలకు.. రెండేళ్ల క్రితం నిలిచిపోయిన జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ త్వరలో ప్రారంభం కాబోతోంది. – 8లో uమహిళల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం నిజామాబాద్నాగారం: మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణే తమ లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తా అన్నారు. స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం వర్చుల్గా ప్రారంభించగా, కలెక్టరేట్ నుంచి బుధవారం ఎమ్మెల్యే వీక్షించారు. అనంతరం దుబ్బ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారు లతో కలిసి స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుందని, జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 కేంద్రాల్లో వైద్యారోగ్య అధికారులు మహిళలకు సేవలందిస్తారన్నారు. కరోలిన్ చింగ్తియాన్ మావీకి ఎమ్మెల్యే స్వస్త్ నారీ సశక్త్ సర్టిఫికెట్ను అందజేశారు. డీఎంహెచ్వో రాజశ్రీ, జీజీహెచ్ సూపరిండెంట్ శ్రీనివాస్, డిప్యూ టీ డీఎంహెచ్వో అంజన, డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, వైద్యురాలు సుశానా, తాజా మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక, శ్రీధర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కమీషన్లను ప్రోత్సహించొద్దు నిజామాబాద్నాగారం: రోగులను రిఫర్ చేసే ఆర్ఎంపీ, పీఎంపీలకు కొన్ని ప్రైవేట్ ఆస్పత్రు లు కమీషన్లు ఇస్తున్న ట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో రాజశ్రీ హెచ్చరించారు. స్కానింగ్, ఆస్పత్రుల్లో రిఫరల్ దందాలపై ఇటీవల ‘సాక్షి’లో కథనాలు ప్రచురితం కావడంతో డీఎంహెచ్వో బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమీషన్లను ప్రోత్సహించే ఆస్పత్రుల యాజమాన్యాలతోపాటు ప్రాక్టిషనర్లపై చర్యలుంటాయని హెచ్చరించారు. కమీషన్ దందాపై ఆధారాలతో సహా తమ దృష్టికి తీసుకురావాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ మేరకు ఓ నిఘా బృందాన్ని సైతం నియమించినట్లు తెలిపారు. లింగాపూర్ మత్స్య సొసైటీ రద్దుకు నోటీసు డొంకేశ్వర్(ఆర్మూర్): కోటగిరి మండలం లింగాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం రద్దుకు జిల్లా మత్స్య శాఖ అధికారి నోటీసు జారీ చేశారు. సొసైటీలో 40 మంది సభ్యులు ఉండగా అందరూ ఇతర కులస్తులకు చెందిన వారు ఉన్నట్లుగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న సొసైటీకి నోటీసు జారీ చేశారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన చేస్తున్నట్లు, ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజావ్యవహారాలు) వేం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తన ప్రసంగంలో నరేందర్ రెడ్డి జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపారు. 1948 సెప్టె ంబర్ 17న హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం రేవంత్రెడ్డి ప్రభుత్వం గాంధీజీ కలులుగన్న గ్రామస్వరాజ్యం దిశగా వెళుతూనే, అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడంలో స్వర్గధామంగా పేరు తెచ్చుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో, పట్టణాల్లో వార్డు స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ‘ప్రజాపాలన’ పేరిట కార్యక్రమం తీసుకొచ్చామన్నారు. రైతులకు రూ.755.29 కోట్ల రుణమాఫీ రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి 1.13 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇక గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా చరిత్ర సృష్టించామన్నారు. జిల్లాలో ఇప్ప టి వరకు 97,696 మంది రైతులకు 755.29 కోట్ల రుణమాఫీ అయిందన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ఇస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజనులో ఇప్పటి వరకు 2,72,589 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో రూ.316 కోట్లు జమ చేశామన్నారు. ● కీలక సంస్కరణల్లో ఒకటిగా భూభారతి చట్టం నిలిచిందన్నారు. దీని ద్వారా భూపరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా ముందడుగు వేశామన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇంటి స్థలం ఉన్న వారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లల్లో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం ఇస్తున్నామన్నారు. తొలివిడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇందుకు రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. గ్రీన్ ఛానెల్లో నిధులు విడుదల చేస్తున్నామన్నారు. జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇళ్లు లక్ష్యం కాగా, 18,155 ఇళ్లు మంజూరు అయ్యాయన్నారు. ● గృహ జ్యోతి పథకం ద్వారా మార్చి 2024 నుంచి జూలై 2025 వరకు ప్రతి నెల 2,67,707 మంది వినియోగదారులకు ‘జీరో’ బిల్లులు మంజూరు చేశామన్నారు. ఇందుకు గాను రూ.174.90 కోట్లు విడుదల చేశామన్నారు. ● అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద 760 పాఠశాలల్లో అత్యవసర మరమ్మతు పనులు చేశామన్నారు. ఇందుకు గాను జిల్లాలో ఇప్పటివరకు రూ.22.20 కోట్లు వెచ్చించామన్నారు. మరోవైపు ధర్పల్లి, ఇందల్వాయి, మెండోర, రుద్రూర్, మోపాల్ మండలాల్లో కేజీబీవీల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టామన్నారు. ● జిల్లాలో కళ్యాణలక్ష్మి ద్వారా 2025–26లో 1,080 మంది లబ్ధిదారులకు రూ.10.81 కోట్లు అందించామన్నారు. షాదీ ముబారక్ ద్వారా 672 మందికి రూ.6.72 కోట్లు ఇచ్చామన్నారు. ● కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, కలెక్టర్ టి వినయ్ కష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.నవీపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల సాంస్కృతిక ప్రదర్శనసిద్ధార్థ కళాక్షేత్రం ఆధ్వర్యంలో భరతనాట్య ప్రదర్శన ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన కీలక సంస్కరణగా నిలిచిన భూభారతి చట్టం ధాన్యం బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి పథకాలతో రైతులు, మహిళలకు మరింత మేలు ధాన్యం సేకరణలో ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి -
పేదలకు సన్న బియ్యం
‘సన్న బియ్యం’ పంపిణీ ద్వారా ప్రజలకు మరింత మేలు చేస్తున్నామని, రూ.13 వేల కోట్ల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది జూలై 14 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామన్నారు. మహా లక్ష్మి పథకం ద్వారా రూ.500 లకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఈ పథకం కింద 2,19,330 గ్యాస్ వినియోగదారులకు, 10,19,994 సిలిండర్లకు సబ్సిడీ విడుదలకు రూ.30.73 కోట్లు ఖర్చు చేశామన్నారు. ● సన్న ధాన్యం రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద 29 లక్షల పంపు సెట్లకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నామన్నారు. ఇందుకు గాను రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నామన్నారు. జిల్లాలో 2024–25 వానాకాలం సీజన్లో 4,91,497 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 78,488 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.1,140 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. యాసంగి సీజన్లో 8,40,279 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 1,16,000 రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి రూ.1,949 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఖరీఫ్, రబీ సీజన్లలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. -
రక్తదానంతో మేలు
● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తెయూ(డిచ్పల్లి): రక్తదానం చేయడమంటే ప్రాణదానమేనని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు అన్నారు. రక్తదాన్ అమృత్ మహోత్సవ్ 2.0 కార్యక్రమంలో భాగంగా బుధవారం తెయూలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కే.రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కనీసం మూడుసార్లు రక్తదానం చేయాలని సూచించారు. దీంతో తలసేమియా వ్యాధితోపాటు అత్యవసర చికిత్సలు అవసరమున్న వారికి ఎంతో మేలు చేసినట్లవుతుందన్నారు. రక్తదాన కార్యక్రమాలతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి అన్నారు. వర్సిటీ విద్యార్థులతోపాటు జీజీ కాలేజ్, ఎస్ఎస్ఆర్, వాగ్ధేవి (నిజామాబాద్), ఆర్కే డిగ్రీ కాలేజ్ (కామారెడ్డి), తెలంగాణ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షుడు బుస్స ఆంజనేయులు, పీఆర్వో పున్నయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు స్వప్న, స్రవంతి, అలీమ్ఖాన్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా
నిజామాబాద్నాగారం: దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి పరిష్కారానికి కృషిచేస్తానని విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి అన్నారు. బుధవారం నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్లో నిర్వహిస్తున్న దివ్యాంగుల పాఠశాల ను విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి సందర్శించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో 33 ఏళ్ల క్రితం కలెక్టర్గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం టీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు, సైనికుడిని సన్మానించా రు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సి ద్ధయ్య, ప్రిన్సిపాల్జ్యోతి, మానసిక పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, రమణస్వామి, టీఎన్ఆర్ ఫౌండేషన్ అశోక్ కుమార్, జిల్లా సైనిక వెల్ఫేర్ అధ్యక్షుడు హరప్రసాద్ పాల్గొన్నారు.ప్రోత్సాహకాలు అందజేత మోపాల్: నగరశివారులోని బోర్గాం(పి)లో ఎన్డీసీసీబీ వైస్ చైర్మన్, సొసైటీ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి తల్లి నల్ల మంగమ్మ మృతిచెందడంతో వారి కుటుంబాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, బాడ్సి సొసైటీ చైర్మన్ మోహన్రెడ్డి, మోపాల్ మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డి, అశోక్ తదితరులు ఉన్నారు.విద్యార్థులకు జామెట్రీ బాక్సులు అందజేతనిజామాబాద్ రూరల్: శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జెడ్పీహెచ్ఎస్ కాలూర్ పాఠశాల విద్యార్థులకు 80 జామెట్రీ బాక్సులు, 150 పెన్నులను అందజేశారు. వి ద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తెలిపారు. సంస్థ ప్రతినిధులు రామ్ మోహన్, శ్రీనివాస్, రాజశేఖర్, బాలశేఖర్, ఇన్చార్జి హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.ధర్పల్లి: మండలంలోని దుబ్బాక ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న 60 మంది విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం రూ. వెయ్యి చొప్పున ఆర్థికసాయాన్ని అందజేశారు. ఎంఈవో రమేశ్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రాజారెడ్డి సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందిస్తున్న ఉల్లాస్ ట్రస్ట్ ప్రతినిధులు అశ్విన్ స్వప్న దంపతులు తెలిపారు.అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైనట్లు ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రశేఖర్ కాలనీకి చెందిన సుమయ్య బేగమ్ తన ఎనిమిదేళ్ల కొడుకు మహమ్మద్ హుస్సేన్ను భారతీరాణి కాలనీలో ఉన్న తన అమ్మ సమీనా బేగం ఇంటి వద్ద మంగళవారం వదిలి వెళ్లింది. బాలుడు బుధవారం ఉదయం 8 గంటల సమయంలో బయట ఆడుకోడానికి వెళ్లి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబీకులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో సమీనాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు. బాలుడు ఆడుకుంటూ సమీపంలో ఉన్న బాబన్ సాహబ్ పహడ్ దర్గా వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బాలుడిని అతని తల్లి దండ్రులకు అప్పగించినట్లు ఎస్సై గంగాధర్ పేర్కొన్నారు.డ్రంకన్ డ్రైవ్లో ఒకరికి రెండు రోజుల జైలుఖలీల్వాడి: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఒకరికి మెజిస్ట్రేట్ నూర్జహాన్ రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టబడ్డు 13 మందిని కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో 12 మందికి రూ. 15 వేల జరిమానా విధించగా ఆర్మూర్కు చెందిన సయ్యద్ అజ్జుకు రెండు రోజుల జైలు శిక్షను మెజిస్ట్రేట్ విధించినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.జీపీకి ఫ్రీజర్ అందజేతడిచ్పల్లి: మండలంలోని ఘన్పూర్కు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు బుధవారం మృతదేహాన్ని పరిచే ఫ్రీజర్ను జీపీకి అందించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, జీపీ కార్యదర్శి, హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
పోరాటయోధుల చరిత్ర భావితరాలకు తెలపాలి
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సుభాష్నగర్: నిజాం నవాబు నిరంకుశ పాలనకు ఎదురు తిరిగిన తెలంగాణ పోరాట యోధుల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారితో కలిసి ధన్పాల్ సూర్యనారాయణ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాంజీ గోండ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, దాశరథి కృష్ణమాచార్యులు, షోయబుల్లా ఖాన్ వంటి ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. తెలంగాణ బిడ్డల ఆత్మఘోషను గ్రహించిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 17న నిజాం మెడలు వంచి ఇక్కడి ప్రజలకు విముక్తి కల్పించారన్నారు. నిజాం ఆనవాళ్లను పూర్తిగా చెరిపేసి, నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ఉపాధ్యక్షులు పాలెపు రాజు, జిల్లా కార్యదర్శి జ్యోతి, మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
● జాతీయ జెండాలను ఆవిష్కరించిన నేతలు, అధికారులు నిజామాబాద్ సిటీ/ సిరికొండ/ ధర్పల్లి/ డిచ్పల్లి/ మోపాల్/ సుభాష్నగర్/ నిజామాబాద్ రూరల్/ నిజామాబాద్నాగారం/ నిజామాబాద్ లీగల్/ జక్రాన్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పా లన వివరిస్తూ ప్రజాపాలన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.జిల్లా కేంద్రంలోని బల్దియా కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, నుడా కార్యాలయంలో చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ భవన్లో జిల్లా గ్రంథాలయ చైరమ్న్ అంతిరెడ్డి రాజారెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించా రు. సిరికొండ, ధర్పల్లి, డిచ్పల్లి, మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాల్లో ప్రజాపాలన వేడుకలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో స్ జిల్లా కార్యాలయ ఆవరణలో జిల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రి న్సిపాల్ ఎన్ కృష్ణమోహన్, జిల్లా కోర్టు ప్రాంగ ణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, జక్రాన్పల్లిలో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. -
ముగిసిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు బుధవారం ముగిసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. వర్సి టీ కళాశాలలో జరిగిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం నాలుగో సెమిస్టర్ పరీక్షలలో మొత్తం 28 మంది విద్యార్థులకు 28 హాజరైనట్లు పేర్కొన్నారు.గాయపడిన వ్యక్తిని అంబులెన్స్లో తరలించిన సీపీడిచ్పల్లి: డిచ్పల్లి పోలీస్స్టేషన్ పరిధి నడిపల్లి శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం ద్విచక్రవాహనంపై వెళుతున్న అశో క్ గాబ్రీ అదుపుతప్పి కిందపడగా తలకు బలమైన గాయాలయ్యాయి. అదే సమయంలో డిచ్పల్లి ఖిల్లా గ్రామానికి వెళ్తున్న సీపీ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య వెంటనే తన వాహనాన్ని నిలిపివేశారు. 108 అంబులెన్స్ను పిలిపించి తీవ్రంగా గాయపడిన అశోక్ను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీపీ వెంట డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్, సిబ్బంది ఉన్నారు.జెండా ఎగురవేసిన సీపీఖలీల్వాడి: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య బుధవారం జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో డీసీపీలు బస్వారెడ్డి, రాంచందర్ రావు, సైబర్ క్రైమ్ ఏసీపీ వై వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, సీఐలు, ఆర్ఎస్సై, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.విశ్వేశ్వర శర్మకు డాక్టరేట్తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పరిశోధక విద్యార్థి ఏ.విశ్వేశ్వర శర్మ పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ జి.మనోజ పర్యవేక్షణలో ‘అప్లికేషన్స్ అండ్ రేసియల్ ఆఫ్ నాదిన్ గార్డెమర్’ అనే అంశంపై విశ్వేశ్వర శర్మ పరిశోధన పూర్తి చే సి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. బుధవా రం తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సెమినార్ హాల్లో నిర్వహించిన ఓపెన్ వైవాకు ఓయూ ప్రొఫెసర్ సవిన్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వ్యవహరించారు. ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ లావ ణ్య, హెచ్వోడీ రమణాచారి, బీవోఎస్ చైర్మన్ సమత, అధ్యాపకులు పాల్గొన్నారు. -
త్వరలో జీవాలకు నట్టల నివారణ మందులు
డొంకేశ్వర్(ఆర్మూర్): రెండేళ్ల క్రితం నిలిచిపోయిన జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ మళ్లీ ప్రారంభం కాబోతుంది. త్వరలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జిల్లాకు కావాల్సిన మందులు ఎన్నో పశుసంవర్ధక శాఖ అధికారులు రాష్ట్ర శాఖకు ఇండెంట్ పంపించారు. ఐదుగురు అధికారులతో కూడిన కమిటీ నాలుగు రకాల మందులను గుర్తించింది. అయితే, ప్రభుత్వం వీటిని ఈ నెలాఖరు నాటికి జిల్లాకు పంపనుంది. జిల్లాలో 6లక్షలకు పైగా జీవాలు జిల్లాలో మేకలు, గొర్రెలు కలిపి 6,02,703 ఉన్నాయి. ప్రధానంగా నట్టల వ్యాధితోపాటు బద్దె పురుగులు, కార్యపు జలగలు, బొంత పురుగుల వ్యాధులను సైతం అధికారులు గుర్తించారు. వీటికి కూడా మందులు వేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నట్టల నివారణ మందులు ఉచితంగా జిల్లాకు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు మందులు రాలేదు. ఏడాదిలో కనీసం మూడుసార్లు మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేయాలి. దీంతో జీవాల పెంపకందారులైన గొల్ల, కుర్మలు డబ్బులు వెచ్చించి మందులు కొనుగోలు చేస్తున్నారు. త్వరలో నట్టల నివారణ మందులు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గొల్ల, కుర్మలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి మందులు జిల్లాకు చేరుకోనుండగా అక్టోబర్ మొదటి వారంలో పంపిణీ చేసేందుకు పశుసంవర్ధక శాఖ ప్రణాళిక తయారు చేస్తోంది. తేదీ ఖరారైన వెంటనే గ్రామాల వారీగా షెడ్యూల్ను ప్రకటించనున్నారు. అయితే, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం వాస్తవమే. నెలాఖరు నాటికి జిల్లాకు పంపుతామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో పంపిణీ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. – రోహిత్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఇండెంట్ పంపిన పశుసంవర్ధక శాఖ నెలాఖరు నాటికి జిల్లాకు మందుల సరఫరా అక్టోబర్ మొదటి వారంలో పంపిణీకి ఏర్పాట్లు -
రైతులను ఆదుకోండి
నిజామాబాద్ రూరల్: ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా జిల్లాకు వచ్చిన సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డికి కంఠేశ్వర్లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలో వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, పీసీసీ డెలిగెట్ శేఖర్గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మునిపల్లి సాయారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఐఏఎస్ చక్రపాణి
చదువుతోనే భవిష్యత్తు నిజామాబాద్ రూరల్: చదువుతోనే విద్యార్థుల భవిష్యత్తు ఉందని విద్యావేత్త, విశ్రాంత ఐఏఎస్, పూర్వ కలెక్టర్ డీ చక్రపాణి పేర్కొన్నారు. నగరంలోని ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రామాలయంలో బుధవారం అవగాహన సద స్సు నిర్వహించారు. విద్యార్థులు ధారాళంగా ఇంగ్లిష్ మాట్లాడడం నేర్చుకోవాలని, ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలని సూచించారు. అంతకు ముందు చక్రపాణిని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృపాల్సింగ్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ వీరేశం, రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
కుక్కల దాడిలో మేకల మృతి నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండల కేంద్రంలో కుక్కల దాడిలో రెండు మేకలు మృతి చెందాయి. నందిపేటకు చెందిన ఎస్కే. అజీం తన ఇంటి ఎదుట రెండు మేకలను కట్టేసి ఉంచాడు. కాగా, ఒక్కసారి గుంపులుగా వచ్చిన కుక్కలు దాడి చేసి రెండు మేకల గొంతులను పట్టేసాయి. మేకల అరుపులు విని కుక్కలను తరిమివేసే ప్రయత్నం చేసినా కుక్కలు మేకలను విడిచి పెట్టకుండా వాటి తల, మొండెం భాగాలను వేరు చేశాయి. ఎల్లారెడ్డిరూరల్: రేసు కుక్కలు గొర్రెల మందపై దాడి చేయడంతో 9 గొర్రెలు, ఒక మేక మృతి చెందినట్లు బాధితుడు రవి తెలిపారు. మండలంలోని తిమ్మారెడ్డి కట్టకింది తండాకు చెందిన రవి గొర్రెల మందపై రేసు కుక్కలు దాడి చేశాయి. ఘటనా స్థలాన్ని బీట్ ఆఫీసర్ మౌనిక పరిశీలించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని బాధితుడు కోరారు. మెండోరాలో భారీ చోరీ ● ఆరు తులాల బంగారం అపహరణ బాల్కొండ: మెండోరా మండల కేంద్రంలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలు చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేర రామకృష్ణ దంపతులు మెండోరా మండల కేంద్రంలో కిరాణాషాపును నిర్వహిస్తారు. రోజూ ఇంటికి తాళం వేసి వచ్చి షాపులో ఉంటారు. పట్టపగలు గుర్తుతెలియని దుండగులు తాళం పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న 6 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయంత్రం పాఠఽశాల నుంచి ఇంటికి వచ్చిన కుమారుడు తాళం పగుల గొట్టి ఉండడాన్ని గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూసేలోపు భారీ చోరీ జరిగింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై సుహాసిని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
యూరియా కోసం బారులు తీరిన రైతులు
సిరికొండ: మండలంలోని తూంపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బుధవారం బారులు తీరారు. సొసైటీకి మంగళవారం 225 సంచుల యూరియా వచ్చింది. బుధవారం పంపిణీ చేస్తారని ఉదయం ఆరు గంటల నుంచే రైతులు సొసైటీ వద్దకు తరలివచ్చారు. అధికారులు వచ్చేంత వరకు వరుసలో నిలబడలేక చెప్పులను వరుసలో ఉంచారు. పోలీసుల సహకారంతో ఏవో నర్సయ్య, సొసైటీ సీఈవో దేవిలాల్, సిబ్బంది ఒక్కో రైతుకు రెండు సంచుల చొప్పున యూరియాను పంపిణీ చేశారు. నిజామాబాద్ లీగల్: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి. ఉదయభాస్కర్ రావు అన్నారు. నగరంలోని అంబేడ్కర్ కాలనీలో బుధవారం న్యాయ చైతన్య సదస్సు నిర్వహించా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏడాదికి రూ. మూడు లక్షలకన్నా ఆధాయం తక్కువ ఉన్న వారికి ఉచిత న్యా య సహాయం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు,కాలనీవాసులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: నగరంలోని సీతారాంనగర్ కాలనీలో ఉన్న అభయాంజనేయ ఆలయం వద్ద యువ నేత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో ఇద్దరు..
కమ్మర్పల్లి: విద్యుత్ వైర్లను నీటిలో వేసి చేపలను వేటాడాలనుకున్న ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్తో మృతి చెందారు. ఈ ఘటన కమ్మర్పల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని గాంధీనగర్లో నివాసముంటున్న కొండపల్లి లక్ష్మణ్(39), చిత్తారి నర్సింలు(30) కలిసి నేషనల్ హైవే పక్కన ఉన్న సౌటామోటా కాలువ కల్వర్టు వద్ద చేపలను వేటాడేందుకు వెళ్లారు. అయితే విద్యుత్ సహాయంతో చేపలను వేటాడలనుకున్న వారిద్దరు కాలువ వద్ద ఉన్న లో టెన్షన్ లైన్కు తీగను తగిలించే క్రమంలో 11 కేవీ లైన్కు తగిలి షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్రెడ్డి తెలిపారు. ● కరెంట్ సాయంతో చేపలు వేటాడే ప్రయత్నం ● కమ్మర్పల్లి మండలంలో ఘటన -
తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు
● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ చరిత్రను 1948 సె ప్టెంబర్ 17 మలుపుతిప్పిన రోజని, శతాబ్దాల బాని స సంకెళ్లను తుంచి స్వాతంత్య్రం పొందిన ఉద్విఘ్న సందర్భమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొ ఫెసర్ యాదగిరిరావు అన్నారు. ప్రజాపాలన దినో త్సవం సందర్భంగా బుధవారం తెయూ పరిపాల నా భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజరికం పరిసమాప్తమై తెలంగాణ సమాజం నిజాం కబందహస్తాల నుంచి విమోచన పొందిన రోజన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, అ ధ్యాపకులు పాత నాగరాజు, శాంతాబాయి, పీఆ ర్వో పున్నయ్య, టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో విద్రోహ దినం
నిజామాబాద్ సిటీ/ డిచ్పల్లి: భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నెత్తుటేరులో ముంచిన సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చీకటి రోజని, తెలంగాణ ప్రజలకు విద్రోహ దినమని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. కోటగల్లి ఎన్ఆర్భవన్లో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విద్రోహ దినం సదస్సు నిర్వహించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులను అణచడానికి జవహాల్లాల్ నెహ్రూ కుట్రలు పన్నారని అన్నారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి పుట్ట వరదయ్య ఆధ్వర్యంలో నాగారంలో విద్రోహ దినోత్సవం నిర్వహించారు. నాందేవ్వాడలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షురాలు సుజాత అధ్యక్షతన తెలంగాణ సాయుధ రైతాంగ సభ నిర్వహించారు. కార్యదర్శివర్గ సభ్యురాలు నూర్జహాన్, నాయకులు పాల్గొన్నారు. డిచ్పల్లిలో సీపీఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథా డిచ్పల్లి మండల కార్యదర్శి బోశెట్టి మురళి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ సభ నిర్వహించారు. మాస్లైన్ ప్రజాపంథా నాయకులు పాల్గొన్నారు. -
సీఎం సలహాదారుకు వినతులు
నిజామాబాద్నాగారం: ఉద్యోగుల సమస్యలపై జిల్లాకు వచ్చిన సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డికి టీఎన్జీవోస్, రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో విన్నవించారు. అనంతరం వేం నరేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, రెవె న్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, శశికాంత్ రెడ్డి, విశాల్, మారుతి, సునీల్ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణతో రోస్టర్ పాయింట్ల విధానంలో మాలలకు అన్యాయం జరుగుతుందని వెంటనే తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఆధ్వర్యంలో జిల్లా మాల మహానాడు కార్యవర్గ సభ్యులు సీఎం సలహాదారుడికి వినతిపత్రం అందజేశారు. జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు చొక్కం దేవీదాస్, నాంది వినయ్ కుమార్, ఆసది గంగాధర్, పి.చంద్ర కాంత్, బీస భూమయ్య, శంకరయ్య, బాలస్వామి, దొడ్డి మోహన్, భూషణ్, గంగాధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ బిల్లు చెల్లించాలి
● సీఎం సలహాదారుకు వినతి ఖలీల్వాడి: పెండింగ్లో ఉన్న బిల్లులను అందించాలని జిల్లా పోలీసుల సంఘం అధ్యక్షుడు షకీల్పాషా కోరారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డిను బుధవారం కలిసిన జిల్లా పోలీసుల సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. 2024 జనవరిలో డిపార్ట్మెంట్కు రావాల్సిన ఎస్ఎల్ఎస్, అడిషనల్ ఎస్ఎల్ఎస్–5, జీపీఎఫ్, 2018 పీఆర్సీ బకాయిలు ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అందరు ఉద్యోగులకు పీఆర్సీ అందించారని, పోలీసులకు ఇవ్వలేదని తెలిపారు. ఉద్యోగులు తమ పిల్లలకు అకడమిక్ ఇయర్ నుంచి ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. -
ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
సుభాష్నగర్/ ధర్పల్లి/ సిరికొండ/ మోపాల్/ నిజామాబాద్ రూరల్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులు, అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ యుగపురుషుడని అన్నారు. జీజీహెచ్లో పార్టీ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ధర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఆలయంలో పూజలు నిర్వహించారు. సపాయి కార్మికులకు చేతు గ్లౌజులు, డెటాల్ సబ్బులను అందజేశారు. సిరికొండ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డి హాజరయ్యారు. శుభోదయం పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. మోపాల్ మండల కేంద్రంలోని కేజీబీవీలో పదోతరగతి విద్యార్థినులకు బీజేపీ నాయకులు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. నగరంలోని గాజుల్పేటలో ఉన్న గురుద్వారాలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
● ఘనంగా ప్రజాపాలన దినోత్సవంనిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హాజరై జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. సిద్దార్థ కళాక్షేత్ర, నవీపేట, కంజర సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలు, బోర్గాం(పి) ప్రభుత్వ పాఠశాల, డిచ్పల్లి మానవతా సదన్ చిన్నారులు చూడచక్కని నృత్యాలు ప్రదర్శించారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ఆర్.భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవేణు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
డిచ్పల్లి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడాపోటీల్లో రాణించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. బుధవారం మండలంలోని డిచ్పల్లి ఖిల్లా జెడ్పీ పాఠశాలను సీపీ సందర్శించారు. పాఠశాలకు రూ.60వేలు విలువ గల క్రీడాపరికరాలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్రెడ్డి వితరణ చేశారు. ఈ క్రీడాపరికరాలను సీపీ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. సీపీ మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. అనంతరం జిల్లా స్థాయి ఉత్తమ పీడీగా అవార్డు తీసుకున్న పీడీ స్వప్నను సీపీ సన్మానించారు. కార్యక్రమంలో డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై ఎండీ షరీఫ్, పాఠశాల హెచ్ఎం బి.సీతయ్య, ఖిల్లా రామాలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సావిత్రి, గ్రామపెద్దలు బూస సుదర్శన్, నర్సారెడ్డి, యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా విశ్వకర్మ జయంతి
నిజామాబాద్ రూరల్/ సిరికొండ/ ధర్పల్లి: ఆర్యనగర్లోని హనుమాన్ మందిర కమిటీ హాల్లో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవాన్కు పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు వెంకటేశం, రమేశ్, అంజయ్య, గంగేశ్వర్, లక్ష్మీనారాయణ, రామస్వామి, విశ్వనాథ్, సంఘ సభ్యులు వెంకట చారి, గంగాధర్, పురుషోత్తం, దేవ శర్మ, అశోక్, రాంబాబు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని న్యావనందిలో విశ్వకర్మ చిత్ర పటానికి విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పూజలు చేశారు. ధర్పల్లిలో మండలంలో మైలారంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శోభాయాత్ర నిర్వహించారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు. -
పాడి రైతులు జాగ్రత్తలు పాటించాలి
● జిల్లా పశువైద్యాధికారి రోహిత్ రెడ్డి నిజామాబాద్ రూరల్: పాడి రైతులు పశువుల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశు వైద్యాఽ దికారి రోహిత్ రెడ్డి అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని అర్సపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 36 పశువులకు గర్భకోశ, 42 దూడలకు నట్టల నివారణ మందులు, 48 పశువులకు సాధారణ చికిత్సలు, మూడు పశువులకు కృత్రిమ గర్భధారణ చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి బాబురావు, జిల్లా పశువైద్య ఆస్పత్రి డాక్టర్ హనుమంత్ రెడ్డి, అర్సపల్లి సబ్సెంటర్ రమేశ్, వీఎల్వో శ్రీనివాస్, ఎల్ఎస్ఏ సిబ్బంది, గోపాల మిత్రలు, ట్రెయినీ డాక్టర్లు పాల్గొన్నారు. -
కామన్ స్కూల్ విద్యా విధానం కావాలి
నిజామాబాద్ సిటీ: విద్యా వ్యవస్థలు అన్నీ ఒకే విధమైన విద్యావిధానం పాటించాలని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి ముఖ్యఅతి థిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాల ల్లో అన్ని కులాలకు చెందిన పేద, నిరుపేద పిల్లలు చదువుతున్నారని, నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు. సీపీఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు పుల్గం దామోదర్ రెడ్డి, భిక్షం గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గుండు లక్ష్మణ్, వంగ మహేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కిషన్, పెంట జలంధర్, వెంకటేశ్వర గౌడ్, తుమ్మల లక్ష్మణ్, అంకం నరేశ్, గంట అశోక్, సరిత తదితరులు పాల్గొన్నారు. -
పంటలను గిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలి
● జిల్లా సహకార అధికారి శ్రీనివాస్రావు మోపాల్: రైతులు పండించిన పంటలను గిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలని, గిట్టుబాటు ధర వచ్చిన సమయంలో విక్రయించుకోవాలని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్రావు సూచించారు. బుధవారం నగర శివారులోని బోర్గాం(పి) సొసైటీలో గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గిడ్డంగుల్లో పంటలను భద్రపర్చుకున్న సమయంలో పొందిన రసీదుల ఆధారంగా రైతులు బ్యాంకుల ద్వారా రు ణాలు పొందవచ్చని తెలిపారు. అనంతరం గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ సంస్థ ఐసీఎం డాక్టర్ శ్యాంకుమార్ మాట్లాడుతూ.. రైతులు గోదాములను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సహకార శాఖ అధికారి సరస్వతి, సొసైటీ వైస్ చైర్మన్ జయకృష్ణారెడ్డి, డైరెక్టర్లు గంగదాస్, సాయిరెడ్డి, మోహన్, నారాయణ, రైతులు సూర్యారెడ్డి, చిట్టి సాయిరెడ్డి, సుభాష్, రాజారెడ్డి, హన్మాండ్లు, పండరి, వ్యాపారులు, సొసైటీ సిబ్బంది నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
వీరుల విముక్తి పోరు
నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ మరో 13 నెలల పాటు వీరోచిత పోరాటం చేయాల్సి వచ్చింది. జిల్లాలో ఏడు వందల మంది పోరాటంలో పాల్గొన్నారు. ఖిల్లా జైలు గోడలపై దాశరథి కృష్ణమాచార్య బొగ్గుతో రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ నినాదం నిజాం విముక్తి పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. ఈ పోరాటంలో ఆర్యసమాజ్ కీలక పాత్ర పోషించింది. జైలులో అనేక చిత్రహింసలను అనుభవించిన సమరయోధులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలంగాణ విముక్తి పోరాటంలో రాధాకృష్ణ మోదాని, సర్దార్ ప్రేమ్సింగ్, సర్దార్ వామాన్ సింగ్, నల్ల నర్సింహారెడ్డి తదితరులు ప్రాణాలు అర్పించారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భారతదేశంలో భాగమయ్యేందుకు గాను తెలంగాణ విముక్తి కోసం నిజాం నవాబుపై ఇందూరు వీరులు చేసిన పోరా టం తిరుగులేనిది. జిల్లాకు చెందిన 700 మందికి పైగా ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. పలువురు అమరులయ్యారు. పోరాట ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ గడ్డపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటి ష్ వాళ్ల నుంచి స్వాతంత్య్రం లభించినప్పటికీ తెలంగాణ మాత్రం అదనంగా మరో 13 నెలల పాటు వీరోచిత పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో నిజాంకు వ్యతిరేకంగా రాసిన సాహిత్యం ప్రధాన పాత్ర పోషించింది. అనేక మంది కవులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన నిజాం పాలకులు కొంతకాలం పాటు నిజామాబాద్ ఖిల్లా జైలు లో బంధించారు. వీరిలో దాశరథి కృష్ణమాచార్యు లు, వట్టికోట ఆళ్వారులు లాంటివారు ఉన్నారు. దాశరథి కృష్ణమాచార్య నిజామాబాద్ జైలులో మూడు నెలల పాటు ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలో దాశరథి జైలు గోడలపై పళ్లు తో ముకునే బొగ్గుతో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాహిత్యాన్ని రాశారు. ‘నా తెలంగాణ కోటి అందా ల జాణ.. నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గోడలపై రాశారు. ఈ నినాదం అప్పటి నిజాం విముక్తి పోరాటంలో తిరుగులేని విధంగా ఉద్యమాన్ని ముందుకు నడిపింది.1939 సెప్టెంబర్ 2న ఇందూరు గంజ్ కమాన్ వద్ద ఒక అరబ్బు వ్యక్తి పోలీసు స్టేషన్ వద్దరాధాకృష్ణ మోదానిని కత్తితో పొడిచి చంపాడు.1939 అక్టోబర్లో రజాకార్లు దసరా ఊరేగింపుపై దాడి చేసి సర్దార్ ప్రేమ్సింగ్, సర్దార్ వా మాన్సింగ్లను చంపారు.1946 నవంబర్ 28న ప్లేగు శిబిరంలో నల్ల నర్సింహారెడ్డిని రజాకార్లు కాల్చి చంపారు.1947 జూన్ 3న దత్తోపంత్ నాయక్ బాంబు పేలుడులో మరణించారు.1931లో హైదరాబాద్ రాష్ట్రంలో సాగిన ‘సివిల్ డిస్ ఒబిడియెన్స్’ ఉద్యమంలో నల్ల నరసింహారెడ్డి అరెస్టయ్యారు. 1947లో హైదరాబాద్ రాష్ట్ర విలీనోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. దీంతో రజాకార్లు క్రూరంగా కాల్చి చంపారు. నిజామాబాద్లో నల్ల నర్సింహారెడ్డి పేరుతో ఒక వీధి ఉంది. జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం వారు నగరంలో ఈయన పేరిట ఒక స్థూపాన్ని ప్రతిష్ఠించారు.ఇందూరులోని గాజుల్పేట్కు చెందిన బెల్లాల్ మాణిక్రెడ్డి నిజాం రజాకార్ల వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించారు. న్యాయవాద విద్యనభ్యసించిన మాణిక్రెడ్డి ఆర్యసమాజ్ బృందాలతో కలిసి ఇందూరు యువకులకు రాత్రి సమయాల్లో కర్రసాము, కరాటే, నాటు తుపాకీ వాడకం, బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చారు. పోరాట యోఽ దులు కనిపిస్తే కాల్చేయమని నిజాం పోలీసులు ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో అనేకమంది వీరులకు తన పొలంలో, ఇంట్లో ఆశ్రయం కల్పించి వారి బాగోగులు, వారి కుటుంబాల బాగోగులు చూసుకున్నారు. అప్పట్లో మాణిక్రెడ్డి ఇల్లు స్వాతంత్య్ర ఉద్యమకార్లకు భోజన సత్రంగా ఉండేదని నాటి సమరయోధులు చెప్పేవారు. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీలు, సత్యాగ్రహ దీక్షల్లో తాను ముందుండి నాటి యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లారు. తరువాత కాలంలో ఎమర్జెన్సీ సమయంలోనూ మాణిక్రెడ్డి అప్పటి ఇందిర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పోరాటాల్లో ముందున్నారు. చంపేస్తామని అప్పటి కాంగ్రెస్ నాయకులు బెదిరించినప్పటికీ వెరవలేదు.మిఠాయి గంగారాం అనే స్వాతంత్య్ర సమరయోధుడు 1921లో నిజామాబాద్లో జన్మించారు. ని జాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈయన తన వృత్తినే వదిలేసి పాల్గొన్నారు. ఆనాటి ఉద్యమంలో వీరి పాత్ర అమోఘమైనది. ఎవరికీ జంకని వీరపురుషుడీయన అంటారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు నై జాం ప్రభుత్వం గంగారాంను హైదరాబాద్, సికింద్రాబాద్ జైళ్లలో విడతలవారీగా ఉంచింది. 1947 జూలై 5 నుంచి 1948 అక్టోబర్ 7 వరకు జైలులో ఉన్నారు. జైలు లో అనేక అవస్థలు పడ్డారు. జైలు నుండి విడుదలైన తరువాత గంగారాం అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆర్యసమాజ్, విశ్వహిందూ పరిషత్ కార్యకలాపాల్లో, హనుమాన్ వ్యాయామశాల స్థాపన నిర్వహణలో చాలా కృషి చేశారు.త్రయంబకరావు పాఠక్ 1920 డిసెంబర్ 1న ఇందూరులో జన్మించారు. తల్లిదండ్రులు అందూబా యి, రామచంద్రరావు. వ్యవసాయ కుటుంబం. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన పాఠక్ రజాకార్ల అరాచకాలను చూడలేకపోయారు. హృదయవిదారక ఘటనలు చూసి విప్లవ భావాలు పెంచుకున్నారు. ఆ కసాయివాళ్లను ఆయుధాలతోనే ఎదురించాలనుకుని, తన భార్య గాజులను అమ్మేసి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లో తన మిత్రుడు దత్తోపంత్తో బాంబులు తయారు చే యించారు. ఇందుకు సీహె చ్బీ విఠల్దాస్, కేవీ గంగాధర్లు సహకరించారు. అయితే బాంబులను రహస్యంగా చేరవేస్తున్నప్పుడు పేలుడు సంభవించి దత్తోపంత్ అనే సమరయోధుడు మరణించారు. ఇది పోలీసులకు తెలియడంతో అందరినీ బంధించి వేర్వేరు జైళ్లలో ఉంచారు. త్రయంబకరావును 1947 డిసెంబర్ 14న హైదరాబాద్ జైల్లో పెట్టారు. 1948 అక్టోబర్ 7న విడుదలయ్యారు. స్వాతంత్య్ర సమరంలో ఈయన పాత్రను గుర్తించిన భారత ప్రభుత్వం 1973 ఆగస్టు 15న తామ్రపత్రానిచ్చి గౌరవించింది. పాఠక్ ఆనాడు నిజామాబాద్ ప్రాంతంలో జరిగిన అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు. హిందూ మహాసభకు జిల్లా కార్యదర్శిగా, ఆర్యసమాజ్ సభ్యులుగా వ్యవహరించారు. తరువాత భారత్ సేవక్ సమాజ్లోనూ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లోనూ, కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీలలో సభ్యులై ఎన్నో కార్యకలాపాలను నిర్వహించారు.బృందాలుగా సత్యాగ్రహాలు..ఇందూరులో 1934 ఆగస్టు 24న ఆర్యసమాజ్ కార్యకలాపాలు ప్రారంభించారు. మొదటి కార్యవర్గంలో ప్రధాన్గా నల్ల రుక్మారెడ్డి వకీలు, మంత్రిగా మునిపల్లె గంగారాం, కోశాధికారిగా గజవాడ మాణిక్యం నియమితులయ్యారు.నిజాం విముక్తి పోరులో బృందాలుగా సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించారు. 1938, 1939లో బృందాలుగా ఏర్పడి పోరాటాలు చేశారు. మాణిక్యరెడ్డి, గడియారం సాంబయ్య, మునిపల్లె గంగారాం, రాధాకృష్ణ మోదా నిలు అరెస్టయ్యారు.ఇందూరు జైలులో ఉప్పొంగిన దేశభక్తి..1948 జనవరి 11న ఇద్దరు ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కార్యకర్తలను రాజకీయ ఖైదీలున్న బ్యారక్ లో ఉంచారు. వీళ్లిద్దరూ స్టేట్ కాంగ్రెస్ ఖైదీలతో గిల్లికజ్జాలు పెట్టుకోసాగారు. జైలులో వందేమాతర గీతం ఆలపించకూడదని ఇద్దరు ఖైదీలు అభ్యంతరం చెప్పారు. అయినప్పటికీ వందేమాతరం ఆలపించడంతో ఇత్తెహాదుల్ ముస్లిమీన్కు చెందిన ఖైదీలు 4వ బ్యారక్లో ఉన్న సత్యాగ్రహులను కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు. అలారం మోగించారు. జైలు వార్డెన్లు, పోలీసులు, కొందరు బయటి వ్యక్తులు జైలులోకి చొచ్చుకొచ్చి దాడిలో పాల్గొన్నారు. అందరూ కలిసి సత్యాగ్రహులను, వందేమాతరం ఆలపించిన వారిని క్రూ రంగా కొట్టారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. తలలు పగిలాయి. కొందరి కాళ్లూ, చేతులు విరిగాయి. 150 మంది సమరయోధులు తీవ్రంగా గాయపడడంతో రక్తసిక్తమైంది. జలియన్ వాలాబాగ్ను తలపించిన ఈ ఘటనను దేశ వ్యాప్తంగా ఖండించారు. ఆ రోజుల్లో తెలంగాణ జైళ్లలోని వార్డెన్లందరూ రాష్ట్రం బయటి నుంచి వచ్చినవారే. దీంతో ఈ జైలు రాజకీయ ఖైదీలకు అగ్నిగుండంలాగా తయారైంది. అప్పట్లో ఈ జైలును ‘‘సియాసీ ఖైదియోంకా ఖబరస్తాన్’’ (‘‘రాజకీయ ఖైదీల బొందలగడ్డ’’) అనేవారు. -
తాళ్లరాంపూర్లో ఉద్రిక్తత
మోర్తాడ్(బాల్కొండ): గ్రామస్తులు, గీత కార్మికుల మధ్య నెలకొన్న వివాదంతో ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఓ వ్యక్తి తన ఇంటి స్థలంలోని ఈత చెట్టును నరికేయగా దీనిపై గీత కార్మికులు ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. గతంలోనే తాటి చెట్లను గీసే విషయంలో గ్రామంలోని కొన్ని కుల సంఘాలు, గీత కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ అంశంపై గ్రామంలో న్యా య సేవాధికార సంస్థ అవగాహన సమావేశాన్ని నిర్వహించి గ్రామాభివృద్ధి కమిటీ రద్దు చేసేలా కృషి చేసింది. గ్రామాభివృద్ధి కమిటీ రద్దు చేసినట్లు ప్రకటించినా గ్రామంలోని రెండు వర్గాల మధ్య సఖ్యత కుదరలేదు. సోమవారం రా త్రి నుంచి ఈనెల 21 వరకు 163 సెక్షన్ అమలు చేస్తూ తహసీల్దార్ మల్లయ్య ఉత్తర్వులు జారీ చేశా రు. గ్రామంలో పోలీసు బలగాలు మోహరించాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయా స్టేషన్ల ఎస్సైలు, ప్రత్యేక పోలీసు బలగాలు గ్రామంలో పికెటింగ్ నిర్వహించారు. పోలీసుల తీరుపై నిరసన బీడీ కంపెనీలో పనికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చిన ఆడెపు లక్ష్మి అనే మహిళతోపాటు ఆమె భర్త నర్సయ్యపై పోలీసులు దాడి చేశారని తా ళ ్లరాంపూర్ గ్రామస్తులు అంటున్నారు. పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన బోనగిరి లావ ణ్యను పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకవెళ్తుండగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో చివరకు వదిలేశారన్నారు. పోలీసులు తమపై అకారణంగా దాడులు చేస్తున్నారని కొందరు ఫొటో లు తీసి సీపీ సాయి చైతన్యకు సామాజిక మా ధ్య మాల ద్వారా చేరవేయడంతో ఎవరిపై దాడికి పాల్పడవద్దని ఆ యన ఆదేశించినట్లు తెలిసింది. తాళ్లరాంపూర్లో చోటు చేసుకున్న వివాదంపై ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్వాన్ మాల్వియా, అదన పు పోలీసు కమిషనర్ బస్వారెడ్డి మోర్తాడ్లో ఇరువర్గాలతో చర్చలు నిర్వహించారు. అధికారులు ఈనెల 19న మరోసారి చర్చలు నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. గ్రామస్తులు, గీత కార్మికుల మధ్య ముదిరిన వివాదం ఈ నెల 21 వరకు 163 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ భారీగా మోహరించిన పోలీసు బలగాలు -
పదిహేను లక్షల బస్తాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో యూరియా అమ్మ కాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో ఏకంగా 70వేల మెట్రిక్ టన్నుల మార్క్ను దా టింది. అంటే 15లక్షల 40వేల యూరియా బస్తాల ను రైతులు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఇది గతే డాది ఖరీఫ్తో పోలిస్తే 2వేల మెట్రిక్ టన్నులు ఎ క్కువ. అయితే వేరే జిల్లాల్లో యూరియా దొరక్క రైతు లు ఇబ్బందులు పడుతుంటే, మన జిల్లాలో అధికారుల ముందు చూపు కారణంగా అలాంటి పరి స్థితి లేదనే చెప్పొచ్చు. రైతులంతా వరికి మూడో డోసు కూడా యూరియా వేశారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే యూరియా అవసరం ఒక్కసారిగా ఏర్పడడంతో అక్కడి మండలాలకు వ్యవసాయ శా ఖ యూరియా సరఫరా చేస్తోంది. మంగళవారం బాల్కొండ, భీమ్గల్ మండలాల్లో సొసైటీల ముందు రైతులు బారులు తీరడంతో టోకెన్లు ఇచ్చి బస్తాలు పంపిణీ చేశారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో కొరత ఏర్పడే అవకాశం ఉందన్న సమాచారం మేర కు స్టాకును తెప్పించి ఆయా మండలాలకు పంపుతున్నారు. ప్రస్తుతం జిల్లా అంతటా 50 పాయింట్లలో యూరియా అమ్మకాలు కొనసాగుతున్నాయి. యాసంగి కోసం ఇప్పుడే.. ఖరీఫ్లో 5,24,506 ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా, 4,36,695 ఎకరాల విస్తీర్ణంలో వరి ఉంది. ప్రస్తుతం మొక్కజొన్న కోతలు ప్రారంభం కాగా కొన్ని చోట్ల ఇరవై రోజుల్లో వరి కోతలు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయంలో రైతులు ఇంకా యూరియాను కొనుగోలు చేయడంపై వ్యవసాయాధి కారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే యాసంగి పంటలకు కూడా ఇప్పుడే యూరియాను కొనుగోలు చేసి దాచి పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అధికారులు కూడా ఇదే విష యాన్ని స్పష్టం చేస్తున్నారు. గతేడాది 68,300 మెట్రిక్ టన్నులు పంపిణీ జరిగిన యూరియా ఇప్పుడు అదనంగా 2వేల మెట్రిక్ టన్నులు అమ్ముపోయింది. అంటే ఇది దాదాపు 18 వేల ఎకరాలకు సరిపడా యూరియా. ఈ లెక్కన జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం పెరగాలి. కానీ అలా జరగలేదు. జిల్లాకు అవసరమైన యూరియా (అంచనా) 75 వేల మెట్రిక్ టన్నులు వచ్చిన యూరియా 71 వేల మెట్రిక్ టన్నులు అమ్ముడైన యూరియా 70 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్న స్టాక్ 1,000 మెట్రిక్ టన్నులు జిల్లాలో ఇప్పటి వరకు రైతులు కొనుగోలు చేసిన యూరియా 70 వేల మెట్రిక్ టన్నుల పంపిణీ గతేడాదితో పోలిస్తే 2 వేల మెట్రిక్ టన్నులు అదనం అయినా కొన్ని చోట్ల రైతుల బారులు చర్యలు చేపడుతున్న వ్యవసాయ శాఖ అవసరం ఉన్న రైతులే కొనాలి ఖరీఫ్లో సాగవుతున్న పంటలు దాదాపు చివరి దశకు చేరాయి. ఇంకా అక్కడక్కడ మాత్రమే యూరియా అవసరం ఉంటుంది. అవసరం ఉన్న రైతులే యూరియాను కొనాలి. కొరత లేకుండా జిల్లాలో ఎక్కడికి కావాలంటే అక్కడికి బస్తాలను పంపుతున్నాం. జిల్లాకు మరికొంత కోట రావాల్సి ఉంది. దీనిని రోజు వారీగా నెలాఖరు వరకు తెప్పిస్తాం. – మేకల గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి -
పరిమితులు లేకుండా పరిహారం అందించాలి
నిజామాబాద్నాగారం: వరద కారణంగా నష్టపోయిన వారికి పరిమితులు లేకుండా పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డి మోహన్రెడ్డి కోరారు. వరద వల్ల పంటలు నష్టపోయిన రైతులతో కలిసి మంగళవారం ఆయన కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ప్రాంతంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాధితులకు పరిహారం అందించని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్, బోధన్ రూరల్ మండల అధ్యక్షుడు సిర్ప సుదర్శన్, బోధన్ పట్టణ అధ్యక్షుడు గోపికిషన్, సాలూర మండల అధ్యక్షుడు గంగాధర్, బోధన్ రూరల్ మండల మాజీ అధ్యక్షుడు రాజు మనోహర్, బోధన్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. -
పెద్దమల్లారెడ్డిలో యువకుడి ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసు కున్నట్లు భిక్కనూరు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ఎల్క తిరుపతి (20) గత కొన్నేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. గతంలో అమ్మాయిలను వేధించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి అతడు డబ్బులు కావాలని తల్లి రామవ్వపై ఒత్తిడి చేశాడు. ఆమె డబ్బులు లేవని చెప్పడంతో, అతడు ఇంటికి వెళ్తున్నానని చెప్పి దూలానికి ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఉరి వేసుకున్న కొడుకును చూసి తల్లి రోదించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హెడ్కానిస్టెబుల్ అంజయ్య ఘటన స్థలానికి చేరు కుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసు కున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
‘ప్రజాపాలన’ వేడుకలకు ముస్తాబైన కలెక్టరేట్
నిజామాబాద్నాగారం: నగరంలోని కలెక్టరేట్ నేడు నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవానికి ముస్తాబైంది. ఏర్పాట్లను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉదయం 10.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. -
నిర్ణీత గడువులో దరఖాస్తులను పరిష్కరించాలి
● పరిశీలనలో జాప్యం చేయవద్దు ● అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశంబోధన్: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని, పరిశీలన ప్రక్రియలో జాప్యం చేయవద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సాలూర మండల తహసీల్దార్ ఆఫీస్ను మంగళవారం కలెక్టర్, సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల వివరాలను తహసీల్దార్ శశిభూషణ్ను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని కలెక్టర్ సూచించారు. సాదాబైనామా, పీఓటీలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి వెనువెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలన జరపాలన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిశీలిస్తూ అర్హులకు ఆమోదం తెలుపాలన్నారు. ఎస్ఐఆర్( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ కోసం ముందస్తుగానే అవసరమైన జాబితాను సిద్ధ చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎస్ఐఆర్ను పకడ్బందీగా నిర్వహించేలా సన్నద్ధమై ఉండాలని కలెక్టర్ అన్నారు. -
నగరంలో గుర్తుతెలియని వ్యక్తి..
ఖలీల్వాడి: నగరంలోని బస్డిపో–1 ప్రహరీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్హెచ్వో రఘుపతి మంగళవారం తెలిపారు. ఈనెల 14న ఉదయం సదరు వ్యక్తి అపస్మారకస్థితిలో ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అతడిని చికిత్స నిమ్తిం జీజీహెచ్కు తరలించారు. కానీ వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు వద్ద ఎలాంటి ఆధారలు లభించలేవని, అతడు బూడిద రంగు షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించాడని పోలీసులు తెలిపారు. మృతుడు భిక్షాటన చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నట్లు చెప్పారు. ఎవరికై నా అతడి వివరాలు తెలిస్తే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
ఆలయంలో చోరీ
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం శివారులోని గుట్టమీద గల శివభక్త మార్కండేయ ఆలయంలో చోరీ జరిగినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆలయంలోని హుండీని సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు ఆలయ ఆవరణలో పగులగొట్టి డబ్బులు దొంగిలించినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యుడు ఆశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే మండల కేంద్రంలో ఇంటి ముందర నిలిపిన బైక్ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు ఎస్సై తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జక్రాన్పల్లి: బైక్ చోరి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని గాంధీనగర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా, వారిని పట్టుకుని విచారించారు. వారి వద్దనున్న బైక్ను గత నెల 18న జక్రాన్పల్లి బస్టాండ్ వద్ద నుంచి చోరీ చేసినట్లు తెలిపారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టుకు ది గువన ఉన్న నాగమడుగు లోలెవల్ వంతెన వద్ద వర ద నీటిలో ఒకరు గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్ (30) మంగళవారం అచ్చంపేట గ్రామంలోని బంధువుల వద్దకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తుండగా నాగమడుగు వద్ద వరద నీరు ఉధృతంగా ఉండటంతో ఈత కొట్టాడు. దీంతో అతడు నీటమునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. వరద నీటిలో రాత్రి వరకు గాలించారు. అయినా అతడి ఆచూకీ లభించలేదు. నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం గ్రామంలో 600 గ్రాములు నిషేదిత అల్ప్రాజోలంను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నట్లు రూరల్ ఎస్హెచ్ మహ్మద్ ఆరీఫ్ మంగళవారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం రావడంతో గుండారం కల్లు బట్టిపై దాడి చేసి అల్ప్రాజోలంను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులైన అశోక్, రమేశ్ గౌడ్లపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మాచారెడ్డి: మండలంలోని ఘన్పూర్ శివారులో మంగళవారం ఓ భారీ ట్రక్కు టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో రోడ్డు కు ఇరువైపులా వాహనాలు గంటపాటు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న మాచారెడ్డి పోలీసులు పొక్లెయిన్ సహాయంతో ట్రక్ను తొలగించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. -
ఉద్యమాల పోరుగడ్డ ‘ఇందూరు’
మోర్తాడ్(బాల్కొండ): నిజాం రజాకార్ల గుర్రపు డెక్కల చప్పుళ్లకు వెరవని ధీరులు ఇందూరు ఉద్యమకారులు. 1947 ఆగష్టు 15న దేశమంతటా త్రివర్ణ పతాకం ఎగురవేయడానికి సన్నాహాలు జరుగుతుంటే నిజాం పాలనలో ఉన్న మనకు ఆ స్వేచ్ఛను రజాకార్లు హరించారు. మన సమరయోధులు మాత్రం రజాకార్ల ఆజ్ఞలను లెక్క చేయకుండా మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. ఫలి తంగా జైలు ఊచలు లెక్కించారు. అహింస– హింస మార్గాల్లో.. మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో మన ప్రాంతానికి చెందిన కౌలాస్ రాజు దిలోప్ సింగ్ చూపిన పోరాట పటిమ, ఝాన్సీ లక్ష్మిబాయ్ ప్రదర్శించిన తెగువతో తెలంగాణకు విముక్తి కోసం కొందరు సాయుధ పోరాటానికి నాంది పలుకగా, మరికొందరూ గాంధీ బాటలో సత్యాగ్రహం ద్వారా స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోశారు. ఇలా తెలంగాణ విముక్తి కోసం హింస, అహింస మార్గాల్లో వేరువేరుగా పయనించిన యోధులకు పుట్టినిల్లుగా ఇందూరు గడ్డ నిలుస్తోంది. పల్లెలపై దాడులు చేస్తు అమాయక ప్రజల ధన, మాన ప్రాణాలను హరిస్తున్న రజాకార్ల గుంపుపై మోర్తాడ్ జమీందార్ రుక్మారెడ్డి ఫిరంగులతో దాడికి పాల్పడ్డాడు. దీంతో నిజాం పాలకులు అతడిని ఇనుప సంకెళ్లతో బంధించి జైళ్లో ఉంచారు. అలాగే ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చౌట్పల్లి నారాయణరెడ్డి ఆర్య, చౌట్పల్లి శ్రీనివాస్రెడ్డి, పడిగెల హన్మాండ్లు, నారాయణ లింగారెడ్డి, నీలకంఠ నారాయణ, పడకల్ శ్రీనివాస్రెడ్డి, శంభులింగం, లక్ష్మాగౌడ్, బ్రహ్మయ్య, వెంకటస్వామి, బొంబాయి నర్సింహారెడ్డి, నర్సింహారావు, నరసింహాశాస్త్రి, కొండా నారాయణ, ఉప్పు లక్ష్మయ్య, హన్మంత్రెడ్డి, రంగారెడ్డిలు రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమానికి ప్రభావితులైనారు. నిజాం రజాకార్లపై తెగింపుతో ప్రతిదాడులు చేసిన జిల్లా ఉద్యమకారులు ఎందరో... నేడు నిజాంపాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన రోజు -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
● 12(టీ) బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ ● నగరంలోని గిరిరాజ్ కళాశాలలో ‘హైదరాబాద్ లిబరేషన్ డే’ ఫొటో ఎగ్జిబిషన్ నిజామాబాద్నాగారం: హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని 12(టీ) బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ అన్నా రు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆవరణలో మంగళవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ లిబరేషన్ డే’ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ప్రియాజిత్ సూర్ హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లిబరేషన్లో పోరాడిన నాయకులు చారిత్రక అంశాలను ఫొటో ఎగ్జిబిషన్లో పొందుపరిచారన్నారు. అనంత రం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మనాయక్ మాట్లాడుతూ.. ఈ ఎగ్జిబిషన్లో నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబా ద్ సంస్థానాన్ని విముక్తి చేసేందుకు పోరాడిన రామ్ జి గోండు, కుమురం భీమ్, చాకలి ఐలమ్మ, భాగ్యరెడ్డి వర్మ, తదితరుల ప్రముఖుల ఫొటోలను ఏర్పా టు చేశామన్నారు. బైరాన్పల్లి ఘటన, ఆపరేషన్ పో లో వంటి ప్రధాన ఘట్టాలను వివరించే ఫొటోలు కూడా ప్రదర్శనకు ఉంచామన్నారు. ఈ ఎగ్జిబిషన్ ఈనెల 18 వరకు కొ నసాగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు ని ర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రి న్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, డిస్ట్రిక్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి, పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి, ఎన్వైకే కోఆర్డినేటర్ శైలీ బెల్లాల్, ఆల్ ఇండియా రేడియో ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్ మోహన్దాస్ పాల్గొన్నారు. -
ఉద్యమకారుల నుంచి ప్రజాసేవకులుగా..
మోర్తాడ్(బాల్కొండ): తెలంగాణ విముక్తి ఉద్యమంలో పాలుపంచుకున్న ఉద్యమకారులు తరువాత రాజకీయాల్లో చేరి ఉన్నత పదవులను అలంకరించారు. మోర్తాడ్ మండలం సుంకెట్కు చెందిన నారాయణరెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్కు చెందిన అర్గుల్ రాజారాం బాల్కొండ నియోజకవర్గానికి నాలుగుమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో పాటు చేనేత, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రిగా విశిష్టమైన సేవలు అందించారు. చౌట్పల్లికి చెందిన హన్మంత్రెడ్డి జిల్లా పరిషత్ మొట్టమొదటి చైర్మన్గా ఎంపికై ప్రజాసేవలో కొనసాగారు. వీరితోపాటు అనేక మంది తమ సొంత గ్రామాలలో సర్పంచ్లుగా, సహకార సంఘాల చైర్మన్లుగా ఎంపికై ప్రజలకు విశేషమైన సేవలు అందించారు. -
కొనసాగుతున్న నీటి విడుదల
బాల్కొండ: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతుంది. 36 వరద గేట్ల ద్వారా 2లక్షల 32వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇన్ ఫ్లో తగ్గినా గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించలేదు. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా తగ్గింది. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 6500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4 వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కులు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు ) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి 1089.80(75. 7టీఎంసీలు ) అడుగుల నీరు నిల్వ ఉంది. రెంజల్(బోధన్): గోదావరి నదికి వరద పొటెత్తుతోంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన గల నదుల నుంచి వరద నీరు రావడంతో కందకుర్తి వద్ద వరద తాకిడి గంటగంటకు పెరుగుతుంది. దీంతో అంతర్రాష్ట్ర వంతెనకు ఆనుకుని వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కందకుర్తి వద్ద గోదావరిలోని పురాతన శివాలయం పూర్తిగా నీట మునిగింది. -
ఎస్ఐఆర్ పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్నిజామాబాద్ నాగారం: ఓటరు జాబితాలో భాగంగా చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నగరంలోని కలెక్టరేట్లో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లతో ఎస్ఐఆర్ అమలు ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలు అందిన మీదట ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, మెప్మా పీడీ రాజేందర్, డీడబ్ల్యూవో రసూల్బీ, డీఎంహెచ్వో రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు. -
సిరికొండ మండలంలో గత స్మృతులు
సిరికొండ: మండలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఛాయలు నేటికి కదలాడుతున్నాయి. 1946 నుంచి 1951 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మండలంలో విస్తృతంగా సాగినట్లు ఆనాటి పెద్ద మనుషులు చెబుతుంటారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అణభేరి ప్రభాకర్రావు నేతృత్వంలో అదే సిరిసిల్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అమృత్లాల్ శుక్లా, శివాయిపల్లెకు చెందిన బల్రాంలు ఇక్కడ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించారు. రజాకార్ల ఆకృత్యాలకు వేదికగా మారుతోందని హోన్నాజీపేట్ గడిపై వీరి ముఠా దాడి చేసింది. దాడితో గడి దొర ప్రతాప్రెడ్డి హైదరాబాద్కు పారిపోయాడు. ప్రభాకర్రావు బృందం మండలంలోని వివిధ గ్రామాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని భూస్వాముల చెరలో ఉన్న భూములను పేదలకు పంచిపెట్టారు. వీరి సారధ్యంలో ఉద్యమం నడుస్తుండగా రజాకార్లకు పన్నులు కట్టడం, పశువులు మేపుకున్నందుకు చెల్లించే పన్నులను చెల్లించడం మానివేశారు. అలాగే గడ్కోల్ గ్రామంలో దొరల వద్ద గుమాస్తాగా పని చేసే జంగం గంగన్నను ఉద్యమకారులు గ్రామ నడిబొడ్డున కాల్చి చంపారు. -
ప్లాస్టిక్ నిరోధానికి స్టీల్ బ్యాంకులు
● రెంజల్, తాడ్బిలోలి గ్రామాల్లో శ్రీకారం ● స్టీల్ ప్లేట్లను వినియోగిస్తున్న గ్రామస్తులురెంజల్(బోధన్): పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమేందుకు గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయి. శుభకార్యాలు, అన్నదానాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనాలు చేస్తుండడంతో అనారోగ్య సమస్యలు దరి చేరుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడాకాన్ని తగ్గించాలనే ఆలోచనతో రెంజల్ మండల కేంద్రంలో శివాజీ సేవా సమితి, తాడ్బిలోలి గ్రామంలో శ్రీరామాలయం కమిటీలు స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశాయి. ఈ రెండు గ్రామాల్లో జరిగే శుభకార్యాలు, పెళ్లిళ్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను తగ్గించే దిశగా కమిటీలు ముందుకెళ్తున్నాయి. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు స్టీల్ ప్లేట్లను వాడేలా కృషి చేస్తున్నాయి. భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం జిల్లాలో ప్లాస్టిక్ భూతం భయపెడుతోంది. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. 120 మైక్రాన్లలోపు కవర్లు, గ్లాసుల నిషేధం అమలుకు నోచడంలేదు. 2022 జూలై నుంచి ప్లాస్టిక్ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కానీ, వ్యాపారులు, ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. మరోవైపు ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. సూపర్ మార్కెట్లు, టిఫిన్ సెంటర్లు, కూరగాయల మార్కెట్లు, హోటల్స్, పానీపూరి, చిరు వ్యాపారులు, వైన్స్ల వద్ద పర్మిట్ రూంలు, స్వీట్ షాపులు, పండ్ల దుకాణాల తదితర వాటిల్లో తక్కువ మైక్రాన్ల కవర్లను వినియోగిస్తున్నారు. వాటిని వినియోగించే ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ కవర్లు విక్రయించే వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధించే అవకాశం ఉన్నా, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వాడకాన్ని నియంత్రించేందుకు శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో 300 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు తీసుకొచ్చాం. శుభకార్యాలకు ఉచితంగా అందిస్తున్నాం. స్టీల్ బ్యాంకు ప్లేట్లు, గ్లాసులు తీసుకున్న వారు చార్జీలు కాకుండా మరిన్ని స్టీల్ ప్లేట్లు అందించాలని సూచిస్తున్నాం. ఎవరినీ బలవంతం చేయడం లేదు. – లక్ష్మణ్గౌడ్, రెంజల్ శివాజీ సేవా సమితి ప్రతినిధిప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలను గుర్తించి ఇటీవల ఆలయ కమిటీ ద్వారా 800 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు తెప్పించాం. కేవలం ఆలయాల్లో నిర్వహించే అన్నదానాలకు ఉచితంగా అందిస్తున్నాం. – కార్ఖానా శ్రీనివాస్, శ్రీరామాలయం కమిటీ చైర్మన్, తాడ్బిలోలి -
ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
● ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ● కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడిసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవానికి విసృత్త ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. వేడుకకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ముఖ్య అతిథితోపాటు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. వేదిక, సీటింగ్ తదితర వాటిపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. 17న స్వస్థనారీ స్వశక్తి పరివార్ ప్రారంభం మహిళల ఆరోగ్యం పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వస్థనారీ స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మహిళల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో సాధారణ ఆరోగ్య శిబిరాలు, ప్రత్యేక నిపుణుల వైద్య శిబిరాలను జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 10 చోట్ల నిర్వహిస్తారని తెలిపారు. శిబిరాల్లో గైనకాలజీ, చర్మవ్యాధి, దంత, కంటి, మానసిక, పిల్లల వైద్య నిపుణులు పాల్గొని పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ, రక్తదాన శిబిరాలు ఉంటాయని తెలిపారు. డీఆర్డీవో, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించి ప్రత్యేక పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎంహెచ్వో రాజశ్రీ, డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ముదెల్లిలో సోమవారం విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన కౌలు రైతు కర్రోల్ల సాయిలు(52) మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సాయిలు అదే గ్రామానికి చెందిన ఒకరి పొలం కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం సాయిలు, భార్య లలిత కలుపు తీసేందుకు పొలానికి వెళ్లారు. పొలానికి నీళ్లు పారించేందుకు సాయిలు బోరు మోటారు స్టార్టరు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్లో రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని రైల్వే పోలీసులు కాపాడినట్లు ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. సాలూరా మండలంలోని హాజీపూర్కు చెందిన పవన్ (28) ఇంజినీరింగ్ పూర్తి చేసి నిజామాబాద్లో ఉంటున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్, మద్యానికి బానిస కావడంతో అప్పులయ్యాయి. అప్పుల బాధలు ఎక్కువ కావడంతో రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పారు. గాయపడిన పవన్ను రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నవీపేట: మండలంలోని యంచ సమీపంలో గోదావరిపై నిర్మిస్తున్న బ్రిడ్జికి వాడే ఐరన్ రాడ్లను ఎత్తుకెళ్లిన నిందితుడిని సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. అనూష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బ్రిడ్జికి వినియోగించే ఇనుప రాడ్లను యంచ సమీపంలో నిల్వ చేశారు. యంచ గ్రామానికి చెందిన పీరాజి వ్యాకంటి కొన్ని రోజులుగా ట్రాక్టర్లో ఇనుమును దొంగిలించాడని పేర్కొన్నారు. దాదాపు రెండు టన్నుల ఇనుప రాడ్లను దొంగిలించినట్లు తెలిపారు. ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి ఫిర్యాదు మేరకు ఈ నెల 10న కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. చోరీకి పాల్పడిన పీరాజి వ్యాకంటిని సోమవారం అరెస్టు చేసి, రెండు టన్నుల ఇనుప రాడ్లను రికవరీ చేశామని ఎస్సై తెలిపారు. చోరీకి ఉపయోగించిన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● ప్రజావాణికి 115 ఫిర్యాదులుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 115 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు వివరించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
అంగన్వాడీల ఆందోళన ఉద్రిక్తం
● పీసీసీ చీఫ్ ఇంటి ముట్టడికి యత్నం ● సీఐటీయూ నాయకుల ముందస్తు గృహనిర్బంధాలు ● ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీల నిరసననిజామాబాద్నాగారం: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలతోపాటు సీఐటీయూ నాయకులు సోమవారం నిర్వహించిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. చలో హైదరాబాద్కు వెళ్లనున్న అంగన్వాడీ టీచర్లు, నాయకులను ఉదయం పోలీసులు గృహనిర్భంధం చేశారు. పలువురిని పోలీసు స్టేషన్లకు తరలించి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇంటి ముట్టడికి అంగన్వాడీ కార్యకర్తలు యత్నించారు. సీఐటీయూ నాయకులు, అంగన్వాడీలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. కార్యకర్తలు, నాయకులను అరెస్టుచేసి స్టేషన్కు తరలించారు. అనంతరం మిగతా అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాచౌక్ వద్ద నిరసన తెలిపారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్బాబు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, శాంతియుతంగా చేపట్టే కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం, అక్రమ నిర్భందాలు చేయడం సరికాదని అన్నారు. సమస్యల పరిష్కారంపైన చూపాల్సిన శ్రద్ధ నాయకుల అరెస్టులపై పెట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రీ ప్రైమరీ కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు రూ. 18వేల వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమం చేపడతామన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు స్వర్ణ, చంద్రకళ, మంగాదేవి, వాణి, విజయ, లక్ష్మి, వసంత, సూర్యకళ, రాజ్యలక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి
● సీపీ సాయి చైతన్యసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఇంజినీర్లు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం ఇంజినీర్స్ డే నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ సాయిచైతన్య హాజరై మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విభాగంలో ఉమ్మడి ఏపీతోపాటు దేశానికి విశ్వేశ్వరయ్య చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం భారతరత్న ఇచ్చిందని గుర్తు చేశారు. యువత ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం కళాశాల టాపర్లకు గోల్డ్మెడల్, బిగాల కృష్ణమూర్తి ట్రస్ట్ నుంచి రూ.10వేల చెక్కు, సర్టిఫికెట్ను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భారతి, పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్, సహా అధ్యక్షుడు కేఎల్వీ రమణ, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, వినోద్, మోహన్ కుమార్, బాలచందర్, బాబా శ్రీనివాస్, వై గణేశ్, కళాశాల అధ్యాపకులు నాగరాజ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘తైక్వాండో’ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారుడు
మోపాల్: ఏషియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ తైక్వాండో చాంపియన్షిప్ పోటీల్లో బిగ్ ఫైటర్స్ తైక్వాండో హబ్ క్రీడాకారుడు కుమ్మరి మోక్షిత్ సత్తా చాటినట్లు మాస్టర్ నరహరి నాయక్ తెలిపారు. హైదరాబాద్లో సోమవారం చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరహరి నాయక్ మాట్లాడుతూ మోక్షిత్ అద్భుతమైన ప్రతిభ కనబర్చాడన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. మోక్షిత్ విజయం సాధించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు.వేల్పూర్: వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రా మాభివృద్ధి కమిటీని రద్దు చేసినట్లు వీడీసీ అధ్యక్షుడు గుమ్ముల కిషన్, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, క్యాషియర్ లింబాద్రి, సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీడీసీని రద్దు చేసినట్లు ఇన్చార్జి తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్సై సంజీవ్కు వినతిపత్రం అందజేశారు. ఇక నుంచి గ్రామంలో వీడీసీ ఉండదని వారు పేర్కొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు సోమవారం ముగియగా, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలలో మొత్తం 30 మందికి 28 మంది హాజరుకాగా ఇద్దరు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. తెయూ క్యాంపస్ కళాశాలలో జరిగిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 28 మందికి 26 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరైనట్లు ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్నాగారం: సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నీరడి లక్ష్మణ్ నియమితులయ్యారు. సోమవారం కౌన్సిల్ నేషనల్ చైర్మన్ కె విజయ్కుమార్ నియామకపత్రాన్ని అందజేశారు. జిల్లాలో హ్యుమన్ రైట్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. డ్రంకెన్డ్రైవ్ కేసులో రెండు రోజుల జైలు భిక్కనూరు: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి న్యాయమూర్తి చంద్రశేఖర్ రెండు రోజుల జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించినట్లు భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు సోమవారం తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రానికి చెందిన స్వామి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో స్వామిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రెండ్రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. -
దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
తోటలకు వెళ్లేందుకు దారి కోసం తమ భూమి ఇవ్వాలని కొందరు వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారని బాల్కొండ మండలం వన్నెల(బి) గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. తమ భూమిలో నుంచి ఇతర కులస్తులు దారి తీసుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించండి రెండు నెలల వేతనాలను చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. -
‘బోను ఏర్పాటు చేస్తాం’
మద్నూర్: చిరుత పులి జాడ కోసం గాలిస్తున్నామని, దానిని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేస్తా మని అటవీశాఖ రేంజ్ అధికారి సంతోష తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యలయానికి సో మవారం మద్నూర్ గ్రామస్తులు, రైతులు తరలి వచ్చి చిరుత పులిని పట్టుకోవాలని తహసీల్దార్ ము జీబ్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం తహసీల్ కార్యలయానికి వచ్చిన అటవీశాఖ అధికారులు రై తులతో సమావేశమయ్యారు. పులిని పట్టుకోవడాని కి డ్రోన్ కెమెరాలను, బోన్లను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా అ టవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి సుజాత, బీట్ అధికారి రాంచందర్, రైతులు బాల్కిషన్, రాములు, హన్మండ్లు, పరశురాం, అజయ్ తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో ఈనెల 19న మధ్యాహ్నం పంట ఉత్పత్తులను వేలం వేయనున్నట్లు క్షేత్రం ఏడీఏ ఇంద్రసేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తన క్షేత్రంలో విత్తనం కోసం ఉపయోగపడని కేఎన్ఎం–1638 సన్నరకానికి చెందిన 492 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విత్తన క్షేత్ర కార్యాలయంలో వీటిని వేలం వేయనున్నట్లు తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు రూ.2 వేల డిపాజిట్ చెల్లించాలని సూచించారు. వేలం తర్వాత నిర్ధారించిన సొమ్ములో సగం డబ్బులను రెండురోజులో చెల్లించాలని, మిగతా మొత్తాన్ని వారంలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలం పాటలో పాల్గొనాలని సూచించారు. -
మహిళా సంఘాల్లో నగదు రహిత లావాదేవీలు
నందిపేట్ (ఆర్మూర్): మహి ళా సంఘాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందు కు జిల్లాలో పైలట్ మండలంగా నందిపేట్ను ఎంపిక చేశా రు. సోమవారం మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘం ప్రతినిధులు, అసిస్టెంట్లకు ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెర్ప్ అధికారి వెంకట్ మాట్లాడుతూ.. వీవో అధ్యక్షులు, సిబ్బంది డిజిటల్ లా వాదేవీలపై చిన్న సంఘ సభ్యులందరికీ అవగాహన కల్పించాలన్నారు. గూగుల్ పే, ఫోన్ పే నుంచి రోజుకు రూ. లక్ష వరకు, చిన్న మొబైల్ నుంచి రోజుకు రూ. 5000 వరకు లావాదేవీలు చేసుకోవచ్చని వివరించారు. రేపటి నుంచి అన్ని గ్రామాలలో అన్ని సంఘాలకు సీసీలు, సీఆర్పీలు, వీవోఏలు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్డీవో మధుసూదన్, డీపీఎం సంధ్యారాణి, జిల్లా సమాఖ్య పాలకవర్గ సభ్యులు, ఏపీఎం ఖాందేశ్ గంగాధర్, బ్యాంకు అధికారులు, సీసీలు, సీఆర్పీలు, వీవోఏలు, వీవో ప్రతినిధులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎస్ఐఆర్
● పొరపాట్లు, తప్పిదాలకు తావుండొద్దు ● వీసీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)–2026 ప్రక్రియను అన్ని నియోజకవర్గాల పరిధిలో పకడ్బందీగా చేపట్టేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్రెడ్డి సూచించారు. కలెక్టర్, ఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియపై మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి ఆదేశాల వచ్చిన వెంటనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపట్టాలని, అందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బీహార్ రాష్ట్ర సాధారణ ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యిందని గుర్తు చేశారు. మన వద్ద సైతం ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. 2002 ఓటరు జాబితాతో 2025 జాబితాను సరిపోల్చుకోవాలని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ నిర్వహణపై సూపర్వైజర్లు, బీఎల్వోలకు శిక్షణ అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ టి వినయ్కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, కిరణ్మయి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. పక్కాగా పోషణ మాసం.. పిల్లల్లో పోషలోపాన్ని అధిగమించేందుకు పోషకాహారాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా, నిజాయితీగా పని చేయాలని కలెక్టర్ టి వినయ్కృష్ణారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న పోషణ మాసం కార్యక్రమాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణమాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు సూచనలు చేశారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసాన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. చిన్న పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి పరిష్కరించడమే పోషణ మాసం ముఖ్య ఉద్దేశమని అన్నారు. డీఆర్డీవో సాయాగౌడ్, డీడబ్ల్యూవో రసూల్ బీ, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, డీఈవో అశోక్, ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్జర్లు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులకు మళ్లీ పోటెత్తిన వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి రెండు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ● నిజాంసాగర్లోకి 38వేల క్యూసెక్కులుబాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం రాత్రి 7గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరద నీరు పోటెత్తింది. ఆదివారం నుంచి నిలకడగా లక్ష క్యూసెక్కులు వచ్చిన వరద సోమవారం సాయంత్రానికి లక్షా 33 వేల క్యూసెక్కులకు చేరుకుంది. రాత్రి ఇన్ఫ్లో లక్షా 51 వేల క్యూసెక్కులకు పెరగడంతో మొదట 26 వరద గేట్ల ద్వారా లక్షా 33 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మళ్లీ వరద పెరడగంతో రాత్రి 7 గంటలకు 36 వరద గేట్ల ద్వారా లక్షా 82 వేల క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 8 వేలు, కాకతీయ కాలువకు 4 వేలు, ఎస్కెప్ గేట్ల ద్వారా 5 వేలు, సరస్వతి కాలువకు 800, లక్ష్మికాలువకు 200, అలీసాగర్ లిప్టు ద్వారా 180, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 684 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం రాత్రి నిండుకుండలా ఉంది. నిజాంసాగర్ నుంచి నాలుగు గేట్ల ద్వారా.. నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 38,829 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 4 వరద గేట్ల ద్వారా 27,128 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నామన్నారు. ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా 1,404.72 అడుగుల(17.397 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు. ఎస్సారెస్పీ నుంచి విడుదలవుతున్న నీరు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి మంజీరలోకి.. -
స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉచాలి
నిజామాబాద్నాగారం: స్కానింగ్ కేంద్రాల పనితీరుపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను, సలహా సంఘ సభ్యులను జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి రాజశ్రీ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశాన్ని సోమ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. ప్రతి స్కానింగ్ కేంద్రాన్ని తప్పుకుండా మూడు నెలలకోసారి తనీఖీ చేయాలన్నారు. రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి రూ పొందించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో తాగునీరు, మూత్రశాలలు ఉండాలని, ధరల పట్టిక, ఐ ఈసీ, సమాచార సూచికలు, వేచి ఉండే గది అందుబాటులో ఉండాలన్నారు. అర్హత లేని వారు స్కానింగ్కు రిఫర్ చేయొద్దని, రేడియాలాజిస్ట్, గైనకాలజిస్ట్ లేకుండా స్కానింగ్ సెంటర్లను నిర్వ హించే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు. కొత్తగా రెండు స్కానింగ్ సెంటర్లకు అనుమతులివ్వడంతోపాటు నాలుగు సెంటర్లకు రెన్యువల్ చేసినట్లు తెలిపారు. ఆర్మూర్ డివిజన్లో ఓ స్కానింగ్ కేంద్రాన్ని మూసివేయాలని సభ్యులు తీర్మానం చేశారు. సమావేశంలో పీవో పీసీఎన్డీటీ డాక్టర్ సుప్రియ, పీవో ఎంసీహెచ్ డాక్టర్ శ్వేత, సభ్యులు పాల్గొన్నారు. మూడు నెలలకోసారి తనిఖీలు చేయాలి అర్హత లేకుండా స్కానింగ్కు రిఫర్ చేయొద్దు డీఎంహెచ్వో రాజశ్రీ -
దిశ సమావేశం 23కు వాయిదా
డొంకేశ్వర్(ఆర్మూర్): ఈ నెల 16న ఎంపీ ధర్మపురి అర్వింద్ అధ్యక్షతన జరగాల్సిన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం అనివార్య కారణాలతో 23వ తేదీకి వాయిదా పడినట్లు డీఆర్డీవో సాయాగౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దిశ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ఖలీల్వాడి: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 23 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ ఆఫ్ పోలీ స్ సాయిచైతన్య ఫిర్యాదుదారుల సమస్యల ను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల ని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమే యం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవ లను వినియోగించుకోవాలని తెలిపారు.వరల్డ్ బాక్సింగ్లో పతకాల పంట ● జిల్లాకు చెందిన కోచ్ ఎత్తేసామొద్దీన్ నేతృత్వంలో..నిజామాబాద్నాగారం: ప్రపచం బాక్సింగ్ చాంపియన్షిప్లో జిల్లాకు చెందిన కోచ్ ఎత్తేసామొద్దీన్ నేతృత్వంలో మన దేశానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణిలు జాస్మిన్, మీనాక్షి ఉదాలు బంగారు పతకాలు సాధించారు. నుపుర్ షియోరాన్ (రజతం), పూజారాణి (కాంస్య) పతకాలు సాధించారు. ఇంగ్లాడ్లో ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన వరల్డ్ బాక్సింగ్ టోర్నమెంట్లో మొత్తం నాలుగు పతకాలుసాధించా రు. భారత బాక్సింగ్ జట్టుకు కోచ్గా జిల్లా కు ఎత్తేసామొద్దీన్ వ్యవహరించడంతో జిల్లా కు చెందిన క్రీడాకారులు, క్రీడాభిమానులు ఆనందనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన బాక్సింగ్ క్రీడాకారులు, జాతీయస్థాయి అథ్లెట్, గోల్డ్ మెడలిస్టు సయ్యద్ ఖైసర్ ఎత్తేసామొద్దీన్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
లేబర్ రేట్లు పెంచాలని పనుల నిలిపివేత
సుభాష్నగర్: లేబర్ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అన్ని పనులను మంగళవారం నుంచి నిలిపేస్తున్నామని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె వెంకట్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్కు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు పవర్హౌస్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. 2021లో ఉన్న లేబర్ రేట్లకు, ప్రస్తుతమున్న రేట్లకు వ్యత్యాసం ఉందని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ఈవిషయాన్ని పలుమార్లు సీఎండీ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు మంగళవారం నుంచి పనులు ఆపేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పరిస్థితిని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సమ్మెకు సహకరించి న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రవి యాదవ్, సంతోష్, భాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బాధిత రైతులకు ఊరట
● పొలాల్లో ఇసుక మేటలు తొలగిస్తున్న ఉపాధి కూలీలుడొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఇటీవల కురిసిన భా రీ వర్షాల కారణంగా పంటపొలాల్లో వేసిన మట్టి, ఇసుక మేటల తొలగింపు సోమవారం నుంచి మొదలైంది. ఎస్టిమేషన్లు వేసిన అధికారులు ఉపాధి కూ లీల ద్వారా తొలగిస్తున్నారు. ఖర్చు లేకుండా ప్రభుత్వమే చర్యలు చేపట్టడంతో బాధిత రైతులకు కొంత ఊరట లభిస్తోంది. జిల్లాలో మొత్తం 270 ఎకరా ల పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వర్ని, వేల్పూర్, ఇందల్వాయి, ధర్పల్లి, భీ మ్గల్, సిరికొండ మండలాలు కలిపి 389 మంది రైతులు బాధితులుగా ఉన్నారు. వరికి ఎక్కువగా నష్టం వాటిల్లగా, జరిగిన నష్టం నుంచి కోలుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పొలాల్లో వేసిన ఇసుక, మట్టిని ఉపాధి కూలీల సహాయంతో తొలగింపజేస్తోంది. ఇటు ఉపాధి కూ లీలకు కూడా పని లభిస్తోంది. వా రం, పది రోజుల్లోగా పొలాల్లోని ఇసుక, మట్టి మేటలను తొలగించాలని సిబ్బందికి ఆదేశాలిచ్చామని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ తెలిపారు. -
హిందువులను స్వయంసేవకులుగా చేయడమే లక్ష్యం
సుభాష్నగర్: ప్రతీ హిందువును స్వయంసేవక్గా తయారు చేయడమే శతాబ్ది ఉత్సవాల లక్ష్యమని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ్ చాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం అన్నారు. ఇందుకోసం రానున్న విజయదశమి నుంచి ఏడాది పాటు వివిధ కార్యక్రమాలను రూ పొందించినట్లు తెలిపారు. నగరంలోని న్యూ హౌసింగ్బోర్డ్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఆర్ఎస్ఎస్ కంఠేశ్వర్, నాందేవ్వాడ ఉప నగరాల ఆధ్వర్యంలో గణవేశ్ధారి స్వయంసేవకుల సంఘీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుచరణం ముఖ్య వక్త గా విచ్చేసి, మాట్లాడారు. సామాజిక సమరసత, ప్రకృతి పరిరక్షణ, కుటుంబ వ్యవస్థ సంరక్షణ ఆధారంగా బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించడం కోసమే సంఘం పని చేస్తుందన్నారు. అంతకు ముందు హౌసింగ్ బోర్డ్ కాలనీలో పథ సంచలన్ నిర్వహించారు. నగర కార్యవాహ అర్గుల సత్యం, ఉపనగర కార్యవాహలు మధుకర్, ప్రవీణ్ తదితరులు పా ల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వివాహిత..
లింగంపేట(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని అయ్యపల్లితండాకు చెందిన దేవసోత్ సుజిత(20) అత్తింటివారి వేధింపులు భరించలేక ఆగస్టు 10 గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. ఖలీల్వాడి: నిజామాబా ద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియ ని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. నగరంలోని న్యాల్కల్ రోడ్లోగల కల్లు బట్టి సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి స్పృహ లేని స్థితిలో గుర్తించారు. వెంటనే సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యా హ్నం మృతిచెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు లేత ఆరెంజ్ రంగు, కలర్ ఫుల్ షర్ట్, ముదురు నీలి రంగు ప్యాంటు ధరించినట్లు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 65 ఏళ్ల వరకు ఉంటాయని, న్యాల్కల్ రోడ్లో భిక్షాటన చేసేవాడని అన్నారు. అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఎవరికై నా సమాచారం తెలిస్తే ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు. నవీపేట: నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియ ని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. నవీపేట ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇ లా.. నవీపేట శివారులో ని అయ్యప్ప ఆలయ సమీపంలో ఈనెల 12న గుర్తుతెలియని ఓ వ్యక్తి అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 36ఏళ్లు ఉంటాయని ఎస్సై అన్నారు. -
మురికి కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యం
బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని శివసాయి కాలనీలోగల మురికి కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. సదరు మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి ప్యాంట్ జేబులో దొరికిన ఆధార్ కార్డులో నిర్మల్ లక్ష్మణ్ పేరు ఉందన్నారు. వయస్సు 42, చిరునామా బ్రాహ్మణపల్లి, ఎడపల్లి మండలం అని ఉందన్నారు. మృతుడు బ్లాక్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ధరించినాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని సీఐ తెలిపారు. ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని అడవిలింగాల్ గేట్ వద్ద ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిపై ఆదివారం లారీ అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొని బురదలో కూరుకుపోయింది. లారీ ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్అండ్బీ డీఈ నారాయణ, ఏఈ ఐశ్వర్యలు స్పందించి బ్రిడ్జిపై దిగబడిపోయిన లారీని క్రేన్ల సహాయంతో తొలగించారు. నారింజపండ్ల లారీ బోల్తా ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్పల్లి శివారులో నారింజ పండ్ల లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నారింజ పండ్ల లోడ్ తో ఉన్న లారీ ఆదివారం హైదరాబాద్ నుంచి నాగ్పూర్వైపు జాతీయ రహదారిపై వెళ్తోంది. మండలంలోని చంద్రాయన్పల్లి శివారులో ప్రమాదవశాత్తు లారీ అదుపుతప్పి బోల్తాపడి సర్వీస్రోడ్డుపై పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. లారీలోని పండ్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. మట్కా ఆడుతున్న ముగ్గురు అరెస్టు ఆర్మూర్టౌన్: పట్టణంలో మట్కా ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మట్కా స్థావరంపై దాడిచేసి గుజరాతి గోవర్ధన్, వొడుల మోహన్, మహ్మద్ రహీముద్దీన్ను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ. 15వేల నగదు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారయిన మట్కా నిర్వాహకుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మోపాల్: మండలంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల ఎల్లయ్యపై అకారణంగా దాడిచేసిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై సుష్మిత ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. ఎల్లయ్య టిప్పర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదేక్రమంలో ఆదివారం సాయంత్రం గేదెలు అడ్డుగా ఉన్నాయని టిప్పర్ను రోడ్డు పక్కన నిలిపాడు. వెనకాల బైక్లపై వస్తున్న నిజామాబాద్కు చెందిన యువకులు టిప్పర్ను ఎందుకు నిలిపావంటూ ఎల్లయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దాడికి పాల్పడ్డారు. ఆరు ద్విచక్ర వాహనాలపై పది మంది యువకులు వచ్చి దాడిచేశారని ఎల్లయ్య ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు అటవీ ప్రాంతంలో చిరుత దా డిచేసి రెండు లేగ దూడలను హతమార్చినట్లు బాధితుడు దూప్సింగ్ తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఆవుల మందను మేతకు అడవికి తీసుకెళ్లగా సాయంత్రం రెండు లేగదూడలు కనిపించలేదని తెలిపారు. లేగదూడల కోసం మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో గాలించగా ఆదివారం కుళ్లిపోయిన లేగదూడల కళేబరాలు కనిపించినట్లు బాధితుడు తెలిపాడు. చిరుత దాడిలోనే లేగదూడలు మృతి చెందాయని, అటవీశాఖ అధికారులు నష్టపరిహారం అందజేయాలని కోరారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఇందల్వాయి/ఖలీల్వాడి: ఇందల్వాయి–సిర్నాపల్లి రైల్వే లైనును ఓ వ్యక్తి దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి మండలం గన్నా రం గ్రామానికి చెందిన బద్దం రవీందర్ రెడ్డి (46) ఆదివారం ఉదయం తన పొలం వద్దకు బయలుదేరాడు. ఈక్రమంలో ఇందల్వాయి–సిర్నాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలను అతడు దాటుతుండ గా గుర్తు తెలియని రైలు ఢీకొని మృతి చెందాడు. స మాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోచారం ప్రాజెక్టు నీటిలో పడి యువకుడు.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పోచారం ప్రాజెక్టు నీటిలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా.. మెదక్ పట్టణానికి చెందిన షేక్ మహబూబ్(20)అనే యువకుడు ఆదివారం తన స్నేహితుల తో కలిసి మండలంలోని పోచారం ప్రాజెక్టుకు వ చ్చాడు. ప్రాజెక్టు అలుగు పైనుంచి వెళ్తుండగా, కా లు జారి నీటి ప్రవాహంలో పడిపోయాడు. నీటము నిగి ఊపిరాడక మృతిచెందినట్లు తెలిసింది. మృతుడి అన్న షేక్ వాజీద్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. -
షార్ట్సర్క్యూట్తో రెండు ఇళ్లు దగ్ధం
ధర్పల్లి: మండల కేంద్రంలోని గోసంగి కాలనీలో షార్ట్ సర్క్యూట్తో రెండు ఇళ్లు దగ్ధమైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా.. గోసంగి కాలనీలో సల్ల భాగ్య, తురపాటి సాయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి పాత సా మాన్ల కొనుగోలు వ్యాపారం చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో వారు ఎప్పటిలాగానే ఆదివారం ఉదయం బయటకు వెళ్లారు. మధ్యాహ్నం సల్ల భాగ్య ఇంట్లో విద్యుత్ తీగలు కాలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం పక్కన ఉన్న తూరపాటి సాయమ్మ ఇంట్లోకి మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి మంటలను ఆర్పి వేశారు. కానీ అప్పటికే రెండు ఇళ్లలోని సామాన్లు పూర్తిగా కాలి బూ డిదయ్యాయి. సల్ల భాగ్య ఇంట్లో తులం బంగారం, వెండి ఆభరణాలు, రూ.3లక్షల నగదు కాలిపోగా, తూరపాటి సాయమ్మ ఇంట్లో కొంత నగదుతోపాటు వంట సామగ్రి, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కాలి పోయాయి. సుమారు రెండు ఇళ్లల్లో కలిపి సుమారు రూ. 5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధి తులు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్ బాధిత కుటుంబాలను పరామర్శించి వంట సామగ్రి, దుస్తులను అందజేశారు. -
కరెంట్షాక్తో నెమలి మృతి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కృష్ణాజివాడి గ్రామ శివారు లో కరంట్ వైర్లకు నెమలి తగిలి షాక్తో మృతిచెందినట్లు గ్రా మస్తులు తెలిపారు. గ్రామంలో శనివారం రాత్రి అకస్మాత్తుగా కరంటు సరఫరా నిలిచిపోవడంతో ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది వచ్చి స్తంభాలను, వైర్లను పరిశీలించారు. సమస్యను గుర్తించకపోవడంతో వేరే లైన్కు కనెక్షన్ ఇచ్చారు. తిరిగి ఆదివారం అధికారులు గ్రామశివారులో గల విద్యుత్ స్తంభాలు, వైర్లను పరిశీలించారు. శివారులోని వైర్లపై నెమలి పడి చనిపోయినట్లు కనిపించిందన్నారు. దీంతో వైర్లపై మృతి చెంది ఉన్న నెమిలిని కిందికి తీసి యథావిధిగా కరంటు కనెక్షన్ ఇచ్చారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
మోపాల్/ఖలీల్వాడీ: నగరశివారులోని బోర్గాం(పి) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల 1991–92 బ్యా చ్ విద్యార్థులు, గురువులు ఆదివారం కిసాన్ ము న్నూరు కాపు కల్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 33 ఏళ్ల తర్వాత విద్యార్థులందరూ ఒకే వేదికపై కలుసుకోవడంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నే ర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. పూర్వ విద్యార్థి, సినీ రచయిత బండోజి సతీష్ తన వ్యాఖ్యానంతో ఆకట్టుకుంటూ గు రుశిస్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆహ్లాదపరిచాడు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. యోగా గురువుకు సన్మానం రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన యోగా గురువు డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం సన్మానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశేష సేవలందించిన వారిని సికింద్రాబాద్లో ఘనంగా సత్కరించారు. ఇటీవల యోగా ఆంధ్రాలో భాగంగా రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సెమినార్కు విశ్వనాథ్ మహాజన్ హాజరై యోగా ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో భారత స్వాభిమాన్ ట్రస్ట్ పతంజలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రావ్ పాల్గొన్నారు. -
తల్లిని చంపిన కొడుకు అరెస్టు
బాన్సువాడ: తల్లిని సాకలేక మంజీర నదిలో తోసేసిన కొడుకును అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బోర్లం గ్రామానికి చెందిన సాయవ్వ(75)కు కొడుకు బాలయ్య ఉన్నాడు. వృద్ధురాలైన సాయవ్వ గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురయింది. ఆమెకు సేవలు చేయడానికి ఇంట్లో ఎవరూ లేరు. దీంతో కొడుకు బాలయ్య ఆమెను సాకలేక ఈనెల 8న ఓ మైనర్తో కలిసి సాయవ్వను బైక్పై ఎక్కించుకొని బోలక్పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి బ్రిడ్జి పైనుంచి నదిలోకి తోసివేశాడు. ఈ 11న సాయవ్వ మృతదేహం నదిలో తేలడంతో ఈనెల 12న బోర్లం గ్రామ పెద్దలు బాలయ్య వద్ద ఉన్న మైనర్ను పట్టుకొని ప్రశ్నించారు. అతడు సాయవ్వను కొడుకే నదిలో పడేశాడని తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కొడుకు కోసం గాలింపు చేపట్టారు. ఈనెల 14న నిందితుడు ఎర్రోళ్ల బాలయ్యతోపాటు మైనర్ కలిసి బోర్లం నుంచి వస్తుండగా కొయ్యగుట్ట చౌరస్తా వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. వారి వద్ద ఉన్న బైక్ను, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలయ్యను రిమాండ్కు తరలించామని, మైనర్ను జువైనల్ అబ్జర్వేషన్ హోంకు తరలించామని అన్నారు. -
అంగన్వాడీల ఆందోళన బాట
నిజామాబాద్నాగారం: సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఉద్యమబాట పట్టాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల బాగోగులను అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చూసుకుంటున్నారు. నిత్యం వారికి పాలు, గుడ్లు, పౌష్టికాహారంతోపాటు ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నారు. ఇవే కాకుండా శ్రీమంతాలు, అక్షరాభ్యాసం తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేదని, పనిభారం పెరుగుతోందని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ.18వేల వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసి, ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఖాళీలను భర్తీ చేయాలని, మూడు నెలల పీఆర్సీ, సమ్మె కాలపు వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్ల సాధనకు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా సోమవారం మంత్రుల ఇళ్లను ముట్టడించి ధర్నా చేపట్టనున్నారు. అయినా స్పందించక పోతే 25న చలో సెక్రటేరియట్, అక్టోబర్ 8న జిల్లా కేంద్రాల్లో 5కి.మీల పాదయాత్ర, 17వ తేదీ నుంచి ఆన్లైన్ సమ్మె చేపట్టాలని నిర్ణయించారు.జిల్లాలో సీడీపీవో ప్రాజెక్టులు 5 మొత్తం అంగన్వాడీలు 1501 బాలింతలు 61,200 గర్భిణులు 9821 చిన్నారులు 81,262 టీచర్లు 1427 ఆయాలు 901 నేడు మంత్రుల ఇళ్ల ఎదుట ధర్నాలు 25న చలో సెక్రటేరియట్ అక్టోబర్ 8న జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర 17 నుంచి ఆన్లైన్ సమ్మెకు పిలుపుఏళ్ల తరబడిగా సమస్యలు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. పనిభారం పెరిగిపోతుంది. జీతాలు తక్కువగానే ఉన్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ఉద్యమిస్తున్నాం. – పి స్వర్ణ, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిమేము న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాల ఎదుట ఉంచాం. గత ప్రభుత్వాలు నమ్మించి మోసం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమస్యలు పరిష్కరించాల్సిందే. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఆందోళన చేస్తాం. – కై రి దేవగంగు, జిల్లా అధ్యక్షురాలు -
పద్మశాలి వసతిగృహం అధ్యక్షుడిగా యాదగిరి
నిజామాబాద్ నాగారం: నగరంలోని కోటగల్లి పద్మశాలి వసతిగృహం అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి గెలుపొందారు. ఆయన ప్యానెల్లోని 11 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఓటర్లు పాల్గొన్నారు. నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్లో 85 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 894 ఓట్లకు 757 ఓట్లు పోలయ్యాయి. 11 పదవులకు 34 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. దీకొండ యాదగిరి, ఎస్ఆర్ సత్యపాల్, కొండి రమేశ్ ప్యానెళ్లు బరిలో నిలిచాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా రాత్రి వరకు కొనసాగింది. యాదగిరికి 441 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి సత్యపాల్కు 236 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారిగా న్యాయవాది రేగొండ గంగాప్రసాద్, అసిస్టెంట్ ఎన్నికల అధికారులుగా పగిడిమారి యాదగిరి, కర్లం రాములు వ్యవహరించారు. ఎన్నికలకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నూతన కార్యవర్గం ఇదే.. అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి గంట్యాల వెంకటనర్సయ్య, కోశాధికారిగా కన్న రాజు, ఉపాధ్యక్షులుగా గుజ్జేటి వెంకటనర్సయ్య, ఎనగందుల మురళి, నూకల విజయసారథి, సహాయ కార్యదర్శి బొమ్మెర తులసీప్రసాద్, లక్కపత్రి దేవిదాస్, గాలిపల్లి వెంకటేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కై రంకొండ మురళి, కల్చరల్ సెక్రెటరీగా తన్నీరు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. -
అద్భుతం అలీసాగర్
● తొమ్మిది దశాబ్దాల క్రితం నిర్మాణం ● నిజాం కాలంలో రూపకల్పన చేసిన సీఈ నవాబ్ అలీ ● జిల్లా కేంద్రానికి తాగునీటి సరఫరానేడు ఇంజినీరింగ్స్ డేబోధన్: నిజాం ఏడో రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన నాటి చీఫ్ ఇంజినీర్ అలీ నవాజ్ జంగ్ ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులో ఎత్తైన గుట్టల మధ్య అలీసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి డిజైన్ చేశారు. 93 ఏళ్ల క్రితం (1932లో) దీనిని నిర్మించగా ఆయన పేరు మీదుగానే అలీసాగర్ రిజర్వాయర్గా నామకరణం చేశారు. నవాబ్ అలీ ఇంజినీరింగ్ నైపుణ్యాలు, దార్శనికతతో రూపుదిద్దుకున్న రిజర్వాయర్తో బహుళ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. రిజర్వాయర్ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు డి–46 కాలువ ద్వారా ఎడపల్లి, బోధన్, రెంజల్ మండలల పరిధిలో 1500 ఎకరాలకు సాగు నీరందుతోంది. నిజామాబాద్ నగర ప్రజల తాగు అవసరాలకు ఈ రిజర్వాయర్ నుంచి రోజూ నీరు సరఫరా అవుతోంది. రిజర్వాయర్ పక్కనే ఉన్న అలీసాగర్ ఉద్యానవనం జిల్లాలో ప్రముఖ్య పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. రిజర్వాయర్లో పర్యాటకులకు బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. -
తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
వేల్పూర్: ఎంపీ అర్వింద్ తప్పుడు ఆరోపణలు చే స్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మానుకోవాలని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మా నాల మోహన్రెడ్డి హితవు పలికారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద డీసీసీ బీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డితో కలిసి ఆదివారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. పోలీసులు ఒక వ ర్గానికే మద్దతుగా ఉంటున్నారని, దానికి కాంగ్రె స్ నాయకులు వత్తాసు పలుకుతున్నారని ఎంపీ అ ర్వింద్ చేసిన ఆరోపణలు కేవలం ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని చేసినవేనని మండిపడ్డారు. యూరి యా సరఫరా వైఫల్యానికి కారణంగా కాంగ్రెస్ అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. కేంద్రం పంపిన యూరియా ను కాంగ్రెస్ ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ చేస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా ను కేంద్రం సక్రమంగా ఇవ్వకపోవడం వల్లనే కొర త ఏర్పడుతోందన్న విషయం రైతులు గుర్తించాలని కోరారు. యూరియ కోసం సీఎం, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి యూరియా కొరతపై కేంద్రానికి విన్నవిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం కావాలనే మన రాష్ట్రానికి కోత విధించిందన్నారు. వేల్పూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి పాల్గొన్నారు. అర్వింద్ రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలి యూరియా కొరత పాపం బీజేపీదే రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి -
చెదరని చరిత్ర
● ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీక ఎస్సారెస్పీ నిజాంసాగర్ ప్రాజెక్టు డొంకేశ్వర్(ఆర్మూర్)/ఇందల్వాయి : ఇంజినీర్లే లేని కాలంలో నిర్మించిన భవనాలు, ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కేవలం రాళ్లు, డంగు సునాన్ని మాత్రమే ఉపయోగించడం ప్రత్యేకత. 200 ఏళ్ల నాటి రామలింగేశ్వరాలయం కుస్తాపురం రామ లింగేశ్వర ఆలయాన్ని రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. గుడిని పూర్తిగా రాతితో నిర్మించారు. 1965 సమయంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు కట్టడంతో కుస్తాపురం గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆలయం కొన్నేళ్లుగా బ్యాక్ వాటర్ ముంపులోనే ఉంటోంది. రెండు సార్లు తేలినా గుడి చెక్కు చెదరకుండా ఉంది. సిర్నాపల్లిలో గడి..సిర్నాపల్లి సంస్థానాధీశురాలు జానకీబాయి అధికారిక భవనాన్ని(గడి) 1870వ దశకంలో అ ద్భుతంగా నిర్మించారు. ఇటుక, మట్టి గోడలు, డంగు సున్నంతో చేపట్టిన నిర్మాణం 150 ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరలేదు. గడి ఎండాకాలంలో చల్లగా, శీతాకాలం వెచ్చగా ఉంటుంది. మూడంచెల తూముఇందల్వాయి: అద్భుతమైన ఇంజినీరింగ్కు సిర్నాపల్లి జానకీబాయి చెరువుతూము అద్దం పడుతోంది. మూడు అంచెలుగా నిర్మించిన తూము ద్వారా కింది ప్రాంతంలో ఉన్న చెరువులకు నీటిని వదులుతారు. చెరువులో నీటి మ ట్టాన్ని బట్టి ఒక్కో తూమును తెరుస్తారు. కేవ లం బండ రాళ్లతో నిర్మించిన తూము ఇప్పటికీ చెక్కు చెదరలేదు. చెరువులో చివరి నీటి బొట్టు వరకు ఉపయోగించే విధంగా తూమును నిర్మించారు. నాటి ఇంజినీర్ల నైపుణ్యం, అంకితభావానికి ల్యాండ్ మార్క్గా నిలుస్తున్నాయి ఉమ్మడి జిల్లాలోని కట్టడాలు. రాళ్లు, డంగు సున్నంతో నిర్మించిన ప్రాజెక్టులు భారీ వరదలను తట్టుకుని చరిత్రలో నిలిచి ఉన్నాయి. నిజాం పాలనలో నాటి చీఫ్ ఇంజినీర్ నవాబ్ అలీ జంగ్ ఉమ్మడి జిల్లాలో రూపకల్పన చేసిన నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులతోపాటు అలీసాగర్ రిజర్వాయర్లు ఆయకట్టుకు జీవం పోస్తున్నాయి. చెరువులో ఏ స్థాయిలో నీరున్నా ఆయకట్టుకు నీరందించేలా శీలం జానకీబాయి సిర్నాపల్లి చెరువులో నిర్మింపజేసిన మూడంచెల తూము ‘ఔరా’ అనిపిస్తోంది. ఇలా ఉమ్మడి జిల్లాలో అనేక కట్టడాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇంజినీర్స్డే సందర్భంగా ‘సాక్షి’ కథనం.. ఇరవైఏళ్ల ఇంజినీర్ల శ్రమ బాల్కొండ: ఉత్తర తెలంగాణ కల్పతరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నాటి ఇంజినీర్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. 1963 జూలైలో పనులు ప్రారంభం కాగా 1983లో పూర్తయ్యింది. ఇరవై సంవత్సరాలపాటు ఇంజినీర్ల చేసిన కృషి 62 ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరకుండా నిలబడింది. మిగులు జ లాలను గోదావరిలోకి విడుదల చేసేందుకు నిర్మించిన 42 వరద గేట్లు ఎస్సారెస్పీకే ప్రత్యేక ఆకర్షణ. 18 లక్షల ఎకరాలకు సాగునీరు, 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి, చేపల పెంపకం లక్ష్యాలుగా.. 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1091 అడుగుల నీటిమట్టంతో 175చదరపు మైళ్ల విస్తీర్ణంలో నిర్మించారు. వరద తాకిడిని తట్టుకునే సువిశాలమైన బండరాయి ప్రాంతాన్ని ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంచుకున్నారు. 16 లక్షల క్యూసెక్కుల వ రద నీటిని తట్టుకునేలా ఆనాటి ఇంజినీర్లు డిజైన్ చేసి 50 అడుగుల వెడల్పు, 33 అడుగుల ఎత్తుతో మొత్తం 42 వరద గేట్లను ని ర్మించారు. పూడిక పోయేలా ఆరు రివర్స్ స్లూయిస్ గేట్లు నిర్మించారు. డంగు సున్నం, బండ రాళ్లు.. ఎస్సారెస్పీ నిర్మాణంలో అధికంగా డంగు సున్నం, బండరాళ్లను వినియోగించినట్లు ఇంజినీర్లు తెలుపుతున్నారు. కుడి, ఎడమల 14 కిలోమీటర్ల మేర ఆ నకట్ట నిర్మించారు. ఆనకట్టకు రివిట్ మెంట్ నిర్మా ణం కోసం పెద్దపెద్ద రాళ్లను వినియోగించారు. ఉమ్మడి జిల్లాలో భారీ ప్రాజెక్టులు రాళ్లు, డంగు సున్నంతో నిర్మాణం భారీ వరదలను తట్టుకుని నిలబడుతున్న కట్టడాలు గడీలు, ఆలయాలు ఎన్నో అద్భుత కట్టడాలు నేడు ఇంజినీర్స్ డే రాతి కట్టడాలు.. -
మంజీరపై రాతి వంతెన
బోధన్: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో సాలూ ర శివారులో మంజీర నదిపై 90 ఏళ్ల క్రితం నిజాం పాలనలో నిర్మించిన లో లెవల్ రాతి వంతెన చెక్కు చెదరలేదు. నిజాంపాలనలో (1935–36) నిర్మించి న ఈ వంతెన నాటి ఇంజినీర్ల నైపుణ్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది. వంతెనను పూర్తిగా రాయి, సున్నం డంగుతో పటిష్టంగా నిర్మించారు. రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం కోసం నిర్మించిన వంతెన మంజీరాకు భారీ వరదలు వచ్చినా తట్టుకుని నిలబడింది. 1985–86లో రాతి వంతెనకు దిగువన మ హారాష్ట్ర–ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్మించిన హైలెవల్ వంతెన ఐదేళ్ల క్రితం పూర్తిగా దెబ్బతిన్నది. కానీ రాతి లోలెవల్ వంతెన ఇప్పటికీ చెక్కుచెదరకుండా చరిత్రకు సాక్షిగా నిలుస్తోంది. ● రాష్ట్ర సరిహద్దులో నిర్మాణం ● నాటి ఇంజినీర్ల నైపుణ్యానికి సజీవ సాక్ష్యం -
వరదపోటును తట్టుకున్న పోచారం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దుల్లో నాగిరెడ్డిపేట మండలం పోచారం శివారులో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1917లో పోచారం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1922లో నిర్మాణం పూర్తయ్యింది. అప్పట్లో రూ. 27.11 లక్షల వ్యయంతో ప్రాజెక్టు నిర్మించారు. ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 21 అడుగుల ఎత్తు, 1.7 కిలోమీటర్ల పొడవు తో ఆనకట్టను నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంలో రాళ్లు, డంగు సున్నం మాత్రమే వినియోగించారు. మొదట 3.4 టీఎంసిల నీటినిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించాలని తలచినప్పటికీ ప్రతికూల పరిస్థితుల కారణంగా 2.423 టీఎంసీలకు పరిమితం చేశారు. 70 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునే శక్తి ఉన్న పోచారం ప్రాజెక్టులోకి గత నెల 27, 28 తేదీల్లో ఎవరూ ఊహించని రీతిలో 1.82 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అయినా ప్రాజెక్టు స్ట్రక్చర్ బలంగా ఉండడంతో దెబ్బతినలేదు. -
గ్రావిటీతో నీటి సరఫరా..
నిజామాబాద్ సిటీ: పంపింగ్ వ్యవస్థతో పనిలే కుండా మంచిప్ప చెరువు నుంచి గ్రావిటీ ద్వారా 1892లోనే నీటిని సరఫరా చేశారు నాటి ఇంజినీర్లు. నిజాం కాలం నాటి ఇంజినీర్ల అద్భుత ప్ర తిభకు నిదర్శనం మంచిప్ప లార్జ్ ట్యాంక్. మంచిప్ప చెరువునీటితో ఇందూరువాసుల దాహార్తిని తీర్చేందుకు నాటి నిజాం నవాబు కృషి చేశారు. 1892 ప్రాంతంలో మంచిప్ప చెరువు నుంచి నీటిని ఎలాంటి పంపింగ్ వ్యవస్థ లేకుండా కేవలం గ్రావిటీద్వారా నీటిని కంజర–కులాస్పూర్ వరకు తీసుకువచ్చారు. కులాస్పూర్ వద్ద ఫిల్డర్ బెడ్లో నీటిని శుద్ధి చేసి పైపుల ద్వారా నిజామాబాద్ నగరంలోని పెద్ద బజార్లో నిర్మించిన వాటర్ట్యాంక్లోకి వస్తాయి. ఇక్కడి నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు ఈ నీటిని సరఫ రా చేస్తున్నారు. 440 మీటర్ల ఎత్తులో ఉన్న మంచిప్ప చెరువులోని నీటిని దిగువన 380 మీటర్ల వరకు కులాస్పుర్ ఫిల్టర్బిడ్ వరకు నీరు గ్రావిటీ ద్వారా సరఫరా అవుతున్నాయి. ఎలాంటి టె క్నాలజీ ఉపయోగించకుండా కేవలం భూమార్గంలోనే కాల్వల ద్వారా (గ్రావిటీ) చెరువు నీటిని తరలించారు. ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. పైపుల మరమ్మతులు వంటి చిన్నచిన్న సమస్యలు మినహా మిగతా పెద్దగా ఎలాంటి సమస్యలు లేవు. సుమారు వందేళ్లుగా ఇందూరువాసులు తమ గొంతులు తడుపుకుంటున్నారు. -
మోతాదుకు మించి యూరియా వాడొద్దు
మోపాల్: వరికి యూరియాను మోతాదుకు మించి వాడొద్దని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవిందు రైతులకు సూచించారు. ఆదివారం మండలంలోని బోర్గాం(పి), మోపాల్ సొసైటీ గోదాములను పరిశీలించి యూరియా, ఇతర ఎరువుల నిల్వలు, రిజిస్టర్, స్టాక్బోర్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నానో యూరియాను వినియోగిస్తే మొక్కకు 90 శాతం వరకు చేరుతుందని తెలిపారు. తద్వారా మొక్క ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. జిల్లాలో యూరియా కొరత రాకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. యూరియా బ్లాక్మార్కెట్కు తరలకుండా, కృత్రిమ కొరత సృష్టించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామన్నారు. ఆయన వెంట సొసైటీ సిబ్బంది ఉన్నారు. ఎత్తేసామొద్దీన్ నేతృత్వంలో బంగారు పతకంనిజామాబాద్నాగారం: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సింగ్ క్రీడాకారిణి జాస్మిన్ బంగారు పతకం సాధించింది. శనివారం రాత్రి ఇంగ్లాండ్లో జరిగిన టోర్నీలో పోలాండ్ క్రీడాకారిణిని 4–1 తేడాతో ఓడించింది. కాగా, జాస్మిన్కు బాక్సింగ్ కోచ్గా జిల్లా చెందిన మహ్మద్ ఎత్తేసామొద్దీన్ వ్యవహరించారు. దీంతో బాక్సింగ్ క్రీడాకారుడు, జాతీయస్థాయి అథ్లెటిక్స్ గోల్డ్మెడలిస్టు సయ్యద్ ఖైసర్ కోచ్ ఎత్తేసామొద్దీన్ను అభినందించారు. కేసుల పరిష్కారంలో జిల్లాకు 4వ స్థానం ● లోక్ అదాలత్లో 7,444 కేసులు రాజీ ● సీపీ సాయిచైతన్య ఖలీల్వాడి: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన, రాజీపడటానికి అవకాశం ఉన్న 7,444 కేసులను జాతీయ మెగా లోక్ అదాలత్లో రాజీ కుదుర్చినట్లు సీపీ సాయిచైతన్య ఆదివారం తెలిపారు. బీఎన్ఎస్(ఐపీసీ) కేసులు 501, ఈ–పెట్టీ కేసులు 1958, డీడీ, ఎంవీఐ యాక్ట్లో 4,985 కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. 138 సైబర్ క్రైమ్ కేసులలో రూ.42,45,273 తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సైబర్ క్రైమ్, వివిధ కేసులలో రాజీమార్గం చేసినందుకు జిల్లాకు 4వ స్థానం లభించిందన్నారు. ప్రజలు సైబర్ మోసాలకు గురైతే ట్రోల్ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. లోక్ అదాలత్ను విజయవంతం చేసినసైబర్ క్రైమ్ డీఎస్పీ వై వెంకటేశ్వర్ రావు, సీఐ ముఖీద్ పాషా, రిజర్వ్ సీఐ సతీశ్, కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని అభినందించారు. -
బకాయిల విడుదలకు ‘పోరుబాట’
ఇంజినీరింగ్ కళాశాలలకు 22 కోట్లు బీఈడీ కళాశాలలకు 15.60 కోట్లు నిజామాబాద్అర్బన్: స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు పోరుబాట పట్టా యి. నాలుగేళ్లుగా బకాయిలు విడుదల కాకపోవడంతో ఉన్నత కళాశాలలకు సోమవారం నుంచి బంద్ ప్రకటిస్తూ హయ్యర్ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ నిర్ణయించింది. జిల్లాలో మొత్తం ఉన్నత విద్యా కళాశాలలు 109 ఉండగా, అందులో ప్రైవేటు కళాశాల లు 79 ఉన్నాయి. వీటితోపాటు మూడు ఇంజినీరింగ్ కళాశాలలు కొనసాగుతున్నాయి. సుమారు 50వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. గుదిబండగా బకాయిలు జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇబ్బందికరంగా మారింది. గత నాలుగు సంవత్సరాలుగా బకాయిల చెల్లింపులలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు దశల వారీగా బకాయిలను విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన కళాశాలలకు సుమారు రూ.86 కోట్ల వరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. విద్యార్థులపై ప్రభావం.. ఉన్నత కళాశాలల బంద్తో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుతం డిగ్రీ కళాశాలల అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాగా, పీజీలో చేరేందుకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు సర్టిఫికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రీయింబర్స్మెంట్ మీద ఆధారపడిన విద్యార్థులు ఫీజు చెల్లించలేక ఉన్నత చదువులకు దూరమయ్యే అవకాశం ఉంది. డిగ్రీ 50 పీజీ 11 బీఈడీ 13 బీపీఈఎడ్ 01 ఎంబీఏ 03 ఎంసీఏ 01 ఇంజినీరింగ్ 03 నిరవధికంగా కొనసాగుతుంది.. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం ఇదివరకు చా లా సార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా ఫలితం లేదు. అందుకే కళాశాలల బంద్ పాటిస్తున్నాం. నిధులు విడుదల చేసే వరకు కళాశాలల బంద్ నిరవధికంగా కొనసాగుతుంది. – సుధాకర్, ఉమ్మడి జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శివెంటనే విడుదల చేయాలి పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. కళాశాలలకు బకాయిపడిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలి. – రాజేశ్వర్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రైవేట్ ఉన్నత కళాశాలలు జిల్లాలో బకాయిల వివరాలు పెండింగ్లో నాలుగేళ్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ జిల్లాలో సుమారు రూ.86 కోట్ల బకాయిలు నేటి నుంచి ఉన్నత విద్యా కళాశాలలు బంద్ -
కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ రాజమార్గం
నిజామాబాద్ లీగల్ : కేసుల సత్వర పరిష్కారంలో లోక్ అదాలత్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, ప్రజలు వీటిని వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి పేర్కొన్నారు. జాతీయ మూడో లోక్ అదాలత్ను జిల్లా కేంద్రంలోని న్యాయ సేవా సంస్థ ప్రాంగణంలో శనివారం జడ్జి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాజీమార్గమే –రాజమార్గం అన్న నినాదంతో ప్రారంభమైన లోక్ అదాలత్లు అనేక పెండింగ్ కేసులకు ముగింపు పలికాయన్నారు. కోర్టుల చుట్టూ ఏళ్లపాటు తిరిగే బదులు కక్షిదారులు తమ కేసుల్ని లోక్అదాలత్ ద్వారా పరిష్కరించుకుని మానసిక ప్రశాంతతను పొందవచ్చని వివరించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెరగడంతో జిల్లా న్యాయసేవా సంస్థ లోక్ అదాలత్ సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారని, ఇది పెండింగ్ కేసుల పరిష్కారంలో ముందడుగని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి విజయభాస్కర్ రావు, నాల్గో అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి హరీష, తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి మూడో లోక్అదాలత్లో 26,390 పెండింగ్ కేసులు పరిష్కారం రూ. 9.26 కోట్ల పరిహారం చెల్లింపు -
సొసైటీ డైరెక్టర్లపై వేటు!
● రుణాలు చెల్లించని వారిని పాలకవర్గాల నుంచి తొలగిస్తున్న సహకార శాఖ ● ఇప్పటి వరకు 20 మంది వరకు ఉద్వాసన ● పలుమార్లు నోటీసులిచ్చినా లెక్క చేయకపోవడంతో చర్యలకు దిగిన అధికారులు డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని డైరెక్టర్లపై జిల్లా సహకార శాఖ చర్యలకు దిగింది. జిల్లా వ్యాప్తంగా పలు సొసైటీల్లోని దాదాపు 20 మంది డైరెక్టర్లపై అధికారులు వేటు వేశారు. వారి పదవితోపాటు పాలకవర్గం నుంచి పేరును అధికారులు తొలగించారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం జిల్లాలో హాట్టాపిక్గా మారింది. జిల్లాలో మొత్తం 89 పీఏసీఎస్లు ఉన్నాయి. ఇటీవల 60 సొసైటీలకు మాత్రమే పదవీకాలాన్ని ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. మిగిలిన 29 సొసైటీలకు పొడిగింపు ఇవ్వలేదు. మొదటిసారి పెంచిన సమయంలో బకాయిలున్న డైరెక్టర్ల జోలికి వెళ్లలేదు. ఇటీవల రెండోసారి పెంచిన సమయంలో మాత్రం రుణాలు తీసుకొని డీఫాల్టర్ల కింద ఉన్న డైరెక్టర్ల పేర్లను ప్రభుత్వం అధికారుల ద్వారా సేకరించింది. అవినీతి జరిగిన సొసైటీల వివరాలు, పాలకవర్గంలో ఉండి రుణాలు కట్టని వారి పేర్లను కూడా ప్రభుత్వానికి పంపారు. ఇదేదో సాధారణంగా తీసుకుంటున్న డేటానేమోనని అంతా అనుకున్నారు. కానీ, ఈ విధంగా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ధర్పల్లి మండలం హోన్నాజీపేట్, ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయితోపాటు నల్లవెల్లి, నందిపేట్లో చింరాజ్పల్లి, ఇతర మండలాల్లోని సొసైటీల్లో డీఫాల్టర్లుగా ఉన్న డైరెక్టర్లకు ఉద్వాసన పలికారు. అయితే, పెద్ద మొత్తంలో రుణాలు పొంది వాటిని తిరిగి కట్టని మరికొన్ని సొసైటీలకు సంబంధించిన డైరెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రైతులకో తీరు..డైరెక్టర్లకో తీరా! రైతుల అభ్యున్నతి కోసం పనిచేయాల్సిన సొసైటీల్లో డైరెక్టర్లు సొంత లాభాపేక్షను చూసుకుంటున్నారనే విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. రైతులు రుణాలు తీసుకొని కట్టపోతే అధికారులు వారి ఇంటికి నోటీసులు పంపడమే కాకుండా ఆస్తులను జప్తు చేస్తున్నారు. కానీ, పాలకవర్గ పదవీలో ఉంటూ రూ.లక్షల్లో రుణాలు తీసుకొని ఏళ్ల తరబడి సక్రమంగా చెల్లించని డైరెక్టర్లను ఏమీ అనకపోవడంతో గత కొంతకాలంగా రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులకో తీరు... డైరెక్టర్లకో తీరా అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలో డీఫాల్ట్ డైరెక్టర్లకు పలుమార్లు నోటీసులు పంపించారు. సమయం ఇచ్చినా వారు లెక్క చేయకపోవడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించి పదవి నుంచి తొలగించడం ప్రారంభించారు. కాగా, తొలగింపబడిన వారి నుంచి బకాయిలను వసూలు చేసేందుకు లీగల్ పద్ధతిలో వెళ్లనున్నట్లు తెలిసింది. అయితే, పదవిని కోల్పోయిన డైరెక్టర్లు పాలకవర్గంలో తిరిగి చేరేందుకు పైరవీలు మొదలుపెట్టారు. రాజకీయ నేతలతో అధికారులకు ఫోన్లు చేయిస్తున్నట్లు సమాచారం. డీఫాల్ట్ డైరెక్టర్ల తొలగింపు విషయమై జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్రావును సంప్రదించగా చర్యలు వాస్తవమేనని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
త్వరలోనే ఇందూరుకు వందే భారత్
● జిల్లాకు ఇండస్ట్రియల్ కారిడార్ ● ఎంపీ అర్వింద్ ధర్మపురి ● ఎన్సీసీఐ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంనిజామాబాద్ రూరల్: త్వరలోనే ఇందూరు నుంచి ముంబై, మధ్యప్రదేశ్లకు వందేభారత్ రైలు సౌ కర్యం కల్పించనున్నట్లు పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో శనివారం నిర్వహించిన నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండసీ్ట్ర (ఎన్సీసీఐ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాల నేపథ్యంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రయ త్నాలు కొనసాగుతున్నాయన్నారు. వందేభారత్ రై లుకు సంబంధించిన ఫైలు రైల్వే శాఖ మంత్రి వద్ద పెండింగ్లో ఉందన్నారు. జిల్లా కేంద్రంలో రైల్వే బైపాస్ నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో వ్యాపార, వాణిజ్య రంగాలను ప్రోత్సహించేందుకు కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చేందుకు తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రైల్వే బ్రిడ్జిలు, కొత్త రైల్వేలైన్ నిర్మాణాల ఆలస్యానికి గత ప్రభుత్వ పాలకుల అవినీతి, అక్రమాలే కారణమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. అనంతరం ఎన్సీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు రాజు, శ్రీనివాసరావు, ఇతర కార్యవర్గసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ షాపర్స్ లక్ష్యంగా..
● తాజాగా నిజామాబాద్లో ఇలాంటి పార్శిల్స్ డెలివరీ ● డబ్బులు చెల్లించి పార్శిల్ విప్పితే, అందులో చిల్లర వస్తువులు.. ● వాట్సాప్ గ్రూపుల్లోకి సైతం చొరబడుతున్న వైనం ● బాధితుల సిమ్ను, వాట్సాప్ను ఆధీనంలోకి తీసుకుంటున్న మాయగాళ్లు సైబర్ కేటుగాళ్లు రోజు రోజుకూ కొత్త కొత్త విధానాలతో మోసాలు చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని పలువురి ఖాతాలకు చిల్లులు పెడుతున్నారు. ఇలా కూడా సైబర్ నేరాలు చేస్తారా అనేవిధంగా సైబరాసురులు ఊహించని రీతిలో మోసాలకు దిగుతున్నారు. ప్రస్తుత గ్లోబల్ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించి సింపుల్గా సైబర్ నేరాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రతిఒక్కరూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్అడ్రస్లు చోరీ చేసి పార్శిల్స్ పంపిస్తున్న సైబర్ కేటుగాళ్లు ● ఇటీవల నిజామాబాద్కు చెందిన పలువురు ఉపయోగిస్తున్న వాట్సాప్ గ్రూపును సైతం తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా మోసం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సైబర్ కేటుగాళ్లు ఏకంగా పర్సనల్ ఫోన్ కాంటాక్ట్ నంబర్ల ద్వారా బాధితుల బంధు వులు, స్నేహితులతో నే రుగా చాటింగ్లోకి వెళుతున్నారు. ఇలా హ్యాక్ చేసిన ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. నిజామాబాద్లోని సుభాష్నగర్కు చెందిన ఓ వ్యాపారస్తుడికి ఇటీవల క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) పార్శిల్ వచ్చింది. ఈ వ్యాపారి ఆన్లైన్ షాపింగ్లో తన ఇంటిలో అవసరమైన గృహోపకరణం కోసం ఆర్డర్ చేశాడు. దానికి సంబంధించిన డెలివరీ రాకపోగా, ఓ కొరియర్ సంస్థ ద్వారా ఈ నెల 11న తన ఇంటి చిరునామాకు పార్శిల్ వచ్చింది. నగదు చెల్లించి పార్శిల్ తీసుకుని దాన్ని తెరవగా అందులో వాడేసిన చిన్న ఖాళీ నెయిల్ పాలిష్ సీసా, నీళ్లతో నింపిన చిన్న స్ప్రేబాటిల్ ఉంది. అయితే ఈ పార్శిల్పై హైదరాబాద్లోని నారాయణగూడ ఏరియాకు చెందిన వ్యక్తి చిరునామా ఉంది. ఈ చిరునామా పైభాగంలో నిజామాబాద్ సుభాష్నగర్కు చెందిన సదరు వ్యాపారి అడ్రస్ స్లిప్ అతికించి మరీ పార్శిల్ డెలివరీ చేయడం గమనార్హం. అయితే తాను ఆర్డర్ చేసిన వస్తువు వచ్చిందని నగదు చెల్లించి తీసుకున్న వ్యాపారి మోసపోయినట్లు తెలుసుకుని అవాక్కయ్యాడు. కొరియర్ సంస్థ వాళ్లను వాకబు చేస్తే హర్యానా నుంచి వచ్చినట్లు చెప్పడం గమనార్హం. అయితే ఈ మోసం చుట్టుపక్కల నుంచే చేసినట్లు అర్థమవుతోంది. ● ఇటీవల నగరానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి వాట్సప్కు సైబర్ కేటుగాళ్లు ఓ లింక్ను పంపారు. ఈ వాట్సప్ ఉన్నది ఆపిల్ ఐఫోన్ కావడం గమనార్హం. ఈ ప్రజాప్రతినిధి ఫోన్తో పాటు అన్ని యాప్లు ఫేస్ ఐడీతో ఓపెన్ అవుతాయి. అయితే వాట్సప్ కూడా అలా ఓపెన్ చేసి కొత్తగా వచ్చిన ఓ లింక్ను క్లిక్ చేశారు. తక్షణమే సదరు వాట్సాప్తో పాటు ఫోన్లోని సిమ్ పూర్తిగా సైబర్ నేరగాడి ఆధీనంలోకి వెళ్లిపోయింది. బాధిత ప్రజాప్రతినిధి ఎవరికీ ఫోన్ చేయలేని, ఎవరి వద్ద నుంచీ ఫోన్కాల్స్ రిసీవ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపటిలోనే కేటుగాళ్లు వాట్సప్ ద్వారా సదరు మాజీ ప్రజాప్రతినిధి కాంటాక్ట్ నంబర్లలోని 90 మందితో ఛాటింగ్లోకి వెళ్లారు. అప్పటికే వాట్సాప్ మొత్తం కేటుగాడి ఆధీనంలో ఉండడంతో బంధువులెవరు, స్నేహితులెవరు అనే విషయాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా చాటింగ్ చేయడం విశేషం. ఇలా ప్రతిఒక్కరికి చాటింగ్లో అత్యవసరంగా రూ.42 వేలు కావాలంటూ మెసేజ్ చేశాడు. ఇలా మెసేజ్ అందుకున్నవారిలో ముగ్గురు వ్యక్తులు సదరు ప్రజాప్రతినిధి ఫోన్పేకు డబ్బులు పంపారు. ఈ డబ్బులు నేరుగా సైబర్ కేటుగాళ్ల ఖాతాల్లో చేరిపోయాయి. గంటలోపే అప్రమత్తమైన సదరు మాజీ ప్రజాప్రతినిధి తన సిమ్ను డీయాక్టివేట్ చేయించడంతో సైబర్ కేటుగాళ్ల మోసానికి బ్రేక్ వేయించగలిగారు. డెలివరీ పార్శిల్ వచ్చిందని..కొందరు ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు సైతం సైబర్ కేటుగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. షాపింగ్ చేయనివారికి సైతం పార్శిల్ వచ్చిందని, బయట డెలివరీ బాయ్ వెయిట్ చేస్తున్నాడని, ఓటీపీ చెప్పాలని కేటుగాళ్లు అడుగుతున్నారు. ఇలా చెప్పినవారి కాల్స్ను సైతం ఫార్వర్డింగ్ చేసుకుంటున్నారు. -
చుట్టం చూపుగా వచ్చి చోరీలు
● రాజస్థాన్కు చెందిన నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి క్రైం: చుట్టం చూపుగా వచ్చి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్కు చెందిన ఓ నిందితుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గతనెల 25 న జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీకి చెందిన మాసిరెడ్డి శివారెడ్డి కుటుంబం ఇంటికి తాళం వేసి దైవదర్శనం కోసం వేములవాడకు వెళ్లింది. మరుసటి రోజు వచ్చి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లోని 19 తులాల బంగారు ఆభరణాలు అపహరణ కు గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసు కుని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేశా రు. శనివారం హౌసింగ్బోర్డు కాలనీలో ఓ కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని వాకబు చేశారు. తెలంగాణ నంబర్ ప్లేట్ కారులో తిరుగుతూ హిందీలో మాత్రమే మా ట్లాడడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకు ని విచారించగా నేరం అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. నిందితుడిని రాజస్థాన్ రాష్ట్రంలోని కరోలీ జి ల్లా అజీజ్పూర్ గ్రామానికి చెందిన హన్సరాజ్ మీ నాగా గుర్తించారు. అతడు కొద్ది రోజుల క్రితం మెద క్ రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉండే తన బంధువు ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడని పేర్కొన్నారు. స్నేహితుడైన అభిషేక్తో కలిసి కామారెడ్డిలో తాళం వేసిన ఇంట్లో చోరీ చేశాడన్నారు. నిందితుడి వద్ద నుంచి 2 తులాల బంగారు ఆభరణాలు, కారు, సె ల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
సిమీ, పీఎఫ్ఐలకు నిజామాబాద్ అడ్డా
● కాంగ్రెస్ హయాంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదు ● ఎంపీ అర్వింద్ ధర్మపురి ఖలీల్వాడి: సిమీ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలకు నిజామాబా ద్ అడ్డాగా మారిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఐజీ కార్యాలయంలో శనివారం సీపీ పోతరాజు సాయిచైతన్యతో ఎంపీ సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదన్నారు. వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశా రని తెలిపారు. యువకుడిపై కేసు నమోదు చే సిన సందర్భంగా ఓ వర్గానికి చెందిన సుమారు 400 మంది బైక్ ర్యాలీ నిర్వహించి, హారన్ కొట్టుడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే మాత్రం కేసు నమోదు చేయలేదన్నారు. తాను పోలీసులతో మాట్లాడిన తర్వాత బాధ్యు లపై కేసులు నమోదు చేశారన్నారు. హిందువుల పండుగలకు ఆంక్షలు ఎక్కువయ్యాయని, తప్పు చేసిన వారి విషయంలో మత ప్రస్తావన ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల దొరికిన ఉగ్రవాదులను పోలీసులు విచారిస్తే స్వచ్ఛంద సంస్థల ముసుగులో లవ్జీహాదీలకు సపోర్టు చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మర్వాడీ గో బ్యాక్ కాదని, ఇక్క డే ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్, టర్కీ దేశాల వారిని వెళ్లగొట్టాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, ఉగ్ర కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సీపీ సాయి చైతన్యను కోరినట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు. -
ఎస్సారెస్పీకి మళ్లీ పెరిగిన వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగు వ ప్రాంతాల నుంచి వరద నీరు మళ్లీ పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు లక్ష క్యూసెక్కులకు చేరింది. దీంతో ప్రాజెక్ట్లోని 23 వరద గేట్ల ద్వారా 90 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. శనివారం ఉదయం ప్రాజెక్ట్లోకి 90 వేల క్యూసెక్కులకు వరద నీరు తగ్గిపోవడంతో వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 75 వేల క్యూసెక్కులకు నీటి తగ్గించారు. మధ్యాహ్ననికి లక్షా 32 వేల క్యూసెక్కులకు పెరగడంతో గోదావరిలోకి లక్షా 15 వేల క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. రాత్రి వరకు అంతేస్థాయిలో ఇన్ఫ్లో, ఔట్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్ట్ నుంచి ఎస్కెప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు పోతుంది. కాగా శనివారం సాయంత్రానికి అంతేస్థాయి నీటి మట్టంతో నిండుకుండలా ఉంది. సందర్శించిన హైకోర్టు జడ్జీలు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను శనివారం హైకోర్టు జడ్జీలు సామ్ కోషి, సృజన సందర్శించారు. నిర్మల్ జిల్లా పర్యటనను ముగించుకుని వారు తిరుగు ప్రయాణంలో ఎస్సారెస్పీని సందర్శించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జడ్జీలకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఎస్సారెస్పీ అతిథి గృహంలో జడ్జిలు, కలెక్టర్తో సమావేశమయ్యారు. ప్రాజెక్ట్ గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై చర్చించారు.వరల్డ్ బాక్సింగ్ కమిటీలో నిఖత్ జరీన్కు చోటునిజామాబాద్నాగారం: వరల్డ్ బాక్సింగ్ అథ్లెటిక్ కమిటీలో జిల్లాకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్కు చోటు లభించింది. కమిటీలో టర్కీ, ఆస్ట్రేలియా, వేల్స్, యూఎస్ఏ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన క్రీడాకారులతోపాటు భారత్ తరఫున నిఖత్కు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. రికార్డుల నిర్వహణపై డీఎంహెచ్వో ఆగ్రహం బాల్కొండ: రికార్డుల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్న బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై డీఎంహెచ్వో రాజశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె శనివారం ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యుల, సిబ్బంది హాజరుపట్టికను పరిశీలించారు. అనంతరం మందుల స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్య సేవలను మె రుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్న ట్లు తెలిపారు. ప్రస్తుతం వైద్యవిధాన పరిష త్ నుంచి వైద్యుల కొరత ఉందని, దీంతో జి ల్లా వైద్య శాఖ నుంచి మరో ఇద్దరు వై ద్యు లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. వారంలో మూడు రోజులు ఇక్కడ సేవలందిస్తారని తెలిపారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నానో యూరియా వాడకం పెరిగేలా చూడాలి ● జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ డిచ్పల్లి: రైతులు పంటల సాగుకు నానో యూరియా వాడకాన్ని అలవాటు చేసుకోలని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ సూచించారు. శనివారం డిచ్పల్లి మండలం బర్ధిపూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆయన సందర్శించారు. యూరియా నిల్వలపై సమీక్షించారు. భవిష్యత్లో నానో యూరియా వాడకం పెంచా లని, ఈ విషయంలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తు తం సొసైటీ పరిధిలో యూరియా కొరత లేదని చైర్మన్ రామకృష్ణ తెలిపారు. ఆయన వెంట సొసైటీ సీఈవో నారాయణరెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
విద్యుత్ షాక్తో మూడు గేదెలు..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని భవానిపేట గ్రామ శివారులో విద్యుత్ షాక్తో మూడు గేదెలు మృతి చెందినట్లు లైన్మెన్ పాండు తెలిపారు. గ్రామానికి చెందిన మాదిగ బాలయ్య పొలం వద్ద బోరు మోటారు సర్వీస్ వైరు తెగిపోయి ఫినిషింగ్ వైర్పై పడింది. ఈక్రమంలో శనివారం అదే గ్రామానికి చెందిన ఆకుల సురేందర్, గుండ్ర సత్యనారాయణ, గుండ్ర పరందాములుకు చెందిన గేదెలు గ్రామ శివారులోకి మేతకు వెళ్లాయి. దీంతో గేదెలు మేత మేసుకుంటూ వెళ్లగా ఫినిషింగ్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. గేదెల విలువ సుమారు రూ. 3లక్షలు ఉంటుందన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. చికిత్సపొందుతూ వృద్ధురాలు.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రమాదవశాత్తు గాయపడిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన నట్ట అనసూయ(79) అనే వృద్ధురాలు గత నెల 28న కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి బయటకు వెళ్లి కాలుజారి నేలపై పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యులు గమనించి చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం ఈ నెల 3న మె దక్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఈ నెల 8న హైదరాబాద్ లోని నిమ్స్కు తరలించి చికిత్స చేయించారు. కాగా ఈ నెల 12న ఆమె ఆ స్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి మనువడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్యాయత్నం వర్ని: చందూర్ మండలంలోని ఘన్పూర్ గ్రామంలో ఓ యువతి తన ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్యకు యత్నించింది. వర్ని మండలం కూనిపూర్ క్యాంపునకు చెందిన వీరేంద్ర అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని ఘన్పూర్ గ్రామానికి చెందిన సదరు యువతి మనస్తాపం చెందింది. దీంతో శుక్రవారం ఆమె ప్రియుడి ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. వెంటనే స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి అక్క పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. విధులకు ఆటంకం కలిగించిన పలువురిపై కేసు నవీపేట: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి శనివారం తెలిపారు. మూడు రోజుల కిందట మండల కేంద్రానికి చెందిన ఒక వర్గానికి చెందిన యువకుడు ప్రార్థనా మందిరంపై జెండాను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియలో షేర్ చేశాడు. ఇది వైరల్గా మారడంతో ఆగ్రహానికి గురైన మరో వర్గానికి చెందిన యువకులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఆందోళన చేశారు. ఈక్రమంలో వారు పోలీస్ స్టేషన్లోకి చొరబడి సిబ్బందితో దురుగా ప్రవర్తిస్తూ, వారి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో ఆ వర్గానికి చెందిన ఆరుగురితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
జీజీహెచ్లో నవజాత శిశువు మృత్యువాత
● ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టిన బంధువులు కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని శిశువు కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాలు ఇలా.. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామానికి చెందిన అఖిల పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం సాయంత్రం కామారెడ్డి జీజీహెచ్కు వచ్చింది. వైద్యులు అర్ధరాత్రి ఆమెకు ప్రసవం చేశారు. ఆడపిల్ల పుట్టడంతో మహాలక్ష్మి పుట్టిందని కుటుంబ సభ్యులంతా సంబరంలో ఉన్నా ఆ ఆనందం 5 నిమిషాలు కూడా లేకుండా పోయింది. పుట్టిన శిశువులో చలనం లేకపోవడంతో మృత శిశువు జన్మించిందని వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. కాలయాపన చేయకుండా ఆపరేషన్ చేసి ఉంటే శిశువు బ్రతికేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు ఆస్పత్రిలో ఆందోళన చేశారు. పట్టణ పోలీసులు ఆస్పత్రికి వచ్చి వారిని సముదాయించారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా వైద్యుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదన్నారు. ఉమ్మనీరు మింగడంతోనే శిశువు మృతి చెందిందని తెలిపారు. -
ఆటోలు చోరీ చేసే ముఠా అరెస్ట్
కామారెడ్డి క్రైం: ఆటోల చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను నాగిరెడ్డిపేట పోలీసులు అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పో లీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరా లు వెల్లడించారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేటకు చెందిన తాడేపల్లి క్రిష్ణ ఆటో ఈ నెల 11న చోరీకి గురైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించా రు. శనివారం ఉదయం మాల్తుమ్మెద వద్ద పోలీసు లు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో పారిపోబోయిన ఇద్దరిని పట్టుకుని విచారించారు. దీంతో ఆటోల చోరీ వ్యవహారం బయటపడింది. నిందితులను నిజామాబాద్ జిల్లా మంచిప్పకు చెందిన కుమ్మరి రాజు, కొల్ల దుర్గరాజులుగా గుర్తించా రు. వారిలో కుమ్మరి రాజుపై గతంలో కరీంనగర్, జ గిత్యాల, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 20 దొంగతనం కేసులు ఉన్నాయ ని ఎస్పీ తెలిపారు. వాటిలో ఎక్కువగా ఆటోల చోరీ కేసులే ఉన్నాయన్నారు. దుర్గరాజుపై గతంలో ఒక ఆటో చోరీ కేసు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి నాగిరెడ్డిపేటలో దొంగిలించిన ఆటోతోపాటు మెదక్ జిల్లాలో దొంగిలించిన 2 ఆటోలు, భి క్కనూర్లో ఎత్తుకెళ్లిన మరో ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న కానిస్టేబుల్ గంగారాం, హోంగార్డు బాలాజీలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
● మద్నూర్లో చోటుచేసుకున్న విషాద ఘటన ● కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు తొట్టెలో పడి బాలుడు మృతి మద్నూర్(జుక్కల్): నీటి తొట్టెలో పడి బాలుడు ప్రాణాలు వదిలాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిర నగర్ కాలనీకి చెందిన మేత్రివార్ రాజు, అనిత దంపతులు మద్నూర్లోని పాత బస్టాండ్లో టీ పాయింట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాజు టీ పాయింట్లో ఉండగా, అనిత ఇంట్లో వంట చేస్తోంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉండగా చిన్న కొడుకు అక్షయ్ (2) ఇంటి ముందు ఆడుకుంటూ నీటి తొట్టె వద్దకు వెళ్లాడు. అక్షయ్ చేతిలో ఉన్న ఆట వస్తువు నీటి తొట్టెలో పడటంతో దాన్ని తీసుకోవడానికి వంగడంతో బ్యాలెన్స్ తప్పి తల నీటి తొట్టెలోకి పడిపోయి కాళ్లు బయటకు తేలాయి. కొద్ది సేపటికి తల్లి అనిత బయటకు వచ్చి చూడగా అక్షయ్ నీటి తొట్టెలో కనిపించాడు. బాలుడిని నీటి తొట్టెలోంచి బయటకు తీసి స్థానికులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్కొండ తెలిపారు. -
ర్యాగట్లపల్లిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు!
● నిందితులను పట్టుకున్న గ్రామస్తులు ● ఎనిమిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు భిక్కనూరు: మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలోగల బసవేశ్వరాలయం ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ర్యాగట్లపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న అతిపురాతనమైన బసవేశ్వరాలయం ప్రాంతంలో శనివారం వేకువజామున ప్రొక్లెయిన్ సహాయంతో కొందరూ గుప్తనిధుల కోసం తవ్వకాలను ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి పనులను అడ్డుకున్నారు. గ్రామస్తులు ప్రశ్నించగా దురుసుగా సమాధానాలు చెప్పడంతో వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితులైన ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన చిన్న భూమయ్య, మహేందర్, మంత్రి దుర్గయ్య, రామాయంపేట, భిక్కనూర్కు చెందిన సభావత్ భరత్, నాగభూషణం, యాదగిరి, వెంకట చంధ్రశేఖర్, నెల్లూరి కాంతారావులను అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై అంజనేయులు వివరించారు. -
ఖాతాలు తీసినా వెతలు తీరలే..
మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ కార్మికుల వేతనాలను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఎస్ఎఫ్సీ) నిధు ల నుంచి చెల్లించేందుకు అంగీకరించి ప్రభుత్వం అందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రతి పంచాయతీకి టీఎస్బీపాస్ ఖాతాలను తెరిపించినా నిధులు జమ చేయడంలో అలసత్వం చోటు చేసుకుంటుంది. ఫలితంగా సకాలంలో వేతనాలు అందక పంచాయతీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అస్తవ్యస్తంగా పాలన.. ఎస్ఎఫ్సీ ద్వారా జిల్లాలోని పంచాయతీలకు ప్రతి నెలా రూ.10.30 కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం లేదు. దీనికి తోడు ఎస్ఎఫ్సీ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం ఏర్పడటంతో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో మొత్తం 545 పంచాయతీలు ఉండగా, అందులో కార్మికులు 2,198 మంది, కారోబార్లు 522 మంది విధులు నిర్వహిస్తున్నారు. అందరికీ ఒకే రకంగా ప్రతి నెలా రూ.9,500 చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఎస్ఎఫ్సీ నిధుల నుంచి ప్రతి నెలా టీఎస్బీపాస్ ఖాతాలకు రూ.2 కోట్ల 58 లక్షల 40 వేలను జమ చేస్తే పంచాయతీ కార్మికుల వేతనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో మూడు, నాలుగు నెలలకు ఒకసారి వేతనాలకు గ్రాంటును విడుదల చేయగా ప్రస్తుతం గ్రాంటు విడుదల కాకపోవడంతో రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సర్దుబాటు చేయిస్తున్నాం ఎస్ఎఫ్సీ నిధులు విడుదలలో జాప్యం ఏర్పడితే వేతనాల చెల్లింపు ఆలస్యం అవుతుంది. పంచాయతీల్లో నిధులు ఉంటే సర్దుబాటు చేయించి కార్మికులకు వేతనాలు ఇస్తున్నాం. కొన్ని పంచాయతీల్లోనే ఆదాయం బాగుంది. చాలా చోట్ల ఆదాయం తక్కువగా ఉంది. – శివకృష్ణ, డీఎల్పీవో, ఆర్మూర్ జీపీ కార్మికుల వేతనాల కోసం పంచాయతీకో టీఎస్బీపాస్ ఖాతా ఎస్ఎఫ్సీ నుంచి నిధులు రాకపోవడంతో రెండు నెలలుగా ఆగిన వేతనాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు -
రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్గా గాంధారి ఈఎంఆర్ఎస్
కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ఈఎంఆర్ఎస్లో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడల్లో కామారెడ్డి జిల్లా గాంధారి ఈఎంఆర్ఎస్ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. శనివారం క్రీడల ముగింపు వేడుకలు నిర్వహించగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరై, మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశపడకుండా గెలుపుకోసం మరోసారి ప్రయత్నించాలనిన్నారు. అనంతరం ఓవరాల్ చాంపియన్షిప్ సాధించిన గాంధారి ఈఎంఆర్ఎస్కు, అలాగే వివిధ విభాగాల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాఽథ్కేకన్, ఆర్డీవో కృష్ణవేణి, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్యనాయక్, ఆర్సీవో రత్నకుమారి, రాష్ట్ర ఉపాధిహామీ సంస్థ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ అజయ్సింగ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చౌడమ్మ కొండూర్ ఎత్తిపోతల పథకంలో చోరీ
● ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్, ఆయిల్ ఎత్తుకెళ్లిన దుండగులు ● ఏడాదిలో మూడోసారి ఘటన నందిపేట్(ఆర్మూర్): జిల్లాలో ఎత్తిపోతల పథకాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. దుండగులు విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లోని విలువైన సామగ్రిని ఎత్తుకెళ్తున్నారు. పోలీసులు నమోదు చేస్తున్నా ఇప్పటి వరకు దుండగులను పట్టుకున్న దాఖలాలు లేవు. తాజాగా చౌడమ్మ కొండూర్ ఎత్తిపోతల పథకం పరిధిలోని ఉమ్మెడ శివారులో ఉన్న రెండవ పంపుహౌజ్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ను గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఇనుప రాడ్లతో లిఫ్ట్ గదిలోకి ప్రవేశించి అక్కడ విధులు నిర్వహిస్తున్న సాకలి ముత్తెన్న, సాకలి శ్రీను అనే ఇద్దరు ఆపరేటర్లను బెదిరించి కాపలా కాశారు. అనంతరం దుండగులు 250 కేవీ ట్రాన్స్ఫార్మర్ను పగుల గొట్టి రాగి కాయిల్స్, ఆయిల్ను దొంగిలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కొలిక్కి రాని దర్యాప్తు.. ఈ సంవత్సరంలో చౌడమ్మ కొండూర్ ఎత్తిపోతల పంపుహౌజ్ల వద్ద మూడు సార్లు, తల్వేద ఎత్తిపోతల పఽథకంలో మూడు సార్లు చోరీలు జరిగాయి. దుండగులు ఎత్తిపోతల పథకాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రూ. లక్షల విలువైన రాగి కాయిల్స్, ఇంధనం, ఇతర పరికరాలను అపహరించుకుపోతున్నారు. వరుస ఘటనలు ఒకే తరహాలో జరుగుతున్నప్పటికీ చోరీలకు పాల్పడుతున్నది ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. అయినా ఒక్క కేసు కూడ దర్యాప్తు కొలిక్కి రాలేదు. ఎత్తిపోతల పథకాల ట్రాన్స్ఫార్మర్లు పనిచేయక పోవడంతో వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు నీరందని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకాల వద్ద చోరీల నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
సామాజిక సేవలు అభినందనీయం
నిజామాబాద్ రూరల్: సమాజంలో విద్య, వైద్య రంగాలకు జోస్ ఆలుక్కాస్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నా రు. నగరంలోని జోస్ ఆ లుక్కాస్ జువెలరీ షో రూంలో శనివారం మూ డవ వార్షికోత్సవం ఘ నంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలోని ఆస్పత్రులు, బడులకు అవసరమైన సామగ్రిని జోస్ ఆలుక్కాస్ సంస్థ అందజేస్తుండటంపై అభినందించారు. ప్రస్తుతం నాలు గు ప్రభుత్వ పాఠశాలకు సుమారు రూ.6.96 లక్షల విలువగల కంప్యూటర్లు, డిజిటల్ టీవీ, తాగునీటి శుద్ధియంత్రం వాటికి నిధులు అందజేశారన్నారు. మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 13 నుంచి 19 వరకు ప్రత్యేక ఆఫర్లు అందజేస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలకు ఎంపీ చేతుల మీదుగా సీఎస్ఆర్ ఫండ్ చెక్కులను అందజేశారు. బ్రాంచ్ మేనేజర్ ధనుష్, అసిస్టెంట్ మేనేజర్ సజయ్, అకౌంట్స్ మేనేజర్ జితిన్, పీఆర్వో పిప్పెర నరేందర్, తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. -
అనాథలైన సోదరులను ఆదుకోరూ!
మాక్లూర్: తండ్రి గల్ఫ్ దేశానికి వెళ్లి గల్లంతుకాగా, ఆ బాధతో తల్లి మంచంపట్టి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో వారి ఇద్దరు కుమారులు అనాథలుగా మిగిలారు. పట్టించుకునేవారు లేక సోదరు లు విలపిస్తుండగా, ఉదార స్వభావులు వారిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండలంలోని మాదాపూర్కు చెందిన పర్సో ల్లా రాజు బతుకుదెరువు నిమిత్తం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లి అక్కడ గల్లంతయ్యాడు. ఇప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. ఆ బాధతో భార్య సత్తె మ్మ మచ్చం పట్టి అనారోగ్యంతో వారం రోజుల క్రి తం మృతి చెందింది. దీంతో వారి కుమారులు ఎవ రు లేని అనాథలుగా మి గిలారు. అంతేకాకుండా మృతి చెందిన తల్లికి అంత్యక్రియలు ఎలా చేయా లో తెలియక బిక్కుబిక్కుమంటూ విలపిస్తూ ఉంటే గ్రామస్తులు స్పందించి విరాళాలు సేకరించి అంత్యక్రియలు పూర్తి చే శారు. తల్లి మృతితో ఒంటరైన పిల్లలకు చిన్న ఇ ల్లు తప్పా వారి వద్ద ఏమి లేవు. అన్నదమ్ముల్లో పెద్దవాడైన రోహిత్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగా, తమ్ముడు దీక్షిత్ 6వ తరగతి చదువుతున్నాడు. దీంతో వీరి దీనస్థితిని చూసి చలించి, ఇప్పటికే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి రూ.10,000, ఆస్కార్ యూత్ సభ్యులు రూ.12000 నగదు, నిత్యవసర సరుకులను అందించారు. మరికొందరు ఉదార స్వభావులు ముందుకు వచ్చి అనాథలైన వారిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తండ్రి దుబాయ్లో గల్లంతు ఆ బాధతో అనారోగ్యానికి గురై ఇటీవల మృతిచెందిన తల్లి పట్టించుకునేవారు లేక విలపిస్తున్న అన్నదమ్ముళ్లు ఉదార స్వభావులు ఆదుకోవాలని గ్రామస్తుల వినతి -
చోరీ కేసులో ఇద్దరు మహిళా నిందితుల అరెస్టు
రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలోని రాములు ఇంట్లో గత నెల 24న జరిగిన చోరీ కేసులో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. కోటగిరి బస్టాండ్ వద్ద శనివారం అనుమానాస్పదంగా ఉన్న బోధన్కు చెందిన సంగీత, రుద్రూర్ మండలం అంబం(ఆర్)కు చెందిన సునీతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు రాములు ఇంట్లో చోరీ చేసినట్లు అంగీకరించారు. అనంతరం వారి వద్ద నుంచి 6.9 గ్రాముల బంగారం, 44.51 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్కు పంపించినట్టు తెలిపారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలకేంద్రంలో ఓ వ్యాపారి ఫోన్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి, సుమారు రూ.8లక్షల వరకు కాజేశారు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన కొడిప్యాక శ్రీనివాస్ గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు, వసతి గృహాలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసే టెండర్ను దక్కించుకుని, సరుకులను సరఫరా చేస్తుంటాడు. ఈక్రమంలో గత నెల 30న తన ఖాతాలో సరుకులకు సంబంధించి డబ్బులు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఈ నెల 6న తన ఫోన్ తరచూ వేడి కావడంతో ఇట్టి విషయాన్ని పోలీసులకు తెలిపాడు. పోలీసులు ఫోన్ హ్యాక్ అయిందని, వెంటనే సిమ్ను వేరే ఫోన్లో వేసుకోమని చెప్పడంతో అతడు అలానే చేశారు. మరుసటి రోజు తన ఖాతా నుంచి డబ్బులను తీసుకుందామని కామారెడ్డిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు వెళ్లగా గతంలోనే రూ.4లక్షల 50వేలు, రూ.4లక్షల 27వేలు ఎలాంటి మెసేజ్ లేకుండా డ్రా అయినట్లు చూపించింది. దీంతో ఇదేమిటని బ్యాంక్ అధికారులను ప్రశ్నించగా ఇది సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించి వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని చెప్పారు. సదరు వ్యాపారి ఈ నెల 9న సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వ్యాపారి తెలిపారు. -
చేపలు చేజారుతున్నాయి..
● వరద గేట్ల నుంచి నీటి ప్రవాహంతోకొట్టుకుపోతున్న వైనం ● ఎస్సారెస్పీలో ప్రతియేటా ఇదే పరిస్థితి ● ఆవేదన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి విడుదల చేసినప్పుడు వరదతోపాటు చేపలు కూడా కొట్టుకు పోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ వరద గేట్ల దిగువన కేవలం గురువారం ఒక్క రోజు వేటాడితే ఎక్కువ సంఖ్యలో చేపలు చిక్కడమే ఇందుకు నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. అలాంటిది వరద ప్రవహించినప్పుడు ఎన్ని చేపలు కొట్టుకుపోయింటాయోనని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను వదిలే వరద కాలువ ద్వారా కూడ అధికంగా చేపలు వెళ్లిపోతున్నాయి. దీంతో వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న 6 గేట్లకు జాలిగేట్లను అమర్చాలని ఏళ్లుగా మత్స్యకారులు పాలకులు, అధికారుల చుట్టు తిరుగుతున్నారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ప్రతి సంవత్సరం ప్రాజెక్ట్లో 62 లక్షల చేపపిల్లలను ఉచితంగా వదులుతారు. కానీ చివరిలో వేటాడుటకు చేపలు ఉండవు. కారణం వరదల వలన దిగువకు కొట్టుకు పోవడమే. దీంతో వరద గేట్లకు చేపలు కొట్టుకుపోకుండ జాలి గేట్లు బిగించాలని కొన్నాళ్లుగా మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ‘సాక్షి’ అధికారులను వివరణ కోరగా.. వరద గేట్లకు జాలిలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని వివరించారు. వరద కాలువ గేట్లకు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. వరద గేట్లకు, వరద కాలువ గేట్లకు జాలి గేట్లను నిర్మించాలి. జాలి గేట్లు లేకపోవడంతో కిందకి చేపలు కొట్టుకుపోతున్నాయి. చిన్న, పెద్ద చేపలు తేడా లేకుండ పోతున్నాయి. ప్రభుత్వం ఆలోచించి, మత్స్యకారుల సమస్యను పరిష్కరించాలి. – శ్రీనివాస్, మత్స్యకారుడు, బాల్కొండ -
నాయబ్ తహసీల్దార్లకు పదోన్నతి
నిజామాబాద్అర్బన్: పలువురు నాయబ్ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి లభించింది. పదోన్నతికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర రెవెన్యూ శాఖ శుక్రవారం జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న నేనావత్ రాక, నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి తహసీల్దార్లుగా పదోన్నతి పొంది జిల్లాకు రానున్నారు. కాగా ఇదే జిల్లాలో పనిచేస్తున్న నరేష్ నాయబ్ తహసీల్దార్ నుంచి తహసీల్దార్గా పదోన్నతి పొందారు. వీరికి త్వరలోనే మండలాలు కేటాయించనున్నారు. ఖలీల్వాడి: పోలీసుల ఆత్మస్థైర్యంను దెబ్బతీయవద్దని, పోలీసులకు అందరు సమానులేనని నిజామాబాద్ పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ష కీల్ పాషా అన్నారు. జిల్లాకేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. ఆర్మూర్లోని యాసీన్ హోటల్ నిబంధనలకు విరుద్ధంగా రాత్రివే ళ కొనసాగడంతో కేసులు నమోదు చేశామన్నారు. పోలీసుల పేర్లు పింక్బుక్లో రాస్తామని సదరు నా యకుడు చెప్పడం సరైనది కాదన్నారు. పోలీసులు నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తారని, ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించరని తెలిపారు. మరోసారి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ సంఘం ప్రతినిధులు చందూలాల్, సాయిలు, గోవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివాహితతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి మూడేళ్ల జైలు నిజామాబాద్ లీగల్: వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి నిజామాబాద్ నాల్గవ అడిషనల్ మహిళ న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10వేల జరిమానా విధించింది. వివరాలు ఇలా.. రెంజల్ మండల కేంద్రానికి చెందిన గైని కిరణ్ 2023 ఏప్రిల్ 14న తన పక్కింట్లో నివసించే వివాహిత ఒంటరిగా ఉండగా ఆమె ఇంట్లోకి ప్రవేశించి, అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో భర్త అక్కడికి చేరుకుని కిరణ్ను పట్టుకునేందుక ప్రయత్నించగా, ఫరారయ్యాడు. దీనిపై దత్తు తన భార్యతో కలిసి రెంజల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని జిల్లా కోర్టులో హాజరుపర్చారు. జడ్జి సాక్ష్యాలను విచారించిన అనంతరం నిందితుడు గైని కిరణ్కు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు. అలాగే జిల్లా న్యాయసేవ సంస్థ బాధితురాలికి రూ.50వేల పరిహారం చెల్లించాలని జడ్జి తన తీర్పులో సూచించారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
సుభాష్నగర్: నగరశివారులోని శ్రావ్యగార్డెన్లో శుక్రవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ఎన్పీడీసీఎల్ డిస్కం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్పీడీసీఎల్ డిస్కం కార్యవర్గ ఎన్నికలు (16 జిల్లాలు) నిర్వహించారు. ఎన్పీడీసీఎల్ డిస్కం అధ్యక్షుడిగా బి రఘునందన్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎస్ వెంకట రమణరావు, అదనపు కార్యదర్శిగా ఎండీ ఆరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర నాయకులు సన్మానించి, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శి సాయిబాబు, అదనపు కార్యదర్శి వరప్రసాద్, కోశాధికారి శ్రీనివాస్రెడ్డి, డిస్కం కార్యదర్శి శేషగిరి రావు, అదనపు కార్యదర్శి రంగారావు, జిల్లా ముఖ్య సలహాదారులు లక్ష్మణ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ డీసీ రాజు, 16 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకం
ఖలీల్వాడి: రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకమని సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం క్రాష్ ఇన్వెస్టిగేషన్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన అవసరమని సీపీ అన్నారు. ప్రతి ప్రమాదం వెనక ఉన్న అసలైన కారణాలను వెలికితీసి, భవిష్యత్లో అలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు సహాయపడుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, వర్షా నిహంత్, సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు సాహెల్ మోటో, నూర్ ఖాట్టర్ పాల్, చిరాగ్ కాటేగర్, సీటీసీ సర్కిల్ సీఐ శివరాం తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో న్యాయవాది మృతి
నిజామాబాద్ లీగల్: నగరానికి చెందిన న్యాయ వాది పెద్దగాని కిరణ్ కుమార్ గౌడ్ (57) గుండెపోటుతో మృతి చెందాడు. కిరణ్ శుక్రవారం సాయంత్రం ఆఫీసర్స్ క్లబ్కు చేరుకున్న కొద్దిసేపటికి చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభిస్తుండగానే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. 1997లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన కిరణ్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాది నారాయణరెడ్డి వద్ద జూనియర్గా పనిచేశాడు, న్యాయవాదిగా సివిల్, క్రిమినల్ కేసులు వాదించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. గవర్నమెంట్ ప్లీడర్గా, న్యాయవాదుల సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శిగా పనిచేశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిరణ్ మృతిపట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ సోమవారం సంతాప సభ నిర్వహించనున్నట్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ ..రుద్రూరు: ఆత్మహత్యకు యత్నించిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న వెల్లడించారు. వివరాలు ఇలా.. మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల సావిత్రి (62) ఈనెల 11న కడుపునొప్పి బాధ భరించలేక యాసిడ్ తాగి ఆత్మహత్యకు య త్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి కొడుకు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కట్టని గోడలు.. ఈ బండరాళ్లు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రతియేటా గోదావరిలోకి వదిలే మిగులు జలాల తాకిడిని బండరాళ్లు తట్టుకొని నిలబడుతున్నాయి. 42 వరద గేట్ల ద్వారా నీటిని వదిలినా బండరాళ్లు చెక్కుచెదరకుండ కట్టని గోడలా నిలబడుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ముందుగా కుస్తాపూర్ వద్దనే నిర్మించాలని నిర్ణయించారు. కాని విశాలమైన బండరాయి లేకపోవడంతో అక్కడి నుంచి, విశాలమైన బండరాళ్లు గల పోచంపాడ్కు మార్చి నిర్మించారు. ప్రస్తుతం వరద గేట్ల ద్వారా నీటి విడుదల నిలిపి వేయడంతో ఈ బండరాళ్లు ప్రత్యేక అకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో పర్యాటకులు ప్రాజెక్ట్ డ్యాం వైపు కంటే దిగువన గోదావరి వైపునకే వస్తున్నారు. -
ఎంఎంపీటీఎఫ్ను పక్కాగా అమలుచేస్తాం
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో సమీక్షనిజామాబాద్అర్బన్: యూఎన్వో ద్వారా ప్రయోగాత్మకంగా నిజామాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న మైగ్రేషన్ మల్టీ పార్ట్నర్ ట్రస్ట్ ఫండ్ (ఎంఎంపీటీఎఫ్) కార్యక్రమాన్ని పక్కాగా అమలు పరుస్తూ, జిల్లా యంత్రాంగం తరపున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం ఆయన జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం జరిపారు. జిల్లాలో వలసదారులు, దుర్బల కుటుంబాల స్థితిగతులలో మార్పును తేవాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, పూర్తి పారదర్శకంగా అమలయ్యేలా చూస్తామని అన్నారు. కార్యక్రమం ఉద్దేశ్యం, పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి మండలాలను ఎంపిక చేయడానికి గల కారణాలు, సహా పలు అంశాలపై చర్చించారు. జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఏవో గోవిందు, డీపీఆర్వో పద్మశ్రీ, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, డీడబ్ల్యూవో రసూల్బీ, డీపీవో శ్రీనివాస్, రోహిత్ రెడ్డి, మధు సూదన్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి ఉద్యోగులకు వేతన వెతలు
మోర్తాడ్(బాల్కొండ): ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి ఉద్యోగులకు మూడు నెలల వేతనం చెల్లించాల్సి ఉండగా ఏపీవోలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు రెండు నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. దీంతో పలువురు సిబ్బంది జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాల్కొండ ఉపాధిహామీ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్గా పని చేస్తున్న ధనుంజయ్(45) గురువారం పని చేసే చోటనే గుండెపోటుతో మరణించాడు. అతని మరణానికి సకాలంలో జీతాలు రాకపోవడంతోపాటు, ఆర్థిక ఇబ్బందులే కారణం అని సిబ్బంది చెబుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ఉపాధి హామీ పథకం ఉద్యోగులు క్రమశిక్షణతో విధులను నిర్వహిస్తున్నా వేతనాల చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం నిధులు ఇస్తున్నా.. ఉపాధిహామీ పథకం కింద నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. ఈ నిధులతో చేసిన పనులకు చెల్లింపులతో పాటు సిబ్బందికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఉపాధి హామీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో పని చేస్తున్నా వేతనాల భారం మాత్రం కేంద్రంపైనే ఉంది. కేంద్రం చెల్లించే నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుండటంతో వేతనాల చెల్లింపులకు కటకట ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించి చేపట్టే పనులను ఈ పథకం ఉద్యోగులే పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదు. గ్రామాలలో ఏవైనా పనులు చేయాలన్నా, మౌళిక సదుపాయాలను కల్పించాలంటే ఉపాధి హామీ పథకం నిధులనే వినియోగిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఉపాధిహామీ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించి వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో ఉపాధిహామీ ఉద్యోగులు ఏపీవోలు 20 కంప్యూటర్ ఆపరేటర్లు 36 ఇంజినీర్ కన్సల్టెంట్లు 11 టెక్నికల్ అసిస్టెంట్లు 67 ఫీల్డు అసిస్టెంట్లు 317 ఉపాధిహామీ పథకం కింద పని చేసే ఉద్యోగులు ఎంతో శ్రమకోర్చి విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వేతనాల చెల్లింపుల విషయంలో జాప్యం చేయడం తగదు. కేంద్రం ఇచ్చే నిధుల నుంచే వేతనాలు చెల్లించాల్సి ఉన్నా ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. – నర్సయ్య, ఏపీవోల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వం ఉపాధి హామీ ఉద్యోగుల వేతనాల విషయంలో స్పందించాలి. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఉపాధి నిధులను వినియోగిస్తున్నారు. ప్రభుత్వం వేతనాలు చెల్లించే విషయంలో జాప్యం చేయడం సరికాదు. ఎంతో మంది ఉద్యోగులకు వేతనాలు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడుతున్నారు. – సురేష్బాబు, ఉపాధి ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి ఫీల్డు అసిస్టెంట్లకు 3 నెలలుగా, ఇతర ఉద్యోగులకు 2 నెలలుగా అందని జీతాలు సకాలంలో చెల్లించాలని సిబ్బంది వేడుకోలు -
వ్యర్థాలను డిస్పోస్ చేయని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి
జక్రాన్పల్లి: నిబంధనలకు అనుగుణంగా వ్యర్థాలను డిస్పోస్ చేయని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ శివారులోని శ్రీ మెడికేర్ సర్వీసెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ వేస్టేజీని నిర్వీర్యం చేసే ప్లాంట్ను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. జిల్లాలో 900 వరకు ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులు కొనసాగుతుండగా, సగానికి పైగా ఆస్పత్రుల నుంచి వ్యర్థాలను సేకరించడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్ ఏజెన్సీకి వ్యర్థాలు అందించని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయాలని, అయినప్పటికీ మార్పు రాకపోతే ఆస్పత్రుల అనుమతులను రద్దు చేయాలని డీఎంహెచ్వో రాజశ్రీని ఆదేశించారు. ఏజెన్సీ పనితీరును పర్యవేక్షించాలని కాలుష్య నియంత్రణ మండలి ఏఈ మానసను ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ తనిఖీ.. నిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని గంగాస్తాన్ ఫేజ్–1లోగల సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ (సీ.డీ.ఎస్)ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ఇండెంట్ వచ్చిన వెంటనే తాత్సారం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఔషధాలు పంపించాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలె ప్రమాదం ఉన్నందున అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫార్మసిస్ట్ గంగాధర్ను ఆదేశించారు. -
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
బోధన్ టౌన్ (బోధన్): ట్రాక్టర్ బోల్తాపడటంతో జీపీ కార్మికులు బాలాజీ, యాదు మృతిచెందడంతో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని బంధువులు, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు శుక్రవారం బోధన్లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు విద్యుత్ కాంట్రాక్టర్ నష్టపరిహారము చెల్లించాలని, ప్రభు త్వం మృతిచెందిన కార్మికులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. రెండు ఎకరాల పొలం, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పిల్లల చదువుల బాధ్యత తీసుకోవాలన్నారు. సమాచారం అందుకున్న బోధన్ తహసీల్దార్ విఠల్, డీఎల్పీవో, రూరల్ సీఐ విజయ్బాబు వారిని సముదాయించారు. అనంతరం సబ్కలెక్టర్ వికాస్మహతో వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. మృతుల కుటుంబాలకు బోధన్లో ప్లాట్లు ఇస్తామని, కు టుంబ సభ్యులకు ఉద్యోగం కల్పిస్తామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని కల్పిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. వివిధ కార్మిక సంఘాల నాయకులు నరేందర్, సుధాకర్, మల్లేష్, నూర్జహాన్, శంకర్ గౌడ్, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రులు జిల్లా అభివృద్ధిపై దృష్టిపెట్టాలి
● కాంగ్రెస్ కామారెడ్డి బీసీ సభను బహిష్కరించాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి సుభాష్నగర్: జిల్లా ఇన్చార్జి మంత్రులు పర్యటనలు మా నుకుని జిల్లా అభివృద్ధి, వరద బాధిత కుటుంబాలను ఆదుకోవడంపై దృష్టిసారించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద బాధితుల పట్ల ప్రభుత్వం, మంత్రులు కనీసం కనికరం చూపకపోవడం సిగ్గుచేటన్నారు. కామారెడ్డిలో వరద బాధితులకు రూ.11,500 పంపిణీ చేశారని, కానీ రూరల్ నియోజకవర్గంలో బాధితులను పట్టించుకోలేదన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించేది బీసీల సభ కాదని, మైనార్టీ రిజర్వేషన్ల కోసం నిర్వహించే బహిరంగ సభ అని విమర్శించారు. సభకు బీసీలు, బలహీనవర్గాలు, బీసీ సంఘాలు దూరంగా ఉండాలని, ఆ సభను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రమోద్, మాస్టర్ శంకర్, జ్యోతి, నాగరాజు, ఓంసింగ్, శ్రీనివాస్రెడ్డి, తారక్ వేణు, అంబదాస్, ఆకుల శ్రీనివాస్, హరీష్రెడ్డి పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
దుబాయ్లో మోపాల్ వాసి మృతి మోపాల్: మండలకేంద్రానికి చెందిన తలారి సవీన్ (35) దుబాయ్లో మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. సవీన్ ఆగస్ట్ 16న ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. 21న కంపెనీలో పని ముగించుకుని గదిలోకి వచ్చిన సవీన్.. ఫోన్, పర్సు, గుర్తింపు కార్డులు పెట్టి వెళ్లిపోయాడు. ఈనెల 26న రోడ్డు పక్కన చెట్టు కింద విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వా ధీనం చేసుకుని వివరాల కోసం ప్రయత్నించారు. తెలియకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాగా గల్ఫ్ సంఘాలు, గ్రామస్తులు సవీన్ తప్పిపోయాడని వీడియో రూపొందించి వైరల్ చేశారు. ఆ వీడియోను పరిశీలించిన పోలీసులు.. వివరాలు సేకరించి కంపెనీకి సమాచారమిచ్చారు. సవీన్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గల్ఫ్ సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. త్వరగా మృతదేహాన్ని రప్పించే ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మృతుడి తండ్రి తలారి చిన్న లక్ష్మణ్ సైతం దుబాయ్లో ఉన్నాడు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య కృష్ణవేణి కోరుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన కారు బోధన్రూరల్: సాలూర మండలకేంద్రంలోని శివారులో శుక్రవారం ఓ కారు అతివేగం కారణంగా అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు, ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమయ్యాయి. కారులోని ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపారు. -
నిజామాబాద్
● రాజీమార్గమే రాజమార్గం● కేసుల పరిష్కారం దిశగా కృషి ● నేడు మూడో జాతీయ లోక్ అదాలత్ ● జిల్లా న్యాయసేవా సంస్థ చైర్ పర్సన్, ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి చేపలు చేజారుతున్నాయి ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసినప్పుడు చేపలు కొట్టుకుపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– 8లో uఅభాగ్యులకు అండగా..జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి న్యాయసేవా సంస్థ‘సత్వరం, సమన్యాయం అందించే జిల్లా న్యాయసేవా సంస్థ ప్రజల పాలిట కామధేనువు, కల్పవృక్షం. అభాగ్యులకు అండగా నిలుస్తోంది. రాజీమార్గమే రాజమార్గం నినాదంతో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి కేసులు పరిష్కరిస్తోంది.’అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి పేర్కొన్నారు. శనివారం మూడో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా న్యాయసేవా సంస్థ లక్ష్యాలు, ప్రజలకు ఉపయోగాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. – నిజామాబాద్ లీగల్ జాతీయ లోక్ అదాలత్ను ఎందుకు నిర్వహిస్తున్నారు.. లక్ష్యం ఏమిటీ దేశంలో కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో ప్రజల్లో చట్టాలపై అవగాహన పెరిగి కేసుల సంఖ్య సైతం పెరిగింది. దీంతో కోర్టులపై పనిభారం ఎక్కువైంది. కేసుల్ని పరిష్కరించేందుకు చాలా సమయం పడుతుండటంతో జాతీయ న్యాయసేవా సంస్థ రాజీమార్గమే– రాజమార్గం అనే నినాదంతో ఇరుపక్షాలను లోక్అదాలత్ ద్వారా ఒక్కచోట చేర్చి వారి సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తోంది. సాక్షి : న్యాయ సేవా సంస్థ లక్ష్యాలు ఏమిటి జడ్జి : జాతీయ న్యాయసేవా సంస్థ దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా న్యాయసేవా సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రజలు ఎదుర్కొంటు న్న అనేక సమస్యలపై న్యాయ సహాయం అందించడంతోపాటు పరిష్కార మార్గాలను చూపుతోంది. ఏ సమస్యలపై న్యాయసేవా సంస్థను సంప్రదించవచ్చు ప్రజలు నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జిల్లా న్యాయసేవా సంస్థను సంప్రదించొచ్చు. భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల మధ్య త గాదాలు, కుల సంఘాల, వీడీసీల ఆధిపత్య ధోర ణి, ప్రజా సమస్యలపై స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నిర్లక్ష్యం, ఫుట్పాత్ల ఆక్రమణ, గరిష్ట చిల్లర ధరకన్నా అధికంగా వస్తువులు అమ్మడం, హోటళ్లలో వాటర్ బాటిల్ కొనుగోలు చేయాలనే నిబంధన విధించడం లాంటి న్యాయ పరిష్కారం ఉన్న అనేక సమస్యలపై ప్రజలకు న్యాయ సహాయం అందిస్తుంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు న్యాయసేవా సంస్థను సంప్రదిస్తే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తాం. న్యాయం పొందడంపై ప్రజల్లో ఎలా అవగాహన కల్పిస్తోంది? గ్రామాలు, పట్టణాల్లో న్యాయ చైతన్య సదస్సులు నిర్వహిస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కోర్టులను ఆశ్రయించకుండానే న్యాయ సహాయం పొందేందుకు ప్రీ–లిటిగేషన్, మీడియేషన్ వ్యవస్థ ద్వారా వారి మధ్య మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లా న్యాయసేవా సంస్థ హెల్ప్లైన్ నంబర్ 15100 సైతం ఏర్పాటు చేసింది. లోక్అదాలత్ ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో గతంలో నిర్వహించిన రెండో లోక్ అదాలత్లో 29 వేలకు పైగా కేసుల్ని పరిష్కరించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. శనివారం జరగబోయే మూడో జాతీయ లోక్అదాలత్ను మరింత సమర్థవంతంగా నిర్వహించి ఎక్కువ కేసుల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకోసం నిజామాబాద్ జిల్లా కోర్టులో 11, బోధన్లో 4, ఆర్మూర్లో 3 బెంచ్లను ఏర్పాటు చేశాం. మూడు సంవత్సరాలకు మించని శిక్షపడే క్రిమినల్ కేసులతోపాటు సివిల్, మోటారు వాహనాల కేసులు, ఇతరత్రా కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించనున్నాం. ఈ సందర్భంగా నల్సా(నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ) నినాదమైన మీడియేషన్ ఫర్ నేషన్ (దేశం కోసం రాజీమార్గం) అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం. వీడీసీల పెత్తనాన్ని ఎలా అదుపు చేస్తోంది ప్రజలపై ఆధిపత్య ధోరణి అవలంబించే గ్రామాభివృద్ధి కమిటీలపై పోరాడేందుకు జిల్లా న్యాయ సేవా సంస్థ సహాయపడుతోంది. జిల్లాలోని పలు వీడీసీలపై అనేకమంది బాధితులు హైకోర్టును సైతం ఆశ్రయించారు. జిల్లా న్యాయసేవా సంస్థ బాధితులను తమ కార్యాలయానికి పిలిపించుకొని ఫిర్యాదులు స్వీకరించి, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో వీడీసీలపై చర్యలకు ఆదేశించింది. వీడీసీల ఆర్థిక వనరులైన షాపింగ్ కాంప్లెక్స్ వంటి వాటిని సీజ్ చేయడం, అమాయకులైన ప్రజలను వేధించకుండా చర్యలు చేపట్టాం. -
యూరియా గోదాముల తనిఖీ
మాక్లూర్: మండల కేంద్రంలోని పీఏసీఎస్, గ్రోమోర్ గోదాములను జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ శుక్రవారం ఆకస్మికంగా త నిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కొందరు రైతులు లేటుగా నాట్లు వేశారని అలాంటి వారికి సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలన్నారు. రై తులు కూడా అవసరం మేరకే యూరియా చల్లుకోవాలని సూచించారు. వరి పొట్ట దశ లో అధిక యూరియా వాడటంతో చీడపీడ లు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. సొసైటీ, గ్రోమోర్ గోదాంలలో యూరియా నిల్వలు ఉండటంపై డీఏవో సంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారిణి పద్మ ఉన్నారు. అర్బన్పార్క్ను సందర్శించిన డీఎఫ్వో మాక్లూర్: మండలంలోని చిన్నాపూర్ శివారులో ఉన్న అర్బన్ పార్క్ను శుక్రవారం డివిజనల్ ఫారెస్టు అధికారి భవానీశంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్కుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, రోజువారీగా పార్కుకు వస్తున్న సందర్శకుల సంఖ్య వివరాలు తెలుసుకున్నారు. పార్కులో ఎంతమంది డ్యూటీలు చేస్తున్నారని అడిగా రు. ఆయన వెంట ఎఫ్ఆర్వో అశోక్, బీట్ అధికారి సుశీల్ ఉన్నారు. నిజాంసాగర్ 4 గేట్ల ఎత్తివేత నిజాంసాగర్: సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 15,296 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజె క్టు నాలుగు వరద గేట్లను ఎత్తి 21,988 క్యూ సెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1,404.82 అడుగుల(17.542 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఏడు మండలాల్లో అధిక వర్షం నిజామాబాద్అర్బన్: జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షం కురుస్తోంది. ఏడు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. శుక్రవారం 44.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా మోస్రాలో 74.6, చందూరు 71.3, మోర్తాడ్ 65.1, నవీపేట 60.4, ఎడపల్లి 58.5, మోపాల్ 57.7, వర్ని 56.5, నిజామాబాద్ సౌత్ 53.8, ఆలూర్ 52.4. రెంజల్ 51.8, కమ్మర్పల్లి 51.4, మాక్లూర్ 51.2, జక్రాన్పల్లి 50.9, భీమ్గల్ 48.0, ఏర్గట్ల 46.0, సిరికొండ 45.1, రుద్రూర్ 41.2, నిజామాబాద్ నార్త్లో 40.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 24 మండలాల్లో సాధారణ, రెండు మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో శనివారం భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దేవీరోడ్లో వన్ వే ఖలీల్వాడి: నగరంలోని దేవీరోడ్లో వన్ వే ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలి పారు. వ్యాపార సముదాయాలు, బ్యాంకు లు, ఆలయాలు ఉండే ఈ ప్రాంతంలో వా హనాలు రోడ్డుపై పార్కింగ్ చేయడంతో ట్రా ఫిక్ జామ్ అవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో బారికేడ్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వన్ వే ప్రారంభించామన్నారు. వాహనదారులు రైల్వే ఫ్లైఓవర్ వైపు నుంచి గంజ్ గేట్–1 మీదుగా, ద్విచక్ర వాహనదారులు దేవిరోడ్ నుంచి సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వ ద్ద బయటకు వెళ్లాలని తెలిపారు. హెవీ వెహికల్స్, ఆటోలు, ఫోర్ వీలర్స్కి ప్రవేశం లేదన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. -
డీఫాల్ట్ మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్
● ఆస్తులు వేలం వేసి సీఎంఆర్ నిధులు రికవరీ చేయండి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అందించడంలో విఫలమైన డీఫాల్ట్ రైస్మిల్లర్ల పై నిబంధనల మేరకు రెవెన్యూ రికవరీ యాక్టును అమలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా డిఫాల్ట్ మిల్లర్లపై ఇప్పటి వర కు చేపట్టిన చర్యలు, వారి నుంచి రావాల్సిన మొ త్తం, ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారనే వివరాల ను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. డీఫాల్ట్ రైస్ మిల్లులతోపాటు మిల్లర్లకు చెందిన ఆస్తులను బ్లాక్ చేయించాలని, అవసరమైతే ఆస్తులను వేలం వేసి సీఎంఆర్ నిధులను రాబట్టే దిశగా చర్యలు తీ సుకోవాలని స్పష్టం చేశారు. సీఎంఆర్ నిధులు పూ ర్తిస్థాయిలో రికవరీ కావాల్సిందేనని, నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. సీఎంఆర్ రికవరీపై ప్రతి వారం సమీక్ష జరుపుతానని, ఎప్పటికప్పుడు ప్రగతి కనిపించాలని అన్నారు. ‘భూభారతి’ దరఖాస్తులు పరిష్కరించాలి భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
17 నుంచి ‘స్వస్థ్ నారీ– స్వశక్త్ పరివార్ అభియాన్’
నిజామాబాద్ నాగారం: మహిళల ఆరోగ్యం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘స్వస్థ్ నారీ – స్వశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఈ నెల 17న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని డీఎంహెచ్వో రాజశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమం అ క్టోబర్ 2 వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమ నిర్వహణపై రాష్ట్రస్థాయి అధికా రులు శుక్రవారం నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆమె పాల్గొన్నా రు. ‘స్వస్థ్ నారీ – స్వశక్త్ పరివార్ అభియాన్’లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆయుష్మాన్ ఆరో గ్య మందిరాల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో ప్రతి రోజు 10 వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. మహిళలు, గర్భిణులకు గుండె సంబంధ, మధుమేహం, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతోపాటు కంటి, దంత తదితర పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ తుకారాం రాథోడ్, డాక్టర్ రాజు, డీపీవో విశాల, డీడీఎం నారాయణ, డీహెచ్ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
అక్రమ కేసులు.. అప్రజాస్వామికం
● నిజాలు నిర్భయంగా రాయడం తప్పా? ● ‘సాక్షి’ ఎడిటర్, పాత్రికేయులపై కేసులు ఎత్తివేయాలి ● ఏపీ ప్రభుత్వ కుట్రలపై మేధావుల మండిపాటు నిజామాబాద్అర్బన్: ‘ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం జర్నలిజం. ప్రజల సంక్షేమం కోసం పాత్రికేయులు పాటుపడతారు. అలాంటి వారిపై ప్రభుత్వాలు అక్రమ కేసులు బనాయించడం స్వేచ్ఛను హరించడమే’ అవుతుందని మేధావులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తమకు అనుకూలంగా ఉండాలని జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. -
ఆర్టికల్ 19(1)(ఏ)ను అతిక్రమించడమే..
ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై కేసులు పెట్టడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమే. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి తన భావాల్ని వెల్లడించే హ క్కు ఉంటుంది. వాటిని ప్రచురించే హక్కు మీడియాకు ఉంటుంది. భావ ప్రకటనను పా ర్లమెంటరీ భాషలో వెల్లడించాలి. ప్రభుత్వ పనుల్లో లో టుపాట్లను పత్రికలు ఎత్తిచూపుతాయి. అంతమాత్రాన వారిపై చర్యలకు పూనుకోవడం ఆర్టికల్ 19(1)(ఏ)ను అతిక్రమించడమే అవుతోంది. – ఆల్గోట్ రవీందర్, సీనియర్ అడ్వొకేట్, పౌరహక్కుల నాయకుడు -
బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
● కేంద్రం నిర్లక్ష్యంతోనే యూరియా కొరత ● రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆర్మూర్/నిజామాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, డెయిరీ, ఫిషరీష్, క్రీడలు, యువజన శాఖల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. జిల్లా లో శుక్రవారం పర్యటించిన ఆయన నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, ఆర్మూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో మాట్లాడా రు. రాష్ట్రంలో బీసీలకు రాజకీయాలు, విద్య, ఉ ద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఈనెల 15న భారీ వర్షం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కామారెడ్డి సభ రెండు, మూడు రోజులు వాయిదా పడుతుందని, ఆ తర్వాత సభ నిర్వహిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నివర్గాలను కలుపుకుపోతూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్ అంటే మక్కువ పెరిగిందన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. యూరియా కోసం గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రా సినా ఫలితం లేకుండా పోయిందని, దీంతో యూరియా సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి శ్రీహరిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం మత్స్యశాఖకు రూ.123 కోట్లు కేటాయించిందన్నారు. వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో 82 కోట్ల చేపపిల్లలు, 24 కోట్ల రొయ్యలను పెంచుతామన్నారు. సమావేశాల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తెలంగాణ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, వ్యవసాయ కమిటీ సభ్యులు గడుగు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార చైర్మన్ మానాల మోహన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు ముప్ప గంగారెడ్డి, సాయిబాబాగౌడ్, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, నగేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాస్ పుస్తకాలు ఎప్పుడొస్తాయ్?
● నెలల తరబడి నిరీక్షిస్తున్న రైతులు ● పట్టా పాస్బుక్లు లేకపోవడంతో రుణాలివ్వని బ్యాంకులు ● ఇబ్బందులు పడుతున్న అన్నదాతలుమోర్తాడ్(బాల్కొండ) : పట్టాదారు పాస్ పు స్తకాలు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కొత్తగా భూములను కొ నుగోలు చేసిన అనేక మంది పాస్ పుస్త కాల కోసం మూడు, నాలుగు నెలల నుంచి ఎదురుచూస్తున్నారు. వ్యవసా య భూమి రిజిస్ట్రేషన్ సందర్భంగా కొత్త పట్టాదా రు పాస్ పుస్తకం కోసం రూ.300 వసూలు చేస్తున్నా రు. గతంలో పాస్ పుస్తకం ఉన్న వారు భూమిని కొనుగోలు చేస్తే అందులోనే వివరాలను నమోదు చేసి ఇస్తున్నారు. ఒక్కో మండలంలో 5 నుంచి 10 రిజిస్ట్రేషన్లు.. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసా య భూములను తహసీల్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మ్యు టేషన్ ప్రక్రియను పూర్తి చేసి, రిజిస్ట్రేషన్ పత్రాలు, ప్రొసీడింగ్ కాపీ, డూప్లికేట్ పీపీలను అందిస్తున్నా రు. అనంతరం రిజిస్ట్రేషన్ వివరాలు సీసీఎల్ కార్యాలయం ద్వారా బెంగళూరులోని ఏజెన్సీకి వెళ్తాయి. అక్కడ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట కొత్త పాస్ పుస్తకం ముద్రించి పోస్టులో ఇంటికి పంపిస్తారు. జిల్లాలోని చిన్న మండలాల్లో రోజుకు ఐదు, పెద్ద మండలాల్లో 10 చొప్పున రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇలా గత నాలుగైదు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న సుమారు వెయ్యి మందికి ఇప్పటి వరకు పట్టా పాస్ పుస్తకాలు అందలేదు. బ్యాంకర్ల విముఖత కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారు పంట రుణాలు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నా రు. తహసీల్ కార్యాలయంలో ఇచ్చే రిజిస్ట్రేషన్ ప త్రాలు, ప్రొసీడింగ్ కాపీలను చూపినా పంట రుణా లు ఇచ్చేందుకు బ్యాంకర్లు విముఖత చూపుతున్నా రు. వాస్తవానికి భూ భారతి వెబ్పోర్టల్లో రైతు వి వరాలను పరిశీలించి పంట రుణం ఇవ్వాలని ప్ర భుత్వం నిబంధన విధించింది. కానీ, బ్యాంకర్లు మాత్రం ఉన్నతాధికారుల సూచనల ప్రకారం పట్టా పాస్ పుస్తకం పరిశీలన తర్వాతే రుణాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వెంటనే ప్రొసీడింగ్ కాపీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తున్నాం. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తున్నాం. పాస్ పుస్తకం లేకపోయినా ఆన్లైన్లో వివరాలను పరిశీలించి బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వాలి. పాస్ పుస్తకాలు పోస్టులో రావడానికి కొంత సమయం పడుతుంది. – కృష్ణ, తహసీల్దార్, మోర్తాడ్ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన రైతు నవీన్ ఎకరం వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తహసీల్దార్ ప్రొసీడింగ్ కాపీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అందజేశారు. కొత్త పట్టాపాస్ పుస్తకం పోస్టులో వస్తుందని చెప్పగా, నెల రోజులు గడచినా ఇంకా రాలేదు. రైతు తహసీల్ కార్యాలయంలో అడిగితే అది తమ పరిధిలో లేదని సమాధానం ఇచ్చారు. -
బ్యాక్టీరియా బారిన వరి
డొంకేశ్వర్(ఆర్మూర్): చిరు పొట్ట దశకు వచ్చిన వరి పంటపై ఎండాకు తెగులు బ్యాక్టీరియా దాడి చేస్తోంది. మోతాదుకు మించి యూరియా వాడకం, తీవ్రమైన ఎండలు, అధిక వానలతో ఎండాకు తెగులు సోకే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెప్తున్నారు. దీనిని నివారించే మందులు లేకపోగా.. ఒక మొక్కనుంచి మరో మొక్కకు వ్యాపించకుండా యాంటీ బయాటిక్స్ రసాయనిక మందులు పిచికారీ చేయడమే మార్గమని సూచిస్తున్నారు. 4,34,695 ఎకరాల్లో సాగు.. ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,34,695 ఎకరాల్లో రైతులు వరిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పొలాలన్నీ చిరు పొట్ట దశకు చేరుకున్నాయి. విత్త నాలు బయటికి వచ్చే సమయంలో ఎండాకు తెగు లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్క పైభాగంలో తెచ్చటి మచ్చలు ఏర్పడి ఆకు లు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఇది ఒకటి, రెండు మొక్కలతో మొదలై పొలమంతా వ్యాపిస్తోంది. త ద్వారా దిగుబడిపై ప్రభావం పడుతుంది. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆ వెంటనే తీవ్రమైన ఎండలతో వాతావరణం నిలకడగా లేదు. దీనికి తోడు రైతులు పరిమితికి మించి యూరియా చల్లారు. వాస్తవానికి ఎకరానికి మూడు డోసులు కలిపి రెండు నుంచి మూడు బస్తాలు సరిపోతుంది. కానీ, రైతులు పొలం త్వరగా ఎదగాలనే ఉద్దేశంతో ఎకరానికి నాలుగైదు, అంతకుమించి బస్తాల యూరియా వేశారు. దీంతో తెగుళ్లు, చీడపీడలు సోకుతున్నాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. పంటకు సోకిన బ్యాక్టీరియా పూర్తిగా వ్యాపించకుండా రైతులు యాంటీ బయాటిక్స్ మందులను స్ప్రే చేస్తున్నారు. ఎండాకు తెగులు వ్యాప్తిని అరికట్టే యాంటీ బయా టిక్స్ రసాయనాలు అందుబాటులో ఉన్నాయి. అగ్రి మైసన్ లేదా ప్లాంటమైసిన్తో కాపర్ ఆక్సిక్లోరైడ్ పిచికారీ చేయాలి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. స్థానిక వ్యవసాయాధికారులను రైతులు సంప్రదించాలి. పూత దశలో ఉన్నప్పుడు కాపర్ సంబంధిత శీలింధ్ర నాశినులు వాడొద్దు. – మధుసూదన్, ఏవో, డొంకేశ్వర్ చిరు పొట్ట దశలో సోకిన ఎండాకు తెగులు అధిక యూరియా, వాతావరణ మార్పులే కారణమంటున్న వ్యవసాయ అధికారులు విస్తరించకుండా యాంటీబయాట్సిక్ వినియోగిస్తున్న రైతులు -
గొంతు నొక్కాలని చూస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు
ఏపీలో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నా రని ఇప్పటి చర్యల వల్ల అర్థం అవుతోంది. జర్నలిస్టు లు వారి బాధ్యతల ను వారు సక్రమంగా నిర్వహిస్తే క్రిమినల్ కేసులు న మోదు చేయడం సరికాదు. ప్రజల గొంతుకగా ఉ న్న జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తే ప్రజలే గు ణపాఠం చెబుతారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు కు రెండుసార్లు ప్రజలు గుణపాఠం చెప్పిన విష యం మరిచిపోయినట్లు ఉన్నారు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలపై కాకుండా పగతో ఊగిపోవడం సరికాదు. – తక్కూరి సతీష్, జిల్లా టెలికం బోర్డు మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మోర్తాడ్ -
అప్రజాస్వామిక పద్ధతులు విడనాడాలి
పత్రికలు, మీడియాపై దాడులు చేయడమంటే పత్రికా స్వే చ్ఛను హరించడమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒ క్కరి హక్కులను కాపా డాల్సిన బాధ్యత ప్రభుత్వా లపైనే ఉంటుంది. కుట్రతో అక్రమ కేసులు బనాయించడం, భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వా మ్య విరుద్ధం. చట్టసభలు, పత్రికలు, బ్యూరోక్రాట్లు ప్రధాన అంగాలు. వీటిలో ఏ ఒక్కటి దెబ్బతిన్నా ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటది. ప్రభుత్వాలు అప్రజాస్వామిక పద్ధతులు విడనాడాలి. పత్రికలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – ఎ.రమేష్బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి -
మృత్యు అంచున చేపపిల్లలు
బాల్కొండ: జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ సందిగ్ధంలో పడింది. టెండర్ల నిర్వహణలో జాప్యం కారణంగా మత్స్యకారులకు చేపపిల్లల సరఫరా ఆలస్యమవుతోంది. దీంతో ఎస్సారెస్పీ దిగువన ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో చేపపిల్లల సైజు పెరిగి కుండీల్లో ఇమడలేక చనిపోయే ప్రమాదం నెలకొంది. 180 చెరువులు, 65 సంఘాలు.. ఎస్సారెస్పీ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం పరిధిలో నందిపేట్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లోని 180 చెరువులు, 65 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత సంవత్సరం 54 లక్షల చేపపిల్లల ఉత్పత్తి లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. కాగా 30 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేసి నర్సరీల్లో వేశారు. సాధారణంగా 35–40 ఎంఎం సైజు పెరగగానే చేప పిల్లలను చెరువుల్లో వదలాలి. ఇప్పటి వరకు చేపపిల్లలు మత్స్యసహకార సంఘాలకు చేరలేదు. దీంతో నర్సరీల్లోని చేప పిల్లల సైజు 80–100 ఎంఎంకు చేరుకుంటోంది. తద్వారా నర్సరీ కుండీల్లో చేపపిల్లలకు స్థలం సరిపడక చనిపోయే ప్రమాదం నెలకొంది. మరోవైపు చేపపిల్లలకు దాణా కూడా సరిపోయే పరిస్థితి లేదు. దీంతో చేపపిల్లలు చేతికందకుండా పోతాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెండర్లతో లింకు వద్దురాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్ట్లకు ప్రభుత్వం నీలి విప్లవంలో భాగంగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుంది. ఇందుకోసం టెండర్లను నిర్వహిస్తారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ చేపపిల్లలను సరఫరా చేస్తారు. అయితే ఇప్పటి వరకు టెండర్లు పూర్తికాలేదు. ఆ టెండర్లకు, ఉత్పత్తి కేంద్రంలోని చేపపిల్లలకు లింకు పెట్టడంతో పంపిణీకి నోచు కోవడం లేదు. టెండర్లు కూడా ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. టెండర్లకు సంబంధం లేకుండా త్వరగా చేపపిల్లలను పంపిణీ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.కేంద్రంలోని చేప పిల్లలకు సరిపడా దాణా అందించలేకపోతున్నాం. సైజ్ ఎక్కువగా పెరిగినట్లు ఉన్నతాధికారులకు నివేదించాం. ఆదేశాలు రాగానే చేపపిల్లల పంపిణీ చేపడతాం. – దామోదర్, మత్స్య అభివృద్ధి అధికారి, పోచంపాడ్ ఉత్పత్తి కేంద్రంలోనే చేప పిల్లలు సైజు పెరిగి కుండీల్లో ఇమడని వైనం సరిపడా ఆహారం అందించలేకపోతున్న అధికారులు చేప పిల్లలు పంపిణీ చేయాలని మత్స్యకారుల డిమాండ్ టెండర్ల జాప్యంతో ఇబ్బందులు -
రోగుల బారులు..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్లో ఓపీ వద్ద బారులు తీరిన రోగులుఇటీవల కురిసిన వర్షాల వల్ల సీజనల్ వ్యాధుల ప్రభావంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం 2,156 మంది అవుట్ పేషెంట్లు నమోదయ్యారు. జ్వరాలు, దగ్గు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రికి వస్తున్నారు. ఒకే రోజు రెండువేలకుపైగా ఓపీ నమోదు కావడం ఈనెలలో తొలిసారి అని ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
గోదావరిలోకి నిలిచిన నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు గురువారం ఉదయం నిలిపివేశారు. బుధవారం రాత్రికి ప్రాజెక్ట్లోకి వరద నీరు పోటెత్తడంతో గోదావరిలో 75 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. తర్వాత క్రమంగా నీటి విడుదలను తగ్గించారు. గురువారం ఉదయం పూర్తిగా నీటి విడుదలను నిలిపి వేశారు. ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు ప్రాజెక్ట్లోకి 385 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అందులో 245 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కులు , సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, గుత్ప లిప్టు ద్వారా 270 క్యూసెక్కులు, అలీసాగర్ లిప్టు ద్వారా 360 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 684క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి అంతేస్థాయి నీటిమట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. -
కొండ చిలువ పట్టివేత
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో గురువారం 9 అడుగుల కొండ చిలువను పట్టుకున్నారు. అయిలాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారి వెంబడి గల డ్రెయినేజీలో అలికిడి రావడంతో గ్రామస్తులు చూడగా భారీ పాముగా గుర్తించారు. వెంటనే నందిపేటకు చెందిన పాములు పట్టే సర్వర్కు సమచారం అందించారు. వెంటనే సర్వర్ అయిలాపూర్కు చేరుకుని గ్రామస్తుల సహకారంతో డ్రెయినేజీలోని కొండ చిలువను పట్టుకుని రోడ్డుపై పడవేశాడు. కొంతసేపు కొండచిలువ అటుఇటుగా తిరగడంతో గ్రామస్తులు భయంతో కేకలు వేశారు. చివరికి దానిని అదుపులోకి తీసుకుని సంచిలో వేశాడు. పట్టుకున్న కొండ చిలువను అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్లు సర్వర్ వివరించాడు. -
బిల్లులు సకాలంలో చెల్లించాలి
● అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం ● సిరన్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన నవీపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లులను సకాలంలో చెల్లించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నవీపేట మండలంలోని సిరన్పల్లి గ్రామంలో గురువారం ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో 93 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 69 గ్రౌండింగ్ అయ్యాయని, 12 ఇళ్లు స్లాబ్ దశకు చేరుకున్నాయన్నారు. ఇంకా 24 మంది లబ్ధిదారులతో మాట్లాడి వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల తనిఖీ నవీపేటలోని ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల ను కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న భూభారతి అర్జీలను పరిశీలించాలన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, హౌసింగ్ పీడీ పవన్కుమార్, ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకట రమణ ఉన్నారు. -
కుక్కర్ పేలి ఎండీఎం కార్మికురాలికి గాయాలు
మాక్లూర్: పాఠశాలలో మధ్యాహ్న భో జనం (ఎండీఎం) వండుతున్న కార్మికురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా.. మండలంలోని అమ్రాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం రాంపూర్ లలిత అనే కార్మికురాలు వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు కుక్కర్ పేలింది. దీంతో కుక్కర్లోని పప్పు ముఖంపై చిల్లి తీవ్రంగా గాయపడింది. ఉపాధ్యాయులు వెంటనే గమనించిన ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆమె కుటుంబ సభ్యులు ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతంలలిత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. విషయం తెలిసిన ఏఐటీయూసీ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు గురువారం ఆస్పత్రిలో లలితను పరామర్శించారు. లలిత వైద్యఖర్చులన్ని జిల్లా విద్యాశాఖ భరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి డిమాండ్ చేశారు. లేనిచో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గోడ కూలి వృద్ధ దంపతులకు .. మద్నూర్(జుక్కల్): మండలంలోని హండేకేలూర్లో ఇంట్లోని గోడ కూలడంతో వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. హండేకేలూర్లోని ఇంట్లో తుమ్మల్వార్ హన్మండ్లు, రుక్మిణీబాయి అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం ప్రమాదవశాత్తు ఇంట్లోని గోడ కూలి వారిపై పడటంతో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ముజీబ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు ఘటన స్థలానికి చేరుకొని, బాధితులను చికిత్స నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు కురవడంతో హన్మండ్లు ఇంటి గోడ నాని తడిసిపోవడంతో కూలిపోయిందని స్థానికులు తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లలో ఉండరాదని, ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని దరాస్ సాయిలు సూచించారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను పరిశీలించారు. బైక్ను ఆటో ఢీకొనడంతో దంపతులకు.. ఖలీల్వాడి: నగరంలోని కుమార్గల్లీ వద్ద ఆటో, బైక్ను ఢీకొడంతో ఇద్దరికి గాయాలైన్నట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా.. నగరంలోని కుమార్గల్లీ వద్ద బైక్పై సాయిలు, అతడి భార్య వెళుతుండగా వెనుక నుంచి ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిలు, అతడి భార్యకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఇంటర్వ్యూలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మ్యాథమెటిక్స్, ఫిజి క్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఈసీఈ, ఈఈఈ, మెకా నికల్, సివిల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులు బోధించటానికి గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం గురువారం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు వందమంది అభ్యర్థులు రాగా, వర్సిటీ పరిపాలన భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం నుంచి ఇంటర్వ్యూలు చేశారు. తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆరతి విషయనిపుణులను సమన్వయం చేశారు. వివిధ విభాగాల కోఆర్డినేటర్స్ నందిని, అతిక్ సుల్తాన్ ఘోరి, భ్రమరాంభిక, నీలిమ సాంకేతిక సహాయం అందించారు. ప్రశాంతంగా ఎంఈడీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో ఒక విద్యార్థికి గానూ ఒకరు హాజరైనట్లు ఆయన తెలిపారు. జాతీయస్థాయి బాస్కెట్బాల్ ఎంపికలకు జిల్లా జట్టు ఖరారు నిజామాబాద్నాగారం: నగరంలోని డీఎస్ఏ మైదానంలో గురువారం జిల్లా బాస్కెట్బాల్ సంఘం ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలబాలికల జాతీయస్థాయి బాస్కెట్ బాల్ ఎంపికలకు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేశారు. బాలుర విభాగంలో 13 మంది, బాలిక విభాగంలో ఏడుగురు ఎంపికయ్యారు. వీరిని ఈనెల 12న హైదరాబాద్లో నిర్వహించే జాతీయ స్థాయి ఎంపిక పోటీలకు పంపనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీరెల్లి విజయ్ రావు, బొబ్బిలి నరేష్ రావు, కార్యనిర్వాహక కార్యదర్శి నిఖిల్ తెలిపారు. సంఘ సభ్యులు శ్రీనివాస్, బెనర్జీ , విశాల్, ప్రణీత్, అరుణ్, నవీన్ పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నాం
● ఈనెల 15న కామారెడ్డిలో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలి ● డీసీసీ అధ్యక్షుడు, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకా రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని డీసీసీ అధ్యక్షుడు, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మానాల మాట్లాడుతూ.. జనాభా ప్రకారం రిజ ర్వేషన్లు అమలు చేయాలన్న ఏఐసీసీ అగ్రనేత రా హుల్గాంధీ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలుచేస్తున్నామన్నారు. బీసీ రి జర్వేషన్లపై అసెంబ్లీలో జరిగిన చర్చకు బీజేపీ ఎమ్మెల్యేలు మద్ధతు పలికితే, బీజేపీ ఎంపీలు మాత్రం రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని, ద్వంద్వ నీతిని అవలంభిస్తున్నారని మండిపడ్డారు. యూరియా కొ రతకు కేంద్రప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. యూ రియా కొరత జిల్లాలో పెద్దగా లేదన్నారు. బీసీల రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తీసివేయాలని బీజే పీ ఎంపీలు వితండవాదం చేస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీ సీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 15న కామారెడ్డిలో ముఖ్యమంత్రి హాజరయ్యే బీసీ గర్జనను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఓబీసీ అధ్యక్షుడు రాజనరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షుడు కెతావత్ యాదగిరి, సీనియర్ నాయకులు మహ్మద్ ఖుద్దూ స్, ప్రమోద్ కుమార్, వేణురాజ్, బోదిరే స్వామి, కేశ మహేష్, తిప్పిరెడ్డి శ్రీనివాస్, ఈసా, అబ్దుల్ ఎ జాజ్, సుభాష్ జాదవ్, సంగెం సాయిలున్నారు. -
క్రైం కార్నర్
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు జీపీ కార్మికుల మృతి ● విద్యుత్ స్తంభాలు తరలిస్తుండగా ఘటన బోధన్రూరల్: బోధన్ మండలం బిక్నెల్లీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు జీపీ కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాలు ఇలా.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బిక్నెల్లీ గ్రామ శివారులోని పొలాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో కొత్త స్తంభాలను తీసుకురావడానికి జీపీ డ్రైవర్ రాజు (అవుట్ ఓర్సింగ్), జీపీ కార్మికులు బాగారే బాలాజీ (42) (మల్లీపర్పస్ వర్కర్), బాగారే యాదు (40) (ఔట్సోర్సింగ్ వర్కర్) గురువారం రాంపూర్ సబ్సేష్టన్కు వెళ్లారు. అక్కడి నుంచి ట్రాక్టర్పై విద్యుత్ స్తంభాలను తీసుకొని గ్రామానికి బయలుదేరారు. కల్దుర్కి శివారులో ఓవర్ లోడ్ కారణంతో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ను నడిపిస్తున్న రాజు గాయాలతో బయటపడగా, ట్రాలీలో ఉన్న బాగారే బాలాజీ, బాగారే యాదుపై స్తంభాలు పడటంతో అక్కడిక్కడే మృతి చెందారు. బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. జీపీ కార్యదర్శి సుధాకర్ ఆదేశాల మేరకే జీపీ సిబ్బంది ట్రాక్టర్లో స్తంభాలను తరలించారని ప్రచారం జరుగగా, ఘటనపై వివరాల కోసం జీపీ కార్యదర్శిని ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. గుండెపోటుతో టీఏ మృతి బాల్కొండ: మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ధనుంజయ్(45) గుండెపోటుతో మృతిచెందారు. విధుల్లో భాగంగా గురువారం ధనుంజయ్ బైక్పై బస్సాపూర్ గ్రామానికి బయలుదేరాడు. గ్రామంలో పర్యటిస్తుండగా అస్వస్థతకు గురై గుండెపోటు వచ్చింది. వెంటనే స్థానికులు అతడిని చికిత్సకు తరలించేలోపు మృతి చెందాడు. సమయానికి జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒత్తిడికి గురికావడంతోనే ధనుంజయ్కి గుండెపోటు వచ్చిందని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య ఎల్లారెడ్డి: ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సబ్దల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. సబ్దల్పూర్ గ్రామానికి చెందిన బత్తుల సావిత్రి (20) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి తండ్రి రాంచందర్ ఇంటికి రాగా, ఉరివేసుకున్న కూతురును చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. సావిత్రికి లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నదని, అతడు నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాంచందర్ ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై యువకుడు.. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గూపన్పల్లిలో ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్హెచ్వో ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. గూపన్పల్లికి చెందిన చింతకుంట రాజు(30) ఆటోడ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా రాజు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల కారణంగా తాగుడుకు బానిసయ్యాడు. ఈక్రమంలో గురువారం తీవ్ర మనస్తాపానికి గురై, ఇంటిలో ఎవరు లేని సమయంలో రాజు ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో వివరించారు. -
యువకుడి అదృశ్యం
ఖలీల్వాడి: నగరంలోని వినాయక్ నగర్కు చెందిన కాంపెల్లి రాము అదృశ్యం అయినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. వినాయక్ నగర్లోని అంగిటి హోటల్ వద్ద రాము అదృశ్యమయ్యాడని, అతడి మానసిక స్థితి బాగాలేదని సోదరుడు తిరుపతి పేర్కొన్నాడు. తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరికై నా రాము ఆచూకీ తెలిస్తే 8712659840, 8712659836కు సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు. అక్రమ మద్యం స్వాధీనం మోర్తాడ్: భీమ్గల్ మండలం బాబాపూర్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై గోవర్ధన్ గురువారం తెలిపారు. బాబాపూర్కు చెందిన జంగిటి నరేష్, సుమలత వద్ద 7.92 లీటర్ల అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నామని, వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమ మద్యం స్వాధీనం ఘటనలో సిబ్బంది దత్తాద్రి, శ్రీనివాస్రెడ్డి, జగదీష్, రాణిలు పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. బోధన్ ఎస్బీఐలో రూ. 5లక్షల నగదు చోరీ బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో రూ. 5లక్షలు చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో ఈ నెల 8న బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కౌంటర్ నుంచి రూ. 5లక్షలను చోరీ చేశారు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు 10వ తేదీన గుర్తించగా, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని సీఐ గురువారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు కార్యాకలాపాలు జరిగే సమయంలో బ్యాంకు అధికారులు ఎవరు ఏమి చేస్తున్నారో గమనించాలని, బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఐ తెలిపారు. -
విద్యారంగంలో తెయూ గణనీయమైన ప్రగతి
● వీసీ యాదగిరిరావు ● ఘనంగా వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం తెయూ(డిచ్పల్లి):విద్యారంగంలో తెలంగాణ యూ నివర్సిటీ గణనీయమైన ప్రగతి సాధించిందని తె యూ వీసీ యాదగిరిరావు అన్నారు. క్యాంపస్ ఆవరణలో గురువారం తెలంగాణ యూనివర్సిటీ ఆవి ర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరితో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ 11 సెప్టెంబర్ 2006న 6 కోర్సులు, 12 మంది రెగ్యులర్ అధ్యాపకులతో ప్రారంభం కా గా, గడిచిన 19 ఏళ్లలో రాష్ట్రంలో మూడో అతిపెద్ద యూనివర్సిటీగా పరిణామం చెందడం గర్వకారణంగా ఉందన్నారు.ప్రస్తుతం 60 మందికి పైగా రెగ్యులర్ అధ్యాపకులు, 50 మందికి పైగా కాంట్రా క్టు అధ్యాపకులు, 13 మంది నాన్ టీచింగ్ సిబ్బంది, 275 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది, మూడు క్యాంపస్లలో 31 కోర్సులకు విస్తరించిందన్నారు. అందరి సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని కోర్సులను తెలంగాణ యూనివర్సిటీలో ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. కంట్రోలర్ సంపత్ కుమార్, యూజీసీ కోఆర్డినేటర్ ఆంజనేయు లు,ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి, అధ్యాపకులు అపర్ణ,రవీందర్రెడ్డి,ఎల్లోసా,అతీక్ సుల్తాన్ ఘోరి,సత్యనారాయణరెడ్డి,వాణి,భ్రమరాంబిక,స్రవంతి,నీలిమ,అసిస్టెంట్ రిజిస్ట్రార్ సా యాగౌడ్, ఏఈ వినోద్, తదితరులు పాల్గొన్నారు. -
చిత్రం.. సందేశాత్మకం
ఆర్మూర్లోని రోడ్డు పక్కన గోడలపై వేసిన చిత్రాలుఆర్మూర్టౌన్ : మొన్నటి వరకు కళావిహీనంగా కనిపించిన గోడలు.. ప్రస్తుతం సందేశాత్మక చిత్రా లతో ఆకట్టుకుంటున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రితోపాటు వివిధ కార్యాలయాలు, కూరగాయల మార్కెట్ ప్రహరీలు కొత్తందాలను సంతరించుకుంటున్నాయి. సర్కారీ గోడలపై అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తూ పట్టణ పురపాలక సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. రూ. 4 లక్షలతో శుభ్రత, పారిశుద్ధ్యం, ప ర్యావరణ పరిరక్షణ, మాదక ద్రవ్యాలను మాన్పించడం, తెలంగాణ సంస్కృతి, రైతుల గౌరవం వంటి అంశాలు ప్రతిబింబించేలా చిత్రాలను గీయిస్తున్నారు. ఇలాంటి చిత్రాలతో గోడ సమీపంలో చెత్త వేయాలనే ఆలోచన రాదని, అవగాహన సైతం పెరుగుతుందని పుర ప్రజలు చెబుతున్నారు. ఆర్మూర్ పట్టణాన్ని అందంగా మార్చడమే లక్ష్యం. ప్రజల్లో వివిధ అంశాలపై అవగాహన పెంపొందించేందుకు చిత్రాలు వేస్తున్నాం. దీంతో పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. చెత్త వేయాలన్న ఆలోచన రాదు. – రాజు, మున్సిపల్ కమిషనర్, ఆర్మూర్