breaking news
Nizamabad District News
-
మొరాయించిన మాధవనగర్ రైల్వేగేటు
నిజామాబాద్ రూరల్: బర్ధిపూర్ శివారులోని మాధవనగర్ రైల్వేగేటు సోమవారం మొరాయించింది. దీంతో ఇరువైపులా వాహనదారు లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వే ళ రైలు వస్తుండటంతో గేట్మన్ రైల్వేగేటు వే శాడు. రైలు వెళ్లిన అనంతరం ఒకవైపు గేటు లే వగా కొందరు వాహనదారులు ముందుకు వె ళ్లారు. కానీ ఇంకో గేటు లేవకపోవడంతో ప్ర యాణికులు పట్టాల మధ్యలోనే ఉండిపోయా రు. అరగంట తర్వాత మళ్లీ గేట్మన్ రైల్వేగేట్ను వేసి తీయడంతో గేటు మొత్తం రెండు వైపులా తెరుచుకోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. -
బీజేపీ, ఎంఐఎంలవి ఎన్నికల డ్రామాలు
నిజామాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఎన్నికల డ్రామాలు చేస్తున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో మున్సిపల్ కమిషనర్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయగా, ప్రతి పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు మించకుండా రావాల్సి ఉండగా, బీజేపీ, ఎంఐఎం నాయకులు తమ కార్యకర్తలతో కలిసి అధిక సంఖ్యలో వచ్చారన్నారు. నిజామాబాద్లో ఓటు హ క్కు లేని షబ్బీర్అలీ కొడు కు ఇలియాస్ నిజామాబాద్ మేయర్ అవ్వడానికి ఎలా సాధ్యమవుతుందొ బీజేపీ జిల్లా అధ్యక్షుడే తెలపాలని ఆయన అన్నారు. -
‘కార్పొరేషన్’పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం
● మేయర్ పీఠంపై ఇందూరు బిడ్డనే కూర్చోబెడతాం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి సుభాష్నగర్: మున్సిపల్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని, మేయర్ పీఠంపై ఇందూరు బిడ్డనే కూర్చోబెడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి స్పష్టంచేశారు. షబ్బీర్, బషీర్ల కుమారులను కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ముగిసిన అ నంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆ యన మాట్లాడారు. ఓటరు జాబితాలో అవకతవకలపై బీజేపీ ప్రశ్నించగానే అధికార దుర్వినియోగం, మత రాజకీయాల అసలు స్వరూపం బయటపడ్డా యని విమర్శించారు. బోగస్ ఓట్లు, అక్రమ రాజకీ యాలు, బెదిరింపుల పాలనకు ముగింపు దగ్గర్లోనే ఉందని స్పష్టంచేశారు. ఇందూరు ప్రజల గుండెల్లో బీజేపీ ఉందని, మేయర్ పీఠం మీద కూడా బీజేపీ నే, హిందూ బిడ్డనే ఉంటాడని స్పష్టంచేశారు. మాజీ కార్పొరేటర్లు, నాయకులు న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, ఆకుల శ్రీనివాస్, తారక్ వేణు, విజయ్, శ్రీనివాస్రెడ్డి, బాలకృష్ణ, ఓంసింగ్, సాయివర్ధన్, శ్రీనివాస్, సుధీర్, ఆనంద్, శ్రీకర్, పాల్గొన్నారు. బీజేపీలో పలువురి చేరిక సుభాష్నగర్: మాజీ కార్పొరేటర్ ప్రమోద్కుమార్ నేతృత్వంలో 4వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, పాంగ్రా మాజీ సర్పంచ్ భీమ్సింగ్, ఎల్ఐసీ శ్రీనివాస్, తదితరులు తమ అనుచరులతో బీజేపీలో చేరారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో వారికి సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి బీజేపీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తామని ఆయన తెలిపారు. పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ నేతలను దూషించే హక్కు బీఆర్ఎస్కు లేదు
● సబ్బండవర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం ● కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేశ్ రెడ్డి నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీని, సీఎం రేవంత్రెడ్డిని దూషించే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు కాంగ్రెస్ పార్టీ నేతలను అవమానించేలా అసెంబ్లీలో మాట్లాడటం సరికాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని కేటీఆర్ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత సీఎం, ప్రతి పేదవానికి డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చిందా అని ప్రశ్నించారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్నారని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పల తెలంగాణాగా మార్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అందించినట్లు తెలిపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, దాదాపు రూ.22 కోట్ల వరకు రైతు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమ మే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మరోసారి కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీ ఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జావిద్ అక్రమ్, సంతోష్, వేణురాజ్, యాదగిరి, వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి, రాజేందర్, శోభన్, కౌశిక్, దేగం గంగారెడ్డి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ను కలిసిన అధికారులు, విద్యార్థినులు
నిజామాబాద్ అర్బన్: జిల్లా నూతన కలెక్టర్గా నియమితులైన ఇలా త్రిపాఠిని సోమవారం వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి పరిచయం చేసుకున్నారు. అలాగే కోటగల్లి, నాందేవ్వాడ ఎస్సీ బాలికల వసతిగృహం విద్యార్థులు గ్రీటింగ్లను అందించారు. సిరికొండ: జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని నీరు గారేలా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మండల కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇట్టెంపేట రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధిహామీ పథకం స్థానంలో తెచ్చిన వీబీ జీ రాంజీ మిషన్ను రద్దు చేయాలన్నారు. సొసైటీ హాల్లో నిర్వహించే సమావేశాన్ని అన్ని వర్గాల శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. సుభాష్నగర్: నగరంలోని పెరిక భవన్లో సోమవారం పెరిక సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మైదం రాజన్న, అసోసియేట్ అధ్యక్షుడిగా గొర్ల లింగం, కార్యదర్శిగా అల్లే రమేష్, ఉపాధ్యక్షులుగా విశ్వనాథం, కోశాధికారిగా వేణు ఎన్నికయ్యారు. జిల్లాలోని 48 గ్రామాల పెరిక సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ..పెరిక సంఘం సభ్యుల అభ్యునతికి పాటుపడతానని అన్నారు. సిరికొండ: సర్పంచ్ల ఫో రం మండలాధ్యక్షుడిగా దు ప్యతండా సర్పంచ్, డీసీసీ కార్యదర్శి మాలావత్ చందర్నాయక్ ఏకగ్రీవంగా ఎ న్నికయ్యారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో అతడిని సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. మిగతా కార్యవర్గాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బా కారం రవి, డీసీసీ కార్యదర్శి ఎర్రన్న, నర్సారెడ్డి, పిట్ల నర్సింగ్, చల్ల రాజారెడ్డి, దేగాం సాయన్న, రవినాయక్, సర్పంచ్లు మల్లేష్యాదవ్, లతభాస్కర్రెడ్డి, పిట్ల వనిత పాల్గొన్నారు. -
విద్యుత్ మరమ్మతులు సొంతంగా చేయొద్దు
ధర్పల్లి: విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు ప్రజ లు సొంతంగా మరమ్మతులు చేయొద్దని గ డ్కోల్ సెక్షన్ ఏఈ శివకుమార్ అన్నారు. మండలంలోని హోన్నాజీపేట్ గ్రామంలో సోమవా రం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. రైతులకు, వినియోగదారులకు విద్యుత్ వల్ల జరిగే ప్రమాదాలను, జా గ్రత్తలను వివరించారు. రైతులు నాణ్యమైన కరెంటు కోసం ఐఎస్ఐ ఉన్న కెపాసిటర్లు, మో టార్లను వాడాలన్నారు. కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రావు, లైన్మెన్ కాశీ రాం, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: ఐరన్ అధికంగా ఉండే పాలు, పండ్లు, ఆకుకూరలు వంటి పౌష్టికాహారంతోనే ఆ రోగ్యం లభిస్తుందని డాక్టర్ అంకం భానుప్రి య తెలిపారు. నగరంలోని శంకర్ భవన్ ప్ర భుత్వ పాఠశాలలో సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా అమె విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. హెచ్ఎం సాయన్న, క్లబ్ ప్రతినిధులు అబ్బా యి లింబాద్రి, రాఘవేంద్ర బాబు, అంకం రా జేందర్, చింతల గంగాదాస్, ఉపాధ్యాయులు వెనిగల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభు త్వ కళాశాలలో సోమవారం కామర్స్ విభాగంతో ఎస్జీడీ ప్రొఫెసనల్ ఐటీ సెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కుదుర్చుకున్న ఎంఓయూలో భాగంగా వర్క్షాప్ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ రాంమోహన్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యం, ఉ ద్యోగావకాశాలు మెరుగుపర్చడానికి వర్క్ షా పు ఎంతగానో ఉపమోగపడుతుందన్నారు. నిజామాబాద్ రూరల్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ అన్నారు. నగరంలోని కంఠేశ్వర్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సోమవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు ప్లకార్డులు పట్టుకిని అవగాహన కల్పించా రు. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: రిటైర్డ్ అంగన్వాడీల స మస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశా రు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే వారికి ఇచ్చిన హామీలను అమలు జరపాలన్నారు. లే నియెడల ఆందోళనలు చేస్తామని హెచ్చరించా రు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందిచారు. సంఘ ప్రతినిధులు హైమావతి, లలిత, రమ, పుష్ప, శోభారాణి పాల్గొన్నారు. -
7నుంచి డిచ్పల్లిలో క్రికెట్ టోర్నమెంట్
డిచ్పల్లి: మండలకేంద్రంలో ఈనెల 7 నుంచి 11 వరకు నిజామాబాద్ నగరానికి చెందిన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ తెలిపారు. డిచ్పల్లిలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ క్రికెట్ టోర్నీ డిచ్పల్లి సీఎంసీ మైదానంలో జరుగుతుందన్నారు. డిచ్పల్లి మండలంలోని వివిధ గ్రామాలతో పాటు తెలంగాణ యూనివర్సిటీ, తెలంగాణ ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్లకు చెందిన 16 క్రికెట్ జట్లు ఇందులో పాల్గొంటున్నాయన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడల ద్వారా మానసిక, శారీరక ధృడత్వాన్ని పెంపొందించుకోవాలనే సంకల్పంతో ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్టు వివరించారు. విజేతలకు 11వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వినోద్, బాబు, వనిత, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షిప్తం
అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి జీపీ పరిధిలోగల గాంధీనగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ప్రీ స్కూల్ పిల్లలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన యూనిఫామ్స్ను సర్పంచ్ కులచారి అశ్విని పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి గంగాధర్, వార్డుసభ్యులు,అంగన్వాడీ టీచర్ సుశీల,ఆ యా రూపాలి ఆశా కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులున్నారు. రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలకు సన్మానం సుభాష్నగర్: సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారాలు అందుకున్న ‘బగ్గలి స్వప్న రజక, సురుకుట్ల ఝాన్సీలను సోమవారం నిజామాబాద్ జిల్లా మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వాసంజయ, రేఖ, రుక్మిణి, అపర్ణ, సుధాకర్, కరిపే రవీందర్, దేవేందర్, అజయ్, చంద్రకాంత్, సురకుట్ల విజయ్, సాయి బసవ, సత్యనారాయణ, సురేందర్, బాలన్న, దేశాయి గంగాధర్, దామ నరసయ్య, హనుమాండ్లు పాల్గొన్నారు షూటింగ్ క్రీడాకారుడికి అభినందన సుభాష్నగర్: జిల్లాకు చెందిన క్రీడాకారుడు బొప్పు రణ్వీర్ ఇటీవల ఓపెన్ నేషనల్ మల్టీ టార్గెట్ స్పోర్ట్స్ మొదటి చాంపియన్షిప్–2025లో పాల్గొని 25 మీటర్ల బెంచ్ రెస్ట్ షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఈసందర్భంగా సోమవారం మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తన నివాసంలో రణ్వీర్ను అభినందించారు. తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్, తాను స్థాపించిన నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ద్వారా రణవీర్కు భవిష్యత్లో ప్రోత్సాహం అందిస్తానని ఆయన హామీనిచ్చారు. సమయానికంటే ముందే ఇంటికి.. సిరికొండ: మండల పంచాయతీ అధికారి తారాచంద్ సా యంత్రం ఐదు గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉండగా, సోమవారం నాలుగు గంటలకే ఆర్టీసీ బస్సులో నిజామాబాద్కు తిరుగు పయనమయ్యారు. ఎంపీవో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు వచ్చి సాయంత్రం కార్యాలయం సమయాని కంటే ముందే వెళ్లి పోతారని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఎంపీడీవో మనోహర్రెడ్డిని ఫోన్ లో వివరణ కోరగా తాను నిజామాబాద్లో ఉన్నానని, మంగళవారం తగిన విచారణ జరుపుతానన్నారు. పెటా క్యాలెండర్ ఆవిష్కరణ ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లోని డీఈవో కార్యాలయంలో సోమవారం డీఈవో అశోక్ జిల్లా తెలంగాణ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం(పెటా) క్యా లెండర్ను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు గోపిరెడ్డి, ప్రధా న కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ప్రసా ద్, ఉపాధ్యక్షుడు సుశీల్ కుమార్, పావని, ప్రతిభ ఉన్నారు. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం సుభాష్నగర్: నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఇంట్రా మ్యూరల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి సోమవా రం ప్రారంభించారు. నేడు ఫైనల్ మ్యాచ్ ఆర్ట్స్ విభాగం, ఫిజికల్స్ సైన్స్ విభాగాల మధ్య జరుగుతుందని ఫిజికల్ డైరెక్టర్ బాలమణి తెలిపారు. అక్రమ ఓట్లను తొలగించాలి నిజామాబాద్ రూరల్: జిల్లాలోని 13వ డివిజన్ సారంగాపూర్లో అక్రమంగా దాదాపు1600 ఓట్లు ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని 13 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేతావత్ రాంసింగ్ సోమవారం ఒక ప్రకటనలో అన్నారు. వాటిని తొలగించాలని త్వరలో మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందిస్తామన్నారు. ఓటర్జాబితాలో అవకతవకలు సుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సమీర్అహ్మద్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఆజారొద్దీన్ ఆరోపించారు. ఈవిషయమై సోమవారం కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్కు ఆయన వినతిపత్రం అందజేశారు. వెనిజులాపై అమెరికా ఏకపక్ష దాడి అమానుషం.. నిజామాద్ రూరల్: వెనిజులాపై అమెరికా ఏకపక్ష దుర్మార్గ దాడి అమానుషం అని హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రధా న కార్యదర్శి శివకుమార్ ఒక ప్రకటనలో అన్నారు. భారతదేశం అమెరికా చర్యలను ఖండించాలన్నారు. కొనసాగుతున్న పాశురాల ప్రవచనాలు నిజామాబాద్ రూరల్: నగరంలోని చక్రం గుడిలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుప్పావై పాశురాల ప్రవచనాల కార్యక్రమం వెభవంగా కొనసాగుతున్నాయి. ప్రవచనాలు ఈనెల 14 వరకు కొనసాగుతాయని, అర్చకులు నరసింహ మూర్తి, నాని స్వామి తెలిపారు. -
త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవం
మోపాల్: మండలంలోని కంజర్ శివారులోగల తె లంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పా ఠశాలలో త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంగీతాన్ని భక్తిగా మార్చి, భక్తిని సంగీతంగా ఆవిష్కరించిన మహానుభావుడు సంత్ త్యాగరాజ స్వామి అని కళాశాల ప్రిన్సిపాల్ జి విజయలలిత కొనియాడారు. త్యాగరాజ ఆరాధన కేవలం ఒక సంగీత సభ మాత్రమే కాదు.. ఇది ఒక ఆధ్యాత్మిక యజ్ఞమని పేర్కొన్నారు. పాఠశాలలోని సంగీతవాద్యాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారులందరూ సంగీతం పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సంగీత ఉపాధ్యాయురాలు జి సుజాత సూచించారు. ఈ మహోత్సవానికి సంగీత వాద్య సహకారం అందించిన వయోలిన్ వేదాంత సీతారామచంద్రమూర్తి, మృదంగం విశ్వనాథ్, తబలా యోగేశ్ జోషి, పి యానో సంబేటి రాము, ప్యాడ్ సంబేటి శ్యామ్లను ప్రిన్సిపాల్ సన్మానించారు. కార్యక్రమంలో ఉపా ధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా గుర్తించాలి
నుడా చైర్మన్ కేశ వేణు సుభాష్నగర్: నిజామాబాద్ నగరం అన్నివిధాలా అభివృద్ధి చెందాలంటే స్మార్ట్ సిటీగా మార్చేందుకు ఎంపీ ధర్మపురి అర్వింద్ చొరవ తీసుకోవాలని, అందుకు పార్టీలకతీతంగా తాము సహకరిస్తామని నుడా చైర్మన్ కేశ వేణు పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ రూపొందించిన పుస్తకాన్ని ఆయన సోమవారం సుభాష్నగర్లోని పెన్షనర్స్ భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ.. గతంలో కరీంనగర్, నాందేడ్ జిల్లాల నుంచి వివిధ వస్తువులు కొనుగోలు చేసేందుకు జిల్లాకు వచ్చేవారని, కానీ ఆ రెండు జిల్లాలు నిజామాబాద్ కన్నా అభివృద్ధిలో ముందున్నాయని తెలిపారు. గత పాలకుల వల్లే జిల్లా అన్నిరంగాల్లో వెనకబడిపోయిందని, నగరంలో యూజీడీ వ్యవస్థకు ప్రభుత్వం రూ.400 కోట్లు విడుదల చేసిందన్నారు. డ్రెయినేజీ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాల ఏర్పాటుకు అందరి సలహాలతో నుడా పరిధిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నగరంలో కుక్కల బెడద, ఆవుల బెడదతోపాటుగా అనేక సమస్యలను పరిష్కరించడానికి మున్సిపల్ శాఖతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆల్ పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, నాయకులు హుస్సేన్, మల్లేశ్ రెడ్డి, భరద్వాజ, భూపతిరావు, ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ నగరంలోని రోడ్లపై పశువులు, కాలనీల్లో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని కోరారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ము న్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం చెందిందన్నారు. -
ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
మోపాల్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉ పాధి హామీ పథకం చట్టాన్ని కొనసాగించాలని ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం మండలంలోని తాడెంలో గాంధీ విగ్రహం వద్ద వారు నిరసన తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. పథకంలో గాంధీ పేరును తొలగించి ‘జీ రామ్ జీ’ పేరుతో కొత్త బిల్లును తీసుకురావడం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకానికి గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటాగా నిధులు కేటాయించేదన్నారు. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో 60 శాతం కేంద్రం వాటాగా, 40శాతం రాష్ట్రాల వాటాగా పొందుపరిచి మోదీ ప్రభుత్వం ఆ పథకం నుంచి మెల్లగా తప్పుకొని అంతిమంగా ఆ పథకం రద్దుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నాయకులు వేల్పూర్ భూజేందర్, బంటు రాజయ్య, గంగారాం, రమేష్, మురళి, బన్నీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య బిచ్కుంద(జుక్కల్): ఆర్థిక ఇబ్బందులతో మండల కేంద్రానికి చెందిన ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రానికి చెందిన గోపీదత్తు(44) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అప్పులు కావడంతో ఆదివారం రాత్రి గదిలో ఉరేసుకున్నాడు. భార్య రుక్మిణి ఉదయం భర్త నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి చూడగా విగతజీవి అయి ఉన్నాడు. పొలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట్లు ఎస్సై తెలిపారు. వృద్ధురాలు ..జక్రాన్పల్లి: మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన ఆరే గంగు (85) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. గంగు కొంతకాలం క్రితం ఇంట్లో కాలు జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయి చీటికి మాటికి చనిపోతానని కుటుంబీకులకు చెప్పేది. ఈ నెల 4న చీరతో ఇంట్లో కిటికీకి ఉరేసుకొంది. గమనించిన కుటుంబీకులు ఆర్మూర్లోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సెల్టవర్ ఎక్కిన యువకుడు రుద్రూర్: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన చాకలి రాజు అనే యువకుడు సోమవారం మధ్యాహ్నం సెల్టవర్ ఎక్కాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై సాయన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్పై ఉన్న యువకుడితో మాట్లాడి పరిస్థితిని సముదాయించి రాజును సురక్షితంగా కిందకు దింపారు. అనంతరం ఆయనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏడుగురికి జరిమానా ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పోలీసులు డ్రంకెన్డ్రైవ్పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఏడుగురికి కౌన్సిలింగ్ నిర్వహించి సోమవారం కోర్టులో హాజరుపరిచారు. దీంతో జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ భవ్యశ్రీ ఏడుగురికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని, వాహనాల పత్రాలను సరిగా ఉండాలని ఎస్హెచ్వో సూచించారు. -
నందిపేట్కు ఆర్టీసీ డిపో మంజూరు చేయండి
ఆర్మూర్ : నందిపేట్ మండల కేంద్రంలో ఆర్టీసీ డిపోను మంజూరు చేయాలని లేదా డిపో స్థలాన్ని ఇతర అవసరాలకు వాడుకు నే విధంగా ఇవ్వాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి కోరారు. అసెంబ్లీ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. ఖుద్వాన్పూర్లో బీసీ, ఎస్సీ వసతి గృహాలు, ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్నగర్లో ఉన్న మైనారిటీ ప్రభుత్వ పాఠశాలకు భవనాలు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా కంఠం ప్రభుత్వ పాఠశాల కోసం రూ.5 లక్షలు కేటాయించాలన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆర్టీసీ డిపో సాధ్యాసాధ్యాలపై అధికారులతో మాట్లాడి అవసరం మేరకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాఠశాలల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నిజాంసాగర్ కాలువల మరమ్మతులకు.. ఆర్మూర్: నిజాంసాగర్ ప్రాజెక్టు కాలువల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని నీటి పా రుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో వినతిపత్రం అందజేశారు. కాలువలు శిథిలమవ్వడంతో ఆర్మూర్ నియోజకవర్గానికి నిజాంసాగర్ ప్రాజెక్టు నీరందడం లేదని, సుమారు 35 కిలో మీటర్ల మేర కాలువల మరమ్మతులకు రూ.1,500 కోట్లు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి సీఎం రేవంత్రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. -
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఒకే రోజు 141 మందికి శిక్ష
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వారిలో 141 మందికి సోమవారం జిల్లాలోని వివిధ కోర్టులు శిక్షలు, జరిమానాలు విధించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి 2 రోజుల జైలు, మరో 12 మందికి 1 రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. భిక్కనూర్ పీఎస్ పరిధిలో ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష రూ.వెయ్యి జరిమానా, దోమకొండ పరిధిలో ఒకరికి ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా, సదాశివనగర్ పరిధిలో ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించబడిందన్నారు. కామారెడ్డి పీఎస్ పరిధిలో 73 కేసులకు రూ.76 వేలు, దేవునిపల్లి పరిధిలో 11 కేసులకు రూ.11 వేలు, మాచారెడ్డి పరిధిలో 5 కేసులకు రూ.5 వేలు, రామారెడ్డి పరిధిలో 2 కేసులకు రూ.2 వేలు, భిక్కనూర్ పరిధిలో 18 కేసులకు రూ.20 వేలు, దోమకొండ పోలీస్ పరిధిలో 5 కేసులకు రూ.6 వేలు, బీబీపేట పరిధిలో 4 కేసులకు రూ.4 వేలు, సదాశివనగర్లో 6 కేసులకు రూ.7 వేలు చొప్పున జరిమానాలు విధించారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 141 కేసులు నమోదు కాగా, మొత్తం రూ.1.48 లక్షలు జరిమానా విధించినట్లు తెలిపారు. -
అప్పు ఎగ్గొట్టేందుకు హత్య
● ఆస్తి కోసం మరదలిని చంపేందుకు వదిన సహాయం ● మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులునందిపేట్(ఆర్మూర్): తీసుకున్న అప్పును ఎగ్గొట్టేందుకు మహిళను కిరాతకంగా హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నందిపేట మండలం తల్వేద గ్రామ శివారులోని వాగులో ఈ నెల 3న జరిగిన మహిళ హత్యకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్రెడ్డి సోమవారం వెల్లడించారు. నందిపేట మండల కేంద్రానికి చెందిన రాగల గంగామణి తన స్నేహితులైన బామని స్వరూప, దుబ్బాక లావణ్యతోపాటు ఆమె చెల్లెలు ప్రేమలకు రూ. 6 లక్షలు అప్పుగా ఇచ్చింది. కొన్నిరోజుల పాటు వడ్డీ చెల్లించి, ఆ తర్వాత వడ్డీ చెల్లించడం ఆపేశారు. ఈ విషయంలో పలుమార్లు గంగామణి వారితో గొడవ పడింది. దీంతో ఆమె ఇచ్చిన డబ్బులను ఎగ్గొట్టేందుకు గంగామణిని చంపడమే మార్గమని భావించిన నిందితులు ఈ నెల 2న నిర్మల్ జిల్లా బాసరకు వెళ్దామని గంగామణిని నమ్మించారు. పథకం ప్రకారం స్వరూప, దుబ్బాక లావణ్యలు బస్సుపై బాసరకు వెళ్లారు. ప్రేమల, ఆమె భర్త నరేశ్, మృతురాలు గంగామణి కలిసి బైక్పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో స్వరూప, లావణ్య ఆటోలో ఇంటికి వచ్చారు. ప్రేమల, నరేశ్, గంగామణి బైక్పై బయల్దేరారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తల్వేద వాగు బ్రిడ్జి వద్దకు రాగానే టాయిటెల్ వస్తుందని నమ్మించి బైక్ను నిలిపారు. గంగామణి టాయిలెట్ చేస్తుండగా వెంట తెచ్చుకున్న సుత్తెతో వెనుకనుంచి ఆమె తలపై రెండు దెబ్బలు వేశారు. తీవ్రంగా గాయపడిన గంగామణి అరుస్తూ పరుగెత్తగా ప్రేమల, నరేశ్లు ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కొని వాగులో తోసేశారు. అనంతరం స్వరూప, లావణ్యలకు సమాచారం చేరవేసి ఇంటికి చేరుకున్నారు. కాగా, 3వ తేదీన డెడ్బాడీ దొరకడంతో మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం నందిపేట మండలంలోని వెల్మల్ చౌరస్తా నుంచి నిందితులు పారిపోతుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు తులాల పుస్తెలతాడు, బైక్, హత్యకు ఉపయోగించిన సుత్తెను స్వాధీనం చేసుకొని రి మాండ్కు తరలించినట్లు సీఐ శ్రీధర్రెడ్డి తెలిపారు. హత్యలో వదిన ప్రమేయం.. నిందితులను విచారించగా మృతురాలి అన్న భార్య మగ్గిడి లావణ్య కూడా తమకు సహకరించినట్లు వెల్లడించారు. లావణ్య, ప్రేమల, స్వరూప తీసుకున్న అప్పు విషయమై పలుమార్లు గంగామణితో జరుగుతున్న గొడవల విషయంలో మృతురాలి అన్న భార్య మగ్గిడి లావణ్యతో చర్చించారు. దీంతో గంగామణి ఆస్తిపై కన్నేసిన లావణ్య.. గంగామణిని చంపేయాలని, తాను సహాయం చేస్తా అని హత్యకు ఉసిగొల్పినట్లు తెలిపారు. హత్య చేసిన అనంతరం నిందితులు లావణ్యకు ఫోన్ చేసినట్లు గుర్తించామని, కుట్రలో భాగమైనందున ఆమైపె కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. హత్య కేసును త్వరగా ఛేదించిన స్థానిక ఎస్సై శ్యాంరాజ్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
ప్రజావాణిపై నమ్మకంతో వస్తారు..
నిజామాబాద్ అర్బన్: తమ సమస్యలు పరి ష్కా రమవుతాయనే నమ్మకంతో ప్రజలు ప్రజావాణికి వస్తారని, జిల్లా అధికారులు అందుబాటులో ఉండి వారి సమస్యలను అప్పటికప్పుడే ప రిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 70 ఫిర్యా దులు అందాయి. ప్రజావాణి అనంతరం అధికారులతో కలెక్ట ర్ మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో కొనసాగుతున్న తరహాలోనే జిల్లా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం కోసం ఆన్లైన్ విధానాన్ని అవలంబిస్తామని అన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయా శాఖ ల జిల్లా అధికారులు ప్రజావాణికి గైర్హాజరు కావొద్దని, కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. క్షేత్ర స్థాయి విషయాలు తెలుసు కునేందుకు ప్రజావాణి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. మండల ప్రత్యేక అధికారు లు జిల్లా ప్రగతిలో క్రియాశీల పాత్ర పోషించాలని అన్నారు. పథకాల అమలు తీరును నిశితంగా పరిశీలించాలని మార్గనిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
డిచ్పల్లి: మండలంలోని సుద్దపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు భోజారాం సోమవారం తెలిపారు. గత నెల హైదరాబాద్లో నిర్వహించిన ఆశ్రమ పాఠశాలల జోనల్ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు చక్కని ప్రతిభ చూపడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 7, 8, 9 వ తేదీలలో ఏటూరు నాగారంలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడాపోటీలలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులు బిట్టు, చరణ్ సింగ్, రాంప్రసాద్, అజయ్ కుమార్, నిఖిల్, లోకేశ్, ఆనంద్లను హెచ్ఎం భోజారాం, ఫిజికల్ డైరెక్టర్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు అభినందించారు. ఇందల్వాయి: మండలంలోని సిర్నాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీనివాస్ జాతీయస్థాయి స్కూ ల్ గేమ్స్ అండర్ –17 కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు రాజ్ కుమా ర్ తెలిపారు.ఈ నెల 7 నుంచి 11 వ తేదీ వ రకు ఖమ్మం జిల్లాలోని ఏడువుల బయ్యారంలో జరగనున్న పోటీల్లో శ్రీనివాస్ పాల్గొననున్నారు.ఎంపికై న విద్యార్థిని సర్పంచ్ అనిత చింటూ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వీడీసీ అధ్యక్షుడు భూమేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, ఉపాధ్యాయులు అభినందించారు. ● రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ నిజామాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల నిధులను వ్యవసాయ రంగానికి ఖర్చు చేస్తోందని రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభు త్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. సంక్రాంతి నుంచి సబ్సిడీపై వ్యవసా య యంత్ర పరికరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రెండ్రోజుల క్రితం అసెంబ్లీలోని చాంబర్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వ్యవసాయంపై చర్చించినట్లు తెలిపారు. కమిషన్ పనితీరు బాగుందని సీఎం ప్రశించారని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఖలీల్వాడి: కలెక్టరేట్లో ఇటీవల బా ధ్యతలు స్వీకరించి న కలెక్టర్ ఇలా త్రి పాఠిని సోమవారం డీఈవో పార్శి అశోక్, ఐఎల్ఏ తిరుపతి కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం విద్యారంగానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. -
బాలిక అదృశ్యం
వర్ని: మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలిక అదృశ్యమైనట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఈ నెల 1న గుడికి వెళ్లి వస్తానని వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు బంధువులు, స్నేహితుల ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు. రెంజల్(బోధన్): మండలంలోని నీలా క్యాంపులో కుక్కలు స్వైరవిహారం చేశా యి. సోమవారం ఇంటి ముందు పనులు చేస్తున్న ఐదుగు రు మహిళలపై దాడి చేశాయి. బాధితులను వెంటనే ప్రభు త్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు కుటుంబీకులు తరలించారు. బాధితుల్లో వృద్ధులు ఉన్నారు. అయితే, కుక్కలకు ఇటీవల వైరస్ సోకడంతో వింతగా ప్రవర్తిస్తున్నాయని పలు గ్రా మాల ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులు, గ్రా మ పంచాయతీ పాలకవర్గ సభ్యులు నియంత్రణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బిచ్కుంద(జుక్కల్): మండలంలోని కందర్పల్లి నుంచి రాచూర్ వెళ్లే రోడ్డులో సోమవారం కంకర టిప్పర్ ఢీకొని ఒకరు మృతి చెందారు. రాచూర్ రోడ్డు నిర్మాణ పనుల కోసం కంకర తీసుకొచ్చిన టిప్పర్ లోడ్ ఖాళీ చేయడానికి రివర్స్లో వెళ్తుంది. రాచూర్ గ్రామానికి చెందిన కల్లప్ప (58) బైక్ పై కందర్పల్లి వైపు వస్తున్నాడు. రీవర్స్లో వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ బైక్పై వస్తున్న కల్లప్పను గమనించకుండా ఢీ కొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై మోహన్రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
రాజకీయ పార్టీల సమావేశంలో రసాభాస
సుభాష్నగర్: ముసాయిదా ఓటరు జాబితాపై నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ దిలీప్కుమార్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశం రసాభాసగా మారింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతున్న క్రమంలో ‘ఇందూరు మున్సిపాలిటీ’ అనడంపై ఎంఐఎం అ భ్యంతరం వ్యక్తం చేసింది. నిజామాబాద్ అనాలని అనడంతో ఎంఐఎం, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరుపక్షాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. రెండు పార్టీల నాయకులను కమిషనర్ దిలీప్కుమార్ సముదాయించే ప్రయ త్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఇద్దరు చొప్పున ఆయా పా ర్టీల ప్ర జాప్రతినిధులు తన చాంబర్లోకి రావాలని చెప్పి వెళ్లిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఘర్షణ చోటుచేసుకోకుండా బందోబస్తు చేపట్టారు. అనంతరం కమిషనర్ చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కొనసాగించారు. ఎన్నికలు సజావుగా సాగాలంటే ఓటరు జాబితా ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ పార్టీల ప్రతినిధులు దినేశ్ పటేల్ కులాచారి, న్యాలం రాజు, బొబ్బిలి రామకృష్ణ, నరాల రత్నాకర్, సిర్ప రాజు, రమేశ్బాబు, స మీర్ అ హ్మ ద్, రాజుగౌడ్ తదితరులు సూచించారు. బీఎల్వోల సేవలతోపాటు అవసరమైతే బూత్ లెవల్ నాయ కులు సహకారం అందిస్తారన్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీ య పార్టీల ప్రతినిధులు విలువైన సూచనలు చేశారని కమిషనర్ తెలిపారు. వాటని పరిగణనలోకి తీసుకుని తుది ఓటరు జాబితా రూపొందిస్తామన్నారు. ఇందూరు అనడంపై ఎంఐఎం అభ్యంతరం.. బీజేపీ నాయకులతో వాగ్వాదం.. పోటాపోటీ నినాదాలు ఇరుపక్షాలను సముదాయించిన కమిషనర్ దిలీప్కుమార్ -
డుమ్మాలకు చెక్!
● ఐకేపీ ఉద్యోగులకు ఆన్లైన్లో ముఖ గుర్తింపు హాజరు ● సోమవారం నుంచే అమలులోకి వచ్చిన కొత్త విధానం డొంకేశ్వర్(ఆర్మూర్): ఐకేపీలో డుమ్మాలు కొట్టే ఉద్యోగులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సెర్ప్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హాజరు రిజిస్టర్లకు స్వస్తి చెప్పి ఆన్లైన్ హాజరు విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ‘టీఫేస్ ఎఫ్ఆర్ఎస్’ యాప్ను రూపొందించగా సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. దీనిని ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై ఉద్యోగులకు అవగాహన కూడా కల్పించారు. తొలి రోజు విజయవంతంగా 85 శాతం ఉద్యోగులు ముఖగుర్తింపు ద్వారా ఆన్లైన్లో హాజరు నమోదు చేసుకున్నారు. ఐకేపీ విభాగంలో అన్ని కేడర్ల ఉద్యోగులు కలిపి 200 మందికి పైగా ఉన్నారు. ఇది వర కు జిల్లా, మండల కార్యాలయాల్లో హాజరు రిజిస్టర్ ద్వారా అటెన్డెన్స్ నమోదు చేసుకునే వా రు. దీని ద్వారా చాలా మంది ఉద్యోగులు ఇంటి ప ట్టున ఉంటూ అధికారులను మేనేజ్ చేస్తూ హాజరు వేసుకుని జీతాలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఆఫీసులకు రాకుండా సొంత పనులు చేసుకోవడంపై సెర్ప్కు ఫిర్యాదులు వెళ్లాయి. ఉద్యోగులను క్రమశిక్షణలో పె ట్టేందుకు సెర్ప్ ఉన్నతాధికారులు ఆన్లైన్లో ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తెచ్చారు. యాప్ను ఉద్యోగులు మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఐడీ, పాస్వర్డ్లతో లాగిన్ అయిన తరువాత హాజరు వే సుకోవాలి. ఉదయం 10గంటలకు ఒకసారి లాగినై ఎక్కడ ఉన్నారో లొకేషన్ పె ట్టాలి. మళ్లీ సాయంత్రం 5గంటలకు ఒకసారి విధు లు ముగించుకున్నట్లుగా నమోదు చేయాలి. సెలవులు సైతం యాప్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగుల హాజరును పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి అధికారికి లాగిన్ ఇచ్చారు. ఐకేపీలో ఏపీడీతోపాటు ఆరుగురు డీపీఎంలు, 30 మంది డీపీఎంలు, 165 మంది సీసీలు, పది మంది అడ్మిన్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇక నుంచి ఉద్యోగులు కచ్చితంగా యాప్ ద్వారానే హాజరు వేసుకోవాల్సి ఉంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. -
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
కామారెడ్డి క్రైం: బాతులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన బుద్ద భాస్కర్ తన కుటుంబంతో కలిసి కొద్దిరోజులుగా రాజీవ్నగర్ కాలనీ సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్ వద్ద కాపలా, కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అక్కడ బాతులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేసిన ఒక చిన్న తొట్టి ఉంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు కొద్దిదూరంలో పనులు చేసుకుంటున్నారు. వారి కుమారుడైన రన్విత్ కుమార్(2) బాతుల వెనుక వెళ్లి ప్రమాదవశాత్తు తొట్టిలో పడిపోయాడు. కొద్దిసేపటికి గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడిని జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
పింఛన్లు పెంచలేని నిస్సహాయ స్థితి
● అసెంబ్లీలో ప్రభుత్వంపై మండిపడ్డ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్సుభాష్నగర్: లబ్ధిదారులకు పింఛన్ను పెంచుతామని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ గద్దెనెక్కిందని, ఒక్కరికి కూడా పింఛన్ మొత్తాన్ని పెంచి ఇవ్వలేని నిస్సహాయ స్థితి లో ప్రభుత్వం ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. పింఛన్ల అంశంపై సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని, బీడీ కార్మికులు, వృద్ధులు, దివ్యాంగులు తమ పింఛన్లను ప్రభుత్వం ఎప్పుడు పెంచుతుందోన ని ఎదురు చూస్తున్నారన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని పెంచాలని ఆయన అన్నారు. -
వేతనాలకు తప్పని కటకట
మోర్తాడ్(బాల్కొండ): ఇంటింటికీ తాగునీటిని అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న మిషన్ భగీరథ ఆపరేటర్లకు ఆరు నెలలుగా వేతనాలు కరువయ్యాయి. ఫలితంగా ఆపరేటర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మూడేళ్లుగా సమయానికి వేతనాలు చెల్లించడంలో విఫలమైన కాంట్రాక్టు కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. ప్రభుత్వం నుంచి తమకు సకాలంలో బిల్లులు మంజూరు కావడం లేదనే సాకు చూపుతున్న కాంట్రాక్టు కంపెనీలు.. వేతనాలు చెల్లించకుండా ఆపరేటర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులతో సంబంధం లేకుండానే కంపెనీలు ఆపరేటర్లకు ప్రతినెలా వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయాలి. గడచిన ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా కంపెనీ వేధింపులకు గురి చేస్తుండటంతో సోమవారం ఆపరేటర్లు ఆందోళన బాటపట్టారు. రెండు, మూడు రోజుల్లో వేతనాలు అందకపోతే సంక్రాంతి పండుగకు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఇంటింటికీ నీటిని సరఫరా చేసేందుకు నిర్దేశించిన పంప్హౌస్లు, సంప్హౌస్లు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి. కేవలం నీటి సరఫరా చేయడం, అజమాయిషీ చేసే బాధ్యతలను గత ప్రభుత్వం కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చింది. కాంట్రాక్టు పొందిన కంపెనీలు ఆపరేటర్లు, సూపర్వైజర్లను నియమించుకొని వారి ద్వారా ఇంటింటికీ రోజు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇలా నీటి సరఫరాను పర్యవేక్షించే ఆపరేటర్లు, సూపర్వైజర్లు ఉమ్మడి జిల్లాలో 600 మంది వరకు పనిచేస్తున్నారు. ఆపరేటర్లకు సీనియారిటీ ప్రకారం రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు, సూపర్వైజర్లకు రూ.12 వేల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. పీఎఫ్ కూడా జమ చేయాల్సి ఉంది. పీఎఫ్ను జమ చేస్తున్నా వేతనాల విషయంలో మాత్రం మొదటి నుంచి నిర్లక్ష్యమే జరుగుతోంది. పదే పదే వేతనం చెల్లింపులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎన్నోమార్లు వేతనాల కోసం మిషన్ భగీరథ ఆపరేటర్లు, సూపర్వైజర్లు ఆందోళన బాట పట్టినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆందోళన చేస్తే ఒకటి, రెండు నెలల వేతనం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలని మిషన్ భగీరథ సిబ్బంది కోరుతున్నారు. మిషన్ భగీరథ ఆపరేటర్లకు ఆరు నెలలుగా జీతాలు కరువు మూడేళ్లుగా ఇదే పరిస్థితి బిల్లులు రావడం లేదనే సాకుతో వేతనాలు చెల్లించని కాంట్రాక్టు కంపెనీ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఉద్యోగుల ఆవేదన -
వెంకటాపూర్లో భారీగా ఇసుక పట్టివేత
నలుగురిపై కేసు నమోదు వేల్పూర్: మండలంలోని వెంకటాపూర్ గ్రామం నుంచి ఆదివారం రాత్రి ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఎస్సై సంజీవ్ సోమవారం తెలిపారు. మరో చోట అక్రమంగా నిల్వ ఉంచిన మరో రెండు ఇసుక డంపులను పట్టుకున్నామన్నారు. ఆదివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా వెంకటాపూర్ నుంచి వెళ్తున్న టీజీ16టీ1429 నంబరు లారీని తనిఖీ చేయగా అందులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. లారీ డ్రైవర్ దిలీప్ను విచారించగా వెంకటాపూర్ సొసైటీ వద్ద నుంచి ఇసుకను తీసుకెళ్తున్నట్లు తెలిపాడని పేర్కొన్నారు. వెంకటాపూర్లో రెండు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను వేల్పూర్ తహసీల్దార్ శ్రీకాంత్ సమక్షంలో సీజ్ చేశామన్నారు. లారీ డ్రైవర్ దిలీప్, యజమాని రాజేశ్వర్, పొక్లెయిన్ డ్రైవర్ శర్మ, వెంకటాపూర్కు చెందిన మహిపాల్రెడ్డిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. ముందస్తు అనుమతితో ఇసుక తీసుకోవాలి ఇసుక అవసరమున్న వారు రెవెన్యూ, మైన్స్ అధికారుల ముందస్తు అనుమతి తీసుకొని సరఫరా చేసుకోవాలని ఎస్సై సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: జిల్లా పాలనాధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా న్యాయమూర్తి జీ.వీ.ఎన్.భరతలక్ష్మితోపాటు పోలీస్ కమిషనర్ సా యి చైతన్యను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయంలో న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్ ఆమెకు పూలమొక్కను అందజేశారు. జిల్లా స్థితిగతులు, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వ ర్యంలో చేపట్టే కార్యక్రమాలపై కొద్దిసే పు చర్చించారు. అనంతరం కమిషనరేట్లో సీపీని కలిసి బొకే అందించారు. ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేయాలి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నందిపేట మండలంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న వెల్మల్ కేంద్రంగా ప్రాథమిక వ్యవసా య సహకార పరపతి సంఘం (సొసైటీ) ఏ ర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు సోమ వా రం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. అఖిలపక్ష నాయకులు ఆధ్వ ర్యంలో గ్రామస్తులు కలెక్టరేట్కు వచ్చారు. వెల్మల్కు సరిహద్దు గ్రామాలైన ఆంధ్రనగర్, కౌల్పూర్, రైతుఫారం, జోజిపేట గ్రామ పంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానంతో కొత్త సొసైటీని ఏర్పాటు చేయాలని కోరా రు. 4 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న తమ గ్రామాన్ని అయిలాపూర్ సొసైటీ నుంచి వేరు చేయాలని వినతిపత్రంలో పేర్కొ న్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో సర్పంచ్ దేవేందర్, ఉప సర్పంచ్ ఇసపల్లి మహేశ్, మాజీ సర్పంచ్ మచ్చర్ల పెద్ద గంగారాం, నాయకులు కస్ప రామకృష్ణ, రాము, గోజూరి నరేందర్, కిషన్, జీఆర్ రాజేందర్, మల్లేశ్, శ్రీధర్, శ్రీనివాస్ ఉన్నారు. దూరవిద్యలో సెమిస్టర్ పరీక్షలు ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళా శాల ప్రాంగణంలో కొనసాగుతున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 – 26 మొదటి సంవత్సరం సైన్స్ విద్యార్థులకు సెమిస్టర్ – 1 ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు సెమిస్టర్ – 3 ప్రయోగ, తృతీయ సంవత్సరం సైన్స్ వి ద్యార్థులకు సెమిస్టర్ – 5 తరగతులు ఈ నె ల 6 నుంచి ప్రారంభమవుతాయని తెలి పా రు. 80 శాతం అటెన్డెన్స్ లేనిపక్షంలో ప్రాక్టికల్స్కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. 1,507 టీఎస్ ఐపాస్ దరఖాస్తుల ఆమోదం కామారెడ్డి క్రైం: టీఎస్ ఐపాస్ పథకం కింద పరిశ్రమల ఏర్పాటుకుగాను జిల్లాలో ఇప్పటివరకు 1,552 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 1,507 ఆమోదించామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పారిశ్రామిక ప్రో త్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ మాఫీ ఏదీ..?
మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన రైతు మాదాం నర్సయ్యకు పాలెంలోని ఎస్బీఐలో పంట రుణం మాఫీ అవుతున్నట్లు గతంలో మెస్సేజ్ వచ్చింది. బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా.. ఇంకా నిధులు జమ కాలేదని, సొమ్ము ప్రభుత్వం నుంచి వస్తేనే రుణమాఫీపై తాము ఏమైనా చెప్పగలమని బ్యాంకు అధికారులు జవాబిచ్చారు. ఆరు నెలలుగా బ్యాంకులో, వ్యవసాయ శాఖ కార్యాలయంలో అడుగుతున్నా రుణమాఫీపై ఎక్కడ కూడా స్పష్టమైన సమాచారం నర్సయ్యకు దొరకడం లేదు. ఒక వేళ తాను రుణాన్ని రెన్యువల్ చేసుకుంటే మా ఫీ సొమ్ము జమ చేస్తారో లేదోనని వడ్డీ మాత్రమే చెల్లించి ఊరుకున్నాడు. జిల్లాలో ఇలా ఎంతో మంది రైతుల పేర్లు రుణమాఫీ జాబితాలో వచ్చినా బ్యాంకులో సొమ్ము జమ కాకపోవడంతో రుణమా ఫీ వర్తించలేదు. నాలుగు విడతల్లో రుణాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా నిధులను విడుదల చేయకపోవడంతో రైతులు అసహనం వ్య క్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల వరకు పంట రుణం మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించింది. బడ్జెట్లో రుణమాఫీకి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేసినా ప్రభుత్వం ఆచరణలో విఫ లం కావడంతో రైతులకు మొండిచేయి ఎదురైంది. ప్రభుత్వం మోసం చేసింది రుణమాఫీ విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ఎంతో మంది రైతులకు అర్హత ఉన్నా పంట రుణం మాఫీ కాకపోవడంతో వడ్డీ భారం మోయాల్సి వస్తోంది. ప్రభుత్వమే మోసం చేస్తే రైతులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలి. – ఏనుగు రాజేశ్వర్, రైతు, మోర్తాడ్నిధులు ఇవ్వాలి రుణమాఫీకి ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. కొద్ది మందికే నిధులు విడుదల చేసి మిగతా వారిని మోసం చేయడం తగదు. అర్హులైన ప్రతి రైతుకు రూ.2లక్షల వరకు రుణం మాఫీ చేయాలి. లేకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు. బడ్జెట్లో నిధులు కేటాయించాలి. – పాపాయి పవన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ౖచైర్మన్, మోర్తాడ్జిల్లా వ్యాప్తంగా 97,696 మందికే లబ్ధిజిల్లా వ్యాప్తంగా 1,00,612 మంది రైతులకు నాలుగు విడతల్లో రూ.782.30 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాస్తవానికి 97,696 మంది రూ.755 కోట్ల 29 లక్షల, 40వేలు మాత్రమే రైతుల ఖాతా ల్లో జమ చేశారు. మరో 2,916 మంది రైతు ల వివరాలు సరిగా లేకపోవడంతో నిధులు జమ కాలేదు. ఫలితంగా రూ.27.01 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయి. వాస్తవానికి జిల్లాలో రుణమాఫీకి అర్హత ఉన్న రైతులు 1.50లక్షల మందికి పైగానే ఉన్నారు. మొదట్లో ఒక్కో రైతుకు రూ.2లక్షల వరకు పంట రుణం మాఫీ అని ప్రకటించగా రుణమాఫీ అమలు చేసే సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు అని మార్గదర్శకాలు మార్చా రు. ఒక ఇంటిలో ఎంత మందికి రుణం ఉన్నా.. ఎంత బకాయి ఉన్నా రూ.2లక్షల వ రకు రుణ మాఫీ వర్తింపజేస్తామని ప్రభు త్వం స్పష్టం చేసింది. కుటుంబాన్ని యూనిట్గా తీసుకున్నా రుణమాఫీకి అర్హత ఉండి లబ్ధి పొందని రైతుల సంఖ్య 50వేలకు పైగానే ఉంటుందని అంచనా. అసంపూర్ణంగా రైతు రుణమాఫీ జాబితాలో పేర్లున్నా.. ఖాతాల్లో నిధులు జమ కాలేదు అన్నదాతకు తప్పని నిరీక్షణ నాలుగు విడతల్లో కొద్ది మందికే ఊరట -
మైనారిటీ స్కూల్లో దారుణం
● ర్యాగింగ్కు పాల్పడిన సీనియర్లు ● 8 మంది విద్యార్థులకు టీసీ జారీబిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యా ర్థులు పదో తరగతి విద్యార్థిపై శనివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. నలుగురు ఫస్టియర్, నలుగురు సెకండియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారని గుర్తించి సోమవారం వారి తల్లిదండ్రులను పిలిపించి ప్రిన్సిపల్ స్వామి టీసీ ఇచ్చి పంపించారు. పదో తరగతి విద్యార్థి.. ఐదో తరగతి విద్యార్థులపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఇంటర్ విద్యా ర్థులు శనివారం రాత్రి దాడి చేశారు. కొట్టిన వీడి యో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విష యమై ప్రిన్సిపల్ స్వామి జిల్లా అధికారులకు సమాచారం అందించారు. సోమవారం విచారణ చేపట్టిన అధికారులు పైఅధికారులకు నివేదిక అందించారు. వారి ఆదేశాల మేరకు 8 మంది ఇంటర్ విద్యార్థులకు టీసీ జారీ చేశారు. వేధింపులకు పాల్పడిన పదో తరగతి విద్యార్థిపై విచారణ చేపట్టి పాఠశాల నుంచి తొలగిస్తామని ఆర్ఎల్సీ జిల్లా అధికారి బషీర్ తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు టీసీలు ఇవ్వడంతో తోటి విద్యార్థులు పాఠశాలలో ఆందోళన చేపట్టారు. విద్యార్థిపై దాడి చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం నేరమని, పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామంటూ విజిలెన్స్ అధికారులు హమీద్, అహ్మద్, ఆర్ఎల్సీ బషీర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
ఊరెళ్తున్నారా? అయితే జాగ్రత్త!
నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల దొంగల అలజడి కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలో రెండు ఏటీఎంల దోపిడీ, మరో ఏటీఎం, బంగారు దుకాణంలో లూటీకి యత్నించిన విషయం తెలిసిందే. అయితే, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇళ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికి, రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్నారని, వారిపై నిఘా పెడుతున్నామన్నారు. ● ఖరీదైన వస్తువులను బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి. ● ఊరెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయొద్దు. ● డోర్స్కు సెంట్రల్ లాకింగ్ సిస్టం వాడాలి. ● సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వాలి. ● సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు గమనించాలి. ● అపరిచిత వ్యక్తులు వస్తే వారి పోలీసులకు సమాచారం అందించాలి. ● ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పాలి. ● మహిళలు, వృద్ధులు ‘అపరిచితులు‘ సమాచారం పేరుతో వస్తే నమ్మొద్దు. ● కాలనీల వారీగా గస్తీ బృందాలను ఏర్పాటు చేసుకోవాలి. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రజలకు పోలీసు శాఖ సూచనలు సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి సీపీ సాయిచైతన్య -
ఆధునిక సేద్యాన్ని ప్రోత్సహించాలి
సుభాష్నగర్: జిల్లాలో ఆధునిక సేద్యం దిశగా రైతులను ప్రోత్సహిస్తూ అవసరమైన తోడ్పాటునందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సమావేశ మందిరంలో సోమ వారం నిర్వహించిన జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశానికి పర్సన్ ఇన్చార్జి హోదాలో కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు, అభ్యుదయ రైతులు హాజరయ్యారు. సహకార బ్యాంకు ద్వారా రైతులకు అందిస్తున్న తోడ్పాటు, వివిధ కార్యక్రమాల అమలు వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ప్రత్యేకతను కలిగి ఉన్న జిల్లా ఘనతను మరింత ఇనుమడింపజేసేలా సాగు రంగానికి ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులకు సూ చించారు. ముఖ్యంగా పసుపు రైతులకు పంట సా గు విషయంలో వెన్నుదన్నుగా నిలుస్తూ, ఆధునిక యంత్ర సామగ్రిని వినియోగిస్తూ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. యూరియా విషయంలో అక్కడక్కడా రైతుల్లో నెలకొని ఉన్న అపోహల ను దూరం చేసేందుకు అభ్యుదయ రైతులు కృషి చే యాలని సూచించారు. మోతాదు మేరకే యూరి యా వినియోగించేలా విస్తృత స్థాయిలో అవగాహ న కల్పించాలన్నారు. యూరియా, ఎరువుల అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, దళారుల ప్రమేయం వంటి అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. రైతులు యాప్ను వినియోగించుకునేలా చూడాలన్నారు. డీసీసీబీ జనరల్ మేనేజర్ అనుపమ, సీఈవో నాగభూషణం, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ సునీల్, ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, సహకార తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సాగు రంగంలో జిల్లా ఘనతను మరింత ఇనుమడింపజేయాలి సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి రైతులు ఆందోళన చెందొద్దు సాంకేతిక కమిటీ సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నిజామాబాద్
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026మోర్తాడ్(బాల్కొండ): కడుపులో ఆడ శిశువు జీవం పోసుకుంటుందంటే గర్భంలోనే చిదిమేయాలనే ఆలోచనలో ఉన్న ఎంతో మందికి కనువిప్పు కలిగించే నిర్ణయం తీసుకున్నారు నూతనంగా ఎన్నికై న సర్పంచులు. పుట్టింది ఆడపిల్లనా అనే వారికి కాదు మహాలక్ష్మి అని నిస్సంకోచంగా చెప్పగలిగే ధైర్యాన్నిస్తున్నారు. గ్రామానికి చెందిన ఆడపడుచు పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగు పెడుతుంటే అండగా మేమున్నాం అంటూ చేయూతనిస్తున్నారు. నగదు, బంగారంతో గౌరవించాలని నిర్ణయించారు. తమకు తోచినంతలో ఎంతో కొంతసాయం అందిస్తూ ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసానిస్తున్నారు. సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. మా ఊరి మహాలక్ష్మి పథకం పేరిట ఆడపిల్ల పుడితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్ ఇవ్వడం, పెళ్లి చేసుకొని వెళితే కట్నం కింద నగదు, బంగారం అందజేస్తున్నారు. -
అమెరికా దురాక్రమణను ఖండిస్తున్నాం
నిజామాబాద్ రూరల్: వెనెజువెలా దేశంపై అమెరికా దురాక్రమణను ఖండిస్తున్నామని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అన్నారు. అమెరికా దాడులకు నిరసనగా ఆదివారం సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడారు. వెనెజువెలా దేశంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణిని నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అమెరికా వైఖరిని ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, జిల్లా నాయకులు డి.రాజేశ్వర్, కే.గంగాధర్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ నాయకులు లింగం, భాస్కర్, సాయిబాబా, కిరణ్, సాయరెడ్డి, అమూల్య, చరణ్, అశుర్, విజయ్ కుమార్, సజన్, గంగాధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో... సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేశ్ బాబు మాట్లాడుతూ వెనెజువెలాపై అమెరికా చేసిన దాడులను ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ిసీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్ , జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర కమిటీ సభ్యులు నల్వాల నరసయ్య, అనసూయ, నగర నాయకులు అంజయ్య, శంషుద్దీన్, అబ్దుల్, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో.. సిరికొండ: వెనెజువెలాపై అమెరికా దాడి చేయడం దుర్మార్గమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ అన్నారు. మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను ఆదివారం దహనం చేశారు. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడారు. నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకులు ఆర్ రమేశ్, దామోదర్, బాబన్న, సాయారెడ్డి, లింబాద్రి, రమేష్, సర్పంచ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వెనెజువెలాపై అమెరికా దాడి దురహంకార చర్య నిజామాబాద్ రూరల్: వెనెజువెలాపై అమెరికా దాడి దురహంకార చర్య అని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య పేర్కొన్నారు. ఆదివారం కోటగల్లిలోని ఎన్.ఆర్.భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా తీరును తీవ్రంగా ఖండించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. ఆ దేశంలో ఉన్న చమురు నిల్వలను, ఖనిజ సంపదను దోచుకోవడానికే అమెరికా ఇలాంటి ఘాతుకానికి తెగబడిందన్నారు. సీపీఐ(ఎం.ఎల్) నాయకులు పాల్గొన్నారు. -
ఐడియా.. అదరహో
వ్యవసాయం చేసే రైతులంతా ఈ చిత్రాన్ని చూసి మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం వేసిన రోడ్లను కాపాడుకోవడానికి డొంకేశ్వర్లో పలువురు రైతులు మంచి ఆలోచన చేశారు. పొలాలను దమ్ము చేసే కేజ్వీల్స్ ట్రాక్టర్లతో రోడ్లు పాడవకుండా ట్రాలీలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక రైతు కేజ్వీల్ ట్రాక్టర్ను ట్రాలీలో ఎక్కించి మరో ట్రాక్టర్ సహాయంతో కావాల్సిన చోటికి తీసుకెళ్తున్న చిత్రాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో తీసింది. గ్రామాల్లోని రైతులందరూ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే బాగుటుందని ఎస్సై శ్యామ్రాజ్ కోరారు. కేజ్వీల్ ట్రాక్టర్లను రోడ్లపై నడిపితే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
ఎంపీని కలిసిన మాజీ కార్పొరేటర్
సుభాష్నగర్: నగరంలోని 16వ డివిజన్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేశ్ ఆదివారం ఎంపీ అర్వింద్ ధర్మపురిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎంపీని శాలువా, పుష్ఫగుచ్చంతో సన్మానించారు. అనంతరం పంచరెడ్డి సురేశ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ జనాకర్షక సంక్షేమ పథకాలు, ఎంపీ అర్వింద్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాను సంక్రాంతి తర్వాత తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరుతానని ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు, ఆర్వోబీల నిర్మాణాలతో ఎంపీ అర్వింద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనపై ప్రజలు విరక్తి చెందారని అన్నారు. అంతకుముందే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను కలిశారు. -
కూరగాయల సాగుకు ప్రోత్సాహం
● ఎకరాకు రూ. 9,600 ఇవ్వనున్న ప్రభుత్వం ● దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు ఇందల్వాయి: కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద ఒక ఎకరా సాగు చేసే రైతుకు రూ.9,600 రాయితీ రూపంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఒక ఎక రాలో కూరగాయలు సాగు చేస్తే 6 టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలు, సస్యరక్షణ చర్యలతోపాటు యాజమాన్య పద్ధతుల కింద ఎకరాకు రూ.24 వేలు ఖర్చు అవుతుందని లెక్కించింది. ఈ క్రమంలో 40 శాతం రాయితీ ఉత్పత్తిదారుల ఖాతా లో నేరుగా జమ చేయాలని ఆదేశించింది. పచ్చిమి ర్చి, క్యాప్సికం, బెండ, బీర, దొండ, కాకర, క్యాబేజీ, టమాట, చిక్కుడు, సోరకా య తదితర తోటల సాగుకు ముందుకు వచ్చే రైతులు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి రాయితీకి ఎంపిక చేస్తారు. రెండున్నర ఎకరాల వరకు రాయితీ అందించనున్నారు. సాగు ప్రారంభించి గుర్తింపు పొందిన నర్సరీలు లేదా ఉద్యానవన శాఖ నుంచి నారు లేదా విత్తనాలు కొనుగోలు చేస్తే వెంటనే నిధులు జమ చేస్తారు. రైతుల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తు విధానం ఇలా.. కూరగాయలు పండించే రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టాదార్ పాస్బుక్, ఆధా ర్ కార్డు, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్స్లతో పాటు ఒక ఫొటో, ఎరువులు, విత్తనాలు, పురుగుమందు లు, కంపోస్ట్ ఎరువులు కొనుగోలు చేసిన రసీదులు (రూ. 20వేలకు తగ్గకుండా) జత చేయాలి. ఉద్యాన శాఖ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జిల్లాలో 1,100 ఎకరాలకు..జిల్లాలో 1,100 ఎకరాలకు ప్రోత్సాహం అందించేలా ఉద్యానశాఖ అధికారులు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారు 225 ఎకరాల్లో కూరగాయల సాగుకు ప్రోత్సాహం అందించనున్నారు. కూరగాయల ఉత్పత్తి పెంచడం, ధరల స్థిరీకరణ, మార్కెట్లో సరఫరాను బలోపేతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. కూరగాయల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నగదు ప్రోత్సహాకాన్ని పొందేందుకు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో 1,100 ఎకరాల వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. నియోజకవర్గంలో ఇదివరకే కొంత మంది రైతులకు ప్రోత్సాహం అందించాం. మరిన్ని వివరాలకు సంబంధిత ఉద్యాన శాఖ అధికారులను రైతులు సంప్రదించాలి. – రోహిత్, ఉద్యాన శాఖ అధికారి, నిజామాబాద్ రూరల్ ఇప్పుడున్న భిన్న వాతావరణ పరిస్థితుల్లో కూరగాయలు సాగు చేయడం అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారంలా మారింది. దీంతో రైతులు కూరగాయల సాగుపై ఎక్కువగా దృష్టి సారించడం లేదు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం రైతులకు కూరగాయల సాగుకు ప్రోత్సహకాలు అందించడం సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోత్సాహకాల వల్ల కూరగాయల సాగు పెరిగి రైతులతో పాటు వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది. – నోముల విజయ, కూరగాయల రైతు, నల్లవెల్లి -
అన్నసత్రానికి ముస్లిం యువకుడి విరాళం
సిరికొండ: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ శైవక్షేత్రం లొంక రామలింగేశ్వరస్వామి ఆలయంలో అన్నసత్రంకు సిరికొండకు చెందిన ముస్లిం యువకుడు షేక్ ఉస్మాన్పాషా విరాళం అందజేశారు. ఆలయం వద్ద సోమవారం నిర్వహించే అన్నదానానికి ఒక రోజు అయ్యే పూర్తి ఖర్చులను ఉస్మాన్ ఆలయ కమిటీకి చెల్లించాడు. ఉస్మాన్ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అవదూత గంగాధర్, సంతోష్, శోభన్, పారుపల్లి రాజ్కుమార్, కంచెట్టి లక్ష్మీనారాయణ, తాళ్ల శ్రీనివాస్, కోల భూపతిరాజు, బోయిడి ప్రకాష్, కనగందుల నవీన్, సల్ల భాస్కర్, నగేష్, పెయింట్ శేఖర్, నరేష్, రాజు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం చేస్తే పథకాలు దూరం!
రైతు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి? ● కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధిని సులభంగా పొందొచ్చు. పీఎం కిసాన్ సహాయానికి ఫార్మర్ ఐడీ తప్పనిసరి. ● రైతు వివరాలు ఖచ్చితంగా నమోదైతే పారదర్శకత పెరుగుతుంది. మోసాలు తగ్గుతాయి. ● బీమా, సబ్సిడీలు, రుణాలు త్వరితగతిన పొందడానికి అవకాశం. భవిష్యత్ పథకాల ప్రయోజనాలు సులభం.డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రతి రైతూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధన కూడా పెట్టింది. రైతుకు వచ్చిన యూనిక్ ఐడీ నంబర్ ద్వారానే పీఎం కిసాన్ వంటి పథకాలు అందుతాయని కూడా స్పష్టం చేసింది. కానీ జిల్లాకు చెందిన రైతులు తమ వివరాలు నమోదు చేసుకోవడానికి పెద్దగా ముందుకు రావడం లేదు. ఫార్మర్ రిజిస్ట్రీ అవసరాన్ని వివరించి చెబుతున్నా మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అధికారులు వాపోతున్నారు. జిల్లాలో 2,98,474 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 1,45,070 మంది (62శాతం) మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో 1,53,404మంది రిజిస్ట్రేషన్కు దూరంగా ఉన్నారు. దీంతో పీఎం కిసాన్ డబ్బులు కొంతమంది రైతులకు ఇటీవల అందలేదు. అయితే ప్రస్తుతం నమోదు చేసుకోవాలని సంబంధిత రైతుల మొబైల్ ఫోన్లకు సర్వే నంబర్లతో సహా ఎస్ఎంఎస్ సందేశాలు వెళ్తున్నాయి. కొద్ది మంది మాత్రమే స్పందించి మీ సేవ కేంద్రాలకు లేదా రైతు వేదికల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మీ సేవ కేంద్రాల్లో సర్వర్ సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. మిగిలిన రైతులు నమోదు చేసుకునేలా వ్యవసాయాధికారులు గ్రామాల్లో ఉన్న వారికి ఫోన్లు చేస్తున్నారు. ప్రతి రైతుకూ ఐడీ తప్పనిసరి.. ఫార్మర్ రిజిస్ట్రేషన్లో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో 11వ స్థానంలో ఉంది. వివరాలు నమోదు చేసుకోని రైతుల వివరాలు ఏఈవోల వద్ద ఉన్నాయి. రైతుల సెల్ఫోన్లకు సందేశాయి కూడా వెళ్లాయి. ప్రతి రైతుకి ఐడీ ఉండాలని ప్రభుత్వం తప్పనిసరి చేసిందన్న విషయాన్ని గమనించాలి. రైతు వేదికలు, మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే ప్రభుత్వ పథకాలు పొందడానికి అవకాశం ఉండదు. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి ఎలా చేసుకోవాలి? ఆధార్ కార్డు భూమి పాస్బుక్ వివరాలు ఆధార్ లింకై ఉన్న మొబైల్ నంబర్ తప్పనిసరి స్థానికంగా ఉన్న మీ సేవ కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫార్మర్ రిజిస్ట్రీపై ఆసక్తి చూపని రైతులు జిల్లాలో ఇంకా నమోదు చేసుకోని వారు 1.53లక్షల మంది ఐడీ నంబర్ ఉంటేనే పీఎం కిసాన్ వంటి పథకాలకు అర్హత -
90 మందికి తగ్గొద్దు..
● ప్రతీరోజు కూలీల హాజరు పెరగాలి ● జిల్లాలో ఉపాధిహామీ పనులపై రాష్ట్ర అధికారుల ఆదేశాలు డొంకేశ్వర్(ఆర్మూర్): ఉపాధిహామీ పథకం ‘వీబీ జీరామ్ జీ’గా మారిన నేపథ్యంలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. పనులకు వచ్చే కూలీల సంఖ్యను పెంచి ఈ నెలాఖరు నాటికి కావాల్సిన పనిదినాల లక్ష్యాన్ని చేరుకోవాలని గ డువు విధించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధి లో 90 మందికి తగ్గకుండా కూలీలు పనికి వచ్చేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో రెండు రోజుల క్రితం మండలాల ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో జిల్లా అధికారులు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూలీల హాజరు శాతం పెంచాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఉపాధి హామీ సిబ్బందిని హెచ్చరించారు. ఇప్పటికే పలు మండలాలు వెనుకబడి ఉన్నాయని, పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉండగా పలు చోట్ల పది మంది కూలీలు కూడా పనులకు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా సరాసరిగా 2,600 మందికి పైగా పనులకు వస్తున్నారు. చెరువుల్లో పూడికతీత పనులు లేకపోవడంతో వేరే పనులు చేయడానికి కూలీలు ముందుకు రావడం లేదు. చందూర్, కమ్మర్పల్లి, మెండోరా, ఏర్గట్ల, నవీపేట్, ఎడపల్లి, కోటగిరి, పొతంగల్, భీమ్గల్, సిరికొండ, డొంకేశ్వర్, మోస్రా మండలాల్లో కూలీలు చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఈ మండలాల్లో ఉపాధిహా మీ సిబ్బంది పనితీరు సరిగ్గా లేనట్లు తెలుస్తోంది. 29 లక్షలకు... 15 లక్షల పనిదినాలు పూర్తి... 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 29 లక్షల పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. ఇందులో ఇప్పటి వరకు 95 వేల మందికి 15 ల క్షల పనిదినాలు కల్పించారు. ఇందుకు రూ.41.60 కోట్లు వెచ్చించారు. ఇంకా 14 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉంది. మార్చి నాటికి మిగిలిన పనిది నాలను పూర్తి చేయాల్సి ఉండగా ఈ నెలాఖరు నాటికే పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఉపాధిహామీ సిబ్బందిని ఆదేశించారు. దీంతో గ్రామాల్లో ఏయే పనులు చేయించాలో గుర్తిస్తున్నారు. కూలీల హాజరు పెంచుతున్నాం.. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఉపాధిహా మీ పనులకు కూలీల హాజరు ను పెంచడానికి చర్యలు చేపట్టాం. జీపీలో రోజుకు 90 మందికి తగ్గకుండా కూలీలు వచ్చేలా చూడాలని ఉపాధిహామీ సిబ్బందికి ఆదేశాలిచ్చాం. మిలిగిన పనిదినాలను గడువులోపు పూర్తిచేస్తాం. – సాయాగౌడ్, డీఆర్డీవో -
పద్మశాలి సంఘ అభివృద్ధికి కృషి చేస్తా
సర్పంచ్ సాయిచరణ్ను సన్మానిస్తున్న గోసంగి సంఘం సభ్యులుభూమికను సన్మానిస్తున్న పద్మశాలి సంఘ సభ్యులు జక్రాన్పల్లి: పద్మశాలి సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని గ్రామ ఉపసర్పంచ్ గాండ్ల భూమిక శేఖర్ అన్నారు. ఆదివారం జక్రాన్పల్లి మండలంలోని బ్రాహ్మణ్పల్లిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ భూమిక శేఖర్ దంపతులు, వార్డు సభ్యుడు మానేటి శ్రీకాంత్కు పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పద్మశాలిలు రాజకీయంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘ పెద్దలు గాండ్ల శ్రీనివాస్, రుద్ర రాజేశ్వర్, రాజేందర్, గంగాధర్, రాంచందర్, నర్సయ్య, చరణ్, రాజేందర్, హన్మండ్లు, పంచాక్షరి, వంకర్, నాందేవ్, రాజేశ్వర్, మమత సంఘ సభ్యులు పాల్గొన్నారు. సర్పంచ్ సాయిచరణ్కు సన్మానం సిరికొండ: సిరికొండ సర్పంచ్గా ఎన్నికై న గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల సాయిచరణ్ను మండలకేంద్రంలో ఆ సంఘం నాయకులు, పలువురు సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు నిషాని రవీందర్, కార్యదర్శి శ్రీనివాస్, దేవయ్య, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టుకు సాగునీరు విడుదల
మోపాల్: మండలంలోని కంజర్ పెద్ద చెరువు నుంచి పాటి మీద తూము ద్వారా ఆయకట్టు రైతాంగానికి యాసంగి సాగుకు ఎస్ఐ జాడె సుస్మిత ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయొద్దని, అవసరం మేరకే వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్యారం రాకేష్ యాదవ్, ఉపసర్పంచ్ గుడి ప్రవీణ్రెడ్డి, జీపీఓ దేవయ్య, రైతులు అరికెల నారాయణరెడ్డి, విశ్వనాథం, బున్నె రాములు, గొల్ల రాములు, గంగబాపు, నవీన్, తదితరులు పాల్గొన్నారు. -
పండితులకు సన్మానం
నిజామాబాద్ రూరల్: తెలుగు వెలుగు సమా ఖ్య ఆధ్వర్యంలో నూతన సంవత్సరం పురస్కరించుకొని గీతభవనంలో ఐదుగురు పండితులను ఘనంగా సన్మానించారు. సమాఖ్య ప్రధా న కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పండితు లు గోసం దత్తుశాస్త్రి, మనోహరశాస్త్రి, చంద్ర శేఖర్శర్మ, మారుతిజోషి, ప్రమోద్లను శాలు వ, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వీపీ చందన్రావు, సమాఖ్య అధ్యక్షులు ప్రభాకర్, ప్రకాశ్, లక్ష్మన్, ఆశోక్శర్మ తదితరులున్నారు. నిజామాబాద్ రూరల్: గుండె సంబంధిత వ్యాధుల నివారణకు వాకింగ్, శారీరక వ్యాయామం, యోగా చేయడం మంచిదని ప్రముఖ కార్డియాలజిస్ట్ సందీప్రావు తెలిపారు. ఆదివారం వినాయక్నగర్లో బస్వా పార్క్ యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మద్యపానం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు సందీప్రావును సన్మానించారు. కార్యక్రమంలో గంగాధర్, మల్లేశ్రెడ్డి, మోహన్ కుమార్, రామ్మోహన్రావు, భూమేశ్వర్, దీవెన, మహేందర్, సత్యనారాయణ, శంకర్ తదితరులున్నారు. ఖలీల్ వాడి: త్రిభాషలైన తెలుగు, హిందీ, ఉర్దూలో విద్యార్థులను తీర్చిద్దాలని డీఈవో పార్శి అశోక్ తెలిపారు. ఆదివారం నగరంలోని ఆర్యనగర్ లో డీఈవో నివాసంలో రాష్ట్రీ య ఉపాధ్యాయ పండిత పరిషత్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఏ, బీ,సీ గ్రేడులుగా విభజించుకుని సీ గ్రేడ్ కలిగిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జమీలుల్లా, ప్రధాన కార్యదర్శి రమణచారి, కోశాధికారి సతీష్ వ్యాస్, రాష్ట్ర బాధ్యులు గంట్యాల ప్రసాద్, పెంట శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బి.ప్రవీణ్ కుమార్, దేవన్న, శ్రీమన్నారాయణ చారి, అబ్దుల్ వహీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్: నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నగర సమస్యలపై పుస్తకాన్ని సోమవారం ఆవిష్కరిస్తున్నట్లు పెన్షనర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి కే రామ్మోహన్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని సుభాష్నగర్లోగల పెన్షనర్స్ భవన్లో కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని, ఆవిష్కరణ కార్యక్రమానికి నుడా చైర్మన్ కేశ వేణు, మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్, అర్బన్ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎన్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. -
అభివృద్ధి పనుల పరిశీలన
నిజామాబాద్ రూరల్: నగరంలోని రెండో డివిజన్ బోర్గాం (కె) గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆదివారం కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పరిశీలించారు. సూపర్వైజర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులతో మాట్లాడి పనులు వేగవంతం చేసుకోవాలని సూచించారు. అంబేడ్కర్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వారి కమిటీ హాల్ని సందర్శించారు. అనంతరం డివిజన్ గ్రామ కాంగ్రెస్ సభ్యులు బొబ్బిలి రామకృష్ణని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బోర్గాం(కె) అధ్యక్షులు రాజు, మట్ట రాము, నగేష్, నవీన్ గౌడ్, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 60వ డివిజన్ నాయకులు అలీ ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్యశిబిరాన్ని ఆదివారం నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ శిబిరాన్ని పరిశీలించి డాక్టర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా బొబ్బిలి రామకృష్ణ వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు అబుద్ బిన్ హందాన్, షాదాబ్, అంజద్, అష్రాఫ్, స్థానిక పెద్దమనుషులు, ఇతరులు పాల్గొన్నారు. -
సమస్య వస్తే పోలీసులను సంప్రదించాలి
● డిచ్పల్లి సీఐ వినోద్ ● నూతనంగా ఎన్నికై న సర్పంచులకు అవగాహనడిచ్పల్లి : గ్రామంలో ఏదైనా సమస్య వస్తే సొంత నిర్ణయాలతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిచ్పల్లి సీఐ కే వినోద్ సూచించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులకు ఆదివారం పోలీస్స్టేషన్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నేరాల కట్టడికి శాంతిభద్రతల రక్షణ కోసం గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, రోడ్డు ప్రమాదాలను అరికట్టేలా సహకరించాలన్నారు. వానదారులందరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలన్నారు. గ్రామాల్లోని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా సర్పంచులు కృషి చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శాంతిభద్రత పరిరక్షణలో పోలీసులకు సర్పంచులు పంచాయతీ పాలకవర్గాల సభ్యులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సై మహమ్మద్ ఆరిఫ్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. -
వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి
ధర్పల్లి: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకువచ్చిన ’వీబీ– జీ రామ్ జీ ’చట్టాన్ని రద్దు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1983లో రూపొందించిన విత్తన నియంత్రణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అణిచివేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసి, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 దినాల పని కల్పించి, రోజుకి రూ.600 కూలి చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ–జీ రామ్ జీ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా, మండల, గ్రామస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బాలయ్య, విమల భూమేష్, గంగారం తదితరులు పాల్గొన్నారు. -
టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు
ఆర్మూర్ : కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను ఆదివారం హైదరాబాద్ లో కలిశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణం లో రాజకీయ పరిస్థితుల పై చర్చించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిని కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసిన వారిలో ఆర్మూర్ ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ ఇట్టేం జీవన్, నాయకులు ఖాందేష్ శ్రీనివాస్, పవన్, పూల నర్సయ్య, విటోభ శేఖర్, రమేష్ తదితరులున్నారు. -
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
● ‘ఉచిత హెల్త్ క్యాంప్’ అభినందనీయం ● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సుభాష్నగర్ : జీవితంలో ఎన్ని రకాల ఒత్తిళ్లు ఉన్నా.. ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. ఆదివారం నగరంలోని కిషన్గంజ్లోగల ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఆరోగ్య శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలుచేశారు. వైద్యశిబిరానికి సన్రైజ్ ఆస్పత్రి, మనోరమ ఆస్పత్రికి చెందిన వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించారు. రక్త పరీక్షలు, బీపీ, ఆర్థోపెడిక్, దంత, గుండె, కంటి, నరాలకు సంబంధించిన వైద్యనిపుణులతో కూడిన వైద్యబృందం ఆరోగ్య పరీక్షలను నిర్వహించింది. అనంతరం ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆరోగ్యమే ప్రధానమని తెలిపారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మెగా హెల్త్క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదని ఆయన స్పష్టంచేశారు. ఆర్యవైశ్యులతోపాటు అనేక కులాల పేదలు ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మెగా హెల్త్ క్యాంప్లో పాల్గొన్న వైద్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అలాగే ఆర్యవైశ్య సంఘంలో నిరుపేద ఆర్యవైశ్యలకు ధన్పాల్ లక్ష్మీబాయి, విఠల్ గుప్త ట్రస్ట్, ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేదలకు ప్రతినెలా రూ.500 అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.500 పెన్షన్లో ఆర్యవైశ్య సంఘం రూ.300, తన ట్రస్ట్ ద్వారా రూ.200 అందజేస్తున్నానని తెలిపారు. 72 మందికి ప్రతినెలా పింఛన్ అందజేస్తామన్నారు. రూ.500 పెన్షన్తోపాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడానికి ఆర్యవైశ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్త, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్త, గాలి నాగరాజు గుప్త, లాభిశెట్టి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
పాత నేరస్తులపై నిరంతరం నిఘా
ఏఎస్పీ చైతన్యరెడ్డి భిక్కనూరు: పాత కేసుల్లో నేరస్తులు, నిందితులు, అనుమానితులుగా ఉన్న వ్యక్తులపై పోలీస్ శాఖ నిరంతం నిఘాను పెడుతుందని కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి అన్నారు. ఆదివారం భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లి, జంగంపల్లి గ్రామాల్లో పాత కేసుల్లో ఉన్న నేరస్తులు, నిందితులు, అనుమానితులను విచారించారు. వారు ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాలు, పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గతంలో అసాంఘిక కార్యకలాపాలకు, మోసాలకు పాల్పడిని వారు తమ పద్ధతిని మార్చుకోవాలని లేకుంటే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగిన వారిని గుర్తించి వారి పేర్లను అనుమానిత జాబితా నుంచి తొలగిస్తామన్నారు. సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. ఏఎస్పీ వెంట భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు. -
కానిస్టేబుల్పై కేసు నమోదు
సిరికొండ: సిరికొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుధాకర్పై యాక్సిడెంట్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై జే రామకృష్ణ ఆదివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గంగాధర్ అనే వ్యక్తిని గత నెల 27న సుధాకర్ కారుతో ఢీకొట్టి గాయపర్చారని పేర్కొన్నారు. సంఘటన జరిగిన రోజున పెద్ద మనుషుల సమక్షంలో గాయపడిన వ్యక్తికి ఆస్పత్రిలో అయ్యే వైద్య ఖర్చులను భరిస్తానని కానిస్టేబుల్ సుధాకర్ ఒప్పుకొని వెనుదిరిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ● దాబాపై నుంచి పడి విద్యార్థికి గాయాలు నవీపేట్: మండల కేంద్రంలోని సుభాష్నగర్ కాలనీకి చెందిన విద్యార్థి లోకేశ్ గాలిపటం ఎగుర వేస్తూ దాబాపై నుంచి కిందపడ్డాడు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న లోకేశ్ స్నేహితులతో కలిసి గాలిపటం ఎగురవేస్తూ వెనుకకు వెళ్లగా కిందపడ్డాడు. స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. -
సొసైటీ గోదాముల వద్దటెంట్లు ఎందుకో..?
డొంకేశ్వర్: యూరియా పంపిణీ చేసే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), గోదాముల వద్ద టెంట్లు ఉండాలనే నిబంధన రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. యూరియా పంపిణీ పూర్తయ్యే వరకు టెంట్లను ఉంచేలా చూడాలని అధికారులకు సూచించింది. జిల్లాలో 89 సొసైటీలు ఉండగా వీటి పరిధిలో ఊరూరికి గోదాములు ఉన్నాయి. వీటి ద్వారానే రైతులకు యూరియా బస్తాలను అందిస్తున్నారు. అయితే గోదాముల ఎదుట టెంట్లు ఎందుకనే ప్రశ్న అందరిలో వ్యక్తమవుతోంది. అందులో ఎండలు ఉన్నాయనేందుకు ఇది వేసవి కాలం కూడా కాదు. ప్రస్తుతం చలికి వణికిపోతు ఎండను కోరుకుంటున్న సమయంలో ప్రభుత్వం టెంట్లు వేయించి డబ్బులు ఖర్చు చేయడంపై సొసైటీ నిర్వాహకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
నేలవాలిన విద్యుత్ స్తంభం
● తప్పిన పెను ప్రమాదం దోమకొండ: మండల కేంద్రంలోని పలుగుగడ్డ ప్రాంతంలో గడ్డిని చదును చేయడానికి గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో ఆదివారం శుభ్రం చేస్తున్నారు. ఇదే సమయంలో విద్యుత్ స్తంభానికి సపోర్టు కోసం భూమిలో ఇనుప చువ్వకు వైరుతో ఉన్న భాగాన్ని సదరు ట్రాక్టర్ ఢీకొన్నది. దీంతో విద్యుత్ స్తంభం నేల వాలుతూ గ్రామానికి విద్యుత్ సరఫరా జరిగే ప్రధాన విద్యుత్ లైన్పై పడటంతో విద్యుత్ మంటలు చెలరేగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న గ్రామ వార్డు సభ్యులు బీసు సతీశ్, బత్తిని సిద్ధరాములు, కాలనీవాసులు ఉన్నారు. వెంటనే వారు అప్రమత్తమై దూరంగా వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగలేదు. వెంటనే వారు విద్యుత్ శాఖ అధికారులకు సమచారం అందించారు. ఈ ఘటనతో మండల కేంద్రంలో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
● అ‘పూర్వ’ సమ్మేళనం
వేల్పూర్/ ఖలీల్వాడి: వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో మోర్తాడ్ జూనియర్ కళాశాల 1990–92 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం పాఠాలు బోధించిన అధ్యాపకులను సన్మానించారు. నగరంలోని బ్రహ్మపురిలో ఉన్న వేంకటేశ్వర విద్యాలయం కు చెందిన 2006–07 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. -
క్రైం కార్నర్
చికిత్సపొందుతూ బాలింత మృతి ఆర్మూర్టౌన్: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆర్మూర్ పట్టణానికి చెందిన శ్రీలత(27) అనే బాలింత ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 2న శ్రీలతకు పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు ఆర్మూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా శ్రీలత మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కావడంతో ఈనెల 3న ఉదయం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శ్రీలత మృతిచెందిందని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండలం నారాయణ గూడెం తండాకు చెందిన మునావత్ రవి(36) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడి తండ్రి బాల్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇసుక వాహనాల పట్టివేత మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని కుర్లా శివారులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను శనివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై రాజు ఆదివారం తెలిపారు. విజిలెన్స్, రెవెన్యూ అధికారులు పోలీసు సిబ్బంది సహాయంతో కుర్లా వద్ద రెండు వాహనాలను పట్టుకున్నారు. డ్రైవర్లపై కేసు నమోదు చేసి వాహనాలను మద్నూర్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
అల్లాడుతున్న ఆయకట్టు రైతులు
మోర్తాడ్: మండలంలోని గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గతంలోనే గండి ఏర్పడింది. దీంతో నీటి సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కాలువను నమ్ముకుని ఏడు గ్రామాల రైతులు సుమారు 2,600 ఎకరాల్లో వివిధ రకాలైన పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరద కాలువలో నీరు లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. గాండ్లపేట్ వద్ద ఏర్పడిన గండితో ఎస్సారెస్పీ నుంచి విడుదలయ్యే నీటిని నిలిపివేశారు. గండి ఏర్పడిన ప్రాంతాన్ని మినహాయించి ముందు భాగంలో రైతులు తాత్కాలిక మట్టి కట్టను నిర్మించుకున్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని వరద కాలువలోకి విడుదల చేస్తే గాండ్లపేట్ గండికి కొంత దూరంలో నీటిని నిలిపి పంటలకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చని రైతు లు భావిస్తున్నారు. మోర్తాడ్, గాండ్లపేట్, పాలెం, తిమ్మాపూర్, కమ్మర్పల్లి, ఉప్లూర్, నాగాపూర్ గ్రామాల రైతులను రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. మరమ్మతులకు నిధులు.. గాండ్లపేట్ వద్ద గండికి మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.8.52 కోట్లు విడుదల చేసింది. కానీ టెండర్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో పనుల ప్రారంభంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతుల విషయంలో జాప్యం జరిగినా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేస్తే వరద కాలువ ఆయకట్టుకు జీవం పోసినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆందోళన బాటలో రైతులు.. వరద కాలువకు ఇరువైపులా ఉన్న మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాలైన ఏడు గ్రామాల ఆయకట్టు రైతు లు వరి, జొన్న, సజ్జ, నువ్వులు తదితర రకాల పంటలను సాగు చేస్తారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వ రి, సజ్జ పంట వేస్తారు. దీనికి నీరు అధికంగా అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ నెల 15వ తేదీ వర కు పంటలకు సాగునీటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత పంటలకు నీరు విషయమై, చేపట్టే అంశాలపై ఈ ఏడు గ్రామాల రైతులు ఆదివారం మోర్తాడ్లో సమావేశమయ్యారు. ప్రభుత్వం తొందరగా రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేస్తే యాసంగి పంటలను పూర్తిగా గట్టెక్కించవచ్చని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన బాట తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు. గాండ్లపేట్ వరద కాలువ గండికి మరమ్మతులు కరువు రివర్స్ పంపింగ్ ద్వారానైనా నీటిని విడుదల చేయాలని మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల రైతుల విజ్ఞప్తి -
జేసీఐ ఇందూరు అధ్యక్షుడిగా జైపాల్ కాలే
సుభాష్నగర్: జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్(జేసీఐ) ఇందూర్ 26వ అధ్యక్షుడిగా జైపా ల్ కాలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం నగరంలో నిర్వహించిన జేసీఐ సమావేశంలో జైపాల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి, పూర్వాధ్యక్షుడు కే మనోజ్ కుమార్ చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికై న జైపాల్ 2025లో జేసీఐ ఇందూర్ కార్యదర్శిగా సేవలందించారని తెలిపారు. అదేవిధంగా జేసీఐ కార్యదర్శిగా తిరునగరి తేజస్విని ఎన్నికయ్యారని మనోజ్ పేర్కొన్నారు. జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో విసృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అధ్యక్షుడు జైపాల్ అన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న జేసీఐ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్అర్బన్: జిల్లా జైలులో ఖైదీలకు గంజాయి సరఫరా, ఖైదీల మధ్య గొడవపై జైళ్ల శాఖ డీ ఐజీ మురళిబాబు, ఐజీ సంపత్ విచారణ చేపట్టా రు.శనివారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వ రకు అధికారులు ఘటన వివరాలు తెలుసుకున్నా రు.ఇద్దరు జైలు అధికారులను విచారించగా, ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఖైదీల బంధువుల నుంచి డబ్బుల వసూ లు, బహుమతులను తీసుకున్నట్లు తేలింది. దీంతో జైలు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
యువత క్రీడలపై ఆసక్తి చూపాలి
డిచ్పల్లి: యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని డిచ్పల్లి సీఐ వినోద్ సూచించారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీనియర్ ఖోఖో టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి హాజరైన సీఐ మాట్లాడుతూ..గ్రామ యువకులు, సర్పంచ్ గొట్టిపాటి వాసు బాబు, ఉప సర్పంచ్ సల్మాన్ ఉ మ్మడి జిల్లా ఖోఖో టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. అనంతరం విజేతగా నిలిచిన ఉప్పల్వాయి, ధర్మారం(బి), మద్నూర్ జట్లకు బహుమలు అందజేశారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ, ఫిజికల్ డైరెక్టర్ రాము, కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ గంగాధర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజ్కుమార్, నర్సింలు, సాయిబాబు, శ్రీనివాస్, గ్రామ పెద్దలు చాకటి మురళి, సొసైటీ మాజీ చైర్మన్ కే రామకృష్ణ, సింగు ప్రవీణ్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
ఆర్మూర్టౌన్: బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఆర్మూర్ పట్టణంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గడ్డం శ్రా వణ్రెడ్డి, కార్యవర్గ నిర్వహణ అధ్యక్షుడిగా టి వి ద్యాసాగర్రెడ్డి, ప్రధానకార్యదర్శిగా బోనగిరి శ్యా మ్, ఉపాధ్యక్షులుగా జైరాజ్కుమార్, కే సునీత, బి నగేశ్, జి రాజేశ్, పి నరేందర్, కోశాధికారిగా బి రాజేశ్వర్, కార్య నిర్వాహణ కార్యదర్శిగా నగేశ్, సంయుక్త కార్యదర్శులుగా సురేశ్, ఆనంద్, నిఖిత ఎన్నికయ్యారు. త్వరలో ఆర్మూర్ పట్టణంలోని ఆల్ఫోర్స్ హైస్కూల్లో నిర్వహించే 70వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బ్యాల్ బ్యాడ్మింటన్ పోటీలను వి జయవంతం చేయాలని ఈ నూతన కార్యవర్గ స భ్యులు తీర్మానించారు. పలు క్రీడా సంఘల నాయకులు తిరుపతి, రమణమూర్తి, దేవన్న, మానస గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ బాలికల జట్టు కోచ్గా సుమలత
నందిపేట్: జాతీయ స్థాయి ఖేలో ఇండియా పోటీలకు నందిపేట మండల కేంద్రంలోని గీతా కాన్వెంట్ స్కూల్ పీఈటీ మర్రిపల్లి సుమలత తెలంగాణ జట్టు బాలికల కోచ్గా వ్యవహరించనున్నారు. ఈ క్రీడలు ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు కేంద్ర పాలిత ప్రాంతం డయ్యు డామన్ లో జరుగుతాయని గీతా కాన్వెంట్ పాఠశాల కరస్పాండెంట్ కానూరి గంగా సాగర్ తెలిపారు. తెలంగాణ జట్టు బాలికల కోచ్గా సుమలత ఎంపికపై తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గజ్జల రమేశ్ బాబు, వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ జనరల్ సెక్రెటరీ హనుమంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీ మల్లేశ్ గౌడ్, నిజామాబాద్ క్రీడల అధికారి పవన్, గీతా కాన్వెంట్ హై స్కూల్, నందిపేట్ యాజమాన్యం సుమలతను అభినందించారు. -
జిల్లా మహిళలకు రాష్ట్రస్థాయి అవార్డులు
సుభాష్నగర్: జిల్లాలోని కులవృత్తి విభాగంలో సేవలందిస్తున్న బగ్గలి స్వప్న రజక, వ్యాపార రంగంలో రాణిస్తున్న సు రుకుట్ల ఝాన్సీ సావిత్రీబాయి ఫూలే రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. సావిత్రీబాయి ఫూలే ఫౌండేషన్, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం సంయుక్తాధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో కార్యక్ర మం నిర్వహించారు.ఆన్లైన్ ద్వారా వినతుల ను స్వీకరించి వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చి న వారికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఇజ్రాయిల్లో నూతన సంవత్సర వేడుకలు ఆర్మూర్: ఇజ్రాయిల్లో ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బానాల గంగాధర్ ఆదివారం తెలిపారు. రహమత్గాన్లోని లోనా పార్క్లో తెలంగాణ వాసులు వందల సంఖ్యలో హాజరై వేడుకలు నిర్వహించారు. తెలంగాణ వాసులతో పాటు గుజరాత్, కర్ణాటకకు చెందిన భారతీయులు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మంగళారం రాజు, ప్రధాన కార్యదర్శి చిన్న, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, మాజీ చైర్మన్ దేగాం లక్ష్మీనారాయణ, అసోసియేషన్ వ్యవస్థాపకులు మెరుగు మహేశ్, మచ్చర్ల ఊషన్న, యాదగిరి, అన్వేష్, నారాయణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ముసాయిదా జాబితాపై నేడు సమావేశం సుభాష్నగర్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కమిషనర్ దిలీప్కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా, అభ్యంతరాల స్వీకరణ, సవరణలు తదితర అంశాలు ఎజెండాగా సమావేశం కొనసాగనుంది. బోధన్: ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ తల్లి పులి పద్మావతి(91) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తన మరణానంతరం చూపు లేని వారికి చూపు కల్పించాలని మృతురాలి కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆమె రెండు కళ్లను దానం చేశారు. బోధన్ లయన్స్ కంటి ఆస్పత్రి వైద్యులు నేత్రాలను సేకరించారు. అంత్యక్రియల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశవేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రాంమోహన్, నాయకులు, పలు గ్రామాల సర్పంచ్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని ఇందూరు విభాగ్ ప్రముఖ్, ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు రెంజర్ల నరేశ్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 3 నుంచి 5తేదీ వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రెండోరోజు ఆదివారం రెంజర్ల నరేశ్ ఆధ్వర్యంలో అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నరేశ్ మాట్లాడుతూ.. తెలంగాణ నలుమూలల నుంచి 1,500 మంది ఏబీవీపీ కార్యకర్తలు సభలకు రాగా, జిల్లా నుంచి 150 మంది కార్యకర్తలు హాజరయ్యారని పేర్కొన్నారు. ఏబీవీపీ క్రమశిక్షణ కలిగిన దేశభక్తులను తయారు చేసే సంస్థ అని తెలిపారు. చివరిరోజు సోమవారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాజరుకానున్నారన్నారు. కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ కై రి శశిధర్, విభాగ్ సంఘటన మంత్రి హర్షవర్ధన్, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు చారి, శివ, నిఖిల్, దినేశ్, పృథ్వి, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ఇందూరు విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేశ్ -
మున్నూరుకాపులు అన్నిరంగాల్లో రాణించాలి
మోపాల్: జిల్లాలోని మున్నూరుకాపులు అన్నిరంగాల్లో రాణించాలని మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. ఆదివారం నగరశివారులోని బోర్గాం(పి)లో ఉన్న కిసాన్ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని మున్నూరుకాపు సంఘాలు జిల్లా సంఘంలో కలిస్తే మరింత బలోపేతం కావచ్చని తెలిపారు. అన్ని సంఘాలకు అండగా ఉంటామని, మున్నూరుకాపు సంఘాలు బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పుప్పాల శోభ, సలహాదారులు చిట్టి సాయిరెడ్డి, బంటు దాస్, సంఘం అధ్యక్షుడు బంటు సుభాష్, ప్రధానకార్యదర్శి బంటు సుదర్శన్, నాయకులు సాయిరెడ్డి, చిట్టి కిష్టయ్య, చంద్రశేఖర్, చిట్టి మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సావిత్రీబాయి ఫూలే జయంతి
సుభాష్నగర్/ మోపాల్/ జక్రాన్పల్లి/ ఇందల్వాయి/ ధర్పల్లి/ తెయూ(డిచ్పల్లి)/ నిజామాబాద్ లీగల్/ నిజామాబాద్ రూరల్/ సిరికొండ/ ఖలీల్వాడి/ నిజామాబాద్: గొప్ప సంఘ సంస్కర్త, ఉద్యమశీలి సావిత్రీబాయి ఫూలే అని పలువురు వక్తలు అన్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో సావిత్రీబాయి ఫూలే జయంతిని ప్రజలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థల్లో ఆమె చిత్రపటానికి ఉపాధ్యాయులు, అధికారులు, నిర్వాహకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళలు చదువును నిర్లక్ష్యం చేయొద్దని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు అధికారులు బహుమతులు అందజేశారు. పలు చోట్ల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి న్యాయవాదులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిరికొండ మండలం సత్యశోధక్ పాఠశాలలో నిర్వహించిన సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ హాజరయ్యారు. పాఠశాలలో చదువు మధ్యలో మానేసిన పిల్లలు(డ్రాపవుట్స్) లేకుండా చూడాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయినులను సన్మానించారు. -
లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు కృషి చేయాలి
ఇందల్వాయి: గ్రామాల్లో లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు సర్పంచులు పోలీసులకు సహకారం అందించాలని డిచ్పల్లి సీఐ వినోద్,ఎస్సై సందీప్ అన్నారు. నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో ఎల్లరెడ్డిపల్లె గ్రామంలో శనివారం సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. గ్రామాల్లో నేరాలు జరగకుండా, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా గ్రామ సభల్లో తీర్మానాలు చేసి అందుకు అనుగుణంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో అనుమానస్పద వ్యక్తుల వివరాలను సేకరించాలని, గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి: మండలంలోని కొలిప్యాక్ గ్రామానికి చెందిన గల్ఫ్ బాధితుడు కమ్మరి అరుణ్కు గల్ఫ్ డ్రైవర్స్ అసోసియేషన్, డీఎస్పీ ఎన్నారై తరఫున రూ. 32వేల ఆర్థికసాయన్ని అందజేశారు. గ్రామానికి చెందిన అరుణ్ అనారోగ్యం కారణంగా ఇటీవల దుబాయి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం అరుణ్కు రూ. 32వేల ఆర్థికసాయిన్ని జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ నాయకుడు ప్రేమ్కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రవి, ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి: మండలంలోని సాంపల్లి తండా సర్పంచ్ రాథోడ్ మమత భర్త రాహుల్ సింగ్ సర్పంచ్ కుర్చీలో కూర్చుని పెత్తనం చెలాయిస్తున్నారని మాజీ సర్పంచ్ జగదీశ్ రాథోడ్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ఎంపీవో శ్రీనివాస్ గౌడ్ను కలిసి ఫిర్యాదు అందజేశారు. అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎంపీవో విచారణ చేపడతామని అన్నారు. నిజామాబాద్అర్బన్: రాష్ట్ర వనరులపైన అవగాహనలేని సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో ఉండటం రాష్ట్రాభివృద్ధికి అవరోధమేనని జిల్లా భారాస లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్రావు శనివారం అన్నారు. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తికమకపడి తప్పుడు మాటలు మాట్లాడటం సీఎం హో దాకు తగదని ఆయన పేర్కొన్నారు. తెలంగా ణ జల వనరులు మళ్లీ ఆంధ్రపాలకుల పరం చేస్తున్నడానికి రేవంత్ సమాధానం ఇవ్వకుండా బజారు భాషలో కేసీఆర్ పై నోరు జారడం తెలివితక్కున తనమేనని ఆయన తెలిపారు. సిరికొండ: మండలంలోని న్యావనంది గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను డీఈవో అశోక్ శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైస్కూల్లో గదుల్లో ఫ్లోరింగ్, ప్రైమరీ స్కూల్లో ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని డీఈవో హమీ ఇచ్చారు. ఎంఈవో రాములు, జీహెచ్ఎం తిరుపతి, రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు మామిడికింది నరేందర్, మహిపాల్, గొల్ల జనార్దన్ తదితరులు ఉన్నారు. ఇందల్వాయి: మండలంలోని ధర్పల్లి రోడ్డు నుంచి జీకే తండాకు వెళ్లే రోడ్డు మార్గంలో దట్టంగా పెరిగిన చెట్ల పొదలను ట్రాక్టర్తో శనివారం తొలగించినట్లు సర్పంచ్ శిరీష తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా పొదలను తొలగించినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఖలీల్వాడి: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని వెహికిల్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ అన్నారు. జిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య ఆధ్వర్యంలో దుబ్బ ప్రభుత్వ పాఠశాల హైస్కూల్లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుజరాజేశ్వరి, బీ లింగయ్య, శ్రీనివాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సెల్ ఫోన్కు దూరంగా ఉండాలి
సిరికొండ: విద్యార్థులు సెల్ ఫోన్కు దూరంగా ఉండాలని తెయూ వీసీ యాదగిరిరావు అన్నారు. రావుట్ల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్థానికుడైన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ రిక్క లింబాద్రి తన తల్లి లక్ష్మి స్మారకార్ధంగా పదో తరగతిలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. అనంతరం పదోతరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఒరగంటి రాజేశ్వరి, మూత బిందుశ్రీ, కట్టాజీ రూపికకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, సర్పంచ్ రాజ్కుమార్, ఉపసర్పంచ్ శ్రీనివాస్గౌడ్, ఎంఈవో రాములు, హెచ్ఎం శ్రీనివాస్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాలయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బోధన్లో ఒకే ఇంటిపై 10 ఓట్లు
బోధన్టౌన్(బోధన్): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బోధన్ బల్దియా అధికారులు ప్రకటించిన ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులు చోటు చేసుకున్నాయి. జాబితాపై వివిధ రాజకీ య పార్టీల నాయకులతోపాటు మాజీ కౌన్సిల ర్లు, పోటీ చేయనున్న ఆశావహులు అభ్యంతరా లు చెబుతున్నారు. 4వ వార్డులో ఒకే ఇంటిపై పది ఓట్లున్నాయి. ఇదేతరహాలో 37 వార్డులు ఉన్నా యని అధికారులకు వివరించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 38 వార్డుల్లో 62,448 ఓట్లు ఉండగా ప్రస్తుతం 69, 470 ఓట్లు ఉన్నాయి. 7,022 ఓటర్లు పెరిగారు. ఓటర్ల జాబితా డ్రాప్ట్లో మృతి చెందిన వారి ఓట్లు తొలగించలేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఓట్లు నమోదు చేయలేదు. 4వ వార్డులో మృతి చెందిన మత్తడి పోచయ్య, పత్తి జగదాంబ, బైరి గంగవ్వ, స్వప్న, ఉమర్ ఖాన్లతోపాటు మరో ఐదుగురి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. కాగా, ఓటర్ల ముసాయిదా జాబితాలో తప్పులను సవరించాలని ఇప్పటికే ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సబ్ కలెక్టర్ను కలిసి విన్నవించారు. -
అయోమయం..
నిజామాబాద్కాంగి‘రేసు’లో రబీ సాగుకు భరోసా! పోచారం ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉంది. సాగునీటికి ఢోకా లేకపోవడంతో ఆయకట్టు రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు.వాతావరణం దట్టంగా పొగమంచు కురుస్తుంది. ఈదురు గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. రాత్రి చలి తీవ్రత కొనసాగుతుంది. రూ.లక్షలు వెచ్చించి.. భారీ వరద తాకిడికి కోతకు గురైన భూముల్లో తిరిగి పంటలను సాగు చేసేందుకు రైతులు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు.ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026– 8లో uఓటర్ల జాబితాలో హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ల ఓట్లు భారీగా చేరడం మీద చర్చ జరిగింది. తమ డివిజన్లలో తమకు తెలియకుండా బయటి వ్యక్తుల ఓట్లు ఎలా నమోదయ్యాయంటూ ఆయా డివిజన్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇలా అయితే ఎంఐఎం, బీజేపీలను ఎదుర్కోవడం కష్టమేనని కొందరు అన్నట్లు తెలిసింది. కీలకమైన ఇలాంటి అంశాల మీద ఏమాత్రం గ్రౌండ్వర్క్ లేకుండా ముందుకు వెళితే కష్టమేనని పలు డివిజన్ల నాయకులు అన్నారు. రియల్ ఎస్టేట్, ఇతర దందాలు చేసుకుంటూ అంతా బాగుందనే నాయకుల కారణంగానే పార్టీలో పరిస్థితి గందరగోళంగా తయారైందని కొందరు అసహనం వెలిబుచ్చారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరపాలక ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో నిజామాబాద్ నగర కాంగ్రెస్లో అయోమయ పరిస్థితి నెలకొంది. బీజేపీ, ఎంఐఎం ఎన్నికల బరిలో ఆధిపత్యం చాటుకునేందుకు ఇప్పటికే నగరంలో పకడ్బందీగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్లో మాత్రం సమన్వయం కుదరకపోవడంతో గందరగోళం నెలకొంది. శనివారం నగరపాలక ఎన్నికల విషయమై ఓటరు ముసాయిదా జాబితా పరిశీలన మీద నగర కాంగ్రెస్ సమావేశం జరిగింది. నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బ్లాక్ అధ్యక్షుడు కేశ మహేశ్, అబుద్ బిన్ హందాన్, సేవాదళ్ బాధ్యులు పాల్గొన్నారు. అయితే ఇంకా నగర కమిటీ వేయకపోవడం, డివిజన్ కమిటీలు నియమించకపోవడంతో ఈ సమావేశంలో ఎవరికి వారే అన్నట్లుగా సాగింది. ఆయా డివిజన్లలో తమ పెత్తనమే సాగాలని కొందరు నాయకులు, పనిచేసిన తమకే టికెట్లు ఇవ్వాలని మరికొందరు నాయకులు డిమాండ్ చేశారు. కొత్త కమిటీ వేసేవరకు తమదే పెత్తనమని కొందరు చెప్పడంతో సమావేశంలో గలాటా జరిగింది. తమ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు ముందుకెళ్లాలని కొందరు మాజీ కార్పొరేటర్లు అన్నారు. ఇదిలా ఉండగా కొందరు సీనియర్ కార్యకర్తలు మాత్రం కొత్తవారికి అధిక ప్రాధాన్యత ఇచ్చి తమకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు ఇవ్వకపోతే బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్, జాగృతి పార్టీల్లోకి వెళ్లిపోతామని కొందరు సీనియర్ కార్యకర్తలు, నాయకులు తెగేసి చెప్పారు. మరికొందరు డివిజన్ల నాయకులు కొత్త కమిటీ వేసేవరకు తామే కొనసాగుతామని చెప్పడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఆర్మూర్: ఆర్మూర్ కాంగ్రెస్లో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ రగడ మళ్లీ ప్రారంభమైంది. మున్సి పల్ ఎన్నికలు నిర్వహించనుండటంతో ఆది నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న సీనియర్ నాయకు లు తమ ఉనికిని కాపాడుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్రెడ్డికి సమాచారం ఇవ్వకుండా ఆర్మూర్ పట్టణంలో రహస్యంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో తమ భవితవ్యంపై ఘాటుగా చర్చించినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి వలస వచ్చిన వినయ్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. వినయ్రెడ్డి ఓటమిపాలైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గ ఇన్చార్జిగా హవా కొనసాగుతోంది. దీంతో ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గంతోపాటు పలు వురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. జూనియర్లుగా చేరిన వీరందరికీ పీవీఆర్ వర్గంగా ముద్ర పడింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సీనియర్ నాయకులకు పీవీఆర్ వర్గానికి మధ్య మనస్పర్థలు తలెత్తుతూ వస్తున్నా యి. సీనియర్ నాయకులకంటే వినయ్రెడ్డి సమక్షంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి న వారికే ప్రాధాన్యత లభిస్తోందనే అభద్రతా భావంతో సీనియర్లు క్రమంగా పార్టీ కార్యకలాపా లకు దూరమవుతూ వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు రానుండటంతో అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులు శనివారం సమావేశమై తమ భవితవ్యంపై చర్చించుకున్నారు. అందులో సు మారు 10 నుంచి 12 మంది కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో పార్టీలో త మ ప్రాధాన్యత గురించి వినయ్రెడ్డికి సమాచారం ఇవ్వాల్సిందిగా సమావేశానికి ఆర్మూర్ ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ను సైతం పిలిపించారు. పార్టీ కోసం ఏళ్ల తరబడిగా కష్టపడుతున్న తమకు కౌన్సిలర్ టికెట్లు కేటాయించాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఇదే విషయమై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ను కలిసి విన్నవించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. బయటి ఓట్ల నమోదు ఎలా! నగరపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో గందరగోళం డివిజన్లలో పెత్తనం, టికెట్లపై ఎవరి వాదన వారిదే కొత్తవారికి ప్రాధాన్యత ఎందుకంటూ పాత నాయకుల అసహనం ఆర్మూర్లో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ పార్టీ ఇన్చార్జి వినయ్రెడ్డికి సమాచారం లేకుండా సమావేశం -
తప్పుల తడక.. ముసాయిదా జాబితా
ఆర్మూర్: నిజామాబాద్ కార్పొరేషన్తోపాటు ఆ ర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో ఇటీవల అధికారులు ప్రకటించిన ముసాయిదా ఓ టర్ల జాబితాలో తప్పిదాలను గుర్తించేందుకు బీజే పీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, ఆర్మూర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మందుల బాలకృష్ణ, బీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ మున్సిపల్ అధికారులను కలిసి నకిలీ ఓట్ల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రాలు సమర్పించారు. ఓటరు జాబితా నుంచి మరణించిన వారి పేర్లతోపాటు డ బుల్ ఉన్న ఓట్లను తొలగించకపోవడంతో ఐదేళ్ల క్రి తం మున్సిపల్ ఎన్నికల నాటికి ఇప్పటికీ గణనీయంగా ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది. దీంతో నకి లీ ఓట్లు గెలుపును నియంత్రిస్తాయోననే భయంప్రధాన పార్టీల నాయకుల్లో నెలకొంది. ఆర్మూర్లో ఇలా... ● 36వ వార్డులోని పెద్దబజార్ గోల్బంగ్లాలోని 3–7–39 నంబర్ ఇల్లు ఓ వర్గానిది. ఈ ఇల్లు కూలిపోయి ఉంది. ఈ ఇంటి నంబర్పై మరోవర్గానికి చెందిన 18 మంది ఓట్లు నమోదయ్యాయి. ● 36వ వార్డులో గరిగె అనూష, వీరభద్రి పిప్రి ఓట్లు చూపిస్తున్నాయి. కానీ వీరు చాలా సంవత్సరాల క్రితమే వలస వెళ్లిపోయి ఆర్మూర్ పట్టణానికి ఎలాంటి బంధాలు లేకుండా ఉన్నారు. ● 19వ వార్డు పరిధిలోని ఓటర్ల జాబితాలో 3, 13వ వార్డు పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ, శాసీ్త్ర నగర్ కాలనీ, కుమ్మర్గల్లి, చిన్న బజార్లకు చెందిన సుమారు 60 మంది ఓటర్లను చేర్చారు. ● 36 వార్డులోని 3–6–6లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మందుల బాలానంద్ ఓటును 15వ వార్డు పరిధిలో చూపించారు. పురపాలిక పేరు వార్డులు మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు నిజామాబాద్ 60 3,44,756 1,65,916 1,78,797 43 ఆర్మూర్ 36 64,165 30,735 33,428 02 బోధన్ 38 69,810 33,881 35,929 - భీమ్గల్ 12 14,189 6,687 7,502 -ముసాయిదా జాబితా ఓటర్లు.. జాబితా సవరించాలి ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులను సవరించకుండా, నకిలీ ఓట్లను తొ లగించకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదు. జాబితాను సవరించి వార్డుల పునర్విభజన చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. – మందుల బాలకృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు, ఆర్మూర్ ఓటరు లిస్టులో తప్పిదాలు గుర్తించే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆర్మూర్లో ఓ వర్గం ఇంటి నంబర్పై మరోవర్గానికి చెందిన 18 మంది ఓట్లు మరణించిన వారి పేర్లు యథాతథం -
పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించండి
● అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డిఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఆయన జీరో అవర్లో మాట్లాడారు. పేదలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, అనర్హులు లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే విషయమై డ బుల్ బెడ్రూం రూం ఇళ్ల కేటాయింపులో తలెత్తిన సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇళ్ల స్థ లాలు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చే యడం హర్షనీయమని, మరికొందరు పేదలకు స్థలాలు లేక ఇళ్లు నిర్మించుకోవడం లేదని గుర్తు చేశారు. నియోజకవర్గంలో సగం ఇళ్లు మంజూ రు చేస్తే, మిగిలిన సగం 1,800 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చే యాలని కోరారు. నిజాంసాగర్ కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి మరమ్మతులకు రూ.1,500 కోట్లు మంజూరు చేయాలని కోరారు. రెండేళ్ల క్రితం కాలువల లైనింగ్ పనులకు మంజూరైన రూ.22 కోట్లు, లంబాడీ తండాల్లో నిజాంసాగర్ కాలువల ఎత్తిపోతల పథకాలకు రూ.7 కోట్లు, ఎత్తిపోతల పథకాల మోటార్ల రీప్లేస్మెంట్కు నిధులు విడుదల చేయాలన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి త్వరలో అధికారులతో రివ్యూ చేసి నిధులు మంజూరు చేస్తామని సమాధానమిచ్చారు. -
ఈ పాస్ యంత్రాలతోనే అమ్మకాలు జరపాలి
● డీఏవో వీరాస్వామి వర్ని: ఈపాస్ యంత్రాల ద్వారానే యూరి యా అమ్మకాలు జరపాలని జిల్లా వ్యవసా య శాఖ అధికారి వీరాస్వామి సూచించారు. వర్ని సహకార సంఘం గోదాములో యూరియా నిలువలను ఆయన సోమవా రం పరిశీలించారు. జిల్లాలో యూరియా విక్రయాలు పారదర్శకంగా ఉండేందుకు ప్రతి గోదాములో స్టాక్ బోర్డులను రోజువారీగా అప్డేట్ చేస్తూ సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో సరిపడా నిల్వలు ఉంచామన్నారు. రైతులు నానో యూరియాను వాడాలని, దీంతో వాతావరణ సమతుల్యతతోపాటు ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందన్నారు. డీఏవో వెంట వర్ని వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ ఉన్నారు. కలెక్టరేట్ కంప్యూటర్ల జప్తు ● పరిహారం చెల్లించకపోవడంతో కోర్టు ఆదేశాలు నిజామాబాద్అర్బన్: కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన 20 కంప్యూటర్లను జిల్లా కోర్టు శనివారం జప్తు చేసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లోని లక్ష్మీ కెనాల్ కు సంబంధించి భూమిని కోల్పోయిన బాధితులు పరిహారం కోసం కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పరిహారం అందలేదు. చివరికి బాధితులు కో ర్టును ఆశ్రయించడంతో న్యాయం చేయాల ని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయినా బాధితులకు పరిహారం అందకపోవడంతో శనివారం జిల్లా సమీకృత కార్యాలయంలోని 20 కంప్యూటర్లను జప్తు చేసింది. ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయ అధికారులు ఆలస్యంతోనే పరిహారం అందలేదని కోర్టు ఆగ్రహించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అడవులను పరిరక్షించాలి ● సీసీఎఫ్ శర్వానంద్ డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో అడవులతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సీసీఎఫ్ శర్వానంద్ అటవీ సి బ్బందికి సూచించారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన డీఎఫ్వో వికాస్ మీనాతో కలిసి సమావేశం నిర్వహించారు. అటవీ భూములు కబ్జాకు గురి కాకుండా ని యంత్రణ రేఖను ఏర్పాటు చేయాలన్నారు. రానున్న వేసవి దృష్ట్యా అడవుల్లో అగ్ని ప్రమాదాలు కాకుండా చర్యలు చేపట్టాలని, వన్యప్రాణుల దాహర్తిని తీర్చేందుకు గుంతల్లో నీరు పోయాలని ఆదేశించారు. అనంతరం జూనియర్స్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్స్ డైరీని ఆవిష్కరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అసోసి యేషన్ సభ్యులు పుష్పగుచ్ఛాల స్థానంలో పేద విద్యార్థుల కోసం నోటు పుస్తకాలు, పెన్నులు అందజేయడంపై సీసీఎఫ్ అభినందించారు. సమావేశంలో ఎఫ్డీవోలు సుధాకర్, భవానీ శంకర్, ఎఫ్ఆర్వోలు శ్రీనివాస్, సంజయ్గౌడ్, రవిమోహన్ భట్, రవీందర్, గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
బీ జోన్కు ఐదు తడులు..
ఎల్లారెడ్డి: రబీ సీజన్లో సాగయ్యే పంటల కోసం పోచారం ప్రాజెక్టు నీటిని బీ జోన్కు 5 తడులు ఇవ్వాలని తీర్మానం చేసినట్లు నీటి పారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. పోచారం ప్రాజెక్టు నీటి విడుదలపై ఎంపీడీవో కార్యాలయంలో శనివారం తైబందీ సమావేశం నిర్వహించారు. రబీ సీజన్లో బీ జోన్కు నీటి విడుదలకు తీర్మానించారు. మొదటి తడి ఈనెల 9 నుంచి 23వ తేదీ వరకు, రెండో తడి ఫిబ్రవరి 3 నుంచి 14వ తేదీ వరకు, మూడో తడి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 13 వరకు, నాల్గో తడి మార్చి 24 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు, ఐదో తడి ఏప్రిల్ 18 నుంచి 27వ తేదీ నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. సమావేశంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
కొండగట్టులో బందోబస్తును పర్యవేక్షించిన సీపీ
నిజామాబాద్అర్బన్: జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రానికి శనివారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అక్కడ బందోబస్తు పర్యవేక్షించారు. ఈ బందోబస్తులో జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, సిరిసిల్ల ఎస్పీ మహేష్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మంచిర్యాల డీసీపీ భాస్కర్. నిజామాబాద్ అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఈ బందోబస్తును పర్యవేక్షించారు. నిజామాబాద్ జిల్లా పోలీసులు కూడా పాల్గొన్నారు. -
రూ.లక్షలు వెచ్చించి.. ఇసుక మేటలు తొలగించి..
ధర్పల్లి: భారీ వరద తాకిడికి కోతకు గురైన భూముల్లో తిరిగి పంటలను సాగు చేసేందుకు రైతులు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. సుమారు ఒక ఎకరం భూమికి రూ.ఒక లక్ష నుంచి రెండు లక్షల వ్యయంతో ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తీసుకువచ్చి పొలం గట్లు పోయడం, భారీగా ఏర్పడిన గుంతలలో మట్టిని పోసి పొలం మాడులను సిద్ధం చేశారు. గత ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పంటలతో పాటు రోడ్లు, ఇళ్లకు నష్టం కలిగిన విషయం తెలిసిందే. ధర్పల్లి మండలంలో కురిసిన భారీ వర్షాలకు హోన్నాజీపేట్ అటవీ ప్రాంతంలోని ముత్యాల చెరువు తెగిపోవడంతో దాని దిగువనున్న బీరప్ప తండా, నడమితండా, హోన్నాజీపేట్, వాడి గ్రామాల పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు కోతకు గురికాగా, రాళ్లు, ఇసుక మేటలు వేశాయి. ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని ప్రకటించినా, ఇప్పటివరకు నష్టపరిహారం అందించలేదు. కొన్నిచోట్ల పొలాల్లో వేసిన ఇసుక మేటలను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించడానికి అధికారులు అంచనాలను రూపొందించినా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. చేసేదేమీ లేక కొందరు రైతులు సొంత ఖర్చులతో ట్రాక్టర్లు , జేసీబీ సాయంతో ఇసుక మేటలను తొలగించి, పొలం మడులను చదును చేసి వరి నాట్లు వేశారు. మరికొందరు అప్పులకు భయపడి మిగిలిన భూమిలోనే యాసంగి పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. వరద ప్రవాహానికి నాకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమి కోతకు గురై, ఇసుక మేటలు వేశాయి. మూడు బోరు మోటార్లు కొట్టుకపోయాయి. చేసేదేమిలేక సుమారు రూ.3 లక్షలు సొంతగా ఖర్చు చేయగా 2 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ప్రస్తుతం 2 ఎకరాల్లో వరి వేశాను. మరో 3 ఎకరాలను చదును చేయాల్సి ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలి. –ధరావత్ రతన్, రైతు, బీరప్ప తండా యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులు గతేడాది భారీ వర్షాలకు కోతకు గురైన పొలాలు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి అందని నష్టపరిహారం సొంత ఖర్చులతో చదును చేసుకున్న అన్నదాతలు నాలుగు నెలలు గడుస్తున్న పంట నష్టపరిహారం ప్రభుత్వం అందించలేదు.భారీ వరదలకు నాకున్న 2 ఎకరాల భూమి కో తకు గురైంది.రూ.లక్షన్నర ఖ ర్చు చేసి ఒక ఎకరం భూమిని చదును చేసి, వరి పంట వేశాను. ఆర్థిక స్థోమత లేక మరో ఎకరం భూమిని అలాగే వదిలేశాను. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టపరిహారంతోపాటు కోతకు గురైన భూమిను చదును చేయించాలి. –ధరావత్ గణేష్, రైతు, బీరప్ప తండా -
తెయూలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి
తెయూ(డిచ్ పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో శ నివారం సావిత్రీబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా యూనివర్సిటీ ఉ మెన్స్ సెల్ డైరెక్టర్ భ్రమరాంబిక ఆధ్వర్యంలో ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్లో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రొఫెసర్ కనకయ్య మాట్లాడుతూ.. భారతదేశంలోనే తొలి మహిళా ఉ పాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే అని అన్నా రు. ఆమె చేసిన సామాజిక సేవలు, మహిళల అభివృద్ధి కోసం చేసిన కృషిని కొనియాడారు. ప్రొఫెసర్ విద్యావర్ధిని, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అరతి, లా కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న రాణి, లక్ష్మణ చ క్రవర్తి, అడ్మిషన్ డైరెక్టర్ వాసం చంద్రశేఖర్, ప్రొఫె సర్ రాంబాబు, అబ్దుల్ ఖవి, మూసా ఖురేషి, సమ త, జమీల్ హైమద్, నీలిమ, సంపత్ పాల్గొన్నారు. -
ఎఫ్పీవోల నిర్వహణపై శిక్షణ
సుభాష్నగర్: నగరంలోని ఎన్డీసీసీబీ సమావేశపు హాల్లో శనివారం తెలంగాణ సహకార యూనియన్ (హైదరాబాద్) క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని సొసైటీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సభ్యులు, సిబ్బందికి ఎఫ్పీవోల నిర్వహణపై ప్రిన్సిపాల్ భూక్య వెంకన్న శిక్షణనిచ్చారు. ఎఫ్పీవో ఫౌండేషన్, లీగల్ ఫామ్స్, సుపరిపాలన, క్రెడిట్, మార్కెట్, ఫోకస్ కంపారటీ వ్ అనాలసిస్, స్కీమ్స్, స్టాట్యూటరీ, నాబార్డ్ పథకాలు, ఫండ్స్ నిర్వహణ, కోర్ పథకాలు, అకౌంటింగ్, స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్,బ్రాండింగ్, ఈ– నామ్, సాంఘిక, ఆర్థిక అంశాలు, ఆదాయ వనరులు, సుస్థిర అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, ఎఫ్పీవో నిర్వహించే వ్యాపార అవకాశాలను భారత్ ఫిన్ టెక్ చీఫ్ ఆఫీసర్ డాక్టర్ భూసారపు శ్రీనివాస్ వివరించారు. అలాగే ఎఫ్పీవో వల్ల ప్రత్యక్ష ప్రయోజనాలు, సత్వర సేవలు, విధులు, బాధ్యతలు, సభ్యులకు మానవ వనరుల ప్రగతిని తెలియజేశారు. ఎన్డీసీసీబీ సీఈవో నాగభూషణం వందే, సొసైటీలు, ఎఫ్పీఓల సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు. -
అమరవీరులకు న్యాయం చేయాలి
● హామీలను అమలు చేయాలి ● అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తానిజామాబాద్ రూరల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరులకు న్యాయం చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో తెలంగాణ అమరవీరులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలన్నారు. 2001 నుంచి 2014 వరకు 1200 మంది అమరవీరులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, వారికి న్యాయం చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేపథ్యంలో ఎంతమంది అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం ఇచ్చారో చెప్పాలన్నారు. ఎంతమందికి రూ.25 వేల పెన్షన్ ఇస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అర్బన్ నియోజకవర్గ పరిధిలో అర్హులైన ఒక్క లబ్ధిదారుడికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. పేరుకు మాత్రమే నగర శివారులో డబుల్ బెడ్రూంలు నిర్మించారని, అధికారికంగా లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందన్నారు. -
16 నుంచి బీఎడ్, బీపీఎడ్ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 16 నుంచి బీఎడ్, బీపీఎడ్, 1, 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్ను సందర్శించాలని కంట్రోలర్ సూచించారు. పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం మగ్గిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు మధు బీచ్ వాలీబాల్ తెలంగాణ జట్టుకు కోచ్గా నియమితులయ్యాడు. కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూ డామన్లో ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి ఖేలో ఇండియా పోటీల్లో మధు తెలంగాణ జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నారు. ఈసందర్భంగా మధును తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు, వీఎఫ్ఐ ఉపాధ్యక్షుడు ఎన్వీ హన్మంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లేష్ గౌడ్, నిజామాబాద్ క్రీడల అధికారి పవన్, మగ్గిడి సర్పంచ్ చంద్రకాంత్ గౌడ్, హెచ్ఎం హరిత, ఉపాధ్యాయులు అభినందించారు. డిచ్పల్లి: మండలంలోని ధర్మారం (బి) గ్రామంలో శనివారం నిజామాబాద్–కామారెడ్డి ఉమ్మడి జిల్లాల ఖోఖో లీగ్ పోటీలను డిచ్పల్లి ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్ గొట్టిపాటి వాసు ఆధ్వర్యంలో ఖోఖో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సర్పంచ్ వాసు, ఉపసర్పంచ్ సల్మాన్, జిల్లా ఖోఖో సంఘ ప్రతినిధులు, సొసైటీ మాజీ చైర్మన్ రామకష్ణ, హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోవాలి ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపల్ పీఠాన్ని కై వ సం చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీ లం చిన్న రాజులు అన్నారు. పట్టణంలో శని వారం నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ము న్సిపల్ ఎన్నికలలో బీజేపీ 12 వార్డుల్లో గెలి చి మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోవాలని అన్నారు. నాయకులు విక్రమ్రెడ్డి, రవీందర్రావు, బాలకిషన్, దేవేందర్, రాజేశ్, నర్సింలు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
బాలికపై వృద్ధుడి లైంగిక దాడి
నస్రుల్లాబాద్: మండలంలోని బొమ్మన్దేవ్పల్లి గ్రామంలో 16ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి ప్రయత్నించాడని ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. గ్రామానికి చెందిన పాపయ్య(53) అనే వ్యక్తి ఇంటి పక్కనే బాలిక సమీప బంధువు ఇళ్లు ఉంది. దీంతో పాపయ్య కొంతకాలంగా బాలికకు మాయ మాటలు చెప్పి దగ్గరయ్యాడు. శనివారం గల్లీలో ఎవరులేని ప్రదేశానికి బాలికను తీసుకువెళ్లాడు. అనంతరం బాలికతో అతడు అసభ్యంగా ప్రవర్తించగా, ఆమె ప్రతిఘటించి, వెంటనే కుటుంబ సభ్యులకు తెలిపింది. స్థానికులు, కుటుంబీకులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రుద్రూర్: కోటగిరి మండలం రాంపూర్ శివారులో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. పోతంగల్ మండలం కొడిచర్ల శివారులో శనివారం మంజీరా నదిలో ట్రా క్టర్ ఇసుక నింపుకుని వెళుతుండగా రాంపూర్ శివారులో అదుపు తప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ను డ్రైవ ర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో బోల్తా పడినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు. రుద్రూర్: పోతంగల్ మండలం కొడిచర్ల శివారులోని మంజీరా నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు బొలెరో వాహనాలను శనివారం పట్టుకున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు. ఈ వాహనాలను కోటగిరి పోలీస్స్టేషన్ తరలించి, కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ఎవరైన అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణ చేసే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించాలి
సుభాష్నగర్: బాల్ బ్యాడ్మింటన్ క్రీడలకు పూర్వవైభవం దిశగా జిల్లా సంఘం కృషి చేస్తుందని, ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాలని సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి శ్యామ్ తెలిపారు. నగరంలోని క్రీడా మైదానంలో శనివారం ఉమ్మడి నిజామా బాద్ జిల్లా బాల్ బాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో బాలబాలికల ఎంపికలను నిర్వహించారు. రాష్ట్రస్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఈనెల 9 నుంచి 11వ తేదీవరకూ ఆర్మూర్లోని ఆల్ఫోర్స్ హైస్కూల్లో జరుగుతున్నాయని, ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. తుది జట్లను ఎంపిక చేశామని శ్యామ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేష్, నరేందర్, కార్తీక్, భాగ్య శ్రీ, గీత, సీనియర్ డాకారులు ఆనంద్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు. -
మహిళ దారుణ హత్య
● పలువురిపై అనుమానం వ్యక్తం చేసిన మృతురాలి కూతురు ● గాలింపు చేపట్టిన పోలీసులు నందిపేట్(ఆర్మూర్): మండ లంలోని తల్వేద గ్రామ శివారులోగల వాగులో ఓ మహిళా దారుణ హత్యకు గురైన సంఘటన శనివారం వెలుగులోకి వ చ్చింది. ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీదర్రెడ్డి, ఎస్సై శ్యాంరాజ్ తె లిపిన వివరాలు ఇలా.. తల్వేద గ్రామ శివారులోగల వాగులో మహిళ మృతదేహంను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించా రు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించా రు. మృతురాలిని తలపై బలమైన ఆయుధంతో కొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందగా, నీటిలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. మొద ట గుర్తుతెలియని మహిళగా భావించగా, మృతురాలి చేతిపై మేఘన అనే టాటు ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆమెను నందిపేటలోని సుభాష్నగర్ కాలనీకి చెందిన రాగల గంగామణి(40)గా గుర్తించారు. దీంతో మృతురాలి కుటుంబీకులకు పోలీసులు సమాచారం అందించారు. తన తల్లిని నందిపేటలోని సుభాష్నగర్ కాలనీకి చెందిన స్వరూప, లావణ్య, ప్రేమల, ప్రేమల భర్త నరేష్లు శుక్రవారం మధ్యా హ్నం బాసర పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్లారని మృతురాలి కూతురు మేఘ న పేర్కొంది. అక్కడ తన తల్లిని వారు నమ్మించి బలమైన ఆయుధంతో తలపై కొట్టి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి అనుమానితుల కోసం గాలింపు చేపట్టారు. వారు పరారీలో ఉన్నారని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చేపట్టినట్లు సీఐ శ్రీదర్రెడ్డి తెలిపారు. హత్యకు దారితీసే పరిస్థితులపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లితండా వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. తెల్గాపూర్ గ్రామ సర్పంచ్ వెల్లుట్ల మేఘన భర్త నగేష్ శనివారం బైక్పై మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయానికి బయలుదేరాడు. తుంకిపల్లి తండా వద్ద కోతుల గుంపు అతడికి అడ్డు రావడంతో బైక్పై నుంచి కిందపడ్డాడు. ఈఘటనలో తీవ్రగాయాలు కావడంతో స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రితో అతడు చికిత్స పొందుతున్నారు. -
రబీసాగుకు భరోసా!
● నిండుకుండలా పోచారంప్రాజెక్టు ● నీటి విడుదల తేదీలు ఖరారు నాగిరెడ్డిపేట: మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉంది. సాగునీటికి ఢోకా లేకపోవడంతో ఆయకట్టు రైతులు వరినారుమళ్లు వేసుకొని యాసంగి పంటలసాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.820టీఎంసీలుకాగా ప్రస్తుతం 1.774 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది యాసంగి పంటలసాగు సమయంలో ప్రాజెక్టులో దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టంతో నీరు నిల్వ ఉండడంతో అధికారులతోపాటు ఆయకట్టు రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘బీ’జోన్కు ప్రాజెక్టు నీరు.... పోచారంప్రాజెక్టు ఆయకట్టును ఏ, బీ జోన్లుగా వి భజించారు. ప్రతి ఏడాది వానాకాలంలో ప్రాజెక్టునీ టిని రెండుజోన్కు కేటాయిస్తారు. యాసంగిలో మాత్రం ఒక ఏడాది ‘ఏ’ జోన్కు, మరో ఏడాది ‘బీ’ జోన్కు కేటాయిస్తారు. నిబంధనల ప్రకారం గతేడాది యాసంగి సీజన్లో నీటిని ‘ఏ’జోన్ పరిధిలో డిస్ట్రిబ్యూటరీ–1 నుండి డిస్ట్రిబ్యూటరీ–44 వరకు ఉన్న ఆయకట్టు భూములకు అందించారు. ఈ ఏడాది ‘బీ’ జోన్కు నీటిని కేటాయిస్తూ డిస్ట్రిబ్యూటరీ–45 నుంచి చివరన ఉన్న డిస్ట్రిబ్యూటరీ–73 వరకు అందించనున్నారు. ఈ ఏడాది చింత లేనట్టే.. గతంతో పొలిస్తే ప్రస్తుత యాసంగి సీజన్లో ఆయక ట్టు పరిధిలోని ‘బీ’ జోన్కు ప్రాజెక్టునీటిని అందించడంలో అధికారులకు పెద్దగా చింత లేనట్టే. గతంలో ప్రాజెక్టు నీటిని యాసంగిసీజన్లో ‘బీ’జోన్ రైతులకు అందించడం కత్తిమీద సాములా సాగులా ఉండేది. ప్రాజెక్టులోని నీటిని వానాకాలం పంటలసాగుకు వినియోగించగా ఉన్న కొద్దిపాటి నీటిని యాసంగిసీజన్లో ‘బీ’జోన్ భూములకు అందించేందుకు అధికారులు నానా ఇబ్బందులు పడేవారు. కానీ ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో ప్రాజెక్టు నీరు వానాకాలం పంటలసాగుకు ఎక్కువగా ఉపయోగపడలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. -
రోడ్ల విభజన.. ట్రాఫిక్ సిగ్నల్స్
మీకు తెలుసా..రామారెడ్డి: వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి రోడ్ల విభజన, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు అనేది చాలా కీలకం. సాధారణంగా మనకు కనిపించే రోడ్లు, సిగ్నల్ వ్యవస్థలను పలు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి కంటె ఎక్కువ రోడ్లు (జంక్షన్లు) కలిసేచోట సిగ్నల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తుంటారు. –టి జంక్షన్: ఒక రోడ్డు వచ్చి మరో ప్రధాన రోడ్డుకు నిలువుగా కలిసినప్పుడు ఇది ఏర్పడుతుంది. ఇక్కడ మూడు వైపుల నుంచి సిగ్నల్స్ ఉంటాయి. ● వై జంక్షన్: రోడ్డు రెండుగా విడిపోయినప్పుడు లేదా రెండు రోడ్లు కలిసి ఒకటిగా మారినప్పుడు ఇది ఏర్పడుతుంది. ● చౌరస్తా : నాలుగు వైపుల నుంచి వాహనాలు వచ్చే ప్రధాన కూడలి ఇది. ● రౌండ్ అబౌట్: దీనిని ’ట్రాఫిక్ ఐలాండ్’ అని కూడా అంటారు. ఇక్కడ సిగ్నల్స్ ఉండవచ్చు లేదా కేవలం వృత్తాకార మార్గం ద్వారా వాహనాలు వెళ్లవచ్చు. ట్రాఫిక్ సిగ్నల్స్ రకాలు.. ● ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులతో వాహనాలను నియంత్రిస్తాయి. ● పాదచారుల సిగ్నల్స్: నడిచి వెళ్లేవారు రోడ్డు దాటడానికి వీలుగా ఉండే సిగ్నల్స్ (నడుస్తున్న మనిషి బొమ్మ ఉంటుంది) ● హెచ్చరిక సిగ్నల్స్: ముందు ప్రమాదం ఉందని లేదా మలుపు ఉందని హెచ్చరించే పసుపు రంగుతో మెరిసే లైట్లు ఉంటాయి. రోడ్లు రకాలు.. ● నేషనల్ హైవేస్ (ఎన్హెచ్): దేశంలోని ప్రధాన నగరాలను కలిపేవి. ● స్టేట్ హైవేస్ (ఎస్హెచ్): రాష్ట్రంలోని జిల్లాలను కలిపేవి. ● ఎక్స్ప్రెస్వేస్: అత్యంత వేగంగా వెళ్లడానికి వీలుండే పరిమిత ప్రవేశ మార్గాలు ఉన్న రోడ్లు. ● స్థానిక రోడ్లు: ఊర్ల లోపల లేదా కాలనీల మధ్య ఉండే రోడ్లు. -
కొత్త సర్పంచ్లు వర్సెస్ మాజీలు
● పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని మాజీ సర్పంచ్ల విన్నపం ● తమకు సంబంధం లేదనే విధంగా కొత్త సర్పంచ్ల తీరు మోర్తాడ్(బాల్కొండ): జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ఇటీవల నూతన పాలకవర్గాలు కొలువుతీరాయి. ఈక్రమంలో కొత్తగా ఎంపికై న సర్పంచ్లు, మాజీ సర్పంచ్ల మధ్య పాత బకాయిల చెల్లింపుల వివాదం నెలకొని ఉంది. జిల్లాలోని మాజీ సర్పంచ్లకు వారి పదవీ కాలంలో చేసిన పనులకు సంబంధించి రూ.15 కోట్లకు పైగా బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. మాజీ సర్పంచ్లు తమ పదవీకాలంలో చేసిన పనులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులను రెండున్నర సంవత్సరాల పాటు పెండింగ్లో ఉంచింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే పరిస్థితి పునరావృతమైంది. మాజీ సర్పంచ్లకు సంబంధించిన వారు కొత్తగా సర్పంచ్ పదవీ బాధ్యతలను స్వీకరించిన చోట ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. కొత్తగా ఎంపికై న వారిలో అనేక మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. మాజీ సర్పంచ్లలో ఎక్కువ మంది ప్రతిపక్ష పార్టీలకు చెందినవారే ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో పాత బకాయిలకు చెల్లింపుల విషయంలో సానుకూలమైన నిర్ణయం కనిపించడం లేదు. ప్రభుత్వం వివరాలను సేకరించినా... మాజీ సర్పంచ్లు తమ బిల్లు బకాయిల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేకమార్లు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో మాజీ సర్పంచ్లు తమ గోడును వెల్లబోసుకున్నారు. స్పందించిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు ముందుగానే ఏ గ్రామంలో ఎంత బిల్లు పెండింగ్లో ఉందనే వివరాలను సేకరించింది. ఇప్పటి వరకూ ఎలాంటి నిధులను మంజూరు చేయకపోవడంతో బిల్లు బకాయిలు పెండింగ్లోనే ఉండిపోయాయి. ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తేనే.. మాజీ సర్పంచ్లు చేసిన పనులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తేనే బిల్లు బకాయిలు చెల్లించడానికి మార్గం సుగమం అవుతుందనే అభి ప్రాయం వ్యక్తం అవుతోంది. గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం పెద్ద పంచాయతీలకు రూ.10లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఆయన ప్రకటనను పరిశీలిస్తే బకాయిల చె ల్లింపుల కోసం ఈ నిధులు కాదనే అంశం వెల్లడవుతుంది.ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను విడుదల చేసేందుకు చొరవ చూపితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రభు త్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. మోర్తాడ్ మండలంలోని సుంకెట్ గ్రామంలో శుక్రవారం జీపీ పాలకవర్గ సమావేశం నిర్వహించగా మాజీ సర్పంచ్ కడారి శ్రీనివాస్ వెళ్లి తనకు రూ.18లక్షల బిల్లులు రావాల్సి ఉందని వివరించారు. పాత బిల్లుల విషయంతో తమకు సంబంధం లేదని ఆ బిల్లులు చెల్లిస్తే అభివృద్ధి ఎలా చేయగలమని పాలకవర్గం సభ్యులు ప్రశ్నించారు. ఈక్రమంలో సర్పంచ్, మాజీ సర్పంచ్ మధ్య కొంత వివాదం ఏర్పడిందనేది స్పష్టమైతుంది. ఇది ఒక్క సుంకెట్లోనే ఎదురైన పరిస్థితి కాదు. జిల్లా వ్యాప్తంగా అనేక పంచాయతీలలో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. -
జిల్లాస్థాయికి హాకీ క్రీడాకారుల ఎంపిక
ఆర్మూర్: నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా స్థాయి హాకీ క్రీడాకారుల ఎంపికలు ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించారు. ఎస్జీఎఫ్ఐ అండర్–19 బాలుర విభాగంలో క్రీడాకారుల ప్రతిభను పరీక్షించి జిల్లాస్థాయికి ఎంపిక చేసినట్లు జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 3వ తేదీ నుంచి మూడు రోజులపాటు రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లోని వీఎం హోం రెసిడెన్షియల్ స్కూల్ గ్రౌండ్లో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటారన్నారు. అక్కడ ప్రతిభ కనబర్చితే రాష్ట్రస్థాయికి ఎంపికవుతారని వివరించారు. ఎంపిక పోటీల్లో జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ సడక్ నగేశ్, జిల్లా హాకీ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజు, సీనియర్ హాకీ క్రీడాకారుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే ధ్యేయం
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాజేశ్వర్రావు ● విజయవంతంగా కొనసాగుతున్న ‘పొలం బాట’ సుభాష్నగర్: రైతులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ ముందుకు సాగుతోందని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కో సం అధికారులు నేరుగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించే విద్యుత్ అధికారుల ‘పొలం బాట’ విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొ న్నారు. సర్కిల్ పరిధిలో 1,339 పొలంబాట కార్యక్రమాలు నిర్వహించి 409 వంగిపోయిన స్తంభాలను సరిచేశామని, 656 చోట్ల లూజ్ లైన్లను బిగించామని తెలిపారు. 380 మధ్య స్తంభాలను (ఇంటర్ పోల్స్) ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదరహిత సర్కిల్గా తీర్చిదిద్దేందుకు జీరో విద్యుత్ ప్రమాదాల కార్యక్రమం చే పట్టినట్లు ఆయన వెల్లడించారు. రైతులకు ఎ లాంటి విద్యుత్ ఇబ్బందులు తలెత్తినా వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య నిజామాబాద్అర్బన్: ప్రైవేట్ ఆస్పత్రి ల్యాబ్ టెక్నీషియన్ ఒకరు బాత్రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని ఖలీల్వాడిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఒకటౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మాబాద్కు చెందిన ఓంకార్(26) కొన్నేళ్లుగా ఖలీల్వాడీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఇతనికి సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అప్పు ఉంది. అప్పు తీర్చలేక బలవన్మరణానికి పాడ్డాడా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లా జైల్లో పర్యవేక్షణ గాలికి..
● జిల్లాలో చర్చనీయాంశంగా మారిన గంజాయి ఘటన నిజామాబాద్అర్బన్: జిల్లా జైల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతోపాటు వసూళ్ల వ్యవహారం జోరుగా కొనసాగుతుంది. ఇటీవల జైలులో గంజాయి లభ్యం కావడం చర్చనీయశంగా మారింది. ఈనేపథ్యంలో జైలు అధికారుల పరిశీలనపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. మామూళ్లు ఇస్తేనే ములాఖత్లు, వస్తువులు.. జిల్లా జైల్లో ప్రస్తుతం 625 మంది ఖైదీలు ఉన్నారు. ఖైదీలలో కొందరు మద్యం, సిగరేట్, గంజాయికి బానిసైనవారు ఉండటంతో, వారికి అవి దొరకక మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ఖైదీలకు వాటిని అందించడానికి జైలు సిబ్బందికి వారి కుటుంబీకులు అధిక మొత్తంలో డబ్బులు ఇస్తున్నారని సమాచారం. మామూళ్లు అందజేస్తేనే ఖైదీలతో నేరుగా ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం, వారికి కావలసిన వస్తువులు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జైలు ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారించకపోవడంతో ఈ వ్యవహారం జోరు గా కొనసాగుతుంది. ఇటీవల రైల్వే స్టేషన్ వద్ద కొడుకును విక్రయించిన జంటను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపిన ఘటనలో వారి వద్ద నుంచి రూ.25వేలు వసులు చేసినట్లు తెలిసింది. ఓ మాజీ ప్రజాప్రతినిధి తమ్ముడు ఓ కేసు విషయంలో జైలుకు వెళ్లగా అతని వద్ద నుంచి పలు వసతుల కోసం రూ. 30వేలు వసూలు చేసినట్లు తెలిసింది. అలాగే జైలు అధికారులు డబ్బు లు దండుకోని ఖైదీలను అనారోగ్యం పేరిట ప్రయివేటు ఆస్పత్రులకు పంపుతూ అధిక మొ త్తంలో డబ్బులు తీసుకుంటున్నారని సమాచారం. జిల్లా జైలు చుట్టూ ఉన్న ప్రహరీ పైనుంచి గంజాయి, గుట్కా ప్యాకెట్లు విసిరేయడం గత కొన్నేళ్లుగా సాగుతుంది. దీనిని జైలు అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జిల్లా జైలులోకి గంజాయి, గుట్కా ప్యాకెట్లు విసరడంతో ఖైదీల మధ్య ఘర్షణ జరగడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందే ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. సారంగాపూర్లోని జిల్లా జైలు జిల్లా జైలులో పర్యవేక్షణను మరింత పటిష్టం చేస్తాం. వివిధ వస్తువులు జైలు లోపలికి రాకుండా అడ్డుకుంటాం. ములాఖాత్ రూపంలో డబ్బు లు వసూలు చేయడం అనేది అవాస్తవం. మరింత నిఘా పెంచుతాం. –ఉపేందర్, జిల్లా జైలర్, నిజామాబాద్ -
తప్పుల తడకగా ముసాయిదా ఓటరు జాబితా
సుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి ఆరోపించారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ను నిలదీశారు. డివిజన్ల వారీగా ఓటరు జాబితా ప్రతులను తీసుకొచ్చి ఇతర జిల్లాలు, రాష్ట్రాల ఓట్లను ఇక్కడ ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. అనంతరం దినేశ్ పటేల్ మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితాలో సికింద్రాబాద్, బొల్లారం, అల్వాల్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, నాందేడ్, ఇతర ప్రాంతాల ఓటర్లు ఉన్నారని తెలిపారు. 350 పోలింగ్ బూత్లు, 60 డివిజన్లలోనూ ఇదే తరహాలో అవకతవకలు జరిగాయని, ఎవరి తప్పిదం వల్ల జరిగిందో తెలియాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ ఒక్కచోట కూడా తప్పిదం జరగలేదని, కానీ కేవలం 3.47లక్షల ఓట్లలో ఇన్ని తప్పిదాలు ఎందుకు జరిగాయన్నారు. 10వ తేదీ తర్వాత ఎవరికీ అడిగే దిక్కు ఉండదని, ఈ విషయమై ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. 60 వేల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందూరులో బీజేపీ గెలుస్తుందనే అధికార కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. త్వరలో కలెక్టర్ను కూడా కలుస్తామని, ఎన్నికల కమిషన్, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. కలెక్టర్ బదిలీపై కూడా తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో అవకతవకలు జరిగాయని, ఈ ఓటరు జాబితాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తెలిపారు. వెంటనే జాబితాను సరిచేయాలని, లేకుంటే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా, ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయమై బీఎల్వోలు, మున్సిపల్ సిబ్బంది సరిచేస్తున్నారని కమిషనర్ దిలీప్కుమార్ తెలిపారు. తుది జాబితా గడువులోపు తప్పిదాలను సరి చేస్తామని బీజేపీ నాయకులకు ఆయన హామీనిచ్చారు. కార్యక్రమంలో నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రమోద్కుమార్, జ్యోతి, పద్మారెడ్డి, బద్దం కిషన్, సంతోష్, శంకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, తారక్ వేణు, ఆమంద్ విజయ్, రాజేందర్, హరీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి ఎన్ఎంసీలో బీజేపీ గెలుస్తుందనే అవకతవకలు కమిషనర్ దిలీప్కుమార్ నిలదీత -
తాళం వేసిన రెండిళ్లలో చోరీ
కామారెడ్డి క్రైం: పట్టపగలు తాళం వేసిన ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ పాత ఎస్పీఆర్ పాఠశాల సమీపంలో వెలుగుచూసింది. వివరాలు ఇలా.. అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉండే బాలూ నాయక్ వైద్యశాఖలో పనిచేస్తున్నాడు. అతడి భార్య శోభ గర్గుల్ జీపీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం ఉ దయం వారు ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. మధ్యాహ్నం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. అప్పటికీ దొంగలు ఇంట్లోనే ఉన్నారు. శోభ రాకను గమనించిన దొంగలు ఇంటి వెనుక భాగం నుంచి పారిపోయారు. భయాందోళనకు గురైన ఆ మె భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దంపతుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని విచారణ జరిపారు. సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. ఇంట్లో దాచిన 3 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. అదే సమయంలో కాలనీలోని మరో ఇంట్లో కూడా చోరీ జరిగింది. ట్రాన్స్కో ఉద్యోగిగా పని చేస్తున్న వెన్నెల ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆమె ఇంట్లో 30 తులాల వెండి ఆభరణాలు, రూ.50 వేలు నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్టీం బృందాలు అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు. బోధన్ పట్టణంలో.. బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన శ్రీధర్రెడ్డి హైదరాబాద్లో ఉండగా అతడి తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి పట్టణ శివారులోగల రుద్ర వెంచర్లో నివాసం ఉంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగుల గొట్టి ఇంట్లోకి వెళ్లి చిన్న మొత్తంలో నగదు చోరీ చేశారు. శుక్రవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు సదరు యజమానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి యజమానికి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. -
ఆర్మూర్ సీఐపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు
ఆర్మూర్: ఆర్మూర్ ఎస్హెచ్వో (సీఐ) సత్యనారాయణ గౌడ్పై ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన పచ్చూక రాజేశ్వర్ శుక్రవారం హైదరాబాద్లో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఈసందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. మచ్చర్లలో తమ భూమి వివాదంలో తనపై కొందరు గ్రామస్తులు దాడికి పాల్పడగా, వారిపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో గత నెల 2న ఫిర్యాదు చేశానన్నారు. కానీ కేసు ఫైల్ చేయని కారణంగా జిల్లా కేంద్రంలోని పోలీసు అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేశానన్నారు. దీంతో ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు తనను పిలిపించి ఆర్మూర్ మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య కారును తాను కాలబెట్టినట్లు ఒప్పుకోమంటూ దాడికి పాల్పడ్డాడని ఆరోపించాడు. దళిత యువకుడినని కూడా చూడకుండా దాడికి పాల్పడిన సీఐపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘానికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశానన్నారు. -
గడ్కోల్లో చైన్ స్నాచింగ్
సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామ సమీపంలో పని చేస్తున్న ఓ మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడని ఎస్సై రామకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పెండ్లి బుచ్చవ్వ అనే మహిళ తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వెళ్లాడు. వెంటనే ఆమె పరుగెత్తగా, అతడు వెంబడించి ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి నిందితుడిని పట్టుకోవడానికి యత్నించగా, అతడి మంకీ క్యాప్ అక్కడ పడిపోయింది. వెంటనే నిందితుడు తన బైక్పై పుసాల తండా వైపు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వివరించారు. వర్ని (చందూర్): మండల కేంద్రంలో ట్రాక్టర్కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టి దహనం చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన సటోజీ గంగారాం తన ట్రాక్టర్ను గురువారం రాత్రి తన ఇంటి ముందు నిలిపి ఉంచాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్టర్కు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. -
పాఠశాలల తనిఖీ
వేల్పూర్: వేల్పూర్ మండల కేంద్రంలోని ఉన్నత, ప్రాథమిక, భవిత పాఠశాలలను జిల్లా విద్యాధికారి అశోక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను చదివించి వారి అభ్యసనా సామర్థ్యాన్ని పరీక్షించారు. ఎస్సెస్సీ విద్యార్థులకు సిలబస్ పూర్తయిందా అని అడిగారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణపై హెచ్ఎం రాజన్నను అడిగి తెలుసుకున్నారు. వేల్పూర్లో అమలు చేస్తున్న అక్షర పల్లకి కార్యక్రమం ద్వారా విద్యార్థులు తెలుగు భాషపై ఏవిధంగా పట్టు సాధిస్తున్నారో పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో రేణుక, ఉపాధ్యాయులు ఉన్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బీఎడ్, బీపీఎడ్, 1, 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్ష ఫీజును ఈనెల 16 వరకు పొడిగించినట్లు కంట్రోలర్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్ను సందర్శించాలని కంట్రోలర్ విద్యార్థులకు సూచించారు. నిజామాబాద్ రూరల్: తెలంగాణ భాషా సాహిత్యాల పరిరక్షణకు, సృజనాత్మక రచనలను ప్రో త్సహించడానికి నిజామాబాద్కు చెందిన ‘హరి దా’ రచయితల సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నా రు. హైదరాబాద్లోని త్యాగరాయ గాన సభ ప్రాంగణంలో గురువారం రాత్రి హరిదా రచ యితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేంద ర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని, మా ట్లాడారు. హరిదా సంఘం నిర్వహించిన తెలంగాణ భాషా కవితా, కథా రచన పోటీల విజేత లకు ‘సరస్వతి రాజ్ హరిదా పురస్కారాలను‘ అందజేశారు. హరిదా ప్రతినిధులు తిరుమల శ్రీనివాస్ ఆర్య, సతీశ్ కుమార్, డాక్టర్ మామిడి సాయినాథ్ తదితరులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. లింగంపేట(ఎల్లారెడ్డి): చోరీ ఘటనలో లింగంపేట మండలం మాలోత్ తండాకు చెందిన ర మేశ్, బన్సీలను శుక్రవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలి పారు. పర్మళ్లతండాలో శ్రీనివాస్కు చెందిన కి రాణం షాపులో, సజ్జన్పల్లి గ్రామ గేటు వద్ద రాందాస్ కృష్ణమూర్తిగౌడ్లకు చెందిన కిరాణ షాపులో సామగ్రిని, నగదును వారు అపహరించినట్లు పేర్కొన్నారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా రమేశ్, బన్సీలు చోరీకి పాల్పడినట్లు గుర్తించి, వారి వద్ద నుంచి చోరీ చేసిన సామగ్రి, నగదు ను రికవరీ చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి
నిజామాబాద్అర్బన్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత– నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా రవాణ శాఖ అధికారి ఉమామహేశ్వరరావు అన్నా రు. జిల్లాకేంద్రంలోని ఐటీఐ విద్యార్థులకు శుక్రవా రం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం ఆర్టీఏ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించడంతోపాటు మరి కొంతమందికి అవగాహన కల్పించాలన్నారు.ఈనెల 31 వరకు ఈ అవగాహన కార్య క్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంవీ ఐలు కిరణ్ కుమార్, పవన్ కళ్యాణ్, వాసుకి, ఐటీఐ ప్రిన్సిపాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేపట్టాలి
ఆర్మూర్: సర్పంచ్లుగా గెలిచిన యువత రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడు సూచించారు. ఆర్మూర్ పట్టణం కొటార్మూర్లో రైతుసేవా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల సర్పంచులుగా విజయం సాఽధించిన 25 మంది రైతులను శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి ఎంతో కొంత చేయాలని సర్పంచ్గా పోటీ చేయడానికి గల్ఫ్ నుంచి వచ్చి విజయం సాధించిన వారికి, సర్పంచులుగా విజయం సాధించిన రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు కొల్లె నర్సయ్య, ముస్కు సాయరెడ్డి, రుక్మాజీ, ఎన్ఆర్ఐ, నరేశ్, వర్షిత, రేవతి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): గ్రామీణ ప్రాంతాల రైతులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సహకార బ్యాంకు అధికారులు సూచించారు. శుక్రవారం పొల్కంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గుర్తుతెలియని వ్యక్తులు అమాయకులైన రైతులకు ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అపరిచిత వ్యక్తులు బ్యాంకు అధికారుల పేరిట ఫోన్ చేస్తే స్పందించవద్దని సూచించారు. అలాంటి ఫోన్లు వస్తే వెంటనే పోలీసులకు, బ్యాంకు అధికారులకు ఫోన్ చేయాలన్నారు. అనంతరం ఏఈవో రాకేష మాట్లాడారు. యాసంగిలో రైతులు సాగు చేస్తున్న పంటల సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. -
తప్పిన ఘోర ప్రమాదం
● బడాపహాడ్లో దుకాణాల్లోకి దూసుకొచ్చిన బస్సు వర్ని: మండలంలోని బడా పహాడ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. మ హారాష్ట్ర నుంచి ఉర్సు కోసం భక్తులను తీసుకువ చ్చిన బస్సును రివర్స్ చేస్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మూడు దుకాణాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల వద్ద, రోడ్లపై యాత్రికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. వర్ని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చేప పిల్లల పంపిణీ పూర్తి చేయండి
● జిల్లా మత్స్యశాఖకు రాష్ట్ర అధికారుల ఆదేశాలు ● ఇప్పటి వరకు చెరువుల్లోకి 70 శాతం మీనాల విడుదలడొంకేశ్వర్(ఆర్మూర్): చేపపిల్లల పంపిణీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా మత్స్యశాఖను రాష్ట్ర శాఖ ఆదేశించింది. ఆలస్యం చేయకుండా ఈ నెల 10వ తేదీ నాటికి చెరువుల్లో చేపపిల్లలు పోయడం పూర్తి కావాలని స్పష్టమైన ఆదేశాలు జా రీ చేసింది. దీంతో జిల్లాలో చేపపిల్లల పంపిణీని వే గవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర శాఖ విధించిన గడువుకు ముందే పూర్తి చేసేలా జిల్లా అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచారు. టెండర్లలో జాప్యం కారణంగా ప్రభుత్వం ఈ ఏడాది చేపపిల్లల పంపిణీని మూడు నెలలు ఆలస్యంగా ప్రా రంభించింది. జిల్లాలో 967 చెరువుల్లో రూ.4.18 కోట్ల విలువ గల 4.54 కోట్ల చేప పిల్లలు పోయా లని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో 35–40 ఎంఎం అలాగే 80–100 ఎంఎం చేప పిల్లలున్నాయి. నవంబర్ 15 నుంచి జిల్లాలో చేప పిల్లల పంపిణీని ప్రారంభించగా డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా కొంత ఆలస్యమైంది. ఇప్పటి వరకు 805 చెరువుల్లో 3.20 కోట్ల (70శాతం) మీనాలను పోశారు. పెద్ద సైజుతోపాటు నాణ్యమైన చేపపిల్లలను పోయడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా మిగిలిన 162 చెరువుల్లో 1.31 కోట్ల చేప పిల్లలను పోయాల్సి ఉంది. వీటిని గడువులోగా పోయాలని కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వారం రోజుల్లో.. జిల్లాలో చేపపిల్లల పంపిణీని ఈ నెల 10లోగా పూర్తి చే యాలని రాష్ట్రశాఖ ఆదేశించింది. ఆదేశాల మేరకు మిలిగిన లక్ష్యాన్ని గడువుకు ముందే వారం రోజుల్లో పూర్తిచేస్తాం. పరిస్థితిని కాంట్రాక్టర్లకు వివరించి జాప్యం చేయవద్దని సూచించాం. – ఆంజనేయస్వామి, జిల్లా మత్స్యశాఖ అధికారి -
సీఎంను కలిసినజిల్లా నేతలు
నిజామాబాద్ రూరల్: హైదరాబాద్లోని రాష్ట్ర స చివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని శుక్రవారం పలువురు జిల్లా నేతలు వేర్వేరుగా కలిశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్యాదవ్ సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిజామాబాద్ నగర అధ్యక్షుడు బొ బ్బిలి రామకృష్ణ సీఎం రేవంత్రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ను కలిసి కొత్త సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు. జిల్లాకు చెందిన రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ సైతం సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రైతు కమిషన్ చైర్మన్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ -
ఆక్రమణలు.. ఉల్లంఘనలు
శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026– IIలో uనేటి నుంచి టెట్ ● జిల్లాలో నాలుగు సెంటర్లు ఏర్పాటు ● కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఖలీల్వాడి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం నుంచి ఈ నెల 20 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం తొ మ్మిది రోజులపాటు ఉదయం, సాయంత్రం వేళల్లో పరీక్షలు కొనసాగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి 11.30 వరకు, సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది. టెట్ నిర్వహణ కోసం జిల్లా కేంద్రంలో మూడు, ఆర్మూర్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈసారి టెట్కు సాధారణ అభ్యర్థులతోపాటు జిల్లాకు చెందిన సుమారు 3 వేలకు పైగా టీచర్లు పరీక్ష రాయనున్నారు. విడతల వారీగా ఇంటర్ ప్రాక్టికల్స్ ● డీఐఈవో రవికుమార్ నిజామాబాద్ అర్బన్: విద్యార్థుల సంఖ్య మేరకు విడతల వారీగా ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్స్పై జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అధ్యక్షతన శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈవో మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ని గురుకుల కళాశాలలలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు ప్రాక్టికల్స్ ఉంటాయమన్నారు. సమావేశంలో ప్రిన్సిపాళ్లు ఖాలిక్ పాషా, శ్రీనాథ్, రాజీయుద్దీన్ అస్లాం, విద్యుత్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. మరోసారి దొంగల అలజడి ● బంగారు దుకాణంలో చోరీకి యత్నం నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో మరోసారి దొంగల అలజడి రేగింది. వరుసగా వారం రోజులపాటు వివిధ ప్రాంతాల్లో దొంగతనానికి యత్నిస్తున్నారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున సుభాష్నగర్లోని బంగారు దుకాణంలో చోరీకి ప్రయత్నించారు. గునపాలతో షెట్టర్ను తొలగించి దొంగతనం చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పెట్రోలింగ్ వాహనం రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు దొంగల కోసం గాలించినా వారి ఆచూకీ లభించలేదు. ఇటీవల ఖలీల్వాడిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను కొల్లగొట్టేందుకు దొంగలు ప్రయత్నించగా పెట్రోలింగ్ పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయి, చివరికి పోలీసులకు చిక్కారు. సుభాష్నగర్లో దుండగులు చోరీకి యత్నించిన బంగారు దుకాణాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరపాలక సంస్థలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నిర్మాణాల్లో విచ్చలవిడిగా ఉల్లంఘనలు జరుగుతు న్నాయి. ఆక్రమణలను బట్టి అంతేస్థాయిలో ముడుపులు అందుకుంటున్న అధికారులు అక్రమార్కు లను ప్రోత్సహించడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ స్థలాలను, లేఅవుట్లలోని పది శాతం స్థలాలను ఆక్రమించుకునేందుకు కబ్జాదారులను మున్సిపల్ అధికారులు ప్రోత్సహించి ముడుపులు దండుకుంటున్నారు. దీంతో నగరంలో ప్రభుత్వ అవసరాలకు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం చిన్న జాగాను కూడా కేటాయించలేని దౌర్భాగ్యం నెలకొంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మున్సిపల్ అధికారులు జే బులు నింపుకుంటున్నారు. టౌన్ప్లానింగ్, రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది అక్రమాలకు మార్గాలు చూపిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. మాఫియా మాదిరిగా సెటిల్మెంట్లు సైతం చేస్తున్నారంటూ పలువురు బాధితులు చెబుతున్నారు. ● నగరంలోని కేసీఆర్ కాలనీలో 60 ఫ్లాట్లతో ఓ భారీ అపార్ట్మెంట్ నిర్మించారు. పలువురు ఇప్పటికే ఫ్లాట్లు కొనుక్కున్నారు. 2023 జూన్లో కొనుగోలుదారులకు పూర్తిగా కట్టించి అప్పగించేలా బిల్డర్ ఒప్పందం చేసుకున్నాడు. బ్యాంకు రుణాలు తీసుకున్నవాళ్లకు ఇప్పటివరకు ఇవ్వకపోగా సదరు బిల్డర్ కొందరు కొనుగోలుదారులను ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పటివరకు ఫ్లాట్ హ్యాండోవర్ చేయకపోవడంతో కొందరు కొనుగోలుదారులు రెరా (రియల్ ఎస్టేట్ రె గ్యులేషన్ అథారిటీ)కు ఫి ర్యాదులు చేశారు. ఇదిలా ఉండగా ఇందులో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలే కావడం గమనార్హం. విజిటర్స్ పార్కింగ్ ప్లేస్లో జిమ్, క్లబ్ హౌస్ కట్టడం విశేషం. ఈ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవు. ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్వోసీ కోసం జిమ్, క్లబ్ హౌస్కు సంబంధించి ఒకవైపు గోడలు కూల్చేయడం పరిస్థితికి నిదర్శనం. ఎన్వోసీ రాగానే మళ్లీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసేందుకు మిగిలిన మూడువైపుల గోడలు మాత్రం కూల్చకుండా ఉంచారు. ఇందుకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు 4వ ఫ్లోర్, 5వ ఫ్లోర్లో నిబంధనలను తుంగలో తొక్కి 9.6 అడుగులకు బదులు, కేవలం 8.8 అడుగులు మాత్రమే రూఫ్ ఉండేలా శ్లాబ్ పోయడం గమనార్హం. పైగా మున్సిపల్ కమిషనర్ నుంచి ఎన్వోసీ తీసుకోకుండానే సెమీ ఫినిష్డ్గా చూపించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం విశేషం. ఇప్పటికే ఇందులోకి 15 కుటుంబాలు చేరాయి. ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండానే కొనుగోలుదారులను గృహప్రవేశాలు చేయించి మోసం చేయడంతో పాటు ప్రభుత్వ పన్నులు సైతం బిల్డర్ ఎగ్గొడుతుండడం గమనార్హం. ఇందులో డ్రెయిన్ పైపు కిందినుంచి వేయడంతో నీరు రివర్స్ వచ్చేలా ఉందని పలువురు తెలిపారు. ఇక అపార్ట్మెంట్ చుట్టూ ఫైరింజన్ తిరిగే పరిస్థితి లేదు. ఇంకుడుగుంటల ఊసే లేదు. ఇక మరో ముఖ్యమైన అంశమేమిటంటే దీనికి నాలా కన్వర్షన్ లేదని మరో వ్యక్తి ఫిర్యాదు చేశాడు. 234, 251/ఏ లో ఎన్ని గజాలు ఉందో డాక్యుమెంట్లో స్పష్టంగా లేకపోవడం కొసమెరుపు. ఇన్ని ఉల్లంఘనలు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు ముందుకే వెళుతుండడం విశేషం. ● ఈ విషయాలపై నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్ను ‘సాక్షి’ వివరణ కోరగా కేసీఆర్ కాలనీలో అపార్ట్మెంట్ విషయమై, వినాయక్నగర్లో నిబంధనల ఉల్లంఘనపై, ముబారక్నగర్లో గ్రీన్బెల్ట్ భూమి ఆక్రమణ వ్యవహారంపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నగరపాలకంలో అక్రమాలకు టౌన్ప్లానింగ్ ప్రోత్సాహం పదిశాతం భూమి ఆక్రమణలు, నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్న నిర్మాణాలకు వెన్నుదన్ను ముడుపులు తీసుకుని అనుమతులు ఇస్తున్న మున్సిపల్ అధికారులు ఎన్ని ఉల్లంఘనలు.. ఎంత అక్రమం ఉంటే అంతగా వసూళ్లు వినాయక్నగర్లో మాజీ మేయర్ ఆకుల సుజాత ఇంటి సమీపంలో నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్న నిర్మాణం గురించి తాజాగా అధికారులకు మరో ఫిర్యాదు అందింది. ఇక్కడ 20 అడుగుల డెడ్ ఎండ్ రోడ్డు ఉంది. తరువాత కేవలం 7 అడుగుల రోడ్డు మాత్రమే ఉండగా, దీన్ని 20 అడుగుల రోడ్డుగా చూపించి ఒక వ్యక్తి భవనం నిర్మాణానికి అనుమతులు తెచ్చుకున్నాడు. సెట్ బ్యాక్, ఎఫెక్టెడ్ ఏరియా వదలకుండా నిర్మాణం చేయడం గమనార్హం. ఇక్కడ మొత్తం 137.86 చదరపు మీటర్ల స్థలం ఉండగా, ఇందులో 35.29 చదరపు మీటర్ల మేర ఎఫెక్టెడ్ ఏరియాగా, మిగిలిన 102.57 చదరపు మీటర్ల మేర మాత్రమే అనుమతులు ఇచ్చారు. ప్లింత్ఏరియా 60.95 మీటర్లు మాత్రమే ఉండేలా అనుమతులు ఇచ్చారు. అయితే 137.86 చదరపు మీటర్ల మేర శ్లాబ్ వేయడం విషయమై పక్కనే ఉన్న ప్రభావానికి గురయ్యే వ్యక్తి మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది రెండుసార్లు వచ్చినప్పటికీ శ్లాబ్ నిర్మాణం ఆపకపోవడం పట్ల ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. అపార్ట్మెంట్ల నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అయితే, ముడుపులు దండుకుంటున్న అధికారులు అక్రమార్కులపై కిమ్మనడం లేదు. చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది సెటిల్మెంట్లకు తెరలేపారు. జేబులు నింపుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 18వ డివిజన్లోని ముబారక్నగర్లో బిల్డర్స్ లేఅవుట్లో 10 శాతం భూమిని సైతం ప్లాట్లు చేస్తున్నారు. దీన్ని కాపాడేందుకు మాజీ కార్పొరేటర్ అనిల్ పోరాటం చేస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. 45 ఎకరాల ఈ లేఅవుట్లో 4.5 ఎకరాలు గ్రీన్బెల్ట్ కింద వదిలారు. ఇందులో రెండున్నర ఎకరాలను గతంలో సర్పంచ్లు అక్రమంగా అమ్ముకున్నారు. మిగిలిన రెండెకరాల 20 గుంటల భూమిలోనే నీళ్ల ట్యాంకు కట్టారు. ఇక్కడే ఉన్న పశువుల తొట్టి, బోరుబావిని లొలగించి ప్లాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా స్వచ్ఛ సర్వేక్షణ్ కింద పాఠశాల కోసం మరో నీళ్ల ట్యాంకును కట్టేందుకు స్థానికులు ప్రయత్నించగా అక్రమార్కులు మాత్రం కబ్జా చేసి ప్లాట్లు చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు మాజీ కార్పొరేటర్ అనిల్ ప్రయత్నిస్తుండగా అతనిపై బెదిరింపులకు దిగుతుండడం గమనార్హం. దీంతో అనిల్ కలెక్టర్, పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ స్పందన లేదని వాపోతున్నాడు. ఈ 10 శాతం భూమిని వదిలేసేందుకు గాను స్థానికంగా ఉన్న కొందరు పెద్దలు రూ.36 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, మొదటి విడతగా ఇప్పటికే రూ.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
బైక్ను ఢీకొన్న లారీ: ఒకరి మృతి
భిక్కనూరు: మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ గ్రామ సమీపంలోగల 44వ నంబర్ జాతీయ రహదారిపై బైక్ను లారీ ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా..స్థానికంగా ఉన్న పెట్రోల్ పంపులో పనిచేస్తున్న చలిమెడ శేఖర్ (35) శుక్రవారం సా యంత్రం పనుల నిమిత్తం బైక్పై భిక్కనూర్కు బయలుదేరాడు. సిద్ధరామేశ్వర నగర్ గ్రామ సమీపంలో అతడి బైక్ను లారీ ఢీకొనడంతో అతడు డివైడర్కు తగిలి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని గోర్గల్ గేటు ప్రాంతంలోని బ్రిడ్జి వద్ద గుంతలో పడి ఓ మత్స్యకార్మికుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని ఒడ్డేపల్లి గ్రామానికి చెందిన బేస్త బొల్లారం బాలయ్య(40) రోజూ మాదిరిగానే గురువారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై నిజాంసాగర్ ప్రాజెక్టులో చేపల వేటకు వలలు కట్టేందుకు వెళ్లాడు. సాయంత్రం వరకు ప్రాజెక్టులో వలలు కట్టి రాత్రి వేళ బైక్పై ఇంటికి బయలుదేరాడు. నిజాంసాగర్ పెద్దపూల్ దాటిన తర్వాత గోర్గల్ గేటు వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద గుంతలో బైక్ దిగబడింది. దీంతో బాలయ్య కిందపడి గాయపడటంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం అతడిని ఎల్లారెడ్డికి అక్కడి నుంచి కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలయ్య అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య అంజవ్వ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్సై శివకుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని శక్కర్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని శక్కర్ నగర్ కాలనీకి చెందిన వహద్ అహ్మద్తో అర్షిన్ జహాన్ (26)కు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉండగా, కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లగా జహాన్ మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భర్త వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. -
పురపాలికల్లోకి ఓటర్ల దిగుమతి
ఆర్మూర్: మోర్తాడ్ మండలానికి చెందిన నారాయణ (పేరు మార్చాము) ఇటీవల తన ఓటు హ క్కును ఆర్మూర్కు బదిలీ చేయించాడు. సొంత గ్రా మం మోర్తాడ్ అయినా ఆరేళ్లుగా తాను ఆర్మూర్లో నివాసం ఉంటున్నానని ఓటు హక్కును మార్చుకున్నట్లు చెబుతున్నాడు. అయితే, ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సొంత గ్రామంలో ఓటేసిన నారాయణ ప్రస్తుతం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయడానికి అనర్హుడు. అసెంబ్లీ, పార్లమెంట్, జీపీ ఎన్నికల వరకు మోర్తాడ్లోనే ఓటేసిన ఈయనకు అత్యవసరంగా ఆర్మూర్కు తన ఓటు హక్కు మార్చుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. అతని మిత్రుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీచేసే ఆలోచన చేస్తుండటంతో అతనికి అండగా నిలిచి ఓటు వేసేందుకు మోర్తాడ్ నుంచి ఆర్మూర్కు ఓటును మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఓటర్ల అడ్రస్ మార్పు నిజామాబాద్ కార్పొరేషన్తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో ఈ మధ్య జోరుగా జరుగుతున్నాయి. విజయం కోసమే.. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో పలువురు నాయకులు తమకు అనుకూలంగా ఉన్న ఓటర్ల దిగుమతికి పాల్పడుతున్నారు. స్థానికంగా ఓటు హక్కు లేని ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఓట్లను మున్సిపాలిటీ పరిఽధిలోకి బదిలీ చేయడం లేదా కొత్తగా ఓటు హక్కును నమోదు చేయించడం లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. సెల్ఫోన్లలో ప్రత్యేకమైన యాప్ ద్వారా ఓటు హక్కు నమోదు, బదలాయింపు చేసుకోవడం సులభంగా మారడంతో కొందరు అక్రమార్కులు ఈ మార్గాలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్ మున్సిపాలిటీలకు సమీపంలో మహారాష్ట్ర సరిహద్దులు ఉండటంతో కూలీ పనులకు ఈ ప్రాంతాలకు వచ్చిన వారిని గుర్తించి వారికి ఓటు హక్కు తీసుకోవడం లేదా వారి ఓటు హక్కును బదలాయించడం చేస్తున్నారు. ఆర్మూర్లో సైతం ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వారు ఉండటంతో వారి ఓట్లను ఇక్కడికి మారుస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధికారులు సేకరించిన ఓటర్ల వివరాలతో పోలిస్తే ఈ తేడా గణనీయంగా కనిపించనుంది. మున్సిపల్ ఎన్నికల నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి దిగుమతి ఓట్లు వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉందని అధికారులు చర్చించుకుంటున్నారు. జీపీ ఎన్నికల్లో ఓటేస్తే అనర్హులే..జిల్లాలో చాలా మంది పిల్లల చదువులు, ఉద్యో గ, ఉపాధి అవకాశాల కోసం పట్టణ ప్రాంతాల కు వలస వస్తుంటారు. కానీ వారి ఓటు హ క్కును మాత్రం సొంత గ్రామాల్లోనే కొనసాగిస్తుంటారు. ఇలాంటి వారంతా ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న కొందరు నాయకులు గ్రామాల్లో ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించి వారి ఓట్లను మున్సిపాలిటీల పరిధిలోకి బదలాయిస్తున్నారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండే వివిధ పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఇలాంటి ఓటర్లను గుర్తించి ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంది. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలకు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారి ఓట్లను మున్సిపాలిటీల పరిధిలోకి బదలాయిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి వారిని స్థానికులు గుర్తించి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – పూజారి శ్రావణి, మున్సిపల్ కమిషనర్, ఆర్మూర్ గ్రామీణ ప్రాంతాల నుంచి బదలాయిస్తున్న నేతలు మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పోలింగ్ ఏజెంట్లు గుర్తిస్తే బదలాయింపులకు అడ్డుకట్టపడే అవకాశం -
బైక్పై ‘ఉమ్లింగ్ లా’కు ఇందూరు యువకుడు
● ప్రపంచంలోనే ఎత్తయిన మోటరబుల్ పాస్ ● గిన్నిస్ రికార్డు ధ్రువీకరణ డిచ్పల్లి (నిజామాబాద్ రూరల్): సొంత బైక్పై ప్రపంచంలోనే ఎత్తయిన మోటారబుల్ పాస్ ఉమ్లింగ్ లా చేరిన యువకుడిగా నగరానికి చెందిన మోటో వ్లాగర్ గత్క సుశాంత్ నిలిచారు. హైదరాబాద్కు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి నిజామాబాద్ నుంచి 14 జూలై 2025న తన బైక్పై బయలుదేరిన సుశాంత్ 7,316 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసి ఆగస్టు 14న తిరిగి జిల్లాకు చేరుకున్నారు. సొంత డామినార్ 400సీసీ బైక్పై నిజామాబాద్ నుంచి లడఖ్ వరకు మోటార్సైకిల్ రౌండ్ ట్రిప్ పూర్తి చేసిన మొదటి డాక్యుమెంటెడ్ మోటోవ్లాగర్గా నిలిచాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మోటారబుల్ పాస్ ఉమ్లింగ్లా (19,024 అడుగులు / 5,883 మీటర్లు) చేరుకున్నాడు. చేరుకున్నారిలా.. నిజామాబాద్ నుంచి బయల్దేరి 44 నంబర్ జాతీయ రహదారి మీదుగా ఆగ్రా, మధుర, ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి జమ్మూ, వైష్ణో దేవి, శ్రీనగర్, జోజిల్లా పాస్, పహల్గాం, సోన్ మార్గ్, కార్గిల్, లేహ్ మీదుగా ప్రపంచంలోనే రెండవ ఎత్తయిన మోటారబుల్ పాస్ (17,982 అడుగులు) ఖార్దుంగ్ లా చేరుకున్నారు. దేశంలోని చివరి గ్రామం టాంగ్ను సందర్శించారు. తర్వాత డిస్కిట్ మఠం, హుందర్, పాంగాంగ్ లేక్, హన్లే ప్రాంతం మీదుగా ప్రపంచంలోనే మొదటి ఎత్తయిన మోటారబుల్ పాస్ (19,024 అడుగులు) ఉమ్లింగ్ లా చేరుకున్నారు. ఉమ్లింగ్ లా చేరుకున్న సుశాంత్కు గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. తిరుగు ప్రయాణంలో వీరు ఇండియా–చైనా సరిహద్దు ప్రదేశాలను వీక్షించి చండీగఢ్, ఝాన్సీ నగరాల మీదుగా తిరిగి నిజామాబాద్కు చేరుకున్నారు. ఈ జర్నీ మొత్తాన్ని సుశాంత్ బైక్పై అమర్చిన కెమెరా ద్వారా చిత్రీకరించి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. అతి ఎత్తు, తక్కువ ఆక్సిజన్, కఠిన రోడ్లు, అనిశ్చిత వాతావరణం వంటి సవాళ్లను ఎదుర్కొని ఈ మోటార్ జర్నీని విజయవంతంగా పూర్తి చేయడంపై సుశాంత్ ప్రశంసలు అందుకున్నారు. -
వీసీ, రిజిస్ట్రార్లకు సన్మానం
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరిలను ప్రైవేట్ డిగ్రీ , పీజీ కళాశాలల యాజమాన్యం అసోసియేషన్ ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీసీ, రిజిస్ట్రార్లను సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, మీమ్స్ శ్రీనివాసరాజు, మారయ్యగౌడ్, నిశిత రాజు, సూర్యప్రకాశ్ రావు, శంకర్, సంజీవ్, శ్రీనివాస్ రెడ్డి, నవీన్, విజయ్, దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు. ● ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితుల ఆరోపణ సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారావ్పేట్ గ్రామంలో ఓ కుటుంబాన్ని అదే కులానికి చెందిన సభ్యులు కులం నుంచి బహిష్కరించారు. గ్రామానికి చెందిన సుంకరి సురేశ్ కుటుంబాన్ని ఎలాంటి కారణంగా లేకుండా కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు పెద్ద మనుషులు హుకుం జారీ చేసినట్లు బాధితుడు గురువారం సాక్షితో పేర్కొన్నారు. కులంలో జరిగిన శుభ, అశుభ కార్యాలకు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మూడు నెలల కింద సదాశివనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తమకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయమై ఎస్సైని సంప్రదించగా ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, కేసు కోర్టులో ఉన్నట్లు వివరణ ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాళాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు గురువారం రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్కు వినతిపత్రం అందజేశారు. తరగతుల వారీగా వేతనాలు ఇస్తుండడంతో తాము బాగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. తమకు కనీస కాలపరిమితితో జీతాలు అందజేయాలని కోరారు. తమ విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ రూరల్: మండలంలోని ఖానాపూర్ గ్రామంలో క్రిమిసంహారక మందు చల్లిన మేత తిని ఆరు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్ల మల్లేశ్, గొల్ల సుదన్కు చెందిన 100 గొర్రెలు గురువారం మేతకు వెళ్లాయి. మేత మేస్తూ ఆకస్మికంగా కొన్ని గొర్రెలు పడిపోవడంతో కాపరులు పశువైద్యాధికారులకు సమాచారం అందించారు. వైద్యులు వచ్చి చూసే సరికి గొల్ల మల్లేశ్కు చెందిన ఐదు గొర్రెలు, గొల్ల సుదన్కు చెందిన ఒక గొర్రె మృత్యువాతపడ్డాయి. మిగతా జీవాలకు వైద్యులు చికిత్స అందించారు. -
బైక్ అదుపుతప్పి ఒకరు మృతి
మాక్లూర్: బైకు అదుపుతప్పి తీవ్రగాయాలైన నందిపేట మండలం కౌలుపూర్కు చెందిన చల్లా వాసు(21) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. చల్లా వెంకటేశ్, చల్లా వాసు ఇద్దరు అన్నదమ్ములు పల్సర్ బైక్పై నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు బుధవారం రాత్రి బోధన్ వెళుతుండగా మాక్లూర్ మండలం గొట్టిముక్కుల శివారులో బైకు అదుపుతప్పి పడింది. చల్లా వాసు తలకు బలమైన గాయాలు తగలడంతో అంబులెన్స్లో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున చల్ల వాసు మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. అనుమానాస్పదస్థితిలో రైతు ..ఇందల్వాయి: మండలంలోని గండి తండాకు చెందిన బానో త్ రాజు (34) అనే రైతు తన పొలంలో గురువారం సాయంత్రం పురుగుల మందు పిచికా రీ చేస్తుండగా మృతి చెందినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. మృతికి గల కారణాలు తెలియ రాలేదని పేర్కొన్నారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు ..తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కృష్ణాజివాడి గ్రామ శివారులోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మండలంలోని దేవాయిపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ పులి రాజయ్య(48) కామారెడ్డి నుంచి తన టీవీఎస్ ఎక్సెల్పై సొంతూరికి వస్తున్నాడు. తాడ్వాయి నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో రాజయ్య తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రాజమణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
130 మందిపై డ్రంకెన్డ్రైవ్ కేసులు
నిజామాబాద్అర్బన్: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా 130 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం రాత్రి జిల్లాలో ఈ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్మూర్లో.. ఆర్మూర్: పట్టణంలో బుధవారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించి 14 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ గురువారం తెలిపారు. వీరందరినీ ఆర్మూర్ కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. ఎల్లారెడ్డిలో 9 మందిపై.. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో 9 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ఎస్సై మహేశ్ గురువారం తెలిపారు. లింగంపేటలో నలుగురిపై... లింగంపేట(ఎల్లారెడ్డి): నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. బుధవారం రాత్రి మండల కేంద్రంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
జాతీయస్థాయి వుషూ పోటీల్లో పతకాలు
సుభాష్నగర్: చత్తీస్గఢ్ రాష్ట్రంలో వుషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంస్కార్ ఇంటర్నేషనల్ పాఠశాలలో గతనెల 24 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన 9వ జాతీయస్థాయి వుషూ ఫె డరేషన్ కప్ క్రీడా పోటీల్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు పతకాలు సాధించారని కోచ్లు వేముల సతీశ్, మహ్మద్ సనాహుల్ల, సాయినాథ్ గురువా రం తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్, సీని యర్ పోటీల్లో ఆయా కేటగిరిల్లో 80 మంది క్రీడాకారులు పాల్గొనగా, 34 మంది పతకాలు సాధించారని, ఒక బంగారు పతకం, 6 రజతాలు, 27 కాంస్య పతకాలు గెలుపొందారని వివరించారు. విజేతలకు వుషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో సోహైల్ అహ్మద్ పథకాలు ప్రదానం చేసినట్లు తెలిపారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు, కోచ్లు, నిర్వాహకులు వూషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చాంపియన్షిప్ డైరెక్టర్ శంభు సేథ్, ముఖేష్ను అమెచ్యూర్ వుషూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్రాజ్, ప్రధానకార్యదర్శి అబ్దుల్ ఒమర్ అభినందనలు తెలిపారు. ప్రతినిధులు అబ్దుల్ ఒమర్, శ్రీ రాముల సాయికృష్ణ, రవితేజ, తైమూర్, పరిపూర్ణ చారి పాల్గొన్నారు. -
ఒకేరోజు వ్యవధిలో దంపతులు మృతి
యాద్గార్పూర్లో విషాదఛాయలు రుద్రూర్: భర్త మరణించిన రెండోరోజే భార్య మృతి చెందిన ఘటన కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయబోయి (70) నెలరోజుల క్రితం అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు భార్య లచ్చవ్వ(65) నెలరోజులుగా సేవలు చేసింది. ఆరోగ్యం విషమించి మంగళవారం సాయిబోయి మృతి చెందగా బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. గురువారం ఉదయం మృతుడి కుటుంబీకులు శ్మశానానికి వెళ్లి ఖననం చేసిన ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా సాయబోయి భార్య లచ్చవ్వ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బుధవారం భర్త అంత్యక్రియలు నిర్వహించగా, గురువారం భార్య అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని కుటుంబీకులు రోదించారు. నూతన సంవత్సరం వేళ భార్యాభర్తలు మృతి చెందడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పొగమంచు మిగిల్చిన విషాదం
● దారి కనిపించక అదుపుతప్పిన కారు ● బండరాయిని ఢీకొని బోల్తాపడిన వాహనం ● ఒకరి మృత్యువాత కామారెడ్డి క్రైం: బంధువులు, స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న ఆ యువకుడు.. అంతలోనే విగత జీవిగా మారాడు. దట్టంగా కమ్ముకున్న పొగమంచుతో దారి కనిపించక వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో గాయాలపాలై మరణించాడు. జిల్లా కేంద్రంలో గురువారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన గోపు నర్సింలు కుటుంబం చాలా ఏళ్ల క్రితమే జిల్లాకేంద్రంలోని అశోక్నగర్ కాలనీలో స్థిరపడింది. అతడి కుమారుడైన గోపు నరేశ్ (30) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నరేశ్కు ఏడాది క్రితమే భిక్కనూరు మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూతురుతో వివాహమైంది. అతడు స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం కోసం బుధవారం కామారెడ్డికి వచ్చాడు. సంబురాలను ముగించుకుని కారులో ఇంటికి తిరిగి వస్తుండగా.. కలెక్టరేట్ సమీపంలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా దారి కనిపించక వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెనుక మరో కారులో వస్తున్న అతడి బావమరిది దీనిని గమనించి తీవ్ర గాయాలపాలైన నరేశ్ను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే నరేశ్ మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. స్టీరింగ్ సక్రమంగా పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని ముందుగా భావించారు. అయితే పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై రంజిత్ తెలిపారు. -
జిల్లా మరింత పురోగతి సాధించాలి
నిజామాబాద్అర్బన్: నూతన సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆకాంక్షించారు. గురువారం ఆయా శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అదనపు కలెక్టర్ను ఆయన చాంబర్లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ,, డీడబ్ల్యూవో రసూల్ బీ, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులు నాగోరావు, నర్సయ్య, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగవ్వ, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు పి.శ్రీనివాస్ రావు, భాస్కర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మానవతా సదన్లో నూతన సంవత్సర వేడుకలు డిచ్పల్లి: మండల కేంద్రంలోని మానవతా సదన్లో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. సదన్ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలకు నోట్ బుక్స్, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్కు సదన్ పిల్లలు తాము చిత్రించిన పార్వతీపరమేశ్వరుని ఫొటో బహూకరించారు. అనంతరం కిరణ్కుమార్ మాట్లాడుతూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిచ్పల్లి తహసీల్దార్ సతీశ్రెడ్డి, సదన్ కేర్ టేకర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ -
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
రెంజల్ : పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్త మ ఫలితాలు సాధించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉపాధ్యాయులకు సూ చించారు. రెంజల్ మండల కేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, ప్రా థమిక పాఠశాలలను సబ్ కలెక్టర్ గురువారం సందర్శించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులను ప లు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాల కోసం ఉపాధ్యాయులు మరింత కృషి చేస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూ చించారు. ఎంఈవో ఆంజనేయులు, సర్పంచ్ తిరు పతి లలిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సిర్పూర్ విద్యార్థులకు అంతర్జాతీయ బహుమతులు
మోపాల్: కెనడా దేశం నుంచి వెలువడే అంతర్జాతీయ బాలల పత్రిక గడుగ్గాయి నిర్వహించిన అంతర్జాతీయ కవితల, కథల, వ్యాసాల పోటీలో మండలంలోని సిర్పూర్ హైస్కూల్ విద్యార్థులు బహుమతులు సాధించినట్లు హెచ్ఎం సత్యనారాయణ తెలిపారు. గురువారం పాఠశాలలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. సంక్రాంతి సందర్భంగా దేశ విదేశాల్లోని విద్యార్థులకు తెలుగు భాషలో సృజనాత్మక రచన పోటీలను ఈ పత్రిక నిర్వహించిందన్నారు. పోటీలకు సంబంధించిన ఫలితాలు గురువారం అందాయని, కవితల విభాగంలో యం.మేఘన, టి.అక్షయ, కథల విభాగంలో యం హరిణి, ఎం మాధురి, కే గాయత్రి, ఆర్ శ్రావణి బహుమతులు గెలుచుకున్నారని తెలిపారు. కవితల విభాగం, వ్యాసరచన పోటీల్లో పి.లతిక, ఎం. అనన్య బహుమతులు గెలుపొందారని, మొత్తం 8 బహుమతులు సిర్పూర్ ఉన్నత పాఠశాలకు లభించాయని తెలిపారు. పోటీలకు విద్యార్థులను సంసిద్ధులను చేసిన తెలుగు ఉపాధ్యాయుడు డాక్టర్ కాసర్లను హెచ్ఎం అభినందించారు. ఉపాధ్యాయులు ఏ శ్యామల, అక్బర్ బాషా, వందన, డాక్టర్ హజారే శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి గురువారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎంను కలిసినవారిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యా ల సునీల్రెడ్డి ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారివెంట ఉర్దూ అకాడ మీ చైర్మన్ తాహెర్బిన్హందాన్, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి ఉన్నారు. -
పసుపు ధరలపై ఆశలు
మోర్తాడ్(బాల్కొండ): పసుపునకు అంతర్జాతీయ మార్కెట్(కమోడిటీ)లో ధర పెరగడంతో రైతుల్లో ఆశలు పెరిగాయి. వారం రోజుల వ్యవధిలో క్వింటాల్ ధర రూ.2 వేలు పెరిగింది. మొన్నటి వరకు రూ.12 వేల నుంచి రూ.13 వేలు ఉన్న క్వింటాల్ పసుపు ధర ఒకేసారి రూ.15 వేలకు చేరింది. కమోడిటీలో రూ.17 వేలుగా నమోదైంది. ఈ సీజన్కు సంబంధించి పసుపు తవ్వకాలకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తవ్వకం తరువాత ఉడికించి ఆరబెట్టాల్సి ఉంటుంది. మరో పక్షం రోజుల్లో పసుపును మార్కెట్లో విక్రయించే అవకాశాలు ఉన్న తరుణంలో ధర ఆశాజనకంగా కనిపిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు ధర నియంత్రణపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు. గత సీజన్లో రూ.12 వేల వరకే ధర లభించింది. పెట్టుబడులు పెరగడంతో ధర కనీసం రూ.16వేలకు పైగా లభిస్తేనే తమకు ప్రయోజనం అని రైతులు పేర్కొంటున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కావడం, ఎగుమతులపై దృష్టి సారించడంతో అంతర్జాతీయ మార్కెట్లో మన పసుపునకు డిమాండ్ ఏర్పడితే ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. ఈసారి జిల్లాలో 20వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు పసుపు సాగు చేశారు. పదేళ్ల కింద కనీసం సాగు విస్తీర్ణం 50వేల ఎకరాల వరకు ఉండేది. పెట్టుబడులు పెరిగడం, మార్కెట్లో ధర లేకపోవడంతో నష్టపోతున్నామనే కారణంతో అనేక మంది రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. ధర ఆశాజనకంగా ఉంటే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ధర ఎప్పటి వరకు నిలకడగా ఉంటుందో మరి. పసుపు ధర నియంత్రణ అధికార యంత్రాంగం చేతిలో ఉండాలి. అంతర్జాతీయ మార్కెట్లో ధర ఆశాజనకంగా ఉండటం మన మార్కెట్లో ధర తగ్గిపోవడం వల్ల రైతులకు నష్టమే జరుగుతుంది. ధర నియంత్రణపై చర్యలు తీసుకుంటేనే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. – సంజీవరెడ్డి, రైతు, దొన్కల్ వారం రోజుల వ్యవధిలో క్వింటాల్కు రూ.2వేలు పెరిగిన ధర ఈ సీజన్లో రూ.15వేలకు పైగా ధర లభించే అవకాశాలు అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరుగుదల ఎగుమతులు పెరిగితే మరింత పుంజుకునే అవకాశం -
నాట్లలోనూ ముందంజ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ధాన్యం సేకరణలో గత రెండు సీజన్లలో వరుసగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన నిజామాబాద్ జిల్లా వరి నాట్లు వేయడంలోనూ ముందంజలో నిలుస్తోంది. ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి వరి నాట్లు వేయడంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి ఇప్పటివరకు 7 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయగా, ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 2,01,798 ఎకరాల్లో రైతులు నాట్లు వేశారు. ఈ సీజన్లో 4,31,042 ఎకరాల్లో వరి సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేయగా ఇప్పటికే 55 శాతం విస్తీర్ణంలో నాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో స్థానిక కూలీలే కాకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు వరంగల్కు చెందిన వలస కూలీలు సైతం వరి నాట్లు వేస్తున్నారు. వరినాట్లు వేయడంలో వీరికి పెట్టింది పేరు. గంట వ్యవధిలోనే ఒక ఎకరంలో నాట్లు వేేస్తున్నారు. 8 నుంచి 10 మంది కూలీలు ఎకరానికి రూ.4,500 నుంచి రూ.5,200 వరకు రైతుల నుంచి తీసుకుంటున్నారు. వరి నాట్లు వేగంగా అవుతుండడంతో యూరియా కొనుగోళ్లు పెరిగాయి. జిల్లాకు 53,393 మెట్రిక్ టన్నుల యూరియా రాగా.. ఇప్పటి వరకు 43,308 మెట్రిక్ టన్నులు రైతులు కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో యాసంగి సీజన్కు గాను మొత్తం 5,22,730 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా జిల్లాలో ఇప్పటివరకు 2,63,126 ఎకరాల్లో (54శాతం) వివిధ పంటలను రైతులు సాగు చేశారు.మొక్కజొన్న పంట 25,202 ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా, ఈ అంచనాలను మించి రైతులు భారీగా 31,880 ఎకరాల్లో (165 శాతం) సాగు చేయడం విశేషం. శనగ పంట 14,366 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. కందులు 48 ఎకరాల్లో, మినుములు 171, పొద్దు తిరుగుడు 181, పొగాకు 2,548 ఎకరాల్లో రైతులు వేశారు. జిల్లాలో జోరుగా యాసంగి సాగు పనులు ఇప్పటికే 55 శాతం వరినాట్లు పూర్తి అన్ని పంటలూ కలిపి 54 శాతం ఇప్పటికే వేసిన అన్నదాతలు రికార్డు స్థాయిలో 165 శాతం మొక్కజొన్న సాగు -
కోడి గుడ్డు ధర ౖపైపెకి..
నందిపేట్(ఆర్మూర్): కోడి గుడ్డు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కోటా మేరకు గుడ్డు అందడం లేదు. పేద విద్యార్థులకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ప్రతి విద్యార్థికి వారానికి మూడు రోజులు గుడ్లు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో గుడ్డుకు రూ. 6 ఏజెన్సీలకు చెల్లిస్తుంది. గత రెండు నెలల నుంచి ధరలు విపరీతంగా పెరిగి ప్రస్తుతం రూ. 8.50 కు చేరుకుంది. దీంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో గుడ్లను అందించలేకపోతున్నారు. గుడ్ల స్థానంలో అరటిపండ్లు.. జిల్లాలో మొత్తం 1,158 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 94 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి నిత్యం మధ్యాహ్న భోజన పథకం కింద వారానికి మూడు కోడిగుడ్లు అందించాల్సి ఉంటుంది. ధరలు పెరగడంతో తక్కువ విద్యార్థులున్నా ప్రైమరీ పాఠశాలలో వారినికి రెండు రోజులు, హైస్కూల్, యూపీఎస్లలో మాత్రం ఒక్క రోజే కోడిగుడ్లు అందజేస్తున్నారు. మిగిలిన రోజులలో ప్రత్యామ్నాయంగా అరటి పండ్లు, బిస్కెట్లను అందిస్తున్నారు. కోడిగుడ్డు ధర పెరగడంతో ఇబ్బందులు పడుతున్న ఏజెన్సీ నిర్వాహకులకు బిల్లులు సైతం సక్రమంగా రావడం లేదు. దీంతో అప్పులు చేసి విద్యార్థులకు వండి పెడుతున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కూడా నేరుగా ప్రభుత్వం కోడిగుడ్లను సరఫరా చేయాలి. అలా చేస్తే మార్కెట్ ధరతో సంబంధం లేకుండా విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందుతుంది. కోడిగుడ్ల ధరలు రోజురోజుకూ పెరగడంతోతమ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే గుడ్ల విషయంలో ఏజెన్సీ నిర్వాహకులను గట్టిగా ప్రశ్నించలేక పోతున్నాం. – అవదూత గంగాధర్, మండల విద్యాధికారి, నందిపేట రూ. 8.50కి చేరిన రేటు మధ్యాహ్న భోజన నిర్వాహకులపై భారం వారంలో మూడు రోజులకు బదులు ఒక రోజుకు పరిమితం -
మోర్తాడ్ వాసికి అరుదైన గౌరవం
మోర్తాడ్(బాల్కొండ) : నిజాం పాలనలో తెలుగు సాహిత్యానికి ప్రతిబింబంగా నిలిచిన సిరిసినహాళ్ కృష్ణమాచారికి అరుదైన గౌరవం దక్కింది. మోర్తాడ్కు చెందిన కృష్ణమాచారి నిజాం కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి తొలి శతావధానిగా గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా కోరుట్లలోని వేద పాఠశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలను నిర్వహిస్తూ అక్కడే స్థిరపడినా మోర్తాడ్లో ఆయన మూలాలు ఉన్నాయి. తెలుగు సాహిత్యానికి జీవం పోసిన కృష్ణమాచారి ఎన్నో పుస్తకాలను రచించారు. ఆయన రాసిన పుస్తకాలపై ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో పలువురు పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. తెలుగు సాహిత్యానికి కృష్ణమాచారి చేసిన సేవలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింది. అప్పట్లో హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో కృష్ణమాచారి పేరిట ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతో ఆయన కీర్తి విస్తరించింది. ప్రస్తుత ప్రభుత్వ నేతృత్వంలో తెలంగాణ సాహిత్య అకాడమీ 2026 క్యాలెండర్పై కృష్ణమాచారి ఫొటోను ముదించారు. తెలుగు సాహిత్యానికి విశేష సేవలు అందించిన కృష్ణమాచారికి గుర్తింపు తగిన గుర్తింపు దక్కిందని మోర్తాడ్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాహిత్య అకాడమీ క్యాలెండర్పై సాహితీవేత్త సిరిసినహాళ్ కృష్ణమాచారి చిత్రం తొలి శతావధానిగా గుర్తింపు పొందిన జిల్లావాసి -
హడలెత్తిస్తున్న దొంగలు
నిజామాబాద్● జిల్లాలో చోరీలు.. హైవేల మీదుగా పరారీ ● ముఠాలుగా ఏర్పడి చోరీలు ● ఏటీఎంలు, బ్యాంకులే లక్ష్యం.. ● సరిహద్దుల్లో నిఘాపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి జిల్లా మరింత పురోగతి.. నూతన సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆకాంక్షించారు.శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026– 8లో u -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ నుంచి బాబాపూర్కు వెళ్లే దారిలో ఓ దుకాణం వద్ద మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. మంగళవారం ఉదయం దుకాణం తెరవడానికి వచ్చిన యజమాని రాగి శ్రీనివాస్కు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎరుపు రంగు చొక్క, బూడిద రంగు పాయింట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడిని యాచకుడిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బోధన్: ఎడపల్లి మండలం మంగళ్పహాడ్ గ్రామంలో మంగళవారం చి లిగిరి రమేష్కు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో రెండు గొర్రెలు మృతి చెందాయి. వీధి కుక్కల దాడుల వల్ల భయాందోళనకు గురవుతున్నామని పెంపకందార్లు పేర్కొంటున్నారు. -
ఇందిరమ్మ ఇళ్లకు ధరల భారం
● పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుక, కంకర ధరలు ● లబ్ధిదారులపై అదనంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల భారం నందిపేట్(ఆర్మూర్):పెరిగిన సిమెంట్, ఇసుక, ఇటుక, కంకర, స్టీల్ ధరలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణ లబ్ధిదారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణా లు గాడిన పడుతున్న తరుణంలోనే సామగ్రి రేట్లు అధికం కావడం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కూలీలు, మేసీ్త్రలు సైతం రేట్లు పెంచారు. పెరిగిన ధరలతో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అదనపు భారం ప డుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. జిల్లాలో 19,306 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ఉండగా లబ్ధిదారులకు రూ. 5 లక్షలు దశల వారిగా ఆర్థిక సాయం విడుదలవుతుంది. మండుతున్న ధరలు ఇందిరమ్మ ఇంటికి 500 నుంచి 525 బస్తాల సిమెంట్ అవసరం ఉంటుంది. పథకం ప్రారంభ దశలో బస్తా ధర రూ. 280 ఉండగా ప్రస్తుతం గ్రేడ్ను బట్టి బస్తా రూ.50 నుండి 80 వరకు అదనంతో విక్రయిస్తున్నారు. పాత ధర ప్రకారం రూ. 1,47,000కు సిమెంట్ వచ్చేది. ప్రస్తుత రేటుతో సుమారు రూ.1.80 లక్షలు అవుతుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారునికి సిమెంట్ రూపేణా అదనంగా రూ. 33 వేలు భారం పడుతుంది. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఇసుక రవాణాదారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ట్రిప్పు ఇసుక రూ. 8 వేల వరకు వసూలు చేస్తున్నారు. వెయ్యి ఇటుకలకు ధర గతంలో రూ. 6 వేలు ఉండగా ప్రస్తుతం రూ. 9,500గా అమ్ముతున్నారు. అలాగే స్టీల్ ధర సైతం అమాంతం పెరిగింది. బేస్మెంట్ నిర్మాణంతోపాటు పిల్లర్లు స్లాబ్కు అవసరమయ్యే 20 ఎంఎం కంకర ధర ట్రాక్టరుకు రూ. 4500 ఉండగా ప్రస్తుతం రూ. 5100 పలుకుతోంది. కూలీలకు ఫుల్ డిమాండ్ గతంలో కూలీల్లో పురుషులకు రోజుకు రూ.800 ఉండేది. ప్రస్తుతం రూ. 1300 నుంచి రూ.1500 అడుగుతున్నారు. మహిళలకు రూ. 500 ఉండగా రూ. వెయ్యి డిమాండ్ చేస్తున్నారు. కూలీలు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూలీలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. నందిపేటలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు -
బల్దియా పోరుకు సన్నాహాలు
● ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్ ● జనవరి 10న ఓటర్ల తుది జాబితా ప్రచురణ ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్కు ముందు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించింది. ముందుగా రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పోరేషన్ల పరిధిలో ఓటరు జాబితా సవణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. నోటిఫికేషన్ను అనుసరించి వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి జనవరి 1న పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించాలి. 5న మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై అభ్యంతరాలు స్వీకరించి, సవరించిన తుది జాబితాను 10న ప్రచురించాల్సి ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ ఆఫీసర్ మృతి
మోర్తాడ్: మెండోరా మండలం పోచంపాడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ ఆఫీసర్ మృతిచెందారు. వివరాలు ఇలా.. పోచంపాడ్లో నివాసం ఉంటున్న బొమ్మల ప్రియాంక (43) స్థానిక సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఆమె విధుల నిమిత్తం తన తమ్ముడి మోటర్సైకిల్పై పాఠశాలకు బయలుదేరింది. మార్గమధ్యలో ఆమె వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె కిందపడి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ట్రాక్టర్ను అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ వేముల మహేశ్పై కేసు నమోదు చేసినట్లు మెండోరా ఎస్సై సుహసినీ తెలిపారు. -
ఆర్మూర్ వాసులకు ఆధ్యాత్మిక అనుభూతి
ఆర్మూర్ : మహా విష్ణువు దశావతారాలను ఇసుకతో రూపొందించి ప్రదర్శన ఏర్పాటు చేయడం ఆర్మూర్ వాసులకు అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్రెడ్డి అన్నారు. పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో విజయ్ అగర్వాల్, లావణ్య సంయుక్తంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పాల ప్రదర్శనను మంగళవారం ఆయన ప్రారంభించారు. నెల రోజుల పాటు ప్రదర్శన కొనసాగనున్నందున విద్యార్థులు తిలకించి దశావతారాలతో పాటు సైకత శిల్పాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సాయి బాబా గౌడ్, షేక్ మున్ను, లింగాగౌడ్, ఖాందేశ్ శ్రీనివాస్, బాల్రెడ్డి, గోర్తె దేవేందర్, అతిక్, ఫయాజ్, అజ్జు, చిట్టిరెడ్డి, రాజు, భూపేందర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. జీనియస్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు.. సైకత శిల్పాల రూప కల్పనకు జీనియస్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు కల్పిస్తున్నట్లు అవార్డుల ప్రతినిధులు బింగి నరేందర్ గౌడ్, రాజు తెలిపారు. వారు స్వయంగా వచ్చి సైకత శిల్పాలను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. సైకత శిల్పాల రూపకర్త ఆకునూరి బాలాజీ వరప్రసాద్తోపాటు ప్రదర్శన నిర్వాహకులు విజయ్ అగర్వాల్, లావణ్యకు అవార్డులను ప్రదానం చేశారు. -
ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుకను తోడేసి..
● అక్రమంగా లారీలలో దూరప్రాంతాలకు తరలింపు ● భీమ్గల్ మండలంలో ఆగని దందా ● పట్టించుకోని అధికారులుమోర్తాడ్(బాల్కొండ): ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుకను తోడేసీ, అక్రమంగా దూరప్రాంతాలను తరలిస్తున్నారు కొందరు అక్రమార్కులు. భీమ్గల్ మండలంలో ఇసుక అక్రమ దందా మూడు పువ్వులు, ఆ రు కాయలు అన్న చందంగా యథేచ్ఛగా సాగుతుంది. అధికార పార్టీకి చెందిన కొందరు ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల కోసమంటూ తరలిస్తూ తమకు అనువైన స్థలంలో నిలువ చేసుకుంటున్నారు. రాత్రిపూ ట పెద్దపెద్ద లారీలలో దూర ప్రాంతాలకు తరలి స్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులే ఇసుక దందా సాగిస్తుండటంతో అధికార యంత్రాంగం మౌనం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని బెజ్జోరా కప్పల వాగు నుంచి రోజు సాగుతున్న ఇసుక రవాణా విషయంలో కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల అభ్యంతరాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకూ నాయకులే రంగంలోకి దిగి సోమవారం రాత్రిపూట అక్రమంగా సాగుతున్న రవాణాను అడ్డుకున్నారు. ఇసుకను తరలిస్తున్న వాహనాలను అధికారులకు పట్టించారు. ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల కోసం తరలించాలనే అధికారులు పగటి పూట అనుమతులు ఇస్తున్నారు. పగలు కొన్ని ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను తరలించి ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తూ తమ దందాను సాగిస్తున్నారని అధికార పార్టీ నాయకులపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి అసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కలెక్టర్కు బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ మండలం క ప్పల వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాపై క లెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ను బీఆర్ఎస్ నాయకులు కలిసి, సమస్యను విన్నవించారు. ఇసుక అక్రమ రవాణాపై నమోదైన కేసుల వివరాలను ప్రజలకు మీడియా ద్వారా వెల్లడించా లని కలెక్టర్ను కోరారు. నాయకులు నవీన్, గు న్నల బాల భాగత్, బోదిరే నర్సయ్య, మల్లెల ప్రసాద్, సతీష్ గౌడ్, అశోక్, సునీల్, రథన్, బచ్చల్వార్ శ్రీనివాస్, లాల రామకృష్ణ ఉన్నారు. -
డిప్యూటీ సెక్రెటరీ జనరల్గా రామ్మోహన్రావు
సుభాష్నగర్: తెలంగాణ ఆల్ పెన్షనర్స్– రిటైర్డ్ ప ర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీ జనరల్గా నిజామాబాద్ జిల్లా పెన్షనర్స్ యూనియ న్ నాయకుడు రామ్మోహన్రావు ఎన్నికయ్యా రు. హైదరాబాద్లో ఇటీవల జరిగిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్–రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలలో ఆయనను ఎన్నుకున్నారు. దీంతో రామ్మోహన్రావుకు జిల్లా అధ్యక్షుడు సిర్ప హన్మాండ్లు, ప్రధాన కార్యదర్శి ఈవీఎం నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. ఖలీల్వాడి: నగరంలోని గిరిరాజ్ కాలేజీలో జరిగే నేషనల్ సెమినార్ బ్రోచర్స్ను మంగళవారం తెయూ రిజిస్ట్రార్ యాదగిరి అవిష్కరించారు. త్వరలో జరుగనున్న ఈ సెమినార్లో డిజిటల్ వేవ్స్ ఇన్ కామర్స్, ఆపర్ుచ్యనిటీస్ అండ్ ఛాలెంజ్ ఆనే ఆంశంపై చర్చించనున్నట్లు తెయూ కామర్స్ హెచ్వోడీ సంపత్ కుమార్ తెలిపారు. సుభాష్నగర్: తెలంగాణ వైద్యారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఘన్పూర్ వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రాష్ట్ర అధ్యక్షుడు రాబర్ట్ బ్రూస్ తెలిపారు. ఈసందర్భంగా అతడికి నియామక పత్రాన్ని మంగళవారం హైదరాబాద్లోని సంఘ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అందజేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం, సంఘం బలోపేతం కోసం కృషిచేస్తానని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నవీపేట: మండలంలోని కమలాపూర్ గ్రామంలోని అంగన్వాడీ టీచర్ మాధవిపై వచ్చిన ఆరోపణలపై మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం విచారణ చేశారు. రికార్డులు సరిగ్గా లేవని, కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామస్తులు ఇటీవల ఐసీడీఎస్ సీడీపీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, సీడీపీవో జ్యోతి, అంగన్వాడీ సూపర్వైజర్లు భాగ్యలక్ష్మి, విశాల గ్రామస్తుల ఆధ్వర్యంలో విచారణ జరిపారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. విచారణ అనంతరం అంగన్వాడీ టీచర్ మాధవికి సూపర్వైజర్ మెమో జారీ చేశారు. రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఎంపిక ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మోడల్స్కూల్కు చెందిన విద్యార్థిని శ్రీజ రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఎంపికై నట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ జహంగీర్ మంగళవారం తెలిపారు. జిల్లా స్థాయి ప్రతిభా పరీక్షలో శ్రీజ మూడో బహుమతి పొంది ఎంపికై నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న శ్రీజను ఉపాధ్యాయులు అభినందించారు. -
నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసమే ఉచిత శిక్షణ
నిజామాబాద్ రూరల్: నిరుద్యోగులకు స్వయం ఉ పాధి కల్పించడం కోసమే బైతుల్ మాల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని ఆటోనగర్లో మంగళవారం ఇన్స్ట్యూట్ బైతుల్ మాల్ ఆ ధ్వర్యంలో ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆయన హాజరై, శిక్షణ కోర్సులను ప్రారంభించారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. శిక్షణ కేంద్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తనవంతుగా రూ.2లక్షలు అందజేసినట్లు తెలిపారు. నిరుద్యోగ మహిళలు, విద్యార్థులకు ఉపాధికి అనుకూలమైన పలు కోర్సుల్లో (కంప్యూటర్ శిక్షణ, టైలరింగ్, మె హందీ డిజైన్, అడ్వాన్సడ్ బ్యూటీషియన్) శిక్షణ ఇ వ్వనున్నట్లు తెలిపారు. సంస్థ ప్రతినిధులు, స్థానిక నాయకులు, శిక్షణార్థులు పాల్గొన్నారు.నిజామాబాద్ రూరల్: హజ్ యాత్రికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని బోధన్ రోడ్లోగల నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఈ ఏడాది హజ్కు వెళ్లనున్న యాత్రికుల కోసం జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. హజ్ యాత్రలో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రయాణ ఏర్పాట్లు, వసతి, రవాణా తదితర లాజిస్టిక్ అంశాలపై అవగాహన కల్పించారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖుస్రో పాషా, హజ్ కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ బాలుడి మృతి
అవయవ దానం చేసిన తల్లిదండ్రులు నందిపేట్(ఆర్మూర్): తనపై దొంగతనం నెపం వేయడంతో బాలుడు ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కొడుకు మృతి బాధను దిగమింగుకొని అవయవదానానికి తల్లిదండ్రులు ముందుకువచ్చారు. వివరాలు ఇలా.. నందిపేట మండలం బాద్గుణ గ్రామానికి చెందిన బరుకుంట ముత్తెన్న తన డబ్బులు రూ. 25వేలు పోయాయంటూ అదే గ్రామానికి చెందిన బరికుంట సన్నిత్ (17)పై దొంగతనం నెపం వేశాడు. దీంతో మనస్తాపం చెందిన సన్నిత్ ఈనెల 27న పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. దీంతో ముత్తెన్నపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. తమ కొడుకు మృతిచెందడంతో అవయవదానానికి మృతుడి తల్లిదండ్రులు ముత్తెన్న, పోసాని ముందుకువచ్చారు. విషాద సమయంలోనూ ఆదర్శంగా నిలుస్తూ అవయవాలు అందించిన కుటుంబాన్ని గ్రామస్తులు అభినందించారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో మంజీరా వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సోమవారం రాత్రి ఎస్సై శివకుమార్ పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మంజీరా నుంచి ఇసుకను తరలిస్తుండటంతో కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. రాజంపేట(భిక్కనూరు): రాజంపేట మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ వద్ద గొడవ పడిన ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు మంగళవారం తెలిపారు. పెట్రోల్ బంక్ వద్ద కారు మళ్లింపు విషయంతో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు వివరించారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండిమాసానిపేట గ్రామ శివారులో మంగళవా రం లారీని వెనుక వస్తున్న మరో లారీ ఢీకొన్న ట్లు స్థానికులు తెలిపారు. రెండు లారీలు జహీరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్నాయన్నా రు. గండిమాసానిపేట గ్రామ శివారులోని జీవదాన్ పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఉండడంతో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశా డు. దీంతో వెనుక వస్తున్న లారీ డ్రైవర్ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలైనట్లు వారు తెలిపారు. నవీపేట: పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని బా వపై దాడి చేసిన బావమరిదిని రిమాండ్ చేసిన ట్లు ఎస్సై శ్రీకాంత్ మంగళవానం తెలిపారు. లింగాపూర్కు చెందిన గంధం శ్రీనివాస్ తన బా వ హన్మండ్లుతో తాగిన మైకంలో గొడవపడ్డా డు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ గొ డ్డలితో హన్మండ్లుపై దాడి చేశాడు. బాధితుడి భార్య రూప ఫిర్యాదు మేరకు నిందితుడిపై హ త్యాయత్నం కేసు నమోదు చేసి, రిమాండుకు పంపినట్లు తెలిపారు. -
కొరట్పల్లిలో బాలిక ఆత్మహత్య
● ప్రేమించిన బాలుడు మోసం చేయడమే కారణమంటూ మృతురాలి కుటుంబీకులు ఆరోపణ ● ప్రియుడి ఇంటి వద్ద ఆందోళనడిచ్పల్లి : మండలంలోని కొరట్పల్లి తండా వడ్డెర కాలనీకి చెందిన ఓ బాలిక(17) సోమవారం సా యంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇ లా.. వడ్డెక కాలనీకి చెందిన బాలిక, కొరట్పల్లి గ్రామానికి చెందిన బాలుడు కొన్నిరోజులుగా ప్రే మించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి ఇళ్లల్లో తెలియడంతో ఇటీవల బాలిక అతడిని కలువకుండా వారి కుటుంబీకులు కట్టడి చేశారు. అయినా వారు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలో సోమవారం ఇరువురి మధ్య ఏం జరిగిందో కానీ సాయంత్రం ఇంట్లో ఎ వరూలేని సమయంలో బాలిక ఉరేసుకుని ఆత్మహ త్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రేమించిన బాలుడు మోసం చేయడంతోనే బాలిక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం కొరట్పల్లి గ్రామంలోని బాలుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న డిచ్పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి ఎస్సై సందీప్ తమ సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఎలాంటి ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు శాంతించారు. అనంతరం సాయంత్రం బాలిక మృతదేహానికి తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కువైట్లో రాంపూర్ వాసి..
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బంటు రవి అలియాస్ ప్రకాష్(50) కువైట్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ఈ నెల 27న రవి తన గదిలో భోజనం చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. దీంతో స్థానికులు ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. కాగా రవి గత 12 సంవత్సరాలుగా ఉపాధి కోసం కువైట్లో ఉంటున్నట్లు తెలిపారు. మృతదేహం మంగళవారం రాత్రి ఇండియాకు వస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మీ, కుమారుడు త్రిజాల్ ఉన్నారు. -
ఈ ఏడాది సవాళ్లను అధిగమించాం..
నిజామాబాద్ అర్బన్: పోలీసు సిబ్బంది అంకిత భావం, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ ఏడాదిలో సవాళ్లను విజయవంతంగా అధిగమించామని పోలీసు కమిషనర్ సాయి చైతన్య పే ర్కొన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో సీపీ వార్షి క నివేదికను మంగళవారం విడుదల చేశారు. ఆయ న మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన పడకుండా రిటైర్డ్ ఉద్యోగులకు, మార్నింగ్ వాకర్స్కు అవగాహ న కల్పించామన్నారు. ‘సే నో టు డ్రగ్స్ –సే ఎస్ టు స్పోర్ట్స్’ నినాదంతో యువతకు క్రీడలు నిర్వహించామన్నారు. జాతీయ రహదారులపై అంతర్ రాష్ట్ర నేరాస్తుల దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి వ చ్చే ‘ పాయింట్ ఆఫ్ ఎంట్రీలపై నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఏడాది విధి ని ర్వహణలో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పో యారని, వారి కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పు డూ అండగా ఉంటుందన్నారు. కల్తీ విత్తనాల నియంత్రణ, గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించామన్నారు. 20 మందికి 12 కేసుల్లో జీవితఖైదు శిక్ష పడింది. ఆరుగురికి ఆరు కేసుల్లో పది సంవత్సరాల జైలు శిక్ష పడింది. నలుగురికి నా లుగు కేసుల్లో ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. ● గతేడాది 857 రోడ్డు ప్రమాదాల్లో 353 మంది మృతి చెందగా, ఈ ఏడాది 780 రోడ్డు ప్రమాదాల్లో 276 మంది మృతిచెందారు. వార్షిక నివేదికలో ‘సాక్షి’ కథనాలు.. వార్షిక నివేదికలో పో లీసు శాఖకు సంబంధించి వివిధ ఘటనలు, కార్యక్రమాలపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలను ప్రచురించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, రామచంద్రరావు, ఏసీపీలు శ్రీనివాస్, రాజావెంకట్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, మస్తాన్అలీ, రాజశేఖర్ తదితరులున్నారు. జిల్లాలో జరిగిన నేరాలు 2024 2025 అన్ని రకాల నేరాలు 8983 8624 డ్రంక్అండ్డ్రైవ్ 8410 17,627 ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ 107 83 హత్యలు 43 50 హత్యాయత్నం 62 101 కిడ్నాప్లు 126 165 చీటింగ్ 758 700 ఇంటి దొంగతనాలు 404 439 సాధారణ దొంగతనాలు 35 21 మహిళలపై.. అఘాయిత్యాలు 747 783 వరకట్న మరణాలు 3 2 ఆత్మహత్యాయత్నాలు 20 25 అత్యాచారాలు 83 89 కిడ్నాప్లు 86 135 వేధింపులు 328 322 పోక్సో కేసులు 120 168 2024 2025 సైబర్క్రైమ్ కేసులు 2339 2411 చైన్స్నాచింగ్ 40 39 తగ్గిన నేరాలు.. పోలీసు సిబ్బంది అంకిత భావంతో పనిచేశారు ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు వార్షిక నివేదిక విడుదల చేసిన సీపీ సాయిచైతన్య -
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు
నిజామాబాద్ రూరల్ : ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్య మని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నా రు. నగరంలో తాగునీటి సమస్య శాశ్వాత పరిష్కా రం కోసం రూ.6 కోట్ల 50 లక్షల వ్యయంతో ఆధునిక వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కేకే గార్డెన్ ఫంక్షన్ హాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో షబ్బీర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేగంగా పెరుగుతున్న జనాభా, నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తయితే నగరంలోని పలు ప్రాంతాల్లో ఏళ్లుగా ఉన్న నీటి కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఆటోనగర్ ప్రాంతంలో 16 లక్షల లీటర్ల సామర్థ్యం గల, సైలనీ నగర్లో 9 లక్షల లీటర్ల, మదీనా ఈద్గా సమీపంలో 9 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నరాల రత్నాకర్, మైనార్టీ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగర జనాభా, విస్తరణను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు రూ.6కోట్ల 50 లక్షలతో ఆధునిక వాటర్ ట్యాంకులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆధునిక వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన -
బీపీ పెరగొచ్చు.. తగ్గొచ్చు
చలి ఎక్కువగా ఉన్న సమయంలో ఎవరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి? – నవీన్, నిజామాబాద్ వృద్ధులు, చిన్న పిల్లలతోపాటు గర్భిణులు, షుగర్, బీపీ, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు బయట కు వెళ్లొద్దు. అత్యవసరమైతే మాస్క్ ధరించి వెళ్లాలి. చలి కారణంగా ఏఏ ఆరోగ్య సమస్యలు రావొచ్చు? – రజినీ, నందిపేట జలుబు, దగ్గు, జ్వరం, న్యుమోనియా, ఆస్తమా, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. చలిలో బయటికి వెళ్లేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– మహేశ్, ఆర్మూర్ ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలి. బయటికి వెళ్లినప్పుడు మఫ్లర్, స్వెట్టర్, టోపీ, గ్లోవ్స్ ధరించాలి. చలిలో స్నానం ఎలా చేయాలి? – ప్రణయ్, ఎడపల్లి చల్లని నీటితో స్నానం చేయొద్దు. గోరువెచ్చని నీటితో త్వరగా స్నానం చేయాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఆస్తమా ఉన్నవారు ఉదయం వేళ కాకుండా ఎండ వచ్చిన తరువాత చేస్తే బాగుంటుంది. దగ్గు, జ్వరం వస్తే ఏం చేయాలి? – రమేశ్, నిజామాబాద్ తేలికపాటి లక్షణాలైతే విశ్రాంతి తీసుకోవడంతోపాటు తగినంత వేడి ద్రవాలు తీసుకోవాలి. మూ డు రోజులు దాటినా తగ్గకపోతే తప్పకుండా వై ద్యుడిని సంప్రదించాలి. రాత్రి నిద్రపోయే సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – శ్రీనివాస్, వర్ని దుప్పటి సరిపడా వాడాలి. గదిలో గాలి ప్రవాహం ఉండాలి. బొగ్గు, కట్టెల మంటలు గదిలో పెట్టొద్దు. చలికాలంలో ఎటువంటి సమయంలో ఆస్పత్రికి వెళ్లాలి? – రాధ, నందిపేట తీవ్ర ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, సో్పృహ కోల్పోవడం, ఎక్కువ జ్వరం ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. చలి కారణంగా గుండె సమస్యలు పెరుగుతాయా? – రఘు, బిచ్కుంద చలిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. గుండె వ్యాధిగ్రస్తులు మందులు మానొ ద్దు. అకస్మాత్తుగా శ్రమించొద్దు. వారం రోజులుగా జలుబు, జ్వరం ఇబ్బంది పెడుతోంది.. – చిన్నాజీ, నిజామాబాద్ వైద్యుడిని సంప్రదించి మాత్రలు వాడండి, తగ్గకుంటే రక్త పరీక్షలు చేయించుకోవాలి. చలికాలంలో జలుబు, జ్వరం త్వరగా తగ్గే అవకాశం ఉండదు. ఉదయం వాకింగ్లో విపరీతమైన తుమ్ములు వస్తున్నాయి.. – అరవింద్, నిజామాబాద్ ఉదయం వాకింగ్కు వెళ్లే ముందు మాస్క్, క్యాప్ ధ రించండి. ఉన్ని దుస్తులు ధరించాలి. అలర్జీ ఉంటే తీవ్రమైన తుమ్మలు వచ్చే అవకాశం ఉంది. సరైన మందులు వాడితే తగ్గే అవకాశం ఉంటుంది. బీపీ పెరుగుతోంది.. – రమేశ్, నిజామాబాద్ చలి కారణంగా బీపీ పెరగడం, తగ్గడం జరగొచ్చు. బీపీ ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. ఒత్తిడికి గురికావొద్దు. తరచూ జ్వరం వస్తుండడంతోపాటు కాళ్లు, చేతులు లాగుతున్నాయి.. – సుమన్, కొరట్పల్లి తరచూ జ్వరం వస్తుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ జ్వరమా లేదా వైరల్ జ్వరమా అనేది తెలుస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గితే కాళ్లు, చేతులు లాగడం వంటి సమస్యలు వస్తాయి. ఆహారంలో ఎటువంటి మార్పులు అవసరం? – సునీత, కమ్మర్పల్లి వేడి ఆహారం, సూప్లు, పప్పులు, కూరగాయలు తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. మద్యం, పొగతాగడం మానుకోవాలి. రాత్రి సమయంలో తయారు చేసిన భోజనాన్ని మరుసటి రోజు ఉదయం తినొద్దు. నూనెపదార్థాలు వేడిచేయడం, ఆహారపదర్థాలను వేడి చేయడం మంచిదికాదు. చలి కారణంగా బీపీ పెరగొచ్చు.. తగ్గొచ్చు. మంచు కురిసే సమయంలో బయటికి వెళ్లొద్దు. సూర్యోదయం తరువాతే వాకింగ్ ఉత్తమం. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.. అంటూ ప్రజలకు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతిరావు సలహాలు, సూచనలు చేశారు. తిరుపతిరావుతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు సలహాలు తీసుకున్నారు. – నిజామాబాద్ అర్బన్/సుభాష్నగర్ వాకింగ్ చేయొచ్చా? – సత్యనారాయణ, నిజామాబాద్ సూర్యోదయం తరువాతే వాకింగ్ చేస్తే మంచిది. లేదా ఇంట్లోనే తేలికపాటి వ్యాయామం చే యాలి. చలితీవ్రంగా ఉన్న సమయంలో వాకింగ్కు వెళ్లకపోవడమే మంచిది. గుండెజబ్బులు ఉంటే బయటకు వెళ్లకపోవడమే మంచిది. చలి నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి సూర్యోదయం తరువాతే వాకింగ్ ఉత్తమం మంచు కురిసే సమయంలో మాస్క్ ధరించాలి గుండె వ్యాధులున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి ‘సాక్షి’ ఫోన్ ఇన్లో జీజీహెచ్ జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతిరావు -
జెండాబాలాజీ ఆలయంలో..
నగరంలోని శ్రీ జెండాబాలాజీ దేవస్థానంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పూజలు చేశారు. ఆలయంలో తెల్లవారుజామున స్వామికి గరుడవాహన సేవ, ఊరేగింపు నిర్వహించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో స్వామివారి సేవలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ ఆలయానికి మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వేణు, దేవాదాయ శాఖ పరిశీలకులు కమల, చైర్మన్ లవంగ ప్రమోద్ కుమార్, ధర్మకర్తలు వేముల దేవిదాస్, పోలకొండ నర్సింగ్రావు, సిరిపురం కిరణ్, కొర్వ రాజ్కుమార్, విజయ పాల్గొన్నారు. -
గోవింద.. గోవిందా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముక్కోటి ఏకాదశి పర్వదినం నేపథ్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో పోటెత్తాయి. అడుగడుగునా గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఇందూరు నగరంలోని ఉత్తర తిరుపతి ఆలయంలో మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి భక్తులకు ప్రవచనాలు చెప్పారు. సచ్చిదానంద స్వామి విలేకరులతో మాట్లాడారు. ప్రతిఒక్కరూ భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు విద్యాభ్యాసం విషయంలో ఏకాగ్రతతో వ్యవహరించాలన్నారు. స్మార్ట్ ఫో న్లకు అతుక్కుపోవద్దన్నా రు. ఫోన్లతో సైతం ఉప యోగాలు ఉంటాయని, వాటిని అవసరం మేర కు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందూ రులోని ఉత్తర తిరుపతి ఆలయం తిరుపతి ఆల యం మాదిరిగా నిర్మాణం చేశామన్నారు. ఇక్కడ వేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు దత్తాత్రేయ, ఆంజనేయస్వామి, లక్ష్మీ అమ్మవారు, శ్రీచక్రం ఉన్నాయన్నారు. అయోధ్య ఆలయం శైలిలో ఉత్తర తిరుపతి ఆలయ నిర్మాణం ఉందన్నారు. ప్రతి మనిషికి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి పరిజ్ఞానాన్ని మంచికి వాడాలన్నారు. పిల్లలను ఆధ్యాత్మికం వైపు నడిపేందుకు పెద్దలు కృషి చేయాలన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం కలుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటించాలన్నారు. కార్యక్రమంలో ఉత్తర తిరుపతి ఆలయ కమిటీ చైర్మన్ అనఘా సంపత్, గడీల శ్రీరాములు పాల్గొన్నారు. ఉత్తర తిరుపతి ఆలయంలో వేంకటేశ్వర స్వామిని పోలీసు కమిషనర్ పోతరాజు సాయిచైతన్య ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. సుభాష్నగర్ ఆలయంలో.. సుభాష్నగర్లోని శ్రీరామాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజూమున ఆలయం సమీప ప్రాంతాల్లో గరుడ వాహనంతో ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపు నిర్వహించారు. స్వామి ఊరేగింపు పల్లకి మోసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆలయ కమిటీ చైర్మన్ సరళ మహేందర్రెడ్డి, కార్యదర్శి శోభ నవీన్రెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. 40 ఏళ్లుగా ఆలయంలో ముక్కోటి ఉత్సవాలతో పాటు ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. ప్రవచిస్తున్న గణపతి సచ్చిదానందహోరెత్తిన వైష్ణవాలయాలు ముక్కోటి ఏకాదశికి పోటెత్తిన భక్తులు ఉత్తర తిరుపతి ఆలయంలో స్వామి గణపతి సచ్చిదానంద ప్రవచనాలు -
కోనాపూర్ హెచ్ఎంకు గణిత రత్న అవార్డు
కమ్మర్పల్లి: మండలంలోని కోనాపూర్ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం చౌడారపు రామ్ప్రసాద్ కు గణిత రత్న అవార్డు లభించింది. గణిత బోధనలో విశేష కృషి, టీచింగ్ లెర్నింగ్ మె టీరియల్ తయారీ, ఎస్ఎస్సీ పరీక్షల్లో వి ద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినందు కు గాను తెలంగాణ గణిత ఫోరం నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో గణిత రత్న అ వార్డు ప్రదానం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో విద్యాశాఖ అధికారి అశోక్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సంఘం కార్యవర్గం సుభాష్నగర్: జిల్లా వైద్యారోగ్యశాఖలో తె లంగాణ వైద్య, ఆరోగ్య ఉద్యోగుల సంఘం కార్యవర్గాన్ని నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం ఎన్నుకున్నారు. అంతకుముందు జిల్లా అధ్యక్షుడు ఘన్పూర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదు, యూనియన్ బలోపేతం, నూతన సంవత్సర క్యాలెండర్, జిల్లా కమిటీ ఎన్నిక, ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్ కార్యక్రమాలు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో సంచరించే ఉద్యోగులకు ఆన్లైన్ అటెండెన్స్ ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 30 ఏళ్లుగా ఏఎన్ఎంలకు ప దోన్నతులు లభించడం లేదని ప్రస్తావించా రు. అనంతరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్ వెంకటేశ్వర్లు, అసోసియేట్ అధ్యక్షులుగా ఏ యాదమ్మ, ఉపాధ్యక్షులుగా వీ ప్రవీణ్ రెడ్డి, బి బేబీరాణి, ఎం రవి గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా ఎం గంగామణి, పి మండోదరి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా జి విమలేశ్వరి, సోలోమన్ రాజ్, ఎస్ స్వామి, జి సురేష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎస్ శ్యామ ల, జి విజయ, ఈ సుధాకర్, టి రమేష్, డి మధుసూదన్ ఎన్నికయ్యారు. కొనసాగుతున్న రెల్వే డబుల్ ౖలైన్ పనులు ● ట్రాఫిక్కు అంతరాయం నవీపేట: డబుల్ రైల్వే లైన్ విస్తరణ పనులు కొనసాగడంతో మండల కేంద్రంలోని ప్రధా న రైల్వేగేటు సమీపంలో మంగళవారం ట్రా ఫిక్కు అంతరాయం కలిగింది. మేడ్చల్ –ముద్ఖేడ్ డబుల్ రైల్వే లైన్ పనులలో భాగంగా నవీపేట నుంచి బాసర వరకు మొ దటి దశ పనులు పూర్తి కానున్నాయి. జనవరిలో 13 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్పై రైలు పరుగెత్తనుంది. ఇరువైపులా లైన్ విస్తరణ పనులు పూర్తయ్యాయి. నవీపేట మండల కేంద్రంలో ట్రాక్ వద్ద పనులను మంగళవారం నిర్వహించారు. ట్రాక్ లెవల్, బీటీ భ ర్తీ పనులను నిర్వహించడంతో గేటును కొద్దిసేపు మూసేశారు. వాహనాల రద్దీతో ట్రాఫి క్కు అంతరాయం కలిగింది. పోలీసులు వా హనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. -
ఇలా త్రిపాఠి
జిల్లా కలెక్టర్గా ● వినయ్కృష్ణారెడ్డి బదిలీనిజామాబాద్ అర్బన్: జిల్లా కలెక్టర్గా ఇలా త్రిపాఠి నియమితులయ్యారు. మంగళవా రం రాష్ట్ర ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఇలా త్రిపాఠిని జిల్లాకు కేటాయించారు. ఆమె 2017 బ్యాచ్కు చెందిన ఐఏఎస్, ఇదివరకు పనిచేసిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్కు బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజ్గిరి , ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని అడిషనల్ కమిషనర్గా నియమించారు. వినయ్కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 13న జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆరు నెలల్లోనే అతి తక్కువ కాలంలోనే కలెక్టర్ బదిలీ కావడం విశేషం. ఇటీవల గ్రామ పంచా యతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించా రు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆకస్మిక బదిలీ జరిగింది. -
31 నుంచి బడాపహాడ్ ఉర్సు
వర్ని: బడాపహాడ్ ఉర్సు ఈ నెల 31 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు వక్ఫ్ బోర్డు డిప్యూటీ సూపరింటెండెంట్ జమాల్ తెలిపారు. మొదటిరోజు జలాల్పూర్ గ్రామంలో బడాపహాడ్ దర్గా పూజారుల ఇంటి నుంచి గంధాలను తీసుకొని మేళతాళాలు, నృత్యాల ఊరేగింపుతో బడాపహాడ్కు తీసుకువస్తారని పేర్కొన్నారు. మూడు రోజులపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కవ్వాలి, దీపారాధన నిర్వహిస్తామన్నారు. ఉర్సు సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉర్సుకు వచ్చే భక్తులకు తాగునీరు, ప్రత్యేక బస్సు, వైద్య శిబిరాలు, రాత్రి బస చేసేందుకు ప్రత్యేక గుడారాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బోధన్: బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బోధన్ సీడీపీవో తాళ్ల పద్మ నియామకమయ్యారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్గౌడ్ ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమా, నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు కరిపె రవీందర్, దారం భూమన్న, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ సంఘ బలోపేతం, సభ్యులు సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. బోధన్టౌన్(బోధన్): అక్రమ చలామణిలో పట్టుబడిన నిషేధిత గుట్కా, పాన్ మసాలా, చైనా మంజా, పేకాట కార్డులను న్యాయమూర్తి సమక్షంలో సోమవారం కోర్టు ఆవరణలో కా ల్చివేశారు. సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ శేష సాయి తల్ప ఆధ్వర్యంలో న్యాయ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు రూ.10వేల విలువజేసే నిషేధిత వస్తువులను దగ్ధం చేశారు. ప్రజా ఆరోగ్యానికి హానికలిగించే గుట్కా, పాన్ మసాలా, చైనా మంజాలు, పేకాట కార్డులను విక్రయించొద్దని సూచించారు. నిజామాబాద్అర్బన్: పోలీసు శాఖ ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గేలా కృషి చేస్తామని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం వంటి ఉల్లంఘనలపై విస్తృత అవగాహన కల్పి స్తామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాల లు, ప్రధాన జంక్షన్ల వద్ద అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. -
వడ్ల డబ్బులు తక్కువొచ్చాయని ఆందోళన
● మహిళా భవనాన్ని ముట్టడించిన రైతులు జక్రాన్పల్లి: కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధాన్యం డబ్బులు తక్కువగా వచ్చాయని పడకల్ రైతులు సోమవారం మహిళా భవనాన్ని ముట్టడించారు. గ్రామంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. సుమారు 54 లారీల ధాన్యాన్ని రైతులు నుంచి మహిళా సమాఖ్య సభ్యులు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2389 ప్రకారం రావాల్సిన డబ్బులు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. దీంతో మహిళా సమాఖ్య సభ్యులను నిలదీయగా తమకేమీ తెలియదని కొనుగోలు చేసేందుకు జక్రాన్పల్లి తండాకు చెందిన వ్యక్తిని నియమించుకున్నట్లు తెలపడంతో రైతుల్లో అనుమానాలు తలెత్తాయి. ఆగ్రహించిన రైతులు మహిళా సమాఖ్య భవనాన్ని ముట్టడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొనుగోలు కేంద్రం నిర్వాహకుడిని పిలిచి విచారించారు. రైస్మిల్లర్లు తరుగు పేరుతో క్వింటాలుకు 8 నుంచి 10 కిలోల చొప్పున కటింగ్ చేశారని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎకరానికి 40 బస్తాలు మాత్రమే తూకం వేయాలని సూచించిందని, అంతకన్నా ఎక్కువ ఉంటే వేరే రైతుల పేరు మీద తూకం వేశామని తెలిపారు. అందుకే డబ్బులు రావడంలో తికమక అయ్యిందని సదరు వ్యక్తి వివరణ ఇచ్చారు. మిల్లర్లతో మాట్లాడి నాలుగైదు రోజుల్లో డబ్బులు వచ్చేలా చేస్తానని చెప్పారు. పోలీసులు రైతులతో మాట్లాడి నాలుగైదు రోజులు ఓపికపట్టాలని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ విషయమై ఐకేపీ ఏపీఎం గంగాధర్ను వివరణ కోరగా ట్రాక్షీట్లను పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. -
సురక్షితమైన ఆహారంతోనే ఆరోగ్యం
తెయూ(డిచ్పల్లి): సురక్షితమైన ఆహారంతోనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం సురక్షితమై న ఆహారంపై తెయూలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన యాదగిరి మాట్లాడుతూ.. హాస్టల్స్ సిబ్బంది ఎల్లప్పుడూ విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు. చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ శుభ్రమైన రుచికరమైన ఆహారం అందించడంతో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సిబ్బంది విఽ దులు నిర్వహించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు సునీత,నవీత,ట్రైనర్ భావన హాస్టళ్లలో ఆహార త యారీ విధానాలు,పరిశుభ్రత, నిల్వ విధానం, భద్ర తా ప్రమాణాలపై అవగాహన కల్పించారు.వంటగదుల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా గ్లౌజులు, ఆ ప్రాన్స్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ని ర్వాహకులు భాష బాబు,వార్డెన్లు గంగాకిషన్, జ్యో త్స్న, కిరణ్ రాథోడ్, కేర్ టేకర్లు క్రాంతికుమార్, ది గంబర్ చౌహాన్, రమేశ్, సుభాన్ రావు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. వర్సిటీలో ఫుడ్ సేఫ్టీపై అవగాహన -
క్రైం కార్నర్
● పాతకక్షల నేపథ్యంలో గొడ్డలితో దాడినవీపేట: మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో బావపై బావమరిది గొడ్డలితో దాడి చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ సోమవారం తెలిపారు. లింగాపూర్ గ్రామానికి చెందిన గంధం శ్రీనివాస్ సోదరిని ఆశాజ్యోతి కాలనీకి చెందిన చెందిన హన్మాండ్లు కొన్నేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గుండారం గ్రామ శివారులోని మహంకాళి ఆలయంలో హన్మాండ్లు ఆదివారం బంధువులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో హన్మాండ్లుకు ఇతర వ్యక్తులతో స్వల్పంగా ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని బావమరిది గంధం శ్రీనివాస్కు ఫోన్లో చెప్పగా ఆయన స్నేహితులను తీసుకొనికి మహంకాళి ఆలయానికి వచ్చారు. కానీ అప్పటికే గొడవ సద్దుమణిగి అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. ఇంటికి వచ్చిన గంధం శ్రీనివాస్ బావ హన్మాండ్లుకు ఫోన్ చేసి తాగిన మైకంలో దూషించాడు. ఇరువురు గొడవపడగా పాతకక్షలను దృష్టిలో ఉంచుకొని హన్మాండ్లు తల, వీపుపై గంధం శ్రీనివాస్ గొడ్డలితో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన హన్మాండ్లును ఆస్పత్రికి తరలించామని, బాధితుడి భార్య రూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. దోమకొండ: చేపలవేటకు వెళ్లిన యువకుడు నీటమునిగి మృతిచెందిన ఘటన దోమకొండ మండలం కోనాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెంట స్వామి(40) రోజూ మాదిరిగా గ్రామ శివారులోని ఎగువ మానేరు నీటిలో చేపలవేటకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. రాత్రి ఒడ్డు వద్దకు శవం కొట్టుకువచ్చింది. మృతుడి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
నిజామాబాద్
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025● జక్రాన్పల్లి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి 2021లో గ్రీన్సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా (డిసెంబర్లో) కొత్తగా కొర్రీలు పెట్టింది. స్థలం అనుకూలంగా ఉన్నప్పటికీ రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం కావాలని చెప్పడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజకీయ, విద్యా రంగాల్లో కీలక మలుపులు చోటు చేసుకున్న 2025 సంవత్సరానికి జిల్లా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉండిపోనుంది. జిల్లాకు వ్యవసాయ, ఇంజినీరింగ్ కళాశాలలు, ధర్మపురి – కొండగట్టు – వేములవాడ – లింబాద్రిగుట్ట – బాసర పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ రహదారి కోసం నిధులు మంజూరయ్యాయి. అయితే జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న జక్రాన్పల్లి ఎయిర్ పోర్టుకు కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టడం నిరాశకు గురి చేసింది. రాజకీయాలకు వస్తే సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్రెడ్డి కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కాగా.. కేసీఆర్ తనయ బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన 2025 ఏడాది జిల్లాపై ప్రత్యేక ముద్రవేసి వెళ్లిపోతోంది.. గేయ రచయితకు రాష్ట్రస్థాయి బహుమతి ధర్పల్లి: మండల కేంద్రానికి చెందిన గేయ రచయిత సాయికుమార్ రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో మొదటి బహుమతి సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ తెలంగాణ సాంస్కృతి సంప్రదాయ పాటల్లో భాగంగా రాష్ట్రస్థాయిలో 500 మంది రచయితలు పోటీపడగా, సాయికుమార్ రచించిన పాటకు మొదటి బహుమతికి ఎంపికయ్యింది. సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిర్మాత దిల్రాజు చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. చైనామాంజా వినియోగిస్తే కఠిన చర్యలు నిజామాబాద్అర్బన్: చైనా మాంజా వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమ వారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మాంజా కారణంగా వ్యక్తులకు ప్రాణహాని కలిగిస్తే హత్యానేరం కింద కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మనుషులు, జంతువుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్న కారణంగా చైనామాంజా వాడకం పూర్తిగా నిషేధించడం జరిగిందని తెలిపారు. చైనా మాంజా విక్రయించినా, కొనుగోలు చేసినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు చైనా మాంజా తీసుకువచ్చినట్లు సమాచారం ఉందని, దాడులు చేసి బాధ్యులను పట్టుకుంటామన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. సాఫ్ట్బాల్ చాంపియన్గా నిజామాబాద్ సుభాష్నగర్: మెదక్ జిల్లా మనోహరాబాద్లో ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ 10వ సబ్ జూనియర్ బాలుర చాంపియన్షిప్గా నిజామాబాద్ జట్టు నిలిచిందని సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి ప్రభాకర్రెడ్డి, మర్కంటి గంగామోహన్ సో మవారం తెలిపారు. ఫైనల్లో మెదక్ జిల్లా జట్టుపై 2–1 పరుగుల తేడాలో విజయం సాధించిందన్నారు. టోర్నీలో బెస్ట్ ఆల్ రౌండర్గా రేవంత్ నిలిచి బహుమతి అందుకున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, సాఫ్ట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్బాబు, రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు అభిషేక్ గౌడ్ తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా జట్టుకు కోచ్, మేనేజర్లుగా అనికేత్, తిరుపతి వ్యవహరించారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాపై 2025 సంవత్సరం చెరగని ముద్రవేసి కాలగర్భంలోకి వెళ్లిపోతోంది. ఈ ఏడాది అనేక కీలక పరిణామాలు, మా ర్పులు చోటు చేసుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా.. రాజకీయాలు అనుకోని మలుపులు తిరిగాయి. 2012లో రోస్టర్ నిబంధనలను తుంగలో తొక్కి తెలంగాణ యూనివర్సిటీలో భర్తీ చేసిన అధ్యాపక పోస్టులను రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయంస్థానం నవంబర్లో తీర్పునిచ్చింది. తక్షణమే కొత్త నోటిఫికేషన్ వేయాలని జారీ చేసుకోవచ్చని సూచనలు చేసింది. ఉత్తర తెలంగాణలో ప్రధానమైన ధర్మపురి – కొండగట్టు – వేములవాడ – లింబాద్రిగుట్ట – బాసర పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ రహదారి కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్లో నిధులు మంజూరు చేసింది. మొదటి దశలో నిజామాబాద్ – 1 సర్కిల్లోని 15 రోడ్లను అభివృద్ధి చేసేందుకు గాను రూ.412.33 కోట్లు, నిజామాబాద్ – 2 సర్కిల్లో మరో 15 రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.243.69 కోట్లు నిధులు మంజూరు చేస్తూ జీవో ఎంఎస్ 76ను ఈ నెల 13న జారీ చేసింది. రోడ్ల నిర్మాణాన్ని హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) విధానంలో చేపట్టనున్నారు. జిల్లా పరిధిలోని పలు రోడ్లు మరింత అభివృద్ధి కానున్నాయి. వీటిలో 8 ముఖ్యమైన రహదారులు ఉన్నాయి. డిసెంబర్లో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడ్డాయి. 362 గ్రామాల్లో కాంగ్రెస్, 76 గ్రామాల్లో బీఆర్ఎస్, 47 గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు, 60 గ్రామాల్లో స్వతంత్రులు సర్పంచులుగా విజయం సాధించారు. డీసీసీబీ, సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేస్తూ డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంతో జిల్లాలో 89 సహకార సంఘాల పాలకవర్గాల సభ్యులు ఇంటికెళ్లాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రభుత్వం జిల్లాకు వ్యవసాయ, ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. జూలైలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. 211 మంది టీచర్ల సర్దుబాటు పూర్తి చేశారు. పీఎంశ్రీ నిధుల వినియోగంలో అవకతలకు జరిగాయని ఏసీబీ అధికారులు నవంబర్లో పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. భూభారతి చట్టం అమలులోకి వచ్చిన తరువాత జిల్లాలో భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. పరిష్కారం ప్రక్రియ నడుస్తోంది. రెవెన్యూ శాఖలో జీపీవోల నియామకం చేపట్టారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు వెళ్లిన తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు తిరిగి జిల్లాకు వచ్చారు. వైద్యారోగ్య శాఖలో నవంబర్లో అవుట్ సోర్సింగ్విధానంలో ఏఎన్ఎంలను నియమించారు. వర్ని మండలం సిద్ధాపూర్ చుట్టుపక్కల 13 గ్రామాల రైతులకు సాగునీరందించేందుకు చేపట్టిన సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపంతో నిలిచిపోయాయి. 2022లో రూ.72 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా, అటవీశాఖ అనుమతులు నిరాకరించడంతో 20 శాతం పనులు అయిన తరువాత నిలిచిపోయాయి. ఇది పూర్తయితే 10వేల ఎకరాలకు సాగునీరందుతుంది. నిజాంసాగర్ కాలువ ఎగువ భాగంలోని నాన్ కమాండ్ ఏరియా వ్యవసాయ భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో జాకోరా, చందూర్, చింతకుంట వద్ద నిజాంసాగర్ కాలువ నుంచి నీరు అందించాలన్న లక్ష్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 2022 సంవత్సరంలో రూ.106 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ మూడు లిఫ్టులు పూర్తయితే 9వేల ఎకరాలకు సాగునీరందుతుంది. పొద్దుటూరి సుదర్శన్రెడ్డికి పెద్ద పదవి బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ జిల్లాలకు వ్యవసాయ, ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరు ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ పోరు జక్రాన్పల్లి విమానాశ్రయానికి కేంద్రం కొర్రీలు తెయూలో అక్రమ నియామకాలు రద్దు బాక్సింగ్లో ప్రపంచ చాంపియన్గా నిఖత్ జరీన్ జిల్లాపై 2025 సంవత్సరానికి ప్రత్యేక ముద్ర -
ఆదర్శం ఎల్లారెడ్డిపల్లె
ఇందల్వాయి : రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతోపాటు గ్రామస్తుల ప్రాణాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మండలంలోని ఎల్లారెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్న ఆలోచన చేసింది. గ్రామ ముఖద్వారం వద్ద ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి హెల్మెట్లను అందుబాటులో ఉంచింది. గ్రామం నుంచి ద్విచక్ర వాహనాలపై బయటికి వెళ్లే వారు రూ.10 చెల్లించి హెల్మెట్ తీసుకెళ్లి తిరిగి వచ్చిన తరువాత తిరిగి ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. ద్విచక్ర వాహనదారుల ప్రాణాల రక్షణ కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సర్పంచ్ మఠముల సుజాత తెలిపారు. కార్యక్రమాన్ని ఎస్సై సందీప్ సోమవారం ప్రారంభించి గ్రామస్తులను అభినందించారు. వీడీసీ సభ్యులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. -
అందుబాటులో యూరియా నిల్వలు
● రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు ● కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి నిజామాబాద్అర్బన్: జిల్లాలో ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్లో పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి భరోసా కల్పించారు. సోమవారం ఆయన మండలాల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా ఎరువుల పంపిణీ జరిగేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అన్ని సహకార సంఘాలలో యూరియా సహా ఇతర ఎరువులు అందుబాటులో ఉంచామని, పంట సాగు చేస్తున్న ప్రతి రైతుకు అందేవిధంగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో జిల్లాలో 82,055 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అవసరం ఉండగా, 51,091 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు 38,993 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామన్నారు. మరో 12,097 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువు 32,057 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1580 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1460 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయన్నారు. పంపిణీ కేంద్రాల వద్ద షామియానాలు ఏర్పాటు చేస్తూ, ఉదయం 6.00 గంటల నుంచే పంపిణీ ప్రారంభం అయ్యేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పారదర్శకంగా యూరియా ఎరువుల పంపిణీకి రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి తెచ్చిందని, రైతు సోదరులు, డీలర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతులకు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే విషయంలో ఇబ్బంది తలెత్తకుండా వ్యవసాయ, సహకార శాఖలతో పాటు ఇతర శాఖల సిబ్బందిని పంపిణీ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుతామని అన్నారు. అదేవిధంగా ప్రతి యూరియా విక్రయ కేంద్రంలో యూరియా బుకింగ్ యాప్కు సంబంధించిన క్యూ.ఆర్ కోడ్ను స్పష్టంగా ప్రదర్శిస్తారని తెలిపారు. తద్వారా రైతులు సులభంగా యాప్ను డౌన్లోడ్ చేసుకొని బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే ఒకేసారి యూరియా కొనుగోలు చేయకుండా, శాసీ్త్రయ పద్ధతిలో అవసరానికి సరిపడా మాత్రమే వినియోగించాలని కలెక్టర్ రైతులను కోరారు. యూరియా పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపైనా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. -
ప్రజావాణికి ప్రాధాన్యమివ్వాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● 93 ఫిర్యాదుల స్వీకరణ నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 93 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్కు వివరించారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. -
కళాభవన్కు నిధులు మంజూరు చేయాలి
సుభాష్నగర్: నిజామాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న కళాభవన్ (కళాభారతి) పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, జీరో అవర్లో ధన్పాల్ మాట్లాడారు. రూ.116 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు గత ప్రభుత్వ హయాంలో కళాభారతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, కేవలం రూ.50 కోట్ల మాత్రమే విడుదల కావడంతో పనులు నిలిచిపోయాయని వివరించారు. కాంట్రాక్టర్కు బకాయిలు పెండింగ్లో ఉండటం, అంచనాలు మారడం కారణంగా రూ.70 కోట్లకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు మిగిలిన నిధులను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలి కమ్మర్పల్లి(భీమ్గల్): బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల జీరో అవర్లో ఆయన.. భీమ్గల్ మున్సిపాలిటీలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనుల పురోగతి, బిల్లుల చెల్లింపు అంశాలపై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 100 పడలక ఆస్పత్రి మంజూరు కాగా.. 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు పూర్తికాకపోవడంతో సిబ్బంది వేరే దగ్గర సర్దుకుని పని చేయాల్సి వస్తోందని వివరించారు. పనులు పూర్తి చేస్తే పేదలకు ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా దృష్టికి తీసుకెళ్లారు. -
95531 30597 / 91544 03633
నేడు డాక్టర్ జలగం తిరుపతిరావుతో సాక్షి ఫోన్ ఇన్చలి తీవ్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతిరావు వివరించనున్నారు. చలి కారణంగా జ్వరాల బారిన పడిన వారు వైద్య సలహాలు, సూచనల కోసం తిరుపతిరావుతో సాక్షి ఫోన్ఇన్ లో మాట్లాడవచ్చు.సమయం : ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకుజలగం తిరుపతిరావు ఫోన్ చేయాల్సిన నంబర్: -
రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
నెలలో రెండో ఘటన నిజామాబాద్అర్బన్: జిల్లాలో చైన్స్నాచింగ్ ఘటనలు మళ్లీ పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే జిల్లా కేంద్రంలో రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో మహిళలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. తెల్లవారుజామున ముసుగు ధరించుకొని బైక్లపై వస్తున్న దుండగులు జనంలేని ప్రాంతాల్లో ఉండే మహిళల బంగారు గొలుసులు లా క్కెళ్తున్నారు. వారం రోజుల క్రితం వినాయక్నగర్, కసాబ్గల్లీలో అడ్రస్ అడుగుతూ మహిళల మెడలో ని పుస్తెలతాడును లాకెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు విచారణ చేస్తుండగా, తాజాగా సోమవారం సుభాష్నగర్ ఎస్బీఐ బ్యాంక్ వెనుక ప్రాంతంలో ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి ఇంటి వద్ద పూలు తెంపుతున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి రెండు తులాల బంగారు చైన్ లాక్కెళ్లారు. క్లూ దొరికింది.. సుభాష్నగర్లో జరిగిన ఘటనకు సంబంధించి చైన్ స్నాచర్ల క్లూ దొరికింది. త్వరలోనే పట్టుకుంటాం. మిగతా రెండు కేసుల్లో విచారణ వేగంగా జరుగుతోంది. బంగారం రేటు పెరగడంతోనే చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి. మహిళలు అప్రమత్తంగా ఉండాలి. – రాజావెంకటరెడ్డి, ఏసీపీ, నిజామాబాద్సంవత్సరం చోరీలు పోలీసులు ఛేదించినవి 2022 26 13 2023 40 18 2024 37 07 2025 17 13 జిల్లా జరిగిన చైన్స్నాచింగ్లు -
ఆర్మూర్లో సైకత శిల్పాలు
● దశావతారాలతో ప్రదర్శనకు సిద్ధం ● నేడు ప్రారంభించనున్న అగ్గు మహరాజ్ ● రాష్ట్రంలోనే మొదటిసారిగా సైకత శిల్పాల ప్రదర్శన ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో విష్ణుమూర్తి దశావతారాలతోపాటు వినాయకుడు, అనంత పద్మనాభ స్వామి సైకత (ఇసుక) శిల్పాలు ఆధ్యాత్మిక శోభ ఉ ట్టిపడేలా కనువిందు చేయనున్నాయి. వైకుంఠ ఏ కాదశి సందర్భంగా ఈ నెల 30వ తేదీ మంగళ వారం సైకత శిల్పాల ప్రదర్శన ప్రారంభం కానున్నది. పట్టణానికి చెందిన విజయ్ అగర్వాల్, లావణ్య (లావణ్య టూర్స్ అండ్ ట్రావెల్స్) సంయుక్తంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా సైకత శిల్పాల ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. విజయవాడకు చెందిన సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వర ప్రసాద్ను ప్రత్యేకంగా పిలిచి పది రోజులుగా సైకత శిల్పాలను రూపొందిస్తున్నారు. మహాలక్ష్మి కాలనీలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రజలు, విద్యార్థులు సందర్శించేందుకు అందుబాటులో ఉంచారు. విష్ణుమూర్తి దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరుశురామ, రాముడు, కృష్ణుడు, బలరాముడు, కల్కి అవతారాలను కళ్లకు కట్టినట్లుగా ఇసుకతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. అమ్దాపూర్ నర్సింహస్వామి ఆలయ అగ్గు మహరాజ్ మంగళవారం ప్రదర్శనను ప్రారంభించనున్నారు. దశావతారాల ప్రదర్శనతో పట్టణంలో ఆధ్యాత్మికత ఉట్టి పడుతుందనే నమ్మకంతో నా సోదరుడి సహాయంతో సైకత శిల్పాల ప్రదర్శనను ఏర్పాటు చేశాం. నామ మాత్రపు ఎంట్రీ టికెట్ చెల్లించి వీక్షకులు ఈ ప్రదర్శనను నెల రోజుల పాటు చూసి అలరించవచ్చు. – లావణ్య, శిబిరం నిర్వాహకురాలు, ఆర్మూర్ రాష్ట్రంలో మొదటిసారిగా సైకత శిల్పాలతో దశావతారాల ప్రదర్శన నిర్వహిస్తున్నందన ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సందర్భం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని బీచ్లలో సోషల్ అవేర్నెస్ కల్పిస్తూ సైకత శిల్పాలు రూపొందించాను. – ఆకునూరి బాలాజీ వరప్రసాద్, సాండ్ ఆర్టిస్ట్, విజయవాడ -
వన్యప్రాణులను వేటాడొద్దు
నందిపేట్(ఆర్మూర్):అడవులు, వన్యప్రాణుల రక్ష ణ అత్యంత కీలకమని, వన్యప్రాణులను వేటాడ డం నేరమని నందిపేట ఫారెస్టు డిప్యూటీ రేంజ్ అఽ దికారి సుధాకర్ సూచించారు. మండలంలోని అ యిలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం అట వీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ సమతుల్యత,అటవీ సంరక్షణ అవసరం,వన్యప్రాణుల ప్రా ధాన్యత,చట్టాలఅమలు,ప్రజల బాధ్యతను సుధాకర్ క్షుణ్ణంగా వివరించారు.ప్రకృతిలో పాముల పాత్రను ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా స్నేక్ స్నాచర్లు షేక్ మున్నా, అంజాద్ వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ,హెచ్ఎం లాలయ్య, జూనియర్ కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, సాయాగౌడ్, శ్రీకాంత్, సీఆర్పీ రాజు పాల్గొన్నారు. ● జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ కమ్మర్పల్లి: రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులు, క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలందించేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని 108 నిజామాబాద్, నిర్మల్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్దన్ సూచించారు. ఆయన సోమవారం కమ్మర్పల్లిలో 108 అంబులెన్స్ వాహనాన్ని, రికార్డులను తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న మందులు, వైద్య పరిక రాలు వాటి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అ నంతరం జనార్దన్ మాట్లాడుతూ గర్భిణులను ప్ర సవ సమయంలో ఆస్పత్రికి అంబులెన్స్లోనే తర లించేలా క్షేత్రస్థాయి వైద్య సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాహనాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జిల్లా కో ఆర్డినేటర్ స్వరాజ్, 108 సిబ్బంది ఈఎంటి జగదీశ్, పైలెట్ శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు. -
విజేతలకు చాంపియన్షిప్ ట్రోపీలు ప్రదానం
సుభాష్నగర్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన క్రాస్ కంట్రీ, కిడ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలకు నాగారంలోని రాజారాం స్టేడియంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నరాల రత్నాకర్, రాజాగౌడ్ మెడల్స్, చాంపియన్షిప్ ట్రోపీలను అందజేశారు. అండర్–8 విభాగంలో సిద్ధార్థ హైస్కూల్ (నందిపేట్), జీఎఫ్ఎస్ పాఠశాల (వన్నెల్–కే), అండర్ – 10 విభాగంలో విజయ్ హైస్కూల్ (నిజామాబాద్), మల్లారెడ్డి పాఠశాల (వర్ని), అండర్ – 12 విభాగంలో ఎంజేపీ బాయ్స్ (రాంపూర్), టీఎస్డబ్ల్యూఆర్ఎస్జేసీ బాయ్స్ (పోచంపాడ్), అండర్ –14 విభాగంలో వెక్టర్ పాఠశాల (నిజామాబాద్), ఎంజేపీ బాలికలు (బాల్కొండ) చాంపియన్షిప్ ట్రోపీలను అందుకున్నాయి. అనంతరం ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్ మాట్లాడుతూ జనవరి 2న రంగారెడ్డి జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు క్రాస్ కంట్రీ జట్టును ఎంపిక చేసి పంపించామన్నారు. జనవరి 18న ఆదిలాబాద్లో జరగబోయే కిడ్స్ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలకు పంపించామని తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
బంగారు ఆభరణాల కోసమే వృద్ధురాలి హత్య
● నిందితుడి పట్టివేత ● ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పొల్కంపేట గ్రామానికి చెందిన నరేంద్రుల సులోచన హత్య కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. నిందితుడు పొల్కంపేట గ్రామానికి చెందిన ముద్రబోయిన కుమార్ బంగారు ఆభరణాల కోసమే ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. లింగంపేట పోలీస్ స్టేషన్లో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఇంట్లో వృద్ధురాలు సులోచన ఒంటరిగా ఉన్న విషయం గమనించిన కుమార్ ఇంటి వెనుక ఉన్న తలుపును పైకి లేపి ఇంట్లోకి చొరబడ్డాడు. వృద్ధురాలు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అపహరించి ఆమెను తీవ్రంగా గాయపర్చి హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు ఆదివారం ఉదయం తన ఇంట్లో దాచిన బంగారు ఆభరణాలను తీసుకెళ్లడానికి వచ్చిన క్రమంలో అతడిని పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి పుస్తెలతాడు, కమ్మలు, ఉంగరం, బంగారు గాజులు (సుమారు నాలుగు తులాలు) స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడు గతంలో చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడని తెలిపారు. పని చేయకుండా ఆవారాగా తిరిగేవాడన్నారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. లింగంపేట ఎస్సై దీపక్కుమార్, సీబ్బంది రమేశ్, సంపత్, జవ్వినాయక్, లీక్యానాయక్, మదన్లాల్లను జిల్లా ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించినట్లు తెలిపారు. -
అన్నను చంపిన తమ్ముడి అరెస్టు
భిక్కనూరు: మండలంలోని మోటాట్పల్లి గ్రామంలో అన్నను చంపిన తమ్ముడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు భిక్కనూరు సీఐ సంపత్కుమార్, ఎస్సై అంజనేయులు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఆదివారు వారు విలేకరులతో మాట్లాడారు. మోటాట్పల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల రాజు తన సమీప బంధువువైన మహిళతో వివాహేతర సంబందం పెట్టుకోవడంతో తన తమ్ముడు శివకుమార్కు పెళ్లి సంబంధాలు రావడంలేదు. అలాగే ఖరీఫ్ పంటకు సంబంధించిన డబ్బులను రాజు దుబార చేస్తున్నాడు. దీంతో అన్నపై కోపంతోనే హత్య చేసినట్టు తమ్ముడు ఒప్పుకున్నాడు. ఈమేరకు నిందితుడు శివకుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ,ఎస్సైలు వివరించారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జక్రాన్పల్లి: మండలంలోని తొర్లికొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని ర్యాపాన్ గంగోత్రి జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు పీడీ గంగామోహన్ తెలిపారు. ఈ నెల 26 నుంచి 28 వరకు మంచిర్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–19 సాఫ్ట్బాల్ పోటీల్లో గంగోత్రి ప్రతిభ కనబర్చి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జనవరిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుందని పీడీ తెలిపారు. గంగోత్రిని ఇన్చార్జి ఎంఈవో, హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు. నిజామాబాద్ రూరల్: యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి అన్నారు. నగరంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన హాజరై, మాట్లాడారు. రాష్ట్ర ప్ర భుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలన్నారు. అనంతరం సర్పంచులుగా ఎన్నికై న యూత్ కాంగ్రెస్ నాయకులను సన్మానించారు. జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్చార్జిలు అల్మాస్ ఖాన్, వినోద్, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నరేందర్ గౌడ్, రాజు గౌడ్, ఆదిత్య, అబ్బోల్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమ ని, వారి భవిష్యత్ నిర్మాణానికి గురువులే పునా ది అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలో ఆదివారం స్టేట్ టీ చర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలను మంచి పౌరులుగా తయారు చేయడమే ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. సంఘ ప్రతినిధులు శ్రీకాంత్, ధర్మేందర్, బెల్లాల్ శ్రీనివాస్, మహేశ్వర్, యాదగిరి, సాయి తేజ, కృష్ణ విజయ సారధి, రత్నాకర్, సురేష్ కుమార్, గోలి ప్రకాష్, శ్రీనివాస్ కిషన్, గణేష్ భూపతి రాజు, అబ్బాయా, యూసఫ్ పాల్గొన్నారు. -
అద్దె అరకలకు డిమాండ్
నిజాంసాగర్(జుక్కల్): యాసంగి సీజన్లో ఆరుతడి పంటల సాగుకు అద్దె అరకలకు డిమాండ్ పెరిగింది. ఒక్క రోజుకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తూ ఆరు తడి పంటల సాగు పనులను రైతులు పూర్తి చేసుకుంటున్నారు. మహమ్మద్నగర్ మండలంలోని సింగితం, తెల్గాపూర్, శేర్ఖాన్పల్లి, శనివార్పేట గ్రామాల్లో ఆరుతడి పంటలు జోరుగా సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో నాగలి, ఎడ్లు లేకపోవడంతో ఆరుతడి పంటల సాగుకు అద్దె అరకల కోసం రైతులు వెతుకులాడుతున్నారు. మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడప్గల్ ప్రాంతాల్లో ఉన్న ఎడ్లను అద్దెకు తీసుకు వచ్చి ఆరుతడి పంటలు సాగు చేయడంలో రైతులు నిమగ్నం అవుతున్నారు. నాగటేడ్లకు రోజుకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తున్నారు. అంతేకాకుండా నెలకు రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు ఎడ్లకు అద్దె ఇస్తూ పంటల సాగుపై రైతులు దృష్టి సారించారు. గ్రామాల్లో పశువుల సంతతి రోజురోజుకు కనుమరుగవడంతో రైతులకు వ్యవసాయం కష్టంగా మారింది.


