breaking news
Nizamabad District News
-
సంక్షిప్తం
బడిలో వంటగది ప్రారంభం ధర్పల్లి: మండలంలోని దుబ్బాక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన వంటగది షెడ్ను ప్రారంభించారు. ఏఐపీఎస్ చైర్మన్ సౌజన్య, వీడీసీ చైర్మన్ నరేష్ గౌడ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పోతన్న, మాజీ ఉపసర్పంచ్ ప్రతాప్ గౌడ్, హెచ్ఎం చంద్రకాంత్, జీపీ సెక్రెటరీ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం గ్రామానికి చెందిన పోతుగంటి నవీన్ అనే యువకుడు మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించాడు. దాతను ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు అభినందించారు. దాడి ఘటనలో నలుగురిపై కేసు నమోదు మోపాల్: మండలకేంద్రంలో ఇంటి స్థలం విషయంలో జరిగిన దాడి ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుస్మిత శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన బండమీది మధు తన పాత ఇల్లు కూల్చి అదే స్థలంలో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఈనెల 8న సాయంత్రం మధు వద్దకు గ్రామానికి చెందిన ఎల్లోల్ల రాజశేఖర్రెడ్డి, అతడి అన్న నరేష్రెడ్డి, తండ్రి ఎల్లోల్ల నారాయణరెడ్డి, తల్లి లక్ష్మీ వచ్చారు. ఈ స్థలం తమదంటూ మధు, వాళ్ల నాన్న బుచ్చన్నపై దాడి చేశారు. చంపేస్తామని బెదిరింపులకు దిగారు. అనంతరం మధు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కుల బహిష్కరణ, బెదిరింపుపై విచారణ మోపాల్: మండలంలోని సింగంపల్లిలో పల్లికొండ పోశెట్టిని కుల బహిష్కరణతోపాటు చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రావడంతో ఎస్ఐ సుస్మిత శుక్రవారం విచారణ చేపట్టారు. పల్లికొండ రమేష్ తమ అన్నదమ్ముళ్లపై కక్ష గట్టి కుల బహిష్కరణ చేశారని, అన్నదమ్ముళ్లను తనను చంపేందుకు రెచ్చగొడుతున్నాడని పోశెట్టి ఇటీవల పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గ్రామానికి వెళ్లిన ఎస్సై దర్యాప్తు చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్సై సుస్మిత పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ను కలిసిన కై సర్ నిజామాబాద్ సిటీ: హైదరాబాద్లో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను జిల్లా కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ కై సర్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. క్యాన్సర్తో కానిస్టేబుల్ మృతి ఖలీల్వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బొంగేవారు అనిల్ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అతడు క్యాన్సర్తో బాధపడుతుండగా, పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందాడు. అనిల్కు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. -
ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
నిజామాబాద్ రూరల్: నగరంలోని దుబ్బ గుమాస్తాకాలనీలోగల దుర్గాదేవి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయ ణ అన్నారు. ఆలయ ఆవరణలో శుక్రవారం రాత్రి నూతన ఆలయ కమిటీ ప్రమాణస్వీకారోత్సవం ని ర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్కులచారి, నుడా చైర్మన్ కేశవేణు హాజరై, నూతన కా ర్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5లక్షలు, తనవంతుగా లక్ష రూపాయలు అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. నూతన కార్యవర్గం.. దుర్గాదేవి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా అమంద్ వి జయ్కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా బోడికె బాబురా వు, కోశాధికారులు ధాత్రిక వేణుగోపాల్, లవంగ సదాశివ్, ఉపాధ్యక్షులుగా మాడురి కిషన్, గంగోనె సంతోష్, గంగోనె అనిల్, కార్యదర్శులుగా అమంద్ వెంకటేశ్, అమంద్ రాకేష్, కార్యవర్గ సభ్యులుగా అ జ్జన్ దుబ్బయ్య, నిచ్చంగ దానాజీ, గంగోనె ఊష న్న, గంగోనె సంతోష్, గంగోనె శ్రీనివాస్, దాత్రిక ప్రవీణ్, మహిపాల్, పొలాస రామకృష్ణ, పాండ్రవీసం హరీష్కుమార్, గౌరవ అధ్యక్షులుగా ఆకుల సందీప్, జోగిని మల్లేష్యాదవ్, గౌరవ సలహాదారులుగా భీమన్న, రాజేందర్ ఎన్నికయ్యారు. -
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
నగరంలోని డీసీసీబీ కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న కుంట రమేష్రెడ్డి సాక్షి నెట్వర్క్: నిజామాబాద్ జిల్లాకేంద్రంతోపాటు అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో శుక్రవారం స్వా తంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, గ్రామాల్లో వీధివీధినా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అన్ని ప్రభుత్వ శాఖల కా ర్యాలయాలు, విద్యాసంస్థలు, వివిధ పార్టీల కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పలు సంఘాల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. విద్యాసంస్థల్లో కొందరు విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పాఠశాలల యాజమాన్యాలు ఇటీవల విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
ఘనంగా తీజ్ వేడుకలు
డిచ్పల్లి: మండలంలోని నడిపల్లితండాలో శుక్రవారం తీజ్ పండుగను తండావాసులు ఘనంగా జరుపుకున్నారు. తొమ్మిది రోజులపాటు భ క్తిశ్రద్ధలతో పూజించిన గోధుమ మొలకల బు ట్టలను యువతులు నెత్తిన ధరించి, ఊరేగింపు నిర్వహించారు. ఈసందర్భంగా మహిళలు, యువతులు బంజారా సంప్రదాయ ఆటపాట లతో అలరించారు.అనంతరం గోధుమ బుట్టలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. నిజామాబాద్ రూరల్: మండలంలోని కేశాపూర్ గ్రామ ఊర చెరువును తహసీల్దార్ అనురుద్, ఎంపీడీవో రాంనారాయణ, ఉన్నత అధికారులు శుక్రవారం పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో చెరువులను, కుంటలను లోతట్టు ప్రాంతలను పరిశీలించినట్లు వారు తెలిపారు. జిల్లాకు వచ్చే రెండు రోజులు సైతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ నాయకులు మహెంధర్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు. నిజామాబాద్ రూరల్: నగరంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కరపత్రాలను ఇ స్కాన్ కంఠేశ్వర్ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా కేంద్రం నిర్వాకులు రామానందరాయ గౌరదాస్ మాట్లాడుతూ..నగరంలోని ఆర్మూర్ రోడ్డులోగల శ్రీలక్ష్మీ కల్యాణ మండపంలో ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో శనివా రం శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మాదాసు స్వామి యాదవ్, నీతాయి చంద్ ప్ర భు, బలరాంప్రభు, రామానందగోపేస్ ప్రభు, ప్రాణప్రియ ప్రభు, సర్వానంతప్రభు ఉన్నారు. డిచ్పల్లి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక సహకార సంఘాల (సొసైటీ) చైర్మన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం సొసైటీ చైర్మన్లు, పాలకమండలి పదవీకాలం 6 నెలలు పొడిగించినందుకు వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసి, సత్కరించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ నల్లా చంద్రశేఖర్రెడ్డి, డైరక్టర ఆనంద్, సొసైటీ చైర్మన్లు చింత శ్రీనివాస్రెడ్డి, చింతలపల్లి గోవర్ధన్రెడ్డి, నాగేశ్వరరావు, నిమ్మ మోహన్రెడ్డి, శ్రీదర్, జన్నారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ సిటీ: నగర మున్సిపాలిటీలో ఉ త్తమ ప్రతిభ కనపరిచిన, అంకితభావం, సేవాదృక్పథంతో విధులు నిర్వహించిన పలువురు అధికారులు, సిబ్బందికి శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ప్రశంసాపత్రా లు అందజేశారు. అనంతరం వారిని కమిషనర్ దిలీప్కుమార్ అభినందించారు. మున్సిపల్ డీ ఈ సుదర్శన్రెడ్డి, ముస్తాక్ అహ్మద్, టీపీఆర్వో చిదుర రమేష్తోపాటు పారిశుధ్య సిబ్బంది న ర్సయ్య, ఆంజనేయులు, పుష్ప, ఒడ్డెమ్మ, సైదు లు, విజయలక్ష్మి ఉన్నారు. సౌండ్ బాక్స్ వితరణ ధర్పల్లి: మండలంలోని దుబ్బాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు శుక్రవారం గ్రామానికి చెందిన పిప్పెర ప్రతాప్ గౌడ్, ప్రసాద్ గౌడ్, ప్రశాంత్ గౌడ్ సౌండ్ బాక్స్ సిస్టం అందజేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కవిత, వీడీసీ చైర్మన్ నరేష్ గౌడ్, హెచ్ఎం శశికళ ఉన్నారు. -
ఉత్తమ సేవలకు ప్రశంసలు
స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ప్రశంసాపత్రాలను అందజేశారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో ఉన్నతాధికారులు ఉద్యోగుల సేవలను అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు. – నెట్వర్క్వసంత్రావు, నాయబ్ తహసీల్దార్, నందిపేటవందన, ఆయూష్ డీపీఎంరవళి, ఎంపీహెచ్వో, డిచ్పల్లిఅశోక్ కుమార్, అసిస్టెంట్ డిప్యూటీ జైలర్సూర్యప్రకాశ్, సర్వేయర్, డిచ్పల్లినవాబ్, ఎమ్మారై, నిజామాబాద్ సౌత్గంగాధర్, తహసీల్దార్, కోటగిరిసంతోష్రెడ్డి, తహసీల్దార్, మెండోరావినయ్ సాగర్, నాయబ్ తహసీల్దార్, నిజామాబాద్ రూరల్సాయిలు, నాయబ్ తహసీల్దార్, మోస్రాశ్రీనివాస్, ఏఎంవీఐ, నిజామాబాద్రావుట్ల జనార్దన్, ఎన్జీవోవెంకటనారాయణ, సీఐ, బోధన్ టౌన్నర్సింగ్రావు, ఫైర్స్టేషన్ ఆఫీసర్, నందిపేటనాగరాజు, సెక్రటరీ, పీఏసీఎస్ రాంపూర్రాములు, ఎండోమెంట్ ఈవోమహ్మద్ అబ్దుల్ మజీద్, సీనియర్ అసిస్టెంట్, డీపీఆర్వోపుష్ప, ఎడ్యుకేషన్ ఆఫీసర్, నిజామాబాద్సయ్యద్ మస్తాన్ అలీ, ఏసీపీ, ట్రాఫిక్ నిజామాబాద్రమేశ్, టీపీవో, మున్సిపల్, నిజామాబాద్ నిక్షిత, కానిస్టేబుల్, ఆర్మూర్సంతోష్రెడ్డి, సీఎస్బీ ఎస్సై, నిజామాబాద్హరితరాణి, కానిస్టేబుల్, షీటీమ్ నిజామాబాద్సుమతి, హెడ్కానిస్టేబుల్ షీటీమ్, ఆర్మూర్రాశి, కానిస్టేబుల్, రెంజల్శ్రీజ, కానిస్టేబుల్, మెండోరాఎండీ సలీం, ట్రాఫిక్ హెడ్కానిస్టేబుల్గంగాధర్, ఏఆర్ ఏఎస్సై, ట్రాఫిక్శ్రీనివాస్, ఏఆర్ ఎస్సైప్రేమ్కుమార్, సీపీ పీఆర్వో, హెడ్కానిస్టేబుల్ -
రైతులకు మరింత సేవ చేసుకునే అవకాశం
● ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి ● సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకంసుభాష్నగర్: రాష్ట్రంలోని సహకార సంఘాలు, డీసీసీబీల పాలకవర్గాల పదవీకాలం గడువు మరోసారి ఆరు నెలలు పొడిగించి రైతులకు మరింత సేవ చే సుకునే భాగ్యాన్ని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మ ల నాగేశ్వర్రావు, మంత్రివర్గం కల్పించిందని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్డీసీసీబీ ప్రధాన కార్యాలయ ఆవరణలో శుక్రవారం పాలకవర్గాల గడువు ఆరు నెలలు పొడిగించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రమేశ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీసీసీబీని రాష్ట్రంలోనే ఉత్తమమైన బ్యాంకుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రధానంగా ఎన్పీఏ తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించామని, అందరి స హకారంతో బ్యాంకుకు పూర్వవైభవం తీసుకొస్తా మని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకార సంఘాల చైర్మన్లు, బ్యాంకు డైరెక్టర్ల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు. -
అన్న వెంటే తమ్ముడు
● సోదరుని మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మృతి వేల్పూర్: అన్న మరణాన్ని తట్టుకోలేక తమ్ముడు గుండెపోటుకు గురై మరణించిన ఘటన శుక్రవారం వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దివంగత రిటైర్డ్ టీచర్ అయ్యవార్ల మురళీధర్రావుకు భార్గవ్శ్యాం, ప్రేమ్కుమార్, విజయ్కుమార్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దకొడుకు భార్గవ్శ్యాం ప్రైవేటు కంపెనీలో పనిచేసుకుంటూ చాలా ఏళ్లుగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో నివాసముంటున్నాడు. ప్రేమ్కుమార్ కలకత్తాలో ఉంటుండగా, విజయ్కుమార్ అంక్సాపూర్లో ఇంటి వద్దనే ఉండేవాడు. భార్గవ్ శ్యాం(57) కొద్దికాలంగా పక్షవాతంతో బాధపడుతూ గురువారం రాత్రి మరణించాడు. ఆయన మరణవార్తను శుక్రవారం ఉదయం అంక్సాపూర్లో ఉన్న తమ్ముడు విజయ్కుమార్కు తెలిపారు. దీంతో విజయ్కుమార్ తీవ్ర మనస్తాపం చెంది గుండెపోటుకు గురయ్యాడు. గ్రామస్తులు వెంటనే స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. భార్గవ్శ్యాం అంత్యక్రియలు శుక్రవారం పూర్తికాగా, విజయ్కుమార్ అంత్యక్రియలు కలకత్తాలో ఉండే అన్న ప్రేమ్కుమార్ శనివారం ఇంటికి వచ్చిన తర్వాత నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అన్నదమ్ములు ఒకరివెంట ఒకరు మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది.రాజంపేట: వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడికి తీవ్రగాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన గుర్రాల రమేశ్ కొడుకు ధనుంజయ్(4) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం 3గంటలకు మూత్ర విసర్జన కోసం పాఠశాల ఆవరణలోకి వెళ్లగా వీధికుక్కలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. దీంతో ధనుంజయ్కి తీవ్రగాయాలయ్యాయి. కుక్కలను తరిమే ప్రయత్నంలో ఓ ఉపాధ్యాయురాలిపై దాడికి యత్నించినట్లు తెలిసింది. విద్యార్థి ప్రస్తుతం కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. పెద్దకొడప్గల్(జుక్కల్): మండల కేంద్ర సమీపంలోని 161 జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మాడు సాయవ్వ శుక్రవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం 161 జాతీయ రహదారి దాటుతుండగా పిట్లం నుంచి బిచ్కుంద వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. సాయవ్వకు గాయాలు కాగా స్థానికులు 108 అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆస్పతిరికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సాయవ్వను మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘ఓట్ల చోరీ’ గడపగడపకూ తీసుకెళ్లాలి
● బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది ● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డిమోపాల్(నిజామాబాద్రూరల్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతుందని, సుప్రీంకోర్టు తీర్పు ఇందుకు నిదర్శనమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఓట్ చోర్.. గద్దె చోడ్ నినాదాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని న్యాల్కల్ గ్రామంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాసాని చెరువు గేట్లు ఎత్తి నిజాంసాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఓట్ల చోరీకి పాల్పడుతూ ప్రజల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. బిహార్లో 65లక్షల ఓట్లు తొలగించిందని, దీనిపై రాహుల్గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్కు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి.. మాసాని చెరువు నుంచి నిజాంసాగర్ కెనాల్ ద్వారా 15వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని, రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు. వర్షాలు ముందుగా కురవడంతో రైతులు త్వరగా నాట్లు వేశారని, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలకు సాగునీరు అవసరమని పేర్కొన్నారు. సొసైటీ పాలకవర్గాల గడువు పొడిగింపు శుభపరిణామమని, రైతులకు మరింత సేవ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డి, ఫిషర్మెన్ జిల్లా చైర్మన్ బోర్గాం శ్రీనివాస్, ఇరిగేషన్ డీఈ బాలరాజు, సొసైటీ చైర్మన్ మోహన్రెడ్డి, నాయకులు గంగాప్రసాద్, ప్రతాప్సింగ్, కిరణ్రావు, బొడ్డు రఘు, కెతడి నారాయణ, సడక్ శేఖర్, సతీశ్ రావు, సతీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కోర్టులో జెండా ఆవిష్కరించిన జడ్జి
నిజామాబాద్ లీగల్: స్వాతంత్య్ర వేడుకలను జిల్లా కోర్టులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయభాస్కర్ రావు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్జీలు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తన క్యాంప్ ఆఫీస్తోపాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి హోదాలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమాల్లో ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, టీజీవో జిల్లా అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి అమృత్కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మోర్తాడ్(బాల్కొండ): యూరప్ పంపిస్తామని నమ్మించి వేల్పూర్ మండలం పడిగెలకు చెందిన గంగాప్రసాద్ను యూఏఈలోనే ఉండిపోయేలా మోసగించిన ఇద్దరు గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రవాసీ ప్రజావాణిలో బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి స్పందించి బాధితునికి న్యాయం చేయాలని సీపీ సాయి చైతన్యకు లేఖ రాశారు. సీపీ ఆదేశాల మేరకు ఆలూర్ మండలం మచ్చర్లకు చెందిన ఆర్ నారాయణ, హైదరాబాద్లోని అమీర్పేట్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ జబ్బర్లపై వేల్పూర్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీంతో దుబాయ్లో చిక్కుకుపోయిన గంగాప్రసాద్ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ చొరవ తీసుకుంటుందని అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ఘనంగా స్వాతంత్య్ర వేడుక
● త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం పండుగ వాతావరణంలో జరిగా యి. వేడుకల కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏ ర్పాట్లు చేయగా, రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమి షన్ చైర్మన్ ఎస్.నిరంజన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన.. పుర ప్రముఖులను, అధికారులు, అనధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమా లు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఆయా శాఖల ఫొటో ఎగ్జిబిషన్, శకటాలను ఆసక్తిగా తిలకించారు. ఉత్త మ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రా లు అందజేశారు. స్వాతంత్య్ర సమర యోధులను, వారి కుటుంబీకులను సన్మానించారు. వేడుకల్లో భా గంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్.భూపతిరెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ముఖ గుర్తింపుతో 60శాతం
● నూతన విధానంతో జిల్లాలో 1,20,246 మందికి పింఛన్ల పంపిణీ ● వివిధ కారణాలతో మిగతా వారికి పాత పద్ధతిలోనే అందజేతడొంకేశ్వర్(ఆర్మూర్): చేయూత పింఛన్ల పంపిణీలో మరింత పారదర్శకత కోసం టీజీ ఆన్లైన్ అభివృద్ధి చేసిన ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్(పేషియల్ రికగ్నిషన్)తో మొదటి సారిగా జిల్లాలో పింఛన్ల పంపిణీ పూర్తయింది. నూతన విధానం ద్వారా గ్రామాల్లో 60 శాతం మందికి పింఛన్లు అందజేయగా, మిగతా వారికి వివిధ కారణాలతో పాత పద్ధతిలోనే (వేలిముద్రలు తీసుకుని) పంపిణీ చేశారు. ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ కారణంగా పింఛన్ల పంపిణీ వేగవంతంగా పూర్తయినట్లు పోస్టల్ అధికారులు చెబుతున్నారు. చేతి వేలిముద్రల ద్వారా 10 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేసేందుకు సుమారు అరగంట సమయం పట్టేది. ప్రస్తుతం ముఖ గుర్తింపు ద్వా రా కేవలం 15 నిమిషాల్లోనే పంపిణీ పూర్తవుతోంది. దీంతో లబ్ధిదారులు పోస్టాఫీసులు, గ్రామ పంచాయతీల వద్ద ఎక్కువ సేపు నిరీక్షించే పరిస్థితి పోయింది. అదే విధంగా గ్రామాల్లో బోగస్ పింఛన్లకు కూడా చెక్ పడినట్లయింది. బ తికున్నవారే పింఛన్లు పంపిణీ చేసే చోటికి వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో జూన్ నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులు పోస్టల్ అధికారులు గ్రామీణ లబ్ధిదారులకు ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్తో పంపిణీ చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కూడా ఈ ప్రక్రియను పరిశీలించారు. నిజామాబాద్ కార్పొరేషన్తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలోని లబ్ధిదారులకు ఎప్పటిలాగే నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. పంచాయతీ కార్యదర్శులకు తప్పిన భారం ఇది వరకు లబ్ధిదారులందరికీ చేతి వేలిముద్రల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తూ వచ్చారు. వేలిముద్రలు రానివారికి సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి వేలిముద్రతో డబ్బులు అందజేశారు. పోయిన నెల వరకు పంచాయతీ కార్యదర్శులే బయోమెట్రిక్ పెట్టి జిల్లాలో సుమారు 12వేల మందికి పింఛన్లు ఇచ్చారు. ఇప్పుడు ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ రావడంతో వేలి ముద్రలు రాని లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పాయి. పంచాయతీ కార్యదర్శులతో పని లేకుండానే పింఛన్ డబ్బులు తీసుకున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శుల సహాయంతో పింఛన్లు పొందే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. తమకు కూడా పనిభారం తగ్గిందని పంచాయతీ కార్యదర్శులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ లబ్ధిదారులు 2,01,243 ముఖ గుర్తింపుతో పింఛన్ పొందినవారు 1,20,246 వేలి ముద్రలతో పొందిన వారు 80,154 పంచాయతీ కార్యదర్శుల ద్వారా పొందిన వారు 843 -
సంక్షేమానికి పెద్దపీట
నిజామాబాద్వాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. చల్లని గాలులు వీస్తాయి. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రైతులకు మరింత సేవ.. మరోసారి పదవీకాలం పొడిగింపుతో రైతులకు మరింత సేవచేసే భాగ్యం కలిగిందని డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి అన్నారు.శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లో uజాతీయ జెండాకు వందనం చేస్తున్న ముఖ్య అతిథి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎమ్మెల్యేలు ధన్పాల్, రాకేశ్రెడ్డి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య తదితరులుఎస్సారెస్పీలోకి 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ● వేగంగా పెరుగుతున్న ప్రాజెక్ట్ నీటి మట్టం ● గంటగంటకూ ఎక్కువవుతున్న వరద బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతోంది. గురువారం 13,910 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. శుక్రవారం ఉదయం నుంచి గంట గంటకూ పెరుగుతూ ెరాత్రి 9 గంటల వరకు 60 వేల క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 800, అలీసాగర్ లిఫ్ట్కు 180 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కులు వినియోగిస్తుండగా, ఆవిరి రూపంలో 502 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా, శుక్రవారం రాత్రి వరకు 1081.10(48 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. గోదావరికి పెరిగిన వరద రెంజల్(బోధన్), నాలుగు రోజులుగా జిల్లాతోపాటు ఎగువన ఉన్న మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వరద ప్రభావం పెరిగింది. కందకుర్తి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర క్షేత్రంలోని పురాతన శివాలయం చుట్టూ వరద నీరు చేరింది. నిజాంసాగర్లోకి భారీ వరద 25,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో నిజాంసాగర్: ఎగువన ఉన్న మెదక్, సంగారెడ్డి జిల్లాలలో కురుస్తున్న వర్షాలకు శుక్రవారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సింగూరు ప్రాజెక్టుతో పాటు ఘనపురం ఆనకట్ట, హల్ది వాగుల ద్వారా 25,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నిప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగుల(17.8 టీఎంసీలు)కుగాను శుక్రవారం సాయంత్రానికి 1,394.92 అడుగుల (6.781 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. సింగూర్ మూడు గేట్ల ఎత్తివేత ఎగువన సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి 27 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ఈ నీరు నిజాంసాగర్ ప్రాజెక్టును చేరనుంది.నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని, అర్హులందరికీ ఫలాలు అందుతున్నాయని బీసీ కమిన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. 79వ స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. జిల్లా రైతాంగానికి రూ.755 కోట్ల 29 లక్షల రుణ మాఫీ చేయడంతోపాటు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 చొప్పున పంట పెట్టుబడి సాయం అందజేయడం జరిగిందని వెల్లడించారు. తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్ల రైతు భరోసా అందించడం జరిగిందన్నారు. 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ ఉండనుందని, ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’ అని పేర్కొన్నారు. ఇది కేవలం ప్రణాళిక కాదని, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పమని అన్నారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై స్వాతంత్య్ర దినోత్సవ వేదిక పైనుంచి నిరంజన్ ప్రసంగం సాగిందిలా.. రైతు రుణమాఫీ పథకం జిల్లాలో 97,696 మంది రైతులకు రూ.755 కోట్ల 29 లక్షల పంట రుణం మాఫీ అయ్యింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందింది. భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 40,462 దరఖాస్తులు అందాయి. పౌర సరఫరాల శాఖ జూన్ నుంచి ఆగస్టు వరకు మొ త్తం 26,217 మెట్రిక్ టన్నుల ఉచిత సన్న బియ్యం పంపిణీ చేశాం. జనవరి నుంచి ఇప్పటి వరకు 11,852 నూతన రేషన్కా ర్డులు మంజూరు చేశాం. మహాలక్ష్మి 2,19,330 మంది గ్యాస్ వినియోగదారులకు 10,19,994 సిలిండర్ల సబ్సిడీ విడుదల చేసి రూ.30 కోట్ల 73 లక్షలు చెల్లించడం జరిగింది. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్న మహిళలకు రూ.249 కోట్ల 13 లక్షలు ఆదా అయ్యాయి. గృహజ్యోతి గృహజ్యోతిలో భాగంగా మార్చి 2024 నుంచి జూలై 2025 వరకు ప్రతి నెలా 2,67,707 మంది వినియోగదారులకు జీరో బిల్లులు వచ్చాయి. వైద్యారోగ్యం టీబీ ముక్త్ భారత్కు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో కేవలం 1,211 మంది వ్యాధిగ్రస్తులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. విద్య జిల్లాలో 1,156 పాఠశాలల్లో 90,359 విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. రెండు కేజీబీవీలు మంజూరయ్యాయి. ధర్పల్లి, ఇందల్వాయి, మెండోర, రుద్రూర్, మోపాల్ కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టాం. అటవీశాఖ జిల్లా మొత్తం అటవీ విస్తీర్ణం 2,14,056.38 ఎకరాలు. నేటి వరకు 27 లక్షల మొక్కలు నాటడం పూర్తయ్యింది. జిల్లాలో మొత్తం 542 నర్సరీలు ఏర్పాటయ్యాయి. శాంతి భద్రతల పరిరక్షణ డయల్ 100 ద్వారా ఫిర్యాదులు స్వీకరించి 5 నిమిషాల్లో పోలీసులు సమస్యలను పరిష్కరిస్తున్నారు. శాంతి భద్రతలను సామరస్యాన్ని కాపాడినందుకు, జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నందుకు జి ల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందనలు. స్వాతంత్య్ర వేడుకల్లో స్నేహ సొసైటీ రూరల్ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్కు చెందిన మానసిక దివ్యాంగులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. యునైటెడ్ వి స్టాండ్.. మేరా భారత్ మహాన్ తదితర నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ 75 మంది మానసిక దివ్యాంగులు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి అయిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. – నిజామాబాద్ నాగారం వ్యవసాయ రంగంవానాకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు వరి 4.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలో, మొక్కజొన్న 52 వేల ఎకరాలు, సోయాచిక్కుడు 33 వేల ఎకరాలు, పసుపు 23 వేల ఎకరాల విస్తీర్ణంలో మొత్తం సుమారు 5 లక్షల 33 వేల ఎకరాల్లో రైతులు పంటు సాగు చేస్తున్నారు. పంటల సాగులో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 1,746 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ లో ఉంది. ఇందిరమ్మ ఇళ్లు 19,397 ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణం లక్ష్యం. లబ్ధిదారులకు 17,301 ఇళ్లు మంజూరయ్యాయి. 9,486 ఇళ్ల మార్కింగ్ పూర్తి కాగా, 4,820 ఇళ్లు బేస్మెంట్, 742 రూఫ్, 237 స్లాబ్ లెవెల్ పనులు పూర్తయ్యాయి. రూ.60.36 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఐక్యతే మనబలం జిల్లాలో రూ.755 కోట్ల 29 లక్షల రుణ మాఫీ భూ భారతితో గ్రామ స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం 17,301 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు 11,852 నూతన రేషన్కార్డులు సజావుగా సంక్షేమ పథకాల అమలు స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రసంగించిన నిరంజన్ -
ఒకే వార్డులో కుటుంబమంతా..
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఇంకా పచ్చజెండా ఊపకపోయినా క్షేత్రస్థాయిలో మాత్రం ఏర్పాట్లు ముమ్మరంగా సా గుతున్నాయి. ఓటర్ల జాబితాను సవరిస్తూ ఆన్లైన్ లో నమోదు చేయడంలో పంచాయతీ కార్యదర్శు లు, కంప్యూటర్ ఆపరేటర్లు బిజిబిజీగా ఉన్నారు. కొత్తగా ఓటరు నమోదు చేసుకోవడంతో అనేక చో ట్ల ఓటర్ల సంఖ్య పెరిగింది.ఈ నేపథ్యంలో ఒక కు టుంబంలోని ఓటర్లందరూ ఒకే వార్డులో ఉండేలా సవరణ చేపట్టారు. గతంలో భార్య ఒక వార్డులో ఓటు హక్కు కలిగి ఉంటే, భర్త ఇతర కుటుంబసభ్యులు మరో వార్డులో ఓటు వేసేవారు. ఇలాంటి పరిస్థితి గందరగోళానికి దారి తీస్తుందనే ఉద్దేశంతో కుటుంబసభ్యులంతా ఒకే వార్డులో ఉండేలా చర్య లు తీసుకుంటున్నారు. మార్పులు, చేర్పులు.. తొలగింపులు జిల్లాలో పాత గ్రామ పంచాయతీలు 530 ఉండగా కొత్తగా విభజించిన పంచాయతీల సంఖ్య 15 ఉంది. మొత్తం వార్డులు 5022 ఉన్నట్లు అధికారులు గతంలో వెల్లడించారు. డిసెంబర్ 2024 నాటికి పంచాయతీలలో ఓటర్ల సంఖ్య 8,30,580గా నమోదైంది. ఈ సంవత్సరం ఆరంభంలో ఓటర్ల నమోదు చేపట్టగా సంఖ్య పెరిగింది. మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించడం, కొత్తవారి చేరికతో ఓటర్ల జాబితా సవరణ అనివార్యమైంది. కాగా, ఓటర్ల జాబితాలను సవరిస్తూ ఆన్లైన్లో నమోదు చేయడంతో పనిభారం పెరిగిందని పంచాయతీ ఉద్యోగులు చెబుతున్నారు. ఆన్లైన్ నమోదు కొనసాగుతోంది ఓటర్ల జాబితాల సవరణ, ఆన్లైన్లో నమోదు ప్ర క్రియ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సూచించిన విధంగా ప్ర తి పంచాయతీ ఓటర్ల జాబితాను ఆన్లైన్లో నమో దు చేస్తున్నాం.ఎలాంటి తప్పులు దొర్లకుండా జా గ్రత్తలు తీసుకుంటున్నాం. – శ్రీధర్, ఎంపీవో, మోర్తాడ్ గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా సవరణ ఆన్లైన్లో నమోదు చేస్తున్న ఉద్యోగులు ఎన్నికలకు ఖరారు కాని షెడ్యూల్ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లు -
ఓటరు జాబితాలో గోల్మాల్
క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ నాయకులునిజామాబాద్ సిటీ: కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ఓటరు జాబితాను గోల్మాల్ చేసిందని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని నిరసన తెలుపుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి నెహ్రూపార్క్ నుంచి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్గౌడ్ మాట్లాడుతూ.. ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఆదేశాలతో క్యాండిల్ర్యాలీ నిర్వహించామన్నారు. ఓటరు జాబితాలో అక్రమాలను రాహుల్గాంధీ బహిరంగపరిచిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జీవీ రామకృష్ణ, నరేందర్గౌడ్, మఠం రేవతి, ప్రమోద్, పోల ఉష, పుప్పాల శోభ తదితులు పాల్గొన్నారు. -
ప్రపంచ దేశాలకు దిక్సూచిలా నిలుస్తుంది
విద్య, వైద్యం, టెక్నాలజీ, పరిపాలన, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో ప్రపంచంలోని ఇతర దేశాలకు దిక్సూచిలా మన దేశం నిలుస్తుంది. మనదేశంలోని ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంది. కొవిడ్ వ్యాక్సిన్ను ప్రపంచానికి అందించిన ఘనత మనదే. రీసెర్చ్లతో మన దేశం ఎన్నో ఆవిష్కరణలకు వేదిక అవుతోంది. భవిష్యత్ తరాల కోసం అన్ని రంగాల్లో చాలా మార్పులు రావాలి. నూతన టెక్నాలజీకి అనుగుణంగా ప్రభుత్వాలు కొత్తకొత్త కోర్సులను ప్రవేశపెట్టాలి. 2047 కల్లా మన దేశం అగ్రామిగా ఉంటుంది. – ఎన్ కృష్ణమోహన్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, అడిషనల్ డీఎంఈ -
నిజామాబాద్
పంద్రాగస్టు వేడుకకు ముస్తాబైన పరేడ్ గ్రౌండ్శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025నిజామాబాద్అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్.నిరంజన్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగించనున్నారు. ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వేడుకల్లో భాగంగా ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. -
అవినీతే సమస్య..
నిజామాబాద్ అర్బన్ : 79 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో అతి పెద్ద సమస్యగా అవినీతి ఉందని, స్వేచ్ఛ, సమానత్వం అంతంతేనని పలువురు అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. స్వతంత్ర భారతంలో అవినీతి, పేదరికం పెద్ద సమస్యగా మారాయని, అధికారులు నీతి, నిజాయితీతో పని చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు ప్రధాన ప్రశ్నలకు 30 మంది సమాధానాలిచ్చారిలా.. ● మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏది.. (ఏ) అవినీతి (బీ) పేదరికం (సీ) నాణ్యమైన విద్య (డీ) వైద్యం (ఇ) కుల వివక్ష ● (ఏ)4 (బీ)3 (సీ) 1 (డీ) 1 (ఇ) 1 ● స్వేచ్ఛ – సమాఽనత్వ్యం నిజంగానే అందరికి చేరుతోందా.. (ఏ) అవును (బీ) లేదు (సీ) కొద్దిగా ● (ఎ)4 (బీ)4 (సీ) 2 ● స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే.. మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగం.. (ఏ) చట్ట సభలు (బీ) న్యాయ స్థానాలు (సీ) అధికార యంత్రాంగం (డీ) మీడియా ● (ఏ)2 (బీ) 2 (సీ) 5 (డీ) 1 స్వేచ్ఛ, సమానత్వం అంతంతే.. అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతో పని చేయాలి ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిప్రాయాలు -
ప్రపంచానికి తలమానికం..
వైద్యరంగంలో ప్రపంచానికి భారతదేశం తలమానికంగా నిలుస్తుంది. ఏఐ కారణంగా వైద్యరంగంలో చాలా మార్పులు రాబోతున్నాయి. అధునాతన పరికరాలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చిన రోగులు మళ్లీ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా భవిష్యత్లు అన్ని వైద్య సేవలందనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యరంగానికి నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నాయి. 2047 నాటికి దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు పల్లె, పట్టణం తేడా లేకుండా మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం నాకు ఉంది. – శ్రీనివాస్, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
సౌర వెలుగుల నడ్కుడ
ఆదర్శంగా నిలుస్తున్న జీజీ నడ్కుడగ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్డొంకేశ్వర్(ఆర్మూర్): పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని బాపూజీ అన్న మాటలను నిజం చేస్తోంది మండలంలోని గంగగడ్డ (జీజీ) నడ్కుడ గ్రామం. బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది స్వాతంత్య్ర ఫలాలు ఇంటింటికీ అందుతున్న గ్రామంగా గుర్తింపు పొందుతోంది. గ్రామంలో ఇప్పటికే ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందుతుండగా, సొలార్ వినియోగంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ను ఆనుకొని ఉన్న ఈ మారుమూల పల్లె మూడేళ్ల క్రితమే సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. గ్రామ పంచాయతీలకు భారీ విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో జిల్లాలో జీజీ నడ్కుడ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సోలార్ సిస్టంను ఏర్పాటు చేశారు. అప్పట్లో కలెక్టర్గా పనిచేసిన నారాయణ రెడ్డి ‘గ్రీన్ విలేజ్’ పేరిట దీనికి శ్రీకారం చుట్టారు. మొత్తం ఆరుచోట్ల సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయగా, రూ.13లక్షల వరకు ఖర్చయింది. నిర్వహణ మొత్తం గ్రామ పంచాయతీ చూస్తుండగా, జీపీకి సంబంధించిన బోరు మోటార్లు, వీధి దీపాలకు ‘సౌర’ విద్యుత్ను వాడుతున్నారు. సోలార్ సిస్టం ఏర్పాటుకు ముందు జీపీకి ప్రతినెలా రూ.లక్షకు పైగా విద్యుత్ బిల్లు వచ్చేది. ఇప్పుడు సగం మాత్రమే వస్తోంది. సోలార్ సిస్టంతో విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకున్న జీజీనడ్కుడ బాటలోనే జిల్లాలోని మరిన్ని జీపీలు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సౌర యూనిట్ల ఏర్పాటుకు ముందు విద్యుత్ బిల్లులు భారీగా వచ్చేవి. మూడేళ్ల నుంచి సోలార్ కారణంగా బిల్లుల భారం తగ్గింది. సోలార్ ద్వారా గ్రామంలోని విద్యుద్దీపాలు, బోరు మోటార్లను వినియోగిస్తున్నాం. – సుప్రియ, పంచాయతీ కార్యదర్శి, జీజీ నడ్కుడ -
బీసీ కమిషన్ చైర్మన్కు స్వాగతం పలికిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్.నిరంజన్ గురువారం రాత్రి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఆయనను కలెక్ట ర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇతర అధికారులు మ ర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. వారి వెంట ఆ ర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు. బెటాలియన్ ఏఆర్ ఎస్సైకి విశిష్ట సేవా పతకం డిచ్పల్లి: డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్కు చెందిన ఏఆర్ ఎస్సై రామ్ దులారి సింగ్కు గురువారం కేంద్ర ప్రభుత్వం విశిష్ట సేవా పతకం ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశేష సేవలందించిన వారికి ప్రభుత్వం ఈ పతకం అందజేస్తుందని బెటాలియన్ అధికారులు తెలిపారు. గంగాసాగర్కు అంబేడ్కర్ ఎక్సలెన్సీ అవార్డు నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండల కేంద్రానికి చెందిన కానూరి గంగాసాగర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎక్సలెన్సీ అవార్డు–2025ను అందుకున్నాడు. హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యుమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జరిగిన కార్యక్రమంలో విద్యారంగ విభాగంలో గంగాసాగర్ అవార్డును అందజేశారు. 28 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించేలా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఈ అవార్డు వరించింది. అసిస్టెంట్ కమిషనర్ శ్యామ్ సుందర్సింగ్, అడ్వకేట్ సునీల్కుమార్, సోషల్ జస్టిస్ ఫర్ హ్యుమన్ రైట్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్కుమార్, ఆర్టీఐ డైరెక్టర్ సాప పండరీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీజీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు గురువారం ప్రారంభమైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం ఐదు పరీక్ష కేంద్రాలలో జరిగిన పీజీ పరీక్షల్లో 1861 మంది విద్యార్థులకు 1784 మంది హాజరుకాగా 77 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. బీఈడీ పరీక్షల్లో 1544 మంది విద్యార్థులకు 1494 మంది హాజరుకాగా 50 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. -
నిష్పక్షపాతంగా విచారణ జరపాలి
పెర్కిట్(ఆర్మూర్): కేజీబీవీ పాఠశాల విద్యార్థిని కా వేరి మృతిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వి యా సూచించారు. పెర్కిట్ కేజీబీవీలో ఇంటర్ వి ద్యార్థిని కావేరి మృతిపై సబ్ కలెక్టర్ గురువారం పా ఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. పాఠశాల ప్రత్యేక అధికారిణి గంగమణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తోటి విద్యార్థినులతో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు. విద్యార్థిని అర్ధరాత్రి వాష్రూంకు వెళ్లగా కోతులు వెంబడించడంతో భయప డి, పరిగెత్తుతూ ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి పడిందని పాఠశాల అధికారిణి సబ్కలెక్టర్కు తెలిపారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నందున పా రదర్శకంగా విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కోతుల బెడద నివారణకు పాఠశాల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చే యించాలని అధికారులను ఆదేశించారు. మున్సిప ల్ కమిషనర్ తహసీల్దార్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
సిరికొండ: మండలంలోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారి పర్వీన్బేగం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్, హిందీ పోస్టులకు టెట్ ఉత్తీర్ణులై బీఏ బీఈడీ, సోషల్ మెథడాలజీ, ఎంపీటీ, హిందీ మెథడాలజీ కలిగి ఉండాలని తెలిపారు. ఎంపికై న వారికి గెస్ట్ ఫ్యాకల్టీగా నెలకు రూ.18 వేల వేతనం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అన్ని ధృవపత్రాలతో ఈనెల 20లోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిజామాబాద్ రూరల్: విద్యార్థి దశ నుంచే సాహిత్యంపై మక్కు వ పెంచుకోవాలని భావకవి, కవిత్వ శిక్షకుడు, వైదిక పురో హితుడు తిరుమల శ్రీనివాస్ ఆర్య తెలిపారు. మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల యజమాన్యం పిలుపు మేరకు గురువా రం ఆయన పాఠశాలను సందర్శించారు. అనంత రం విద్యార్థులకు సాహిత్యంపై మక్కువ పెంచే అ నేక విషయాలు తెలియజేశారు. పాఠశాల యజమాన్యం, నిర్వహకులు ఆచార్యుల బృందం ఆయనను సన్మానించారు. -
ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
మోపాల్: మండలకేంద్రంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నారులు జాతీయ జెండాను ఎగురవేశారు. జెండాలను చేతబూని దేశభక్తి, జాతీయ భావం, దేశ ప్రాధాన్యతను పిల్లలకు బీజేపీ నాయకులు నవీన్రెడ్డి తెలియజేశారు. చిన్నారులు అక్షర, ఆకృతి, ఖుషి, చిన్ను, కన్నయ్య, అభినయ్, సంజీవ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో.. ధర్పల్లి: మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం తిరంగా యాత్ర చేపట్టారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మువ్వన్నెల పతాకాలతో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో ర్యాలీ చేపట్టారు. పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, గంగాదాస్, కర్క గంగారెడ్డి, శ్రీకాంత్, వెంకటేష్ పాల్గొన్నారు. -
జాతి ఆత్మగౌరవానికి ప్రతీక.. జాతీయ పతాకం
● నేడు స్వాతంత్య్ర దినోత్సవం ● వీధివీధిన రెపరెపలాడనున్న త్రివర్ణ పతాకం నిబంధనలు.. ● జెండా దీర్ఘ చతురస్రాకారంలో ఉండి, పొడవు, వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉండాలి. ● సమ నిష్పత్తిలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు కలిగిఉండాలి. మధ్యలో నీలి రంగులో 24 మొనలు కలిగిన అశోక ధర్మ చక్రం రెండు వైపులా కనిపించేలా ఉండాలి. ● పతాకాన్ని గౌరవప్రదమైన ప్రదేశాల్లో ఎగుర వేయాలి. ● జెండాలోని కాషాయ రంగు పైకి వచ్చేలా కట్టాలి. ● జాతీయ పతాకం కంటే ఎత్తుగా మరే పతాకం ఎగుర వేయకూడదు. ● కుడి వైపున ఇతర జెండాలను పెట్ట కూడదు. జెండాను అలంకరణగా వాడరాదు. ● పతాకాన్ని నేలకు తగిలేలా ఉంచరాదు. ● ఎగర వేసేటప్పుడు జెండా వైపే చూస్తూ, నిలబడి వందనం చేయాలి. అనంతరం జాతీయ గీతాలాపన చేయాలి. ● సూర్యోదయం కంటే ముందు జెండాను ఎగురవేయకూడదు. ● సూర్యాస్తమయం సమయంలోనే కిందికి దించాలి. ● ప్రభుత్వ భవనాలపై త్రివర్ణ పతాకం ఎల్లప్పుడు ఎగురవచ్చు. ● దేశ ప్రముఖులు చనిపోతే సంతాప సూచకంగా పతాకాన్ని అవతనం చేయాలి. ● చినిగిన, నలిగిన పతాకాన్ని ఎగురవేయరాదు. ఆర్మూర్: ఎటు చూసినా రాజకీయ పార్టీల జెండాలే దర్శనం ఇవ్వడంతో 145 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న మువ్వన్నెల జెండాకు గుర్తింపు కరువవుతోంది. ఇలాంటి తరుణంలో మన జాతీయ జెండా ప్రాముఖ్యతను, నియమాలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ప్రాముఖ్యత, నియమాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. జాతీయ జెండా రూపకల్పన ఇలా.. 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో బందరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య ఒక జాతీయ పతాకాన్ని రూపొందించి గాంధీజీకి చూపించారు. రెండు గడులు పచ్చగా ఒక గడి ఎరుపుగా ఉండేది. గాంధీజీ ఆ పతాకానికి కొన్ని మార్పులు సూచించారు. దాని ప్రకారం తెలుపు, పచ్చ, ఎరుపు రంగుల మధ్య చరఖా వచ్చి చేరింది. నేటి మన జాతీయ పతాకానికి మాతృక ఇది. 1931లో కరాచిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ నాయకత్వం జాతీయ పతాకం రూపొందించడం కోసం ఒక సబ్ కమిటీని నియమించింది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఎరుపు, తెలుపు, ఆకుప్చ రంగులున్న పతాకాన్ని రూపొందించారు. తెలుపు రంగులో నీలి రంగు చరఖాను ఏర్పరిచారు. ఈ పతాకాన్ని కాంగ్రెస్ కమిటీ ఆమోదించింది. ఆ తర్వాత జాతీయ జెండాలో రాట్నానికి బదులుగా అశోక ధర్మ చక్రాన్ని చేర్చమని అంబేడ్కర్ ప్రతిపాదించగా, సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ సమర్థించారు. దీంతో జాతీయ పతాకం మధ్యలో నీలి రంగులో 24 మొనలు కలిగిన అశోక ధర్మ చక్రాన్ని ముద్రించారు. ఈ జాతీయ పతాకాన్ని భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న ఆమోదించింది. జిల్లాకు భారీ వర్ష సూచన -
పెళ్లి వ్యాన్ బోల్తా: 15 మందికి గాయాలు
డిచ్పల్లి: మండలంలోని మిట్టపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం పెళ్లి వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ మండలం అర్సపల్లి గ్రామానికి చెందిన యువతితో ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సట్ల అనిల్కు గురువారం పెళ్లి జరిగింది. మల్లాపూర్కు వచ్చిన వధువు తరపు బంధువులు సుమారు 50 మంది సాయంత్రం వ్యాన్లో అర్సపల్లికి బయలుదేరారు. మిట్టాపల్లి గ్రామశివారులోని మహాలక్ష్మీ ఆలయం మలుపు వద్ద వారి వ్యాన్ ప్రమాదవశాత్తు పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది గాయపడగా, వారిలో బాగిర్తి చంద్రయ్య, రాజయ్యలకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలియగానే మల్లాపూర్ మిట్టపల్లి గ్రామానికి చెందిన పలువురు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. -
ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చూడాలి
● వీసీలో మంత్రులు పొంగులేటి, తుమ్మల, సీఎస్ ● క్షేత్రస్థాయిలో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు : కలెక్టర్ నిజామాబాద్అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో సమీక్షించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా రూ. కోటి చొప్పున నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సాధారణ స్థాయిలోనే వర్షాలు కురుస్తున్నాయని, గురువారం ఉదయం సగటున 23 మి.మీ వర్షపాతం నమోదైందని మంత్రులు, సీఎస్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, అయినప్పటికీ రానున్న 48గంటలపాటు భారీ వర్ష సూచన దృష్ట్యా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది సన్నద్ధమై ఉన్నారని వివరించారు. ఇప్పటికే అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశామన్నారు. జిల్లాలోని ఎస్సారెస్పీకి తక్కువగానే ఇన్ఫ్లో వస్తోందని, పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. 100 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, శిక్షణ పొందిన మరో 20 మందితో కూడిన పోలీస్, ఫైర్ బృందం ఉందని, ఒక బృందాన్ని మెదక్ జిల్లాలో సహాయక చర్యలకు పంపించినట్లు పేర్కొన్నారు. వీసీలో సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో సొసైటీ చైర్మన్ మృతి మోర్తాడ్(బాల్కొండ): మండలంలోని దొన్కల్ శివారులోగల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో శెట్పల్లి సహకార సంఘం చైర్మన్ సింగిడి రాజేశ్వర్రెడ్డి(70) మృతిచెందారు. వివరాలు ఇలా.. దొన్కల్ గ్రామానికి చెందిన రాజేశ్వర్రెడ్డి గురువారం బైక్పై పొలానికి వెళ్లాడు. కొద్దిసేటికే ఇంటికి తిరిగి బయలుదేరాడు. దొన్కల్ శివారులోని హైవేపై అతడి బైక్ను మెట్పల్లి నుంచి ఆర్మూర్ వైపు వెళుతున్న పశువుల వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కూతురు రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. రాజేశ్వర్రెడ్డి కుటుంబ సభ్యులు ఆమెరికాలో ఉండటంతో అంత్యక్రియలు జరగడానికి ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు. -
లోతట్టు ప్రాంతాల్లో మాక్డ్రిల్
● భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు సూచించిన అగ్నిమాపక శాఖ ఖలీల్వాడి: భారీ వర్షాల సూచన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ రోడ్డులోని లోతట్టు ప్రాంతాలు, కెనాల్ ప్రాంతంలో అగ్నిమాపకశాఖ అధికారులు మాక్డ్రిల్ నిర్వహించారు. భారీ వర్షాలకు నీ రు ఇళ్లలోకి వచ్చి చేరితే, రక్షణ చర్యలపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఇళ్లలోకి నీరు వస్తే వెంటనే ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలకు అగ్నిమాపకశాఖ అధికారి శంకర్ సూచించారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు. పారిశుద్ధ్య పనుల పరిశీలన నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను గురువారం డిప్యూటీ కమిషనర్ రవిబాబు పరిశీలించారు. మహాలక్ష్మినగర్, బ్యాంక్కాలనీ, నాందేవ్వాడ, ముజాహిద్నగర్ కాలనీల్లో శానిటరీ సూపర్వైజర్తో కలిసి ఆయన పర్యటించారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, ట్రాక్టర్లలో చెత్తను డంపింగ్యార్డుకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. సూపర్వైజర్, ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, సునీల్ తదితరులున్నారు. -
సంక్షిప్తం
బడిలో కృష్ణాష్టమి వేడుకలు మోపాల్: మండలంలోని మంచిప్ప గ్రామంలోగల జ్ఞానోదయ హైస్కూల్లో గురువారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, గోపికమ్మల వేషధారణలో అలరించారు. ఉట్టి కొట్టి సంబురాలు చేసుకున్నారు. ప్రిన్సిపాల్ దేవ శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దుర్గామాతను దర్శించుకున్న జిల్లా నాయకులు నిజామాబాద్ సిటీ: జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు గురువారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, ఆర్మూర్ ఏబీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నీకి ఎంపిక నిజామాబాద్నాగారం: చైన్నెలో ఈ నెల 18 నుంచి జరిగే బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్కు జిల్లాకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు అనికేత్రెడ్డి ఎంపికయ్యారు. ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జస్టీస్ నవీన్రావు, జాయింట్ సెక్రటరీ బస్వరాజు కలిసి 15మందితో కూడిన జట్టును ఎంపిక చేసి ప్రకటించారు. అనికేత్రెడ్డిని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రసేన్రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, కోచ్ సురేష్ అభినందించారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి నిజామాబాద్ సిటీ: జిల్లాకేంద్రంలోని కోజాకాలనీలోగల ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సయ్యద్ ఖైసర్ కోరారు. ఈమేరకు గురువారం ఆయన హైదరాబాద్లోని సీడీఎంఏ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన అప్పటి నగర మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సైబర్ క్రైంపై అవగాహన
ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు రైల్వే, ఆర్పీఎఫ్ పోలీసులు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్సై సాయిరెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్కు వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. సైబర్మోసాలకు గురైతే వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని తెలిపారు. కల్వర్టుల పరిశీలన డిచ్పల్లి: మండలంలోని కొరట్పల్లి గ్రామాన్ని ఎంపీడీవో రాజ్వీర్, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ ఇషాక్ అలీలు గురువారం సందర్శించారు. కొరట్పల్లి నుంచి జక్రాన్పల్లి మండలం కలిగోట్–చింతలూరు గ్రామాలకు వెళ్లే రోడ్డుపై ఉన్న కల్వర్టులను వారు పరిశీలించారు. ప్రజలు రాకపోకలు సాగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొరట్పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నగేశ్కు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్కార్డుల పంపిణీ నిజామాబాద్ రూరల్: సారంగాపూర్లోని 13వ డివిజన్లో కొత్తగా మంజూరైన రేషన్కార్డులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుంచపు నాగేశ్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. నూతన రేషన్కార్డుల మంజూరుకు కృషి చేసినందుకు రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సుదర్శన్, రామ్సింగ్, రవి, శ్రీరాములు, ఇలియాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. పాకాలలో ఘనంగా తీజ్ సిరికొండ: మండలంలోని పాకాల గ్రామంతోపాటు గంగారాంనాయక్ తండాలో తీజ్ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గోధుమ మొలకల బుట్టలతో బంజారా మహిళలు పాటలు పాడుతూ సంప్రదాయ రీతిలో నృత్యాలు చేశారు. ఊరేగింపుగా వెళ్లి గోధుమ మొలకలను చెరువులో నిమజ్జనం చేశారు. తండా పెద్దలు ఆనంద్నాయక్, భూపతినాయక్, గంగానాయక్, రమేశ్నాయక్, తిరుపతినాయక్, రవినాయక్, బీమ్లానాయక్, లాల్సింగ్నాయక్, గ్రామ అధ్యక్షుడు సంతోష్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ● అర్గుల్లో రూ. కోటి నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జక్రాన్పల్లి: ఇందిరమ్మ రాజ్యంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. గురువారం జక్రాన్పల్లి మండలంలోని అర్గుల్లో రూ. కోటి నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించారన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ.6800 కోట్లు చెల్లించిందన్నారు. రైతులకు ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, పేదల గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, డ్వాక్రా సంఘాలకు ఒక్కో గ్రూప్ కు రూ. 15 లక్షలు వడ్డీ లేని రుణాలు, వంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులు, ఒక్క ఇల్లు మంజూరు చేయలేదన్నారు. బీసీలకు 42 శాతం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు, బీసీ రిజర్వేషన్లకు అనుకూలమా, వ్యతిరేకమా, స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. అనంతరం చాకలి ఐలమ్మ ముని మనుమరాలు శ్వేతను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయి రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్, నాయకులు చిన్నారెడ్డి, చిన్న సాయి రెడ్డి, ఆర్మూర్ గంగారెడ్డి, శేఖర్, కాటిపల్లి నర్సారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యం రెడ్డి, వసంతరావు, మద్దుల రమేశ్, గోర్త పద్మ , రజక సంఘ సభ్యులు సాగర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మెరుగుపర్చాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిజామాబాద్అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. వైద్యవిధాన పరిషత్ పరిధిలో కొనసాగుతున్న జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై కలెక్టర్ గురువారం సాయంత్రం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలు, వాటి భర్తీకి చేపట్టిన చర్యల గురించి జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్ను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖాళీల భర్తీ కోసం ఉన్నతాధికారులకు పంపిన ప్రతిపాదనలను పరిశీలించారు. విభాగాల పనితీరును సమీక్షించారు. కాగా, వర్ని, ధర్పల్లి తదితర ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రుల భవన నిర్మాణాల పనులు వేగంగా , నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఎంహెచ్వో రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు. -
వేగవంతంగా ‘డబుల్ ఇళ్ల’ కేటాయింపు ప్రక్రియ
నిజామాబాద్అర్బన్: జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయించే ప్రక్రియ వేగవంతం చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులు గురువారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వారు స్థానికంగా నెలకొని ఉన్న స్థితిగతులను కలెక్టరేట్లో ఆయనకు వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించి ఆమోదం నిమిత్తం జిల్లా ఇన్చార్జి మంత్రికి లబ్ధిదారుల జాబితా పంపుతామని అన్నారు. ప్రధానంగా ఇల్లు, నివాస స్థలం లేని నిరుపేద కుటుంబాలు, సఫాయి కర్మచారీలు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇళ్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పవన్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఆర్అండ్బీ డీఈ రంజిత్, హౌసింగ్ అధికారి నివర్తి తదితరులు ఉన్నారు. -
200 ట్రిప్పులు.. రూ.3000
● హైవేపై నేటి నుంచి వార్షిక టోల్ పాస్ అమలు ● రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా పాస్లు పొందే అవకాశం ఇందల్వాయి( నిజామాబాద్ రూరల్): జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ప్రయాణం మరింత సులభంగా, చవకగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి వార్షిక టోల్పాస్ విధానాన్ని అమలు చేయనుంది. ఒకసారి రూ.3వేలు చెల్లిస్తే సంవత్సరంలో టోల్గేట్ గుండా 200 ట్రిప్పులు వెళ్లవచ్చు. ఒకసారి టోల్గేట్ దాటితే ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు. ఈ వార్షిక పాస్ కోసం వాహనదారులు ఇప్పుడు ఉన్న ఫాస్టాగ్కే రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్హెచ్ఏఐ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొని రూ.3వేలు చెల్లిస్తే, రెండు గంటల్లో యాక్టివేట్ అవుతుంది. కాల పరిమితి లేదా 200 ట్రిప్పులు పూర్తవగానే వాహనదారుడి ఫాస్టాగ్ పాత విధానం (పే ఫర్ యూజ్)లోకి మారిపోతుంది. తెలుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటేనే.. ఈ వార్షిక టోల్పాస్ తెలుపు రంగు నంబరు ప్లేటు కలిగిన వాహనాలకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుంది. పసుపు రంగు నంబరు ప్లేటు కలిగిన వాహనాలకు వర్తించదు. ఒక వాహనంపై పొందిన వార్షిక పాస్ మరో వాహనానికి వర్తించదు. వార్షికపాస్ తీసుకోవటం తప్పనిసరి కాదు. రాష్ట్ర రహదారులు, ఔటర్ రింగ్ రోడ్లు, మున్సిపల్ టోల్స్ వద్ద ఈ వార్షిక టోల్పాస్ చెల్లుబాటు కాదు. ఇందల్వాయి టోల్ప్లాజావ్యాపార పనుల నిమిత్తం ఇదివరకు నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు నెలలో ఐదారు సార్లు వెళ్లేవాన్ని. ఈ క్రమంలో టోల్చార్జీలే రెండు మూడు వేల రూపాయలు కట్టేవాన్ని. వార్షిక టోల్పాస్ ద్వారా వందల్లోనే కట్టాల్సి రావడం సంతోషకరం. ప్రయివేటు వాహనదారులకు ఈ పాస్ ఎంతో ఉపయోగకరం. –కుంట గంగారెడ్డి, నల్లవెల్లి -
సవాల్గా సమస్యల పరిష్కారం
నిజామాబాద్ అర్బన్: భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి అధికారులకు తలనొప్పిగా మా రింది. జిల్లాలో 453 రెవెన్యూ సదస్సులు నిర్వహించిన అధికారులు 40,468 దరఖాస్తులను స్వీకరించారు. భూ సమస్యలను ఆగస్టు 14వ తేదీ లోగా పరిష్కరిస్తామని ప్రకటించగా, నేటితో గడువు ము గియనుంది. కాగా మొత్తం దరఖాస్తుల్లో సగం ద రఖాస్తులు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. ఇందుకు ప్రధాన కారణం కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాలే. ఉండడం గత కొన్నేళ్ల నుంచి ప రిష్కారం కానీ సమస్యలు ఉండడమే ప్రధాన కారణం. సాదా బైనామా దరఖాస్తులు 9,185 ఉండగా, ప్రభుత్వ భూముల నుంచి పట్టా భూములుగా మార్చేందుకు 9,233, ఇతర సమస్యలకు సంబంధించి 4,189 దరఖాస్తులు అందాయి. స్వీకరించిన మొత్తం స్వీకరించిన దరఖాస్తుల్లో 22,607 దరఖాస్తులను పరిష్కరించేందుకు అవకాశం ఉందని గుర్తించినప్పటికీ 1320 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించారు. మరో 2449 దరఖాస్తులు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదివరకే 28,072 మందికి దరఖాస్తులకు అనుగుణంగాసమస్యల పరిష్కారానికి సంబంధించి నోటీసులు అందించారు. వీటి పరిశీలన ప్రస్తుతం కొనసాగుతోంది. ఆ దరఖాస్తులే ఎక్కువ.. భూభారతి దరఖాస్తుల్లో ఎక్కువగా సాదాబైనామా, ప్రభుత్వ భూమి నుంచి పట్టా భూమిగా మార్పిడి, పేరు మార్పిడికి సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. వీటిని పరిశీలించి పరిష్కరించే అవకాశం ఉంది. అయితే క్షేత్రస్థాయికి అధికారులు వెళ్లినప్పుడు దరఖాస్తుదారు అందుబాటులో ఉండకపోవడం, సర్వే నంబర్లు ఇతరత్రా ఇబ్బందులు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోర్టు కేసులూ జాప్యానికి కారణమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి రెవెన్యూ బందాలను కూడా అధికారులు ఏర్పాటు చేయగా, దరఖాస్తుల పరిశీలనకు ఎక్కువ సమయం తీసుకోవడంతో మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం విధించిన గడువు మళ్లీ పొడిగించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం దరఖాస్తుల్లో ఇప్పటి వరకు ఇప్పటివరకు 1,320 దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేశారు. భూభారతి దరఖాస్తులు 40468 పరిష్కారమైనవి 1320 నేటితో ముగుస్తున్న గడువు మరింత సమయం పట్టే అవకాశం -
వాగుల వైపు వెళ్లొద్దు..
ఖలీల్వాడి: రాబోయే రెండు, మూడు రోజు ల్లో వర్ష సూచన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ పోతరాజు సాయిచైతన్య సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీస్ అధికారు లు, సిబ్బంది ప్రతిరోజూ అందుబాటులో ఉండాలని అన్నారు. వా గుల వైపు, జలాశయాలు, చెరువులు, కుంటలు చూసేందుకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. పురాతన కట్టడాలు, ఇళ్లు, గోడలు ఉంటే వర్షతాకిడికి పడిపోయే అవకాశా లున్నాయని, ప్రజలు పునరావాస కేంద్రాల కు వెళ్లాలని సూచించారు. ఎక్కడైనా వరద ఉధృతి తలెత్తితే వెంటనే స్పందించి సహాయ క చర్యలు చేపట్టి ప్రాణనష్టం లేకుండా చూ డాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. అన్నిశాఖల అధి కారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 59700ను లేదా స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్ను సంప్రదించాలని సీపీ సూచించారు. -
విద్యుత్ కంట్రోల్ రూం ఏర్పాటు
సుభాష్నగర్: మూడు రోజులపాటు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యుత్ సరఫరాపై వినియోగదారులు, రైతులు అత్యంత జాగ్రత్త వహించాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు లోడ్ మానిటరింగ్ చేస్తున్నామని, మెన్, మెటీరియల్ అందుబాటులో ఉంచామని తెలిపారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్ వాహనాలను సిద్ధం చేశామని, ఉద్యోగులకు షిఫ్ట్ విధానంలో 24 గంటల విధులు కేటాయించామని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నివారణ, అంతరాయాల సమస్య పరిష్కారం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, 87124 85205 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకొద్దని, ప్రమాదకరంగా ఉన్నట్లు గమనించిన వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బందికి, టీజీఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నెంబర్ 1912కు సమాచారం అందించాలని కోరారు. ప్రధానంగా రైతులు మో టార్లు, పైపులు, ఫుట్ వాల్వులను ఏమరపాటుతో తాకొద్దని, వ్యవసాయ పంపుసెట్లు, స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయాలని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారికంగా మరమ్మతులు చేయొద్దని, పనులేమైనా ఉంటే విద్యుత్ సిబ్బందికి సమాచారమివ్వాలని ఎస్ఈ కోరారు. కరెంట్ సరఫరాపై జాగ్రత్త వహించాలి మొబైల్ ట్రాన్స్ఫార్మర్ వాహనాలు సిద్ధం ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్ -
అగమ్య గోచరంగా జిల్లా పరిస్థితి
నిజామాబాద్ అర్బన్: జిల్లా పరిస్థితి అగమ్య గోచరంగ మారిందని, జిల్లాను పట్టించుకున్న వారే కరువయ్యారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు మంత్రి లేరని, తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఉన్నా ఆయన ఏనాడూ జిల్లా ను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు అవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి అవినీ తిని ప్రజలు గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేస్తున్నారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలును విస్మ రించారని, ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఇస్తామన్న హామీ అమలు కావడం లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇవ్వడం లేదన్నారు, క్రిస్మస్, రంజాన్ కానుకలు మర్చిపోయారని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు ప్రభాకర్, సుజిత్ సింగ్ ఠాకూర్, రాజేశ్వర్రెడ్డి, మస్తా ప్రభాకర్, పూజా నరేంద్ర, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అవినీతిని ప్రజలు గమనిస్తున్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ జీవన్రెడ్డి -
అత్యవసరమైతేనే బయటికి రండి
నిజామాబాద్ అర్బన్: రానున్న రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అ న్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించా రు. ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎక్కడ కూడా ఏ చిన్న అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించి, జాగ్రత్తలు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి మొదలుకుని జిల్లా పంచాయతీ అధికారి వర కు, ఆశాలు, ఏఎన్ఎంల నుంచి జిల్లా వైద్యారోగ్య అధికారి వరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ స్థానికంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితి కారణంగా సెలవులను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన సమయాలలో చేపట్టే సహాయక చర్యలపై ప్రజలకు భరోసా కల్పించేలా నిజామాబాద్ నగరంతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ పట్టణాల్లో ఆయా వార్డుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. గతంలో వరద ప్రభావానికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఇదివరకు ఏర్గట్ల మండలం తడ్పాకల్ గోదావరి పరీవాహక ప్రాంతంలో పలువురు వరద ప్రవాహంలో చిక్కుకున్న ఘటనను కలెక్టర్ గుర్తు చేశారు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ల ను ఏర్పాటు చేయాలన్నారు. విద్యు త్, రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్ బీ, పంచాయితీరాజ్, ఇరిగేషన్, వైద్యారోగ్యం, వ్యవసాయ తదితర శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ, జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి మండలాల్లో కంట్రోల్ రూమ్లు భారీ వర్ష సూచన నేపథ్యంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష జాగ్రత్తలు, సహాయక చర్యలపై యంత్రాంగానికి దిశానిర్దేశం -
సింగూరు ప్రాజెక్టు గేటు ఎత్తివేత
నిజాంసాగర్: ఎగువన వర్షాలు దంచి కొట్టడంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు 11 వ నంబర్ గేటును ఎత్తి, 7,694 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ఈ నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరనుంది. ‘సాగర్’లోకి 16 వందల క్యూసెక్కులు.. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,600 క్యూసె క్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. బుధవారం సాయంత్రానికి 1,300.93 అడుగుల (5.67 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. 12,769 క్యూసెక్కుల ఇన్ఫ్లో బాల్కొండ:శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 12,769 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో తక్కువగా, ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బోధన్ మున్సిపల్ కమిషనర్గా జాదవ్ కృష్ణ బోధన్టౌన్(బోధన్): బోధన్ మున్సిపల్ కమిషనర్గా జాదవ్ కృష్ణ బుధవారం రా త్రి బాధ్యతలు తీసుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కమిషనర్గా పనిచేసిన కృష్ణ పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్కు గురయ్యారు. ఆ తరువాత ఆరోపణలు అవాస్తవమని తేలడంతో సీడీఎంఏ ఆయనను బోధన్ మున్సిపల్ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంద్రాగస్టు వేడుకకు ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ చైర్మన్ నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హాజరవుతారని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని, వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. 17న షటిల్ బ్యాడ్మింటన్ జిల్లాస్థాయి ఎంపికలు నిజామాబాద్నాగారం: ఈ నెల 17న జిల్లాస్థాయి బాలబాలికల షటిల్ బాడ్మింటన్ ఎంపికలు నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి వాసు, కేవీ కిరణ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–11, 13,15 విభాగంలో బాలబాలికలకు పోటీలు ఉంటాయన్నారు. మోపాల్ మండల కేంద్రంలోని ఫిట్నెస్ క్లబ్లో ఎంపికలు నిర్వహిస్తామని, వివరాలకు ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాస్గౌడ్ 9848351255 నెంబర్లో సంప్రదించాలని సూచించారు. శాలువాలు, బొకేలు వద్దు ● ఎంపీ అర్వింద్ ధర్మపురి సుభాష్నగర్: తనను కలిసేందుకు వచ్చే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని ఎంపీ అర్వింద్ ధర్మపురి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. వాటికి బదులు నోట్బుక్స్, పెన్నులు వంటివి తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వడం లేదు
● నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ● ఆగిపోతున్న రైల్వే బ్రిడ్జిల పనులు ● మీడియాతో ఎంపీ అర్వింద్ నిజామాబాద్ అర్బన్: జిల్లాలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించడం లేదని, ఆలస్యం చేస్తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో జరుగుతున్న రైల్వే పనులకు సంబంధించి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అడవి మామిడిపల్లి, అర్సపల్లి, మాధవ్ నగర్ వద్ద రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. అడవి మామిడిపల్లిలో సుమారుగా పనులు పూర్తి కావచ్చాయని, దీనికి సంబంధించిన నిధులను నాటి మంత్రి ప్రశాంత్ రెడ్డి రూ. 17 కోట్లను ఇతర పనులకు మళ్లించారని పేర్కొన్నారు. దీనివల్లనే పనులలో ఆలస్యం అన్నారు. మాధవ నగర్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 కోట్లు కేటాయించవలసి ఉందన్నారు. అర్సపల్లి వద్ద నిర్మించే రైల్వే బ్రిడ్జికి సంబంధించి మొత్తం రూ. 137 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 127 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 10 కోట్లు ఇప్పటికీ కేటాయించలేదన్నారు. రైల్వే బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి వారం రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి నిధులు విడుదల చేయాలని కోరనున్నట్లు తెలిపారు. జిల్లాలో మిగతా అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర మంత్రులను కలిసి నిధులు వచ్చేలా చూస్తానన్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెండింగ్ బకాయిలను విడుదల చేయించినట్లు తెలిపారు. -
సివిల్ ప్రొసీజర్ కోడ్లో మెలకువలు నేర్చుకోవాలి
జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి నిజామాబాద్ లీగల్: యువ న్యాయవాదులు సివిల్ ప్రొసీజర్ కోడ్పై పట్టు సాధించినప్పుడే సివిల్ లా యర్గా వృత్తిలో స్థిరపడతారని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి పేర్కొన్నారు. యువ న్యాయవాదుల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన శిబిరం రెండోరోజు బుధవారం కొనసాగింది. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సివిల్ ప్రొసీజర్ కోడ్లోని మెలకువలు నేర్చుకోవాలని సూచించారు. సీనియర్ సివిల్ న్యాయవాది సంగమేశ్వర్ రావు సివిల్ ప్రొసీజర్ కోడ్లోని వివిధ సెక్షన్లపై అవగాహన కల్పించారు. సీనియర్ సివిల్ అడ్వకేట్ జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమయస్పూర్తితో ఆలోచిస్తే అనేక సమస్యలకు న్యాయశాస్త్రంలో పరిష్కారం దొరుకుతుందని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కృపాకర్ రెడ్డి, వాల్గోట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ కళాశాలలో 61 మంది చేరిక
తెయూ(డిచ్పల్లి): నూతనంగా ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో 3వ విడత కౌన్సెలింగ్లో 81 మందిని కేటాయించగా, బుధవారం సాయంత్రం వరకు 61 మంది విద్యా ర్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లో 48 మంది, సీఎస్ ఐటీలో ముగ్గురు, సీఎస్ (ఏఐ)లో ఏడుగురు, డాటా సైన్స్లో ముగ్గురు విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి తెలిపారు. హాస్టల్ వసతి లేక వెనుకంజ ఇంజినీరింగ్ విద్యార్థులకు తెయూ క్యాంపస్లో హాస్టల్ వసతి కల్పించడం లేదు. దీంతో కౌన్సెలింగ్లో కేటాయించబడిన మరికొంత మంది విద్యార్థులు క్యాంపస్కు వచ్చి ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న వసతి, సౌకర్యాలను తెలుసుకున్నారు. హాస్టల్ వసతి లేకపోవడంతో కొందరు బాలికలు ఇక్కడ అడ్మిషన్ తీసుకునేందుకు వెనుకంజ వేశారు. నాలుగు కోర్సులకు 264 సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ కళాశాల మంజూరులో ఆలస్యం కావడం, హాస్టల్ వసతి లేకపోవడంతో విద్యార్థులు తక్కువ సంఖ్యలో చేరడానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. సీట్ల భర్తీకి ఇక స్పాట్ కౌన్సెలింగ్పైనే ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. -
దరఖాస్తు లేకుండానే కుల ధ్రువీకరణ పత్రం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): కుల ధ్రువీకరణ పత్రాల జారీలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. మీసేవ నుంచి పత్రాన్ని పొందిన వ్యక్తి మరోసారి దరఖాస్తు చేసే వెసులుబాటు గతంలో ఉండేది. కులం మారదు కనుక ఇప్పుడు అలాంటి విధానానికి స్వస్తి పలకడంతోపాటు ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తెచ్చింది. కుల ధ్రువీకరణపత్రం గతంలో ‘కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్’ గా వచ్చేది. దీంతోపాటు ఆధార్ కార్డు ప్రకారం పుట్టిన తేదీ వివరాలు వచ్చేవి. ప్రస్తుతం కుల ధ్రువీకరణ పత్రంలో జనన వివరాలు అవసరం లేదని ప్రభుత్వం గుర్తించింది. పత్రంలో ఈ వివరాలను తొలగించి కేవలం ‘కమ్యూనిటీ’ పేరుతోనే నూతన పత్రాన్ని జారీ చేస్తోంది. కొత్త విధానంతో ధ్రువపత్రాలు పొందడానికి క్షణాల్లో పని పూర్తయితే బాగానే ఉంటుంది. కానీ, గతంలో పొందిన కుల ధ్రువపత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మార్చుకునే వెసులుబాటు లేదు. ఎస్సీ వర్గానికి వర్తించదు.. కుల ధ్రువీకరణ పత్రం జారీలో అన్ని సామాజిక వర్గాలకు పాత ధ్రువపత్రం చూపిస్తే అప్పటికప్పుడు కుల ధ్రువీకరణ పత్రం జారీ కానుండగా ఎస్సీ సామాజిక వర్గానికి మాత్రం వర్తించదని అధికారులు చెబుతున్నారు. వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రచారం కరువు.. నూతన విధానంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. నూతన మార్పులను పత్రికా ప్రకటనల ద్వారా ప్రజలకు తెలపాల్సి ఉండగా తదనుగుణ చర్యలు లేకపోవడం గమనార్హం. కొత్త విధానంలో కులధ్రువీకరణ పత్రం ఎలా తీసుకోవాలో తెలియక చాలామంది పాత విధానాన్నే అనుసరిస్తూ సమయంతోపాటు డబ్బు వృథా చేసుకుంటున్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులను సంప్రదించగా ప్రభుత్వం నుంచి ఇంకా గైడ్లైన్స్ రాలేదని రాగానే ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. నూతన విధానాన్ని అమలులోకి తెచ్చిన ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు అవగాహన కల్పించని అధికారులు పాత సర్టిఫికెట్ చూపిస్తే సరి.. ఇక మీదట ప్రతిసారి కుల ధ్రువీకరణ పత్రం పొందడానికి దరఖాస్తు చేయాల్సిన పని లేదు. పాత ధ్రువీకరణ పత్రంలోని నంబర్ లేదా ఆధార్ ద్వారా అప్పటికప్పుడు మీసేవలో సర్టిఫికెట్ తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో విద్యార్థులు, ఇతరత్రా వారికి సేవలు సులభతరం కానున్నాయి. గతంలో మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకొని, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, నాయబ్ తహసీల్దార్, తహసీల్దార్ ఆమోదం పొందిన తర్వాత కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియకు కనీసం పక్షం రోజులు సమయం పట్టేది. కొత్త విధానంలో భాగంగా పాత సర్టిఫికెట్ చూయించి వెంటనే కొత్త సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
కాకతీయ కాలువకు తగ్గిన నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను అధికారులు తగ్గించారు. కాకతీయ కాలువకు 2500, లక్ష్మి కాలువ ద్వారా 150, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. అలీసాగర్, గుత్ప లిఫ్ట్ ద్వారా నీటి విడుదలను నిలిపివేశారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరిరూపంలో 482 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1080.10(45.16టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి ఖలీల్వాడి: నషా ముక్త్ భారత్ అభియాన్ ఐదో వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ రీజియన్ సమావేశ మందిరంలో మాదకద్రవ్యాల వ్యతిరేక సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న మాట్లాడుతూ మాదకద్రవ్యాల నివారణ, డ్రగ్స్ రహిత జీవన శైలి పాటించడం, అక్రమ రవాణా నిరోధించాలన్నారు. బస్సులో గంజాయి వంటి మత్తు పదార్థాలు రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాత్రంతా విధుల్లోనే.. డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాకు భారీ వర్ష సూ చన నేపథ్యంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు డొంకేశ్వర్ మండల అధికారులు బుధవారం రాత్రంతా విధుల్లోనే ఉన్నారు. త హసీల్దార్ నరేశ్ కుమార్తో కలిసి ఎంపీడీవో లక్ష్మి ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి మ ధుసూదన్, రెవెన్యూ సిబ్బంది తహసీల్ కార్యాలయంలోనే ఉండి పరిస్థితులను సమీక్షించా రు. ఆయా గ్రామాల ప్రజలతో ఫోన్లో మా ట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని హస్గుల్ క్వారీ నుంచి మంగళవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సముందర్ తండా శివారులో పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై అరుణ్ కుమార్ హెచ్చరించారు. -
వీడీసీ నిర్మించిన మడిగెలను సీజ్ చేయాలి
నిజామాబాద్ లీగల్: ఆర్మూర్ మండలం సుర్భిర్యాల్ గ్రామంలో పంచాయతీ స్థలం ఆక్రమించడంతోపాటు అనుమతి లేకుండా నిర్మించిన 11 మడిగెలను సీజ్ చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశించారు. సుర్భిర్యాల్ గ్రామంలో ఇటీవల మాదిగ కులానికి చెందిన వ్యక్తులపై వీడీసీ సాంఘిక బహిష్కరణ విధించింది. దీంతో బాధితులు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావును ఆశ్రయించారు. వీడీసీ సభ్యులు గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమంచి అక్రమంగా 11 షెటర్లను నిర్మించారని, వాటిలో రెండింటిని ఓ అగ్రవర్ణ కుల సంఘానికి అప్పగించారని, అదేవిధంగా తమకు కేటాయించాలని అడుగగా వ్యతిరేకిస్తున్నారని వివరించారు. దీనిపై స్పందించిన సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావు సుర్భిర్యాల్ పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, ఆర్ఐ ప్రమోద్లను తన కార్యాలయానికి పిలిపించుకొని సాంఘిక బహిష్కరణకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. గ్రామంలో కొందరు వ్యక్తులు చట్టానికి అతీతులుగా వ్యవహరిస్తుంటే పైఅధికారులకు నివేదికలు ఇవ్వాల్సింది పోయి వారికి సహకరించడం తగదని అన్నారు. ● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశం ● సుర్భిర్యాల్ వీడీసీ ఆగడాలపై ఆగ్రహం -
క్రైం కార్నర్
మట్టిలో కూరుకుపోయి కూలీ మృతి బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44 విస్తరణ పనుల్లో బిహార్కు చెందిన సురాజ్ నిశాద్(40) అనే కూలీ మట్టిలో కూరుకుపోయి మృతి చెందాడు. ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన కొంతమంది కూలీలు ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్నారు. మంగళవారం ముప్కాల్ మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణలో పని చేసేందుకు సునీల్, సురాజ్, ధీరేంద్రయాదవ్, రాజు వచ్చారు. పనిలో భాగంగా పైపులను పక్కకు జరిపేందుకు సురాజ్, ధీరేంద్రయాదవ్లు గుంతలోకి దిగారు. ప్రమాదవశాత్తు పైపులైన్ పక్కన ఉన్న మట్టి పెల్లాలు కూలి సురాజ్ పూర్తిగా కూరుకుపోగా, ధీరేంద్రయాదవ్ ఛాతి వరకు మట్టి పడింది. ఇద్దరినీ హైవే అంబులెన్స్లో ఆర్మూర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే సురాజ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, ధీరేంద్రయాదవ్ చికిత్స పొందుతున్నాడు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాడ్వాయి (ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని కరడ్పల్లి గ్రామంలో బుధవారం పట్టపగలు తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన పరువాజిగారి శివాజీ రావు కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పెళ్లి నిమిత్తం ఇతర గ్రామానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. అనంతరం బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రెండుతులాల బంగారం, రూ.40వేల నగదు, వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళి తెలిపారు. అదుపుతప్పిన కంటైనర్ సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామశివారు 44వ జాతీయ రహదారిపై కంటైనర్ అదుపుతప్పింది. బుధవారం తెల్లవారుజామున నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఘటనలో డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. సదాశివనగర్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో ఉండాలి
నిజామాబాద్ రూరల్: భారీ వర్ష సూచనల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కార్యస్థానాల్లో ఉండని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్ మండలం తిర్మన్పల్లి, పాల్దా గ్రామాలలో కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిర్మన్పల్లి రైతువేదికను సందర్శించిన కలెక్టర్.. ఏఈవో అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. రైతు వేదికకు తాళం వేసి ఉండడం, పలువురు రైతులు బయట నిరీక్షిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందుకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించారు. అదే సమయంలో ఏఈవో కూడా చేరుకోగా, రైతువేదిక వద్ద అందుబాటులో లేకుండా ఎక్కడికి వెళ్లావంటూ కలెక్టర్ నిలదీశారు. కార్యస్థానాలలో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యం వహించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. పాల్ద గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంత నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, దాని నిర్వహణను చక్కబెట్టాలని ఏపీవోను ఆదేశించారు. పాఠశాలకు 30 మంది విద్యార్థులు హాజరుకాగా, ముఖ గుర్తింపు విధానం ద్వారా 25 మంది హాజరు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేయడాన్ని గమనించిన కలెక్టర్, మిగతా విద్యార్థులు ఎఫ్ఆర్ఎస్ హాజరు విషయమై హెచ్ఎం సుమన్ రెడ్డిని ప్రశ్నించారు. సాంకేతిక కారణాలతో నమోదు కాలేదని హెచ్ఎం తెలుపగా, కలెక్టర్ తన సమక్షంలో విద్యార్థులు హాజరును ఎఫ్ఆర్ఎస్ విధానంలో నమోదు చేయించారు. ఎఫ్ఆర్ఎస్ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఎవరిని సంప్రదించాలనే విషయమై జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్ఎంలకు టెక్నికల్ పర్సన్ ఫోన్ నెంబర్, తదితర వివరాలతో కూడిన సమాచారాన్ని చేరవేయాలని ఫోన్ ద్వారా డీఈవోను ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో యూరియా, ఇతర ఎరువులను అందజేసినట్లు సొసైటీ సీఈవో రాకేశ్, కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మరింత అందుబాటులో ఉంచేందుకు వీలుగా 10 టన్నుల వరకు ఎరువుల కోసం ఇండెంట్ పంపినట్లు తెలిపారు. పాల్ద గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్ రూరల్లో ఆకస్మిక తనిఖీలు తిర్మన్పల్లి ఏఈవోపై ఆగ్రహం -
చికిత్స పొందుతూ కేజీబీవీ విద్యార్థిని మృతి
నిజామాబాద్నాగారం/ఆర్మూర్: తీవ్రగాయాలతో ప్రగతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేజీబీవీ విద్యార్థిని కావేరి(16) బుధవారం ఉదయం మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని దుబ్బకు చెందిన కావేరి ఆర్మూర్ పట్టణంపెర్కిట్లో ఉన్న కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 5న అర్ధరాత్రి కేజీబీవీ భవనం నుంచి కావేరి కిందకు దూకింది. తలకు తీవ్రగాయాలు కావడంతో కేకలు వేసింది. స్పందించిన కేజీబీవీ సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న ఎంజే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ప్రగతి ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా చికిత్స పొందిన కావేరి బుధవారం ఉదయం 8.40 నిమిషాల సమయంలో మరణించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. కోతులకు భయపడే.. కావేరి ఈ నెల 5న తెల్లవారుజామున హాస్టల్లోని వాష్రూంకు వెళ్లి వస్తుండగా కోతులు వెంటపడడంతో భయపడి హాస్టల్ పోర్టువాల్ ఎక్కి కిందకు దూకినట్లు కేజీబీవీ అధికారులు తెలిపారు. తలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా, కావేరి తండ్రి గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు.. రామారెడ్డి: ఆర్థిక ఇబ్బందులతో గడ్డి మందు తాగిన ఓ యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు రామారెడ్డి ఎస్సై లావణ్య తెలిపారు. రామారెడ్డికి చెందిన పోగుల నాగరాజు (37) కొంతకాలంగా మద్యం, పేకాటకు బానిసయ్యాడు. దురలవాట్లతో అప్పులు కావడంతో మానసిక ఒత్తిడికి గురై ఈ నెల 1న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 9న గుర్తుతెలియని గడ్డి మందు తాగిన నాగరాజును కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు. -
జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలి
ఎంపీకి సాధన కమిటీ సభ్యుల వినతి సుభాష్నగర్: కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని డ్రైపోర్టు సాధన కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు బుధవారం ఎంపీ అర్వింద్ ధర్మపురిని నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డ్రైపోర్టు సాధన కమిటీ సభ్యులు మాట్లాడుతూ నిజామాబాద్ను పారిశ్రామికీకరణ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. యువత, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, వారిని ఆర్థికంగా శక్తివంతం చేసేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో ఏదైనా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని విజ్ఞప్తిచేశారు. కాగా, డ్రైపోర్టు ఏర్పాటు విషయంలో వీలైనంత త్వరగా ఫిజిబిలిటీ రీసెర్చ్ చేయిస్తానని ఎంపీ హామీనిచ్చినట్లు తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో డ్రైపోర్టు సాధన కమిటీ సభ్యులు ఎన్ దినేశ్ రెడ్డి, హితేన్, లక్ష్మణ్, బీజేపీ నాయకులు గోపిడి స్రవంతిరెడ్డి, తదితరులు ఉన్నారు. -
విద్యా బోధనకు సమయమేది..?
ప్రభుత్వ పాఠశాలల్లోని గురువులపై బోధనేతర పనుల భారం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు పాఠాలు చెబుతూ బిజీగా ఉండే ఉపాధ్యాయులు నేడు యాప్, ఆన్లైన్ పనులతో కుస్తీ పడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. నిజామాబాద్అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఆన్లైన్ పనులు ప్రతిబంధకంగా మారాయి. బోధనేతర పనులన్నీ ఉపాధ్యాయులు చేయాల్సి ఉండడంతో పాఠాల బోధన క్లిష్టతరంగా మారింది. మరోవైపు రాష్ట్ర విద్యాశాఖతోపాటు జిల్లా, మండల స్థాయి అధికారులు అడిగే నివేదికలు పంపేందుకు సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థుల వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేయలేదని 13 మంది హెచ్ఎంలకు జిల్లా విద్యాశాఖ మెమోలు జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయులు మరింత ఆందోళన చెందుతున్నారు. సగం సమయం వీటికే.. ప్రతిరోజు పాఠశాలలో ప్రార్థన నుంచే ఉపాధ్యా యులకు ఆన్లైన్ పని మొదలవుతుంది. డీఎస్ఈ–ఎఫ్ఆర్ఎస్ (డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేస్తారు. దీనికి అరగంట నుంచి గంట వరకు కేటాయించాల్సి వస్తోంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో అల్పాహారం, మిగతా పాఠశాల ల్లో రాగిజావ పెట్టేందుకు మరొక గంట సమయం పడుతుంది. మొదటి రెండు పీరియడ్లు గడిచిన త ర్వాత మధ్యాహ్న భోజనానికి గంట సమయం కేటాయించాల్సి వస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో గతే డాది ప్రవేశపెట్టిన తొలిమెట్టు, ఈ ఏడాది నుంచి ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టిన ఉన్నతి కార్యక్ర మాల నిర్వహణ, వాటి పరీక్షలకు పాఠ్యప్రణాళిక తయారీ, బోధన ఉపకరణాల ను సమకూర్చాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ), ఎల్ఐపీ (లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం), విద్యార్థుల వివరాలను యూడైస్ ప్లస్లో నమోదు చేయడం, కంప్యూటర్ల నిర్వహణ తదితర కార్యక్రమాలు ఉంటాయి. ఒత్తిడిలో ఉపాధ్యాయులు బోధనేతర పనులతో ప్రభుత్వ ఉపాధ్యాయు లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మధ్యాహ్న భోజన పర్యవేక్షణ బాధ్యతలంటే జంకుతున్నారు. గతేడాది నవీపేట, రెంజల్, బోర్గాం(పి) పాఠశాలలకు చెందిన పలువురు ప్రధానోపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. ఒకవైపు మెనూ ప్రకారం మఽ ద్యాహ్న భోజనం వడ్డించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. మరోవైపు సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఏజెన్సీల నిర్వాహకు లు మెనూ పాటించలేని పరిస్థితి ఏర్పడుతోంది. మంచినీటి వసతి, సరైన వంట పాత్రలు లేక చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భాలున్నాయి. వీటన్నింటికీ ప్రధానోపాధ్యాయులే కారణంగా చూపుతూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. బోధనేతర పనుల నుంచి తప్పించాలి మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాల నుంచి హెచ్ఎంలను తప్పించాలి. వాటిని ప్రత్యేక ఏజెన్సీలకు అప్పగించాలి. ఉన్నతి కార్యక్రమాన్ని సరళీకృతం చేసి బోధనకు ఎక్కువ సమయం కేటాయించేలా హెచ్ఎంలకు అవకాశం ఇవ్వాలి. ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలి. – రవీందర్ గౌడ్, పీఆర్టీయూ నాయకుడు ఇబ్బంది లేకుండా పనిచేయాలి టీచర్లు తమకు కేటాయించిన పనులను ఇ బ్బంది లేకుండా చేయాలి. పాఠశాలలో మిగ తా టీచర్ల సహాయం తీసుకోవాలి. సరైన ప్ర ణాళిక ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆన్లైన్ పనులు కూడా ఎక్కువ సేపు ఉండవు. – అశోక్, డీఈవో బోధనేతర పనులతో ఉపాధ్యాయులకు ఇబ్బందులు యాప్, ఆన్లైన్ పనులే అధికం అల్పాహార, మధ్యాహ్న భోజన అమలు బాధ్యతా గురువులకే.. అటకెక్కుతున్న పాఠ్యాంశాల బోధన -
831 ఇళ్లకు ఒకేసారి ముగ్గు
నిజామాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప నుల వేగవంతానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏకకాలంలో ఇందిరమ్మ ఇళ్ల పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధ, గురువారాల్లో మంచి రోజులు ఉండడంతో ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ మహామేళా చేపట్టనున్నారు. మొదటి స్థానం కోసం.. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ సంకల్పించా రు. అందులో భాగంగా అధికారులతో సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడుతున్నారు. సంబంధిత శాఖల అధికారులకు సూచనలు, సలహాలు ఇ స్తున్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనివారికి మె ప్మా, డీఆర్డీవో సహకారంతో రుణాలు మంజూరు చేయిస్తున్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవా రం జిల్లా వ్యాప్తంగా 831 ఇళ్లకు మార్కింగ్ చేయనుండగా, అధికంగా నిజామాబాద్ అర్బన్లో 133, ఆర్మూర్లో 47, మాక్లూర్లో 44, రెంజల్లో 41 ఇళ్లకు భూమిపూజ చేయనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాకు 17,301 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, అందులో 9,526 ఇళ్లు పురోగతిలో ఉన్నాయి. వీటిలో బేస్మెంట్ లెవల్లో 5,043, రూఫ్ లెవల్లో 796, స్లాబ్ పూర్తయిన 256 ఇళ్లు ఉన్నాయి. ఆ ఇళ్లపై కొనసాగుతున్న విచారణ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గతంలో ఇళ్లు పొందిన, వాహనాలు కలిగిన 355 మంది లబ్ధిదారులను అధికారులు పక్కన పెట్టారు. కాగా, జాబితాలో కొందరు గతంలో ఇల్లు నిర్మించుకొని మధ్యలోనే నిలిపివేసిన వారు ఉన్నారు. వీరు కూడా ప్రస్తుతం లబ్ధిదారులేనని, వారికీ ఇళ్లు అందేలా చూడాలని మళ్లీ ఆదేశాలు అందాయి. దీంతో మండల పరిషత్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. మరో మూడు రోజుల్లో విచారణ పూర్తిచేసి అర్హులైన వారి జాబితాను ప్రకటించనున్నారు. దీంతో లబ్ధిదా రుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నేడు ఇందిరమ్మ ఇళ్ల ‘మార్కింగ్ మహామేళా’ జిల్లా వ్యాప్తంగా పనుల ప్రారంభం -
6.5 కిలోల గంజాయి స్వాధీనం
ఖలీల్వాడి: నగరానికి గంజాయి తీసుకు వస్తున్న ఒకరిని పోలీసులు పట్టుకొని, అ తడి వద్ద నుంచి 6.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇ లా.. నగరంలోని అమన్ నగర్, ఖిల్లా రోడ్డులో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకట్ తనిఖీలు చేపట్టారు. నగరానికి చెందిన షేక్ మిరాజ్ బైక్పై ఎండు గంజాయి తీసుకువస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించగా మహారాష్ట్రలోని బోకర్కు చెందిన ఫారుఖ్ ఖురేషి నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. అతడి వద్ద ఉన్న 6.5 కిలోల గంజాయిని, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫారుఖ్ ఖురేషీ పరారీలో ఉన్నారని, మిరాజ్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎకై ్సజ్ ఎస్సై నరసింహచారి, సిబ్బంది నారాయణరెడ్డి, అవినాష్, విష్ణు, భోజన్న, శ్యామ్ తదితరులు ఉన్నారు. -
దొంగ ఓట్లతో అధికారంలోకి..
నిజామాబాద్ సిటీ: ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకొని దొంగ ఓట్లతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్ నుంచి ధర్నాచౌక్ వర కు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించారు. ధర్నాచౌక్ వద్ద ఓ టరు జాబితాను దహనం చేశారు. అనంతరం మా నాల మోహన్రెడ్డి మాట్లాడుతూ ఓట్ల దొంగతనాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగం చేయగానే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ను మూసివేసిందన్నారు. నుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు మాట్లాడుతూ దొంగ ఓట్ల వ్యవహారం బయటపెట్టిన రాహుల్గాంధీని బీజేపీ నేతలు విమర్శించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో నాయకులు రాంభూపాల్, బాడ్సీ శేఖర్గౌడ్, జీ వీ రామకృష్ణ, విపుల్ గౌడ్, వేణురాజ్, రత్నాకర్, న రేందర్ గౌడ్, లింగం, కెతావత్ యాదగిరి, సయ్యద్ ఖైసర్, ప్ర మోద్, మధుసూదన్, బొబ్బిలి రామకృష్ణ, వినయ్, సంగెం సాయిలు, మహిళా కాంగ్రెస్ నాయకులు మఠం రేవతి, పోల ఉష, పుప్పాల విజయ, స్వప్న, మీనా, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా మారింది ఓట్ల గోల్మాల్ను రాహుల్గాంధీ బయటపెట్టారు డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి -
తాళ్ల రాంపూర్ వీడీసీ రద్దు
మోర్తాడ్(బాల్కొండ): కల్లు విక్రయాలపై నిషేధం విధించి, గీతా కార్మిక సంఘం సభ్యులకు ఆలయ ప్రవేశం లేదని హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ అంటూ ఏది ఉండదని కమిటీని రద్దు చేస్తున్నట్లు మంగళవారం సభ్యులుగా వ్యవహరించిన వారు ప్రకటించారు. సహకార సంఘం ఫంక్షన్ హాల్లో గ్రామస్తుల సమక్షంలో గ్రామాభివృద్ధి కమిటీ రద్దు అంశాన్ని వెల్లడించారు. దీంతో గడచిన పది నెలల నుంచి తాళ్లరాంపూర్లో నెలకొన్న వివాదానికి తెరపడినట్లు అయ్యింది. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల గ్రామంలో చైతన్య సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయమూర్తి, ఇతర న్యాయాధికారులు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో వీడీసీ స భ్యులు, గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసు కుని ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ సమక్షంలో వీడీసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ ప్రవేశంపై ఆంక్షలు ఎప్పుడూ లేవని ఇదంతా ఒక కల్పితమని వీడీసీ సభ్యులు ప్రధానంగా వివరించారు. వీడీసీ రద్దు ప్రకటనతో గ్రామస్తులు ఐక్యంగా ఉంటారా లేదా అనే విషయం ముందు ముందు తేలనుందని చెప్పవచ్చు. -
ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదులకు గుణపాఠం
సుభాష్నగర్: భారతదేశం వైపు కన్నెత్తి చూసే ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్తో గుణపాఠం చెప్పా మని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూ ర్యనారాయణ పేర్కొన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీచౌక్ నుంచి తిలక్ గార్డెన్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున చేసిన భారత్ మాతాకీ జై అనే నినాదాలతో ఇందూరు నగరం హోరెత్తింది. తిలక్ గార్డెన్ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతలాపన కార్యక్రమంతో ర్యాలీ ముగిసింది. ఈ సందర్భంగా ధన్పా ల్ సూర్యనారాయణ మాట్లాడుతూ అమరుల త్యా గాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, జాతీయత, దేశభక్తిని ప్రపంచదేశాలకు చాటిచెప్పేలా ప్రధాని మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆపరేషన్ సిందూర్ వంటి చారిత్రాత్మక రక్షణ చర్యలతో భారత సైన్యం శౌర్యం, నాయక త్వం ఎంత దృఢంగా ఉందో ప్రపంచానికి చాటి చె ప్పారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కు లాచారి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజీ ఫ్లోర్లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, హర్ ఘర్ తిరంగా కో కన్వీనర్ రాంచందర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీశ్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జాతీయత, దేశభక్తి, ఐక్యత చాటిచెప్పేలా భారీ తిరంగా ర్యాలీ -
ట్రాఫిక్ నియంత్రణ చర్యలు బలోపేతం చేయాలి
కమ్మర్పల్లి/ఆర్మూర్టౌన్/మాక్లూర్/ఖలీల్వాడి: ప్రజల ప్రాణాల రక్షణ కోసం ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా సరిహద్దు కమ్మర్పల్లి నుంచి బోధన్ వరకు 77 కిలోమీటర్ల మేర ఉన్న ఎన్హెచ్–63ని మంగళవారం పోలీసు, ఆర్అండ్బీ, ఎన్ఐసీ, పంచాయతీరాజ్, రవాణ, 108 సర్వీస్ తదితర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. కమ్మర్పల్లి మండల కేంద్ర శివారులోని పెట్రోల్ బంక్ వద్ద యాక్సిడెంట్ స్పాట్ను క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షాల కారణంగా రోడ్లపై గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి మరమ్మతులు త్వరగా చేపట్టాలన్నారు. ఎన్హెచ్–63 పరిధిలో ఉన్న దుకాణాలు, ప్రకటనల బోర్డులు, విగ్రహాలను వెనక్కి జరిపించాలని సూ చించారు. గ్రామాల్లో పాదచారులు రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని చోట్ల జంక్షన్లు మూసి వేయడానికి బా రికేడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మూలమలుపుల వద్ద రోడ్డు విశాలంగా కనపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిని కలిపే అన్ని రకాల రోడ్లకు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయా లని ఆదేశించారు. ప్రజలకు అవగాహన కల్పించాలి హైవేకు సమీపంలోని గ్రామాల ప్రజలకు అవగా హన కల్పించడంతోపాటు వారి సూచనలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ అధికారులు డ్రైవర్లకు తగిన సలహాలు, సూ చనలు ఇవ్వాలన్నారు. వృద్ధాప్యం, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారికి లాంగ్ రూట్ డ్యూటీ లు వేయకుండా ఉండటమే మంచిదని సూచించారు. ఆర్మూ ర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదం ఘటన నమూనా దృశ్యాన్ని కలెక్టర్, సీపీ తిలకించి అభినందించారు. వారి వెంట ఎన్హెచ్ పెర్కిట్ ఈఈ మల్లారెడ్డి, మంచిర్యాల పీడీ అజయ్, డీటీవో ఉమా మహేశ్వర్రావు, ఆర్అండ్బీ ఏఈ సతీశ్, పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది రామకృష్ణ, ఏసీపీలు మస్తాన్ అలీ, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్, ఐఆర్ఏడీ మేనేజర్ శ్రీవర్ష, 108 సర్వీసెస్ ప్రతినిధి రామలింగేశ్వరరెడ్డి, ఆర్మూర్ ము న్సిపల్ కమిషనర్ రాజు, సీఐలు, ఎస్సైలు, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య జిల్లా పరిధిలోని ఎన్హెచ్–63పై ఉన్న 26 బ్లాక్ స్పాట్ల పరిశీలన రోడ్ల మరమ్మతులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం -
ఎఫ్ఆర్ఎస్ సంపూర్ణంగా అమలు చేయాలి
నందిపేట్(ఆర్మూర్): పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థుల హాజరుకు ఫేషి యల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్)ను సంపూర్ణంగా అమలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని హెచ్ఎం మంజులకు సూ చించారు. అంతకుముందు పీహెచ్సీని తనిఖీ చేసి న కలెక్టర్, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను పరిశీలించారు. గర్భిణులు స్థానికంగానే సుఖ ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడిక ల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్కు సూచించారు. హైరిస్క్ కేసులను సీహెచ్సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేయాలన్నారు. స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచాలని, ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాక్సినేషన్, టీబీ ముక్త్భారత్ అభియాన్ అమలు, గ్రామాల్లో ఆరోగ్య శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. అనంతరం ఎరువుల గోదామును తనిఖీ చేశారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని మండల వ్యవసాయాధికారి రాంబాబు, గో డౌన్ నిర్వాహకుడు కార్తిక్ను ఆదేశించారు. పశువైద్యశాలను సందర్శించి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు, కృత్రిమ గర్భధారణ తదితర సేవలపై పశువైద్యాధికారి నితీశ్ వర్మను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ స్టేషన్ను సందర్శించి విపత్తులు, అతివృష్టి సంభవించినప్పుడు సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని స్టేషన్ ఆఫీసర్ నర్సింగ్రావును ఆదేశించారు. నర్సరీ మొక్కలపై సంతృప్తి మండల కార్యాలయం ఆవరణలోని నర్సరీలో మొక్కలు ఆరోగ్యంగా ఉండడాన్ని చూసి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎంపీడీవో శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతి గురించి ఆరా తీశారు. ఈ నెల 13న మార్కింగ్ మేళాలో లబ్ధిదారులందరూ మార్కింగ్ పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం తహసీల్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతిపై సమీక్షించారు. ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా చూడాలని తహసీల్దార్ సతీశ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి నందిపేటలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు -
రుణ మాఫీ కొందరికేనా!
మోర్తాడ్ మండలం సుంకెట్కు చెందిన రైతు ఆరెపల్లి గంగాప్రసాద్కు ఎస్బీఐలో రూ.50వేల రుణం ఉంది. అతని పేరిట రెండు ఖాతాలు ఉన్నాయని ఆన్లైన్లో చూపడంతో రుణమాఫీ సొమ్ము జమకాలేదు. వాస్తవానికి సదరు రైతుకు ఒక్కటే రుణ ఖాతా ఉంది. బ్యాంకర్ల తప్పిదంతోనే గంగాప్రసాద్ పేరిట రెండు ఖాతాలు ఉన్నాయి. దీంతో ఏ విడతల్లోనూ గంగాప్రసాద్కు రుణమాఫీ వర్తించలేదు. బ్యాంకు ఖాతాను సరిచేసి రుణమాఫీ సొమ్మును జమ చేయాల్సి ఉండగా ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో అతనికి నిరాశే మిగిలింది. సుంకెట్కు చెందిన మరో రైతు సాయిరాంకు వేల్పూర్ మండలం రామన్నపేట్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.2.45లక్షల రుణం ఉంది. మాఫీ సొమ్ము పరిమితి కంటే ఎక్కువ రుణం ఉండటంతో సాయిరాంకు మాఫీ వర్తించలేదు. తన బకాయిలో రూ.45వేలను చెల్లించడానికి సాయిరాం సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం నుంచి సరైన సమాచారం లేకపోవడంతో రుణమాఫీకి అర్హుడు కాలేకపోయాడు. ఇది ఒక్క గంగాప్రసాద్, సాయిరాంలకు ఎదురైన సమస్యనే కాదు. రూ.2లక్షల వరకు పంట రుణం బకాయి ఉన్న అనేక మంది రైతులకు కలిగిన అసౌకర్యం.మోర్తాడ్(బాల్కొండ): తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన రైతులు అందరికీ రూ.2లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. కానీ రెండేళ్లు దగ్గరపడుతున్నా రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రుణమాఫీ ఊసెత్తకపోవడంతో అర్హులైన అనేక మంది రైతుల ఆశలు ఆవిరి అవుతున్నాయి. జిల్లాలో 97,696 మందికి.. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో రుణమాఫీ అమలు చేయగా, జిల్లాలోని 97,696 మంది రైతులు లబ్ధిపొందారు. వారికి సుమారు రూ.755 కోట్ల, 29 లక్షల, 40వేలు మాఫీ సొమ్ము ఖాతాల్లో జమ చేశారు. అప్పట్లో ప్రభుత్వం జిల్లాకు సంబంధించి 1,00,612 మంది రైతులకు రూ.782.30 కోట్ల నిధులు రుణమాఫీ కోసం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 2,916 మంది రైతుల వివరాలు సరిగా లేకపోవడంతో రూ.27.01కోట్ల మాఫీ సొమ్ము తగ్గిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఒక కుటుంబానికి రూ.2లక్షల రుణం మాఫీ చేయాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాలో రుణమాఫీకి అర్హులైన వారి సంఖ్య ఇంకో 50వేల వరకూ ఉంటుందని అంచనా. రుణమాఫీకి అవసరమైనన్ని నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తూతూ మంత్రంగానే రుణాలు మాఫీ అయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలోనూ నిరాశే... బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ రుణమాఫీపై అనేక మంది రైతులు ఆశలు వదులు కోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో రుణమాఫీ లక్ష్యం రూ.1790 కోట్లు కాగా 2,91,188 మంది రైతులకు మాఫీ సొమ్ము జమ చేయాలని నిర్ణయించారు. అప్పట్లోనూ నిధుల కేటాయింపు సరిగా జరగకపోవడంతో కేవలం 97,418 మంది రైతులకు రూ.490.72 కోట్లు మాత్రమే మాఫీ జరిగింది. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి అర్హత ఉండి రుణమాఫీ పొందని రైతులకు మాఫీ ఫలాలు అందించాలని పలువురు కోరుతున్నారు. మాట తప్పడం సరికాదు.. ప్రభుత్వం రుణమాఫీ విషయంలో మాట తప్పడం సరికాదు. నిధులను కేటాయించి రైతులను రుణ విముక్తులను చేయాలి. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా మాట తప్పితే విలువ ఏముంటుంది. రేవంత్రెడ్డి సర్కార్ రుణమాఫీపై స్పందించాలి. – సల్ల రాజేశ్వర్, రైతు, తొర్తిరైతులకు అండగా నిలవాలి.. రుణం మాఫీ అవుతుందనే ఆశతో ఎంతో మంది రైతులు సకాలంలో రుణాలను రెన్యూవల్ చేసుకోక బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్లుగా ఉండిపోయారు. రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసి సీఎం రేవంత్రెడ్డి అన్నదాతలకు అండగా నిలవాలి. – మాదాం చిన్న నర్సయ్య, రైతు, తొర్తిస్పష్టత రావాల్సి ఉంది గతంలో రుణ మాఫీ అయిన రైతుల సమాచారం మాత్రమే వ్యవసాయ శాఖ వద్ద ఉంది. నిధుల విడుదల విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు. రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. – గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి, నిజామాబాద్ రూ.2లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నాలుగు విడతల్లో కొంత మందికే చేశారని ఆరోపణలు -
తెయూలో ముగిసిన తీజ్ ఉత్సవాలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో 9 రోజులుగా నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. బంజార ఆడబిడ్డలు 9 రోజులు ఉపవాసదీక్షలు పాటించి తీజ్ పై భోగ్ బండార్తోపాటు మూడు పూటలు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి గోధుమ మొలకల బుట్టలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. ఈసందర్భంగా బంజారా విద్యార్థినులు చేసిన సంప్రదాయ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శాంతాబాయి, కాంట్రాక్టు అధ్యాపకులు కిరణ్రాథోడ్, గిరిజన శక్తి విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీనురాథోడ్, ఎన్ఎస్ఎస్యూ అధ్యక్షులు సాగర్ నాయక్, బోధనేతర సిబ్బంది బికోజి, నరేష్, మహావీర్, పూజారి రమేష్ గిరి మహరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
మృత్యువులోనూ కలిసే..
కామారెడ్డి క్రైం: కవలలుగా కలిసి జన్మించారు. మృత్యువులోనూ కలిసే లోకాన్ని వీడిపోయారు. పిల్లలే సర్వస్వంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులకు జరిగిన ఘటన కడుపుకోతను మిగిల్చింది. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా తిమ్మక్పల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గుర్రాల పెద్ద నర్సింలు, మంజుల దంపతులకు రామ్, లక్ష్మణ్ (13) అనే కవలలు ఉన్నారు. స్థానికంగా ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుకుంటున్నారు. రోజూ మాదిరిగానే సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వారిద్దరూ బ్యాగులు ఇంట్లో పెట్టి ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. రాత్రి 10 గంటలైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారు. సమీపం లోని కుంట కట్ట పైన పిల్లల బట్టలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి పోలీసులు, గ్రామస్తులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకుని కుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒకరి మృత దేహం, మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మరొక బాలుడి మృతదేహలు లభ్యమయ్యాయి. సరదాగా గడిపేందుకు నీళ్ల లోకి దిగి లోతు ఎక్కువగా ఉండటంతో ఈత రాక నీటమునిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతి చెందిన కవల పిల్లల తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. కుటుంబంలో తీరని విషాదం..గ్రామానికి చెందిన పెద్ద నర్సింలు నిత్యం కామారెడ్డికి వచ్చి రోజువారీ మేసీ్త్ర పనులు చేస్తూ, మంజుల బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నా రు. 13 ఏళ్ల క్రితం నర్సింలు దంపతులకు కవలలు పుట్టారు. ఇద్దరు కుమారులు ఒకేసారి జన్మించడంతో తరువాత సంతానం వద్దనుకున్నారు. రామ్, లక్ష్మణ్ అనే పేర్లు పెట్టుకుని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. పిల్లలే సర్వస్వంగా ఉన్నదాంట్లో సంతోషంగా బతుకుతున్నారు. ఉన్న ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. కుంటలో పడి కవలల దుర్మరణం కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లిలో ఘటన -
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్అర్బన్: రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సీఎం రేవంత్రెడ్డి మంత్రులతో కలిసి మంగళవారం సాయంత్రం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని, అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలు కూడా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ 08462–220183కు సమాచారం ఇవ్వాలన్నారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా, అప్రమత్తంగా వ్యవహరించి, తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీస్ కమిషనర్ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -
డొంకేశ్వర్ జెడ్పీహెచ్ఎస్లో ఏఐ పాఠాలు
● మద్రాస్ ఐఐటీ నుంచి స్కూల్ కోడ్ కనెక్ట్ ప్రోగ్రాం అనుసంధానం ● పదో తరగతి విద్యార్థులకు రెండు నెలల పాటు బోధన డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో ఏఐ పాఠాలు బోధించనున్నారు. ఇందుకోసం మద్రాస్ ఐఐటీ డొంకేశ్వర్ జెడ్పీ స్కూల్లో బోధనకు అంగీకారం తెలిపింది. ఈమేరకు మద్రాస్ నుంచి స్కూల్ కోడ్ కనెక్ట్ ప్రోగ్రాంను పాఠశాలకు అనుసంధా నం చేసినట్లు హెచ్ఎం సురేశ్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే విద్యార్థులకు ఆన్లైన్ తరగతు లు కూడా ప్రారంభమైనట్లు తెలిపారు. 10వ త రగతి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బయోలాజికల్ ఇంజినీరింగ్ సిస్టమ్స్, అర్కిటెక్చర్ ఇంజినీరింగ్ తదితర టెక్నాలజీలో బోధన చేయనున్నారు. ఆగస్టు, సెప్టెంబర్లో ఈ సర్టిఫికెట్ కోర్సులు అందించనున్నారు. అ క్టోబర్లో ఆన్లైన్ పరీక్షను నిర్వహించి కోర్సు పత్రాలను అందజేస్తారు. ప్రస్తుతం డొంకేశ్వర్ పాఠశాల నుంచి 48మంది విద్యార్థులు ఈ కో ర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పదో తరగతిలోనే విద్యార్థులు ఐఐటీ సాంకేతికతపై పట్టు సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని హెచ్ఎం అన్నారు. ఈ సందర్భంగా మద్రాస్ ఐఐటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్లో ఒకేషనల్ కోర్సు.. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ విభాగంలో ఒకేషనల్ కోర్సు కూడా ప్రారంభమైనట్లు హెచ్ఎం తెలిపారు. తరగతి గదుల్లో బోధనలో భాగంగానే ఈ కోర్సును నేర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యేకంగా మైండ్ లీడర్స్ సంస్థ తరపున ఒక టీచర్ను నియమించామన్నారు. -
నలుగురికి రెండు రోజుల సాధారణ జైలు
ఆర్మూర్టౌన్: పట్టణంలో సోమవారం డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. నలుగురు వ్యక్తులకు సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. ‘డయల్ 100’ దుర్వినియోగంపై ఒకరికి జైలుధర్పల్లి: డయల్ 100ను దుర్వినియోగం చేసిన ఓ వ్యక్తికి కోర్టు నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్కు చెందిన కేతావత్ పరశురాం తీజ్ పండుగ సందర్భంగా ఇటీవల మండలంలోని డీబీ తండాలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. మద్యం సేవించి ఈ నెల 8న డయల్–100కు పలుమార్లు ఫోన్చేసి పోలీసుల విధులను దుర్వినియోగం పరిచాడు. దీంతో పోలీసులు పరశురాంపై కేసు నమోదు చేసి సోమవారం నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జడ్జి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై కళ్యాణి తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలోని బజాన్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుడి వయసు సుమారు 45 నుంచి 50 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 8712686173ను సంప్రదించాలని తెలిపారు. సేవా సంస్థలో చోరీకి యత్నంఖలీల్వాడి: నగరంలోని గుర్బాబాది రోడ్ కెనాల్ కట్ట ప్రాంతంలో ఉన్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో సోమవారం దుండగుడు చోరీకి యత్నించాడు. మధ్యాహ్న సమయంలో కార్యాలయ తాళాలు పగులగొట్టి లోనికి చొరబడేందుకు ప్రయత్నించాడు. ఇందూరు యువత సిబ్బంది కార్యాలయానికి వచ్చేసరికి డోర్స్ తెరిచి ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి మూడో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై ఎస్సై హరిబాబును వివరణ కోరగా చోరీయత్నం జరిగిందని, దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఠాణాలో చేయి కోసుకున్న యువరైతు● భూ సమస్యను పరిష్కరించాలని ఆత్మహత్యాయత్నం నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): భూ వివాదాన్ని పరిష్కరించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన సిద్ధిగారి యాదగిరి అనే యువరైతు సోమవారం రాత్రి స్థానిక పోలీస్స్టేషన్లో బ్లేడ్తో చేయికోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన ఎస్సై భార్గవ్గౌడ్ వెంటనే యాదగిరిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో మెదక్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, అందుకు యాదగిరి సహకరించకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా యాదరిగి మాట్లాడుతూ తన తండ్రి రాములు గతంలో గ్రామానికి చెందిన కొందరి వద్ద సుమారు రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశాడన్నారు. ధరణి వచ్చిన తర్వాత తమ భూమి గ్రామానికి చెందిన ఇతరుల పేరిట నమోదైందని, ఈ విషయమై పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా, పోలీస్స్టేషన్కు వచ్చిన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎకరానికి రూ.50 వేలు చెల్లిస్తున్నాం
గత రెండు సంవత్సరాల నుంచి కౌలు రేట్లు భారీగా పెరిగాయి. ఎకరానికి రూ.50 వేలు కౌలు చెల్లిస్తున్నాం. రెండేళ్ల క్రితం రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు చెల్లించే వాళ్లం. రెండేళ్ల నుంచి అదనంగా ఎకరానికి రూ. 10 వేలు రైతుకు చెల్లిస్తున్నాం. రెండు సంవత్సరాల కౌలు ముందుగా నే అందజేస్తున్నాం. దీనివల్ల బాగా నష్టపోవాల్సి వస్తుంది. కూనీపూర్ శివారులో 30 ఎకరాలు కౌలు చేస్తున్నాను. ఎకరానికి రూ. 10 వేల చొప్పున రూ.6 లక్షలు రెండేళ్లకు సరిపడా కౌలును అదనంగా చెల్లించాల్సి వస్తుంది. – పల్సర్ కృష్ణ, వెంకటేశ్వర క్యాంప్, వర్ని -
పతకాలు సాధించిన అథ్లెట్స్కు సన్మానం
నిజామాబాద్ నాగారం: రాష్ట్రస్థాయి పోటీలలో పతకాలు సాధించిన జిల్లా అథ్లెట్స్, పీఈటీలతోపాటు జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన జైపాల్ను అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరాల రత్నాకర్ ఘనంగా సన్మానించారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో జిల్లాలో అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ నిర్మిస్తుందన్నారు. అథ్లెటిక్స్ని ప్రోత్సహిస్తున్న పాఠశాలల కరస్పాండెంట్లు, తల్లిదండ్రులను అభినందించారు. ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్ మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయుల సమష్టి కృషి ఫలితంగానే అథ్లెటిక్స్లో విజయాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మరింత ప్రోత్సహిస్తే జాతీయస్థాయిలో రాణిస్తారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేయాలినిజామాబాద్ సిటీ: బీసీల రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ధర్నాచౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలన్నారు. సామాజికంగా వెనుకబడిన తరగతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, పదేళ్లుగా అధికారంలో బీజేపీ ప్రభుత్వం జనాభాకనుగుణంగా కులగణన చేయలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎ.రమేశ్ బాబు, నూర్జహాన్, వెంకటేశ్, నన్నేసాబ్, గంగాధర్, బెజుగం సుజాత, జంగం గంగాధర్, విఘ్నేశ్, నాయక్వాడి శ్రీనివాస్, కటారి రాములు, అనసూయమ్మ, శ్రీదేవి, నరేశ్, మహేందర్, శేఖర్ గౌడ్, నరేష్, ఒడ్డన్న తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్పై రౌడీషీట్ నిజామాబాద్ రూరల్: మండలంలోని ఆకుల కొండూర్ మాజీ సర్పంచ్ అశోక్పై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. ఇది వరకు ఆయ నపై పది కేసులు ఉన్నాయని వాటి ఆధారంగా రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు ఎస్హెచ్వో మహ్మద్ ఆరిఫ్ తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా తమ పార్టీ నాయకులపై కేసులు పెడుతోందని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. -
ప్రజావాణికి అధికారులు హాజరుకావాలి
నిజామాబాద్ అర్బన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపించొద్దని, జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణిలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో జిల్లా అధికారుల హాజరును పరిశీలించేందుకు అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు. సోమవారం ఐడీవోసీలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ప్రజావాణికి పలు శాఖల జిల్లా అధికారులు గైర్హాజరు కావడం, మరికొందరు కిందిస్థాయి అధికారులను పంపించడంపై కలెక్టర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కావడం సమంజసం కాదన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణిలో తప్పక ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎవరికై నా అత్యవసర పని ఉంటే, ముందుగానే తమ దృష్టికి తేవాలని సూచించారు. అనుమతి లేకుండా ప్రజావాణికి గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజావాణిలో ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్ రావు, మెప్మా పీడీ రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం పలువురి గైర్హాజరుపై అసహనం -
‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
సుభాష్నగర్: జిల్లాలో ప్రతి బూత్స్థాయిలో బీజేపీ బలోపేతంపై దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ప్రతి బూత్ను బీజేపీ బూత్గా చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడితో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు -
భార్యతో ఫోన్ మాట్లాడుతూ భర్త ఆత్మహత్య
మద్నూర్(జుక్కల్): ‘ఎన్ని నెలలైంది నువ్వు ఇక్కడికి వస్తలేవు.. నిన్ను అన్ని రకాలుగా బాగా చూసుకుంటాను. ప్లీజ్ వచ్చేయ్’ అంటూ భార్యతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉరేసుకొని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మద్నూర్ మండలం మేనూర్ గ్రామంలో జరిగింది. ఎస్సై విజయ్ కొండ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మేనూర్కి చెందిన సాబ్డె సాయిలు(31)కు నాలుగు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని చైన్పూర్ గ్రా మానికి చెందిన శోభతో వివాహమైంది. మనస్పర్థలతో ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన శోభ తిరిగి రాలేదు. ఈ క్రమంలో సోమవారం శోభకు సాయి లు ఫోన్ చేశాడు. కాపురానికి రావాలని బ్రతిమిలాడాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. తల్లి సరుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. జీవితంపై విరక్తితో ఒకరు.. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామానికి చెందిన కై రి నరేశ్(39) మద్యానికి బానిసై తన భార్యతో గొడవ పడి మూడు నెలల క్రితం ఫత్తేపూర్ గ్రామానికి వచ్చాడు. అక్కడే ఉంటూ కూలీ పనిచేస్తూ జీవనం సాగించాడు. సోమవారం జీవితంపై విరక్తితో గుళికల మందు తాగి మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి కై రి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. కాపురానికి రావట్లేదని మనస్తాపంతో.. -
పచ్చందనమే.. పచ్చదనమే
రహదారికి ఇరువైపులా ఉన్న పచ్చదనం, ప్రకృతి అందాలు వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ గుట్టలు, కనుచూపుమేరలో పచ్చని పొలాలతో నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నుంచి కామారెడ్డి జిల్లా గాంధారి వెళ్లే దారి కనువిందు చేస్తోంది. ఈ దారిలో ప్రయాణం అరకు అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రాంతంలో కేవలం వర్షపు నీటి ఆధారంగా గిరిజనులు గుట్టలపై మొక్కజొన్న, పెసర, మినుపు వంటి పంటల్ని సాగుచేస్తుంటారు. ఈ దారి గుండా వెళ్లే ప్రయాణికులకు ఈ పచ్చని సోయగాలు మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
వరద కాలువకు నీటి విడుదల నిలిపివేత
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు సోమవారం మధ్యాహ్నం నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదలను నిలిపి వేసినట్లు వరద కాలువ డిప్యూటీ ఈఈ గణేశ్ తెలిపారు. కాకతీయ కాలువకు 3 వేలు, లక్ష్మి కాలువకు 150, సరస్వతి కాలువకు 200, అలీసాగర్ లిఫ్ట్కు 360, గుత్ప లిఫ్ట్కు 135, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు నుంచి ఆవిరి రూపంలో 482 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 1080.00(45 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. తగ్గిన వరద.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 35 వేల క్యూసెక్కులు వచ్చిన వరద నీరు సోమవారం ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టింది. సాయంత్రానికి ప్రాజెక్ట్లోకి 13,952 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, పీసీసీ డెలిగేట్ శేఖర్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో సోమవారం నిర్వహించిన రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కేంద్రం నుంచి జీపీలు, మున్సిపాలిటీలకు నేరుగా నిధులు ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందని రాజీవ్ గాంధీ భావించారని గుర్తుచేశారు. ఆర్టికల్ 72,73 రాజ్యాంగ సవరణతో గ్రామ పంచాయతీలకే హక్కులు కల్పించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. శేఖర్గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్జీపీఆర్ఎస్ జోనల్ ఇన్చార్జి మోత్కురి నవీన్, నాయకులు సురేశ్ బాబా, పొలసాని శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, ఇందూరు శేఖర్, వెంకటేశ్వర పటేల్, ఇట్టం జీవన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.చికిత్స పొందుతూ ఒకరి మృతిమాక్లూర్: మండలంలోని బోర్గాం(కె) గ్రామానికి చెందిన సంగేవార్ ప్రకాశ్(44) జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ప్రకాశ్ వృత్తి రీత్యా కుట్టుమిషన్ మెకానిక్. ఆదివారం రాత్రి సుమారు రాత్రి 11 గంటల సమయంలో మూత్ర విసర్జనకు బయటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇంటి ఎదుట ఉన్న డ్రెయినేజీలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన భార్య చికిత్స నిమిత్తం వెంటనే అంబులెన్స్లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ ప్రకాశ్ మృతి చెందాడు. మృతుడి భార్య సంగేవార్ లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మూడున్నర తులాల బంగారం చోరీమోపాల్: మండలంలోని గుడి తండాకు చెందిన రత్నావత్ గంగా అలియాస్ హారిక ఇంట్లో నుంచి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఎస్సై జాడె సుస్మిత సోమవారం తెలిపారు. గత నెల 27న కుమారుడి జన్మదినం సందర్భంగా బంగారు ఆభరణాలు ధరించారు. తిరిగి ఎప్పటిలాగే బీరువాలో దాచిపెట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా 8న బీరువా తెరిచి చూడగా, బంగారు ఆభరణాలు కన్పించలేదు. ఇంట్లో అంతా వెతికినా లభించకపోవడంతో చోరీకి గురైనట్లు నిర్ధారణకు వచ్చిన హారిక సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జిల్లా బేస్బాల్ మహిళల ప్రాబబుల్స్ జట్టు ఎంపిక
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామ శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల క్రీడామైదానంలో సోమవారం జిల్లాస్థాయి బేస్బాల్ మహిళల ప్రాబబుల్స్ జట్టు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ నళిని క్రీడాకారిణులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఎంపికై న క్రీడాకారిణులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా బేస్బాల్ అసొసియేషన్ ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎంపికై న క్రీడాకారిణులకు మూడు రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా తుది జట్టును ఎంపిక చేసి ఈ నెల 16 నుంచి 18 వరకు ఆదిలాబాద్ జిల్లాలోని ఐపీ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ సప్న, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వనిత, సాఫ్ట్బాల్ కోచ్ మౌనిక, పీఈటీ జ్యోత్స్న, నర్మద, సీనియర్ క్రీడాకారిణులు తదితరులు పాల్గొన్నారు. -
పేదల చదువులకు ‘విద్యాలక్ష్మి’
వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి విద్యాలక్ష్మి’ పథకం అమలు చేస్తోంది. ● ఇంజినీరింగ్, వైద్య ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ చదివే విద్యార్థులకు తోడు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసే వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ● పేదల చదువుకు హామీ పత్రాలు అవసరం లేకుండానే తక్కువ వడ్డీతో బ్యాంక్ రుణం పొందే అవకాశం కల్పిస్తోంది. ● గూగుల్లో https://pmvidyalaxmi.co.in అనే వెబ్సైట్లోకి వెళ్లి పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, చిరునామా నమోదు చేసుకోవాలి. ● రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సాధారణ విద్యారుణ దరఖాస్తు పత్రం(సీఈఎల్ఏఎఫ్) పూర్తి చేయాలి. ● పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాతోపాటు ఆదాయ ధ్రువీకరణపత్రాలు అప్లోడ్ చేయాలి. ● అర్హులైన పేదలకు మూడు విభాగాల్లో రుణం మంజూరు అవుతుంది. ● మొదటి విభాగంలో రూ.4లక్షల లోపు, రెండో విభాగంలో రూ.4లక్షల నుంచి 7.5 లక్షలు, మూడో విభాగంలో రూ.7.5 లక్షల కంటే ఎక్కువ రుణం అందిస్తారు. ● దరఖాస్తు చేసుకునే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.4లక్షల లోపు ఉండాలి. – సదాశివనగర్ (ఎల్లారెడ్డి)మీకు తెలుసా? -
ప్రజాకళల రక్షణకు ప్రయత్నించాలి
నిజామాబాద్ రూరల్: ప్రజాకళల రక్షణకు ప్రయత్నించాలని, జానపద ప్రజా కళాకారుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా సాంస్కృతిక కళావేదిక కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు సిర్ప లింగయ్య తెలిపారు. నగరంలో నాందేవ్వాడలోని పెన్షనర్ భవన్లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాకారులను సామాజిక మార్పులో భాగస్వాములుగా చేసేందుకు సాంస్కృతిక వేదిక కృషి చేస్తుందన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా సిర్ప లింగయ్య, అబ్దుల్, వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు, ఉపాధ్యక్షులుగా ఇందూరు సాయిబాబా, శంకర్ గౌడ్, నర్సారెడ్డి, రాధాకిషన్, విజయమాల, సహాయ కార్యదర్శిగా చంద్రకళ, రంజిత్, మధుసూదన్ గౌడ్, శ్రీనివాస్, డి.సాయిరాం తదితరులను నియమించారు. -
అల్బెండజోల్తో దుష్ప్రభావం ఉండదు
మోపాల్(నిజామాబాద్రూరల్): అల్బెండజోల్ మా త్రలతో ఎలాంటి దుష్ప్రభావం ఉండదని, ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నిజామాబాద్ నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్లో జిల్లా అధికారులతో కలిసి బాలబాలికలకు అల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 01 నుంచి 19ఏళ్ల వయస్సు వారందరికీ తప్పనిసరిగా నులి పు రుగుల నివారణ మాత్రలు వేయించాలన్నారు. జి ల్లాలో 4 లక్షల మందికి అల్బెండజోల్ మాత్రలు వేయడం లక్ష్యమన్నారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీల్లో ఏ ఒక్కరూ తప్పిపోకుండా పిల్లలు మాత్రలు వేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయా లని విద్య, వైద్యారోగ్య శాఖల అధికారులను ఆదేశించారు. ఎవరైనా తప్పిపోతే ఈనెల 18న మలి విడతగా చేపట్టే కార్యక్రమంలో తప్పనిసరిగా మా త్ర వేసేలా చూడాలన్నారు. నూటికి నూరు శాతం విజయవంతమయ్యేలా వైద్య, విద్యా శాఖతోపాటు ఐసీడీఎస్, సంక్షేమ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. నులి పురుగుల కారణంగా పిల్లలు ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు లోనవుతారని వివరించారు. 1,009 మంది విద్యార్థులతో కొనసాగుతున్న బోర్గాం(పీ) జెడ్పీహెచ్ఎస్ నిర్వహణపై ప్రజల్లో సదాభిప్రాయం ఉందని, దీనికనుగుణంగా స్కూల్లో అవసరమైన వసతులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అవసరమైతే ఈ విషయంలో రాష్ట్రస్థాయిలో ని ఉన్నతాధికారులను సంప్రదించి సౌకర్యాల మె రుగుదలకు చొరవ చూపుతామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రాజశ్రీ, డీఈవో అశోక్, జిల్లా ఇ మ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, పాఠశాల హెచ్ఎం శంకర్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆందోళన అవసరం లేదు నులిపురుగుల కారణంగా రుగ్మతలు 1 నుంచి 19 ఏళ్లలోపు వారందరికీ మాత్రలు వేయాలి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -
ఎకరానికి రూ.50 వేలు చెల్లిస్తున్నాం
గత రెండు సంవత్సరాల నుంచి కౌలు రేట్లు భారీగా పెరిగాయి. ఎకరానికి రూ.50 వేలు కౌలు చెల్లిస్తున్నాం. రెండేళ్ల క్రితం రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు చెల్లించే వాళ్లం. రెండేళ్ల నుంచి అదనంగా ఎకరానికి రూ. 10 వేలు రైతుకు చెల్లిస్తున్నాం. రెండు సంవత్సరాల కౌలు ముందుగా నే అందజేస్తున్నాం. దీనివల్ల బాగా నష్టపోవాల్సి వస్తుంది. కూనీపూర్ శివారులో 30 ఎకరాలు కౌలు చేస్తున్నాను. ఎకరానికి రూ. 10 వేల చొప్పున రూ.6 లక్షలు రెండేళ్లకు సరిపడా కౌలును అదనంగా చెల్లించాల్సి వస్తుంది. – పల్సర్ కృష్ణ, వెంకటేశ్వర క్యాంప్, వర్ని -
ఆటంతా అజ్జదే..
● సీఎంసీ వ్యవహారంపై సర్వత్రా చర్చ ● ప్రారంభానికి ముందే కేసులు, కోర్టులు ● ఐఎంఏ పేరును విచ్చలవిడిగా వాడుకున్నారనే ఆరోపణలు ● మెడికల్ కళాశాలలో ఉద్యోగాల పేరుతో డబ్బుల వసూలు! ● ఏప్రిల్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసిన షణ్ముగం మహాలింగం మలుపు తిరిగింది ఇక్కడే.. చైర్మన్గా ఉన్న మహాలింగం అనారోగ్య కారణాలతో కొంతకాలంపాటు సీఎంసీ వైపు రాలే దు. ఇక్కడే అజ్జ శ్రీనివాస్ కథ మలుపు తిప్పా రు. త్వరలోనే సీఎంసీ ప్రారంభమవుతుందని, తాను డైరెక్టర్గా ఉన్నానని ప్రచారం చేసుకున్నారు. కమిటీకి తాను ఇచ్చిన చెక్కులను చూపి వైద్యులను, ఇతర స్టాఫ్ను నియమించేశాడు. ఈ క్రమంలో పలువురు వైద్యుల నుంచి రూ.8 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డ బ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. నిజామాబాద్నాగారం: క్రిస్టియన్ మెడికల్ కళాశా ల, ఆస్పత్రి ప్రారంభానికి ముందే వివాదాలకు కేంద్రమైంది. గ్రామీణులకు వైద్య సేవలందించడంతోపాటు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురా వాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన వారి వద్దకు ఐఎంఏ ముసుగులో చొచ్చుకువెళ్లిన ప్రముఖవైద్యు డు అజ్జ శ్రీనివాస్ వారిని బెదిరించి అసత్య ప్రచా రం చేశారని తెలిసింది. అజ్జ శ్రీనివాస్ ఇచ్చిన చెక్కు లు బౌన్స్ అయ్యాయని, వైద్య పరికరాల సప్లై వ్యవహారంలో చీటింగ్ చేశారని చైర్మన్ షణ్ముగం మహా లింగం ఏప్రిల్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతా తానే అవ్వాలనే అత్యాశతో.. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన వారు ఒక బృందంగా ఏర్పడి మెడికల్ కళాశాలలు, ఆస్పత్రులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా డిచ్పల్లిలోని సీఎంసీని లీజుకు తీసుకుని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఆ కమిటీకి షణ్ముగం మ హాలింగం చైర్మన్గా ఉంటూ ఆస్పత్రి ప్రారంభం, మెడికల్ కళాశాల అనుమతులకు సంబంధించి వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అజ్జ శ్రీనివాస్తో పరిచయం ఏర్ప డింది. వైద్యుడిగా తాను పని చేస్తానని కమిటీతో శ్రీనివాస్ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మహాలింగం, శ్రీనివాస్ మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డా యి. దీన్ని అవకాశంగా మల్చుకున్న శ్రీనివాస్.. వ ురో ఇద్దరు వైద్యులతో కలిసి ఆస్పత్రి ప్రారంభానికి అవసరమయ్యే వైద్య పరికరాల సప్లై బాధ్యతల్లో సైతం తలదూర్చారు. తనకు డైరెక్టర్గా అవకాశం ఇవ్వాలని, తన వంతుగా రూ.5 కోట్లు పెట్టుబడిగా పెడతానని ఒప్పందం చేసుకుని కమిటీకి చెక్కు(ఐఎంఆర్సీ పేరుతో)లు సైతం ఇచ్చాడు. వేతనాలు ఇవ్వకపోవడంతో వివాదం అజ్జ శ్రీనివాస్ చెప్పిన మాటలను నమ్మి సీఎంసీలో ఉద్యోగులుగా చేరిన వైద్యులు, స్టాఫ్ తమకు జీతా లు ఇవ్వడం లేదని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక్కడి నుంచి వివాదం మొదలు కావడం, వైద్య పరికరాల సప్లై వ్యవహారం పంచాయితీ కావడం, తాను కమిటీకి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో శ్రీనివాస్ అప్రమత్తమయ్యాడు. సీఎంసీ పేరుతో షణ్ముగం మహాలింగం డబ్బులు వసూలు చేసి పరారయ్యాడని గత నెల 5న డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ రోజు నుంచి సీఎంసీ మోసమంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టిన ఆయ న 8వ తేదీన మరోసారి, 13న ఇంకోసారి మహాలింగంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలుకు బడి ఉపయోగించి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాడు. వివాదం ముదరడంతో అంతా సైలెంట్ అయ్యారు. ఏప్రిల్ నుంచే అజ్జపై ఫిర్యాదులు అయితే తమను మోసం చేయడంతోపాటు వేధిస్తున్నాడని సీఎంసీ కమిటీ అజ్జ శ్రీనివాస్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే ఉంది. ఈ విషయం ఎక్కడా బయటికి తెలియలేదు. వైద్య పరికరాల సప్లైలో అజ్జ శ్రీనివాస్తోపాటు మరో ఇద్దరు వైద్యులు తమను చీటింగ్ చేశారని జూన్లో, శ్రీనివాస్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని జూలైలో షణ్ముగం మహాలింగం లీగల్ నోటీసులు పంపించారు. సీఎంసీ వ్యవహారంపై డాక్టర్ అజ్జ శ్రీనివాస్ను ‘సాక్షి’ వివరణ కోరేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. -
బోనస్కు బదులు మద్దతు ధర పెంచాలి
నేను పది ఎకరాల పొలం కౌలు తీసుకుని సాగు చేస్తున్నాను. గతంలో ఎకరాకు రూ.15 వేలు కౌలు ధర చెల్లించేవాడిని. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వడం ప్రారంభించింది. దీంతో భూయజమానులు వెంటనే కౌలు ధరను అమాంతం పెంచేశారు. ఇప్పుడు ఎకరాకు రూ.25 నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. బోనస్ డబ్బులు అదనపు ఆదాయం అనుకుంటే పెరిగిన కౌలు వల్ల ఏం ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రభుత్వం ఇలా బోనస్ ఇవ్వకుండా వరికి మద్దతు ధర పెంచితే బాగుంటుంది. కౌలు రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. – లక్ష్మీ నారాయణ, కౌలు రైతు, ధర్మారం(బి), డిచ్పల్లి మండలం -
కౌలు ధర.. తగ్గేదేలే!
– 8లో uమంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025● సన్నధాన్యానికి బోనస్ నేపథ్యంలో వరి సాగుకు మరింత మొగ్గు ● రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెరిగిన ఏడాది కౌలు ● తీసుకునేందుకు పట్టాదారులు, ఇచ్చేందుకు కౌలు రైతుల ఉత్సాహం ● జిల్లాలో సుమారు 45 వేల మంది కౌలు రైతులు.. 1లక్ష ఎకరాల్లో ధాన్యం సాగు సన్న ధాన్యం సాగు చేస్తే ప్రభుత్వం బోనస్ ఇస్తుండడంతో కౌలు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎకరం కౌలు ధర రూ.25 వేల నుంచి ఏకంగా రూ.50వేల వరకు చేరింది. ప్రాంతాన్ని బట్టి భూ యజమానులు కౌలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కౌలు రైతులు వెనుకడుగు వేయడం లేదు. బోనస్ లెక్కలు వేసుకుని కౌలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్న నేపథ్యంలో వరి పంటకు సంబంధించి కౌలు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా కౌలు ధరలు ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో గతంలో ఏడాదికి ఎకరానికి రూ.30వేల చొప్పున ఉన్న కౌలు ఈ ఏడాది రూ.50వేల వరకు పెరిగింది. ఇక బాన్సువాడ నియోజకవర్గం మినహా మిగిలిన నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ఏడాదికి ఎకరం వరి పంట వేసేందుకు కౌలు ధర రూ.25 వేలు ఉండగా ఈ ఏడాది అది రూ.40 వేలకు చేరింది. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని, రుద్రూర్ తదితర ప్రాంతాల్లో వరి ఎకరానికి సగటున 40 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో సగటున 30 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. దీంతో ఆయా ప్రాంతాలను బట్టి కౌలు ధరల్లో మార్పు ఉంటోంది. ● బోనస్ ఇస్తున్న నేపథ్యంలో రైతులు కౌలుదార్లకు ఇచ్చేందుకు ధరలు పెంచుతున్నారు. అయితే కౌలు రైతులు సైతం అదనంగా కౌలు చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో సగటున ఎకరానికి రూ.15 వేల వరకు బోనస్ వస్తోంది. అంటే వానాకాలం, యాసంగి రెండు పంటలకు కలిపి రూ.30 వేలు బోనస్ రూపంలో దక్కుతోంది. దీంతో ఒక పంట బోనస్ పెరిగిన కౌలు కింద చెల్లిస్తే మరో పంట బోనస్ తమకు అదనంగా కలసి వస్తుందని కౌలు రైతులు లెక్కలు వేసుకుని పెరిగిన కౌలును చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ● జిల్లాలో పంటలు సాగు చేసే భూమి 5.60 లక్షల ఎకరాలు ఉంది. 2.72 లక్షల మంది రైతులు ఉన్నారు. అయితే జిల్లాలో సుమారు 45 వేల మంది రైతులు 1 లక్షకు పైగా ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఎకరం వరి పంట సాగుకు సంబంధించి దుక్కి దున్నడం, విత్తనాల కొనుగోలు, దమ్ము చేయడం, ఎరువులు, మందుల కొనుగోలు, వరినాట్లు, కలుపుతీత కూలీ, వరికోత, ధాన్యాన్ని కల్లాలకు తరలించడం, హమాలీ చార్జీ లు, బోరు మరమ్మతులన్నీ కలిపి ఒక పంటకు రూ.25 వేలకు పైగా ఖర్చు వస్తోంది. కౌలు డబ్బు లు, పెట్టుబడి ఖర్చులు పోగా ఎకరానికి రూ. లక్షకు పైగా రాబడి వస్తోందని కౌలు రైతులు చెబుతు న్నా రు. ఇదిలా ఉండగా గడిచిన యాసంగికి సంబంధించి ఇప్పటివరకు బోనస్ రైతులకు చెల్లించలేదు. దీంతో రైతుల్లో కొంతమేర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పట్టాదారులు, కౌలు రైతులు వివిధ రకాల అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. న్యూస్రీల్ -
ఉత్సాహమేదీ...?
డొంకేశ్వర్(ఆర్మూర్): వన మహోత్సవాన్ని ఈ ఏడాది అధికారులు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. వర్షాకాలం మొదలై రెండు నెలలు కావొస్తున్నా జిల్లాలో అంతంత మాత్రంగానే మొక్కలు నాటారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నా ప్లాంటేషన్ పుంజుకోవడం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి మొదలుకొని జిల్లా అధికారుల వరకు వన మహోత్సవాన్ని లైట్గా తీసుకుంటున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మొక్కలు నాటడంలో కీలకంగా వ్యవహరించాల్సిన గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్సాహన్ని ప్రదర్శించడం లేదు. గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటి వరకు సగం లక్ష్యాన్నే చేరుకుంది. 2025–26 సంవత్సరంలో 16.84లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా మండలాలకు టార్గెట్లు ఇచ్చింది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 3,178 మొక్కలు నాటించాలని లక్ష్యాన్ని నిర్ధేశించారు. అందుకనుగుణంగా జీపీ నర్సరీల్లో మొక్కలను భారీగా పెంచారు. అయితే మొక్కలు బాగా నాటుకోవాలంటే జూలై, ఆగస్టు నెలల్లో ప్లాంటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ, మొదట్లో వర్షాల్లేక మొక్కలు నాటలేదు. ఇప్పుడు గత నెల రోజులుగా వర్షాలు కురుస్తున్నా కూడా మొక్కలను వేగంగా నాటడం లేదు. భారీగా గుంతలు తవ్వించి మొక్కలు నాటించేందుకు ఉపాధి కూలీలను పిలవడం లేదు. వచ్చిన వారితోనే నెట్టుకొస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 879 ప్రాంతాల్లో 8.87లక్షల మొక్కలను (లక్ష్యంలో 52.66శాతం) మాత్రమే నాటారు. 7.97లక్షల మొక్కలు నాటాల్సి ఉంది. సగం మండలాల్లో.. మండలాల వారీగా లక్ష్యాలు నిర్ధేశించగా జిల్లాలో సగం మండలాల్లో వన మహోత్సవం కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. నవీపే ట్, ఇందల్వాయి, ధర్పల్లి, నందిపేట్, డిచ్పల్లి మండలాల్లో కనీసం 40శాతం కూడా లక్ష్యాన్ని చేరుకోలేదు. సిరికొండ, ఎడపల్లి మండలాలు 50శాతం దాటకపోగా... చందూర్, మోస్రా, రుద్రూర్, భీమ్గల్, వేల్పూర్, కమ్మర్పల్లి, మాక్లూర్ మండలాలు 50 శాతాన్ని మాత్రమే దాటాయి. జిల్లాలో జక్రాన్పల్లి మండలం 95.83శాతం, మోర్తాడ్ మండలాలే 92.83 శాతం మొక్కలు నాటి ముందు లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నాయి. మిగతా మండలాలు 55–65 శాతం మధ్యలో ఉన్నాయి. మొక్కలు నాటే విషయంలో వెనుబడ్డ మండలాలు, గ్రామ పంచాయతీలపై దృష్టి పెట్టని అధికారులు, అక్కడ పని చేస్తున్న ఉపాధిహామీ సిబ్బందిని అధికారులు మందలించడానికి కూడా ముందుకు రావడం లేదు. నెమ్మదించిన వన మహోత్సవం నామమాత్రంగానే మొక్కలు నాటిస్తున్న అధికారులు ఇప్పటి వరకు సగం లక్ష్యాన్నే చేరుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ వర్షాలు కురుస్తున్నా కనిపించని పురోగతి దృష్టి పెడతాం లక్ష్యానికనుగుణంగా మొక్క లు నాటేందుకు చర్యలు చేపడుతున్నాం. కొంత వెనుకబడినా వేగవంతం చేస్తాం. పురోగతి కనిపించని మండలాలు, గ్రామాలపై దృష్టి సారిస్తాం. అక్కడి సిబ్బందితో రోజువారీగా సమీక్షించి మొక్కలు నాటిస్తాం. నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. – సాయాగౌడ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి -
నిరాశాజనకంగా నిజాంసాగర్
నిజాంసాగర్: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు వెలవెలబోతోంది. దీంతో ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరుణుడు కరుణిస్తే తప్ప ఆయకట్టు గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద అలీసాగర్ రిజర్వాయర్ వరకు 1.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాలువకు ఇరువైపులా మోటార్లు ఏర్పాటు చేసి మరో 15 వేల ఎకరా ల వరకు అనధికారికంగా పంటలు పండిస్తున్నారు. రెండు విడతల్లో 1.58 టీఎంసీలు.. ఈ సీజన్లో నిజాంసాగర్ ఆయకట్టుకు ఇప్పటివరకు రెండు విడతల్లో 1.58 టీఎంసీల నీటిని విడుదల చేశారు. జూన్ 25 నుంచి జూలై 9 వరకు మొదటి దఫాలో 0.766 టీఎంసీల నీరందించారు. అదేనెలలో 15 నుంచి 23 వరకు రెండో దఫాలో 0.814 టీఎంసీల నీరు విడుదల చేశారు. అయితే వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 1.224 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.203 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో డెడ్ స్టోరేజీలో 0.9 టీఎంసీ ఉంటుంది. ఎగువనుంచి ఆశలు అంతంతే.. ఎగువన సింగూరు ప్రాజెక్టుతోపాటు కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టు హైదరాబాద్ ప్రాంతంతోపాటు మిషన్ భగీరథ గ్రిడ్కు తాగు నీటి సరఫరాకు పరిమితమైంది. సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 20 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. కొండ పొచ మ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు నిరాశాజనకంగా ఉండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వర్షాల కారణంగా ప్రస్తుతానికి ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ఫ్లో వస్తోంది. పంటలు గట్టెక్కాలంటే నాలుగు తడులైనా నీరివ్వాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితో నాలుగు తడులు ఇవ్వలేమని ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ అంటున్నారు. అలీసాగర్ వరకు 1.3 లక్షల ఎకరాల్లో పంటల సాగు పంటలు గట్టెక్కాలంటే మరో నాలుగు తడులు అవసరం వెలవెలబోతున్న ప్రాజెక్టు.. వరుణుడి కరుణపైనే ఆశలు -
ఇంజినీరింగ్లో మొదటి రోజు ఐదుగురి చేరిక
తెయూ(డిచ్పల్లి): నూతనంగా ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు మూడో విడత కౌన్సెలింగ్లో 81 మందిని కేటాయించగా, మొదటిరోజైన సోమవారం ఐదుగురు విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు. వీరంతా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)కి చెందిన విద్యార్థులేనని ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి తెలిపారు. కౌన్సెలింగ్లో కేటాయించబడిన మరికొంత మంది విద్యార్థులు క్యాంపస్కు వచ్చి ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న వసతి సౌకర్యాలను పరిశీలించారన్నారు. అయితే ఈ విద్యాసంవత్సరం హాస్టల్ వసతి కల్పించకపోవడంతో పలువురు విద్యార్థినులు ఇక్కడ అడ్మిషన్ తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. తొలి విద్యార్థి అల్లె శ్రీచరణ్ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థి అల్లె శ్రీచరణ్ తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో తొలి విద్యార్థిగా అడ్మిషన్ పొందారు. ఆయనకు ప్రిన్సిపాల్ సీహెచ్ఆరతి స్వాగతం పలికి అడ్మిషన్ అందజేశారు. ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఖలీల్వాడి: ఆర్టీసీ ఎ క్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో గుర్తింపు కార్డు లేదా జిరాక్స్ కాపీని చూపి ట్రాన్స్జెండర్లు ఉచిత ప్ర యాణం చేయొచ్చని ఆర్ఎం జ్యోత్స్న సో మవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మహా లక్ష్మి పథకం ద్వారా మహిళలు, బాలికలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు పే ర్కొన్నారు. మహిళలు, బాలికలు, సీనియర్ సిటిజన్(మహిళ)లతోపాటు ట్రానన్స్జెండర్లు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి న గుర్తింపు కార్డులను కండక్టర్కు చూపించాలని, మొబైల్ ఫోన్ల లో సైతం కార్డులు చూపి ఉచిత ప్రయాణం చేయొచ్చని తెలిపారు. రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రధాన రోడ్ల మరమ్మతు లు, నూతన రోడ్లకు రూ.80 కోట్లు అవసరమని, వాటిని మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మంత్రిని సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి వేరే జిల్లాలను కలుపుతూ ఉన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లానని, త్వరలో నిధు లు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారని రాకేశ్రెడ్డి తెలిపారు. -
బీమా.. రైతన్నకు ధీమా
డొంకేశ్వర్(ఆర్మూర్): రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే వారి కు టుంబసభ్యులకు బాసటగా నిలుస్తోంది. రూ.5లక్షల ఆర్థిక సాయం బాధిత కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతోంది. ఈ పథకానికి రైతులపై భా రం లేకుండా ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లి స్తోంది. ప్రస్తుతం బీమా చేసుకోవడానికి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 13వరకు గడువు ఉండగా అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. జిల్లాలో 1.69లక్షల మంది నమోదు రైతుబీమా పథకానికి జిల్లాలో ఇప్పటి వరకు 1.69లక్షల మంది నమోదు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం ఏడాదికోసారి ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేస్తూ వస్తోంది. గడిచిన ఏడేళ్లలో 7,135మంది రైతులు మరణించగా, వారి కుటుంబాలకు రూ.357.10కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం జూన్ 5నాటికి కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు జిల్లా వ్యాప్తంగా ఐదారు వేల మంది ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. వీరు బీమా కోసం దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. అర్హతలు ఇవే.. జూన్ 5వ తేదీ నాటికి పట్టాదారుగా నమోదై ఉండాలి. 18–59 సంవత్సరాల వయసు ఉండాలి. రైతు, నామినీ ఆధార్ కార్డు, పట్టాదారు పుస్తకం జిరాక్స్ పత్రాలతోపాటు దరఖాస్తు ఫారాన్ని నేరుగా రైతువేదికల్లో ఏఈవోలకు సమర్పించాలి. పట్టా పుస్తకం రానివారు ఆన్లైన్లో డిజిటల్ సైన్ ఉన్నా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏడేళ్లుగా బీమా పొందిన రైతు కుటుంబాలు కొత్త దరఖాస్తులకు ఆహ్వానం జూన్ 5నాటికి పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులకు అవకాశం ఈ నెల 13 వరకు గడువు ఏఈవోలను సంప్రదించాలి రైతుబీమా పథకాన్ని అర్హులైన ప్రతి రైతు సద్వినియో గం చేసుకోవాలి. కొత్త పట్టా పాసు పుస్తకాలు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలి. నేరుగా రైతు వేదికల్లోని ఏఈవోలను సంప్రదించాలి. – మేకల గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి -
నులిపురుగులను నివారిద్దాం
నిజామాబాద్నాగారం/బోధన్ రూరల్: నులి పురుగులతో నెలల వయసు నుంచి పెద్దల వరకు ఇబ్బందులు పడుతుంటారు. ఇవి సులువుగా పొట్టలోకి చేరి హాని కలిగిస్తున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ నెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా 1–19 ఏళ్లలోపు పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు లక్షలకు పైగా.. జిల్లాలో 1500 అంగన్వాడీ కేంద్రాలు, 1262 ప్రభుత్వ, 569 ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటితోపాటు కేజీబీవీ, మోడల్, సోషల్, బీసీ, ట్రైబల్, మైనార్టీ వెల్ఫేర్ విద్యాసంస్థలతోపాటు మదర్సాలున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో 1,10,032 మంది చిన్నారులుండగా, పాఠశాలలు, కళాశాలల్లో 2,95,411 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ సోమవారం అల్బెండజోల్ మాత్రలను వైద్య సిబ్బంది వేయనున్నారు.మాత్రలు ఇలా వేసుకోవాలి 1– 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను పొడిగా చేసి నీటిలో కలిపి వేయించాలి. 2– 3 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్రను పూర్తిగా పొడి చేసి కొద్దిగా నీటిని కలిపి వేయాలి. 3 –19 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్రను బాగా చప్పరించి, నమిలి మింగేలా చూడాలి. భోజనం తర్వాతే ఈ మాత్ర వేయాలి. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వేయొద్దు. అల్బెండజోల్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి జిల్లాలో 4లక్షలకుపైగా 1–19 సంవత్సరాల పిల్లలు నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం -
రాజకీయ దురుద్దేశంతోనే దుష్ప్రచారం
నిజామాబాద్ సిటీ: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద రాజకీయ కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకుండా రైతాంగానికి అన్యా యం చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిపై మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో కలి సి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని చివరి ఆయకట్టు వరకు మూడు పంటలకు సాగునీరివ్వాలన్న ఆలోచనతోనే కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మించామన్నారు. ప్రాజెక్టులోని చిన్న సమస్యను పరిష్కరించకుండా కొండంత చేసి దుష్ప్రచారం చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదన్నారు. మేడిగడ్డను పండబెట్టి బనకచర్లకు గో దావరి నీళ్లను దోచిపెడుతూ తన గురువు చంద్రబాబుకు రేవంత్రెడ్డి గురుదక్షిణ ఇచ్చాడని విమర్శించారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్ర బాబు, బీజేపీ కలిసి ఇచ్చిన రిపోర్టునే జస్టిస్ ఘోష్ ఇచ్చారని, అది కోర్టులో చెల్లదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో సుంకిశాల గోడలు, ఎస్ఎల్బీసీ ట న్నెల్ కూలిపోయిందని, పెద్దవాగుకు గండపడినా సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిపై ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్, హరీశ్రావులను ఎ లా బాధ్యులను చేస్తారన్నారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయ ని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కేంద్ర సహాయమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ ఘోష్ కమిషన్ ముందుకు వె ళ్లడం ఏమిటని ప్రశ్నించారు. బండి సంజయ్ బజా రు భాష మాట్లాడుతున్నారని, కేటీఆర్పై ఆయన చేసిన వ్యాఖ్యలకు సభ్యసమాజం సిగ్గుపడుతుందన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రె డ్డి, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, సత్యప్రకాశ్, సి ర్పరాజు, సుజిత్ సింగ్, దొన్కంటి నర్సయ్య, బాజిరెడ్డి రమాకాంత్, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు. మాజీ సీఎం కేసీఆర్పై రాజకీయ కక్ష అది ఘోష్ కమిటీ కాదు.. ఘోస్ట్ కమిటీ చంద్రబాబు మెప్పుకోసమే బనకచర్లకు నీళ్లు కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ను టార్గెట్ చేశాయి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
రెడ్ నోటీస్
నిజామాబాద్కట్టడి చేసినా.. జిల్లాలో గంజాయి కట్టడికి పోలీసులు ఎంత ప్రయత్నం చేస్తున్నా.. స్మగ్లర్లు ఏదో ఒకవిధంగా తమ దందాను కొనసాగిస్తున్నారు. సోమవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లో uనిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశాబ్దాలుగా పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 1996 నుంచి పన్ను చెల్లించని వారి జాబితాను రూపొందించారు. వివిధ కారణాలు చూపుతూ కోర్టుకు వెళ్లిన వారు.. నాటి నుంచి పాత, కొత్త పన్ను చెల్లించడం లేదు. అధికారులు ప్రశ్నిస్తే వ్యవహారం కోర్టులో ఉందంటూ తప్పించుకుంటున్నారు. అయితే రూ.26 కోట్ల మొండి బకాయిలను వసూలు చేసే లక్ష్యంతో అధికారులు శుక్రవారం నుంచి రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. నిజామాబాద్ సిటీ: మొండి బకాయిలు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు తలకుమించిన భారంగా మారాయి. కోట్లాది రూపాయల వసూలుకాకపోవడంతో బల్దియా ఆదాయానికి గండిపడుతోంది. పలువురు బడా వ్యాపారులు కోర్టుల్లో కేసులు వేసి పన్నులు చెల్లించకుండా దర్జాగా వ్యాపారాలు చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. బల్దియాకు చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మొండి బకాయిలపై జిల్లా కలెక్టర్, ప్రత్యేక అధికారి వినయ్కృష్ణారెడ్డి బకాయి వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పెండింగ్ పన్ను వసూళ్ల కోసం కమిషనర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. కోర్టు కేసులంటూ.. అధికారులు పన్ను ఎక్కువ వేశారంటూ కొందరు కోర్టులో కేసులు వేశారు. అయితే తీర్పు రాకపోవడాన్ని సాకుగా చూపుతున్నారు. ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన పన్ను సైతం చెల్లించడం లేదు. నగరంలోని రెండు ప్రముఖ హోటళ్లే రూ.13 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని తెలిసింది. వీరితోపాటు బహుళ అంతస్తుల భవనాలు, మల్టీప్లెక్స్లు, ఫర్నిచర్ షాపులు, ఆస్పత్రులు కూడా మొండి బకాయిల లిస్టులో ఉన్నట్లు తెలిసింది. పెద్దలను ఎందుకు వదిలేస్తారు.. సాధారణ పౌరులు బల్దియాకు పన్ను చెల్లించకుంటే ఇంటికి వచ్చి మరీ వసూలు చేస్తున్నారు. పెద్దవాళ్లని ఎందుకు వదిలేస్తున్నారు. స్టార్ హోటళ్లు, పెద్ద దుకాణదారులను ఉపేక్షించడం సరికాదు. అందరికీ ఒకే న్యాయం ఉండాలి. పన్ను రికవరీలో బల్దియా అధికారుల ఉదాసీనత సరికాదు. – వి.ప్రభాకర్, న్యూడెమోక్రసీ (మాస్లైన్) రాష్ట్ర నాయకుడుస్పెషల్ డ్రైవ్తో.. కార్పొరేషన్ పరిధిలో రూ. 26 కోట్లు పెండింగ్ బకాయిలున్నట్లు గుర్తించాం. చెల్లించాల్సిన వారికి రెడ్నోటీసులు జారీచేస్తున్నాం. గడువులోగా చెల్లించకుంటే కఠిన చర్యలు తప్పవు. అవసరమైతే సీజ్లు చేస్తాం. ప్రతి ఒక్కరూ విధిగా పన్ను చెల్లించాలి. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – దిలీప్కుమార్, బల్దియా కమిషనర్1200 అసెస్మెంట్లు పన్ను చెల్లించకుండా తప్పించుకుంట్నువారిని బల్దియా రెవెన్యూ అధికారులు గుర్తించారు. వారిలో 1996 నుంచి పన్ను చెల్లించని వారి పేర్లు సైతం ఉన్నాయి. మొత్తం 1200 అసెస్మెంట్లను గుర్తించిన అధికారులు వారికి రెడ్ నోటీసులు అందజేస్తున్నారు. వారం రోజుల్లో పన్ను చెల్లించకుంటే చర్యలు తప్పవని, స్పందించని పక్షంలో సీజ్ చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి బకాయి వసూళ్లపై కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి వినయ్కృష్ణారెడ్డి దృష్టి సారించారు. కోర్టు కేసులంటూ తప్పించుకునేవారిని ఉపేక్షించొద్దని అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నోటీసులు ఇవ్వాలని, నోటీసులు తీసుకుని స్పందించని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉన్నతస్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో రూ.26 కోట్లు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. న్యూస్రీల్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి 1996 నుంచి పన్ను చెల్లించని వారి జాబితా సిద్ధం రూ.26 కోట్ల మేర పాతబకాయిలు రెండు స్టార్ హోటళ్లు చెల్లించాల్సింది రూ.13 కోట్లు.. కోర్టు కేసులంటూ అసలుకే చెల్లించని వైనం కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీసులిస్తున్న అధికారులు -
చేపపిల్లల ఉత్పత్తి ప్రయోగం విఫలం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో చేపపిల్లల ఉత్పత్తి ప్రయోగం రెండుసార్లు విఫలమైంది. దీంతో సుమారు కోటి స్పాన్ ఉత్పత్తికి నష్టం ఏర్పడింది. ప్రస్తుత సంవత్సరం 54 లక్షల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకోగా అందుకు 2.4 కోట్ల స్పాన్ ఉత్పత్తి కావాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు 1.75 కోట్ల స్పాన్ మాత్రమే ఉత్పత్తి అవ్వగా, మిగతా స్పాన్ కోసం ఎకో హేచరీలో రెండుసార్లు ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం విఫలం కావడంతో స్పాన్ ఉత్పత్తి కావడం లేదు. దీంతో ప్రభుత్వ సొమ్ము వృథా అవుతోంది. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం కొరవడడం కూడా ఒక కారణంగా మత్స్యకారులు చెప్తున్నారు. ఉత్పత్తిపై అనుమానాలు చేపపిల్లల ఉత్పత్తికి జూలై, ఆగస్టు నెలలు అనుకూల సమయం. చెరువులు, ప్రాజెక్టుల్లో సహజ సిద్ధంగానే ఈ రెండు నెలల్లో చేపలు పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. కానీ, ప్రతికూల వాతావరణం కారణంగానే స్పాన్ ఉత్పత్తి ప్రయోగం విఫలమైనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో చేపపిల్లల ఉత్పత్తి అంశంపై ఉన్నతాధికారులు స్పందించాలని మత్స్యకారులు కోరుతున్నారు. 5 కోట్ల చేపపిల్లలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న కేంద్రంలో ప్రస్తుతం 10శాతం కూడా చేపపిల్లల ఉత్పత్తి జరిగేలా లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు కోటి స్పాన్కు నష్టం ప్రస్తుత సీజన్లో రెండుసార్లు ఫెయిల్ ప్రతికూల వాతావరణమే కారణమంటున్న అధికారులు లక్ష్యాన్ని పూర్తి చేస్తాం ప్రస్తుతం వాతావరణం చల్లగా లేకపోవడంతోనే రెండుసార్లు చేపపిల్లల ఉత్పత్తి ప్రయోగం విఫలమైంది. సుమారుగా కోటి స్పాన్ ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ప్రస్తుత సంవత్సర లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ఐస్ వేసి చేపపిల్లల ఉత్పత్తి చేపడ్తాం. – దామోదర్, మత్స్య అభివృద్ధి అధికారి, పోచంపాడ్ -
భయపెడుతున్న చిరుత పులి
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ సిద్ధుల గుట్టపై మూడు నె లల క్రితం చిరుత సంచారం పట్టణ ప్రజలతోపాటు సందర్శకులను కంటి మీద కునుకులేకుండా చేసింది. తాజాగా గుట్టకు అతి సమీపంలోని పెద్దమ్మ ఆ లయ పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలను కలవరపెడుతోంది. శుక్రవారం ఆలయానికి వచ్చిన భక్తులకు చిరుత కదళికలు భయాందోళనకు గురిచేశా యి. అంకాపూర్కు చెందిన ఓ గొర్రెల మంద నుంచి రెండు మేకలు కనిపించకపోవడం చిరుత సంచారానికి బలం చేకూర్చింది. విషయం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు ఆదివారం చిరుత ఆనవాళ్ల కోసం కొండ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. కాగా, శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఆనవాళ్లేమీ కనిపించలేదు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని అధికారులు సూచించారు. మొన్న సిద్ధుల గుట్టపై, ఇప్పుడు పెద్దమ్మ గుడి పరిసరాల్లో.. ఆర్మూర్ పట్టణ ప్రజల్లో కలవరం -
కళాశాలల్లో ‘మధ్యాహ్న భోజనం’ కలేనా?
నందిపేట్(ఆర్మూర్): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ‘మధ్యాహ్న భోజన పథకం’ కలగానే మిగిలిపోతుందేమోనని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని గతంలో ప్రతిపాదనలు పంపించినా ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కళాశాలలకు దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పరిస్థితి.. మారుమూల గ్రామాల నుంచి పేద విద్యార్థులు ఆర్టీసీ బసుల్లో, సైకిళ్లపై సమీప పట్టణాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వచ్చి చదువుకుంటారు. దూరప్రాంతాల విద్యార్థులు ఇంటి నుంచి ఉదయం తొందరగా బయలుదేరితేనే కళాశాలకు సకాలంలో చేరుకుంటారు. ఈక్రమంలో కొందరు విద్యార్థులు ఇంట్లో ఉదయం టిఫిన్ తయారీతో ఆలస్యం కావడంతో టిఫిన్ బాక్స్లు తెచ్చుకోకుండానే కళాశాలకు వెళుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జూనియర్ కళాశాల తరగతులు నిర్విహిస్తుండటంతో వారు అర్ధాకలితో అలమటిస్తున్నారు. దీంతో విద్యార్థులు పూర్తిస్థాయిలో చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. జిల్లాలో 31 కళాశాలలు.. జిల్లాలో 31 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నా యి. ఇందులో సుమారు 9850 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో కొందరు విద్యార్థులు మా త్రమే నిత్యం తమ ఇంటి వద్ద నుంచి టిఫిన్ బాక్సు లతోపాటు వాటర్ బాటిళ్లు తెచ్చుకుంటున్నారు. మి గిలిన వారు అర్ధాకలితోనే విద్యను కొనసాగిస్తున్నా రు. ప్రభుత్వం స్పందించి కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలుకు నోచుకోని పథకం ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు -
ఎస్సారెస్పీలోకి గుర్రపు డెక్క
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితో పాటు గుర్రపు డెక్క కొట్టుకువస్తోంది. దీంతో ప్రాజెక్ట్ నీటిలో గుర్రపు డెక్క మొక్కలు భారీగా పేరుకుపోగా, కొన్ని ఆనకట్ట అంచున వచ్చిచేరాయి. గుర్రపు డెక్క పేరుకుపోతే ఆనకట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్రపు డెక్కతో అనర్థాలు.. గుర్రపు డెక్క నీటిలో పెరిగే కలుపు మొక్క. ఇది వేగంగా పెరిగి నీటి వనరులను మూసుకు పోయే లా చేస్తుంది. దీని వలన నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతుంది. ప్రాజెక్ట్ అనకట్ట అంచున గురప్రుడెక్క పేరుకుపోతే రివిట్మెంట్లోకి నీరు అధికంగా వెళ్లి అనకట్టకు గండి పడే ప్రమాదం ఏర్పడుతుంది. చేపల పెంపకాననికి అంటకంగా మారుతుంది. దీని వలన అధికంగా దోమలు, ఇతర కీటకాలు పెరిగి నీటి నాణ్యతను దెబ్బతీస్తుంది. గుర్రపు డెక్క నీటిలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. వ్యాధుల వ్యాప్తికి కారణమవుతుంది. ఒక్కసారి నాటుక పోతే తొలిగించడానికి చాలా ఖర్చు అవుతుంది. దీంతో ఆర్థికంగా కూడ తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆనకట్ట అంచున పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలిగించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరదతోపాటు కొట్టుకువస్తున్న వైనం పట్టించుకోని అధికారులు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం.. గుర్రపు డెక్క ప్రాజెక్ట్లోకి వరదల వలన కొట్టుకువస్తోంది. తొలిసారి రావడం ఆశ్చర్యంగా ఉంది. గుర్రపు డెక్క సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గుర్రపు డెక్క పెరగక ముందే తొలిగించుటకు ఉన్నత అధికారులతో చర్చలు జరుపుతున్నాం. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ -
వృద్ధురాలి ఆత్మహత్య
సిరికొండ: మండలంలోని చీమన్పల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన చందాల లక్ష్మీ(63) అనే వృద్ధురాలు గత కొన్ని రోజుల నుంచి మానసిక స్థితి సరిగా ఉండటం లేదు. ఒంటరిగా నివసించడంతో తీవ్ర మనోవేదనకులోనై తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హాస్టల్ వార్డెన్.. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహం వార్డెన్ షబానా ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన షబానా గత సంవత్సరం ఆగస్టులో ఆర్మూర్లోని ఎస్సీ హాస్టల్లో విధుల్లో చేరింది. ఆర్మూర్ పట్టణంలోనే ఉంటూ విధులు నిర్వహిస్తుండేది. కాగ రెండు రోజులు సెలవులు రావడంతో ఆమె జగిత్యాలలోని ఆమె ఇంటికి వెళ్లింది. ఆమె స్వగృహంలో శనివారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది.ఈ ఘటనపై తోటి ఉద్యోగులు, హాస్టల్ విద్యార్థినులు విచారం వ్యక్తం చేశారు. -
ఏజెంట్ల మోసంపై విచారణ
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏజెంట్ల మోసానికి గురికాగా, ఈ ఘటనపై భా రత విదేశాంగ శాఖ విచారణ ప్రారంభించింది. వివరాలు ఇలా.. వేల్పూర్ మండలం పడి గెల వాసి గంగాప్రసాద్ యూర ప్ వెళ్లే ప్రయత్నంలో ఏజెంట్ల మోసానికి గురై దుబాయ్లో మూడేళ్ల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండిపోయాడు. ఏజెంట్లు బాధితుడి నుంచి రూ.8.77 లక్షలు వసూలు చేసి టోకరా వేసిన విషయం విధితమే. ఈ విషయంపై బాధితుడి తండ్రి భోజన్న ఇటీవల ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. మరోవైపు గంగాప్రసాద్ సామాజిక మాధ్యమం ద్వారా ఎంపీ అర్వింద్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. దీంతో రెండ్రోజుల క్రితం దుబాయ్లో ఉన్న గంగాప్రసాద్ను విదేశాంగశాఖ అధికారులు ఎంబసీకి పిలిపించుకున్నారు. వారు ఏజెంట్ల పేర్లు, వారి వివరాలను నమోదు చేసుకున్నట్లు బాధితుడు ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. తన వీసా గడువు ముగిసిపోగా ఈ అంశంపై ఉన్నతాధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారన్నారు. మరోవైపు ప్రవాసీ ప్రజావాణి లేఖ మేరకు విచారణ చేపట్టాలని వేల్పూర్ ఎస్సై సంజీవ్ను సీపీ సాయి చైతన్య ఆదేశించారు. దీంతో సదరు ఏజెంట్ల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ● దుబాయ్లో చిక్కుకున్న జిల్లావాసితో మాట్లాడిన ఎంబసీ అధికారులు ● వేల్పూర్లోనూ పోలీసుల ఆరా -
మద్యంమత్తులో యువకుడి వీరంగం
నిజామాబాద్ రూరల్: మండలంలోని గూపన్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించి, ముగ్గురిపై దాడిచేసి గాయపర్చాడు. నిందితుడిని పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించా రు. రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరీఫ్ తెలిపిన వి వరాలు ఇలా.. గ్రామానికి చెందిన మదన్ అనే వ్యక్తి శనివారం రాత్రి కల్లుబట్టిలో మద్యం తాగి సమీపంలో గల అనిల్ అనే వ్యక్తి ఇంటి ఎదుట నిద్రించాడు. కొద్దిసేపటికి ఇంటికి చెందిన అనిల్, శైలేందర్లు ఇంట్లోకి వెళుతుండగా మదన్కు కాళ్లు తగలడంతో మేల్కొన్నాడు. దీంతో మదన్ వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం మదన్ పగిలిన కల్లుసీసాతో శై లేందర్ ఎడమచేతిని గాయపరిచారు. అనిల్, అతడి అక్క దీపిక అడ్డురావడంతో మదన్ వారిపై సైతం దాడిచేసి గాయపర్చారు. వెంటనే గ్రామ పెద్దలు ఘటన స్థలానికి చేరుకొని ఇరువురిని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనపై బాధితులు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ముగ్గురిపై కల్లుసీసాతో దాడి నిందితుడిని రిమాండ్కు తరలించిన రూరల్ పోలీసులు -
ఉప్లూర్ చెరువులో మొసలి
కమ్మర్పల్లి: మండలంలోని ఉప్లూర్ నల్ల చెరువులో ఆదివారం ఉదయం మొసలి కనిపించడం కలకలం రేపింది. చెరువు మధ్యలో నీటిపై ఏదో కదులుతున్నట్లు కనిపించడంతో స్థానిక రైతుతు తమ సెల్ఫోన్ కెమెరాల్లో బంధించారు. మొసలి కావడంతో గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయడంతో ఈ విషయం కలకలం రేపుతోంది. చెరువు విస్తీర్ణం పెదద్దిగా ఉండడంతో మొసలి ఎటు వైపు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మూడు నాలుగు నెలల క్రితం కూడా చెరువులో మొసలి కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి మొసలిని పట్టుకొని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్లపై నిలుస్తోన్న వాన నీరు ● కేకేవై రహదారిలో వాహనదారులకు ఇబ్బందులు కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణం గుండా వెళ్లే కేకేవై (కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి) వంద ఫీట్ల రోడ్డు కబ్జాలు ఒకవైపు, మరో వైపు ఉన్న రోడ్డుకు ఇరువైపులా డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో రోడ్లపై నీరు నిలుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంద ఫీట్ల కేకేవై రోడ్డు పట్టణంలో సిరిసిల్లరోడ్డు, స్టేషన్రోడ్డు, పోలీసు స్టేషన్, రైల్వే బ్రిడ్జి మీదుగా ఉంది. ఈ రోడ్డులో ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలతో కబ్జా చేశారు. సిరిసిల్ల రోడ్డులో కేకేవై నుంచి రామేశ్వరపల్లి వెళ్లే జాతీయ రహదారి సర్వీసు రోడ్డు సైతం ఇలాగే వాన నీటితో నిండిపోయింది. జాతీయ రహదారి నిర్వాహకులు మూసుకుపోయిన మురికికాల్వల్లో మట్టిని తొలగించకపోవడంతో నీరు రోడ్డుపై నిలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసం రాజంపేట : ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుకు ఏదో ఒక రూపంలో కష్టాలు తప్పడం లేదు. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామంలోని రాజిరెడ్డి అనే రైతు తనకున్న రెండు ఎకరాల భూమిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. శనివారం రాత్రి అడవి పందులు మొక్కజొన్న పంటపై దాడి చేసి బీభత్సాన్ని సృష్టించాయి. దీంతో మొక్కజొన్న పంట మొత్తం నేలవాలింది. అడవి పందులు రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసిన వాటి దాడుల నుంచి పంటను కాపాడుకోలేకపోతున్నామని బోరున విలపిస్తున్నారు. తూము గండికి మరమ్మతులు గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గుజ్జుల్ డ్యాం ఎడమ కాలు తూముకు గండి పడి నీరు వృథాగా పోతున్న విషయం తెలిసిందే. నీటి పారుదల శాఖ అధికారులు రెండు రోజులుగా తూము గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం కూడ మరమ్మతు పనులు కొనసాగాయి. ఆయకట్టు పొలాల్లో నీరు చేరి పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పతకాల పంట
కామారెడ్డి అర్బన్ : ఆదిలాబాద్లో ఈనెల 7, 8 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ యోగాసన పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. జిల్లాకు ఎనిమిది పతకాలు వచ్చాయని యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యోగా రాంరెడ్డి తెలిపారు. డి.సురేందర్ బ్యాక్ బెండింగ్ విభాగంలో బంగారు, ట్రెడిషన్ విభాగంలో రజత పతకాలు సాధించారని పేర్కొన్నారు. సీహెచ్.రాజ్కుమార్ ట్విస్టింగ్, సుపైన్లో కాంస్యం, ఫార్వర్డ్ బెండింగ్లో వెండి పతకాలు, యు.అనిల్కుమార్ ఫార్వర్డ్ బెండింగ్లో కాంస్యం, సీహెచ్.తిరుపతి హ్యాండ్ బ్యాలెన్స్లో కాంస్యం, ఏ.రాజు ట్రెడిషన్ విభాగంలో వెండి పతకాలు సాధించారని తెలిపారు. మరికొందరు క్రీడాకారులు ప్రశంసా పత్రాలు అందుకున్నారన్నారు. -
తీజ్ సందడి
మోపాల్ : మండలంలోని ఎల్లమ్మకుంటలో ఆదివారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. పెళ్లి కాని యువతులు 9 రోజులపాటు గోధుమబుట్టలకు ప్రత్యేక పూజలు చేశారు. చివరిరోజు గోధుమబుట్టలను ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. అంతకుముందు సేవాలాల్ మహరాజ్, జగదాంబ మాతా ఆల యాల్లో పూజలు చేసి, బోగ్భండార్ నిర్వహించా రు. వేడుకలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటే ల్ కులాచారి, కాంగ్రెస్ ఆదివాసీ, గిరిజన జిల్లా చై ర్మన్ కెతావత్ యాదగిరి, జెడ్పీటీసీ మాజీ సభ్యు డు మోహన్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధా న కార్యదర్శి నరేశ్ నాయక్, బుజ్జి రతన్, తండా నాయక్ జోర్సింగ్ , కారొబార్ ప్రకాశ్ ఉన్నారు. మాక్లూర్: మండలంలోని అమ్రాద్ తండా, మద న్పల్లితండా, సట్లాపూర్తండా, కృష్ణానగర్తండాలలో గిరిజనులు తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. గిరిజన యువతులు ముందుగా మొలకెత్తిన గోధుమ నారును నెత్తిన పెట్టుకుని సేవాలాల్ మందిరం వరకు ఊరేగింపుగా వెళ్లా రు. గిరిజన మహిళలు వారి సంప్రదాయ దుస్తుల ను ధరించి నృత్యాలు చేశారు. అనంతరం సేవాలాల్ మహరాజ్ మందిరం వద్ద నైవేద్యాలు సమర్పించి వన భోజనాలు చేశారు. -
క్రైం కార్నర్
డ్రెయినేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఖలీల్వాడి: నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫారెస్ట్ ఆఫీస్ వద్ద గల డ్రెయినేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సయ్యద్ ముజాహిద్ తెలిపారు. మురికి కాలువలో మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి వచ్చి పరిసరాలను పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, అడి వయస్సు సుమా రు 40ఏళ్లు ఉంటాయని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు. చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి ఖలీల్వాడి: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని నెహ్రూనగర్ బస్టాండ్ దగ్గర నెల రోజుల క్రితం ఒక గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్య సమస్యలతో అపస్మారక స్థితి లో పడిఉన్నాడు. అతడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అతడిని చికిత్స నిమి త్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు యాబై ఏళ్లు ఉంటాయని, ఎవరైనా అతడిని గుర్తిస్తే పోలీస్ స్టేషన్లో గాని, లేదా 8712659848, 8712659734కు సంప్రదించాలన్నారు. చోరీకి గురైన బైక్ రికవరీ సదాశివనగర్(ఎల్లారెడ్డి): చోరీకి గురైన బైక్ను నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా.. మండలంలోని పద్మాజివాడి చౌరస్తా వద్ద పోలీసులు ప్రత్యేక చెక్పోస్టు ఏర్పాటు చేసి, వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి అనుమానాస్పదంగా బైక్పై వెళుతుండగా పోలీసులు అతడిని ఆపారు. వివరాలు సేకరించగా బైక్ను చోరీ చేసి తీసుకువస్తున్నట్లు అతడు పేర్కొన్నాడు. వెంటనే పోలీసులు బైక్ను స్వాధీనం చేసుకొని, వాహన యజమానికి సమాచారం అందించారు. పట్టుబడ్డ నిందితుడిని కామారెడ్డి పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. -
కట్టడి చేసినా.. గంజాయి సరఫరా..
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో గంజాయి కట్టడికి పోలీసులు ఎంత ప్రయత్నం చేస్తున్నా.. స్మగ్లర్లు ఏదో ఒకవిధంగా తమ దందాను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలోగల పలు గ్రామాలకు పొరుగు జిల్లాల నుంచి గంజాయి సరఫరా కొనసాగుతోంది. నిందితులను పోలీసులు పట్టుకుంటూ, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నా స్మగ్లర్లు దందాను ఆపడం లేదు. ఇదీ పరిస్థితి.. బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పొరుగు జిల్లాలైన జగిత్యాల్, నిర్మల్ల నుంచి గంజాయి స్మగ్లర్లు వచ్చి తమ దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా కమ్మర్పల్లిలో పోలీసులు మెట్పల్లికి చెందిన నాంపల్లి వికాస్ను అతడికి సహకరిస్తున్న స్థానికుడైన షేక్ ఇమ్రాన్ను అరెస్టు చేయడం పరిశీలిస్తే పొరుగు జిల్లాల నుంచి గంజాయి దిగుమతి అవుతుందని వెల్లడవుతోంది. నాంపల్లి వికాస్ను అరెస్టు చేసిన పోలీసులు అతడికి గంజాయి అందించేవారు ఎవరు? ఎంత మొత్తంలో సరఫరా చేస్తారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గంజాయి దందాకు కీలకమైన వ్యక్తులను పట్టుకుంటేనే ఈ దందాను పూర్తిగా అంతమొందించవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కౌన్సెలింగ్ ద్వారానే మార్పు.. గంజాయికి బానిసలైన యువకులను గుర్తించి వారికి, వారి తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తేనే గంజాయికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో మోర్తాడ్ ఎస్సైగా పనిచేసిన సంపత్ గంజాయికి బానిసలైన వారితోపాటు వారి తల్లిదండ్రులను పోలీసు స్టేషన్కు రప్పించి అందరి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉన్నతాధికారులు స్పందించి కౌన్సెలింగ్ ద్వారానే యువతలో మార్పు తీసుకరావాలని పలువురు సూచిస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి బాల్కొండ నియోజకవర్గ గ్రామాలకు సప్లయ్ పోలీసులు పట్టుకుంటున్నా వెరవని స్మగ్లర్లు ఎవరు విక్రయించినా ఉపేక్షించం గంజాయిని ఎవరైన, ఎక్కడైన విక్రయిస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి విషయంలో మా యంత్రాంగం సీరియస్గా ఉంది. గంజాయి విక్రయించేవారి గురించి సమాచారం ఇస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ప్రజల సహకారంతోనే గంజాయిని నిర్మూలించడం సాధ్యమవుతుంది. – సత్యనారాయణ, సీఐ, భీమ్గల్ -
క్రైం కార్నర్
దుస్తుల షాపు దగ్ధం మాక్లూర్: మండలంలోని ముల్లంగి(బి)లో శనివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బట్టల షాపు దగ్ధం కాగా సుమారు రూ. 12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన నీరడి ప్రశాంతి నాలుగేళ్ల క్రితం గ్రామంలో కిరాణ షాపుతో పాటు బట్టల షాపును నిర్వహిస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పెద్ద మొత్తంలో చీరలు కొనుగోలు చేసి దుకాణంలో పెట్టారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున షార్ట్సర్క్యూట్ జరగడంతో షాపులో ఉన్న వస్తువులు, బట్టలన్నీ కాలిపోయాయి. ప్రమాద విషయమై తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ పంచనామా నిర్వహించినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సందీప్ శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రాయన్పల్లి శివారులోని జాతీయ రహదారి పక్కన కుళ్లిన స్థితిలో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని, మృతుడి ఒంటిపై నెవీ బ్లూ కలర్ ప్యాంట్, తెల్లటి బనియన్, వైట్ అండ్ బ్రౌన్ చెక్స్ కలిగిన షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659854 నంబర్కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. పేకాట స్థావరంపై దాడి తాడ్వాయి: మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై మురళి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని ఓ రేకుల షెడ్డు వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఇద్దరిని పట్టుకోగా వారి నుంచి రూ. 1700 నగదును, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు. విద్యుత్షాక్తో మేకలు మృతి ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని అడివిలింగాల గ్రామ శివారులో విద్యుత్ షాక్ తగిలి రెండు మేకలు మృతి చెందినట్లు స్థానికులు శనివారం తెలిపారు. గ్రామంలోని మహ్మద్ సలీంకు చెందిన మేకలు గ్రామ శివారులో మేత మేస్తుండగా ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన విద్యుత్ తీగలు తగలడంతో షాక్ తగిలి మృతి చెందాయి. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి నష్ట పరిహారం అందేలా చూడాలని బాధితుడు కోరుతున్నాడు. యువకుడి అదృశ్యం మోపాల్: మండలంలోని నర్సింగ్పల్లికి చెందిన దుబ్బాక సాయితేజ అదృశ్యమైనట్లు ఎస్సై జాడె సుస్మిత శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయితేజ విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. అక్కడే హాస్ట ల్లో ఉంటున్నాడు. సెలవుల కోసం నర్సింగ్పల్లికి వచ్చిన సాయితేజ ఆ తర్వాత హాస్టల్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. సుమారు రెండు నెలల నుంచి సాయితేజ కనిపించకపోవడంతో స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి దుబ్బాక సావిత్రి ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పండుగ పూట విషాదం
నవీపేట: రాఖీ పండుగను పురస్కరించుకొని ఓ సోదరుడు అక్కతో రాఖీ కట్టించుకొని స్కూటీపై తిరిగి వస్తుండగా అనంత లోకాలకు వెళ్లిన ఘటన నవీపేట మండలం అబ్బాపూర్ (ఎం) శివారులో చోటు చేసుకుంది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన వర్గంటి సాయినాథ్, కవితలకు కుమార్తె సాయిప్రియి, కుమారుడు సాయిబాబు అలియాస్ బబ్లూ(21) ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాజుల్పేట్లో ఉంటున్న కవిత వద్దకు బబ్లూ రాఖీ పండుగ సందర్భంగా శనివారం ఉదయం స్నేహితుడు అరవింద్తో కలిసి స్కూటీపై వెళ్లాడు. అక్కతో రాఖీ కట్టించుకొని తిరిగి వస్తుండగా అబ్బాపూర్(ఎం)–జగ్గారావు ఫారమ్ మధ్యలో ముందు వెళ్తున్న కంటెయినర్ను ఓవర్టేక్ చేయబోయి దానిని ఢీకొన్నారు. ఈ ఘటనలో బబ్లూ కిందపడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అరవింద్కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి మేనమామ బలగం రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.● రాఖీ కట్టించుకొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం ● కంటెయినర్ ఢీకొని యువకుడి మృతి -
చోరీకి పాల్పడిన ముగ్గురి నిందితుల అరెస్ట్
మాక్లూర్: మండలంలోని కృష్ణనగర్లో ఇటీవల శ్రీహరి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురి నిందితులను మాక్లూర్ పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ రాజారత్నం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 1న కృష్ణనగర్లో తాళం వేసి ఉన్న శ్రీహరి ఇంట్లో నిందితులు చోరీకి పాల్పడగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం మాణిక్బండార్ చౌరస్తాలో అనుమానంగా తిరుగుతున్న ముగ్గురి నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారింగా కృష్ణనగర్లో చోరీకి పాల్పడింది తామేనని నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 4.8 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. పదివేల నగదు, రెండు ఫోన్లు, ఐదు బైక్లు, రూ. 50 వేలు విలువ చేసే రోల్డ్ గోల్ బంగారాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. పట్టుబడిన వారిలో కామారెడ్డి జిల్లాకు చెందిన చాకలి రాజు, కన్నె లింగం, మరొకరు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లికి చెందిన నగేశ్ పోలీసులు గుర్తించారు. వీరు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ను ఏసీపీ అభినందించారు. -
అన్నివర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం
నిజామాబాద్ సిటీ: దేశ స్వాతంత్య్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలక ఘట్టమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హుందాన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో క్విట్ ఇండియా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ భవన్లో తాహెర్బిన్ జాతీయ జెండాను, నుడా చైర్మన్ కేశ వేణుతో కలిసి ఎగురవేశారు. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ జెండాను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో తాహెర్బిన్ మాట్లాడుతూ.. మహత్మాగాంధీ శాంతియుతంగా చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిషర్లను దేశం వదిలేలా చేసిందన్నారు. అన్నివర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. ఈకార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్గౌడ్, నాయకులు నరాల రత్నాకర్, రామర్తి గోపి, నరేందర్గౌడ్, లవంగ ప్రమోద్కుమార్, మొయిన్, వంశీ, దినేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులంలో విశ్వ సంస్కృత భాషా దినోత్సవం
మద్నూర్(జుక్కల్): భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిరూపం సంస్కృత భాష అని సంస్కృత భాష ప్రచార సమితి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి.వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం విశ్వ సంస్కృత భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. అన్ని భాషలకు సంస్కృతం అమ్మభాష అని అన్నారు. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు, రామాయణం, మహాభారతం తదితర గ్రంథాలు దేవనాగరిలిపిలో రచించబడ్డాయని చెప్పారు. భారతదేశంలో అనేక విశ్వవిద్యాలయాల్లో సంస్కృతం బోధిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంస్కృత భాషను ప్రేమించాలని, నేర్చుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులు సంస్కృత గేయాలు, సుభాషితాలను, శ్లోకాలను ఆలపించారు. పాఠశాల ప్రిన్స్పాల్ గంగాకిషోర్, ఉపాధ్యాయులు సుమన్, నరహరి, సంజీవ్, ఆశోక్, ప్రవీణ్, హన్మండ్లు, నరేష్, బస్వరాజు, విద్యార్థులున్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
● డిచ్పల్లి సీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్ డిచ్పల్లి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం డిచ్పల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, జనరల్ వార్డు, ల్యా బ్ తదితర విభాగాల పనితీరును పరిశీలించారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, రౌండ్ ది క్లాక్ ఆస్పత్రుల్లో అన్ని సమయాల్లో వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉండాలని ఆదేశించారు. ప్రతీ నెల రెండో శనివారం ప్రత్యేకంగా నిర్వహించే ఆరోగ్యశ్రీ శిబిరానికి అన్ని విభాగాల స్పెషలిస్టు డాక్టర్లు హాజరయ్యేలా చూడాలని, పీహెచ్సీలు, సీహెచ్సీల పనితీరును ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి భూభారతి దరఖాస్తుల పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. డిచ్పల్లి తహసీల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి తహసీల్దార్ సతీశ్రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
ఎస్సారెస్పీలోకి పెరిగిన వరద
బాల్కొండ: ఎస్సారెస్పీలోకి స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల వరద మరింత పెరిగింది. ప్రాజెక్ట్లోకి 14630 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3 వేలు, లక్ష్మికాలువ ద్వారా 150, సరస్వతి కాలువ ద్వారా 300, అలీసాగర్ లిప్టు ద్వారా 180, గుత్ప లిప్టు ద్వారా 270, ఆవిరి రూపంలో 462, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగుల నీ రు కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1078.40(40.8 టీఎంసీలు) అడుగుల నీటి ని ల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. టీఎన్జీవీఏ నూతన కార్యవర్గం ఎన్నిక డొంకేశ్వర్: తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటరినేరియన్స్ అసోసియేషన్ (టీఎన్జీవీఏ) నూతన కార్యవర్గం ఎన్నికై ంది. జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా తిరుమల వినీత ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. కార్యదర్శి గా గంగరాజు, సహాధ్యాక్షుడిగా వినోద్, కోశాధికారిగా వెంకటి, ఉపాధ్యాక్షులుగా రమేశ్, ప ద్మావతి, నారాయణ, గంగాధర్, చంద్రశేఖర్ ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవో స్ జిల్లా అధ్యక్షుడు సుమన్తో పాటు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బింగి సురే శ్,అభిషేక్ రెడ్డిలుసన్మానించి అభినందించారు. క్యాంపస్లో కొనసాగుతున్న తీజ్ ఉత్సవాలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ లో శనివారం ఆరో రోజు తీజ్ ఉత్సవాలు కొనసాగాయి. ఈ సందర్భంగా తెయూ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు సాగర్నాయక్ మాట్లాడుతూ.. బంజారాల సంస్కృతి, సాంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో రవీందర్నాయక్, గిరిజనశక్తి విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీనురాథోడ్, సచిన్, మోహన్, రాము, రాజు, విద్యార్థినులు సంద్య, అశ్విని పాల్గొన్నారు. -
ఏదైనా స్ట్రెయిట్గా..
నిజామాబాద్అర్బన్: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా హవానే జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సమాచార పంపిణీలో వాట్సాప్ అగ్రగామిగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ వాడకం తప్పనిసరిగా మారిపోయింది. వాట్సాప్లోని స్టేటస్ ఫీచర్ ద్వారా ఒకరి అభిరుచులను, ఒకరి విషయాలను, ఒకరి చెడు, మంచి ఘటనలను తేలికగా తెలుసుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ స్టేటస్పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ప్రతిభను కనబర్చినా.. చాలామంది తమ వ్యక్తిగత ప్రతిభ చాటడానికి స్టేటస్ను ఉపయోగించుకుంటున్నారు. విద్యా, ఉద్యోగం, క్రీడలు ఇలా ఎందులోనైనా వారు ప్రతిభ సాధించి ఉంటే అప్పటికప్పుడు స్టేటస్లో పోస్ట్ చేస్తున్నారు. లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరు ప్రతిభ కనబర్చినా పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులు చూసినవారు వారిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. మనోభావాలను వ్యక్తపరుస్తూ.. కొందరు వారి మనోభావాలను తెలియజేసే విషయాలను ఎంపిక చేసుకొని స్టేటస్లో పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది వారికి జరిగిన మంచి, చెడులను ఇతరులకు చెప్పేందుకు స్టేటస్ను ఆశ్రయిస్తున్నారు. అలాగే కొందరు ప్రతిరోజు ఉదయమే వారానికి తగ్గట్టు దేవుళ్ల ఫొటోలు, పాటలతో స్టేటస్ పెడుతుంటారు. ప్రత్యేక రోజులు, పండుగల్లోనూ శుభాకాంక్షలు తెలుపుతూ స్టేటస్ పెట్టేవారు కూడా చాలామంది ఉన్నారు. చూసేవారు ఎక్కువే.. వాట్సాప్ను ఉపయోగించే వారందరూ స్టేటస్లో వారికి నచ్చిన అంశాలను పోస్ట్ చేయడంతోపాటు ఇతరుల స్టేటస్ను చూస్తూ ఉంటున్నారు. ఐదేళ్ల క్రి తం వరకు వాట్సాప్ యాప్ ఉపయోగించే వారిలో పది నుంచి 20 శాతం మాత్రమే స్టేటస్ ఫీచర్ను ఉ పయోగించేవారు. ఇప్పుడు 80 శాతం మంది వర కు ఈ ఫీచర్ను చూస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు రోజుల్లో నాలుగైదు సార్లు స్టేటస్ను చూడందే నిద్రపోవడం లేదు. వారు పెట్టిన పోస్టులను ఎంతమంది చూశారు? ఎవరైన ప్రతి స్పందించారా అన్న ఆత్రుత కోసం వెతికేవారు ఎంతోమంది ఉన్నారు. ఇలా వారు పెట్టిన పోస్ట్కు ఎవరు స్పందించకపోతే తీవ్ర అసంతృప్తి గురయ్యే వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా వాట్సాప్ స్టేటస్తో వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వల్ల తమ భద్రతకు, వ్యక్తిగ త గోప్యతకు భంగం కలుగుతుందన్న విషయాన్ని కూడా గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. తానేంటో తెలుపుతూ..స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో వాట్సాప్ యాప్లోని స్టేటస్ ఫీచర్ను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆధునిక టెక్నాలజీకి అలవాటు పడ్డ చాలా మంది స్టేటస్ పోస్ట్ పెట్టడం అనేది ఒక స్టేటస్గా భావిస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ తదితర మాధ్యమాలు ఉన్నప్పటికీ ఎక్కువగా వాట్సాప్ స్టేటస్ వేదికగా వాడుకుంటున్నారు. తానేంటో తెలిపేందుకు, ఇతరుల విషయాలు తెలుసుకునేందుకు స్టేటస్ ముఖ్య భూమిక పోషిస్తుంది. రోజువారి జీవితంలో చేసే పనులను, వెళ్లిన ప్రదేశాలను వాట్సాప్ స్టేటస్గా పెడుతూ ఎప్పటికప్పుడు తాము ఉన్న స్థితిని తెలియజేస్తున్నారు. వ్యాపారానికి ప్రచారం..వ్యాపార అభివృద్ధికి సోషల్ మీడియా ఒక ప్రచార వేదికగా మారింది. అందులోనూ అందరూ ఎక్కువగా చూసే వాట్సాప్ స్టేటస్ను చాలామంది వ్యాపారులు తమ వ్యాపార అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు. వ్యాపారం గురించి బ్రోచర్లు ముద్రించి స్టేటస్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇక విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పాఠశాలకు సంబంధించిన వివరాలను ప్రతిరోజు స్టేటస్లో ప్రదర్శిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్, హోట ల్స్, వివిధ దుకాణాలు, మాల్స్ ఇలా అన్ని వ్యాపార రంగాల వారు తమ ఆఫర్లను, సర్వీసులను స్టేటస్లో పెడుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఖలీల్వాడి: వినాయక చవితి వేడుకల్లో ఎవరైన ని బంధనలు అతిక్రమిస్తే ఎంతటివారైన చర్యలు తప్పవని సీపీ పోతరాజు సాయి చైతన్య హెచ్చరించారు. నగరంలోని సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయా పోలీస్స్టేషన్ ఎస్సైలకు తగిన ఆదేశాలు ఇప్పటికే జారీ చేశామన్నారు. గణేష్మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విగ్రహాలను వివాదాస్పద స్థలాల్లో పెట్టవద్దని, ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్దకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన పార్కింగ్ స్థలం కూడ ఎంపిక చేసుకోవాలన్నారు. పోలీసుల అను మతి లేనిదే మండపం పెట్టవద్దన్నారు. రాత్రి 10 తర్వాత డీజే సౌండ్స్ నిషేదం అన్నారు. మండపాలకు విద్యుత్ కనెక్షన్ కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు రాజావెంకట్రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
కిటకిటలాడిన బస్టాండ్
నిజామాబాద్ బస్టాండ్లో గుమిగూడిన ప్రయాణికులు నిజామాబాద్ బస్టాండ్ శనివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. రాఖీ పండుగను పురస్కరించుకొని సోదరులకు రాఖీ కట్టేందుకు, కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోవడానికి తమ ఊర్లకు వెళ్లేందుకు మహిళలు భారీగా బస్టాండ్కు తరలివచ్చారు. బస్సుల కోసం ఎదురుచుస్తున్న ప్రయాణికులతో బస్టాండ్ సందండిగా మారింది. రద్దీ ఎక్కువ ఉండటంతో సీట్ల కోసం ప్రయాణికులు బస్సులు రాగానే ఎగబడ్డారు. మరికొందరూ కిటికీల నుంచి దూరి సీట్లను దక్కించుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
విస్తృత స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి
సుభాష్నగర్: గ్రామ పంచాయతీ భవనం మొదలు కుని రాష్ట్ర సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, తద్వారా విద్యుత్ ఉత్పత్తి పెంచాలని రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్లోని బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి శనివారం ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, రెడ్కో సీఎండీ అనిల్ తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం అమలు, ఇరిగేషన్, దేవాదాయ తదితర శాఖల పరిధిలోని ఖాళీ భూములు, అవకాశమున్న చోట్ల సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీ కూడా ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలమైన డిజైన్లను హైదరాబాద్ నుంచి ఎంపిక చేసి పంపిస్తామని తెలిపారు. ఏవైన మంచి డిజైన్లు ఉంటే, వాటిని పంపాలని సూచించారు. నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పరిధిలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటి వివరాలు సైతం పంపాలన్నారు. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని జాప్యానికి తావు లేకుండా వారం రోజుల్లోపు వివరాలు పంపాలని సూచించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, టీజీ రెడ్కో డీఎం రమణ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లల్లో యూనిట్లు ఏర్పాటు చేయాలి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ -
స్టేటస్..
నిజామాబాద్ఆదివారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2025మనం ఆనందంలో ఉన్నా, కొత్త ప్రదేశానికి వెళ్లినా, మూవీకి వెళ్లినా, మంచి ఫుడ్ తిన్నా, బాధాకరమైన సమాచారం ఉన్నా, లేదా ఇంట్లోనే ఉన్నా, ఈ విషయాలను ఎవరికీ చెప్పకున్నా, వాట్సాప్ స్టేటస్లో ఫొటో కానీ, వీడియో కానీ పెట్టేస్తే అందరికీ తెలిసిపోతుంది. అలాగే ఎవరికై నా బర్త్డే, మ్యారెజ్ డే విషెస్, సంతాపం తెలపాలన్నా స్టేటస్లో పెట్టేస్తే, వారికి చెప్పకనే చెప్పేస్తుంది. ప్రస్తుత ఆన్లైన్ కాలంలో అన్నింటికీ ప్రచార వేదికగా వాట్సాప్ స్టేటస్ మారిపోయింది. న్యూస్రీల్ నేటి తరంలో క్రేజీ.. ప్రజలకు మరింత చేరువవుతున్న వాట్సాప్ స్టేటస్ ఫీచర్ ప్రతి నిత్యం తమ భావోద్వేగాన్ని పంచుకుంటున్న ప్రజలు మెరుగుపడుతున్న కమ్యూనికేషన్ -
నిరీక్షణ ఇంకెన్నాళ్లు..?
● పెండింగ్లోనే అభివృద్ధి పనుల బిల్లులు ● నిధుల కోసం ఎదురుచూస్తున్న మాజీ సర్పంచులు మోర్తాడ్(బాల్కొండ): గ్రామాల్లో గత సర్పంచులు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు ఇప్పటికీ విడుదల కాలేవు. దీంతో వారు నెలల తరబడి నిధుల రాక కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 2024లో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోయింది. అంతకుముందు నుంచే వారికి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సర్పంచ్లుగా వ్యవహరించిన వారికి బిల్లులు మంజూరు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదిపాటు కాలయాపన చేసింది. అప్పట్లో ఆ పార్టీకి చెందిన వారే సర్పంచ్లుగా ఎ క్కువ మంది ఉండటంతో బిల్లుల గురించి అప్పటి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోయారు. ప్రస్తు తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మాజీ సర్పంచ్ల బిల్లులకు మోక్షం లభించడం లేదు. జిల్లాలో రూ.15 కోట్లకు పైగా పెండింగ్.. జిల్లాలోని మాజీ సర్పంచ్లకు దాదాపు రూ.15 కో ట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అంచనా. 15వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులకు సంబంధించి బిల్లులు చేసి పంపినా ట్రెజరీల్లోనే చెల్లింపులు నిలిచిపోయాయి. కొందరు సర్పంచ్లకు టోకెన్లు జారీ చేసినా నిధులు లేకపోవడంతో ఖాతాల్లో సొమ్ము జ మ కావడం లేదు. తమ బిల్లుల కోసం మా జీ స ర్పంచ్లు అనేక మార్లు సచివాలయం, అసెంబ్లీ ము ట్టడికి పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడానికి యత్నించగా పోలీసులు ముందస్తు అరెస్టులతో అడ్డుకున్నారు. గత ప్రభుత్వాన్ని బిల్లుల కోసం ప్రశ్నించని నాయకులు ఇప్పు డు నిరసన తెలియజేస్తూ ఈ ప్రభుత్వం పరువు తీయాలని చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముడుపులు ఇస్తామంటూ.. బిల్లులకు సంబంధించి పలువురికి టోకెన్లను ఆర్థి క శాఖ జారీ చేసింది. కాగా బిల్లుల చెల్లింపులు మొ త్తం హైదరాబాద్ నుంచి పెండింగ్లో ఉండటంతో ఒక్కో బిల్లుకు 18 శాతం వరకు ముడుపులు ఇస్తా మని ఉద్యోగులను ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. కానీ మాజీ సర్పంచ్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోయింది. ఏదేమైనా మాజీ సర్పంచ్లు తమ బి ల్లుల కోసం నిరీక్షించక తప్పదని స్పష్టమవుతోంది. మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామ సర్పంచ్ కడారి శ్రీనివాస్ తన పదవీ కాలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టగా, అందుకు సంబంధించి రూ.58 లక్షల బిల్లు ప్రభుత్వం నుంచి మంజూరు కావాల్సి ఉంది. అలాగే మోర్తాడ్ గ్రామ సర్పంచ్గా పని చేసిన ధరణికి కూడా పలు పనులకు సంబంధించి రూ.70 లక్షల బిల్లు మంజూరు కావాల్సి ఉంది. వీరి పదవీ కాలం ముగిసిపోయి ఏడాదిన్నర కాలం అవుతున్నా ఇప్పటికీ బిల్లులు మాత్రం రాలేదు. దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల మాజీ సర్పంచ్లకు సైతం బిల్లులు మంజూరు కాకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నారు.ప్రభుత్వం స్పందించాలి.. ప్రజలు మాపై నమ్మకంతో సర్పంచ్లుగా ఎన్నుకున్నారు. వారికి సౌకర్యాలను కల్పించడానికి అభివృద్ధి ప నులకు సొంతంగా అప్పులు చేసి పనులు పూర్తి చేశాం. రూ.లక్షల్లో అప్పులు చేసిన ఎంతోమంది వడ్డీ చెల్లించడానికి అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి. – కడారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్, సుంకెట్ ఆస్తులు అమ్ముకుంటున్నారు.. సర్పంచ్లుగా పని చేసిన వా రికి రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్లో ఉండటంతో అప్పు లు తీర్చడం కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. వడ్డీ భారంతో ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది మాజీ సర్పంచ్లు దిగులుతో మరణించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. – గడ్డం చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్, తిమ్మాపూర్ -
వైభవంగా వరలక్ష్మి వ్రతశోభ
నిజామాబాద్ రూరల్/ డిచ్పల్లి: వరాలను అందించే వరలక్ష్మి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో ఆడపడుచులు వైభవంగా వరలక్ష్మి వ్రతాలు చేశారు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పలు ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో సామూహిక వ్రతాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, శివాజీనగర్లో ఉన్న గీత ఆలయం, న్యాల్కల్ రోడ్డులో ఉన్న లలితాదేవి ఆలయం, దుబ్బలో ఉన్న మహాలక్ష్మి ఆలయం, కోటగల్లిలో ఉన్న మార్కండేయ మందిరం, నల్లపోచమ్మ ఆలయం, వినాయక్నగర్లో ఉన్న భూలక్ష్మి ఆలయం, మారుతినగర్, నాందేవాడలో ఉన్న అమ్మవారి ఆలయాల్లో, డిచ్పల్లి మండల కేంద్రంలో, పోలీస్ బెటాలియన్లోని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. -
అలుగు పారుతున్న చెరువులు
మోపాల్/ నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని కాల్పోల్ ఊర చెరువు అలుగు పారుతోంది. గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు అటవీ ప్రాంతాల గుండా వరద చెరువులోకి వచ్చి చేరుతోంది. అదే విధంగా మంచిప్ప పెద్ద చెరువుతోపాటు బాడ్సి, కంజర్, ముదక్పల్లి, సిర్పూర్, తదితర చెరువుల్లోకి కూడా వరద వచ్చి చేరుతోంది. ఊర చెరువు అలుగు పారడంతో అటవీ ప్రాంతంలో ఉన్న కాల్పోల్ వాటర్ ఫాల్స్ సందడిగా మారనుంది. రూరల్ మండలంలోని మల్కాపూర్ తండా చెరువు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిండుకుండలా మారి అలుగు పారుతోంది. దీంతో గ్రామస్తులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
అటవీశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి
మోపాల్: మండలంలోని బైరాపూర్ శివారులోని మోతీరాంనాయక్ తండాలో గిరిజనులు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటపై గడ్డి మందు చల్లి ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని ఏఐబీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామావత్ మోహన్ నాయక్ డిమాండ్చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి, అదనపు కలెక్టర్ కిరణ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీహరి నాయక్, చౌహన్ మోహన్ నాయక్, పీర్సింగ్, గంగాధర్, రవి రాథోడ్, బాలు నాయక్, ఇందల్, జలంధర్, గౌతమ్, కమలాజీ, రమేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వసతిగృహ అధికారికి ఆర్థికసాయం నిజామాబాద్అర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వసతి గృహ అధికారి రాజేందర్కు శుక్రవారం వార్డెన్ల సంక్షేమ సంఘం ఆర్థిక సహాయాన్ని అందించింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ వసతి గృహాధికారిగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ ఈనెల 6న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో సంక్షేమ వసతి గృహ అధికారులు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్ ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్ రూ. 80 వేల ఆర్థికసాయాన్ని అందించారు. కార్యక్రమంలో వసతి గృహాధికారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చెందర్, టీఎన్జీవోస్ జనరల్ సెక్రెటరీ జాఫర్ తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి నిజామాబాద్ నాగారం: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని లయన్స్ క్లబ్ జిల్లా అదనపు కోశాధికారి లక్ష్మీనారాయణ అన్నారు. నగరంలోని వివేకానందనగర్ కాలనీలో శుక్రవారం వనమహోత్సవం నిర్వహించారు. కాలనీవాసులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.లింబాద్రి, పి.రాఘవేందర్, కోశాధికారి ఎ.రాజేందర్, జి.రామకృష్ణ రెడ్డి, గంగాదాస్, వెంకటరమణ, బాబుకృష్ణ, రాజశేఖర్, కాలనీవాసులు నర్సింహారెడ్డి, నర్సారెడ్డి, తుకారాం, విజయలక్ష్మి, శారద, రవి, కృష్ణ, నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు జక్రాన్పల్లి: ఆయిల్ పామ్ పంట సాగుతో అధిక లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయ అధికారిణి దేవిక సూచించారు. శుక్రవారం మండలంలోని కొలిప్యాక్లో ఆయిల్ పామ్ పంట సాగు పై రైతులకు అవగహన సదస్సు నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. హార్టికల్చర్ అధికారి రాజు, ఏఈవో శివ ప్రసాద్, ప్రీ యూనిక్ కంపెనీ క్లస్టర్ ప్రతినిధి రాకేశ్, గ్రామ మాజీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ రూరల్: చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర చేనేత గౌరవ అధ్యక్షుడు చెలివేరి గణేశ్ అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని చేనేత సహకార సంఘం భవనంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. చేనేత కార్మికులకు తక్కువ ధరకే వారు తయారు చేసే మెటీరియల్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుతాన్ని ఆయన కోరారు. అంతకుమందు పలువురు చేనేత కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిలివేరి శంకర్, రాష్ట్ర సలహాదారులు కొండి రమేశ్, బీమర్తి రవి, బొట్టు వెంకటే్శ్, కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. -
వర్సిటీ హాస్టల్ డిపాజిట్ ఫీజు తగ్గించాలి
తెయూ(డిచ్పల్లి): రాష్ట్రంలో ఏ ఇతర యూనివర్సిటీల్లో లేని విధంగా తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్ డిపాజిట్ ఫీజులు ఆకాశన్నంటుతున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్ విమర్శించారు. శుక్రవారం తెయూ న్యూబాయ్స్ హాస్టల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు రూ.10 వేలు, నాన్ స్కాలర్షిప్, ఓసీ విద్యార్థులకు రూ.18వేల చొప్పున డిపాజిట్ వసూలు చేస్తున్నారన్నారు. వెంటనే వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజు, వర్సిటీ అధ్యక్షుడు జీషన్, ఉపాధ్యక్షులు నాగేంద్ర, నిరంజన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రీగార్డులు వృథాగా..
నేటి చిత్రంనిజామాబాద్ సిటీ: మొక్కల రక్షణ కోసం కొనుగోలు చేసిన ట్రీగార్డులను మున్సిపల్ అధికారులు వృథాగా పడేశారు. గతేడాది హరితహారం కార్యక్రమంలో కొనుగోలు చేసిన వీటిని పెద్ద సంఖ్యలో జోన్–2లోని గోల్హనుమాన్ శానిటేషన్ కార్యాలయంలో ఓ మూలన పడేశారు. ఓ పక్కన నాటిన మొక్కలు పశువులు తింటున్నాయి. మరోపక్క రూ. లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ట్రీగార్డులను వృథాగా పడేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – రామగిరి శంకర్, కసాబ్గల్లి మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము. నిజామాబాద్ అర్బన్ – 95531 30597 నిజామాబాద్ రూరల్ – 97053 46541 మాకు ఫొటో పంపండి -
హరిచరణ్లో జీవన్ దాత వందన ఉత్సవం
నిజామాబాద్ రూరల్: మార్వాడీ యువ మంచ్ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో హరిచరణ్ మార్వాడీ హిందీ విద్యాలయంలో ‘జీవన్ దాత వందన ఉత్సవం’ నిర్వహించారు. స్కూల్లో విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలు కడిగి వారిని నమస్కరించారు. అనంతరం దుబ్బా ప్రాంతంలోని అక్షరధామ్ స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో మార్వాడీ యువ మంచ్ అధ్యక్షుడు సందీప్ సార్డా, అఖిల భారతీయ మార్వాడీ యువ మంచ్ జాతీయ అధ్యక్షుడు సురేశ్ ఎం జైన్, ఆంధ్రా–తెలంగాణ మార్వాడీ యువ మంచ్ ప్రాంతీయ అధ్యక్షుడు మనీష్ నహర్, శ్రీకాంత్ ఝన్వర్, ఉదయ ఉపాధ్యాయ్, అనురాగ్ భంగడియా, రాఘవ ఉపాధ్యాయ్ పాల్గొన్నారు. -
సంక్షిప్తం
రజతోత్సవ మహాసభల్లో సత్యానంద్ నిజామాబాద్అర్బన్: కోల్కతలో ఈ నెల 8 నుంచి10వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రజతోత్సవ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ హాజరయ్యారు. ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారుగా 37 మంది ప్రతినిధులు హాజరుకాగా జిల్లా నుంచి డి. సత్యానంద్ పాల్గొన్నారు. మహాసభల్లో జాతీయ విద్యా విధానాన్ని పునరుద్ధరించాలని, మధ్యాహ్న భోజన స్లాబ్ రేట్స్ పెంచాలని, విద్యార్థులకు సరిపడా అన్ని రకాల స్టేషనరీ అందించాలన్న అంశలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. హైమాస్ట్ లైట్ల ప్రారంభం సిరికొండ: మండలంలోని తూంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను బీజేపీ నాయకులు శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ మంజూరు చేసిన నిధులతో లైట్లను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. పార్టీ మండల ఉపాధ్యక్షుడు అన్నారం గంగామురళి, మండల కార్యదర్శి జినుక రాజేందర్, బూత్ అధ్యక్షుడు అరిగెల రమేశ్, సత్తూర్ రవి, బూస రాజు, గంగాధర్, రాజేశ్వర్, నరేశ్, రాజు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యసమాజ్లో యజ్ఞం నిజామాబాద్ రూరల్: ఇందూరు ఆర్యసమాజ్లో శ్రావణమాస యజుర్వేద పారాయణ యజ్ఞములను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వరలక్ష్మి వ్రతాల సందర్భంగా రామగిరి సుదర్శన ముని సిద్ధిరాములు, కరిపె సూర్యప్రకాశ్, మల్లికార్జున, ప్రశాంత్ దంపతులు పూజలు చేశారు. వీడీసీల ఆగడాలను అరికట్టాలి నిజామాబాద్ అర్బన్: జిల్లాలో వీడీసీల ఆగడాలని అరికట్టాలని దళిత సంఘాల బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ప్రసాద్ శుక్రవారం డిమాండ్ చేశారు. ఇటీవల ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్లో మాదిగ కులస్తులను గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరించడం అన్యాయం అన్నారు. ఆ గ్రామంలో మడిగెల పంపిణీ విషయంలో తలెత్తిన వివాదంలో వీడీసీ కులస్తులను బహిష్కరించి వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా చేయడం దారుణమన్నారు. వ్యవసాయ పనులు జరగకుండా, నిత్యావసర సరుకులు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి ఇందల్వాయి: భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆర్డీవో రాజేంద్ర కుమార్ అధికారులకు సూచించారు. ఇందల్వాయి తహసీల్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భూభారతి రెవెన్యు సదస్సుల్లో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆలస్యం చేయకుండా తొందరగా విచారణ చేపట్టి సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రేషన్కార్డుల దరఖాస్తులను విచారణ చేపట్టి అర్హులకు రేషన్కార్డులు అందేలా చూడాలన్నారు. తహసీల్దార్ వెంకట్రావు, డీటీ శైలజ, ఆర్ఐ మోహన్, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ పాల్గొన్నారు. -
డీఈవోకు వినతి
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధ్యాయ పదోన్నతుల్లో స్వచ్ఛందంగా తమకు పదోన్నతి వద్దు అనుకునే వారికి నాటు విల్లింగ్ ఇచ్చి పదోన్నతి నుంచి తప్పుకునే అవకాశాన్ని కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేశ్, గంగాధర్ కోరారు. డీఈవో అశోక్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మేతరి మల్లేశ్, శీను, ప్రతాప్, శ్రీనివాస్, లక్ష్మణ్, రవి, అశోక్, రవీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముర్రుపాలు పట్టించాలి జక్రాన్పల్లి: పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ సునంద అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. పౌష్టికాహారంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ గోడ గంగలక్ష్మి, కవిత, సవీణ ఏఎన్ఎం స్వరూపం, ఆశా వర్కర్ లత పాల్గొన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి నిజామాబాద్ రూరల్: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయీమెంట్ ట్రెయినర్ గోపిక అన్నారు. నగరంలోని వాణి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని రాఖీలు తయారు చేయించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ రమేశ్ గౌడ్, మహేశ్ కుమార్, ప్రిన్సిపాల్ స్వప్న, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆత్మీయ భరోసాను అమలు చేయాలి సిరికొండ: భూమి లేని పేదలకు ఇందిరా ఆత్మీయ భరోసాను వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి కిశోర్ డిమాండ్ చేశారు. మండలంలోని గడ్కోల్లో జీపీ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. నాయకులు లింబాద్రి, కిరణ్, అనీస్, కిశోర్, కట్ట రాములు, ఎర్రన్న, రాములు, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంసీ మోసంలో.. అసలు సూత్రధారులెవరూ?
షణ్ముకకు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సహకారం?● ప్రజాప్రతినిధులు అడిగినా లీజుకు ఇవ్వని సీఎస్ఐ మెదక్ డయాసిస్ పెద్దలు ● షణ్ముక మహాలింగానికి అనుమతులు ● పెట్టుబడుల రూపంలో వైద్యుల నుంచి రూ. కోట్లు వసూలు చేసిన షణ్ముక ● మోసపోయిన పలువురు జిల్లా డాక్టర్లు నిజామాబాద్నాగారం/ డిచ్పల్లి: డిచ్పల్లి మండ లం సుద్దపల్లి శివారులో గల సీఎంసీ (క్రిస్టియన్ మెడికల్ కాలేజ్) పున:ప్రారంభం పేరిట వైద్యులను మోసం చేసిన విషయంలో సూత్రధారులెవరనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. మాజీ ఐఏఎస్ పేరిట వై ద్యులను నమ్మించి, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి మోసం చేసిన షణ్ముక మహాలింగం వెనక ఎవరున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. పక్కా పథకం ప్రకారమే వైద్యుల డబ్బులకు ఎసరు పెట్టారనే చర్చ నడుస్తోంది. పేరు మార్చి తాత్కాలిక అనుమతులు సీఎంసీని పున:ప్రారంభిస్తామని, అందులో భాగంగా 50 పడకలతో ఆస్పత్రిని సైతం అందుబాటులోకి తేస్తామని గతేడాది ఏప్రిల్ 27న జిల్లా వైద్యారోగ్యశాఖలో డాక్టర్ ముద్దమాల ఇసాక్ అభిలాష్ పేరిట దరఖాస్తు చేశారు. మూడు నెలల్లో అన్ని వస తులు ఏర్పాటు చేసి, వైద్యులను నియమించుకొని సేవలు అందిస్తామని దరఖాస్తులో పేర్కొన్నా రు. దీంతో నిబంధనల ప్రకారం డీఎంహెచ్వో తాత్కాలికంగా మూడు నెలల అనుమతి ఇచ్చారు. కాగా, జూలై 26తో గడువు ముగియడం, ఎంసీఐ అను మతి రాకపోవడంతో మెడికల్ కాలేజీ ప్రారంభం కాలేదు. మళ్లీ ఈ ఏడాది మే 19న మరోసారి సీఎంసీ పున:ప్రారంభం కోసం సీఎస్ఐ మెడికల్ ట్రస్ట్ పేరిట డాక్టర్ విమల్కుమార్ సుకుమార్, డాక్టర్ ముద్దమాల ఇసాక్ అభిలాష్ దరఖాస్తు చేశారు. గ తంలో మాదిరిగానే మూడు నెలల్లో వసతులు, సౌ కర్యాలు కల్పిస్తామని వైద్యాధికారులతో పేర్కొన్నా రు. అయితే ప్రస్తుత డీఎంహెచ్వో అనుమతి ఇవ్వడానికి ససేమేరా అనడంతో పలువురితో ఒత్తిడి తీ సుకువచ్చారు. ఐఎంఏ ప్రతినిధులు వచ్చి విన్నవించడంతోపాటు 26 మంది వైద్యుల పేర్లతో కూడిన జాబితాను అందజేయడంతో తాత్కాలిక అనుమతులు ఇచ్చారు. ఆ గడువుకు కూడా ఈ నెల 18తో ముగియనుండడం గమనార్హం. తెరమీదకు రిటైర్డు ఐఏఎస్ పేరు.. దేశ, రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్న జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు అడిగినా లీజుకు ఇచ్చేందుకు సీఎస్ఐ మెదక్ డయాసిస్ మెడికల్ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఒప్పుకోలేదు. కానీ, కర్ణాటకకు చెందిన షణ్ముక మహాలింగం తాను రిటైర్డ్ ఐఏ ఎస్ను అని చెప్పుకోగానే లీజు ఒప్పందం చేసు కోవడం విస్మయం కలిగిస్తోంది. షణ్ముక మహాలింగంను ట్రస్ట్ సభ్యులు ఎలా నమ్మారో అర్థం కావడం లేదని స్థానిక క్రిస్టియన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా రు. షణ్ముక మహాలింగంకు జిల్లాలోని వైద్యులతో నేరుగా సంబంధాలు ఉన్నాయా? లేదంటే ఇక్కడికి ఎలా వచ్చారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది దరఖాస్తు చేసిన ఇసాక్ అభిలాష్ మళ్లీ ఈసారి కూడా దరఖాస్తు చేసుకోవడం చూస్తే పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగిందనే అభిప్రాయా లు వినిపిస్తున్నాయి. డాక్టర్ అజ్జ శ్రీనివాస్కు డైరెక్టర్ పదవి ఇస్తామని చెప్పి అతడితో రూ.2.20 కోట్లు పెట్టుబడులు పెట్టించడంతోపాటు మరో 26మంది వైద్యుల నుంచి సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు షణ్ముక మహాలింగం వసూలు చేసినట్లు తెలుస్తోంది. సీఎంసీకి ఎంసీఐ అనుమతి నిరాకరణతోనే ఈ మోసాలన్నీ బయటకు రావడం గమనార్హం. అసలు షణ్ముకను ఇక్కడికి రప్పించిందెవరు? షణ్ముకకు ఢిల్లీలో మంచి సంబంధాలున్నాయని, ఎంసీఐ నుంచి మెడికల్ కళాశాలకు సులువు గా అనుమతి తీసుకువస్తారని జిల్లాలోని వైద్యులను నమ్మించిందెవరు? అనేది తెలియాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చినా..దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హ యాంలో అప్పటి మంత్రి సుదర్శన్రెడ్డి వినతి మేరకు జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మంజూరు చేశారు. అప్పటికే డిచ్పల్లిలో ఉన్న సీఎంసీ మూడు సంవత్సరాలు నడిచిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అనుమతి నిరాకరణతో మూతపడింది. అయితే హాస్పిటల్తోపాటు మెడికల్ కాలేజీకి అవసరమైన అన్ని వసతి సౌకర్యాలు ఉండటంతో ప్రభుత్వం లీజు ప్రతిపాదన చేసింది. కానీ, లీజు ఇవ్వడానికి మెదక్ డయాసిస్ ప్రతినిధులు నిరాకరించారు. దీంతో ప్రభుత్వ మెడిక ల్ కాలేజీని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరోసారి సీఎంసీ తెరమీదకు వచ్చింది. మాజీ ఎంపీ సీఎంసీ లీజుకు ఎంతగానో ప్రయత్నించినా సీఎస్ఐ మెడికల్ ట్రస్టు సభ్యులు నిరాకరించడంతో వీలు కాలేదు. ఖలీల్వాడి: సీఎంసీ పేరిట డాక్టర్ల వద్ద నుంచి రూ.కోట్లు నొక్కేసిన షణ్ముక మహాలింగానికి ఓ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సహకరించినట్లుగా తెలుస్తోంది. కొన్నేళ్ల నుంచి ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్న కానిస్టేబుల్కు తెలిసిన వారి ద్వారా షణ్ముక మహాలింగం పరిచయమయ్యాడు. దీంతో తన ఇంటి పక్కనే అతనికి ఓ ఇంటిని అద్దెకు ఇప్పించడంతో పాటు షణ్ముకకు కావాల్సిన వాటిని కానిస్టేబుల్ కుటుంబసభ్యులే చూసుకునేవారని తెలిసింది. షణ్ముక నిజామాబాద్ నుంచి సీఎంసీకి వెళ్లేందుకు ఓ కారు డ్రైవర్ను సైతం సమకూర్చినట్లు తెలుస్తోంది. కాగా, మూడు నెలలైనా షణ్ముక వేతనం చెల్లించకపోవడంతో సదరు డ్రైవర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సదరు కానిస్టేబుల్ తనకున్న పలుకుబడితో పీఎస్లో కేసును సెటిల్మెంట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయినా జీతం డబ్బులు చెల్లించకపోవడంతో షణ్ముక ఇంటికి డ్రైవర్ తాళం వేయడంతో కానిస్టేబుల్ వెళ్లి సమస్యను పరిష్కరించినట్లు తెలిసింది. మాజీ డీఎస్పీతో పరిచయం సీఎంసీ పున:ప్రారంభిస్తున్నారని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ నగరానికి చెందిన ఓ మాజీ డీఎస్పీకి షణ్ముకను పరిచయం చేసినట్లు తెలిసింది. దీంతో సదరు మాజీ డీఎస్పీతో తరుచూ టాచ్లో ఉండేవారని తెలుస్తోంది. సీఎంసీకి సంబంధించిన వివరాలను కానిస్టేబుల్ సమక్షంలోనే వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. దీంతో మాజీ డీఎస్పీకి సీఎంసీలో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారనే చర్చ జరుగుతోంది. నెల క్రితమే పోలీసుల విచారణ! కర్నాటకకు చెందిన షణ్ముక మహాలింగంను నెల క్రితం పోలీసులు విచారణ చేసినట్లు తెలిసింది. మాజీ ఐఏఎస్ అధికారిని అని చెప్పుకున్నట్లు వ చ్చిన ప్రచారంపై పోలీసులు ఆరా తీయగా, నకిలీ ఐఏఎస్గా విచారణలో తేలినట్లు సమాచారం. కా గా, పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ష ణ్ముక మహాలింగం వెంటే ఇంటెలిజెన్స్ కానిస్టేబు ల్ సతీమణి ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమెను పోలీసులు ప్రశ్నించగా, సీఎంసీలో ఉద్యోగిగా పని చేస్తున్నానని, తన భర్త ఇంటెలిజెన్స్లో పని చేస్తార ని చెప్పినట్లు తెలుస్తోంది. ఏదైనా తన భర్తే చూసుకుంటారని చెప్పినట్లు పోలీస్వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిచ్పల్లి పోలీసులు షణ్ముకను తీసుకువెళ్లినప్పుడు సైతం ఆమె వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. విచారణ అనంతరం డిచ్పల్లి పీఎస్లో షణ్ముకపె చీటింగ్ కేసు నమోదైంది. ఏదేమైనా ఈ కేసులో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. తాత్కాలిక అనుమతి ఇచ్చాం జిల్లాలో ఏ ఆస్పత్రి ఏర్పాటు చేసినా తాత్కాలికంగా మూడు నెలల అనుమతి ఇవ్వడానికి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మూడు నెలల్లో పూర్తిస్థాయిలో వైద్యులు, వసతులు ఏర్పాటు చేయించాలని తాత్కాలిక అనుమతులు ఇచ్చాం. మూడు నెలల్లో నిబంధనల ప్రకారం ఫీజును డీడీ రూపంలో చెల్లించి, అన్నీ పక్కాగా ఉంటే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే రద్దు చేస్తాం. మరో 10 రోజులు తాత్కాలిక అనుమతుల గడువు ఉంది. దీనిపై పోలీసు అధికారులు అడిగితే సమాచారం కూడా పంపించాం. – రాజశ్రీ, జిల్లా వైద్యాఽధికారి -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఇందల్వాయి: మండలంలోని రూప్లనాయక్ తండా వద్ద గల జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. తండాకు చెందిన తుంగర్ బాలాజి(50) స్థానిక హోటల్లో పని చేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి అతడు రూప్లానాయక్ తండా నుంచి దేవి తండాకు నడుచుకుంటూ హైవేపై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కొడుకు పవన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.ఆలయంలో చోరీ ఖలీల్వాడి: నగరంలోని సాయిబాబా ఆలయంలో దొంగతనం జరిగినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి వెండి కిరీటం, ఇత్తడి సాయిబాబా విగ్రహం, ఇత్తడి సామగ్రి అపహరించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు గుడికి వెళ్లగా, చోరీని గుర్తించి పోలీసుకలు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వారు చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి కిడ్నాప్ మోపాల్: మండలంలోని ముదక్పల్లి తండాకు చెందిన కెతావత్ హరీష్ (17) కిడ్నాప్నకు గురైనట్లు ఎస్సై జాడె సుస్మిత శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. తండాకు చెందిన హరీష్కు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో వారిని మందలించాడు. ఈక్రమంలో వివాహితను ఆమె భర్త ఈనెల 5న రాంచంద్రపల్లిలోని తల్లిగారింట్లో వదిలేసి వచ్చాడు. 7న సదరు వివాహిత హరీష్కు ఫోన్ చేయడంతో అతడు నిజామాబాద్ వెళ్లాడు. అప్పటి నుంచి అతడు తిరిగి ఇంటికి రాలేడు. దీంతో బాలుడి సోదరి హరీష్ కిడ్నాప్కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. దాబాపై పోలీసుల దాడి నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం శివారులో గల దాబాపై గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతి లేకుండా దాబాలో, బెల్టుషాపులో లిక్కర్ అమ్మకాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ఆరీఫ్ తెలిపారు. ఈ దాడిలో ఆరు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు. పేకాడుతున్న పలువురి అరెస్టు పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో పేకాట స్థావరంపై గురువారం రాత్రి పోలీసులు దాడి చేసి పేకాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ.4,320 నగదు, 7 సెల్ ఫోన్లు, 2 బైకులతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. రుద్రూర్ మండలంలో.. రుద్రూర్: మండలంలోని రాణంపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై సాయన్న తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 4510 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు. రెంజల్ మండలంలో.. రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 8470 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
బాధ్యతల స్వీకరణ
బోధన్టౌన్(బోధన్): బోధన్ మున్సిపల్ కమిషనర్గా రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బల్దియా కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై సిబ్బంది ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. బల్దియాకు వచ్చే ఆదాయంతోపాటు బల్దియాకు రావాల్సిన బకాయిలపై శ్రద్ధచూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని వెల్లడించారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి బల్దియా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గంటల తరబడి తిప్పాల్సిందే.. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టలన్నా.. నీటి విడుదల పెంచాలన్నా.. తగ్గించాలన్నా గంటల తరబడి గేట్లను తిప్పాల్సిందే. లేదంటే గేట్లు లేవవు, దిగవు. గేట్లకు కరెంట్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది చేతులతోనే వాటిని ఎత్తుతున్నారు. శుక్రవారం నీటి విడుదల పెంచడం కోసం ఉదయం 7గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు గేట్లను తిప్పితే 200 క్యూసెక్కులకు నీటి విడుదల పెరిగింది. గంటల తరబడి గేట్లను తిప్పడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ను కలిసిన సుధాకర్గౌడ్ నిజామాబాద్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో శుక్రవారం ఓవర్సీస్ కాంగ్రెస్పార్టీ ఉపాధ్యక్షుడు సుధాకర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కులగణన విజయవంతంగా పూర్తిచేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు యత్నిస్తున్న సీఎం రేవంత్రెడ్డికి, ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ ప్రజల తరపున ఓవర్సీస్ కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. -
లక్ష్మి ఆయకట్టులో జోరుగా వరినాట్లు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి లక్ష్మికాలువ ద్వారా నీటి విడుదలతో ఆయకట్టు రైతు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు నీరు లేక రైతులు వరినాట్లు వేయలేదు. ప్రస్తు తం ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీరు ప్రవహించడంతో లక్ష్మికాలువ చివరి ఆయకట్టు డీ–4 కాలువ వరకు నీటి సరఫరా జరుగుతోంది. డీ–3పై నిర్మించిన వేంపల్లి ఎత్తిపోతల పథకం నుంచి సైతం నీటి విడుదలను శుక్రవారం ప్రారంభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీటి విడుదలతో రైతుల హర్షం -
రైతుబజార్లను సద్వినియోగం చేసుకోవాలి
● నగరంలో మార్కెట్లను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● రోడ్లపై కూరగాయలు విక్రయించడంతో ఆగ్రహం ● అమృత్ 2.0 పనుల పరిశీలన నిజామాబాద్ సిటీ: ఇందూరు వాసుల కోసం జిల్లా కేంద్రంలో కేటాయించిన రైతుబజార్లను సద్వినియోగం చేసుకోవాలని, వాటిని ప్రజలకు అందు బాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవా లని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్తో కలిసి కలెక్టర్ నగరంలో పర్యటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లను వర్తకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పులాంగ్ వద్దనున్న రైతుబజార్, డీఎస్ మా ర్కెట్ను పరీక్షించారు. వీక్లీ మార్కెట్, సుభాష్నగర్, శివాజీనగర్ ప్రాంతాలలో రోడ్లమీద కూరగాయలు విక్రయించడంపై అసహనం వ్యక్తం చేశారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్మించి వృథాగా ఉన్న మినీ మార్కెట్లను పరిశీలించి వా టిని వినియోగంలోకి తేవాలన్నారు. పాత గంజ్లో కొనసాగుతున్న మార్కెట్ను చూశారు. ఖలీల్వాడిలో నిర్మిస్తున్న సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణాలను పరిశీలించి మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. రోడ్ల పక్కన కూరగాయల అమ్మకంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కూరగాయలు, పండ్ల విక్రేతలు రోడ్ల పక్కన కాకుండా రైతుబజార్లలో అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్కు సూచించారు. రైతు బజార్ల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్, మార్కెటింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఆక్రమణలను గుర్తించి, వాటిని తొలగించేందుకు డీ–మార్కింగ్ చేయాలన్నారు. అనంతరం అమృత్ 2.0 పథకంలో భాగంగా నాందేవ్వాడ, గౌతంనగర్లలో చేపడుతున్న మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. నాగారం 300 క్వార్టర్స్లోని బస్తీ దవాఖానను కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ ఈఈ మురళీ మోహన్ రెడ్డి, డీఈలు సుదర్శన్రెడ్డి, ముస్తాక్ అహ్మద్, రషీద్, ఏఈ పావని, ఇనాయత్ కరీం, ఏసీపీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
కమ్మర్పల్లిలో గంజాయి పట్టివేత
కమ్మర్పల్లి: మండలంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను భీమ్గల్ సీఐ సత్యనారాయణ శుక్రవారం కమ్మర్పల్లి పోలీస్స్టేషన్లో వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ అనిల్రెడ్డి, సిబ్బంది కలిసి కమ్మర్పల్లిలోని మెట్పల్లి రోడ్లోగల రైస్మిల్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు కమ్మర్పల్లి వైపు వస్తుండగా, పోలీసులు వారిని తనిఖీ చేయగా 4 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారిని జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన నాంపల్లి వికాస్, కమ్మర్పల్లికి చెందిన షేక్ ఇమ్రాన్గా గుర్తించారు. గంజాయిని కమ్మర్పల్లిలో విక్రయించడానికి తీసుకువస్తున్నామని, ఇంతకుముందు కూడా వికాస్ వద్ద గంజాయి కొనుగోలు చేసి కమ్మర్పల్లిలో విక్రయించానని షేక్ ఇమ్రాన్ ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. పట్టుకున్న గంజాయి 20 గ్రాములు ఉందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎస్ఐ అనిల్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ అప్సర్ సిబ్బంది రాజ్కుమార్, లక్ష్మణ్గౌడ్,, నవీన్చంద్ర, లక్ష్మణ్నేత, గణపతినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మాజివాడిలో ఒకరి ఆత్మహత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని బ్రహ్మాజివాడి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామాస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జోలే శ్రీకాంత్రావు(30) కామారెడ్డిలో ఓ ప్రయివేటు జాబ్ చేస్తున్నాడు. అతడికి వివాహం జరిపించడానికి కుటుంబ సభ్యులు గత కొన్ని సంవత్సరాల నుంచి పెండ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ కుదర లేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీకాంత్రావు శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రాజేశ్వర్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని, మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు.. బాన్సువాడ రూరల్: ఆత్మహత్యకు యత్నించిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలు ఇలా.. మండలంలోని చిన్నరాంపూర్ గ్రామం పులికుచ్చ తండాకు చెందిన జప్పిబాయి (60) అనే వృద్దురాలు గత కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయింది. ఈక్రమంలో ఈనెల 7న ఆమె పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్సనిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
క్రీడలతోనే మానసికోల్లాసం
నిజామాబాద్ నాగారం: క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని, క్రీడల ద్వారానే విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ధృడంగా తయారవుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో శుక్రవారం ఇందూర్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఇందూర్ బిడ్డలు జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్స్ స్థాయిలో రాణించి జిల్లాకు మరింత పేరుప్రతిష్టలు తీసుకురావాలన్నారు. నాయకులు ఎర్రం సుదీర్, నాగోళ్ళ లక్ష్మినారాయణ, కృష్ణ తదితరులు ఉన్నారు. -
ఇలా వచ్చి.. అలా వెళుతున్నారు
● ఆర్అండ్బీలో ఉన్నతాధికారుల పరిస్థితి ● బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలలకే పదవీవిరమణ ● ఇన్చార్జి అధికారులతో నెట్టుకొస్తున్న వైనంనిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ శాఖలో కీలక అధికారులు వచ్చిన కొన్నినెలలకే పదవీ విరమణ చేస్తుండటంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో ఇన్చార్జి అధికారులతో పాలనను నెట్టుకొస్తున్నారు. ఈక్రమంలో ఎప్పడు అధికారులతో నిండుగా ఉండే జిల్లాకేంద్రంలోని కార్యాలయం ఖాళీల కారణంగా బోసి పోతుంది. ముఖ్యమైన పోస్టులు ఖాళీ.. ఆర్అండ్బీలో ప్రధానంగా ఎస్ఈ, ఈఈ, డిప్యూటీ ఎస్ఈ మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటీతో పాటు ఎస్ఈ కార్యాలయంలో సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉంది. శాఖలో బాల్కొండ, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ ఐదు సబ్ డివిజన్లున్నాయి. బాల్కొండ సబ్ డివిజన్కు డిప్యూటీ ఈఈ లేకపోవడంతో ఆర్మూర్ సబ్ డివిజన్ డిప్యూటీ ఈఈకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో సబ్ డివిజన్కు ఒక్కో ఏఈ మాత్రమే ఉండడంతో తమపై పనిభారం పెరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆర్అండ్బీలో పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.ఇదీ పరిస్థితి..నిజామాబాద్ జిల్లా ఆర్అండ్బీ శాఖలో ఎస్ఈగా విధులు నిర్వహించిన సత్యనారాయణరెడ్డి ఇటీవల పదవీ విరమణ చేశారు. గత నెలలో డిప్యూటి ఎస్ఈ సైతం కొన్ని రోజులు ఈఈగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఈఈగా సురేష్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. అనంతరం డిప్యూటీ ఈఈ శ్రీమాన్ ఇన్చార్జి ఈఈగా వ్యవహారించి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాతా డిప్యూటీ ఎస్ఈ కూడా ఇన్చార్జిగా వ్యవహరించి వీడ్కోలు పలికారు. సత్యనారాయణరెడ్డి కంటే ముందు ఎస్ఈగా విధులు నిర్వహించిన హన్మంత్రావు 6 నెలలు గడవకముందే సీఈగా పదోన్నతి పొంది, పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. -
సెర్ప్ సీఈవోకు ‘కమ్మర్పల్లి’ పిండివంటలు
కమ్మర్పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో మ హిళా సమాఖ్య సభ్యులు తయారుచేసిన పిండి వంటలు రాష్ట్ర రాజధానికి చేరాయి. హైదరాబాద్లోని తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సె ర్ప్) రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) దివ్య దేవరాజన్కు శుక్రవారం ఐకేపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కమ్మర్పల్లి ఎర్గట్ల ఏపీఎం కుంట గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కమ్మర్పల్లి సమాఖ్య సభ్యులు వనజ ‘పెద్దమ్మ తల్లి హోమ్ ఫుడ్స్’ పేరుతో తయారుచేసిన పిండి వంటలను వారు ఆమెకు అందజేశారు. మహిళా సంఘం ద్వారా రుణం పొంది ఉపాధి పొందుతున్న సభ్యులు తయారుచేసిన లడ్డులను అందించడంతో ఆమె సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఏపీఎం కుంట గంగాధర్ వెల్లడించారు. మహిళా సంఘ సభ్యులు తయారుచేసిన పిండివంటలకు విస్తృత ప్రచారం లభించేలా చూడాలని అధికారి పేర్కొన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర జేఏసీ నాయకులు ఏపూరి నర్సయ్య, బాణాల రాజారెడ్డి, మహేష్, జానయ్య, యాదగిరి, రాజప్ప తదితరులు పాల్గొన్నారు. -
సుభాష్నగర్లో అగ్నిప్రమాదం
ఖలీల్వాడి: నగరంలోని సుభాష్ నగర్లోగల ఓ ఇంటీరియర్ షాప్లో శుక్రవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ ఆఫీసర్ శంకర్ తెలిపారు. షాపు నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని ఫైరింజన్తో మంటలను అర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 20 వేల వరకు ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు. హత్య కేసులో నిందితుడి అరెస్టు మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం దొన్కల్లో ఒకరిని హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు భీమ్గల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. మోర్తాడ్ పోలీసు స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొన్కల్లోని వడ్డెర కాలనీలో జూన్ 26న ఒల్లెపు నాగరాజు, షేక్ రహమాన్తో మద్యం సేవిస్తూ ఘర్షణ పడ్డారు. ఈక్రమంలో రహమాన్ను నాగరాజు కర్రతో కొట్టగా అతడు మృతిచెందాడు. అప్పటి నుంచి నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నాడన్నారు. విశ్వసనీయ సమాచారం రావడంతో నాగరాజును పట్టుకొని, రిమాండ్కు తరలించినట్లు సీఐం తెలిపారు. ఎస్సై రాము, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇసుక టిప్పర్ల పట్టివేత రుద్రూర్: మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో శుక్రవారం తెల్లవారుజామున రెండు ఇసుక టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని పోలీస్స్టేషన్ తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. సిరికొండ మండలంలో.. సిరికొండ: మండలంలోని గోప్యతండా పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై రామకృష్ణ శుక్రవారం తెలిపారు. గడ్డమీదితండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ ట్రాక్టర్లలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండగా పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
స్టేడియం ఊసేదీ..?
సౌకర్యాలు అంతంత మాత్రమే.. అంతంతమాత్రం సౌకర్యాల మధ్యే పలువురు క్రీడాకారులు ప్రతిరోజూ ప్రాక్టీస్ చేసి ఎదిగారు. పలువురు వర్ధమాన క్రీడాకారులు సైతం ఇదేరీతిలో ప్రాక్టీస్ చేస్తుండడం గమనార్హం. జిల్లాలో గత కొన్నేళ్లుగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేసిన దాఖలాలు లేవు. క్రీడాకారుల కోసం కోచ్లను సైతం నియమించలేదు. అయినప్పటికీ ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. ఇప్పటి వరకు అందరూ పాత కలెక్టరేట్ మైదానంలోనే ఇబ్బందులు పడుతూ ముందుకెళుతున్నారు. ఈ ఒక్క మైదానంలోనే హకీ, బాక్సింగ్, కబడ్డీ, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, ఉషూ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడలకు సీనియర్ క్రీడాకారులు శిక్షణ ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి, పతకాలతో దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన ప్రతిభావంతమైన క్రీడాకారులు ఉన్న జిల్లా నిజామాబాద్. ఇక్కడ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించేందుకు గాను స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణం చేయాలనే డిమాండ్లు ఏళ్లుగా ఉన్నాయి. ● ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి ● ఇండోర్ స్టేడియం విషయంలోనూ ఇదే పరిస్థితి ● సౌకర్యాలు లేకున్నా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు ● పాత కలెక్టరేట్ మైదానంలో ఎల్బీ స్టేడియం తరహాలో నిర్మించాలని ప్రజల డిమాండ్ ● మెడికల్ కళాశాల గ్రౌండ్గా ఎంసీఐకు చూపిస్తున్నట్లు చర్చ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న పాత కలెక్టరేట్ స్థలంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం తరహాలో నిర్మించాలని ప్రజలు, క్రీడాభిమానులు కోరుతున్నారు. ఇప్పటివరకు ప్ర భుత్వం నుంచి ప్రోత్సాహం అంతంత మాత్రమే ఉన్నప్పటికీ పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరిచారు. కాగా, ప్ర భుత్వం నుంచి తగిన సౌకర్యాలు, సహకారం లభించకపోతుండడంతో ప్రతిభ ఉన్నప్పటికీ అనేకమంది ఔత్సాహిక క్రీడాకారులు వెనుకబడిపోతున్నారు. సర్వే పూర్తయినా.. స్టేడియం నిర్మాణం కోసం 2024 నవంబర్ 11న సర్వే పూర్తిచేశారు. నిధుల మంజూరే ఆలస్యమని కీలక నాయకులు ప్రకటనలు చేశారు. కానీ, అది మళ్లీ పది అడుగులు వెనక్కి వెళ్లినట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. పాత కలెక్టరేట్ మైదానాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల గ్రౌండ్ కోసం కేటాయించినట్లు ఇప్పటికే ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కు చూపినట్లు, దీంతో ఇందులో స్టేడియం నిర్మాణం సాధ్యం కాదని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో స్టేడియం మంజూరు అనేక అడుగులు వెనక్కి వెళ్లినట్లు సమాచారం. ● సర్వే మేరకు ఈ మైదానంలో 8 లేన్లతో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్, ఉత్తర దక్షిణాలకు 188 మీటర్లు, తూర్పు పడమరకు 125 మీటర్లు ఉండేలా ప్లాన్ చేశారు. లైన్ వెడల్పు 1.22‘‘బ్లేన్స్‘‘2=19.52 మీటర్లు, కర్వ్ డిస్టెన్స్(వంపు దూరం) 36.50‘‘2=73.00 మీటర్లు, లెంగ్త్ ఆఫ్ స్ట్రెయిట్ 84.39‘‘1=84.39 మీటర్లు, ఫ్రీ జోన్ 05మీ‘‘2=10.00 మీటర్లు, మొత్తం 186.91 మీటర్లతో నిర్మించేందుకు అంచనాలు తయారు చేశారు. విడ్త్ విషయానికి వస్తే లైన్ విడ్త్ 1.22‘‘బ్లేన్స్‘‘2=19.52 మీటర్లు, కర్వ్ డిస్టెన్స్ 36.50‘‘2=73.00 మీటర్లు, లాంగ్ జంప్ కోసం 9 మీటర్ల వెడల్పు, ఫ్రీ జోన్ 5 మీటర్లు+10 మీటర్లు = 15 మీటర్లు ఉండేలా మొత్తం 116.52 మీటర్లతో ప్లాన్ తయారు చేశారు. ● పాత కలెక్టరేట్ మైదానంలో స్టేడియం సమీపంలోని స్థలంలో ఇండోర్ స్టేడియం నిర్మించాలనే డిమాండ్లు ఏళ్లుగా ఉన్నాయి. లోపల ఫుట్బాల్ మైదానంతోపాటు దాని చుట్టూ 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు, మరోవైపు బాస్కెట్బాల్ కోసం, మరో వైపు బాక్సింగ్ ఇండోర్ స్టేడియం, ఉషు, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఇండోర్ స్టేడియాలు నిర్మించాలని డిమాండ్లు ఉన్నాయి. ఇక స్టేడియం చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్ షెట్టర్లు నిర్మించి నిర్వహణ కోసం ఆదాయం రాబట్టుకోవచ్చు. ● తగిన సౌకర్యాలు, ప్రభుత్వ కోచ్లు, ప్రోత్సాహం లేకున్నప్పటికీ అంతర్జాతీయ పతకాలు సాధించిన ఆణిముత్యాలైన క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. బాక్సింగ్లో హుస్సాముద్దీన్, నిఖత్ జరీన్, హాకీలో యెండల సౌందర్య, ఫుట్బాల్ క్రీడలో గుగులోత్ సౌమ్య అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. జిల్లాకు చెందిన ఎతెసామ్ భారత ఆర్మీ బాక్సింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. ● నగరం నడిబొడ్డున క్రీడా స్టేడియంతో కూడిన మైదానాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ అథ్లెటిక్స్ జాతీయ మెడలిస్ట్, ఉస్మానియా యూనివర్సిటీ రికార్డ్ హోల్డర్ సయ్యద్ ఖైసర్ 2010లో మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. అదేవిధంగా నగరంలో స్టేడియం కోసం 4 కిలోమీటర్ల మేర రన్నింగ్ చేశాడు. ఒక్క స్టేడియంతో అనేకమంది క్రీడాకారులు.. నగరంలో స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మిస్తే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే క్రీడాకారులను భారీ సంఖ్యలో తయారు చేయొచ్చు. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు ఉన్నతంగా ఎదుగుతున్నారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే పతకాలు సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి క్రీడాభివృద్ధికి కృషి చేయాలి. – సయ్యద్ ఖైసర్, జాతీయ అథ్లెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్, శిక్షకుడు క్రీడాకారులకు, కోచ్లకు గుర్తింపు ఇవ్వాలి.. నగరంలో స్టేడియం కోసం వేలాది క్రీడాకారులు ఎదు రుచూస్తున్నారు. తగిన సౌకర్యాలు కల్పించనప్పటి కీ మావంతుగా క్రీడాకారులకు శిక్షణనిస్తున్నాం. నాలాంటి ఎంతో మంది కోచ్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా కోచ్లను అభినందించలేదు. ఫుట్బాల్ విషయంలో క్రీడామైదానం లేకుంటే ఖాళీ స్థలాలను అద్దెకు తీసుకుని మరీ శిక్షణ ఇస్తున్నాను. పతకాలు సాధించిన తరువాత ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. – నాగరాజు, ఫుట్బాల్ కోచ్ -
విద్యార్థులకు ప్ర‘యోగం’ ఎప్పుడో?
నందిపేట్(ఆర్మూర్): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రయోగాలు చేసే యోగం ఎప్పుడొస్తుందోనని ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సర్కార్ బడులకు ఆరేళ్లుగా నిధులు విడుదల కాకపోవడం, సరిపడా సైన్స్ పరికరాలు లేకపోవడంతో విద్యార్థులు ప్రయోగ విద్యకు దూరమవుతున్నారు. అయినా సంబంధిత అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ‘ఉన్నత’ విద్యార్థుల కోసం.. జిల్లాలో 1042 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 77,224 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైన్స్ విద్యను అందిచాలనే లక్ష్యంతో ప్రయోగశాలలు ఏర్పాటు చేసినా కొన్నేళ్లుగా నిధుల లేమితో లక్ష్యం నీరుగారుతోంది. విధిలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఉన్న పరికరాలతోనే పాఠాలు బోధించి మమ అనిపిసున్నారు. 6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టులలో ఎక్కువ భాగం ప్రయోగాలతో కూడిన పాఠ్యాంశాలు ఉంటాయి. వాటిని ప్రయోగం చేసి చూపితే గాని అర్థం కాని పరిస్థితి. దీంతో ప్రయోగాత్మక బోధనపై సంబందిత సబ్జెక్టుకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రయోగ పరికరాలు, రసాయనాల కొనుగోలుకు గతంలో విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో అరకొర నిధులు మంజూరు చేయగా కొద్దిపాటి పరికరాలు కొనుగోలు చేశారు. కొద్దిపాటి పరికరాలతో ప్రయోగాలు సంపూర్ణంగా చేసే అవకాశం లేకపోవడంతో పలు పాఠశాలల్లో అవిసైతం మూలన పడ్డాయి. 2019 నుంచి.. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా ప్రతి ఉన్నత పాఠశాలకు 2019లో రూ. 50వేలు, ప్రాథమిక పాఠశాలలకు రూ. 22వేలు విడుదల చేశారు. వీటి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఆరేళ్ల క్రితం కొన్ని పరికరాలు కొనుగోలు చేశారు. ఫలితంగా పాఠశాలల్లో ప్రయోగాత్మక బోధన నిర్వహణ కష్టతరంగా మారింది. అందులో ఉన్న పరికరాలతో పాటు కాలం చెల్లిన రసాయనాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తూ మమ అనిపిస్తున్నారు. ప్రయోగాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో సైన్స్ పోటీలకు విద్యార్థులు దూరంగా ఉంటున్నారు. ఏటా ప్రభుత్వం నిర్వహించే సైన్స్ఫేర్, ఇన్స్స్పైర్ అవార్డుల్లో వెనుకబడుతున్నారు. ప్రతిభ ఉన్నా సరిపడా శిక్షణ, అవగాహన లేక విద్యార్థులు సత్తా చాటలేకపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రయోగాత్మక బోధనకు అవసరమైన పరికరాలు సమకూర్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కానరాని సైన్స్ పరికరాలు కొన్నేళ్లుగా విడుదల కాని నిధులునిధులు మంజూరు కాలేదు.. సైన్స్ పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు కాగానే పరికరాలు కొనుగోలు చేస్తాం. విద్యార్థులకు కావాల్సిన కొన్ని సైన్స్ పరికరాలను ఉపాధ్యాయులు తయారు చేసి అవగాహన కల్పిస్తున్నారు. – అవదూత గంగాధర్, ఎంఈవో, నందిపేట -
మార్కెట్లో రాఖీల కొనుగోళ్ల సందడి
నిజామాబాద్ రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్: నిజామాబాద్ నగర మార్కెట్లో రాఖీల కొనుగోళ్లతో సందడి నెలకొంది. రాఖీ పౌర్ణమి(రక్షాబంధన్) సందర్భంగా మహిళలు, యువతులు వివిధ రకాల రాఖీలు, స్వీట్లు కొనుగోలు చేయడానికి శుక్రవారం నగరానికి భారీగా తరలివచ్చారు. గత వారం రోజులుగా రాఖీల విక్రయాలు కొనసాగుతుండగా, పండుగ సమీపించడంతో నగరంలోని ప్రధాన చౌరస్తాలు, దుకాణాల్లో రద్దీ నెలకొంది. కుమార్గల్లి, పెద్దబజార్, గాయత్రినగర్చౌరస్తా, వినాయక్నగర్, కంఠేశ్వర్లలో దుకాణాలు పెట్టి వ్యాపారాలు సాగే అన్నిచోట్లా సందడి నెలకొంది. మార్కెట్లో రకరకాల రాఖీలు అందుబాటులో ఉండగా, కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీక.. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. శ్రావణ పౌర్ణమి రోజున ఈ పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎక్కడెక్కడో ఉన్న సోదరసోదరీమణులు పండుగ పూట తప్పకుండ కలుసుకుంటుంటారు. సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి, మురిసిపోతారు. సోదరులు వారికి తోచిన కట్నం అందించి, వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆనందంగా ఉంటుంది.. రాఖీ పౌర్ణమి రోజున తమ్ముడికి రాఖీ కడితే చాలా సంతోషంగా ఉంటుంది. ఏటా రాఖీ పౌర్ణమి నాడు తమ్ముడికి రాఖీకడుతాను. ఈ పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాను. – నిక్షిత, ధర్మారంపుట్టింటికి వెళ్లాల్సిందే.. అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే బంధం అనిర్వచనీయమైంది. మా తమ్ముడికి చిన్నప్పటి నుంచి రాఖీ కడుతున్నాను. పండుగ రోజు ఖచ్చితంగా పుట్టింటికి వెళ్లి, తమ్ముడికి రాఖీ కట్టాల్సిందే. – లక్ష్మీ, బర్ధిపూర్ -
వరలక్ష్మి.. వరప్రదాయినీ
నిజామాబాద్ రూరల్: శ్రావణ మాసంలో వరలక్ష్మి మాతను మహిళలు ప్రత్యేకంగా కొలుస్తుంటారు. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వత్రాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈరోజున వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, వ్రతం ఆచరించేవారు ఉపవాస దీక్ష పాటించడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మహిళలు నేడు వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈరోజు మహిళలు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రపరుచుకుని, ముగ్గులు తోరణాలు పెట్టి శోభాయమానంగా అలంకరిస్తారు. ధనధాన్య, విద్యా, వైద్య, సంతాన, అష్టలక్ష్మిలను పూజించిన ఫలితము ఈ ఒక్క వరలక్ష్మి ప్రతం నాడు అమ్మవారిని పూజించడంతో దక్కుతుందని పండితులు పేర్కొంటున్నారు. పూజా విధానం.. ఇత్తడి, రాగి, వెండి, బంగారు చెంబులో కొబ్బరికాయతో కలశ రూపంలో అమ్మవారిని పూజిస్తారు. కొందరు మహిళలు అమ్మవారిని ప్రార్థించి పాలు తేనె నెయ్యి వంటి వాటితో అభిషేకం నిర్వహిస్తారు. అమ్మవారికి చీరలు, రవికలు పండ్లు బెల్లం నెయ్యితో తయారుచేసిన నైవేద్యాలతో సమర్పించి యధాశక్తిగా పూజిస్తారు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మహిళలయితే బిందెలకు చీరలను కట్టి పూలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా అమ్మవారిని పూజిస్తారు. వ్రతం చేసేటప్పుడు గోత్రనామాలతో సంకల్పం చేసుకుంటారు. అలాగే కలశ పూజ, గణపతి, గౌరీ పూజలను సైతం నిర్వహి స్తారు. లక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించి, అమ్మవారి నామాలతో, తామర పువ్వులతో పుష్పార్చన కుంకుమార్చన పూజలు నిర్వహించడం శ్రేష్ఠమని పండితులు విశ్లేషిస్తున్నారు. వ్రతం అనంతరం ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వడం వల్ల పదికాలాలపాటు అష్టైశ్వర్యాలతో సౌభాగ్యాలతో ఉంటారని భక్తుల నమ్మకం. ఆలయాలు ముస్తాబు.. నగరంలోని దేవిరోడ్లోగల దేవీమాతా ఆలయం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, లలితాదేవి ఆశ్రమాలయం, దుబ్బ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. నేడు వరలక్ష్మి వ్రతం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నిర్వహణ -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఖలీల్వాడి: నగర పరిధిలోని జానకంపేట గ్రామ శివారులో ఉన్న అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు తెలిపారు. చెరువులో గురువారం ఉదయం మృతదేహం పైకి తేలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటాయని, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్సై తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. పార్థి దొంగల ముఠా సభ్యుడి అరెస్టు కామారెడ్డి క్రైం: జాతీయ రహదారుల వెంబడి ఆగి ఉన్న వాహనాలను టార్గెట్ చేస్తూ దారి దోపిడీలకు పాల్పడడంతోపాటు ఆయా జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న పార్థి దొంగల ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముధ్కేడ్ ప్రాంతానికి చెందిన ముఠాలోని ముగ్గురిని కొంతకాలం క్రితం కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో జాతీయ రహదారులపై జరుగుతున్న దారి దోపిడీలు, రోడ్డుకు సమీపంలోని ఇళ్లలో దొంగతనాలకు సంబంధించిన కేసులు ఈ ముఠాపై నమోదై ఉన్నాయి. జిల్లాలోని గాంధారి, పిట్లం, బీర్కూర్, సదాశివనగర్, మద్నూర్, తాడ్వాయి పోలీస్ స్టేషన్లలో పార్థి ముఠాపై కేసులున్నాయి. పోలీసులు ముగ్గురు సభ్యులతోపాటు ఓ రిసీవర్ను అరెస్టు చేసిన్పటికీ.. ప్రధాన సభ్యుడు భాస్కర్ బాపూరావు చౌహాన్ ఎనిమిది నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం చాలా రోజులుగా గాలిస్తున్నాయి. అతడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు శ్రీనివాస్, సంతోష్కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, రంజిత్, ఉస్మాన్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది గణపతి, శ్రీనివాస్, రాజేందర్, శ్రావణ్, లక్ష్మీకాంత్, స్వామి, మైసయ్య, రవిని ఎస్పీ అభినందించారు. -
పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి
నిజామాబాద్అర్బన్: జిల్లాలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను, ఇతర అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం ఆయన అదనపు కలెక్టర్ అంకిత్తో కలిసి విద్యుత్, మున్సిపల్ అధికారులు, ఆర్అండ్బీ, హౌసింగ్, పంచాయతీ రాజ్ తదితర శాఖల ఇంజినీరింగ్ అధికారులతో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్బన్ ఏరియాలల్లో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జీజీహెచ్లో మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. పనులపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి డబుల్ బెడ్రూం ఇళ్లు, అసంపూర్తి పనులపై అధికారులతో సమీక్ష -
విద్యార్థుల అభ్యున్నతికి సమన్వయంతో పనిచేయాలి
నిజామాబాద్అర్బన్: విద్యార్థుల అభ్యున్నతి కోసం అధ్యాపకులు సమన్వయంతో పనిచేసి, మంచి ఫలి తాలను సాధించాలని ఇంటర్ విద్యా జిల్లా ప్రత్యేక అధికారి ఒడ్డెన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ బాలికల జూనియర్ కళాశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఒడ్డెన్న మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాల్సిందేనని అన్నారు. కళాశాల ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నందున యూనిట్ టెస్టులు నిర్వహించి మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను గుర్తించాలని అన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, వారు చదువుకునేవిధంగా ఆసక్తి కలిగించాలని సూచించారు. విద్యార్థులు కళాశాలకు హాజరుకాకుంటే వారి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందజేసే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిజామాబాద్ నుంచి ప్రారంభించాలన్నారు. నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాల రాష్ట్రంలోనే మోడల్ జూనియర్ కళాశాలగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కళాశాల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని అన్నారు. జిల్లా ఇంటర్ అధికారి రవికుమార్ తదితరులు ఉన్నారు. -
ప్రోత్సహించే వారుంటే కాదేది అసాధ్యం
● రన్నింగ్ పోటీల్లో రాణిస్తున్న ఖానాపూర్ వాసి అజయ్కుమార్నిజామాబాద్ రూరల్: ‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది’ అన్న స్వామి వివేకానంద మాటలు గుర్తుంచుకున్న ఖానాపూర్ వాసి గరిపల్లి అజయ్కుమార్ నేషనల్ అథ్లెటిక్ పరుగు పందెంలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన అజయ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయా డు. తాత–నానమ్మ వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. తాత అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. అయినా కుంగిపోకుండా తనకంటు జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. పరుగు పందెంలో చిన్ననాటి నుంచే ఆసక్తి ఉన్న అతనికి కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. అంతేకాకుండా గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు ఇచ్చిన ప్రోత్సాహంతో పోటీల్లో రాణిస్తున్నాడు. ఇటీవల వరంగల్లో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్ పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచి మెడల్ సాధించాడు. అదేవిధంగా గత నెల 19న పంజాబ్, బిహార్ లో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్ కాంపిటేషన్లో 100 మీటర్ల పరుగు పందెంలో రాణించాడు. అంతకుముందు చైన్నెలో జరిగిన నేషనల్ కాంపిటీషన్లో సైతం ప్రతిభ కనబర్చాడు. తనకు ఆర్థికంగా, ఆత్మస్థైర్యాన్ని నింపిన వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తానని అజయ్ కుమార్ అంటున్నాడు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓడిపోయిన వారు మళ్లీ ఆత్మస్థైర్యంతో గెలవడానికి ప్రయత్నించాలని విద్యార్థులకు, తోటి యువకులకు అతడు తెలుపుతున్నాడు. -
నగరంలో కుండపోత
నిజామాబాద్ నగరంలో గురువారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు భారీగా నిలిచిఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దుబ్బ నుంచి ఖానాపూర్కు వెళ్లే దారిలో, ఆదర్శనగర్, గౌతమ్నగర్, ఎన్జీవోస్ కాలనీ, జన్మభూమిరోడ్డులోని పలు కాలనీలు, రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్కు వెళ్లే దారిల్లో రోడ్లపై వర్షపునీరు, మురికినీరు నిలిచాయి. అరుంధతినగర్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
తల్లిపాలు బిడ్డకు అమృతంలాంటివి
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివని, తల్లిపాలతో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా సంక్షేమాధికారిణి ఎస్కే రసూల్బీ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్ఎల్జీ గార్డెన్స్లో గురువారం వారం రోజులుగా కొనసాగుతున్న తల్లి పాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. అప్పుడే పు ట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు సూ దం లక్ష్మి, ఇందల్వాయి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ క్రిస్టినా, పిల్లల డాక్టర్ దీపక్రాథోడ్ మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం పలువురు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో జ్యోతి, హెచ్ఈవో శంకర్, ఆయుష్ డాక్టర్ మాధవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు బుజ్జి, మమత, శోభ, సరిత, వరలక్ష్మీ, సునీత, భాగ్యలక్ష్మి, రాధాలక్ష్మి, డిస్ట్రిక్ కోఆర్డినేటర్ రాంబాబు, ఐటీ ప్రకాశ్, బ్లాక్ కోఆర్డినేటర్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సంక్షేమాధికారిణి రసూల్బీ ముగిసిన తల్లి పాల వారోత్సవాలు -
శతాధిక వృద్ధురాలు మృతి
బోధన్రూరల్: మండలంలోని పెంటాకుర్దు గ్రా మానికి చెందిన శతాధిక వృద్ధురాలు దొబ్బ మా రుబాయి (105) గురువారం మృతిచెందింది. గ్రా మానికి చెందిన ఆమె గ్రామంలో గర్భిణులకు నా ర్మల్ డెలివరీలు చేయడంతో పేరుపొందింది. గత 75 ఏళ్లల్లో గ్రామంలో సుమారు వెయ్యికి పైగా ప్రసవాలు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామపెద్దలు, గ్రామస్తులు మారుబాయి మృతదేహానికి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.దాడి ఘటనలో ఇద్దరిపై కేసు నమోదురెంజల్(బోధన్): ఒకరిపై దాడికి పాల్పడిన ఘటనలో మండలంలోని వీరన్నగుట్ట తండా గ్రామానికి చెందిన జాదవ్ రాజుతోపాటు అతడి మిత్రుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్ గురువారం తెలిపారు. వీరన్నగుట్ట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు గ్రామానికి చెందిన వీరయ్య నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అతడు బుధవారం అర్ధరాత్రి విధులు నిర్వహిస్తుండగా రాజుతోపాటు అతని స్నేహితుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. దీంతో వీరయ్య వారిని ఈ సమయంలో ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించగా, వారు అతడిపై దాడి చేశారు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.మోపాల్ మండలంలో ముగ్గురిపై..మోపాల్: మండలంలోని కంజర్ గ్రామంలో మహిళపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. గ్రామానికి చెందిన కొత్తోళ్ల రాధాతో మోహన్, లక్ష్మి, అనితకు పాత గొడవలు ఉన్నాయి. ఈక్రమంలో రాధకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి గురువారం వారు వచ్చి అకారణంగా దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.పేకాడుతున్న 24మంది అరెస్టుమద్నూర్(జుక్కల్): మండలంలోని రెండు పేకాట స్థావరాలపై పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం రావడంతో బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్సై విజయ్ కొండ ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై దాడులు చేసి, పేకాడుతున్న 24 మందిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 34వేల నగదు, 19 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిలో డోంగ్లీ మండలం మదన్హిప్పర్గాలో 20 మందిని, మద్నూర్ మండలం పెద్ద శక్కర్గాలో నలుగురిని పట్టుకున్నట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇసుక డంపు స్వాధీనంరుద్రూర్: పోతంగల్ మండలం కల్లూర్ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ను గురువారం తహసీల్దార్ గంగాధర్ స్వాధీనం చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిన ఇసుకను కొందరు అక్రమంగా డంప్ చేసినట్టు గుర్తించారు. ఈ ఇసుకను వర్ని మండలం చింతల్పేట్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేటాయించినట్టు ఆయన తెలిపారు. -
ఆయిల్పామ్తో అధిక లాభాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): అధిక దిగుబడి, మంచి మ ద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్పామ్ పంటను సాగు చేసేందుకు జిల్లా లోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్ట ర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా, సహకార సంఘం ఎరువుల గోడౌన్ వద్ద స్థానిక రైతులతో భేటీ అయ్యారు. ఆయిల్పామ్ సాగు చేపట్టిన నూత్పల్లి గ్రామ ఆదర్శ రైతు గోపిడి గంగారెడ్డి క లెక్టర్ సమక్షంలో తన స్వీయ అనుభవా లను తో టి రైతులకు తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడు తూ.. గంగారెడ్డిని అభినందించారు. ఇతర రైతు లు కూడా ఇదే స్ఫూర్తితో ఆయిల్పామ్ సాగును చేపట్టి ఆర్థిక పరిపుష్టి సాధించాల ని అన్నారు. ఈ పంట సాగుకు జిల్లాలో అనుకూ ల పరిస్థితులు ఉన్నాయని, ప్రభుత్వం పెద్ద ఎత్తు న రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తోందని వివరించారు. సాగుకు ముందుకు వచ్చే రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామన్నారు. -
బీజేపీతోనే సామాజిక న్యాయం
సుభాష్నగర్: అన్ని వర్గాల సంక్షేమమే బీజేపీ లక్ష్యమని, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అ న్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయ న మాట్లాడారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ఇచ్చి, రిజర్వేషన్లు మైనారిటీలకు అమలుచేయడం మోసం చే యడం కాదా అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ బీసీల కోసం ఏం చేశారో చె ప్పాలన్నారు. రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఈనెల 15 వరకూ జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. నాయకులు లక్ష్మీనారాయణ, గంగాధర్, శ్రీనివాస్, ఆశన్న, నారాయణ యాదవ్, శ్రీనివాస్రెడ్డి, జగన్రెడ్డి, విజయ్కుమార్, రాంచందర్, శంకర్, సంతోష్,ముత్యాలు, మల్లేష్ ఉన్నారు. తెలుగులో బాలామణికి డాక్టరేట్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వ ర్సిటీ తెలుగు విభాగం పరిశోధక విద్యార్థిని బాలామణి పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. తె యూ తెలుగు విభాగం అధ్యాపకులు సీహెచ్ లక్ష్మణ చక్రవర్తి పర్యవేక్షణలో ‘ముదిగొండ వీరభద్రయ్య సాహిత్య విమర్శ– సమగ్ర పరిశీలన’ అనే అంశంపై బాలామణి పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వారిజారాణి గురువారం తెయూలో ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా హాజరై, పరిశోధకురాలిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. -
రైతులకు సరిపడా యూరియా
సుభాష్నగర్: జిల్లాలోని రైతాంగానికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ఎక్కడా కొర త లేదని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పేర్కొన్నారు. నగరంలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశపు హాల్లో వ్యవసాయ, హార్టికల్చర్, మార్కెటింగ్ శాఖల పనితీరు, పథకాల అమలు, సబ్సిడీ లు, తదితర అంశాలపై గురువారం ఆయన సమీ క్షించారు. ప్రధానంగా వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో రైతాంగానికి కల్పిస్తున్న రాయితీలు, పంటల విస్తీర్ణం, ఎరువుల నిల్వలపై డీఏవో గోవిందు, జేడీ శ్రీనివాస్రావును అడిగారు. 10వేలకు పైగా ఎకరాల్లో ఆయిల్ పావ్ు పంటను సాగు చేస్తేనే జిల్లాకు ఫ్యాక్టరీ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విషయమై రైతులకు దాని ప్రయోజనాలను వివరించాలన్నారు. జిల్లాలో పసుపు సాగు స్వ ల్పంగా పెరిగిందని అధికారులు వివరించారు. యూరియా కొరత లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని గడుగు గంగాధర్ సూచించారు. యేటా టెండర్లు నిర్వహించాలి.. మార్కెట్ కమిటీల్లో సెక్యూరిటీ టెండర్లు ప్రతియేటా నిర్వహించాలని గడుగు గంగాధర్ ఆదేశించా రు. ఏళ్లుగా ఒక్క కాంట్రాక్టర్కే అప్పగించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్కు వచ్చే రైతులకు దళారుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని తెలిపారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీలో ఉద్యోగులు, సిబ్బంది కొరత, డిప్యుటేషన్ల వివరాలతోపాటు ఆదాయం, ఖర్చు లు, గోదాములు తదితర అంశాలను సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ వివరించారు. ఉద్యోగుల కొరత, హోల్సేల్ మార్కెట్లో కొత్త లైసెన్సులు, మడిగెల నిర్మాణం తదితర అంశాలపై ఇప్పటికే మంత్రి తు మ్మల నాగేశ్వర్రావు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి వివరించారు. అనంతరం దడువాయిలు, హమాలీలు, చాటా కార్మికులు గడుగు గంగాధర్ను కలిసి సమస్యలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ క మిటీ వైస్ చైర్మన్ జంగిటి రాంచందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి గంగు, ఏడీఏ కృష్ణ, డైరెక్టర్లు మా రుతీ మల్లేశ్, గంగారెడ్డి, రాజలింగం, బాగారెడ్డి, దేవ కరుణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్నదాతల సమస్యల పరిష్కారానికి కమిషన్ పని చేస్తుంది.. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ -
ఉద్యోగులు అటెన్షన్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘కలెక్టర్ సార్ ఈ రోజు ఏ మండలానికి వస్తున్నారు? మా కార్యాలయానికి వస్తున్నారా?’ అంటూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజూ ఆరా తీస్తున్నారు. కలెక్టర్ పర్యటన, ఆకస్మిక తనిఖీల విషయమై ప్రతి అంశాన్ని ఉద్యోగులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఒక్కరోజు కూడా విరామం ఇవ్వకుండా ప్రతిరోజు వివిధ మండలాల్లో పర్యటిస్తూ ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఉద్యోగులందరూ పూర్తిగా అటెన్షన్తో వ్యవహరిస్తున్నారు. సమయపాలన పాటిస్తున్న ఉద్యోగులు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి క్షేత్ర పర్యటన వివరాలు ఆయన డ్రైవర్ సహా ఎవరికీ తెలియకపోవడంతో మండల స్థాయి అధికారులు, ఉద్యోగుల్లో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి కచ్చితంగా సమయపాలన పాటిస్తుండడం గమనార్హం. జూన్ 13న జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డి మరుసటి రోజు 14వ తేదీ నుంచే మోపాల్ మండల పర్యటనతో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. పోస్టాఫీసులను సైతం సందర్శించి తనిఖీలు చేస్తుండడం గమనార్హం. తాను పర్యటించిన మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎరువుల గోదాములు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాలను తనిఖీ చేస్తున్నారు. పీహెచ్సీల్లో వైద్య సేవలు, పాఠశాలలు, అంగన్వాడీల్లో పిల్లల హాజరు, మధ్యాహ్న భోజనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఎరువుల నిల్వలపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ విషయమై ప్రతి అంశాన్ని గురించి క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుంటున్నారు. ఉరుకులు.. పరుగులు విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్ చెప్పడంతో పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ ఉద్యోగులు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఎక్కడైనా లోటుపాట్లు, సమస్యలు కనిపి స్తే సరిచేసుకోవాలని కలెక్టర్ సూచనలు చేస్తున్నా రు. మళ్లీ 15 రోజుల్లో వస్తానని, ఆ సమయంలో స దరు సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశా లు ఇస్తున్నారు. దీంతో అధికారులు ఉరుకులు, ప రుగులు పెడుతున్నారు. మరోవైపు జిల్లా అధికా రుల సమీక్ష సమావేశంలోనూ కలెక్టర్ ప్రతి విషయాన్ని పిన్పాయింటెడ్గా అడుగుతున్నారు. దీంతో అధికారులు సైతం అలర్ట్గా ఉంటున్నారు. అన్ని మండలాల్లో అప్రమత్తం పెద్దసారు ఎటువైపు వెళ్తున్నారో.. ప్రతిరోజూ ఆరా తీస్తున్న ఉద్యోగులు కారెక్కిన తర్వాతే ఏ మండలానికి వెళ్లేది నిర్ణయిస్తున్న ఉన్నతాధికారి సిబ్బందితో కళకళలాడుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం వరకు తప్పనిసరి విధుల నిర్వహణ అన్ని విభాగాలను చుట్టేస్తూ.. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బయల్దేరిన సమయంలో ఏ మండలం వైపు వెళ్లే విషయాన్ని ఎవరికీ చెప్పడం లేదు. కారులో కూర్చున్న తర్వాత డ్రైవర్కు డైరెక్షన్ ఇస్తూ తాను ఎంపిక చేసుకున్న మండలానికి వెళ్తున్నారు. ఆయా మండలాలకు వెళ్లిన తర్వాత సైతం ఎప్పుడు ఏ కార్యాలయానికి వెళతారో, పాఠశాల, ఆస్పత్రులకు వెళతారో అనే విషయమై ఎవరికీ చెప్పకుండా ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. అయితే తన పర్యటనలో మాత్రం మండలంలోని అన్ని ప్రభుత్వ విభాగాలను తనిఖీ చేస్తున్నారు. పైగా వెళ్లే దారిలోని గ్రామాల్లోనూ ఆగుతూ వివరాలు తెలుసుకుంటున్నారు. దీంతో ఉద్యోగులు కచ్చితంగా తాము విధులు నిర్వర్తించే ప్రాంతాల్లోనే ఉంటున్నారు. కలెక్టర్ ఎప్పుడు వస్తారో అనే విషయమై తెలియకపోవడంతో సాయంత్రం వరకు ఉద్యోగులు విధుల్లో ఉంటున్నారు. దీంతో అన్ని కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. -
పీహెచ్సీల్లోనే కాన్పులు జరగాలి
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రభుత్వ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వైద్యాధికారులకు సూచించారు. సాధారణ చికిత్సలతోపాటు గర్భిణులకు స్థానికంగానే సుఖ ప్రసవాలు (కాన్పులు) కూడా చేయాలన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ గురు వారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మొదట పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్... ఓపీ రిజిస్టర్, సి బ్బంది హాజరును పరిశీలించారు. సేకరించిన బ్లడ్ శాంపిల్స్ను టీహబ్కు పంపిస్తున్న తీరును పరిశీలించారు. వ్యాక్సినేషన్, టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలు, గ్రామాల్లో ఆరోగ్య శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. సుశిక్షితులైన స్టాఫ్ నర్స్ ఉన్నప్పటికీ స్థా నికంగా కాన్పులు ఎందుకు చేయడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రతీ నెల కనీసం రెండు కా న్పులు స్థానికంగా జరిగేలా కృషి చేయాలన్నా రు. గర్భిణులకు స్థానిక పీహెచ్సీలో డెలివరీ సదుపాయం అందుబాటులో ఉందని ఏఎన్ఎంలు, ఆశాల ద్వారా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శుభాకర్కు సూచించారు. పీహెచ్సీ పనితీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జెడ్పీ హైస్కూల్, ప్రా థమిక పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని హెచ్ఎంలు సురేశ్ కుమార్, సాబేర బేగంలను ఆదేశించారు. పలువురు విద్యార్థుల హాజరును ఎఫ్ఆర్ఎస్ ద్వారా నమోదు చేయకపోవడాన్ని గమనించి, ఎంఈవో రామకృష్ణను ఫోన్ ద్వారా కలెక్టర్ ప్రశ్నించారు. ఎఫ్ఆర్ఎస్ అమలును ఎందుకు పర్యవేక్షించడం లేదని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు – మన బడి కింద నూతనంగా నిర్మించిన తరగతి గదుల గోడలపై పెయింటింగ్స్ వేయించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ సహకార సంఘం ఎరువుల సేల్ పాయింట్ను సందర్శించి, అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని, మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల పనులపై స్థానిక అధికారులతో సమీక్షించారు. ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ సందర్శన చిన్నయానం శివారులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి పర్యాటకులు ఈ ప్రదేశానికి వస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ డీఈ రవికి సూచించారు. బ్యాక్ వాటర్ ఏరియాలో నిలువ ఉన్న నీటిమట్టం, గోదావరి ప్రవాహాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాక్ వాటర్ ఏరియాను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రతిపాదనలను అడిగి తెలుసుకొని, అందుకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలందించాలి డొంకేశ్వర్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు ఎంపీడీవో ఆఫీసు, పాఠశాలలు, సొసైటీ గోదాం సందర్శన -
పంటను ధ్వంసం చేయడమెందుకు?
● ఫారెస్టు అధికారులను ప్రశ్నించిన సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్రావు ● గిరిజనులతో కలిసి భూమి పరిశీలన మోపాల్(నిజామాబాద్రూరల్): చేతికొచ్చిన మొక్కజొన్న పంటకు గడ్డి మందు కొట్టి ధ్వంసం చే యాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఫారెస్ట్ అధి కారులను జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్రావు ప్రశ్నించారు. మోపాల్ మండలం భైరాపూర్ మోతీరామ్నాయక్ తండాలో గురువారం సాయంత్రం అ టవీ అధికారులు గడ్డి మందు కొట్టిన మొక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. మొక్కజొన్నకు గడ్డిమందు కొట్టడంతో మనస్తాపానికి గురైన రైతు ప్రకాశ్ నాయక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు, వాస్తవ పరిస్థితులు, భూముల వివరాలను గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ భూముల వివరాలను సంబంధిత అధికారుల వద్ద వాకబు చేశారు. మొక్కజొన్న పంట సాగు చేసి రెండున్నర నెలలు గడిచిపోయిందని, చేతికొచ్చే పంటకు గడ్డి మందు కొట్టి ధ్వంసం చేశారని, దీంతో రూ.లక్షకుపైన నష్టం వాటిల్లిందని గిరిజనులు వివరించారు. కాగా, ఆత్మహత్యాయత్నంతో అధికారులను బె దిరించే ప్రయత్నం చేసిన రైతుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. అటవీ భూమిలో ప్ర కాశ్ అక్రమంగా సాగు చేయడంతోనే తాము అడ్డు కున్నట్లు ఫారెస్ట్ అధికారులు వివరించారు. అన్నివర్గాల నుంచి విషయ సేకరణ చేసిన జడ్జి ఉదయ్ భాస్కర్రావు పలు విలువైన సూచనలు చేశారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని, చట్టానికి బాధ్యులుగా ఉండాలన్నారు. రైతు ప్రకాశ్పై నమోదైన కేసును సామరస్యంగా పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. జడ్జి వెంట న్యాయవాదులు ఆశ నారాయణ, బాల్రాజ్ నాయక్, రవిప్రసాద్, న్యాయసేవా సంస్థ సూపరింటెండెంట్ శైలజ, సెక్షన్ ఆఫీసర్ బాసిత్, ఎల్హెచ్పీఎస్ అధ్యక్షుడు చవాన్ మోహన్ నాయక్, సేవాలాల్ సేన ప్రధాన కార్యదర్శి నరేశ్ నాయక్, ఇందల్ నాయక్, జలందర్, గౌతమ్, జవహర్లాల్ తదితరులు ఉన్నారు.